Illegal structures
-
గుర్రం విజయలక్ష్మి అరెస్ట్..
దుండిగల్: నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడమేగాక, వినియోగదారులను మోసం చేసి రూ.కోట్లు సంపాదించింది. పోలీసు కేసులు నమోదు కావడంతో దేశం విడిచి పారిపోయేందుకు యత్నించిన ఓ నిర్మాణ సంస్థ యజమానురాలిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేటలోని సర్వే నెంబర్ 170/3, 170/4, 170/5లోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత సదరు భూమి పలువురి చేతులు మారి చివరికి కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం 3.20 ఎకరాల్లో 65 విల్లాల నిర్మాణం కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత సదరు సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే పక్కనే ఉన్న కత్వ చెరువుకు సంబంధించిన 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్ను ఆక్రమించి ఏకంగా 300కు పైగా విల్లాలను నిరి్మంచింది. దీనిపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని 11 అక్రమ విల్లాలను గత సెప్టెంబరులో అధికారులు కూల్చివేశారు. అంతేగాక ఇరిగేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టారని దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు తమకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని, రిజి్రస్టేషన్లు సైతం చేసుకుని బ్యాంకుల్లో రుణాల్లో తీసుకుని రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లను కొనుగోలు చేశామని, చివరికి తమ విల్లాలను కూల్చివేశారని, సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని బాధితులు దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు. విజయలక్ష్మిపై ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా గురువారం తెల్లవారుజామున దేశం విడిచి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు అప్పగించారు. వారు ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. -
హైడ్రా మళ్లీ వీకెండ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన వీకెండ్ ఆపరేషన్లను పునఃప్రారంభించింది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు ఆదివారం కూల్చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం అక్కడ పర్యటించి పూర్వాపరాలు తెలుసుకున్నారు. హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో దాదాపు ప్రతి వీకెండ్లోనూ ఓ అక్రమ నిర్మాణం కూల్చివేత ఉండేది. అక్రమ నిర్మాణాలెన్నో.. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. 100 ఫీట్ల రోడ్డులో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఐదు అంతస్తుల్లో ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణమని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. గత ఏడాది ఫిబ్రవరి 14న షోకాజ్ నోటీసులు, 26న స్పీకింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భవన యజమాని హైకోర్టు సవాల్ చేశారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అది అక్రమ నిర్మాణమని తేల్చి, కూల్చివేయాలని గత ఏడాది ఏప్రిల్ 19న ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ అధికారులు.. గత ఏడాది జూన్ 13న ఆ భవనం స్లాబ్కు అనేక చోట్ల పెద్ద పెద్ద రంధ్రాలు చేసి విడిచిపెట్టారు. వాటిని పూడ్చేసిన యజమానికి నిర్మాణం కొనసాగిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఇటీవల సదరు అక్రమ నిర్మాణంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రాత్రి 8 గంటల వరకు.. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏవీ రంగనాథ్, భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఆ భవనం వద్దకు చేరుకున్న ‘బాహుబలి క్రేన్’కూల్చివేత మొదలు పెట్టింది. రాత్రి 8 గంటల వరకు కూల్చివేత కొనసాగింది. అక్కడ పోలీసులు, హైడ్రా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరా ఆపేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు. అనుమతిచ్చిన అధికారుల వివరాలపై ఆరా తీస్తున్నాం.. హైకోర్టు అక్రమం అని తేల్చినా భవన నిర్మాణం కొనసాగడానికి కారణమైన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నాం. బాధ్యులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్నీ అక్రమ నిర్మాణాలే. ఆ భవనాలకు ఫైర్ ఎన్ఓసీ, భవన నిర్మాణ అనుమతి కూడా లేదు. అయ్యప్ప సొసైటీలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీతో కలిసి సమీక్షిస్తాం. హైకోర్టు నుంచి స్పష్టమైన కూల్చివేత ఉత్తర్వులు ఉన్న వాటిని తొలి దశలో కూల్చేస్తాం. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్. -
200 ఎకరాలను పరిరక్షించాం!
‘ఈ ఏడాది జూలై 19న హైడ్రా ఉద్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 ఎకరాలను పరిరక్షించాం. వీటిలో 12 చెరువులు, ఎనిమిది పార్కులతో పాటు ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుద్ధభవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాల జోలికి వెళ్లమని, హైడ్రా ఏర్పడిన తర్వాత వెలిసిన అక్రమ నిర్మాణాల పైనే చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. 2025 సంవత్సరంలో హైడ్రా అనుసరించే విధానాలపై రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలో ఆయా నిర్మాణాలకు నోటీసులు ఇచ్చే అధికారం కూడా హైడ్రాకు వచ్చింది. సంజాయిషీ నోటీసులతో పాటు అవసరాన్ని బట్టి ఖాళీ చేయమని, కూల్చేస్తామని సైతం నోటీసులు జారీ చేస్తుంది. గడిచిన 5 నెలల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 2025కు రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు అందాయి. అనధికారిక నిర్మాణాలకు సంబంధించి ఓఆర్ఆర్కు ఆనుకుంటూ అవతలి వైపునకూ విస్తరించి ఉన్న 27 పురపాలక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పునరు ద్ధరించిన 12 చెరువులకు 2025లో పునరుజ్జీవం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న హైడ్రా వాటి వివరాలను ప్రభుత్వానికి నివేదించనుంది. ఎవరి ప్రమేయం లేకుండా ఎఫ్టీఎల్... ప్రస్తుతం నగరం పరిధిలో ఉన్న 1095 చెరువుల్ని హైడ్రా గుర్తించింది. వీటి ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నిర్ధారణ, పునర్ వ్యవస్థీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. ఏ దశలోనూ మానవ వనరుల ప్రమేయం లేకుండా పూర్తి సాంకేతికంగా దీన్ని తేల్చనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు, రికార్డులు, డేటా ఆధారంగా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ) డేటా, శాటిలైట్ ఇమేజ్తో పాటు అత్యంత రెజల్యూషన్ ఉన్న గూగుల్ డేటా తీసుకుంటున్నారు. 2006 నుంచి 2023 వరకు ఏరియల్, డ్రోన్స్ ఫొటోలతో పాటు రెవెన్యూ రికార్డులను అధ్యయనం చేస్తున్నారు. వీటి ద్వారా ఆయా చెరువుల ఎఫ్టీఎల్ మారడానికి కారణాలు స్పష్టంగా తెలుసుకోనున్నారు. పెద్ద నాలాల ఆక్రమణలపైనా నజర్... చెరువులతో పాటు నాలాల పైనా హైడ్రా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దీనికోసం కిర్లోస్కర్ కమిటీ, ఓమెంట్స్ నివేదికలను పరిశీలిస్తోంది. చిన్న చిన్న నాలాలు కాకుండా మూడు, నాలుగు ఆర్డర్స్లో ఉండే పెద్ద వాటిపైనే ప్రధానంగా దృష్టి పెడుతోంది. శాటిలైట్ ఇమేజ్ల ద్వారా నాలాలపై ఆక్రమణలను గుర్తిస్తున్నారు. చెరువులను మింగేస్తున్న వాటిలో భవన నిర్మాణ వ్యర్థాలు కూడా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో 2025లో వీటి డంపింగ్ కోసం ప్రత్యేక స్థలాల గుర్తింపుతో పాటు జలవనరులకు జియో ఫెన్సింగ్ చేయనున్నారు. జనవరి నుంచి ప్రతి సోమవారం హైడ్రా గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారు. ప్రజలు, కాలనీ అసోసియేషన్లు ఇచ్చే ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యాప్, వెబ్సైట్ ద్వారా సమాచారం ⇒ హైడ్రా 2025లో తమ అధికారిక వెబ్సైట్తో పాటు యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఎఫ్టీఎల్, బఫర్జోన్, ప్రభుత్వ స్థలాలు, పార్కులు తదితరాలకు సంబంధించిన సమస్త సమాచారం జీపీఎల్ ఆధారంగా నిక్షిప్తం చేయనున్నారు. ⇒ ఓ వ్యక్తి ఎక్కడైనా నిల్చుని హైడ్రా యాప్ ఓపెన్ చేస్తే..అది వీటిలో ఏ ప్రాంతం పరిధిలోకి వస్తుందో తెలిసేలా అభివృద్ధి చేస్తున్నారు. హైడ్రా ఆవిర్భావం తర్వాత వీటిపై అవగాహన పెరిగిన ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ⇒ త్వరలో ఏర్పాటుకానున్న హైడ్రా పోలీసుస్టేషన్ ప్రభుత్వ, చెరువుల భూముల కబ్జా కేసులను దర్యాప్తు చేస్తుంది. ఈ దందాల వెనుక ఉన్న సూత్రధారులు, అధికారులను గుర్తిస్తుంది. ⇒ హిమాయత్సాగర్ ఎఫ్టీఎల్ డీ–మార్కేషన్ను 2025లో హైడ్రా పూర్తి చేయనుంది. మూసీలో ఉన్న ఆక్రమణల గుర్తింపునకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వర్షపు నీరు పరిరక్షణ పైనా హైడ్రా అధ్యయనం చేయనుంది. -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
Telangana: బుల్డోజర్లకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కలకలం రేపిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలి పరిణామాలు, సంస్థాగత లోపాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం 3 నెలలపాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని సూచించింది. దీనితో హైడ్రా తమ విభాగం అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువులు, కుంటలపై విస్తృత సర్వే చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలతో..చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే.. జీహెచ్ఎంసీ అధీనంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ‘విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం)’రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్ 27న ఫిల్మ్నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు. తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఓఆర్ఆర్ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు.విరామానికి కారణాలెన్నో..హైడ్రా ప్రభావంతో రాష్ట్రంలో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు పడిపోయాయి. మరో వైపు అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నది వెంట ఇళ్ల సర్వే, ఖాళీ చేయించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టింది. మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేకపోయినా.. రెండింటి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.‘హైడ్రా’వ్యవస్థ నిర్మాణంపై ఫోకస్కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఇటీవలే వివిధ విభాగాల నుంచి 169 మందిని డిప్యూటేషన్పై నియమించారు. కానీ పోలీసు విభాగం నుంచి వచ్చిన 20 మంది మినహా మరే ఇతర విభాగాల సిబ్బంది హైడ్రా విధుల్లో చేరలేదు. మరోవైపు హైడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపుతూ కొందరు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వారిని రిలీవ్ చేయడానికి పలువురు శాఖాధిపతులు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైడ్రా వినియోగిస్తున్న కార్యాలయంతోపాటు సిబ్బందిలో దాదాపు అంతా జీహెచ్ఎంసీకి సంబంధించిన వారే. ఈ విషయంలో అటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, ఇటు హైడ్రాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత అంశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు.జల వనరుల ‘లెక్క’తేల్చేలా..జల వనరుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయా చెరువులు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడాన్ని ఇటీవల న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. దీనికోసం రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలతోపాటు హెచ్ఎండీఏ ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ప్రాథమిక, ఆపై తుది నోటిఫికేషన్లు జారీ చేయాలి. హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్తోపాటు శివారు జిల్లాల్లో కలిపి 2,688 జలవనరులు ఉన్నాయి. వీటిలో 2,364 ప్రిలిమినరీ నోటిఫికేషన్ స్థితి దాటగా, 324 మాత్రమే తుది నోటిఫికేషన్ దాకా వెళ్లాయి. 95 చెరువులకు హైడ్రా ఏర్పడిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో అన్ని చెరువుల సర్వే పూర్తి చేసి, తుది నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
చెరువుల్ని వదలకుంటే చెరసాలకే!: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ‘చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఫాంహౌస్ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారు. అందుకే చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదిలేయాలని ఆక్రమణ దారులకు విజ్ఞప్తి చేస్తున్నా..లేకపోతే చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతాం. నాలాలపై ఆక్రమణలను కూడా తప్పనిసరిగా కూల్చేస్తాం. కూల్చివేతలపై స్టే తెచ్చుకుంటే కోర్టుల్లో కొట్లాడతాం. అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడం..’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించే లక్ష్యంతోనే హైడ్రాను ఏర్పాటు చేశామని, ఆక్రమణదారులు ఎంత గొప్పవారైనా చర్యలు తప్పవని చెప్పారు. ఇదే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలను క్రమబద్ధం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం నిర్వహించిన ఎస్ఐల దీక్షాంత్ పరేడ్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 145 మంది మహిళలు సహా 547 మంది సివిల్ ఎస్ఐలు, రిజర్వ్ ఎస్ఐలు, ఏఎస్ఐల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. శిక్షణలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలను బహూకరించారు. పాసింగ్ అవుట్ పరేడ్ కమాండర్గా వ్యవహరించిన పల్లి భాగ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలి ‘పోలీస్ ఉద్యోగాన్ని కేవలం ఉద్యోగ బాధ్యతగా మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజలను కాపాడే ఉద్యోగంగా, భావోద్వేగంతో చూడాలి. ప్రకృతి విపత్తులైనా, శాంతిభద్రతల సమస్యలైనా, ఏ ఇతర సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే. ఆ మేరకు ప్రజల్లో విశ్వాసాన్ని, పోలీసులపై గౌరవాన్ని పెంచేలా పనిచేయాలి. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం మోపాలి. సైబర్ నేరాలకు తావులేకుండా యువ పోలీస్ అధికారులు పనిచేయాలి. డ్రగ్స్, గంజాయి పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ఆక్రమణల కూల్చివేతలు, డ్రగ్స్ కట్టడి సహా ప్రభుత్వ అన్ని నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత యువ అధికారులపై ఉంది. కాస్మొటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులతోనే.. నేరస్తులతో కాదు. మీ అందరినీ చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న విశ్వాసం కలుగుతోంది..’అని సీఎం అన్నారు. రెండు రెసిడెన్షియల్ పోలీస్ స్కూళ్లు ‘సైనిక్ స్కూళ్ల మాదిరిగా హైదరాబాద్, వరంగల్లో ఒక్కొక్కటి 50 ఎకరాలతో రెండు రెసిడెన్షియల్ పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు ఉచితంగా చదువుకునే ఏర్పాటు చేస్తాం. ఇందుకు సంబంధించి డీజీపీ జితేందర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి చర్యలు తీసుకోవాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏడాది చివర్లో కొత్తగా 35 వేల ఉద్యోగాలు ‘కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదు.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోంది. కేవలం 28 రోజుల్లోనే 22.22 లక్షల రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేసి రుణమాఫీ చేశాం. తెలంగాణ వచ్చినా గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. గతంలో జిరాక్స్ సెంటర్లలో టీజీపీఎస్సీ ప్రశ్నపత్రాలు లభించే దారుణ పరిస్థితి ఉండేది. మా ప్రజా ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షలపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏడాది చివరికి కొత్తగా 35 వేల ఉద్యోగాలు ఇస్తాం..’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలు కాపాడడంలో, ప్రజలకు న్యాయం చేయడంలో ఎస్ఐల పాత్ర కీలకం అని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందేలా పనిచేయాలని యువ అధికారులకు సూచించారు. కాగా పోలీస్ అకాడమీలో శిక్షణ సంబంధిత వివరాలను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్రెడ్డి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర సీనియర్ అధికారులు, యువ ఎస్ఐల కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం‘హైదరాబాద్ నుంచి వచ్చే కాలుష్యంతో నల్లగొండ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి కోమటిరెడ్డి నా దృష్టికి తెచ్చారు. ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తాం. మూసీలో శాశ్వత నివాసదారుల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాం.నివాసితులైన 11 వేల మందిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది’ ..: సీఎం రేవంత్ రెడ్డి :.. -
18 ప్రాంతాలు.. 43.94 ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో మొత్తం 43.94 ఎకరాలు పరిరక్షించింది. వీటిలో ఎన్–కన్వెన్షన్ ఆక్రమించిన తమ్మిడికుంటతో పాటు ఇతర చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు ఉన్నాయి. తొలుత జీహెచ్ఎంసీ అ«దీనంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) ఈ కూలి్చవేతలు ప్రారంభించింది.ఈ విభాగం డైరెక్టర్గా వచి్చన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ నేతృత్వంలోని బృందం ఈ ఏడాది జూన్ 27న ఫిల్మ్నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టింది. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్లోని 0.16 ఎకరాలకు విముక్తి కలి్పంచడం తొలి ఆపరేషన్గా రికార్డుల్లోకి ఎక్కింది. ఆపై జూలై 1, 4, 5, 14 తేదీల్లో మన్సూరాబాద్, ఎమ్మెల్యేస్ కాలనీ, మిథిలానగర్, బీజేఆర్ నగర్లపై పంజా విసిరింది. ఆ నాలుగు చోట్ల ఉన్న ఏడు నిర్మాణాలను కూలి్చ వేసింది. అప్పటివరకు ఆ ఆపరేషన్లు జీహెచ్ఎంసీ వరకే పరిమితం అయ్యాయి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు పరిధిని విస్తరించడమే కాకుండా హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్.. దూకుడు పెంచారు. మహదేవ్పురంలో తొలి ఆపరేషన్ గత నెల 21న మహదేవ్పురంలో పార్కు స్థలంలోని ఆక్రమణల తొలగింపుతో హైడ్రా ఆపరేషన్లు మొదలయ్యాయి. ఇలా శనివారం వరకు 18 చోట్ల ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించింది. మొత్తం 43.94 ఎకరాల మేర ప్రభుత్వ భూములు, చెరు వులు పరిరక్షించింది. వీటిలో పలువురు వీఐపీలతో పాటు బడా రియల్టర్లకు చెందినవీ ఉన్నాయి. హైడ్రా ఏర్పాటై నెల రోజులు దాటినా ఇప్పటివరకు దానికి అదనంగా ఒక్క పోస్టును కానీ సిబ్బందిని కానీ కేటాయించలేదు. దీంతో ఇప్పటివరకు కేవలం ఈవీడీఎం, జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల సహకారంతోనే కార్య కలాపాలు సాగిస్తోంది.దీనికోసం ప్రతిపాదించిన అదనపు సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్స్టేషన్ను కేటాయిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైడ్రా షాక్ తగిలిన వారిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునతో పాటు ప్రో కబడ్డీ యజమాని అనుపమ, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నేత సునీల్రెడ్డి, బహదూర్పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (ఈయనపై కేసు నమోదైంది), చింతల్కు చెందిన బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సంబంధీకులు ఉన్నారు.హైడ్రా కూలి్చవేతల్లో కీలకమైనవి.. ⇒ మహదేవ్పురంపార్క్ స్థలంలోని నిర్మాణం ⇒ భూదేవిహిల్స్లో చెరువులను ఆక్రమించి చేపట్టిన ఐదు నిర్మాణాలు ⇒గాజులరామారంలోని చింతల్చెర్వులో ఉన్న 54 నిర్మాణాలు ⇒నందగిరి హిల్స్ పార్కులో 16 నిర్మాణాలు ⇒రాజేంద్రనగర్లోని బుమ్రాఖ్ దౌలా లేక్ లోని 45 నిర్మాణాలు ⇒ ఖానాపూర్, చిల్కూరుల్లోని గండిపేట చెరు వులో ఉన్న 24 నిర్మాణాలు ⇒తమ్మిడికుంట చెరువులోని ఎన్–కన్వెన్షన్తో పాటు ఇతర నిర్మాణాలు ⇒ ఫుట్పాత్లు, నాలాలపైన, ప్రభుత్వ స్థలా ల్లోని అక్రమ నిర్మాణాలు -
ఇది కురుక్షేత్ర యుద్ధమే: సీఎం రేవంత్రెడ్డి
మణికొండ (హైదరాబాద్): ‘ఆనాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని గెలిపించేందుకు అర్జునుడి వెంట ఉండి కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. నేడు మేము ఆయన మార్గంలోనే భవిష్యత్తు తరాలకు ప్రకృతి సంపదను, చెరువులను అందించాలనే ఉద్దేశంతోనే చెరువుల్లో అక్రమ నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాం. ఇది కరుక్షేత్ర యుద్ధంతో సమానమే.. ఇందులో మా వారితో పాటు మంది కూడా ఉన్నారు. ఇది ఏమాత్రం రాజకీయ కక్ష కానేకాదు.. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా తలవంచకుండా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తాం. వెనక్కి తగ్గేదే లేదు..’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. ఆది వారం హైదరాబాద్ నగర శివారు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో హరేకృష్ణ మూవ్మెంట్ వారు నిర్మిస్తున్న హెరిటేజ్ టవర్లో అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చెన్నై, వయనాడ్లా కాకూడదు ‘హైదరాబాద్కు హెరిటేజ్ సిటీ, లేక్ సిటీగా పేరుంది. ఆ ప్రత్యేకతను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లేదంటే చెన్నై, వయనాడ్లా ప్రకృతి మనపై ప్రతాపం చూపిస్తుంది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ చెరువుల చుట్టూ సంపన్నులు ఫాంహౌస్లు కట్టుకుని వాటి డ్రైనేజీని చెరువుల్లో కలపటం ఎంతవరకు సబబు? అలాంటి వారిలో కొందరు మా పార్టీ వాళ్లు కూడా ఉండొచ్చు. తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకునే సమయం వచ్చింది. వారు సైతం కూల్చివేతలకు సహకరించాలి. కృష్ణా, గోదావరి నదులు ఎండిపోయినా గండిపేట, హిమాయత్సాగర్ జలాలతో హైదరాబాద్ ప్రజలు దాహార్తి తీర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ను సుందర నగరంగా తీర్చిదిద్దుకుని భవిష్యత్తరాలకు అందించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుని పనిచేస్తుంది. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇప్పటికే హైడ్రా పలు చెరువుల్లో ఆక్రమణలను తొలగించింది. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా పనిచేస్తుంది..’అని సీఎం స్పష్టం చేశారు కాంక్రీట్ జంగిల్కు ఆధ్యాత్మిక శోభ ‘మన రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన ఫైనాన్షియల్ జిల్లా కాంక్రీట్ జంగిల్గా అభివృద్ధి చెందింది. అలాంటి చోట ఆరు ఎకరాల విస్తీర్ణంలో 430 అడుగుల ఎత్తులో ఆధ్యాత్మికతను బోధించే హెరిటేజ్ టవర్ రావటం ఎంతో అభినందనీయం. ఇలాంటి దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనటంతో నా జన్మ ధన్యం అయ్యింది. 36 నుంచి 40 నెలల్లో పనులు పూర్తయ్యాక ప్రారంబోత్సవంలోనూ పాల్గొనాలని ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప మందిరం అవుతుంది. ఇప్పటికే ఐటీ, వైద్యం, విద్య తదితర రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న మన రాష్ట్రం, హెరిటేజ్ టవర్ నిర్మాణంతో ఆధ్యాత్మికతలోనూ అదే స్థాయికి వస్తుంది. అనునిత్యం ఒత్తిడిలో జీవిస్తున్న ప్రజలకు ఇలాంటి దేవాలయాలతో మనశ్శాంతి, స్ఫూర్తి లభిస్తాయి. అక్షయ పాత్ర ద్వారానే ఆస్పత్రుల్లో భోజనం అక్షయపాత్ర ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నాణ్యమైన భోజనం అందిస్తాం. ప్రభుత్వ పథకాల అమలుకు కూడా హరేకృష్ణ మూవ్మెంట్ సహకారం అందించాలి..’అని రేవంత్రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్గౌడ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర మత్స్య సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బి.జ్ఞానేశ్వర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం.జైపాల్రెడ్డి, హరేకృష్ణ మూవ్మెంట్ గ్లోబల్ అధ్యక్షుడు మధుపండిత దాస, తెలంగాణ రీజియన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాసలు పాల్గొన్నారు. -
ట్రిపుల్వన్ అడ్రస్ తెలుసా హైడ్రా?
‘పరిధి’ దాటుతోందా? చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ‘హైడ్రా’ పరిధి ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వరకు ఉంటుందని ప్రభుత్వమే నిర్వచించింది. కానీ ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో సింహభాగం ఔటర్ వెలుపలే ఉంది. దీంతో ‘హైడ్రా’ పరిధిని దాటి, టార్గెట్ చేసి మరీ బుల్డోజర్లను ప్రయోగిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.సెలబ్రిటీల నిర్మాణాలను ‘టచ్’ చేస్తారా? 111 జీవో పరిధిలో చాలా మంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేశారు. వాటిలో నివాస, వాణిజ్య సముదాయాలు, ఫామ్హౌస్లు, రిసార్ట్లను నిర్మించుకున్నారు. ఇందులో ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులు, మాజీ మంత్రులు, బహుళ జాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీల లగ్జరీ ఫామ్హౌస్లు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం వాటిని ‘టచ్’ చేస్తుందా? ఆ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను ప్రయోగించగలదా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: వందేళ్లుగా భాగ్యనగరవాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్ జంట జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. అక్రమ భవనాలను తొలగించి, జలాశయాలను పరిరక్షించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కానీ ‘ఈ కూల్చివేతలను కేవలం ‘ఎంపిక’చేసిన భవనాలు, నిర్మాణాలకే పరిమితం చేస్తారా? లేక అక్రమ నిర్మాణాలు అన్నింటిపైకీ బుల్డోజర్లు వెళతాయా? విచ్చలవిడి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన 111 జీవో పరిధిలోని ప్రాంతాలపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)’ దృష్టిపెడుతుందా?’అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలోని అక్రమ నిర్మాణాలపైకి ‘హైడ్రా’ బుల్డోజర్లను నడిపిస్తున్న నేపథ్యంలో.. ట్రిపుల్ వన్ జీవో వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ‘ట్రిపుల్ వన్’పై తీవ్ర గందరగోళం జంట జలాశయాలను కాపాడేందుకు, వాటి పరీవాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు 40 ఏళ్ల క్రితం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో–192ను తీసుకొచ్చారు. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో–111ను తెల్చింది. ఇటీవలి వరకు అది కొనసాగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చేందుకు జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని గత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్లో ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేసి, దాని స్థానంలో జీవో నంబర్ 69ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడి 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఇతర అంశాలపై అప్పటి ప్రభుత్వ సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. కానీ ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఈలోపు ఎన్నికలు సమీపించడం, ప్రభుత్వం మారడంతో జీవో–111పై గందరగోళం నెలకొంది. ‘ఎంపిక’ చేసిన భవనాలపైనేనా? గ్రేటర్ హైదరాబాద్ సిటీకి చేరువలో 84 గ్రామాలు, 1.32 లక్షల ఎకరాల భూములు, 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. క్లుప్తంగా జీవో– 111 పరిధి ఇది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే–అవుట్లకు అనుమతి లేదు. ఈ ప్రాంతంలోని ఏ స్థలంలో అయినా దాని విస్తీర్ణంలో కేవలం 10శాతం మాత్రమే నిర్మాణాలు చేపట్టవచ్చు. అదీ శాశ్వత నిర్మాణం అయి ఉండకూడదు. నీటి సహజ ప్రవాహానికి ఏమాత్రం అడ్డుగా ఉండకూడదు. కానీ ఈ నిబంధనలు కాగితాలకే పరిమితయ్యాయి. అక్రమార్కులు అధికారులతో కుమ్మకై అడ్డగోలుగా నిర్మాణాలను చేపట్టారు. తాజాగా సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులు జలాశయాల పరీవాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఇది ఈ జలాశయాల పరిధిలోని అన్ని అక్రమ నిర్మాణాలపై ఉంటుందా? లేదా కేవలం ‘ఎంపిక’ చేసిన నిర్మాణాల కూల్చివేతతోనే ఆగిపోతుందా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. జలాశయాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లు కూడా భవిష్యత్తులో హుస్సేన్సాగర్లా మురికికూపమైపోయే మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకున్నా లక్షల్లో నిర్మాణాలు 40 ఏళ్ల కిందటే జంట జలాశయాల పరీవాహక ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చినా.. అక్రమ నిర్మాణాలు కొనసాగుతూ వచ్చాయి. గత పది, పదిహనేళ్లలో విపరీతంగా పెరిగాయి. అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఇష్టారీతిగా నిర్మాణాలు సాగుతున్నా చూసీచూడనట్టు వదిలేశారు. ప్రధానంగా మెయినాబాద్, శంషాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ మండలాల్లోని ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, హోటళ్లు, ఇతర భవన నిర్మాణాలు వెలిశాయి. జీవో–111 పరిధిలో 7 మండలాల్లోని 84 గ్రామాల పరిధిలో మొత్తం 426 అక్రమ లే–అవుట్లు, 10,907 గృహాలు, 1,363 వాణిజ్య నిర్మాణాలు, 190 పారిశ్రామిక, ప్రభుత్వ నిర్మాణాలు వెలిశాయని 2016లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైకోర్టుకు నివేదించారు. ఇప్పుడు వీటి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా.అటు అభివృద్ధి.. ఇటు మనుగడ.. అభివృద్ధిలో వెనుకబడుతున్నామని, జీవో–111 ఎత్తే యాలని ఆ ప్రాంతంలోని వారు మొదట్నుంచీ కోరుతున్నారు. అలా చేస్తే జంట జలాశయాల మనుగడకు విఘాతం కలుగుతుందని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సర్కారు జీవో–111పై కోదండరెడ్డి నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. – చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ ప్రెసిడెంట్ ఫిఫ్త్ సిటీగా జీవో–111 జీవో–111 పరిధిలోని 84 గ్రామాలను ఫిఫ్త్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. జీవో పరిధిలోని 84 గ్రామాలకు నెట్ జీరో పాలసీని అవలంబించేలా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. పర్యావరణానికి హాని కలిగించని, తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. వాన నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. – జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్ప్లాన్ను రూపొందించాలని, ట్రిపుల్ వన్లోని ప్రాంతాలను కూడా మాస్టర్ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్ప్లాన్లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్ప్లాన్లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్ప్లాన్లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అద్దెకు.. టీడీపీ ఆఫీస్!
సాక్షి, అమరావతి: అధికారం ఉన్నా.. లేకున్నా.. టీడీపీ ‘భూ’ కబ్జాలు మాత్రం ఆగడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వాగు పోరంబోకు భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయం కోసం కేటాయించిన చంద్రబాబు.. ఇప్పుడు జీవో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం ముందే దుకాణాలు నిర్మించి వాణిజ్య కార్యకలాపాలకు అద్దెకిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి భూమిని సైతం కబ్జా చేసేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద జరుగుతున్న ‘చంద్రబాబు చిలక్కొట్టుడు.. కబ్జా’ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. కార్యాలయానికి.. వాగు పోరంబోకు భూమి చంద్రబాబు ప్రభుత్వం 2018లో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 392లో ఉన్న 3.65 ఎకరాలను టీడీపీ రాష్ట్ర కార్యాలయం కోసం కేటాయించింది. ఎకరాకు ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్లకు లీజు కింద కేటాయిస్తూ జీవో 228 జారీ చేసింది. ఆ భూమి పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకే వినియోగించాలని అందులో పేర్కొంది. ఇతరత్రా అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని కూడా స్పష్టం చేసింది. ఈ భూ కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదం కూడా అయ్యింది. వాగు పోరంబోకు భూమిని చంద్రబాబు టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్నారు. వాగులు, చెరువులు, నదులు ఇతర జలవనరులకు సంబంధించిన భూముల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా వాగు పోరంబోకు భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్నారు. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. సహకరిస్తున్న ఎన్హెచ్ఏఐ అధికారి! ఈ ఆక్రమణలపై ఎన్హెచ్ఏఐ యంత్రాంగం ఉదాసీనంగా ఉండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్ మీద ఎన్హెచ్ఏఐలో పనిచేస్తున్న ఓ అధికారి టీడీపీకి వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేసినా.. ఆయన పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. ఇక టీడీపీ కార్యాలయంలో సమావేశాలు జరిగితే.. ఎన్హెచ్ఏఐకు చెందిన తూర్పు, పశ్చిమ సర్వీసు రోడ్లను పూర్తిగా ‘బ్లాక్’ చేస్తూ.. పార్కింగ్కు వాడేసుకుంటున్నారు. ఇష్టమొచ్చినట్లుగా సర్వీస్ రోడ్లపై కార్లు అడ్డంగా పెడుతుండటంతో ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. దర్జాగా ఆక్రమణలు.. దుకాణాల నిర్మాణం వాగు పోరంబోకు భూమి కేటాయింపుతో టీడీపీ అధినేత చంద్రబాబు సంతృప్తి చెందలేదు. పార్టీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి వచ్చే భూమిపైనా కన్నేశారు. నెమ్మదిగా దానిని ఆక్రమించడం మొదలుపెట్టారు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి కేటాయించిన భూమికి, ఎన్హెచ్ఏఐ సర్వీసు రోడ్డుకు మధ్యలో ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టారు. ఏడాది క్రితం టీడీపీ కార్యాలయం ప్రధాన గేటు పక్కన ఓ దుకాణాన్ని నిర్మించి.. మైత్రి ఎంటర్ప్రైజస్ అనే పేరుతో ఒకరికి అద్దెకు కూడా ఇచ్చారు. తాజాగా మరో రెండు దుకాణాలను నిర్మించి.. వాణిజ్య కార్యకలాపాల కోసం ఇతరులకు అద్దెకిచ్చారు. రాజకీయ కార్యకలాపాల కోసమే వినియోగించాలని టీడీపీ ఆఫీస్కు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. దానికి విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా.. ఎన్హెచ్ఏఐ సర్వీసు రోడ్డు పరిధిలోకి చొరబడి మరీ వాణిజ్య నిర్మాణాలు చేపట్టారు. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనే. -
ఇప్పటం ఇళ్ల యజమానులకు ధర్మాసనంలోనూ షాక్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు ఇళ్ల యజమానులకు హైకోర్టు ధర్మాసనం సైతం గట్టి షాక్నిచ్చింది. రోడ్డు మార్జిన్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడమే కాకుండా వాటిని కూల్చివేసేందుకు అధికారులు నోటీసులిచ్చినా ఆ విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఇళ్ల యజమానులు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఖర్చులు విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈమేరకు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ 14 మంది ఇళ్ల యజమానులు దాఖలు చేసిన రిట్ అప్పీల్ను ధర్మాసనం కొట్టి వేసింది. ఖర్చుల మొత్తాన్ని తగ్గించాలన్న విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. వాస్తవాలను దాచి పెట్టి కోర్టుల నుంచి సానుకూల ఉత్తర్వులు పొందే తీరును తామెంత మాత్రం ప్రోత్సహించబోమని తేల్చి చెప్పింది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందని, వారు సకాలంలో కోర్టును ఆశ్రయించి న్యాయం పొందే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 14 మంది రూ.14 లక్షలను ఖర్చుల కింద చెల్లించాలంటూ సింగిల్జడ్జి ఇచ్చిన తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ నేపథ్యం.. రహదారి విస్తరణలో భాగంగా పలు ఇళ్ల కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్ మార్జిన్లను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు ఈ ఏడాది మే 21న చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయితే రాజకీయ పార్టీల అండతో ఈ నోటీసులను సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది ఇళ్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సింగిల్ జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్హారీ... పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అటు తరువాత ఆ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా ఇళ్ల కూల్చివేత విషయంలో పిటిషనర్లకు అధికారులు ముందుగానే షోకాజ్ నోటీసులతో పాటు ఇతర నోటీసులు కూడా అందచేశారంటూ అందుకు సంబంధించి అన్ని ఆధారాలను మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తి ముందుంచారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి హైకోర్టును ఆశ్రయించిన 14 మంది పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందుకుని కూడా నోటీసులు ఇవ్వలేదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించడంపై మండిపడ్డారు. కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున 14 మందికి రూ.14 లక్షలను ఖర్చులుగా విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆ 14 మంది ఇళ్ల యజమానులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారు... ఇళ్ల యజమానుల తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ పిటిషనర్లందరూ వ్యవసాయదారులని పేర్కొన్నారు. వారికి షోకాజ్ నోటీసులకు, తుది నోటీసులకు తేడా తెలియదన్నారు. దీంతో నోటీసులు ఇవ్వలేదని చెప్పారన్నారు. అంతేకానీ కోర్టును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం వారికి లేదన్నారు. జరిగిన తప్పులకు క్షమాపణ చెబుతున్నామన్నారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఇలాంటి వ్యాజ్యాల వల్ల కోర్టుల సమయం వృథా అవుతోందని పేర్కొంది. వాస్తవాలను తొక్కి పెట్టి పిటిషన్ దాఖలు చేయడం ద్వారా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా మిగిలిన కక్షిదారుల వ్యాజ్యం విచారణ జాబితాలో వచ్చే అవకాశం లేకుండా పోయిందని, ఇది ఓ రకంగా అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించింది. కేసులు సకాలంలో విచారణకు రాకపోవడంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, అందుకు ఇప్పటం ఇళ్ల యజమానులు లాంటి వారు దాఖలు చేసే వ్యాజ్యాలే కారణమని పేర్కొంది. ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు హైకోర్టు ఎంతో సమయం వెచ్చించిందని తెలిపింది. ఆ సమయాన్ని నిజమైన బాధితులు దాఖలు చేసే వ్యాజ్యాలను విచారించేందుకు వెచ్చించి ఉంటే వారికి న్యాయం జరుగుతుందని పేర్కొంటూ అప్పీల్ను కొట్టేసింది. -
AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అటవీ, రెవిన్యూ, పంచాయతీ, మున్సిపల్ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ బుధవారం ఆదేశాలిచ్చింది. ఆరు నెలల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: (శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ) -
మునిసిపల్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట/నరసరావుపేట: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట మునిసిపల్ కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. భవన నిర్మాణాలకు అనుమతులు, అక్రమ నిర్మాణాలు అడ్డుకోకపోవడం వంటి వాటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సూళ్లూరుపేట మునిసిపల్ కార్యాలయం వద్ద నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటలో ఒక భవనం కొలతలు తీసుకున్నారు. ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. రూ.1.9 లక్షల స్వాధీనం సూళ్లూరుపేట మునిసిపల్ కార్యాలయంపై ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏసీబీ డీఎస్పీ మోహన్ నేతృత్వంలోని అధికారులు తనిఖీలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో అవినీతి జరుగుతోందని స్పందనలో సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ దాడులు చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చిన వెంటనే మునిసిపల్ కమిషనర్ చాంబర్ కిటికీకి పక్కనే రూ.500 నోట్ల కట్టలు రెండు, వంద రూపాయల నోట్ల కట్ట ఒకటి కనిపించాయి. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ కారులో రూ.50 వేలు దొరికాయి. కొందరు ఉద్యోగుల వద్ద రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.90 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్కు అధికారి లేకపోవడంతో ఆ బాధ్యతలను ప్రస్తుతం కమిషనర్ చూస్తున్నారు. వసూలు చేసిన ఫీజు అధికారుల వద్దే.. నరసరావుపేట మునిసిపల్ కార్యాలయంలో ఏసీబీ అదనపు ఎస్పీ జె.వెంకటరావు ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రతాప్కుమార్, ఇతర అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు, కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకుని ప్లాన్ల∙వివరాలను పరిశీలించారు. పాతూరు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని ఒక నూతన భవనాన్ని టేపులతో కొలతలు తీసుకున్నారు. ఆ సమయంలో మునిసిపల్ కమిషనర్ డి.రవీంద్ర అక్కడే ఉండగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంతకు గంటముందే తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరినట్లు తెలిసింది. తరువాత ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు టీపీఎస్తోపాటు పలువురు ఉద్యోగులు కార్యాలయానికి వచ్చారు. అదనపు ఎస్పీ వెంకటరావు విలేకర్లతో మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగంపై తమకు రెండు ఫిర్యాదులు వచ్చాయన్నారు. తమ తనిఖీల్లో చాలా అవకతవకలను కనుగొన్నట్లు చెప్పారు. ప్లాన్కు విరుద్ధంగా, అసలు ప్లాన్ తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్నా టౌన్ప్లానింగ్ అధికారులు నియంత్రించలేదని తెలిపారు. అనుమతి ఇచ్చిన ప్లాన్కు సంబంధించిన ఫీజును వీరే వసూలు చేసి తమ దగ్గరే ఉంచుకున్నారని చెప్పారు. -
ఢిల్లీ జహంగీర్పూరాలో ఉద్రిక్తత
-
జీ+2 పర్మిషన్ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించిన హెచ్ఎండీఏ తాజాగా తక్కువ విస్తీర్ణంలోని అక్రమ భవనాలపై దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపంచాయతీలలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టింది. వివిధ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగాలు, మున్సిపల్ అధికారులు, పోలీసులు తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలతో త్వరలోనే విస్తృత స్థాయిలో దాడులు చేపట్టనున్నారు. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు. గత నెల 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించారు. నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. చట్టవిరుద్ధమని తెలిసినా.. గ్రామ పంచాయతీలలో జీ+2 కోసం అనుమతులు తీసుకొన్న భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా అయిదారు అంతస్తుల భవనాలను నిర్మించారు. హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతలలో చాలా వరకు 600 నుంచి1000 గజాల విస్తీర్ణం కలిగిన స్థలాలు. ఇక నుంచి 600 చదరపు గజాల లోపు స్థలాల్లోనూ చేపట్టిన అక్రమ నిర్మాణాలే టార్గెట్గా దాడులు కొనసాగించనున్నారు. 150 గజాల నుంచి 250 గజాల వరకు ఉన్న స్థలాల్లో కూడా చాలా చోట్ల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. ఇలాంటివి పూర్తిగా చట్టవిరుద్ధం. (క్లిక్: ఫ్లాట్ కొంటున్నారా? ఏం చేస్తే బెటర్!) అక్రమాలు వేల సంఖ్యలో.. నగర శివారు ప్రాంతాల్లో వేలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామపంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. కోవిడ్ కాలంలో ఇలాంటి అక్రమ భవనాలను ఎక్కువగా నిర్మించినట్లు అధికారులు అంచనా వేశారు. తక్కువ విస్తీర్ణంలో చేపట్టిన అక్రమ కట్టడాలు వేల సంఖ్యలో ఉంటాయని అంచనా. కొరవడిన నిఘా... హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతల్లో తిరిగి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కూల్చిన కట్టడాలను ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, ఎమ్మెల్యేల అండతో తిరిగి నిర్మిస్తున్నారు. నిజాంపేట్, తుర్కయంజాల్, పోచారం, ఘట్కేసర్, అన్నోజీగూడ తదితర చోట్ల ఇలా పునర్నిర్మించి కొనుగోలుదారులకు అప్పగించారు. (క్లిక్: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) -
కూలుతున్న అక్రమ కట్టడాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీలలో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై సర్కారు కన్నెర్ర చేసింది. వాటిని కూల్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరు చెప్పి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గత మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. నెలక్రితం దుండిగల్లో పంచాయతీ అనుమతితో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడం విషయం వెలుగుచూడడంతో పురపాలక శాఖ సీరియస్ అయింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ ఇతర అధికారులు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ నుంచి గతంలో నిర్మాణ అనుమతి పొందినప్పటికీ, మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లుగా మారాక ఆయా ప్రాంతాల్లో తిరిగి సంబంధిత విభాగాల అనుమతి పొందాలని, లేని పక్షంలో కూల్చివేస్తామని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే పురపాలక శాఖ అధికారులు అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు సోమవారం నుంచే భవన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ శివార్లలోని జిల్లాల్లో ముందుగా 600 చదరపు గజాల విస్తీర్ణానికి మించి ఉన్న అక్రమ నిర్మాణాలపై ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలకు దిగాయి. కూల్చివేతలను మంగళవారం సైతం కొనసాగించారు. ఇతర జిల్లాల్లో సైతం భారీగా అక్రమ కట్టడాలు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో రెండేళ్ల కాలంలో నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాల డేటాను అధికారులు సేకరించారు. ఈ మేరకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వాటికి ఆనుకొని ఉన్న కొత్త మున్సిపాలిటీల్లో కూడా గ్రామ పంచాయతీ అనుమతి పేరిట భారీగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. వ్యక్తిగత నివాస భవనాలతో పాటు కళాశాలలు, హాస్టళ్లు, స్కూళ్లను బహుళ అంతస్తుల్లో నిర్మించినట్లు కనుగొన్నారు. వీటిలో స్థానిక పట్టణ అథారిటీ, డీటీసీపీ అనుమతి లేకుండా సాగిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
విశాఖ కలెక్టర్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు విశాఖ జిల్లా కలెక్టర్ జనవరి 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సబ్బవరంలోని 255, 272, 277 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిలో కె.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అధికారులతో కుమ్మక్కై నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఎస్.చినవెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన సీజే ధర్మాసనం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కలెక్టర్ను ఆదేశిస్తూ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని పిటిషనర్ న్యాయవాది ఎన్.హెచ్.అక్బర్ తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కలెక్టర్పై మండిపడింది. -
నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్
సాక్షి, హైదరాబాద్: నయా మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలపై పురపాలక శాఖ నజర్ పెట్టింది. పంచాయతీలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందే సమయంలో సర్పంచ్, పాలకమండలితోపాటు కార్యదర్శులుగా వ్యవహరించినవారు ఇచ్చిన ‘అనుమతుల’తో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల దుండిగల్లో నకిలీ అనుమతితో సాగిన నిర్మాణం వెలుగులోకి రావడంతో పురపాలక శాఖ అప్రమత్తమైంది. ఇటీవల ఏర్పాటైన 68 కొత్త మునిసిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన 131 గ్రామ పంచాయతీల్లో 2018 తర్వాత పాత తేదీల అనుమతితో వెలిసిన వెంచర్లు, నిర్మించిన భవనాలు, ఇళ్లు, తదితర కట్టడాల వివరాలను తెప్పించింది. ఎల్ఆర్ఎస్, బీపీఎస్లపై కోర్టుల్లో వివాదాలున్న నేపథ్యంలో కొత్త విధానం ద్వారా అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించేలా కసరత్తు సాగుతున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం కష్టంగా మారడంతో న్యాయ పరమైన చిక్కులు రాకుండా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. కొత్త మున్సిపాలిటీల్లోనే ఈ కొత్తవిధానం వర్తించేలా రూపొందించాలని యోచి స్తున్నట్లు సమాచారం. ఏ సర్వే నంబర్లో ఏ స్థలానికి ఎప్పుడు అనుమతి మంజూరైంది? నిర్మాణం సాగిన వివరాలను కూడా ఇన్వార్డు, అవుట్వార్డుల్లో నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందుతున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ శివార్లు, ఇతర పట్టణాల సమీపంలో... గ్రేటర్ హైదరాబాద్ శివార్లన్నీ గతంలో గ్రామపంచాయతీలే. శివార్లలో గత 20 ఏళ్ల నుంచి వేల సంఖ్యలో లేఅవుట్లు వెలసి కాలనీలు ఏర్పాటయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016 నుంచి మళ్లీ శివారు పంచాయతీల్లో కొత్త వెంచర్లు, నిర్మాణాలు వచ్చాయి. పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన శివారు ప్రాంతాల్లోనూ పాత తేదీల ‘అనుమతి పత్రాల’తో కొత్త లేఅవుట్లు వెలిశాయి. దీంతో ఐటీ కారిడార్ పరిధిలోని కిస్మత్పూర్, పీరంచెరువు, బైరాగిగూడ, కోకాపేట, గోపన్పల్లి, మణికొండ, పుప్పాల్గూడ, నార్సింగి, మంచిరేవుల, బండ్లగూడ, దుండిగల్, పోచారం ప్రాంతాలతో పాటు ఓఆర్ఆర్కు లోపలున్న స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ పాత లేఅవుట్ల ఆధారంగా అనుమతిపత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు జరిగి నట్లు, ఇంకా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, పిర్జాదిగూడ, బడంగ్పేట, బండ్లగూడ, మీర్పే ట, జిల్లెలగూడ, జవహర్నగర్ కార్పొరేషన్లతో పాటు ఇబ్రహీంపట్నం, జల్పల్లి, కోకాపేట, పోచారం, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, శంషాబాద్, ఆదిబట్ల, నాగారం, ఘట్కేసర్, పెద్ద అంబర్పేట, కరీంనగర్లో కొత్తపల్లి, మహబూబ్నగర్లో భూత్పూరు మొదలైన మున్సిపాలిటీల్లో ఒక ఫ్లోర్ అనుమతితో రెండు మూడంతస్తుల భవనాలను నిర్మించి నట్లు, పార్కులు, ఇతర సామాజిక అవసరాల కోసం లే అవుట్లో వదిలేసిన స్థలాలు కూడా ఆక్రమణలకు గురై భవనాలు వెలిసినట్లు పురపాలక శాఖ గుర్తించింది. -
సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్..
సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం.. బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి. అనధికార నిర్మాణాలను జేసీబీలతో కూలగొడుతుంటే.. టీడీపీ నేతల వెన్నులో వణుకుపుట్టింది. అడ్డగోలుగా ఫుట్పాత్ ఆక్రమించేసి ఏర్పాటు చేసిన దుకాణాల్ని తొలగిస్తుంటే... కబ్జాదారులకు చెమటలు పట్టాయి. ఐదేళ్ల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు అధికార దర్పం ప్రదర్శించారు. నిబంధనలు మీరి అక్రమాల పునాదులపై అడ్డగోలుగా నిర్మించినవి కొన్నైతే.. స్థలాలు కబ్జా చేసి దర్జాగా కట్టిన కోటలు ఇంకొన్ని.. వెరసి టీడీపీ నేతల దాష్టీకాలపై అధికారులు పంజా విసిరారు. ‘సాక్షి’ దినపత్రికలో వరుసగా ప్రచురితమవుతున్న తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాల సిత్రాలు.. నగరంలో సంచలనంగా మారాయి. పల్లా ఆక్రమణలకు మాస్టర్ప్లాన్ రోడ్డు చిన్నబోయి అక్రమాల కంచెలో ఇరుక్కుపోయింది. ఇప్పుడా కబ్జా కంచెను కత్తిరించేశారు. ప్లాన్కు విరుద్ధంగా చేపడుతున్న అడ్డగోలు నిర్మాణాన్ని జీవీఎంసీ పెకలించేసింది. మరోవైపు వెలగపూడి బ్యాచ్ ఫుట్పాత్ ఆక్రమణలపైనా జీవీఎంసీ ఉక్కుపాదం మోపింది. రెండు కిలోమీటర్ల వ్యవధిలో ఏకంగా 70 దుకాణాలను ఫుట్పాత్లపైనే ఏర్పాటు చేసి దందా సాగించిన పచ్చ రాబందుల రెక్కలు విరిచేశారు. పల్లా అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ కొరడా గాజువాక: మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని కూలి్చవేశారు. దీనిపై తొలుత కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత, అధికారులు, పోలీసులు చొరవ తీసుకోవడంతో టౌన్ప్లానింగ్ సిబ్బంది తమ పని పూర్తిచేశారు. గాజువాకకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాతగాజువాక జంక్షన్లోని 1033 చదరపు గజాల (864.33 చదరపు మీటర్ల) స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. 227.84 చదరపు మీటర్ల వరకు రోడ్డు విస్తరించి ఉంది. దీంతో ఆయనకు 636.49 చదరపు మీటర్లు మిగిలింది. ఇందులో నిబంధనల ప్రకారం మినహాయింపులు పోనూ 221.45 చదరపు మీటర్ల స్థలంలో ఈ సముదాయ నిర్మాణానికి జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జి+4 భవన నిర్మాణానికి అనుమతి పొందగా, ప్రస్తు తం సెల్లార్+జి+1 అంతస్తుల శ్లాబులు పూర్తిచేశారు. అయితే అనుమతులకు విరుద్ధంగా నిర్మా ణం సాగుతోందని జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో పరిశీలించిన అధికారులు నిజమేనని నిర్ధారించారు. ఈ నిర్మాణంలో మాస్టర్ ప్లాన్ రోడ్లో 25.46 చదరపు మీటర్ల ఏరియా కూడా ఆక్రమణకు గురవడంతోపాటు సెట్ బ్యాక్లను కూడా ఉంచలేదని గుర్తించారు. ఒక అంతస్తుకు 221.45 చదరపు మీటర్ల అనుమతి పొందగా 369.86 చదరపు మీటర్ల చొప్పున నిర్మాణం సాగిస్తున్నట్టు నిర్ధారించారు. ఒక్కో అంతస్తుకు 148.41 చదరపు మీటర్ల చొప్పున అదనపు భాగాన్ని నిర్మిస్తున్నట్టు గుర్తించిన అధికారులు అదనంగా చేపట్టిన నిర్మాణాన్ని ఆదివారం తొలగించారు. తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న టౌన్ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని తొలగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తాను అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టానంటూ టౌన్ప్లానింగ్ అధికారి నరేంద్రనాథ్రెడ్డి తదితరులతో వాదనకు దిగారు. దీంతో వారు మాస్టర్ ప్లాన్ రోడ్డు, సెట్ బ్యాక్లు లేకపోవడం, అనుమతి పొందినదానికంటే అదనంగా నిర్మించడం తదితర విషయాలను వివరించారు. గాజువాక పోలీసుల సూచన మేరకు అక్కడి నుంచి పల్లా శ్రీనివాసరావు వెళ్లిపోవడంతో టౌన్ప్లానింగ్ అధికారులు అనధికార నిర్మాణాన్ని తొలగించారు. ఈ వ్యవహారం పల్లా మీడియాతో మాట్లాడారు. తనకు హైకోర్టులో ఊరట లభిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు తన భవనాన్ని తొలగించడం అన్యాయమన్నారు. వెలగపూడి ‘దుకాణాలు’ క్లోజ్.. కొమ్మాది (భీమిలి): ప్రశాంత విశాఖ నగరంపై దందాల సంతకం చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి..అధికారాన్ని అడ్డంపెట్టుకొని విషపు సంస్కృతిని వ్యాపింపజేశారు. తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టి.. భీమిలి నియోజకవర్గంలోనూ పాగా వేశారు. ఆక్రమణల పర్వాన్ని అడ్డగోలుగా సాగించి ఫుట్పాత్లను సైతం మింగేశారు. అనుచరులకు నచ్చిన చోట ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణాలు పెట్టించేసి దందా సాగించారు. దుకాణాలను తొలగిస్తున్న జేసీబీ.. అడ్డగోలుగా 70 దుకాణాలు.. జీవీఎంసీ 8వ వార్డు గీతం కాలేజీ డౌన్ నుంచి చిన్న రుషికొండ మీదుగా పెద్ద రుషికొండ వరకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 దుకాణాలు అడ్డగోలుగా పెట్టించారు. సుమారు రెండు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న ఈ ఆక్రమణల్లో వెలసిన ఒక్కో దుకాణం నుంచి ఏడాదికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేసేవారు. ‘సాక్షి’ కథనాలతో బ్రేక్! అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్న ధైర్యంతో ఆక్రమణల పర్వం కొనసాగించాలనుకున్న వెలగపూడి బ్యాచ్ ఆగడాలకు ‘సాక్షి’ వరుస కథనాలు బ్రేక్ వేశాయి. సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు జీవీఎంసీ అధికారులు స్పందిస్తూ వెలగపూడి దుకాణాలను బంద్ చేయించారు. మూడు రోజులుగా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తున్న టౌన్ప్లానింగ్ అధికారులు వెలగపూడి అండ్ కో ఆక్రమించేసుకున్న బీచ్రోడ్డు ఫుట్పాత్లపై చర్యలకు ఉపక్రమించారు. రైట్ టు వాక్ పేరుతో ఆక్రమణల తొలగింపు బీచ్రోడ్ వెంబడి ఫుట్పాత్లపై వెలగపూడి, టీడీపీ అనుచరులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న ఫుడ్స్టాళ్లు, దుకాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆదివారం తొలగించారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి పోలీసు బందోబస్తు నడుమ 70 బడ్డీలను తొలగించారు. ఫుట్పాత్లను కేవలం పాదచారులకు మాత్రమే వినియోగించేలా జీవీఎంసీ నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం ‘రైట్ టు వాక్’ పేరుతో ఆక్రమణలను తొలగిస్తున్నట్టు జీవీఎంసీ టౌన్ప్లానింగ్ డీసీపీ రాంబాబు వెల్లడించారు. దీనికితోడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ బీచ్ రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనులు త్వరలోనే చేపట్టనున్న నేపథ్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు తాత్కాలిక ఆక్రమణలను తొలగిస్తున్నామని ఆయన వివరించారు. ఆక్రమణదారుల ఆందోళన.. ఫుట్పాత్పై అక్రమంగా వెలసిన బడ్డీల తొలగింపునకు నిరసనగా ఫుట్పాత్ ఆక్రమణదారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బడ్డీలను తొలగిస్తున్నారని, కనీసం బడ్డీల్లోని సామగ్రిని తీసుకునే సమయం ఇవ్వనదున తీవ్రంగా నష్టం పోతున్నామని వాపోయారు. వీరితో టీడీపీ కార్యకర్తలు కలిసిపోయి గందరగోళం సృష్టించేందుకు ప్రయతి్నంచారు. పీఎంపాలెం సీఐ రవికుమార్ ఆక్రమణదారులతో మాట్లాడి సామాన్లు తీసుకెళ్లేందుకు సమయం ఇచ్చారు. వారంతా దుకాణాల్లోని సామగ్రిని తీసుకెళ్లిపోయారు. అనంతరం షాపుల తొలగింపు ప్రక్రియను సాయంత్రం వరకూ నిర్వహించారు. టౌన్ప్లానింగ్ టీపీవోలు రఘునాథరావు, ప్రసాద్ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీలను తొలగించారు. చదవండి: మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అక్రమ నిర్మాణం కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని విశాఖ మహానగర పాలకసంస్థ (జీవీఎంసీ) అధికారులు ఆదివారం కూల్చివేశారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆక్రమణలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాత గాజువాక జంక్షన్లోని 1,033 చదరపు గజాల స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణానికి నిబంధనల ప్రకారం మినహాయింపులు పోను 221.45 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జీ+4 భవన నిర్మాణానికి అనుమతి పొందిన ఆయన ప్రస్తుతం సెల్లార్+జీ+1 అంతస్తులకు శ్లాబులను పూర్తిచేశారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం సాగుతుండటంతో.. పరిశీలించిన అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మాస్టర్ప్లాన్ రోడ్డును సైతం ఆక్రమించి ఎలాంటి సెట్బ్యాక్లు లేకుండా అడ్డగోలుగా కడుతున్నట్లు నిర్ధారించారు. ఆదివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న జీవీఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాల్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు కాసేపు హడావుడి చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పల్లా అక్కడ నుంచి నిష్క్రమించారు. దీంతో అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు మరోవైపు..నగరంలోని ఫుట్పాత్లన్నింటినీ టీడీపీ నేతలు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. ‘రైట్ టు వాక్’ పేరుతో తొలగింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల్లో ఫుట్పాత్లపై ఉన్న 305 దుకాణాలు తొలగించారు. బీచ్రోడ్డులో అడ్డగోలుగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఏర్పాటు చేసిన 70 దుకాణాల్ని జీవీఎంసీ అధికారులు ఆదివారం తొలగించారు. -
పైసలిస్తారా.. ఫిర్యాదు చేయాలా..?
సాక్షి, కేపీహెచ్బీకాలనీ: అక్రమ నిర్మాణాల పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కొందరు చట్టాలకు అతీతులమన్నట్లు పెట్రేగిపోయి భవన నిర్మాణ దారుల నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేయకుండా ఉండాలంటే తాము చెప్పిన ధరకే అపార్టుమెంట్ ఫ్లాట్ను ఇవ్వాలని బలవంతంగా తమ పేరిట రాయించుకుంటున్నట్లు పోలీసు యంత్రాంగం దృష్టికి వచ్చింది. ఇటీవల ఈ ఘటనలపై జీహెచ్ఎంసీ, పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్లలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్న 20 మందిపై పోలీసు ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఎవరెవరిని బెదిరింపులకు గురి చేశారో..? ఎంత మొత్తంలో దండుకున్నారో పక్కా ఆధారాలతో ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో రోజూ అక్రమ నిర్మాణాలు లక్ష్యంగా చేసుకొని రాత పూర్వకంగా, సోషల్ మీడియా ద్వారా సుమారు 40 కిపైగా ఫిర్యాదులు రావడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. రెండేళ్ల క్రితం అక్రమ నిర్మాణదారులను, ప్రభుత్వ భూముల్లో వెలసిన ఇళ్ల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ మహిళను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితురాలి ఇంట్లో దొరికిన ఫిర్యాదు పత్రాలు, సెల్పోన్లో నిక్షిప్తం చేసిన బహుళ అంతస్తుల భవనాల ఫొటోలను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. తాజాగా హైదర్నగర్ డివిజన్ పరిధిలోని బసంత్రాజ్ ఉదంతంలోనూ ఇలాంటి ఫిర్యాదులే తలెత్తడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. చదవండి: మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్ పిల్లలకు తిండి పెట్టలేని మాకు..ఆత్మహత్యే శరణ్యం! అక్రమ నిర్మాణాలపై చర్యల విషయంలో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అక్రమ నిర్మాణాలు కొన్నయితే.. ఎలాంటి నిబంధనలు లేకుండానే చేపట్టే నిర్మాణాలు మరికొన్ని. అయితే వీటిలో ఎక్కువశాతం నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడమే తరువాయి అన్నట్లుగా పెద్దఎత్తున ఒత్తిళ్లను తీసుకువచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుకునేవారు కొందరైతే, మరికొందరు ఫిర్యాదులు మొదలుపెట్టి తమకు తాయిలం దక్కే వరకూ బెదిరింపులకు పాల్పడేవారు మరికొందరు. టౌన్ప్లానింగ్ విభాగం అధికారులు అవినీతికి పాల్పడటం దేవుడెరుగు, ఫిర్యాదుదారులకు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇప్పించాల్సిన దుస్థితికి దిగజారిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటాం.. అక్రమ నిర్మాణాల పేరుతో బిల్డర్లను బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసే కొంతమందిపై ఫిర్యాదులు అందాయి. పూర్తి ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. ఇంకా ఎవరైనా కూకట్పల్లి, కేపీహెచ్బీ, బాచుపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలి. వారి వివరాలను గొప్యంగా ఉంచి నిందితులపై చర్యలు తీసుకుంటాం. -సురేందర్రావు, ఏసీపీ -
..కూల్చే అధికారం మీకెక్కడిది?
సాక్షి, హైదరాబాద్: ‘ఉరి తీయబోయేటప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు. అలాంటిది అక్రమ నిర్మాణమని నోటీసు కూడా ఇవ్వకుండానే ఇంటిని కూల్చేస్తారా? నోటీసు జారీ చేయకుండా కూల్చేసే అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు కట్టబెడతారా? అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా చట్టాలు చేస్తామంటే కుదరదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకే ప్రభుత్వ చర్యలు ఉండాలి’ అని ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 174 (4), సెక్షన్ 178 (2) రెండింటినీ కలిపి చట్టాన్ని అన్వయించాలే గాని, ఒక సెక్షన్కే పరిమిత మై చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. నోటీ సు జారీ చేయకుండానే అక్రమ నిర్మాణాలను కూ ల్చేసేలా మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 178 (2)ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డితో కూడిన ధర్మా సనం సోమవారం విచారించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. తెల్లారేసరికి ఇంటి ముందు బుల్డోజర్ ఉంటే ఆ ఇంటి యజమాని పరి స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోర్టు పేర్కొంది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుని ప్లాన్ ప్రకారం నిర్మాణం చేస్తామని భరోసా ఇచ్చి దాన్ని ఉల్లంఘిస్తే నోటీసు జారీ చేయాల్సిన అవసరం ఏముంటుందన్నారు. కోర్టు స్పందిస్తూ.. ఉరి శిక్ష విధించే కేసులోనైనా నేరస్తుల వాదనలు వినాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని, అలాంటిది అనుమతి పొందిన ప్లాన్ను అతిక్రమించి నిర్మిస్తే వాళ్ల వాదన వినేందుకు నోటీసు కూడా ఇవ్వరా అని ప్రశ్నించింది. రోడ్డు పక్కనో, ఫుట్పాత్లపైనో గుడిసెలను తొలగించేటప్పుడు కూడా అందులో నివాసమున్న వారికి నోటీసులివ్వాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పింది. ‘ఒక ప్లాన్ ప్రకారం ఒక అంతస్తుకు అనుమతి తీసుకుని, రెండో అంతస్తు నిర్మించారనుకుందాం. మున్సిపల్ కమిషనర్కు తెలియకుండానే రెండో అంతస్తు నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారి అనుమతిచ్చారని అనుకుందాం. బుల్డోజర్లతో కూల్చేసే అధికారం మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వడం ఎంత వరకు చట్టబద్ధత?’అని పేర్కొంది. సాంకేతిక కారణాల సాకుతో అడ్డుకోవద్దు.. మంజూరు చేసిన ప్లాన్ను ఉల్లంఘించి నిర్మాణాలు చేసి వాటి విషయంలోనే ఆ విధమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. చట్టాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని, పిల్ను విచారించడానికి వీల్లేదని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం కల్పించుకుని.. సాంకేతిక కారణాలతో అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని, ఒక ఇంటి నిర్మాణానికి అనుమతి పొందిన ప్లాన్లో మార్పు చేసి నిర్మాణం చేస్తే నోటీసు కూడా ఇవ్వకుండా ఏ చట్టం కింద కూల్చేస్తారని, ప్రభుత్వమూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చీవాట్లు పెట్టింది. అధికారంలో ఉన్నామని ఏకపక్షంగా అధికారాలను చెలాయిస్తామంటే ఎలాగని ప్రశ్నించింది. అయితే ఇటీవల అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆందోళన వెలిబుచ్చిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గుర్తు చేయగా.. అది నిజమేనని, అయితే ఏకపక్షంగా నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలతోపాటు అనుమతి పొంది.. ప్లాన్ డీవియేట్ అయ్యే నిర్మాణాలను కూడా కూల్చేసే అధికారాలను మున్సిపల్ కమిషనర్లకు ఇస్తారా అని ప్రశ్నించింది. ఈ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని, దీన్ని మరో రెండేళ్ల వరకు ఏర్పాటు చేయకపోతే ఇళ్ల నిర్మాణాల వివాదాలను ఎదుర్కొనే వాళ్ల పరిస్థితి ఏం కావాలని నిలదీసింది. -
నిబంధనలు అతిక్రమిస్తే ‘ఈ-నోటీస్’
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల తొలగింపునకు ‘ఈ-నోటీస్’ ఇస్తున్నామని జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ఈ విధానంలో పారదర్శకత కనిపిస్తుందని వెల్లడించారు. సిస్టం ద్వారానే ప్రక్రియ అంతా జరుగుతుందని.. ప్రతీ నోటీస్కు క్యూఆర్ కోడ్ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో అన్ని వివరాలు ప్రజలకు తెలుస్తాయని వివరించారు. అక్టోబర్ నుంచి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. మాన్యువల్ పద్ధతి ఇక్కడ ఉండదని.. లొకేషన్ పూర్తి వివరాలతో పాటు భద్రతాపరమైన అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. కోర్టుకి ఎవరైనా వెళ్ళినా ఇది పూర్తిస్థాయి ఆధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 4,61,783 అక్రమ బ్యానర్లు, వాల్పోస్టర్స్, గోడ రాతలు, భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించామని వెల్లడించారు. 136 కి.మీల పరిధిలో ఫుట్పాత్ అక్రమ నిర్మాణాలు తొలగించామని విశ్వజిత్ పేర్కొన్నారు. -
కోర్టు చెబితే మాకేంటి?
రామ్నగర్ రాక్డేల్ లేఅవుట్లో విలువైన ఖాళీ స్థలంపై ఆక్రమణదారుడు కన్నేశాడు. నకిలీ దస్తావేజులు సృష్టించి బహుళ అంతస్థులతో భారీ నిర్మాణం చేపట్టేందుకు 2012లో జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు కూడా వెంటనే అనుమతులు ఇచ్చేయడంతో నిర్మాణం చేపట్టాడు. విషయం తెలిసి అసలు హక్కుదారుడు కోర్టును ఆశ్రయించడంతో గుడ్డిగా ఎలా అనుమతులు ఇచ్చారంటా కోర్టు అధికారులకు చీవాట్లుపెట్టి వెంటనే ప్లాన్ రద్దుచేసి నిర్మాణం ఆపేయాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి నిర్మాణం కొనసాగిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: అక్రమానికి బరితెగిస్తే.. అధికారులే కాదు.. అపర బ్రహ్మలు అడ్డొచ్చినా ఆగేది లేదు.. అడ్డగోలుగా నిర్మాణాలు సాగించేస్తాం అన్నట్లుగా జోన్–3 పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జోన్–3 టౌన్ ప్లానింగ్లో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో న్యాయస్థానం తీర్పుల్ని కూడా తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. రామ్నగర్ దరి రాక్డేల్ లేఅవుట్లో టౌన్ సర్వేనెంబరు 1187లో ఉన్న సుమారు 3600 గజాల స్థలం 25 ఏళ్లుగా వివాదంలో ఉంది. ఈ స్థలానికి ఆనుకుని ఉన్న ఫ్లాట్ నెంబర్ 19లో ఓ వ్యక్తి ఆ సమయంలో ఈ స్థలంపై కన్నేసి, నకిలీ దస్తావేజులు సృష్టించి 2 వేల చదరపు గజాల స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నాడు. పూర్తిస్థాయిలో పరిశీలన చేయకుండా సంబంధిత అధికారులు నిర్మాణం చేపట్టేందుకు బిల్డింగ్ అప్లికేషన్ (బీఏ) 10567/2012/జోన్3 పేరున ఆగస్టు 1, 2012 తేదీన అనుమతులు కట్టబెట్టేశారు. ఇంకేముంది అప్పనంగా సంపాదించిన స్థలంలో అడ్డగోలుగా భవన నిర్మాణం సాగించేశారు. అసలు హక్కుదారులు కోర్టును ఆశ్రయించారు. విశాఖపట్నం ఆరో అదనపు జిల్లా జడ్జి అక్టోబర్ 12, 2018న జీవీఎంసీకి మొట్టికాయలు వేసి, ప్లాన్ రద్దుచేయాలని ఎల్.ఎ.నెంబర్ 28/2017, ఓ.ఎస్.నెంబర్ 314/2016తో ఆర్డర్ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆ యజమాని యథేచ్చగా ఆ అక్రమనిర్మాణ పనులను చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. నగరం నడి»ొడ్డున ఇంత పెద్ద అక్రమ నిర్మాణం సాగుతున్నా జోన్–3 సిబ్బంది పట్టించుకోకపోవడం వెనుక పెద్దమొత్తంలోనే ఆమ్యామ్యాలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లతను వివరణ కోరగా.. ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉండటంతో పనులన్నీ నిలిపి వేశామని తెలిపారు. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా అప్పట్లో రద్దు చేశామని వివరించారు. మరోసారి స్థలాన్ని పరిశీలించి సంబంధిత జోనల్ అధికారుల నుంచి నివేదిక తీసుకుంటామని వెల్లడించారు. -
ఉగాదికి ఇళ్ల పట్టాలు
-
పేదలకు ఏపీ సర్కారు బంపర్ ఆఫర్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రెండు సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అంతకు మించితే క్రమబద్ధీకరణ ఫీజు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. అలాగే, వీటి క్రమబద్ధీకరణకు విధివిధానాలు తయారు చేయాలన్నారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే విషయమై గురువారం ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కాల్వగట్ల వాసులకు ప్రాధాన్యం నదీతీరాల వెంబడి, కాల్వగట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నందున.. స్థలాలు, ఇళ్ల కేటాయింపులో ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. గతంలో స్థలం ఇచ్చినా రిజిస్ట్రేషన్ చేసే వారు కాదని.. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కున్నారని.. ఒకసారిఇచ్చిన తర్వాత ఎలా లాక్కుంటారని జగన్ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి వీలైనంత మేర ప్రభుత్వ స్థలాలనే వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విడివిడిగా ఇళ్లే ఇవ్వండి పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కన్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో విడివిడిగా ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పేదలు ఉంటున్న బహుళ అంతస్తుల సముదాయాల్లో నిర్వహణ సరిగ్గాలేదని.. ఫలితంగా ఫ్లాట్లు దెబ్బతింటున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. దీనికి పరిష్కారంగా లబ్ధిదారులకు విడివిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే, ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న ఫ్లాట్లను బాగుచేసుకునేలా ఏదైనా ఆలోచన చేయాలన్నారు. లబ్ధిదారుల జాబితా విధిగా ప్రదర్శించాలి ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారుల జాబితాలను విధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని కూడా సీఎం ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా వారికి తెలియజేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ సమయంలో మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని.. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు, ఇళ్లు విషయంలో.. వైఎస్సార్సీపీకి ఓట్లేశారని, ఆ పార్టీ సానుభూతిపరులంటూ వారికి నిరాకరించారని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే లబ్ధిదారుల జాబితా కింద దరఖాస్తులు ఎవరికి చేయాలి.. ఎలా చేయాలి.. ఎవరిని సంప్రదించాలి వంటి సూచనలు కూడా ఇవ్వాలని సీఎం చెప్పారు. జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలి ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలని, లక్ష్యం కన్నా మరో 10 శాతం అదనంగా ఇళ్ల స్థలాలను బఫర్గా పెట్టుకుంటే దరఖాస్తుదారులు అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నా ఇబ్బందిలేకుండా ఉంటుందని సీఎం అన్నారు. 20,47,325 మంది లబ్ధిదారులు ఇప్పటివరకూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య 20,47,325గా తేలిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకూ 19,389 ఎకరాల భూమిని గుర్తించామని, ఇక్కడ మరో 8వేల ఎకరాలు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో 2,559 ఎకరాలను గుర్తించామని, ఇక్కడ ఇంకా 11వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం మీద పేదల ఇళ్ల స్థలాల కోసం సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. (చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం) -
అక్రమ నిర్మాణాలకు తుది నోటీసులు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేశ్ అతిథి గృహం సహా కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన 3 భవనాలకు సీఆర్డీఏ తుది నోటీసులు జారీ చేసింది. నదీ పరిరక్షణ చట్టం, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారని వీటి యజమానులకు గతంలోనే నోటీసులిచ్చి వివరణ కోరిన విషయం తెలిసిందే. దానికి వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో శుక్రవారం లింగమనేని రమేశ్, పాతూరి నాగభూషణం, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ భవనాలకు తుది నోటీసులిచ్చారు. నిర్మాణాలకు అనుమతులు లేవని, సరైన అనుమతులు చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ వారంలో ఆ నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన 26 కట్టడాలకు సీఆర్డీఏ గతంలోనే నోటీసులివ్వగా అందరూ వివరణ ఇచ్చారు. తమ వద్ద ఉన్న అనుమతి పత్రాలు, ఇతర పత్రాలను అధికారులకు చూపించారు. సీఆర్డీఏ కమిషనర్ స్వయంగా వారితో మాట్లాడి అభ్యంతరాలను తెలుసుకున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం యజమాని లింగమనేని రమేశ్ కూడా సీఆర్డీఏకు వివరణ ఇచ్చారు. తనకు పంచాయతీ అనుమతి ఉందని చెప్పిన ఆయన తాను భవనం నిర్మించినప్పుడు సీఆర్డీఏ లేదని, కాబట్టి సీఆర్డీఏకు నోటీసులిచ్చే అధికారం లేదన్నారు. గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సీఆర్డీఏకు పలు సూచనలు చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వారి వద్దనున్న పత్రాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ భవనాలు అక్రమమేనని తేల్చిన సీఆర్డీఏ చంద్రబాబు నివాసం సహా మూడు భవనాలకు తుది నోటీసులు జారీ చేసింది. మిగిలిన అక్రమ నిర్మాణాలకు సోమవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నారు. -
అక్రమార్కులపై అధికారి ప్రేమ
సాక్షి,చిత్తూరు, తిరుపతి : కొంక చెన్నాయిగుంటలో ఆక్రమణదారులపై రెవెన్యూ అధికారులు ఇద్దరు ఎనలేని ప్రేమను కురిపిస్తున్నారు. ఆక్రమణల పై పత్రికల్లో వార్తలు వస్తే, వెంటనే రెవెన్యూ అధికారులు హడావుడి చేస్తారు. రెండు, మూడు తాత్కాలిక కట్టడాలు పడగొట్టి వెళ్తున్నారు. రెండు రోజుల తరువాత తిరిగి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులకు తెలిసినా, చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఆ ఆక్రమణల జోలికి ఎవ్వరూ రాకుండా ఉండేం దుకు అక్రమార్కులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. తిరుపతికి కూతవేటు దూరంలో అక్కారంపల్లి పరిధిలోని కొంక చెన్నాయిగుంట సర్వే నంబర్ 173/3లో 2.50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సుమారు రూ.15 కోట్లు విలువచేసే ఈ భూమిని గతంలో ఆరుగురు స్వాతంత్య్ర సమరయోధులకు పట్టాలు ఇచ్చినట్లు, వారి నుంచి కొనుగోలు చేసినట్లు టీడీపీ శ్రేణులు రికార్డులు సృష్టించినట్లు సమాచారం. ఇందుకు ఇద్దరు రెవెన్యూ అధికారులకు కొంత నగదు ముట్టజెప్పారు. వాటి ఆధారంగా టీడీపీ శ్రేణులు ఆక్రమణలకు బరితెగిస్తున్నారు. ఎన్నికలకు ముందు, ఆ తరువాత ఇదే భూమిని ఆక్రమించి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఈ ఆక్రమణలపై స్థానికుల ఆరోపణలు వెల్లువెత్తటంతో పత్రికల్లో కథనాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ప్రవేశించి నిర్మాణాలను పడగొట్టారు. కొద్దిరోజులు ఆగాక మళ్లీ నిర్మాణాలు మొదలు పెట్టారు. దీనిపై పత్రికల్లో మళ్లీ కథనాలు వచ్చాయి. రెవెన్యూ అధికారులు స్పందించి మూడు తాత్కాలిక నిర్మాణాలను కూలదోశారు. టీడీపీ వ్యతిరేకుల ఇళ్ల కూల్చివేత అక్రమ కట్టడాలు చేపట్టిన టీడీపీ శ్రేణులకు సంబంధించిన నివాసాలను మాత్రం పడగొట్టలేదు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా మాట్లాడేవారి నివాసాలను మాత్రం గుర్తించి పడగొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతుంటే, రెవెన్యూ అధికారులు కొందరు టీడీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. తాత్కాలిక షెడ్లు పడగొట్టినప్పటికీ, ఆ స్థలాలను టీడీపీ శ్రేణులు వారం తరువాత మరొకరికి విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. కొంక చెన్నాయిగుంట స్థలాలు అక్రమమని తెలియటంతో కొందరు టీటీడీ శ్రేణులకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారి నుంచి కొంత సమయం తీసుకుని అదే స్థలాన్ని వేరొకరికి విక్రయిస్తున్నారు. ఎన్నికల ముందు ఒక ఇంటి స్థలం రూ.2 లక్షలకు విక్రయిస్తే... ఎన్నికల తరువాత అదే స్థలాన్ని రూ.5 లక్షలకు విక్రయిస్తున్నారు. కుంట పోరంబోకు స్థలం అని తెలియక కొనుగోలు చేసి మోసపోతున్న వారు టీడీపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓపిక పడితే ఇచ్చిన సొమ్ము కొంత ఇస్తామని, లేదంటే ఇచ్చేది లేదు పొండి అంటూ ఎదురు తిరుగుతున్నారు. ఆక్రమణలపై ఎవరైనా ప్రశ్నిస్తే డబ్బులు అడుగుతున్నారని టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చెయ్యడం ప్రారంభించారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
అక్రమార్కులకు ముచ్చెమటలు
మరోసారి స్పెషల్ డ్రైవ్ మొదలైంది. అక్రమాల పునాదులు కదులుతున్నాయి.. ఇన్నాళ్లూ టీడీపీ ప్రభుత్వ హయాంలో కళ్లముందే తప్పు జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయతతో చేతులు ముడుచుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. మరోసారి జూలు విదిల్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమవుతున్న భవనాలపై ఉక్కుపాదం మోపారు. గెడ్డను ఆక్రమించేసి అడ్డంగా ఐదంతస్తులు నిర్మించేస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనంపై సమ్మెటపోటు పడటంతో.. జీవీఎంసీ రెండో విడత డ్రైవ్ ప్రారంభించింది. బీపీఎస్ దరఖాస్తుల ఆధారంగా అక్రమ భవనాలను గుర్తించి వాటిని కూలగొట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి... అనధికార నిర్మాణాల్ని జేసీబీలతో కూలగొడుతుంటే.. వెన్నులో వణుకుపుట్టింది. సమ్మెటలతో నిర్మాణాల్ని ఛిద్రం చేస్తుంటే.. కబ్జాదారులకు చెమటలు పట్టాయి. టీడీపీ ఎమ్మెల్యేల అండతో నిబంధనలంటే లెక్కలేనితనంతో విచ్చలవిడిగా పెరిగిన అనధికార నిర్మాణాలపై జీవీఎంసీ స్పెషల్ డ్రైవ్ మరోసారి మొదలైంది. ఐదేళ్ల కాలంలో పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ నిర్మాణాలను గుర్తిస్తున్న సిబ్బంది వాటిని కూలగొడుతున్నారు. కమిషనర్ జి.సృజన ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన టౌన్ప్లానింగ్ అధికారులు.. జూన్ 26 నుంచి 8 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వార్డులోనూ జల్లెడ పడుతూ.. అనధికార భవనాలపై చర్యలు తీసుకున్నారు. 8 రోజుల వ్యవధిలో 79 భవనాలను కూలగొట్టారు. నిరంతర ప్రక్రియగా.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నిబంధనలకు తుంగలో తొక్కుతూ టీడీపీ హయాంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తాజాగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్కు చెందిన 5 అంతస్తుల నిర్మాణాన్ని శనివారం నేలమట్టం చేశారు. కోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేతల్ని సాయంత్రం నిలిపేశారు. కేవలం ఈ ఒక్క భవనమే కాకుండా శనివారం జీవీఎంసీ పరిధిలో 8 అక్రమ నిర్మాణాల్ని పడగొట్టేశారు. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాలతో మరోసారి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన టౌన్ప్లానింగ్ సిబ్బంది.. దీన్ని నిరంతర ప్రక్రియగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. బీపీఎస్ దరఖాస్తుల ఆధారంగా.. పారదర్శంగా ఈ డ్రైవ్ చేపట్టాలని టౌన్ప్లానింగ్ అధికారులు నిర్ణయించారు. ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించకుండా నిబంధనలకు తిలోదకాలిచ్చి చేపట్టిన నిర్మాణాలపైనే ఉక్కుపాదం మోపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్)ను ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. జీవీఎంసీ పరిధిలో అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు 5,238 దరఖాస్తులు వచ్చాయంటే.. ప్లాన్కు విరుద్ధంగా ఎన్ని అంతస్తులు నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఇప్పటి వరకు 267 భవనాలకు అప్రూవల్ ఇచ్చారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ దరఖాస్తుల ఆధారంగా డ్రైవ్ కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ప్రతి జోన్లోనూ అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏసీపీ)లకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఏసీపీ తన జోన్ పరిధిలో రోజుకు 5 నుంచి 10 బీపీఎస్ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇందులో బీపీఎస్ నిబంధనలననుసరించి ఉన్న భవనాలకు అనుమతులు మంజూరు చేయనున్నారు. మిగిలిన భవనాల్ని కూల్చివేసేందుకు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ రకంగా టౌన్ప్లానింగ్ సిబ్బంది అనధికార భవనాలపై అధికారికంగా ఉక్కుపాదం మోపనున్నారు. ప్లాన్కు విరుద్ధంగా ఎక్కడ అనధికార నిర్మాణం కనిపించినా, దాని వెనుక ఎంతటివారున్నా వెనుకాడకుండా కూలగొట్టాలని నిర్ణయించారు. పారదర్శకంగా వ్యవహరిస్తాం.. అనధికార నిర్మాణం ఎక్కడ ఉన్నా.. అది ఎవరిదైనా ఉపేక్షించే ప్రసక్తేలేదు. కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ మళ్లీ ప్రారంభించాం. తొలిరోజున 8 భవనాలపై చర్యలకు ఉపక్రమించాం. దీంతో పాటు ఇప్పటికే కొన్ని భవనాలకు నోటీసులు జారీ చేశాం. వారు ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. దానికి సంబంధించిన విచారణ సోమవారం జరగనుంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి బీపీఎస్ వెరిఫికేషన్లో తిరస్కరణకు గురైన ప్రతి అదనపు అంతస్తు, భవనాన్ని కూలగొడతాం. నియమాల్ని అనుసరించి పారదర్శకంగా వ్యవహరిస్తాం. –ఆర్జె విద్యుల్లత, జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ -
ముంచెత్తిన ‘కృష్ణమ్మ’
సాక్షి, అమరావతి బ్యూరో/విజయవాడ: కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో కరకట్ట వెంబడి నిర్మించిన అతిథి గృహాలు, ఇతర కట్టడాల్లోకి బుధవారం వరద నీరు ప్రవేశించింది. కరకట్ట లోపలి వైపున నదీ గర్భంలోకి చొచ్చుకెళ్లి గతంలో భారీ కట్టడాలను నిర్మించారు. వాటికి కొండరాళ్లతో పునాదులు వేసి.. నీటి ప్రవాహానికి అడ్డంగా గట్లు నిర్మించారు. నది పోటెత్తి ప్రవహిస్తుండటంతో చాలా కట్టడాల్లోకి వరద నీరు ప్రవేశించింది. వీటివల్ల నదీ ప్రవాహ దిశ మారుతోందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. కృష్ణా కరకట్ట దిగువన ఉన్న అక్రమ కట్టడాలలో చంద్రబాబు నివాసం కూడా ఉన్న సంగతి తెలిసిందే. నదీ గర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి నీరు చేరుతుండటంతో గ్రౌండ్ ఫ్లోర్లోని సామగ్రిని మరో అంతస్తులోకి చేర్చారు. నీటిమట్టం పెరుగుతుండటంతో చంద్రబాబు నివాసం వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. వాకింగ్ ట్రాక్ సమీపంలో 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తున ఇసుక బస్తాలు వేసి ముంపు నీరు లోనికి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేశారు. చంద్రబాబు వాహన శ్రేణిని సురక్షిత ప్రదేశానికి తరలించగా, ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కరకట్ట లోపల మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన అతిథి గృహం మంతెన సత్యనారాయణ నిర్వహిస్తున్న ప్రకృతి ఆశ్రమం, గణపతి సచ్చిదానందం ఆశ్రమంలోకి వరద నీరు చేరింది. నదిని ఆనుకుని అనాథ బాలల కోసం నిర్మించిన ‘చిగురు’ బాలల ఆశ్రమం సైతం ముంపుబారిన పడింది. దీంతో చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కరకట్ట వెంబడి ఉన్న అతిథి గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే సమీప ప్రాంతాల్లోని మత్స్యకారులను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు కృష్ణా నది ప్రవాహానికి అక్రమ కట్టడాలు ఎలా అడ్డు తగులుతున్నాయో సీఆర్డీఏ అధికారులు బుధవారం పరిశీలించారు. అక్కడి పరిస్థితిని ఫొటోలు, వీడియోలు తీశారు. లంక గ్రామాలను ముంచెత్తిన వరద ప్రకాశం బ్యారేజి నుంచి భారీఎత్తున వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుండటంతో లంక గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని లంక గ్రామాలతోపాటు పులిచింతల ముంపు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరటంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉద్దండరాయనిపాలెం లంకలోని 150 కుటుంబాలను, తాళ్లాయపాలెం లంకలోని 70 కుటుంబాలను, వెంకటపాలెంలోని 24 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దలంకకు చెందిన 200 కుటుంబాలను ఇబ్రహీంపట్నం వైపు పడవల ద్వారా తరలించారు. పులిచింతల ముంపు గ్రామాలను ఖాళీ చేయించారు. గొట్టిముక్కల గ్రామం నీట మునగటంతో 20 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. కొల్లిపర మండలంలోని పాతబొమ్మువానిపాలెం, అన్నవరపులంక, కొత్తూరిలంక గ్రామాల నుంచి 2 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అనుపాలెం, తూములూరు గ్రామాల్లోని పునరావాస కేంద్రాలకు 200 కుటుంబాలను తరలించారు. రేపల్లె మండలం పెనుమూడి, పులిగడ్డ వారధికి వరద నీరు చేరింది. కొల్లూరు మండలం దోనేపూడి, పోతార్లంక మధ్య చిన్నరేవు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా నది మధ్యలో చిక్కుకున్న ఘంటసాలకు చెందిన ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మంత్రుల పర్యటన వరద ఉధృతిని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి బుధవారం పరిశీలించారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పరిస్థితిని, తీసుకున్న జాగ్రత్తలను మంత్రులకు వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రులు ఆదేశించారు. -
అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు
సాక్షి, అమరావతి: చట్ట నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అక్రమ కట్టడాల నిర్మాణం జరుగుతుంటే గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. గత ప్రభుత్వం కళ్లుమూసుకుని చేసిన తప్పును తాము చేయబోమంది. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. కృష్ణానది, కరకట్ట సమీపంలో రైతు సంఘం భవన్ పేరుతో నిర్మించిన అక్రమ కట్టడం కూల్చివేతకు సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ చందన కేదారీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ దుర్గాప్రసాదరావు సీఆర్డీఏ ప్రాథమిక ఉత్తర్వుల అమలును మూడు వారాల పాటు నిలిపేస్తూ గత వారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఆర్డీఏ కమిషనర్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనుమతులు లేవని పిటిషనరే ఒప్పుకున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, రైతు సంఘం భవన్ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని పిటిషనరే ఒప్పుకున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలని భావించిన వాటి కూల్చివేతలో భాగంగా పిటిషనర్ భవనానికి సైతం షోకాజ్ నోటీసు ఇచ్చామని, ఆ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు గడువు కోరి, ఆ వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని వివరించారు.కృష్ణానదికి 100 మీటర్ల లోపు ఎటువంటి నిర్మాణాలు ఉండడానికి వీల్లేదని ఎన్జీటీ 2017లో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. రాజధాని ప్రాంత పరిధిలో అభివృద్ధిని క్రమబద్ధీకరించే విషయంలో సీఆర్డీఏకు అన్ని అధికారాలున్నాయని, నదీ ప్రాంతాల పరిరక్షణ, అభివృద్ధి కూడా సీఆర్డీఏదేనని అన్నారు. సీఆర్డీఏ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై పిటిషనర్కు ఏవైనా అభ్యంతరాలుంటే, వాటిపై ఉన్నతాధికారులను ఆశ్రయించే ప్రత్యామ్నాయం ఉందన్నారు. దీనిని ఉపయోగించుకోకుండా పిటిషనర్ నేరుగా పిటిషన్ దాఖలు చేశారని, ఇలా దాఖలు చేసే వ్యాజ్యాలను విచారించేందుకు హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించరాదని ఏజీ తెలిపారు. అవి కేవలం తాత్కాలిక ఉత్తర్వులే.. ఆ తరువాత పిటిషనర్ కేదారీష్ తరఫున సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చింది కేవలం తాత్కాలిక ఉత్తర్వులు మాత్రమేనన్నారు. తాత్కాలిక ఉత్తర్వులపై దాఖలు చేసే అప్పీల్కు విచారణార్హత లేదన్నారు. తమ భవనం అక్రమ కట్టడమని అంతిమ నిర్ణయానికి వచ్చిన తరువాతనే షోకాజ్ నోటీసు ఇచ్చారని, ఇది అన్యాయమన్నారు. అసలు వంద మీటర్ల లోపు నిర్మాణాలను కూల్చివేయాలని ఎన్జీటీ ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని వాదించారు. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఎన్జీటీ ఏ కేసులో ఆదేశాలు ఇచ్చిందీ.. ఆ కేసు నంబర్, ఆదేశాలు ఇచ్చిన సంవత్సరం తదితర వివరాలను వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
అసలే అక్రమం.. ఆపై అసత్యాలు
నేను ఉంటున్న బిల్డింగ్ ప్రభుత్వానికి చెందినది. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నేను ఉంటున్నా కాబట్టి అది ప్రభుత్వానిదే. దాన్ని భూ సమీకరణ కింద తీసుకుంటాం. లేకపోతే సేకరణ ద్వారానైనా తీసుకుంటాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అది ప్రభుత్వానిదే. ఇందులో క్విడ్ప్రో కో ఎక్కడుంది?. – 2016 మార్చి 6న మీడియా సమావేశంలో చంద్రబాబు 2019 ఎన్నికల తర్వాత సీఎం కార్యాలయాన్ని వదిలేశాక ప్రస్తుతం ఉంటున్న ప్రైవేట్ ఇంటిలోనే భవన యజమానితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఉండాలని నిర్ణయించుకున్నా. – 2019 జూన్ 5న సీఎం వైఎస్ జగన్కు విపక్ష నేత చంద్రబాబు లేఖ సాక్షి, అమరావతి: అది పూర్తిగా అక్రమ కట్టడం.. నదీ జలాలు, పర్యావరణ పరిరక్షణ చట్టాలకు విరుద్ధంగా నిర్మించింది.. జాతీయ హరిత ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, లోకాయుక్త ఆదేశాలను ధిక్కరించి కట్టింది. కనీసం బిల్డింగ్ ప్లాన్కు అనుమతి కూడా తీసుకోలేదు. రాష్ట్రంలోని సీనియర్ ఇంజనీర్లు ఆ భవనం నివాస యోగ్యం కాదంటూ స్వయంగా లేఖలు రాశారు. ఇన్ని చట్టాలు, నిబంధనలన్నింటినీ ఉల్లంఘించి కృష్ణానది కరకట్ట లోపల నిర్మించిన లింగమనేని ఎస్టేట్స్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాలుగేళ్లుగా నివాసం ఉండడంపై అందరిలోనూ విస్మయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు వల్లించి ఇప్పుడు తప్పుదోవ పట్టించే యత్నాలు చేయడంపై విస్తుపోతున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు లింగమనేని ఎస్టేట్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, రాజధాని భూసమీకరణ కింద తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు అధికారాన్ని కోల్పోయాక అది ప్రైవేట్ భవనమంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాయడం గమనార్హం. ఉండవల్లిలో చంద్రబాబు నివసిస్తున్న అక్రమ కట్టడానికి సీఆర్డీఏ తాజాగా నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు వల్లించి... కృష్ణా నది నుంచి వంద మీటర్ల లోపు లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన ఇంట్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమంగా నివసిస్తుండడంతో 2016లో తీవ్ర దుమారం చెలరేగింది. క్విడ్ప్రోకోలో భాగంగానే ఈ ఇంటిని ఇచ్చారని, ప్రతిఫలంగా రమేష్కు రూ.వేల కోట్ల లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై 2016 మార్చి మొదటి వారంలో ‘సాక్షి’ దినపత్రికలో ఆధారాలతో సహా కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో చంద్రబాబు దీనిపై సమాధానం ఇస్తూ తాను ఉంటున్న ఇల్లు ప్రభుత్వానిదని, ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుందని ప్రకటించారు. అంతకుముందు రాజధానిలో అక్రమాలపై వివరణ ఇచ్చేందుకు నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. భూసమీకరణ కింద సీఆర్డీఏ తీసుకున్నట్లు వెల్లడించారు. లింగమనేని రమేష్ సైతం అప్పట్లో మీడియా సమావేశం నిర్వహించి ఆ ఇంటితో తనకు ఏ సంంబంధం లేదని, దాన్ని ప్రభుత్వానికి భూ సమీకరణ కింద ఇచ్చేశామని తెలిపారు. సాక్షాత్తూ సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయడం, భవన యజమాని ధ్రువీకరించడంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుందనే అంతా భావించారు. అధికారం కోల్పోయాక ప్రైవేటుదంటూ.. అధికారం కోల్పోయాక కూడా అక్రమ భవనంలో నివాసం ఉండాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు మరో అక్రమ కట్టడం ప్రజావేదికను కూడా తనకే ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. తానుంటున్న భవనం ప్రైవేటు వ్యక్తిదని, అందులోనే ఉంటానని, ఒప్పందం మేరకు ఆ ఆస్తిని అనుభవిస్తానని లేఖలో పేర్కొన్నారు. అయితే ఇదే అక్రమ నివాసానికి సంబంధించి గతంలో తాను అసెంబ్లీ, మీడియా సమావేశంలో చెప్పిన అంశాలను ఆయన నాటకీయంగా కప్పి పెట్టేశారు. తాను ఉంటున్నది ప్రైవేట్ భవనమంటూ అధికారం కోల్పోయాక ఆయన మాట మార్చడం గమనార్హం. నదీ జలాల పరిరక్షణ చట్టానికి తూట్లు నదీ జలాల పరిరక్షణ చట్టం ప్రకారం గరిష్ట వరద మట్టం స్థాయి వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయితే కృష్ణా కరకట్ట వెంట లింగమనేని ఎస్టేట్స్ ఉన్న ప్రాంతంలో గరిష్ట వరద మట్టం స్థాయి 22.60 మీటర్లు కాగా అక్కడ నిర్మించిన భవనాలు మాత్రం 19.3 మీటర్ల ఎత్తులోనే ఉండటం గమనార్హం. అంటే కృష్ణానదికి గరిష్టంగా వరద వస్తే ప్రవాహానికి ఈ భవనాలు అడ్డుగా మారి ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతాయని స్పష్టమవుతోంది. కృష్ణా నదిలో సహజసిద్ధమైన ప్రవాహానికి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయని, ఇలాంటి చోట భవనాలు నిర్మించరాదని సూచిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలువురు సీనియర్ ఇంజనీర్లు లేఖలు రాశారు. ఇలాంటి భవనాల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఆ లేఖల్లో స్పష్టంగా పేర్కొన్నా చంద్రబాబు లెక్క చేయలేదు. తొలగించాలన్న లోకాయుక్త జాతీయ హరిత ట్రిబ్యునల్ 2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం నది నుంచి వంద మీటర్ల లోపు ఎటువంటి కట్టడాలు నిర్మించ కూడదు. నదీ, పర్యావరణ పరిరక్షణ చట్టాలకు విరుద్ధంగా ఉన్న ఇలాంటి భవనాలన్నింటినీ తొలగించాలని లోకాయుక్త 2015లో ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కోర్టులు చెప్పినా చట్టాలను ఉల్లంఘిస్తూ చంద్రబాబు అక్రమ కట్టడాన్ని వదల్లేదు. పైగా చేసిన తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు నిస్సిగ్గుగా అబద్ధాలాడడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
సర్పంచ్కు ఆ అధికారం లేదు
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని పంచాయతీ చేసే తీర్మానాన్ని అమ లు చేయాలని నోటీసు జారీ చేసే అధికారం గ్రామ సర్పంచ్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ తీర్మానాన్ని పంచాయతీ కార్యదర్శి ద్వారా అమలు చేయించాలని చట్టం చెబుతోందని, గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకారం నోటీసును నేరుగా గ్రామ సర్పంచ్ జారీ చేసే అధికారం చట్టంలో లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా శంషా బాద్ మండలం నానాజీపూర్కి చెందిన రైతు వంగ రాఘవరెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రహరీ నిర్మాణం వల్ల రోడ్డు మూసుకుపోతుందని, అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించాలని గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకా రం నోటీసును నేరుగా అక్రమ కట్టడానికి పాల్పడిన వ్యక్తికి సర్పంచ్ జారీ చేయడాన్ని తప్పుబడుతూ రాఘవరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి చేయాల్సిన విధుల్ని సర్పంచ్ చేయడం చట్ట వ్యతిరేకమని, పంచాయతీరాజ్ చట్టంలోని 32 సెక్షన్ ప్రకారం సర్పంచ్కు అధికారం పరిమితమని పిటిషనర్ తరఫు న్యాయవాది జనార్దన్రెడ్డి వాదించారు. పంచాయతీ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారం ఉంటుందని, పంచాయతీ తీర్మానం ప్రకారం సర్పంచ్ నోటీ సు ఇవ్వొచ్చని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాద నలు విన్న హైకోర్టు ‘పంచాయతీ శాఖ కమిషనర్ చట్టంలోని 42వ సెక్షన్ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తారు. కార్యదర్శే పంచాయతీ స్థిరచరాస్తుల రక్షణ, నిర్వహణ బాధ్యతలు నిర్వహించాలి. ఆస్తుల అంశంపై పంచాయతీ పాలకవర్గం చేసే తీర్మానాన్ని కార్యదర్శే అమలు చేయాలి. ఈ కేసులో పిటిషనర్ సర్పంచ్ నేరుగా నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేయడం సరైనదే. సర్పంచ్కు నోటీసు ఇచ్చే అధికారం లేదు’ అని స్పష్టం చేస్తూ వ్యాజ్యంపై విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. -
అనుమతుల వెనుక..
పెద్దఅంబర్పేట: పెద్దఅంబర్పేట పురపాలక సంఘం పరిధిలో అధికారుల కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ నిర్మాణాల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి అధికారుల తీరుతో ఇటు హెచ్ఎండీఏకు, అటు పురపాలక సంఘానికి కోట్లాది రూపాయల మేర గండి పడుతోంది. పాలకవర్గంలోని కొందరు సభ్యులతో చేతులు కలిపిన ఇక్కడి అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ వాటి వల్ల వచ్చే సొమ్మును ‘తిలాపాపం తలాపిడికెడు’ అనే చందంగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దఅంబర్పేట 5వ వార్డు పరిధిలోకి వచ్చే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కార్పొరేట్ భవనం నుంచి హెచ్ఎండీఏ, పెద్దఅంబర్పేట పురపాలక సంఘానికి రావాల్సిన సుమారు రూ. 2 కోట్ల రూపాయలను దారి మళ్లించారు. అధికారులు, కొంతమంది సభ్యులు సదరు భవన నిర్మాణదారుడి నుంచి రూ. 50లక్షలు (అరకోటి) ముడుపులు తీసుకున్నారనే విమర్శలు స్థానికంగా గుప్పుమంటున్నాయి. సుమారు లక్ష నుంచి లక్షా ముప్పై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన, నిర్మిస్తున్న భవనాలను అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోయి ఉచిత సలహాలు ఇస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. రెండు భవనాలూ అక్రమంగానే.. 5వ వార్డు పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో కొనసాగుతున్న రెండు భవనాలు కూడా అక్రమ నిర్మాణాలే. అందులో ఒకటి హెచ్ఎండీఏ అనుమతితో నిర్మాణం చేపట్టామని చెబుతున్నప్పటికీ, అధికారుల ఇచ్చిన అనుమతి మ్యాప్లో ఒక విధంగా ఉంటే నిర్మాణం మాత్రం అందుకు విరుద్ధంగా కొనసాగుతోంది. సాధారణంగా హెచ్ఎండీఏ అధికారులు సెల్లార్ను వాహనాల పార్కింగ్కు కేటాయిస్తూ అనుమతిస్తారు. అయితే, అలా కాకుండా సెల్లార్ను మొత్తం గదులతో నిర్మించి హెచ్ఎండీఏ అధికారులను సైతం మోసగించే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు ఈ భవానికి పక్కనే నిర్మిస్తున్న (దాదాపు పూర్తికావచ్చిన ) భవనానికి పదేళ్ల క్రితం సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి సంతకాలతో కూడిన అనుమతి పత్రాలతోనే భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.ఇదే భవనం తరహాలోనే మరో భవనానికి పునాదులు తీసి పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ తతంగం అంతా స్థానిక పెద్దఅంబర్పేట పురపాలక సంఘం పరిధిలోని అధికారులకు, పాలకవర్గంలో పలువురు సభ్యులకు తెలిసే జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారానికి సహకరిస్తున్న అధికారులకు, పలువురు సభ్యులకు నిర్మాణదారుడు రూ. అరకోటి వరకు ముడుపులు చెల్లించారని విశ్వసనీయ సమాచారం. ఏపీ మంత్రికి చెందిన కళాశాల కొనసాగింపు అయితే, ఈ అక్రమ భవనాల్లో ఒక దాంట్లో ప్రస్తుత ఏపీ మంత్రి నారాయణకు చెందిన కళాశాల కొనసాగుతోంది. దీంతోపాటు పక్కనే నూతనంగా నిర్మాణం పూర్తి చేస్తున్న భవనాలు కూడా వచ్చే జూన్లో ఇదే కళాశాల యాజమాన్యానికి అప్పగించాలనే లక్ష్యంతో కొనసాగిస్తున్నారు. అయితే, వీటిలో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిర్మించడంతో వందలాది మంది విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతారా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు, సౌకర్యాలు ఉన్నాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే ఉన్నత విద్యామండలి అధికారులు సైతం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. -
ఆర్టీఐ ద్వారా వివరాలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కింగ్స్ గార్డెన్ యజమాని షహనవాజ్, మహ్మద్ జుబైరుద్దీన్లు తమకు చెందిన 6.10 ఎకరాల భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు పరిష్కరించింది. అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారన్న విషయానికి సంబంధించి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద పూర్తి సమాచారాన్ని తీసుకోవాలని పిటిషనర్కు హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం ఆ సమాచారంతో తిరిగి పిటిషన్ దాఖలు చేసుకునే వెసులుబాటును ఇచ్చింది. ఈ మేర కు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లా ఆసిఫ్నగర్ మండలం గుడిమల్కాపూర్ గ్రామంలో ఉన్న తమ 6.10 ఎకరాల భూమిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కింగ్స్ గార్డెన్ యజమాని షహనవాజ్, మహ్మద్ జుబైరుద్దీన్లు కబ్జా చేసి, అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని, ఇందుకు జీహెచ్ ఎంసీ కమిషనర్ దానకిషోర్ సహకరించారంటూ ఎమ్మెల్సీ జి.దీపక్రెడ్డి తరఫున ఆయన జీపీఏ హోల్డర్ తగశిరపు శివనాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. షహనవాజ్, మహ్మద్ జుబైరుద్దీన్లతో దాన కిషోర్ వ్యాపార భాగస్వామిగా ఉంటూ తమ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టా రని పిటిషన్లో పేర్కొన్నారు. వీటిని కూల్చివేయడంతోపాటు దాన కిషోర్పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై బుధవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, తమ స్థలంలో అక్రమ నిర్మా ణాలు చేస్తున్నారని దీపక్రెడ్డి ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దానకిషోర్కు ఏం సంబంధం? ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జీహెచ్ఎంసీ కమిషనర్గా దాన కిషోర్ బాధ్యతలు చేపట్టి ఎంత కాలమైందని ప్రశ్నించారు. ఓ 3 నెలలు అయిందని న్యాయవాది చెప్పగా, మరి అంతకుముందు జరిగిన వ్యవహారాలతో అతనికి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. -
కేశవనగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
-
‘బతుకమ్మకుంట’ ఆక్రమణలపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్: జనగామలోని బతుకమ్మకుంట చెరువులో అక్రమ నిర్మాణాల అంశంపై సోమవారం శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఆక్రమణలపై కలెక్టర్ నివేదిక ఇచ్చి నా చర్యలు ఎందుకు తీసుకోలేదని విపక్ష కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే చెరువును ఆక్రమించారని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ మధ్య జరిగిన సంభాష ణ టేపులు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. ఒక ఐఏఎస్ అధికారిపై దౌర్జన్యం కూడా చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రెండెకరాలకు మించిన చెరువులను పూడ్చరాదని, కానీ బతుకమ్మకుంట చెరువులో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగిం దని పొంగులేటి విమర్శించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ సమాధానమిస్తూ.. బతుకమ్మకుంట చెరువు శిఖం భూమిలో ఒక ఆక్రమణ, పూర్తిస్థాయి చెరువులోని పట్టా భూమిలో 6 నిర్మాణాలు ఉ న్నట్లు గుర్తించామన్నారు. ఆక్రమించిన చెరువు విస్తీర్ణం 3,855 చదరపు గజాలని, పట్టా భూమిలో నిర్మాణాల విస్తీర్ణం 976 గజాలని వివరించారు. ఆక్రమణదారుల నుంచి చెరువును రక్షించాలని జిల్లా సాగునీటి అధికారిని కలెక్టర్ ఆదేశించారన్నారు. సమాధానంపై సం తృప్తి చెందని షబ్బీర్, పొంగులేటి న్యాయ వి చారణకు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి శ్రీ నివాస్ యాదవ్ జోక్యం చేసుకుంటూ ఈ అం శంపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చే స్తోంద ని మండిపడ్డారు. అక్కడ గుడి నిర్మాణం జరిగినట్లు కనిపిస్తోంది తప్ప ఎమ్మెల్యే ఆక్రమించిన ట్లు ఏమీ లేదన్నారు. ప్రభుత్వ సమాధానానికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. -
అక్రమ భవనం.. అధికార కేంద్రం
-
అక్రమ భవనం.. అధికార కేంద్రం
- ‘కృష్ణా’లో అక్రమ నివాసంపై నోరు విప్పని బాబు - నాడు కూల్చివేత అంటూనే నేడు నివాసం - గతంలో అధికారులు నోటీసులిచ్చినా స్పందన శూన్యం - పైగా నదీ పరిరక్షణ అంటూ సూక్తుల వల్లింపు - తాజాగా హైకోర్టు నోటీసులతో అధికారుల్లో కలవరం సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : కృష్ణా నదిలో, కరకట్ట (గట్టు) లోపల అక్రమ నిర్మాణాలు సరికాదని, వాటిని అనుమతించడం వల్ల భవిష్యత్తులో ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉన్నందున కూల్చి వేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంటున్న నివాసం విషయంలో అధికారులు తలపట్టుకుంటున్నారు. ఈ విషయమై ఎలా ముందుకు వెళతారు.. న్యాయస్థానానికి ఏం సమాధానం చెబుతారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నదీ పరిరక్షణ చట్టం(ఆర్సీ యాక్టు) ప్రకారం నీటి ప్రవాహానికి అడ్డు తగిలే ఎలాంటి నిర్మాణాలను నదిలో అనుమతించకూడదు. చివరకు ఏపుగా పెరిగే చెట్లను కూడా నాటడానికి వీల్లేదు. కరకట్ట లోపల ఉన్న నిర్మాణాలు అక్రమమని గతంలో తాడేపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసిన జాబితాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న లింగమనేని ఎస్టేట్ (ఉండవల్లిలో)కు చెం దిన నిర్మాణం కూడా ఉంది. దీంతోపాటు బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్, ముక్కాల అప్పారావు, చిగురు ఆశ్రమం, గణపతి సచ్చి దానంద ఆశ్రమం... తదితర అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గతంలోనే జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారులు గుర్తించి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నాడు రచ్చ చేసిందీ టీడీపీ నేతలే... కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2014కు ముందు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్రెడ్డి నేతృత్వంలో విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అందులో సభ్యులైన ప్రస్తుత జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బాలవర్ధనరావు తదితరులు కృష్ణా నదిలో ఆక్రమణల గురించి అప్పటి కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను, నీటిపారుదల శాఖ అధికారులను పెద్ద ఎత్తున నిలదీశారు. ఆక్రమణదారులకు తక్షణం నోటీసులు జారీ చేసి, వాటిని పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు తీసుకోవాలని, నివేదిక కూడా సమర్పించాలని హుకుం జారీ చేశారు. 2014 డిసెంబర్ 31న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా నదిలో పరిశీలనకు బోటులో వెళ్లి.. నదికి ఇరువైపులా కరకట్టల లోపల ఆక్రమణలు ఉన్నాయని, చివరకు కృష్ణమ్మను కూడా వదల్లేదని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని మీడియా ఎదుట తారస్థాయిలో ఏకరువు పెట్టారు. ఆ మరుసటి రోజు (2015 జనవరి 1న) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. కృష్ణా నదిలో ఆక్రమణలు దారుణమని, కాంగ్రెస్ వాళ్లు దేన్నీ వదిలిపెట్టరని, ఆక్రమణదారులను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఇక అంతే.. ఆ తర్వాత అదే అక్రమ నిర్మాణంలో నివాసం ఏర్పరచుకోవడం చంద్రబాబునాయుడుకు మాత్రమే సాధ్యమైంది. పరిరక్షణంటూ తాజాగా ఉపన్యాసాలు నదీ పరిరక్షణ చట్టానికి భిన్నంగా కృష్ణా నది గర్భంలో నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి.. నదులను ççపరిరక్షిస్తానంటూ తాజాగా సుదీర్ఘ ఉపన్యాసాలు ఇస్తుండటంపై పర్యావరణవేత్తలతో పాటు జలవనరుల రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నదీ పరిరక్షణ చట్టాలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా, ఆక్రమణల తొలగింపు విషయంలో చిత్తశుద్ధి ఉన్నా.. తక్షణం తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయాలని పర్యావరణ వేత్తలు డిమాండ్ చేసినా చెవికెక్కించుకోలేదు. నదుల అనుసంధానం కేవలం తాత్కాలిక చర్య అని, నదుల పరిరక్షణ శాశ్వత చర్య అంటూ సీఎం చెప్పుకొచ్చారు. అయితే కృష్ణా, గోదావరి, పెన్నా నదులతో పాటు రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లోనూ ఇసుకను ఇష్టానుసారంగా తన పార్టీ నేతలు తోడిపోస్తున్నా చర్యలు శూన్యం అయ్యాయి. పర్యావరణానికి తీవ్ర విఘాతమని పర్యావరణ వేత్తలు నిత్యం ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. నదులను పరిరక్షించుకోవాల్సిన బా«ధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పర్యావరణ వేత్తలు మేథాపాట్కర్, రాజేంద్రసింగ్ తదితరులు ఎంతగా చెబుతున్నా చంద్రబాబు సర్కారుకు పట్టడం లేదు. తాజాగా నిర్మాణాలు... లింగమనేని అతిథి గృహాన్ని సీఎం అ«ధికారిక నివాసంగా మార్చుకోవడంతో పాటు ప్రత్యేకంగా రహదారిని సైతం నిర్మించుకున్నారు. హెలిప్యాడ్ సౌకర్యంతో పాటు ఇతర నిర్మాణాలనూ చేపట్టారు. రక్షణ సిబ్బందికి ప్రత్యేకంగా గదులు, ప్రహరీని నిర్మింపజేస్తున్నారు. రూ.4.12 కోట్లతో ప్రత్యేకంగా సందర్శకుల కోసం భవన నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా ఆక్రమణలపై పిల్ను ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించి.. నోటీసులు జారీ చేయడంతో ప్రభుత్వం తప్పు ఒప్పుకుని తప్పుకుంటుందా.. లేక ఏమని సమాధానం చెబుతుందో వేచి చూడాలి. -
క్రమబద్ధీకరణం
అక్రమ భవన నిర్మాణదారులకు శుభవార్త. నిబంధనలకు నీళ్లొదిలి ఇష్యారాజ్యంగా చేపట్టిన నిర్మాణాలకు రాజముద్ర పడనుంది. దశాబ్దం క్రితం అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తూ సక్రమ నిర్మాణాలుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఆరుమాసాల గడువు ఇచ్చింది. ♦ అక్రమ నిర్మాణాలకు అవకాశం ♦ 2007 క్రితం నాటి నిర్మాణాల క్రమబద్ధీకరణ ♦ ఆరునెలల గడువు ♦ ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వ్యతిరేకత సాక్షి ప్రతినిధి, చెన్నై: చెరువులు, నీటి నిల్వ ప్రాంతాలు, స్థానిక సంస్థలకు సొంతమైన స్థలాలు, ప్రజా వినియోగానికి కేటాయించిన ప్రదేశాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను అనర్హమైనవిగా గుర్తించి విద్యుత్, తాగునీటి వసతిని తొలగిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. చెన్నై శివారు ప్రాంతాలు గ్రేటర్ చెన్నైలో కలిసిపోగా ఆయా ప్రాంతాల్లో నివాస గృహాలు, వాణìజ్య సముదాయాలు నిర్మించాలంటే చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (సీఎండీఏ), డైరెక్టర్ టౌన్, కంట్రీ ప్లానింగ్ కమిటీ (డీటీసీపీ)నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ రెండు సంస్థలు సూచించే నియమ నిబంధనలు, భద్రతా సూచనలను పాటించకుండా నిర్మాణాలు జరిపితే ప్రమాదాలు చోటుచేసుకోగా కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గ్రేటర్ చెన్నై చట్టంలో 113సీ పేరుతో సవరణ చట్టాన్ని తెచ్చారు. నిబంధనలను అతిక్రమించి 2007 జూలై 1వ తేదీ క్రితం నాటి నిర్మాణాల గణాంకాలను సేకరించి క్రమబద్ధీకరణకు రిటైర్డు న్యాయమూర్తి రాజేశ్వరన్ చైర్మన్గా 2014లో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో సభ్యులుగా పలువురు అధికారులు, నిర్మాణరంగ నిపుణులుగా ఉన్నారు. ఈ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి కొన్ని సిఫార్సులు చేసింది. కమిటీ చేసిన సిఫార్సులను మంత్రివర్గం ఇటీవలే ఆమోదించి అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి నోటీసు వెలువడిన నాటి నుంచి ఆరు నెలల్లోగా క్రమబద్ధీకరణను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణ పరిధిలోకి రాని నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ సిబ్బందికి అధికారాలు ఇచ్చారు. ఓవైపు వ్యతిరేకత అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. నీటి నిల్వ ప్రాంతాలు, ప్రభుత్వ పొరంబోకు స్థలాల్లో నిర్మాణాలను ప్రభుత్వమే అనుమతించడం వల్ల కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమ నిర్మాణా లు, ఆక్రమణలపై పరిసరాల్లోని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు చేస్తున్నారు. సీఎండీకే, డీటీసీపీ అధికారుల ఉదాసీనతకు ప్రజలు ప్రాణాలు కోల్పోతూ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారనే ఆవేదన వ్యక్తం అవుతోంది. చెన్నై మౌళివాక్కంలో 61 మందిని బలిగొన్న 11 అంతస్తుల నిర్మాణం, ఇటీవల నిట్టనిలువునా కాలిపోయిన టీనగర్లోని చెన్నై శిల్క్స్ భవనాన్ని ఉదహరిస్తున్నారు. క్రమబద్ధీకరణకు ఇవీ నిబంధనలు ♦ ఆయా నిర్మాణాలు 2007 జూలై 1 కంటే ముందు నిర్మించి ఉండాలి. ♦ కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలు ఎయిర్ కంట్రోల్, సముద్రతీర ప్రాంతాల, ఎయిర్ఫోర్సు, సైనిక దళాల, కొండ ప్రాంతాల, తమిళనాడు న్యూక్లియర్ సంస్థల నిబంధనలకు నిర్మాణాలు కట్టుబడి ఉండాలి. ♦ వీధులు, రోడ్లు, జాతీయ రహదారులు, ప్రభుత్వ, స్థానిక సంస్థలకు సొంతమైన ప్రదేశాలు, నీటి నిల్వ ప్రాంతాలు, నగర అభివృద్ధి పథకాల పరిధిలోని ప్రాంతాలు, పార్కులు, ప్రజోపయోగంలో ఉండే బహిరంగ స్థలాల్లో నిర్మించిన వాటిని క్రమబద్ధీకరించేందుకు వీలు లేదు. ♦ రోడ్ల విస్తరణకు అనువైన ప్రదేశాలు, వాహనాలు నిలిపే ప్రదేశాలు తదితరాల్లోని నిర్మాణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కమిటీ సిఫార్సు చేసింది. ♦ క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం చెల్లించాల్సిన సొమ్ము, విస్తరించిన ప్రాంతానికి రుసుం, జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ♦ అపార్టుమెంట్ల నిర్మాణాల్లో కారు పార్కింగ్ సరిగా లేకుంటే రూ.10 వేలు, వాణిజ్య సముదాయాల్లో చెన్నైలో అయితే రూ.1లక్ష, శివార్లలో రూ.50 వేలు, ద్విచక్రవాహన పార్కింగ్లో లోపాలుంటే రూ.2,500లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంద -
పాపం పండింది
► జైలుపాలవుతున్న అక్రమార్కులు ► వైఎస్సార్ నగర్లో అక్రమ మార్కులకు చెక్ నెల్లూరు రూరల్ : పేదలకు కేటయించిన ఇళ్లను ఆక్రమించుకుని అమ్ముతున్న అక్రమార్కుల పాపం పండింది. వైఎస్సార్ నగర్లోని ఇళ్ల అక్రమ నిర్మాణాలు, నకిలీ పట్టాల దందాపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు ప్రచురితమయ్యాయి. స్పందించిన కలెక్టర్ ముత్యాలరాజు విచారణ చేపట్టాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. వారు విచారణ జరిపి అక్రమ దందా నిజమేనని నిగ్గు తేల్చారు. అక్రమార్కులకు ఆ శాఖ ఏఈ రామకృష్ణారావు సహకారం కూడా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. తమ వద్ద ఉన్న ప్రాథమిక ఆధారాలతో పీడీ రామచంద్రారెడ్డి ఆదేశాలతో డీఈఈ రాజారత్నం వాస్తవాలు తేల్చాలని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్న వారితో పాటు మరికొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. వైఎస్సార్ నగర్లో ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి, నకిలీ పట్టాలను సృష్టించి, అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి అమ్మకాలు సాగించి రూ.లక్షలు పోగేసుకున్న వైనం గురించి ఒప్పుకున్నారు. కాగా ఇప్పటికే 21 మంది బాధితులు తాము మోసపోయిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రాంతాన్ని బట్టి వసూలు చేసి, నకిలీ పట్టాలను అంటగట్టినట్లు బాధితులు ఎస్ఐ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. హడలిపోతున్న అక్రమార్కులు ఇప్పటికే అక్రమాలకు ప్రధాన సూత్రధారి శివ, మంజుల, హౌసింగ్ ఏఈ రామకృష్ణారావు తదితరులపై కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్కు పంపారు. హౌసింగ్ ఏఈని ఆ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. పోలీసు విచారణలో అక్రమంగా ఇళ్లను అమ్మిన మరికొంతమంది ముఠా కూడా ఉన్నట్లు తేలింది. వీరిని కూడా త్వరలో అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో అక్రమార్కులు హడలిపోతున్నారు. కొంత మంది కబ్జాదారులు కాలనీ విడిచి వెళ్లారు. కబ్జాకు గురైన ఇళ్లను గుర్తించి లబ్ధిదారులకు అప్పగించే పనిలో హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. విచారణ కొసాగుతోంది వైఎస్సార్ నగర్లో ఇళ్ల అక్రమాలపై విచారణలో దోషులుగా తేలిన వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా వారికి రిమాండ్ విధించారు. మరి కొంత మందిపై విచారణ కొనసాగుతుంది. వీరి వల్ల నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే విచారించి న్యాయం చేస్తాం. – ఎన్.రామ్మూర్తి, రూరల్ ఎస్ఐ -
అక్రమ నిర్మాణాలెలా వెలిశాయి?
జీవో 111 పరిధిలో కట్టడాలపై హైకోర్టు సీరియస్ సాక్షి, హైదరాబాద్: హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ చెరువులకు పది కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో 111 అమల్లో ఉన్నప్పుడు అక్కడ అక్రమ నిర్మాణాలు ఎలా వెలిశాయని ఉమ్మడి హైకో ర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తుంటే హెచ్ఎండీఏ ఏంచేస్తోందని నిలదీసింది. 40కి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు భారీ నిర్మాణాలు చేపట్టాయంటే ఇది హోల్సేల్ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది. ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్రం గనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనితో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. తమ ముందున్న వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కాలేజీల్లో కొందరి తరఫున తాను గతంలో న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదనలు వినిపించినందున, ఈ కేసును తాను విచారించడం భావ్యం కాదని ఏసీజే తెలిపారు. ఈ వ్యాజ్యాన్ని మరో ధర్మాస నానికి నివేదిస్తున్నట్టు చెప్పారు. అసలా అనుమతులెవరిచ్చారు? 111 జీవో పరిధిలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయని, ప్రభుత్వం ఎటువంటి చర్య లూ తీసుకోవడం లేదంటూ హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ క్వాలిటీ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే ఇంజనీరింగ్ కాలేజీలు భారీ భవనాలు నిర్మించాయన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘అదెలా సాధ్యం? 111 జీవో అమల్లోనే ఉంది కదా. ఈ జీవో పరిధిలోని ప్రాంతంలో ఎటు వంటి నిర్మాణాలు చేపట్టరాదని ఇదే ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అక్రమ నిర్మాణాలు చేస్తుంటే హెచ్ఎండీఏ ఏం చేస్తోంది? అనుమతులెవరిచ్చారు’అంటూ ప్రశ్నించింది. జీవో పరిధిపై ఓ కమిటీ వేశాం... దీనికి హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు స్పందిస్తూ... 111 జీవో పరిధిలో 84 గ్రామాలున్నాయని, ఈ జీవో చట్టబద్ధత విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో జీవో 111 పరిధిపై శాస్త్రీయ సర్వే నిర్వహిం చేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుం టూ... 40కి పైగా కాలేజీలు నిర్మాణాలు చేశాయంటే, అది హోల్సేల్ ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించింది. -
జీహెచ్ఎంసీ బ్లాస్టింగ్ ఫెయిల్
హైదరాబాద్: మాదాపూర్లో అక్రమంగా నిర్మించిన ఓ భవనాన్ని కూల్చడంతో జీహెచ్ఎంసీ ఫెయిల్ అయింది. ఇంపిలోషన్ బ్లాస్టింగ్ పద్ధతి ద్వారా నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా భవనం పూర్తిగా ధ్వంసం అవ్వలేదు. మళ్లీ కూల్చడానికి ప్రయత్నిస్తుండగా రాళ్లు ఎగిరిపడి ముగ్గురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం ఇవ్వకుండానే జీహెచ్ఎంసీ బ్లాస్టింగ్ చేసిందని స్ధానికులు ఆరోపిస్తున్నారు. -
అక్రమ భవనాలన్నింటికీ ఇంప్లోజన్
⇒అన్ని ప్రాంతాల్లో ఇదే విధానం ⇒సామర్ధ్యం కలిగిన సంస్థ కోసం త్వరలో టెండర్లు ⇒గుట్టలబేగంపేటలో కూలిన భవనానికి రెండుమూడు రోజుల్లో మళ్లీ ఇంప్లోజన్ సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకుగాను సోమవారం ప్రయోగించిన ‘ఇంప్లోజన్’ విధానంలో భవనం పాక్షికంగానే కూలినప్పటికీ, కాంట్రాక్టు సంస్థ నైపుణ్య లేమి ఇందుకు కారణంగా గుర్తించారు. తగిన నైపుణ్యం, అనుభవం కలిగిన వారిని ఎంపిక చేయడం ద్వారా అక్రమంగా వెలసిన పెద్ద భవంతులన్నింటినీ ఇంప్లోజన్ విధానంలో కూల్చివేయాలని భావిస్తున్నారు. మాన్యువల్గా కంటే ఇంప్లోజన్ ద్వారా తక్కువ సమయం, తక్కువ వ్యయం కానుండటంతో చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాల భూముల్లో వెలసిన పెద్ద నిర్మాణాలన్నింటికి ఈ విధానాన్ని వర్తింపజేయనున్నట్లు చీఫ్సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్రెడ్డి తెలిపారు. ఇందుకుగాను త్వరలో టెండర్లు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈమేరకు ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) ఆహ్వానించనున్నారు. టెండర్లలో పాల్గొనే సంస్థల శక్తిసామరŠాధ్యలు, నైపుణ్యం, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేపడతారు. గుట్టల బేగంపేట సున్నంచెరువు బఫర్జోన్లో సోమవారం కూల్చివేసిన భవనం పక్కనే ఉన్న మరో భవనాన్ని కూడా తగిన నోటీసులిచ్చాక కూల్చివేయనున్నట్లు తెలిపారు. ఆ భవనానికి అనుమతి ఇచ్చాక, అది బఫర్జోన్లో ఉన్నట్లు తెలిసిందని, దాంతోపాటు బఫర్జోన్, ఎఫ్టీఎల్ల పరిధిలోని ఇతర భవనాలను సైతం నిబంధనల కనుగుణంగా తగిన చర్యలు తీసుకొని కూల్చివేస్తామని ఆయన పేర్కొన్నారు. వెస్ట్జోన్లో ప్రారంభించిన ఇంప్లోజన్ కూల్చివేతల్ని అన్ని జోన్లలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వినియోగించనున్నారు. రెండు మూడు రోజుల్లో మళ్లీ ఇంప్లోజన్.. సోమవారం పాక్షికంగా కూలిన భవనాన్ని మరో రెండు మూడు రోజుల్లో పూర్తిగా నేలమట్టం చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఉత్తమ్ బ్లాస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధమైంది. పేలుడు పదార్థాలను అమర్చేందుకు వీలుగా మంగళవారం అన్ని ఫ్లోర్లలోనూ పిల్లర్లకు రంద్రాలు వేశారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ రమణారావు సదరు భవన పటిష్టతను పరిశీలించి మరోమారు ఇంప్లోజన్ జరుపవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇటుకలు, డెబ్రిస్ను తొలగించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. అన్నీ పేలనందునే.. భవనం కూల్చివేతకు అమర్చిన అన్ని డిటొనేటర్ల బటన్లను ఏకకాలంలో వినియోగించనందువల్ల భవనం మొత్తం కూలకుండా కేవలం గ్రౌండ్ ఫ్లోర్మాత్రం కూలిందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఒకటి, రెండో అంతస్తులకు అమర్చిన ౖవైర్లు తెగిపోవడం వల్ల పేలుడు పదార్థాలు పేలకపోవడంతో భవనం మొత్తం కూలిపోకుండా పక్కకు ఒరిగిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ భవనం పక్కనుంచి నడవడానికి పాదచారులు భయపడుతున్న నేపథ్యంలో రెండు రోజుల్లో భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నట్లు తెలిపారు. -
GHMC అక్రమ నిర్మాణాలపై కొరడా
-
అక్రమ కట్టడాలు కూల్చివేత, ఉద్రిక్తత
శంషాబాద్ : శంషాబాద్ మండలం ఘాన్సిమియాగుడలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను హెచ్ఎండీఎ అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేస్తున్నారు. అనుమతి లేకుండా నిర్మించారని స్థానికులే ఫిర్యాదు చేయడంతో 200 మంది పోలీసు బందోబస్తుతో కట్టడాలను కూల్చివేస్తున్నారు. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
అక్రమ కట్టడాలపై చర్యలు
► ఏకీకృత మాస్టర్ప్లాన్ పూర్తయింది.. ప్రభుత్వానికి కూడా పంపాం ► దాదాపు 200కు పైగా కేసులను పర్యవేక్షణ చేస్తున్నాం ► గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ లేఅవుట్లపై చర్యలు ► ‘సాక్షి’తో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు సేవలు అందించడంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు పరిచయం చేసిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ద్వారా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)కు వచ్చే ఆదాయం రెట్టింపయింది. గతంలో నెలకు రూ.7 కోట్ల వరకు ఆదాయం ఉంటే ప్రస్తుతం రూ.15 కోట్ల వరకు చేరింది. అంతేకాకుండా బిల్డింగ్ పర్మిషన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూ, లేఅవుట్ పర్మిషన్, ఎన్వోసీలు, అక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ వేగవంతమై నగరవాసులకు సేవలు త్వరతగతిన అందిస్తున్నాం. తద్వారా ఆదాయం రెట్టింపునకు అవకాశం ఏర్పడింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లలో మార్పులు తీసుకురావడం ద్వారా ఆదాయం పెరిగింది. ఏకీకృత మాస్టర్ ప్లాన్ పూర్తి నగరాభివృద్ధికి ఆటంకంగా మారుతున్న ఐదు అభివృద్ధి సంస్థలను అనుసంధానం చేసే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ పూర్తి చేశాం. హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ( హుడా), హైదరాబాద్ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ, సైబరాబాద్ అభివృద్ధి సంస్థ (సీడీఏ), పాత హైదరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్), హెచ్ఎండీఎ వేర్వేరు మాస్టర్ప్లాన్ల వల్ల జోన్లలో చాలా సమస్యలు తలెత్తుతుండడంతో వీటన్నింటిని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఒకే గొడుకు కిందకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలు సేకరించాం. ఈ ఏకీకృత మాస్టర్ప్లాన్ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించాం. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి రెండేళ్ల నుంచి హెచ్ఎండీఏకు సంబంధించి దాదాపు 200కుపైగా కేసుల్లో న్యాయస్థానాల్లో జరిగే వాదనలను పర్యవేక్షిస్తున్నాం. ఓఆర్ఆర్ కోకాపేటకు సంబంధించి భూవిషయంపై సుప్రీంలో వాదనలు ముగిశాయి. కబ్జా కోరల్లో చిక్కుకున్న 2,370.25 ఎకరాలకు సంబంధించి జవహర్నగర్ భూముల విషయంలో న్యాయపరమైన చిక్కులను అధిగమించాం. సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆదాయం పెరిగింది.. గతంలో ఎన్నడూ లేని విధంగా హెచ్ఎండీఏ పరిధిలో వెలిసిన అక్రమ భవనాలు, లే అవుట్ల కూల్చివేత ప్రక్రియకు గతేడాది శ్రీకారం చుట్టాం. నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి మరీ వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. ఫలితంగా బిల్డింగ్ పర్మిషన్, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూ, లేఅవుట్ పర్మిషన్ల దారిపడుతున్నారు. దీంతో హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం పెరిగింది. భవిష్యత్లోనూ అక్రమ కట్టడాల గురించి సమాచారం తెలిస్తే కూల్చివేతకు వెనుకాడం. -
అక్రమ నిర్మాణం వద్దన్నందుకు..
కత్తులతో దాడి, ఒకరికి గాయాలు బంజారాహిల్స్: మజీదుకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతుండటంపై ప్రశ్నించినందుకు కత్తులతో దాడి చేసిన సంఘటన మంగళవారం బంజారాహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్ నెం.11లో ఇండో అరబ్లీగ్కు చెందిన స్థలంలో ఉన్న మజీదు గ్రౌండ్ఫ్లోర్లో హోటల్ నిర్వహిస్తున్న వ్యక్తి దానిని బార్కాస్కు చెందిన సౌద్ అమోదీకి సబ్ లీజ్కు ఇచ్చాడు. అయితే హోటల్ ఎదురుగా ఉన్న స్థలంలో సౌద్ అక్రమ నిర్మాణం చేపడుతుండటంతో ఇక్రమ్ అడ్డుకున్నాడు. నిర్మాణం చేపడితే మజీదు కనిపించకుండా పోతుందని, ఇప్పటికే అక్రమంగా నడుస్తున్న హోటల్ను మూసేయాలని జీహెచ్ఎంసీ క్లోజర్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో సౌద్ తన అనుచరులతో కలిసి కర్రలు, కత్తులతో దాడి చేయడంతో ఇక్రమ్కు తీవ్రగాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న ఇక్రమ్ కారును ధ్వంసం చేసి పరారయ్యారు. పోలీసులు నిందితులకు చెందిన ఆడికారును స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
అక్రమమా.. ఆస్తిపన్ను బాదుతాం!
►జరిమానాగా 25% నుంచి 100 % ఆస్తి పన్ను ►కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కట్టడాలపై జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా కట్టడాలపై 25 శాతం నుంచి 100 శాతం ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొ రేషన్(జీహెచ్ఎస్సీ)తో సహా రాష్ట్రం లోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపా లిటీలు, నగర పంచాయతీలను ప్రభు త్వం ఆదేశించింది. ఈ మేరకు కొత్త నిబంధ నలను అమల్లోకి తెస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేశా రు. అక్రమ కట్టడాలను కూల్చివేసే వరకు సదరు కట్టడాలపై పెనాల్టీలను విధించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు. జరిమానా విధింపు ఇలా... బిల్డింగ్ ప్లాన్లో అనుమతించిన అంతస్తుల సెట్బ్యాక్ను 10 శాతం ఉల్లంఘిస్తే 25 శాతం ఆస్తి పన్నును జరిమానాగా విధిస్తారు. ప్లాన్లో అనుమతించిన అంతస్తుల సెట్బ్యాక్ను 10 శాతానికి మించి ఉల్లంఘిస్తే 50 శాతం ఆస్తి పన్నును జరిమానాగా వేస్తారు. అనుమతి లేని అంతస్తులను నిర్మిస్తే.. సదరు భాగానికి గాను 100 శాతం జరిమానా పడుతుంది. పూర్తిగా అక్రమ కట్టడాన్ని నిర్మిస్తే 100 శాతం ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని ప్రభుత్వం ఆదేశించింది. పెనాల్టీ కట్టినా అక్రమమే... ప్రభుత్వ భూములు, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలతో పాటు స్థానిక నగర, పురపాలిక నుంచి బిల్డింగ్ ప్లాన్ అనుమతి లేకుండా అడ్డగోలుగా నిర్మించిన కట్టడాలపై కొరడా ఝుళిపించడానికి ప్రభుత్వం తాజాగా పెనాల్టీ నిబంధనలను జారీ చేసింది. పెనాల్టీ కట్టినా సదరు అక్రమ భవనాల క్రమబద్ధీకరణ జరగదని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానిక నగర, పురపాలికలు సదరు భవనాలకు నల్లా, డ్రైనేజీ, రోడ్డు, వీధి దీపాలు తదితర సౌకర్యాన్ని స్థానిక మున్సిపాలిటీలు కల్పిస్తున్నందున పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుందని పురపాలక శాఖ అధికారవర్గాలు తెలిపాయి. సదరు అక్రమ భవనాల కూల్చివేత వరకు పెనాల్టీలు వసూలు చేయనున్నారు. అక్రమ కట్టడాలపై ప్రతి నెలా నివేదిక... ప్రతి నెలా తమ వార్డు/డివిజన్ల పరిధిలోని అక్రమ కట్టడాల జాబితాతో తమ విభాగాధిపతికి నివేదికలను సమర్పించాలని క్షేత్ర స్థాయిలో పనిచేసే టౌన్ప్లానింగ్ ఓవర్సీయర్స్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ జాబితాలోని భవనాలపై పెనాల్టీలను నిర్ణయించి యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను కోరింది. నోటీసులు జారీ చేసిన 30 రోజుల తర్వాత నిర్ణీత పెనాల్టీ మొత్తాలను ఆస్తి పన్నులతో కలిపి కట్టాలని భవన యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ చేయాలని సూచించింది. పెనాల్టీలకు ప్రత్యేక రశీదు జారీ చేయాలని, ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలని కోరింది. ‘కబ్జా’ భవనాలకు గులాబీ నోటీసులు ప్రభుత్వ, వక్ఫ్, దేవదాయ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములను ఆక్రమించి నిర్మించిన భవనాలను 100 శాతం అక్రమం అని నిర్ధారించి పెనాల్టీల వసూళ్ల కోసం గులాబీ రంగు నోటీసులు జారీ చేయను న్నారు. ఈ భవనాలకు సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ను కూడా నిర్వహిస్తారు. -
ఆరోరోజూ 11 అక్రమ నిర్మాణాల కూల్చివేత
మూడు లే అవుట్లను నేలమట్టం చేసిన హెచ్ఎండీఏ సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, అనధికారిక లే అవుట్ల కూల్చివేతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) వేగిరం చేసింది. స్పెషల్ డ్రెవ్లో భాగంగా ఆరో రోజైన గురువారం నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో 11 అక్రమ నిర్మాణాలు, మూడు లే అవుట్లను పోలీసు సిబ్బంది సహకారంతో హెచ్ఎండీఏ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నేలమట్టం చేసింది. స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైనా పుప్పలగూడ, నియమి, బోడుప్పల్, చెంగిచెర్ల, బాలాపూర్ మండలం జల్పల్లి ప్రాంతాల్లో అక్రమ భవనాలు, లే అవుట్లను కూల్చివేసింది. దుండిగల్లోని 20 ఎకరాల స్థలం భూవివాదంలో ఉండటంతో హెచ్ఎండీఏ లే అవుట్ను తిరస్కరించిన రోడ్డు, ప్రహరీలు, నిర్మాణాలు చేపట్టి తాజాగా ఎల్ఆర్ఎస్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్ను కూడా హెచ్ఎండీఏ సిబ్బంది కూల్చివేసింది. దొమ్మర పోచంపల్లి నర్సాపూర్ రోడ్డులోని మూడు అంతస్తుల బిల్డింగ్ను, జల్పల్లిలో అనధికారిక లే అవుట్ను నేలమట్టం చేసింది. -
భండారి లేఅవుట్లో అక్రమ కట్టడాల కూల్చివేత
హైదరాబాద్: నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత పనులను అధికారులు తిరిగి ప్రారంభించారు. కూకట్పల్లి పరిధిలోని నిజాంపేట-భండారీ లేఅవుట్లో అక్రమ కట్టడాలను మంగళవారం కూల్చి వేశారు. మొత్తం 8 అపార్టుమెంట్లను కూల్చివేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. భవన యజమానులు అధికారులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల సహకారంతో అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ కూల్చివేతల పనుల్లో హెచ్ఎండీఎ అధికారులతో పాటు నిజాంపేట గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీ మునిగిపోయి నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. -
కూల్చివేతలతో పాటు అభివృద్ధి పనులు
సమాంతరంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు కూల్చివేయడంతో పాటు రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల పనులను సమాంతరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. బ్యాంకుల నుంచి ఆర్థిక వనరులను సమీకరించి నగరంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు ప్రణాళికలు రూపొందించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆ శాఖ మంత్రులను ఆదేశించారు. నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలతో పాటు ఇతర అభివృద్ధి పనులపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలతో బ్యాంకర్లలో విశ్వాసం పెరిగిందని, రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారని సీఎం అన్నారు. బ్యాంకులిచ్చే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందన్నారు. నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రైతుల భాగస్వామ్యంతో టౌన్షిప్లు: రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత ప్రాతిపదికన చేపట్టడంతో పాటు నగరం చుట్టూ రైతుల భాగస్వామ్యంతో టౌన్షిప్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరదలతో నగరంలోని రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే కేంద్రానికి నివేదిక పంపించాలన్నారు. బుధవారం సాయంత్రం వరకు 400 కట్టడాలను కూల్చివేశామని సీఎంకు అధికారులు నివేదించగా, అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో ఇదే వేగం కొనసాగించాలని చెప్పారు. వచ్చే బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'అక్రమ కారకులు టీఆర్ఎస్లో చేరారు'
హైదరాబాద్ : నగరంలో భారీ వర్షాలతో ముంపుకు గురైన బండారీ లేఅవుట్లో సహాయక చర్యలు చేపట్టడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...అక్రమ కట్టడాలకు కారణమైనవారు టీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గ్రేటర్ నిధులను ఆర్టీసీకి తరలించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. హైదరాబాద్పై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. -
ప్లానింగ్లో ప్రకంపనలు
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో మూకుమ్మడి బదిలీలు ఒకేసారి 22 మందికి స్థానచలనం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి 11 మంది బదిలీ జీవీఎంసీ చరిత్రలో ఇంత భారీ బదిలీలు ఇదే తొలిసారి విశాఖపట్నం : అడుగడుగునా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ అవినీతికి చిరునామాగా మారిన మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో మూకుమ్మడి బదిలీలు ప్రకంపనలు రేపుతున్నాయి. రికార్డు స్థాయిలో ఇక్కడ పని చేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో డిప్యూటీ సిటీ ప్లానర్తో సహా ఏసీపీ, టీపీవో, టీపీఎస్, తదితర అధికారులు సహా ఏకంగా 22 మందిని వివిధ మున్సిపాలిటీలకు బదిలీ చేశారు. టౌన్ప్లానింగ్ చరిత్రలో ఇంతమందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి. కాగా వీరి స్థానంలో 11 మందిని వివిధ మున్సిపాలిటీల నుంచి బదిలీపై జీవీఎంసీలో నియమించారు. జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అంటే అదో అవినీతి గని అన్న ముద్ర పడిపోయింది. ఈ విభాగంలో పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎవరిస్థాయిలో వారు అక్రమకట్టడాలను ప్రోత్సహిస్తూ రెండు చేతూలా దండుకుంటున్నారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. ఈ విభాగంలో పనిచేసి కోట్లు గడించిన వారు ఇటీవల ఏసీబీకి చిక్కిన విషయమూ తెలిసిందే. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్(సీటీపీవో) వెంకటరత్నాన్ని కూడా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ కు కేటాయిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయనకు ఇంకా రిలీవింగ్ ఆర్డర్ రాలేదు. రేపో మాపో రిలీవింగ్ ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. కాగా డిప్యూటీ సిటీ ప్లానర్గా పనిచేస్తున్న పి.ప్రదీవ్కుమార్ను గుంటూరు బదిలీ చేయగా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ముగ్గురు అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్స్తో పాటు ఆరుగురు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఆరుగురు టౌన్ప్లానింగ్ సూపర్వైజర్లు, ఆరుగురు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ ర్సీర్లపై కూడా బదిలీ వేటు పడింది. వారి స్థానంలో వివిధ మున్సిపాలిటీల నుంచి ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు టీపీవోలు, ఇద్దరు టీపీబీవోలు, ఐదుగురు టీపీఎస్లను ఇక్కడికి బదిలీ చేశారు. తాజా బదిలీలతో ఖాళీ అయిన డీసీపీతో సహా నాలుగు టీపీవో, ఒక టీపీఎస్, నాలుగు టీపీబీవో పోస్టుల్లో ఎవర్ని నియమించలేదు. -
యనమలకుదురే టార్గెట్
చేతల్లో నిజాయతీ ఏది.. ఇతర గ్రామాల జోలికి వెళ్లని టీడీపీ ముఖ్యనేత పెనమలూరు : తాను నిజాయతీ పరుడినని.. అభివృద్ధి కోసమే వసూళ్లు చేస్తున్నానని చెబుతున్న నియోజకవర్గ ముఖ్యనేత ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యనమలకుదురులో నకిలీ ప్లాన్లపై అధికారులు క్రిమినల్ కేసులు పెట్టడానికి ముందుకు రాగా ముఖ్యనేత అడ్డుకుంటున్నారు. ఓ బిల్డర్ ఇప్పటికే రూ.40 లక్షలు ముఖ్యనేతకు ముట్టచెప్పాడని గుసగుసలు వినపడుతున్న నేపథ్యంలో అక్రమ కట్టడాల వేగం పెరిగింది. ఇతర గ్రామాల జోలికి వెళ్లని నేత మండలంలో గ్రూప్హౌస్లు దాదాపుగా అన్ని గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారు. అయితే ముఖ్యనేత ఇతర గ్రామాల జోలికి మాత్రం వెళ్లడంలేదు. ఆ గ్రామాల్లో టీడీపీ నేతలు బలంగా ఉండటంతో సొంతపార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురవుతుందని వెనక్కు తగ్గి యనమలకుదురు టార్గెట్గా పెట్టుకున్నారని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. గ్రామాన్ని అభివృద్ధి చేయటానికే తాను యనమలకుదురులో వసూళ్లు చేస్తున్నట్లు కానూరులో ఆదివారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన ప్రకటించారు. మిగిలిన గ్రామాలను స్మార్టు విలేజ్లుగా అభివృద్ధి చేయటానికి అక్కడ ఎందుకు వసూలు చేయలేక పోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయగలవా..? అభివృద్ది మంత్రం చదువుతూ వసూళ్లకు పాల్పడుతున్న టీడీపీ నేతకు చిత్తశుద్ధి ఉంటే ఈ పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. యనమలకుదురులో నకిలీ గ్రూప్హౌస్ల ప్లాన్లపై విచారణ చేయించాలి. అక్రమాలకు పాల్పడిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెట్టించాలి.మోసపోయి ప్లాట్లు కొనుగోలు చేసిన వారి ప్లాట్లు సీఆర్డీఏలో రెగ్యులర్ (బీఆర్ఎస్) చేయించాలి. యనమలకుదురులో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధ్ది పనులు చేపట్టాలి.యనమలకుదురులో గతంలో అక్రమాలకు పాల్పడిన కార్యదర్శల నుంచి సొమ్ము పంచాయతీ ఖజానాకు జమ చేయించాలి. పంచాయతీ పై జరిగిన విజిలెన్స్ విచారణ నివేదిక బహిర్గతం చేయాలి.గతంలో టీడీపీ నేత వసూళ్లు చేసిన రూ.1.5 కోట్లకు గ్రామస్తులకు లెక్క అప్పగించాలి. నకిలీ ప్లాన్లు రాకుండా అధికారులు చర్యలు తీసుకునే విధంగా పని చేయించాలి. మిగితా గ్రామాల్లో అక్రమంగా నిర్మాణాలు, గ్రూప్హౌస్లపై కూడా విచారణ చేపట్టాలి.ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా న్యాయం చేయాలి. సీఆర్డీఏ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి. -
సత్తెన పల్లిలోఉద్రిక్తత
నింబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసిన మార్కెట్ తొలగింపు.. ఉద్రిక్తతకు దారి తీసింది. గుంటూరు జిల్లా సత్తెన పల్లిలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ వద్ద ఆదివారం ఉదయం అధికారులు పోలీసుల సాయంతో అక్రమ కట్టడాలు తొలగించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వెంకాయమ్మ అనే మహిళను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో పడేశారు. మరో వైపు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న షాపులను ఖాళీ చేయాల్సిందిగా పలుమార్లు హెచ్చరించామని అధికారులు తెలిపారు. ఫలితం లేక పోవడంతోనే బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చిందని వివరించారు. -
ప్రజా మేనిఫెస్టో
పాలకుల ముందు ప్రజల మేనిఫెస్టో సిటీజనుల ఆకాంక్షలు, అభిప్రాయాల మేరకు రూపకల్పన మౌలిక సదుపాయాలు, పారదర్శకత, జవాబుదారీతనం ప్రధానాంశాలు రూపొందించిన పలు స్వచ్ఛంద సంస్థలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. ప్రచారం పదునెక్కింది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు అరచేతిలో అభివృద్ధి చూపిస్తున్నాయి. గ్రేటర్ ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. అద్భుతాలు చేస్తామంటూ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. పార్టీల హామీలు, నాయకుల మాటలు శ్రద్ధగా, ఓపిగ్గా వింటున్న ప్రజలు ఏం అనుకుంటున్నారు? అసలు వారేం కోరుకుంటున్నారు? వీటన్నింటికి సమాధానమే ‘ప్రజా మేనిఫెస్టో’. అవును.. ప్రజలే తమ మేనిఫెస్టోను రూపొందించి పార్టీల ముందుంచితే ఎలా ఉంటుంది. అచ్చంగా అదే పనిచే శాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. ప్రజల పక్షాన మేనిఫెస్టో విడుదల చేశాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక, కోవా, అప్సా, అభిప్రాయ్, బస్తీ వికాస్ మంచ్, లెట్స్ ఓట్, యునెటైడ్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్స్, పీపుల్స్ యూనియన్ ఫర్ సెల్ఫ్ హెల్ప్, ఛత్రి... తదితర 15కు పైగా స్వచ్ఛంద సంస్థలు ఇందులో పాలుపంచుకున్నాయి. మౌలిక సదుపాయాలు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం.. తదితర అంశాలపై ‘ప్రజా మేనిఫెస్టో’ను రూపొందించి పార్టీల ముందుంచాయి. ముఖ్యాంశాలు.. ► విశాలమైన రోడ్లు, పాదచారులకు అనుగుణంగా ఫుట్పాత్లు. ఆక్రమిత ఫుట్పాత్ల పరిరక్షణ. ► మురుగు, వర్షపు నీటిని బయటకు పంపేందుకు పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, పారిశుధ్య సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు. ► ప్రతి వార్డుకు ఒక పార్కు ఏర్పాటు చేసి, నిర్వహణ బాధ్యతను స్థానికులకే అప్పగించాలి. ప్రతి వార్డులో ఒక ఆటస్థలం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పిల్లల మానసిక, శారీరక వికాసానికి దోహదం చేసే ఆటలను ప్రోత్సహించాలి. ► అన్ని కాలనీలు, ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వీటి నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి. ► ప్రతి రోజు ఒక వ్యక్తికి 100 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందజేయాలి. ► చెత్త సేకరణ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించేందుకు యంత్రాంగం ఏర్పాటు చేయాలి. ► నగరంలో రోజురోజుకు తీవ్రమవుతున్న కాలుష్యం దృష్ట్యా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలి. ► దోమలు, కుక్కలు, పందుల బెడదను తొలగించేందుకు జీహెచ్ఎంసీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ► ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ► ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ సేవలన్నింటినీ జీహెచ్ఎంసీలోని ప్రత్యేక విభాగం కింద చేర్చి 24 గంటల పాటు రవాణా సదుపాయాలు అందుబాటులో ఉంచాలి. ► ఆస్తిపన్నుపై శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలి. అవినీతి లేని, పారదర్శక పరిపాలనను అందజేయాలి. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపొందించాలి. ► అన్ని విభాగాల్లో పౌరసేవా పత్రం అమలు. ► వార్డు కమిటీల్లో పార్టీ కార్యకర్తలు, బంధుగణాలకు తావు లేకుండా చూడాలి. చట్టంలో పేర్కొన్న విధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు ఉండాలి. ► కార్పొరేటర్లకు ఏడాదికి కేటాయించే రూ.కోటి నిధులతో చేపట్టే పనుల వివరాలను వార్డు కమిటీలో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి. మురికి వాడల అభివృద్ధి, పరిరక్షణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి. ► హుస్సేన్సాగర్, మూసీ నది ప్రక్షాళనను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలి. చార్మినార్ పరిరక్షణ, సుందరీకరణ చర్యలు చేపట్టాలి. అక్రమ కట్టడాలను అరికట్టాలి. సంబంధిత అధికారుల్లో జవాబుదారీతనం ఉండాలి. చెరువులు ఆక్రమణలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వాటిని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి. -
వీఐపీలున్నారని వెనుకాడుతున్నారా?
* అక్రమ నిర్మాణాలు వెలుస్తుంటే ఏం చేస్తున్నారు? * 111 జీవోపై పురపాలక శాఖ, హెచ్ఎండీఏలను ప్రశ్నించిన కోర్టు సాక్షి, హైదరాబాద్: హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు పది కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ జీవో 111 అమల్లో ఉన్నప్పటికీ, అక్కడ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోని హెచ్ఎండీఏపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జంట నగరాలకు తాగునీరు అందిస్తూ జీవాధారంగా ఉన్న ఈ జంట జలాశయాల పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు వెలిశాయి.. వాటి తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారు.. అరికట్టలేకపోవడానికి కారణాలు ఏమిటి తది తర వివరాలను అఫిడవిట్ల రూపంలో తమ ముందుంచాలని తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మం డలం హిమాయత్నగర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 47, 48ల్లో జీవో 111కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా హెచ్ఎండీఏ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ పొట్లూరు కమలాదేవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ పరీవాహక ప్రాంతంలో మున్నీ మి యా, ఇబ్రహీం, ఎం.శ్రీహరి, బాలకృష్ణలు జీవో 111కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, వీటిని అడ్డుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది సి.ఎం.ఆర్.వేలు కోర్టు ను కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి... ‘జంట జలాశయాల పరీవాహక ప్రాంత పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిలో వీఐపీ, వీవీఐపీలు ఉన్నారని చర్యలకు వెనుకడుగు వేస్తున్నారా’ అంటూ హెచ్ఎండీఏను నిలదీశారు. ఇప్పటి వరకు ఈ జీవోకు విరుద్ధంగా ఎన్ని నిర్మాణాలు వెలిశాయో, తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో, అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ‘ఈ వ్యాజ్యంలో విస్తృత ప్రజా ప్రయోజనాలు ముడిపడిఉన్నాయి. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్న దాంట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. జంటనగరాలకు ఈ జంట జలాశయాలు తాగునీరు అందిస్తూ జీవాధారంగా ఉన్నాయి. ఇటువంటి వాటి చుట్టూ అక్రమ నిర్మాణాలు పుట్టగొడుల్లా వెలుస్తుండటం అత్యంత దురదృష్టకరం. ప్రభుత్వం, అధికారులు ఎంతోకొంత చేస్తున్నట్లు కనిపిస్తున్నా, క్షేత్ర స్థాయిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు. -
క్రమబద్ధీకరణ చేయొద్దు!
* మేం ఆదేశాలిచ్చేదాకా జీవో 146ను అమలు చేయకండి * అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు * దరఖాస్తులను మాత్రం స్వీకరించవచ్చు * జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించిన తీరు సరికాదు * శాసన ప్రక్రియ ద్వారా సవరించుకోవచ్చు * పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం * విచారణ జనవరి 27కు వాయిదా సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని అక్రమ నిర్మాణాలను తాము చెప్పే వరకూ క్రమబద్ధీకరించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమబద్ధీకరణ కోసం జీహెచ్ఎంసీ చట్టానికి సవరణ చేసిన తీరు సరికాదని, కార్యనిర్వాహక అధికారాల ద్వారా చట్ట సవరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కావాలంటే శాసన ప్రక్రియ ద్వారా చట్ట సవరణ చేసుకోవచ్చని సూచించింది. అయితే క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మాత్రం అనుమతించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. ఆ చట్ట సవరణ తప్పు: పిటిషనర్ న్యాయవాది జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన 146, 152 జీవోలను సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని మంగళవారం హైకోర్టు విచారించింది. తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ ఏడాది అక్టోబర్ 28కి ముందు నిర్మించిన అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో 146 జారీ చేసిందని కోర్టుకు చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 455ఎఎకు సవరణ చేసినట్లుగా జీవోలో పేర్కొన్నారని... ఈ సవరణ ప్రకారం క్రమబద్ధీకరణ గడువును 5.12.2007 నుంచి 2015కు పొడిగించారని చెప్పారు. అయితే సెక్షన్ 101 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఏ చట్టాన్నయినా వర్తింప (అడాప్ట్) చేసుకోవచ్చని, సవరణ మాత్రం చేయడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ వాదనల్లో వాస్తవముంది: ధర్మాసనం పిటిషనర్ న్యాయవాది వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘మా ముందున్న ప్రాథమిక ఆధారాలను బట్టి పిటిషనర్ తరఫు న్యాయవాది చెబుతున్న దాంట్లో వాస్తవం ఉంది. సెక్షన్ 101 కేవలం ఓ చట్టాన్ని అన్వయించుకోవడానికి ఉద్దేశించిందే. దాని కింద చట్ట సవరణ చేయడానికి వీల్లేదు. చట్ట సవరణ చేసే విషయంలో మీకు (రాష్ట్ర ప్రభుత్వానికి) హక్కులపై మాకు కొంత సందేహం ఉంది..’’ అని పేర్కొంది. అయితే ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వాదిస్తూ... ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 100, రాజ్యాంగంలోని 131, 372 అధికరణల ప్రకారం ఈ చట్ట సవరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. అందులో భాగంగానే క్రమబద్ధీకరణ జీవో జారీ చేశామని కోర్టుకు విన్నవించారు. దీనిపై సంతృప్తి చెందని ధర్మాసనం... శాసనాధికారం ద్వారా చట్ట సవరణ చేసుకోవచ్చే తప్ప, ఇలా కార్యనిర్వాహక అధికారాల ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి చట్ట సవరణ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చేంత వరకు జీవో 146 ప్రకారం అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించవచ్చని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 27కు వాయిదా వేసింది. -
కదులుతున్న అవినీతి డొంక
నగరంలో అక్రమ నిర్మాణాల జోరు పాత ఫైళ్లను తిరగదోడుతున్న కమిషనర్ అధికారుల బెంబేలు టౌన్ ప్లానింగ్లో {బోకర్ల రాజ్యం విజయవాడ సెంట్రల్ : టౌన్ ప్లానింగ్లో అవినీతి డొంక కదులుతోంది. అక్రమ కట్టడాలకు సంబంధించి పాత ఫైళ్లను కమిషనర్ జి.వీరపాండియన్ తిరగ తోడుతున్నారు. అక్రమ నిర్మాణాలే లేవంటూ నివేదిక ఇచ్చిన అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. నాలుగు నెలలుగా నగరంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ఒక్కో బిల్డింగ్కు మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కొందరు అధికారులు, కార్పొరేటర్లు కుమ్మక్కై దందా సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పింది చేయండి.. సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ కార్పొరేటర్లు అక్రమ నిర్మాణాలను బిజినెస్గా మలుచుకున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ కార్పొరేటర్ ఏడాది కాలంలో 52 అనధికారిక కట్టడాలను ప్రోత్సహించినట్లు సమాచారం. ఓ మహిళా కార్పొరేటర్ భర్త తరచు టౌన్ప్లానింగ్లో హల్చల్ చేయడం వివాదాస్పదంగా మారింది. తమ వాళ్లు చెప్పింది చేయాల్సిందేనంటూ టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో దరఖాస్తుదారుల కంటే బ్రోకర్లే ఎక్కువ కనిపిస్తుంటారు. దీన్ని నియంత్రించడంలో ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. పంపకాల లొల్లి మామూళ్ల వ్యవహారంలో అధికారులు, కార్పొరేటర్ల మధ్య విభేదాలు తలెత్తడంతోనే అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత కమర్షియల్ ప్రాంతంలోని కార్పొరేటర్ ఒక్కో బిల్డింగ్ నుంచి రూ.5 లక్షలు వసూలు చేస్తూ అధికారుల చేతిలో రూ.50 వేలు పెడుతున్నట్లు సమాచారం. అదే అధికారులు అనుమతిచ్చే అక్రమ కట్టడాల్లో తనకు రూ.2 లక్షలు ఇవ్వాలంటూ అదే కార్పొరేటర్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై కార్పొరేటర్, అధికారి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. సెంట్రల్ నియోజకవర్గంలోని ఓ మహిళా కార్పొరేటర్ భర్త వైఖరిపై విసుగెత్తిన అధికారి ‘నువ్వు కార్పొరేటర్వి కాదు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..’ అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనధికారిక కట్టడాలను ఆ కార్పొరేటర్ భర్త వ్యాపారంగా మార్చుకోవడమే ఇందుకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టౌన్ప్లానింగ్ అధికారులపై తరచు ఆగ్రహం వ్యక్తం చేసే మేయర్ కోనేరు శ్రీధర్ తమ పార్టీ కార్పొరేటర్లను కంట్రోల్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఏసీబీ కన్ను నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ విభాగంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు డేగకన్ను వేశారు. నెలన్నర రోజుల్లో రెండు దఫాలుగా విచారణ చేపట్టారు. గతంలో నిర్మాణమైన రెండు అక్రమ కట్టడాలకు సంబంధించి స్పష్టమైన ఫిర్యాదులు అందడంతో కూపీ లాగారు. కొందరు చైన్మెన్లు రెచ్చిపోతున్నారని ఫిర్యాదులు అందటంతో సర్వీస్ రిజిస్టర్ల నుంచి వారి వివరాలు సేకరించారు. రెండేళ్ల కిందట బిల్డింగ్ ఇన్స్పెక్టర్ చీకటి సత్యనారాయణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈజీ మనీకి అలవాటుపడిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ స్కాంవెండీష్ స్థాయికి మించి అప్పులు చేసి ఏడాది క్రితం ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గతం నేర్పిన గుణపాఠాల నుంచి ఏమాత్రం అనుభవం నేర్వని కొందరు అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా అక్రమాలకు తెగబడుతున్నారు. సరైన చర్యలు లేకపోవడం వల్లే టౌన్ప్లానింగ్లో అవినీతి పేట్రేగిపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
అంతా వాళ్లే చేశారు!
అక్రమ కట్టడాలకు అధికార పార్టీ దన్ను విజిలెన్స్కు ఫిర్యాదు చేసిందీ టీడీపీ ప్రజాప్రతినిధే మంత్రిని ఆశ్రయించిన బిల్డర్లు ఆసక్తికరంగా మారిన యనమలకుదురు వ్యవహారం విజయవాడ : యనమలకుదురు గ్రామంలో అక్రమ కట్టడాల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలో వందల సంఖ్యలో అక్రమ కట్టడాల నిర్మాణం దగ్గర్నుంచి ఫిర్యాదుల వరకు అంతా టీడీపీ ప్రజాప్రతినిధుల డెరైక్షన్లోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అడ్డగోలుగా అక్రమ కట్టడాలకు పచ్చజెండా ఊపారు. దండిగా కాసులు దండుకున్నారు. సీన్ కట్ చేస్తే.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి సమగ్ర విచారణ జరిపి నలుగురు గ్రామ కార్యదర్శులు , ఇద్దరు ఆర్కిటెక్చర్లను ఈ అక్రమ కట్టడాలకు కారకులుగా తేల్చి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. సాక్షిలో అక్రమ కట్టడాల వ్యవహారంపై వరుస కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో బిల్డర్లలో వణుకు మొదలైంది. విజి‘లెన్స్’ నుంచి తమను కాపాడాలంటూ జిల్లాకు చెందిన ఓ అమాత్యుడిని ఆశ్రయించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతా తాను చూసుకుంటానని ఆ మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో మూడుసార్లు విచారణ జరుగగా.. ఫైల్ను తొక్కిపెట్టారు. తాజా పరిణామాల నేపథ్యంలో విజిలెన్స్ నివేదికపై అధికార పార్టీలో అంతర్మథనం మొదలైంది. టీడీపీ నేతల వింత ధోరణి రెండేళ్ల కిందట అక్రమ కట్టడాలకు అనుమతులు ఇప్పించింది అక్కడున్న టీడీపీ నాయకులే. అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేలా చేసిందీ స్థానిక నాయకులే. మళ్లీ వారే మూడు నెలల కిందట అక్రమ కట్టడాల వ్యవహారం, గ్రామంలో గాడితప్పిన పంచాయతీ పాలనపై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ కట్టడాల సంగతి తేల్చాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో గతంలో ఈ గ్రామ పంచాయతీపై జిల్లా పంచాయతీ అధికారులు విచారణ నిర్వహించారు. ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ కూడా నిర్వహించింది. అన్ని నివేదికలు అక్రమాలు జరిగాయని తెల్చిచెప్పాయి. తాజాగా స్థానిక ప్రజాప్రతినిధి ఫిర్యాదుతో ప్రభుత్వం విజిలెన్స్ను రంగంలోకి దింపి విచారణ నిర్వహించింది. విజిలెన్స్ కూడా అక్రమాలను నిర్ధారించింది. ఈ విచారణలన్నింటికీ మూలం స్థానిక అధికార పార్టీ నేతల ఫిర్యాదులే. కానీ వారు దీనికి భిన్నంగా ప్రజల ముందు మరో కోణంలో వ్యవహరిస్తుండడం గమనార్హం. ఫిర్యాదుచేసిన వారే ఈ వ్యవహారాన్ని మళ్లీ భుజానికి ఎత్తుకొని అండగా నిలవడం విశేషం. దీని వెనుక పెద్ద మొత్తం చేతులు మారిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. అటు అక్రమ కట్టడాల వ్యవహారంతో పాటు ఇటు అధికార పార్టీ నేతల రెండు ధోరణులపై ఊళ్లో విస్తృత చర్చ జరుగుతోంది. -
అక్రమ మేడలపై... విజిలెన్స్
యనమలకుదురు వ్యవహారంపై సమగ్ర విచారణ ప్రభుత్వానికి నివేదిక నలుగురు గ్రామ కార్యదర్శులపై చర్యకు,ఇద్దరు ఆర్కిటెక్చర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు నిబంధనల ఉల్లంఘనులపై కొరడా విజయవాడ : యనమలకుదురు అక్రమ కట్టడాల వ్యవహారంపై విజిలెన్స్ కన్నేసింది. ఏడుగురిపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధం చేసింది. ‘చూడుచూడు మేడలు.. అక్రమాల జాడలు’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. అడ్డగోలు నిర్మాణాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. అనధికారిక కట్టడాల్లో చక్రం తిప్పిన గ్రామ కార్యదర్శులు వి.బ్రహ్మం, పీఎన్పీ ఆనంద్ భూషణ్, ఎస్.రమేష్, పి.ఉమామహేశ్వరరావులు మామూళ్లు దండుకొని నిబంధనలు ఉల్లంఘించారని తేల్చారు. వీరిని విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. శ్రీనివాస ఇంజనీర్ ఆర్కిటెక్చర్చ్కు చెందిన ఉడా లెసైన్స్డ్ ఆర్కిటెక్చర్ కె.శ్రీనివాసరావు, లక్ష్మీ దుర్గ అసోసియేట్స్కు చెందిన ఆర్కిటెక్చర్ కె.రవీంద్రబాబుల ఆర్కిటెక్చర్ లెసైన్స్ను రద్దు చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. అక్రమాల కేరాఫ్... రాజధాని నగరాన్ని ఆనుకొని ఉన్న యనమలకుదురు గ్రామం అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ముఖ్యంగా గ్రామంలో ప్రధాన రహదారులు మినహా మిగిలిన ప్రాంతంలో రోడ్లన్నీ పూర్తిగా 20 అడుగులవే. గడిచిన మూడేళ్లలో తాడిగడప డొంక రోడ్డు వేగంగా అభివృద్ధి చెందింది. దీంతో రియల్టర్లు పొలాలు, ఖాళీ స్థలాలను తీసుకొని లక్షల రూపాయలు ముడుపులుగా గ్రామ కార్యదర్శులకు చెల్లించి అడ్డగోలుగా అనుమతులు పొంది భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. ఇలా మూడేళ్ల వ్యవధిలో దాదాపు 160 భవనాలు వెలిశాయి. వీటిలో 90 శాతం వరకు అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్లే కావటం గమనార్హం. విజయవాడ నగరంలో అపార్ట్మెంట్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవటంతో నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలోని యనమలకుదురులో గతంలో రేట్లు కాస్త అందుబాటులో ఉండటంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువమంది ఇక్కడ అపార్ట్మెంట్లలోని ప్లాట్లు కొనుగోలు చేశారు. నిబంధనలకు తూట్లు అపార్ట్మెంట్లు నిర్మించాలంటే 30 అడుగుల రోడ్డు, ప్రతి ప్లాట్కు సెట్ బ్యాక్ తప్పనిసరి. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా నిర్మాణాలు జరగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. స్థానికంగా అధికారుల్ని మేనేజ్ చేసిన అక్రమార్కులు విజిలెన్స్కు దొరికిపోయారు. గతేడాది వరకు గ్రామంలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అధికారం పంచాయతీలకే ఉండేది. గత ఏడాది సీఆర్డీఏ ఆవిర్భావానికి ముందు పంచాయతీలకు అధికారాలు రద్దు చేసి ఉడాకు అప్పగించారు. ఆ సమయంలో రియల్ఎస్టేట్ హవా ఎక్కువగా ఉండటంతో అప్పటి గ్రామ కార్యదర్శి దరఖాస్తులకు పాత తేదీలు వేసి అనుమతులు ఇచ్చేశారు. విజిలెన్స్ విచారణలో ఈ విషయం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి పంపిన నివేదికలో ఈ విషయాన్ని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. పదుల సంఖ్యలో అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్లు 10, 20 అడుగుల రోడ్డులోనే నిర్మించటం, జి+2 అనుమతి తీసుకొని జి+4 నిర్మించటం, కొన్నింటిలో పెంట్ హౌస్లు కూడా నిర్మించటం, అపార్ట్మెంట్లు సెట్బ్యాక్ వదలకుండా నిర్మించటం, మరికొన్నిచోట్ల ఏటి ఒడ్డును కూడా ఆక్ర మించి అక్రమంగా కట్టడాలు నిర్మించటం వివాదాస్పదంగా మారింది. -
చూడుచూడు మేడలు అక్రమాల జాడలు
నిబంధనలకు విరుద్ధంగా భారీ నిర్మాణాలు జి+2కి అనుమతులు.. జి+4 నిర్మాణం అడ్డగోలుగా అనుమతులిచ్చిన పంచాయతీ అధికారులు విజిలెన్స్ తనిఖీల్లో బయటపడుతున్న బాగోతం యనమలకుదురు గ్రామం అక్రమ కట్టడాల అడ్డాగా మారింది. ఒకటి రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో ఇక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయి. గత రెండేళ్లలో ఇక్కడ దాదాపు 300కు పైగా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మిస్తే వాటిలో 70 శాతం నిబంధనలు ఉల్లంఘించినవే. ఈ విషయం గ్రామ స్థాయి నుంచి సీఆర్డీఏ స్థాయి వరకు అధికారులందరికీ తెలిసినా పట్టించుకునేవారు లేరు. విజయవాడ : యనమలకుదురు గ్రామ శివారు ప్రాంతం గడిచిన మూడేళ్లలో అనూహ్యంగా అభివృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్ హడావుడి అన్ని ప్రాంతాల కంటే ఇక్కడ ఎక్కువగా ఉండటంతో నెలకో అపార్ట్మెంట్ నిర్మాణం అనే రీతిలో ఇక్కడ నిర్మాణాలు శరవేగంగా జరిగాయి. ఇంకా ప్రత్యేకంగా యనమలకుదురు నుంచి తాడిగడపకు వెళ్లే డొంక రోడ్డులో 90 శాతం నిర్మాణాలు చేపట్టారు. గ్రామంలో ప్రధాన రహదారులు మినహా మిగిలినవన్నీ 10, 20 అడుగుల రోడ్లే. కార్యదర్శులే రింగ్ లీడర్లు... ఇక్కడ హవా అంతా గ్రామ కార్యదర్శులదే. ముఖ్యంగా గత ఏడాది వరకు ఉన్న కార్యదర్శులు పెద్ద సంఖ్యలో అనుమతులు ఇచ్చి భారీగా సొమ్ము చేసుకున్నారు. దరఖాస్తు వచ్చాక కనీసం పరిశీలన కూడా చేయకుండానే అనుమతులు ఇచ్చేశారు. గతంలో ఏడాదికి ఐదుగురు గ్రామ కార్యదర్శులు ఇక్కడ మారేవారు. ఒక కార్యదర్శి హయాంలో కేవలం రెండు నెలల వ్యవధిలో 80కి పైగా భవనాలకు అనుమతులు ఇవ్వటం గమనార్హం. అంతేకాదు.. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవాలని వారే సలహాలు కూడా ఇస్తుండటం విశేషం. దీనిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి సారించింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో దర్యాపు చేయించి అక్రమ కట్టడాల సమగ్ర చిట్టా సేకరించి విచారణ పర్వం ముగించింది. ఇక చర్యలు ఎలా ఉంటాయనేది వేచిచూడాలి. ఇక్కడి పరిస్థితి ఇదీ... ►ఇక్కడి రోడ్లలో కార్లు తప్ప మరే పెద్ద వాహనాలూ రాకపోకలు సాగించలేవు. ►గత ఏడాది వరకు గ్రామాల్లో భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చే అధికారం పంచాయతీలకే ఉండేది. ►ఈ ఏడాది నుంచి సీఆర్డీఏ పరిధిలోని పంచాయతీల్లో అనుమతిలిచ్చే అధికారం బదలాయించారు. ► సీఆర్డీఏకు ఆ అధికారం అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ► గత ఏడాది వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా సాగటంతో ఇక్కడ భారీగా అపార్ట్మెంట్లు వెలిశాయి. ►కనీసం 360 చదరపు గజాల పైనే స్థలం ఉంటే దానిలో జి+3 భవనం నిర్మాణానికి అనుమతులు ఇస్తారు. ►రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లతో అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేశారు. ►గడచిన మూడేళ్లలో ఇక్కడ 160 అక్రమ కట్టడాలు నిర్మితమైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్ధారించారు. ►286 చదరపు గజాల విస్తీర్ణంలో జి+2 భవనానికి అనుమతులు తీసుకొని జి+3 భవనాలు 40కి పైగా నిర్మించారు. ►200 గజాల విస్తీర్ణంలో జి+1కి అనుమతులు తీసుకొని జి+2 భవనాలు గ్రూప్హౌస్ల పేరుతో సెట్బ్యాక్, చుట్టూ జాగా లేకుండా సుమారు 37 వరకు నిర్మించారు. -
కబ్జా చేస్తే కటకటాలే!
♦ ‘చెరువుల రక్షణ, నిర్వహణ చట్టం’ ముసాయిదా రూపకల్పన ♦ ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్, ఏడాది పాటు జైలు శిక్ష ♦ అక్రమ నిర్మాణాలు చేపడితే స్వాధీనం.. కలుషితం చేసినా, వ్యర్థాలు వేసినా చర్యలు ♦ నిర్లక్ష్యం చేసే అధికారులకూ శిక్ష విధింపు ♦ రాష్ట్ర, జిల్లా స్థాయిలో చెరువుల పరిరక్షణకు అథారిటీలు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్న చెరువులను కబ్జా కోరల్లోంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. చెరువు పరిధి, శిఖం భూమిని కబ్జా చేస్తే నేరుగా జైలుకు పంపేలా కఠిన చట్టాన్ని తీసుకువస్తోంది. కబ్జాలతో పాటు చెరువులను కలుషితం చేసే, దెబ్బతీసే ఎలాంటి చర్యలకు పాల్పడినా శిక్ష పడనుంది. ఎలాంటి వారంట్ లేకుండా అరెస్ట్ చేసేలా, కనీసం ఏడాది జైలుశిక్ష పడేలా ముసాయిదాను రూపొందించింది. ‘చెరువుల రక్షణ, నిర్వహణ చట్టం-2015’ పేరుతో తయారు చేసిన ఈ ముసాయిదాలో... చిన్న నీటి వనరులను సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, చేపల పెంపకాన్ని ప్రోత్సహించడం, సాధారణ ప్రజల అవసరాలకు సమర్థవంతంగా చెరువు నీటిని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. నీటి కాలుష్యాన్ని, కబ్జాలను నివారించేలా కఠిన చర్యలను అమల్లోకి తెస్తోంది. ఈ ముసాయిదాపై ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చించిన ప్రభుత్వం... అభిప్రాయం చెప్పాలంటూ జిల్లాల అధికారులకు ముసాయిదాను అందజేసింది. వారి సూచనలు స్వీకరించాక అవసరమైన మార్పులు, చేర్పులు చేసి.. చట్టాన్ని అమల్లోకి తేనున్నారు. గతేడాది అక్టోబర్లో చెరువుల సమగ్ర సర్వే ద్వారా రాష్ట్రంలో 46,531 చెరువులను గుర్తించిన సమయంలోనే... వేల సంఖ్యలో చెరువుల కింది శిఖం భూములు కబ్జా అయినట్లు నీటి పారుదల శాఖ తేల్చింది. చెరువుల పూడిక పనుల అంచనాల నిమిత్తం జరిపిన సర్వేలోనూ భారీగా కబ్జాలను గుర్తించింది. చెరువు పూర్తినిల్వ సామర్థ్యం(ఎఫ్టీఎల్) పరిధిలోకి కబ్జాలు చొచ్చుకురావడంతో చెరువుల పరిధి కుచించుకు పోయిందని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో చెరువుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉక్కుపాదమే.. తాజాగా ప్రభుత్వం సిద్ధం చేసిన 30 పేజీల ముసాయిదా ప్రకారం... చెరువులను నీటి నిల్వ కోసం మినహాయించి ఏ ఇతర అవసరాల కోసం వాడినా కఠిన చర్యలుంటాయి. చెరువు సరిహద్దు నుంచి 30 మీటర్ల దూరం లోపల ఉన్న భూముల్లో ఎలాంటి వాణిజ్య, గృహ, పారిశ్రామిక సముదాయాలు నిర్మించరాదు. అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు. చెరువుల్లోకి నీరు వచ్చే ప్రవాహ మార్గాలకు ఎలాంటి ఆటంకం కలిగించరాదు. మున్సిపల్ వ్యర్థాలు కానీ, బురదనుకానీ, రసాయన వ్యర్థాలనుకానీ చెరువులో వేయరాదు. ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువు పరిధిలో ఎలాంటి రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టరాదు. శుద్ధి చేయని జలాలను పంపకూడదు. వీటిని ఎక్కడైనా ఉల్లంఘిస్తే.. ఆ ఆక్రమణకు ఉపయోగించే పరికరాలు, వస్తువులు, వాహనాలను సీజ్ చేసే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టారు. అంతేగాకుండా ఆక్రమణ దారులను ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం కూడా ఉంటుంది. ఈ చట్టం కింద నేరం రుజువైతే కనీసం ఏడాది జైలు శిక్ష పడేలా నిబంధనలు విధించారు. ఇదే సమయంలో చట్టవిరుద్ధంగా చెరువులు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైతే వారిని కూడా శిక్షించనున్నారు. -
వేగం...సులభం
ఆన్లైన్లో ప్రభుత్వ శాఖల సమాచారం భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానం మంత్రివర్గ ఉప సంఘం సిఫారసు సిటీబ్యూరో ఓ వైపు బీపీఎస్తో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. మరోవైపు భవిష్యత్లో ప్రజలు భవన నిర్మాణ అనుమతులను సులభంగా...త్వరితంగా పొందేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రెవెన్యూ, వాటర్ బోర్డు, విమాన యాన సంస్థల సేవల అనుసంధానానికి యత్నిస్తోంది. ఎవరైనా భవన నిర్మాణానికిదరఖాస్తు చేసుకుంటే... అది ప్రైవేటు స్థలమేనా?.. లేక ప్రభుత్వానిదా?... నీటి సదుపాయం ఉందా? లేదా?... ఏదైనా వివాదం ఉందా? అనే వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని యత్నిస్తోంది. దీనికోసం సంబంధిత ప్రభుత్వ విభాగాలన్నీ తమ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచాలని బీపీఎస్పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార సు చేసినట్లు తెలిసింది. అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులోని సర్వే నెంబరును నమోదు చేయగానే ఆ స్థలానికి సంబంధించిన వివరాలన్నీ తెలిసేలా ఉండాలని సూచించింది. ఇవి అధికారులతో పాటు ప్రజలకూ అందుబాటులో ఉండేలా చూడాలంది. ఉదాహరణకు నగరంలో ఎవరైనా ఒక ప్లాటు కొనాలనుకుంటే సంబంధిత సర్వే నెంబరును నమోదు చేయగానే వివరాలు తెలిసేలా.. ప్రభుత్వ భూముల సమాచారాన్ని రెవెన్యూ శాఖ... ఆ ప్రాంతంలో నీటి సరఫరాకు అవకాశం ఉందో లేదో తెలిపే సమాచారాన్ని వాటర్ బోర్డు ఆన్లైన్లో పొందుపరచాలి. నీటి సరఫరాకు అవకాశం ఉంటే బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతి ఇచ్చే ముందే జీహెచ్ఎంసీ తగిన ఫీజు వసూలు చేసి ఏర్పాట్లు చేస్తుంది. అవకాశం లేనట్లయితే తిరస్కరిస్తుంది. తద్వారా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఏదైనా స్థలానికి సంబంధించి వివాదాలున్నట్లయితే...ఆ విషయం తెలిసేలా ఉండాలి. తద్వారా దాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి ముందస్తుగానే విషయం తెలుస్తుంది. అన్ని వివరాలూ ఇలా అందుబాటులో ఉంచడం (సీమ్లెస్ ఇన్ఫర్మేషన్) ద్వారా త్వరితంగా అనుమతులు రావడమే కాకుండా, భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని సబ్కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రస్తుతం టీఎస్ ఐపాస్ తరహాలో సింగిల్విండో విధానం ద్వారా ఇతర శాఖల వద్దకు వెళ్లకుండానే అనుమతులిచ్చేందుకూ వీలవుతుందని భావిస్తున్నారు. సబ్కమిటీ నివేదికను సీఎం పరిశీలించాక నిర్ణయం తీసుకుంటారు. ఎయిర్పోర్ట్ అథారిటీ అట్లాస్తో ప్రయోజనం.. ఎక్కువ ఎత్తున్న భవనాల నిర్మాణానికి ప్రస్తుతం ఎయిర్పోర్టు అథారిటీ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఎంతో సమయం పడుతోంది. దీన్ని నివారించేందుకు ఎయిర్పోర్టు అథారిటీ రూపొందిస్తున్న అట్లాస్ను వినియోగించుకోనున్నారు. నగరంలోని ఏ ప్రాంతంలో సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో భూమి ఉందో తెలిసేలా ఎంఎస్ఎల్(మీన్ సీ లెవెల్) వివరాలతో ఎయిర్పోర్టు అథారిటీ అట్లాస్ను రూపొందిస్తోంది. ఎఎంఎస్ఎల్ల వివరాలు సులభంగా అర్థమయ్యేలా వివిధ రంగుల్లో రూపొందుతున్న అట్లాస్తో తక్కువ ఎత్తు భవనాలను నిర్మించాల్సిన ప్రాంతాలకు ఒక రంగును, కొంత ఎత్తు వరకు అనుమతించే ప్రాంతాలకు మరో రంగును వినియోగిస్తారు. వీటిని బట్టి ఆ ప్రాంతంలో ఎంత ఎత్తు వరకు భవనం నిర్మించవచ్చునో సులభంగా తెలుస్తుంది. ఈ అట్లాస్ను ఆన్లైన్లో అనుసంధానించడం ద్వారా సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది. త్వరితంగా అనుమతులు ఇవ్వవచ్చునని భావిస్తున్నారు. దీంతో పాటు అనుమతి లేని భవనాలకు రిజిస్ట్రేషన్లు చేయరు. తద్వారా భవిష్యత్లో అక్రమ నిర్మాణాలు లేకుండా చూడవచ్చని భావిస్తున్నారు. -
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
హెచ్ఎండీఏకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: అనుమతుల్లేని లేఅవుట్లు, అందులో జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయించాలని హైకోర్టు సోమవారం హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారికి తక్షణమే నోటీసులు జారీ చేసి నిర్మాణాల నిలుపుదలకు అన్ని చర్యలను తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆయా లేఅవుట్లలో ఒక్క నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే నిర్మాణాలు జరిగి ఉంటే వాటి విషయంలోనూ చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రంగారెడ్డి జిల్లాలోని నాదర్గుల్ గ్రామంలో అనుమతుల్లేని లేఅవుట్లలో నిర్మాణాలు చేపడుతున్న తేజశ్రీ రియల్ ఎస్టేట్స్, భవానీ రియల్ ఎస్టేట్స్, శ్రీనిధి రియల్ ఎస్టేట్స్, లక్ష్మీ నర్సింహ బిల్డర్స్, రాఘవేంద్ర రియల్ ఎస్టేట్స్, సప్తగిరి రియల్ ఎస్టేట్స్లతోపాటు హెచ్ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాదర్గుల్ గ్రామ పరిధిలో తేజశ్రీ రియల్ ఎస్టేట్స్ తదితరులు హెచ్ఎండీఏ అనుమతుల్లేకుండానే లేఅవుట్లు వేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సోమవారం విచారణ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్ల వాదనలు విన్నది. తేజశ్రీ రియల్ ఎస్టేట్స్ తదితరులు పెద్ద మొత్తంలో అక్రమ లేఅవుట్లు వేసి నిర్మాణాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేదని, అందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది పి. తిరుమలరావు పేర్కొన్నారు. తరువాత హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు వాదనలు వినిపిస్తూ అక్రమ లేఅవుట్ల విషయం తమకు దృష్టికి వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తాము నాదర్గుల్ గ్రామానికే పరిమితం కాకుండా హెచ్ఎండీఏ పరిధి మొత్తానికీ కలిపి ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. -
బాబు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు
-
సరళం...సులభం
- భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం - బీపీఎస్ అమలుకు సర్కారు సిద్ధం - అక్ర మాలకు చెక్ పెట్టే వ్యూహం - మళ్లీ మొదలైతే కూల్చివేతకు నిర్ణయం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం మరోసారి సిద్ధమవుతోంది. అదే సమయంలో భవిష్యత్తులో తిరిగి ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టడి చేయాలనేది సర్కారు వ్యూహం. ఈ క్రమంలో భవన నిర్మాణ అనుమతులను అత్యంత సరళీకరించనున్నారు. ఆ తరువాత ఎవరైనా అక్రమ నిర్మాణాలకు పాల్పడితే నిర్దాక్షిణ్యంగా కూల్చి వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు.. అక్రమ నిర్మాణం పూర్తయ్యేంతదాకా ఉపేక్షించే సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అవసరమైతే ఏకంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చే యాలనే కఠిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో అధికారులు తలమునకలవుతున్నారు. అన్నిచోట్లా ఒకే మాదిరిగా కాకుండా ఆయా ప్రాంతాల డిమాండ్ను బట్టి ఫీజులు నిర్ధారించాలనే యోచనలో అధికారులు ఉన్నారు. జీహెచ్ఎంసీలో ట్రేడ్ లెసైన్సులు, ప్రకటనల పన్నులకు సంబంధించిన విధానాలు గతంలో గందరగోళంగా ఉండి సామాన్యులకు అర్థమయ్యేవి కావు. వాటిని స్వల్ప మార్పులతో కమిషనర్ సోమేశ్ కుమార్ సరళీకరించారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఫీజులు నిర్ధారించేందుకు ఆయా ప్రాంతాల్లోని రహదారుల వెడల్పు, అంతర్గత కాలనీలు అనే అంశాల వారీగా ఫీజు వసూలు విధానాన్ని నిర్ణయించారు. దాదాపుగా ఇదే పద్ధతిని భవన నిర్మాణ ఫీజులకు వర్తింపజేసే అవకాశం ఉంది. దాంతో పాటు సెట్బ్యాక్ల విషయంలోనూ వీలైనంత మేరకు ప్రజలకు ఎక్కువ ప్రయోజనం ఉండేలా చేయాలని ప్రభుత్వ యోచన. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీపీఎస్ దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించడం ద్వారా తప్పుడు తేదీలతో రబ్బరు స్టాంపులు వేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్లతో జీహెచ్ఎంసీ ఖజానాకు దాదాపు రూ. 2 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కమిషనర్ సోమేశ్కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. భవన నిర్మాణ అనుమతులను సరళీకరించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని పేదలకు ఉపకరించేలా సెట్బ్యాక్లు, ఇతర అంశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అక్రమాలకు చెక్ భవన నిర్మాణాల్లోనే కాకుండా జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సాంకే తిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్లు కమిషనర్ చెప్పారు. ఒక సర్కిల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన బయోమెట్రిక్ హాజరుతో వేతన బిల్లులకు సంబంధించి రూ.లక్షల్లో దుబారా ఆగిపోయిందన్నారు. డీజిల్ వినియోగంలో అక్రమాలనూ అరికట్టగలిగామన్నారు. రోజుకు సగటున నాలుగువేల లీటర్ల డీజిల్ మిగులు కనిపిస్తోందని చెప్పారు. -
అక్రమాల ఊడలు
బీపీఎస్ ముసుగులో యథేచ్ఛగా నిర్మాణాలు టౌన్ప్లానింగ్లో దళారీ దందా మాట వినని టీపీఎస్ను మార్చేందుకు కుట్ర ఉన్నతాధికారులు దృష్టిసారించాలి మరి.. బీపీఎస్ ముసుగులో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. అధికార పార్టీ కార్పొరేటర్లు కొందరు అవినీతి మేడలు కట్టేస్తున్నారు. టౌన్ప్లానింగ్ విభాగంలో ముఖ్య అధికారిని గుప్పెట్లో పెట్టుకున్న ఓ దళారీ ఈ కథంతా నడిపిస్తున్నాడు. తన మాట వినని అధికారులను అంతర్గత బదిలీలు చేయించే స్థాయికి సదరు దళారీ ఎదగడం ఇప్పుడు కార్పొరేషన్లో హాట్ టాపిక్గా మారింది. విజయవాడ సెంట్రల్ : బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. నిబంధనల ప్రకారం 1985 జనవరి నుంచి 2014 డిసెంబర్ మధ్యకాలంలో నిర్మాణమైన భవనాలకు మాత్రమే ప్రభుత్వం బీపీఎస్కు అనుమతిచ్చింది. దీనిని సాకుగా తీసుకుని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారు. స్థాయిని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. గవర్నర్పేట మ్యూజియం రోడ్డులో టౌన్ప్లానింగ్ అనుమతులు లేకుండా మూడో అంతస్తు నిర్మాణం సాగుతోంది. విద్యుల్లత సిటీప్లానర్గా పనిచేసిన కాలంలో ఈ భవనంలో రెండో అంతస్తుకే అనుమతించలేదు. అన ధికారికంగా నిర్మించేందుకు ప్రయత్నించగా, రెండుసార్లు ఆమె కూలగొట్టారు. ఆమె బదిలీ అయిన మూడు నెలలకే రెండో అంతస్తు వెలిసింది. తాజాగా మూడో అంతస్తు నిర్మాణంలో ఉంది. దీనికి సంబంధించి భారీ డీల్ జరిగినట్లు సమాచారం. టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి హస్తం ఇందులో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తపేట అహ్మద్వీధిలో రెండో అంతస్తు నిర్మాణం జరుగుతోంది. అలాగే, బందరురోడ్డులోని ఒక ప్రముఖ హోటల్పై, మొగల్రాజపురంలోని మోడరన్ మార్కెట్ సమీపంలో అపార్ట్మెంట్ అనధికారిక కట్టడాలకు అనుమతిచ్చారు. వన్టౌన్, భవానీపురం, గవర్నర్పేట, సింగ్నగర్, కృష్ణలంక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా నిర్మిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, బ్రోకర్లే డీల్స్ కుదురుస్తున్నారనేది బహిరంగ రహస్యం. బీపీఎస్కు ప్రభుత్వం అనుమతిచ్చాక నగరంలో సుమారు రెండువేల పైచిలుకు అక్రమ కట్టడాలు వెలిసినట్లు భోగట్టా. వీటిద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చక్కబెడుతున్నారు టౌన్ప్లానింగ్ను బ్రోకర్లు రాజ్యమేలుతుండటంపై మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ముఖ్య అధికారిని బదిలీ చేయాల్సిందిగా టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ డెరైక్టర్ను రెండు నెలల కిందటే కోరారు. డీటీసీపీ ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. సాయిబాబా అనే అధికారి ఇక్కడకు వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎలాగూ బదిలీ అయిపోతున్నాం కాబట్టి చక్కబెట్టేద్దాం.. అనే ‘ప్లానింగ్ ’లో అధికారి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు భోగట్టా. టౌన్ప్లానింగ్పై అందుతున్న ఫిర్యాదులపై విజిలెన్స్, ఏసీబీ అధికారులు తగని మొహమాటం ప్రదర్శించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే అక్రమాల లోగుట్టు బట్టబయలవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దళారీ దందా టౌన్ప్లానింగ్లో ఆ దళారీ రూటే సెప‘రేటు’. ముఖ్య అధికారిని గుప్పెట్లో పెట్టుకుని కావాల్సిన పనులు చక్కబెట్టుకుంటున్నాడు. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు టౌన్ప్లానింగ్ సెక్షన్లోనే ఆయన పనంతా. పై అధికారి పేరు చెప్పి కిందిస్థాయి ఉద్యోగుల్ని బెదరేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సర్కిల్-3లో ఓ భారీడీల్కు సంబంధించి సంతకం చేయాల్సిందిగా టీపీఎస్ను కోరగా, ఆయన నిరాకరించారు. దీంతో సదరు దళారీ వేరే సర్కిల్ టీ పీఎస్తో సంతకం చేయించి ముఖ్య అధికారితో ఆమోదముద్ర వేయించినట్టు భోగట్టా. ఈ విషయమై ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగిందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. సీన్కట్ చేస్తే.. సర్కిల్-3లో తాము చెప్పిన పనులు చేయడం లేదనే నెపంతో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణను బదిలీ చేయించే కుట్ర సాగుతోంది. దీనికి సంబంధించి ఫైల్ను ముఖ్య అధికారి సిద్ధం చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్కు స్క్రీన్ప్లే దళారీ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో టీపీఎస్ మార్పునకు సంబంధించిన ఫైల్ కమిషనర్ టేబుల్పైకి చేరనున్నట్లు సమాచారం. -
కటాఫ్ డేట్.. జూన్ 2, 2014
అక్రమ కట్టడాలు, లే ఔట్ల క్రమబద్ధీకరణ బీపీఎస్, ఎల్ఆర్ఎస్పై సర్కారు నిర్ణయం! పురపాలక శాఖ నుంచి {పతిపాదనలు కోరిన సీఎంవో గతంతో పోల్చితే క్రమబద్ధీకరణ చార్జీలూ రెట్టింపు హైదరాబాద్: మళ్లీ అక్రమ కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో భవనాలు/లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాల(బీపీఎస్/ఎల్ఆర్ఎస్)ను ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను తాజాగా సీఎం కార్యాలయం ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2 తేదీని అక్రమాల క్రమబద్ధీకరణకు ‘కటాఫ్ డేట్’గా ప్రభుత్వం నిర్ణయించి నట్లు తెలుస్తోంది. అంటే, 2014 జూన్ 1 లోపు నిర్మాణం పూర్తై భవనాలు, లే ఔట్లనే క్రమబద్ధీకరించనున్నారు. ఆ తర్వాత పుట్టుకొచ్చిన అక్రమ కట్టడాలు, లే అవుట్లను కూల్చేయాలా? లేదా? అన్న అంశంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కటాఫ్ డేట్కు ముందు నిర్మితమైన భవనాలు, లే అవుట్లను గుర్తించేందుకు ‘గూగుల్ మ్యాప్స్’ సహాయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంతో పోలిస్తే ఈ సారి క్రమబద్ధీకరణ చార్జీలు దాదాపు రెట్టింపు కానున్నాయి. ఒక్క హైదరాబాద్లోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరిస్తే రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ఇప్పటికే జీహెచ్ఎంసీ తమ వార్షిక బడ్జెట్ అంచనాల్లో పేర్కొంది. నగరంలో దాదాపు 65 వేలకు పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆర్థికంగా కుదేలైన మిగిలిన 67 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం అక్రమాల క్రమబద్ధీకరణ ద్వారా రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే చివరిసారి..: అక్రమ కట్టడాలు, లే అవుట్లను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదని 2002లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయని అధికారవర్గాలు గుర్తించాయి. ఆ ఆదేశాల తర్వాత కూడా.. ఇదే చివరి క్రమబద్ధీకరణలు అంటూ 2007-08లో బీపీఎస్, ఎల్ఆర్ఎస్ను అమలు చేశారు. 2002లో సైతం ‘ఇదే చివరిసారి’ అంటూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గత ప్రభుత్వాల నిర్ణయాలు, హైకోర్టు ఆదేశాల ప్రభావం లేకుండా బీపీఎస్, ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టేందుకు అనువుగా ఏపీ మునిసిపల్ చట్టం, మునిసిపల్ కార్పొరేషన్ల చట్టం, భవన నిర్మాణ నియమావళి, డీటీసీపీ చట్టాలను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా సవరించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. పెండింగ్ దరఖాస్తులు మళ్లీ పరిశీలన ఉమ్మడి రాష్ట్రంలో 2007-08లలో పెండింగ్లో వున్న 57,473 బీపీఎస్, 4,586 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరాలు, పట్టణాల అభివృద్ధికి భారీ ప్రణాళికల అమలుకు కావాల్సిన నిధుల కోసం క్రమబద్ధీకరణ పథకాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. -
క్రమబద్ధీకరణపై నిర్లక్ష్యం
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. గతంలో ఇదే పథకం జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.20 కోట్ల వరకు కురిపించింది. ఈ సారి బీపీఎస్లో పెట్టిన షరతులు, సాంకేతిక నిబంధనల కారణంగా రూ.కోటి కూడా దాటలేదు. ఈ పథకానికి సోమవారంతో గడువు ముగియనుండడంతో స్థానిక సంస్థల ఖజానాలు కాస్త నిండుతాయనుకున్న అధికారుల ఆశలు ఆవిరికానున్నాయి. - జిల్లాలో వెయ్యి దాటని దరఖాస్తులు - బీపీఎస్కు నేటితో ముగియనున్న గడువు చిత్తూరు (అర్బన్): అనుమతుల్లేని భవనాలు, అక్రమకట్టడాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఈ ఏడాది మే 22న ప్రత్యేక ఉత్తర్వులు (జీవో 128)ను జారీ చేసింది. 1985 తరువాత 2014 డిసెంబర్ 31 వరకు నిర్మించిన కట్టడాలకు బీపీఎస్ పథకం అమలు చేస్తూనే పలు నిబంధనల్ని పెట్టింది. బీపీఎస్ దరఖాస్తుల ప్రక్రియ మొత్తం గతంలో ప్రజలు నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి అందచేసేవారు. ఇప్పుడు దరఖాస్తులను ఆన్లైన్లోనే అందజేయాల్సి రావడం, అన్ని పత్రాలను స్కానింగ్ చేసుకున్న తరువాతే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలనడం, దీంతో పాటు ఇంటర్నెట్ బ్యాకింగ్ నుంచి రూ.10 వేలు ప్రాథమికంగా చెల్లించాలని చెప్పడం బీపీఎస్ వనరుల్ని దెబ్బతీసింది. ఇప్పటికే జిల్లాలోని ఆరు మున్సిపాల్టీలు, రెండు కార్పొరేషన్లలో పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీనికి తోడు కార్యాలయాల్లో సరైన కంప్యూటర్లు లేకపోవడం, ఆన్లైన్లో సమస్యలు రావడంతో ప్రజలు మధ్యవర్తుల ద్వారా దరఖాస్తులను అందిస్తూ వచ్చారు. దీనికితోడు అధికారులు సైతం బీపీఎస్పై పెద్దగా ప్రచారం నిర్వహించకపోవడం కూడా ప్రధాన కారణం. ఫలితంగా జిల్లాలో శనివారానికి కేవలం 997 దరఖాస్తులు మాత్రమే బీపీఎస్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ అయ్యాయి. గడుపు పొడిగిస్తారా...? క్రమబద్ధీకరణకు అడ్డుగా ఉన్న కొన్ని నిబంధనల వల్ల దరఖాస్తులు చేసుకోవడం ఆలస్యంగా మారుతున్నట్లు ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంలో పలు సాంకేతిక సమస్యలు కూడా ఉన్నాయి. వీటిన్నింటికీ తోడు జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేసే అధికారులను, సిబ్బందిని గోదావరి పుష్కరాల్లో విధులకు పంపడం బీపీఎస్పై ప్రచారానికి అడ్డుగా నిలిచింది. బీపీఎస్ గడువు పెంచాలనే వాదన ప్రజల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో వేచి చూడాలి. ఇదీ పురో‘గతి’ - చిత్తూరు నగర పాలక సంస్థలో గతంలో బీపీఎస్కు 1,600 దరఖాస్తులు రాగా.. రూ.5 కోట్ల వరకు ఆదాయం లభించింది. ఈ సారి కేవలం 84 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. - తిరుపతి కార్పొరేషన్లో క్రబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు 532. గతంతో పోలిస్తే ఈ సంఖ్య ఆరో వంతు. - మదనపల్లెలో ఇప్పటి వరకు 101 దరఖాస్తులు వచ్చాయి. కానీ పట్టణంలో ఉన్న అక్రమ కట్టడాల సంఖ్య మాత్రం వెయ్యికిపైనే ఉండడం గమనార్హం. - పుంగనూరులో 63, శ్రీకాళహస్తిలో 134, పలమనేరులో 31, నగరిలో 13, పుత్తూరులో 34 దరఖాస్తులు మాత్రమే బీపీఎస్ కింద అందాయి. - జిల్లా మొత్తంలో ఇప్పటి వరకు బీపీఎస్ కింద అందిన - దరఖాస్తులు 992. -
ఆలయ ప్రహరీ కూల్చివేత..ఆందోళన
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలోని మణికొండ ప్రాంతంలో ప్రధాన రహదారి పక్కన ప్రభుత్వ స్థలంలో ఉన్న శివాలయానికి ప్రహరీ, వాణిజ్య షట్టర్లను నిర్మిచారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలంలోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం తహశీల్దారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు ఆలయ ప్రహరీ, వాణిజ్య షట్టర్లను కూల్చివేశారు. కాగా, కూల్చివేతలను వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల ఆధ్వర్యంలో స్థానికులు ధర్నాకు దిగారు. కూల్చివేసిన వాటిని తిరిగి రెవెన్యూ సిబ్బందే నిర్మింపజేయాలని, అప్పటి వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఆందోళన కారులను రాయదుర్గం పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. -
మూసీపై అక్రమ కట్టడాలు కూల్చివేత
హైదరాబాద్ : చాదర్ఘాట్లో మూసీనది పరిసరాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పలుమార్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు నోటీసులిచ్చినా వినకపోవడంతో అధికారులు కూల్చివేతకు ఉపక్రమించారు. కూల్చివేతలు ప్రారంభించడంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
అక్రమ కట్టడాల కూల్చివేత: ఉద్రిక్తత
కీసర: అక్రమ కట్టడాలపై రంగారెడ్డి జిల్లా కీసర రెవెన్యూ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. మండలంలోని దమ్మాయిగూడ గ్రామం, భవానీనగర్లో ప్రభుత్వ స్థలాల్లోని సుమారు 70 ఆక్రమ నిర్మాణాలను శనివారం జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. కాగా, ఈ కూల్చివేతలను స్థానికులు తీవ్రంగా అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వారికి గ్రామ సర్పంచ్ అనురాధ మద్దతుగా నిలిచారు. ఇక్కడ పేదలు ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారని, నిర్మాణాలను కూల్చవద్దని కోరారు. అయితే, అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని రెవెన్యూ సిబ్బంది సర్పంచ్కు వివరించారు. అనంతరం గట్టి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. -
అక్రమ కట్టడాలపై కొరడా!
అద్దెకు ఇచ్చిన పార్కింగ్ స్థలాలను గుర్తించే పనిలో సిబ్బంది రంగంలోకి దిగిన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం కర్నూలు : నగరంలో నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించేందుకు నగరపాలక సంస్థ రంగం సిద్ధం చేసింది. నగరంలో అడ్డగోలు నిర్మాణాలపై ‘అంతా మాఇష్టం’ శీర్షికన సోమవారం సాక్షి దదిన పత్రికలో ప్రచురితమైన కథనానికి నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు. కమిషనర్ అదేశాలకు మేరకు పట్టణ ప్రణాళిక విభాగం అధికారి వీరారెడ్డి నేతృత్వంలో ఓ బృందం మంగళవారం నగరంలో విస్తృతంగా పర్యటించింది. పలుచోట్ల అక్రమ భవన నిర్మాణ పనుల్ని ఈ బృంద సభ్యులు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ-క్యాంపు సమీపంలో ఆర్అండ్బీ క్వార్టర్ను కూల్చివేసి ఆ స్థలంలో కొత్తగా చేపట్టిన అక్రమ నిర్మాణ పనుల్ని టౌన్ప్లానింగ్ అధికారి శాస్త్రితోపాటు ఇతర అధికారులు పరిశీలించారు. ఆ స్థలంలో నిర్మాణ పనులకు సంబంధించి రోడ్లు, భవనాల శాఖ ఎలాంటి నిరభ్యంతర పత్రం ఇవ్వలేదు. అయితే, ఆ స్థలానికి కర్నూలు తహశీల్దారు కార్యాలయం నుంచి తాత్కాలిక పట్టా ఇవ్వడం.. దాని ఆధారంగా గతంలో నగరపాలక సంస్థలో బిల్డింగ్ ప్లాన్కు అనుమతి కోరగా.. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితి కొనసాగించాలని స్టే ఇచ్చారు. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇదే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసురావడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు నిర్మాణ దారున్ని తీవ్రంగా హెచ్చరించారు. ఎలాంటి పనులు చేపట్టొద్దని, నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి.. పనుల్ని నిలిపివేశారు. ఇక పార్కింగ్ స్థలాలను అద్దెకు ఇచ్చిన వాణిజ్య సముదాయాల్ని గుర్తించే పనిలో పట్టణ ప్రణాళిక సిబ్బంది నిమగ్నమైంది. ఈ విషయంపై సిటీప్లానర్ వీరారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నగరంలో అనధికారిక కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్కింగ్ స్థలాల్ని ఇతరత్రా వాటికి వినియోగిస్తున్న బిల్డర్లకు, యాజమానులకు నోటీసులు జారీ చేయనున్నామని చెప్పారు. ఫంక్షన్హాళ్లలోనూ ఫైర్సేప్టీ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని, పార్కింగ్ సదుపాయం కల్పించాలని పేర్కొంటూ వారికి ఇది వరకే నోటీసులు జారీ చేశామని, నేటికీ వాటిని ఏర్పాటు చేయని ఫంక్షన్హాళ్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పార్కింగ్ స్థలాల్ని ఆక్రమించిన వారిని వారంలోగా ఖాళీ చేయిస్తామని ఆయన వివరించారు. -
‘లెక్క’ల కాలం
రూ.1000 కోట్ల ఆదాయమే లక్ష్యం భవనాల క్రమబద్ధీకరణపై చర్చ నివేదిక తయారీలో అధికారుల నిమగ్నం పార్కింగ్పై నో రాజీ? సిటీబ్యూరో: నగరంలో భవనాల క్రమబద్ధీకరణ పథకం (బీఆర్ఎస్) అమలు దిశగా జీహెచ్ఎంసీ అడుగులు వేస్తోంది. తమ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉంటాయి? తద్వారా ఖజానాకు ఎంత ఆదాయం రావచ్చనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. భవనాల క్రమబద్ధీకరణ విధి విధానాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసే పనిలో పడ్డారు. ఇటీవల ఒక టీవీ చానెల్లో ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ వారి ప్రశ్నలకు స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో భవనాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అధికారులు దీనిపై లెక్కలు వేస్తున్నారు. గతంలో ఇదే కార్యక్రమాన్ని బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్) పేరుతో అమలు చేసిన సంగతి తెలిసిందే. 2007లో ప్రారంభమైన ఆ పథకం 2013 వరకు కొనసాగింది. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.868 కోట్ల ఆదాయం లభించింది. ఆ పథకాన్ని అమలు చేసేటప్పుడే భవిష్యత్తులో ఇంకెప్పుడూ బీపీఎస్కు అవకాశమివ్వబోమని ప్రభుత్వం హైకోర్టుకు లిఖితపూర్వకంగా తెలిపింది. దాని వల్లనో, ఇతరత్రా కారణాలతోనో... ఈ పథకాన్ని బీఆర్ఎస్గా సీఎం ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదాయం కోసమే...? బీపీఎస్ గడువు ముగిశాక కూడా అక్రమ నిర్మాణాలు ఆగలేదు. వివిధ కారణాలతో వీటికి అడ్డుకట్ట వేయలేకపోయారు. అలాంటి అక్రమ నిర్మాణాలు 60 వేల నుంచి లక్షన్నర వరకు ఉండవచ్చునని టౌన్ ప్లానింగ్ అధికారుల అంచనా. వాటి ద్వారా వీలైనంత ఆదాయాన్ని పొందడంతో పాటు... భవిష్యత్లో అక్రమ నిర్మాణాలు లేకుండా చూడాలనేది ప్రభుత్వ యోచన. బీపీఎస్ కంటే అధిక మొత్తంతో క్రమబద్ధీకరణ ఫీజులు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. గ్రేటర్లో చేపట్టనున్న ఎక్స్ప్రెస్వేలు, స్కైవేలు, మల్టీలెవెల్ గ్రేడ్సెపరేటర్లకు అవసరమైన నిధులు బీఆర్ఎస్ ద్వారా పొందవచ్చని యోచిస్తున్నారు. అయితే... అంత ఆదాయం రావడం కష్టమని కొందరు టౌన్ప్లానింగ్ నిపుణులు చెబుతున్నారు. అధికారులు అంచనా వేసినంత భారీగా అక్రమ నిర్మాణాలు ఉండకపోవచ్చనేది వారి అభిప్రాయం. 2008 నుంచి మార్ట్గేజ్(తనఖా) నిబంధన అమలు చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తేనేఓసీ జారీ చేస్తున్నారు. లేనిపక్షంలో తనఖా పెట్టుకున్న భవనంలోని కొంతభాగాన్ని విడుదల చేయడం లేదు. దీనివల్ల చాలా వరకు అక్రమ నిర్మాణాలు ఆగాయనేది వారి ఆలోచన. ఓసీ పొందాక అదనపు అంతస్తులు నిర్మించినవారు, డీవియేషన్లకు పాల్పడ్డ వారు భారీగా ఉన్నారని... వారిని దృష్టిలో పెట్టుకుంటే మరో రూ.800 కోట్లు రాగలవని అధికారుల అభిప్రాయం. ఈ అంశాన్ని కూడా వారు నివేదికలో పొందుపరిచే వీలుంది. పార్కింగ్కు మినహాయింపు లేదు పార్కింగ్ ప్రదేశాల్లోని ఉల్లంఘనలను మాత్రం బీఆర్ఎస్కు అనుమతించవద్దనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతరత్రా ఉల్లంఘనలను అనుమతించినా... నగరంలోని పరిస్థితుల దృష్ట్యా పార్కింగ్ ప్రదేశం విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని అంశాలతో నివేదిక అందించి... ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలకు సిద్ధం కానున్నారు. -
అక్రమ నిర్మాణాలు కూల్చివేత
హైదరాబాద్: తుకారం గేట్ సమీపంలో దేవాలయ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను శనివారం ఉదయం అధికారులు కూల్చి వేశారు. ఈ సందర్భంగా నివాసితులు అధికారులతో వాగ్విదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇక స్వాధీనమే
అక్రమ నిర్మాణాల అడ్డుకట్టకు ప్రభుత్వ యోచన మరోసారి తెరపైకి బీపీఎస్ రూ.250 కోట్ల ఆదాయంపై దృష్టి అక్రమ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం హెచ్చరించడం... ఒక్కోసారి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడం... దీన్ని సాకుగా తీసుకొని అక్రమార్కులు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించడం... ఇదీ ఇప్పటి వరకూ మనం చూస్తున్నది. ఇకపై దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటోంది. క్రమబద్ధీకరణలు... కూల్చివేతలకు స్వస్తి చెప్పి... నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని ఏకంగా స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది. సిటీబ్యూరో: ప్రభుత్వ భూముల్లో 125 చదరపు గజాలలోపు నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఉచిత క్రమబద్ధీకరణ... అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలోని వారి నుంచి క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయం సముపార్జనకు యత్నిస్తున్న ప్రభుత్వం...మలిదశలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్) మళ్లీ అమలుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో దశలో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకోని వారి అక్రమ నిర్మాణాలను స్థానిక సంస్థలే స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీని దృష్టిలో పెట్టుకొని ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ ...త రువాత దశలో తెలంగాణ రాష్ట్రమంతటా దీన్ని వర్తింపజేయాలనేది లక్ష్యంగా తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తులకు మోక్షం జీహెచ్ఎంసీలో అనుమతి పొందిన ప్లాన్కు మించి అదనంగా నిర్మాణాలు చేపట్టడం... ఆమోదం పొందకుండానే నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గతంలో బీపీఎస్ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన జీవో 2007 డిసెంబర్ 31న జారీ కాగా... పలుమార్లు పొడిగించారు. అలా 2010 వరకు అవకాశం కల్పించారు. దీనికోసం జీహెచ్ఎంసీకి 2.05 లక్షల దరఖాస్తులు రాగా.... ప్రభుత్వ స్థలాలు, పార్కుల ప్రదేశాల్లో నిర్మించిన 55,901 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. 1,44,353 దరఖాస్తులు బీపీఎస్ నిబంధనల మేరకు ఉండడంతో భవనాలు క్రమబద్ధీకరించారు. మిగతా దరఖాస్తులకు సంబంధించి అవసరమైన పత్రాలు లేకపోవడం, ఫీజులు చెల్లించకపోవడం, ఇతరత్రా కారణాలతో పెండింగ్లో ఉంచారు. బీపీఎస్ ద్వారా జీహెచ్ఎంసీకి అప్పట్లో దాదాపు రూ.868 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ప్రభుత్వ భూముల్లో భవనాలు నిర్మించుకున్న వారికీ అవకాశం కల్పించడంతో పాటు ఇదే చివరి గడువని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల అప్పట్లో తిరస్కరణకు గురైన వారు క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కలగనుంది. గతంలో అవకాశాన్ని వినియోగించుకోని వారితో పాటు ఆ తర్వాత కొత్తగా వచ్చిన అక్రమ నిర్మాణాలు కలిపి దాదాపు లక్షన్నర వరకు ఉండవచ్చుననే ది అంచనా. వీటితో పాటు ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలు కలిపితే సుమారు రెండు లక్షల దాకా ఉంటాయని భావిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలోనివి కావడంతో గతంలో వచ్చినంత కాకపోయినా రూ. 200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయని టౌన్ ప్లానింగ్ నిపుణుల అంచనా. స్వాధీనమే పరిష్కారమని... భవిష్యత్లో తిరిగి అక్రమ నిర్మాణాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అక్రమ నిర్మాణాల క్రమబద్ధీక రణకు ఇదే చివరి అవకాశంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే... నిబంధనలు ఉల్లంఘించినంత మేరకు భవనంలోని భాగాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోనుంది. అలా స్వాధీనం చేసుకున్న వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించడమో లేక వేలం ద్వారా విక్రయించడమో చేయాలనే దిశగా సమాలోచనలు జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి అవసరమైన చట్ట సవరణ, నిబంధనలపై ఉన్నతస్థాయి అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు అక్రమంగా వెలసిన నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తుండటం తెలిసిందే. తద్వారా ఎంతో సంపద నష్టం కావడమే కాక... కొంతకాలానికి తిరిగి వెలుస్తున్నాయి. కొత్తగా అమల్లోకి తేనున్న ‘స్వాధీనం’ యోచనతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది ఒకఅంతస్తుకు అనుమతి పొంది.. రెండు, మూడంతస్తులు.... నాలుగంతస్తుల వరకు అనుమతి ఉంటే అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇలాంటి అదనపు అంతస్తులను స్వాధీనం చేసుకోవడం వల్ల అక్రమాలు పునరావృతం కావని భావిస్తున్నారు. దీనివల్ల జీహెచ్ఎంసీకి వచ్చే రాబడి కంటే ప్రజలు అక్రమాల జోలికే వెళ్లకుండా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. బీపీఎస్.. దరఖాస్తులు.. పరిష్కారం 2007 డిసెంబర్ 31న బీపీఎస్కు సంబంధించిన జీవోను ప్రభుత్వం వెలువరించింది. 2007 డిసెంబర్ 15 కన్నా ముందు నిర్మించిన అక్రమ భవనాలకే ఇది వర్తిస్తుంది. బీపీఎస్ కోసం జీహెచ్ఎంసీకి అందిన మొత్తం దరఖాస్తులు: 2,05,006 పరిష్కారమైనవి: 1,44,353 తిరస్కరించినవి: 55,901 బీపీఎస్ ద్వారా జీహెచ్ఎంసీకి వచ్చిన ఆదాయం: రూ.868.87 కోట్లు బీపీఎస్కు ముగింపు పలికింది: 31 మే 2013 -
నిర్మాణాలకు అనుమతి తప్పనిసరి
నగరంలోని కబ్జారాయుళ్ల ఆట కట్టించడంతో పాటు అక్రమ నిర్మాణాలకు తావులేకుండా పటిష్ట చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్రమ నిర్మాణ దారులపై ఉక్కుపాదం మోపడమే కాకుండా భవిష్యత్లో ఇలాంటి వాటికి తావులేకుండా నిబంధనలు రూపొందించనున్నారు. అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... నగరంలో ఇకపై ఎలాంటి నిర్మాణాలకైనా జీహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావాలన్నారు. పర్యావరణపరమైన అనుమతులు తప్పనిసరి చేసేందుకు నిబంధనలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కబ్జాదారులను కఠినంగా శిక్షించేందుకు పటిష్టమైన చట్టాలు తెస్తామన్నారు. వాతావరణ సమతుల్యతకు ప్రాధాన్యమివ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. నగరంలోని 60 వేల ఎకరాల అటవీ భూములను గుర్తించి, అందమైన ఉద్యానవనాలుగా తీర్చిదిద్దాలన్నారు. పార్కులతో పాటు రిజర్వు ఫారెస్ట్, గ్రీన్ల్యాండ్స్ కబ్జారాయుళ్ల పాలవుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. బొటానికల్ గార్డెన్కు సైతం ఈ ముప్పు రాగా, స్థానికులు పోరాడి కాపాడుకున్నార ని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. పార్కుల పరిరక్షణ కమిటీలు పార్కుల స్థలాన్ని పరిరక్షించేందుకు, వాటిని వాతావరణ సమతుల్యాన్ని కాపాడే సాధనాలుగా మలచుకోవడానికి సిటిజన్ కమిటీలు నియమించాల్సిందిగా సీఎం సూచించారు. ఎన్నో నగరాలు తగిన స్థలం లేక కొట్టుమిట్టాడుతుండగా, హైదరాబాద్లో ఉన్న స్థలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని పెదవి విరిచారు. వాకర్లు, సైక్లిస్టులు, జాగింగ్ చేసేవారికి వేర్వేరు ట్రాక్లతో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతామన్నారు. మూసీనది నుంచి వనస్థలిపురం వరకు వందల ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయని... అవి పార్కుల అభివృద్ధికి, చెట్లు పెంచేందుకు ఉపయోగపడతాయన్నారు. ఏరియల్ సర్వే ద్వారా ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఉందో పరిశీలించి, పార్కుల అభివృద్ధికి గల అవకాశాలను పరిశీలిస్తానని చెప్పారు.