injury
-
స్టోక్స్... మూడు నెలలు ఆటకు దూరం
లండన్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఇటీవల న్యూజిలాండ్తో మూడో టెస్టు సందర్భంగా గాయపడ్డ స్టోక్స్... వచ్చే నెలలో శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. దీంతో మరో మూడు నెలల పాటు అతడు మైదానంలోకి దిగబోడని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి స్టోక్స్ దూరం కానున్నాడు. ఇప్పటికే ఆ టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు జట్టును ప్రకటించగా... అందులో 33 ఏళ్ల స్టోక్స్కు చోటు కల్పించలేదు. గతంలోనూ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డ స్టోక్స్... శ్రీలంక, పాకిస్తాన్తో సిరీస్లకు దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి అదే గాయం తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. -
స్టార్ హీరో ప్రభాస్ మళ్లీ గాయపడ్డాడా?
వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రభాస్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. గతేడాది 'సలార్', ఈ ఏడాది 'కల్కి 2898 ఏడీ' చిత్రాలతో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకున్న డార్లింగ్ హీరో.. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ (వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్లో పాల్గొంటున్నాడు. మరి ఎప్పుడు జరిగిందో గానీ ప్రభాస్ చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డాడట. ఈ విషయాన్ని స్వయంగా ఇతడే వెల్లడించినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం)'బాహుబలి' తర్వాత నుంచి ప్రభాస్ తన ప్రతి సినిమాను జపాన్లోనూ విడుదల చేస్తున్నాడు. రాబోయే జనవరి 3న 'కల్కి' జపాన్లో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఈ సినిమా ప్రీమియర్ కోసం ప్రభాస్ వెళ్లే ప్లాన్ ఫిక్సయింది. ఇప్పుడు ఇతడి చీలమండ బెణికిందని, దీంతో జపాన్ రాలేకపోతున్నానని జపనీస్ భాషలో ప్రభాస్ ఓ లెటర్ ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. గతంలో పలుమార్లు ప్రభాస్ గాయపడ్డాడు!ప్రభాస్ 'రాజాసాబ్' మూవీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికే చాలా షూటింగ్ పెండింగ్లో ఉందని, బహుశా ఈ తేదీకి రాకపోవచ్చనే రూమర్స్ నడుస్తున్నాయి. విడుదల తేదీ ఇంకా చాలా దూరముంది కాబట్టి ఇప్పుడే ఏం చెప్పలేం. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' చేస్తున్నాడు. దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' మూవీ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) -
జొకోవిచ్ దూరం
బెల్గ్రేడ్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ ఫైనల్స్ టైటిల్ను సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ ఈసారి నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈనెల 10 నుంచి 17 వరకు ఇటలీలోని ట్యూరిన్ నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. గాయం కారణంగా తాను ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనడంలేదని ప్రపంచ ఐదో ర్యాంకర్, డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మంగళవారం ప్రకటించాడు. ‘ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో ఆడాలని ఆసక్తితో ఎదురుచూశా. కానీ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ టోర్నీలో ఆడటంలేదు. నా ఆట చూసేందుకు ప్రణాళికలు చేసుకున్న వారికి క్షమించాలని కోరుతున్నాను. ఈ టోరీ్నలో ఆడబోతున్న ఆటగాళ్లందరికీ నా తరఫున శుభాకాంక్షలు. త్వరలో మళ్లీ కలుద్దాం’ అని జొకోవిచ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నాడు. ఏడుసార్లు విజేతగా... 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన ప్లేయర్గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ టైటిల్ను జొకోవిచ్ ఏడుసార్లు (2008, 2012, 2013, 2014, 2015, 2022, 2023) సొంతం చేసుకున్నాడు. స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (6 సార్లు) పేరిట ఉన్న రికార్డును గత ఏడాది జొకోవిచ్ బద్దలు కొట్టాడు. 37 విజయాలతో ముగింపు... ఇప్పటికే అత్యధికంగా 24 గ్రాండ్స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్గా గుర్తింపు పొందిన జొకోవిచ్ ఈ ఏడాది తన కెరీర్ను పరిపూర్ణం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తోన్న ఒలింపిక్స్ వ్యక్తిగత సింగిల్స్ స్వర్ణ పతకాన్ని అతను ‘పారిస్’లో అందుకున్నాడు.వింబుల్డన్ టోర్నీలో, షాంఘై మాస్టర్స్ టోర్నీలో ఫైనల్ చేరుకున్నా రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డాడు. ఓవరాల్గా ఈ ఏడాది జొకోవిచ్ 37 మ్యాచ్ల్లో గెలిచి, 9 మ్యాచ్ల్లో ఓడిపోయి మొత్తం 44,21,916 డాలర్ల (రూ. 37 కోట్ల 19 లక్షలు) ప్రైజ్మనీని గెల్చుకున్నాడు. -
తీవ్రంగా గాయపడిన 'కలర్ ఫోటో' హీరోయిన్
'కలర్ ఫోటో' మూవీతో హీరోయిన్గా బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి. చాందిని చౌదరి.. తీవ్రంగా గాయపడింది. ఆ విషయాన్ని ఈమెనే స్వయంగా బయటపెట్టింది. అయితే చాన్నాళ్ల క్రితం ఇది జరగ్గా.. తాను లైట్ తీసుకున్నానని ఇప్పుడు అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు)చాందిని ఏం చెప్పింది?'హలో.. నేను గత కొన్నిరోజుల నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేను. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం నాకు ఓ గాయమైంది. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా షూటింగ్స్లో పాల్గొన్నాను. ఇప్పుడు ఆ గాయం తిరగబెట్టింది. షూట్ కోసం వెళ్తుంటే గాయం వల్ల మరింత నొప్పిగా అనిపిస్తుంది. దీంతో అన్నింటికి కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మళ్లీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత సోషల్ మీడియాలోకి వస్తా' అని చాందిని చౌదరి ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.షార్ట్ ఫిల్మ్స్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన చాందిని చౌదరి.. టాలీవుడ్లోనూ హీరోయిన్గా పలు సినిమాలు చేసింది. ఈ ఏడాది గామి, మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ చిత్రాలతో వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ కొత్త మూవీలో నటిస్తోంది. బహుశా ఈమెకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు ఉంది. అందుకే కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకుంటానని చెప్పినట్లు అనిపిస్తోంది.(ఇదీ చదవండి: షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య) -
నేనోపాఠం నేర్చుకున్నాను
వ్యాయామాలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని, లేకపోతే తనలానే ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు రకుల్ప్రీత్ సింగ్. ఇంతకీ విషయం ఏంటంటే... వ్యాయామాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రకుల్ ఇటీవల హెవీ వర్కౌట్ చేశారు. ఈ కారణంగా ఆమెకు గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయంపై రకుల్ స్పందించారు. ‘‘నా ఆరోగ్యం గురించి నేనొక అప్డేట్ ఇస్తున్నాను. నేనొక పిచ్చి పని చేశాను. నా శరీరం చెప్పే మాటను నేను పట్టించుకోలేదు. హెవీ వర్కౌట్ చేశాను. ఇందుకు ఫలితంగా నేను గాయపడ్డాను.ఆరు రోజులుగా నేను బెడ్పై విశ్రాంతి తీసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో నేను కోలుకోవడానికి మరో వారం రోజులు పడుతుందనిపిస్తోంది. నేను తొందరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. ఎందుకంటే రెస్ట్ తీసుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. అలాగే నేనొకపాఠం కూడా నేర్చుకున్నాను. మీకు మీ శరీరం ఏదైనా సిగ్నల్ ఇచ్చినప్పుడు పట్టించుకోండి. తేలికగా తీసుకుని బలవంతంగా వర్కౌట్స్ చేయకండి. నాకు తెలిసి నా శరీరం కన్నా నా బ్రెయిన్ స్ట్రాంగ్ అనుకుంటున్నాను. కానీ అన్ని వేళలా ఇది వర్కౌట్ కాదు. ఇక నా మేలును ఆశించి నాకు సందేశాలు పంపుతున్న వారికి థ్యాంక్స్. నేను త్వరలోనే కోలుకుని, మరింత స్ట్రాంగ్గా వస్తాను’’ అని పేర్కొన్నారు రకుల్ ప్రీత్సింగ్. ఇదిలా ఉంటే.. 80 కేజీల బరువు ఎత్తడంవల్లే రకుల్కి గాయం అయిందని బాలీవుడ్ టాక్. -
ప్రపంచ చాంపియన్షిప్ లక్ష్యం
సొనెపట్: కొత్త సీజన్ను వంద శాతం ఫిట్నెస్తో ప్రారంభిస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. రెండు వరుస ఒలింపిక్స్లలో స్వర్ణ, రజత పతకాల విజేత అయిన 26 ఏళ్ల ఈ స్టార్ గాయం నుంచి కోలుకున్నట్లు చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో టాప్–3లో నిలవడమే లక్ష్యంగా శ్రమిస్తానని పేర్కొన్నాడు. బ్రస్సెల్స్లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో చోప్రా రెండో స్థానంలో నిలిచి సీజన్ను ఘనంగా ముగించాడు. హరియాణాలోని స్పోర్ట్స్ యూనివర్సిటీలో నిర్వహించిన ‘మిషన్ ఒలింపిక్స్–2036’ పాల్గొన్న నీరజ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఇప్పటిదాకా జరిగిన సీజన్ ముగిసింది. కొత్త సీజన్పై దృష్టి పెట్టాలి. ఇందులో పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. 2025లో టోక్యోలో జరిగే ప్రపంచ చాంపియన్íÙప్లో పతకమే లక్ష్యంగా సన్నాహాలు ప్రారంభించాల్సి ఉంది. ఒలింపిక్స్ అనేది ఎప్పటికైనా పెద్ద ఈవెంటే. కానీ దానికి ఇంకా నాలుగేళ్ల సమయముంది’ అని అన్నాడు. ఈ ఏడాది గాయంతో ఇబ్బంది పడిన తను ప్రస్తుతం కోలుకున్నానని చెప్పాడు. పూర్తిస్థాయి ఫిట్నెస్తో కొత్త సీజన్ బరిలోకి దిగుతానన్నాడు. సాంకేతిక అంశాలపై కూడా దృష్టి సారించినట్లు చెప్పిన చోప్రా జర్మన్ బయోమెకానిక్ నిపుణుడైన క్లాస్ బార్టొనిజ్తో కలిసి పురోగతి సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పాడు. స్వదేశంలోనూ శిక్షణ తీసుకోవచ్చని అయితే పోటీలు విదేశాల్లో ఉండటంతో అక్కడే ట్రెయినింగ్లో పాల్గొంటున్నానని వివరించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో వరుస ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు గెలిచిన భారత తొలి అథ్లెట్గా ఘనతకెక్కిన చోప్రా ఒలింపిక్స్లో ఆరు పతకాలే సాధించినా... ఎక్కువగా నాలుగో స్థానాలు వచ్చాయన్న సంగతిని గుర్తు చేశాడు. దీంతో ఒక్క స్వర్ణం లేకపోయినా మన ప్రదర్శన తీసికట్టుగా భావించాల్సిన అవసరం లేదన్నాడు. అయితే పారాలింపిక్స్లో మన పారా అథ్లెట్లు అసాధారణ స్థాయిలో పతకాలు సాధించారని అభినందించాడు. తదుపరి మెగా ఈవెంట్లలో భారత్ బలమైన జట్టుగా బరిలోకి దిగుతుందని, మరిన్ని పతకాలు సాధిస్తుందని చెప్పాడు. అంతకుముందు కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో నీరజ్ భేటీ అయ్యాడు. తాను సంతకం చేసిన జెర్సీని మంత్రికి నీరజ్ అందజేశాడు. -
'ఆ ప్రమాదం వల్లే యాక్టివ్గా లేను'.. పుష్ప భామ రష్మిక పోస్ట్ వైరల్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2లో కనిపించనుంది. బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంలో శ్రీవల్లిగా మరోసారి అభిమానులను అలరించనుంది. పుష్పకు సీక్వెల్గా వస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంద డి చేయనుంది. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన షూటింగ్ పెండింగ్లో ఉండడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా రష్మిక చేసిన ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తెలిపింది. ఎందుకంటే గత నెల రోజులుగా యాక్టివ్గా లేకపోవడానికి ఓ కారణం ఉందని వెల్లడించింది. నాకు చిన్న ప్రమాదం జరిగిందని.. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని శ్రీవల్లి చెప్పుకొచ్చింది. డాక్టర్ల సలహాతో కోలుకున్నానని.. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొంది. ఇకనుంచి నా రోజువారీ కార్యకలాపాలతో యాక్టివ్గా ఉంటానని రాసుకొచ్చింది.అంతే కాకుండా 'మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి.. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది.. రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు.. అందుకే ప్రతి రోజు సంతోషంగా జీవించండి' అంటూ అభిమానులకు సలహా ఇచ్చింది ముద్దుగుమ్మ. త్వరలోనే ఫుల్గా లడ్డులు తింటూ మరో అప్డేట్ ఇస్తానని ఫన్నీగా పోస్ట్ చేసింది రష్మిక. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Hey guys🥰How've you been?💛I know it's been a whileeeee since I came on here or was even seen in the public.. 🏃🏻♀️➡️The reason I haven't been very active in last month is because I had a little accident, (a minor one) and I was recovering and was staying at home as I was… pic.twitter.com/TrTieza3eM— Rashmika Mandanna (@iamRashmika) September 9, 2024 -
ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్.. ట్వీట్ వైరల్
తెలుగు స్టార్ హీరో రవితేజ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయమై ట్విటర్లో పోస్ట్ పెట్టాడు. సర్జరీ సాఫీగా సాగిందని, విజయవంతంగా పూర్తయిందని.. దీంతో డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నాడు. అందరి ఆశీర్వాదాలు, మద్ధతుకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)రీసెంట్గా 'మిస్టర్ బచ్చన్' సినిమాతో వచ్చిన రవితేజ.. ప్రస్తుతం భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. షూటింగ్లో భాగంగా రవితేజ గాయపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేశారు. అయితే రవితేజ గాయపడిన ఫొటో ఇదేనంటూ ఓ ఫేక్ పిక్ని తెగ వైరల్ చేశారు. ఇప్పుడు డిశ్చార్జ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్) -
ఎన్టీఆర్కి రోడ్డు ప్రమాదం అని రూమర్స్.. టీమ్ క్లారిటీ
'దేవర' షూటింగ్ ఎన్టీఆర్ పూర్తి చేశాడు. తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో అభిమానులు మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఇతడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడని రూమర్స్ వచ్చాయి. ఇవి నిజం కాదని స్వయంగా తారక్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: నాగచైతన్య ఎంగేజ్మెంట్.. అతనితో సమంత డేటింగ్!)కొన్నిరోజుల క్రితం జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఎడమ చేయి మణికట్టు దగ్గర కాస్త బెణికిందని, కానీ దాన్ని భరిస్తూనే 'దేవర' షూటింగ్ పూర్తి చేశారని.. దీనికి బదులు రోడ్డు ప్రమాదమని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ ఎవరూ నమ్మొద్దని ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పుకొచ్చారు.'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చేస్తున్నాడు. సెప్టెంబరు 27న తొలి పార్ట్ థియేటర్లలోకి రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా, అవి రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. నెక్స్ట్ ఏం ప్రమోషనల్ కంటెంట్ వస్తుందా అని ఫ్యాన్స్ వెయిటింగ్.(ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ దేవర.. అప్డేట్ ఇచ్చిన యంగ్ టైగర్!) -
హీరో సూర్యకు గాయం
హీరో సూర్య స్వల్పంగా గాయపడ్డారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ గ్యాంగ్స్టర్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. సూర్య, జ్యోతిక, కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోందని కోలీవుడ్ టాక్. అక్కడ ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించే సమయంలో సూర్య తలకు గాయం అయిందనే వార్తలు వచ్చాయి.దీంతో సూర్యకు ఏమైందోనని ఆయన అభిమానులు కంగారుపడ్డారు. అయితే అది చిన్న గాయమేనని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సూర్య అన్న బాగానే ఉన్నారని ఈ చిత్రం సహ–నిర్మాతల్లో ఒకరైన రాజశేఖర్ పాడియన్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. దీంతో సూర్య అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
హీరో సూర్య తలకు గాయం.. నిర్మాత క్లారిటీ!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వర్కింగ్ టైటిల్ సూర్య44 పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్లో హీరో సూర్యకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయనకు తలకు బలమైన గాయమైనట్లు కోలీవుడ్లో వార్తలు రావడంతో ఫ్యాన్స్కు షాక్కు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చిత్ర నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్న ట్విటర్ వేదికగా పంచుకున్నారు.నిర్మాత రాజశేఖరన్ పాండియన్ సోషల్ మీడియా వేదికగా సూర్య గాయంపై స్పందించారు. సూర్యకు గాయమైన మాట వాస్తవమేనని.. అయితే చిన్నదేనని తెలిపారు. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని.. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా.. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే ఊటీలో ప్రారంభమైంది. సూర్యకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సూర్య నటించిన భారీ యాక్షన్ చిత్రం కంగువా అక్టోబరు 10న విడుదల కానుంది.Dear #AnbaanaFans, It was a minor injury. Pls don’t worry, Suriya Anna is perfectly fine with all your love and prayers. 🙏🏼— Rajsekar Pandian (@rajsekarpandian) August 9, 2024 -
ఓటమి బాధలో ఉన్న విండీస్కు బిగ్ షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
టీ20 వరల్డ్కప్ గ్రూపు స్టేజిలో అజేయంగా నిలిచిన వెస్టిండీస్కు సూపర్-8లో బిగ్ షాక్ తగిలింది. సెయింట్ లూసియా వేదికగా ఇంగ్లండ్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఓటమి పాలైంది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విండీస్ బౌలర్లు విఫలమయ్యారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్( 7 ఫోర్లు, 5 సిక్స్లతో 87 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్తో మ్యాచ్ను ఫినిష్ చేశాడు.విండీస్కు బిగ్ షాక్..ఇక ఓటమి బాధలో ఉన్న కరేబియన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ బ్రాండెన్ కింగ్ గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కింగ్ గాయపడ్డాడు. సామ్కుర్రాన్ బౌలింగ్లో కవర్స్ దిశగా షాట్ ఆడే సమయంలో కింగ్ పక్కటెముకలకు గాయమైంది. దీంతో హఠాత్తుగా తీవ్రమైన నొప్పితో కింగ్ విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడి నొప్పి మాత్రం తగ్గలేదు. దీంతో ఫిజియో సాయంతో కింగ్ మైదానాన్ని వీడాడు. అతడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. అయితే కింగ్ గాయంపై విండీస్ క్రికెట్ బోర్డు ఎటువంటి ప్రకటన చేయలేదు. విండీస్ తమ తదుపరి మ్యాచ్లో జూన్ 22న అమెరికాతో తలపడనుంది. -
గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్కు మయాంక్ దూరం
పదునైన పేస్ బౌలింగ్తో ఈ ఐపీఎల్లో వెలుగులోకి వచ్చిచన మయాంక్ యాదవ్ మిగతా సీజన్కు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న ఈ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మిగిలిన మ్యాచ్లు ఆడే అవకాశం లేదని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగిన 21 ఏళ్ల మయాంక్ తొలి రెండు మ్యాచ్లలో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషించి ఐపీఎల్లో ఆడిన తొలి రెండు మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ప్రతీ మ్యాచ్లో 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ సత్తా చాటిన అతను గాయంతో మూడో మ్యాచ్ మధ్యలో తప్పుకున్నాడు. ఆ తర్వాత లక్నో ఆడిన ఐదు మ్యాచ్లకు దూరమైన అతను కోలుకొని ముంబైతో మ్యాచ్లో మళ్లీ బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో తన నాలుగో ఓవర్లో ఒక బంతి వేయగానే గాయం తిరగబెట్టడంతో మెదానం వీడాడు. లక్నో ప్లే ఆఫ్స్కు చేరితే మయాంక్ ఆడే అవకాశాలు ఉన్నాయని భావించినా... ఇప్పుడు ఆ అవకాశం లేదని తేలిపోయింది. -
రాహుల్ అవుట్
రాజ్కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్కోట్లో జరుగుతుంది. రాజ్కోట్కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్లతో పాటు పార్ట్టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
ఆస్పత్రి పాలైన 'దేవర' విలన్.. ఇంతకీ కారణం ఏంటంటే?
'దేవర' సినిమాలో విలన్గా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి పాలయ్యాడు. బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. గతేడాది 'ఆదిపురుష్' విలన్గా నటించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే షూటింగ్లో భాగంగా ఈ మధ్య సైఫ్కి గాయాలయ్యాయని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇతడు ఆస్పత్రిలో చేరడంతో అది నిజమని తేలింది. (ఇదీ చదవండి: సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) ప్రస్తుతం 'దేవర' షూటింగ్ చివరి దశలో ఉంది. అయితే కొన్నాళ్ల ముందు యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు విలన్గా చేస్తున్న సైఫ్.. మోకాలి, భూజానికి గాయాలయ్యాయట. అయితే అప్పుడు పెద్దగా తెలియలేదు గానీ ఇప్పుడు ఆ గాయాలు సీరియస్ కావడంతో ముంబయిలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరాడు. అయితే గతంలో సైఫ్కి గాయమైందట. తాజాగా అది తిరగబెట్టడంతో ట్రైసప్(కండ) సర్జరీ కచ్చితంగా చేయాల్సి వచ్చిందట. అలా ఇప్పుడు ఆ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో హీరోగా అప్పట్లో హిట్స్ కొట్టిన సైఫ్.. ఇప్పుడు సరైన సినిమాలు పడకపోయేసరికి రూట్ మార్చాడు. ప్రతినాయక పాత్రలైనా సరే ఒప్పుకొంటున్నాడు. అలా గతేడాది ప్రభాస్ 'ఆదిపురుష్'లో రావణుడిగా కనిపించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ 'దేవర' చిత్రంలో భైరా అనే పాత్రలో నటిస్తున్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
ఆస్ట్రేలియన్ ఓపెన్కు నాదల్ దూరం
స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్ ఈనెల 14 నుంచి 28 వరకు జరిగే సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్కు నాదల్ దూరం నుంచి వైదొలిగాడు. కెరీర్లో 22 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన 37 ఏళ్ల నాదల్ గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తుంటి గాయంతో ఏడాదిపాటు ఆటకు దూరమయ్యాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ టోర్నీతో నాదల్ పునరాగమనం చేశాడు. ఈ టోర్నీ లో జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన నాదల్ ఈ మ్యాచ్ సందర్భంగా ఎడమ కాలి కండరాల గాయానికి గురయ్యాడు. -
టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆల్రౌండర్కు గాయం
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్రౌండర్గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని ఎడమ భుజానికి గాయమైంది. వెంటనే జట్టు ఫిజియో ఐస్ ప్యాక్తో ఉపశమన సపర్యలు చేశాడు. అనంతరం మళీ ప్రాక్టీస్కు దిగలేదు. దీంతో అతను కేప్టౌన్లో జనవరి 3 నుంచి జరిగే ఆఖరి టెస్టుకు దూరమయ్యే అవకాశముంది. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు శార్దుల్ భుజానికి స్కానింగ్ తీయాల్సి ఉంది. దీన్నిబట్టే అతను అందుబాటులో ఉంటాడ లేదా అనే విషయంపై స్పష్టత వస్తుంది. సఫారీ బౌలర్ కొయెట్జీ అవుట్ దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ రెండో టెస్టుకు దూరమయ్యాడు. 23 ఏళ్ల బౌలర్ పొత్తికడుపు నొప్పితో సతమతమవుతున్నాడు. ఈ నొప్పితోనే తొలిటెస్టు ఆడటంతో వాపు మొదలైందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో కొయెట్జీ కేప్టౌన్ టెస్టుకు అందుబాటులో లేడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. ఇదివరకే రెగ్యులర్ కెపె్టన్ బవుమా కూడా గాయంతో రెండో టెస్టుకు గైర్హాజరు కానున్నాడు. కొయెట్జీ స్థానాన్ని ఎన్గిడి, ముల్డర్లలో ఒకరితో భర్తీ చేసే అవకాశముంది. -
ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డా: మెగాస్టార్ ట్వీట్
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ సార్కు గాయమైందన్న విషయం తెలిసి చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. ఆయనకు శస్త్ర చికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని మెగాస్టార్ ఆకాంక్షించారు. ఇప్పటికే సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. కేసీఆర్ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగా 156 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బింబిసార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టిన వశిష్ఠ చాలా గ్యాప్ తీసుకుని పక్కా ప్లాన్తో చిరంజీవి కోసం కథ సిద్ధం చేశారు. యూవీ క్రియేషన్స్ ద్వార విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Deeply pained to learn about the injury suffered by Sri KCR garu! Wishing him a successful surgery and a very speedy recovery. — Chiranjeevi Konidela (@KChiruTweets) December 8, 2023 -
గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!
లియో మూవీ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్లో అదరగొడుతోంది. ప్రస్తుతం రూ.400 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రమోషన్స్లో భాగంగా ఫ్యాన్స్ని కలవడానికి వెళ్లిన లోకేశ్ గాయపడటం కాస్త కలవరపాటుకి గురిచేసింది. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?) 'లియో'తో కలిపి లోకేశ్ కనగరాజ్ తీసింది జస్ట్ ఐదు సినిమాలే. కానీ దక్షిణాదిలో కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తమిళ హీరోలందరినీ కలిపి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తీస్తుంటడమే ఇందుకు కారణం. లోకేశ్ తీసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు.. ఈ యూనివర్స్లో భాగమే. ఇకపోతే 'లియో' సక్సెస్లో భాగంగా కేరళలోని పాలక్కాడ్ వెళ్లాడు లోకేశ్. పాలక్కాడ్లోని అరోమా థియేటర్కి వెళ్లి ఫ్యాన్స్తో కలిసి లియో సినిమా చూశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన అభిమానులతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువమంది జనాలు వచ్చేసరికి పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో తనకు గాయమైందని లోకేశ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. మరోసారి త్వరలో కేరళ వస్తానని అన్నాడు. అతడి ట్వీట్ బట్టి చూస్తుంటే గాయం చిన్నదే అనిపిస్తుంది. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను: రేణు దేశాయ్) Thank you Kerala for your love.. Overwhelmed, happy and grateful to see you all in Palakkad. ❤️ Due to a small injury in the crowd, I couldn’t make it to the other two venues and the press meeting. I would certainly come back to meet you all in Kerala again soon. Till then… pic.twitter.com/JGrrJ6D1r3 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 24, 2023 Director lokesh at palakkad,aroma theatre 🤩 " Thalapathy enna sonnaru nu kettaralama when lokesh said he is going to kerala "🤩😍 @actorvijay na come here one time na 🙂 #Leo #LeoIndustryHit pic.twitter.com/87TQJd9kDf — Hari Vj Fanatic (@Vijayfanzh) October 24, 2023 -
హార్దిక్ పాండ్యాకు గాయం
ప్రపంచకప్ వేటలో ఉన్న భారత శిబిరంలో కాస్త ఆందోళన పెంచే ఘటన మైదానంలో జరిగింది. బంగ్లాతో మ్యాచ్లో బౌలింగ్ చేస్తూ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. తన తొలి ఓవర్ మూడో బంతిని బ్యాటర్ దాస్ నేరుగా ఆడగా బంతిని ఆపే ప్రయత్నంలో పాండ్యా తన కాలును బాగా ముందుకు జరిపాడు. ఈ క్రమంలో అతని చీలమండ భాగం మడత పడింది. దాంతో అతను నొప్పితో విలవిల్లాడాడు. ప్రాథమిక చికిత్స చేసినా లాభం లేకపోవడంతో అలాగే మైదానం వీడాడు. కొద్ది సేపటికే ఈ మ్యాచ్లో అతను బౌలింగ్ చేయడని బీసీసీఐ ప్రకటించింది. అతని కాలికి స్కాన్ నిర్వహించినట్లు తెలిసింది. దాని ఫలితాలపై పూర్తి సమాచారం లేకున్నా మ్యాచ్ తర్వాత రోహిత్ ‘పెద్దగా ప్రమాదం ఏమీ లేకపోవడం మాకు ఊరట. అయితే ప్రతీ రోజు గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తారు’ అని స్పష్టతనిచ్చాడు. పాండ్యా తప్పుకోవడంతో ఆ ఓవర్లో మిగిలిన మూడు బంతులను కోహ్లి బౌల్ చేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి ముందు 2017లో శ్రీలంకపై చివరిసారిగా కోహ్లి బౌలింగ్ చేశాడు. -
ప్రపంచకప్కు నసీమ్ షా దూరం!
వచ్చే నెలలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ జట్టుకు గట్టి దెబ్బ తగిలే అవకాశముంది. ఆ జట్టు యువ పేస్ బౌలర్ నసీమ్ షా ఈ మెగా ఈవెంట్ మొత్తానికి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నసీమ్ షా భుజానికి గాయమైంది. ఈ గాయానికి స్కాన్లు నిర్వహించారు. గాయం తీవ్రతదృష్ట్యా నసీమ్ షా మూడు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశముందని తెలిసింది. 20 ఏళ్ల నసీమ్ పాక్ తరఫున 14 వన్డేలు ఆడి 32 వికెట్లు తీశాడు. -
కాజోల్కు ఏమైంది?.. ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్!
బాలీవుడ్ భామ కాజోల్ ఇటీవలే ది ట్రయల్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సిరీస్లో లాయర్ పాత్రలో మెప్పించింది. ఈ సిరీస్లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంటోంది. ది గుడ్ వైఫ్ అనే అమెకరిన్ సిరీస్కు రీమేక్గా తెరకెక్కించారు అయితే బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ను పెళ్లాడిన భామ.. ఇటీవలే 49వ పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా కాజోల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి వారే వ్యక్తుల గురించి మాట్లాడతారు.. సోనమ్ పోస్ట్ వైరల్! ) ఆమె మోచేతికి కర్ర (ఎల్బో క్రచ్) సాయంతో నడుస్తూ వీడియో కనిపించింది. కాజోల్ తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. కెమెరాల కంటికి చిక్కింది. దీంతో ఆమె ఫ్యాన్స్ కాజోల్కు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. వీడియోలో గమనిస్తే కాజోల్ కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అంతే కాకుండా గాయంతోనే షూటింగ్కు వెళుతున్నట్లు సమాచారం. కాగా.. కాజోల్ మిస్టరీ థ్రిల్లర్ దో పట్టిలో కృతి సనన్తో కలిసి నటించనుంది. ఈ ప్రాజెక్ట్ నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కానుంది. (ఇది చదవండి: ఆ హీరోయిన్కి క్షమాపణలు చెప్పిన రానా) View this post on Instagram A post shared by Snehkumar Zala (@snehzala) -
'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్లో ప్రమాదం.. సంజయ్ దత్కు గాయాలు!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని నటిస్తోన్న తాజా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2019లో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ సినిమా మాస్ ఆడియన్స్ను ఎంతో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ నటిస్తోంది. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాని పూరి కనెక్ట్స్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పూరి 'ఇస్మార్ట్ శంకర్' వచ్చేస్తున్నాడు.. ఈసారి బాలీవుడ్ హీరోయిన్) అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్లాండ్లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్లో సంజయ్ దత్కు గాయాలైనట్లు తెలుస్తోంది. కత్తితో ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించే సమయంలో సంజయ్ దత్ గాయపడినట్లు సమాచారం. అతని తలకు గాయం కాగా.. రెండు కుట్లు పడినట్లు చిత్రబృందం తెలిపింది. అయినప్పటికీ అతను వెంటనే సెట్కి తిరిగి వచ్చి షూటింగ్ని ప్రారంభించాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పటికే ముంబయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. రెండో షెడ్యూల్ థాయ్లాండ్లో కొనసాగుతోంది. కాగా.. సంజయ్ దత్ కేజీఎఫ్-2 చిత్రంలో కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కాగా.. జూలైలో మేకర్స్ సంజయ్ దత్ పాత్రను 'బిగ్ బుల్'గా అభిమానులకు పరిచయం చేశారు. అతని ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ చిత్రం మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఇప్పటికే రామ్- బోయపాటి కాంబోలో భారీ యాక్షన్ మూవీ 'స్కంద' చేస్తున్నాడు. దీనిని సెప్టెంబర్ 15న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నారు. (ఇది చదవండి: తీసింది నాలుగు సినిమాలు.. అన్నింటికీ సీక్వెల్స్ చేస్తానంటున్న డైరెక్టర్) -
Yadamma Raju Leg Injury Video: నడవలేని స్థితికి చేరుకున్న ఏదమ్మరజు
-
స్టార్ హీరో షారుక్ ఖాన్కి యాక్సిడెంట్!
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్కి ప్రమాదం జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఓ సీన్ సందర్భంగా గాయమైంది. దీంతో హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దగా ప్రమాదం లేదని చెప్పినప్పటికీ.. మైనర్ సర్జరీ అవసరమని సూచించారట. ప్రస్తుతం షారుక్.. స్వదేశానికి వచ్చేశారని, రెస్ట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో) షారుక్కి యాక్సిడెంట్ నేషనల్ మీడియా కథనాల ప్రకారం.. తన కొత్త సినిమా షూటింగ్ కోసం కొన్నాళ్ల ముందు షారుక్ లాస్ ఏంజెల్స్ వెళ్లారు. ఓ సన్నివేశం తీస్తున్న క్రమంలోనే ఆయన ముక్కుకి తీవ్ర గాయమైంది. డాక్టర్స్ అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో త్వరగానే డిశ్చార్జ్ అయిపోయారు. కానీ మైనర్ సర్జరీ చేయాలని సూచించారు. ఈ ప్రమాదం కొన్నిరోజుల క్రితమే జరిగనప్పటికీ.. ఇప్పుడు ఈ విషయం లీక్ అయింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ షారుక్ క్షేమంగానే ఉన్నారని తెలిసి రిలాక్స్ అయ్యారు. 'జవాన్' కోసం వెయిటింగ్ దాదాపు ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన షారుక్ ఖాన్.. 'పఠాన్'తో బ్లాక్బ్లస్టర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' మూవీ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ అట్లీతో చేసిన 'జవాన్' విడుదలకు రెడీగా ఉంది. ఇది సెప్టెంబరు 7న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేశాయి. ఇలా షారుక్ సినిమాల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. గాయమైందనే వార్త కాస్త కలవరపరిచింది. (ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్తో!) -
షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి అర్చన గౌతమ్. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తోంది. ఈ షో షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. తాజాగా జరిగిన షూటింగ్లో అర్చనా గౌతమ్కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో వెల్లడించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోలను పంచుకుంది నటి. (ఇది చదవండి: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!) అర్చన గడ్డం కింద బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ఆమె గాయానికి వైద్యులు కుట్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ షోలో ధైర్యవంతులైన కంటెస్టెంట్లలో అర్చన గౌతమ్ ఒకరు. డేరింగ్ స్టంట్ చేస్తుండగానే తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. షూటింగ్ ప్రారంభమైన కొన్ని వారాల్లోనే రోహిత్ బోస్ రాయ్, అంజుమ్ ఫకీ అర్జిత్ తనేజా, ఐశ్వర్య శర్మ, నైరా బెనర్జీ పలువురు విన్యాసాలు చేస్తూ గాయపడ్డారు. కాగా.. అర్చన గౌతమ్ ఇటీవల హర్ష్ లింబాచియా షో ఎంటర్టైన్మెంట్ కా రాత్-హౌస్ఫుల్లో కనిపించింది. రాజకీయ నాయకురాలైన అర్చనా 'బిగ్ బాస్- 16'లో మరింత గుర్తింపు సాధించింది. (ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!) View this post on Instagram A post shared by khatron ke khiladi 13 Khabri (@kkk13_biggbossott2.tazakhabar) -
WTC Final: రోహిత్ శర్మకు గాయం..? టీమిండియా అభిమానుల ఆందోళన
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు ముందు రోజు ఓ షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. ఇన్ని రోజులు గాయాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండిన భారత ఆటగాళ్లు, మ్యాచ్కు కొద్ది గంటల సమయం మాత్రమే ఉందనగా దెబ్బలు తగిలించుకున్నారు. నిన్న ప్రాక్టీస్ సందర్భంగా ఇషాన్ కిషన్ స్వల్పంగా గాయపడగా.. తాజాగా (ఇవాళ) జట్టు సారధి రోహిత్ శర్మ చేతి వేలికి దెబ్బతగిలించుకున్నాడు. గాయం తీవ్రత తదితర విషయాలపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ రోహిత్ ఎడమ చేతి వేలికి బ్యాండ్ ఎయిడ్ చుట్టుకుంటూ కనిపించిన ఓ దృశ్యం ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసి భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫైనల్ మ్యాచ్కు హిట్మ్యాన్ అందుబాటులో ఉంటాడా లేదా అని విచారించుకుంటున్నారు. రోహిత్ గాయంపై పూర్తి సమాచారం కొరకు గూగుల్ చేస్తున్నారు. రోహిత్ గాయం వార్త నిజమా లేక ఫేక్ న్యూసా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ప్రముఖ వార్తా సంస్థల కథనాల ప్రకారం.. ఇవాళ ఉదయం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా రోహిత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. అనంతరం హిట్ మ్యాన్ ప్రాక్టీస్కు రాకుండా రెస్ట్ తీసుకున్నాడు. రోహిత్ చేతి వేలికి స్కానింగ్ కూడా చేసినట్లు సమాచారం. కాగా, రేపటి (జూన్ 7) నుంచి జూన్ 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చాలా రోజులుగా కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు జట్లలోని ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ఆసీస్ తరఫున హాజిల్వుడ్, తాజాగా టీమిండియా తరఫున రోహిత్ శర్మ గాయపడ్డారు. మరి హిట్మ్యాన్ మ్యాచ్ సమయానికి అందుబాటులో ఉంటాడా లేక గాయం వార్త ఫేక్ న్యూసా తేలాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే. తుది జట్లు (అంచనా).. ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, కెమరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ (వికెట్కీపర్), పాట్ కమిన్స్, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్, మిచెల్ స్టార్క్ టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్ చదవండి: WTC Final: ఆస్ట్రేలియా తుది జట్టులో నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలర్ -
WTC ఫైనల్ లో ఆస్ట్రేలియాకి కోలుకోలేని దెబ్బ స్టార్ పేసర్ అవుట్
-
ధోని సర్జరీ, అసలు విషయం చెప్పిన CSK సీఈఓ..!
-
చరిత్రలో తోలి సారి కంకషన్ సబ్ స్టిట్యూట్
-
WTC ఫైనల్ కి ముందు కోహ్లి గాయం...అడతాడ లేదా..
-
జైలు బాత్రూమ్లో కుప్పకూలిన సత్యేంద్ర జైన్.. ఆసుపత్రి తరలింపు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆయన గురువారం ఉదయం తీహార్ జైలులోని బాత్రూమ్లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో, జైలు అధికారులు సత్యేంద్ర జైన్ను వెంటనే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. కాగా, జైన్ గడచిన వారం రోజుల్లో అనారోగ్యంతో రెండుసార్లు ఆసుపత్రిలో చేరారు. తీహార్ జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సత్యేంద్ర జైన్ తన వార్డులోని బాత్రూమ్లో పడిపోయారు. దీనికిముందు మే 22న అనారోగ్యం కారణంగా సత్యేంద్ర జైన్ను ఢిల్లీ పోలీసులు సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చారు. అయితే, బాత్రూమ్లో పడిపోవడంతో ఆయన వెన్నముకకు గాయమైనట్టు తెలుస్తోంది. కాగా, మాజీ మంత్రి జైన్ మనీ లాండరింగ్ కేసులో నిందితునిగా ఉన్నారు. అందులో భాగంగానే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Jailed AAP leader Satyendar Jain admitted to hospital after slipping in washroom#satyendrajain #AAP https://t.co/6L82iMxk83 — Kalinga TV (@Kalingatv) May 25, 2023 ఇది కూడా చదవండి: పార్లమెంట్: రాజ్యసభలో రెడ్, లోక్సభలో గ్రీన్ కార్పెట్.. ఎందుకో తెలుసా? -
షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్ఖాన్కు గాయాలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గాయపడ్డాడు. సినిమా షూటింగ్లో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా సల్మాన్ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ తెలిపారు. ఎడమ భుజానికి గాయమైనట్లుత తెలుపుతూ ఓ ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు.దీంతో గెట్ వెల్ సూన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం సల్మాన్ ‘టైగర్-3’షూటింగ్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సీక్వెల్గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీలో సల్మాన్పై భారీ యాక్షన్ సీన్స్ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా సల్మాన్ భుజానికి గాయమైంది. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్లో రజనీకాంత్, కపిల్ దేవ్.. నెట్టింట ఫోటో వైరల్ అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఓ యాక్షన్ సీన్ కూడా ఉండనుందట. ఇటీవలె కిసీకా భాయ్ కిసీకి జాన్తో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్కు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. దీంతో టైగర్-3 కోసం బాగానే కసరత్తులు చేస్తున్నాడు ఈ కండల వీరుడు. Wen u think u r carrying the weight of the world on your shoulders , he says duniya ko chodo paanch kilo ka dumbbell utha ke dikhao .Tiger Zakhmi Hai . #Tiger3 pic.twitter.com/nyNahitd24 — Salman Khan (@BeingSalmanKhan) May 18, 2023 -
#Rafael Nadal: తిరగబెట్టిన గాయం.. ఫ్రెంచ్ ఓపెన్కు దూరం
స్పెయిన్ బుల్.. టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్కు దూరమయ్యాడు. దీనికి తుంటి ఎముక గాయం తిరగబెట్టడమే కారణమని తెలిసింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్లో తుంటి గాయంతో టోర్నీ మధ్యలోనే నాదల్ వైదొలిగాడు. అప్పటినుంచి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. తాజాగా మరోసారి గాయం తిరగబెట్టడంతో గురువారం తాను ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం లేదని నాదల్ స్వయంగా స్పష్టం చేశాడు. కాగా 2004 నుంచి వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ ఆడుతూ వస్తున్న నాదల్ తనకు అచ్చొచ్చిన గ్రాండ్స్లామ్కు దూరమవ్వడం ఇదే తొలిసారి. క్లేకోర్టు రారాజుగా అభివర్ణించిన నాదల్ ఇప్పటివరకు 22 గ్రాండ్స్లామ్ టైటిల్స్ కొల్లగొడితే.. అందులో 14 టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్లే కావడం విశేషం. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్లో 115 మ్యాచ్లు ఆడిన నాదల్ 112 మ్యాచ్లు గెలిచి కేవలం మూడు మాత్రమే ఓడిపోయాడు. దీన్నిబట్టే ఫ్రెంచ్ ఓపెన్లో నాదల్ ఆధిపత్యం ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇక 2024 ఏడాదిలో నాదల్ టెన్నిస్ కెరీర్కు ముగింపు పలికే అవకాశాలు ఉన్నట్లు AFP ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు 22 గ్రాండ్స్లామ్స్ కొల్లగొట్టిన నాదల్.. అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ విషయంలో జొకోవిచ్తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. -
'కెరీర్ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'
ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో గతేడాది ఆగస్టులో ప్రమాదవశాత్తూ గాయపడిన సంగతి తెలిసిందే. గోల్ఫ్ ఆడే క్రమంలో స్టిక్ కాలికి బలంగా తగలడంతో బెయిర్ స్టోకు తీవ్ర గాయాలయ్యాయి. కాలికి సర్జరీ అనంతరం ఎనిమిది నెలల పాటు విశ్రాంతి తీసుకొని కోలుకున్నాడు. ఈ కారణంగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్కు దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ మినీ వేలంలో బెయిర్ స్టోను రూ. 6.75 కోట్లకు దక్కించుకుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న బెయిర్ స్టోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వచ్చే నెలలో ఐర్లాండ్తో జరగనున్న ఏకైక టెస్టుకు ఎంపికచేసింది. నిజానికి బెయిర్ స్టో గాయపడే సమయానికి కెరీర్లో పీక్ ఫామ్లో ఉన్నాడు. తనను మళ్లీ జట్టులోకి ఎంపిక చేయడంపై బెయిర్ స్టో స్పందించాడు. ఏదో కాలక్షేపం కోసం ఆడిన గోల్ఫ్ తన కెరీర్ను తలకిందులు చేసిందని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. '' నిజానికి మళ్లీ నడుస్తాననుకోలేదు.. ఎందుకంటే కాలికి గోల్ఫ్ స్టిక్ బలంగా తగిలింది. ఇక జీవితంలో జాగ్ చేయడం, నడవడం, పరిగెత్తడం చేయలేకపోవచ్చనుకున్నా. ఈ దెబ్బతో క్రికెట్కు దూరమైనట్లేనని భావించా. గాయం నుంచి కోలుకునే సమయంలో నా మైండ్లో అన్ని ఇవే ఆలోచనలు. కానీ మన ఆలోచనలే సగం భయాన్ని కలిగిస్తాయి. ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తావో నీలోని ఆందోళన మొత్తం తొలిగిపోతుంది అని డాక్టర్లు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి సూచనలను సీరియస్గా తీసుకొని వర్కౌట్స్ చేశా. వంద శాతం ఫలితం వచ్చింది. కానీ ఇంతకముందులా మైదానంలో పరుగులు తీయగలనా.. ఫీల్డింగ్ చేయగలనా అనే సందేహం ఉండేది. కానీ ఫిట్నెస్ పరంగా తీసుకున్న జాగ్రత్త చర్యలు నాలోని భయాన్ని మొత్తం పోగొట్టాయి.'' అంటూ తెలిపాడు. చదవండి: #RileeRossouw: అచ్చొచ్చిన స్థానం.. మించినోడు లేడు -
తీవ్ర గాయం.. ప్రమాదంలో పాక్ క్రికెటర్ భవితవ్యం!
పాకిస్తాన్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో ఇన్నింగ్స్ 21వ ఓవర్ మహ్మద్ నవాజ్ వేశాడు. ఓవర్ తొలి బంతిని డారిల్ మిచెల్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో నవాజ్ చేతి వేలికి తగిలింది. బంతి వేగంగా రావడంతో అతని చూపుడు వేలు విరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నొప్పితో విలవిల్లాడిపోయిన నవాజ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి వేలిని పరిశీలించగా.. బోన్ బ్రేక్ అయినట్లు గుర్తించాడు. దీంతో నవాజ్ను సిబ్బంది ఆసుపత్రికి తరలించి ఎక్స్-రే తీయించారు. కాగా రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. గాయం తీవ్రత ఎంతనేది తెలియకపోయినప్పటికి వేలు విరిగితే మాత్రం అతని కెరీర్ ప్రమాదంలో పడినట్లే. సర్జరీ జరిగినప్పటికి చూపుడు వేలు గ్రిప్ కోల్పోయే అవకాశం ఉండడంతో భవిష్యత్తులో మహ్మద్ నవాజ్ బౌలింగ్ వేసే చాన్స్ తక్కువగానే ఉంటుంది. కేవలం బ్యాటింగ్కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్తాన్ వరుసగా మూడో వన్డేలోనూ విజయం సాధించి మరో రెండు మ్యాచ్లు ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. పాకిస్తాన్కు 2011 తర్వాత న్యూజిలాండ్పై వన్డే సిరీస్ గెలవడం మళ్లీ ఇదే. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ 90, బాబర్ ఆజం 54 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్ 49.1 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌట్ కావడంతో పాక్ 26 పరుగులతో విజయాన్ని అందుకుంది. టామ్ బ్లండల్ 65, కొల్ మెక్నికొంచి 64, టామ్ లాథమ్ 45 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీమ్లు తలా రెండు వికెట్లు తీశారు. Yaar ye kya hogya 😭 The main finger of M Nawaz has been broken yaar ☹️🥺💔 Plzz remember him in ur prayers to comeback as quick as possible 🙏🤲❤️#BabarAzam𓃵 #NaseemShah #PAKvNZ #muhammadNawaz @Awaisii6 pic.twitter.com/NPOors4m0i — 𝘽𝙖𝙗𝙖𝙧 ⁵⁶ × 𝘼𝙞𝙢𝙖𝙡 ¹¹ ⚡ (@Aymalkhan_112) May 3, 2023 చదవండి: ఐపీఎల్లో 16 సీజన్లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా? -
బిగ్షాక్.. ఐపీఎల్కు కేఎల్ రాహుల్ దూరం!
లక్నో సూపర్జెయింట్స్ జట్టుకు బిగ్షాక్ తగిలింది. గాయంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ టోర్నీకి మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. సోమవారం ఆర్సీబీతో మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీలైన్ వద్ద బంతిని ఆపేందుకు పరిగెడుతూ.. మైదానంలో కుప్పకూలాడు. దీంతో తొడ కండరానికి గాయం కావడంతో లేవడానికి ఇబ్బంది పడ్డాడు. ఫిజియోలు వచ్చి స్ట్రెచర్పై రాహుల్ను తీసుకెళ్లారు. అయితే లక్నో బ్యాటింగ్ సమయంలో ఆఖర్లో వచ్చిన రాహుల్ పరిగెత్తడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పీటీఐ సమాచారం మేరకు.. ''కేఎల్ రాహుల్ ప్రస్తుతం లక్నో జట్టుతో ఉన్నప్పటికి సీఎస్కేతో మ్యాచ్కు దూరంగా ఉండనున్నాడు. సీఎస్కేతో మ్యాచ్ పూర్తవ్వగానే జట్టును వీడనున్న రాహుల్ ముంబైకి వెళ్లనున్నాడు. అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో వైద్యులు స్కానింగ్ నిర్వహించనున్నారు. రిపోర్ట్స్ ద్వారా వచ్చే ఫలితంపై కేఎల్ రాహుల్ ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రానుంది. ''ఒకవేళ రాహుల్ గాయంలో తీవ్రత ఎక్కువగా ఉంటే ఐపీఎల్ టోర్నీ మొత్తానికే దూరం కానున్నాడు. ఐపీఎల్ తర్వాత జరగనున్న ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేది కూడా అనుమానమే.కాగా ఆర్సీబీతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్లో గాయపడిన లక్నో బౌలర్ జయదేవ్ ఉనాద్కట్ ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ పర్యవేక్షణలోనే ఉన్నాడు.'' అని పేర్కొంది. లక్నోకు ఎదురుదెబ్బే? ఈ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన లక్నో ప్రస్తుతం ఓటములతో సతమతమవుతోంది. ఈ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు ఉనాద్కట్ దూరమవ్వడం లక్నోకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ప్రస్తుతం లక్నోకు స్టాండిన్ కెప్టెన్గా ఉన్న కృనాల్ పాండ్యా.. కేఎల్ రాహుల్ దూరమైతే మిగతా మ్యాచ్ల్లోనే అతనే జట్టును నడిపించనున్నాడు. రాహుల్ దూరమైతే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశం ఎవరికి? ఇక జూన్ 7 నుంచి 11 వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు ఎంపిక చేసిన టీమిండియా జట్టులో రాహుల్ సభ్యుడిగా ఉన్నాడు. గాయంతో కేఎల్ రాహుల్ దూరమైతే అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ దూరమైతే.. సర్ఫరాజ్ ఖాన్, ఇషాన్ కిషన్, హనుమ విహారిలలో ఎవరో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని అభిమానులు పేర్కొన్నారు. We didn't win on the night, but one man won hearts everywhere. 💙 KL, we love you. Get well soon, skip! 🫶 pic.twitter.com/1x896mj9dF — Lucknow Super Giants (@LucknowIPL) May 2, 2023 చదవండి: 'నా చివరి ఐపీఎల్ అని మీరే డిసైడ్ అయ్యారా?' -
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనలకు శ్రేయాస్ అయ్యర్ దూరం
-
షూటింగ్లో పేలుడు.. సంజయ్ దత్కి గాయాలు? అసలు నిజమిదే
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కన్నడ సినిమా ‘కేడీ’ షూటింగ్లో గాయపడ్డారంటూ బుధవారం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్గా మారింది. ధృవ సర్జా హీరోగా జోగి ప్రేమ్ దర్శకత్వంలో ‘కేడీ: ది డెవిల్’ చిత్రం రూపొందుతోంది. బెంగళూరు సమీపంలోని మాగడి వద్ద వేసిన సెట్లో ఇటీవల ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్ సీన్స్ తీస్తుండగా సంజయ్ దత్కి గాయాలైనట్లు వార్త గుప్పుమంది. అయితే ఈ వార్త నిజం కాదని సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ‘‘నాకు గాయాలైనట్లు వచ్చిన వార్త అవాస్తవం. నేను ప్రస్తుతం ‘కేడీ’ షూటింగ్లో పాల్గొంటున్నాను. యూనిట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అన్నారు సంజయ్ దత్. There are reports of me getting injured. I want to reassure everyone that they are completely baseless. By God’s grace, I am fine & healthy. I am shooting for the film KD & the team's been extra careful while filming my scenes. Thank you everyone for reaching out & your concern. — Sanjay Dutt (@duttsanjay) April 12, 2023 -
అదే జరిగితే పుండు మీద కారం చల్లినట్లే..!
ఐపీఎల్ 16వ సీజన్ను ఐదుసార్లు ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఎప్పటిలాగే ఓటమితో ప్రారంభించింది. ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. గాయాల కారణంగా బుమ్రా, జై రిచర్డ్సన్ లాంటి టాప్ బౌలర్లు ముంబై ఇండియన్స్కు దూరమవ్వడం జట్టు ఓటమిపై ప్రభావితం చేసింది. అయితే తాజాగా ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా మోచేతి గాయంతో బాధపడుతున్నాడని.. శనివారం రాత్రి సీఎస్కేతో మ్యాచ్కు అతను దూరమయ్యాడంటూ మాజీ క్రికెటర్ బద్రీనాథ్ తన యూట్యూబ్ చానెల్లో పేర్కొన్నాడు. సొంత స్టేడియంలో మ్యాచ్ ఆడబోతున్న ముంబై ఇండియన్స్కు ఇది షాకింగ్ లాంటి వార్త. మోచేతి గాయంతో బాధపడుతున్న ఆర్చర్ సీఎస్కేతో మ్యాచ్కు దూరమయినట్లు తెలుస్తోంది. ఇది సీఎస్కేకు సానుకూలాంశంగా మారనుంది. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. ఒకవేళ ఆర్చర్ గాయం నిజమైతే మాత్రం ముంబై ఇండియన్స్కు ఇది పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది. కాగా ఆర్చర్ ఆర్సీబీతో మ్యాచ్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 4 ఓవర్లు వేసి 33 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే ఆర్చర్ ప్రస్తుతం ముంబైకి ప్రధాన బౌలర్గా ఉన్నాడు. అయితే జోఫ్రా ఆర్చర్ గాయంపై ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ క్లారిటీ ఇచ్చాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ఫిట్గా ఉన్నారని.. ఎవరు గాయపడలేదు. ఎవరైనా ఆటగాడు గాయపడినా ముంబై ఇండియన్స్ అధికారికరంగా ప్రకటించేవరకు వేచి చూడడం మంచిది అంటూ తెలిపాడు. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, జై రిచర్డ్సన్లు అందుబాటులో లేకపోవడంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ బలహీనంగా తయారైంది. -
బిగ్బాస్ ఫేం అఖిల్కు గాయం.. ఆసుపత్రిలో చేరిక
బిగ్బాస్ ఫేమ్ అఖిల్ సార్థ్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. రెండుసార్లు(బిగ్బాస్-4, బిగ్బాస్ ఓటీటీ)లలో రన్నరప్గా నిలిచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అఖిల్ ప్రస్తుతం ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పర్ఫార్మెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తేజస్వి మదివాడతో కలిసి జంటగా పాల్గొని డ్యాన్స్ దుమ్మురేపుతున్నాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలనే కసితో ఉన్న అఖిల్కు ఈసారి కూడా ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అఖిల్ తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎప్పటినుంచో నాకు ఈ బాధ ఉంది. కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు. కానీ సాంగ్ పర్ఫెర్మెన్స్ చేస్తున్నప్పుడు కూడా నొప్పితోనే చేశాను. నా గాయాలు బయటకు కనపించనందున ఎవరికి నచ్చినట్లు వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నా. నా కడుపు కింది భాగంలో తీవ్రవైన నొప్పితో బాధపడుతున్నాను. ఇప్పటికే ఆలస్యం చేయడంతో అది మరింత నన్ను బాధిస్తుంది. నేను, తేజు మా సాయశక్తులా కష్టపడ్డాం. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో నేను షో నుంచి బయటకు వచ్చేశాను. ఇంకా షాకింగ్ విశేషమేమిటంటే మేం బాటమ్2లో ఉన్నాం. అయినా ఏం పర్లేదు. మరో అద్భుతమైన షోతో మళ్లీ మిమ్మల్ని త్వరలోనే అలరిస్తాను అంటూ అఖిల్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
గాయం... ఓ మంచి బహుమతి
గాయం తియ్యగా ఉంటుందా... మనసు తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. కొందరు కథానాయికలు కొన్ని గాయాలను అలానే తీసుకున్నారు. పవర్ఫుల్ రోల్స్ చేసేటప్పుడు అయిన గాయాలను ‘బహుమతి’గా, ‘తియ్యని గాయం’లా అనుకుంటున్నారు. ‘ఆగేదే లేదు’ అంటూ దూసుకెళుతున్నారు. ఆ నాయికల గురించి తెలుసుకుందాం. యాక్షన్కి దక్కిన బహుమతి ఒకవైపు మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేసి, దాదాపు కోలుకున్న సమంత మరోవైపు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్లో పో రాట సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్లో పవర్ఫుల్ రోల్ చేస్తున్న సమంత హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత షూట్లో పా ల్గొన్నారు. అయితే యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు ఆమె రెండు చేతులకు గాయాలయ్యాయి. మంగళవారం ఆ ఫోటోను షేర్ చేసి, ‘యాక్షన్కి దక్కిన బహుమతి ఇది’ అని పేర్కొన్నారు సమంత. ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కి ఇండియన్ వెర్షన్గా వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్లో రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ని తెరకెక్కిస్తున్నారు. నొప్పిని మరచి... గాయం చిన్నదైనా పెద్దదైనా నొప్పి మాత్రం కామన్. అయితే త్రిష మాత్రం గాయం తాలూకు నొప్పి తెలియలేదు అంటున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొ న్నియిన్ సెల్వన్’ షూట్లో తగిలిన గాయాల గురించే త్రిష ఈ విధంగా అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు ప్రధాన తారాగణంగా రెండు భాగాలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం పొ న్నియిన్ సెల్వన్’. తొలి భాగం గత ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కాగా మలి భాగం ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఇందులో యువరాణి కుందవై పా త్ర చేశారు త్రిష. పో రాట సన్నివేశాల్లో నటించినప్పుడు తన చేతులకు గాయాలయ్యాయని, శోభిత (పొ న్నియిన్...’లో ఓ కీలక పా త్రధారి) చెవులకు కూడా గాయం అయిందని త్రిష పేర్కొన్నారు. అయితే గాయాల తాలూకు నొప్పిని మరచిపో యి షాట్ గ్యాప్లో కబుర్లు చెప్పుకుని, ఆ తర్వాత షూటింగ్లో పా ల్గొనేవాళ్లమని త్రిష పేర్కొన్నారు. అలాగే పొ న్నియిన్ సెల్వన్’ తన జీవితంలో ఓ మంచి జ్ఞాపకం అని కూడా అన్నారామె. తియ్యని గాయం ‘క్రికెట్ చూడ్డానికి ఎగ్జయిటింగ్గా ఉంటుంది కానీ ఆడేటప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో’ అంటున్నారు జాన్వీ కపూర్. రాజ్కుమార్ రావ్, జాన్వీ కపూర్ క్రికెటర్లుగా కనిపించనున్న చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’. ఈ సినిమాలోని పా త్ర కోసం టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద శిక్షణ తీసుకున్నారు జాన్వీ. ఇటీవల తన పా త్రకు సంబంధించిన షూట్ని పూర్తి చేశారీ బ్యూటీ. ఈ సందర్భంగా ఈ సినిమా తనకు ఎప్పటికీ మరచిపో లేని అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నారామె. ‘‘ఈ సినిమా కోసం కెమెరా ముందు క్రికెట్ ఆడినప్పుడు రెండు సార్లు నా భుజానికి గాయం అయింది. ఎముక పొషన్ మారింది. అయినప్పటికీ తియ్యని గాయం అనుకుంటున్నాను. ఒంటరిగా కూర్చుని నేను చేసిన సినిమాల గురించి ఆలోచించుకున్నప్పుడు కచ్చితంగా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ ముందు గుర్తొస్తుంది. ఇది నాకు అపురూపమైన సినిమా’’ అన్నారు జాన్వీ. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. గాయంతోనే షూటింగ్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది వాక్సిన్ వార్’. ఈ చిత్రంలో కీలక పా త్ర చేస్తూ, ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు పల్లవీ జోషి. ఆ మధ్య ఈ చిత్రం చివరి షెడ్యూల్ హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్లో జరిగింది. ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా వాహనం అదుపు తప్పడంతో పల్లవీ జోషికి స్వల్ప గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆ సన్నివేశం పూర్తి చేశాకే ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్లారు. ఈ నాయికలే కాదు.. ఆ మధ్య టబు, శిల్పా శెట్టి వంటి తారలు కూడా షూటింగ్స్లో గాయపడ్డారు. -
వెబ్ సిరీస్ షూటింగ్ లో సమంత చేతికి గాయాలు
-
వార్నర్ కూడా అవుట్
న్యూఢిల్లీ: భారత పర్యటనలో మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా ఆ్రస్టేలియా కష్టాలు కొనసాగుతున్నాయి. కాలి కండరాల గాయంతో ఇప్పటికే పేస్ బౌలర్ హాజల్వుడ్ సిరీస్ నుంచి తప్పుకొని స్వదేశానికి వెళ్లిపోగా... హాజల్వుడ్ సరసన తాజాగా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా చేరాడు. రెండో టెస్టులో గాయపడ్డ వార్నర్ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోని మిగతా రెండు టెస్టులకూ దూరమయ్యాడు. అతను స్వదేశానికి పయనమవుతాడని, అయితే వచ్చే నెలలో జరిగే మూడు వన్డేల సిరీస్కల్లా జట్టుకు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. ‘ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో వార్నర్ మోచేతికి ఫ్రాక్చర్ అయింది. వైద్య పరీక్షల అనంతరం గాయం తీవ్రత దృష్ట్యా పూర్తిగా కోలుకునేందుకు పునరావాస శిబిరానికి పంపాలని సీఏ నిర్ణయించింది. నాలుగు టెస్టుల సిరీస్ ముగిశాక జరిగే వన్డే సిరీస్ ఆడతాడని బోర్డు అంచనా వేస్తుంది’ అని సీఏ తెలిపింది. 36 ఏళ్ల ఓపెనర్ ఈ పర్యటనలో నిరాశ పరిచాడు. మైదానంలో గాయపడటంతో అతని స్థానంలో కన్కషన్ సబ్స్టిట్యూట్గా రెన్షా బరిలోకి దిగాడు. మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్లో, నాలుగో టెస్టు 9 నుంచి అహ్మదాబాద్లో జరుగుతుంది. -
తీవ్ర గాయం.. స్ట్రెచర్పై వెస్టిండీస్ ప్లేయర్
వెస్టిండీస్ మహిళా సీనియర్ క్రికెటర్ స్టెఫానీ టేలర్ తీవ్రంగా గాయపడింది. మహిళల టి20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ రమ్హాక్రాక్ వేసింది. ఓవర్ ఆఖరి బంతిని హర్మన్ప్రీత్ కౌర్ షార్ట్ఫైన్ దిశగా ఆడింది. షార్ట్ఫైన్లోనే ఫీల్డింగ్ చేస్తున్న స్టెఫానీ టేలర్ బంతిని త్రో వేద్దామని ప్రయత్నించింది. అయితే పట్టు తప్పి జారిపడడంతో కాలు బెణికినట్లయింది. దీంతో మైదానంలో కూలబడింది. టేలర్ పైకి లేవడానికి ఇబ్బంది పడడంతో వెంటనే మెడికల్ సిబ్బంది స్ట్రెచర్పై ఆమెను గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆటకు కాసేపు విరామం ఇచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మహిళల టి20 ప్రపంచకప్లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్-బిలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్కు ఇది రెండో పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీమిండియా తొలి బౌలర్గా -
Australian Open: బిగ్షాక్.. రఫేల్ నాదల్ ఓటమి
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో డిఫెండింగ్ చాంపియన్.. స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్(ప్రపంచ రెండో ర్యాంకర్) పోరు ముగిసింది. 23వ గ్రాండ్స్లామ్ అందుకోవాలన్న కల తీరకుండానే నాదల్ రెండో రౌండ్లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో భాగంగా బుధవారం నాదల్.. అమెరికాకు చెందిన అన్సీడెడ్ మెకంజీ మెక్డొనాల్డ్ చేతిలో 4-6,4-6,5-7 స్కోర్తో ఓటమి పాలయ్యాడు. నాదల్ నిష్రమణకు గాయం కూడా ఒక కారణం. ఎడమకాలికి గాయం అయినప్పటికి బై ఇవ్వడానికి ఇష్టపడని నాదల్ మ్యాచ్లో బరిలోకి దిగాడు. నొప్పితో సరిగా ఆడలేకపోవడంతో మెకంజీ తొలి రెండు సెట్లు ఈజీగా గెలిచేశాడు. మూడోసెట్ ఆడుతుండగా నాదల్ మరోసారి గాయంతో ఇబ్బంది పడ్డాడు. అప్పటికే మెకంజీ మూడో సెట్లో 7-5తో స్పష్టమైన ఆధిక్యంలో నిలవడంతో నాదల్ సర్వీస్ చేయకుండా పక్కకు తప్పుకున్నాడు. దీంతో మెకంజీ మెక్డొనాల్డ్ మూడోరౌండ్లో అడుగుపెట్టాడు. Mission accomplished for @mackiemacster 🇺🇸 The impressive American has beaten Nadal 6-4 6-4 7-5. @wwos • @espn • @eurosport • @wowowtennis • #AusOpen • #AO2023 pic.twitter.com/fkaTpk11te — #AusOpen (@AustralianOpen) January 18, 2023 Always a pleasure, @RafaelNadal 🫶#AusOpen • #AO2023 pic.twitter.com/CdnOMzYDK0 — #AusOpen (@AustralianOpen) January 18, 2023 చదవండి: మాజీ బాయ్ఫ్రెండ్ మొహం చూడకూడదని గోడ కట్టించింది -
IPL 2023: ముంబై ఇండియన్స్కు భారీ షాక్! 17 కోట్ల ‘ఆల్రౌండర్’ దూరం?!
IPL 2023- Mumbai Indians- Cameron Green: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ మినీ వేలం-2023లో ఏకంగా 17 కోట్లు పెట్టి కొన్న ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ కొన్నాళ్లపాటు కేవలం బ్యాటర్గానే సేవలు అందించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 13 వరకు అతడు స్పెషలిస్టు బ్యాటర్గా మాత్రమే అందుబాటులో ఉంటాడని, ఆ తర్వాతే అతడు బౌలింగ్ చేస్తాడని సమాచారం. ఒకవేళ ఏదేని కారణాల చేత టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడకపోతే మాత్రం ఐపీఎల్లో తొలి మ్యాచ్ నుంచి బౌలింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వేలికి గాయం! దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో భాగంగా గ్రీన్ కు గాయమైన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడి చేతి వేలికి బంతి బలంగా తాకింది. రక్తం కూడా కారడంతో రిటైర్డ్హర్ట్గా వెనుదిరిగాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ చేశాడు. అనంతరం ఎక్స్రేకు వెళ్లగా వేలు విరిగినట్లు తేలింది. దీంతో అతడు ప్రొటిస్తో మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక ఈ సిరీస్ తర్వాత ఆసీస్.. భారత పర్యటనకు రానుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో టెస్టు, వన్డే సిరీస్లు ఆడనుంది. గాయం ఇబ్బంది పెడితే.. ఈ నేపథ్యంలో వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా గ్రీన్ గనుక టెస్టు సిరీస్ ఆడితే.. నాలుగు వారాల పాటు అతడు బౌలింగ్కు దూరంగా ఉంటాడని సీఏ గతంలో పేర్కొంది. అయితే, ఇప్పుడు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. భారత పర్యటన నాటికి కోలుకుంటే టీమిండియాతో సిరీస్లో ఆడతాడు.. గాయం ఇబ్బంది పెడితే ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లకూ దూరమయ్యే అవకాశం లేకపోలేదు. కాగా వేలంలో ముంబై గ్రీన్ కోసం 17.5 కోట్లు ఖర్చు చేయగా అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితాలో అతడు రెండో స్థానంలో నిలిచాడు. చదవండి: Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం! IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
చేతి వేలికి ఫ్రాక్చర్ కాలేదు.. ఎముక పక్కకు జరిగింది: రోహిత్ శర్మ
బుధవారం ఢాకా వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో భారత్ పరజాయం పాలైంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అఖరి వరకు పోరాడనప్పటికీ జట్టును గెలిపించకలేకపోయాడు. కాగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో రోహిత్ ఫీల్డింగ్ చేస్తుండగా కుడి చేతి బొటనవేలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్ను విడిచి వెళ్లిన రోహిత్ చికిత్స చేయించుకుని తిరిగి బ్యాటింగ్లో 9వ స్థానంలో వచ్చాడు. అఖరిలో బ్యాటింగ్కు వచ్చిన హిట్మ్యన్ ఒక వైపు నొప్పిని భరిస్తునే.. బంగ్లా ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు. చివరి ఓవర్లో 20 రన్స్ అవసరం కాగా.. ముస్తఫిజుర్ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. ఈ క్రమంలో అఖరి బంతికి 6 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్ ఒక్క పరుగు కూడా సాధించ లేకపోయాడు. దీంతో రోహిత్ విరోచిత పోరాటం వృధా అయిపోయింది. ఈ మ్యాచ్లో 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 5 సిక్స్లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా గాయపడిన రోహిత్ ఈ సిరీస్లో అఖరి వన్డేకు దూరమయ్యాడు. టెస్టులకు కూడా అతడి అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఇక మ్యాచ్ అనంతరం తన గాయం గురించి రోహిత్ శర్మ అప్డేట్ ఇచ్చాడు. తన వేలికి ఫ్రాక్చర్ అయితే కాలేదని, ఎముక కాస్త జరిగినట్లు రోహిత్ తెలిపాడు." నిజం చెప్పాలంటే చాలా నొప్పితోనే ఈ మ్యాచ్ బ్యాటింగ్ చేశాను. నా బొటనవేలు సరిగ్గా లేదు. వేలి ఎముక కాస్త పక్కకు జరిగింది. కొన్ని కుట్లు పడ్డాయి. అయితే దేవుడు దయవల్ల ఫ్రాక్చర్ మాత్రం కాలేదు. అందుకే నేను బ్యాటింగ్ వచ్చాను. ప్రతీ మ్యాచ్లోనూ పాజిటివ్, నెగెటివ్లు ఉంటాయి. కానీ 70 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఉన్న బంగ్లాను 270 పరుగుల వరకు రానివ్వడం కచ్చితంగా బౌలర్ల విఫలమే అని" రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: రోహిత్ భయ్యా నీ ఇన్నింగ్స్కు హ్యాట్సప్.. ఓడిపోయినా పర్వాలేదు -
రోహిత్ భయ్యా నీ ఇన్నింగ్స్కు హ్యాట్సాఫ్.. ఓడిపోయినా పర్వాలేదు
బంగ్లాదేశ్తో జరగిన రెండో వన్డే భారత్ ఓటమి పాలైనప్పటికీ... కెప్టెన్ రోహిత్ శర్మ విరోచిత పోరాటానికి మాత్రం అభిమానులు పిధా అయిపోయారు. ఒక వైపు బొటన వేలి గాయంతో భాదపడతునే అఖరి బంతి వరకు రోహిత్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. హిట్మ్యాన్ తన సునామీ ఇన్నింగ్స్తో బంగ్లా జట్టుకు చెమటలు పట్టించాడు. అఖరి బంతికి భారత విజయం సాధించాలంటే ఒక సిక్సర్ అవసరమైంది. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మన్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. 5 సిక్స్లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తద్వారా సిరీస్ను కూడా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0తో బంగ్లా సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం పెవిలియన్కు నడుస్తున్న రోహిత్ను ప్రత్యర్థి జట్టు అభిమానులు సైతం చప్పట్లతో అభినందించారు. అదే విధంగా విరోచిత ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "రోహిత్ భయ్యా నీ ఇన్నింగ్స్కు హ్యాట్సప్.. ఓడిపోయినా మాకు ఏ బాధ లేదంటూ" నెటిజన్లు ట్విటర్లో పోస్టులు చేస్తున్నారు. What a fight with injured thumb🙏🏽🙏🏽🙏🏽🙏🏽 #RohitSharma#Respect pic.twitter.com/pQpYTMVgNS — vennela kishore (@vennelakishore) December 7, 2022 🙌 𝐎 𝐜𝐚𝐩𝐭𝐚𝐢𝐧, 𝐦𝐲 𝐜𝐚𝐩𝐭𝐚𝐢𝐧! 💙 We are proud to have such an inspiring leader! 👏 Chin up, Skip. You did your best! 📷 Getty • #RohitSharma #INDvBAN #BANvIND #TeamIndia #BharatArmy pic.twitter.com/OvEonl3rAG — The Bharat Army (@thebharatarmy) December 7, 2022 చదవండి: Ind VS BAN: వారెవ్వా! రోహిత్ అరుదైన రికార్డ్.. ప్రపంచ క్రికెట్లో రెండో ఆటగాడిగా.. -
టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం! ఆసుపత్రికి తరలింపు..
బంగ్లాదేశ్తో రెండో వన్డే సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. బంగ్లా ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో నాలుగో బంతిని అనముల్ హక్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బంతి ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. స్లిప్లో క్యాచ్ పట్టే క్రమంలో రోహిత్ శర్మ చేతి వేలికి గాయమైంది. దీంతో రోహిత్ నొప్పితో వెంటనే ఫీల్డ్ను వదిలి వెళ్లాడు. అతడి స్థానంలో రజిత్ పటిదార్ సబ్స్ట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చాడు. అయితే గాయపడిన రోహిత్ను వెంటనే స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరిలించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. రెండో వన్డే ఫీల్డింగ్ సందర్భంగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ బొటన వేలికి గాయమైంది. Update: India Captain Rohit Sharma suffered a blow to his thumb while fielding in the 2nd ODI. The BCCI Medical Team assessed him. He has now gone for scans. pic.twitter.com/LHysrbDiKw — BCCI (@BCCI) December 7, 2022 బీసీసీఐ వైద్య బృందం అతడిని స్కానింగ్ కోసం పంపించింది అంటూ బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ బ్యాటింగ్కు వచ్చేది అనుమానంగా మారింది. కాగా రెండో వన్డేలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. కీలక మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని రోహిత సేన భావిస్తోంది. pic.twitter.com/SoOLqQYLn1#RohitSharma — Shivam Rajvanshi (@social_timepass) December 7, 2022 చదవండి: Rohit Sharma: ఒక్క మ్యాచ్కే తప్పించారా? కుల్దీప్ను పక్కనపెట్టడానికి కారణమిదే! -
ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు భారీ షాక్!
ఇంగ్లండ్తో తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు బిగ్ షాక్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ గాయం కారణంగా సిరీస్లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టు సందర్భంగా రౌఫ్ రెడ్బాల్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ చారిత్రాత్మక టెస్టులో మొదటి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా రౌఫ్ కుడి కాలికి గాయమైంది.అనంతరం అతడిని ఆసుపత్రికి తరిలించి స్కాన్ చేయించగా గాయం తీవ్రమైనదిగా తేలింది. దీంతో అతడికి దాదాపు నెల రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు సమచారం. ఈ క్రమంలోనే హరీస్ మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇక గాయపడిన రౌఫ్ స్థానంలో ఫహీమ్ అష్రఫ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు రౌఫ్ దూరం కావడం పాక్ను కలవరపెడుతోంది. ఇక ఇది ఇలా 17 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఓటమి చవిచూసింది. ఈ చారిత్రాత్మక టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ముల్తాన్ వేదికగా డిసెంబర్ 9 నుంచి జరగనుంది. చదవండి: World Test Championship: పాకిస్తాన్కు ఊహించని షాక్.. ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం! మరి టీమిండియా పరిస్థితి? -
నడవలేని స్థితిలో బుట్టబొమ్మ.. ఫోటో వైరల్..!
అందాల భామ, బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇటీవల ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆమెకు కాలుకు బలమైన గాయం కావడంతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ఎడమకాలి పాదం గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా ఆమె వాకర్ పట్టుకుని నడక ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సల్మాన్ ఖాన్తో నటిస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమా షూటింగ్ సమయంలో నటి పూజా హెగ్డేకు గాయమైంది. ఆమె చివరిసారిగా విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రంలో కనిపించింది. (చదవండి: పూజా హెగ్డే ఐరన్ లెగ్ సెంటిమెంట్!) ఆ ఫోటోలో పూజా హెగ్డే.. నర్సు సాయంతో వాకర్ పట్టుకుని నడక ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. వాకర్ పట్టుకుని స్టెప్స్ వేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇన్స్టాలో హ్యాండిల్లో రాస్తూ..' నేను నా జీవితంలో రెండవ సారి నడక నేర్చుకుంటున్నాను. దీన్ని తలుచుకుంటేచాలా ఫన్నీగా ఉంది.' అంటూ రాసుకొచ్చింది బుట్టబొమ్మ. పూజా హెగ్డే తదుపరి చిత్రం మహేష్ బాబుతో జతకట్టనుంది. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఆమె రణ్వీర్ సింగ్ నేతృత్వంలోని హిందీ మూవీ 'సర్కస్'లోనూ కనిపించనుంది. -
ఆస్పత్రిలో షాహీన్ ఆఫ్రిది.. ఫోటో షేర్ చేసిన స్పీడ్ స్టర్!
ఇంగ్లండ్తో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ స్పీడ్స్టార్ షాహీన్ షా అఫ్రిది మెకాలి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ను వీడిన సంగతి తెలిసిందే. అయితే అతడు కేవలం మెకాలి గాయంతోనే కాకుండా అపెండిక్స్తో కూడా బాధపడుతున్నాడు. తాజాగా అఫ్రిది తన గాయం గురించి అప్డేట్ ఇచ్చాడు. అపెండెక్టమీ సర్జరీ చేయించుకున్నట్లు ట్విటర్ వేదికగా షాహీన్ వెల్లడించాడు. "ఈరోజు అపెండెక్టమీ చేయించుకున్నాను. అల్లా దయవల్ల బాగానే ఉన్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు దన్యవాదాలు" అంటూ షాహీన్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అతడి అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. కాగా గాయం తీవ్రత దృష్ట్యా అతడు సుమారు ఆర్నెళ్ల పాటు జట్టు నుంచి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వచ్చె నెలలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు ఆఫ్రిది దూరమయ్యే అవకాశం ఉంది. Had an appendectomy today but Alhumdulillah feeling better. Remember me in your prayers. 🤲 pic.twitter.com/M70HWwl9Cn — Shaheen Shah Afridi (@iShaheenAfridi) November 20, 2022 చదవండి: IND vs NZ: సూర్యకుమార్పై కోహ్లి ప్రశంసలు.. వీడియో గేమ్ ఇన్నింగ్స్ అంటూ! -
తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. ఎట్టకేలకు 8నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. విజయ్కు కొన్నినెలల కొందట భుజానికి గాయం అయ్యింది. ఆ నొప్పితోనే లైగర్ షూటింగ్తో పాటు ప్రమోషన్స్లో పాల్గొన్నాడు. అయితే చికిత్స అనంతరం ఇప్పుడు పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడినట్లు విజయ్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘బీస్ట్ బయటకు రావడానికి ఉబలాటపడుతోంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది’ అంటూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. సినిమాల్లోకి రాకముందే విజయ్కు షోల్డర్ ఇంజ్యురీ అయ్యిందట. లైగర్ షూటింగ్ సమయంలో ఆ గాయం మళ్లీ తిరిగబెట్టిందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే కొంతవరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు షూటింగ్కు బ్రేక్పడింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
లంకకు దెబ్బ మీద దెబ్బ.. మరో కీలక ఆటగాడు దూరం
టి20 ప్రపంచకప్లో శ్రీలంక జట్టును గాయాలు వీడడం లేదు. ఇప్పటికే ముగ్గురు టాప్ ఆటగాళ్లు గాయాలతో జట్టును వీడగా.. తాజాగా లంక స్టార్ పేసర్ బినురా ఫెర్నాండో ఈ జాబితాలో చేరాడు. తొడ కండరాల గాయంతో టి20 ప్రపంచకప్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో 27 ఏళ్ల ఆసిత ఫెర్నాండోను ఎంపిక చేసినట్లు లంక క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐర్లాండ్తో తొలి మ్యాచ్లో గెలిచిన లంకకు ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో పరాజయమే ఎదురైంది. కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్లో బౌలింగ్ చేసిన బినురా ఫెర్నాండో తన తొలి ఓవర్లోనే గాయపడ్డాడు. ఓవర్ ఐదో బంతి వేస్తుండగా తొడ కండరాల పట్టేయడంతో మ్యాచ్ను నుంచి పక్కకు తప్పుకున్నాడు. అప్పటినుంచి గాయం నుంచి కోలుకోని ఫెర్నాండో తాజాగా టి20 ప్రపంచకప్ నుంచి మొత్తానికే దూరమైనట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే దనుష్క గుణతిలక, దుష్మంత చమీరా, దిల్షాన్ మధుషనకలు గాయాలతో జట్టును వీడారు. గ్రూఫ్-1లో ఉన్న శ్రీలంక ఒక గెలుపు, ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. లంక తన తర్వతి మ్యాచ్ శనివారం సిడ్నీ వేదికగా పటిష్టమైన కివీస్తో ఆడనుంది. శ్రీలంక జట్టు: దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భానుక రాజపక్సే, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, చమిక కరుణరత్నే, కసున్ రజిత, అషెన్ బండార, లహిరు కుమారా, ప్రమోద్ మధుషన్, అసిత ఫెర్నాండో. స్టాండ్బై ప్లేయర్స్: ప్రవీణ్ జయవిక్రమ, దినేష్ చండిమల్, నువానీడు ఫెర్నాండో. చదవండి: లైవ్ మ్యాచ్లో లవ్ ప్రపోజ్.. మరో దీపక్ చహర్ మాత్రం కాదు -
హార్దిక్ పాండ్యాకు ఏమైంది.. పాక్తో మ్యాచ్కు డౌటేనా!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మోకాలి గాయంతో బాధపడుతున్నాడా. మెల్బోర్న్ వేదికగా ఇవాళ(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్లో ఆడేది అనుమానమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాక్తో పోరుకు ముందు మెల్బోర్న్ గ్రౌండ్లో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో ఒకటి బయటికొచ్చింది. ఆ ఫోటోలో ఆటగాళ్లంతా ప్రాక్టీస్లో తలమునకలయ్యుంటే పాండ్యా మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్లు నిలబడిపోయాడు. ఆ సమయంలో అతని కుడి మోకాలికి పట్టి కనిపించింది. దీంతో పాండ్యాకు గాయమైందని.. పాక్తో మ్యాచ్లో ఆడేది అనుమానమేనా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అయితే పాండ్యా గాయంపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇదంతా పుకార్లే అని కొట్టిపారేశారు. ''అతను ఎలాంటి గాయంతో ఇబ్బంది పడడం లేదని.. మాములుగా మోకాలిపై ఒత్తిడి పడకుండా క్రికెటర్లు పట్టి వేసుకుంటారు. ఆ పట్టీని చూసి గాయమైందనుకుంటే ఎలా'' అంటూ కొందరు అభిమానులు పేర్కొన్నారు. మరోవైపు రోహిత్ శర్మ కూడా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ''పాకిస్తాన్తో ఆడే తుది జట్టును ఆల్రెడీ నిర్ణయించాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ప్రపంచకప్ కొట్టి తొమ్మిదేళ్లు కావొస్తుంది. అయినా ప్రతీ మ్యాచ్కు జట్టును మార్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటికి ఆటగాళ్లు సిద్ధమై ఉండాలి. ఏదైనా మార్పు ఉంటే ముందే చెప్తాం.. చివరి నిమిషంలో ఆటగాళ్లను ఎంపికచేయడం నాకు నచ్చదు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్కున్న ప్రాధాన్యం ఏంటనేది అందరికి తెలుసు.. పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు'' అంటూ పేర్కొన్నాడు. Hardik Pandya has his right knee strapped. Could be a knee cap, as well. But he is limping a bit. @Sportskeeda #INDvPAK #T20WorldCup pic.twitter.com/72KKE9xSyO — Srinjoy Sanyal (@srinjoysanyal07) October 22, 2022 చదవండి: దాయాదుల సమరం.. అమ్మ, ఆవకాయలాగే ఎప్పుడు బోర్ కొట్టదు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
శ్రీలంకకు భారీ షాక్.. యువ బౌలర్ దూరం
టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు యువ పేసర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ట్రైనింగ్లో సెషన్లో మధుశంక మెకాలికి గాయమైంది. దీంతో అతడిని ఎమ్మరై స్కాన్కు తరలించగా.. గాయం తీవ్రమైనదిగా తేలింది. ఈ క్రమంలోనే టోర్నీ మొత్తానికి మధుశంక దూరమయ్యాడు. అదే విధంగా త్వరలోనే అతడి స్థానాన్ని శ్రీలంక క్రికెట్ భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే రిజర్వ్ జాబితా ఉన్న బినూర ఫెర్నాండో ప్రధాన జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మెగా ఈవెంట్ తొలి మ్యాచ్లో గీలాంగ్ వేదికగా నమీబియాతో శ్రీలంక తలపడుతోంది. చదవండి: Women's Asia Cup 2022: శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా -
బంగ్లాను వెంటాడుతున్న గాయాలు.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం
ఆసియాకప్ 2022 ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బంగ్లా స్టార్ బ్యాట్స్మన్ లిట్టన్ దాస్ కండరాల గాయంతో నెలరోజుల కిందటే జట్టుకు దూరమయ్యాడు. తాజాగా బంగ్లా జట్టుకు మరో షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న హసన్ మహ్ముద్, వికెట్ కీపర్ నురుల్ హసన్లు గాయాలతో దూరమయ్యారు. గతవారం ట్రెయినింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హసన్ చీలమండకు గాయమైంది. ఎక్స్రే తీయగా గాయం తీవ్రత పెద్దదని తేలడంతో నెలరోజుల విశ్రాంతి అవసరమైంది. ఇక మరో ఆటగాడు నురుల్ హసన్ ఇటీవలే చేతి వేలికి గాయం అవడంతో సర్జరీ జరిగింది. అతను కోలుకోవడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఇద్దరు ఆసియాకప్ టోర్నీకి దూరమవ్వాల్సి వచ్చింది.ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ ఆసియా కప్లో జట్టును నడిపించనున్న సంగతి తెలిసిందే. షకీబ్ నేతృతంలోని 17 మందితో కూడిన బంగ్లాదేశ్ జట్టు మంగళవారం యూఏఈలో అడుగుపెట్టింది. రానున్న టి20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని షకీబ్కు జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీబీ(బంగ్లా క్రికెట్ బోర్డు) ప్రకటించింది. చదవండి: Asia Cup 2022: తాత్కాలిక హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్! Sikandar Raza: పాక్ మూలాలున్న బ్యాటర్.. అయినా సరే మనసు దోచుకున్నాడు -
'యూఎస్ ఓపెన్కు దూరం'.. రిటైర్మెంట్ ప్లాన్లో మార్పులు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయం కారణంగా యూఎస్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ అనంతరం సానియా తన ప్రొఫెషనల్ ఆటకు గుడ్బై చెప్పాలనుకుంది. అయితే తాజాగా గాయంతో యూఎస్ ఓపెన్కు దూరం కావడంతో సానియా రిటైర్మెంట్లో పలు మార్పులు ఉండనున్నాయి. ఈ సందర్భంగా సానియా తన ఇన్స్టాగ్రామ్లో స్పందించింది. 'హాయ్ గయ్స్. ఒక క్విక్ అప్డేట్. నా దగ్గర అంత గొప్ప వార్త ఏమీ లేదు. రెండు వారాల క్రితం కెనడాలో ఆడుతున్నప్పుడు మోచేతికి గాయమయింది. నిన్న స్కానింగ్ చేయించుకునేంత వరకు ఆ గాయం ఎంత తీవ్రమైనదో నాకు అర్థం కాలేదు. మోచేతి దగ్గర లిగ్మెంట్ కాస్త దెబ్బతింది. ఈ కారణంగా కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండబోతున్నాను. యూఎస్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నా. ఈ పరిణామాల నేపథ్యంలో నా రిటైర్మెంట్ ప్లాన్స్ లో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూనే ఉంటా' అని ఆమె పేర్కొంది. మహిళల డబుల్స్లో మాజీ నెంబర్ వన్ అయిన సానియా మీర్జా డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లు ఒక్కోసారి నెగ్గింది. అలాగే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్లను కూడా గెలిచింది. ఇక 2016 రియో ఒలింపిక్స్లో మిక్స్డ్ డబుల్స్లో సెమీఫైనల్లో ఓడిన సానియా జంట తృటిలో పతకం చేజార్చుకుంది. చదవండి: BWF Championship 2022: అదరగొట్టిన సైనా నెహ్వాల్.. నేరుగా మూడో రౌండ్కు Victor Amalraj: పుస్తక రూపంలో భారత దిగ్గజ ఫుట్బాలర్ బయోగ్రఫీ.. -
ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్!
ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన భారత పేసర్ దీపక్ చాహర్ అదరగొట్టాడు. హరారే వేదికగా జింబాబ్వే జరుగుతోన్న తొలి వన్డేలో చాహర్ నిప్పులు చేరిగాడు. ఈ మ్యాచ్లో 7 ఓవర్లు బౌలింగ్ చేసిన చహర్ మూడు కీలక వికెట్లు పడగొట్టి 27 పరుగులు ఇచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేను ఆదిలోనే ఓపెనర్లు కియా, మారుమణి పెవిలియన్కు పంపి చాహర్ కోలుకోలేని దెబ్బకొట్టాడు. అనంతరం వన్డౌన్ బ్యాటర్ మాధేవేరేను కూడా ఔట్ చేసి చాహర్ మూడో వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా చాహర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో గాయపడ్డాడు. దీంతో అతడు ఐపీఎల్తో పాటు పలు సిరీస్లకు కూడా దూరమయ్యాడు. అనంతరం గాయం నుంచి కోలుకున్న చాహర్ జింబాబ్వే సిరీస్తో పునరాగామనం చేశాడు. అదే విధంగా ఆసియా కప్-2022కు స్టాండ్బైగా చహర్ ఎంపికయ్యాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 189 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్లో టెయిలండర్లు రిచర్డ్ నగరవా(34), బ్రాడ్ ఎవన్స్(33) అద్భుతమైన ఆటతీరుతో అకట్టుకున్నారు. Deepak Chahar announced his comeback with a scintillating performance 💛🥳 7 Overs | 27 Runs | 3 Wickets#ZIMvIND #WhistlePodu @deepak_chahar9 📷 Getty Images pic.twitter.com/nEVR0IWRnY — WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) August 18, 2022 చదవండి: ZIM vs IND: టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్ల కొత్త చరిత్ర ! -
కాలు విరగ్గొట్టుకున్నా డోంట్ కేర్ అంటున్న హీరోయిన్స్
‘రిస్కీ ఫైట్ చేయాలా? డూప్ వద్దు.. చేసేస్తాం’ అని కొందరు హీరోయిన్లు యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో గాయాలపాలవుతుంటారు. అలా ఈ మధ్య టబు, శిల్పా శెట్టి, సంయుక్తా హెగ్డే షూటింగ్లో గాయపడ్డారు. అయితే వెనక్కి తగ్గేదే లే అంటున్నారు. కోలుకున్నాక డూప్ లేకుండానే ఫైట్స్ చేస్తాం అంటున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఇటీవల వీరు చేసిన రిస్కీ యాక్షన్ గురించి తెలుసుకుందాం. టబు పేరు గుర్తు రాగానే ‘కొత్త కొత్తగా ఉన్నది...’ అంటూ వెంకటేశ్తో ‘కూలీ నెం. 1’లో, ‘ఎటో వెళ్లిపోయింది మనసు..’ అంటూ ‘నిన్నే పెళ్లాడతా’లో నాగార్జునతో రొమాంటిక్గా ఆడిపాడిన పాటలు గుర్తొస్తాయి. అలాంటి క్యూట్ రోల్స్ చేసిన టబు వీలు కుదిరినప్పుడల్లా పవర్ఫుల్ రోల్స్ చేస్తుంటారు. తాజాగా ‘భోలా’ చిత్రంలో ఆమె పోలీసాధికారి పాత్ర చేస్తున్నారు. పవర్ఫుల్ పోలీసాఫీసర్ అన్నమాట. ఈ సినిమా కోసం ఇటీవల టబు పాల్గొనగా ఓ ఛేజింగ్ సీన్ చిత్రీకరించారు. ఆ సమయంలో ఓ మోటారు సైకిల్, ట్రక్కు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగలడంతో టబు నుదురు, కంటి దగ్గర గాయాలయ్యాయి. అయితే పెద్ద ప్రమాదం కాకపోవడంతో యూనిట్ ఊపిరి పీల్చుకుంది. కానీ టబు కంటి దగ్గర గాయం కావడంతో అది తగ్గే వరకూ షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ కథానాయకుడు. ఇక టబు గాయపడిన ఒకట్రెండు రోజులకు మరో నటి శిల్పాశెట్టి ప్రమాదం బారిన పడ్డారు. ప్రస్తుతం శిల్పా చేస్తున్న ప్రాజెక్ట్స్లో ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ఒకటి. శిల్పాకి ఇది తొలి వెబ్ సిరీస్. ఇందులో శిల్పాది పోలీసాఫీసర్ క్యారెక్టర్. సో.. ఫైట్స్ ఉండటం సహజం. ‘ఒక యాక్షన్ సీన్ తీస్తూ.. యాక్షన్ అని చెప్పి, కాలు విరగ్గొట్టుకో అని నా యూనిట్ సభ్యులు అన్నారు. ఆ మాటలను సీరియస్గా తీసుకున్నాను. అంతే.. కాలికి బలమైన గాయం అయింది. ఫలితంగా ఆరు వారాలు షూటింగ్కి బ్రేక్. బలంగా తిరిగొస్తా.. ఫైట్ సీన్ చేస్తా’ అని పేర్కొన్నారు శిల్పా శెట్టి. మరోవైపు యువకథానాయిక సంయుక్తా హెగ్డే కూడా ఇటీవల షూటింగ్లో గాయపడ్డారు. ‘కిర్రాక్ పార్టీ’ చిత్రం ద్వారా ఈ కన్నడ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమయ్యారు. తాజాగా ‘క్రీమ్’ అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారామె. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సంయుక్తాకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఈ సినిమాకి ఆమెను కథానాయికగా ఎంపిక చేయడానికి అదొక కారణం. కాగా, ‘క్రీమ్’ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్తో ప్రత్యర్థులను ఎదుర్కొనే ఫైట్ సీన్లో సంయుక్తా హెగ్డేకి బలమైన గాయం తగిలింది. కాలికి గాయం కావడంతో రెండు నెలలు విశ్రాంతి సూచించారు. ‘‘ఇంటిపట్టున కూర్చోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. అయితే ఇప్పుడు కాలు కదపలేని పరిస్థితి. ఈ రెండు నెలల్లో పాటలు పాడటం నేర్చుకోవాలనుకుంటున్నాను. అలాగే గతంలో కొన్ని కథలు రాశాను. వాటికి స్క్రీన్ప్లే రాసే టైమ్ దొరకలేదు. ఇప్పుడు ఆ పని కూడా పూర్తి చేయాలను కుంటున్నాను’’ అన్నారు సంయుక్తా. కథానాయికలకు గ్లామరస్ రోల్స్ ఎక్కువగా వస్తుంటాయి. అందుకు భిన్నంగా చాలెంజింగ్ రోల్స్ వస్తే, ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. టబు, శిల్పా, సంయుక్తా ఇటీవల గాయపడిన తారలైతే గతంలో తాప్సీ, కంగనా రనౌత్ వంటి కథానాయికలు షూటింగ్స్లో ప్రమాదాల బారిన పడ్డారు. అయినప్పటికీ సవాల్లాంటి క్యారెక్టర్ అంటే ‘సై’ అంటున్నారు. ‘ఆడపులులు’ అంతే మరి.. -
టీమిండియాకు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్కు కూడా అతడు దూరం!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. గాయం కారణంగా ఆసియా కప్కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్లో కూడా పాల్గొనడం అనుమానంగా మారింది. బుమ్రా ప్రస్తుతం తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. అంతకు మందు 2019లో బుమ్రా ఇదే గాయంతో బాధపడ్డాడు. దీంతో బుమ్రా గతంలో చాలా మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇక ఇప్పడు అతడి గాయం మళ్లీ తిరగబెట్టింది. బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్కు జట్టు ప్రకటించడానికి నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున బుమ్రా గాయం బీసీసీఐను ఆందోళనకు గురిచేస్తోంది. "బుమ్రా గాయం మా జట్టును కలవరపెడుతోంది. అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి పాత గాయం మళ్లీ తిరిగి బెట్టింది. ప్రస్తుతం బుమ్రా వెన్ను నొప్పి తీవ్రమైంది. ప్రపంచ కప్కు మాకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో బుమ్రా గాయపడడం మా దురదృష్టమనే చెప్పుకోవాలి. అతడు మా జట్టు ప్రాధాన బౌలర్. కాబట్టి అతడు గాయం నుంచి తొందరగా కోలుకుని తిరిగి జట్టులోకి చేరుతాడని ఆశిస్తున్నాము" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్సైడ్ స్పోర్ట్స్తో పేర్కొన్నారు. కాగా టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది. చదవండి: 'భవిష్యత్తులో అతడు టీమిండియా కెప్టెన్ కావడం ఖాయం' -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికాకు బిగ్ షాక్..!
ఐర్లాండ్తో టీ20 సిరీస్కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ గాయం కారణంగా ఐర్లాండ్తో టీ20 సిరీస్కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20 లో రబాడా ఎడమ కాలి చీలమండకు గాయమైంది. దీంతో అతడు ఇంగ్లండ్తో జరిగిన అఖరి టీ20కూడా దూరమయ్యాడు. అయితే రబాడ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనున్నట్లు ప్రోటిస్ జట్టు బృందం తెలిపింది. ఈ క్రమంలో అతడు ఐర్లాండ్ సిరీస్తో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కాగా ఇంగ్లండ్ వేదికగా రెండు మ్యాచ్ల టీ20 సిరీస్లో ఐర్లాండ్తో ప్రోటీస్ తలపడనుంది. ఐర్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 బ్రిస్టల్ వేదికగా బుధవారం జరగనుంది. ఈ సిరీస్ మొత్తం బ్రిస్టల్ వేదికగా జరగనుంది. ఇక ఈ సిరీస్ ముగిసిన అనంతరం దక్షిణాఫ్రికా మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనుంది. కాగా ఇంగ్లండ్తో మూడు టీ20 సిరీస్ను 2-1తో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. ఐర్లాండ్తో టీ20లకు దక్షిణాఫ్రికా జట్టు డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్, రిలీ రోసౌ, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, క్వింటన్ డి కాక్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్, గ్రెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్,తబ్రైజ్ షమ్సీ, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే చదవండి: IND vs WI 3rd T20: భారత్-విండీస్ మూడో టీ20 కూడా ఆలస్యం.. కారణం ఇదే..! -
KTR: రామారావు ఆన్ వర్క్ఫ్రమ్హోం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ కాలి చీలమండ కండరం గాయంతో బాధపడుతూ మూడు వారాల విశ్రాంతి తీసుకుంటున్నారు ఆయన. ఈ క్రమంలో మంచి సినిమాలు, వెబ్ సిరీస్లు రిఫర్ చేయాలంటూ ఆయన నెటిజన్స్ని కోరారు. ఇక ఇప్పుడు ఐటీ మంత్రి కేటీ రామారావు తన విభాగం ఫైల్స్ను చూస్తున్న ఫొటోను మంగళవారం ట్విట్టర్లో షేర్ చేశారు. వర్క్ఫ్రమ్ హోంలోనూ కొన్ని ఫైళ్లకు సంబంధించిన పని జరుగుతోందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. Getting some file work done #WorkFromHome pic.twitter.com/SC2v7RtI5j — KTR (@KTRTRS) July 26, 2022 చదవండి: కేటీఆర్ కోసం మోకాళ్లపై గుడి మెట్లెక్కిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
భారత్కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్!
బర్మింగ్హామ్ వేదికగా జరగనున్న కామన్వెల్త్ గేమ్స్-2022కు ముందు భారత్కు భారీ షాక్ తగిలింది. ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్కు దూరమయ్యాడు. కాగా తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2022లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ సమయంలో అతడి గజ్జలో గాయమైంది. ఫైనల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నానని, పరుగెత్తుతున్నప్పుడు తొడ కండరాలు పట్టేశాయని నీరజ్ చోప్రా పతకం సాధించిన అనంతరం చెప్పాడు. అయితే అతడి గాయం ప్రస్తుతం తీవ్రం కావడంతో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్నట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. "ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా గాయం కాణంగా కామన్వెల్త్ గేమ్స్లో భాగం కాలేకపోతున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము" అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ట్విటర్లో పేర్కొంది. చదవండి: Lovlina Borgohain: బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. టోక్యో ఒలింపిక్స్ మెడలిస్ట్ సంచలన ఆరోపణలు Our Olympic Champ @Neeraj_chopra1 will not be defending his title at @birminghamcg22 due to concerns regarding his fitness. We wish him a speedy recovery & are supporting him in these challenging times.#EkIndiaTeamIndia #WeareTeamIndia pic.twitter.com/pPg7SYlrSm — Team India (@WeAreTeamIndia) July 26, 2022 -
శ్రీలంకతో రెండో టెస్టు.. పాకిస్తాన్కు భారీ షాక్..!
గాలే వేదికగా జూలై 24 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాలేలో జరిగిన మొదటి టెస్టులో అఫ్రిది మోకాలి గాయంతో బాధపడ్డాడు. దాంతో అతడు మ్యాచ్ నాలుగు రోజు ఆట మధ్యలో మైదానం వీడాడు. అయితే అతడి గాయం తీవ్రం కావడంతో కీలక రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇక తొలి టెస్టులో పాక్ విజయంలో షాహీన్ షా అఫ్రిది కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును కేవలం 222 పరుగులకే కట్టడి చేశాడు. ఇక గాయ పడిన అతడి స్థానంలో యువ పేసర్ హరీస్ రవూఫ్ తుది జట్టులోకి రానున్నాడు. కాగా రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాక్ 1-0 అధిక్యంలో ఉంది. రెండో టెస్టుకు పాకిస్తాన్ తుది జట్టు(అంచనా) అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, అజర్ అలీ, బాబర్ ఆజం (సి), అఘా సల్మాన్, మహ్మద్ రిజ్వాన్ (wk), మహ్మద్ నవాజ్, యాసిర్ షా, హసన్ అలీ,హరీస్ రవూఫ్ , నసీమ్ షా చదవండి: WI vs IND 1st ODI: వెస్టిండీస్తో భారత్ తొలి పోరు.. ధావన్కు జోడీ ఎవరు? -
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..!
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కు ముందు భారత్కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. జట్టు యువ పేసర్ ఆవేష్ ఖాన్ గాయం కారణంగా రాజ్కోట్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ వేదికగా జరగిన మూడో టీ20లో ఆవేష్ ఖాన్ కుడి చేతికి గాయమైంది. దీంతో అతడు మ్యాచ్ మధ్యలోనే ఫీల్డ్ను విడిచి పెట్టి వెళ్లాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి వారం రోజులు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో అతడు స్థానంలో డెత్ స్పెషలిస్ట్ ఆర్షదీప్ సింగ్ తుది జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాజ్కోట్ వేదికగా నాలుగో టీ20 శుక్రవారం జరగనుంది. చదవండి: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డును తిరగరాసిన ఆఫ్ఘాన్ బౌలర్ -
IND Vs SA: కేఎల్ రాహుల్ దూరం.. కెప్టెన్గా రిషబ్ పంత్
సౌతాఫ్రికాతో టి20 సిరీస్కు ముందు టీమిండియాకు బిగ్షాక్ తగిలింది. గాయంతో కెప్టెన్ కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. రాహుల్తో పాటు కుల్దీప్ యాదవ్ కూడా టి20 సిరీస్ నుంచి వైదొలిగాడు. కాగా కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ జట్టును నడిపించనుండగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. తొలి టి20 జరగనున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం సాయంత్రం ప్రాక్టీస్ అనంతరం గజ్జల్లో గాయం ఇబ్బంది పెడుతున్నట్లు కేఎల్ రాహుల్ మేనేజ్మెంట్కు తెలిపాడు. కాగా ఇవాళ ఉదయమే రాహుల్ గాయం తీవ్రతను వైద్యులు పరిశీలించారు. అయితే సాయంత్రానికి నొప్పి ఎక్కువ అవడంతో మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. రానున్న ఇంగ్లండ్ సిరీస్ను దృష్టిలో పెట్టుకొని సౌతాఫ్రికా సిరీస్కు దూరంగా ఉంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్ నుంచి కేఎల్ రాహుల్ వైదొలిగినట్లు మేనేజ్మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక కుల్దీప్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గాయం బారీన పడ్డాడు. దీంతో అతను కూడా కొన్ని రోజుల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఇక గురువారం(జూన్ 9న) ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మొదటి టీ20: జూన్ 9- గురువారం- అరుణ్ జైట్లీ స్టేడియం- ఢిల్లీ రెండో టీ20: జూన్ 12- ఆదివారం- బరాబతి స్టేడియం- కటక్ మూడో టీ20: జూన్ 14- మంగళవారం- డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం- విశాఖపట్నం నాలుగో టీ20: జూన్ 17, శుక్రవారం- సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం- రాజ్కోట్ ఐదో టీ20: జూన్ 19- ఎం.చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు చదవండి: Mitali Raj Intresting Facts: మిథాలీరాజ్లో మనకు తెలియని కోణాలు.. పాండ్యా, సంజూపై ద్రవిడ్ ప్రశంసలు.. అతడికి జట్టులో చోటు మాత్రం ఇవ్వరు కదా! -
ఇంగ్లండ్తో రెండో టెస్టు.. న్యూజిలాండ్కు భారీ షాక్..!
Colin de Grandhomme ruled out of England tour: ఇంగ్లండ్తో తొలి టెస్టు ఓటమి నుంచి కోలుకోక ముందే న్యూజిలాండ్కు మరో ఎదరు దెబ్బ తగిలింది. గాయం కారణంగా కివీస్ స్టార్ ఆల్రౌండర్ కొలిన్ డి గ్రాండ్హోమ్ మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. గ్రాండ్హోమ్ తన కుడి కాలి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతడు గాయం నుంచి కోలుకోవడానికి 10 నుంచి 12 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే సిరీస్ ఆరంభానికి ముందే గ్రాండ్హోమ్కు బ్యాకప్గా హెన్రీ నికోల్స్ను న్యూజిలాండ్ క్రికెట్ ఎంపిక చేసింది. కాగా నికోల్స్ ఇంగ్లండ్కు చేరుకున్న తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో గ్రాండ్హోమ్ స్థానంలో మైఖేల్ బ్రేస్వెల్ తుది జట్టులోకి రానున్నాడు. ఇక ఇరు జట్లు మధ్య రెండో టెస్టు ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా శుక్రవారం(జూన్14) ప్రారంభం కానుంది. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. చదవండి: Lionel Messi : మెస్సీ ‘వన్మ్యాన్ షో’.. అర్జెంటీనా ఘనవిజయం -
కోమా నుంచి కోలుకున్న దక్షిణాఫ్రికా యువ క్రికెటర్..
Mondli Khumalo Health Condition: బ్రిడ్జ్వాటర్లో గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన దక్షిణాఫ్రికా యువ క్రికెటర్ ఖుమాలో కోమా నుంచి బయట పడ్డాడు. ఈ విషయాన్ని అతడి సహచర ఆటగాడు లాయిడ్ ఐరిష్ తెలిపాడు. మొండ్లీ ఖుమా యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా గత ఆదివారం తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. అతడి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు మూడు సర్జరీలు చేశారు. "మొండ్లీ శుక్రవారం కోమా నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అతడు తన తల్లి కోసం అడుగుతున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ను చూస్తున్నాడు. ఇక అతడి తదుపరి మ్యాచ్ ఎప్పుడు అని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాడు. గత 24 గంటల్లో అతడు బాగా కోలుకున్నాడు అని లాయిడ్ ఐరిష్ పేర్కొన్నాడు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్లు, 4 టి20 మ్యాచ్లు ఆడాడు. చదవండి: నీ క్రీడాస్ఫూర్తికి సలామ్ నాదల్: సచిన్, రవిశాస్త్రి ప్రశంసలు -
French Open: హోరాహోరీ సమరం... గాయంతో సమాప్తం
పాయింట్ పాయింట్కూ పోరాటం... సుదీర్ఘ ర్యాలీలు... 3 గంటల 13 నిమిషాలు ముగిసినా పూర్తి కాని రెండు సెట్లు... ఫ్రెంచ్ ఓపెన్లో 13 సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ తీరిది. తొలి సెట్ను అతికష్టమ్మీద నెగ్గిన నాదల్కు రెండో సెట్లోనూ ఒక్కో పాయింట్కు తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాల్సిన స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తుది ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆలోచిస్తున్న తరుణంలో కోర్టులో ఊహించని సంఘటన జరిగింది. రెండో సెట్ 12వ గేమ్లో నాదల్ రిటర్న్ షాట్ను అందుకోనే క్రమంలో బేస్లైన్ వద్ద జ్వెరెవ్ జారి పడటంతో చీలమండకు తీవ్ర గాయమైంది. పడిన వెంటనే జ్వెరెవ్ నొప్పితో విలవిలలాడాడు. మైదానంలో ప్రథమ చికిత్స తర్వాత జ్వెరెవ్ను చక్రాల కుర్చీపై బయటకు తీసుకెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత జ్వెరెవ్ ‘క్రచెస్’ సహాయంతో కోర్టులోకి వచ్చి అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. దాంతో రాఫెల్ నాదల్ తనకెంతో కలిసొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్లో 14వ సారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్ చేరిన 13 సార్లూ నాదలే విజేతగా నిలిచాడు. కాస్పర్ రూడ్ (నార్వే), సిలిచ్ (క్రొయేషియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో నాదల్ తలపడతాడు. పారిస్: తన 36వ పుట్టిన రోజు విజయం రుచి చూసిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మూడో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో నాదల్ తొలి సెట్ను 7–6 (10/8)తో టైబ్రేక్లో గెలిచాడు. రెండో సెట్లోని 12వ గేమ్ చివర్లో నాదల్ రిటర్న్ షాట్ను అందుకునే క్రమంలో జ్వెరెవ్ కోర్టులో జారి పడ్డాడు. దాంతో పాయింట్ నాదల్కు లభించింది. స్కోరు 6–6తో సమమైంది. కోర్టులో జారిపడ్డ జ్వెరెవ్కు గాయం త్రీవంగా ఉండటంతో అతను మళ్లీ బరిలోకి దిగలేకపోయాడు. దాంతో నాదల్ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన పోరులో జ్వెరెవ్ రెండు సెట్లలో నాదల్కు చెమటలు పట్టించాడు. తొలి సెట్ టైబ్రేక్లో జ్వెరెవ్ 6–2తో ఆధిక్యంలో నిలిచి నాలుగు సెట్ పాయిం ట్లు సంపాదించాడు. కానీ పట్టువదలకుండా పోరాడినా నాదల్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 7–6తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత స్కోరు 7–7తో, 8–8తో సమమైంది. ఈ దశలో నాదల్ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తొలి సెట్ను గంటా 38 నిమిషాల్లో గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ జ్వెరెవ్ అద్భుతంగా ఆడుతూ 5–3తో ఆధిక్యంలోకి వచ్చి సెట్ కోసం సర్వీస్ చేశా డు. కానీ తొమ్మిదో గేమ్లో జ్వెరెవ్ సర్వీస్ను బ్రేక్ చేసిన నాదల్ ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేశాడు. 11వ గేమ్లో జ్వెరెవ్ తన సర్వీస్ను కాపాడుకోగా... 12వ గేమ్లో నాదల్ సర్వీస్లో చివరి పాయింట్ సమయంలో జ్వెరెవ్ జారి పడటంతో మ్యాచ్ ముగిసింది. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ స్వియాటెక్ (పోలాండ్) X కోకో గాఫ్ (అమెరికా) సా. గం. 6:30 నుంచి సోనీ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టైటిల్ కోసం అమెరికా టీనేజర్ కోకో గాఫ్... రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గాలనే లక్ష్యంతో స్వియాటెక్ నేడు మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తలపడనున్నారు. ⚔️ A thrilling battle came to a tough end with an injury to @AlexZverev but he and @RafaelNadal played some amazing points! Check out the Highlights by @emirates 🎥#RolandGarros | #EmiratesFlyBetterMoment pic.twitter.com/E9vn2iRF1v — Roland-Garros (@rolandgarros) June 3, 2022 -
‘రెండు నెలల్లో కోలుకుంటా’
తొడ కండరాల గాయంతో ఆటకు దూరమైన భారత క్రికెటర్ అజింక్య రహానే 6–8 వారాల్లోగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున ఆడుతూ రహానే గాయపడ్డాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో పది రోజుల పాటు తన రీహాబిలిటేషన్ జరిగిందని, గాయం తీవ్రత ప్రస్తుతం తగ్గిందని అతను అన్నాడు. రహానే సారథ్యంలో ఆస్ట్రేలియాపై సాధించిన గత టెస్టు సిరీస్ విజయంపై రూపొందించిన డాక్యుమెంటరీలో తన మెల్బోర్న్ టెస్టు సెంచరీని అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. -
ముంబై ఇండియన్స్కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..!
Suryakumar Yadav ruled out IPL 2022: ముంబై ఇండియన్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా ఐపీఎల్-2022 సీజన్ నుంచి తప్పుకున్నాడు. మే 6న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో యాదవ్ ఎడమ చేయి కండరానికి గాయమైంది. దీంతో ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు సూర్యకుమార్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. "సూర్యకుమార్ యాదవ్ ఎడమ చేయి కండరానికి గాయమైంది. దీంతో ఈ సీజన్లో మిగితా మ్యాచ్లకు దూరం కానున్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడిని కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని" సూచించారు అని ముంబై ఫ్రాంచైజీ పేర్కొంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఆరంభ మ్యాచ్లకు గాయం కారణంగా సూర్యకుమార్ దూరమయ్యాడు. ఆ తరువాత ఏంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ ఆద్భుతంగా రాణించాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ 303 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ లైవ్ అప్డేట్స్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఆడకపోవడంపై ధావన్ క్లారిటీ
ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్కు పంజాబ్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. మయాంక్ అగర్వాల్ మ్యాచ్కు ఎందుకు దూరమయ్యాడన్న సందేహం చాలా మంది అభిమానుల్లో మెదిలింది. అయితే టాస్ సమయంలో గ్రౌండ్కు వచ్చిన ధావన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ''మయాంక్ అగర్వాల్ కాలి బొటనవేలి గాయంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచ్కు మాత్రమే దూరంగా ఉంటున్నాడు. అతని స్థానంలో నేను జట్టును నడిపిస్తున్నా. అతని పరిస్థితి బాగానే ఉంది. బహుశా తర్వాతి మ్యాచ్కు మయాంక్ అగర్వాల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా మయాంక్ అగర్వాల్ ఈ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. కెప్టెన్గా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్న మయాంక్ బ్యాటర్గా మాత్రం విఫలమవుతున్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్ల్లో మూడింట గెలిచి.. రెండు ఓడి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. చదవండి: 'సాధారణ ఆటగాడిలా ఫీలవ్వు'.. కోహ్లికి మాజీ క్రికెటర్ సలహా -
T20 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్..!
టీమిండియా పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా ఐపీఎల్-2022కు దూరమైన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న చాహర్.. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుండగా మరో సారి గాయపడ్డాడు. నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతడి వెన్నెముకకు గాయమైంది. దీంతో ఈ ఏడాది సీజన్లో సీఎస్కేకు సెకెండ్ హాఫ్లో ఎంట్రీ ఇస్తాడనుకున్న చాహర్ పూర్తిగా దూరమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. కనీసం నాలుగు నెలలపాటు క్రికెట్కు దీపక్ చాహర్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలలపాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు చాహర్ అందుబాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక వేళ టీ20 ప్రపంచకప్కు చాహర్ దూరమైతే భారత్కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ ట్రాక్ పిచ్లపై అద్భుతంగా రాణించే సత్తా చాహర్కు ఉంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో చాహర్ రూ.14 కోట్ల భారీ ధరకు చాహర్ను సీఎస్కే కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుత సీజన్లో చాహర్ లేని లోటు సీఎస్కే బౌలింగ్లో సృష్టంగా కన్పిస్తోంది. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. తొలి జట్టుగా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్కు బిగ్షాక్
ఆర్సీబీతో మ్యాచ్లో ఓటమితో షాక్లో ఉన్న రాజస్తాన్ రాయల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్నీల్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ యాజమాన్యం ట్విటర్ వేదికగా స్వయంగా ప్రకటించింది. కాగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన తొలి మ్యాచ్లో కౌల్టర్ నీల్ ఆడాడు. ఆటలో చివరి ఓవర్ బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రస్తుతం అతనికి రెస్ట్ అవసరమని వైద్యులు దృవీకరించారు. కౌల్టర్ నీల్ తాను కోలుకునే వరకు స్వదేశంలో రీహాబిటేషన్లో గడపనున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్.. ''తొందరగా కోలుకో.. మనం మళ్లీ కలుద్దా ఎన్సీఎన్(నాథన్ కౌల్టర్ నీల్)'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా కౌల్టర్ నీల్కు ప్రత్యామ్నాయంగా ఎవరని ఎంపిక చేస్తుందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కౌల్టర్ నీల్ 48 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. ఆ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్ మెగావేలంలో రాజస్తాన్ రూ. 2 కోట్లకు నాథన్ కౌల్టర్ నీల్ను దక్కించుకుంది. కౌల్టర్ నీల్ ఐపీఎల్లో 38 మ్యాచ్లాడి 48 వికెట్లు పడగొటగ్టాడు. ఐపీఎల్లో మధ్యలోనే వైదొలగడం కౌల్టర్ నీల్కు ఇది రెండోసారి. ఇంతకముందు 2014లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడుతున్న సమయంలో తొడ కండరాల గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక కండరాల గాయంతో 2021 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. మంగళవారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ ఓటమి పాలైంది. ఒక దశలో మ్యాచ్లో పట్టు చిక్కినప్పటికి.. దినేశ్ కార్తిక్ విధ్వంసానికి తోడూ.. షాబాజ్ అహ్మద్ నిలకడైన ఆటతీరుతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 10న లక్నో సూపర్ జెయింట్స్తో ఆడనుంది. చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్తో పని లేదు' Ayush Badoni: ఆ ఆటగాడు పెను సంచలనం.. నాలుగేళ్ల క్రితం ట్వీట్ వైరల్ Until we meet again, NCN. 💗 Speedy recovery. 🤗#RoyalsFamily | #HallaBol | @coulta13 pic.twitter.com/XlcFUcTg5L — Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2022 -
భారత్తో రెండో టీ20.. శ్రీలంకకు భారీ షాక్!
టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఓటమి చెందిన శ్రీలంకకు మరో ఎదరుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్ మహేశ్ తీక్షణ గాయం కారణంగా మిగితా రెండు టీ20లకు దూరమయ్యాడు. అదే విధంగా భారత్తో సిరీస్కు శ్రీలంక స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగా కరోనా బారిన పడి దూరమైన సంగతి తెలిసిందే.కాగా భారత్-శ్రీలంక రెండో టీ20 ధర్మశాల వేదికగా ఫిబ్రవరి 26న జరగనుంది.ఇక ఈ మ్యాచ్కు స్టార్ బ్యాటర్ కుశాల్ మెండిస్ అందుబాటుపై కూడా సందేహం నెలకొంది. మరోవైపు శ్రీలంక టెస్టు జట్టులో సభ్యులుగా ఉన్న నిరోషన్ డిక్వెల్లా , ధనంజయ డిసిల్వా చివరి రెండు మ్యాచ్ల కోసం టీ20 జట్టులో చేర్చబడ్డారు. ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. శ్రీలంకపై టీమిండియా 62 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. ఇషాన్ కిషన్(89), శ్రేయస్ అయ్యర్(57) సునామీ ఇన్నింగ్స్లు ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు సాధించింది. 200 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకే పరిమితమైంది. చదవండి: IND vs SL: ''కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు'' -
ఐపీఎల్కు దూరం కానున్న స్టార్ ఆల్రౌండర్.. రూ. 14 కోట్లు వ్యర్థమేనా!
టీమిండియా యంగ్ ఆల్రౌండర్ దీపక్ చహర్ తొడ కండరాల గాయంతో శ్రీలంకతో టి20 సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం దీపక్ చహర్కు గాయం త్రీవత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో చహర్ ఐపీఎల్ 2022 సీజన్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తన్నాయి. ఇదే నిజమైతే సీఎస్కే పెద్ద దెబ్బ పడినట్లే. ఎందుకంటే ఈసారి మెగావేలంలో సీఎస్కే దీపక్ చహర్ను రూ. 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. సీజన్కు చహర్ దూరమైతే మాత్రం సీఎస్కే భారీ మొత్తంలో నష్టపోనుంది. గతేడాది ఐపీఎల్లో చహర్ సీఎస్కే తరపున అదరగొట్టాడు. ఒక రకంగా సీఎస్కే టైటిల్ గెలవడంలో దీపక్ చహర్ కీలకపాత్ర పోషించాడు. చహర్ దూరమైతే అతనికి రీప్లేస్మెంట్ విషయంలోనూ సీఎస్కేకు సరైన ఆటగాడు లేడు. అంతేకాదు ఏడాది కాలంగా దీపక్ చహర్ బంతితోనే కాదు బ్యాట్తోనూ అదరగొడుతున్నాడు. శ్రీలంక గడ్డపై జరిగిన వన్డే సిరీస్లో 65 పరుగుల కీలక ఇన్నింగ్స్తో తనలో ఆల్రౌండర్ ఉన్నాడని నిరూపించిన చహర్ ఆ తర్వాత చాలా సందర్భాల్లోనూ టీమిండియా తరపున పలు మ్యాచ్లో మెరిశాడు. ఇక విండీస్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మూడో టి20లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. ప్రస్తుతం దీపక్ చహర్ బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్లో ఉన్నాడు. ఇప్పటికైతే చహర్ గాయం తీవ్రత గురించి ఎలాంటి సమాచారం లేనప్పటికి.. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ 2022 సీజన్ను మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటివారం నుంచి ప్రారంభించేలా బీసీసీఐ సన్నాహాకాలు చేస్తుంది. చదవండి: Formula One: 'ఫార్ములావన్ను యువతులు ఎగబడి చూస్తున్నారు.. ఆటపై ఇష్టంతో కాదు' 1992 World Cup: అందరూ ఉన్నారు.. ఒక్కడు మాత్రం మిస్సయ్యాడు.. ఎవరది? -
జోష్ మీదున్న టీమిండియాకు దెబ్బ.. రెండో టి20కి ఆ ఇద్దరు డౌటే!
India Vs West Indies 2nd T20: వెస్టిండీస్తో జరిగిన తొలి టి20లో 6 వికెట్ల తేడాతో గెలిచి ఫుల్ జోష్లో ఉన్న టీమిండియాకు షాక్ తగిలే అవకాశం ఉంది.ఫీల్డింగ్ సమయంలో ఆల్రౌండర్లు దీపక్ చహర్, వెంకటేశ్ అయ్యర్లు గాయాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. రెండో టి20 మ్యాచ్కు వీరు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు టి20 సిరీస్ నుంచి ఔటైన సంగతి తెలిసిందే. వీరు కూడా దూరమైతే టీమిండియా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. చదవండి: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్ విషయంలోకి వెళితే.. విండీస్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కెప్టెన్ పొలార్డ్ స్వ్కేర్లెగ్ దిశగా ఆడాడు. బంతిని ఆపే ప్రయత్నంలో చహర్ కుడిచేతికి గాయమయింది. దీంతో తన కోటా ఓవర్లు పూర్తి కాకుండానే డ్రెస్సింగ్రూమ్కు వెళ్లిపోయాడు. మూడు ఓవర్లు వేసిన చహర్ 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. చహర్ మిగిలిన ఓవర్ను హర్షల్ పటేల్ పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు అవకాశం రాలేదు. అయితే గాయం తీవ్రతను బట్టి చహర్ రెండో వన్డే ఆడేది లేనిది తెలుస్తుంది. ఇక మరో ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కూడా ఫీల్డింగ్ సమయంలో గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో పొలార్డ్ కొట్టిన షాట్ను ఆపే క్రమంలో జారిపడడంతో అయ్యర్ కుడిచేతికి గాయం అయింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన అయ్యర్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి టీమిండియాకు విజయం అందించాడు. కాగా వీరిద్దరికి స్కానింగ్ నిర్వహించి.. వచ్చే ఫలితాలను బట్టి రెండో టి20కి అందుబాటులో ఉంటారా.. దూరమవుతారా అనేది ఆసక్తిగా మారింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్ ఫిబ్రవరి 18న ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగనుంది. చదవండి: అరంగేట్రంలో రవి బిష్ణోయి రికార్డు.. కల నిజమైంది.. కానీ ఇది అస్సలు ఊహించలేదు! -
రిపబ్లిక్ డే వేడుకలలో అపశ్రుతి.. తలపై పడిన డ్రోన్
భోపాల్: మధ్యప్రదేశ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ ఘటన జబల్పూర్ స్టేడియంలో జరిగింది. కాగా, అధికారులు వివిధ కార్యక్రమంలో భాగంగా డ్రోన్లను ప్రదర్శించారు. అయితే, ఈ డ్రోన్లు.. రిపబ్లిక్ వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన వారి మీద పడ్డాయి. వేడుకలలో భాగంగా గిరిజన నృత్యం కొనసాగుతుంది. ఈ క్రమంలో.. డ్రోన్ ఒక్కసారిగా అదుపు తప్పి నృత్యం చేస్తున్న వారిమీద పడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఇందు కుంజమ్(38), గంగోత్రి కుంజమ్(18)లుగా గుర్తించారు. వీరు గిరిజన తెగకు చెందిన వారిగా.. దిండోరి జిల్లా నుంచి గణతంత్ర వేడుకలకు చూడటానికి జబల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరు పండిత్ రవి శుక్లా స్టేడియంలో గిరిజన నృత్యం చేయడానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. చదవండి: రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు