industry
-
తీరంలో ‘భూ’ అలజడి!
ఉలవపాడు: ‘మా ఊరు దగ్గరలో పరిశ్రమ వస్తే సొంత ఇంట్లో ఉంటూ పని చేసుకోవచ్చు. పరిశ్రమ కోసం మా ఊరే లేకుండా చేస్తే ఎలా..? మా ఊరే లేకుండాపోయిన తర్వాత ఆ పరిశ్రమ వస్తే ఎంత..? రాకపోతే ఎంత...? ఉన్న భూమిని సాగు చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాం. ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్...’ అంటున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండల తీరప్రాంత ప్రజలు. ఉలవపాడు మండలంలో ఇటీవల కలెక్టర్ ఆనంద్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయదేవ్ పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకు భూములను పరిశీలించారు. కరేడు నుంచి రామాయపట్నం వరకు తీరప్రాంత భూములు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. దీంతో తీర ప్రాంత గ్రామాల్లో గుబులు మొదలైంది. శుక్రవారం తీరప్రాంత మత్స్యకారులందరూ అలగాయపాలెంలో సమావేశమై పరిశ్రమలకు తమ భూములు ఇవ్వకూడదని తీర్మానించారు. పోలీసులు వచ్చి సమావేశాన్ని అడ్డుకున్నా కూడా మత్స్యకారులు ఐక్యంగా ఉంటూ తీర్మానం చేయడం గమనార్హం. అయితే, శనివారం కందుకూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు ఈ నియోజకవర్గంలోనే బీపీసీఎల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని, భూములు ఇవ్వాలని పిలుపునిచ్చారు. దీంతో తీరప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుందని..బీపీసీఎల్ రిఫైనరీ కోసం ప్రధానంగా కరేడు చెరువు అనుకుని ఉన్న ఆయకట్టును తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ సమీపంలోని సపోటా, మామిడి తోటలు కూడా సేకరించే భూముల జాబితాలో ఉన్నట్లు సమాచారం. ప్రాథమికంగా కరేడు గ్రామ చెరువు నీటిని ఉపయోగించుకుని కంపెనీ నిర్మాణాలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. తమ చెరువు ఆయకట్టు కింద వరి, వేరుశనగ పండించుకుని సంతోషంగా ఉన్నామని, తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రైతులు తెగేసి చెబుతున్నారు.కరేడుతోపాటు తీరప్రాంత గ్రామాలైన అలగాయపాలెం, టెంకాయచెట్లపాలెం, చిన్నపట్టపుపాలెం, చాకిచర్ల, పెదపట్టపుపాలెం, రామాయపట్నం, పల్లెపాలెం గ్రామాల్లో అధిక శాతం ప్రజలు సముద్ర వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని భూములు బీపీసీఎల్ కోసం తీసుకునే జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 6వేల ఎకరాలను సేకరించనున్నట్లు తెలిసింది. భూములను తీసుకోవడంతోపాటు ఆయా గ్రామాలను ఖాళీ చేయిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కన్నతల్లి లాంటి సొంత ఊరు.. జీవనాధారమైన భూములు... తీరం వదిలి తాము ఎక్కడికి వెళ్లాలని మత్స్యకారులు భగ్గుమంటున్నారు. ఉలవపాడు మండలంలోని కొన్ని ప్రధాన గ్రామాలను లేకుండా చేసేందుకు బడాబాబులు కుట్ర పన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పరిశ్రమకు వెయ్యి ఎకరాలు సరిపోతుందని, అటవీ భూములను తీసుకుని పరిశ్రమ పెడితే తమకు ఉపాధి లభిస్తుందని, తమను తరిమేసి పరిశ్రమ పెడితే ఎలా..అని ప్రశ్నిస్తున్నారు.ఇవేమీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ భూములను పరిశీలిస్తున్నారు. సర్వేలు చేస్తున్నారు.భూములు లాక్కోవడానికి కుట్ర పరిశ్రమ పెట్టడానికి ఆరు వేల ఎకరాలు అవసరమా? అటవీ భూమి వెయ్యి ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది. కేవలం పేదల భూములు లాక్కోవడానికే పరిశ్రమ పేరుతో కుట్ర పన్నారు. – మిరియం శ్రీనివాసులు, 139 కులాల జేఏసీ చైర్మన్, కరేడు భూములు ఇచ్చేది లేదు బీపీసీఎల్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చేది లేదు. మండలంలో చాలా అటవీ భూములు ఉన్నాయి. పరిశ్రమల కోసం వాటిని తీసుకోవచ్చు. – వాయల అంజయ్య, అలగాయపాలెం -
ఆశల పల్లకీలో ఎంఎస్ఎంఈలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ 2025–26 బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (ఎంఎస్ఎంఈ) ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల పరిధిని కొత్తగా నిర్వచించడంతోపాటు రుణ పరిమితిని రెట్టింపు చేశారు. దీంతో వచ్చే ఐదేళ్లలో ఎంఎస్ఎంఈలకు దేశవ్యాప్తంగా రూ.లక్షన్నర కోట్లు అదనంగా రుణాలు లభించే అవకాశం ఏర్పడింది. తెలంగాణలోనూ రుణ లభ్యత పెరగడంతోపాటు కొత్తగా అనేక సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి రానున్నాయి. రాష్ట్రంలో 2015 నాటికి 26.05లక్షల ఎంఎస్ఎంఈలు ఉండగా, టీజీ ఐపాస్ పోర్టల్లో నమోదవుతున్న వివరాల ప్రకారం వీటి వృద్ది రేటు 11 నుంచి 15 శాతం వరకు ఉంటోంది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోనే 40శాతం మేర ఉన్నాయి.ఎంఎస్ఎంఈలతో సుమారు 33లక్షల మంది ఉపాధి పొందుతుండగా, సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజాధారిత పరిశ్రమల్లోనే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలు భూమి, నిధులు, ముడి సరుకులు, కార్మికులు, సాంకేతికత, సరైన మార్కెటింగ్ వసతులు లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. నిధుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్లే ఎంఎస్ఎంఈలు కొల్లేటరల్ సెక్యూరిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎంఎస్ఎంఈ రుణాల కోసం డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలో మూడో స్థానంలో ఉంది. నిర్వహణ వ్యయం కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నా సరైన సమాచారం లేకపోవడం, ఇతర నిబంధనలతో సకాలంలో ఎంఎస్ఎంఈలకు నిధులు అందుబాటులోకి రావడం లేదు. కొల్లేటర్ సెక్యూరిటీ లేకుండా రుణపరిమితిని రెట్టింపు చేసి రూ.10 కోట్లకు పెంచారు.ప్రగతిశీల, పురోగామి బడ్జెట్ ప్రజలు, ఉద్యోగులు, పారిశ్రామిక అనుకూల ప్రగతిశీల, పురోగామి బడ్జెట్ ఇది. టారిఫ్ రేట్ల విధానంలో మార్పులతో దేశీయంగా తయారీ రంగానికి ఊతం లభిస్తుంది. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘జాతీయ క్రిటికల్ మినరల్ మిషన్’ద్వారా లిథియం, కోబాల్ట్ వంటి అనేక ఖనిజాలు దేశ ఆర్థిక పురోగతిలో కీలకంగా మారడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదం చేస్తాయి. తద్వారా లిథియం, ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీల తయారీని ప్రోత్సహిస్తుంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగకరం. నైపుణ్య శిక్షణ రంగానికి కూడా బడ్టెట్లో పెద్ద పీట వేశారు. –సురేశ్ కుమార్ సింఘాల్, ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు నిధుల లభ్యత పెరుగుతుంది ఎంఎస్ఎంఈల్లో సులభతర విధానాలకు బాటలు వేసేలా బడ్జెట్ ఉంది. రుణ లభ్యత పెరగడంతో రూ.5 లక్షల విలువ చేసే క్రెడిట్ కార్డులను 10 లక్షల మందికి జారీ చేయాలనే నిర్ణయాన్ని ఆహా్వనిస్తున్నాం. ఇది ఎంఎస్ఈలకు నిర్దేశిత వడ్డీపై ఎప్పుడైనా రుణ మొత్తాన్ని ఉపయోగించుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ఔషధాల తయారీలో ఉపయోగించే ముడి సరుకుల దిగుమతి సులభతరమవుతుంది. స్టార్టప్ల రుణ పరిమితి కూడా రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పెంచడాన్ని ఆహా్వనిస్తున్నాం. – కొండవీటి సుదీర్రెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు -
పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలు మరింత అవసరం
దేశ వైద్య పరికరాల రంగం ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన వృద్ధిని సాధించిందని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం వంటివి ఇందుకు దోహదం చేశాయని మెరిల్ లైఫ్ సైన్సెస్లో కార్పొరేట్ స్ట్రాటజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ అభిప్రాయపడ్డారు. ఈ ఊపును కొనసాగించడానికి రానున్న కేంద్ర బడ్జెట్లో ఆర్&డీ, ఎగుమతులు, పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలలో నిరంతర మద్దతు ఆశిస్తున్నట్లు తెలిపారు.“ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాల రంగం గణనీయమైన వృద్ధిని సాధించింది. రోగులకు మెరుగైన ఫలితాలు, అవకాశాలను అభివృద్ధి చేయడం ద్వారా ఆధునిక ఆరోగ్య సంరక్షణకు మూలస్తంభంగా మారింది. భారతదేశంలో 21వ శతాబ్దం మొదటి పాతికేళ్లు ఎంతో పరివర్తన చెందాయి. దేశాన్ని అధిక-నాణ్యత, సరసమైన వైద్య సాంకేతికతలకు ప్రపంచ కేంద్రంగా నిలిపాయి.ఈ పురోగతికి భారత ప్రభుత్వ ముందుచూపు కార్యక్రమాలు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై బలమైన దృష్టి గణనీయంగా మద్దతు ఇచ్చాయి. ఈ చర్యలు మెడ్టెక్ తయారీలో ఆవిష్కరణ, పెట్టుబడులు, స్వావలంబనను ప్రోత్సహించాయి. కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో ఈ ఊపును కొనసాగించడానికి ఆర్&డీ, ఎగుమతులు, పరిశ్రమ ఆధారిత ప్రోత్సాహకాలలో నిరంతర మద్దతు ఆశిస్తున్నాం.ప్రజల జీవితాలను మార్చే ప్రపంచ స్థాయి పరిష్కారాలను అందించడం ద్వారా భారతదేశ మెడ్టెక్ అభివృద్ధికి మెరిల్ దోహదపడుతుండటం పట్ల సంతోషంగా ఉన్నాం. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో అగ్రగామిగా భారతదేశం స్థానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాం” అన్నారు. -
Automobile: భారత్లో ఆటోమొబైల్స్ పరుగులు
ఒకరికి బతుకు బండి.. మరొకరికి హోదా.. ఇంకొందరికి వ్యాపారం.. మరి కొద్దిమందికి విహారం.. టూవీలర్, ఆటో, కారు, ట్రాక్టర్, వ్యాన్ , ట్రక్, బస్.. పేరు ఏదైనా, వాడకం ఏదైనా బండి చక్రాలు పరుగెడుతూనే ఉండాలి. ఆ పరుగే అన్నం పెడుతోంది. ఆ పరుగే వృద్ధి ‘ఇంజన్ ’ అవతారంలో భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమై దూసుకెళుతోంది. ఆటోమొబైల్ రంగంలో అత్యంత కీలకమైన మార్కెట్గా రూ.22 లక్షల కోట్లతో మూడవ స్థానంలో నిలిచి ప్రపంచ దిగ్గజ సంస్థలను భారత్ ఊరిస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత గల భారతావనిలో ఎన్ని బండ్లు రోడ్డెక్కుతున్నాయో తెలుసా? నిమిషానికి 49.53 యూనిట్లు. 2024లో 2,61,07,679 యూనిట్ల వాహనాలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. 2023లో ఈ సంఖ్య 2,39,28,293 యూనిట్లు. గత ఏడాది కొత్త వాహనాల రాక 9.11 శాతం పెరిగిందని ‘వాహన్ ’ గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న అవసరాలు..ఉద్యోగం, వ్యాపారం, షాపింగ్, ప్రయాణాలు, విహార యాత్రలు, డెలివరీ సేవలు.. అవసరం ఏదైనా చేతిలో బండి ఉండాల్సిందే! గడియారంలోని సెకన్ల ముల్లుతో పోటీపడుతూ పరుగు తీయాలంటే బండి రోడ్డెక్కాల్సిందే! అంతలా దైనందిన జీవితంలో వాహనం భాగమైపోయింది. అందుకే వాహనాల అమ్మకాలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ఇక 2030 నాటికి మెగా సిటీల సంఖ్య 87కు చేరనుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక్కో మెగా సిటీలో జనాభా 10 లక్షల పైచిలుకు ఉంటుందన్నమాట! ఇంతమందికి సేవలు అందించడానికి ప్రజా రవాణా వ్యవస్థ సరిపోదు. వ్యక్తిగత వాహనాలపై ఆధారపడాల్సిందే! అలాగే ఆరేళ్లలో వర్కింగ్ ఏజ్ గ్రూప్లో 100 కోట్ల మంది చేరతారని అంచనా. అంటే ఆ సమయానికి మొత్తం జనాభాలో వీరి వాటా 60 శాతం ఉంటుంది. ఈ అంశం కూడా వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేయనుంది. మారుతున్న ధోరణులుభారత మార్కెట్లో ధర అత్యంత సున్నిత అంశం. డబ్బుకు తగ్గ విలువ చూసే కస్టమర్లే అధికం. మైలేజీ ఒక్కటే సరిపోదు. డిజైన్ సైతం ఆకట్టుకోవాలి. అటు భద్రతకు పెద్దపీట వేయాలి. ఎక్కువ ఫీచర్లు ఉండాలి. మారుతున్న వినియోగదార్ల అభిరుచులకు తగ్గట్టుగా మోడళ్లకు రూపకల్పన చేసేందుకు వందల కోట్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి కంపెనీలు కసరత్తు చేస్తుంటాయి. సరికొత్త మోడళ్లే కాదు సక్సెస్ అయిన మోడల్స్లో ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లను, అప్గ్రేడ్స్ను ప్రవేశపెట్టాల్సిందే. హైబ్రిడ్స్, ఈవీలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కొత్త ట్రెండ్ ఏమంటే ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీ, యూవీల హవా నడుస్తోంది. మొత్తం పీవీల విక్రయాల్లో వీటి వాటా 60 శాతం దాటిందంటే మారుతున్న ధోరణులకు అద్దం పడుతోంది. కార్ల అమ్మకాల్లో 2,02,031 యూనిట్లతో టాప్ సెల్లింగ్ మోడల్గా కాంపాక్ట్ ఎస్యూవీ టాటా పంచ్ నిలిచింది. మరోవైపు చిన్న కారు చిన్నబోతోంది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ చిన్న కార్ల వాటా 2 శాతం కంటే తక్కువగా ఉంది. అమ్ముడవుతున్న రెండు త్రిచక్ర వాహనాల్లో ఒకటి ఈ–త్రీవీలర్ ఉంటోంది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) విభాగాన్ని ఏలుతున్న దిగ్గజ కంపెనీలే ఈవీ సెగ్మెంట్నూ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నాయి. 350 సీసీ, అంత కంటే అధిక సామర్థ్యంగల ఇంజన్ ్స విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ దూసుకెళుతోంది. ఈ కంపెనీ గత ఏడాది 4.26 శాతం వృద్ధితో 8,57,378 యూనిట్లను విక్రయించి రాయల్గా నిలిచింది. కొత్త వ్యాపారాల రాకతో..వ్యక్తిగత అవసరాలకే కాదు.. కొత్త వ్యాపారాల రాక కూడా వాహనాల అమ్మకాలకు ఆజ్యం పోస్తోంది. ఊబర్, ఓలా, రాపిడో వంటి అగ్రిగేటర్లు, అమెజాన్ , ఫ్లిప్కార్ట్ తదితర ఈ–కామర్స్ సంస్థలు, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, బిగ్బాస్కెట్, జెప్టో, బ్లింకిట్, డంజో తదితర క్విక్ కామర్స్ కంపెనీలు.. ఇలా ఒకటేమిటి. ఉత్పత్తుల తయారీ, డెలివరీ సేవల కంపెనీలు వాహన వినియోగం పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. అటు సులభ వాయిదాల్లో వాహనం కొనుగోలుకు రుణ లభ్యత పెరిగింది. ఇంకేముంది వాయిదాలు చెల్లించగలిగే స్తోమత ఉంటే చాలు, స్థాయికి మించిన విలువైన వాహనం కొనేందుకూ కస్టమర్లు వెనుకంజ వేయడం లేదు. లగ్జరీ.. తగ్గేదేలే!దేశంలో లగ్జరీ కార్ల దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. రూ.50 లక్షలకుపైగా ఖరీదు చేసే లగ్జరీ కార్లు 2024లో గంటకు దాదాపు ఆరు (5.83 యూనిట్లు) అమ్ముడయ్యాయి. అయిదేళ్ల క్రితం గంటకు రెండు లగ్జరీ కార్లే రోడ్డెక్కాయంటే ప్రస్తుత భారత మార్కెట్ తీరుతెన్నులను అర్థం చేసుకోవచ్చు. 2024లో మొత్తం 51,200 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 50 వేల మార్కును చేరుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది రెండు డజన్లకుపైగా నూతన మోడళ్లు కొలువుదీరనున్నాయి. ఊరిస్తున్న కొత్త మోడళ్లు, సంపన్నులు పెరుగుతుండడంతో 2025లో ఈ సెగ్మెంట్లో 54,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతాయని పరిశ్రమ ధీమాగా ఉంది. 2030 నాటికి లగ్జరీ కార్ల అమ్మకాలు ఏటా 1,00,000 దాటుతుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహన పరిశ్రమలో లగ్జరీ వాటా 1 శాతంపైగా ఉంది. 2020లో 20,500 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్లు్య, ఆడి, వోల్వో, మినీ, జేఎల్ఆర్, లెక్సస్ టాప్ బ్రాండ్స్గా ఉన్నాయి. సూపర్ ప్రీమియం లంబోర్గీని, పోర్ష్ కార్లకూ డిమాండ్ ఉంది. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశంలో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్య 2028 నాటికి 19,908కి చేరనుంది. 2023లో ఈ సంఖ్య 13,263 ఉంది. ప్రపంచవ్యాప్తంగా అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ సంఖ్యలో భారత్ భారీ పెరుగుదలను నమోదు చేస్తుందని నివేదిక అంచనా వేసింది. ఈవీతో పోటీగా సీఎన్ జీ.. ఆశ్చర్యకర విషయం ఏమంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) ఆధారిత వాహనాల డిమాండ్ ఊహకు అందడం లేదు. ఈ విభాగంలో గత ఏడాది 7,15,213 కార్లు అమ్ముడయ్యాయి. 2023తో పోలిస్తే వృద్ధి ఏకంగా 35 శాతం నమోదు కావడం విశేషం. మారుతీ సుజుకీ ఇండియా అత్యధికంగా 2024లో ఈ విభాగంలో 5,12,155 యూనిట్లతో 71.60 శాతం వాటా దక్కించుకుంది. సీఎన్జీ వాటా ప్యాసింజర్ వెహికిల్స్లో 18 శాతం, త్రీవీలర్స్ అమ్మకాల్లో 28 శాతం ఉంది. బజాజ్ ఆటో ఒక అడుగు ముందుకేసి దేశంలో తొలిసారిగా సీఎన్ జీ బైక్ ‘ఫ్రీడమ్’ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా 5,500లకు పైగా సీఎన్ జీ ఫిల్లింగ్ స్టేషన్ ్స ఉన్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య 8,000 దాటనుంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్తో పోలిస్తే సీఎన్ జీ వ్యయం తక్కువ కావడంతో కస్టమర్లు వీటికి మళ్లుతున్నారు. వాహన విడిభాగాలు ఇలా..2023–24లో వాహన విడిభాగాల పరిశ్రమ 9.8 శాతం వృద్ధితో 74.1 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసింది. 2017–18లో ఇది 51 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రపంచంలో తయారవుతున్న వాహన విడిభాగాల్లో భారత్ వాటా 3.5 శాతం. భారత జీడీపీలో ఈ రంగం వాటా 3.5 శాతం. తయారీ జీడీపీలో ఈ విభాగం 25 శాతం సమకూర్చింది. 50 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. విడిభాగాల ఎగుమతులతో అయిదేళ్లలో 88 బిలియన్ డాలర్ల విదేశీ మారకం సమకూరింది. ఆటోమోటివ్ కాంపొనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ప్రకారం భారత వాహన విడిభాగాల పరిశ్రమ 2030 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఎగుమతులు 21 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని ఏసీఎంఏ ధీమాగా ఉంది. ఐదేళ్లలో తొలి స్థానం..!భారత ఆటోమోటివ్ పరిశ్రమ విలువ రూ.22 లక్షల కోట్లు. దేశ జీడీపీకి ఈ రంగం 7 శాతం సమకూరుస్తోంది. మొత్తం వసూలు అవుతున్న జీఎస్టీలో 14–15 శాతం ఆటోమొబైల్ రంగం అందిస్తోందంటే ఆశ్చర్యం వేయకమానదు. వచ్చే ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానానికి చేరుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి భారతీయ వాహన పరిశ్రమ రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని చెప్పారు. ‘రూ.78 లక్షల కోట్లతో తొలి స్థానంలో యూఎస్ఏ, రూ.47 లక్షల కోట్లతో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా చైనా నిలిచింది. ఐదేళ్లలో భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్–1గా మార్చాలనుకుంటున్నాం. ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటోమొబైల్ బ్రాండ్స్ భారత్లో ఉండడం దేశ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని మంత్రి వివరించారు. ప్రభుత్వం ఏం చేస్తోందంటే..సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ (ఐసీఈ) నుంచి ఈవీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వంటి నూతన సాంకేతికతలవైపు వాహన పరిశ్రమ మళ్లేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేందుకు రూ.25,938 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రకటించింది. అడ్వాన్ ్సడ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ రంగానికి రూ.18,100 కోట్లు, పీఎం ఈ–డ్రైవ్ స్కీమ్కు రూ.10,900 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈవీ రంగంలో విదేశీ సంస్థలను ఆకట్టుకోవడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం ఎఫ్డీఐలకు ప్రభుత్వం తివాచీ పరిచింది. కనీసం 50 కోట్ల డాలర్ల పెట్టుబడితో తయారీ కేంద్రాలు నెలకొల్పే సంస్థలు పూర్తిగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకుంటే పన్ను 70–100 శాతం నుంచి కొత్త ఈవీ పాలసీలో 15 శాతానికి కుదించారు. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్నును 21 నుంచి 13 శాతానికి చేర్చారు. 2030 నాటికి ఈవీ, చార్జింగ్ మౌలిక వసతులు, బ్యాటరీస్ విభాగంలో 200 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే ఆరేళ్లలో ఈవీ పరిశ్రమ ప్రపంచంలో తొలి స్థానంలో నిలుస్తుందని అంచనా. పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు స్క్రాప్ పాలసీకి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల భద్రత, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యత, సేఫ్టీ ప్రమాణాలను నిర్దేశిస్తూ, తప్పనిసరి చేస్తోంది. గ్లోబల్ ఎన్ సీఏపీకి దీటుగా భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ సీఏపీ) పరిచయం చేసింది. 2030 నాటికి కొత్తగా అమ్ముడయ్యే వాహనాల్లో ఈవీల వాటా 30 శాతం ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.మీకు తెలుసా? వాహనాల తయారీ, విక్రయాల పరంగా భారత్ పేరిట పలు ప్రపంచ రికార్డులు ఉన్నాయి. రూ.22 లక్షల కోట్లతో భారత మార్కెట్ ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచింది. 7 శాతం వార్షిక వృద్ధితో 2022–23లో 33.2 బిలియన్ డాలర్ల విలువైన 47.6 లక్షల యూనిట్ల వాహనాలు భారత్ నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 45 లక్షల యూనిట్లు దాటింది. రెండు దశాబ్దాల్లో 25 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు వెల్లువెత్తాయి. ఒక్క ఈవీ రంగంలోనే 2022–23లో 3.6 బిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చి చేరింది. వోల్వో, దైమ్లర్ వంటి 60కిపైగా దిగ్గజాలు భారత్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) నెలకొల్పాయి. ట్రాక్టర్ల తయారీలో మహీంద్రా, త్రీవీలర్ల ఉత్పత్తిలో బజాజ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచాయి.ఆటోమోటివ్ రంగం పరిశ్రమను కొత్తపుంతలు తొక్కించే దిశగా వెళుతోంది. వృద్ధిలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూనే గ్రీన్ మొబిలిటీకి మారడం సవాలే. ఈవీలు, హైబ్రిడ్స్, హైడ్రోజన్ లేదా ఇతర ఇంధన విభాగాలైనా సరైన సాంకేతికతను అవలంబించడం కూడా సవాలుగానే ఉంటుంది. వృద్ధిని నిర్ధారిస్తూనే ఆటోమోటివ్ కంపెనీలు మారుతున్న పరివర్తనను ఎలా నిర్వహిస్తాయో అన్న అంశాన్ని ఈ రెండేళ్లు పరిశీలించాల్సి ఉంటుంది.∙వి.రిషి కుమార్, ఆటో ఎక్స్పర్ట్. ప్యాసింజర్ వాహన పరిశ్రమలో 60 శాతంపైగా వాటాతో ఎస్యూవీలు రూల్ చేస్తున్నాయి. రియల్ సూపర్ స్టార్గా సీఎన్ జీ నిలిచింది. 3.6 మీటర్ల లోపు ఉండే ఎంట్రీ లెవెల్ కార్ల వాటా ప్రస్తుతం 2 శాతంలోపు వచ్చి చేరింది. ∙అరుణ్ మల్హోత్రా, మాజీ ఎండీ, నిస్సాన్ ఇండియామార్కెట్ రికవరీ, తయారీ సంస్థల నుంచి వ్యూహాత్మక మద్దతు, విధాన స్థాయి స్పష్టత.. వెరసి ఆటోమోటివ్ రిటైల్ పరిశ్రమ 2025లో మెరుగ్గా ఉంటుంది. ఈ ఏడాది వృద్ధి ఉంటుందని 66.41 శాతం డీలర్లు అంచనా వేస్తున్నారు. స్థిరంగా ఉంటుందని 26.72 శాతం, తిరోగమన వృద్ధి నమోదవుతుందని 6.87 శాతం మంది డీలర్లు అభిప్రాయపడ్డారు.∙సి.ఎస్. విఘ్నేశ్వర్,,ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ్స (ఎఫ్ఏడీఏ) -
ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్.. నితిన్ గడ్కరీ
వచ్చే ఐదేళ్లలో భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ.. ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుతుందని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ రంగంలో అమెరికా, చైనాలను సైతం అవలీలగా దాటేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ ఖర్చులు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.అమెజాన్ సంభవ్ సమ్మిట్ (Amazon Smbhav Summit)లో గడ్కరీ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమలో విపరీతమైన వృద్ధిని సాధించింది. తాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, తరువాత స్థానంలో చైనా (రూ. 47 లక్షల కోట్లు) ఉంది. భారత్ మూడో స్థానంలో (రూ. 22 లక్షల కోట్లు) ఉంది. కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలనీ, తప్పకుండా అవుతుందని గడ్కరీ అన్నారు.ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను 2 సంవత్సరాలలోపు సింగిల్ డిజిట్కు తగ్గించాలనే మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని గడ్కరీ వివరించారు. మన దేశంలో లాజిస్టిక్ ధర 16 శాతం ఉంది, ఇది చైనాలో 8 శాతం, అమెరికా & యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతంగా ఉంది. కాబట్టి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. -
ఆయుధ పరిశ్రమ ఆదాయం రూ.53 లక్షల కోట్లు
స్టాక్హోం: యుద్ధాలు, ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో ప్రపంచ ఆయుధ పరిశ్రమ ఆదాయం 2023లో 632 బిలియన్ డాలర్లకు (రూ.53 లక్షల కోట్లు) పెరిగింది. 2022తో పోలిస్తే ఇది 4.2 శాతం అధికం. ఆయుధ రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. లాక్హీడ్ మార్టిన్, రేథియోన్ వంటి యూఎస్ ఆయుధ కంపెనీలే అధికాదాయం పొందాయి. స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) నివేదిక ప్రకారం టాప్ 100 కంపెనీల్లో 41 కంపెనీలు 317 బిలియన్ డాలర్ల ఆదాయం పొందాయి. ఇది గతేడాది కంటే 2.5 శాతం ఎక్కువ. ఆయుధ పరిశ్రమలో రెండో అతి పెద్ద దేశమైన చైనా టాప్ 100 జాబితాలోని తొమ్మిది కంపెనీల నుంచి 103 బిలియన్ డాలర్లను ఆర్జించింది. అయితే ఆర్థిక పరిమితులు, ఇతర సవాళ్లతో దాని వృద్ధి 0.7 శాతం తగ్గింది. స్వావలంబన దిశగా భారత్ భారత ఆయుధ పరిశ్రమకు 2023లో 6.7 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. 2022తో పోలిస్తే ఇది 5.8 శాతం ఎక్కువ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రయోజనం పొందాయి. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, విదేశీ ఆయుధ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం స్వయం సమృద్ధికి ఆజ్యం పోశాయి. భారత్, తుర్కియే దేశీయ ఆయుధోత్పత్తిని విస్తరించి స్వావలంబనపై దృష్టి సారించాయి. ఘర్షణల నేపథ్యంలో పెరిగిన ఉత్పత్తి రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆయుధ ఉత్పత్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషించింది. డిమాండ్కు అనుగుణంగా యూరప్, అమెరికా, తుర్కియేలోని రక్షణ సంస్థలు ఆయుధ తయారీని పెంచాయి. పలు దేశాల రక్షణ సంస్థల్లో ఆయుధాల అమ్మకాలు పెరిగాయి. తుర్కియే రక్షణ సంస్థ బేకర్ ఆదాయం 25 శాతం పెరిగి 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది ఎక్కువగా డ్రోన్లను ఎగుమతి చేసింది. చైనాతో ఉద్రిక్తతల మధ్య తైవాన్ రక్షణ వ్యయాన్ని పెంచడంతో ఆ దేశ ఎన్సీఎస్ఐఎస్టీ ఆదాయం 27 శాతం పెరిగి 3.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. యూకే సంస్థ అయిన అటా మిక్ వెపన్స్ ఎస్టాబ్లి‹Ùమెంట్ ఆదాయం 16 శాతం పెరిగి 2.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆయుధ ఆదాయాన్ని ఎలా నడిపిస్తున్నాయో సిప్రి నివేదిక ఎత్తిచూపింది. -
మీ రుణం మాకొద్దు
సాక్షి, అమరావతి: చెప్పేదొకటి.. చేసేది మరొకటి. పైకి పరిశ్రమలు తెస్తామంటారు.. వస్తున్న పరిశ్రమలకూ మోకాలడ్డుతారు. వాటి కోసం కేటాయించిన స్థలాలను లాగేసుకోవడం ప్రధాన ఉద్దేశం. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలోని కీలక నేతల కుతంత్రాలివి. ఇందుకు రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటున్న వైనమే ఇందుకు తార్కాణం. ఈ పరిశ్రమల కోసం రుణాలిస్తానన్న బ్యాంకుకు తమ ‘పాలసీ’మారిందని, రుణం అవసరం లేదంటూ కూటమి ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. వీటికోసం జిల్లా కేంద్రాలకు సమీపంలో సేకరించిన విలువైన భూములపై టీడీపీ పెద్దలు కన్నేసినందునే ప్రభుత్వ ‘పాలసీ’ మారిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పంట ఉత్పత్తులకు డిమాండ్ కల్పించడం ద్వరా రైతులకు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించింది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో రూ.3,559.11 కోట్లతో 27 ఆహార శుద్ధి యూనిట్లు, రూ.65 కోట్లతో ఉమ్మడి జిల్లాకి ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. తొలుత రెండు దశల్లో రూ.1,250 కోట్లతో 10 ఆహార శుద్ధి యూనిట్లు, 13 మిల్లెట్ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి కోసం జిల్లా కేంద్రాలకు సమీపంలోనే 322.61 ఎకరాలు సమీకరణ చేసి లాండ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసింది.115 కంపెనీలు ఆసక్తిఈ పరిశ్రమల ద్వారా వచ్చే 15 ఏళ్లలో పన్ను రూపంలో రూ. 9వేల కోట్ల రాబడితో పాటు జీడీపీ 1,500 కోట్లకుపైగా పెరుగుతుందని అంచనా వేశారు. ప్రభుత్వమే స్వయంగా వీటిని నిర్మించి ఆసక్తి చూపే బహుళ జాతి సంస్థలకు 15 ఏళ్లకు లీజు పద్ధతిలో నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ముడి సరుకును ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, మార్క్ఫెడ్, ఆర్బీకేల ద్వారా కొనాలని నిర్దేశించింది. తొలి దశ ప్రాజెక్టుల కోసం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు ఆపరేటర్ల ఎంపిక కోసం టెండర్లు పిలవగా హల్దీరామ్స్, ఐటీసీ వంటి 115 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. వీరికి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో ఇవ్వాలని సంకల్పించింది. తొలిదశ యూనిట్ల ఏర్పాటు కోసం సిడ్బీ రూ.1,000 కోట్లు రుణం అందించేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ను కూడా విడుదల చేసింది. ఫేజ్–1లో అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద రూ.72.47 కోట్లతో ఏర్పాటు చేసిన యూనిట్తో పాటు ఒక్కొక్కటి రూ.5 కోట్ల అంచనాతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు గతేడాది అక్టోబర్లో శ్రీకారం కూడా చుట్టారు. ఇలా పరిశ్రమల ఏర్పాటుకు పూర్తిగా రంగం సిద్ధమైన తరుణంలో వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. తాము ఈ పాలసీని పునః సమీక్షిస్తున్నామని, రుణం అవసరం లేదంటూ బ్యాంకుకు చెప్పేసింది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రశ్నార్ధకంగా మారింది.రూ.1,000 కోట్ల విలువైన భూములను కొట్టేయాలన్న కుట్రతోనే..ఆహార శుద్ధి పరిశ్రమలకు జిల్లా కేంద్రాల సమీపంలో సమీకరించిన విలువైన భూములపై టీడీపీ బడా నేతల కన్ను పడినందునే వీటి ఏర్పాటును అడ్డుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పీపీపీ మోడ్లో ఇచ్చే పేరుతో వేల కోట్ల విలువైన ఈ భూములను కొట్టేయాలని కుతంత్రం పన్నినట్లు సమాచారం. ప్రభుత్వమే పరిశ్రమలు ఏర్పాటు చేయించి, బహుళ జాతి సంస్థల ద్వారా రైతులకు మద్దతు ధర ఇప్పించేందుకు తలపెట్టిన గొప్ప కార్యక్రమానికి తూట్లు పొడిచి ఆ స్థలాల్లో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రంగం సిద్ధం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.యూనిట్లు ఏర్పాటు ఇలా..తొలిదశ : ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్ల లోపువేరుశనగ – అనంతపురంకాఫీ – అరకుమామిడి తాండ్ర – కాకినాడబెల్లం అనుబంధ ఉత్పత్తుల తయారీ – అనకాపల్లి కందులు – గుంటూరు, ఒంగోలువీటితోపాటు ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున 13 మిల్లెట్ యూనిట్లురెండో దశ: ఒక్కో యూనిట్ పెట్టుబడి – రూ.100 కోట్లకు పైబడ్చిఅరటి – పులివెందులటమాటా – నంద్యాలపండ్లు, కూరగాయలు – రాజంపేటసుగంధ ద్రవ్యాలు – నరసరావుపేట -
పుష్ప సిస్టర్స్ తగ్గేదేలే...
పూలు రోడ్డు మీద దొరుకుతాయి. కాని వాటిని స్విగ్గీలో తెప్పించుకునే కస్టమర్లు కూడా ఉంటారు అని గ్రహించారు యశోద, రియా కారుటూరి.ఈ ఇద్దరూ కలిసి ‘వూహూ ఫ్రెష్’ పేరుతోమొదలెట్టిన బ్రాండ్ ఇంతింతై ఇంతి ఇంతై అన్నట్టు సాగుతోంది. తాజాగా వీరు అగరు బత్తీల రంగంలో అడుగు పెట్టారు. బంతి, నిమ్మ, మందారం... వీరి అగర్బత్తీల పేర్లు.పూలతో 50 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరి ఆలోచనలు...ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఐడియా రావడమే సగం విజయం. మిగిలింది ఆచరణ మాత్రమే. ఐడియాలు అందరికీ ఎందుకు రావు? ఎవరో అన్నట్టు బుర్ర పారాచూట్ లాంటిది. తెరిచి పెడితే పని చేస్తుంది. లేదంటే ఏం ఉపయోగం. బెంగళూరులో నివాసం ఉండే ఇద్దరు అక్కచెల్లెళ్లు 2019లో తల్లి తరచూ చేసే ఫిర్యాదును వినేవారు. ‘బెంగళూరులో ఉన్నామన్న మాటేగాని పూజ చేద్దామంటే తాజా పూలే దొరకవు’ అని. ఆ అక్కచెల్లెళ్ల పేర్లు యశోద కారుటూరి, రియా కారుటూరి. యశోద వాషింగ్టన్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివితే రియా స్టాన్ఫోర్డ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చదివింది. అంటే వీళ్లకు టెక్నాలజీ తెలుసు. బిజినెస్ తెలుసు. ఐడియా వెలగకుండా ఉంటుందా?పూలు తెలుసురియ, యశోదల తండ్రి వాళ్ల బాల్యంలో కెన్యా వెళ్లి గులాబీ పంట వేసి పండించేవాడు. ఒకప్పుడు కెన్యా గులాబీలకు పెద్ద మార్కెట్ ఉండేది. ఆ తర్వాత ΄ోయింది. చిన్నప్పడు ఆ తోటల్లో తిరిగిన రియ, యశోదలు అందరూ ఏవేవో వ్యాపారాలు చేస్తారు... మనం పూలతో ఎందుకు చేయకూడదు అనుకున్నారు. ఆలోచన వస్తే వెంటనే పని మొదలెట్టాలి. 2019 పూలకు ప్రాధాన్యం ఉండే ప్రేమికుల దినోత్సవం నాడు ‘వూహూ ఫ్రెష్’ అనే ఆన్లైన్ రిటైల్ బ్రాండ్ మొదలెట్టారు. ‘వూహూ’ అంటే కన్నడలో పువ్వు. తాజాపూలను కస్టమర్లకు అందించడమే లక్ష్యం.ఇంటికి చేరాలిభారతీయలకు భక్తి జాస్తి. పూలతోనే దైవారాధన చేస్తారు. కాని గుడికి పూలు తీసుకెళ్లాలంటే గుడి చుట్టూ ఉన్న అంగళ్లలో కొనాలి. లేదా రోడ్డు మీద కొనాలి. అవి ఫ్రెష్గా ఉండొచ్చు... లేక΄ోవచ్చు. అప్పుడు మాత్రమే కాదు శుభకార్యాలకు, అలంకరణలకు, స్త్రీలు జడల్లో ముడుచుకోవడానికి, సన్మానాలకు.. సంస్మరణలకు... ఇళ్లల్లో పెద్దల పటాలకు పూలే కావాలి. కాని ఆ పూలుపాల ΄్యాకెట్టు అందినట్టు న్యూస్పేపర్ అందినట్టు ఇంటికి ఎందుకు అందవు అనుకున్నారు అక్కచెల్లెళ్లు. అందేలా చేశారు. విజయం సాధించారు.చందాదారులుగా...న్యూస్పేపర్ చందాదారుల్లానే ‘వూహూ ఫ్రెష్’కు కూడా చందాదారులుగా చేరితే రోజంతా పూలు ఇంటికే వస్తాయి. మరి ఇవి ఫ్రెష్గా ఎలా ఉంటాయి. దీనికోసం ప్రత్యేకమైన ΄్యాకింగ్ తయారు చేశారు. 3 రోజుల నుంచి 15 రోజుల వరకూ వాడకుండా ఉంటాయి. చేయి తగిలితే పూలు నలిగి΄ోతాయి కదా. అందుకే ‘జీరో టచ్’ ΄్యాకింగ్ కూడా ఉంది. డబ్బాల్లో పెట్టి పంపుతారు. స్విగ్గి, జొమాటో, అమేజాన్ ద్వారా కూడా అందే ఏర్పాటు చేశారు. పండగల్లో పబ్బాల్లో ఆ పండగలకు తగ్గ పూలు, హారాలు, పత్రి, దళాలు కలిపిన ప్రత్యేక బాక్సులు అమ్ముతారు. అవి హాట్కేకుల్లా అమ్ముడు΄ోతున్నాయి.రైతులతో కలిసిబెంగళూరులో కేంద్రస్థానంగా ఉంటూ ఇతర ముఖ్య నగరాల్లో విస్తరించుకుంటూ పూల సరఫరా చైన్లను రియా, యశోదలు స్థాపించారు. 500 మంది పూల రైతులతో ఒడంబడిక చేసుకుని కోసిన పూలను వీలైనంత త్వరగా ΄్యాకింగ్ కేంద్రానికి పంపే ఏర్పాటు చేశారు. ఆర్డర్లకు తగ్గ ΄్యాకింగ్ కోసం మహిళా ఉద్యోగులను నియమించారు. ప్రస్తుతం 300 ఆలయాలలో దేవుళ్లు రోజూ వీరు పంపే పూలతోనే పూజలు, హారతులు అందుకుంటున్నారు.2023 షార్క్ ట్యాంక్ షోలో రియా, యశోదాల బిజినెస్ గురించి విని అందరూ ఆశ్చర్య΄ోయారు. సంవత్సరానికి దాదాపు 8 నుంచి 10 కోట్ల వ్యాపారం జరుగుతోంది. వీరి బ్రాండ్ విలువ 50 కోట్లకు చేరింది. వాడి΄ోయిన పూలతో అగర్ బత్తీలు తయారు చేస్తూ ఆ రంగంలోనూ విజయం సాధించారు ఈ బెంగళూరు స్టిస్టర్స్. ఐడియా వీరిని గెలిపిస్తూనే ఉంది. -
అనకాపల్లి: సినర్జిన్ ప్రమాదంపై తలోమాట!
విశాఖపట్నం, సాక్షి: అచ్యుతాపురం సెజ్ ఘోర ప్రమాదం జరిగి 48 గంటలు గడవకముందే.. అనకాపల్లిలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అచ్యుతాపురం ఘటన తర్వాత.. పరిహార ప్రకటన, బాధిత కుటుంబాలతో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఇప్పుడు ఫార్మా సిటీ ప్రమాద ఘటనలో కూటమి ప్రభుత్వ నేతలు తలోమాట చెబుతూ గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఎంపీ సీఎం రమేష్ ఏమన్నారంటే.. సీనియర్ కెమిస్ట్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగింది. సీనియర్ కెమిస్ట్ డ్రగ్ పౌడర్ మిక్స్ చేస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోంది. హోం మంత్రి అనిత ఏమన్నారంటే.. ఇది మరో దురదృష్టకరమైన ఘటన. జార్ఖండ్ కు చెందిన ముగ్గురు కార్మికులతో పాటు మరో ఉద్యోగికి.. మొత్తం నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. యాజమాన్యాలు నిర్లక్ష్యం వలన పరిశ్రమల్లో ప్రమాదాలు జరగుతున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు భద్రత పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులకు సేఫ్టీ సూట్లు ఇవ్వాలి. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తాం. ఒక కమీటి వేసి,పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తాం. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.అధికారులు ఏమన్నారంటే.. మానవ తప్పిదంతోనే ప్రమాదం జరిగిందని దర్యాప్తు ఆధారంగా గుర్తించాం. వేపర్ క్లైండ్ బరస్ట్ కారణంగానే ప్రమాదం జరిగింది. కెమికల్ మిక్సింగ్టైంలో బయటకు ఆవిరి వచ్చి పేలింది. అసలేం జరిగింది?పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రేడియంట్స్ సంస్ధలో గత అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జార్ఖండ్కు చెందిన ముగ్గురు కార్మికులు, విజయనగరానికి చెందిన మరో ఉద్యోగి(సీనియర్ కెమిస్ట్) తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త పడింది. హుటాహుటిన నలుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించింది. ఘటనపై ఈ ఉదయం జిల్లా కలెక్టర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. హోంమంత్రి, ఇతర అధికారులు వెంటనే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. దీంతో హోం మంత్రి అనిత క్షతగాత్రుల్ని పరామర్శించారు. సినర్జిన్ ప్రమాదంలో ఒకరికి 90 శాతం గాయాలు కాగా, మరో ముగ్గురికి 60 శాతం పైగా గాయాలయ్యాయి. చికిత్స పొందుతున్న ఈ నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు ఘటనలో 17 మంది మృత్యువాత పడగా.. మరో ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇంకో నలుగురు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది. -
వైద్య పరికరాల తయారీకి కొత్త పథకం
న్యూఢిల్లీ: దేశీ వైద్య పరికరాల తయారీ పరిశ్రమను బలోపేతం చేసేందుకు ఒక పథకాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం సెక్రటరీ అరుణీష్ చావ్లా తెలిపారు. పరిశ్రమతో విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ పథకాన్ని రూపొందించినట్టు, దీనికి ఆర్థిక శాఖ సూతప్రాయ ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. వచ్చే నెలలోనే దీన్ని అమల్లోకి తేనున్నట్టు చెప్పారు.రెండో మెడిటెక్ స్టాకథాన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చావ్లా మాట్లాడారు. వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అవసరాలను తీర్చేదిగా ఈ పథకం ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో దిగుమతులపై ఆధారపడడాన్ని ఇది తగ్గిస్తుందన్నారు. దీర్ఘకాలంలో దేశీ పరిశ్రమ స్వయంసమృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. వైద్య పరికరాలకు సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) ఇప్పటి వరకు సత్ఫలితాలను ఇచ్చినట్టు, 20 పెద్ద ప్రాజెక్టులు కార్యకలాపాలు ప్రారంభించినట్టు చెప్పారు.కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ) స్కాన్, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ స్కాన్, డయలాసిస్ మెషిన్లు దేశీయంగా తయారవుతున్నట్టు చావ్లా తెలిపారు. గతేడాది కేంద్ర కేబినెట్ ‘నేషనల్ మెడికల్ డివైజెస్ పాలసీ’కి ఆమోదం తెలపడం తెలిసిందే. వచ్చే ఐదేళ్లలో 50 బిలియన్ డాలర్ల స్థాయికి పరిశ్రమ ఎదిగేందుకు ఈ విధానం తోడ్పడుతుందని కేంద్రం భావిస్తోంది. -
బంగారం పరిశ్రమకు కొత్త సంఘం!
-
టారిఫ్ల పెంపుతో ఏఆర్పీయూ జూమ్
ముంబై: టారిఫ్ల పెంపు టెలికం కంపెనీలకు మరింత ఆదాయన్ని తెచి్చపెట్టనుంది. ప్రతి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 2025–26లో దశాబ్ద గరిష్ట స్థాయి రూ.225–230కు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పీయూ రూ.182తో పోల్చి చూస్తే 25 శాతం వృద్ధి చెందుతుందని తెలిపింది. అధిక లాభాలు, తక్కువ మూలధన వ్యయాలతో టెలికం కంపెనీల పరపతి సైతం మెరుగుపడుతుందని పేర్కొంది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం చార్జీలను 20 శాతం మేర పెంచడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 3 నుంచి అమల్లోకి వచ్చినట్టు క్రిసిల్ తన నివేదికలో గుర్తు చేసింది. అయితే, తదుపరి రీచార్జ్ల నుంచే పెంచిన చార్జీలు చెల్లించాల్సి వస్తుంది కనుక, దీని అసలు ప్రతిఫలం వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే కనిపిస్తుందని వివరించింది. 5జీ సేవలతో డేటా వినియోగం పెరుగుతుందని, ఇది కూడా ఏఆర్పీయూ పెరిగేందుకు మద్దతుగా నిలుస్తుందని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారుతున్నట్టు క్రిసిల్ తన నివేదికలో తెలిపింది. మూలధన వ్యయ భారం తగ్గుతుంది.. తాజా చార్జీల పెంపుతో టెలికం పరిశ్రమ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్వోసీఈ) 2023–24లో ఉన్న 7.5 శాతం నుంచి 2025–26లో 11 శాతానికి పెరుగుతుందని క్రిసిల్ అంచనా వేసింది. ఆదాయంలో మూలధన వ్యయాల (పెట్టుబడులు) శాతం 2023–24లో 28 శాతంగా ఉంటే, 2025–26లో 19 శాతానికి దిగొస్తుందని తెలిపింది. చాలా వరకు టెలికం సంస్థలు 5జీ సేవలను అమల్లోకి తెచ్చాయని.. అలాగే, స్పెక్ట్రమ్పై అధిక వ్యయాలు 2022–23లోనే చేసినట్టు గుర్తు చేసింది. దీంతో కంపెనీల రుణ భారం 6.4 లక్షల కోట్ల నుంచి రూ.5.6 లక్షల కోట్లకు దిగొస్తుందని వివరించింది. కంపెనీలు మరో విడత రేట్లను పెంచితే, తమ తాజా అంచనాలకు ఇంకా మెరుగుపడతాయని తెలిపింది. -
పెట్టుబడులు పెంచండి.. ఆనంద్ మహీంద్రా కీలక సూచనలు
ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా వృద్ధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి భారతీయ కంపెనీలు పెట్టుబడి పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' పేర్కొన్నారు. 2023-24 సంవత్సరానికి కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ఈయన.. కోవిడ్ అనంతర కాలంలో భౌగోళిక రాజకీయాలు మరియు ఆర్థిక సంబంధాల పరస్పర చర్య భారతదేశం స్థితిని బలపరిచిందని పేర్కొన్నారు.భారతదేశం వృద్ధి మరింత వేగవంతం కావాలంటే పరిశ్రమలు కూడా వృద్ధి చెందాలి. ఈ దేశం మనకు ఏమిచ్చింది అని కాకుండా.. దేశానికీ మనం ఏమి చేయగలమో ఆలోచించండి. ఈ క్లిష్ట సమయంలో పరిశ్రమ చేయాల్సిన ముఖ్యమైన పని ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం అని ఆనంద్ మహీంద్రా అన్నారు.1990ల ఆర్థిక సంస్కరణల తర్వాత.. ప్రైవేట్ పెట్టుబడులు జీడీపీలో 10 శాతం నుంచి 27 శాతానికి పెరిగాయి. అయితే 2011-12 నుంచి జీడీపీ శాతంగా ప్రైవేట్ పెట్టుబడులు ఆందోళనకరమైన స్థాయికి పడిపోతున్నాయని మహీంద్రా పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మనం చక్కదిద్దాలని, సమస్య వనరులకు సంబంధించినది కాదు, ఇది మనస్తత్వానికి సంబంధించినదని మహీంద్రా వెల్లడించారు. -
గౌతమ్ అదానీ జీతం ఎంతో తెలుసా?
ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ కుబేరుడు 'గౌతమ్ అదానీ' గురించి అందరికి తెలుసు. ఆసియా సంపన్నుల జాబితాలో ఒకరుగా ఉన్న ఈయన.. అదానీ గ్రూపులో పనిచేసే ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగుల కంటే తక్కువ జీతం తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారతదేశంలోని ఇతర పారిశ్రామక వేత్తల జీతాలతో పోలిస్తే.. అదానీ జీతం చాలా తక్కువ. కరోనా మహమ్మారి సమయంలో ముకేశ్ అంబానీ జీతం తీసుకోవడం మానేశారు. అంతకు ముందు ఈయన వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉండేది. భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకులు సునీల్ భారతి మిట్టల్ 2022లో రూ. 16.7 కోట్లు వార్షిక వేతనంగా తీసుకున్నారు. బజాజ్ ఆటో కంపెనీకి చెందిన రాజీవ్ బజాజ్, పవన్ ముంజాల్.. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ జీతం కూడా అదానీ జీతం కంటే చాలా తక్కువ.అదానీ సంస్థలో పనిచేసే ఏఈఎల్ బోర్డు డైరెక్టర్గా పనిచేస్తున్న వినయ్ ప్రకాష్ వార్షిక వేతనంగా మొత్తం 89.37 కోట్ల రూపాయలను అందుకున్నారు. గ్రూప్ సీఎఫ్ఓ జుగేషీందర్ సింగ్ వేతనం రూ.9.45 కోట్లు. దీన్ని బట్టి చూస్తే తన సంస్థలో పనిచేసేవారి జీతం కంటే.. అదానీ తక్కువ జీతం తీసుకుంటున్నారని తెలుస్తోంది.2024 మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో గౌతమ్ అదానీ తీసుకున్న జీతం రూ. 9.26 కోట్లు. ఈ జీతం భారతదేశంలోని ఇతర పారిశ్రామిక వేత్తలకంటే తక్కువని తెలుస్తోంది.అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (AEL) నుంచి 2023-24లో అదానీ తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు, దీనితో పాటు రూ. 27 లక్షల విలువైన అలవెన్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం మీద అదానీ ఎంటర్ప్రైజెస్ ఈయన తీసుకున్న జీతం రూ. 2.19 కోట్లు. అదానీ పోర్ట్స్, ఎస్ఈజెడ్ లిమిటెడ్ నుంచి రూ.6.8 కోట్లు జీతంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. -
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ 'అటెరో' వచ్చే ఐదేళ్లలో సుమారు రూ. 8300 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని కంపెనీ సీఈవో, కో ఫౌండర్ 'నితిన్ గుప్తా' తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సంవత్సరానికి 1,44,000 టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను(ఈ-వేస్ట్ ), 15,000 టన్నుల లిథియం అయాన్ బ్యాటరీని రీసైకిల్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాబోయే రోజుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సంస్థ ఈ పెట్టుబడి పెట్టింది.సంస్థ ప్రతి ఏటా 100 శాతం వృద్ధి సాధిస్తోందని, ఈ క్రమంలోనే సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఐరోపా దేశంలో ఇప్పటికే తన కార్యకలాపాలనను ప్రారంభించింది. భారతదేశంలో మరొక గ్రీన్ఫీల్డ్ సౌకర్యాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. దీనికోసం ఆంధ్రప్రదేశ్ / జార్ఖండ్లో స్థలాన్ని కూడా ఖరారు చేసినట్లు సమాచారం.కంపెనీ తన ఉనికిని విస్తరించిన తరువాత రీసైక్లింగ్ కెపాసిటీ ఏడాదికి 50000 టన్నులకు చేరుతుంది. ప్రస్తుతానికి కంపెనీ రీసైక్లింగ్ సామర్థ్యం 415000 టన్నులు అని తెలుస్తోంది. కంపెనీ 2027 నాటికి దాదాపు రూ. 16500 కోట్ల ఆదాయం గడించాలని యోచిస్తోంది. 2023లో కంపెనీ ఆదాయం రూ. 285 కోట్లు, 2024లో రూ. 440 కోట్లు.అటెరోకు ప్రస్తుతం 25 శాతం మార్కెట్ వాటా అది. ఇది వచ్చే ఏడాదికి 35 శాతానికి పెరుగుతుంది. అయితే మార్కెట్ వాటా పరంగా కంపెనీ దాని ప్రత్యర్థుల కంటే 10 శాతం తక్కువగా ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో కంపెనీ గణనీయమైన వృద్ధి సాదిస్తుందని భావిస్తున్నట్లు నితిన్ గుప్తా పేర్కొన్నారు. -
ఏపీలో ‘థర్మల్’ ధగధగ
నాడు రాష్ట్రంలో విద్యుత్తు కోతలు... పారిశ్రావిుక రంగంలో వెతలు, జనం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు, విద్యుత్తు కార్యాలయాల ముందు ధర్నాలు. రాత్రీ, పగలూ ఒకటే యాతన. ఇటు వ్యవసాయ రంగం, అటు పారిశ్రామిక రంగం కుదేలు. ఇక చిన్న, మధ్య తరహా పరిశ్రమల కష్టాలు చెప్పనవసరం లేదు. పవర్ హాలీడేలతో నరక యాతనే. నేడు కరెంటు కష్టాలు లేవు...కోతలు అసలే లేవు. జనంలో అప్పటి మాదిరిగా ఆగ్రహోద్వేగాల జాడే లేదు. పారిశ్రామికం, వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయా రంగాల్లో ఉత్పత్తి భేషుగ్గా నమోదవుతోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకుల మోముల్లో దరహాసం కనిపిస్తోంది. దీనికి కారణం సీఎం జగన్ తీసుకున్న చర్యలు.. దూర దృష్టి. సాక్షి, అమరావతి: సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు ఫలితంగా రాష్ట్రంలో గత ఐదేళ్లుగా విద్యుత్ వెలుగులీనుతోంది. విద్యుదుత్పత్తికి ఎలాంటి అవరోధాలు లేకపోవడంతో వినియోగదారులకు, పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకపోవడానికి జగన్ ముందు చూపే కారణం. చంద్రబాబు హయాంలో ముఖ్యంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు సామరŠాధ్యనికి తగ్గట్టుగా విద్యుత్ను ఉత్పత్తి చేయలేని దుస్థితిలో ఉండేవి. అవే ప్లాంట్లు జగన్ పాలనలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అదనపు సామరŠాధ్యన్ని జోడించుకుని పురోగతిని సాధించాయి. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో దాదాపు 45 శాతం ఏపీ జెన్కో థర్మల్ ప్రాజెక్టుల నుంచే సమకూరుతోందంటే రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాçßæమే ప్రధాన కారణం. అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైందని ఆ రంగ నిపుణులే చెబుతున్నారు. గత ప్రభుత్వ అసమర్థత శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం)లో రూ.8,432 కోట్ల అంచనా వ్యయంతో స్టేజ్ 1ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి, 2012లో ఒక యూనిట్ 800 మెగావాట్లు, 2013లో మరో 800 మెగావాట్ల యూనిట్ను పూర్తి చేయాలని నిర్ధేశించారు. కానీ అలా జరగలేదు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నడిచే మొదటి ప్రాజెక్ట్ ఇది. విదేశీ తయారీదారుల నుంచి సాంకేతికతను బదిలీ చేయడంలో అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడంలో జాప్యం చోటుచేసుకుంది. తర్వాత అంచనా వ్యయం రూ.12,230 కోట్లకు పెంచారు. అయితే స్టేజ్ 1 నిర్మాణం కోసం తీసుకున్న రూ.12942.28 కోట్ల అప్పులకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. అవన్నీ కలిపి మొత్తంగా రూ.20 వేల కోట్లకు చేరాయి. వీటిలో గత ప్రభుత్వం అసమర్ధత కారణంగా రూ.4200 కోట్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గుర్తించలేదు. అప్పులతోపాటు రూ.2106.75 కోట్ల నష్టాల్లోకి ప్లాంటు వెళ్లిపోయింది. జగన్ సర్కారు సమర్ధత అలాంటి ప్లాంటులో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణానికి చేయూతనందించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు త్వరితగతిన పనులు పూర్తి చేయించి, గతేడాది మార్చిలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారు. అక్కడితో ఆగలేదు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్ నిర్మాణంపైనా దృష్టి సారించించారు. గతేడాది డిసెంబర్లో దానినీ అందుబాటులోకి తెచ్చారు. బొగ్గు కొరతకు చెక్ దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు జగన్ సర్కారు ప్రణాళికలు అమలు చేస్తోంది. గతంలో ఒక్క రోజు నిల్వలకే అప్పటి ప్రభుత్వం నానా తంటాలు పడేది. ఉత్పత్తి లేక విద్యుత్ కోతలు విధించేది. ► ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో థర్మల్ విద్యుదుత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు సమకూర్చుకుంటున్నాయి. ►సాధారణంగా 65 శాతం నుంచి 75 శాతం వరకు ఉండే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ వద్ద 1000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ►ఈ మేరకు వీటీపీఎస్లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,12,350 మెట్రిక్ టన్నులు నిల్వ చేశారు. ►ఆర్టీపీపీలో 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి వస్తే అక్కడ 1,28,715 మెట్రిక్ టన్నులు తెచ్చి ఉంచారు. కృష్ణపట్నంలో 29 వేలు ఉత్పత్తికి వాడాల్సి ఉంటే 9,0971 మెట్రిక్ టన్నులు అందుబాటులో పెట్టారు. ►ఈ నిల్వలు వారం రోజుల వరకూ విద్యుత్ ఉత్పత్తికి సరిపోతాయి. బొగ్గును వినియోగిస్తూ థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ► కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతోపాటు, టెండర్ల ద్వారా విదేశీ బొగ్గును రప్పించుకుంటున్నాయి. ►శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించేలా ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. ►ఇది కాకుండా థర్మల్ కేంద్రాలకు ఎంసీఎల్ నుంచి ఏటా 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకుంది. ►ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్సీసీఎల్లు డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ)కు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. -
సింగర్ సుజాత మోహన్ బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
Adult Film Stars Serial Deaths: అదీ ఒక సినీ పరిశ్రమే.. అక్కడా చీకట్లెన్నో! (ఫొటోలు)
-
కాసులు కురిపించే కొబ్బరిపీచు
-
పతంగుల పరిశ్రమ వృద్ధిలో ప్రధాని మోదీ పాత్ర ఏమిటి?
మకర సంక్రాంతి పర్వదినం గుజరాత్కు ఎంతో ప్రత్యేకమైనది. దీనికి కారణం గుజరాత్ అంతటా గాలిపటాలు ఎగరడమే. ఈసారి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన పలువురు ప్రతినిధులు గాలిపటాలు ఎగురవేయడంపై ఆసక్తి చూపారు. మునుపెన్నడూ లేనంతగా పతంగులపై ప్రజలు ఇంత ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది అంతర్జాతీయ పతంగుల పండుగలో గతానికంటే భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక్కరోజులో హఠాత్తుగా జరిగినది కాదు. దీని వెనుక 20 ఏళ్లకు పైగా శ్రమ ఉంది. ఈ గాలిపటాల పండుగ గుజరాత్ సంస్కృతిని అందరికీ తెలిసేలా చేసింది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయానికి అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎంతో ప్రాధాన్యతనిచ్చి, ప్రపంచం గుర్తించేలా చేశారు. అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ గుజరాత్లో 1989 నుండి అధికారిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ, 2005లో వైబ్రెంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమ్మిట్తో ఈ ఉత్సవానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే గుజరాత్ పతంగులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికను 2003లో అప్పటి ముఖ్యమంత్రి మోదీ సిద్ధం చేశారు. అది గుజరాత్లో గాలిపటాల పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదపడింది. తమిళనాడులోని గాలిపటాల పరిశ్రమలపై అధ్యయనం చేసి, స్థానికంగా గాలిపటాల పరిశ్రమ అభివృద్ధికి వ్యూహాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అప్పటి సీఎం నరేంద్ర మోదీ అధికారులను కోరారు. 2003లో నిపుణుల బృందం గాలిపటాల పరిశ్రమలు కలిగిన అనేక ప్రదేశాలలో సమగ్ర సర్వేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రభుత్వం స్థానికంగా గాలిపటాల పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది. 2003లో నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ అహ్మదాబాద్లోని గాంధీ లేబర్ ఇన్స్టిట్యూట్లో గుజరాత్ కైట్ ఇండస్ట్రీ వర్క్ క్యాంప్ నిర్వహించారు. దీనిద్వారా గాలిపటాల కళాకారులు, పంపిణీదారులు, ప్రభుత్వ సంస్థలు, డిజైనర్లు, ఆర్థిక సంస్థల మధ్య కమ్యూనికేషన్ కోసం ప్రయత్నించారు. ఈ వర్క్క్యాంప్కు భాను భాయ్ షాను కూడా ఆహ్వానించారు. భాను భాయ్ ప్రముఖ కైట్సర్ఫర్. 50 సంవత్సరాలుగా గాలిపటాలు సేకరించడం అంటే అతనికి ఎంతో ఇష్టం. అవసరమైన ముడి పదార్థాల లభ్యతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గాలిపటాల పరిశ్రమను మరింత సులభతరం చేయాలని మోదీ కార్పొరేట్ సంస్థలను కోరారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న లక్షకుపైగా కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా గాలిపటాల పరిశ్రమను మోదీ అభివృద్ది చేశారు. గాలిపటాల తయారీ అనేది 2003-04 లో కుటీర, గ్రామీణ పరిశ్రమల స్థాయికి చేరింది. ఫలితంగా గుజరాత్లో గాలిపటాల పరిశ్రమ కొత్త మలుపు తిరిగింది. 2003-04 సంవత్సరంలో గాలిపటాల పరిశ్రమ టర్నోవర్ రూ. 15-20 కోట్లుగా ఉంది. కైట్ ఫెస్టివల్ విజయవంతం కావడంతో ఈ పరిశ్రమ పరిధి మరింత విస్తరించింది. 2007లో ఈ పరిశ్రమ టర్నోవర్తో రూ. 100 కోట్లకు చేరుకుంది. 2010నాటికి ఇది రూ. 400 కోట్ల పరిశ్రమగా మారింది. 2014 సంవత్సరంలో, గుజరాత్ గాలిపటాల ప్రపంచ వ్యాపారం రూ. 500 కోట్ల రూపాయలకు చేరింది. ఇది గుజరాత్లో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా చెబుతారు. గుజరాత్లోని గాలిపటాల పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 70 శాతం మంది మహిళలే ఉన్నారు. మోదీ అనంతర ప్రభుత్వాలు నేటికీ గాలిపటాల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్! -
అంతంత మాత్రంగానే ఎఫ్ఎంసీజీ వృద్ధి.. క్యూ3లో 4–5 శాతంగా అంచనా
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీలు అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాల పరంగా తక్కువ నుంచి మధ్యస్థ సింగిల్ డిజిట్ వృద్ధిని చూడొచ్చని అంచనా వేస్తున్నాయి. సీక్వెన్షియల్గా (క్రితం త్రైమాసికం) వినియోగ డిమాండ్ ఊపందుకోవడమే ఈ అంచనాలకు కారణం. ఇప్పటికీ గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ స్తబ్దుగానే ఉంది. పట్టణ ప్రాంతాల్లో వరుసగా మూడో త్రైమాసికంలోనూ డిమాండ్ నిలకడగా కొనసాగింది. ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్, మారికో, గోద్రేజ్ కన్జ్యూమర్ డిసెంబర్ త్రైమాసికం అప్డేట్లను పరిశీలించినప్పుడు ఈ విషయాలు తెలిశాయి. వినియోగం పుంజుకుంటుందనడానికి ఆరంభ సంకేతాలు కనిపిస్తున్నాయని, కనుక క్రమంగా వినియోగం పెరుగుతుందని ఎఫ్ఎంసీజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం తగ్గడంతో, తయారీ వ్యయాలు దిగిరావడం వల్ల స్థూల మార్జిన్లు మెరుగుపడతాయని పేర్కొన్నాయి. దీంతో కంపెనీలు మరిన్ని ప్రకటనల ద్వారా అమ్మకాలు పెంచుకునేందుకు అనుకూల వాతావరణం నెలకొంది. ‘‘ప్రకటనలు, ప్రచారంపై వ్యయాలు పెంచడం ద్వారా అధిక శాతం స్థూల మార్జిన్ల విస్తరణకు అవకాశం ఉంది. నిర్వహణ లాభం ఆదాయం కంటే ఎక్కువ వృద్ధిని వార్షికంగా నమోదు చేయవచ్చు’’అని డాబర్ ఇండియా త్రైమాసికం వారీ అప్డేట్లో పేర్కొంది. త్రైమాసికం వారీగా చూస్తే డిమాండ్ ధోరణిలో పురోగతి కనిపించినట్టు చెప్పింది. అయినప్పటికీ పట్టణాల్లో వృద్ధితో పోలిస్తే గ్రామీణ వృద్ధి బలహీనంగానే ఉందని, కాకపోతే పుంజుకుంటున్న సంకేతాలు కనిపించాయని వెల్లడించింది. ధరల్లో వృద్ధి స్తబ్దుగానే ఉందని, డిసెంబర్ త్రైమాసికంలో ప్రధానంగా అమ్మకాల పరిమాణంలోనే వృద్ధి కనిపించినట్టు తెలిపింది. ఎఫ్అండ్బీ విభాగం అమ్మకాలు అధిక సింగిల్ డిజిట్ వృద్ధిని చూడగా, హోమ్, పర్సనల్ కేర్ విభాగం అమ్మకాలు మధ్యస్థ సింగిల్ డిజిట్ను చూసినట్టు పేర్కొంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 35 శాతంగా ఉంటోంది. గ్రామీణం పర్వాలేదు.. డిసెంబర్ క్వార్టర్లో గ్రామీణ మార్కెట్ కొంత ఉత్సాహపూరితంగా ఉన్నట్టు మారికో తెలిపింది. స్థూల ఆర్థిక అంశాలు మెరుగుపడడంతో 2024లో వినియోగం ఇంకా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. దేశీయ అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయి సింగిల్ డిజిట్ వృద్ధికి పరిమితం కావొచ్చని, ప్రధాన పోర్ట్ఫోలియో అమ్మకాలు త్రైమాసికం వారీగా కొంత మెరుగుపడతాయని మారికో వివరించింది. పారాచ్యూట్ కోకోనట్ అయిల్ అమ్మకాలు తక్కువ సింగిల్ డిజిట్లో పెరగ్గా, సఫోలా ఆయిల్ అమ్మకాలు బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. కన్సాలిడేటెడ్గా డిసెంబర్ త్రైమాసికం అమ్మకాల్లో మధ్యస్థ సింగిల్ డిజిట్ వృద్ధిని చూసినట్టు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రకటించింది. ‘‘దేశీయంగా నిర్వహణ వాతావరణం సెప్టెంబర్ త్రైమాసికం మాదిరే ఉంది. అయినప్పటికీ మెరుగైన అమ్మకాలతో మధ్యస్థ సింగిల్ డిజిట్ వృద్ధి నమోదైంది’’అని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ దేశీయ ఎఫ్ఎంసీజీ అమ్మకాల వృద్ధి మధ్యస్థ సింగిల్ డిజిట్లోనే ఉండొచ్చని అంచనా. మారికో ఇంటర్నేషనల్ వ్యాపారం మధ్యస్థ స్థాయిలో వృద్ధి చెందగా, తమ అంతర్జాతీయ వ్యాపారం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తుందని డాబర్ ఇండియా తెలిపింది. -
Birthday Special: మ్యూజిక్ ఇతడి చేతుల్లో మేజిక్.. ఏఆర్ రెహమాన్ బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..
-
హైదరాబాద్లో ‘గింబల్స్’ తయారీ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణ దళాలకు అవసరమయ్యే ఆధునిక ‘గింబల్స్’తయారీ పరిశ్రమను హైదరాబాద్లో ఏర్పాటు చేయాల్సిందిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. హైదరాబాద్కు చెందిన హెచ్సీ రోబోటిక్స్ ఫ్రెంచ్ కంపెనీ మేరియోతో కలిసి ఆధునిక గింబల్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ కంపెనీ మేరియోకు చెందిన అత్యున్నతస్థాయి ప్రతినిధి బృందం సంస్థ సీఈవో రెమీప్లెనెట్ నేతృత్వంలో శుక్రవారం మంత్రిని కలిసి హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిని తెలియజేసింది. హైదరాబాద్లో మేరియో కార్యకలాపాలకు ప్రభుత్వపరంగా మద్దతును ఇస్తామని మంత్రి హామీనిచ్చారు. మేరియో ప్రతినిధి బృందం భారత పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ అధికారులతోపాటు ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థలతో సమావేశమైంది. శ్రీధర్బాబును కలిసిన ప్రతినిధి బృందంలో హెచ్సీ రోబోటిక్స్ సీఈవో వెంకట్ చుండి, డైరెక్టర్ డాక్టర్ రాధాకిషోర్ ఉన్నారు. -
సంక్రాంతికి సై
సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ కూడా. పండగ వసూళ్లను దండుకోవడానికి సంక్రాంతి మంచి సమయం. అందుకే ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. 2024 సంక్రాంతి పండగకి మరో నెలకు పైగా సమయం ఉన్నా అప్పుడే ఇండస్ట్రీలో సంక్రాంతి జోష్ కనిపిస్తోంది. ఈసారి పండగకి దాదాపు అరడజను స్ట్రయిట్ తెలుగు, దాదాపు ఐదు డబ్బింగ్ చిత్రాలతో సినిమాల జోరు బాగానే కనిపించనుంది. సినీ లవర్స్కి పండగకి దాదాపు పది చిత్రాలు రానున్నాయి. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ‘సోగ్గాడే చిన్నినాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) వంటి చిత్రాలతో సంక్రాంతి రేసులో నిలిచి, విజయం అందుకున్నారు నాగార్జున. ‘నా సామి రంగ’ చిత్రంతో ఈసారి మళ్లీ సంక్రాంతి బరిలో నిలుస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇందులో నాగార్జున ఫుల్ మాస్ లుక్లో కనిపిస్తారు. ఆయన మాట తీరు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ కొత్తగా, స్టైలిష్గా ఉంటాయి. నాగార్జున పుట్టిన రోజు (ఆగస్ట్ 29) సందర్భంగా విడుదల చేసిన నాగార్జున లుక్, గ్లింప్స్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ‘ఈ పండక్కి నా సామి రంగ’ అంటూ గ్లింప్స్ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది. ఆయన కెరీర్లో 99వ సినిమాగా ‘నా సామి రంగ’ రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు కానీ, సంక్రాంతికి రిలీజ్ పక్కా అని డుదలైన గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ► ‘సైంధవ్’ సినిమాతో వెంకటేశ్ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. వెంకటేశ్ కెరీర్లో ‘సైంధవ్’ 75వ చిత్రం కావడంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. పైగా ఆయన నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ సినిమా ఇదే కావడం విశేషం. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ‘సైంధవ్’ చిత్రాన్ని ఈ డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ఆ చిత్రబృందం ప్రకటించడంతో సంక్రాంతి బరిలో దిగారు వెంకటేశ్. ► గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు రవితేజ. ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’గా వెండితెరపై కనిపించారు. సంక్రాంతికి ‘ఈగల్’ చిత్రంతో బరిలో దిగడానికి రెడీ అయ్యారు. రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది. అయితే ఆ తేదీకి విడుదలవుతుందా? వాయిదా పడుతుందా అనే చర్చ వినిపిస్తోంది. కానీ చెప్పిన తేదీకి పక్కా వస్తామంటూ రిలీజ్ కౌంట్డౌన్ మొదలు పెట్టారు మేకర్స్. రవితేజ కెరీర్లోనే ‘ఈగల్’ వినూత్నమైన యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోందని, ఇందులో రవితేజ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తారని చిత్రయూనిట్ పేర్కొంది. ► ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు గుంటూరు కారం ఘాటు చూపించ డానికి ‘గుంటూరు కారం’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు హీరో మహేశ్బాబు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేశ్బాబు పక్కా మాస్ లుక్లో కనిపించ నున్నారని ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, గ్లింప్స్ చెబుతున్నాయి. ► ‘ఖుషి’ వంటి హిట్ సినిమా తర్వాత విజయ్ దేవర కొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ‘గీత గోవిందం’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్–పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఫ్యామిలీ స్టార్’. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి పోటీలో నిలవనుంది. అయితే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదనే చర్చ తాజాగా ఫిల్మ్నగర్ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ సంక్రాంతికి విడుదల కాకపోతే మార్చిలో రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడి షెడ్యూల్ పూర్తయ్యాక తర్వాతి షెడ్యూల్ చిత్రీకరణకు అమెరికాకు బయలుదేరనుంది యూనిట్. దాదాపు నెలరోజులకు పైగా అక్కడి లొకేషన్స్లో షూటింగ్ జరపనున్నారట. సంక్రాంతికి ఇంకా నెలన్నరే ఉంది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ షూటింగ్కి దాదాపు అంతే సమయం పడుతుందట. అందుకే ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలుస్తుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. ► ఈ సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు దిగుతుంటే నేనూ వస్తున్నానంటున్నాడు యువ హీరో తేజ సజ్జా. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను–మాన్’. ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్ మూవీ తర్వాత తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ఇది. అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడి, చివరికి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. డబ్బింగ్ కూడా.. పండగకి స్ట్రయిట్ చిత్రాలతో పాటు అనువాద చిత్రాలు కూడా వస్తుంటాయి. ఈసారి రజనీకాంత్ సినిమాతో పాటు జోరుగా బరిలో నిలవనున్న అనువాద చిత్రాలేవో తెలుసుకుందాం. ‘జైలర్’ సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న రజనీకాంత్ ‘లాల్ సలాం’తో పొంగల్ (సంక్రాంతి) బరిలో దిగుతున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ధనుష్, ప్రియాంకా అరుళ్ మోహనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని జి.శరవణన్, సాయి సిద్ధార్థ్ నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. శివ కార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘అయలాన్’. ఆర్. రవికుమార్ దర్శకత్వంలో ఆర్డీ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజవుతోంది. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్లో నటిస్తున్న చిత్రం ‘అరణ్మనై 4’. స్వీయ దర్శకత్వంలో ‘అరణ్మనై’ ఫ్రాంచైజీలో భాగంగా సుందర్ .సి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పొంగల్కి రిలీజ్ కానుంది. -
టయోటా కొత్త ప్లాంటుకు రూ.3,300 కోట్లు
బెంగళూరు: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత్లో మూడవ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3,300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. కర్ణాటకలోని బిదాడిలో ఈ కేంద్రం రానుంది. 2026 నాటికి నూతన ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం కానుంది. రెండు షిఫ్టులలో 1 లక్ష యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. బిదాడిలో ఇప్పటికే సంస్థకు రెండు యూనిట్లు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 3.42 లక్షల యూనిట్లు. మల్టీ–యుటిలిటీ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్తోపాటు వివిధ ఇంధన సాంకేతికతలతో మోడళ్లను తయారు చేసేందుకు భవిష్యత్కు అవసరమయ్యే స్థాయిలో కొత్త ప్లాంట్ ఉంటుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ విక్రమ్ గులాటీ తెలిపారు. కొత్త ప్లాంట్ ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న రెండు ప్లాంట్లలో 11,200 మంది పని చేస్తున్నారని వివరించారు. -
‘అపసవ్య ఆహారం’ ః రూ.25 లక్షల కోట్లు!
సాక్షి, సాగుబడి డెస్క్: వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటివరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ఇది ఎంత ఎక్కువంటే.. కనీసం ఊహకు కూడా అందనంత ఎక్కువగా.. ఏడాదిలో 12.7 లక్షల కోట్ల డాలర్లు అని పేర్కొంది. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు (20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు (12.3%) కాగా ఆ తర్వాత స్థానంలో భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు (8.8%) ఉండటం గమనార్హం. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్ఏఓ లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) ప్రకారం డాలర్ మార్పిడి విలువను నిర్థారించింది. భారత్కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ.21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం అపసవ్యమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ.25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ.14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ.6.2 లక్షల కోట్ల మేర పర్యావరణ, జీవవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1 లక్షల కోట్ల వరకు పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఏఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగు మందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘పరోక్ష మూల్యం’లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపితే దాని అసలు ధర పూర్తిగా తెలుస్తుంది. అయితే వైద్య ఖర్చులు, పర్యావరణానికి జరిగే నష్టాన్ని కలిపి ‘హిడెన్ కాస్ట్’అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’అనే తాజా నివేదికలో ఎఫ్ఏఓ వెల్లడించింది. ఈ ఆహారాలే జబ్బులకు మూలం వ్యవసాయంలో భాగంగా అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ మనల్ని దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తున్నాయి. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవలి దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఏఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్లో 60% మేరకు ఉండటం గమనార్హం. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశంలో బాగంగా పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యమని ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తామని తెలిపారు. -
ఏకంగా 45000 కోట్లు.. డేటా సెంటర్లలోకి పెట్టుబడుల వరద
ముంబై: దేశీయంగా డేటా సెంటర్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రూ. 45,000 కోట్ల మేర ఇన్వెస్ట్మెంట్లు రాగలవని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో అంచనా వేసింది. పెద్ద కంపెనీలు క్లౌడ్ సొల్యూషన్స్ను వినియోగించుకోవడం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొంది. ఇక ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్లు ప్రాచుర్యంలోకి వస్తున్న క్రమంలో రిటైల్ డేటా వినియోగం పెరుగుతోందని వివరించింది. గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ వార్షికంగా 45 శాతం మేర వృద్ధి చెందిందని క్రిసిల్ తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ సర్వీసులతో రిటైల్ యూజర్లలో డేటా వినియోగం ఇంకా విస్తరిస్తుందని, తద్వారా ఉత్పత్తయ్యే డేటాను నిల్వ చేసేందుకు డేటా సెంటర్ల అవసరమూ పెరుగుతుందని వివరించింది. ప్రస్తుతం 780 మెగావాట్లుగా ఉన్న భారతీయ డేటా సెంటర్ల స్థాపిత సామర్ధ్యం .. 2026 మార్చి నాటికి 1,700 మెగావాట్ల స్థాయికి చేరగలదని, ఇందుకు రూ. 45,000 కోట్లు అవసరం కాగలవని క్రిసిల్ డిప్యుటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనీష్ గుప్తా చెప్పారు. హైదరాబాద్, చెన్నై తదితర నగరాలకూ ప్రాధాన్యం.. కొత్త పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు భాగం ఆర్థిక రాజధాని ముంబైలోను, మిగతావి హైదరాబాద్, చెన్నై, నేషనల్ క్యాపిటల్ రీజియన్, పుణె వంటి ప్రాంతాల్లోను ఉండవచ్చని గుప్తా చెప్పారు. సబ్–సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అందుబాటులో ఉండటం, బడా కంపెనీలకు నెలవుగా ఉండటం, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండటం వంటి సానుకూల అంశాల కారణంగా ముంబైకి అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని క్రిసిల్ వివరించింది. తాజా పెట్టుబడులన్నీ దేశీ, అంతర్జాతీయ డేటా సెంటర్ ఆపరేటర్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో పాటు టెలికం, రియల్ ఎస్టేట్, నిర్మాణ, ఇంజినీరింగ్ తదితర రంగాల కంపెనీల నుంచి ఉండగలవని పేర్కొంది. -
2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ప్రారంభానికి ఇంక కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఒక పక్క మెగా టోర్నమెంట్ మరోపక్క దసరా-దీపావళి పండుగలు. దీంతో అటు ఫ్యాన్స్, ఇటు వ్యాపారవేత్తల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఎందుకంటే ఈ ఏడాది ODI (వన్ డే ఇంటర్నేషనల్) పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ప్రకటనల ద్వారా భారీ ఆదాయం సమకూరనుందని పరిశ్ర వర్గాల అంచనా. ప్రపంచ కప్ 2023 డిజిటల్ ఆదాయాలు ఈ సంవత్సరం గణనీయంగా పెరుగుతాయని, మునుపటి ఎడిషన్తో పోలిస్తే 70 శాతం ఎక్కువ పెరగవచ్చట. దాదాపు రూ. 2,000 కోట్లకు పైగా ఆదాయాన్ని తెస్తుందని అంచనా. 2019 ప్రపంచ కప్లో ఖర్చు చేసిన దాని కంటే రెట్టింపు ఖర్చుపెట్టనున్నారనే అంచనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పండుగ కాలంలో ప్రకటనల ఖర్చులు 15 శాతం పెరుగు తాయని విక్రయదారులు భావిస్తున్నారు. అటు ఫ్యాన్స్కు ,ఇటు ప్రకటనదారులకు పండగే 2022తో పోల్చితే 2023లో పండుగ కాలంలో ప్రకటన ఖర్చు కనీసం 10-15 శాతం పెరుగుతుందని యాడ్ ఏజెన్సీ పల్ప్ స్ట్రాటజీ వ్యవస్థాపకుడు , ఎండీ అంబికా శర్మ తెలిపారు. రాబోయే క్రికెట్ ప్రపంచ కప్ చాలా మంది వీక్షకులకు, ప్రకటనదారులకు ఆకర్షణీయంగా మారుతుందని పేర్కొన్నారు. ఏడాదికి మొత్తం యాడ్ ఖర్చులో 40-45 శాతం పండుగ కాలంలోనే జరుగుతుంది. క్రికెట్కు రోజుకు రోజుకు పెరుగుతున్న ఆదరణ, అందులోనూ ఈ ఏడాది ఫెస్టివ్ సీజన్లో వస్తున్న ప్రపంచ కప్ ద్వారా టీవీ ,డిజిటల్ ప్లాట్ఫారమ్లలో కలిపి రూ. 2,000-2,200 కోట్ల ప్రకటనల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. .2019 క్రికెట్ వరల్డ్ కప్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆధారిత ఆదాయం రూ. 400-రూ. 500 కోట్ల లోపే. డిజిటల్ ప్లాట్ఫారంల ద్వారా క్రికెట్కు భారీ క్రేజ్ క్రికెట్ డిజిటల్ ప్లాట్ఫారమ్లలో క్రికెట్కు భారీ క్రేజ్ ఏర్పడింది. డిజిటల్ ఛానెల్లలో తక్కువ ధరలు అనేక బ్రాండ్స్ను ప్రమోట్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఈనేపథ్యంలోనే క్రికెట్ వరల్డ్ కప్ 2023 2023లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వచ్చిన డిజిటల్ యాడ్స్ రెవెన్యూ దీనికి ఉదాహరణ. 2023 క్రికెట్ వరల్డ్ కోసం డిజిటల్పై యాడ్ రేట్ వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 230-250 పరిధిలో ఉంది. 2019 ఎడిషన్లో ప్రతి వెయ్యి ఇంప్రెషన్లకు రూ. 140-150తో పోలిస్తే 60 శాతం ఎక్కువ (CPM). ప్రపంచ కప్ కోసం ఈ ఏడాది టీవీలో ప్రకటనల ఖర్చు 20 శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా. అందులోనూ భారతదేశం-పాకిస్థాన్ మ్యాచ్అంటే ఆ క్రేజే వేరు. ఇలాంటి ప్రీమియం మ్యాచ్ల కోసం 10 సెకనుల రేట్లు దాదాపు రూ. 30 లక్షలు. ప్రపంచ కప్ సానుకూల ప్రభావంతో సహా 2023లో ప్రకటనల పరిశ్రమ మొత్తం వృద్ధి రేటు 8-9 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎలారా క్యాపిటల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తౌరానీ తెలిపారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎక్కువ శాతం వృద్ధి వస్తుందని అంచనా. క్యూ కట్టిన దిగ్గజ స్సాన్సర్లు అక్టోబరు 5 నుండి షురూ కానున్న ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 అధికారిక ప్రసార భాగస్వామి, స్ట్రీమింగ్ భాగస్వామి అయిన డిస్నీ స్టార్ ఇప్పటివరకు టోర్నమెంట్ కోసం 21 మంది స్పాన్సర్లు , 500 కంటే ఎక్కువ మంది ప్రకటనదారులు సైన్ అప్ చేసారు. మహీంద్రా & మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, MRF టైర్స్, Dream11, Booking.com, వంటి కొన్ని టోర్నమెంట్ స్పాన్సర్లుగా ఉన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ళ కోసారి పురుషుల జాతీయ జట్లు పోటీ పడే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంటు-2023 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజా 13వ ఎడిషన్ను భారతదేశం హోస్ట్ చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభమై వచ్చే నెల(నవంబర్) 19న ముగుస్తుంది. -
జీఎస్టీ పెంపు: ఇలా అయితే డిజిటల్ ఎకానమీ ఎలా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయం.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. 2025 నాటికి 1 లక్ష కోట్ల డిజిటల్ ఎకానమీ కావాలన్న భారత్ ఆకాంక్షలకు ఎదురుదెబ్బలాంటిదని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమపై పన్ను భారం 1,000 శాతం మేర పెరుగుతుందని ఐఏఎంఏఐ తెలిపింది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్) ఫలితంగా 2.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ స్టార్టప్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. కొత్తగా రాబోయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పూర్తిగా నిలిచి పోయే అవకాశం ఉందని వివరించింది. చట్టబద్ధమైన ఆన్లైన్ గేమింగ్ రంగంపై .. గ్యాంబ్లింగ్ కార్యకలాపాకు సమాన స్థాయిలో పన్ను విధించడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఐఏఎంఏఐ పేర్కొంది. కాగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సంబంధిత కంపెనీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా డెల్టా కార్ప్ ఎన్నడూ లేనంతగా నష్టాలను ఎదుర్కొంది. -
ఉపాధికి రక్షణ కవచం!
సాక్షి, అమరావతి : పారిశ్రామికంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఓ వైపు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు.. మరో వైపు సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)లు, వాటిలో భారీ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో యువతకు ఉపాధి మార్గాలు చేరువ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యసాయి జిల్లా పాల సముద్రం వద్ద 914 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగానికి చెందిన భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు వేగం అందుకున్నాయి. ఐదు దశల్లో ఈ యూనిట్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తొలి దశలో రూ.384 కోట్లతో అభివృద్ధికి బోర్డు ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో మిగిలిన దశలకు సంబంధించి ఆమోదం లభించనుందని బీఈఎల్ అధికారులు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్లో రాడార్, మిసైల్, సబ్మెరైన్లకు సంబంధించిన పరికరాలను అభివృద్ధి చేయడమే కాకుండా వీటిని పరీక్షించేలా టెస్టింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశకు సంబంధించి క్షిపణుల అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతులను రూ.148 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. బిడ్ దక్కించుకున్న సంస్థ క్షిపణుల తయారీకి సంబంధించి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ప్రీ ఇంజనీర్డ్ బిల్డ్లతో పాటు ఒక ఫ్యాక్టరీకి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు విద్యుత్, నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వరద నీటి కాల్వలు, అంతర్గత రహదారులు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాలు వంటి వాటిని సమకూర్చాల్సి ఉంటుంది. ఆసక్తి గల సంస్థలు మే 23లోగా బిడ్లను దాఖలు చేయాలని కోరింది. ఇప్పటికే ఈ 914 ఎకరాల చుట్టూ సుమారు రూ.50 కోట్లతో ప్రహరీ నిర్మించింది. గోడ చుట్టూ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, సొంత అవసరాల కోసం సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఏపీఐఐసీ అధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. చకచకా అనుమతులు గత ప్రభుత్వ అసమర్థ నిర్వాకానికి బీఈఎల్ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అత్యంత ప్రతిష్టాత్మకమైన క్షిపణులు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి 2016లోనే బీఈఎల్ ముందుకు రాగా, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. భూమి కన్వర్షన్, పర్యావరణ అనుమతులు తేవడంలో అప్పటి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి, త్వరితగతిన అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టారు. మరోపక్క యూనిట్ పనులు ప్రారంభించకపోతే భూ కేటాయింపులు రద్దు చేయడంతో పాటు, పెనాల్టీ విధిస్తామంటూ బీఈఎల్కు ఏపీఐఐసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో బీఈఎల్ కొంత సమయం ఇవ్వాలని, పెనాల్టిలు రద్దు చేయాలని కోరింది. గతంలో కంటే పెద్ద యూనిట్ ఏర్పాటు చేసేలా, కొత్తగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని పరిశీలించిన ఏపీఐఐసీ బోర్డు అన్ని అనుమతులు మంజూరు చేసింది. అనుమతులు రావడంతో బీఈఎల్ కూడా యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టింది. నిధులు కూడా కేటాయించింది. రక్షణ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై బీఈఎల్ అధికారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం బీఈఎల్ కార్యాలయంలో ప్రత్యేకంగా బోర్డు సమావేశం ఏర్పాటు చేసి, తొలి దశలో రూ.384 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయితే 2025 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. డిఫెన్స్ హబ్గా ఏపీ దేశ రక్షణ అవసరాల తయారీ హబ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఇప్పటికే కేంద్ర రక్షణ సంస్థ 914 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేస్తుండగా ఏపీఐఐసీ కూడా 1,200 ఎకరాల్లో ఏపీ ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ ఎల్రక్టానిక్స్ (ఏపీ–ఏడీఈ) పార్క్ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో జరిగే ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు రాష్ట్రం రక్షణ రంగ ఉత్పత్తులకు తయారీ కేంద్రంగా తయారవుతుందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల రాకతో ప్రత్యక్షంగా 2,800 మందికి, పరోక్షంగా 8,000 మంది వరకు ఉపాధి లభిస్తుంది. యాంకర్ యూనిట్గా బీఈఎల్ భారీ ప్రాజెక్టును చేపడుతుండటంతో అనేక అనుబంధ కంపెనీలు, ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కానున్నాయి. -
పెట్టుబడులకు లాజిస్టిక్స్ అద్భుత అవకాశం
భువనేశ్వర్: పెట్టుబడులు, పరిశ్రమగా రూపుదిద్దుకోవడం, భారీ ఉపాధి అవకాశాలతో రాబోయే సంవత్సరాల్లో యువతకు లాజిస్టిక్స్ పూర్తి అవకాశాలను కల్పించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుండి 29 వరకు ఇక్కడ జరగనున్న మూడవ జీ– 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ భేటీ నేపథ్యంలో ‘‘ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్ ఫర్ కోస్టల్ ఎకానమీస్‘ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో లాజిస్టిక్స్ భారీగా పురోగమించే అవకాశం ఉందని అన్నారు. ఈ రంగానికి సంబంధించి సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులకు, వ్యవస్థాపకతకు, ఉపాధి అవకాశాలకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయని అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇది ప్రపంచానికి సవాళ్లతో కూడిన ఆసక్తికరమైన సమయం. అవకాశాలతో పాటు సవాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంలో, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. భారత్ను ప్రపంచం చాలా గౌరవ ప్రదమైన దేశంగా చూస్తోంది‘ అని చంద్రశేఖర్ అన్నారు. సవాళ్లను తట్టుకునే ఎకానమీల దిశగా ప్రపంచం సవాళ్లను తట్టుకుని పురోగమించే లాజిస్టిక్స్, విశ్వసనీయ సప్లైచైన్ వైపు ప్రపంచం చూస్తోందని, రిస్క్ నుండి దూరంగా ఉంటూ సవాళ్లను ఎదుర్కొనే ఆర్థిక వ్యవస్థల వైపు పెట్టుబడులకు మొగ్గుచూపుతోందని మంత్రి పేర్కొన్నారు. ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాలలో లాజిస్టిక్స్పై దృష్టి, దీనిపై తగిన విధానాలు కీలకమైనవని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. భారత్కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. ఈ నేపథ్యంలో భారత్ పురోగతిపై ఇంకా కేంద్ర మంత్రి ఏమన్నారంటే.. మొబైల్ ఫోన్ల హబ్గా.. 2014లో భారతదేశంలో వినియోగించే మొబైల్ ఫోన్లలో 82 శాతం దిగుమతి అయ్యాయి. 2022లో భారతదేశంలో వినియోగించే దాదాపు 100 శాతం మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారయ్యాయి. 2014లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి దాదాపు లేనేలేదు. అయితే ఒక్క ఈ ఏడాదే భారత్ దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువ చేసే యాపిల్, సామ్సంగ్ ఫోన్లను ఎగుమతి చేసింది. మారిన పరిస్థితులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి తగిన మార్కెట్ లేదని, ఇది ఆచరణీయ మార్కెట్ కాదని, లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉన్నందున భారత్కు ప్రపంచ తయారీ కేంద్రంగా మారగల సామర్థ్యం అసలు లేదని చాలా దశాబ్దాలుగా ఒక వాదన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్లు తదితర అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఎ గుమతులు, దేశంలోనే విక్రయాలు, దేశీయంగా పటి ష్టమైన లాజిస్టిక్స్ వ్యవస్థ వంటి ఎన్నో అంశాల్లో భా రత్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారింది. నైపుణ్యాలు కీలకం యువత తమ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. అంటే డిగ్రీలు అందుకున్నంత మాత్రాన నైపుణ్యాలను పొందలేము. ప్రత్యేకించి నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలి. మూడవ జీ–20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అక్షరాస్యత, స్టాటిస్టిక్స్, టెక్–ఎనేబుల్డ్ లెర్నింగ్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, పరిశోధన, సహకారం వంటి పలు అంశాలపై దృష్టి సారిస్తుంది. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థల పురోగతికి టెక్నాలజీ, ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్, స్కిల్ ఆర్కిటెక్చర్, జీవితకాల అభ్యాసానికి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చనీయాంశాలు కానున్నాయి. జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగింది. ఆ తర్వాత గత నెలలో అమృత్సర్లో రెండవ సమావేశం జరిగింది. మూడవ సమావేశాలు ఈ నెల్లో భువనేశ్వర్లో జరుగుతున్నాయి. తదనంతరం ఆయా అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయ ప్రాతిపదికన విధాన నిర్ణయాలు రూపొందుతాయి. -
5.2 బిలియన్ డాలర్లకు.. పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ
కోల్కతా: దేశీయంగా పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. దీంతో వచ్చే మూడు, నాలుగేళ్లలో 5.2 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఎఫ్ఏఐ) ప్రెసిడెంట్ రిషభ్ కొఠారీ ఈ విషయాలు తెలిపారు. ‘దేశీయంగా ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్ పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఇది 3.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది‘ అని ఆయన చెప్పారు. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు, ఇతరత్రా అంశాలపై ఖర్చు చేయగలిగే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని కొఠారీ వివరించారు. ఆహారోత్పత్తులు, పానీయాలు, వ్యక్తిగత సౌందర్య సంరక్షణ, హోమ్కేర్, ఫార్మా, కాస్మెటిక్స్ మొదలైన రంగాల్లో వీటిని ఎక్కువగా వినియోగి స్తుంటారు. సహజసిద్ధమైన, సేంద్రియ ఉత్పత్తులవైపు వినియోగదారులు మళ్లుతున్నందున ఆ విభాగాల్లో ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్ సంస్థలకు వ్యాపార అవకాశాలు ఉన్నాయని కొఠారీ పేర్కొన్నారు. -
వెండి, బంగారం ధరలపై గుడ్న్యూస్: బడ్జెట్పై కోటి ఆశలు!
న్యూఢిల్లీ: 2023-24 కేంద్రం బడ్జెట్కు సంబంధించిన కేటాయింపులు, మినహాయింపులు, కోతలపై సామాన్య ప్రజానీకం నుంచి కార్పొరేట్ దాకా చాలా ఆశలు, ఊహాగానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టన్నారు.ఈ సందర్భంగా కేంద్రానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో మరిన్ని ప్రజాకర్షక పథకాలు ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పసిడి ధర, బంగారు ఆభరణాల ధర తగ్గుముఖం పడుతుందా? దిగుమతి సుంకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పండుగల సీజన్లో రిటైల్ అమ్మకాలను దెబ్బతీస్తూ బంగారం ధరలు రికార్డు స్థాయిలకు పెరుగుతున్న తరుణంలో, రాబోయే కేంద్ర బడ్జెట్ 2023-24లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తారని భారతీయ ఆభరణాల విభాగం భావిస్తోంది. ప్రస్తుతం, బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 12.5 శాతం, వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్గా అదనంగా 2.5శాతంగా ఉంది. గత బడ్జెట్లో కరెంటు ఖాతా లోటును తగ్గించేందుకు ఈ సుంకాన్ని పెంచారు. ఫలితంగా బంగారం దిగుమతులు 2021లో 1,068 టన్నుల నుంచి 2022లో 706 టన్నులకు తగ్గిపోయాయి. సుంకం పెంపు వల్ల భారత్లోకి బంగారం అక్రమ రవాణా పెరిగిందనీ, ఇది ఏడాదికి 200 టన్నులు అని అంచనా వేశామని వాస్తవానికి బంగారం రిటైల్ అమ్మకాలను ఇది ప్రభావితం చేస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. బంగారం, వెండి ,ప్లాటినంపై దిగుమతి సుంకాన్ని 4 శాతంక తగ్గించాలని జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) డిమాండ్ చేస్తోంది. ఈ దిగుమతి సుంకం ఎగుమతిదారుల నుండి మూలధనాన్ని హరించివేస్తోందని భావిస్తోంది. కౌన్సిల్ చైర్మన్ విపుల్ షా ప్రకారం. దిగుమతి సుంకం తగ్గింపు ఆరోగ్యకరమైన ,మరియు పారదర్శక పరిశ్రమను కలిగి ఉండటానికి సహాయడుతుందనీ, అలాగే ఎగుమతిదారుల వర్కింగ్ క్యాపిటల్ అడ్డంకిని తగ్గించడంలో సహాయపడుతుంది. స్థానిక ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో కొన్ని వస్తువులు ఖరీదైనవి, మరికొన్ని చౌకగా మారనున్నట్లు తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్లో, ప్రభుత్వం మొత్తం దృష్టి దేశంలో ఉత్పత్తిని పెంచడం, అనవసరమైన వస్తువుల దిగుమతిని తగ్గించడంపైనే ఉంటుంది. తద్వారా దేశంలోని వాణిజ్య నిల్వలను సరిచేయవచ్చు. కరెంట్ ఖాతా లోటును తగ్గించవచ్చు. దీనికి తోడు దేశీయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం అనేక రంగాలకు పీఎల్ఐ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో బంగారం చౌకగా ఉండే అవకాశం ఉందని, తద్వారా ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని తెలుస్తోంది. రత్నాలు, ఆభరణాల రంగానికి సంబంధించి బంగారంతో పాటు మరికొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. తద్వారా దేశం నుండి ఆభరణాలు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. గతేడాది బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పసిడి ధరల సెగ కాస్త తగ్గుముఖం పట్టి..ప్రజల చేతుల్లో పుత్తడి మరింత మెరిసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంగారెడ్డి : మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
-
రష్మిక నోటి దురుసు.. సౌత్ ఇండస్ట్రీ నుండి బ్యాన్..?
-
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ, పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారు?
న్యూఢిల్లీ: నైపుణ్య ఆధారిత ఆన్లైన్ గేమింగ్పై ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రస్తుత 18 శాతం నుండి 28 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన పట్ల తమకు అభ్యంతరం ఏదీ లేదని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ స్థాయి పన్ను స్థూల గేమింగ్ రాబడి (జీజీఆర్) పైనే విధించాలని, పోటీకి సంబంధించిన ప్రవేశ మొత్తంపై (సీఈఏ) 28 శాతం జీఎస్టీ విధింపు సరికాదని పేర్కొంది. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) ప్రవేశ మొత్తంపైనే ఈ స్థాయి పన్ను విధిస్తే, అది దాదాపు 2.2 బిలియన్ డాలర్ల విలువచేసే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషించింది. జీజీఆర్ అనేది ఆన్లైన్ స్కిల్ గేమింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా తమ ప్లాట్ఫారమ్లోని గేమ్లో పాల్గొనడానికి సర్వీస్ ఛార్జీలుగా ఆయా సంస్థలు వసూలు చేసే రుసుము. అయితే పోటీ ఎంట్రీ అమౌంట్ (సీఈఏ) అనేది ప్లాట్ఫారమ్పై పోటీలో పాల్గొనడానికి ప్లేయర్ డిపాజిట్ చేసిన మొత్తం. ఆయా అంశాలు, సమస్యలపై గేమింగ్ పరిశ్రమ నిపుణులు ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. (గుడ్న్యూస్: ఎఫ్ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!) నేపథ్యం ఇదీ... ఆన్లైన్ గేమింగ్ జీజీఆర్పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచడంపై డిసెంబర్ 17న జరుగుతుందన్న భావిస్తున్న జీఎస్టీ మండలి ఒక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో గేమింగ్ రంగంలో నిపుణులు కేంద్రానికి తమ కీలక సూచనలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జరగబోయే రానున్న జీఎస్టీ సమావేశంలో ప్యానెల్ క్యాసినో, రేస్ కోర్స్ ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు సంబంధించిన ఎజెండాను చేపట్టవచ్చని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్పై నివేదిక సమర్పించాలని మంత్రుల బృందాన్ని ఆదేశించింది. నివేదిక రూపకల్పన విషయంలో ఈ రంగానికి సంబంధించి పలు అంశాల పరిశీలనతో పాటు రాష్ట్రాల నుండి వచ్చే మరిన్ని సూచనలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. (సరికొత్త అవతార్లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) గేమ్స్ ఇవీ... నైపుణ్యాల ప్రాతిపదికన జరిగే ఆన్లైన్ గేమ్లలో ఇ–స్పోర్ట్స్, ఫాంటసీ గేమ్లు, రమ్మీ, పోకర్ లేదా చెస్ ఉన్నాయి. ఇటువంటి గేమ్లు ఆన్లైన్లో ఉచితంగానూ ఆడవచ్చు. లేదా ఫ్లాట్ఫామ్ ఫీజుల రూపంలో డబ్బు చెల్లించి ఆడే వారూ ఉంటారు. చట్టబద్ద పరిశ్రమ ప్రయోజనాలు కాపాడాలి పోటీ ప్రవేశ మొత్తంపై కాకుండా స్థూల గేమింగ్ ఆదాయంపై జీఎస్టీ విధించాలని ఒకే పరిశ్రమగా ఒకే తాటిపై మేము కోరుతున్నాము. స్థూల గేమింగ్ ఆదాయంపై జీఎస్టీ 18 శాతం నుండి 28 శాతానికి పెరగడం వలన కేంద్రానికి పన్ను రాబడి పెరుగుతుంది. పరిశ్రమ కూడా దీనిని భరించగలుగుతుంది. ఇక పోటీ ప్రవేశ మొత్తంపై పన్ను విధించడం వల్ల పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. పెరిగిన పన్ను భారాన్ని వినియోగదారులపై మోపవలసి ఉంటుంది. దీనివల్ల భారతదేశంలో ఎటువంటి పన్ను బాధ్యతలు లేని గ్రే మార్కెట్, ఆఫ్షోర్ గేమింగ్ ప్లాట్ఫారమ్లకు ఆటగాళ్లు మారిపోతారు. దీనితో చట్టబద్ధమైన గేమింగ్ వ్యాపార సంస్థలు తమ కస్టమర్ బేస్ను కోల్పోతాయి. చివరకు చట్టబద్దమైన సంస్థలపై, ప్రభుత్వ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తుంది- త్రివిక్రమన్ థంపి, గేమ్స్ 24గీ7 కో–చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతికూల ప్రభావాలు ఎంట్రీ ఫీజుల కంటే స్థూల గేమింగ్ రాబడిపై పరిశ్రమ జీఎస్టీ విధించడం వల్ల ఫలితాలు బాగుంటాయి. ఎంట్రీ ఫీజుపై పన్ను విధింపు మాత్రం భారత్దేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న గేమింగ్ రంగం వృద్ధిని నియంత్రిస్తుంది. ప్రవేశ రుసుములపై జీఎస్టీని వర్తింపజేయడం వలన ఇప్పటికే అనేక రకాల పన్నులు– రుసుములను చెల్లించే ప్లేయర్లు తీవ్రంగా నిరుత్సాహపడతారు. స్థూల గేమింగ్ రాబడిపై పన్ను విధించడం వలన ప్లేయర్లు వారి నైపుణ్యం లేదా విజయంతో సంబంధం లేకుండా, న్యాయమైన సమానమైన మార్గంలో పన్ను చెల్లింపులకు సహకరిస్తారు. ఎంట్రీ ఫీజుపై జీఎస్టీ విధింపు వల్ల కంపెనీలు లేదా ప్లేయర్లు చట్టవిరుద్ధమైన ఆఫ్షోర్ జూదం యాప్ల వైపు నడిచే అవకాశం ఉంది. ఇవి భారత్ చట్టాలకు అనుగుణంగాగానీ లేదా ఎకానమీకి లాభదాకంగా ఉండే అవకాశమే ఉండదు -సుమంత డే, డిజిటల్ వర్క్స్ సీనియర్ డైరెక్టర్ -
టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా : హీరోయిన్
అటు పోట్లు ఎన్ని ఎదురైనా దృఢ సంకల్పం ఉంటే విజయం సాధించవచ్చు అని నటి నందిని రాయ్ నిరూపించింది. వరుస ఫ్లాప్లతో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య గురించీ ఆలోచించింది. మళ్లీ తనకు తానే ధైర్యం చెప్పుకుని అపజయాలను చాలెంజ్గా తీసుకుంది. ప్రస్తుతం వరుస విజయాలు చవిచూస్తోంది. ఆ విజేత పరిచయం.. ► కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా ► పుట్టింది, పెరిగింది హైదరాబాద్లోనే. చిన్న వయసులోనే మోడల్గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైమ్లోనే అంతర్జాతీయ మోడల్గా పేరు సంపాదించుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకుంది. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. ► ‘040’ అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ‘మాయ’, ‘ఖుషీ ఖుషీగా’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘శివరంజని’ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ నటించింది. అటు హిందీలో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే సినిమాలో కనిపించింది. ► బిగ్ బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్కు మరింత దగ్గరైంది. ఇటీవల సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గాలివాన’ వెబ్ సిరీస్లో కూడా నటించి విమర్శల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘పంచతంత్ర కథలు’, ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్లతో వీక్షకులను అలరిస్తోంది. -
పన్నులపై సూచనలు ఇవ్వండి
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్పై కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక శాఖ.. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విషయంలో తగు సూచనలు చేయాలంటూ పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ అసోసియేషన్లను కోరింది. డిమాండ్లతో పాటు వాటి వెనుక గల హేతుబద్ధతను కూడా వివరిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని సూచించింది. సుంకాల స్వరూపం, పన్నుల రేట్లు మొదలైన వాటిల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన సిఫార్సులను పంపేందుకు నవంబర్ 5 ఆఖరు తేదీ. ప్రత్యక్ష పన్నుల రేట్లను క్రమబద్ధీకరించడంతో పాటు పన్ను ప్రోత్సాహకాలు, డిడక్షన్లు, మినహాయింపులు మొదలైనవి దశలవారీగా తొలగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో తాజా బడ్జెట్పై ఆసక్తి నెలకొంది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
హైదరాబాద్ : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పరిశ్రమకు శంకుస్థాపన
-
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలకు ఊరట లభించింది. బ్యాటరీలకు సంబంధించి అదనపు భద్రతా ప్రమాణాల అమలును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వాస్తవానికి అయితే అక్టోబర్ 1 నుంచి కొత్త భద్రతా ప్రమాణాలు అమల్లోకి రావాల్సి ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. నూతన బ్యాటరీ భద్రతా ప్రమాణాలను రెండంచెల్లో అమలు చేయనున్నారు. మొదటి దశ నిబంధనలు ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. రెండో దశ నిబంధనలు 2023 మార్చి 31 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం తెలిసిందే. ప్రమాదాలకు కారణం బ్యాటరీలేనని తేలింది. దీంతో నిపుణుల సూచనల మేరకు కేంద్ర రవాణా శాఖ అదనపు భద్రతా ప్రమాణాలను రూపొందించి, ఆ మేరకు నిబంధనల్లో సవరణలు చేసింది. బ్యాటరీ సెల్స్, ఆన్ బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, వేడిని తట్టుకోగలగడం తదితర అంశాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసింది. -
మాకూ పీఎల్ఐ స్కీమ్ ఇవ్వండి : టోయ్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని తమకూ వర్తింపచేయాలని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయాలని ఆట వస్తువుల పరిశ్రమ వర్గాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగాల కల్పనకు, ఎగుమతులను పెంచేందుకు ఇవి దోహదపడగలవని పేర్కొన్నాయి. ఇటు దేశీయంగా తయారీకి, అటు ఎగుమతులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎల్ఐ స్కీము ప్రస్తుతం ఫార్మా తదితర 14 రంగాలకు వర్తిస్తోంది. ఈ నేపథ్యంలో టాయ్స్ పరిశ్రమ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. (Hero Motocorp: విడా ఈవీ: తొలి మోడల్ కమింగ్ సూన్) ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు పరిశ్రమకు సహాయకరంగా ఉంటున్నప్పటికీ పీఎల్ఐ స్కీము, ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తే మరింత తోడ్పాటు లభించగలదని లిటిల్ జీనియస్ టాయ్స్ సీఈవో నరేశ్ కుమార్ గౌతమ్ చెప్పారు. అలాగే పరిశ్రమ భవిష్యత్ వృద్ధికి దిశా నిర్దేశం చేసేలా ప్రభుత్వం జాతీయ టాయ్ పాలసీ రూపొందించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు. మరోవైపు, ప్రస్తుతం టాయ్స్ పరిశ్రమను హస్తకళలు లేదా క్రీడా వస్తువుల కింద వర్గీకరిస్తున్నారని అలా కాకుండా దీని కోసం ప్రత్యేకంగా ఎగుమతి మండలిని ఏర్పాటు చేస్తే మరింత ప్రాధాన్యం దక్కేందుకు అవకాశం ఉంటుందని నట్ఖట్ టాయ్స్ ప్రమోటర్ తరుణ్ చేత్వాని అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు భారీ అవకాశాలు ఉన్నాయని, పరిశ్రమ ప్రస్తతుం తయారీపై దృష్టి పెడుతుండటంతో చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయని వివరించారు. ఎగుమతులు 61 శాతం అప్.. గడిచిన మూడేళ్లలో ఆటవస్తువుల ఎగుమతులు 61 శాతం పెరిగాయని ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. ఇవి 2018–19లో 202 మిలియన్ డాలర్లుగా ఉండగా 2021–22లో 326 మిలియన్ డాలర్లకు చేరాయని వివరించారు. మరోవైపు గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గాయని, 371 మిలియన్ డాలర్ల నుంచి 110 మిలియన్ డాలర్లకు దిగి వచ్చాయని వాణిజ్య శాఖ గణాంకాలను ఉటంకిస్తూ పేర్కొన్నారు. చాలా మటుకు దిగుమతిదారులు దిగుమతులను తగ్గించుకుని, స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక చర్యలు సహాయపడుతున్నాయని చెప్పారు. -
‘మీరు వెళ్లండి, కానీ మేం నష్టపోనివ్వకుండా చూడండి’
న్యూఢిల్లీ: విదేశీ ఆటోమొబైల్ సంస్థలు (ఓఈఎం) అకస్మాత్తుగా భారత మార్కెట్ నుంచి నిష్క్రమిస్తుండటం వల్ల తాము భారీగా నష్టపోవాల్సి వస్తోందని ఆటోమొబైల్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి నిష్క్రమణల వల్ల తమను నష్టపోనివ్వకుండా తగు పరిహారం అందేలా చూడాలని కోరారు. రెండు పక్షాలకు ప్రయోజనం కలిగించే విధంగా ఇరు వర్గాల మధ్య ఒప్పందాలు ఉండాలని ఆటోమోటివ్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి మంగళవారం నిర్వహించిన ఆటో రిటైల్ సదస్సులో నమూనా డీలర్ ఒప్పందాన్ని (ఎండీఏ) ఆవిష్కరించింది. ‘ఓఈఎం (వాహనాల తయారీ సంస్థలు)లకు, డీలర్లకు మధ్య ప్రస్తుతం ఒప్పందాలు ఏకపక్షంగా ఉంటున్నాయి. అవి ఓఈఎంల కోణంలోనే ఉంటున్నాయి. అలాకాకుండా వ్యాపార నిర్వహణలో మా మాటకు కూడా విలువ ఉండేలా ఒప్పందాలు ఉండాలన్నది డీలర్ల అభిప్రాయం‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా చెప్పారు. ఎండీఏతో ఇటు ఓఈఎంలు, అటు డీలర్లకు సమాన స్థాయి లభించగలదని పేర్కొన్నారు. ఒప్పందాలనేవి ఆటో పరిశ్రమ లేదా వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా ఇరు పక్షాలకు తగు పరిహారం లేదా తగిన సెటిల్మెంట్ లభించేలా ఉండాలే తప్ప ఏకపక్షంగా ఉండకూడదని సింఘానియా చెప్పారు. విదేశీ ఓఈఎంలు భారత్లో కార్యకలాపాలు ప్రారంభించడం కోసం అయిదేళ్ల పైగా కూడా అధ్యయనాలు చేస్తుంటాయని, కానీ తప్పుకోవాల్సి వస్తే హఠాత్తుగా నిష్క్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘దీంతో డీలర్ల దగ్గర వాహనాలు, స్పేర్ పార్టుల స్టాక్లు పేరుకుపోతుంటాయి. వ్యాపారం కోసం మేము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటాం. విదేశీ ఓఈఎం అకస్మాత్తుగా నిష్క్రమించడం వల్ల ఆ డబ్బంతా ఇరుక్కుపోతుంది. అలా కాకుండా ఒకవేళ నిష్క్రమించాల్సి వస్తే అది ప్రణాళికాబద్ధంగా జరిగితే, డీలర్లు కూడా తమ దగ్గరున్న నిల్వలను విక్రయించి, బ్యాంకు రుణాలను తీర్చుకునేందుకు వీలవుతుంది‘ అని సింఘానియా చెప్పారు. 2017లో జనరల్ మోటర్స్, 2021లో ఫోర్డ్ భారత మార్కెట్ నుంచి నిష్క్రమించిన సందర్భాల్లో డీలర్లు భారీగా నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
‘ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది’: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో ద్వైపాక్షిక వాణిజ్యంపై పలు దేశాలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేవలం రూబుల్ (రష్యా కరెన్సీ)–రూపాయి మారకంలో వాణిజ్యానికే పరిమితం కాకుండా ఇతరత్రా కరెన్సీలకూ వర్తించేలా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక విధానాన్ని రూపొందించడం సానుకూలాంశమని ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికి మించి స్వేచ్ఛా విపణిగా మారగలుగుతోందని మైండ్మైన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారి అనంతరం భారత్ అనేక వినూత్న ప్రయోగాలను ఆవిష్కరిస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రైవేట్ రంగం హనుమంతుడిలాంటిది.. విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారత్పై నమ్మకంగా ఉన్నప్పుడు దేశీయంగా ప్రైవేట్ సంస్థలు తయారీలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకాడుతున్నారో తెలియడం లేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. పరిశ్రమకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చించేందుకు, పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. హనుమంతుడిలాగా పరిశ్రమకు తన శక్తి సామర్థ్యాలపై నమ్మకం లేని పరిస్థితి కనిపిస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. ‘పరిశ్రమ హనుమాన్లాగా మారిందా? మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం కలగడం లేదా. ఎవరైనా మీ పక్కన నిల్చుని, మీకు హనుమంతుడి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి .. ముందుకు కదలండి అని చెప్పాల్సిన అవసరం ఉందా? అలా హనుమంతుడికి ప్రస్తుతం చెప్పేవారు ఎవరున్నారు. పరిశ్రమ కదిలి వచ్చి ఇన్వెస్ట్ చేసేందుకు ఏమేమి చేయగలదో అంతా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయినప్పటికీ ఎందుకు వెనుకాడుతున్నారో మీ నుంచి వినాలని ఉంది‘ అని ఆమె పేర్కొన్నారు. -
పెన్నార్కు రూ.511 కోట్ల ఆర్డర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ పరికరాల తయారీ దిగ్గజం పెన్నార్ గ్రూప్ తాజాగా రూ.511 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. పెన్నార్ అనుబంధ విభాగాలు రిలయన్స్, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, యమహా, కోనే, ఐఎఫ్బీ, హిందాల్కో, మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ తదితర సంస్థల నుంచి వీటిని పొందినట్టు కంపెనీ కార్పొరేట్ స్ట్రాటజీ, ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎం.సునీల్ తెలిపారు. జూలై, ఆగస్ట్లో ఈ ఆర్డర్లను చేజిక్కించుకున్నామని, వచ్చే రెండు త్రైమాసికాల్లో వీటిని పూర్తి చేస్తామని చెప్పారు. చదవండి: టీవీఎస్ అపాచీ కొత్త మోడల్.. ఆహా అనేలా ఫీచర్లు, లుక్ కూడా అదిరిందయ్యా! -
బొమ్మల పరిశ్రమ సామర్థ్యం పెరగాలి
న్యూఢిల్లీ: దేశీయ బొమ్మల పరిశ్రమ (టాయ్) విశాలంగా ఆలోచించాలని, సామర్థ్యం నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేంద్ర వాణిజ్య శాఖ సూచించింది. తద్వారా తయారీని పెంచి, ఎగుమతుల వృద్ధికి కృషి చేయాలని కోరింది. దిగుమతులపై సుంకాలు పెంపు, నాణ్యత ప్రమాణాలను ప్రవేశపెట్టడం దిగుమతులు తగ్గేందుకు సాయపడతాయని, తయారీని ప్రోత్సహిస్తాయని పారిశ్రామిక ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ) కార్యదర్శి అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. పెద్దగా ఆలోచించడమే ఇప్పుడు పరిశ్రమ వంతుగా గుర్తు చేశారు. యూనికార్న్(బిలియన్ డాలర్ల విలువ)గాఅవతరించాలంటే మరో స్థాయికి చేరుకోవాలన్నారు. యాజమాన్యంలో వృత్తి నైపుణ్యాలు తీసుకురావాలని సూచించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో టాయ్ ప్రదర్శనను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వల్ల మూడేళ్ల విరామం తర్వాత ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో 96 స్టాళ్లు కొలువుదీరాయి. కేంద్ర ప్రభుత్వం స్థానికంగానే బొమ్మల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో 2020 ఫిబ్రవరిలో బొమ్మలపై 20 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 60 శాతానికి పెంచింది. భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా దిగుమతి అయ్యే బొమ్మల నాణ్యత ఉండాలని నిర్ధేశించింది. భారత్కు ఎగుమతి చేయాలనుకునే ఏ దేశ కంపెనీ ఉత్పత్తులకు అయినా ఇవే నిబంధనలు అమలవుతాయని నాటి ఆదేశాల్లో కేంద్ర సర్కారు పేర్కొంది. గణనీయంగా తగ్గిన దిగుమతులు దేశంలోకి బొమ్మల దిగుమతులు 2018-19లో 304 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2021-22 నాటికి 36 మిలియన్ డాలర్లకు తగ్గినట్టు అగర్వాల్ తెలిపారు. అదే సమయంలో మన దేశం నుంచి బొమ్మల ఎగుమతులు 109 మిలియన్ డాలర్ల నుంచి 177 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు చెప్పారు. ప్రభుత్వం చర్యలు పరిశ్రమకు సాయపడుతున్నట్టు ప్లేగ్రో టాయ్స్ ఇండియా ప్రమోటర్ మను గుప్తా తెలిపారు. తయారీని ప్రోత్సహించడంతోపాటు, దిగుమతులు తగ్గేందుకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం నుంచి మరింత మద్దతు కావాలి. అప్పుడే పరిశ్రమ తదుపరి స్థాయికి వెళుతుంది. ఉపాధి కల్పనతోపాటు, ఎగుమతులు పెరుగుతాయి’’అని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 120 బిలియన్ డాలర్లు ఉంటే, అందులో భారత్ వాటా చాలా తక్కువేనన్నారు. నేషనల్ టాయ్ పాలసీ, పీఎల్ఐ పథకాల వంటికి ఈ రంగం వృద్ధికి సాయపడతాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన మేక్-ఇన్-ఇండియా కార్యక్రమంతొ దేశంలోని బొమ్మల రంగానికి సానుకూల ఫలితాలు వచ్చాయని, గత మూడేళ్లలో దిగుమతులు 70 శాతం తగ్గగా, ఎగుమతులు 61 శాతం పెరిగాయని మంగళవారం నాటి ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 13వ టాయ్ బిజ్ బి2బి (బిజినెస్ టు బిజినెస్) ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిల్ అగర్వాల్ "రీబ్రాండింగ్ ది ఇండియన్ టాయ్ స్టోరీ" పేరుతో ప్రధాని ఇచ్చిన క్లారియన్ కాల్ను గుర్తు చేశారు. -
రాజకీయాల్లోకి రావడంలేదు.. వారికే ప్రజలు ఓట్లు వేస్తారు: సుమన్
విజయవాడరూరల్: ఆంధ్రప్రదేశ్లో చిత్రపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తోందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. ఆల్ ఇండియా సుమన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ధూళిపాళ్ళ దేవేంద్రరావు ఇంటి వద్ద జరిగిన ఒక కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సినీ ప్రముఖులు కలిసిన సందర్భంలో చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తామని చెప్పారన్నారు. పి.నైనవరంలో మాట్లాడుతున్న సినీ నటుడు సుమన్ బుల్లితెరపై వస్తున్న సీరియల్స్, వెబ్ సిరీస్లలో సెక్స్ వయొలెన్స్ ఎక్కువగా ఉంటోందని, చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లలో వాటిని చూసి ఆ ప్రభావానికి లోనవుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. బుల్లితెర సినిమాలకు, పెద్ద సినిమాలకు సెన్సార్బోర్డు నిబంధనలు ఒకేలా ఉంటే బాగుంటుందన్నారు. షార్ట్ ఫిలింస్ సత్తా చాటుతున్నాయని, నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నారన్నారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా తాను ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడంలేదని తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను చూసేవారికే ప్రజలు ఓట్లు వేస్తారన్నారు. మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకులను ప్రజలు ఆదరించలేరన్నారు. చదవండి: (anyas tutorial trailer: అలా భయపెట్టడం ఇష్టం) -
రాష్ట్రంలో సౌర ఫలకల ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ పరికరాల తయారీ రంగంలో రాష్ట్రం కీలక ముందడు గువేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో 1.25 గిగావాట్ల సోలార్ సెల్స్, 1.25 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ (సౌర ఫలకలు) తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూప్, ఆజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ సంయుక్తంగా రూ. 700 కోట్ల పెట్టుబడి పెట్టాయి. మెగా ప్రాజెక్టుల విభాగం కింద ఈ పరిశ్రమ కోసం మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్ సిటీ (ఈ–సిటీ)కి 20 ఎకరాలను అదనంగా కేటాయించినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వచ్చే నాలుగేళ్లలో రూ. 4 వేల కోట్ల అంచనా విలువతో 2.4 గిగావాట్ల సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూల్స్ను ఆజూర్ పవర్కు సరఫరా చేసేందుకు ప్రీమియర్ ఎనర్జీస్ సోమవారం కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఆజూర్ పవర్ పరిశ్రమ విస్తరణ ద్వారా 1,000 మందికి ప్రత్యక్షంగా, అనుబంధ పరిశ్రమల స్థాపనతో 2,000 మందికి పరో క్షంగా ఉపాధి లభించనుంది. ప్రీమియర్ ఎనర్జీస్ విస్తరణ ద్వారా ఎలక్ట్రానిక్స్ సిటీలో అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులు కలిగిన సం స్థగా నిలవనుంది. దేశంలో సౌర విద్యుదుత్పత్తిని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేస్తామని ఆ సంస్థ పేర్కొంది. ప్రీమియర్, ఆజూర్ నుం చి పెట్టుబడులు పునరావృతం కావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమన్నా రు. దీర్ఘకాలిక సరఫరా అవకాశాలు ఉండటంతో తమ పెట్టుబడులు సురక్షితమని నిర్ధారణకు వచ్చా మని ఆజూర్ పవర్ చైర్మన్ అలాన్ రోజ్లింగ్ తెలిపారు. తనదైన ప్రత్యేక సాంకేతికతతో అధునాతన సోలార్ సెల్స్, మాడ్యూల్స్ను ప్రీమియర్ ఎనర్జీస్ ఉత్పత్తి చేస్తోందని, ఆ సంస్థతో భాగస్వామ్యం కుదరడం సంతోషకరమన్నారు. సోలార్ రంగం లో 27 ఏళ్ల అనుభవాన్ని తమ సంస్థ కలిగి ఉందని ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్పాల్ సింగ్ పేర్కొన్నారు. సోలార్ సెల్స్ కలయికతో ఏర్పడే ఫొటో వోల్టాయిక్ ప్యానెల్ను సోలార్ మాడ్యూల్ అంటారు. సూర్యకిరణాలను సంగ్రహించడం ద్వారా సోలార్ సెల్స్ విద్యుదుత్పత్తి చేయడం తెలిసిందే. రూ. 250 కోట్లతో మెటా4 ప్లాంట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభిన్న వ్యాపారాల్లో ఉన్న యూఏఈకి చెందిన మెటా4 సంస్థ తెలంగాణలో రూ.250 కోట్లతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. వోల్ట్లీ ఎనర్జీ కంపెనీ ద్వారా మెటా4 ఈ పెట్టుబడి పెడుతోంది. జహీరాబాద్ వద్ద 15 ఎకరాల్లో తయారీ కేంద్రం స్థా పించనున్నారు. ఈ మేరకు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒ ప్పందం కుదిరింది. 2023 మార్చి నాటికి తొలిదశ అందుబాటులోకి రానుంది. వార్షిక తయారీ సామర్థ్యం 40,000 యూనిట్లుకాగా.. మూడేళ్లలో లక్ష యూనిట్లకు పెంచనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ప్రత్యక్షంగా 500, పరోక్షంగా 2,000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించాయి. -
కింజరాపు వారి మైనింగ్ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్ బాగోతం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు వారి ‘వ్యాపార రహస్యం’ బట్టబయలైంది. ఏళ్లుగా సాగుతున్న గ్రానైట్ బాగోతం వెలుగుచూసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు గ్రానైట్ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. కలర్ గ్రానైట్ను అక్రమ తరలించడమే కాకుండా అడ్డగోలుగా విక్రయాలు జరిపారు. ఈ మొత్తం వ్యవహారం గనుల శాఖ , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసింది. దీనిపై పక్కా ఆధారాలతో అధికారులు కోట»ొమ్మాళి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చదవండి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు కోటబొమ్మాళి మండలం పెద్ద బమ్మిడి గ్రామంలో సర్వే నంబర్ 106/1,104/9లో టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్కుమార్ పేరున శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది. 2018 ఏప్రిల్ 23 నుంచి 2038 ఏప్రిల్ 22వ తేదీ వరకు దాదాపు 20 ఏళ్ల పాటు మినరల్ డీలర్ లైసెన్స్ తీసుకున్నారు. దీంట్లో నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావు భాగస్వాములుగా ఉన్నారు. జిల్లాలో అనేక కలర్ గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ బ్లాక్లను అధికారికంగా అనుమతి తీసుకుని తమ ఇండస్ట్రీకి రవాణా చేసుకోవాల్సి ఉంది. కానీ, అచ్చెన్న కుటుంబీకులకు చెందిన ఈ ఇండస్ట్రీలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. మే 8న వచ్చిన సమాచారం మేరకు కంచిలి మండలం భైరీపురం గ్రామంలోని రానా గ్రానైట్ అండ్ మినరల్ క్వారీ నుంచి గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్న వాహనాన్ని(ఏపీ30టీఎ 1089) గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేసి గడువు దాటిన పరి్మట్తో అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించారు. మే 8వ తేదీ మ«ధ్యాహ్నం 3.11గంటల వరకే ఉన్న పర్మిట్ను ఆధారంగా చేసుకుని ఆ తర్వాత గ్రానైట్ బ్లాక్ల తరలింపు చేసినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది స్టేట్మెంట్ తీసుకుని వాహనం సీజ్ చేశారు. ఈ సందర్భంలో తమ యాజమాన్యం చెప్పినట్టుగా వాహనం బ్రేక్ డౌన్ అయిన కారణంగా ఆలస్యమైందని, దానివల్ల గడువు సమయం దాటి రవాణా చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో గనుల శాఖ, విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ జరిపారు. పలాస దగ్గర ఉన్న టోల్ ప్లాజాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా పట్టుకున్న ఏపీ 30టీఎ 1089వాహనం నిర్దేశిత ట్రాన్సిట్ గడువు సమయంలో మూడు సార్లు లోడింగ్, అన్లోడింగ్తో అటు ఇటు వెళ్లినట్టు రికార్డైంది. దీంతో ఒక ట్రాన్సిట్ ఫారంతో రెండు మూడు సార్లు గ్రానైట్ బ్లాక్ల అక్ర మ తరలింపు జరిగినట్టు అభిప్రాయానికొచ్చారు. దీని వెనుక గుట్టు తేల్చేందుకు ఈ గ్రానైట్ బ్లాక్లు రవాణా జరిగిన అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీని, అటు కంచిలిలో ఉన్న గ్రానైట్ క్వారీని పరిశీలించి, విచారణ జరిపారు. దీంతో దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీ బాగోతం బయటపడింది. అ«ధికారుల విచారణను దృష్టిలో ఉంచుకుని అప్పటికప్పుడు గ్రానైట్ బ్లాక్ల నంబర్లు దిద్దుబాటు చేయడం, నంబర్ల టాంపరింగ్కు పాల్పడటం వంటివి చేశారు. అంతేకాకుండా ఒకే నంబర్తో ఉన్న వివిధ గ్రానైట్ బ్లాక్లను గుర్తించారు. అలాగే, ఆన్లైన్లో ఉన్నదానికి, భౌతికంగా ఉన్న బ్లాక్ల నిల్వల తేడాను సైతం పట్టుకున్నారు. 172.87 క్యూబిక్ మీటర్ల బరువైన 23 బ్లాక్లకు సంబంధించి తేడాలు ఉన్నాయి. ఇవన్నీ గ్రానైట్ క్వారీల నుంచి అక్రమంగా తరలించినట్టుగా తేల్చారు. దీని విలువ అపరాధ రుసుంతో కలిపి రూ.6కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం. దానిని అచ్చెన్న ఫ్యామిలీ వ్యూహాత్మకంగా గండి కొట్టి దోచుకుంది. కేసు నమోదు అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్ ఇండస్ట్రీలో ప్రభుత్వ ప్రాపర్టీ దొంగతనం, టాంపరింగ్, డూప్లికేషన్, ఉన్న స్థితిని మార్చడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఇండస్ట్రీ మేనేజింగ్ డైరెక్టర్ అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్కుమార్, భాగస్వాములైన నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావుపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో శ్రీకాకుళం గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీంతో 379, 420, 477–ఎ, 406, 120బి, 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. -
మైలార్దేవ్పల్లిలోని ప్లాస్టిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
-
దేశంలో వంట నూనెల కొరత ఉండదు!
న్యూఢిల్లీ: దేశంలో వంట నూనెల కొరత ఉండబోదని ప్రభుత్వానికి పరిశ్రమ భరోసా ఇస్తోంది. దీనిపై ఆందోళన అక్కర్లేదని సూచిస్తోంది. వంట నూనెల సరఫరాల్లో ఎటువంటి సమస్యలూ లేకుండా తమ వంతు సహకారాన్ని అందిస్తామని ప్రభుత్వానికి పరిశ్రమ హామీ ఇచ్చింది. రెండు నెలల్లో ఈ మేరకు తగిన చర్యలు తీసుకుంటామని వంట నూనెల పరిశ్రమ ప్రతినిధులు కేంద్ర ఆహార వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్ గోయల్కు హామీ ఇచ్చినట్లు శుక్రవారం ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశంలో వంట నూనెల సరఫరాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన సంగతి తెలిసిందే. దీనితో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పొద్దు తిరుగుడు పువ్వు నూనె భారీగా ఉక్రెయిన్ నుంచి దిగుమతులు జరుగుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై కేంద్ర మంత్రి గోయల్ ఒక కీలక సమావేశం నిర్వహించి సన్ఫ్లవర్ ఆయిల్సహా వంటనూనెల సరఫరాలపై సమీక్ష జరిపారు. సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ) సెక్రటరీ జనరల్ ఎస్పీ కమ్రా, అదానీ విల్మర్, రుచీ సొయా, మోడీ న్యాచురల్స్సహా ప్రముఖ రిఫైనర్లు, దిగుమతిదారుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సన్ఫ్లవర్.. తగినంత లభ్యత! సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, సన్ఫ్లవర్ ఆయిల్ కొరత లేదని సమావేశంలో పారిశ్రామిక ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. మార్చిలో డెలివరీ కోసం మొదటి షిప్మెంట్ 1.5 లక్షల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ యుద్ధానికి ముందే ఉక్రెయిన్ నుండి బయలుదేరింది. త్వరలో ఈ షిప్మెంట్ (దిగుమతుల) భారత్కు చేరుకుంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో ఒక నెలలో 18 లక్షల టన్నుల వంట నూనెల వినియోగం జరగుతుంది. సన్ఫ్లవర్ ఆయిల్ వాటా దాదాపు 1.5–2 లక్షల టన్నులు. హార్డ్కోర్ వినియోగదారుల (కేవలం సన్ఫ్లవర్ వంట నూనె వినియోగించే వారు) డిమాండ్ను తీర్చడానికి లక్ష టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే అవసరం. దేశంలో పొద్దుతిరుగుడు నూనెకు ఆవాలు, సోయాబీన్ నూనెల రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రిత్వ శాఖకు పరిశ్రమ తెలిపిందని ఆ వర్గాలు తెలిపాయి. దాదాపు 11 లక్షల టన్నుల కొత్త ఆవాల పంట రావడంతో వచ్చే 2–3 నెలల్లో దేశంలో సరఫరాలు తగిన స్థాయిలోనే ఉంటాయని భరోసాను ఇచ్చింది. భారతదేశం తన వంట నూనెల డిమాండ్లో 60 కంటే ఎక్కువ వాటా దిగుమతులదే కావడం గమనార్హం. తయారీని పెంచే మార్గాలు అన్వేషించండి: గోయల్ కాగా, స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచే దిశగా తగిన మార్గాలు అన్వేషించాలని పరిశ్రమ వర్గాలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ పిలుపునిచ్చారు. అలాగే, టెక్నాలజీలో భారత్ను అగ్రగామిగా తీర్చిదిద్దే క్రమంలో 10 పరిశోధన, అభివృద్ధి ల్యాబ్లను లేదా నవకల్పనల కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ప్రస్తుతం జీడీపీలో తయారీ రంగ వాటా 15 శాతం స్థాయిలో ఉంది. డీపీఐఐటీ వెబినార్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. జీడీపీలో ఎగుమతుల వాటాను 25 శాతానికి పెంచడంపై కూడా పరిశ్రమ దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. సర్వీసుల ఎగుమతుల్లో టాప్ మూడు దేశాల్లో ఒకటిగా భారత్ ఎదగడం, విదేశీ వాణిజ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలకు తోడ్పాటు అందించడం వంటి అంశాలపై కసరత్తు జరగాలని పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు దేశీ కంపెనీలు మద్దతునివ్వాలని గోయల్ చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంపై పలు దేశాల్లో ఆసక్తి నెలకొందని ఆయన తెలిపారు. -
సర్కారు వారి మాట
సాక్షి, సిటీబ్యూరో: ఏళ్లుగా కంపెనీలు నెలకొల్పని పరిశ్రమల నుంచి ప్రభుత్వ భూముల స్వాదీనానికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలకల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) రంగం సిద్ధం చేస్తోంది. గ్రేటర్కు ఆనుకొని హెచ్ఎండీఏ పరిధిలో సుమారు రెండువేల ఎకరాల వరకు ఖాళీ స్థలాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ స్థలాలను తిరిగి కంపెనీలు నెలకొల్పేవారికి కేటాయించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఎకరం మొదలు వంద ఎకరాలకు పైగా భూములున్న కంపెనీలుండడం గమనార్హం. ఈ ప్రాంతాల్లోనే అత్యధికం... రెండేళ్ల క్రితం టీఎస్ఐఐసీ నుంచి స్థలాలను దక్కించుకున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కంపెనీల యజమానులు ఇప్పటికీ కంపెనీలను నెలకొల్పలేదు. ఇలా నిరుపయోగంగా ఉన్నవిలువైన ప్రభుత్వ స్థలాలు.. ప్రధానంగా ర్యావిర్యాల ఫ్యాబ్సిటీ, మామిడిపల్లిలోని హార్డ్వేర్పార్క్, నానక్రామ్గూడలోని ఐటీపార్క్, నాచారం పారిశ్రామిక వాడ, పాశమైలారం, పటాన్చెరు ప్రాంతాలున్నాయి. గతంలో కేటాయింపులిలా.. ♦ నాలుగేళ్లుగా టీఎస్ఐఐసీ సుమారు 4,169 ఎకరాల భూములను 2,290 కంపెనీలకు కేటాయించింది. ఇందులో 95 సంస్థలు ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారివి. ఈ కంపెనీలు పూర్తిస్థాయిలో ఏర్పాటైతే రాష్ట్రానికి సుమారు రూ.56,597 కోట్ల పెట్టుబడుల వెల్లువతోపాటు..1.50 లక్షల మందికి ఉపాధి దక్కనుందని టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా కంపెనీలు ఏర్పాటు చేయని సంస్థల నుంచి భూములు స్వా«దీనం చేసుకొని తిరిగి ఇతర సంస్థలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేయడంతో ఈ మేరకు టీఎస్ఐఐసీ కార్యాచరణ సిద్ధంచేస్తోంది. ♦ ఇప్పటికే కొన్ని కంపెనీల నుంచి భూములు స్వా«దీనం చేసుకోగా..సదరు యజమానులు కోర్టులను ఆశ్రయించడం గమనార్హం. గత ఏడేళ్లుగా టీఎస్ఐఐసీ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల ఎకరాలతో భూబ్యాంకును ఏర్పాటు చేయనుంది. ♦ గత ఏడేళ్లుగా 18 ప్రాంతాల్లో 19,961 ఎకరాల్లో పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దడంతోపాటు మౌలిక వసతులు కల్పించింది . మరో 15,620 ఎకరాలను పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో రావిర్యాల, మహేశ్వరంలోని హార్డ్వేర్ క్లస్టర్, సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్క్లున్నాయి. రాబోయే రెండేళ్లలో 80 ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. -
‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’తో కొత్త వెలుగు!
పై నుంచి కిందికి జారే ప్రవాహధారను– నీటిబుగ్గ వద్దనే అది నలువైపులకు విస్తరించేట్టుగా దారులు సరిచేసినప్పుడు, బీడు భూములు సైతం జలాలతో తడుస్తాయి. ‘సోర్స్’గా పిలిచే ఈ నీటిబుగ్గను ఆంగ్లంలో ‘ఫౌంటెన్ హెడ్’ అంటాం. అయితే, పెట్టే చేతిని మెలివేయగలిగే శక్తి ఉన్నవారికి– ‘జల’ వద్దనే ఇవి దారులు మళ్ళించబడతాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు ఇటువంటి మౌలిక అంశాల పట్ల స్పృహ ఉన్నప్పుడే, ‘రాజ్యం’ అందించే ఫలాల పంపిణీలో సమన్యాయం అమలవుతుంది. ఈ దృష్టి ప్రభుత్వాలకు లేనప్పుడు, నీటిబుగ్గ వద్దనే జలాలు–ఫలాలు కూడా దారులు మళ్ళించబడతాయి. ఇన్నాళ్ళు జరిగింది అదే. అయితే, అనివార్యస్థితి ఒకటి వస్తుంది. అప్పుడు జరిగే పంపిణీ న్యాయాన్ని ఎవరైనా కేవలం ప్రేక్షక పాత్రగా చూడ్డం తప్ప మరేమీ ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏళ్ల క్రితం– ఇకముందు వ్యవసాయం సాగదేమో? అనే అనుమానాన్ని స్వయంగా సర్కారులోని పెద్దలే వ్యక్తం చేయడం మనం చూశాం. అప్పటికే కౌలు రైతుల వెతలు పెరిగి సాగుబడి భారమయింది. భూముల సొంతదారులు ఊళ్ళను వదిలిపెట్టి, నగరాలలోనో, విదేశాలలోనో ఉంటూండటంతో రాష్ట్ర మంతా – ‘ఆబ్సెంట్ ల్యాండ్ లార్డిజం’ ఎక్కువయింది. ఆ తర్వాత – ‘జలయజ్ఞం’ మొదలై సాగునీటి వసతి పెరుగుతున్న దశలో– డాక్టర్ వైఎస్ఆర్ తాత్కాలిక ఉపశమనంగా చిన్న సన్నకారు రైతులు– పాడి, మేకలు, గొర్రెలు, కోళ్ళు, కూరగాయల పెంపకం వంటివాటితో అదనపు ఆదాయం పెంచుకోవాలని సభల్లోనే బహి రంగంగా కోరేవారు. రాష్ట్ర విభజన తర్వాత తన తండ్రి ఆలోచన నుంచి– ఆ ‘లైన్’ స్ఫూర్తిగా తీసుకుని, గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో కొత్తగా– ‘ఫుడ్ ప్రాసె సింగ్ ఇండస్ట్రీ’ శాఖను ప్రారంభించారు. ‘కాటన్ తర్వాత భూమి...’ ఒక ఆరంభం అనుకుంటే, ‘గోదావరి మండలంలోని రెండు జిల్లాల్లోని ప్రముఖ ‘ఆగ్రో–ఇండస్ట్రీస్’ కంపెనీల కారణంగా, ఇప్పటికంటే మరింత మేలైన మానవీయ కేంద్రిత స్థిమిత స్థితిని సామాజిక పర్యావరణంగా ఒకప్పుడు ఇక్కడ చూడగలిగాము. అయితే, ‘అటోమెషన్’ ‘కంప్యూటర్ల’ ప్రవేశం తర్వాత, ఉద్యోగులు/కార్మికుల సంఖ్య నియంత్రణతో... ఉపాధి వెతుకులాట కోసం మొదలైన పట్టణాల వలసల ప్రభావం తొలుత పంటలపైన, ఆ తర్వాత ఈ పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా పైనా కనిపించింది. సంస్కరణలు తర్వాత, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల దిగుమతుల్లో కేంద్రం తీసుకున్న వైఖరితో, మన ఆగ్రో పరిశ్రమల్లో సంక్షోభం చూశాం. సహకార చక్కెర మిల్లుల మూత ఈ పరిస్థితుల పర్యవసానమే! నిజానికి – ‘వ్యవసాయం దండగ...’ అనే ముగింపునకు వచ్చినప్పుడే, తదుపరి దశ గురించి పాలకుల్లో యోచన మొదలు కావాలి. అటువంటిది లేదు కనుకనే, గత ప్రభుత్వంలో 2014 జూన్లో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో– ‘కాటన్ ఆనకట్ట కట్టిన తర్వాత, రైస్ మిల్లులు పెట్టడం తప్ప మీరు ఏం చేశారు?’ అని అప్పటి ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కానీ 1952 నాటికే తణుకులో ‘ఆంధ్ర షుగర్స్’, ఆ తర్వాత ఏలూరులో ‘అన్నపూర్ణ పల్వరైసెస్’ వంటివి మొదలయ్యాయి. రవాణాకు గ్రాండ్ ట్రంక్ రోడ్, కోరమండల్ రైల్వే లైన్, విశాఖపట్టణం, కాకినాడ పోర్టుల అందుబాటును ఈ ప్రాంత– ‘ఆంట్రప్రెన్యూర్లు’ గరిష్ట స్థాయిలో వినియోగించుకున్న కాలం ఒకటి వుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన పారిశ్రామిక వేత్తలు ఏలూరులో జనుము ఉత్పత్తులు, తాడేపల్లి గూడెంలో వంట నూనెలు ఉత్పత్తి చేశారు. ఈ నేపథ్యమే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టడానికి కారణం అయింది. (చదవండి: మేనేజ్మెంట్ రాజకీయాలు ఇంకెన్నాళ్లు?) ఈ ప్రాంత తదుపరి దశ గనుక– ‘డిజిటలైజేషన్’ అయితే, భూమిని నమ్ముకుని దిగువన మిగిలిపోతున్న వర్గాల సాగుబడికి, వారి పిల్లల ఉపాధికి దారేది? అనే ప్రశ్నకు మాత్రం జవాబు లేకుండానే, విభజిత ఏపి తొలి ఐదేళ్ళు ముగిసింది. ఇలా ఎటువంటి దిక్సూచి లేని స్థితిలో, తన ప్రభుత్వానికి కొత్త దారులు తానే వేసుకునే తప్పనిసరి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇందుకు మేలైన మానవ వనరులు అవసరం కనుక, విద్య, వైద్యం, వ్యవసాయం మీద దృష్టి తప్పలేదు. విమర్శలు ఉన్నప్పటికీ, కొత్త ఉపాధి వనరులు సృష్టించే వరకు, వివిధ వర్గాలకు తొలుత నగదు చెల్లింపు వంటి– ‘ఊతం పథకాలు’ తప్పలేదు. అయితే– ‘కరోనా’ దాన్ని అనివార్యం చేసి కొనసాగించేట్టుగా చేసింది. (చదవండి: కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!) అదే సమయంలో మరో అర్ధ శతాబ్ది అవసరాలకు సరిపడిన– ‘ఎకో సిస్టం’ లక్ష్యంగా, ఈ ప్రభుత్వ ప్రణాళికలు వాగ్దానపూరితంగా కనిపిస్తున్నాయి. ఇందుకు గత ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన– ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ’ని చూడవలసి వుంటుంది. (చదవండి: మా కోరిక వికేంద్రీకరణే!) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యా -
ఆయిల్ పామ్.. పెట్టుబడుల బూమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ రంగం విస్తరించబోతోంది. ఇందుకోసం రాష్ట్ర సర్కారు మంచి ప్రణాళికలు వేస్తోంది. దేశంలోనే తొలిసారి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే కార్యాచరణతో ముందుకు సాగుతోంది. వచ్చే నాలుగైదేళ్లలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచి ఈ రంగంలో రూ. 3,750 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు చర్యలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 55 వేల మందికి ఉపాధి లభించనుందని ఆయిల్ ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాక్టరీలు, నూనె తీత తదితరాలతో ఏడాదికి రూ. 400 కోట్ల జీఎస్టీ ప్రభుత్వానికి సమకూరనుందని అంచనా. తొలుత 26 జిల్లాల్లో 9.5 లక్షల ఎకరాల్లో.. దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తులు పేరుకుపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కొన్నాళ్లుగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇందులో భాగంగా మంచి లాభాలు పొందే అవకాశమున్న పామాయిల్ వైపు రైతులను మళ్లిస్తోంది. మున్ముందు రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టాలని ప్రణాళిక వేసింది. తొలుత 26 జిల్లాల్లో సుమారు 9.49 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 11 ఆయిల్ పామ్ కంపెనీలకు జోన్లను కేటాయించింది. 2022–23 సంవత్సరంలో 5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టాలని కంపెనీలను ఆదేశించింది. ఆయిల్ ఫెడ్కు 1.80 లక్షల ఎకరాలు, ప్రీ యూనిక్ కంపెనీకి లక్ష ఎకరాలు, రుచి సోయాకు 40 వేల ఎకరాలు, ఇతర కంపెనీలకు మిగిలిన భూముల జోన్లను కేటాయించింది. ఆ ప్రకారం కంపెనీలు వచ్చే మూడు, నాలుగేళ్లలో పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ నూనె వినియోగం 4 లక్షల టన్నులు కాగా 45 వేల టన్నులే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. 5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు పెంచి ఫ్యాక్టరీలను స్థాపిస్తే రూ. 7,400 కోట్ల విలువైన 7.4 లక్షల టన్నుల పామాయిల్ ఉత్పత్తి కానుంది. దిగుమతికి బదులు ఎగమతి చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుంటుంది. 25 క్రషింగ్ యూనిట్లు.. 3,750 కోట్ల పెట్టుబడులు సర్కారు ప్రణాళికలో భాగంగా కంపెనీలు మొదట 25 క్రషింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఒక్కో ఫ్యాక్టరీకి రూ. 150 కోట్ల చొప్పున రూ. 3,750 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఆ ఫ్యాక్టరీల్లో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక పామాయిల్ పంట భూముల్లో ఏకంగా 50 వేల మందికి ఉపాధి లభించనుందని. మరో 2,500 మందికి పామాయిల్ రవాణా రంగంలో ఉపాధి దొరుకుతుందని ఆయిల్ ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రైతులకు పామాయిల్ సాగుతో లక్షలాది రూపాయల ఆదాయం సమకూరనుంది. రాష్ట్రంలో ఓ రైతు 33 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నాడని, అతనికి ఏడాదికి రూ. 45 లక్షల ఆదాయం వస్తోందని ఆయిల్ ఫెడ్ చెప్పింది. రూ. 750 కోట్లతో రిఫైనరీలు పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీల్లో క్రూడాయిల్ బయటకు తీస్తారు. దాన్ని రిఫైన్ చేసి పామాయిల్ వంట నూనె తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి క్రషింగ్ ఫ్యాక్టరీ వద్ద ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీని నెలకొల్పాలి. ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీ కోసం రూ. 30 కోట్ల చొప్పున రూ. 750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది. అటు పెట్టుబడులు.. ఇటు ఉద్యోగాలు పామాయిల్ రంగంలో క్రషింగ్ ఫ్యాక్టరీల వల్ల వచ్చే మూడేళ్లలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇందులో ఆయిల్ఫెడ్ ద్వారానే రూ. 750 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నాం. దీంతో ఆయిల్ఫెడ్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా భర్తీ కానున్నాయి. – సురేందర్, ఎండీ, ఆయిల్ఫెడ్ -
అమ్మకానికి మరో ఆరు సంస్థలు... కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఆరు సంస్థల (సీపీఎస్ఈ) ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకోసం డిసెంబర్–జనవరిలోగా ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం ఈ విషయాలు తెలిపారు. ‘దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఏడాది 5–6 సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ చూడబోతున్నాం. బీపీసీఎల్ మదింపు ప్రక్రియ జరుగుతోంది. దీనితో పాటు బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, పవన్ హన్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, ఎన్ఐఎన్ఎల్ ఆర్థిక బిడ్లను డిసెంబర్–జనవరిలోనే ఆ హ్వానించవచ్చు’ అని ఆయన వివరించారు. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) ఉండవచ్చని చెప్పారు. సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు. అటు విమానయాన సంస్థ ఎయిరిండియాను డిసెంబర్లోగా కొనుగోలుదారుకు అప్పగించడం పూర్తవుతుం దని పేర్కొన్నారు. వేలంలో సుమారు రూ. 18,000 కోట్లకు ఎయిరిండియాను టాటా గ్రూప్ సంస్థ టాలేస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిం డియా విక్రయం పూర్తవడంతో సీపీఎస్ఈల ప్రైవేటీకరణ మరింత వేగవంతం కాగలదని పాండే చెప్పారు. ఇందుకోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా సహకారం అవసరమని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రూ.9,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ లిస్టింగ్పై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. రిస్కులు తీసుకోండి సామర్థ్యాలు పెంచుకునేందుకు ఇన్వెస్ట్ చేయండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించండి పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు న్యూఢిల్లీ: కరోనాపరమైన సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో రిస్కులు తీసుకోవాలని, సామర్థ్యాల పెంపుపై మరింతగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘సామర్థ్యాలను పెంచుకోవడంలోనూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలోను, టెక్నాలజీని ఇచ్చే భాగస్వాములతో చేతులు కలపడంలోనూ భారతీయ పరిశ్రమ మరింత జాప్యం చేయొద్దని కోరుతున్నాను’ అని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ తెలిపారు. దేశీయంగా తయారీ కోసం విడిభాగాలు, పరికరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సమస్యేమీ లేదని.. కాని పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులను మాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల రిస్కులు ఉన్నందున.. దీనిపై పునరాలోచించాలని అభిప్రాయపడ్డారు. ‘మన దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు, కొన్ని కమోడిటీలకు కొరత ఎందుకు ఏర్పడుతోంది, దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం సరైనదేనా? దిగుమతులకు మనం తలుపులు మూసేయడం లేదు. కానీ మొత్తం ఉత్పత్తిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా. ఇలాంటి అంశాలను మనం పునరాలోచించుకోవాలి’ అని మంత్రి చెప్పారు. ఆదాయ అసమానతలు తగ్గించాలి .. ఆదాయ అసమానతలను తగ్గించేలా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఫినిష్డ్ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని పరిశ్రమకు నిర్మలా సీతారా>మన్ సూచించారు. వృద్ధికి ఊతమివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో.. దేశీ పరిశ్రమ మరింతగా రిస్కులు తీసుకోవాలని, దేశానికి ఏం కావాలన్నది అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కొన్ని కాలం చెల్లిన చట్టాలను తీసివేయడంతో ఆగటం కాకుండా .. పరిశ్రమకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాలంటూ ప్రతి శాఖ, విభాగానికి ప్రధాని సూచించారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ భేష్.. బ్యాంకింగ్ రంగం విశేష స్థాయిలో కోలుకుందని, రికవరీలు పెరిగే కొద్దీ మొండి బాకీలు క్రమంగా తగ్గడం మొదలైందని సీతారామన్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్ నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాయని, ప్రభుత్వంపై ఆధారపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక ప్రోగ్రాం కింద దీపావళితో ముగిసిన మూడు వారాల్లో నాలుగైదు వర్గాల వారికి బ్యాంకులు ఏకంగా రూ. 75,000 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. వర్ధమాన దేశం అత్యం వేగంగా కోలుకోవడంతో పాటు రెండంకెల స్థాయికి దగ్గర్లో వృద్ధి రేటును అందుకోవడం సాధ్యమేనంటూ ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్పీవోల) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయన్నారు. వీటి నిర్మాణానికివ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం బిహార్ చంపారన్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చిన్న, మధ్యతరగతి రైతులు తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సాధించడం వెనుక దేశ వ్యవసాయ రంగం గొప్పదనం దాగుందని, అందుకే వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారికి మద్దతుగా నిలవాలన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేయాలన్నారు. -
ఛత్రీనాక పేలుడు ఘటన: ట్విస్ట్ ఏంటంటే..
హైదరాబాద్: ఛత్రీనాక పీఎస్ పరిధి కందికల్ గేట్ వద్ద గురువారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇద్దరు మృతి చెందగా, మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు బెంగాల్కు చెందిన విష్ణు,జగన్నాథ్లుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ పేలుడుకు గల కారణాలను పరిశీలిస్తున్నారు. మృతులు పీవోపీ విగ్రహ తయారీ కార్మికులని పోలీసులు తెలిపారు. అయితే, ఈ పేలుడులో కొత్తకోణం బయటపడింది. యువకులు గుంతలో టపాసులతోపాటు కెమికల్స్ను పెట్టి కాల్చడం వల్ల పేలుడు సంభవించిందని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. విగ్రహ తయారీ పరిశ్రమలో బాణాసంచా కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. పేలుడు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని ఏసీపీ మజీద్ తెలిపారు. -
ఊరంతా ఉపాధి.. ఇత్తడి ఖజానా అజ్జరం
టంగ్.. టంగ్.. టక్కుంటక్కుం.. అంటూ లయబద్ధంగా వినిపించే శబ్దాలు.. ఏ ఇంటి ముంగిట చూసిన ఇత్తడి సామగ్రి, కళాకృతుల మెరుపులు.. అజ్జరం ప్రత్యేకం.. సాధారణంగా ఏ ఊరిలోనైనా వర్ణాలను అనుసరించి వృత్తులు చేయడం పరిపాటి. అయితే ఈ గ్రామంలో మాత్రం అన్ని వర్ణాల వారూ కలిసి ఇత్తడి సామాన్ల తయారీని వందల ఏళ్లుగా చేస్తూ ఉపాధి పొందుతున్నారు. దీంతో అజ్జరం ఇత్తడి పరిశ్రమకు పెట్టింది పేరుగా మారింది. గంటల తయారీలో ప్రత్యేకతతో ప్రతి ఆలయంలోనూ ‘అజ్జరం గంట’ మోగాల్సిందే అన్నట్టుగా నిలిచిపోయింది. పెరవలి: దాదాపు 200 ఏళ్ల నుంచి అజ్జరంలో ఇత్తడి సామగ్రి పరిశ్రమ ఉంది. నాడు చేతి పనిముట్లతో వస్తువులు తయారు చేయగా ప్రస్తుతం యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గంటలు దేశంలోని ప్రముఖ ఆలయాల్లో మార్మోగుతున్నాయి. గ్రామ జనాభా 2,957 మంది కాగా 2,500 మంది ఇత్తడి సామాన్ల తయారీపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి ఇత్తడి పని తప్ప మరే పని తెలియదంటే అతిశయోక్తి కాదు. తరతరాలుగా సామగ్రి, కళాకృతుల తయారీలో వీరు నైపుణ్యం కనబరుస్తుండటంతో గ్రామంలో ఇత్తడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. అజ్జరంలోని ఇత్తడి పరిశ్రమలో బిందెలను తయారుచేస్తున్న కార్మికులు గంటలు ప్రత్యేకం ఇత్తడితో పలురకాల సామగ్రిని తయారుచేస్తున్నా ఆలయాల్లో గంటల తయారీతో వీరి ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. 50 గ్రాముల నుంచి 500 కిలోల వరకూ గంటలను వీరు తయారు చేసి రికార్డు సృష్టించారు. ఇత్తడి గంటల తయారీలో ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ఇత్తడి అంటే అజ్జరం.. అజ్జరం అంటే ఇత్తడి.. అన్నట్టుగా పేరు సంపాదించారు. పట్టణాల్లో దుకాణదారులు ‘అజ్జరం వారి ఇత్తడి షాపు’ అని పేరు పెట్టుకుని వ్యాపారులు సాగిస్తున్నారు. మెరుగులు దిద్దుతూ.. 200 ఏళ్ల అనుబంధం అజ్జరానికి ఇత్తడితో అనుబంధం 200 ఏళ్లుగా కొనసాగుతోంది. అప్పట్లో ముడిసరుకులను కలకత్తా, మద్రాసు నుంచి తీసుకువచ్చి ఇక్కడ వస్తువులు తయారుచేసేవారు. ప్రస్తుతం ఇక్కడే ఇత్తడి రేకులు తయారుచేసి రాష్ట్ర నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. చిన్నా,పెద్దా తేడా లేకుండా పనులు చేస్తున్నారు. వేకువజామున పని మొదలుపెట్టి రాత్రి వరకూ పనులు చేస్తూనే ఉంటారు. ఇత్తడి బిందెలు, బకెట్లు, పల్లెం, చెంబు, గంగాళా, డేగిసా, పప్పు గిన్నెలు తదితర పెళ్లి సామగ్రి కోసం రాష్ట్ర నలుమూలల నుంచి అజ్జరం వస్తుంటారు. దీంతో గ్రామ ఖ్యాతి దశదిశలా విస్తరించింది. తరతరాలుగా.. మా తాత పేరలింగం, తండ్రి సాంబమూర్తి ఇదే పనిచేసేవారు. నేనూ ఇదే పనిలో ఉన్నాను. 20 ఏళ్ల క్రితం చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ పనికి వచ్చేవారు. తర్వాత కాలంలో చిన్న పిల్లలు పనికిరాకపోవడంతో పనినేర్చుకునే వారు తగ్గారు. 50 గ్రాముల నుంచి 500 కిలోల వరకూ గంటలను ప్రత్యేకంగా తయారుచేస్తున్నాం. ఈ గంటలు దేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు అందించాం. అమెరికా కూడా పంపించాం. ఈ మధ్య కాలంలో యంత్రాలపైన తయారీ ఎక్కువయ్యింది. – బొప్పే సత్యలింగం, ఇత్తడి పరిశ్రమ యజమాని చిన్నప్పటి నుంచీ.. పుట్టినప్పటి నుంచి ఈ పనిలోనే ఉన్నాను. పని పూర్తిగా ఉండటంతో కుటుం బాన్ని ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నా. ఇటీవల మిషన్లు రావటంతో పనికి డిమాండ్ తగ్గింది. దీని వలన కొన్ని ఒడిదుడుకులు వచ్చాయి. – పాటి సత్యనారాయణ, వర్కర్ తండ్రి ద్వారా.. నా తండ్రి ద్వారా ఈ పని అబ్బింది. పనిని ఇష్టంగా చేస్తాం. మా వద్దకు వచ్చిన కస్టమర్లు మా పనిచూసి ఎంతో అందంగా ఉందని ప్రశంసించినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఈ పనిలోనే హాయి ఉంది. – నున్న వీరవెంకట సత్యనారాయణ, వర్కర్ ఇదే జీవనోపాధి మేము నాయీబ్రాహ్మణులమైనా ఇత్తడి పనినే జీవనోపాధిగా ఎంచుకున్నాం. మిషన్లు రావటంతో పని నేర్చుకునేవారు తక్కువైపోయారు. దీంతో ఈ పని మా తరంతోనే అంతరించిపోతుందేమోనని అనిపిస్తోంది. – బొజ్జొరి బాలరాజు, వర్కర్ 40 ఏళ్లుగా.. 40 ఏళ్లుగా ఈ పనిచేస్తు న్నా. గ్రామంలో అందరూ ఇదే పని చేస్తుంటాం. ఇతర వ్యాపారాలు ఏమీ తెలియవు. ఇటీవల యంత్రాల రాకతో పని నేర్చుకునేవారు తగ్గారు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియలేదు. – యడ్ల పోతురాజు, వర్కర్ -
సినిమా పరివార్!
‘ఇండస్ట్రీ’ అంతా మా కుటుంబమే అని చెబుతుంటారు సినిమా వాళ్లు. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఉద్ఘాటన చేస్తూనే ఉంటారు. అదొక సంఘీభావం. మంచిదే. ఈ సినిమా కుటుం బంలో సభ్యులెవరు? దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులు, గాయకులు, సాంకేతిక నిపుణులు వగైరా వగైరా. వీళ్లు గాక సినీ నిర్మాణం కోసం ‘లైట్లెత్తే’ బాయ్స్ సహా చాలామంది శ్రమజీవులుంటారు. వీళ్లందర్నీ 24 క్రాఫ్టుల ‘బంగారం’గా గుర్తించి కుటుంబ సభ్యత్వం కల్పించిన వ్యక్తి దాసరి నారాయణరావు. సినిమా పరివారం ఎల్లలు ఇంతవరకేనా? ఎగ్జిబిటర్లు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు మొదలైన మైలురాళ్లను దాటి విస్తరించిన కుటుంబం ఇది. తెలుగు రాష్ట్రాలకు సంబంధిం చినంతవరకైతే తెలుగు ప్రేక్షకులందరూ సినిమా కుటుంబ సభ్యులే. ఎదుగుతున్న నాటక రంగాన్ని బలిపెట్టి మరీ సినిమా రంగాన్ని పోషించింది తెలుగు సమాజం. ఈ రాష్ట్రాల్లో ఉన్న సినిమా థియేటర్ల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఉత్తర భారత దేశమంతటా కలిపి ఎన్ని థియేటర్లున్నాయో ఈ రెండు రాష్ట్రా ల్లోనే అన్ని ఉన్నాయట. సినిమా అభిమానం బాగా ఎక్కువ నుకునే తమిళనాడుతో పోల్చినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు వెయ్యి సినిమా హాళ్లు ఎక్కువుండేవి. ఇతర రాష్ట్రాల్లో నాటక రంగం ఇంకా తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎప్పుడో ఒకసారి చిన్న మూలుగు వినిపి స్తుంది, అంతే. తెలుగు ప్రజలకున్న అపార సినిమా అభిమానం అందుకు కారణం. కుటుంబ సభ్యులంటే భార్య, భర్త, పిల్లలు మాత్రమే కాదు గదా! పెంచి పోషించిన తల్లి దండ్రులు కూడా కుటుంబ సభ్యులే. అలాగే ప్రత్యేక శ్రద్ధతో తెలుగు సినిమాను పెంచి పోషించిన ప్రేక్షకులంతా సినిమా పరివారమే. మన సినిమా ఒక విస్తారమైన కుటుంబమని గుర్తిస్తే, సభ్యులైన ప్రేక్షకుల అభిప్రాయాలను కూడా ఎప్పటికప్పుడు గణించుకోవాలి. కొన్ని వేలమందికి అన్నం పెట్టే ‘పరిశ్రమ’ కనుక, సినిమాను ఒక వ్యాపారం అనుకుందామా? అయితే ఈ వ్యాపారంలో మేజర్ స్టేక్హోల్డర్లు ప్రేక్షకులు. వారిపై ఏకపక్షంగా రుద్దజూసే నిర్ణయాలు చెల్లవు. సినిమాను ఒక కళగా మాత్రమే భావిద్దామా? కళ కళ కోసమే తప్ప కాసుకోసం కాదని చాలామంది కళాస్రష్టలు భావిస్తారు. జగత్ ప్రసిద్ధ ఫిలిమ్ మేకర్ వాల్డ్డిస్నీ ఒక మాటన్నారు. ‘నేను డబ్బులు సంపాదించడం కోసం సినిమా తీయను. సినిమా తీయడం కోసం డబ్బులు సంపాదిస్తా’. సినిమాను కళగా భావించే వారికి ఇదొక సందేశం. సినిమాపై డిస్నీ సంతకం ఇంకెన్నాళ్లకయినా చెరిగి పోతుందా? కాసుల పొడ సోకనీయని శుద్ధ సృజనాత్మక ఆలోచనలు మన వాళ్లలోనూ ఉండేవి. కటిక దరిద్రాన్ని అనుభవిస్తూనే బమ్మెర పోతన కవి ‘ఆంధ్ర మహాభాగవత’ కావ్యాన్ని పూర్తి చేశారు. రాజులకు అంకితం ఇస్తే దరిద్రం తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనుభవించవచ్చని సన్నిహితులు సలహా ఇస్తారు. కానీ, పోతన ససేమిరా అంటాడు. ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజిం చుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల కౌ / ద్దాలికులైననేమి? నిజ దార సుతోదర పోషణా ర్థమై’ అని ఈసడించుకుంటాడు. కోమలమైన మహాభాగవత కావ్యాన్ని దుర్మార్గులైన రాజులకు అంకితం చేయడం కంటే వ్యవసాయం చేసుకుని భార్యాబిడ్డల్ని పోషించడం మేలంటాడు పోతన. ఇదీ విశుద్ధ కళా ప్రకటన, భక్తి భావన. ఆనాటికి తెలుగు ప్రాంతాల్లో ఉన్న నాటక సమాజాలన్నీ వరసకట్టి మరీ నటీనటులనూ, రచయితలనూ, దర్శకులనూ, గాయకులను సినీరంగ ప్రవేశం చేయించాయి. వాటిలో ప్రముఖ మైనది ‘ప్రజానాట్యమండలి’. ‘కళ కళ కోసం కాదు ప్రజల కోసం’ అనేది ఈ సంస్థ సిద్ధాంతం. ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు డాక్టర్ గరికపాటి రాజారావు స్వీయ దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ సినిమా నిర్మించి జమునను వెండితెరకు పరిచయం చేశారు. ఎన్టీరామారావు కూడా సినిమాల్లోకి రాకముందు ‘నేషనల్ ఆర్ట్ థియేటర్’ అనే పేరుతో నాటకాలు వేసేవారు. సంస్థ పేరులోనే జాతీయ భావం ఇమిడి వున్నది. సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన ఇదే పేరుతో ప్రారంభించారు. అభ్యుదయ భావాలతో నాటకాలు వేసి, సినీరంగంలో ప్రవేశించిన వారి ప్రభావం ఫలితంగా తొలి రోజుల్లో అనేక సందేశాత్మక, కళాత్మక విలువలున్న తెలుగు సినిమాలు తయారయ్యాయి. ఇవి వాణిజ్యపరంగా కూడా ఘన విజయాలను నమోదు చేశాయి. 1950వ, 60వ దశకాలను తెలుగు సినిమాకు స్వర్ణయుగంగా చాలామంది భావిస్తుంటారు. ఆర్థికంగా నష్టపోయే సినిమాల శాతం ఇప్పటికంటే చాలా తక్కువ. నిర్మాణ వ్యయం అదుపులో ఉండేది. సినిమా తారాగణం, కథాబలం, దర్శకుడు, బ్యానర్ను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు వసూలు చేయగలదో అంచనా వేసుకునేవారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ వ్యయం ఉండేది. అప్పట్లో సూపర్స్టార్స్గా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్ల పారితోషికాలు కూడా నిర్మాణ వ్యయంలో ఐదు నుంచి పది శాతంలోపే ఉండేవని చెబుతారు. ఈ తరహా పొదుపు బడ్జె ట్లతోనే నాటి సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. ఇప్పటివరకూ వచ్చిన అతిపెద్ద కమర్షియల్ హిట్ తెలుగు సినిమా ఏది? అప్పటికీ, ఇప్పటికీ మార్కెట్నూ, డబ్బు విలు వనూ బేరీజు వేసుకొని చూస్తే ‘లవకుశ’ను మించిన పెద్ద హిట్ లేదట. ఆ సినిమా విడుదలైనప్పుడు తెలుగు రాష్ట్రాల జనాభా ఇప్పటి జనాభాలో సుమారు 40 శాతం లోపే. రవాణా సౌకర్యాలు లేవు. రహదారులు చాలా తక్కువ. దూరంగా ఉండే టౌన్లకే సినిమా హాళ్లు పరిమితం. అయినా కూడా అప్పటి జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ఈ సినిమాను చూశారని అంచనాలున్నాయి. పావలా నేల టికెట్ దగ్గర్నుంచి రూపాయి సోఫా టికెట్ దాకా అన్ని తరగతుల చిల్లర శ్రీమహాలక్ష్మి కనకవర్షం కురిపించింది. ఎక్కువ శాతం సినిమాలు ఘనవిజయం సాధించడం ఈ స్వర్ణయుగం ప్రత్యేకత. 1963లో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన 13 సినిమాలు విడుదలైతే అందులో 7 శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. శతదినోత్సవం జరుపుకోవడం అంటే సినిమా సూపర్ హిట్ అయినట్టు! ఇదే ట్రెండ్ కొన్నేళ్ళు కొనసాగింది. ఎంత పెద్ద హీరోలైనా, ఎంత దిగ్గజ దర్శకులైనా, వారు ఎంత గొప్ప విజయాలను సాధించినా కూడా అడ్డగోలు పారి తోషికాలను డిమాండ్ చేయలేదు. ఫలితంగా నిర్మాణ వ్యయం అదుపులో ఉండి లాభాలు గడించిన కారణంగా తెలుగు సినిమా వేలాదిమందికి ఆశ్రయం కల్పించి ‘ఇండస్ట్రీగా’ గుర్తింపు పొందింది. ఇక్కడొక ఉదాహరణ చెప్పుకోవాలి. టాప్ ఫైవ్ తెలుగు సినిమాల పేర్లు చెప్పమని ఏ తెలుగువాణ్ణి అడిగినా అందులో కచ్చితంగా చెప్పే పేరు – ‘మాయాబజార్’. ఆ జనరంజక చిత్ర దర్శకుడు కేవీ రెడ్డి తెలుగు సినిమా స్వర్ణయుగ వైతాళికుల్లో ఒకరు. ఈ సినిమా కంటే ముందే అతిపెద్ద కమర్షియల్ హిట్గా ‘పాతాళభైరవి’ని ఆయన మలిచారు. దాదాపు ఒక డజన్ అపురూప దృశ్యకావ్యాలు ఆయన అందిం చారు. సినిమాలు తీయడం ఆపేసిన తర్వాత తన కొడుకును ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించవలసిన సందర్భం వచ్చింది. అందుకయ్యే ఖర్చు కోసం ఆయన ఇబ్బంది పడ్డారట. విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు తాను సర్దుబాటు చేయడానికి ముందుకొచ్చారు. ‘నీకు తెలుసు కదా రామారావ్, నేను ఎవరి దగ్గరా ఊరికే తీసుకోను’ అని కేవీ రెడ్డి తిరస్క రించారు. ‘ఊరికే వద్దు నాకో సినిమా తీసిపెట్టండ’ని ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చారు. అలా వచ్చింది ‘శ్రీకృష్ణ సత్య’. దర్శకుడిగా కేవీ రెడ్డి కమిట్మెంట్నూ, ఫోకస్ను చెప్ప డానికి, సినిమా బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ఉండే ఆనాటి పారితోషికాలను గురించి చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ. నటులైనా, దర్శకులైనా డబ్బులు సంపాదించకుండా ఇబ్బం దులు పడాలని కాదు. అయితే నిర్మాణ వ్యయం అదుపు తప్పని విధంగా ఏదో రకమైన బ్యాలెన్స్ను పాటించడం తప్పనిసరి.ఆ బ్యాలెన్స్ లేనప్పుడే ప్రేక్షకుల మీద అదనపు భారం మోప డమనే అవాంఛనీయ ఆలోచనలు ముందుకొస్తాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, కృష్ణ, శోభన్బాబు, చిరంజీవి వంటి నటులకూ, కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి, కేఎస్ ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, ‘విక్టరీ’ మధుసూదనరావు, కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు వంటి దర్శకులకు జనంలో ఎంతో ఇమేజ్ వుండేది. ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు అప్పట్లో చేయలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా టికెట్ల వసూళ్ళపై వినోదపు పన్ను వసూలుకు శ్లాబ్ పద్ధతిని ప్రవేశపెట్టారు. కలెక్షన్లపై నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తప్పుడు లెక్కలు చూపెడుతున్నారనే అనుమానంతో ఈ పద్ధతిని తీసు కొచ్చారు. ఈ పద్ధతి సినిమా వ్యాపారాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఓపెనింగ్స్ బాగా వుంటేనే సినిమా బతికి బట్టకట్టే పరిస్థితి వచ్చింది. ఓపెనింగ్స్ లేకపోయినా కథాబలంతో నోటి మాట ద్వారా పుంజుకునే అవకాశం ఉండే సినిమాలు దెబ్బతిన్నాయి. ఒకవేళ ‘శంకరాభరణం’ సినిమాయే శ్లాబ్ పద్ధతి తర్వాత విడుదలై ఉంటే ఏమయ్యేదో! శ్లాబ్ పద్ధతి చిరంజీవికి బాగా కలిసొచ్చింది. అప్పుడప్పుడే యువ ప్రేక్షకుల అభిమా నాన్ని చూరగొంటున్న చిరంజీవి బంపర్ ఓపెనింగ్స్తో దూసుకొని పోయాడు. ‘మెగాస్టార్’ అని పిలిచేంత వరకూ వెనక్కు చూడలేదు. ఇప్పటికీ అడపాదడపా చిరంజీవి నటిస్తూనే ఉన్నప్పటికీ గడిచిన పదిహేనేళ్ల కాలాన్ని పోస్ట్ చిరంజీవి దశగానే పరిగ ణించాలి. ఈ దశలోనే నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. ఐదారు మంది దర్శకులు ఫిలిమ్ మేకింగ్లో కొత్త పుంతలు తొక్కారు. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, వినాయక్, కొరటాల శివ తదితరులకు నాగ్ అశ్విన్ లాంటి ప్రతిభావంతులు తోడవుతున్నారు. మార్కెట్ విస్తరణకు తెలుగు సినిమా నడుం కట్టింది. ఇంత వరకూ స్వాగతిద్దాం. కానీ నిర్మాణవ్యయం పట్టాలు తప్పింది. ఆర్థికంగా విజయాలు సాధిస్తున్న సినిమాలు ఏటా పది శాతం కూడా ఉండడం లేదు. ఇది కూడా ప్రీ–కోవిడ్ లెక్క. సినిమా రంగం సంక్షోభంలో కూరుకుపోవడాన్ని ఇప్పుడు చూస్తున్నాము. ఒక అరడజను మంది స్టార్ హీరోలున్నారు మనకు. మరో అరడజను మంది పెద్ద డైరెక్టర్లున్నారు. వీళ్ల సినిమాలన్నీ తెలుగు మార్కెట్ తట్టుకోలేనంత భారీ బడ్జెట్ సినిమాలే. ఈ బడ్జెట్లో యాభై శాతానికిపైగా హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషనే! మిగతా బడ్జెట్లో ఒక పావలా ఇతరుల రెమ్యునరేషన్.ఒక పావలా నిర్మాణవ్యయం. షూటింగ్ జరిగే ప్రదేశంలో ఆరేడు క్యారవాన్ బస్సులుండటం పరిపాటి. హీరో హీరోయిన్లతో పాటు ఇతర ముఖ్యులం దరికీ ఈ సౌకర్యం ఉండాలి. ఇదొక స్టేటస్ సింబల్. షూటింగ్ విరామంలో స్టార్లు ఈ ఏసీ బస్సుల్లో విశ్రాంతి తీసుకుంటారు. షూటింగ్ జరిగే భవంతుల్లో ఏసీ గదులున్నాసరే ఈ క్యారవాన్లు ఉండి తీరాల్సిందే. పెద్ద నటీనటుల వెంట వారి బంధుమిత్ర పరివారం కూడా ఉంటుంది. వారందరికీ అతి«థి సేవలు తప్పనిసరి. ఈ పరివారానికి స్టార్ హోటళ్ల నుంచి క్యారియర్లు తెప్పించాలి. షూటింగ్ జరిగినన్నాళ్లూ ఈ తంతు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా హీరో ఇమేజ్ను పెంచడం కోసం, దర్శకుని ప్రతిభను చాటడం కోసం తీసే కొన్ని సీన్లుంటాయి. ఇవి లేకున్నా కథనంలో ఏ లోపం ఉండదు. కానీ ఉంటాయి. ఈ దుబారా ఖర్చునంతా వసూలు చేసుకోవడానికి నిర్మాతలు రెండు పద్ధతులు అనుసరిస్తారు. అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలోనూ ఈ సినిమాయే విడుదలవడం మొద టిది. చిన్న సినిమాలు విడుదలవడానికి అవకాశం ఉండదు. ఇక రెండవది– జనం మీద అడ్డగోలు బాదుడు! మొదటి వారం రోజులపాటు అదనపు షోలు నడిపించి ప్రేక్షకుల దగ్గర ఐదింతల నుంచి పదింతల వరకు వసూలు చేయడం! ఒకప్పుడు థియేటర్ల బైట బ్లాక్టికెట్లమ్మే వ్యవస్థ, పోలీసు అరెస్టులుండేవి. కానీ, ఇప్పుడు అనధికారిక అడ్డగోలు టికెట్ రేట్ల పెంపు అంటే, ఏకంగా థియేటర్లలో బుకింగ్లోనే బ్లాక్ టికెట్లు అమ్ముతున్నట్టు లెక్క! చూడదలుచుకున్న ప్రేక్షకులంతా వారం లోపే చూసెయ్యాలి. లేదంటే సదరు సినిమా ఎన్నాళ్లు ఆడు తుందో గ్యారంటీ లేదు. థియేటర్లన్నీ కొద్దిమంది గుత్తాధి పత్యంలో ఉన్నందువల్ల స్టార్ హీరోల సినిమాలకే వాటిని అంకితం చేస్తున్నారు. చిన్న సినిమాలు తీసినవారు ఆ సినిమాల విడుదల కోసం పడుతున్న బాధలు దేవుడెరుగు. స్టార్ పరివారాల క్యారవాన్ల కోసం, భోజనం క్యారియర్ల కోసం, సినిమా ప్రొడక్షన్ దుబారా కోసం, హీరోల భారీ పారి తోషికం కోసం సామాన్య ప్రజలు చందాలివ్వాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మీద ఇప్పుడిప్పుడే చర్చ మొదలైంది. ఒక లాజికల్ ముగింపునకు చేరుకునేంత వరకు ఈ చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్లలో పారదర్శకత కోసం ప్రభుత్వ నియంత్రణలో ‘ఆన్లైన్ టికెటింగ్’ అనే అంశం ముందుకొచ్చింది. అట్లాగే ప్రేక్షకులపై అదనపు భారం పడకుండా టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదుపులోకి తెచ్చింది. పాత విధానాల ద్వారా లబ్ధి పొందుతున్నవారికి ఈ సంస్కరణలు సహజంగానే ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. పవన్ కల్యాణ్కు కూడా అందుకే కోపం వచ్చింది. ఒక సినిమా ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఆయనకు ఆ ప్రభుత్వంలోని మంత్రులు కూడా గట్టిగానే కౌంటరిచ్చారు. అది వేరే కథ. స్టార్ అంటే నక్షత్రం. అది వెలుగునివ్వాలి. నక్షత్రకుడంటే వెంటపడేవారు, వేధించేవాడు. స్టార్స్ వెలుగులు వెదజల్లు తుంటే నవీన్ పొలిశెట్టి లాంటి నటులు పదుల సంఖ్యలో వస్తారు. ‘జాతిరత్నాలు, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, కేరాఫ్ కంచరపాలెం, పలాస, పెళ్లిచూపులు’ వంటి సినిమాలు ప్రవాహంలో వచ్చి పడి తెలుగు సినిమాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తాయి. ఒకవేళ స్టార్లు నక్షత్రకులుగా మారితే... ‘స్టార్స్’ను వెలిగించిన ప్రేక్షకులే నక్షత్రకులను వదిలించుకుంటారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
బతుకు చిత్రం :పాదరక్షల తయారీ పరిశ్రమల్లో వేలాదిమందికి ఉపాధి
-
ప్రభుత్వం – పరిశ్రమ మధ్య విశ్వాసం ఉండాలి
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి పరిస్థితుల్లో తెరపైకి వచి్చన కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే.. ప్రభుత్వం, పరిశ్రమ మధ్య నమ్మకం కీలకమైన అంశంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం ఒకవైపు టీకాల ప్రక్రియను వేగవంతం చేస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగం తోడ్పాటుతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు సహా అన్ని చోట్లా ఆరోగ్య సంబంధ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంని ఆమె చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. నేషనల్ బ్యాంక్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అండ్ డెవలప్మెంట్, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్ మొదలైనవి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించగలవని ఆమె తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ యథాప్రకారం కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. ఫిక్కీతో సమావేశం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం వాణిజ్య మండలి ఫిక్కీతో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఇందులో 50 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించి ఎన్నో అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇండియా సిమెంట్స్ చైర్మన్, ఎండీ ఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. చైనా తర్వాత సిమెంట్ తయారీలో భారత్ అతిపెద్ద దేశంగా ఉందని గుర్తు చేశారు. భారత్లో సగం మేర సిమెంట్ దక్షిణాదిలోనే తయారవుతోందని.. మౌలిక సదుపాయాల రంగంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టనున్న దృష్ట్యా దేశంలోని ఇతర ప్రాంతాలకూ సిమెంట్ తయారీ విస్తరణ అవసరాన్ని ప్రస్తావించారు. దిగుమతి చేసుకుంటున్న బొగ్గు ధర గణనీయంగా పెరిగిపోవడాన్ని చర్చకు తీసుకువచ్చారు. తోలు పరిశ్రమలో ఎంఎస్ఎంఈలే ఎక్కువగా ఉన్నందున.. వడ్డీ రాయితీ పథకాన్ని సెప్టెంబర్ తర్వాత కూడా కొనసాగించాలని ఫిక్కీ తమిళనాడు ఎగ్జిమ్ ప్యానెల్ కన్వీనర్ ఇర్షద్ మెక్కా కోరారు. దీంతో అన్ని అంశాలపైనా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్
ముంబై: ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మంచి వృద్ధిని చూస్తుందని.. కంపెనీల ఆదాయం 20–23 శాతం పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీ ఆటోమొబైల్ రంగం కోలుకోవడానికి తోడు, ఎగుమతులు సైతం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా పేర్కొంది. అయితే, కీలక ముడి సరుకుల ధరలు అధికంగా ఉండడం, సెమీ కండక్టర్ల కొరత పరిశ్రమను వేధిస్తున్న అంశాలుగా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆటో విడిభాగాల పరిశ్రమ మంచి రికవరీని చూసినట్టు వివరించింది. ప్రయాణికుల వాహనాలు (పీవీ), ట్రాక్టర్లకు డిమాండ్ బలంగా ఉందని.. కరోనా ముందస్తు నాటి డిమాండ్ స్థాయికి చేరుకున్నట్టు నివేదికలో పేర్కొంది. మధ్యతరహా, భారీ వాణిజ్య వాహనాల విభాగాలు సైతం కోలుకుంటున్న సంకేతాలను ఇస్తున్నాయని తెలిపింది. పెరిగిన ముడి పదార్థాల ధరలను బదలాయించినట్టయితే ఇది కూడా ఆదాయ వృద్ధికి తోడ్పడే అంశమేనని పేర్కొంది. పరిశ్రమ స్థూల మార్జిన్లు 2021–22 మొదటి మూడు నెలల్లో సీక్వెన్షియల్గా (మార్చి త్రైమాసికం నుంచి) మెరుగుపడినట్టు.. నివేదికలో వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలను పరిశీలిస్తే... చదవండి : ఫేస్బుక్ సమర్పించు....వరల్డ్రూమ్ ♦పరిశీలనలోకి తీసుకున్న 50 ఆటో పరికరాల విభాగాలను తీసుకుంటే, వార్షికంగా క్యూ1లో పటిష్ట స్థాయిలో 140 శాతం వృద్ధి నమోదయ్యింది. లో–బేస్ ఎఫెక్ట్ నామమాత్రంగా ఉంది. ♦సీక్వెన్షెయల్గా చూస్తే, (మార్చి త్రైమాసికంతో పోల్చి) సెకండ్ వేవ్ సవాళ్లు ఉన్నప్పటికీ, క్షీణత 19 శాతానికి పరిమితమైంది. అంచనాలు 30 నుంచి 35 శాతం క్షీణతకన్నా ఇది ఎంతో తక్కువ. ♦త్రైమాసికంగా 19 శాతం క్షీణతలోనూ టైర్లు, బ్యాటరీలు వంటి విడిభాగాల క్షీణత కేవలం 13కే పరిమితమైంది. ♦ కీలక ముడిపదార్థాలు, కమోడిటీ ధరలు తీవ్రంగా ఉండడం ప్రస్తుతం ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాలు. ♦గ్లోబల్ సెమీ కండక్టర్ డిమాండ్లో భారత్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ వాటా 11 శాతం. అయితే ఇప్పుడు వీటి కొరత పరిశ్రమకు సవాలుగా మారింది. ఈ విభాగంలో ఊహించినదానికన్నా పటిష్ట రికవరీ, కొన్ని సెమీ–కండక్టర్ తయారీ సంస్థల్లో సరఫరాల సమస్యలు, అంతర్జాతీయంగా పెరిగిన చిప్ కొరత సవాళ్లు ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ♦పరిశ్రమలో సరఫరాల సవాళ్లు తొలగిపోలేదు. కొన్ని మోడళ్లు, వేరియెంట్లకు సంబంధించి సరఫరాలు నాలుగు నెలలకుపైగా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. డిమాండ్ పటిష్టంగా ఉన్నప్పటికీ సరఫరాలు అందుకు తగిన విధంగా లేవు. 2021 క్యాలెండర్ ఇయర్ వరకూ ఈ పరిస్థితి కొనసాగుతునందని పరిశ్రమ ప్రతినిధులు అంచనావేస్తున్నారు. ♦పరిశ్రమ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న అంశమిది. ♦కోవిడ్–19 సెకండ్వేవ్ వల్ల ఆటో విడిభాగాల సరఫరాదారుల్లో మెజారిటీ భాగం ఆపరేటింగ్ మార్జిన్లు తగ్గాయి. -
బాలానగర్లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ పారిశ్రామికవాడలో గల ఓ గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రేరణి ఇండస్ట్రీస్ ప్లైవుడ్ గోదాములో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. -
దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఈ పరిశ్రమ నాలుగు రెట్లు పెరిగి రూ.1,100 కోట్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. క్రీడాకారుల్లో నైపుణ్యం, కోవిడ్తో ఇంటికే ఎక్కువ సమయం పరిమితం అవటం, మొబైల్ వినియోగం పెరగడం వంటివి పరిశ్రమ వృద్ధికి కారణాలని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఈ–స్పోర్ట్స్ పరిశ్రమ రూ.250 కోట్లుగా ఉంది. వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా 46 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ మాదిరిగా కాకుండా ఈ–స్పోర్ట్స్ అనేది నైపుణ్యం కలిగిన ఆన్లైన్ ఆటలుగా పరిగణిస్తారు. జట్లుగా లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీల రూపంలో టోర్నమెంట్లు, లీగ్లు ఆడి టైటిల్స్ను గెలుచుకుంటారు. 2025 నాటికి దేశీయ ఈ–స్పోర్ట్స్ పరిశ్రమలో క్రీడాకారుల సంఖ్య 15 లక్షలకు, 2.50 లక్షల జట్లకు చేరుతుందని తెలిపింది. ప్రస్తుతం 1.50 లక్షల మంది ప్లేయర్లు, 60 వేల బృందాలున్నాయి. ఇదే సమయంలో భారతీయ ఈ–స్పోర్ట్స్ ప్రైజ్ మనీ ఏటా 66 శాతం వృద్ధి రేటుతో రూ.100 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ప్రస్తుతం గ్లోబల్ ప్రైజ్ మనీ భారతీయ ఈ–స్పోర్ట్స్ ప్రైజ్ మనీ 0.6 శాతమే ఉందని.. 2025 నాటికి 2 శాతానికి చేరుతుందని తెలిపింది. ప్రేక్షకులు, ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్ల సం ఖ్య పెరగడంతో ప్రకటనదారులు, ఏజెన్సీలు వ్యూ యర్షిప్ను చేరుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నా యని తెలిపారు. ఈ–స్పోర్ట్స్ ఆదాయంలో మెజారిటీ వాటా అయిన ప్రకటనల విభాగం 2025 నాటికి ప్రకటనల ఆదాయం నాలుగు రెట్ల వృద్ధితో రూ.650 కోట్లకు చేరుతుంది. టోర్నమెంట్ స్పాన్సర్షిప్, సిండికేషన్ విభాగాల ఆదాయం ఏటా 45 శాతం వృద్ధి రేటుతో రూ.350 కోట్లకు చేరుతుందని ఈవై ఇండియా పార్టనర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లీడర్ ఆశీష్ ఫెర్వానీ తెలిపారు. చదవండి: సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..! -
ఇక్కడి బొమ్మలే కొందాం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయులు స్థానిక బొమ్మలపై మక్కువ పెంచుకోవాలని, ఈ రంగంలోని వారంతా దేశీయ బొమ్మలకు ‘గొంతుక’ కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్లో వినియోగిస్తున్న బొమ్మల్లో దాదాపు 80 శాతం బొమ్మలను దిగుమతి చేసుకుంటున్నామని, వీటినే కొనడంతో వేలకోట్ల ధనం విదేశాలకు తరలిపోతోందని ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. రూ.7.5 లక్షల కోట్ల విలువైన ప్రపంచ బొమ్మల మార్కెట్లో భారత్ వాటా కేవలం రూ.11 వేల కోట్లమేరకే ఉందని ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం వర్చువల్ వేదికగా జరిగిన టాయ్కాథాన్–2021లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని ప్రసంగించారు. బొమ్మల ఆర్థిక వ్యవస్థ(టాయ్ ఎకానమీ–టాయ్కానమీ)లో భారత స్థానం మరింతగా మెరుగుపడాలని ఆయన అభిలషించారు. ఆట వస్తువుల తయారీ, గేమింగ్ పరిశ్రమల్లో ప్రపంచ విపణిలో భారత్ మరింత పురోగతి సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఈ పరిశ్రమ దేశీయంగా వృద్ధిచెందితే సమాజంలో ఈ రంగంపై ఆధారపడ్డ వర్గాలకు మేలు జరుగుతుంది. గ్రామీణులు, దళితులు, పేద ప్రజలు, గిరిజనుల భాగస్వామ్యంతో దేశీయంగా చిన్నతరహా ఆట వస్తువుల పరిశ్రమ కొనసాగుతోంది. ఈ రంగంలో మహిళల పాత్ర ఎంతో ఉంది. వీరందరి జీవితాలు మరింతగా వృద్ధిలోకిరావాలంటే మనందరం స్థానిక బొమ్మలనే కొందాం’అని మోదీ పిలుపునిచ్చారు. చదవండి: Narendra Modi: సహకారంతోనే సంస్కరణలు రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త! -
మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: రెండో దశలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి సినీ జర్నలిస్టులకు, సినీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా ఉచితంగా కోవిడ్-19 టీకా ఇప్పించనున్నామని మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు అపోలో 24/7 సౌజన్యంతో ఉచిత టీకా సౌకర్యాన్ని అందిస్తున్నామని చిరంజీవి తెలిపారు. ప్రతి ఒక్కరూ భద్రంగా ఉండాలంటూ ఒక వీడియో సందేశాన్ని చిరంజీవి షేర్ చేశారు. 45 ఏళ్లు దాటిన వారిన సినీ కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని చిరంజీవి తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న వారికి మూడు నెలల పాలు అపోలో ఆసుపత్రి ద్వారా ఉచితంగా వైద్యులను సంప్రదించే అవకాశంతోపాటు, మందులను కూడా రాయితీ ధరలకు అందించే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చిరంజీవి తెలిపారు. గతేడాది కరోనా వైరస్ సంక్షోభ కాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన చిరు దాని ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. (రెమిడెసివిర్ అడిగిన దర్శకుడు: ఊహించని స్పందన) తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd — Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021 -
బొల్లారం అగ్ని ప్రమాదం: అదుపులోకి మంటలు
సాక్షి, హైదరాబాద్: వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. సంఘటన స్థలం నుండి వెళ్లిపోయిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లిపోగా, పరిశ్రమలో రెండు ఫైర్ బృందాలను అందుబాటులో ఉంచారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 3 బ్లాకులు కాగా, మొదటి బ్లాక్లో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ అయ్యాయి. ఒక్కసారిగా రెండు రీయాక్టర్లు బ్లాస్ట్ కావడంతో భవనం మొత్తం నేలమట్టం అయ్యింది. (చదవండి: ఐడీఏ బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం) ప్రొడక్షన్ యూనిట్లో ఉన్నవారికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 8 మంది గాయపడగా, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. వింధ్యా ఆర్గానిక్ పరిశ్రమలో మొత్తం 50 కి పైగా రీయాక్టర్లు ఉన్నాయి. ఈ పరిశ్రమలో వివిధ ప్రముఖ కంపెనీల రా మెటీరియల్ తీసుకొని బల్క్ డ్రగ్స్ తయారు చేస్తారు. ప్రమాదంపై పోలీసులు, రెవెన్యూ, కెమికల్ ఇండ్రస్టీస్ ఇన్స్పెక్షన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇక హైదరాబాద్లో ఫ్రీ వాటర్.. అయితే..) -
యువతకు అన్ని రంగాల్లో నైపుణ్యం అందిస్తాం
-
ఏపీలో సమగ్ర పరిశ్రమ సర్వే: గౌతమ్రెడ్డి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సమగ్ర పరిశ్రమ సర్వే చేశామని పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ల ఏర్పాటుకు కేంద్ర సంస్థలు అంగీకరించాయని పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఛైర్మన్ ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని అభినందించారని తెలిపారు. 8 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి కేంద్ర సహకారం ఉంటుందని ఆయన చెప్పారని గౌతమ్రెడ్డి వెల్లడించారు. (చదవండి: 3 ప్రముఖ సంస్థలతో ‘స్కిల్స్’పై ఒప్పందాలు) ‘‘డిసెంబర్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. బల్క్ డ్రగ్ పార్క్ని ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. డిసెంబర్ 15 నాటికి భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు ప్రారంభిస్తామని’’తెలిపారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరల్డ్ క్లౌడ్ సెంటర్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. వర్క్ ఫ్రం హోమ్కి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని’’ మంత్రి గౌతమ్రెడ్డి పేర్కొన్నారు. (చదవండి: బాబోయ్ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషనా..!) -
ఒకప్పటి స్టార్స్..ఇప్పుడు యాచిస్తూ..దయనీయంగా
చిత్ర పరిశ్రమ అనేది ఓ మాయా ప్రపంచం. బయటినుంచి చూసేవాళ్లకి అదో రంగులలోకం. ఏమీ లేని స్థాయి నుంచి స్టార్లుగా ఎదిగిన వాళ్లు కొందరుంటే ఎక్కడినుంచి మొదలు పెట్టారో తిరిగి అక్కడికే చేరేవాళ్లు మరికొందరుంటారు. ఒక్క సినిమా హిట్ అయితే రాత్రికి రాత్రే స్టార్లు అయినవాళ్లు కూడా ఉన్నారు. అయితే ఈ క్రేజ్ ఎక్కువకాలం నిలవాలంటే మాత్రం కఠోర శ్రమ, గ్లామర్, అదృష్టం..ఇలా అన్నీ కలిసిరావాలి లేదంటే ఇండస్ట్రీలో నెగ్గుకురావడం చాలా కష్టం. ఒకప్పుడు స్టార్లుగా చలామణి అయినవాళ్లు ప్రస్తుతం చాలా సాదాసీధాగా జీవనం గడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే వారి పేర్లు కనుమరుగైనట్లే ప్రస్తుతం ఎక్కడో దిక్కుతోచని, దయనీయమైన పరిస్థితుల్లో జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. అలనాటి బాలీవుడ్ స్టార్ల జీవితాలపై సాక్షి.కామ్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఓపీ నాయర్ మద్యం.. మనుషుల్ని, బంధుత్వాన్ని కూడా దూరం చేయగలదు. అలాంటి కోవలోకే వస్తారు. సంగీత దర్శకుడు ఓపీ నాయర్. మత్తుకు బానిసై కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు పనిచేసి ఇంటర్వ్యూలతో క్షణం తీరిక లేకుండా గడిపిన నాయర్ ఇప్పుడు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోహ్రాబ్రీన్ సినిమా ప్రపంచం అనగానే నిజంగానే సినిమాల్లో చూపించిన విధంగానే వాళ్లు కుటుంబాలతో సంతోషంగా ఉంటారనుకుంటాం. కానీ అది చాలా కొద్ది మందికే సాధ్యం. చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన జోహ్రాబ్రీన్ను ఆమె కొడుకు, కూతురు అనాధలా వదిలేశారు. కుటుంబం కోసం ఎంతో కష్టపడి ప్రతీ పైసా పోగుచేసింది. చివరికి ఆమె చివరి క్షణాల్లో సైతం కుటుంబ సభ్యులు ఎవరూ చేరదీయలేదు. దీంతో అనాథ శవంలానే చనిపోయింది. పర్వీన్ బాబీ బాలీవుడ్ పరిశ్రమలో తన అందంతో అలరించిన నటి పర్వీన్ బాబీ. తీవ్రమైన డిప్రెషన్తో జనవరి 22,2005లో ముంబైలోని తన ఫ్లాట్లో కన్నుమూసింది. దారుణమేంటంటే.. ఆమె అంత్యక్రియలు జరపడానికి రెండు రోజుల వరకు కుటుంబసభ్యులు కానీ ఆత్మీయులు ఎవరూ రాలేదు. దీంతో చివరికి నిర్మాత మహేష్ భట్ ఆమె అంత్యక్రియలు జరిపించే బాధ్యతను తీసుకున్నాడు. మీనాకుమారి భారత చిత్ర పరిశ్రమలో ట్రాజెడీ క్వీన్గా పిలిచే మీనాకుమారి..తన జీవితంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంతో జీవితాన్ని ముగించింది. పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ఆమెను పెళ్లి చేసుకోవాలనుకొని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మీనా కుమారి మాత్రం తను ప్రేమించిన కమల్ అమ్రోహినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత భర్త వేరే మహిళలతో అక్రమ సంబంధాలు తెలిసి మీనా కుమారి గుండె పగిలేలా రోదించింది. చివరికి మద్యానికి బానిసై చనిపోయింది. రాజ్కిరణ్ కార్జ్ చిత్రంంలో రిషికపూర్తో పాటు నటించిన హీరో రాజ్కిరణ్కి కూడా మంచి పాపులారిటినే ఉండేది. అయితే తర్వాత కొన్నేళ్లకు ఆయన ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించకపోవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాడేమో అనుకున్నారు. అయితే 2010లో అట్లాంటాలో మతిస్థిమితిం లేని వ్యక్తిలా కనిపించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ స్థితిలో ఆయన్ను చూసింది రిషికపూరే. మితాలి శర్మ భోజ్పురి నటిగా ఎంతో ప్రజాదరణ పొందిన నటి మితాలి శర్మ. ఇటీవల ముంబై వీధిల్లో యాచకురాలిగా కనిపించింది. అంతేకాకుండా దొంగతనాలకు పొల్పడుతూ రెండు సార్లు పోలీసులకు చిక్కింది. ఒకప్పుడు అగ్ర హీరోల పక్కన నటించిన మితాలి ఇప్పుడు యాచకురాలిగా కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యాయి. సినిమా ఆఫర్లను కొన్ని రిజెక్ట్ చేయడంతో మొత్తానికే ఆఫర్లు రావడం ఆగిపోయాయి. దీంతో తీవ్ర నిరాశలో కుంగిపోయింది. భగవాన్ దాదా ఖరీదైన కార్లు, బంగళాలు ఉన్న స్టార్ భగవాన్ దాదా పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఆయన నటించిన జమేలా, లాబెలా వంటి సినిమాలు దారుణంగా పరాజయం కావడంతో బంగ్లా నుంచి ముంబై మురికివాడలకు మారాల్సి వచ్చింది. చివరకు అక్కడే తుదిశ్వాస విడిచారు. భరత్ భూషణ్ ఉత్తమ నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన భరత్ భూషణ్ మీనాకుమారి లాంటి హీరోయిన్లతో ప్రేమ వ్యవహారం నడిపారు. తర్వాత కొన్ని సంఘటనల ద్వారా విడిపోయారు. ఆ తర్వాత చివరికి ఆఫర్లు లేక ఫిల్మ్ స్టూడియోలో గేట్ కీపర్గానూ పనిచేశాడు. చివరకు అద్దె కట్టుకోలేక అదే ఇంట్లో మరణించాడు. గీతాంజలి నాగ్పాల్ ఎంతో మంది స్టార్లకు డిజైనింగ్ చేసిన సుప్రసిద్ధ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ గీతాంజలి నాగ్పాల్ ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ స్థాయికి ఎదిగింది. చివరికి డ్రగ్స్, మద్యానికి బానిసై ఆస్తులన్నీ కుప్పకూలిపోయాయి. దీంతో ఢిల్లీ వీధుల్లో యాచిస్తూ బతుకుతుంది. కొన్ని ఇళ్లలో పనిమనిషిగానూ పనిచేసింది. జగదీష్ మాలి ప్రముఖ ఫోటోగ్రాఫర్, నటి ఆండ్రామాలి తండ్రి జగదీష్ మాలి యాచిస్తూ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒకప్పుడు ఆయన తీసిన ఫోటోలకు తెగ క్రేజ్ ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల ఫోటో స్టూడియోను సైతం అమ్ముకొని యాచిస్తూ కనిపించాడు. ఈ స్థితిలో చూసిన నటుడు సల్మాన్ ఖాన్ ఆర్థిక సహాయం అందించాడు. -
పటిష్టంగా దేశ ఎకానమీ
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవస్థాగతంగా పటిష్టంగా ఉన్న నేపథ్యంలో పరిశ్రమల వర్గాలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. పెట్టుబడులకు ఊతమిచ్చే దిశగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు తగ్గించడంతో గత ఆరేళ్లుగా కేంద్రం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన వెబినార్లో పేర్కొన్నారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: మంత్రి మాండవీయ నౌకాశ్రయాల్లో కార్గో హ్యాండ్లింగ్కు ఉపయోగపడే క్రేన్లు మొదలైన కీలక ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ధి సాధించడంపై దేశీ కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అలాగే, ఔషధాల తయారీలో ప్రధానమైన ముడి పదార్థాల ఉత్పత్తి కూడా దేశీయంగా పెంచాలని, తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాది ప్రాంత సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వర్చువల్ ప్లాట్ఫాం ద్వారా మంత్రి ఈ విషయాలు తెలిపారు. -
కరోనా; పెళ్లి పరిశ్రమకు అపార నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్డౌన్, దేశంలోని ఐదువేల కోట్ల డాలర్ల ‘పెళ్లి పరిశ్రమ’పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. లాక్డౌన్ కారణంగా దేశంలో ఎక్కువ పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. నామమాత్రపు ఏర్పాట్లు, పరిమిత కుటుంబ సభ్యులతో కొన్ని పెళ్లిళ్లు తూతూ మంత్రంగా కొనసాగాయి. మరికొన్ని పెళ్ళిళ్లు ఆన్లైన్ ద్వారా జరిగాయి, జరుగుతున్నాయి. పర్యవసానంగా పెళ్లిళ్లపై ఆధారపడి సగటు దినసరి కూలీల నుంచి మ్యారేజ్ హాళ్ల యజమానులు, ఈవెంట్ మేనేజర్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, క్యాటరర్స్, పెళ్లి పందిళ్లను అలంకరించే కళాకారుల వరకు అందరు నష్టపోయారు. ‘కరోనా ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి వాయిదా పడిన పెళ్లిళ్లు హంగామా లేకుండా నామమాత్రపు ఖర్చులతో జరగవచ్చు. లాక్డౌన్ సందర్భంగా భౌతిక దూరం పాటించడం ద్వారా కలిగిన వెలితిని పూడ్చుకోవడం కోసం మరింత వైభవంగా పెళ్లిళ్లు చేసుకునేందుకు ధనిక కుటుంబాలు ప్రయత్నించవచ్చు’ అని ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ సహా దాదాపు 400 మంది పెళ్లి కుమారులు, పెళ్లి కూతుళ్లను కస్టమర్లుగా కలిగిన ‘వెడ్డింగ్ ఫొటోగ్రఫీ కంపెనీ’ యజమాని జోసఫ్ రాదిక్ తెలిపారు. భారీ ఎత్తున అలంకరించాల్సిన నాలుగు పెళ్లిళ్లు, 50 మంది అతిథులకు పరిమితమైన రెండు చిన్న పెళ్లిళ్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయని టుస్కానీలో జరిగిన అనుష్క శర్మ పెళ్లికి అంగరంగ వైభవంగా అలంకరణలు చేసిన వెడ్డిండ్ ప్లానర్ దేవికా నారాయణ్ తెలిపారు. పెళ్లి కూతురికి కరోనా రావడం వల్ల 50 మంది అతిథులకు పరిమితమైన ఓ పెళ్లి వాయిదా పడగా, సమీప బంధువుల్లో ఒకరికి కరోనా రావడం వల్ల 50 మందికి పరిమితమైన మరో పెళ్లి కూడా వాయిదా పడిందని చెప్పారు. మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, ఆ తర్వాత ఏం అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉందని ఆమె అన్నారు. (గుడ్న్యూస్: మరింత పెరిగిన రికవరీ రేటు) ఇక ముందు పెళ్లిళ్ల కూడా భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంటే తనలాంటి వెడ్డింగ్ ప్లానర్స్ అవసరమే ఎక్కువ ఉంటుందని, సాధారణ టెంట్ సరఫరాదారులకు ఆ అవగాహన ఉండదని దేవిక ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్కు చెందిన ఐదువేల కోట్ల డాలర్ల పెళ్లి పరిశ్రమలో కరోనా కారణంగా మూడువేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగి ఉంటుందని ఓ అంచనా. (బ్రీతింగ్ వ్యాయామంతో వైరస్లకు చెక్!) -
మరో విషాదం : 2020.. దయచేసి ఇక చాలు!
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త, క్యుకి డిజిటల్ మీడియా సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ బంగారా (46) ఆకస్మిక మరణం వ్యాపార వర్గాలను విభ్రాంతికి గురిచేసింది. ముంబై శివారు ప్రాంతంలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బంగారా కన్నుమూశారు. ఆయన అకాల మరణంపై కంపెనీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ విషాదవార్తతో షాక్ లో వున్నామని క్యుకి మరో కో-ఫౌండర్ సీవోవో సాగర్ గోఖలే ఉద్యోగులకు పంపిన ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. ఈ లోటును వర్ణించడానికి మాటలు చాలవని పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో మనమంతా ఆయన కుటుంబానికి అండగా నిలబడాలన్నారు. అలాగే కరోనా మహమ్మారి కాలంలో అందరూ ఇంటినుంచే బంగారాకు నివాళులర్పించాలన్నారు. అటు సమీర్ బంగారా మరణంపై బాలీవుడ్ ప్రముఖులు విశాల్ దాడ్లాని, అర్మాన్ మాలిక్, కుబ్రా సైట్, అదితీ సింగ్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా సంతాపం ప్రకటించారు. తన స్నేహితుడు, సమీర్ ఇక లేడన్న భయంకరమైన, హృదయ విదారక వార్త తెలిసి చాలా బాధపడుతున్నా అన్నారు. జీవితంలో ఎంతోమందికి సాయం చేసిన మంచి వ్యక్తి అని విశాల్ గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాది విషాదాలను తలుచుకుంటూ 2020 ఇక చాలు దయచేసి..అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. Just heard that @samirbangara is no more. Horrible, heartbreaking news. Man's been a friend for a long time. Such a good guy, so straight-up. Helped so many people build careers out of nothing! His legacy will remain. Much love & strength to the family. 🙏🏼 2020, enough please! — VISHAL DADLANI (@VishalDadlani) June 14, 2020 Really very sad to wake up to the news that @samirbangara is no more. He was a great guy with a drive and passion like no other. Shocking and heartbreaking. Sincere condolences, strength and prayers to his immediate family & the @MyQyuki family... — ARMAAN MALIK (@ArmaanMalik22) June 14, 2020 -
కాలుష్య పరిశ్రమలపై చర్యలేవి?
సాక్షి, హైదరాబాద్: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో అలాంటివి పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ నగర శివారు జీడిమెట్లలో పారిశ్రామిక కాలుష్య కట్డడికి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) చేపట్టిన చర్యలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భూగర్భ జలాలు కలుషితం అవుతుంటే పీసీబీ చర్యలు ఆశాజనకంగా లేవని పేర్కొంది. పరిశ్రమల నుంచి కాలుష్యం వెదజల్లుతుంటే గత నాలుగేళ్లల్లో 45 కేసులు మాత్రమే నమోదవడం పీసీబీ పనితీరును తెలియజేస్తోందని వ్యాఖ్యానించింది. జీడిమెట్లలో భూగర్భ జలాలు కలుషితంపై పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. 799 ఫార్మా కంపెనీలు ఉంటే వాటిలో 708కే అనుమతి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ చెప్పారు. 24 కంపెనీలకు నోటీసులు, 2 కంపెనీలను మూసివేయాలని, అలాగే పలు కంపెనీలపై 23 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గత ఆరు నెలల్లోనే ఇన్ని కేసులు నమోదయ్యాయంటే కోర్టులో కేసు దాఖలైన తర్వాతే పీసీబీ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోందని తప్పుబట్టింది. శివారుల్లోని 220 బల్క్ డ్రగ్స్ యూనిట్స్లో చేసిన తనిఖీల నివేదికలను ఎందుకు వివరించలేదని ప్రశ్నిస్తూ తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది. -
రేడియో పరిశ్రమను ప్రభుత్వమే ఆదుకోవాలి
న్యూఢిల్లీ: కోరోనా దెబ్బకు అన్ని రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేడియో పరిశ్రమ ప్రతినిధులు సమస్యలను ప్రభుత్వానికి నివేదించారు. రేడియో ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, ఎఫ్ఎమ్ చానెల్స్ ప్రతినిధులు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర సమాచార మంత్రి ప్రకాష్ జవదేకర్కు లేఖలో వివరించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల ఫీజులను సంవత్సరం పాటు మినహాయించాలని లేఖలో ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ లేఖపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజులను వడ్డీ లేకుండా మూడు నెలలు పొడిగించనున్నట్లు తెలిపింది. కోరోనా కారణంగా రేడియా పరిశ్రమ ఏప్రిల్లో 80శాతం నష్టపోగా.. మే నెలలో 90శాతం నష్టపోయిందని ప్రతినిధులు వాపోయారు. లక్షలాది మందికి ఉపాధి కల్సిస్తున్న రంగంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం పరిశ్రమ 200కోట్ల నష్టాలను చవిచూసిందని.. సెప్టెంబర్ నాటికి 600 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చదవండి: జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలి : కేంద్ర మంత్రి -
భద్రతపై దృష్టి సారించాలి:కలెక్టర్ నివాస్
సాక్షి, శ్రీకాకుళం: పరిశ్రమల భద్రత, సురక్షిత అంశాలను పరిశీలించాలని కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల భద్రతపై తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదకర రసాయనాలు కలిగిన కర్మాగారాలను పరిశీలించాలని తెలిపారు. ప్రమాదకరమైన విష వాయువులు, రసాయన వ్యర్థాలను విడుదల చేసే పరిశ్రమలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అగ్నిమాపక కోణంలో కూడా తనిఖీ చేయాలని..పరిశ్రమలు విధిగా అన్ని సురక్షిత, భద్రతా చర్యలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న పరిశ్రమల్లో సిబ్బంది మాస్కులు కలిగి ఉండాలన్నారు. అగ్నిమాపక యంత్రాలు,ఫోమ్,నీటితో నియంత్రణ చేసే పరికరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. -
అన్ని పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక కార్యకలాపాలు అధిక స్థాయిల్లో ఉండే అన్ని జిల్లాల్లోనూ తక్షణమే అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లాక్డౌన్ జోన్లుగా గుర్తించే విషయంలో జిల్లాల ఆర్థిక ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రెడ్జోన్ ప్రాంతాల్లోనూ ఉన్నత స్థాయి భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో తెలియజేసింది. -
కోవిడ్-19 : కొలువులను కాపాడాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవడంతో కీలక రంగాలు ప్రభుత్వాల చేయూత కోసం వేచిచూస్తున్నాయి. కోట్లాది కొలువులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలతో కీలక రంగాలను ఆదుకోవాల్సి ఉంది. అత్యధిక ఉపాధిని సమకూర్చే పరిశ్రమలు, సంస్ధల మనుగడకు ఆర్థిక ప్యాకేజ్ను ప్రకటించి ప్రభుత్వం చేయూత ఇవ్వకుంటే పెద్దసంఖ్యలో ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం నెలకొంది. అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలు ప్రాణాంతక వైరస్ ధాటికి కుప్పకూలుతుంటే భారత ఆర్థిక వ్యవస్థ భారీ మాంద్యంలోకి జారుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎకానమీని కాపాడుకుంటూ కోట్లాది ఉద్యోగాలను నిలబెట్టేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం భారీ కసరత్తే చేయాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్లో భారత్లో నిరుద్యోగ రేటు భారీగా ఎగబాకిందని సీఎంఐఈ గణాంకాలు వెల్లడించాయి. మరికొద్ది నెలలు ఇదే పరిస్ధితి కొనసాగే పరిస్ధితి కనిపిస్తోంది. మాంద్య మేఘాలు ముసురుకున్న క్రమంలో దేశంలో ఐదు కీలక రంగాలకు ప్రభుత్వ ఊతం అవసరమని భావిస్తున్నారు. ఎంఎస్ఎంఈకి భరోసా ఇక భారత ఆర్థిక వ్యవస్ధకు వెన్నుదన్నుగా నిలిచి కోట్లాది ఉద్యోగాలను కల్పిస్తున్న చిన్న మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) ప్రభుత్వం భారీ ప్యాకేజ్ను ప్రకటించాలనే డిమాండ్ ముందుకొస్తోంది. దేశ జీడీపీకి మూలస్తంభాలైన తయారీ, ఎగుమతి రంగంలో నిమగ్నమైన ఎంఎస్ఎంఈ రంగం కోవిడ్-19 ప్రభావంతో విలవిలలాడుతోంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్ధితుల్లో ఆయా పరిశ్రమలు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దేశ జీడీపీలో 30 శాతంపైగా సమకూరుస్తున్న ఈ రంగానికి భారీ రిలీఫ్ ప్యాకేజ్ ప్రకటించాలని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు కోరతున్నారు. సత్వరమే ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించని పక్షంలో పలు చిన్న యూనిట్లు మూతపడే ప్రమాదం నెలకొంది. చదవండి : డబ్ల్యూహెచ్ఓకు చైనా భారీ సాయం! సంక్షోభంలో ఆతిథ్యం.. కోవిడ్-19 ప్రభావంతో ఆతిథ్య, పర్యాటక రంగాలకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వైరస్ వ్యాప్తి భయాలు, లాక్డౌన్ ఫలితంగా పర్యాటకుల రాకపోకలు నిలిచిపోయి ఈ రంగాలు కుదేలయ్యాయి. దేశంలో టూరిజం, ఆతిథ్య రంగం 3.8 కోట్ల ఉద్యోగాలను కోల్పోయిందని కేపీఎంజీ నివేదిక స్పష్టం చేసింది. మే 3వరకూ లాక్డౌన్ పొడిగించడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక టూరిజం రంగమూ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ఒక్క పౌరవిమానయాన రంగానికే రూ 5 లక్షల నష్టం వాటిల్లడంతో పాటు పర్యాటక రంగంలో 4 నుంచి 5 కోట్ల ఉద్యోగాలు దెబ్బతిన్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగాలకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం సత్వరమే ప్రోత్సాహక చర్యలు ప్రకటించాలి. విమానయాన, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలకు ఊతం.. ఈ రెండు ప్రధాన రంగాలతో పాటు కరోనా మహమ్మారితో కుదేలైన విమానయానం, ఆటోమొబైల్, రియల్ఎస్టేట్, నిర్మాణ రంగాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ఉద్దీపన ప్యాకేజ్లను ప్రకటించాలని పరిశ్రమ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు కోరుతున్నారు. పరిశ్రమలను కాపాడుకునేందుకు చొరవచూపితేనే కోవిడ్-19 ఎఫెక్ట్తో కళ్లముందు కనిపించే మహా పతనాన్ని కొంతమేర నివారించవచ్చు. -
మహమ్మారి ఎఫెక్ట్ : పతనం అంచున పరిశ్రమ
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని పరిశ్రమ సంస్థ ఫిక్కీ సర్వేలో వెల్లడైంది. గత కొద్దివారాలుగా మహమ్మారి ప్రభావంతో అంచనాలకు మించి ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయని, భవిష్యత్లోనూ వ్యాపారాలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలపై కోవిడ్-19 ప్రభావంపై అనిశ్చితి నెలకొందని ఫిక్కీ-ధ్రువ సర్వే తేల్చిచెప్పింది. కరోనా మహమ్మారి తమ వ్యాపారాలపై అధిక నుంచి అత్యధిక స్ధాయి ప్రభావాన్ని చూపతోందని సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ వ్యాపారాలకు సానుకూల డిమాండ్ నెలకొనే పరిస్ధితి లేదని కూడా సర్వేలో పాల్గొన్న వారిలో పలువురు పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు భారీగా పడిపోతాయని 70 శాతం మంది వెల్లడించారు. కరోనా మహమ్మారితో తమ వ్యాపారంలో నగదు ప్రవాహాలు కుచించుకుపోవడంతో పాటు ఆర్డర్లు గణనీయంగా తగ్గుతాయని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నిర్ధిష్ట ఆర్థిక ప్యాకేజ్తో సత్వరమే ముందుకురాని పక్షంలో పరిశ్రమ గడ్డుపరిస్ధితిని ఎదుర్కొంటుందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. తమ సంస్ధల్లో సిబ్బందిని తగ్గించాలని యోచిస్తున్నామని సర్వే పలుకరించిన వారిలో నాలుగింట మూడొంతుల మంది వెల్లడించడంతో రాబోయే నెలల్లో ఉద్యోగాలు పెద్ద ఎత్తున కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. చదవండి : కరోనాపై అంతుచిక్కని అంశాలు వ్యాపారాల విస్తరణకు పలు సంస్ధలు చేపట్టిన ప్రణాళికలూ కోవిడ్ మహమ్మారితో అటకెక్కాయని సర్వేలో వెల్లడైంది. ఇక ఫిక్కీ-ధ్రువ చేపట్టిన ఈ సర్వేలో పలు రంగాలకు చెందిన 380 కంపెనీలు పాలుపంచుకున్నాయి. కోవిడ్-19 ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమించిందని, దశాబ్ధాలుగా పారిశ్రామిక ఆర్ధిక వ్యవస్ధ సాధించిన ప్రయోజనాలను హరించివేసిందని ఫిక్కీ ప్రెసిడెంట్ డాక్టర్ సంగీతా రెడ్డి అన్నారు. ప్రజలు, ఉద్యోగాలు, సంస్ధలను కాపాడేందుకు పరిశ్రమను ఆదుకునేలా ప్రభుత్వం నుంచి తక్షణ సాయం అవసరమని పేర్కొన్నారు. వ్యాపారాలు సజావుగా సాగేందుకు సత్వరమే ద్రవ్య సరఫరా పెంచాలని సూచించారు. ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేలా డిమాండ్ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం ద్రవ్య ఉద్దీపన ప్యాకేజ్ను ప్రకటించడంతో పాటు లిక్విడిటీని పెంచడం, ట్యాక్స్ రిఫండ్లు, తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటి చర్యలు చేపట్టాలని ధ్రువ అడ్వైజర్స్ సీఈఓ దినేష్ కనబర్ కోరారు. -
ఫుడ్ పార్కుల్లో పెట్టుబడుల వేట
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ద్వారానే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం సాధ్యమవుతుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగు విస్తీర్ణం పెరగడం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత తదితరాల నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరిగే అవకాశముందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రైతులకు భరోసాతో పాటు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులతో దేశంలోకి కొత్తగా వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, కార్యకలాపాల విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహం అమలుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్, ఇండస్ట్రియల్ పార్కుల సమగ్ర సమాచారాన్ని పెట్టుబడులతో వచ్చే వారి కోసం పరిశ్రమల శాఖ సిద్ధం చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై కసరత్తు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పాలసీ’విధి విధానాలపై పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గాలను 21 క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో సాగయ్యే ప్రధాన, ఇతర పంటల వివరాలను సేకరించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సాగయ్యే పంటల వివరాలతో ‘స్టేట్ ఫుడ్ మ్యాప్’కూడా సిద్ధం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణలో ఇతర రాష్ట్రాల నుంచి ఎదురయ్యే పోటీకి సంబంధించిన నివేదికలు కూడా పరిశ్రమల శాఖ గతంలో రూపొందించింది. రాష్ట్రంలో నాలుగు మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుకు గతంలో కేంద్రం ఆమోదం తెలిపింది. నిజామాబాద్లో రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ప్రైవేటు మెగా ఫుడ్పార్కుకు 2018లో శంకుస్థాపన జరగ్గా, పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే రూ.14 వేల కోట్ల టర్నోవర్ సాధించడంతో పాటు 50 వేల మంది యువతకు ఉపాధి దక్కడమే కాకుండా సుమారు లక్ష మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఫుడ్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్లో ఫుడ్ పార్కులను అభివృద్ధి చేస్తోంది. బుగ్గపాడులో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బుగ్గపాడు సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)లో డ్రైవేర్ హౌజ్, డీప్ ఫ్రీజ్, సబ్ జీరో కోల్డ్ స్టోరేజీ ఛాంబర్ తదితరాల నిర్మాణం పూర్తయింది. బుగ్గపాడు సీపీసీకి అనుబంధంగా వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మంలో టీఎస్ఐఐసీ ద్వారా ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ల (సీపీసీ) నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ శివారులోని దండు మల్కాపూర్ పారిశ్రామిక పార్కుకు అనుబంధంగా సుమారు వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫుడ్ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణపై పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్ఐఐసీ దృష్టి సారించింది. రాష్ట్రం వైపు భారీ పరిశ్రమల చూపు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులతో ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చాయి. మనోహరాబాద్లో ఐటీసీ రూ.800 కోట్లు, బండ తిమ్మాపూర్లో ఆర్పీఎస్జీ సంస్థ రూ.200 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించాయి. సంగారెడ్డి జిల్లా గోవింద్పూర్లో రూ.207 కోట్ల పెట్టుబడితో హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్ లిమిటెడ్ దేశంలోని అతిపెద్ద ఐస్క్రీమ్ తయారీ ప్లాంటు అక్టోబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించనుంది. దీంతో పాటు డీఎక్స్ఎన్, కోకాకోలా, లులు గ్రూప్ తదితర సంస్థలు కూడా రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని బుగ్గపాడు, బండ మైలారం, బండ తిమ్మాపూర్ తదితర ఫుడ్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీలతో త్వరలో సమావేశం అయ్యేందుకు పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.