Indian womens cricket team
-
‘పునరాగమనం చేస్తా’
న్యూఢిల్లీ: దాదాపు ఐదేళ్ల పాటు భారత మహిళల క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్గా పలు విజయాల్లో భాగంగా ఉన్న షఫాలీ వర్మ(Shafali Verma) మూడు నెలల క్రితం టీమ్లో చోటు కోల్పోయింది. ముందుగా ఆస్ట్రేలియాతో, ఆపై స్వదేశంలో వెస్టిండీస్, ఐర్లాండ్లతో సిరీస్లకు కూడా ఆమెను ఎంపిక చేయలేదు. అయితే ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో చెలరేగిన షఫాలీ పరుగుల వరద పారించింది. సీనియర్ వన్డే చాలెంజర్ టోర్నీలో 5 మ్యాచ్లలోనే 82.80 సగటుతో 414 పరుగులు సాధించింది. ఇదే జోరులో తాను భారత జట్టులోకి పునరాగమనం చేస్తాని షఫాలీ విశ్వాసం వ్యక్తం చేసింది. ‘గత కొన్ని నెలలు నా జీవితంలో కఠినంగా గడిచాయి. నాన్నకు అనూహ్యంగా గుండెపోటు వచ్చిన రెండు రోజులకే టీమ్లో స్థానం కోల్పోయాను. మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డా. అయితే నా కుటుంబం నాకు అండగా నిలిచి ప్రోత్సహించింది. అందుకే మళ్లీ మైదానంలో పట్టుదలగా ఆడగలిగా. నాకు అవకాశం వచ్చిన ప్రతీసారి భారీగా పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టా. అందు కోసం పట్టుదలగా సిద్ధం కావడమే నేను చేయగలిగింది. ఇలాగే ప్రాక్టీస్ కొనసాగించి పరుగులు సాధిస్తే తిరిగి భారత జట్టులో రాగలను’ అని షఫాలీ వ్యాఖ్యానించింది. డబ్ల్యూపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షఫాలీ ప్రస్తుతం సన్నాహకాల్లో ఉంది. సీజన్ ఆరంభానికి ముందు క్యాపిటల్స్ నిర్వహిస్తున్న ప్రత్యేక క్యాంప్లో ఆమె పాల్గొంటోంది. డబ్ల్యూపీఎల్ మ్యాచ్ల ద్వారా ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో తాను నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ‘డబ్ల్యూపీఎల్లో ప్లేయర్లకు ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుంది. ఆటలో స్వల్ప మార్పులు కూడా చేసుకోవచ్చు. వ్యక్తిగతంగా చూస్తే ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో నేర్చుకోగలిగాను. అనుభవజు్ఞలైన విదేశీ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం రావడం ఎంతో మేలు చేస్తుంది. మైదానంలో కీలక సమయాల్లో, మైదానం బయట కూడా ప్రశాంతంగా ఎలా ఉండవచ్చో వారిని చూస్తే తెలుస్తుంది. తాజా సీజన్ కోసం మా జట్టు సన్నాహాలు చాలా బాగా సాగుతున్నాయి’ అని షఫాలీ పేర్కొంది. డబ్ల్యూపీఎల్ రెండు సీజన్లలో కూడా ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ సాధించడంలో మాత్రం విఫలమైంది. -
భారత జట్టు తరపున అరంగేట్రం.. ఎవరీ సయాలీ గణేష్?
రాజ్కోట్ వేదికగా భారత మహిళల జట్టు తొలి వన్డేలో ఐర్లాండ్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హర్మాన్ ప్రీత్ కౌర్ గైర్హజరీలో స్మతి స్మృతి మంధాన భారత జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తోంది. ఇక ఈ మ్యాచ్తో ముంబైకి చెందిన ఆల్రౌండర్ సయాలీ సత్ఘరే గణేష్ భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కెప్టెన్ స్మతి స్మృతి మంధాన చేతుల మీదగా ఆమె ఇండియా క్యాప్ను అందుకుంది. ఈ క్రమంలో నెటిజన్లు ఎవరీ సయాలీ అని వెతుకుతున్నారు.ఎవరీ సయోలీ?24 ఏళ్ల సయోలీ సత్ఘరే దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తోంది. 2015లో అరంగేట్రం చేసిన ఆమె.. అప్పటినుంచి నిలకడగా రాణిస్తోంది. అయితే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. గతేడాది డబ్ల్యూపీఎల్లో గుజరాత్ జెయింట్స్కు ఆమె ప్రాతినిథ్యం వహించింది. ఆ సీజన్లో తొలుత ఆమె చాలా మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైంది.కానీ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో మాత్రం సయోలీకి సువర్ణ అవకాశం లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో డి హేమలతకు కంకషన్ సబ్స్టిట్యూట్గా ఆమె బరిలోకి దిగింది. ఆ మ్యాచ్లో ఆమె పర్వాలేదన్పించింది. దీంతో డబ్ల్యూపీఎల్-2025 సీజన్కు ముందు గుజరాత్ ఆమెను రూ.10 లక్షలకు రిటైన్ చేసుకుంది. సయోలీ సత్ఘరే అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది.దేశీవాళీ క్రికెట్లో అదుర్స్..లిస్ట్-ఎ క్రికెట్లో ఇప్పటివరకు 51 మ్యాచ్లు ఆడిన సయోలీ.. 20.81 సగటుతో 666 పరుగులు, 56 వికెట్లు పడగొట్టింది. 2023–24 సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పై ఆమె ఆజేయ సెంచరీతో మెరిసింది. బౌలింగ్లో 7/5 స్పెల్ అత్యుత్తమ గణాంకాలుగా ఉన్నాయి.తుది జట్లుభారత మహిళల జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, తేజల్ హసబ్నిస్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, సయాలీ సత్ఘరే, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధుఐర్లాండ్ మహిళల జట్టు: సారా ఫోర్బ్స్, గాబీ లూయిస్(కెప్టెన్), ఉనా రేమండ్-హోయ్, ఓర్లా ప్రెండర్గాస్ట్, లారా డెలానీ, లేహ్ పాల్, కౌల్టర్ రీల్లీ(వికెట్ కీపర్), అర్లీన్ కెల్లీ, జార్జినా డెంప్సే, ఫ్రెయా సార్జెంట్, ఐమీ మాగైర్ -
ఐర్లాండ్తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్కు నో ఛాన్స్
వెస్టిండీస్తో జరిగిన టీ20, వన్డే సిరీస్లను సొంతం చేసుకున్న భారత మహిళల జట్టు మరో స్వదేశీ పోరుకు సిద్దమైంది.ఐర్లాండ్ మహిళల జట్టుతో మూడు వన్డేల సిరీస్లో భారత్ తలపడేందుకు భారత్ సిద్దమైంది. జనవరి 10న రాజ్కోట్ వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఈ క్రమంలో ఐరీష్తో వన్డే సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్కు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. దీంతో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్గా ఎంపికైంది. అదే విధంగా మరో సీనియర్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ కూడా ఈ వన్డే సిరీస్కు దూరమైంది.కాగా మరోసారి స్టార్ ప్లేయర్ షెఫాలీ వర్మకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. షెఫాలీ వర్మ ప్రస్తుతం దేశీవాళీ క్రికెట్లో దుమ్ము లేపుతున్నప్పటికి సెలక్టర్లు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. కాగా విండీస్తో సిరీస్లో ఆడిన ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్లు.. ఐరీష్ సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు.ఐర్లాండ్ సిరీస్కు భారత మహిళల జట్టు ఇదే: స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్, సయాలీ సత్ఘరే -
చరిత్ర సృష్టించిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
వడోదర వేదికగా వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డేలో 115 పరుగుల తేడాతో భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పరుగులు వరద పారించారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (103 బంతుల్లో 115; 16 ఫోర్లు) కెరీర్లో తొలి సెంచరీ సాధించగా... జోరుమీదున్న ఓపెనర్ స్మృతి మంధాన (53; 7 ఫోర్లు, 2 సిక్స్లు), మరో ఓపెనర్ ప్రతీక రావల్ (76; 10 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు సాధించింది. తద్వారా వన్డేల్లో భారత్ తమ అత్యధిక స్కోరును సమం చేసింది. 2017లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ భారత జట్టు 358 పరుగులే సాధించింది. అంతేకాకుండా మరో అరుదైన రికార్డు కూడా భారత్ తమ ఖాతాలో వేసుకుంది.తొలి జట్టుగా..మహిళల వన్డే క్రికెట్లో వెస్టిండీస్పై అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉండేది. 2011లో లీసెస్టర్ వేదికగా విండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో ఇంగ్లీష్ జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో ఇంగ్లండ్ ఆల్టైమ్ రికార్డును మన అమ్మాయిలు బ్రేక్ చేశారు.మాథ్యూస్ సెంచరీ వృథా..359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్, కెప్టెన్ హేలీ మాథ్యూస్ (109 బంతుల్లో 106; 13 ఫోర్లు) శతకం సాధించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 3, దీప్తి శర్మ, టిటాస్, ప్రతీక తలా 2 వికెట్లు తీశారు. కాగా ఇరు జట్ల మధ్య మూడో వన్డే డిసెంబర్ 27న ఇదే వేదికలో జరగనుంది.చదవండి: IND vs AUS: ఆసీస్తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్? -
రెండో వన్డేలో వెస్టిండీస్ చిత్తు.. సిరీస్ భారత్ సొంతం
వడోదర వేదికగా వెస్టిండీస్ మహిళలతో జరిగిన రెండో టెస్టులో 115 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో భారత అమ్మాయిలు కైవసం చేసుకున్నారు.డియోల్ సూపర్ సెంచరీ.. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్(103 బంతుల్లో 115, 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. ప్రతికా రావల్(76), రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు.హర్లీన్ డియోల్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. కాగా వన్డేల్లో భారత్ 350కిపైగా స్కోరు చేయడం ఇది రెండోసారి. 2022లో ఐర్లాండ్పై కూడా సరిగ్గా 358/5 స్కోరు చేసింది. ఇక విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్, జైదా జేమ్స్, క్వినా జోసెఫ్, డాటిన్ తలో వికెట్ తీశారు.మాథ్యూస్ ఒంటరి పోరాటం..అనంతరం భారీ లక్ష్య చేధనలో వెస్టిండీస్ మహిళల జట్టు 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ హీలీ మథ్యూస్ విరోచిత పోరాటం కనబరిచింది. మథ్యూస్ సూపర్ సెంచరీతో చెలరేగింది. 109 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మాథ్యూస్ 106 పరుగులు చేసింది.అయితే మిగితా బ్యాటర్ల నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో విండీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. దీప్తీ శర్మ, ప్రతికా రావల్,టిటాస్ సాదు తలా రెండు వికెట్లు సాధించారు. -
భారత బ్యాటర్ల ఊచకోత.. ఏకంగా 358 పరుగులు
వడోదర వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు జూలు విదిల్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మన అమ్మాయిలు ఆకాశమే హద్దుగా చెలరేగారు.విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన(Smriti Mandhana), ప్రతికా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన బ్యాటర్లు తమపని తాము చేసుకుపోయారు.భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్(103 బంతుల్లో 115, 16 ఫోర్లు) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. ప్రతికా రావల్(76), రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీలతో మెరిశారు. హర్లీన్ డియోల్కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం. ఇక విండీస్ బౌలర్లలో డొటిన్, ఫ్లెచర్, జేమ్స్, జోషఫ్ తలా వికెట్ సాధించారు. కాగా వన్డేల్లో భారత మహిళ జట్టు 358 పరుగులు చేయడం ఇది రెండో సారి. అదనంగా మరో పరుగు చేసి ఉంటే భారత్కు అత్యధిక వన్డే స్కోర్ను నెలకొల్పేది. గతంలో 2017లో ఐర్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.చదవండి: WI vs PAK: వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడికి చోటు -
స్మృతి మంధాన ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్గా
భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో అదరగొట్టిన మంధాన.. స్వదేశంలో వెస్టిండీస్ మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్లోనూ అదే దూకుడు కనబరిచింది. తొలి రెండు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన మంధాన.. గురువారం జరిగిన ఆఖరి టీ20లోనూ తన బ్యాట్కు పనిచెప్పింది. ఈ మ్యాచ్లో స్మృతి విధ్వంసం సృష్టించింది. కేవలం 47 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్తో 77 పరుగులు చేసింది. ఈ క్రమంలో మంధాన పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకుంది.మంధాన సాధించిన రికార్డులు ఇవే..👉మహిళా క్రికెట్లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన ప్లేయర్గా మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన ఇప్పటివరకు తన టీ20 కెరీర్లో 30 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ వెటరన్ సుజీ బేట్స్(29) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో బేట్స్ ఆల్టైమ్ రికార్డును మంధాన బ్రేక్ చేసింది.అత్యధిక పిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్లు వీరే..స్మృతి మంధాన (భారత్) -30సుజీ బేట్స్ (న్యూజిలాండ్)- 29బెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 25స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్)- 22సోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 22👉అదే విధంగా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 పరుగులు సాధించిన క్రికెటర్గా సైతం మంధాన రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాది 21 టీ20 ఇన్నింగ్స్లలో స్మృతి 763 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్లు (720 పరుగులు) పేరిట ఉండేది. -
భారత మహిళల ‘రికార్డు’ విజయం
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు ప్రదర్శనతో వెస్టిండీస్తో జరిగిన టి20 సిరీస్ను సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్లో, ఆపై బౌలింగ్లో చెలరేగిన భారత్ 60 పరుగుల తేడాతో విండీస్ మహిళల జట్టుపై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను 2–1తో గెలుచుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (47 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ రిచా ఘోష్ (21 బంతుల్లో 54; 3 ఫోర్లు, 5 సిక్స్లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా... జెమీమా రోడ్రిగ్స్ (28 బంతుల్లో 39; 4 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (22 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు చేసింది. చినెల్ హెన్రీ (16 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, రాధ యాదవ్కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం వడోదరలో తొలి వన్డే జరుగుతుంది. మెరుపు బ్యాటింగ్... తొలి ఓవర్లోనే ఉమా ఛెత్రి (0) అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి విండీస్ బౌలర్లపై చెలరేగారు. హెన్రీ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన స్మృతి... డాటిన్ వేసిన తర్వాతి ఓవర్లో 3 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. కరిష్మా ఓవర్లో జెమీమా 3 ఫోర్లు సాధించడంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 61 పరుగులకు చేరింది. 27 బంతుల్లో ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. రెండో వికెట్కు జెమీమాతో 98 పరుగులు (55 బంతుల్లో), మూడో వికెట్కు రాఘ్వీతో 44 పరుగులు (27 బంతుల్లో) జోడించిన తర్వాత స్మృతి వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత వచి్చన రిచా విరుచుకుపడింది. తన తొలి మూడు బంతులనే 6, 4, 4గా మలచిన ఆమె హేలీ ఓవర్లో వరుసగా 2 సిక్స్లు బాదింది. అలీన్ బౌలింగ్లో మరో భారీ సిక్స్తో 18 బంతుల్లో రిచా రికార్డు హాఫ్ సెంచరీని అందుకుంది. ఛేదనలో విండీస్ బ్యాటర్లంతా తడబడ్డారు. అసాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. హెన్రీ కొద్దిగా పోరాడటం మినహా మిగతా వారంతా విఫలం కావడంతో విజయానికి జట్టు చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) హెన్రీ (బి) డాటిన్ 77; ఉమా ఛెత్రి (సి) జోసెఫ్ (బి) హెన్రీ 0; జెమీమా (ఎల్బీ) (బి) ఫ్లెచర్ 39; రాఘ్వీ బిస్త్ (నాటౌట్) 31; రిచా ఘోష్ (సి) హెన్రీ (బి) అలీన్ 54; సజన (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–1, 2–99, 3–143, 4–213. బౌలింగ్: చినెల్ హెన్రీ 2–0–14–1, డాటిన్ 4–0–54–1, హేలీ మాథ్యూస్ 4–0–34–0, కరిష్మా 3–0–44–0, అలీన్ 4–0–45–1, ఫ్లెచర్ 3–0–24–1. వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) సజన (బి) రాధ 22; ఖియానా జోసెఫ్ (సి) టిటాస్ సాధు (బి) సజన 11; డాటిన్ (సి) రాధ (బి) టిటాస్ సాధు 25; క్యాంప్బెల్ (సి) స్మృతి (బి) దీప్తి 17; చినెల్ హెన్రీ (సి) రాఘ్వీ (బి) రేణుక 43; క్రాఫ్టన్ (రనౌట్) 9; అలీన్ (బి) రాధ 6; షబిక (సి) సజన (బి) రాధ 3; జైదా (సి) రిచా (బి) రాధ 7; ఫ్లెచర్ (నాటౌట్) 5; కరిష్మా (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–20, 2–57, 3–62, 4–96, 5–129, 6–136, 7–137, 8–142, 9–147. బౌలింగ్: రేణుకా సింగ్ 3–0–16–1, సజీవన్ సజన 2–0–16–1, సైమా ఠాకూర్ 4–0–33–0, టిటాస్ సాధు 3–0–31–1, రాధ యాదవ్ 4–0–29–4, దీప్తి శర్మ 4–0–31–1. 217/4 అంతర్జాతీయ టి20ల్లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇదే ఏడాది యూఏఈపై సాధించిన 201/5 స్కోరును భారత్ అధిగమించింది. 18 హాఫ్ సెంచరీకి రిచా తీసుకున్న బంతులు. సోఫీ డివైన్, లిచ్ఫీల్డ్ పేరిట వేగవంతమైన అర్ధసెంచరీ రికార్డును రిచా సమం చేసింది. 30 స్మృతి మంధాన అర్ధ సెంచరీల సంఖ్య. సుజీ బేట్స్ (29)ను అధిగమించి అగ్ర స్థానానికి చేరింది.763 ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో స్మృతి చేసిన పరుగులు. క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా చమరి అటపట్టు (720) రికార్డును స్మృతి సవరించింది. -
ఆసియా కప్-2024కు భారత జట్టు ప్రకటన.. తెలుగు ప్లేయర్లకు చోటు
న్యూఢిల్లీ: జూనియర్ మహిళల ఆసియా కప్లో పాల్గొననున్న భారత అండర్–19 జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష, కేసరి ధృతి, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ చోటు దక్కించుకున్నారు. కౌలాలాంపూర్ వేదికగా ఈ నెల 15 నుంచి 22 వరకు జూనియర్ మహిళల ఆసియా కప్ జరగనుంది.సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. నికీ ప్రసాద్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా... సనికా చాల్కె వైస్ కెపె్టన్గా వ్యవహరించనుంది. అండర్–19 ప్రపంచకప్లో ఆడిన అనుభవం ఉన్న త్రిషతో పాటు మహిళల ఐపీఎల్లో గుజరాత్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న షబ్నమ్ ఇందులో చోటు దక్కించుకున్నారు.నలుగురు స్టాండ్బై ఆటగాళ్లను ప్రకటించగా... అందులో తెలంగాణ అమ్మాయి గుగులోత్ కావ్యశ్రీ కూడా ఉంది. ఈ టోరీ్నలో పాకిస్తాన్, నేపాల్తో కలిసి భారత్ జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి పోటీ పడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేసియా గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. టోర్నీ ఆరంభ పోరులో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత జట్టు తలపడుతుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సూపర్–4కు అర్హత సాధించనున్నాయి. అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ నెల 22 జరగనున్న ఫైనల్లో తలపడనున్నాయి. భారత జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సనికా చాల్కె (వైస్ కెపె్టన్), గొంగడి త్రిష, కమలిని, భావిక అహిరె, ఈశ్వరి అవాసరె, మిథిలా వినోద్, జోషిత, సోనమ్ యాదవ్, పరుణిక సిసోడియా, కేసరి ధృతి, ఆయుషి శుక్లా, అనందిత కిషోర్, షబ్నమ్, నందన. స్టాండ్బైలు: హర్లీ గాలా, హ్యాపీ కుమారి, గుగులోత్ కావ్యశ్రీ, గాయత్రి. -
ఆస్ట్రేలియా బ్యాటర్ల ఊచకోత.. భారత్ ముందు భారీ టార్గెట్
ఆస్ట్రేలియాలో భారత మహిళా జట్టు బౌలర్ల వైఫల్యం కొనసాగుతోంది. పెర్త్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సైతం భారత బౌలర్లు తీవ్ర నిరాశపరిచారు. మన బౌలర్లను ఆసీస్ బ్యాటర్లు ఉతికారేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ఆసీస్ బ్యాటర్లలో అన్నాబెల్ సదర్లాండ్(95 బంతుల్లో 110, 9 ఫోర్లు, 4 సిక్స్లు) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. గార్డనర్(50), కెప్టెన్ మెక్గ్రాత్(56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో ఒక్క అరుంధతి రెడ్డి మినహా మిగతా అందరూ తీవ్ర నిరాశపరిచారు. అరుంధతి తన 10 ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. కాగా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఘోర ఓటమి చవిచూసిన భారత జట్టు 2-0 తేడాతో సిరీస్ను ఆస్ట్రేలియాకు అప్పగించేసింది. కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలిచి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని హర్మాన్ సేన భావిస్తోంది. ఇప్పుడు ఆ భారమంతా భారత బ్యాటర్లపైనే ఉంది. -
ఆస్ట్రేలియా అదుర్స్.. ఒకేరోజు టీమిండియాకు రెండు షాక్లు
ఆస్ట్రేలియా గడ్డపై ఒకే రోజు భారత్కు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ పురుషల జట్టు పరాజయం పాలవ్వగా.. మరోవైపు బ్రిస్బేన్లో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో 122 పరుగుల తేడాతో భారత మహిళల టీమ్ ఘోర ఓటమి చవిచూసింది. 372 పరుగుల లక్ష్య చేధనలో భారత అమ్మాయిల జట్టు 44.5 ఓవర్లలో కేవలం 249 పరుగులకే కుప్పకూలింది.భారత బ్యాటర్లలో రిచా ఘోష్(54) టాప్ స్కోరర్గా నిలవగా.. మిన్ను మణి(46), రోడ్రిగ్స్(43), హర్మాన్ ప్రీత్(38) పరుగులతో పర్వాలేదన్పించారు. కానీ ఏ ఒక్క బ్యాటర్ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్లాండ్ 4 వికెట్లతో సత్తాచాటగా.. స్కాట్, కిమ్ గార్త్, గార్డనర్, కింగ్ తలా వికెట్ సాధించారు.పెర్రీ, వాల్ సెంచరీలు..ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 371 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వాల్(87 బంతుల్లో 12 ఫోర్లుతో 101), ఎల్లీస్ పెర్రీ(75 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లు) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు.వీరిద్దరితో పాటు లిచ్ఫీల్డ్(60),బీత్ మూనీ(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక విజయంతో మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 ఆతిథ్య ఆసీస్ సొంతం చేసుకుంది. కాగా ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే పెర్త్ వేదికగా డిసెంబర్ 11న జరగనుంది.చదవండి: ట్రావిస్ హెడ్ అబద్దం చెప్పాడు.. అతడు నన్ను తిట్టాడు: సిరాజ్ -
ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. 100 పరుగులకే టీమిండియా ఆలౌట్
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో భారత మహిళల జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 34.2 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల దాటికి ఇండియా బ్యాటర్లు విల్లవిల్లాడారు.ఉమెన్ ఇన్ బ్లూ ఆఖరి 5 వికెట్లు కేవలం 11 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం. భారత జట్టు బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(23) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతోపాటు హర్లీన్ డియోల్ (19), హర్మన్ ప్రీత్ కౌర్ (17), రిచా ఘోష్ (14) మాత్రమే రెండెంకెల స్కోర్ చేయగల్గారు.మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు. ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్ మెగాన్ స్కాట్ 5 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు కిమ్ గార్త్, గార్డనర్, కింగ్ తలా వికెట్ సాధించారు.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్పై వేటు
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు 16 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అదే విధంగా ఎప్పటిలాగే ఆమెకు డిప్యూటీగా స్మృతి మంధాన వ్యవహరించనుంది.అయితే ఈ జట్టులో భారత స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు చోటు దక్కలేదు. జట్టు ఎంపికకు షఫాలీని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఆమెను పక్కన పెట్టడానికి గల కారణాన్ని అయితే సెలక్టర్లు వెల్లడించలేదు. షెఫాలీ మాత్రం ప్రస్తుతం పెద్దగా ఫామ్లో లేదు.ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో షఫాలీ వర్మ కేవలం 56 పరుగులు మాత్రమే చేసింది. ఆమె వన్డేల్లో హాఫ్ సెంచరీ సాధించి ఏడాది దాటింది. మరోవైపు హర్లీన్ డియాల్, టిటాస్ సాధు తిరిగి జట్టులోకి వచ్చారు. హర్లీన్ చివరగా భారత్ తరపున 2023లో ఆడింది. అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉంటుంది. డిసెంబర్ 5న బ్రిస్బేన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.భారత మహిళల జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రియా పునియా, జెమిమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, టిటాస్ సాధు , అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, సైమా ఠాకూర్ -
వచ్చే నెలలో విండీస్తో భారత మహిళల జట్టు సిరీస్
ముంబై: వచ్చే నెలలో భారత మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్తో 3 వన్డేలు, 3 టి20లు ఆడనుంది. దాంతో పాటు జనవరిలో స్వదేశంలో ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ మూడు సిరీస్ల కోసం బీసీసీఐ బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. డిసెంబర్ 15 నుంచి వెస్టిండీస్ మహిళల జట్టు భారత్లో పర్యటించనుండగా... నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వరుసగా మూడు టి20లు (15న, 17న, 19న) ఆడనుంది. ఆ తర్వాత వడోదరలో డిసెంబర్ 22, 24, 27వ తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది.అనంతరం వచ్చే ఏడాది జనవరి 10, 12, 15న రాజ్కోట్లో ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనుండగా... ఐసీసీ మహిళల చాంపియన్షిప్లో భాగంగా ఈ సిరీస్లు జరగనున్నాయి. -
IND Vs NZ: న్యూజిలాండ్తో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన
మహిళల టి20 ప్రపంచకప్లో నిరాశజనక ప్రదర్శన అనంతరం కూడా ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్కు హర్మన్ప్రీత్ కౌర్ కొనసాగనుంది. తాజా వరల్డ్కప్లో భారత జట్టు గ్రూప్ దశ నుంచే ని్రష్కమించగా... సారథ్య మార్పు అంశం తెరపైకి వచ్చింది. కానీ, సెలెక్టర్లు మాత్రం ప్రస్తుతానికి నాయకత్వ మార్పు జోలికి వెళ్లకుండా హర్మన్పైనే నమ్మకం ఉంచారు. అహ్మదాబాద్లో ఈ నెల 24, 27, 29న జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం సెలెక్షన్ కమిటీ గురువారం 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది.ఇందులో నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు దక్కింది. 12వ తరగతి బోర్డు పరీక్షల నేపథ్యంలో వికెట్ కీపర్ రిచా ఘోష్ను ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. ఆల్రౌండర్ పూజ వ్రస్తాకర్కు విశ్రాంతినివ్వగా... ఆశ శోభనను గాయం కారణంగా పరిగణించలేదు. ఇటీవల ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’జట్టు నుంచి తేజల్ హస్నాబిస్, సయాలీ సత్గారె, ప్రియా మిశ్రాతో పాటు మహిళల ఐపీఎల్లో రాణించిన సైమా ఠాకూర్ తొలిసారి జాతీయ జట్టులోకి వచ్చారు. భారత మహిళల జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, ఉమా ఛెత్రీ, సయాలీ, అరుంధతి రెడ్డి, రేణుక సింగ్, తేజల్ హసాబ్నిస్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్.చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్ -
న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే?
మహిళల టీ20 వరల్డ్కప్-2024 టోర్నీని భారత జట్టు ఘోర ఓటమితో ఆరంభించింది. శుక్రవారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 58 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 102 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో హర్మాన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు.. గ్రూపు-ఎలో న్యూజిలాండ్, పాకిస్థాన్,శ్రీలంక, ఆస్ట్రేలియాతో పాటు కలిసి ఉంది. ప్రస్తుతం టీమిండియా -2.900 రన్రేట్తో గ్రూప్-ఏలో ఆఖరి స్థానంలో ఉంది.సెమీస్ చేరాలంటే?భారత్ సెమీస్ చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీఫైనల్కు ఆర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో ఇంకా భారత్కు మూడు లీగ్ మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఉమెన్ ఇన్ బ్లూ తమ తదుపరి మ్యాచ్ల్లో పాక్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో తలపడనుంది.భారత్ సెమీఫైనల్కు చేరాలంటే తమ తర్వాతి మ్యాచ్ల్లో పాకిస్తాన్, శ్రీలంకను భారీ తేడాతో ఓడించాలి. అప్పుడు భారత్ ఖాతాలో 4 పాయింట్లు చేరడమే కాకుండా రన్ రేట్ కూడా మెరుగుపడుతోంది. ఆ తర్వాత తమ చివరి లీగ్లో మ్యాచ్లో ఆసీస్పై భారత్ సాధారణ విజయం సాధించినా చాలు సెమీఫైనల్కు ఆర్హత సాధించవచ్చు. ఒకవేళ ఆసీస్పై భారత్ ఓడిపోతే.. న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లలోనైనా పరాజయం పొందాలి. అప్పుడు మెరుగైన రన్-రేట్ కారణంగా భారత్కు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. కాగా గ్రూప్-ఏ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ దక్కించుకోవడం దాదాపు ఖాయం. అయితే ఇదే సమయంలో ఆసీస్ మినహా పాక్, శ్రీలంక, న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్ల్లో కనీసం రెండు మ్యాచ్లు అయినా ఓడాలి. అప్పుడే ఈ మూడు జట్ల కంటే భారత్ పాయింట్లు ఎక్కువగా సాధించి సెమీస్లో అడుగు పెడుతోంది.చదవండి: అరంగేట్రంలోనే దుమ్ములేపిన సెహ్వాగ్ కుమారుడు -
న్యూజిలాండ్ కెప్టెన్ సూపర్ ఫిప్టీ.. భారత్ టార్గెట్ ఎంతంటే?
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. వైట్ఫెర్న్స్ కెప్టెన్ సోఫీ డివైన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగింది.36 బంతులు ఎదుర్కొన్న డివైన్.. 7 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు ప్లిమ్మర్(34), బేట్స్(24) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో రేణుకా సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా.. అరుందతి రెడ్డి, శోభనా తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్లో భారత ఫీల్డర్లు చెప్పకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. -
ఈసారి టీ20 వరల్డ్కప్ భారత్దే.. ఆ ఇద్దరే కీలకం: శ్రీశాంత్
మహిళల టీ20 వరల్డ్కప్-2024లో భారత జట్టు తొలి మ్యాచ్కు సిద్దమైంది. శుక్రవారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ మహిళలతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఉమెన్ ఇన్ బ్లూ ఉవ్విళ్లూరుతోంది.ఈ నేపథ్యంలో హర్మన్ సేనను ఉద్దేశించి భారత మాజీ పేసర్ శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టీ20 వరల్డ్కప్ టైటిల్ను కైవసం చేసేకునేందుకు భారత్కు అన్ని విధాలగా అర్హత ఉందని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.వరల్డ్కప్నకు ఎంపిక చేసిన భారత జట్టు అద్బుతంగా ఉంది. టీమ్తో పాటు భారత్కు గొప్ప కోచింగ్ స్టాప్ ఉంది. ముఖ్యంగా హెడ్కోచ్ అమోల్ భాయ్ (ముజుందార్) కోసం ఎంత చెప్పకున్న తక్కవే. అతడొక అద్బుతమైన కోచ్. ఈ సారి అతడి నేతృత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని అనుకుంటున్నా. కోచ్తో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ను నేను చూశాను. తమ జట్టు 100 శాతం ఎఫెక్ట్ పెట్టి ఆడితే ఏ జట్టునైనా ఓడించగలదని ఆమె చెప్పుకొచ్చింది అంటూ శ్రీశాంత్ పేర్కొన్నాడు.ఆ ఇద్దరే కీలకం..ఈ టోర్నీలో భారత్కు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధానలు ఎక్స్ ఫ్యాక్టర్స్(కీలక ఆటగాళ్లగా) మారనున్నారు.హర్మన్ గత కొంత కాలంగా అద్భుతమైన ఫామ్లో ఉంది. ఆమె 2017 వన్డే వరల్డ్కప్లో ఆడిన ఇన్నింగ్స్ మళ్లీ ఈసారి చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. ఆమె ఈ సారి ఏదో మ్యాజిక్తో ముందుకు వస్తుందని నమ్మకం నాకు ఉంది. మరోవైపు స్మృతి మంధాన కూడా సత్తాచాటనుంది. అదేవిధంగా జెమీమా రోడ్రిగ్స్ కూడా అద్భుతమైన ప్లేయర్. వీరుముగ్గరు తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేస్తే భారత్కు తిరిగుండదు అని శ్రీశాత్ చెప్పుకొచ్చాడు. -
దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్..
మహిళల టీ20 వరల్డ్కప్-2024 సన్నాహాల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్ల్లో భారత జట్టు అదరగొట్టింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ప్రత్యర్ధులను భారత్ చిత్తు చేసింది. మంగళవారం దుబాయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ (35 నాటౌట్; 2 ఫోర్లు), రిచా ఘోష్ (36; 2 ఫోర్లు, 2 సిక్స్లు), జెమీమా రోడ్రిగ్స్ (30; 3 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అయబొగా ఖాక 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్(29) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. భారత బౌలర్లలో ఆశా శోభనా రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ, శ్రేయంకా పాటిల్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇక ప్రధాన టోర్నీ ఆక్టోబర్3 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్లో ఆక్టోబర్ 4న న్యూజిలాండ్తో తలపడనుంది.చదవండి: Babar Azam: బాబర్ ఆజం సంచలన నిర్ణయం.. -
యూఏఈతో మ్యాచ్.. భారత జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ
మహిళల ఆసియాకప్-2024లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. యూఏఈ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. భారత జట్టులో మాత్రం ఒక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే వైదొలిగిన స్పిన్నర్ శ్రేయంకా పాటిల్ స్ధానంలో తనుజా కన్వర్ తుది జట్టులోకి వచ్చింది. తనుజా కన్వర్కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ చేతుల మీదగా భారత టీ20 క్యాప్ను కన్వర్ అందుకుంది. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. యూఏఈను కూడా మట్టికరిపించాలని పట్టుదలతో ఉంది.తుది జట్లుభారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, దయాళన్ హేమలత, హర్మన్ప్రీత్ కౌర్(సి), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుకా ఠాకూర్ సింగ్, తనూజా కన్వర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ఈషా రోహిత్ ఓజా(కెప్టెన్), తీర్థ సతీష్(వికెట్ కీపర్), రినిత రజిత్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, ఖుషీ శర్మ, హీనా హాట్చందానీ, వైష్ణవే మహేష్, రితికా రజిత్, లావణ్య కెనీ, ఇంధుజా నందకుమార్ -
ఆసియాకప్లో టీమిండియాకు ఊహించని షాక్..
మహిళల ఆసియాకప్-2024లో భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరమైంది. జూలై 18న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో పాటిల్ గాయపడింది.ఈ మ్యాచ్లో క్యాచ్ను పట్టే ప్రయత్నంతో శ్రేయాంక చేతి వేలికి గాయమైంది. మ్యాచ్ అనంతరం ఆమెను స్కానింగ్ తరలించగా చేతి వేలి విరిగినట్లు నిర్ధారణైంది. ఈ క్రమంలోనే టోర్నీ మధ్యలోనే ఆమె వైదొలిగింది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.కాగా పాక్తో జరిగిన మ్యాచ్లో శ్రేయాంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 3.2 ఓవర్లలో కేవలం 14 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టింది. ఇక ఆమె స్ధానాన్ని మరో యువ స్పిన్నర్ తనూజా కన్వర్తో బీసీసీఐ భర్తీ చేసింది. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ సీజన్లో కన్వర్ తన బౌలింగ్తో అందరని ఆకట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ తరపున 10 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఇక పాకిస్తాన్పై అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ఆదివారం తమ రెండో మ్యాచ్లో యూఏఈతో తలపడనుంది. -
8 జట్లు.. 15 మ్యాచ్లు.. ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇదే?
శ్రీలంక వేదికగా మహిళల ఆసియాకప్-2024కు మరో 24 గంటల్లో తెరలేవనుంది. జూలై 19(శుక్రవారం) దంబుల్లా వేదికగా నేపాల్, యూఏఈ మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. మొత్తం ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 8 జట్లను రెండు గ్రుపులగా విభిజించారు. గ్రూపు-ఎలో భారత్, పాకిస్తాన్, నేపాల్, యూఏఈలు ఉండగా.. బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయ్లాండ్ జట్లు గ్రూప్-బిలో చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో ఆసియాకప్-2024 షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్ తదితర వివరాలను తెలుసుకుందాం.ఆసియాకప్ షెడ్యూల్ ఇదే.. జూలై 19, శుక్రవారం - యూఏఈ వర్సెస్ నేపాల్ - 2:00 PMజూలై 19, శుక్రవారం - భారత్ వర్సెస్ పాకిస్తాన్ - 7:00 PMజూలై 20, శనివారం - మలేషియా వర్సెస్ థాయిలాండ్ - 2:00 PMజూలై 20, శనివారం - శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ - 7:00 PMజూలై 21, ఆదివారం - భారత్ వర్సెస్ యూఏఈ - 2:00 PMజూలై 21, ఆదివారం - పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ - 7:00 PMజూలై 22, సోమవారం - శ్రీలంక వర్సెస్ మలేషియా - 2:00 PMజూలై 22, సోమవారం - బంగ్లాదేశ్ వర్సెస్ థాయిలాండ్ - 7:00 PMజూలై 23, మంగళవారం - పాకిస్తాన్ డ యూఏఈ - 2:00 PMజూలై 23, మంగళవారం - భారత్ వర్సెస్ నేపాల్ - 7:00 PMజూలై 24, బుధవారం - బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా - 2:00 PMజూలై 24, బుధవారం - శ్రీలంక వర్సెస్ థాయిలాండ్ - 7:00 PMజూలై 26, శుక్రవారం - సెమీ-ఫైనల్ 1 - 2:00 PMజూలై 26, శుక్రవారం - సెమీ-ఫైనల్ 2 - 7:00 PMజూలై 28, ఆదివారం - ఫైనల్ - 7:00 PMఆసియాకప్లో పాల్గోనే జట్లు ఇవే.. భారత్: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్ - ట్రావెలింగ్ రిజర్వ్లు: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్థాయిలాండ్: తిపట్చా పుట్టావాంగ్ (కెప్టెన్), సువనన్ ఖియాటో (వాక్), నన్నపట్ కొచరోయెంకై (వాక్), నట్టయా బూచతం, ఒన్నిచా కమ్చోంఫు, రోసెనన్ కానో, ఫన్నితా మాయ, చనిదా సుత్తిరువాంగ్, సులీపోర్న్ లావోమి, కన్యాకోర్న్ ఫొనాంగ్టానా చాపతన్సేన్, సులీపోర్న్ లావోమి, కన్యాకోర్న్ బూంతన్సాన్సన్, చపతన్సేన్, కోరనిత్ సువంచోంరతి, అఫిసర సువంచోంరతిమలేషియా: వినిఫ్రెడ్ దురైసింగం (కెప్టెన్), ఐనా నజ్వా (వికెట్ కీపర్), ఎల్సా హంటర్, మాస్ ఎలిసా, వాన్ జూలియా (వికెట్ కీపర్), అయిన హమీజా హషీమ్, మహిరా ఇజ్జతీ ఇస్మాయిల్, నూర్ అరియానా నాట్యా, ఐస్యా ఎలీసా, అమలిన్ సోర్ఫినా, ధనుశ్రీ ముహునాన్, ఇర్డ్నా బెహనాన్ , నూర్ ఐషా, నూర్ ఇజ్జతుల్ సయాఫికా, సుయాబికా మణివణ్ణన్నేపాల్: ఇందు బర్మా (కెప్టెన్), సీతా రాణా మగర్, రాజమతి ఐరీ, రుబీనా ఛెత్రీ, డాలీ భట్టా, మమతా చౌదరి, కబితా జోషి, కబితా కున్వర్, కృతికా మరాసిని, పూజ మహతో, బిందు రావల్, రోమా థాపా, సబ్నమ్ రాయ్, సంజన ఖడ్కా, (వికెట్ కీపర్)యుఎఈ: ఇషా ఓజా (కెప్టెన్), తీర్థ సతీష్ (వికెట్ కీపర్), ఎమిలీ థామస్, సమైరా ధరణిధర్క, కవిషా ఎగోదాగే, లావణ్య కెనీ, ఖుషీ శర్మ, ఇంధుజా నందకుమార్, రినిత రజిత్, రిషిత రజిత్, వైష్ణవే మహేష్, సురక్షా కొట్టె, హీనా హాట్చందనీ, మెహక్చందనీ, రితికా రజిత్పాకిస్థాన్: నిదా దార్ (కెప్టెన్), ఇరామ్ జావేద్, సాదియా ఇక్బాల్, అలియా రియాజ్, డయానా బేగ్, ఫాతిమా సనా, గుల్ ఫిరోజా, మునీబా అలీ, సిద్రా అమీన్, నజిహా అల్వీ, సయ్యదా అరూబ్ షా, నష్రా సుంధు, తస్మియా రుబాబ్, ఒమైమా సోహైల్, తుబా హసన్ .శ్రీలంక: చమరి అతపత్తు (కెప్టెన్), అనుష్క సంజీవని, హర్షిత సమరవిక్రమ, హాసిని పెరీరా, అమ కాంచన, ఉదేశిక ప్రబోధని, కావ్య కవింది, సుగండికా కుమారి, అచ్చిని కులసూర్య, కవీషా దిల్హరి, విష్మి గుణరత్నే, శనివా గుణరత్నే, శనివాణి సక్షిలా గిమ్హానిబంగ్లాదేశ్: నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), షోర్నా అక్టర్, నహిదా అక్టర్, ముర్షిదా ఖాతున్, షోరిఫా ఖాతున్, రీతు మోని, రుబ్యా హైదర్ ఝెలిక్, సుల్తానా ఖాతున్, జహనారా ఆలం, దిలారా అక్టర్, ఇష్మా తంజిమ్, రబేయా ఖాన్, రుమానా అహ్మద్, సబికున్ అక్టర్, నహర్ జెస్మిన్మహిళల ఆసియా కప్ మ్యాచ్లు స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అదేవిధంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్స్టార్లో కూడా మ్యాచ్లను వీక్షించవచ్చు. -
భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. ఫ్యాన్స్కు ఫ్రీ ఎంట్రీ
మహిళల టీ20 ఆసియా కప్-2024కు శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. జూలై 19న దంబుల్లా వేదికగా యూఏఈ - నేపాల్ మహిళల మధ్య జరగనున్న మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది.టోర్నమెంట్లోని అన్ని మ్యాచ్లకు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలని శ్రీలంక క్రికెట్ నిర్ణయించింది. "మహిళల ఆసియా కప్కు ఆతిథ్యం ఇస్తున్నందకు చాలా సంతోషంగా ఉంది. మహిళల క్రికెట్ ఆదరణ పెంచేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నామని శ్రీలంక క్రికెట్ వైస్ ప్రెసిడెంట్ రవిన్ విక్రమరత్నే తెలిపారు. ఈయనే ఆసియాకప్ టోర్నమెంట్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు.ఇక ఆసియా సింహాల పోరులో భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్లో జూలై 19న దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో దాయాది పాకిస్తాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ ఉచిత ప్రవేశం కల్పించడంతో పెద్ద ఎత్తున ఇరు జట్ల ఫ్యాన్స్ మ్యాచ్ను చూసేందుకు స్టేడియంకు తరలి రానున్నారు. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఎలో భారత్, పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ ఉండగా.. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్,మలేషియా, థాయ్లాండ్ ఉన్నాయి. ఇక ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఆసియాకప్కు భారత మహిళల జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
ఆసియాకప్కు భారత జట్టు ప్రకటన.. పాక్తోనే తొలి మ్యాచ్
మహిళల టీ20 ఆసియా కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మహిళల సెలక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ఈ మల్టీనేషనల్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుండగా.. స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మహిళలతో తలపడుతున్న భారత జట్టునే దాదాపుగా సెలక్టర్లు ఎంపిక చేశారు. శ్రేయాంక పాటిల్, సజన సజీవన్, ఆశా శోభన వంటి క్రికెటర్లను సెలక్టర్లు కొనసాగించారు. ఇక ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూపు-ఎలో పాకిస్తాన్, యూఏఈ, నేపాల్తో పాటు ఉంది. భారత్ తమ తొలి మ్యాచ్లో జూలై 19న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది. అనంతరం హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు జూలై 21న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత తమ చివరి గ్రూపు మ్యాచ్లో జూలై 23న నేపాల్తో భారత్ తలపడనుంది. కాగా శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నఈ టోర్నీ జూలై 19న యూఏఈ -నేపాల్ మ్యాచ్తో ప్రారంభం కానుంది.ఆసియాకప్కు భారత మహిళల జట్టుహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (డబ్ల్యుకె), ఉమా చెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్రిజర్వ్ జాబితా: శ్వేతా సెహ్రావత్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, మేఘనా సింగ్ -
క్లీన్స్వీప్ లక్ష్యంగా...
చెన్నై: ఇప్పటికే వన్డే సిరీస్ను 3–0తో క్లీన్స్వీప్ చేసి... ఏకైక టెస్టులో ఘనవిజయం సాధించి... జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 సిరీస్నూ దక్కించుకోవాలనే లక్ష్యంతో ఉంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య నేడు తొలి మ్యాచ్ జరుగుతుంది. బలాబలాలను పరిశీలిస్తే దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్లోనూ భారత్దే పైచేయి ఉండటం ఖాయమనిపిస్తోంది. వన్డే సిరీస్లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో అదరగొట్టిన స్మృతి మంధాన... ఏకైక టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన షఫాలీ వర్మ అదే జోరును టి20 సిరీస్లోనూ కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో పేసర్లు రేణుక సింగ్, అరుంధతి రెడ్డి... స్పిన్నర్లు ఆశా శోభన, శ్రేయాంక పాటిల్ కీలకం కానున్నారు. దక్షిణాఫ్రికా అవకాశాలన్నీ కెపె్టన్ లౌరా వొల్వార్ట్, మరిజన్ కాప్, సునె లుస్ ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా విధించిన 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత మహిళల జట్టు వికెట్ నష్టపోకుండా ఛేదించింది. షెఫాలీ వర్మ(24), సతీష్(13) పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 603 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(205) డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన(146), రిచా ఘోష్(86) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 266 పరుగులకు ఆలౌట్ కావడంతో ఫాలోన్ గండం దాటలేకపోయింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా 8 వికెట్లతో దెబ్బతీసింది.ఈ క్రమంలో ఫాలో ఆన్ ఆడిన సఫారీలు సెకెండ్ ఇన్నింగ్స్లో 373 పరుగులకు ఆలౌటయ్యారు. దీంతో భారత్ ముందు దక్షిణాఫ్రికా కేవలం 37 పరుగులు మాత్రమే లక్ష్యంగా ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఊదిపడిసేన భారత్.. ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక సెకెండ్ ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో సునే లూస్(109), వోల్వార్డ్ట్(109) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో దీప్తీ శర్మ, గైక్వాడ్, రాణా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. షఫాలీ వర్మ, హర్మాన్ ప్రీత్ కౌర్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో 10 వికెట్లతో సత్తాచాటిన స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్ట్ క్రికెట్లో అత్యధిక స్కోర్ నమోదు
భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృస్టించింది. టెస్ట్ క్రికెట్లో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఈ రికార్డును సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 603 పరుగులు చేసింది. ఈ మ్యాచ్కు ముందు ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోర్ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇదే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓవరాల్గా మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా 600 స్కోర్ దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో టీమిండియా మరో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ చేసిన 431 పరుగులు టెస్ట్ల్లో తొలి రోజుతో పాటు ఒకే రోజు చేసిన అత్యధిక స్కోర్గా ఉండింది.టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-5 టీమ్ స్కోర్లు..భారత్- 603/6ఆస్ట్రేలియా- 575/9ఆస్ట్రేలియా- 569/6ఆస్ట్రేలియా- 525న్యూజిలాండ్- 517/8కాగా, సౌతాఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు శతకాల మోత మోగించి పరుగుల వరద పారించారు. ఓపెనర్ షపాలీ వర్మ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (194 బంతుల్లో 205) నమోదు చేయగా... మరో ఓపెనర్ స్మృతి మంధన (149) టెస్ట్ల్లో తన రెండో సెంచరీ సాధించింది. మంధన, షఫాలీతో పాటు జెమీమా రోడ్రిగెజ్ (55), హర్మన్ప్రీత్ (69), రిచా ఘోష్ అర్ద సెంచరీలతో రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ను 603 పరుగుల వద్ద (6 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది.భారత ఇన్నింగ్స్లో మరిన్ని హైలైట్స్..2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది.292 తొలి వికెట్కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్లు విండీస్పై తొలి వికెట్కు 241 పరుగులు జతచేశారు. -
షఫాలీ విశ్వరూపం
భారత మహిళా క్రికెటర్లా... మజాకా! దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో చెన్నైలో ఆరంభమైన ఏకైక టెస్టును టీమిండియా రికార్డుల జడివానతో మొదలుపెట్టింది. ‘ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ’... తొలి వికెట్కు అత్యధిక భాగస్వామ్యం... ఒకేరోజు అత్యధిక జట్టు స్కోరు... ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు... ఇలా ఒకటేమిటి అన్ని కలగలిపి అతివల క్రికెట్లో అపూర్వ రికార్డుల జాతరను మన మహిళల జట్టు ఆవిష్కరించింది. ఈ మ్యాచ్ను చూసిన వారందరికి ఆడుతోంది అమ్మాయిలేనా? జరుగుతోంది టెస్టా లేదంటే వన్డేనా అన్న అనుమానం కలగకమానదు. అంతలా... ఆకాశమే హద్దన్నట్లుగా హర్మన్ప్రీత్ బృందం సఫారీపై సూపర్గా ఆడింది. చెన్నై: భారత మహిళల క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో విశ్వరూపమే చూపెట్టింది. డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205; 23 ఫోర్లు, 8 సిక్స్లు) అంతర్జాతీయ మహిళల క్రికెట్లో వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించింది. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (161 బంతుల్లో 149; 27 ఫోర్లు, 1 సిక్స్) కూడా సఫారీ బౌలర్లను చితగ్గొట్టి మరీ శతకాన్ని పూర్తి చేసుకుంది. దీంతో శుక్రవారం మొదలైన ఈ ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు తొలి రోజు ఆట ముగిసేసరికి 98 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీస్కోరు కాదు... ఒక్క రోజే రికార్డు స్కోరు నమోదు చేసింది. పరుగు... ప్రవాహమైందిలా! టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ పరుగులు మొదలుపెట్టారు. ఇది పట్టాలెక్కగానే ప్రవాహం ఆ వెంటే రికార్డుల విధ్వంసం రోజంతా కొనసాగింది. 14వ ఓవర్లో భారత్ స్కోరు 50కి చేరింది. స్మృతి 78 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దీంతోనే ఇది టెస్టు కాదని వన్డేనేమో అనే అనుమానం మొదలైంది.షఫాలీ 66 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించడం, జట్టు స్కోరు వన్డేలకు దీటుగా 24.4 ఓవర్లలోనే 100కు చేరడంతో ఇది ఏ మ్యాచ్ అబ్బా అని అభిమానులు క్రికెట్కు సంబంధించిన వెబ్సైట్లలో ఏ ఫార్మాట్ అనే ఎంక్వైరీ చేసుకునేలా చేసింది. లంచ్ విరామానికి 130/0 స్కోరు చేసింది. ఆ తర్వాత రెండో సెషన్లోనూ ఓపెనర్లు షఫాలీ, స్మృతిల బ్యాటింగ్ దూకుడుతో 39 ఓవర్లలోనే భారత్ 200 స్కోరును అవలీలగా దాటేసింది. ఈ క్రమంలో ముందుగా షఫాలీ 113 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకోగా, స్మృతి 122 బంతుల్లో శతకాన్ని సాధించింది. 194 బంతుల్లో ‘ద్విశతకం’ ఎట్టకేలకు 52వ ఓవర్లో స్మృతి అవుటైంది. 54వ ఓవర్లో జట్టు స్కోరు 300 పరుగులకు చేరుకుంది. అప్పుడు తెలిసొచ్చింది స్కోరైతే వన్డే తీరు... ఫార్మాట్ అయితే సంప్రదాయ పోరు అని! కాసేపటికే శుభా సతీశ్ (15) వెనుదిరిగింది. 334/2 స్కోరు వద్ద టీ బ్రేక్కు వెళ్లారు. తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 55; 8 ఫోర్లు) అండతో షఫాలీ 194 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించింది. 73వ ఓవర్లోనే భారత్ 400 పరుగుల మైలురాయిని వేగంగా అందుకుంది. షఫాలీ రనౌట్ కాగా... క్రీజులో పాతుకుపోయినా జెమీమా కూడా (85 బంతుల్లో) ఫిఫ్టీ సా«ధించింది. 95వ ఓవర్లో భారత్ 500 అసాధారణ స్కోరును ఒక్కరోజులోనే సాధించింది. స్కోరు వివరాలు భారత మహిళల తొలి ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (రనౌట్) 205; స్మృతి (సి) డెర్క్సెన్ (బి) టకర్ 149; శుభ (సి) జాఫ్తా (బి) డి క్లెర్క్ 15; జెమీమా (సి) డి క్లెర్క్ (బి) టకర్ 55; హర్మన్ప్రీత్ (బ్యాటింగ్) 42; రిచా ఘోష్ (బ్యాటింగ్) 43; ఎక్స్ట్రాలు 16; మొత్తం (98 ఓవర్లలో 4 వికెట్లకు) 525. వికెట్ల పతనం: 1–292, 2–325, 3–411, 4–450. బౌలింగ్: క్లాస్ 14–2–63–0, డెర్క్సెన్ 11–0–60–0, నదినె 10–1–62–1, టుమి 10–0– 55–0, నొంకు లులెకొ లబ 24–1–113–0, డెల్మి టకర్ 26–1–141–2, సునె లుస్ 3–0–15–0.1 మహిళల క్రికెట్లో షఫాలీ 194 బంతుల్లో సాధించిన వేగవంతమైన డబుల్ సెంచరీ కొత్త రికార్డు. ఇదే ఏడాది దక్షిణాఫ్రికా జట్టుపైనే అనాబెల్ సదర్లాండ్ (ఆ్రస్టేలియా) 248 బంతుల్లో ద్విశతకం చేసింది. 2 మిథాలీ రాజ్ (214; 2002లో ఇంగ్లండ్పై) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో భారతీయ మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది. 292 తొలి వికెట్కు షఫాలీ, స్మృతి జోడించిన పరుగులు. ఇది కొత్త ప్రపంచ రికార్డు. 2004లో పాక్ ఓపెనర్లు సాజీదా, కిరణ్ బలూచ్లు విండీస్పై తొలి వికెట్కు 241 పరుగులు జతచేశారు. 525 టెస్టు క్రికెట్లో మ్యాచ్ తొలిరోజుతోపాటు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. 1935లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ తొలిరోజు 431 పరుగులు చేసింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒకే రోజు 525 పరుగులు!
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి రోజు ఏకంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది. 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్లతో 205 పరుగులు చేయగా.. మంధాన 161 బంతుల్లో 149 పరుగులు చేసింది.వీరితో పాటు జెమిమా రోడ్రిగ్స్(55) పరుగులతో రాణించింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్(42), రిచా ఘోష్(43) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డీక్లార్క్ ఒక్క వికెట్ సాధించింది.చరిత్ర సృష్టించిన టీమిండియా..ఇక ఈ మ్యాచ్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. పురుషుల, మహిళల టెస్టు క్రికెట్లో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది.అంతకుముందు 2002లో బంగ్లాదేశ్పై శ్రీలంక ఒకే రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో లంకేయుల రికార్డును భారత మహిళలు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు మహిళల టెస్టు క్రికెట్లో అయితే 431 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. -
చరిత్ర సృష్టించిన "లేడీ సెహ్వాగ్".. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ! వీడియో
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత ఓపెనర్ షఫాలీ వర్మ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్లో షఫాలీ వర్మ విధ్వంసకర డబుల్ సెంచరీతో చెలరేగింది. టెస్టు క్రికెట్ అన్న విషయం మర్చిపోయిన షఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లకు వర్మ చుక్కలు చూపించింది. షఫాలీ బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కేవలం 194 బంతుల్లోనే తన తొలి డబుల్ సెంచరీ మార్క్ను షఫాలీ అందుకుంది. వరుసగా సిక్స్లు బాదుతూ షఫాలీ తన స్టైల్లో ద్విశతకం నమోదు చేసింది. ఓవరాల్గా 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్లతో 205 పరుగులు చేసి పెవిలియన్కు చేరింది. దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో షఫాలీ వర్మ వెనుదిరిగింది. ఇక డబుల్ సెంచరీతో చెలరేగిన ఈ లేడీ సెహ్వాగ్.. పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది.షఫాలీ సాధించిన రికార్డులు ఇవే..మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేసిన ప్లేయర్గా షఫాలీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ ఆల్రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సదర్లాండ్ 256 బంతుల్లో ద్విశతకం నమోదు చేసింది. తాజా మ్యాచ్లో కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసిన వర్మ.. అన్నాబెల్ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. అదేవిధంగా టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన రెండో భారత మహిళా క్రికెటర్గా షఫాలీ నిలిచింది. షఫాలీ కంటే ముందు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ టెస్టుల్లో ద్విశతకం నమోదు చేసింది. THE MOMENT SHAFALI VERMA CREATED HISTORY. ⭐- She scored Fastest Double Hundred in Women's Test Cricket History. 🔥 pic.twitter.com/94zBj5zY01— Tanuj Singh (@ImTanujSingh) June 28, 2024 -
వరుసగా నాలుగో టీ20లో టీమిండియా జయకేతనం
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్లో జయకేతనం ఎగురవేసింది. నిన్న (మే 6) జరిగిన నాలుగో మ్యాచ్లో భారత్ 56 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతిలో) ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కెప్టెన్ హర్మన్ప్రీత్ (39), స్మృతి మంధన (22), హేమలత (22), రిచా ఘోష్ (24) రాణించడంతో 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్ అనంతరం మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 125 పరుగులుగా నిర్దారించారు. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వరుసగా నాలుగో మ్యాచ్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లు దీప్తి శర్మ (3-0-13-2), ఆశా శోభన (3-0-18-2), రాధా యాదవ్ (3-1-12-1), పూజా వస్త్రాకర్ (3-0-15-1) బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఆ జట్టు ఇన్నింగ్స్లో దిలారా అక్తెర్ (21) టాప్ స్కోరర్గా నిలిచింది.నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ మే 9న జరుగనుంది. ఈ మ్యాచ్లో కూడా భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. టీ20 ప్రపంచకప్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈ సిరీస్ విజయం మాంచి బూస్టప్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది. -
హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో...
ముంబై: సొంతగడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు ఆడే రెండు కీలక సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ప్రకటించింది. ఈ రెండు టీమ్లకు కూడా హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది. ఇంగ్లండ్తో 3 టి20 మ్యాచ్ల సిరీస్లో తలపడే భారత జట్టు ఆ తర్వాత ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలతో ఒక్కో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఆసీస్తో టి20 సిరీస్కు టీమ్ను తర్వాత ప్రకటిస్తారు. ఈ మ్యాచ్లన్నీ ముంబై వేదికగానే జరుగుతాయి. ఈ నెల 6న భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టి20 జరుగుతుంది. ఇంగ్లండ్తో టి20లకు జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షఫాలీ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, అమన్జోత్, శ్రేయాంక, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటాస్ సాధు, పూజ వస్త్రకర్, కనిక ఆహుజా, మిన్ను మని. ఇంగ్లండ్, ఆసీస్లతో టెస్టులకు జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్ ), స్మృతి మంధాన, జెమీమా, షఫాలీ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, స్నేహ్ రాణా, శుభ సతీశ్, హర్లీన్ డియోల్, సైకా ఇషాక్, రేణుకా సింగ్, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, పూజ వస్త్రకర్ -
స్వర్ణ పతకానికి గెలుపు దూరంలో
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ మహిళలపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 51 పరుగులకే కుప్పకూలింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (12) టాప్ స్కోరర్ కాగా మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. ఐదుగురు బ్యాటర్లు ‘డకౌట్’ కావడం విశేషం. పేస్ బౌలర్ పూజ వస్త్రకర్ (4/17) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనను నమోదు చేసి బంగ్లాను దెబ్బ కొట్టింది. భారత్ 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 52 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్మృతి మంధాన (7) తొందరగానే అవుటైనా... జెమీమా రోడ్రిగ్స్ (20 నాటౌట్), షఫాలీ వర్మ (17) కలిసి గెలిపించారు. స్వర్ణపతకం కోసం నేడు జరిగే ఫైనల్లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. రెండో సెమీస్లో శ్రీలంక 6 వికెట్లతో పాకిస్తాన్పై గెలిచింది. -
Asian Games 2023: సెమీస్లో బంగ్లాదేశ్ చిత్తు.. ఫైనల్కు చేరిన భారత్
ఆసియాక్రీడల మహిళల క్రికెట్లో భారత్కు పతకం ఖాయమైంది. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన సెమీఫైనల్-1లో బంగ్లాదేశ్ను 8వికెట్ల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. దీంతో ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల దాటికి కేవలం 51 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సటిటాస్ సాధు, గైక్వాడ్, వైద్యా తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో నిగార్ సుల్తానా 12 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం 52 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో జెమిమా రోడ్రిగ్స్(20 నాటౌట్),షెఫాలీ వర్మ(17) పరుగులతో రాణించారు. ఇక సోమవారం(సెప్టెంబర్ 25) జరగనున్న ఫైనల్లో శ్రీలంక లేదా పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. చదవండి: Asian Games 2023: పతకాల ఖాతా తెరిచిన భారత్.. వరుసగా రెండు మెడల్స్ -
మలేషియాతో మ్యాచ్ రద్దు.. సెమీఫైనల్కు చేరిన టీమిండియా
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్-2023 సెమీఫైనల్లో భారత మహిళల క్రికెట్ జట్టు అడుగుపెట్టింది. గురువారం భారత్-మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్-1 వర్షం కారణంగా రద్దు కావడంతో ఇరు జట్లకు చెరోపాయింట్ లభించింది. అయితే మలేషియా కంటే భారత ర్యాంక్ అత్యధికంగా ఉండడంతో సెమీఫైనల్ బెర్త్ను ఉమెన్ ఇన్ బ్లూ ఖారారు చేసుకుంది. సెప్టెంబర్ 24న సెమీఫైనల్-1లో పాకిస్తాన్తో తలపడే అవకాశం ఉంది. కాగా వర్షం కారణంగా రద్దు అయిన మ్యాచ్లో టాస్ గెలిచిన మలేషియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు స్మృతి మంధాన, షాపాలీ వర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం మంధాన తొలి వికెట్గా వెనుదిరిగింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు కూడా ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అంపైర్లు మ్యాచ్ను నిలిపివేశారు. అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ను 15 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ ప్రారంభమయ్యాక షఫాలీ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. షఫాలీ వర్మ( 39 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67) అద్బుత ఇన్నింగ్స్ ఆడగా.. రోడ్రిగ్స్(47 నాటౌట్) పరుగులతో దుమ్మురేపింది. ఆఖరిలో రిచా ఘోష్(7 బంతుల్లో 21 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. వీరిముగ్గరి విధ్వంసకర ఇన్నింగ్స్ల ఫలితంగా నిర్ణీత 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి భారత్ 173 పరుగులు చేసింది. అనంతరం మలేషియా ఇన్నింగ్స్ ఆరంభంలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పటికి వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. చదవండి: IND Vs AUS ODI Series: ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందంటే? చివరగా -
చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టు
విశ్వవేదికపై భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన తొలి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్లో టైటిల్ కైవసం చేసుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇవాళ (ఆగస్ట్ 26) జరిగిన ఫైనల్లో టీమిండియా.. ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి, జగజ్జేతగా అవతరించింది. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగా.. భారత్ 3.3 ఓవర్లలో కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించి (వర్షం కారణంగా భారత లక్ష్యాన్ని 42 పరుగులకు కుదించారు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్ తొలి ఛాంపియన్గా టీమిండియా చరిత్రపుటల్లోకెక్కింది. ఈ టోర్నీలో అజేయ జట్టుగా నిలిచిన భారత్.. ఫైనల్స్తో కలుపుకుని ఆసీస్పై 3 సార్లు, ఇంగ్లండ్పై 2 సార్లు గెలుపొందింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల విభాగంలో సైతం భారత జట్టు ఫైనల్స్కు చేరుకుంది. సెమీస్లో భారత్.. బంగ్లాదేశ్ను చిత్తు చేసి, టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో భారత్.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు
భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (IBSA) వరల్డ్ గేమ్స్లో ఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. IBSA వరల్డ్ గేమ్స్లో అంధుల క్రికెట్ గత వారమే అరంగేట్రం చేయగా.. ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డుపుటల్లోకెక్కింది. బర్మింగ్హామ్ వేదికగా టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ మీట్లో టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలపై విజయాలు సాధించి, తుదిపోరుకు అర్హత సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరల్డ్ గేమ్స్లో తమ ప్రస్తానాన్ని అద్భుతంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్లో టీమిండియా.. ఆస్ట్రేలియాను 59/6కి కట్టడి, అనంతరం సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్తో జరిగిన రెండో మ్యాచ్లో హెచ్ గంగవ్వ 60 బంతుల్లో 117 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 268/2 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ 185 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. నిన్న (ఆగస్ట్ 23) జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 163 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి, వరల్డ్ గేమ్స్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఫైనల్స్కు చేరింది. శనివారం జరుగబోయే టైటిల్ పోరుకు ముందు భారత్ ఇంగ్లండ్తో తమ చివరి లీగ్ మ్యాచ్ (గురువారం) ఆడనుంది. ఫైనల్స్లో భారత ప్రత్యర్ధి ఖరారు కావల్సి ఉంది. మరోవైపు ఇదే ఈవెంట్ పురుషుల విభాగంలోనూ భారత్ సెమీస్కు చేరుకుంది. శుక్రవారం టీమిండియా ఈ మ్యాచ్ ఆడనుంది. సెమీ ఫైనల్లో భారత్ గెలిస్తే, ఫైనల్స్లో దాయాది పాకిస్థాన్తో తలపడుతుంది. -
బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు
మహిళల వన్డే క్రికెట్లో బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదైంది. 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా టీమిండియాతో ఇవాళ (జులై 22) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఫర్జానా హాక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్కు ముందు వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక స్కోర్ రికార్డు సల్మా ఖాతూన్ పేరిట ఉండేది. 2013 ఏప్రిల్లో సల్మా భారత్పై 75 పరుగులు చేసింది. అదే నేటి వరకు వన్డేల్లో బంగ్లా తరఫున అత్యధిక స్కోర్గా ఉండింది. బంగ్లా తరఫున వన్డేల్లో తొలి సెంచరీ రికార్డుతో పాటు ఫర్జానా ఖాతాలో మరో 2 రికార్డులు కూడా ఉన్నాయి. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు (56 మ్యాచ్ల్లో 25.83 సగటున 1240 పరుగులు), బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు (9) ఫర్జానా పేరిటే ఉన్నాయి. భారత్తో మ్యాచ్లో 160 బంతులు ఎదుర్కొన్న ఫర్జానా.. మహిళల క్రికెట్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఐదో బ్యాటర్గా రికార్డుల్లోకెక్కింది. టీమిండియా బ్యాటర్ దీప్తి శర్మతో కలిసి ఫర్జానా ఈ రికార్డును షేర్ చేసుకుంది. ఈ జాబితాలో ఐర్లాండ్ అన్నె ముర్రే (171) టాప్లో ఉంది. ఇదిలా ఉంటే, ఫర్జానా రికార్డు సెంచరీతో కదంతొక్కడంతో భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫర్జానాతో పాటు మరో ఓపెనర్ షమీమా సుల్తానా (52) అర్ధసెంచరీతో రాణించింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (24), ఆఖర్లో శోభన మోస్త్రీ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, దేవిక వైద్య ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. 37 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి, విజయం దిశగా సాగుతుంది. స్మృతి మంధన (59) అర్ధశతకంతో మెరవగా.. హర్లీన్ డియోల్ (67 నాటౌట్) భారత్ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తుంది. హర్లీన్కు జతగా జెమీమా రోడ్రిగెజ్ (6) క్రీజ్లో ఉంది. షెఫాలీ వర్మ (4), యస్తికా భాటియా (5), కెప్టెన్ హర్మన్ప్రీత్ (14) ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, మరుఫా అక్తర్, నహిద అక్తర్, ఫామిమా ఖాతూన్ తలో వికెట్ పడగొట్టారు. -
బంగ్లాదేశ్ టూర్.. టీమిండియా హెడ్ కోచ్గా మాజీ క్రికెటర్!
బంగ్లాదేశ్ పర్యటనకు భారత మహిళల జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ అతిథ్య బంగ్లాదేశ్తో తలపడనుంది. ఇప్పటికే ఈ పరిమిత ఓవర్ల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై 9న జరగనున్న తొలి వన్డే మ్యాచ్తో భారత పర్యటన ప్రారంభం కానుంది. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్కు హర్మన్ సేన పయనం కానుంది. భారత జట్టు హెడ్ కోచ్గా నూషిన్ అల్ ఖదీర్ కాగా గత డిసెంబర్లో మహిళల జట్టు హెడ్కోచ్గా ఉన్న రమేశ్ పొవార్ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ బదిలి చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రధాన కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్లో భారత మహిళల జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్కోచ్ పదవి కోసం ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోన్ లూయిస్, భారత మాజీ కోచ్ తుషార్ అరోథే, అమోల్ ముజుందార్ వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ముంబై దిగ్గజ ఆటగాడు అమోల్ ముజుందార్ పేరును క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కమిటీ ఫైనల్ చేసిందని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు. అయితే బంగ్లా టూర్కు సమయం దగ్గరపడుతుండడంతో మాజీ భారత క్రికెటర్ నూషిన్ అల్ ఖదీర్ను తాత్కాలిక ప్రధాన కోచ్గా బోర్డు నియమించింది. కోచ్గా ఖదీర్కు అపారమైన అనుభవం ఉంది. కాగా మొట్టమొదటి మహిళల అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు నూషిన్ హెడ్కోచ్గా వ్యవహరించింది. చదవండి: Online Betting: మ్యాచ్ మ్యాచ్కు ఉత్కంఠ.. ఉన్నదిపాయే, ఉంచుకున్నది పాయే! జీవితమే! -
జాక్పాట్ కొట్టిన అనంతపురం క్రికెటర్.. టీమిండియాకు ఎంపిక
సాక్షి, అనంతపురం: నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది. ఇటీవల హాంకాంగ్లో జరిగిన ఆసియా కప్లో ఎమర్జింగ్ ఇండియా తరఫున ఆడిన అనూష బాగా రాణించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఎడమ చేతి స్పిన్నర్, బ్యాటర్ అయిన అనూష 2014లో అనంతపురం ఆర్డీటీ అకాడమీలో చేరింది. అకాడమీ ప్రోత్సాహంతో జిల్లా, రాష్ట్ర, జోనల్ స్థాయిలో విశేషంగా రాణించి..చివరకు టీమిండియాలో చోటు దక్కించుకుంది. ఈమె తల్లిదండ్రులు బి.లక్ష్మీదేవి, మల్లిరెడ్డి. సాధారణ రైతు కుటుంబం అయినప్పటికీ కుమార్తెను క్రికెటులో బాగా ప్రోత్సహించారు. ఆర్డీటీ సహాయ సహకారాలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని అనూష తెలిపింది. (అనూషను అభినందిస్తున్న మాంఛూ ఫెర్రర్) టీమిండియా తరఫున బాగా రాణించి దేశానికి పేరు తెస్తానంది. అనూష క్రీడాప్రస్తానం ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఆర్డీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత క్రీడా ఆణిముత్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ఆర్డీటీ పనిచేస్తోందని చెప్పారు. కాగా, బంగ్లాదేశ్లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. గాయంతో పేసర్ రేణుక సింగ్ దూరం కాగా, వికెట్ కీపర్ రిచా ఘోష్ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్లకు (టి20, వన్డే) పక్కనబెట్టారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్కు సెలక్టర్లు అవకాశమివ్వలేదు. బంగ్లాదేశ్తో భారత్ మూడేసి టి20లు, వన్డేలు ఆడుతుంది. ముందుగా మిర్పూర్ వేదికగా ఈనెల 9, 11, 13 తేదీల్లో టి20 మ్యాచ్లు, అదే స్టేడియంలో 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టి20 జట్టు: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి (వైస్ కెప్టెన్), దీప్తిశర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా చెట్రి, అమన్జోత్ కౌర్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, అనూష బారెడ్డి, మిన్నురాణి. వన్డే జట్టులో సబ్బినేని మేఘన, మిన్నురాణి స్థానాల్లో ప్రియా పూనియా, స్నేహ్ రాణాలను తీసుకున్నారు. -
భారత జట్టు హెడ్కోచ్గా ముజుందార్.. త్వరలోనే ప్రకటన
భారత మహిళల జట్టు హెడ్కోచ్గా ముంబై మాజీ ఆటగాడు అమోల్ ముజుందార్ భాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు ఈ హెడ్కోచ్ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. జూలై 9న బంగ్లాదేశ్తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్తో భారత జట్టు ప్రధానకోచ్గా ముజుందార్ ప్రయాణం ప్రారంభం కానుంది. దీనిపై బీసీసీఐ ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా కాగా గత డిసెంబర్లో మహిళల జట్టు హెడ్కోచ్గా ఉన్న రమేశ్ పొవార్ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ బదిలి చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రధాన కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతూ వస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్లో భారత మహిళల జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. హెడ్కోచ్ పదవి కోసం ఇంగ్లండ్ మాజీ ఆటగాడు జోన్ లూయిస్, భారత మాజీ కోచ్ తుషార్ అరోథే వంటి వారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజ్పే, సులక్షణా నాయక్లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కమిటీ ముజుందార్ పేరును ఖారారు చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ముజుందార్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. ముజుందార్ ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ స్టాప్లో భాగంగా ఉన్నాడు. అదే విధంగా గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్గా కూడా పనిచేశాడు. 48 ఏళ్ల ముజుందార్ 2019లో భారత పర్యటనలో దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా కూడా పనిచేశాడు. చదవండి: బంగ్లాదేశ్ టూర్కు భారత జట్టు ఎంపిక.. స్టార్ ప్లేయర్పై వేటు -
'ఇంటర్మీడియట్' పాసైన టీమిండియా స్టార్ ఓపెనర్
భారత మహిళల జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించింది. సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ను క్లియర్ చేసిన షఫాలీ వర్మ.. తన మార్క్ షీట్ను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. "ఈ ఏడాది మరోసారి 80 ప్లస్ స్కోర్ సాధించాను. కానీ ఈ సారి మ్యాచ్లో కాదు, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్లో. మంచి మార్కులతో పాసైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని షఫాలీ తన పోస్ట్కు క్యాప్షన్గా ఇచ్చింది. కాగా కేవలం 15ఏళ్ల వయస్సులోనే షఫాలీ వర్మ భారత తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 2019లో దక్షిణాఫ్రికాపై ఆమె తన తొలి మ్యాచ్ ఆడింది. ఇప్పటివరకు టీమిండియా తరపున 79 మ్యాచ్లు ఆడిన 2106 పరుగులు చేసింది. అదే విధంగా తొట్టతొలి మహిళల అండర్-19 ప్రపంచకప్ను సొంతం చేసుకున్న మొదటి కెప్టెన్గా షఫాలీ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ను షఫాలీ నేతృత్వంలో భారత జట్టు కైవసం చేసుకుంది. మరోవైపు మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించిన షఫాలీ వర్మ.. తన జట్టు ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించింది. చదవండి: IPL 2023: నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆటగాడిగా View this post on Instagram A post shared by Shafali Verma (@shafalisverma17) -
టీమిండియా హెడ్ కోచ్గా ముజుందార్!
భారత మహిళల జట్టు హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పదవి కోసం ముందు వరుసలో ముంబై జట్టు భారత మాజీ క్రికెటర్ అమోల్ ముజుందార్ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గత డిసెంబర్లో మహిళల జట్టు హెడ్కోచ్గా ఉన్న రమేశ్ పొవార్ని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి బీసీసీఐ బదిలి చేసింది. అప్పటి నుంచి ప్రధాన కోచ్ లేకుండానే భారత మహిళల జట్టు ఆడుతూ వస్తుంది. కాగా ముజుందార్కు కోచ్గా అపారమైన అనుభవం ఉంది. ముజుందార్ ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ స్టాప్లో భాగంగా ఉన్నాడు. అదే విధంగా గతంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో కోచ్గా కూడా పనిచేశాడు. 48 ఏళ్ల ముజుందార్ 2019లో భారత పర్యటనలో దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా కూడా పనిచేశాడు. హెడ్కోచ్ పదవికి అర్హతలు బీసీసీఐ హెడ్కోచ్ పదవికి ఎటువంటి వయస్సు పరిమితి లేదు. అభ్యర్థి తప్పనిసరిగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ లేదా మరేదైనా దేశానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి లేదా కనీసం ఎన్సీఏ స్థాయి ‘C’ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. సూర్య కోసం మా ప్లాన్ ఛేంజ్ చేశాం: రోహిత్ శర్మ -
టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తుల ఆహ్వానం
భారత సీనియర్ మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ నోటిఫికేషన్ను విడుదల చేసింది. 60 ఏళ్లలోపు వారై ఉండి... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్గానీ, 50 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవమైనా ఉన్నాకానీ లేదంటే ఎన్సీఏ లెవల్ ‘సి’ కోచింగ్ సర్టిఫికెట్, అంతర్జాతీయ టి20 జట్టుకు కనీసం ఒక్క సీజన్కైనా కోచింగ్ చేసి ఉండాలి. ఇందులో ఏ ఒక్క అర్హత ఉన్నా ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ కోరింది. -
సెమీస్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ఆల్రౌండర్ దూరం
ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 సెమీస్ మ్యాచ్కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ అనారోగ్య కారణంతో టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఆమె ప్రస్తుతం శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో నాలగు మ్యాచ్లు ఆడిన ఆమె రెండు వికెట్లు పడగొట్టింది. ఇక పూజా స్థానాన్ని మరో ఆల్ రౌండర్ స్నేహ్ రానాతో సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. పూజా స్థానాన్ని స్నేహ్ రానాతో భర్తీ చేయడాన్ని ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. అయితే తుది జట్టులో మాత్రం స్నేహ్ రానా చోటు దక్కే అవకాశం కన్పించడం లేదు. ప్లేయింగ్ ఎల్వెన్లో పూజా స్థానంలో దేవికా వైద్య వైపు జట్టు మెనెజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్కు భారత కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ అందుబాటుపై కూడా సంధిగ్ధం నెలకొంది. కీలక మ్యాచ్కు ముందు హర్మన్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా-భారత్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ గురువారం(ఫిబ్రవరి 23) సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్కప్-2023 తొలి సెమీ ఫైనల్- తుది జట్లు (అంచనా) భారత్: స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, రేణుక, యస్తికా భాటియా, దేవికా వైద్య. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), బెత్ మూనీ, అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, ఆష్లే గార్డ్నర్, తాలియా మెక్గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్ షుట్, డార్సీ బ్రౌన్. చదవండి: T20 WC 2023: సెమీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్కు అస్వస్థత?! UPDATE 🚨 - Pacer Pooja Vastrakar has been ruled out due to an upper respiratory tract infection! The Event Technical Committee of the ICC Women’s T20 World Cup 2023 has approved @SnehRana15 as a replacement for Pooja Vastrakar in the India squad! #T20WorldCup | #TeamIndia pic.twitter.com/NKiTvp22Hn — BCCI Women (@BCCIWomen) February 23, 2023 -
వేలంలో ఊహించని ధర.. సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా! వీడియో వైరల్
ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా భారత క్రికెటర్ల పంటపండింది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన రూ.3.4 కోట్ల భారీ ధర దక్కించుకోగా.. దీప్తిశర్మ(రూ.2.6 కోట్లు) షఫాలీ వర్మ(రూ. 2 కోట్లు), దీప్తి శర్మ(రూ.2.6 కోట్లు), జెమ్మిమా రోడ్రిగ్స్(రూ. 2.2కోట్లు), పూజా వస్త్రాకర్(రూ.1.9 కోట్లు) సొంతం చేసుకున్నారు. సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా కాగా భారత మహిళల జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరగుతోన్న టీ20 ప్రపంచకప్లో బీజీ బీజీగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన ఈ వేలాన్ని భారత క్రికెటర్లంతా వారు బస చేస్తున్న హాటల్లో వీక్షించారు. అయితే ఈ వేలంలో భారత పేసర్ రేణుక సింగ్కు ఊహించని ధర దక్కడంతో ప్లేయర్స్ సెలబ్రేషన్స్లో మునిగి తెలిపోయారు. రేణుక సింగ్ను రూ.1.5 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆక్షనర్ మల్లికా సాగర్ రేణుక సింగ్ను ఆర్సీబీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించిగానే సహాచర క్రికెటర్లు ఆమె చుట్టూ చేరి ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ అరుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: WPL 2023: బాబర్ కంటే మంధానకి రెండున్నర రెట్లు ఎక్కువ.. పాక్ ప్లేయర్లు ఇప్పుడేమంటారో? Yet another lovely video - the celebration is simply incredible. Renuka Singh Thakur joins Smriti Mandhana in RCB. pic.twitter.com/63OteaQwKC — Mufaddal Vohra (@mufaddal_vohra) February 13, 2023 -
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. విండీస్పై ఘన విజయం
Womens T20I Tri Series South Africa 2023: సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ముక్కోణపు మహిళల టీ20 టోర్నీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో (వర్షం కారణంగా ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు) తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న భారత్.. ఇవాళ (జనవరి 30) విండీస్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. దీప్తి శర్మ (4-2-11-3), పూజా వస్త్రాకర్ (4-1-19-2) గైక్వాడ్ (4-1-9-1) బౌలింగ్లో సత్తా చాటడంతో విండీస్ను 94 పరుగులకే (6 వికెట్ల నష్టానికి) నియంత్రించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (34) విండీస్ ఇన్నింగ్స్లో టాప్ స్కోర్గా నిలిచింది. 95 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. జెమీమా రోడ్రిగ్స్ (42 నాటౌట్), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (32 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్లతో రాణించడంతో 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. స్మృతి మంధన (5), హర్లీన్ డియోల్ (13) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. విండీస్ బౌలర్లలో షమీలియా కాన్నెల్, హేలీ మాథ్యూస్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో సంబంధం లేకుండా ఇదివరకే ఫైనల్కు చేరిన భారత్.. ఫిబ్రవరి 2న టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. -
ఆఖరి టీ20లోనూ భారత్కు తప్పని ఓటమి..
ముంబై: గత మ్యాచ్లోనే ఆస్ట్రేలియా మహిళల చేతికి టి20 సిరీస్ అప్పగించిన భారత మహిళల జట్టు చివరి పోరులోనూ చతికిలపడింది. ఫలితంగా సొంతగడ్డపై సిరీస్ను ఓటమితో ముగించింది. మంగళవారం జరిగిన ఐదో టి20 మ్యాచ్లో ఆస్ట్రే లియా 54 పరుగులతో భారత్పై నెగ్గి సిరీస్ను 4–1తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా... భారత్ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ హీతర్ గ్రాహమ్ (4/8) ‘హ్యాట్రిక్’తో భారత్ను దెబ్బ తీసింది. తాను వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లోని చివరి రెండు బంతులకు దేవిక, రాధ యాదవ్లను అవుట్ చేసిన హీతర్... 20వ ఓవర్ తొలి బంతికి రేణుక సింగ్ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా తరఫున యాష్లే గార్డ్నర్ (32 బంతుల్లో 66 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (35 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు అర్ధ సెంచరీలతో చెలరేగారు. 67 పరుగుల వద్దే ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోగా, ఆ తర్వాత గార్డ్నర్, హారిస్ కలిసి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరు ఐదో వికెట్కు అభేద్యంగా 62 బంతుల్లోనే 129 పరుగులు జోడించడం విశేషం. తొలి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 72 పరుగులు కాగా, తర్వాతి 10 ఓవర్లలో జట్టు 124 పరుగులు సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఒక్క దీప్తి శర్మ (53; 8 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు పోరాడటం మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. హర్లీన్ (24) ఫర్వాలేదనిపించగా... టాప్ బ్యాటర్లు స్మృతి మంధాన (4), షఫాలీ వర్మ (13), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (12) ప్రభావం చూపలేకపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. చదవండి: FIFA WC 2022: అభిమాన సంద్రం మధ్య... అర్జెంటీనా జట్టు సంబరాలు -
ఆసీస్తో ఐదో టీ20.. టీమిండియా ముందు కొండంత లక్ష్యం
INDW VS AUSW 5th T20: భారత మహిళా క్రికెట్ జట్టుతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.. నామమాత్రంగా ఇవాళ (డిసెంబర్ 20) జరుగుతున్న ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడినప్పటికీ టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మిడిలార్డర్ బ్యాటర్లు ఆష్లే గార్డ్నర్ (32 బంతుల్లో 66 నాటౌట్; 11 ఫోర్లు, సిక్స్), గ్రేస్ హారిస్ (35 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్) మెరుపు అర్ధసెంచరీలతో విరుచుకుపడటంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు బెత్ మూనీ (2), లిచ్ఫీల్డ్ (11), కెప్టెన్ తహీలా మెక్గ్రాత్ (26), పెర్రీ (18) తొందరగానే ఔటైనా గార్డ్నర్-హారిస్ జోడీ ఐదో వికెట్కు రికార్డు స్థాయిలో అజేయమైన 129 పరుగులు జోడించి, టీమిండియాకు భారీ టార్గెట్ నిర్ధేశించడంలో కీలకంగా వ్యవహరించారు. భారత బౌలర్లలో అంజలీ సర్వానీ, దీప్తి శర్మ, షఫాలీ వర్మ, దేవిక వైద్య తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ సిరీస్లో తొలి టీ20లో ఆసీస్, ఆతర్వాత జరిగిన రెండో మ్యాచ్లో భారత్.. మూడు, నాలుగు టీ20ల్లో ఆసీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. -
భారత్ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
ముంబై: భారత మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిచా ఘోష్ (36; 5 ఫోర్లు, 2 సిక్స్లు), దీప్తి శర్మ (36 నాటౌట్; 8 ఫోర్లు) రాణించారు. ఆసీస్ అమ్మాయిలు 18.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసి గెలిచారు. ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బెత్ మూనీ (57 బంతుల్లో 89 నాటౌట్; 16 ఫోర్లు) మెరిసింది. ఈ మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన అంజలి శర్వాణి భారత్ టి20 జట్టు తరఫున అరంగేట్రం చేసిన 72వ ప్లేయర్గా గుర్తింపు పొందింది. కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అంజలి 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చింది. చదవండి: అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ -
భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా హృషికేశ్ కనిత్కర్
భారత మహిళల క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్గా హృషికేశ్ కనిత్కర్ను బీసీసీఐ నియమించింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా మంగళవారం ప్రకటించింది. డిసెంబర్ 9న ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టీ20 నుంచి భారత బ్యాటింగ్ కోచ్గా కనిత్కర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా హృషికేశ్ కనిత్కర్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు. అదే విధంగా భారత మహిళల జట్టు మాజీ హెడ్ కోచ్ రమేష్ పొవార్కు నేషనల్ క్రికెట్ అకాడమీలో స్పిన్ బౌలింగ్ కోచ్గా బీసీసీఐ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక బ్యాటింగ్ కోచ్గా ఎంపికైన అనంతరం కనిత్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. "భారత సీనియర్ మహిళల జట్టుకు బ్యాటింగ్ కోచ్గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. భారత జట్టులో కలిసి పనిచేయడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. మా జట్టులో సీనియర్ క్రికెటర్లతో పాటు అద్భుతమైన యువ క్రికెటర్లు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో మాకు పెద్ద సవాళ్లు ఎదురు కానున్నాయి. బ్యాటింగ్ కోచ్గా నా వంతు బాధ్యతలు నిర్వహించి జట్టును ముందుకు నడిపిస్తాను" అని కనిత్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టు హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్ 🚨 NEWS 🚨: Hrishikesh Kanitkar appointed as Batting Coach - Team India (Senior Women), Ramesh Powar to join NCA More Details 🔽https://t.co/u3Agagamdd — BCCI (@BCCI) December 6, 2022 చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు భారీ షాక్! -
బీసీసీఐ చారిత్రక నిర్ణయం
సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన భారత మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చారిత్రక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజ్ చెల్లించాలని డిసైడైంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఇవాళ (అక్టోబర్ 27) ట్వీట్ చేశాడు. మహిళా క్రికెటర్లపై ఉన్న వివక్షను పారద్రోలేలా ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు షా వెల్లడించాడు. I’m pleased to announce @BCCI’s first step towards tackling discrimination. We are implementing pay equity policy for our contracted @BCCIWomen cricketers. The match fee for both Men and Women Cricketers will be same as we move into a new era of gender equality in 🇮🇳 Cricket. pic.twitter.com/xJLn1hCAtl — Jay Shah (@JayShah) October 27, 2022 లింగ భేదం లేకుండా పే ఈక్విటి విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ప్రకటించాడు. మహిళల క్రికెట్లో ఇదో సరికొత్త అధ్యాయమని ఆయన వర్ణించాడు. ఇకపై భారత పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా టెస్ట్ మ్యాచ్కు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20కి 3 లక్షల రూపాయలు చెల్లించనున్నట్లు షా ప్రకటించాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన పురుష క్రికెటర్ల మ్యాచ్ ఫీజ్ విషయానికొస్తే.. ఏ ప్లస్ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు ఏడాదికి 7 కోట్లు, ఏ కేటగిరిలోని ప్లేయర్లకు 5 కోట్లు, బి కేటగిరిలో ఉన్న వారికి 3 కోట్లు, సీ కేటగిరి ప్లేయర్లకు కోటి రూపాయలు వార్షిక రుసుముగా అందుతుంది. అదే మహిళా క్రికెటర్ల విషయానికొస్తే.. ఏ గ్రేడ్ ప్లేయర్లకు 50 లక్షలు, బీ గ్రేడ్ వారికి 30 లక్షలు, సీ గ్రేడ్లో ఉన్న ప్లేయర్లకు 10 లక్షలు వార్షిక వేతనంగా అందుతుంది. ఇది పురుష క్రికెటర్ల వార్షిక వేతనం కేవలం పది శాతం మాత్రమే. -
చరిత్ర సృష్టించిన భారత కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి మహిళా క్రికెటర్గా
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా హర్మన్ప్రీత్ రికార్డులకెక్కింది. మహిళల ఆసియాకప్-2022 ఫైనల్లో శ్రీలంకపై బరిలోకి దిగిన హర్మన్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు హర్మన్ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 137 మ్యాచ్లు ఆడింది. అంతకుముందు ఈ అరుదైన రికార్డు న్యూజిలాండ్ ఆల్ రౌండర్ సుజీ బేట్స్ పేరిట ఉండేది. బేట్స్ ఇప్పటి వరకు 136 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు ఆడింది. తాజా మ్యాచ్తో బేట్స్ రికార్డును హర్మన్ప్రీత్ అధిగమించింది. కాగా హర్మన్ప్రీత్ 2009లో భారత్ తరపున టీ20 అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు 122 ఇన్నింగ్స్లో హర్మన్.. 2,683 పరుగులు చేసింది. ఆమె టీ20 కెరీర్లో ఇప్పటి వరకు సెంచరీతో పాటు 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక భారత మహిళా క్రికెటర్ కూడా హర్మన్ కావడమే గమనార్హం. ఆసియా కప్-2022 విజేత భారత్ ఇక మహిళల ఆసియా కప్-2022 ఛాంపియన్స్గా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి.. 7వ సారి ఆసియాకప్ విజేతగా భారత్ అవతరించింది. ఈ మ్యాచ్లో 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్ను పూర్తి చేసింది. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు.. రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: Women's Asia Cup 2022: ఛాంపియన్ భారత్కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
మరో విజయమే లక్ష్యంగా... థాయ్లాండ్తో భారత్ ఢీ
మహిళల ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు నేడు తమ చివరి లీగ్ మ్యాచ్లో థాయ్లాండ్ జట్టుతో ఆడనుంది. బంగ్లాదేశ్ వేదికగా ఏడు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో హర్మన్ప్రీత్ కౌర్ బృందం ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు విజయాలు సాధించి, ఒక మ్యాచ్లో ఓడింది. మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. తుది జట్లు(అంచనా) భారత్: స్మృతి మంధాన (కెప్టెన్), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కిరణ్ నవ్గిరే, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, రేణుకా సింగ్, రాజేశ్వరి గయక్వాడ్ థాయ్లాండ్: నన్నపట్ కొంచరోయెంకై (వికెట్ కీపర్), నత్తకన్ చంతమ్, నరుఎమోల్ చైవై (కెప్టెన్), సోర్నరిన్ టిప్పోచ్, చనిద సుత్తిరువాంగ్, రోసెనన్ కానో, ఫన్నిత మాయ, నట్టయ బూచతం, ఒన్నిచ కమ్చోంఫు, బంతిద లీఫత్తానా, తిపట్చా పుట్టావొంగ్ చదవండి: సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం -
ఆసియాకప్లో భారత్ జైత్ర యాత్ర.. వరుసగా మూడో విజయం
మహిళల ఆసియాకప్-2022లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. షెల్లాట్ వేదికగా యూఏఈ మహిళలతో జరిగిన మ్యాచ్లో భారత్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఈ ఆసియాకప్లో వరుసగా మూడో విజయాన్ని భారత్ తమ ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తీ శర్మ(49 బంతుల్లో 64), రోడ్రిగ్స్( 45 బంతుల్లో 75) అర్ధ సెంచరీలతో చెలరేగారు. యూఏఈ బౌలర్లలో గౌర్, మొఘల్, కోట్టి, ఇషా రోహిత్ తలా వికెట్ సాధించారు. ఇక 179 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులకే పరిమితమైంది. యూఏఈ బ్యాటర్లో కవిషా ఎగోడాగే(30 నటౌట్), కుషీ శర్మ(29) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. కాగా భారత బౌలర్లలో రాజేశ్వరి గయక్వాడ్ రెండు వికెట్లు, దయాలన్ హేమలత ఒక్క వికెట్ సాధించింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో ఆక్టోబర్7న తలపడనుంది. చదవండి: LLC 2022: మహిళా అంపైర్తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. భారత క్రికెటర్ గదిలో చోరీ
ఇంగ్లండ్ మహిళలతో వన్డే సిరీస్లో భారత జట్టు సభ్యురాలిగా ఉన్న తానియా భాటియాకు అనూహ్య పరిణామం ఎదురైంది. లండన్లో ఆమె బస చేసిన మారియట్ హోటల్లోని తన గదిలో దొంగతనం జరిగినట్లు ఆమె వెల్లడించింది. ‘నన్ను చాలా నిరాశకు గురి చేసిన, నిర్ఘాంతపోయే ఘటన ఇది. ఎవరో అపరిచితులు నా గదిలోకి వచ్చి బ్యాగ్ చోరీ చేశారు. ఇందులో నగదు, కార్డులు, గడియారాలతో పాటు నగలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ బోర్డుతో భాగస్వామ్యం ఉన్న హోటల్లోనే ఇలా జరిగింది. భద్రతా ఏర్పాట్ల వైఫల్యం ఇది. వీలైనంత తొందరగా విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నా’ అని తానియా ట్వీట్ చేసింది. కాగా ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: Runout controversy: ‘అప్పటికే పలుమార్లు హెచ్చరించాం’ -
మహిళా క్రికెట్ జట్టుపై గంగూలీ అభ్యంతరకర ట్వీట్.. ఆటాడుకుంటున్న నెటిజన్లు
కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు గాను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దారుణమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటున్నాడు. ఈ విషయంలో నెటిజన్లు దాదాను ఓ ఆటాడుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి సిల్వర్ మెడల్తో సరిపెట్టుకుంది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో భారత్ 9 పరుగుల తేడాతో ఓడి కనకం గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. ఫైనల్లో ఓడినప్పటికీ హర్మన్ సేన స్పూర్తివంతమైన ప్రదర్శనకు గాను ప్రపంచం నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బీసీసీఐ బాస్ గంగూలీ కూడా హర్మన్ సేనను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. ఇందులో దాదా టీమిండియాను అభినందిస్తూనే, చురకలంటించే వ్యాఖ్యలు కూడా చేశాడు. Congratulations to the Indian women's team for winning silver ..But they will go home disappointed as it was their game tonite ..@BCCIWomen — Sourav Ganguly (@SGanguly99) August 7, 2022 "సిల్వర్ గెలిచినందుకు భారత మహిళా క్రికెటజట్టుకు అభినందనలు.. అయితే వాళ్లు మాత్రం ఇంటికి అసంతృప్తిగానే వస్తారు.. ఎందుకంటే మ్యాచ్ వాళ్ల చేతుల్లోనే ఉండింది అంటూ గంగూలీ ఆమోదయోగ్యంకాని ట్వీట్ చేశాడు. గంగూలీ చేసిన ఈ అభ్యంతరకర ట్వీట్పై ప్రస్తుతం నెట్టింట రచ్చ జరుగుతుంది. అభిమానులు దాదాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. they shouldn't be disappointed, they should be proud of that silver medal they should be disappointed for still not having a proper system in place for them and it's a bit ironic when he talks about a final game lol#CWG2022 https://t.co/ydsrD7ow7o — Nikhil Mane 🏏🇦🇺 (@nikhiltait) August 8, 2022 తొలి ప్రయత్నంలోనే అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, దాదాపు స్వర్ణం గెలిచినంత పని చేసినందుకుగాను టీమిండియాను మనస్పూర్తిగా అభినందించాల్సింది పోయి, హేళన చేసేలా వ్యాఖ్యలు చేస్తావా అంటూ సీరియస్ అవుతున్నారు. అసలు మీ ట్వీటే అతిపెద్ద అసంతృప్తి కలిగిస్తోందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి వ్యక్తి బోర్డు ప్రెసిడెంట్గా ఉండటం దురదృష్టకరమని కామెంట్లు చేస్తున్నారు. కాగా, కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళా క్రికెట్ జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. The biggest disappointment is you. https://t.co/gBj47PO0HD — ಸುಶ್ರುತ । Sushrutha (@3eyeview) August 8, 2022 This guy is an absolute 🤡 Shame that he is the president of World's most powerful board https://t.co/slQz1drjPI — Harsh Deshwal🇮🇳 (@IamHarshDeshwal) August 8, 2022 చదవండి: నాలుగో ర్యాంక్లో టీమిండియా ఓపెనర్ -
హర్మాన్ పోరాటం వృధా.. ఉత్కంఠ పోరులో ఆసీస్ చేతిలో టీమిండియాకు పరాభవం
CWG 2022 Womens Cricket Final: కామన్వెల్త్ గేమ్స్లో ఈసారి ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం 9 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (61; 8 ఫోర్లు), మెగ్ లానింగ్ (36; 5 ఫోర్లు, 1 సిక్స్), అష్లే గార్డ్నెర్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ] భారత బౌలర్లలో రేణుక సింగ్, స్నేహ్ రాణా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత మహిళల జట్టు 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హర్మన్ప్రీత్ కౌర్ (65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకపోయింది. మహిళల క్రికెట్లో రజతంతో భారత పతకాల సంఖ్య 52కు చేరింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో తొలి పతకం ఖరారు
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ క్రీడల్లో మహిళల క్రికెట్ ప్రవేశపెట్టిన తొలి ఎడిషన్లోనే హర్మన్ నేతృత్వంలోని టీమిండియా పతకం ఖరారు చేసింది. శనివారం ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో టీమిండియా అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఓపెనర్ స్మృతి మంధాన మెరుపు అర్ధసెంచరీ (32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 61 పరుగులు), మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ ఇన్నింగ్స్ సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 164 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో షఫాలీ వర్మ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), దీప్తి శర్మ (20 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. ఇంగ్లీష్ బౌలర్లలో కెంప్ 2, బ్రంట్, సీవర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి లక్ష్యం దిశగా సాగింది. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నతాలీ సీవర్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, సిక్స్) రనౌటవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా భారత్వైపు మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగులు కావల్సిన తరుణంలో స్నేహ్ రాణా (2/28) అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్కు చారిత్రక విజయాన్ని అందించింది. ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల క్రికెట్లో భారత్కు తొలి పతకం (కనీసం రజతం) ఖరారైంది. ఇంతకుముందు 1998 కామన్వెల్త్ గేమ్స్ పురుషుల క్రికెట్లో భారత్ కనీసం సెమీస్కు కూడా చేరలేకపోయిన విషయం తెలిసిందే. చదవండి: అదరగొడుతున్న అథ్లెట్లు.. స్టీపుల్ఛేజ్లో అవినాష్ సాబ్లేకు రజతం -
గార్డనర్ మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ హర్మాన్ప్రీత్ కౌర్(52), షఫాలీ వర్మ(48) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జానెసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..స్కాట్ రెండు వికెట్లు, బ్రౌన్ ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా కేవలం 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత యువ పేసర్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఆసీస్ను దెబ్బకొట్టింది. ఇక ఆసీస్ ఓటమి ఖాయం అనుకున్న వేళ బ్యాటర్లు ఆష్లీ గార్డనర్, గ్రేస్ హ్యారీస్ భారత్పై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 51 పరుగులు జోడించారు. అనంతరం మేఘనా సింగ్ బౌలింగ్లో గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 37 పరుగులు) ఔటైంది. ఆ తర్వాత వచ్చిన జొనసేన్ ను 14వ ఓవర్లో దీప్తి శర్మ పెవిలియన్కు పంపింది. ఒక వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతోన్న గార్డనర్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించింది. గార్డనర్ 52 పరుగులతో అఖరి వరకు నిలిచి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్ జూలై 31న పాకిస్తాన్ తో ఆడనున్నది. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో తొలి టీ20.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..! -
చరిత్ర సృష్టించేందుకు మరో 45 పరుగుల దూరంలో ఉన్న టీమిండియా క్రికెటర్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టీ20ల్లో ఓ భారీ రికార్డును తన పేరిట లిఖించుకునేందుకు అత్యంత సమీపంలో ఉంది. శ్రీలంకతో రేపటి నుంచి (జూన్ 23) ప్రారంభంకాబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో హర్మన్ మరో 45 పరుగులు సాధిస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించనుంది. 121 టీ20ల్లో 103 స్ట్రయిక్ రేట్తో 2319 పరుగులు చేసిన హర్మన్ శ్రీలంకతో సిరీస్లో మరో 45 పరుగులు చేస్తే టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక టీ20 పరుగుల రికార్డును (2364) అధిగమిస్తుంది. మిథాలీ రాజ్ 89 మ్యాచ్ల్లో 17 అర్ధ సెంచరీల సాయంతో 37.52 సగటున 2364 పరుగులు సాధించగా.. హర్మన 121 టీ20ల్లో సెంచరీ, 6 అర్ధ సెంచరీల సాయంతో 26.35 సగటున పరుగులు సాధించింది. ఇదిలా ఉంటే, భారత మహిళా జట్టు శ్రీలంక పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. జూన్ 23, 25, 27 తేదీల్లో డంబుల్లా వేదికగా మొత్తం టీ20లు జరుగనుండగా.. జులై 1, 4, 7 తేదీల్లో పల్లెకెలె వేదికగా వన్డే సిరీస్ జరుగనుంది. చదవండి: మిథాలీరాజ్ రిటైర్మెంట్.. కొత్త కెప్టెన్గా హర్మన్ప్రీత్ కౌర్ -
‘శభాష్’ అనిపించుకోగలిగాను!
2005... మెదక్ పట్టణంలో ఒక చిన్నస్థాయి క్రికెట్ టోర్నీ... అమ్మాయిలు క్రికెట్ ఆడటమే అరుదు అనుకుంటే కొందరు స్థానికుల చొరవతో టోర్నమెంట్ కూడా జరుగుతోంది. ఒక మ్యాచ్లో సరిగా చూస్తే మిథాలీ రాజ్ బ్యాటింగ్ చేస్తోంది. ఆమె భారత క్రికెట్ జట్టు తరఫున ఆడటం మొదలు పెట్టి అప్పటికే ఆరేళ్లు దాటింది... కానీ అక్కడ బరిలోకి దిగడానికి ఆమె సంకోచించలేదు... ఇలాంటి అంకితభావమే ఆమెను గొప్పగా తీర్చిదిద్దింది. ఆటపై ఉన్న అభిమానమే ఏకంగా 23 ఏళ్లు దేశం తరఫున ఆడేలా చేసింది. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పలు విశేషాలు... బయోపిక్... బయోగ్రఫీ... రిటైర్మెంట్ తర్వాతి కెరీర్పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నాకు తెలిసిన విద్య క్రికెట్ మాత్రమే కాబట్టి ఆటకు సంబంధించిందే అవుతుంది. ప్రస్తుతం నా బయోపిక్ ‘శభాష్ మిథూ’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. నా బాల్యం నుంచి పెద్ద స్థాయికి ఎదిగే వరకు వేర్వేరు అంశాలతో సినిమా ఉంటుంది. అయితే ఎక్కడితో సినిమాను ముగిస్తున్నామో ఇప్పుడే చెప్పను. తాప్సీ చక్కటి నటి కావడంతో పాటు మహిళా ప్రధాన చిత్రాలు కూడా కొన్ని చేసింది కాబట్టి బయోపిక్ కోసం ఆమెను సరైన వ్యక్తిగా అనుకున్నాం. దీంతో పాటు నా ఆటోబయోగ్రఫీ పని కూడా నడుస్తోంది. త్వరలోనే పుస్తకం విడుదలవుతుంది. లోటుగా భావించడం లేదు ప్రపంచకప్ గెలవాలనేది నా కల. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను కూడా. అయితే చివరకు అది లేకుండానే కెరీర్ ముగిసింది. కానీ అది లేనంత మాత్రాన నా ఇన్నేళ్ల ప్రదర్శన విలువ తగ్గదు. భారత పురుషుల క్రికెట్లోనూ చూస్తే ప్రపంచకప్ గెలిచిన టీమ్లో భాగం కాకపోయినా, క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవారు ఎంతో మంది ఉన్నారు. రెండు ప్రపంచకప్లలో జట్టును ఫైనల్కు చేర్చడం కూడా చెప్పుకోదగ్గ ఘనతే కాబట్టి విచారం ఏమీ లేదు. సుదీర్ఘ కెరీర్కు అదే కారణం చాలా ఎక్కువగా కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నిలకడగా, మార్పు లేకుండా ఇన్నేళ్ల పాటు ఒకే తరహా ‘టైమ్ టేబుల్’ను అమలు చేశాను. అత్యుత్తమంగా ఎదిగేందుకు సన్నద్ధత, ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఆటకు మెరుగులు దిద్దుకోవడం, అదే ప్రాక్టీస్, అదే డ్రిల్స్ను ఏకాగ్రత చెదరకుండా 23 ఏళ్ల పాటు కొనసాగించగలిగాను. రోజూ ఇదేనా అనే భావన లేకుండా మైదానంలోకి వచ్చేదాన్ని. నా సాధన నాకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు. అందుకే ఇలాంటి కెరీర్ సాధ్యమైంది. సమాజంలో కొందరు నేను క్రికెట్ ఆడటంపై కామెంట్లు చేసినా... మైదానంలో మాత్రం ఎప్పుడూ, ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు. అలా అనుకోలేదు ఎన్నో గంటల ప్రాక్టీస్ తర్వాత కూడా ఆడింది చాలు, కొంత విరామం తీసుకుందాం, కొంచెం విశ్రాంతిగా కూర్చుందాం అనే ఆలోచన రాలేదు. చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను కదా, ఇంత అవసరమా అనుకోలేదు. సరిగ్గా చెప్పాలంటే నాపై నేను ఎప్పుడూ జాలి పడలేదు. 23 ఏళ్ల కెరీర్లో నేను గాయాలపాలైంది కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు గాయపడినా సిరీస్ మొత్తానికో, ఒక టోర్నీకో ఎప్పుడూ దూరం కాలేదు. రక్తం కారినప్పుడు కూడా బయటకు వెళ్లాలనే భావన రాలేదు. నొప్పి, బాధను భరిస్తూనే ఆడేందుకు ప్రయత్నించా. ఆట ముగిసిన తర్వాతే కోలుకోవడంపై దృష్టి పెట్టా. ఇన్నేళ్ళలో ఇది కూడా నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక్క 2009లో మాత్రమే మోకాలి గాయంతో చాలా బాధపడ్డా. రిటైర్మెంట్ ఇద్దామని అనుకున్న క్షణమది. అయితే అదృష్టవశాత్తూ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా బీసీసీఐలోకి రావడంతో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సౌకర్యాలను తొలిసారి ఉపయోగించుకునే అవకాశం కలిగి కోలుకోగలిగాను. అన్ని చోట్లా ఆడాను కెరీర్ ఆరంభంలో బీసీసీఐ సహకారం లేని సమయంలో ఆర్థికపరంగా మేం ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పట్టించుకోకుండా ఆడటం గురించి అందరికీ తెలుసు. అయితే మరో అంశం గురించి నేను చెప్పాలి. క్రికెట్పై ఆ సమయంలో నాకున్న అపరిమిత ప్రేమ, పిచ్చి ఎక్కడికైనా వెళ్లేలా చేసింది. భారత్ తరఫున అరంగేట్రం చేసి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా నేను ‘ఇన్విటేషన్ టోర్నమెంట్’లకు వెళ్లడం మానలేదు. చిన్న పట్టణాల్లో, హైస్కూల్ మైదానాల్లో జరిగిన మ్యాచ్లలో కూడా పాల్గొన్నాను. టర్ఫ్ వికెట్, మ్యాట్ వికెట్ ఏదైనా సరే... ఆడే అవకాశం వస్తే చాలని అనిపించేది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, మంచి జ్ఞాపకాలవి. టి20లు కలిసి రాలేదు నేను అంతర్జాతీయ క్రికెట్ మొదలు పెట్టినప్పుడు టి20లు లేవు. మహిళల క్రికెట్లోనూ టెస్టులు ఉండి ఉంటే దాంతో పాటు వన్డేలను ఎంచుకొని అసలు టి20 ఆడకపోయేదాన్నేమో. కానీ టెస్టులు లేకపోవడంతో రెండో ఫార్మాట్ అవసరం ఏర్పడింది. నేను మూడో టి20 ఆడే సమయానికే నా అంతర్జాతీయ కెరీర్ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత ఆలస్యంగా మొదలు పెట్టడంతో నేను సర్దుకోవడానికే టైమ్ పట్టింది. ఓపెనర్గా వచ్చే సాహసం చేశాక పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. కోచ్ రమేశ్ పొవార్తో వివాదంతో నా కెరీర్ ముగియలేదు. ఆ తర్వాతా రెండు సిరీస్లు ఆడి ఇక చాలనుకున్నాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను. ప్రస్తుత క్రికెటర్లతో పోల్చరాదు వాణిజ్యపరంగా నాకు ఆశించినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. వాస్తవికంగా చూస్తే సగంకంటే ఎక్కువ కెరీర్ నన్ను ఎక్కువ మంది కనీసం గుర్తు కూడా పట్టని విధంగానే సాగింది. అలాంటప్పుడు కార్పొరేట్లు ఎలా ముందుకొస్తాయి. సరిగా గమనిస్తే 2017 వన్డే వరల్డ్కప్ ఫైనల్ తర్వాతి నుంచి భారత మహిళల ప్రతీ మ్యాచ్ టీవీలో లైవ్గా వచ్చింది. అంతకుముందు అసలు టీవీల్లో కూడా కనిపిస్తే కదా! స్మృతి మంధాన, హర్మన్ప్రీత్లతో పోలిస్తే నా ప్రయాణం పూర్తిగా భిన్నం. వీరితో పోలిస్తే ఇప్పుడే వచ్చిన షఫాలీ, రిచాలు కూడా భిన్నం. కాబట్టి పోలిక అనవసరం. భారత మహిళల క్రికెట్ ఎదుగుదలలో నేనూ కీలక భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అంశం. -
పరాజయంతో ప్రారంభం
క్వీన్స్టౌన్: భారత మహిళల క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనను పరాజయంతో మొదలుపెట్టింది. బుధవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్లో ఆతిథ్య కివీస్ 18 పరుగుల తేడాతో గెలిచింది. మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. సుజీ బేట్స్ (36; 2 ఫోర్లు), కెప్టెన్ సోఫీ డివైన్ (31; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. పూజ, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేసింది. ఆంధ్రపదేశ్కు చెందిన సబ్బినేని మేఘన (30 బంతుల్లో 37; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (12) నిరాశపరిచింది. క్వారంటైన్ లో ఉండటంతో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్కు దూరమైంది. ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈనెల 12న జరిగే తొలి వన్డేలోనూ స్మృతి బరిలో దిగే అవకాశం కనిపించడంలేదు. -
నేడు భారత్, ఇంగ్లండ్ మహిళల తొలి టి20
నార్తాంప్టన్: భారత మహిళల క్రికెట్ జట్టు ఇక టి20ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో నేడు భారత్,ఇంగ్లండ్ల మధ్య తొలిటి20 జరుగనుంది. వన్డేల్లాగే ఈ ఫార్మాట్లోనూ ప్రత్యర్థి జట్టు మనకంటే బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ బృందం విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఫామ్లో లేని కెప్టెన్ హర్మన్పైనే తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ ఇచ్చే ఆరంభంపై భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. స్నేహ్ రాణా, రిచా ఘోష్లతో పాటు సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ కూడా కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మరో వైపు స్టార్ ప్లేయర్ డానీ వ్యాట్ పునరాగమనంతో ఇంగ్లండ్ మరింత పటిష్టంగా తయారైంది. -
సమరానికి సమయం...
ఇంగ్లండ్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ ఒకవైపు... దీని గురించి సుదీర్ఘ చర్చోపచర్చలు సాగుతుండగా మరోవైపు సౌతాంప్టన్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో భారత మహిళల జట్టు ప్రశాంతంగా తమ సన్నాహాలు కొనసాగిస్తోంది. పురుషుల టీమ్తో పాటే ప్రయాణించి ఒకేసారి ఇంగ్లండ్ చేరిన మహిళలు డబ్ల్యూటీసీ ఫైనల్కంటే రెండు రోజుల ముందుగానే మైదానంలోకి దిగబోతున్నారు. నేటి నుంచి ఆతిథ్య జట్టుతో మిథాలీ బృందం తలపడే ఏకైక టెస్టు మ్యాచ్కు రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల ఈ పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం. భారత జట్టు తాము ఆడిన గత వరుస మూడు టెస్టుల్లో కూడా గెలిచింది. ఈ మ్యాచ్లో గెలిస్తే నాలుగో విజయంతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది. బ్రిస్టల్: ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. బుధవారం నుంచి జరిగే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. 2014 తర్వాత భారత్ టెస్టులు ఆడనుండటం ఇదే తొలిసారి కాగా... ఈ మధ్య కాలంలో మూడు టెస్టులు ఆడిన ఇంగ్లండ్దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయితే గత పర్యటనలో ఇంగ్లండ్ను వారి సొంతగడ్డపైనే ఓడించిన భారత జట్టును తక్కువగా అంచనా వేయలేం. సీనియర్లపైనే భారం... భారత్ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉండగా... అందరూ ఆడిన మ్యాచ్లు కలిపి 30 మాత్రమే. వన్డే, టి20 ఫార్మాట్ రెగ్యులర్ ప్లేయర్లు ఈ ఫార్మాట్లో అదే స్థాయి ఆటను ప్రదర్శించడం అంత సులువు కాదు. పైగా వీరందరూ కనీసం దేశవాళీ క్రికెట్లో కూడా నాలుగు రోజుల మ్యాచ్లు ఆడలేదు. ఈ నేపథ్యంలో ఎంతో కొంత సీనియర్లే మ్యాచ్లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పదేసి టెస్టుల అనుభవం ఉన్న కెప్టెన్ మిథాలీ రాజ్, పేసర్ జులన్ గోస్వామి జట్టును ముందుండి నడిపించాలి. బ్యాటింగ్లో మిథాలీ కీలకం కానుంది. ఆమె బలమైన డిఫెన్స్ కూడా వికెట్ల పతనాన్ని అడ్డుకోగలదు. అయితే జులన్ చాలా కాలంగా బౌలింగ్లో సుదీర్ఘ స్పెల్లు వేయలేదు కాబట్టి ఎలా ఆడుతుందనేది చూడాలి. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్లో హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానున్నారు. క్రీజ్లో కాస్త ఓపిక ప్రదర్శించి ఎక్కువ సమయం క్రీజ్లో గడపగలిగితే వీరిద్దరు పరుగులు రాబట్టగల సమర్థులు. దీప్తి శర్మ ఆల్రౌండ్ నైపుణ్యంతో పాటు ఓపెనర్గా పూనమ్ రౌత్ కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. స్పిన్నర్గా పూనమ్ యాదవ్కు కూడా తన సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. పేసర్లలో శిఖా పాండే, అరుంధతి రెడ్డిలలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. అన్నింటికి మించి అందరి దృష్టి ఉన్న బ్యాటర్ షఫాలీ వర్మ. టి20లు మినహా కనీసం వన్డేల అనుభవం కూడా లేని షఫాలీని టెస్టులోకి ఎంపిక చేసింది ఆమె దూకుడైన ఆట కారణంగానే. షఫాలీ చెలరేగితే భారత్ పైచేయి సాధించగలదు. ఊహించినట్లుగానే ఈ మ్యాచ్కు ముందు భారత్కు ఆశించినంత ప్రాక్టీస్ లభించలేదు. అయితే పరిమిత వనరులతోనే మెరుగ్గా ఆడగలమని జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. అనుభవజ్ఞులతో... 15 మంది సభ్యుల ఇంగ్లండ్ టెస్టు జట్టులో 11 మందికి టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అందరూ కలిసి 47 టెస్టు మ్యాచ్లు ఆడారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన గత మూడు టెస్టుల్లో బరిలోకి దిగిన వారంతా దాదాపుగా ప్రస్తుత జట్టులో ఉన్నారు. కెప్టెన్ హీతర్నైట్, నటాలీ స్కివర్, ఓపెనర్ బీమాంట్, ఆల్రౌండర్ బ్రంట్లకు తమకంటూ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పేసర్లు ష్రబ్సోల్, కేట్ క్రాస్లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్స్టోన్ అత్యంత ప్రభావవంతమైన బౌలర్గా పేరు సంపాదించుకుంది. వీరందరికీ ఒంటి చేత్తో మ్యాచ్ను శాసించగల సామర్థ్యం ఉంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో పాటు ఫిట్నెస్పరంగా కూడా వీరంతా మన జట్టు సభ్యులతో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నారు. ఇన్నేళ్ల కెరీర్లో నేను చాలా తక్కువ టెస్టులే ఆడాననేది వాస్తవం. అయితే ఫార్మాట్ ఏదైనా సన్నాహాలు మాత్రం ఒకే తరహాలో ఉం టాయి. మేం అలాగే సిద్ధమయ్యాం. ఈ క్రమం లో అనేక మంది ఇతర క్రికెటర్ల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నాం. జట్టులోని జూనియర్ సహచరులకు కూడా టెస్టులు ఎలా ఆడాలనేదాని గురించి మేం చెప్పాం. చాలా మందికి కొత్త కాబట్టి అనవసరపు ఒత్తిడి పెంచుకోవద్దని, స్వేచ్ఛగా ఆడుతూ క్రికెట్ను ఆస్వాదించాలని చెప్పాం. మున్ముందు జరిగే ద్వైపాక్షిక సిరీస్లలో తప్పనిసరిగా కనీసం ఒక టెస్టు ఉంటే బాగుంటుందనేది నా సూచన. –మిథాలీ రాజ్, భారత కెప్టెన్ కామన్వెల్త్ గేమ్స్లో మహిళల క్రికెట్కు 10 రోజులు బర్మింగ్హమ్: 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు జరిగే తేదీల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. టి20 ఫార్మాట్లో జరిగే ఈ మ్యాచ్లను జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు చోటు కల్పించడం ఇదే మొదటిసారి. ఆగస్టు వరకు లీగ్ మ్యాచ్లు, ఆగస్టు 6న సెమీఫైనల్ జరగనుండగా...ఆగస్టు 7న ఫైనల్తో పాటు మూడో స్థానం కోసం పోరు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అర్హత సాధించగా... ఆతిథ్య జట్టు హోదాలో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఒకే వెస్టిండీస్ జట్టుగా కాకుండా వేర్వేరు కరీబియన్ దేశాలు (ట్రినిడాడ్, జమైకా తదితర) పోటీ పడి వాటిలోంచి ఒక టీమ్, 2022 జనవరిలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి మరో జట్టు అర్హత సాధిస్తాయి. -
ఫీల్డింగ్లో మెరుగుపడాలి
న్యూఢిల్లీ: విదేశీ జట్లపై నిలకడగా విజయాలు దక్కాలంటే భారత మహిళల క్రికెట్ జట్టు ఫీల్డింగ్ విభాగంలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ అభిప్రాయపడ్డారు. చాలాకాలం భారత అండర్–19 పురుషుల జట్టుకు కోచ్గా వ్యవహరించిన అభయ్ శర్మ... గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్లో భారత మహిళల జట్టుకు తొలిసారి ఫీల్డింగ్ కోచ్గా వచ్చారు. చివరి నిమిషంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఏర్పాటు కావడం... జట్టు సభ్యులతో కలిసి పనిచేసేందుకు తగినంత సమయం కూడా లభించకపోవడంతో ఆయన ఫీల్డింగ్ విభాగంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన మాత్రం అభయ్ శర్మ పనితీరు ఎలా ఉందనే విషయం తెలియజేస్తుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్లు ఆడనుంది. ‘ఫీల్డింగ్ విషయానికొస్తే చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మహిళల క్రికెట్లో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయాలంటే, పరుగులు ఎక్కువ ఇవ్వకూడదంటే ఫీల్డర్లు మైదానంలో ఎల్లవేళలా చురుకుగా కదలాల్సి ఉంటుంది. సాంకేతికంగా కూడా కొన్ని అంశాల్లో మనం మెరుగుపడాలి. ముఖ్యంగా త్రోయింగ్లో మన అమ్మాయిలు బలహీనంగా ఉన్నారు. కెరీర్ ఆరంభంలోనే మనం సరైన పద్ధతిలో శిక్షణ తీసుకోకపోతే ఆ తర్వాత మనకు ఇబ్బందులు ఎదురవుతాయి’ అని అభయ్ శర్మ విశ్లేషించారు. ‘విదేశీ మహిళా క్రికెటర్లతో పోలిస్తే మనం కొన్ని విభాగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నామని అంగీకరించాలి. దక్షిణాఫ్రికా అమ్మాయిలు మైదానంలో చురుకుగా కదులుతారు. శారీరకంగా కూడా విదేశీ మహిళా క్రికెటర్లు పటిష్టంగా ఉంటారు’ అని అభయ్ శర్మ వివరించారు. -
‘పింక్ టెస్టు’ బరిలో మహిళలు
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు తమ 45 ఏళ్ల టెస్టు మ్యాచ్ చరిత్రలో ఇప్పటి వరకు 36 టెస్టులు ఆడింది. జూన్ 16నుంచి ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్ జట్టుకు 37వది అవుతుంది. దీని తర్వాత తొలి సారి మన టీమ్ మిథాలీ రాజ్ నాయకత్వంలో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడటం ఖాయమైంది. సెప్టెంబర్ 30నుంచి పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగే ఏకైక టెస్టును ‘పింక్ బాల్’తో నిర్వహించనున్నట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మహిళల క్రికెట్ను మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో భాగంగా పింక్ బాల్ టెస్టు అవకాశం కల్పించినట్లు బోర్డు కార్యదర్శి జై షా వెల్లడించారు. ఆస్ట్రేలియాలో భారత మహిళల జట్టు పర్యటన షెడ్యూల్ను ఆసీస్ క్రికెట్ బోర్డు (సీఏ) ఖరారు చేసింది. సెప్టెంబర్ 19, 22, 24 తేదీల్లో వన్డేలు...అక్టోబర్ 7, 9, 11 తేదీల్లో టి20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ రెండింటి మధ్య ఏకైక టెస్టును నిర్వహిస్తారు. మహిళల క్రికెట్లో గతంలో ఒకే ఒక డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరిగింది. 2017లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య సిడ్నీలో జరిగిన ఈ టెస్టు డ్రాగా ముగిసింది. -
మహిళల జట్టులో అన్నీ రాజకీయాలే!
భారత మహిళల క్రికెట్ జట్టు అంతర్గత వ్యవహారాలపై మరో మాజీ కోచ్ తుషార్ అరోథే తీవ్ర విమర్శలు చేశారు. బయటకు కనిపించని రాజకీయాలు చాలా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీమ్తో సంబంధం లేని మాజీ మహిళా క్రికెటర్లు బయటినుంచి ఎన్నో విషయాలు శాసిస్తుంటారని అన్నారు. తప్పు ఎవరిదైనా కోచ్పైనే వేటు పడుతుందన్న తుషార్... అగ్రశ్రేణి జట్లతో పోటీ పడే విధంగా మన సన్నాహకాలు బాగుండాలని చెబితే తాము అంత కష్టపడలేం అన్నట్లుగా వారు వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. -
ఇంగ్లండ్లో భారత మహిళల క్రికెట్ జట్టు పర్యటన రద్దు!
ముంబై: భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన రద్దయింది. కరోనా కారణంగా మన జట్టు అక్కడికి వెళ్లి ఆడే పరిస్థితి లేదు కాబట్టి టూర్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం జూన్లోనే భారత మహిళల జట్టు ఇంగ్లండ్తో 3 వన్డేలు, 3 టి20ల్లో తలపడాల్సింది. అప్పుడు దానిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినా... ఇప్పుడు పూర్తిగా రద్దయినట్లే. అయితే వచ్చే సెప్టెంబరులోనైనా భారత్, దక్షిణాఫ్రికా జట్లతో కలిసి ముక్కోణపు టోర్నీ నిర్వహించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. అయితే భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో సెప్టెంబర్లోనూ భారత్ మహిళల జట్టు ఇంగ్లండ్లో పర్యటించే అవకాశం లేదు. ఒకవేళ భారత్ రాకపోతే దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ ద్వైపాక్షిక సిరీస్ ఆడే అవకాశం ఉంది. -
‘లూడో కలిపింది అందరినీ’
ముంబై: కరోనా నేపథ్యంలో అసలు ఆటలన్నీ ఆగిపోవడంతో ప్లేయర్లంతా ఇతర వ్యాపకాల్లో బిజీగా మారుతున్నారు. ఇంటి డ్రాయింగ్ రూమ్లో ఆర్చరీ రేంజ్లు, వర్చువల్ షూటింగ్ రేంజ్లలో తమ సామర్థ్యం మెరుగుపర్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తుండగా, సరదాగా ఆన్లైన్ క్రీడలతో సమయం గడుపుతున్నవారు మరికొందరు. భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. వీరంతా ఆన్లైన్లో కలిసికట్టుగా లూడో గేమ్ను ఆడుతున్నారు. బ్యాట్, బంతి పక్కకు వెళ్లిపోగా పాచికలే ఇప్పుడు వారికి పరమపూజ్యంగా మారిపోయాయి. జట్టు ఓపెనర్ స్మృతి మంధాన ఈ విషయాన్ని వెల్లడించింది. ‘మేం ఫ్రెండ్స్ అంతా కలిసి ఆన్లైన్లో లూడో గేమ్ను ఆడుతున్నాం. ఇందులో జట్టు సభ్యులంతా పాల్గొంటున్నారు. మైదానంలో అందరితో కలిసి ఉండే తరహాలోనే ఇప్పుడు దీని ద్వారా కూడా అదే బంధం, సాన్నిహిత్యం కొనసాగిస్తున్నట్లుగా ఉంది. దీంతో పాటు ఫిట్గా ఉండటం కూడా కీలకం. మా ట్రైనర్ మాకందరికీ విడివిడిగా పంపించిన ట్రైనింగ్ షెడ్యూల్ను అనుసరిస్తూ మేమంతా ఫిట్నెస్ను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నాం’ అని స్మృతి వెల్లడించింది. బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ లాక్డౌన్లో తాను ఎలా సమయం గడుపుతున్నానో చెప్పింది. ‘కుటుంబసభ్యులందరం సరదాగా గడుపుతున్నాం. పేకాట, ఇంటి పని, వంట పని, సోదరుడితో అల్లరి ఎలాగూ ఉన్నాయి. సినిమాలంటే బాగా ఇష్టం కాబట్టి వారానికి రెండు, మూడు సినిమాలు చూస్తున్నాను. అన్నింటికి మించి నాకు ఇష్టమైన వ్యాపకం నిద్ర. రోజుకు కనీసం 10 గంటలు పడుకుంటున్నాను. దాని వల్ల మిగిలిన రోజంతా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తోంది’ అని స్మృతి చెప్పింది. ఇంటి పని చేస్తూ స్మృతి -
సీఏసీ నుంచి తప్పుకున్న శాంత రంగస్వామి
న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశమై అక్టోబర్ 10లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసు రావడంతో భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ శాంత రంగస్వామి... క్రికెట్ సలహా మండలి (సీఏసీ), భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) నుంచి ఆదివారం తప్పుకొన్నారు. దిగ్గజ ఆల్రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలోని సీఏసీలో సభ్యురాలిగా ఉన్న శాంత... ఇటీవల టీమిండియా హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఎంపికలో పాల్గొన్నారు. దీంతో ఆమె విరుద్ధ ప్రయోజనాల పరిధిలోకి వస్తారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐ ఎథిక్స్ అధికారికి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పదవుల నుంచి శాంత వైదొలగారు. ‘నాకు వేరే ప్రణాళికలున్నాయి. వాటిపై దృష్టిపెట్టాలి. అయినా, సీఏసీ ఏడాదికో రెండేళ్లకో ఒకసారి సమావేశం అవుతుంది. ఇందులో విరుద్ధ ప్రయోజనాలు ఏమున్నాయో? సీఏసీలో సభ్యురాలిని కావడం గౌరవంగా భావిస్తున్నా. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ పాలనకు తగిన మాజీ ఆటగాళ్లను ఎంపిక చేయడం కష్టమేమో? ఐసీఏకు దాని ఎన్నికల కంటే ముందే రాజీనామా చేశా’ అని శాంత కాస్త తీవ్రంగా స్పందించారు. -
మిథాలీ స్థానంలో షెఫాలీ
న్యూ ఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టులో టీనేజీ బ్యాటింగ్ సంచలనం షెఫాలీ వర్మకు చోటు దక్కింది. హరియాణాకు చెందిన 15 ఏళ్ల షెఫాలీ... దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగనున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో తొలి మూడు మ్యాచ్లకు ఎంపికైంది. తాజాగా టి20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన హైదరాబాదీ వెటరన్ మిథాలీ రాజ్ స్థానంలో ఆమెకు అవకాశం లభించింది. తెలుగమ్మాయి, పేసర్ అరుంధతిరెడ్డికి సైతం స్థానం దక్కింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన బీసీసీఐ అండర్–19 టోర్నీలో విధ్వంసక ఆటతో 5 ఇన్నింగ్స్ల్లో 376 పరుగులు చేసి షెఫాలీ అందరి దృష్టిలో పడింది. మహిళల టి20 చాలెంజ్ టోర్నీలోనూ రాణించడంతో జాతీయ జట్టులోకి రావడం ఖాయమని తేలిపోయింది. దక్షిణాఫ్రికా సిరీస్కు జట్టు ఎంపికకు గురువారం సమావేశమైన సెలక్షన్ కమిటీ... వన్డేలకు మిథాలీ రాజ్, టి20లకు హర్మన్ప్రీత్ కౌర్లను సారథులుగా కొనసాగించింది. తొలి టి20 ఈ నెల 24న సూరత్లో జరుగనుంది. -
నేను తప్పు చేయలేదు!
వడోదర: ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడి పోలీసుల చేతిలో అరెస్టయిన భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ అరోథే తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. తానెప్పుడూ ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. బెట్టింగ్ అభియోగంపై తుషార్తో పాటు మరో 18 మందిని బరోడా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయగా...ఆ తర్వాత వారు బెయిల్పై విడుదలయ్యారు. అనంతరం ఈ ఘటనపై తుషార్ స్పందించారు. ‘క్రికెట్ నా జీవనాధారం. ఇవాళ నాకు ఈ మాత్రం పేరు వచ్చి ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు క్రికెట్టే కారణం. నేనెప్పుడూ అలాంటి తప్పుడు పని చేయను. చేయడం సంగతేమో కానీ కనీసం ఆలోచించను కూడా. జీవితంలో ఒక్క పైసా విషయంలో కూడా ఎవరినీ మోసం చేయలేదు’ అని అరోథే వ్యాఖ్యానించారు. -
అమ్మాయిలూ... ఇదొక్కటైనా?
హామిల్టన్: ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ తప్పించుకోవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో భారత మహిళల క్రికెట్ జట్టు నేడు చివరి టి20 బరిలో దిగుతోంది. బ్యాటింగ్ వైఫల్యమే రెండు మ్యాచ్ల్లోనూ జట్టును దెబ్బతీసినందున ఈసారైనా ఆ విభాగంలో మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్లపై జట్టు అతిగా ఆధారపడుతోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఈ పర్యటనలో స్థాయికి తగ్గ ఇన్నింగ్సే ఆడలేదు. త్వరలో టి20లకు వీడ్కోలు పలకనున్న వెటరన్ మిథాలీరాజ్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్ మెరుగైన స్కోరు చేస్తేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. మరోవైపు ముందుగా బ్యాటింగ్కు దిగినా, బౌలింగ్ చేసినా ప్రత్యర్థిని కీలక సమయాల్లో దెబ్బకొడుతూ సొంతగడ్డపై న్యూజిలాండ్ సమష్టిగా రాణిస్తోంది. భారత్... ఈ మ్యాచ్లో కలసి కట్టుగా ఆడితేనే గెలుపు తీరం చేరుతుంది. ►ఉదయం గం. 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
మళ్లీ ఓడిన హర్మన్ బృందం
ఆక్లాండ్: వన్డే సిరీస్ను రెండు వరుస విజయాలతో కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు టి20 సిరీస్ను మాత్రం రెండు వరుస ఓటములతో కోల్పోయింది. అయితే, తొలి మ్యాచ్ తరహాలో కాకుండా ఈసారి చివరి వరకు పోరాడింది. కీలక సమయంలో ఒత్తిడి అధిగమించిన ఆతిథ్య న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి పరుగు తీసి 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2–0తో కైవసం చేసుకుంది. మూడో టి20 ఆదివారం హామిల్టన్లో జరుగుతుంది. బ్యాటింగ్లో మళ్లీ తడబాటు... సిరీస్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో శుక్రవారం టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హర్మన్ ప్రీత్ బృందం మిడిలార్డర్ వైఫల్యంతో మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. ఓపెనర్ ప్రియా పూనియా (4) త్వరగానే వెనుదిరగ్గా... మరో ఓపెనర్ స్మృతి మంధాన (27 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్), వన్డౌన్లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 72; 6 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు చూపారు. 44 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. దీంతో పదో ఓవర్లోనే జట్టు స్కోరు 71కి చేరుకుంది. ఈ దశలో కివీస్ అమ్మాయిలు కట్టడి చేశారు. మంధానతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (5), దీప్తిశర్మ (1)లను వెంటవెంటనే ఔట్ చేశారు. హేమలత (2) రిటైర్డ్ హర్ట్గా క్రీజును వీడింది. వేగంగా ఆడబోయి జెమీమా స్టంపౌటైంది. టీమిండియా చివరి 10 ఓవర్లలో 63 పరుగులే చేయగలిగింది. రోజ్మేరీ మైర్ (2/17) పొదుపుగా బౌలింగ్ చేసింది. ఛేదనలో కివీస్ ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసి సరిగ్గా 20వ ఓవర్ చివరి బంతికి విజయాన్ని అందుకుంది. 33 పరుగులు జోడించి ఓపెనర్లు సుజీ బేట్స్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు), సోఫియా డివైన్ (19) శుభారంభం ఇచ్చారు. డివైన్, వన్డౌన్ బ్యాటర్ కైట్లిన్ గ్యురె (4)ను ఔట్ చేసి టీమిండియా పట్టు సాధించింది. బేట్స్, కెప్టెన్ సాటర్వైట్ (23) మూడో వికెట్కు 61 పరుగులు జత చేయడంతో న్యూజిలాండ్ గెలుపు సులువే అనిపించింది. వీరితో పాటు అన్నా పీటర్సన్ (0) త్వరగా ఔటవడం ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ నెలకొంది. తొలి బంతికి ఫోర్ కొట్టిన వికెట్ కీపర్ క్యాటీ మార్టిన్ (13) రెండో బంతికి బౌల్డయింది. లిసా కాస్పరెక్ (4 నాటౌట్), రోయి (4 నాటౌట్) నిలిచారు. చివరి బంతికి సింగిల్ తీసిన రోయి జట్టుకు విజయం అందించింది. భారత బౌలర్లలో హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి, రాధా యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. -
మన మహిళలదే సిరీస్
మౌంట్ మాంగనీ: పురుషుల బాటలోనే భారత మహిళల క్రికెట్ జట్టు కివీస్ పని పట్టింది. అదే వేదికపై రెండో వన్డేలోనూ విజయం సాధించి 2–0తో సిరీస్ను గెలుచుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ మహిళలను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కివీస్ 44.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ అమీ సాటర్వైట్ (87 బంతుల్లో 71; 9 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. జులన్ గోస్వామి 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 35.2 ఓవర్లలో 2 వికెట్లకు 166 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన స్మృతి మంధాన (83 బంతుల్లో 90; 13 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో సెంచరీ అవకాశాన్ని త్రుటిలో కోల్పోగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (111 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించింది. ఐసీసీ ఉమెన్ చాంపియన్షిప్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో విజయంతో భారత్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం హామిల్టన్లో జరుగుతుంది. కట్టడి చేసిన ఏక్తా... కెప్టెన్ సాటర్వైట్ పోరాటం మినహా కివీస్ ఇన్నింగ్స్లో చెప్పుకోవడానికేమీ లేదు. భారత బౌలింగ్ ముందు ఆ జట్టు పూర్తిగా తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సుజీ బేట్స్ (0)ను జులన్, ఆ వెంటనే డెవిన్ (7)ను శిఖా ఔట్ చేసి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత పరుగులు తీయడంలో ఇబ్బంది పడటంతో పాటు స్వల్ప విరామాల్లో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఏక్తా బిష్త్ 8 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టి పడేసింది. తన వరుస ఓవర్లలో ఆమె డౌన్ (15), కెర్ (1)లను పెవిలియన్ పంపించింది. మరో వైపు ఓపిగ్గా ఆడిన సాటర్వైట్ 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత జోరు పెంచి దీప్తి శర్మ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ఆమెను పూనమ్ ఔట్ చేయడంతో కివీస్ పతనం మరింత వేగంగా సాగిపోయింది. భారీ భాగస్వామ్యం... స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్ కాగా, కొద్ది సేపటికే దీప్తి శర్మ (8) కూడా వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత భారత్ను కివీస్ నిరోధించలేకపోయింది. మరో వికెట్ పడకుండా స్మృతి, మిథాలీ జట్టును జట్టును విజయపథంలో నడిపించారు. చక్కటి షాట్లతో అలరించిన స్మృతి 54 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకుంది. ఇందులోనే 8 ఫోర్లు ఉండటం విశేషం. కెప్టెన్ మిథాలీరాజ్ ఆరంభంలో కొంత తడబడ్డా ఆ తర్వాత నిలదొక్కుకుంది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకునేందుకు ఆమెకు 102 బంతులు అవసరమయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరు చకచకా లక్ష్యం వైపు దూసుకుపోయారు. కెర్ వేసిన 36వ ఓవర్లో భారీ సిక్స్ కొట్టి కెప్టెన్ మ్యాచ్ను ముగించింది. స్మృతి, మిథాలీ మూడో వికెట్కు అభేద్యంగా 151 పరుగులు జోడించారు. -
అమ్మాయిలూ అదరగొట్టారు
తీవ్ర దుమారం రేపిన టి20 ప్రపంచ కప్ సెమీఫైనల్ వివాదం తర్వాత... ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు దుమ్మురేపింది. ఒక రోజు ముందు పురుషుల జట్టు ఏ విధంగానైతే సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిందో... అదేచోట, అదే తరహాలో చెలరేగి ఆడి ఆతిథ్య న్యూజిలాండ్పై తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. తొలుత స్పిన్త్రయం విజృంభించి ప్రత్యర్థిని కుప్పకూల్చగా... తర్వాత ఓపెనింగ్ ద్వయం విరుచుకుపడి సునాయాసంగా జట్టును లక్ష్యానికి చేర్చింది. నేపియర్ : భారత మహిళల క్రికెట్ జట్టు కివీస్ పర్యటనను ఘన విజయంతో ప్రారంభించింది. బౌలింగ్లో స్పిన్నర్లు ఏక్తా బి‹ష్త్ (2/32), పూనమ్ యాదవ్ (3/42), దీప్తి శర్మ (2/27) మాయాజాలం... బ్యాటింగ్లో ఓపెనర్లు స్మృతి మంధాన (104 బంతుల్లో 105; 9 ఫోర్లు, 3 సిక్స్లు) అద్భుత శతకానికి తోడు జెమీమా రోడ్రిగ్స్ (94 బంతుల్లో 81; 9 ఫోర్లు) దుమ్మురేపడంతో గురువారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆతిథ్య జట్టు టీమిండియా స్పిన్నర్ల ధాటికి 48.4 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ సుజీ బేట్స్ (54 బంతుల్లో 36; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. స్మృతి, జెమీమా జోరుతో 33 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 193 పరుగులు చేసి భారత్ లక్ష్యాన్ని అందుకుంది. రెండో వన్డే ఈ నెల 29న మౌంట్ మాంగనీలో జరుగుతుంది. మంత్రం వేసిన స్పిన్ త్రయం ఓపెనర్లు బేట్స్, సోఫీ డివైన్ (38 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) నిలకడతో కివీస్ ఇన్నింగ్స్ సాఫీగానే ప్రారంభమైంది. తొలి వికెట్కు వీరిద్దరు 61 పరుగులు జోడించారు. అయితే, డివైన్ను రనౌట్ చేసి దీప్తి శర్మ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టింది. లారెన్ డౌన్ (0) పూనమ్ బౌలింగ్లో స్టంపౌట్ అయింది. బేట్స్... దీప్తి బౌలింగ్లో వెనుదిరిగింది. ఈ దశలో కెప్టెన్ సాటర్వైట్ (45 బంతుల్లో 31; 3 ఫోర్లు), అమెలియా కెర్ (60 బంతుల్లో 28) కాసేపు పోరాడారు. వీరిద్దరిని పెవిలియన్ పంపి పూనమ్ మ్యాచ్ను మలుపు తిప్పింది. తర్వాత బి‹ష్త్ ప్రతాపం చూపడంతో మరెవరూ క్రీజులో నిలవలేకపోయారు. హనా రౌయీ (25) పోరాటంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వారిద్దరే కొట్టేశారు ఛేదనలో స్మృతి, జెమీమా ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడారు. తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన వీరు తర్వాత ఓవర్కు కనీసం ఒక ఫోర్ చొప్పున కొడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. స్మృతి... హడెల్స్టన్ బౌలింగ్లో రెండు ఫోర్లు, సిక్స్ బాదింది. 43 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్లో పూర్తి సహకారం అందించిన జెమీమా 61 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకుంది. వీరి దూకుడుతో టీమిండియా స్కోరు 18వ ఓవర్లోనే వంద దాటింది. అనంతరం ఈ ఇద్దరు తడబాటు లేకుండా బ్యాటింగ్ కొనసాగించారు. 101 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న స్మృతి... లక్ష్యానికి మూడు పరుగుల ముందు కెర్ బౌలింగ్లో ఔటైంది. జెమీమా విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. -
అమ్మాయిల ‘గురు’ రామన్
ముంబై:భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్గా మాజీ ఓపెనర్ డబ్ల్యూవీ రామన్ను క్రికెట్ పరిపాలక కమిటీ (సీఓఏ) నియమించింది. పురుషుల కోచ్గా భారత్కు వన్డే ప్రపంచకప్ అందించిన గ్యారీ కిర్స్టెన్ను కాదని రామన్ను కోచ్గా నియమించినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రామస్వామిలతో కూడిన అడ్హక్ కమిటీ తొలి ప్రాధాన్యంగా కిర్స్టెన్ను ఎంపిక చేసింది. తర్వాతి స్థానాల్లో రామన్, వెంకటేశ్ ప్రసాద్లతో వున్న తుది జాబితాను కమిటీ గురువారం సీఓఏకు అందజేసింది. అందులో మహిళా కోచ్ కల్పన వెంకటాచర్ను సహాయ కోచ్గా తీసుకోవాలని సూచించింది. కిర్స్టెన్ ఐపీఎల్లో ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కోచ్గా ఉన్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల రీత్యా ఆయన ఫ్రాంచైజీకి రాజీనామా చేయాల్సివుంటుంది. కానీ కిర్స్టెన్ అందుకు సమ్మతించకపోవడంతో సీఓఏ ఆయన్ని పక్కనబెట్టింది. అయితే ఈ ప్రక్రియ వివాదాస్పదమైంది. కోచ్లను నియమించే అధికారం లేని సీఓఏ తమ పరిధిని అతిక్రమిస్తుందని దీన్ని బోర్డు ఆమోదించే అవకాశం లేదని కోశాధికారి అనిరుధ్ చౌదరి తెలిపారు. ఆయనే ఎందుకంటే... మహిళా జట్టుకు బ్యాటింగ్ కోచ్ అవసరముందని బీసీసీఐ భావించింది. దీంతో బ్యాటింగ్ కోచ్నే హెడ్ కోచ్గా నియమించాలనుకోవడంతో భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్కు అవకాశం దక్కలేదు. వూర్కేరి వెంకట్ రామన్ భారత మాజీ ఓపెనర్. 1992–93 సీజన్లో దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్మన్గా ఆయనకు రికార్డుంది. జాతీయ జట్టు తరఫున 11 టెస్టులు, 27 వన్డేలాడిన 53 ఏళ్ల రామన్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. పైగా కోచ్గా పనిచేసిన అనుభవం కూడా రామన్కు ఉంది. గతంలో తమిళనాడు, బెంగాల్ రంజీ జట్లతో పాటు... భారత అండర్–19 జట్టుకూ కోచ్గా పనిచేశారు. ఇవన్నీ ఆయన ఎంపికకు అనుకూలించాయి. 28 మంది దరఖాస్తు చేస్తే... వన్డే కెప్టెన్, సీనియర్ బ్యాట్స్మన్ మిథాలీ రాజ్తో విభేదాల కారణంగా తాత్కాలిక కోచ్ రమేశ్ పొవార్ పదవీ కాలాన్ని పొడిగించలేదు. దీంతో కొత్త కోచ్ నియామక ప్రక్రియను బోర్డు మొదలు పెట్టింది. దరఖాస్తులను ఆహ్వానించగా 28 మంది ఆసక్తి కనబరిచారు. ఇందులోంచి 10 మందిని కపిల్ కమిటీ ఇంటర్వ్యూకు పిలిచింది. పై ముగ్గురితో పాటు గిబ్స్, రమేశ్ పొవార్, మస్కరెనస్, బ్రాడ్ హగ్, ట్రెంట్ జాన్స్టన్, మనోజ్ ప్రభాకర్, మహిళా కోచ్ కల్పన వెంకటాచర్లను కపిల్ బృందం ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ముగ్గురిని మాత్రమే నేరుగా ఇంటర్వ్యూ చేయగా, ఫోన్లో, స్కైప్ వీడియా చాట్ ద్వారా మిగతా వారు అందుబాటులోకి వచ్చారు. బయటపడ్డ లుకలుకలు కోచ్ నియామక ప్రక్రియపై బోర్డు, పరిపాలక కమిటీ (సీఓఏ)లోని అభిప్రాయబేధాలు మళ్లీ తెరమీదికొచ్చాయి. పొవార్నే మళ్లీ కోచ్ను చేయాలంటూ సీఓఏ సభ్యురాలైన డయానా ఎడుల్జీ పట్టుబట్టారు. బాహాటంగానే మద్దతు పలికారు. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ మాత్రం ఆమె పంతాన్ని నెగ్గనివ్వలేదు. ఇప్పుడు అంతా పూర్తయ్యాక కూడా ఎడుల్జీ, బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరితో కలిసి వినోద్ రాయ్ తీరును తప్పుబట్టారు. కోశాధికారి అనిరుధ్ వచ్చే నెల 17వ తేదీన జరిగే కోర్టు విచారణ వరకైన ఈ ఎంపిక ప్రక్రియను ఆపాలని కోరారు. ఇలాగే ముందుకెళ్తే కోచ్ నియామకానికి బోర్డు ఆమోదం తెలపదని స్పష్టం చేశారు. కివీస్ టూర్కు జట్ల ఎంపిక నేడు న్యూజిలాండ్ పర్యటించే భారత వన్డే, టి20 జట్లను శుక్రవారం ఎంపిక చేయనున్నారు. ఢిల్లీలో జరిగే ఈ సెలక్షన్ సమావేశానికి వన్డే సారథి మిథాలీరాజ్ హాజరు కానుంది. ఆసీస్లో మహిళల బిగ్బాష్ లీగ్ ఆడుతున్న టి20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్కైప్ వీడియోలో అందుబాటులో ఉండనుంది. కివీస్లో భారత మహిళల జట్టు మూడు వన్డేలు, మూడు టి20లు ఆడనుంది. -
మిథాలీ బృందానికి రూ.50 లక్షల నజరానా
భోపాల్: భారత మహిళల క్రికెట్ జట్టుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. త్వరలోనే భారీ ఎత్తున జరిపే కార్యక్రమంలో ఈ రివార్డును అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ‘మధ్యప్రదేశ్ ప్రభుత్వం భారత మహిళల జట్టును సన్మానించనుంది. అలాగే జట్టుకు రూ.50 లక్షల నజరానా అందిస్తాం’ అని ఆయన ట్వీట్ చేశారు. భారత మహిళల జట్టుకు బీసీసీఐ సన్మానం న్యూఢిల్లీ: అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ టోర్నమెంట్లో ఫైనల్కు చేరి రన్నరప్గా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ఘనంగా సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇంకా తేదీ, వేదిక ఎక్కడ అనేది ఖరారు కాలేదు. బుధవారం నుంచి క్రీడాకారిణులు విడతల వారీగా స్వదేశానికి రానున్నారు. ఇదే కార్యక్రమంలో ఒక్కో సభ్యురాలికి రూ.50 లక్షల చొప్పున, సహాయక సిబ్బందికి రూ.25 లక్షల చొప్పున బోర్డు అందించనుంది. ‘మన జట్టు ఫైనల్లో ఓడినా కోట్లాది మంది భారత హృదయాలను గెలుచుకుంది. త్వరలోనే వారిని సన్మానించనున్నాం. అలాగే ప్రధాని మోదీతో కూడా సమావేశం కోసం ప్రయత్నిస్తున్నాం. ఇక వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్పై జట్టు దృష్టి పెట్టాల్సి ఉంది. మరోవైపు ఈ క్రేజ్ను మహిళల ఐపీఎల్తో సొమ్మ చేసుకునే అవకాశాలూ లేకపోలేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
శిఖరాన మిథాలీ రాజ్
⇒వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా గుర్తింపు ⇒6 వేల పరుగులు పూర్తి బ్రిస్టల్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా రికార్డు సాధించింది. 183 వన్డేల్లో ఆమె 6,028 పరుగులు సాధించింది. చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఇంత కాలం ఉన్న 5,992 పరుగుల రికార్డును మిథాలీ బద్దలు కొట్టింది. ఎడ్వర్డ్స్ 180 ఇన్నింగ్స్లలో ఈ రికార్డు సాధించగా, మిథాలీకి 164 ఇన్నింగ్స్లు మాత్రమే సరిపోయాయి. ఈ క్రమంలో మహిళల వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన తొలి క్రీడాకారిణిగా కూడా ఈ హైదరాబాదీ గుర్తింపు తెచ్చుకుంది. లెగ్ స్పిన్నర్ కిర్స్టన్ బీమ్స్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది ఆమె ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. 35 ఏళ్ల మిథాలీ రాజ్ 1999 జూన్ 26న ఐర్లాండ్తో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. 106 మ్యాచ్లలో ఆమె జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం విశేషం. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ భారత్కే చెందిన జులన్ గోస్వామి (189) పేరిట రికార్డు ఉండగా, ఇప్పుడు బ్యాట్స్మన్ జాబితాలో కూడా భారతీయురాలే అగ్రస్థానానికి చేరింది. ప్రశంసల వెల్లువ... ⇒ ‘భారత క్రికెట్లో అద్భుత ఘట్టం. మిథాలీ చాంపియన్లా ఆడింది’ – విరాట్ కోహ్లి, భారత పురుషుల జట్టు కెప్టెన్ ⇒ ‘మిథాలీకి అభినందనలు, ఇది చాలా పెద్ద ఘనత’ – సచిన్ ⇒ ‘పదేళ్ల వయసు నుంచి ఆమె పురోగతిని చూశాను. మిథాలీ ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. ఇలాంటివి మరిన్ని సాధించాలి’–వీవీఎస్ లక్ష్మణ్ ⇒‘ఇది మహిళల క్రికెట్కు సుదినం. మిథాలీ, జులన్ రికార్డులు మన జట్టు స్థాయి పెరిగిందనేదానికి సంకేతం’ –డయానా ఎడుల్జీ ⇒మొత్తం 183 వన్డేల్లో మిథాలీ రాజ్ 51.52 సగటుతో 6,028 పరుగులు చేసింది. ఇందులో 5 సెంచరీలు, 49 అర్ధసెంచరీలు ఉన్నాయి.