lake
-
Home Guard: ఈశ్వర్.. సూపర్
జీవితంపై విరక్తి చెంది.. క్షణికావేశంలో చెరువులో దూకే వారి పాలిట ఆపద్బాంధవుడయ్యాడు ఆ (Home Guard)హోంగార్డు.. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మందికి పునర్జన్మ ప్రసాదించాడు.. ఆయా కుటుంబాల్లో చీకట్లు అలుముకోకుండా కొత్త ‘ఊపిరి’ పోశాడు.. సరూర్నగర్ పోలీస్ స్టేషన్(Saroor Nagar Police Station) పరిధిలోని చెరువు కట్టపై పోలీస్ ఔట్ పోస్ట్ ఇన్చార్జిగా 2020 నుంచి 2023 వరకు మూడేళ్లపాటు విధులు నిర్వర్తించాడు మంత్రి ఈశ్వరయ్య అలియాస్ ఈశ్వర్. అదే సమయంలో వివిధ కారణలతో సరూర్నగర్ చెరువులోకి దూకి ఆత్మ హత్యకు యత్నించిన 23 మందిని రక్షించాడు. బాధితులను రక్షించే క్రమంలో కొన్నిసార్లు ప్రాణపాయం వరకూ వెళ్లాడు. అయినా వెరవకుండా చెరువులో దూకేవారి ప్రాణాలను కాపాడాడు. అతని ధైర్య సాహసాలు, సేవలకు గుర్తింపుగా కేంద్రం ప్రతిష్టాత్మక భారత రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ మెడల్కు ఇటీవల ఎంపికచేసింది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతులమీదుగా ఈశ్వర్ అవార్డు అందుకోనున్నారు. కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని.. మహేశ్వరం(maheshwaram) మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఈశ్వర్ చిన్నప్పుడు బావులు, చెరువుల్లో ఈత నేర్చుకున్నాడు. స్నేహితులతో ఈత కొట్టే సమయంలో పోటీలు పెట్టుకుని మొదటి స్థానంలో నిలిచేవాడు. 2000 సంవత్సరంలో హోంగార్డుగా ఎంపికయ్యాడు. 2020లో సరూర్నగర్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యాడు. చెరువు కట్టపై పోలీస్ ఔట్ పోస్ట్ డ్యూటీ వేశారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. కాపాడే క్రమంలో అతడు కళ్ల ముందే చనిపోయాడు. ఈ సంఘటన (Ishwar)ఈశ్వర్ను కలిచివేసింది. అదే సమయంలో వివిధ కారణాలతో ఎంతోమంది చెరువులో దూకి ఆత్మ హత్యయత్నానికి పాల్పడుతుంటారని.. అలాంటి వారిని కష్టపడి రక్షించి ప్రాణాలు పోకుండా చూడాలని సీఐ సీతారామ్ చేసిన హితబోధ తన కర్తవ్యాన్ని గుర్తు చేశాయి. ఈ క్రమంలోనే రెండు రోజులకే చెరువులో దూకిన యువకుడిని కాపాడాడు. ప్రేమ విఫలమై, సంసారంలో కలతలు వచ్చి గొడవలు పడిన దంపతులను రక్షించాడు. గాయాలైనా వెరవక.. చెరువులో దూకిన వారిని రక్షించే క్రమంలో కష్టంగా ఉండేది. బరువుగా ఉన్న వారిని ఒడ్డుకు తీసుకువచ్చే క్రమంలో ఒక్కోసారి పట్టుకొని చెరువు లోపలికి లాగేవారు. చెరువులో ముళ్లు, రాళ్లు, పడేసిన సీసాల ముక్కలు కాళ్లకు తగిలి తీవ్ర గాయాలయ్యేవి. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని, చెరువులో దూకిన వారిని ప్రాణాలతో కాపాడాలని కుటుంబ సభ్యులు, ఏసీపీ, సీఐ, ఎస్ఐలు చెప్పి ప్రోత్సహించేవారు. అలా 23 మందిని రక్షించాడు. భారత రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ మెడల్కు ఎంపికకావడంపై ఎంతో మంది పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈశ్వర్ ప్రస్తుతం మహేశ్వరం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: అప్పులు చేసి అమెరికా వెళ్లిన వారికి ఊహించని దెబ్బ!బాధ్యత మరింత పెంచింది: మంత్రి ఈశ్వరయ్యచెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిలో ప్రాణాలతో బయటపడ్డవారు ఇప్పటికీ ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. నీ వల్లే ఈరోజు బతికిబట్టకట్టామని, కొత్త జీవితాన్ని ఇచ్చావంటూ కృతజ్ఞతలు చెబుతుంటారు. వారు మాట్లాడుతుంటే నిజంగా గర్వంగా ఉంటుంది. రాష్ట్రపతి మెరిటోరియస్ సర్వీస్ మెడల్కు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఇది నా బాధ్యతను మరింత పెంచింది. -
మళ్లీ అమీన్పూర్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. ఇక్కడ హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని హైడ్రాకు ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
సరస్సులో పడిపోయిన పారాగ్లైడర్.. వీడియో వైరల్
డెహ్రాడూన్:పారాగ్లైడింగ్ శిక్షణ తీసుకుంటున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు సరస్సులో పడిపోయిన ఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. పర్యాటక శాఖ నిర్వహిస్తున్న పారాగ్లైడింగ్ శిక్షణ కార్యక్రమంలో రిషి అనే వ్యక్తి అదుపుతప్పి తెహ్రీ సరస్సులో పడిపోయాడు.వెంటనే స్పందించిన ఎస్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు రిషిని రక్షించారు. పారాగ్లైడింగ్ చేస్తూ రిషి సరస్సులో పడిపోవడం, అతడిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బోటులో వచ్చి కాపాడడం చకచకా జరిగిపోయాయి. ఈ దృశ్యాలను కొందరు కెమెరాలో బంధించి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. కొద్దిసేపటికే ఈ వీడియో వైరల్గా మారింది. ఇదీ చదవండి: విమానంలో మహిళకు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్ -
ఈ సరస్సులో దయ్యం ఉందట!
ఈ సరస్సు చూడచక్కగా ఉంటుంది. ఇందులోని నీళ్లు స్వచ్ఛంగా తళతళలాడుతూ ఉంటాయి. అయినా, జనాలు ఈ సరస్సు పేరు వింటేనే భయపడతారు. గుండెధైర్యం ఉన్న కొద్దిమంది ఇక్కడకు పిక్నిక్లకు వస్తుంటారు. అలాంటి వారు కూడా ఈ సరస్సు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సరస్సులో దయ్యం ఉందన్న ప్రచారమే జనాల భయానికి కారణం. అమెరికాలోని లాంగ్ ఐలండ్లో ఉన్న ఈ సరస్సు పేరు ‘రోంకోంకోమా లేక్’. ఇక్కడి స్థానికులు ఈ సరస్సు నీళ్లల్లో అరికాళ్ల మునివేళ్లను ముంచడానికి కూడా భయపడతారు. రోంకోంకోమా సరస్సులో దయ్యం ఉందనే గాథకు మూలాలు పదిహేడో శతాబ్ది చివరికాలం నుంచి ఉన్నాయి. ఇక్కడి స్థానిక మూలవాసులైన ‘సెటాకెట్’ తెగకు చెందిన యువరాణి టుస్కావాంటా ఈ ప్రాంతంలో కట్టెలు కొట్టుకునేందుకు వచ్చే తెల్లజాతి యువకుడితో ప్రేమలో పడింది. టుస్కావాంటా తండ్రి వారి ప్రేమను నిరాకరించడంతో ఆమె సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ సరస్సులోనే ఉందని, సరస్సులోకి వచ్చే పురుషులను బలిగొంటూ ఉందని లాంగ్ ఐలండ్ జనాలు చెప్పుకుంటుంటారు. గడచిన శతాబ్దకాలంలో ఈ సరస్సులో పడి 160 మందికి పైగా యువకులు అంతుచిక్కని పరిస్థితుల్లో మరణించారు. ఈ సరస్సులోని దయ్యం ఏడాదికి కనీసం ఒక యువకుడినైనా బలిగొంటుందని ఇక్కడి జనాల నమ్మకం. ఈ సరస్సు తీరంలో డేవిడ్ ఇగ్నేరీ (74) దాదాపు ముప్పయి ఏళ్ల పాటు లైఫ్గార్డ్గా పనిచేశాడు. తాను పనిచేసిన కాలంలోనే ఈ సరస్సులో పడి ముప్పయి మంది మరణించారని, వారందరూ యువకులేనని అతడు చెబుతున్నాడు. స్థానికుల నమ్మకాలు, భయాలకు తోడు ఈ సరస్సులో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడంతో ఇక్కడి జనాలు సరస్సులో పడి ఆత్మాహుతి చేసుకున్న యువరాణి కట్టెబొమ్మను భారీసైజులో ఇక్కడ నెలకొల్పారు. అమెరికా పర్యాటక శాఖ ఇక్కడ ఈ గాథను వివరిస్తూ, పెద్ద పెద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం విశేషం. -
టీవీ పాత్రికేయురాలి అనుమానాస్పద మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఒక టీవీ జర్నలిస్టు రాజధాని ఢాకాలో ఓ సరస్సులో శవమై తేలారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, చంపి ఎవరైనా నీళ్లలో పడేశారా అనేది తెలియరాలేదు. మృతురాలిని గాజీ మీడియా గ్రూప్లోని బెంగాలీ బాషలో ప్రసారమయ్యే గాజీ టీవీ న్యూస్రూమ్ ఎడిటర్ సారా రహనుమాగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఢాకాలోని హతిర్జహీల్ సరస్సు నుంచి మంగళవారం అర్ధరాత్రి దాటాక 2గంటలపుడు పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. చనిపోవడానికి ముందు సారా ఫహీమ్ ఫైజల్ అనే వ్యక్తిని ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ నీలాంటి స్నేహితుడిని పొందడం సంతోషంగా ఉంది. నీ కలలను నెరవేర్చలేకపోతున్నందుకు క్షమించు. నీ జీవిత గమనంలో దేవుడు నీకు తోడుగా నిలుస్తాడు’ అని రాసుకొచి్చంది. ‘‘చస్తూ బతకడం కంటే చావడమే ఉత్తమం’ అంటూ అంతకుముందు మరో పోస్ట్ పెట్టింది. -
‘సార్.. మా చెరువూ తప్పిపోయింది!’
సాక్షి, హైదరాబాద్: కబ్జాకు ఏ చెరువూ కాదు అనర్హం అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్తో పాటు నగరం చుట్టుపక్కల ఉన్న అనేక చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఓ మోస్తరు వాన కురిసినా కాలనీలను వరద ముంచెత్తుతోంది. రోడ్లే చెరువుల్ని తలపిస్తున్నాయి. ఇక భారీ వర్షం అంటే నగరజీవి బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొంటోంది. చెరువులు, కుంటల్లాంటి జలవనరులు, నాలాలు ఆక్రమణలకు గురి కావడం వల్లే ఈ దుస్థితి ఏర్పడుతోందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు సామాన్య ప్రజలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ఇటీవలి కాలంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చెరువుల్లో ఆక్రమణలపై కొరడా ఝళిపిస్తుండటంతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతంలో చెరువుల ఆక్రమణపై హైడ్రాతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకు ఫిర్యాదు చేస్తున్నారు. మా చెరువేదీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలు తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆధారాలతో సహా.. ‘తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్దార్నగర్లో రికార్డుల ప్రకారం 8 ఎకరాల విస్తీర్ణంలో తుమ్మల చెరువు ఉండాలి. కానీ ప్రస్తుతం దాని అలుగు మాత్రమే కనిపిస్తోంది కానీ చెరువు కనిపించట్లేదు..’అని బీజేపీ నేత అందెల శ్రీరాములు యాదవ్ సోమవారం పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలో ఉన్న జలవనరుల పరిరక్షణ కోసం.. ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించిన ఈ ఏజెన్సీ 43.94 ఎకరాల చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలకు సంబంధించి ఈ విభాగానికి ఇబ్బడిముబ్బడిగా ఫిర్యాదులు వస్తున్నాయి. సాధారణంగా వివిధ విభాగాలకు చేసే ఫిర్యాదులకు బాధితులు, ప్రజలు.. పలు పత్రాలు, ఫొటోలు, ఆడియో, వీడియో సీడీల్లాంటివి జత చేస్తుంటారు. కానీ హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులు మాత్రం కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ తరహా శాటిలైట్ ఫొటోలను జత చేసి మరీ ఫిర్యాదు చేస్తుండటం గమనార్హం. కాగా ఈ ఫిర్యాదులకు సంబంధించిన వివరాలను హైడ్రా, ఇతర విభాగాలు గోప్యంగా ఉంచుతున్నాయి. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేస్తున్న వారిలో బాధితులతో పాటు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఉంటున్నట్లు సమాచారం. మాదాపూర్ ఖానామెట్లోని తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నట్టుగా చెబుతున్న సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్–కన్వెన్షన్పై.. ‘జనం కోసం’అనే సంస్థతో పాటు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ కూల్చివేత తర్వాతే హైడ్రాకు లెక్కకుమిక్కిలిగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి ఫిర్యాదునూ వివిధ కోణాల్లో పరిశీలించి, రికార్డులు తనిఖీ చేసిన తర్వాతే హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తోంది. అన్ని అనుమతులతో దర్జాగా..! ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటల్లో.. అలాగే నాలాలపై నిర్మించిన కట్టడాల్లో రెండు రకాలైనవి ఉంటున్నాయి. కొన్నింటిని అసలు అనుమతులే తీసుకోకుండా నిర్మించేయగా.. మరికొన్నింటికి అవసరమైన అన్ని అనుమతులూ ఉండటం గమనార్హం. ఇరిగేషన్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తదితర శాఖల నుంచి అనుమతులు తీసుకుని మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటికి విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా.. ఇతర విభాగాలు రోడ్లు, డ్రైనేజీలు వంటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక చోట్ల లేఔట్లు, వెంచర్లు, అపార్ట్మెంట్లు కూడా యథేచ్ఛగా వెలిశాయి. ఈ క్రమంలో రూ.లక్షల నుంచి రూ.కోట్ల వరకు చేతులు మారాయన్నది బహిరంగ రహస్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ! ఏదైనా భవనం నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత జీహెచ్ఎంసీ అధికారులు ఆద్యంతం పరిశీలించాల్సి ఉంటుంది. నిర్మాణంలో నిబంధనలు పూర్తి స్థాయిలో పాటించారని నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ‘నివాసానికి యోగ్యం’అంటూ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేయాల్సి ఉంటుంది. అయితే రాజధానిలోని చెరువులు, కుంటలు, బఫర్ జోన్లలో నిర్మితమవుతున్న కొన్ని భవనాలకు పనులు పూర్తి కాకుండానే ఓసీలు జారీ అయిపోతున్నాయనే ఆరోపణలున్నాయి. దీనికి ఆ విభాగం అధికారుల అవినీతే కారణమనే ఆరోపణలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారులు వాటిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కొన్ని నిర్మాణాలకు ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇవ్వడాన్ని గుర్తించిన హైడ్రా అధికారులు వాటిని రద్దు చేయాల్సిందిగా కోరుతూ హెచ్ఎండీఏకు లేఖ రాశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టనున్నారు. ఆ అధికారుల గుండెల్లో రైళ్లు ప్రస్తుతానికి ఆయా నిర్మాణాల కూల్చివేతల పైనే హైడ్రా దృష్టి పెడుతోంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల కబ్జాల నిరోధం, విపత్తు స్పందన.. తదితర లక్ష్యాలతో ఏర్పాటు అయిన హైడ్రా జలవనరుల పరిరక్షణకే పెద్దపీట వేసి ముందుకు వెళ్తోంది. అయితే ఈ విభాగానికి ప్రత్యేక పోలీసుస్టేషన్ మంజూరైన తరువాత మరో అడుగు ముందుకు వేయనుంది. ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రతి విభాగం, ఆయా అధికారుల పైనా విచారణ జరిపి, సంబంధిత శాఖలకు నివేదికలు ఇవ్వడంతో పాటు చర్యలకు సిఫారసు చేయనుంది. దీంతో ప్రస్తుతం ఆయా విభాగాలకు చెందిన అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 10 వేలకు మిగిలింది 3,900 ఎకరాలే...నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ‘గ్రేటర్’తో పాటు చుట్టుపక్కల ఉన్న 56 చెరువుల పరిస్థితిపై అధ్యయనం చేసింది. 1979–2023 మధ్య 44 ఏళ్లలో అవి ఏ స్థాయిలో కబ్జాలకు గురయ్యాయో తేల్చింది. అప్పట్లో 10416.8 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ జలవనరులు గత ఏడాది నాటికి 3,974.1 ఎకరాలకు పడిపోయాయి. ఇలా మొత్తమ్మీద 61 శాతం మాయమై కేవలం 39 శాతం మిగిలినట్లు ఎన్ఆర్ఎస్సీ లెక్కకట్టింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితుల్ని మార్చాలని కోరుతూ హైడ్రాకు నివేదిక సమర్పించింది. చెక్కు చెదరని హకీంపేట.. విస్తరించిన చెన్నపురంరాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న డిఫెన్స్ ఏరియా హకీంపేటలోని 18 ఎకరాల చెరువు మాత్రం ఇప్పటికీ అలాగే ఉందని ఎన్ఆర్ఎస్సీ సర్వే వెల్లడించింది. అలాగే ఈ సర్వేలో వెలుగులోకి వచ్చిన మరో ఆసక్తికర అంశం చెన్నపురం చెరువుకు సంబంధించింది. సికింద్రాబాద్ చంద్రపురికాలనీలో ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 44 ఏళ్లల్లో పెరిగింది. 1979లో ఇది 16 ఎకరాల్లో విస్తరించి ఉండగా..2023 నాటికి 15 శాతం పెరిగి 18.2 ఎకరాలకు చేరింది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన హైడ్రా..చెరువు విస్తీర్ణం అలా పెరగడానికి కారణాలను విశ్లేషించాలని నిర్ణయించింది.ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లూ వర్తించవు.. మూడు దశల్లో కార్యాచరణ అమలుహైడ్రా పరిధిలో ఉన్న ప్రతి చెరువు, కుంట పూర్వాపరాలు అధ్యయనం చేస్తున్నాం. కూల్చివేతలు అనేవి చట్ట ప్రకారం జరుగుతాయి. ఇలాంటి చర్యలు తీసుకునే ముందు ఆద్యంతం పరిశీలిస్తాం. నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు పూడ్చే ట్రాక్టర్లు, టిప్పర్లను కూడా భవిష్యత్తులో సీజ్ చేయనున్నాం. చెరువు, కుంటలకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, పార్కు స్థలాలకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లు వర్తించవు. చెరువులు, కుంటలు, నాలాలు తదితరాల పరిరక్షణ కోసం హైడ్రా మూడు దశల్లో కార్యాచరణ అమలు చేస్తోంది. మొదటి దశలో ఇకపై ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఒక్క చదరపు అడుగు కూడా ఆక్రమణ కాకుండా చూస్తోంది. రెండో దశలో ఇప్పటికే ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో అనుమతి ఉన్నా, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటాం. మూడో దశలో ప్రస్తుతం బెంగళూరులో జరుగుతున్న మాదిరిగా చెరువుల పునరుద్ధరణ చేపడతాం. నగరంలో ఉన్నవి అన్నీ గొలుసుకట్టు చెరువులే. ఒకటి అలుగు పారితే ఆ నీరు నాలాలు, వాగుల ద్వారా మరో దాంట్లోకి వెళ్లాలి. ఆ పరిస్థితిని మళ్లీ తీసుకురావడానికి కృషి చేస్తాం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాలు, లేఔట్లలో ప్రజలు ఫ్లాట్లు, స్థలాలు ఖరీదు చేయొద్దు. త్వరలో ఈ వివరాలను వెబ్సైట్లో పెడతాం. ఇప్పటికే ఇలా ఖరీదు చేసి నష్టపోయిన వాళ్లు ఉంటే బిల్డర్పై కేసు పెట్టండి.– ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ -
మా చెరువు ఎక్కడ? దండం పెట్టి వేడుకున్న రైతు..
-
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
యాదాద్రి: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల ఎల్బీనగర్ శివారు జానపహాడ్ మేజర్ కాలువలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 40 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మృతదేహం 2022 సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన మేజర్ కాలువలో కొట్టుకు వచ్చినట్లు సీఐ చరమందరాజు ఆదివారం తెలిపారు. మృతుడి దేహంపై తెలుపు రంగు లుంగీ, నీలి, తెలుపు రంగు గడులుగల ఫుల్షర్ట్ ఉన్నదని, భుజంపై ఆంజనేయస్వామి పచ్చబొట్టు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యక్తిని ఎవరో వ్యక్తులు చంపి, చేతులు కట్టి, ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి కాలువలో పడవేసినారని పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు మేరకు గరిడేపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు స్థానిక సీఐ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఇవి చదవండి: ఉత్తర రింగుకు ఈపీసీ.. దక్షిణ రింగుకు బీఓటీ -
ఆధార్కార్డు మార్చే విషయంపై.. వివాహిత తీవ్ర నిర్ణయం!
నిజామాబాద్: భర్త వేధింపులతోనే వివాహిత నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేటకు చెందిన శిరీష(25), సతీశ్ దంపతులు. వీరికి ఏడాది బాబు యోగేశ్ ఉన్నాడు. తరచూ భర్త వేధింపులతో పాటు ఆధార్కార్డులో అడ్రస్ మార్పు విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మానసిక వేదనకు గురైన శిరీష బుధవారం తల్లిగారింటికి వెళ్తున్నాని చెప్పి కుమారుడు యోగేశ్తో కలిసి బస్సులో వెళ్లింది. మార్గమధ్యలో బస్సు దిగిన శిరీష నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న చెట్టు కింద కుమారుడు యోగేశ్ను కూర్చోబెట్టి తాను కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
హెలికాప్టర్ క్రాష్.. చిలీ మాజీ అధ్యక్షుడి మృతి
సాంటియాగో: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగినపుడు హెలికాప్టర్లో పినేరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదంలో పినేరా ఒక్కరే మృతిచెందగా మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్ను పినేరానే స్వయంగా నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. చిలీ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా తొలిసారి 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు దేశాధ్యక్షుడిగా పదవిలో ఉన్నారు. బిలియనీర్ అయిన పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు పలువురు ఇతర దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇదీ.. చదవండి..పాక్ ఎన్నికల బరిలో ఆమె అంతంతే -
రొయ్యలు మాత్రమే ఉండే సరస్సు!
ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పని నీరున్న సరస్సు. ఇది ఏ సముద్రంలోనూ కలవదు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన మోనో కౌంటీ ఎడారి ప్రాంతంలో ఉందిది. అత్యధిక లవణసాంద్రత కలిగిన ఈ సరస్సు నీటిలో సాధారణ జలచరాలేవీ మనుగడ సాగించలేవు. ఇందులో చేపలు, పీతలు వంటివి మచ్చుకైనా కనిపించవు. అయితే, ‘బ్రైన్ష్రింప్’ అనే ఒక రకం రొయ్యలు మాత్రం ఈ సరస్సులో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకునే లక్షలాది పక్షులు ఏటా సీజన్లో ఈ సరస్సు వద్దకు వలస వస్తుంటాయి. దాదాపు 7.60 లక్షల ఏళ్ల కిందట సహజంగా ఏర్పడిన ఈ సరస్సు ఒక ప్రకృతి విచిత్రం. కొన్నేళ్ల కిందట కాలిఫోర్నియా ప్రభుత్వం ఈ సరస్సులో ఉప్పు సాంద్రతను తగ్గించడానికి ఇందులోకి మంచినీటిని విడుదల చేసింది. ఫలితంగా ఇందులో ‘బ్రైన్ష్రింప్’ రొయ్యల సంఖ్య తగ్గి, వలసపక్షుల రాక కూడా తగ్గిపోయింది. దీంతో పర్యావరణ ప్రేమికులు కోర్టుకెక్కి దీని సహజ స్థితిని పునరుద్ధరించేలా ఆదేశాలను సాధించారు. (చదవండి: బ్లూ సీ డ్రాగన్! చూడటానికీ అందంగా ఉందని టచ్ చేశారో అంతే..!) -
యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి శవమై కనిపించాడు!
లండన్: గత వారం యూకేలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి తూర్పు లండన్లోని కానరీ వార్ఫ్ సరస్సులో శవమై కనిపించాడు. డిసెంబర్ 14న అదృశ్యమైన గురష్మాన్ సింగ్ భాటియా(23 ) మృతదేహాన్ని కానరీ వార్ఫ్ సరస్సులో డైవర్లు బుధవారం గుర్తించారు. లాఫ్బరో యూనివర్శిటీకి చెందిన విద్యార్థి గురష్మాన్ సింగ్ భాటియా డిసెంబర్ 14న రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. ఆ క్రమంలో కానరీ వార్ఫ్ ప్రాంతంలో అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చివరిసారిగా సౌత్ క్వే ప్రాంతంలోని సీసీటీవీలో డిసెంబర్ 15న కనిపించాడు. కానీ ఆ తర్వాత ఆయన జాడ తెలియలేదు. చివరగా బుధవారం కానరీ వార్ఫ్ ప్రాంతంలోని సరస్సులో డైవర్లకు గురష్మాన్ సింగ్ మృతదేహం కనిపించింది. గురష్మాన్ సింగ్ మరణవార్త సమాచారాన్ని పంజాబ్లోని ఆయన కుటుంబానికి అందించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేపడుతామని డిటెక్టివ్ చీఫ్ సూపరింటెండెంట్ జేమ్స్ కాన్వే చెప్పారు. గురష్మాన్ సింగ్ అదృశ్యంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పందించారు. గత నెలలో కూడా యూకేలో భారతీయ విద్యార్థి థేమ్స్ నది ఒడ్డున శవమై కనిపించాడు. ఇదీ చదవండి: కరోనాతో మాటను కోల్పోయిన బాలిక.. డాక్టర్లు ఏం చెబుతున్నారు? -
చెరువులోకి దూకిన దొంగ..గంటలు గడుస్తున్నా దొరకని దొంగ..
-
దయ్యాల సరస్సులో తేలియాడే ఊరు!
ఆఫ్రికాలోని పెద్ద సరస్సులో ఒకటైన నొకోవే సరస్సు దయ్యాల సరస్సుగా పేరుమోసింది. అయినా కొందరు ఆ సరస్సు నడిబొడ్డున తేలియాడే ఊరును నిర్మించుకున్నారు. ఈ ఊరి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉంది. ఆఫ్రికా పశ్చిమ ప్రాంత దేశమైన బెనిన్లో ఉంది ఈ ఊరు. దీని పేరు గాన్వీ. నాలుగు శతాబ్దాల కిందట యూరోప్ నుంచి వివిధ దేశాల వలస వర్తకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుండేవారు. ప్రస్తుతం బెనిన్గా పిలుచుకుంటున్న దేశంలో అప్పట్లో ఫోన్, దహోమి రాజ్యాలు ఉండేవి. ఈ రెండు రాజ్యాల సైన్యాల్లోనూ చాలా క్రూరులైన సైనికులు ఉండేవారు. వారు ఇక్కడి టొఫిను తెగకు చెందిన వారిని బందీలుగా పట్టుకుని, ఇక్కడకు వర్తకం కోసం వచ్చే పోర్చుగీసు వారికి బానిసలుగా అమ్మేసి, వారు తమ దేశం నుంచి తీసుకువచ్చే వస్తువులను ప్రతిఫలంగా తీసుకునేవారు. అయితే, ఫోన్, దహోమీ రాజ్యాల్లో నొకోవే సరస్సు దయ్యాల సరస్సు అనే నమ్మకం ఉండేది. సైనికులకు చిక్కకుండా తప్పించుకోవడానికి ఈ సరస్సు ఒక్కటే తగిన ప్రదేశమని నిర్ణయించుకున్న టొఫిను తెగ ప్రజలు చెక్క తెప్పలపై గుడారాలను నిర్మించుకుని, సరస్సులోనే నివసించడం మొదలుపెట్టారు. క్రమంగా ఈ సరస్సలోనే వారు తేలియాడే ఇళ్లను నిర్మించుకున్నారు. జనాభా పెరగడంతో సరస్సులో ఏకంగా తేలియాడే ఊరు తయారైంది. కాలం తెచ్చిన మార్పుల్లో ఫోన్, దహోమి రాజ్యాలు అంతరించాయి. తర్వాతికాలంలో ఇక్కడ అధికారం చలాయించిన ఫ్రెంచ్ పాలన కూడా అంతరించింది. ఈ ప్రాంతం ‘బెనిన్’ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అయినా అప్పట్లో ఇక్కడ స్థిరపడిన టొఫిను తెగ ప్రజలు తిరిగి నేల మీదకు రాకుండా, ఈ సరస్సులోని ఊరినే తమ శాశ్వత నివాసంగా చేసుకుని, తరతరాలుగా కొనసాగు తున్నారు. (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
సరస్సును ఖాళీ చేయిస్తారట.. ఎందుకంటే
ప్రముఖ ఆర్ అండ్ బీ గాయకుడు అషర్ మాజీ భార్య తమెకా ఫాస్టర్ తాజాగా జార్జియాలోని అతి పెద్ద సరస్సును ఖాళీ చేయించాలని అధికారులను కోరుతున్నారు. దానిలో ఆమె కుమారుడు 11 సంవత్సరాల క్రితం జెట్ స్కీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఫ్యాషన్ డిజైనర్ తమెకా ఫాస్టర్ అట్లాంటాకు ఈశాన్యంగా ఉన్న 44-మైళ్ల పొడవైన రిజర్వాయర్ లేక్ లానియర్ "డ్రెయిన్, క్లీన్,రీస్టోర్" కోసం ఆన్లైన్ పిటిషన్ వేసి, 3 వేలకు మించిన సంతకాలను సేకరించారు. ఈ భారీ సరస్సు పూర్తిగా ఎండిపోయినప్పుడే అధికారులు దానిలోని ప్రమాదకర పదార్థాలను సురక్షితంగా తొలగించగలరని ఆమె అంటోంది. వ్యక్తిగత వాటర్క్రాఫ్ట్, వినోద కార్యక్రమాలలో నిమగ్నమయ్యేవారి రక్షణ కోసం సరస్సు వద్ద మెరుగైన భద్రతా చర్యలను చేపట్టాలని ఫోస్టర్ సూచించారు. ఆమె 11 ఏళ్ల కుమారుడు కిల్ గ్లోవర్ జూలై 2012లో లేక్ లానియర్లోని లోపలి ట్యూబ్పై తేలుతుండగా, వారి కుటుంబ స్నేహితుడు జెఫ్రీ హబ్బర్డ్ నడుపుతున్న జెట్ స్కీ ఆ బాలునిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కైల్ - బౌన్స్ టీవీ వ్యవస్థాపకుడు ర్యాన్ గ్లోవర్ కుమారుడు, అషర్ సవతి కొడుకు బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. అయితే ఆ బాలుడు చనిపోయే ముందు రెండు వారాల పాటు లైఫ్ సపోర్ట్లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో హబ్బర్ట్పై హత్య కేసు నమోదయ్యింది. అతను దోషిగా నిర్ధారణ కావడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, 15 ఏళ్ల పరిశీలన శిక్ష విధించారు. తన కుమారుని విషయంలో ఎదురైన ఈ సంఘటన సరస్సులో సరైన జోనింగ్, భద్రత, రక్షణ చర్యల తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతున్నదని ఫోస్టర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. జార్జియా డిపార్ట్మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ తెలిపిన వివరాల ప్రకారం సరస్సుపై భారీ ట్రాఫిక్ కారణంగా గత మూడు దశాబ్దాల్లో వందలాది పడవలు పరస్పరం ఢీకొన్నాయి. 1994-2018 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో 170కు మించిన మరణాలు చోటుచేసుకున్నాయి. 73 ఏళ్ల క్రితం నాటి ఈ మానవ నిర్మిత సరస్సు నీటి ప్రవాహాలపై ప్రభావం చూపుతున్నదని, ఇది ఇక్కడ వినోద కార్యక్రమాల్లో పాల్గొనేవారికి ప్రమాదకరంగా పరిణమించిందని ఫోస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాహూచీ రివర్కీపర్ కన్జర్వేషన్ గ్రూప్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సరస్సు 5 మిలియన్ల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది. ఆస్కార్విల్లేలోని నల్లజాతి కమ్యూనిటీకి ముంపును తెచ్చిపెడుతూ ప్రమాదకరంగా పరిణమించిన ఈ సరస్సును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, తద్వారా ఇటువంటి విషాదాలను నివారించవచ్చని ఫోస్టర్ పేర్కొంది. ఈ లేక్లోని నీటిని తోడి వేసిన తరువాత నీటి సంబంధిత కార్యకలాపాల కోసం కఠినమైన నిబంధనలను అమలు చేయాలని, జోనింగ్ను ప్రవేశపెట్టాలని ఫోస్టర్ ప్రతిపాదించింది. కాగా ఫోస్టర్, అషర్లు 2009లో విడాకులు తీసుకున్నారు. వీరికి అషర్ రేమండ్, నావిడ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
ఈ సరస్సు ఎంత ప్రమాదకరమంటే.. ఒడ్డున నిలుచున్న..
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సరస్సు. రష్యా పశ్చిమప్రాంతంలోని ఫెడరేషన్ ఆఫ్ షెల్యాబిన్స్క్లో దక్షిణ యూరల్ పర్వత సానువుల సమీపంలో ఉంది. ఈ సరస్సు పేరు కరాచే. ఇది మరీ అంత పెద్దది కాదు. కేవలం 900 మీటర్ల పొడవున విస్తరించిన ఈ సరస్సు ఒకచోట సన్నగా, ఇంకోచోట వెడల్పుగా కాస్త అడ్డదిడ్డంగా ఉంటుంది. అత్యధిక వెడల్పు గల ప్రదేశంలో దీని వెడల్పు 500 మీటర్లు. సాధారణంగా మొసళ్లతో నిండిన సరస్సులోకి అడుగు పెడితేనే ప్రమాదం. కాని, ఈ సరస్సు ఒడ్డున నిలుచున్నా ప్రమాదమే! ఇది పూర్తిగా రేడియో ధార్మిక వ్యర్థాలతో నిండిపోయి ఉండటమే దీనికి కారణం. ఇదివరకు ఈ సరస్సు సమీపంలోనే ఒక అణుకేంద్రం ఉండేది. అక్కడి వ్యర్థాలన్నీ ఈ సరస్సులోకి చేరడంతో ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రపంచంలోనే అత్యధిక రేడియో ధార్మికత గల సరస్సుగా 1951లోనే ఈ సరస్సు గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. అప్పట్లో ఇక్కడ ఉన్న అణుకేంద్రం నుంచి వెలువడిన ప్లూటోనియం–239, యురేనియం–235 ఐసోటోప్స్ ఈ సరస్సులోకి చేరాయి. ఇవి అణ్వాయుధాల్లో ఉపయోగించే రకానికి చెందినవి. ఈ సరస్సుకు దిగువన ఉండే 24 గ్రామాలకు ఇదొక్కటే మంచినీటి వనరుగా ఉండేది. ఈ గ్రామాల్లో రేడియో ధార్మికత పెరగడంతో జనాలు వాటిని ఖాళీ చేశారు. దీని పరిసరాల్లోనూ గాలిలోకి కూడా తీవ్రస్థాయిలో రేడియో« దార్మికత చేరుతోంది. అమెరికన్ శాస్త్రవేత్తలు 1992లో ఈ సరస్సు ఒడ్డున గాలిలో ఉన్న రేడియో ధార్మిక ప్రభావంపై పరిశోధన చేశారు. ఇక్కడ నిలుచుంటే, గంటకు 5.6 సీవర్ట్ల రేడియో ధార్మిక ప్రభావానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇది ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలంలో ప్రాణాంతకంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని తేల్చారు. (చదవండి: ఈ సరస్సు ఒడ్డున నిలుచున్నా ప్రమాదమే!) -
అది నిగూఢ రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..
ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. వీటి రహస్యాల ముడి విప్పాలని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి అత్యంత వింత సరస్సు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ సరస్సులోని నీటి రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రయ్యే సరికి ఆ సరస్సులోని నీరు నీలి రంగులోకి ఎందుకు మారిపోతున్నదో ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నేపధ్యంలో పలువురు శాస్త్రవేత్తలు తమ వాదనలు వినిపించినా, అవి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సమాధానాన్ని ఇవ్వలేదు. అదరగొట్టే ఉష్ణోగ్రత.. ఈ సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని కవాహ్ ఇజేన్ లేక్ అని అంటారు. ఇది చూసేందుకు ఇతర సరస్సుల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎంతో ఉప్పగా ఉంటుందని చెబుతారు. ఈ నీరు 200 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగివుండటం విశేషం. ఉదయం వేళలో ఈ సరస్సులోని నీరు సాధారణంగానే కనిపిస్తుంది. మధ్యరాత్రి సమయానికి గాఢమైన నీలిరంగులోకి మారిపోతుంది. అలాగే మెరుస్తూ కనిపిస్తుంటుంది. ఇది ఎంతో ఆకర్షించే విషయమైనప్పటికీ, టూరిస్టులు ఇక్కడికి రాకపోవడం విశేషం. సరస్సులోని వేడి నీటి కారణంగా ఇక్కడికి వచ్చేవారెవరూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు. శాస్త్రవేత్తలు కూడా ఈ కారణంగానే తమ పరిశోధనలు ముందుకు సాగడం లేదని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన రసాయన వాయువులే కారణమా? పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరస్సుపై లెక్కలేనన్ని పరిశోధనలు సాగించారు. అయితే ఇప్పటి వరకూ ఈ నీటి వెనుకనున్న రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ సరస్సుకు సమీపంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి అప్పుడప్పుడు పేలు తుంటాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అగ్నిపర్వతాలు పేలడం వలన హైడ్రోజన్ ఫ్లోరైడ్, సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ తదితర వాయువులు వెలువడతాయి. ఈ వాయువుల రియాక్షన్ కారణంగానే సరస్సులోని నీటి రంగు మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా నిరంతరం వాయువులు వెలువడినప్పుడు ఉదయం వేళలో నీటి రంగు మారకుండా, రాత్రివేళలో మాత్రమే నీటి రంగు ఎందుకు మారుతున్నదనే ప్రశ్న అలానే మిగిలిపోయింది. మరి దీనికి సమాధానం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్.. ఆదాయంలో టాప్ వన్! -
బంజారా హిల్స్ లోటస్ పాండ్ చెరువులో చేపల మృత్యువాత
-
సిద్దిపేటలో విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.
సాక్షి, సిద్దిపేట, హైదరాబాద్: సెల్ఫీ సరదాకు ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మూడేళ్ల బాలుడు సహా ఇద్దరు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. బేగంపేట ఎస్ఐ అరుణ్కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్లోని యాకుత్పురాకు చెందిన షేక్ కైసర్ (28), అతని అన్నకొడుకు షేక్ ముస్తఫా (3), సమీప బంధువు, జగద్గిరిగుట్టకు చెందిన మహమ్మద్ సోహెల్ (17) గురువారం రాత్రి సిద్దిపేట (దుద్దెడ)లో జరగనున్న ఫంక్షన్లో పాల్గొనేందుకు తమ కుటుంబ సభ్యులతో కలసి గజ్వేల్ మండలం మక్తమాసాన్పల్లిలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం వారు వర్గల్ మండలం నెంటూరు సామల చెరువు సమీపంలోగల బంధువుల పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో షేక్ ఖైసర్, మమ్మద్ సోహెల్లు ముస్తఫాను తీసుకుని సెల్ఫీలు దిగేందుకు సమీపంలో ఉన్న సామల చెరువుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ముస్తఫా చెరువులో ఉన్న గుంతలో జారిపడ్డాడు. ఇది గమనించి అతడిని రక్షించే ప్రయత్నంలో సోహెల్, అతడిని కాపాడేందుకు ఖైసర్లు వరుసగా గుంతలో దిగారు. ఈత రాకపో వటంతో బాలుడితో పాటు వారిద్దరూ నీళ్లలో మునిగి చనిపోయారు. సమీపంలో వున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మొదట బాలుడి బయటకు తీసి చికిత్స కోసం తరలించగా అప్పడికే అతను మృతిచెందాడు. పోలీసులు స్థానికుల సహాయంతో చెరువు నుంచి ఖైసర్, సోహెల్ మృతదేహాలను వెలికి తీశారు. మృతుడు ఖైసర్కు భార్య, మూడు నెలల కూతురు ఉన్నారు. అప్పటిదాకా ఆడుతూ కళ్ల ముందు సంతోషంగా గడిపిన ముస్తఫా నీట మునిగి విగత జీవిగా మారటంతో తండ్రి జుబేర్, తల్లి అయేశాలు కన్నీరు మున్నీరై బోరుమని విలపించారు. కాగా మహ్మద్ సోహెల్ ఇటీవలే టెన్త్ పరీక్షలు రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతిలో చారిత్రాత్మక, పురాతన కట్టడాల పరిరక్షణకు ముందడుగు
సాక్షి,తిరుపతి: తిరుపతి నగరంలోని చారిత్రాత్మకమైన, పురాతన కట్టడాలను పరిరక్షించుకోవడం కోసం, భవిష్యత్ తరాలకు వారసత్వ సంపదగా అందించడం కోసం యువనేత భూమన అభినయ్ రెడ్డి ముందడుగు వేశారు. తిరుపతి 39వ డివిజన్, చెన్నారెడ్డి కాలనీలో ఓ పురాతనమైన కొలను ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులు సేద తీరడం కోసం, స్నానాలు చేయడం కోసం ఈ కొలను నిర్మించారు. ఈ కొలనుకు కృష్ణంనాయుడి గుంటగా వాడుకలోకి వచ్చింది. అయితే కాలక్రమేణా ఈ కొలను అన్యాక్రాంతం అవుతూ వచ్చింది. 2018 టీడీపీ హయాంలో వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి చెన్నారెడ్డి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా కృష్ణంనాయుడి గుంట కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని చెప్పిన విధంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్రెడ్డి ఆ గుంటను అభివృద్ధి పరచడానికి కౌన్సిల్లో చర్చించారు. నిధులు మంజూరు చేసి మరమ్మతులు ప్రారంభించారు. తాజాగా మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంతో పాటు పురాతన కట్టడాలను పరిరక్షించడం కోసం అడుగులు వేశామని భూమన అభినయ్ తెలిపారు. శ్రీకృష్ణంనాయుడి గుంట పరిరక్షణకు మొదటి విడతగా 57 లక్షలు మంజూరు చేసిన కౌన్సిల్, మలి విడతగా మరో 50 లక్షలను ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. కొలనులో పూడికతీతతో పాటు ప్రహరీగోడ, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటి, సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన చెప్పారు. -
గుడికి వెళ్లొచ్చే సరికి కొడుకు మాయం.. అదృశ్యమైన గంటల్లోనే..
సాక్షి, హైదరాబాద్: అదృశ్యమైన బాలుడు కొన్ని గంటల్లో శవమై తేలిన ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు వివరాల ప్రకారం..లాల్వాణినగర్కు చెందిన యాతం మహేష్యాదవ్ కుమారుడు యువన్ (9) చిన్నప్పటి నుంచి మాటలు రాదు. ఈ నెల 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తల్లితండ్రులు గుడికి వెళ్లి వచ్చేసరికి యువన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అర్ధరాత్రి వరకు గాలించినా ఫలితం లేకపోయింది. సీసీ కెమెరాలు పరిశీలిస్తే.. ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు రికార్డయింది. లాల్వాణీనగర్ ప్రధాన రహదారి మరో వైపు ఉన్న సీసీ కెమరా రికార్డులు పరిశీలిస్తే యువన్ అటు వైపు వచ్చినట్లుగా కనిపించలేదు. అనుమానం వచ్చిన పోలీసులు బండచెరువులో ప్రమాదవశాత్తు పడిపోయాడా అన్న కోణంలో వెతకడం ప్రారంభించారు. గుర్రపు డెక్కతీసే యంత్రం పై నుంచి గాలిస్తుండగా చెరువు చివర కాలిన శవాన్ని గుర్తించారు. ఒంటి మీద ఉన్న బట్టలు ఆదారంగా యువన్దే మృతదేహంగా నిర్ధారించారు. అనుమానాలెన్నో.. బండచెరువులో చెత్త వేయకుండా కంచె ఏర్పాటు చేశారు. యువన్ మృతదేహం దొరికిన ప్రాంతంలో కంచె తొలగించి ఉంది. దీనిపై ఆరా తీయగా చెరువులో పందులు పెంచుకునే వారు వాటికి ఆహారం వేయడానికి కంచె తొలగించారని పారిశుద్ధ్య సిబ్బంది చెబుతున్నారు. ఘటనా జరిగిన స్థలానికి ప్రధాన రహదారి కొద్దిదూరంలోనే ఉంది. కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.గస్తీ సిబ్బంది అప్రమత్తంగా ఉండివుంటే ఈ సంఘటనను గుర్తించి ఉండేవారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రక్షితామూర్తి, ఏసీపీ నర్సింహారెడ్డి పరిశీలించారు. జాగిలం కూడా అక్కడక్కడే తిరిగింది. -
విషాదం: చిన్నా.. నీ సాహసం వృథా అయ్యిందిరా!
ఆ చిన్నారి సాహసం వృథా అయ్యింది. స్నేహితుల్ని రక్షించాలనే తాపత్రయం.. చివరకు అతన్ని కూడా బలిగొంది. సెంట్రల్ ఇంగ్లండ్ బర్మింగ్హమ్ సోలిహల్ సరస్సు విషాదంలో ముగ్గురు పిల్లలు కన్నుమూయగా.. స్థానికంగా విషాదం అలుముకుంది. తన స్నేహితుల్ని కాపాడబోయి ప్రాణాలు అర్పించిన జాక్ జాన్సన్ను(10) తల్చుకుని స్థానికులు కంటతడి పెడుతున్నారు. ఇంగ్లండ్లో మైనస్ ఉష్ణోగ్రతల కారణంగా.. విపరీతంగా మంచు కురుస్తోంది. వాతావరణ ప్రభావంతో.. సోలిహల్లోని బాబ్స్ మిల్ పార్క్ దగ్గర ఓ సరస్సు గడ్డ కట్టుకుపోయింది. ఆదివారం మధ్యాహ్నాం నలుగురు చిన్నారులు ఆ సరస్సులో ఆడుకోవడానికి వెళ్లారు. హఠాత్తుగా ఓ చోట మంచు ఫలకం విరిగింది. దీంతో పిల్లలు నీళ్లలోకి మునిగిపోయారు. తన స్నేహితులు మునిగిపోతున్న విషయం ఒడ్డు నుంచి గమనించిన జాక్.. పెద్దలను పిలవాలనే సంగతి మరిచాడు. మరో మాట లేకుండా ధైర్యం చేసి నీళ్లలోకి దూకాడు. ఆ సమయంలో సైకిల్పై వెళ్తున్న ఓ యువతి.. కేకలు వేయడం ప్రారంభించింది. కానీ, జాక్ ప్రయత్నం ఫలించలేదు. పైగా క్షణాల్లో మంచు గడ్డ కట్టుకుపోవడంతో.. ఆ సరస్సు కిందే అతనూ చిక్కుకున్నాడు. సమాచారం అందుకోగానే.. పరుగున అక్కడికి చేరుకున్న జాక్ జాన్సన్ తాత, అతన్ని మిగతా పిల్లలను రక్షించే యత్నం చేసినా లాభం లేకుండా పోయింది. మంచు పొర మందంగా ఉండడంతో దానిని బద్ధలు కొట్టడం ఆలస్యం అయ్యింది. హుటాహుటినా సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ఓ అధికారి తన చేతులతో ఆ మంచు ఫలకాన్ని బద్ధలు కొట్టే యత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జనం చేరిన ఇరవై నిమిషాలకు.. పిల్లల్ని అచేతనంగా బయటకు తీశారు. నలుగురు పిల్లలను ఆస్పత్రికి తరలించగా.. అందులో ముగ్గురు(జాక్తో సహా) అప్పటికే కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. ఆరేళ్ల మరో చిన్నారి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకెవరైనా పిల్లలు అందులో ఇరుక్కుపోయారా? అనే కోణంలో అధికారులు గాలింపు చేపట్టారు. చివరకు ఎవరూ లేరని విషయం నిర్ధారించుకుని చర్యలు ఆపేశారు. చిన్నారుల మరణంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోగా.. అంతా నివాళులు అర్పిస్తున్నారు. ప్రధాని రిషి సునాక్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చెరువు కనిపించడం లేదంటూ కేటీఆర్కు ట్వీట్.. తీరా చూస్తే
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీలోని లోధా అపార్టుమెంట్ వద్ద ఆరు నెలల క్రితం వరకు కనిపించిన చెరువు ప్రస్తుతం కనిపించడం లేదంటూ ఫ్యూచర్ ఫౌండేషన్స్ సొసైటీ ప్రతినిధులు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో చేసిన ఫిర్యాదు కలకలం రేపింది. ఇందుకు స్పందించిన మంత్రి కేటీఆర్ చెరువు కనిపించకపోవడం నిజమే కాబట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. If this👇is true, I assure you that stringent action will be taken on those who are responsible @CollectorRRD and @zckukatpally please inspect and submit a report to the Govt at the earliest@KTRoffice please follow up https://t.co/2LPyfdBgun — KTR (@KTRTRS) December 4, 2022 వెంటనే సంబంధిత చెరువును సందర్శించి త్వరగా ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని జిల్లా కలెక్టర్, కూకట్పల్లి జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కేటీఆర్ ఆదేశాలతో ఉరుకులు, పరుగులు పెట్టిన మున్సిపల్ అధికారులు అసలు లోధా అపార్టుమెంట్ ప్రాంతంలో చెరువు ఎక్కడుందబ్బా అంటూ లేని చెరువు కోసం వెతుకులాడారు. ట్విట్టర్లో చెరువు కనిపించడం లేదంటూ పోస్ట్ చేసిన ఫోటోలను పరీక్షించి చూస్తే ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఉన్న సెల్లార్ గుంతలా అనిపించడంతో మూసాపేట సర్కిల్ ఉపకమిషనర్ రవికుమార్ ఇతర అధికారులు అక్కడికి వెళ్లి చూసి అవాక్కయ్యారు. sir, above said land pertains to Telangana state housing board & the water body shown in the image is not a lake. It was dug for a construction project but due to cancellation of project it was levelled to prevent accidents & water stagnation . Present situation is as below. pic.twitter.com/5dyufrurn5— zc_kukatpally (@zckukatpally) December 4, 2022 గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల భవనం నిర్మించి విక్రయించేందుకు చేపట్టిన నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వి పూడ్చిన సెల్లార్ గుంత కావడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే దాదాపు పదేళ్ల క్రితం తవ్విన సెల్లార్ గుంతలో వర్షం కారణంగా నీళ్లు నిండిపోయి చెరువులా మారింది. సెల్లార్ గుంతలో పలుమార్లు చిన్నారులు పడి మృతి చెందారు. గత సంవత్సరం ముగ్గురు బాలికలు ఆడుకుంటూ వెళ్లి సెల్లార్ గుంతలో పడి మృతి చెందారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో మాట్లాడి సెల్లార్ గుంతను పూడ్చి వేయించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వ పరంగా రూ.5లక్షలు, ఎమ్మెల్యే సొంతంగా రూ.3లక్షలు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఎవరో ఎక్కడో అపార్టుమెంట్లో ఉంటూ గతంలో ఇక్కడ చెరువు ఉండేదని అక్కడ పక్షులను చూసేందుకు వెళ్లే వారమని ఇప్పుడు అది కనిపించడంలేదని ట్విట్టర్లో తప్పుడు ఫిర్యాదు చేయడం అధికారులతో పాటు స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే -
ఘోర ప్రమాదం.. సరస్సులో కూలిపోయిన విమానం
దార్ ఎస్ సలాం: ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. 49 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. బుకోబా నగరంలో ల్యాండింగ్ కావాల్సిన కొద్ది సమయానికి ముందే వాతావరణం అనుకూలించకపోవటంతో సరస్సులో పడిపోయింది. ప్రయాణికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ‘ప్రెసిషన్ ఎయిర్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. ఎయిర్పోర్ట్కు 100 మీటర్ల దూరంలో ఉన్న నీటిలో పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.’ అని రీజనల్ పోలీస్ కమాండర్ విలియమ్ వాంపఘేల్ తెలిపారు. మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. టాంజానియా ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలాం నుంచి బుకోబాకు ప్రయాణిస్తోంది. ప్రెసిషన్ ఎయిర్ సంస్థ టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ప్రమాద ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపామని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. ఉత్తర టాంజానియాలో సఫారీ సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 11 మంది చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ప్రమాదం జరిగింది. Precision Air plane crashes into Lake Victoria while trying to land in Tanzania; no word on casualties pic.twitter.com/EpRrgPvAVB — BNO News (@BNONews) November 6, 2022 ఇదీ చదవండి: వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు! -
Travel: మచ్చల సరస్సు.. అతి విచిత్రమైన జలాశయం.. ఎక్కడ ఉందంటే!
ప్రపంచంలోని అతి విచిత్రమైన జలాశయాల్లో ఇదొకటి. నీటిపైన ఏదో డిజైన్ ఏర్పడినట్లు కనిపిస్తోంది కదూ! ఇందులోని ఖనిజాల వల్ల ఈ సరస్సు ఇలా మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో ఓసోయూస్ పట్టణానికి చేరువలో ఉందిది. నీటిపై నిండా మచ్చలతో కనిపిస్తూ ఉండటం వల్ల దీనికి ‘స్పాటెడ్ లేక్’ (మచ్చల సరస్సు) అనే పేరు వచ్చింది. ఈ సరస్సులో మెగ్నీషియం సల్ఫేట్, సోడియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ ఖనిజాలు అధిక సాంద్రతతో నిండి ఉన్నట్లు శాస్త్రవేత్తల పరీక్షల్లో తేలింది. అలాగే ఈ సరస్సు నీటిలో వెండి, టిటానియం లోహాలు కూడా స్వల్ప పరిమాణంలో ఉన్నట్లు తేలింది. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో ఈ సరస్సులోని ఖనిజాలను ఆయుధాల తయారీకి వాడేవారు. ఇదివరకు ఈ సరస్సు నీటితో వివిధ వ్యాధులకు సంప్రదాయ వైద్యం చేసేవారు కూడా. ఈ వింత సరస్సును చూడటానికి పర్యాటకులు ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తుంటారు. చదవండి: Horned Orb Spider: ఈ కొమ్ముల సాలీడు చాలా సాధుజీవి తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఒంటరి వృక్షం.. 125 ఏళ్లుగా -
ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా...
-
యూకేలో ఇద్దరు కేరళ యువకులు మృతి
లండన్: యూకేలోని ఐర్లాండ్లో ఒక సరస్సులో ఈత కొట్టేందుకు వెళ్లిన ఇద్దరు కేరళ యువకులు మృతి చెందారు. సోమవారం యూకే సెలవురోజు కావడంతో ఒక స్నేహితుల బృందం డెర్రీ లేదా లండన్ డెర్రీలోని ఎనాగ్లాఫ్లో ఉన్న సరస్సు వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లారు. ఐతే అనుకోకుండా కేరళకు చెందిన సెబాస్టియన్, రూవెన్ సైమన్ అనే ఇద్దరు యువకులు ఆ సరస్సులో గల్లంతై చనిపోయారు. ఉత్తర ఐరీష్ నగరంలోన ఉన్న కేరళ అసోసియేషన్ ఆ ఇద్దరు యువకులకు నివాళులర్పించింది. ఈ విషాద ఘటన పట్ల స్థానిక కౌన్సిలర్ రాచెల్ ఫెర్గూసన్ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంతేకాదు ఉత్తర ఐర్లాండ్ పోలీస్ సర్వీస్ ఆ ఇద్దరు యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఐతే ఈ ఘటనలో ఒక వ్యక్తి సురక్షితంగా రక్షించామని, అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ సంఘటనా స్థలంలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు డెర్రీ/లండన్ డెర్రీ మేయర్, స్ట్రాబేన్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్, సాండ్రా డఫీ కూడా ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని సరస్సులు, నదులలో ఈత కొడుతున్నప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
ఏటి ఒడ్డున కన్నీటి సుడులు.. తమ్ముడూ రాఖీ కడదామని వచ్చానురా.. !
నేలకొండపల్లి / ఖమ్మం వైద్యవిభాగం: మండలంలోని సుర్దేపల్లి ఏటిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తితో పాటు ఆయనను కాపాడేందుకు వచ్చి గల్లంతైన డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహాలు శుక్రవారం లభించాయి. గురువారం ఏటిలో చేపల వేటకు వెళ్లిన రంజిత్ గల్లంతు కాగా, ఆయనను రక్షించేందుకు వచ్చిన ఖమ్మం కార్పొరేషన్ డీఆర్ఎఫ్ సిబ్బంది ఎం.వెంకటేశ్వర్లు, బి.ప్రదీప్ కూడా గల్లంతైన విషయం విదితమే. అయితే, గురువారం రాత్రి వెంకటేశ్వర్లు మృతదేహం లభించగా, శుక్రవారం ప్రదీప్, రంజిత్ మృతదేహాలను గుర్తించారు. అనంతరం రంజిత్ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాక, డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని తరలించే క్రమంలో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులను సస్పెండ్ చేసి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. అధికారులు రాకుండా బలవంతం చేస్తే తాము ఏటిలో దూకి ఆత్మహత్య చేసుకుంటామని స్పష్టం చేశారు. (చదవండి: అభ్యర్థి ఎవరైనా కలిసి పని చేయండి: కృష్ణారెడ్డితో కేసీఆర్) వీరి ఆందోళనకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలపగా, ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్ చర్చించినా ససేమిరా అన్నారు. చివరకు కార్పొరేషన్ ఈఈ కృష్ణలాల్ వచ్చి నచ్చచెప్పారు. అలాగే, ఖమ్మంలో ఉన్న నాయకులతో ఫోన్లో మాట్లాడిన ప్రదీప్ బంధువులు వారి సూచనతో ఐదు గంటల ఆందోళన అనంతరం మృతదేహాన్ని ఖమ్మం తరలించారు. కాగా, ఆందోళన నేపథ్యాన నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ పోలీస్స్టేషన్ల నుంచి సిబ్బందిని పిలిపించి ఖమ్మం రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్, ముదిగొండ ఎస్సై నాగరాజు ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటు చేశారు. తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ సీ.హెచ్.శివ పర్యవేక్షించారు. సీపీఐ, సీపీఎం, ప్రజాపంథా, కాంగ్రెస్తో పాటు ప్రజాసంఘాల నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, నున్నా నాగేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, గోగినపల్లి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని నరేందర్, తుమ్మా విష్ణువర్ధన్, మందా వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఎం.జయరాజ్, పొట్టపింజర నాగులు, పగిడికత్తుల నాగేశ్వరరావు, కే.వీ.రెడ్డి, కడియాల శ్రీనివాసరావు, గరిడేపల్లి రామారావు, తోళ్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రోదిస్తున్న ప్రదీప్ భార్య బంధువులు విలేకరిపై రాళ్లదాడి ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, స్థానికులు న్యాయం చేయాలని ధర్నా చేస్తూ అధికారులు రావాలి్సందేనని పట్టుబడ్డారు. ఇంతలోనే నేలకొండపలి్లకి చెందిన ఓ పత్రిక(సాక్షి కాదు) విలేకరి.. అధికారులంతా రావడానికి చనిపోయిన వ్యక్తి ఏమైనా వీఐపీనా అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో మృతుడి కుటుంబీకులు ఆగ్రహంతో అక్కడే ఉన్న రాళ్లతో దాడికి దిగారు. దాదాపు అర కిలోమీటర్ మేర పరుగులు పెట్టిస్తూ రాళ్లు విసరగా, సహచర విలేకరులు, పోలీసులు అడ్డుకుని పంపించారు. రోదిస్తున్న నాగరాణి(కుడి) కుప్పకూలిన నాగరాణి తమ్ముడూ... రాఖీ పండగకు వచ్చాను... నీకు రాఖీ కడతాను, లేవరా అంటూ ప్రదీప్ మృతదేహం వద్ద ఆయన సోదరి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. డీఆర్ఎఫ్ టీమ్ లీడర్ బి.ప్రదీప్(32) అక్క లింగం కనకదుర్గ నాగరాణి బోనకల్లో ఉంటుండగా, పండుగ సందర్భంగా సోదరుడికి రాఖీ కట్టేందుకు రావాలని గురువారం సాయంత్రం సిద్ధమవుతోంది. ఇంతలోనే ఆయన ఏటిలో గల్లంతైనట్లు తెలుసుకుని ఆవేదనతో వచ్చింది. గురువారం చీకటి పడడంతో గాలింపు నిలిపివేసినా తమ్ముడు వస్తాడని ఆశగా ఎదురుచూసింది. శుక్రవారం అక్కడే ఉన్న ఆమె తమ్ముడిపై ప్రేమతో ఆశగా చూస్తోంది. ఇంతలోనే ఆయన మృతదేహాన్ని స్థానికులు తీసుకురావడంతో నాగరాణి కుప్పకూలింది. నాగరాణి తన తమ్ముడు ప్రదీప్తో పాటు అన్నకు ఏటా రాఖీ కట్టేది. కానీ సుర్దేపల్లి చెక్డ్యామ్ ఆమె సంతోషంపై నీళ్లు చల్లడంతో రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. పరిహారం, ఉద్యోగం డీఆర్ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చాక అక్కడ కూడా ధర్నా చేశారు. చివరకు ఒక్కో కార్మికుడి కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం, ఇంటి స్ధలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. (చదవండి: మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..) -
పర్యాటకుల స్వర్గధామం.. ‘కాస్ పీఠభూమి’
పింప్రి: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక మంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. మహారాష్ట్రలోనూ వర్షాకాలంలో అందమైన ప్రకృతి రమణీయమైన జలపాతాలు, పచ్చని కొండలు, లోయలు ఇలా అనేకం ఉన్నాయి. అయితే వీటిలో సాతారా జిల్లాలోని ఓ అందమైన ప్రాంతం.. జిల్లాకు 22 కి.మీ. దూరంలో ఉన్న ‘కాస్ పీఠభూమి’. ఒక అసాధారణమైన బయోస్పియర్, స్థానికులతోపాటు పర్యాటకులను ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ కేవలం ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో దాదాపు 300 రకాలకుపైగా వివిధ రకాలకు చెందిన రంగురంగుల పూలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. కేవలం ఈ రెండు నెలల్లో ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులు తండోపతండాలుగా దేశ, విదేశాల నుంచి తరలి వస్తారు. అదేవిధంగా మరెక్కడా చూడలేని రకరకాల పక్షులను ఈ ప్రాంతంలో చూసేందుకు ఇదే మంచి అవకాశం. పర్వత శిఖరాలపైన కనిపించే ఈ పీఠ భూములు హెలిప్యాడ్లను పోలి ఉంటాయి. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు మొదలయ్యేసరికి వివిధ రకాల గడ్డి పెరిగి, కొండలన్నీ పచ్చటి తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. దీంతో ఆ ప్రదేశానికి రంగులు వేసినట్లుగా పచ్చిక బయళ్లు.. వాటిపై రంగురంగుల బొట్లు పెట్టినట్లుగా వివిధ రకాల పూలు చూడముచ్చటగా కనిపిస్తాయి. పసుపు రంగు, ఇత ర రంగుల పుష్పాలతో రంగురంగు తివాచీలు పర చి మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ప్రకృతి దృశ్యాలను తిలకించేందుకు, పలు రకాల పుష్పాలను, పక్షులను అధ్యయనం చేసేందుకు వృక్ష, జంతు శాస్త్ర నిపుణులు, ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రఫీ ప్రియులు, పర్యాటకులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా ఈ ప్రదేశానికి తరలివస్తుంటారు. పర్వత ప్రాంతం ఈ రెండు నెలల్లో పర్యాటకుల వాహనాలతో కిక్కిరిసిపోతుంది. అయితే ఈ పీఠభూమికి కాలినడకన మాత్రమే చేరాల్సి ఉంటుంది. ఈ ప్రకృతిని ఆస్వా దించిన పర్యాటకులకు ఈ ప్రదేశం తమ జీవితంలో ఒక మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రయాణం.. అత్యంత అద్భుతం.. సతారా నుంచి కాస్కు వెళ్లే మార్గం కొంత ఇరుకుగా ఉన్నప్పటికి పర్వతాలపైకి వెళ్తున్నంతసేపు పర్యాటకులను తాకే చల్లటి గాలులు మొత్తం శ్రమను దూరం చేస్తాయి. ముందుకు సాగుతున్నంతసేపూ ఎన్నో అద్భుతాలను, మనోహరమైన ప్రకృతి దృశ్యాలను కెమరాలలో బంధించవచ్చు. ముఖ్యంగా ప్లాస్టిక్కు సంబంధించిన ఎలాంటి వ్యర్థ పదార్థాలు ఇక్కడ మచ్చుకైనా కనిపించవు. దీంతో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన సందర్శకులు పూలను, మొక్కలను తెంచకపోవడం మరో విశేషం. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఈ వింత లోకాన్ని చూడడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చూడాల్సిన ప్రదేశాలు.. కాస్లేక్.. కాస్ పీఠభూమి సముద్ర మట్టానికి 3,725 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ పీఠభూమి సహ్యాద్రి కొండల మధ్య గిన్నె ఆకారంలో కనిపిస్తుంది. కొయనా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ద్వారా కాస్ లేక్ ఏర్పడింది. సతారా పట్టణానికి తాగునీటిని ఈ లేక్ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ సరస్సు ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. స్వచ్ఛతలో ఈ లేక్ దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పవచ్చు. ఇక్కడ బోటింగ్ ఓ అద్భుత, చిరస్మరణీయ అనుభూతిని కల్గిస్తుంది. ఈ ప్రాంతం మొక్కలకు, వన్యజీవులకు అనుకూలంగా నిలుస్తుంది. భూలోకంలో స్వర్గాన్ని అనుభవించాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందర్శించి.. ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాల్సిందే. చల్కేవాడి.. వందలాది గాలి మరలు ఇక్కడ పర్వతాలపై మనకు టాటా చెబుతూ వీడ్కోలు పలుకుతుంటాయి. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు పలు సినిమా షూటింగ్లు ఇక్కడ జరుగుతుంటాయి. ఈ గాలి మరల ద్వారా ఇక్కడ విద్యుచ్ఛక్తిని తయారు చేస్తున్నారు. అందుకే సతారా జిల్లాను ‘డిస్ట్రిక్ట్ ఆఫ్ పవర్’గా పిలుస్తున్నారు. చల్కేవాడి పవన నిలయంగా చెప్పవచ్చు. నైసర్గ్ ఆర్గానిక్ ఫార్మ్.. సతారాకు చెందిన శిందే ఈ ఆర్గానిక్ ఫామ్ను నడుపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన సర్పగంధ, ఇన్సులిన్, తులసి లాంటి వివిధ మొక్కలను ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడ సజ్జన్ఘడ్ కోటను కూడా చూడవచ్చు. (క్లిక్: ఆ భార్యాభర్తలు దేశం మొత్తం నడిచేశారు) తోసేఘర్ వాటర్ ఫాల్స్... సతారా నుంచి 20 కి.మీ. దూరాన తోసేఘర్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ వెయ్యి అడుగుల పైనుంచి కిందున్న లోయలోకి పడుతుంటాయి. పర్యాటకులకు ఈ దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. వేలాది మంది పర్యాటకులు ఈ జలపాతాలను చూడడానికి దేశ నలుమూలల నుంచి వస్తుంటారు. వాటర్ ఫాల్స్కు ఎదురుగా ఉన్న లోయపైన ఒక ప్లాట్ఫాంను నిర్మించడం వల్ల ఈ జలపాతాలను దగ్గరగా చూసేందుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి సాహస కృత్యాలు చేయకూడదు. గతంలో చాలామంది పర్యాటకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఇక్కడి ప్రకృతి అందా లు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. (క్లిక్: అదిరే..అదిరే.. అతిరాపల్లి వాటర్ ఫాల్స్) -
అదృష్టవంతుడు.. మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చాడు!
ముంబై: సాధారణంగా చేపలు పట్టడం కొందరికి హాబీ అయితే, మరికొందరికి జీవనోపాధిగా ఉంటుంది. అయితే చేపల వేట కోసమని వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు! వివరాల్లోకి వెళితే.. ఒక ఆదివాసీ తెగకు చెందిన 40 ఏళ్ల విజయ్ కాక్వే చేపలు పట్టేందుకు ముంబైలోని పొవై ప్రాంతంలోని చెరువు వద్దకు వెళ్లాడు. ఒడ్డున కూర్చోని చేపలు పడుతున్నాడు. ఇంతలో అతనిపై ఓ మొసలి దాడి చేసింది. ఎట్టికేలకు అతను మొసలితో పోరాడి దాని నోట్లో పడకుండా బయటపడ్డాడు కానీ ఈ దాడిలో అతని కాలికి తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు కాక్వేని ఘట్కోపర్లోని రాజవాడి ఆస్పత్రికి తరలించారు. పొవై సరస్సు అంచున నిర్మించిన ర్యాంప్ వల్ల ఈ మొసలి దాడి నుంచి బయటపడినట్లు స్థానికులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే బీఎంసీ అధికారులు ఆ ప్రాంతంలో మరిన్ని వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలు కారణం ఇదేనా.. ప్రతి ఏడాదిలో ఈ సమయంలో.. మొసళ్ళు పొవై సరస్సు పక్కన మెత్తటి నేలపై గుడ్లు పెడుతుంటాయి. అయితే ఇప్పటికే, సరస్సు అవతలి వైపు, రెనైసాన్స్ హోటల్కు సమీపంలో చాలా నిర్మాణ కార్యకలాపాలు జరిగాయి. అలాగే, చాలా మంది పిక్నిక్ స్పాట్లుగా ఆ ప్రాంతానికి వెళ్లడం, సరస్సు సమీపంలో పార్టీలు లాంటివి జరగడంతో ఇవి ఆ సరస్సులోని సముద్ర జాతులకు ఆటంకంగా మారింది. ఈ కారణంగానే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. చదవండి: ఉత్తరాఖండ్లో దారుణం.. కదులుతున్న కారులో తల్లీ, కూతురిపై సామూహిక అత్యాచారం -
భార్యను హత మార్చిన 'సాఫ్ట్వేర్' భర్త
-
Ganvie: బతికి తేలిన ఊరు
సాగరానికి చేరువలో నీటి మధ్య కొలువైన అద్భుతం.. వెనిస్ నగరం. ఆ ఊరు పేరు చెప్పగానే ఎటుచూసినా నీరు.. మధ్యలో అందమైన భవనాలు.. వంతెనలు.. పడవ ప్రయాణాలు.. కళ్లల్లో మెదులుతాయి. అయితే అలాంటి హంగులేవీ లేని వెనిస్ గురించి ఎప్పుడైనా విన్నారా? చీకటి ఖండం ఆఫ్రికాలో ఉంది ఆ ఊరు. పేరు.. గాన్వీ. నీటిపై తేలియాడే ప్రాంతాలు నిజంగా అద్భుతాలు. అలాంటి అద్భుతాల్లో ఒకటే గాన్వీ. వెనిస్ అంత కాకపోయినా ఈ ఊరూ పర్యాటకానికి వరల్డ్ ఫేమస్సే. కారణం.. నీటి అందాలతో పాటు ఈ ఊరికి ఉన్న చారిత్రక నేపథ్యం. ఇది పశ్చిమ ఆఫ్రికా, బెనిన్ ప్రాంతంలోని నోకోయూ సరస్సు మధ్యలో ఉంటుంది. బానిసత్వం రాజ్యమేలిన కాలంలోనే గాన్వీ వెలిసిందని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. సుమారు నాలుగు వందల ఏళ్ల కిందట టోఫిన్ గ్రామ ప్రజలు.. ఫోన్తెగ పోరాటయోధులకు భీతిల్లి ఇలా నీటి మధ్యలో ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఫోన్తెగ వాళ్లు తమను బానిసలుగా అప్పజెప్తారనే భయంతోనే టోఫిను ప్రజలు పారిపోయారు. అలా సరస్సు మధ్యలో వెలిసిన ఆ ఊరు.. ఇప్పుడు పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. గాన్వీ అంటే వాళ్ల భాషలో ‘బతికి బట్టకట్టాం’ అని అర్థం. అందుకే ఆ పేరొచ్చింది గాన్వీ జనాభా ముప్పై వేలకు పైనే. వీళ్లు సరస్సు మధ్యలో గట్ల వెంట ఆరడుగుల కంటే ఎత్తులో వెదురు బొంగులు, చెక్కలతో ఇళ్లు నిర్మించుకున్నారు. మూడు వేలకు పైగా భవనాలు నీటి మధ్యలోనే ఉంటాయి. అందులో రెండు బడులు, ఓ బ్యాంకు, ఓ పోస్టాఫీస్, ఇంకా ప్రార్థన మందిరాలు ఉన్నాయి. నీటి ఆవాసం కారణంగా వీళ్లను ‘నీటి మనుషులు’(వాటర్ మెన్) అని వ్యవహరిస్తుంటారు. ఊరిలో తిరగడానికి ఏకైక మార్గం.. చిన్నపడవలు. అందుకే గాన్వీకి ‘వెనిస్ ఆఫ్ ఆఫ్రికా’ అనే పేరొచ్చింది. కోళ్లను ఎక్కువగా తినే గాన్వీ ప్రజలు.. తాటాకులతో, గడ్డిపోచలతో చేపలనూ వేటాడి తింటారు. ఒకప్పుడు చేపలు పట్టడమే ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. కానీ ఇప్పుడు దాన్ని పక్కనపెట్టి.. టూరిస్ట్ గైడ్స్గా మారిపోతున్నారు. రీజన్.. టూరిస్టులు క్యూ కడుతుండడమే. సోలార్ ప్యానెల్స్, జనరేటర్స్, సరస్సు నీటితో కరెంట్ అందుతోంది ఈ ఊరికి. పడవల మీదే తిరుగుతూ కూరగాయలు, నిత్యావసరాలు అమ్ముతుంటారు. 1996లో గాన్వీ.. వెనిస్ ఆఫ్ ఆఫ్రికాకు ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కింది. నెట్ఫ్లిక్స్లో ఈమధ్యే స్ట్రీమింగ్లోకి వచ్చిన డాక్యుసిరీస్ ‘హై ఆన్ ది హోగ్: హౌ ఆఫ్రికన్ అమెరికన్ కజిన్ ట్రా¯Œ్సఫార్మ్డ్ అమెరికా’లో గాన్వీ గురించీ ఉంటుంది. రణగొణ ధ్వనులకు దూరంగా.. రాకపోకలకు బాటలుగా పిల్ల కాలువలున్నాయి. అందుకే కాలుష్యం ఈ నగరానికి ఆవలే ఉండిపోయింది. ఓవైపు వరదలు పోటెత్తుతున్నా.. మరోవైపు పర్యాటకులతో కిటకిటలాడుతోంది గాన్వీ. అందుకు కారణం.. మనసుకు సాంత్వననిచ్చే ప్రాంతం కావడమే. మొసలి రాజు? ఈ ఊరికి ఓ నేపథ్య కథ కూడా ప్రచారంలో ఉంది. బానిసత్వమంటే టోఫిన్ ప్రజలు భయపడుతున్న సమయంలో.. గాన్వీ రాజు ఒక కొంగగా మారి సురక్షితమైన ప్రదేశం కోసం గాలించాడు. ఆ తర్వాత నోకోయూ సరస్సును సురక్షితమైన ప్రాంతంగా గుర్తించి వాళ్లను అక్కడికి వెళ్లమని సూచించాడు. అయితే తమ వస్తువులతో అక్కడికి వెళ్లడం కష్టంగా మారడంతో.. భారీ మొసలిగా మారిన ఆ రాజు తన వీపుపై వాళ్లందరినీ మోసుకుంటూ వెళ్లాడట. తీరా ఆ సరస్సులో శాపగ్రస్త ఆత్మలు ఉన్నాయనే భయంతో నది నీటిని తాకకూడదనే ఉద్దేశంతో కాస్త ఎత్తులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని ఆ కథ సారాంశం. అయితే గాన్వీ నేటి తరం మాత్రం అలాంటి నమ్మకాలేవీ లేకుండా.. మొసళ్లు లేని ఆ సరస్సులో హాయిగా జీవిస్తోంది. -భాస్కర్ శ్రీపతి -
చైనా వక్రబుద్ధి?.. మరో అక్రమ వంతెన నిర్మాణం
చైనా తన వక్రబుద్ధిని మరో సారి ప్రదర్శించింది. భారత్ను ఎలాగైనా దెబ్బకొట్టేందుకు దొంగ ప్రయత్రాలు చేస్తోంది. ఇందులో భాగంగా తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పాంగాంగ్ సరస్సుపై ఖుర్నాక్ వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేసింది. తాజాగా ఈ బ్రిడ్జ్ను దగ్గరలోని సైనిక స్థావరానికి అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. ఖుర్నాక్ సమీపంలో గతేడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి డ్రాగన్ వంతెన నిర్మాణం ప్రారంభించింది. ఇది ఏప్రిల్ తొలివారంలో పూర్తయింది. దీంతో ఖుర్నాక్ నుంచి దక్షిణ ఒడ్డుకు 180 కిలోమీటర్ల దూరం కాస్తా.. 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది. 1962 నుంచి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మించింది. ఇది వరకే ఈ వంతెన నిర్మాణంపై.. ‘భారత ప్రభుత్వం ఈ అక్రమ ఆక్రమణను ఎప్పటికీ అంగీకరించలేదు’ అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటులో తెలిపారు. పాంగాంగ్ సరస్సు సమీపంలోని కీలక స్థానాలపై నియంత్రణ సాధించడం కోసం చైనా ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఆగస్టు 2020 నాటి పరిస్థితి ఎదురైనప్పుడు భారత సాయుధ బలగాలు ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలో భాగంగా ఈ వంతెన నిర్మాణమని చేపట్టింది. దీంతో స్పంగూర్ సరస్సు వద్దనున్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరిజాప్లలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం లభించింది. చదవండి: PM Modi-PM Danish: డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్ Further developments to the new Chinese bridge at #PangongTso, recent imagery shows roadworks have begun (as mapped in the quoted tweet) to join the bridge most likely to Rutog, giving #China's PLA troops in the area quicker connectivity through the terrain https://t.co/xLDhDTefvL pic.twitter.com/ELwWr6xE1N — Damien Symon (@detresfa_) May 2, 2022 Incase you're still wondering why the new bridge at #PangongTso matters, here's an explainer on its implications & potential advantages it holds for #China's troops in the area, very likely a lesson learnt from #India's maneuvers at Rezang La in 2020 https://t.co/wsQwQuHQT9 pic.twitter.com/xoAzkWIhqY — Damien Symon (@detresfa_) January 4, 2022 -
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
-
తీవ్ర విషాదం.. క్షణాల వ్యవధిలో మూడు తరాల బంధం జలసమాధి
సాక్షి, వరంగల్: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. నర్సంపేట మండలం చిన్న గురిజాల గ్రామానికి చెందిన వెంగలదాసు కృష్ణమూర్తి (55)కి దుగ్గొండి మండలం అడవిరంగాపురం శివారు రాళ్ల కుంట పక్కనే వ్యవసాయ భూమి ఉంది. అందులో వేసిన మొక్కజొన్న పంట కోసి నూర్పిడి చేశాడు. మొక్కజొన్నలను బస్తాల్లో నింపడానికి కృష్ణమూర్తి, ఆయన భార్య విజయ, కొడుకు నాగ రాజు (34), కోడలు సంధ్య, ఇద్దరు మనవలు దీపక్ (11), కార్తీక్ సెలవు దినం కావడంతో చేను వద్దకు వచ్చారు. పంటను బస్తాల్లో నింపి చేతులు, కాళ్లు కడుక్కోవడానికి కృష్ణమూర్తి, మనవడు దీపక్ ఇద్దరూ కుంట వద్దకు వెళ్లారు. దీపక్ నీటిని చూసి ఉత్సాహంగా అందులోకి దిగి మునిగాడు. వెంటనే గమనించిన తాత కృష్ణమూర్తి మనవడిని రక్షించబోయి తను కూడా మునిగాడు. ఎంతకూ తండ్రి, కొడుకు రాకపోవడంతో కుంట వద్దకు వెళ్లిన నాగరాజు.. ఇద్దరూ మునుగుతూ.. తేలుతుండటం చూశాడు. వారిని రక్షించే క్రమంలో నాగరాజు సైతం కుంటలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వ్యక్తులు ఒకేసారి మృతి చెందడంతో చిన్న గురిజాల, అడవిరంగాపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సందర్శించి.. కుంటలోని మృత దేహాలను బయటకు తీయిం చారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుగ్గొండి సీఐ సూర్యప్రసాద్, ఎస్ఐ నవీన్కుమార్ సంఘటన స్థలాన్ని పరి శీలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దిగ్భ్రాంతి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కుంటలో మునిగి మృతి చెందడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. -
Saroornagar Lake: మారని కథ.. నెరవేరని సీఎం కేసీఆర్ హామీ!
సాక్షి, చైతన్యపురి: నగరంలో మినీ ట్యాంక్ బండ్గా ప్రసిద్ధి చెందిన సరూర్నగర్చెరువు నానాటికి దుర్గంధ భరితంగా తయారైంది. సందర్శకులు సేదతీరేందుకు రావాలంటేనే బయపడే పరిస్థితి నెలకొంది. దుర్వాసన కారణంగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సరూర్నగర్ మినీట్యాంక్ బండ్ను హుస్సేన్ సాగర్లా అభివృద్ధి చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా నెరవేరకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు సరూర్నగర్ చెరువు సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 1906లో అప్పటి నైజాం రాజు తాగు, సాగునీటి అవసరాల కోసం 99 ఎకారాల విస్తీర్ణంలో సరూర్నగర్ చెరువును తవ్వించారు. ఇటలీ నుంచి పక్షులు సరూర్నగర్ చెరువుకు విడిదికి వచ్చేవి. చదవండి: ‘విషం తాగించి, హత్యాయత్నం చేశారు.. నా భర్తతో ప్రాణహాని ఉంది’ ► నగరం అభివృద్ధి చెందటం, చెరువు చుట్టూ ఆక్రమణలకు గురైంది. ప్రస్తుతం చెరువు 60 ఎకరాలు మిగిలింది. ► పాత సరూర్నగర్ మండలంలోని గ్రామాలనుంచి, అక్కడి చెరువుల నుంచి మురుగునీరు సరూర్నగర్ చెరువులో కలుస్తుండటంతో మురికి కూపంలా తయారైంది. ► దీనికి తోడు పరిసర కాలనీల ప్రజలు వ్యర్థాలను వేయటంతో పరిస్థితిదారుణంగా మారింది. దీంతో వలస పక్షులు రావటం మానేశాయి. ► 2003లో స్థానికుల ఆందోళనతో రూ.3 కోట్లతో సివరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినప్పటికీ సక్రమంగా పనిచేయక పోవటంతో చెరువు మురుగునీటితో నిండి పోయింది. ► చెరువు అభివృద్ధిలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని పార్కును ఏర్పాటు చేసి బోటింగ్ సౌకర్యం కల్పించారు. అయితే, నీరు దుర్గంధ భరితంగా మారడంతో బోటింగ్కు ఆదరణలేకుండా పోయింది. ►చెరువులోకి వచ్చే మురుగు నీటి శుద్ధికి ఏర్పాటు చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయకపోవటంలో సమీప ప్రాంత కాలనీల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు. దోమల బెడదతో కూడా ఎక్కువగా ఉంది. ► దుర్వాసన కారణంగా సందర్శకులు కూడా మినీట్యాంక్ బండ్పై ఉండలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి హామీ ఏమైంది ? ► తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మినీ ట్యాంక్ బండ్ను సందర్శించి హుస్సేన్ సాగర్లా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. అంతేకాక రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ సరూర్నగర్ మినీట్యాంక్ బండ్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి చేయకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం జీహెచ్ఎంసీ, లేక్ అభివృద్ధి శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే మినీట్యాంక్బండ్ అభివృద్ధి జరగటం లేదు. చెరువులోకి మురుగు చేరకుండా చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశాం. చెరువులో వ్యర్థాలు వేయకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరాం. చెరువు ఔట్లెట్ వద్ద నాలాల్లోకి చెత్త చేరకుండా జాలీ ఏర్పాటు చేయాలని కోరాం.మా జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. –బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డి, కార్పొరేటర్, గడ్డిఅన్నారం డివిజన్ -
హుస్సేన్ సాగర్ పై వేలాడే వంతెనలు
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ మరింత అందమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. సాగర్ ను మరింత కనువిందుగా తీర్చి దిద్దేందుకు వేలాడే వంతెన లు నిర్మించేందుకు ప్రతి పాదనలు, రూపొందించారు. రష్యాలోని జీయాడు పార్క్ నుంచి రెడ్ స్క్వర్ వైపు ఉతరం వైపు ఉన్న మాస్కో నదిలోకి నిర్మించిన వేలాడే వంతెనల తరహాలోనే నెక్లెస్ రోడ్ నుంచి హుస్సేన్ సాగర్ లోకి వంతెనలను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వ కార్యధర్సి అరవింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మాస్కో నదిలోకి నిర్మించిన పై వంతెన ఫోటో దృశ్యాల్ని ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికల్లా హుస్సేన్ సాగర్ లేక్ వ్యూ ను మాస్కో నది తరహాలో అభివృధి చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
మహిళను మింగిన ఇసుక గుంత
ఆత్మకూర్–ఎస్ (సూర్యాపేట):. ఇసుక గుంత ఓ మహిళను మింగింది. ఈ ఘటన మండల పరిధిలోని మక్తా కొత్తగూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వీరబోయిన పూలమ్మ(34) పొలం పనుల నిమిత్తం ఏటిలో నుంచి అవతలికి వెళ్తుండగా ఇసుకకోసం తీసిన గుంతలో కాలుజారి పడడంతో నీటిలో మునిగింది. సమీప రైతులు గమనించి ఆమెను రక్షించేలోపే మృతిచెందింది. మృతురాలికి భర్త సత్తయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇష్టానుసారంగా ఇసుకతవ్వకాలు పాతర్లపహడ్, ముక్కుడుదేవులపల్లి, రామన్నగూడెం, ఏపూరు, బొప్పారం, మక్తాకొత్తగూడెం గ్రామల నుంచి బిక్కేరు వాగు వెళ్తుంది. ఈ వాగు నుంచి ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఇసుకతరలిస్తున్నారు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరుగుతుండడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి.వర్షాలు వచ్చినప్పుడు అందులో నీరుచేరడంతో తెలియక పశువులు, మనిషులు ప్రమాదాల బారిన పడుతున్నారు.మక్తా కొత్తగూడెంలో ఏరు దాటే సమయంలో ఎక్కడ గుంతలు ఉన్నయో తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. రెండు నెలల క్రితం మక్తాకొత్తగూడెం గ్రామానికి చెందిన మహిళ ఏరుదాటుతూ నీటిలో మునిగి మృతిచెందగా ప్రస్తుతం అదే గ్రామానికి చెందిన వీరబోయిన పూలమ్మ ఇసుక తవ్వకంతో ఏర్పడిన గుంతలో జారిపడి మృతిచెందడం ఇసుక మాఫియా ఆగడాలకు నిదర్శనం. వాగుదాటేదెలా... మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి 15కిలో మీటర్లకు పైగా వెళ్తున్న బిక్కేరు వాగు అవతల పలు గ్రామాల భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. ఆ భూముల్లో సాగుచేయడానికి రైతులు ప్రమాదమని తెలిసినా దాటకతప్పడంలేదు. వాగు దాటి రైతులు తమ భూముల్లోకి వెళ్లడానికి ఎక్కడా వంతెనలు లేవు. ప్రమాదమని తెలిసినా రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో వాగులో నుండే వెళ్తున్నారు. లేదా దూరమైనా వేరే గ్రామాల నుంచి తిరిగివస్తున్నారు. తమ భూములు సాగుకు నోచుకోవాలంటే వంతెనలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. -
సముద్రం, భూమి కలిసి చెస్ ఆడుతూ..
ఇక్కడ సముద్ర తీరంలో చెస్ కాయిన్లలా కనిపిస్తున్నవి ఏమిటో తెలుసా?.. ఏవో శిల్పాల్లా ఉన్నాయి, ఎవరో పెట్టి ఉంటారులే అనిపిస్తోందికదా.. కానీ అవి శిల్పాలూ కాదు, ఎవరూ ఏర్పాటు చేయలేదు. ఇవి ప్రకృతి సృష్టించిన చిత్రాలు. కేవలం ఇసుకతో ఏర్పడిన చిన్నపాటి స్తంభాలు. అమెరికాలోని లేక్ మిషిగన్ ప్రాంతంలో రెండు రోజుల కింద ఈ చిత్రమైన ఇసుక ఆకృతులు ఏర్పడ్డాయి. వీటిని అక్కడ ‘హూడూస్’ అని పిలుస్తారు. (క్లిక్: అరుదైన గ్రహాంతర వజ్రం.. కాసులుంటే మీ సొంతం !) అక్కడ చలికాలంలో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి. సముద్ర తీరంలో నీళ్లు ఇసుకలో చేరి అక్కడక్కడా గడ్డకడతాయని, ఆ తర్వాత అలలకు ఇసుక కోతకు గురవడం, దానికి గాలి తోడవడంతో.. ఇలా రకరకాల ఆకారాల్లో ఇసుక స్తంభాలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తాజాగా టెర్రీ అబ్బాట్ అనే ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. సముద్రం, భూమి కలిసి సరదాగా చెస్ ఆడుతూ.. మధ్యలో వదిలేసినట్టుగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. (చదవండి: అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు) -
ఇప్పటివరకు 25 వేల పక్షులు.. వావ్ వాట్ ఏ సీన్!
బరంపురం: నగర శివారులోని బహుదా నదీ తీరాన విదేశీ అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. తొలిసారిగా ఇక్కడికి విచ్చేస్తున్న విహంగాలను చూసి నగరవాసులు ఆనందం వ్యక్త చేస్తున్నారు. ఏటా శీతాకాలంలో గంజాం జిల్లా, బరంపురం దగ్గరలోని చిలికా సరస్సులో ఉన్న 24 దీవులకు విదేశాల నుంచి కొన్ని లక్షల సంఖ్యలో వలస పక్షులు వచ్చి, విడిది చేస్తుంటాయి. ఎప్పటిలాగే కాకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 185 జాతులకు చెందిన దాదాపు 10 లక్షల పక్షులు చిలికాకు చేరుకోవడంతో, వాటిలో కొన్నింటి నివాసం ఏర్పాటుకు కాస్త అడ్డంకి ఏర్పడింది. దీంతో విడిది కోసం సరస్సుకు సమీపంలోని బహుదా నదికి కొన్ని పక్షులు చేరుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తున్న అక్కడి వారు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల పక్షులు నదీ తీరానికి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నదీ తీరంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అక్కడి అడవిలోకి తరలించేందుకు వెళ్లిన బరంపురం అటవీ శాఖ అధికారుల ద్వారా అతిథి పక్షుల ఆచూకీ వెలుగులోకి రావడం విశేషం. ప్రస్తుతం నది పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకుని 25 వేల వరకు పక్షులు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎఫ్ఓ అముల్యకుమార్ ప్రధాన్ తెలిపారు. చదవండి: కొన్ని రోజులు కాపురం చేసి ముఖం చాటేశాడు.. 44 రోజుల పాటు పగలు, రాత్రి.. చివరికి -
విదేశాల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్!
సాక్షి,బరంపురం: చిలికా సరస్సుకు ప్రతీ ఏడాది మాదిరిగానే విదేశీ పక్షులు వచ్చి చేరుతున్నాయి.తమ జాతి పక్షులతో జతకట్టేందుకు చిలికా దీవుల్లో విడిదిని ఏర్పరచుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల కారణంగా చలి ఎక్కువై లక్షలాది విదేశీ విహంగాలు చిలికా సరస్సుకు చేరుతున్నాయి. విదేశీ పక్షులు వేటగాళ్ల బారిన పడకుండా చిలికా వన్యప్రాణి అభివృధ్ధి సంస్థ అధికారులు గట్టి నిఘాను ఏర్పాటుచేశారు. ( చదవండి: మత్తు చల్లుతున్నారు.. అందుకే చూశారా? ) మూడు వారాలుగా సుమారు 8.94 లక్షల విదేశీ పక్షులు సరస్సుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంతానానికి శ్రీకారం రకరకాల విదేశీ పక్షులు చిలికా సరస్సు మధ్యన ఉన్న బరుకుల్, నల్లబాల, కాళీజై, సత్తపరా, బ్రేక్పాస్టు, శరణ్, చోడైహోగా, మంగళాజోడి, పరికుద్ దీవులకు లక్షల సంఖ్యలో చేరుకొని విడిదిని ఏర్పర్చుకున్నాయి. ప్రకృతిలో వచ్చే మార్పును మనుషులతో పాటు పక్షులు కూడా తెలుసుకుంటాయనడానికి.. చలికాలంలో చిలికా సరస్సుకి లక్షలాది పక్షులు రావడమే నిదర్శనం. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ గూడు కట్టుకొని తమ జాతి పక్షులతో జతకలిసి సంతాన అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాయి. చదవండి: లావైపోయారు.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారు.. -
నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ?
పుణ్య క్షేత్రాలకు, పురాతన దేవాలయాలకు మన దేశం పెట్టిందిపేరు. ఐతే మన దేశ అగ్రభాగంలో ఉన్న ఓ నది మాత్రం పుణ్యక్షేత్రం కానప్పటికీ దానిని చూసేందుకు వేలల్లో జనాలు వెళ్తుంటారు. కాకపోతే ఆ నదిలో నీళ్లతోపాటు, పైన తేలే అస్థిపంజరాలు కూడా ఉంటాయి. దీని వెనుక దాగి ఉన్న మిస్టరీ ఎంటో తెలుసుకుందాం.. ఏడాదంతా మంచులోనే.. అదికరిగిందంటే మాత్రం.. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోనే ఉందీ నది. రూప్ఖండ్ నది అని దీనికి పేరు. ఇది సముద్ర మట్టానికి 5029 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏడాదిలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుందీ నది. కానీ మంచు కరిగిపోగానే అక్కడి వాతావరణం అంతా కూడా భయానకంగా మారిపోతుంది. వందలాది అస్థిపంజరాలతో చూసేందుకు అత్యంత భీభత్సంగా ఉంటుంది. ఈ అస్థిపంజరాలను మొదటిసారిగా 1942లో బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ గుర్తించారు. ఐతే ఎన్నో యేళ్లుగా ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు సాగాయి. ఎవరెవరేం చేప్పారంటే.. జనరల్ జోరావర్ సింగ్ సైన్యమేనా.. ఈ అస్థిపంజరాలు కాశ్మీర్కు చెందిన జనరల్ జోరావర్ సింగ్ సైన్యానికి సంబంధించినవని అక్కడి స్థానికులు నమ్ముతారు. 1841లో టిబెట్ యుద్ధం నుండి తిరిగి వస్తుండగా, మంచు తుఫానులో చిక్కుకుని హిమాలయ ప్రాంతం మధ్యలో తప్పిపోయి మరణించారనే కథనం ప్రచారంలో ఉంది. చదవండి: Interesting Facts About Death: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. మంచు తుఫానే కారణమా.. కనౌజ్ రాజా జస్ధావల్, అతని భార్య బలంప, అతని సేవకులు, నృత్య బృందంతో కలిసి నందా దేవి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు పెద్ద మంచు తుఫాను కారణంగా పూర్తి సమూహం మరణించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవం ఏమిటీ? ఐతే 2014 శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ఫ్రోజెన్ లేక్లో ఉన్న మొత్తం 200 అస్థిపంజరాలు 9వ శతాబ్ధానికి చెందినవ భారత తెగకు చెందినవని, భారీ వడగండ్లవానలో వీరంతా మరణించారని తేల్చింది. దీనితో దీనివెనుక దాగిన మిస్టరీ వీడింది. పాపం.. అంత పెద్ద వడగండ్లు తగిలి.. మృతుల తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగలడం మూలంగా వీరంతా మరణించారని, బహుశా క్రికెట్ బాల్ సైజు వడగళ్ళు కురిసి ఉండవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఐతే వారి శరీర ఇతర భాగాలపై ఎటువంటి గాయాలు కనుబడలేదట. దీంతో ఎటువంటి యుద్ధం గానీ, ఆయుధాల ప్రమేయంగానీ లేకుండా జరిగిన ప్రమాదమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ప్రతీయేట ఈ మిస్టీరియస్ రూప్ఖండ్ నదిని చూసేందుకు వేలాదిమంది పర్యాటకులు, సాహసికులు వస్తుంటారు. ఈ సరస్సు చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, చూపరులకు అందమైన అనుభూతిని కలిగించినప్పటికీ, నదిలో తేలుతున్న అస్థిపంజరాల భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు మాత్రం వారి వెన్నులో వణుకు ప్రారంభమౌతుంది..!! చదవండి: Coffee and Alzheimer's Disease: మతిమరుపుతో బాధపడుతున్నారా? కాఫీతో మీ బ్రెయిన్కు పదును పెట్టండి.. -
ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్..
రొటీన్కి భిన్నంగా వెరైటీ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? లేక్ ఆఫ్ నో రిటర్న్కు వెళ్లండి. ఎందుకుంటే ఇదో రహస్యాల పుట్ట. మన దేశంలో ఉన్న మిస్టీరియస్ ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. మీరిప్పటి వరకు చాలా సరస్సుల గురించి వినడం, చదవడం, చూడటం జరిగి ఉండవచ్చు. కానీ ఈ మిస్టీరియస్ సరస్సుకు వెళ్లినవారు మాత్రం తిరిగి రావడం ఇప్పటివరకూ జరగలేదు. ఇది కథలో సరస్సు కాదు. ఇలలోని సరస్సే! ఎక్కడుందో తెలుసా.. మనదేశానికి, మయన్మార్కు మధ్య సరిహద్దు ప్రాంతంలో అంటే అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో నవాంగ్ యాంగ్ సరస్సు ఉంది. దీనిని అందరూ మిస్టీరియస్ లేక్ అని పిలుస్తారు. అనేక సంఘటనల ఆధారంగా దానికాపేరు వచ్చింది. ప్రచారంలో ఉన్న కొన్ని కథనాలు ఏంటంటే.. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపనీస్ సైనికులతో ఉన్న ఒక విమానం ఈ ప్రదేశంలో అత్యవసర ల్యాండ్ అయ్యిందట (వాళ్లు దారి తప్పటం వల్ల). ఐతే చాలా అనూహ్య రీతిలో విమానంతో సహా అందరూ అదృశ్యమయ్యారట. ఒక అధ్యయనం ప్రకారం యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్తున్న జపాన్ సైనికులందరూ మలేరియా కారణంగానే మరణించి ఉంటారని పేర్కొంది. చదవండి: Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..! ఐతే ఈ సరస్సు చుట్టుపక్కల గ్రామస్తుల్లో మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఒక అతనికి ఈ సరస్సులో ఓ పెద్ద చేప దొరికింది. దీంతో అతను ఆ గ్రామంలోని అందరికీ విందు ఏర్పాటు చేశాడు. కానీ ఓ వృద్ధురాలు, ఆమె మనవరాలిని మాత్రం అతను విందుకు ఆహ్వానించలేదు. దీంతో సరస్సుకు కాపలా కాస్తున్న వ్యక్తి కోపోద్రిక్తుడై వారిద్దరినీ ఊరు విడిచి వెళ్లమని ఆజ్ఞాపించాడు. కానీ ఆ మరుసటి రోజే ఊరంతా సరస్సులో మునిగిపోయిందట. అక్కడి గ్రామస్తుల్లో ఈ విధమైన జానపద కథలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ఐతే ఈ మిస్టీరియస్ సరస్సు రహస్యాన్ని ఛేదించడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! ఈ విధంగా అనేక పురాణాలు, కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ.. అరుణాచల్ ప్రదేశ్లో పర్యాటకాన్ని పెంచాలనే ఆశతో అక్కడి గ్రామస్తులు ఈ స్థానిక బెర్ముడా ట్రయాంగిల్పై రకరకాల కథనాలను ప్రచారం చేస్తున్నారనే నానుడి కూడా ఉంది. చదవండి: ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!! -
చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. దత్తిరాజేరు మండలం మారడాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. కాగా, బస్సులో 79 మంది ప్రయాణికులున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. బస్సు విజయనగరం నుంచి సాలూరు వైపుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. -
కంగారులో బ్రేకు, యాక్సలరేటర్, పెడల్ని కలిపి నొక్కాడు..ఇక అంతే !
వియన్నా: ఒక్కోసారి ఆందోళనగా లేదా గందరగోళంగా ఉన్నప్పుడు మనం చేసే పనులు ఎంత ప్రమాదకరంగా మారతాయో చెప్పవలసిన అవసరం లేదు. అందుకే ఆందోళనగా ఉన్నప్పుడూ కాసేపు నిధానంగా ఉండమని పెద్దులు చెబుతారు కాబోలు. కానీ ఆస్ట్రియాకు చెందిన ఒక వ్యక్తి ఇదే విధంగా గందరగోళంలో ఒక చెత్త పనిచేసి ఎంత పెద్ద ప్రమాదం కొని తెచ్చుకున్నాడో చూడండి. (చదవండి: ఏవరు ఈమో నా పియానో వాయిస్తుంది ?) లంబోర్ఘి హురాకాన్ అనే కారు యజమాని సమీపంలోని సరస్సు వద్ద కారు రివర్స్ చేస్తూ పొరపాటున బ్రేక్, యాక్సిలరేటర్ పెడల్ను ఒకేసారి నొక్కేశాడు. ఇంకేముంది కారుతో సహా ఆ యజమాని కూడా సరస్సులో పడిపోయాడు. కానీ అదృష్టవశాత్తు హురాకాన్ కారు నుంచి ఏదోరకంగా బయటపడి సరస్సు నుంచి ఈదుకుంటు వచ్చాడు. అయితే అతని కారు మాత్రం నీటిలో 50 అడుగుల లోతులో మునిగిపోయింది. ఈ మేరకు సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆ హురాకాన్ లగ్జరీ కారుని బయటకు తీసింది. అంతేకాదు పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు వచ్చి విచారించడమే కాక ఆ కారు యజమానికి స్వల్ప గాయలవ్వడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఘటన జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న స్థానికుడోకరు ఆ కారు యజమాని బ్రేక్ ,యాక్సిలరేటర్ పెడల్లను మిక్స్ చేసి కారుని రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు వివరించడం గమనార్హం. (చదవండి: వరద చుట్టిముట్టినా.. ఒంటి చేత్తో ముగ్గురు గర్భిణీలకు సాయం) -
నీ ఆయువు గట్టిది కాబట్టే తప్పించుకున్నావ్!
బ్రస్సీలియా: సాధారణంగా చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్లగానే నీటిని చూసి సంబరపడిపోతుంటారు. నీటిలో దిగి స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడతారు. అయితే, ఇలాంటి సమయాల్లో ఒక్కొసారి షాకింగ్ సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బ్రెజిల్లోని క్యాంపో గ్రాండెలోని లాగో డో అమోర్ సరస్సులో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మిస్టర్ కెటానో అనే వ్యక్తి.. గత శనివారం(అక్టోబరు 23)న సాయంత్రం సరదాగా అమోర్ సరస్సులో స్విమ్మింగ్ చేయడానికి దిగాడు. అతగాడు.. స్విమ్ చేస్తూ నిషేధిత ప్రదేశం దాటి నీటిలోపలికి వెళ్లిపోయాడు. కాగా, విల్యాన్ కెటనో అనే మరో వ్యక్తి గట్టుపై నుంచి సరస్సును వీడియో తీస్తున్నాడు. సరస్సులో ఒక వ్యక్తి నిషేధిత ప్రాంతంను దాటి లోపలికి వెళ్లడంను గమనించాడు. అతడిని కదలికలను వీడియో తీస్తున్నాడు. ఆ సరస్సు మొసళ్లకు ప్రసిద్ధి. అక్కడ.. చాలా మొసళ్లు ఉన్నాయి. అందులో ఒక మొసలి.. మిస్టర్ కెటానోవైపు వేగంగా వచ్చి దాడిచేసింది. నీటిలో ఏదో అలజడి రావడంతో వెంటనే వెనక్కు చూశాడు. ఒక మొసలి తన వైపుకు వేగంగా రావడాన్ని గమనించాడు. అతను కూడా.. వేగంగా స్విమ్మింగ్ చేస్తూ సరస్సు ఒడ్డుకు చేరుకున్నాడు. అప్పటికి అతని చేతికి, శరీర భాగాలను మొసలి గాయపర్చింది. వెంటనే మిస్టర్ కెటానోను.. స్థానికులు మొబైల్ ఎమర్జెన్సీ అంబూలెన్స్కి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మిస్టర్ కెటానో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వెంట్రుక వాసిలో తప్పించుకున్నావు..’, ‘నీ ఆయువు గట్టిదే..’ ‘వామ్మొ... ఎంత భయంకరంగా ఉందో? అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: మందు.. సోడా.. మంచింగ్.. ఆ కోతే వేరబ్బా! -
కాలువలోకి దూసుకెళ్లిన కారు..
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరగ్గానే కారులో ప్రయాణిస్తున్న వారు వెంటనే తేరుకుని బయటకు వచ్చేశారు. ప్రయాణికులకు మాత్రం స్వల్పగాయాలు అయ్యాయి. కాలువలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు తెలిపారు. ఆ తర్వాత గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చదవండి: ‘ఉద్యోగులంతా తెలుగు అకాడమీలో అందుబాటులో ఉండాలి’ -
Yadadri: చెరువులో దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: భువనగిరి మండలం రాయగిరి చెరువులో దూకి ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, స్థానికుల సమాచారంతో పోలీసులు చెరువు దగ్గరకు చేరుకున్నారు. చెరువు కట్టపై లభించిన సెల్ఫోన్, ఇతర వస్తువుల ఆధారంగా యువతి.. హైదరాబాద్ లాలాపేట్కు చెందిన గీతా రాణి(26)గా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు యువతి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ‘కిలేడి’ మహిళ.. ఇద్దరు పిల్లలతో బ్యాంక్కు వచ్చి.. -
కోకాకోలా సరస్సును ఎప్పుడైనా చూశారా..?
Coca Cola Lake: ఎప్పుడైనా ‘కోకాకోలా’లో ఈత కొడుతున్నట్లు కలకన్నారా? అయితే, ఇప్పుడ ఆ కలను నిజం చేసుకోండి. ఆశ్చర్యపోతున్నారా! నిజం, బ్రెజిల్లోని రియో గ్రాండే డో నార్టే దక్షిణ తీరంలో ‘కోకాకోలా సరస్సు’ ఉంది. అసలు పేరు ‘లగోవా ద అరారాక్వారా’. ఇందులోని నీరు, అచ్చం కోకాకోలా రంగులా ఉంటే, రుచి మాత్రం సాధారణ నీటి కంటే కాస్త ఉప్పగా ఉంటుంది. ఐరన్, అయొడిన్ సహా కొన్ని రసాయనాల కారణంగా దీనికి ఆ రంగు వచ్చిందని, పైగా ఇవి శరీరానికి ఏ హాని చేయవని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు నిరూపించారు. దీంతో చాలామంది ఈ సరస్సులో ఈత కొట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పైగా వేసవిలో ఇక్కడ స్పెషల్ వాటర్ ప్రోగ్సామ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సరస్సు పర్యాటకులతో కిటకిటలాడుతోంది. మీరు కూడా ఈ కోకాకోలా సరస్సులో ఈత కొట్టాలనుకుంటే, బ్రెజిల్ వెళ్లాల్సిందే మరి. చదవండి: ఆ గ్రామం.. కోట్ల ఏళ్లుగా సజీవం -
పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా..
ఎటో చూస్తూ నడిస్తే ఎంతటి వారైనా బొక్కబోర్లా పడాల్సిందే! అందుకు ఎవరూ అతీతులు కాదని.. సాక్షాత్తు మృగరాజే నిరూపించింది. అసలేం జరిగిందంటే.. జర్మన్ జూ పార్క్లో రెండు సింహాలు ఒక నీటిగుంట గట్టు మీద క్యాజువల్గా నడుస్తున్నాయి. ఇంతలో ఒక సింహం ఎటో చూస్తూ, నిర్లక్ష్యంగా నడుస్తూ, స్లిప్ అయ్యి నీటి గుంటలో పడిపోయింది. ముందు షాకయినప్పటికీ తర్వాత తేరుకుని నింపాదిగా ఈదుకుంటూ పైకి వచ్చింది. అయితే దానితో పాటే ఉన్న మరో సింహం మాత్రం కంగారు పడిపోయింది. నీళ్లలోనుంచి బయటికి వచ్చేంతవరకూ హడావిడిగా తిరగసాగింది. 2018 నాటి ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ వీడియోకు సరదాగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. ‘గర్వం పతనానికి దారితీస్తుంది’అని ఒకరు కామెంట్ చేస్తే, ‘బుద్ధిలేని సింహం’ అని మరొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ నవ్వు వచ్చేలా ఉన్న ఈ వీడియో సన్నివేశాన్ని మాత్రం వేల సంఖ్యలో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: ఈ రైళ్ల కూత కుక్కల అరుపులా ఉంటుంది.. ఐడియా అదుర్స్ కదూ.. -
Tragedy: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి
సాక్షి, ఆదిలాబాద్: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. అప్పటివరకు బ్యాండ్ మేళాల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపిన యువకుడు నిమజ్జనం అనంతరం వాగులో మునిగి మృతిచెందాడు. ఆదిలాబాద్రూరల్ ఎస్సై అంజమ్మ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణం అనుకుంటకు చెందిన దేవన్న–అక్కమ్మల కుమారుడు కన్నయ్య(22) బంగారుగూడ వాగులో గణేశ్ నిమజ్జనం అనంతరం కొంతమంది యువకులు కలిసి వాగులో స్నానం చేశారు. వారితో పాటు కన్నయ్య కూడా స్నానం చేయగా ఈత రాకపోవడంతో నీటిలో మునిగాడు. స్నేహితులందరూ రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ గల్లంతయ్యాడు. తీరా శవమై తేలాడు. కన్నయ్యకు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి గతంలో మరణించగా తల్లి కూలీనాలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. చేతికొచ్చిన కుమారుడు ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: Medak: ఒకేరోజు ఏడు చోట్ల చోరీలు మరువక ముందే.. -
పెళ్లి ముచ్చట్లు తీర లేదు.. అంతలోనే ఘోరం జరిగింది
రామభద్రపురం(విజయనగరం): ఆ ఇంటి ముంగిట కట్టిన పచ్చని కొమ్మలు వాడనే లేదు.. పెళ్లి ముచ్చట్లు తీర లేదు.. గణపతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించి.. సంతోషంగా సాగిపోతున్న నూతన జంటపై విధి కన్నెర్ర చేసింది. చెరువు రూపంలో భర్తను కాటేసింది. పెళ్లయిన రెండు నెలలకే ఆ ఇంట విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు పట్టణంలోని దుర్గాన వీధికి చెందిన రాంబార్కి తిరుపతిరావు(29) విశాఖపట్టణంలోని పెప్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రామభద్రపురం మండలంలోని జన్నివలస గ్రామానికి చెందిన పత్తిగుళ్ల కుమారిని ఈ ఏడాది జూన్ 24న వివాహం చేసుకున్నాడు. వినాయక చవితిని అత్తవారింట్లో సరదాగా జరుపుకుందామన్న ఉద్దేశంతో భార్యా భర్తలిద్దరూ సాలూరులో గురువారం సాయంత్రం బాలగణపతి విగ్రం కొనుగోలు చేసి జన్నివల స వచ్చారు. వినాయక పూజను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిపారు. అదేరోజు సాయంత్రం గ్రామం పొలిమేరల్లో ఉన్న పత్తిగుళ్లవాని చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు పూర్తిస్థాయిలో నిండడం, చెరువు లోతును గుర్తించని తిరుపతిరావు కాస్త ముందుకు వెళ్లాడు. అంతే.. ఈత రాకపోవడంతో కుటుంబ సభ్యుల కళ్లముందే మునిగిపోయాడు. భార్య కుమారి కేకలు వే యడంతో పలువురు చేరుకుని మునిగిపోతు న్న తిరుపతిరావును ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీరు ఎక్కువగా తాగడంతో హుటాహుటిన సాలూరు సీహెచ్సీకి తరలించినా ఫలితం లేకపోయింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు మృతదేహానికి సాలూరు సీహెచ్సీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. వివాహమైన రెండు నెలలకే తిరుపతిరావు మృతితో అటు కన్నవారు, ఇటు అత్తవారింటిలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులు తవుడమ్మ, తవుడు, అత్త బుచ్చమ్మ, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: ఏడాదిన్నర పాప.. ఆడుకుంటూ.. మృత్యు ఒడిలోకి -
కోకాకోలా సముద్రం.. ఈత కూడ కొట్టొచ్చు.. ఎక్కడంటే?
Brazil Coco Cola River Facts: ప్రపంచంలో మనకు తెలియని, ఊహలకు అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ భూమి మొత్తం వింతలు విశేషాలతో నిండి ఉంది. మనకు తెలిసే వరకు అది ఏదైనా ఒక ఆశ్చర్యమే. మరి కోకాకోలా ప్రవహించే మహాసముద్రం గురించి ఎప్పుడైనా విన్నారా.. అదేంటి కోకాకోలా సముద్రం కూడా ఉందా, నిజమేనా అనుకుంటున్నారా. అవును, మీరు విన్నది నిజమే. బ్రెజిల్లోని రియో గ్రాండే డెల్ నార్టేలోని కోకా కోలా సరస్సు ఉంది. అక్కడ మీరు ఈత కూడా కొట్టవచ్చు. ఇక్కడి సరుస్సులోని నీరు అచ్చం కోకా కోలా డ్రింక్ కలర్లోనే ఉంటాయి. ఈ ప్రదేశంలోని నీటి ముదురు గోధుమ మరియు నలుపు రంగు, ఇది ఖచ్చితంగా కోకా కోలా వలె కనిపిస్తుంది. ఒక్కసారి మనం అ లేక్ వద్దకు వెళితే నీటికి బదులు కోకాకోలానే సరస్సులో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది.ఈ నీటిలో ఇనుము, అయోడిన్ గాఢత ఎక్కువ ఉండటం వల్ల ఈ నీటికి ఇలా రంగు ఉందని పరిశోధనల్లో తేలింది. దీని కారణంగానే ఇక్కడి నీటికి కోలా నీటిలా కనిపిస్తుంది. వేసవిలో బీచ్ జీవితాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ నివసించే ప్రజలు తరచుగా ఇక్కడకు వస్తారు. తీరంవైపు ఉన్న నీరు లేత ముదురు రంగులో కనిపిస్తుంది. అదే సముద్రంలోకి వెళితే ముదురు రంగులోకి మారుతుంది. నీటికి ఉన్న వింత రంగు కారణంగా ప్రజలు ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది టూరిస్టులు తమ కుటుంబంతో విహారయాత్రకు రావడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రాంతం టూరిస్టులతో నిత్యం సందడిగా ఉంటుంది. -
జిమ్ కోసం ఇన్నేసి రూల్సా.? ఇది జిమ్మా లేక ఇంకేందీ సామి
చండిగఢ్: ‘మీరు వేసుకునే లోదుస్తులపై స్టాంప్ ఉండాలి. స్మెల్ టెస్ట్ చేయించుకోవాలి’ అని ఓ క్లబ్ యాజమాన్యం సభ్యులకు ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. జిమ్కు వచ్చేవారందరూ ఇది తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అలా చెప్పారో.. కథ ఏమిటో తెలుసుకోండి. చండీగఢ్లోని లేక్ క్లబ్ ఇటీవల సభ్యులకు కొత్త నియమనిబంధనలు విడుదల చేసింది. అందులో భాగంగా పలు సూచనలు చేసింది. వాటిలో పైన పేర్కొన్న ప్రధాన సూచన సభ్యులను విస్మయానికి గురి చేసింది. ఈ రూల్స్కు సంబంధించిన ఫొటోను జర్నలిస్ట్ ఆర్ష్దీప్ సంధు ట్విటర్లో పంచుకోవడంతో ఈ విషయం బహిర్గతమైంది. నాలుగు సూచనలతో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిమ్కు వచ్చేవారు సరైన దుస్తులు ధరించి రావాలి. జిమ్ సూట్లలోనే రావాలి. లోదుస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి. అనుమతి ఇచ్చిన వాటినే వేసుకోవాలి. ఆ దుస్తులు ఎలా ఉండాలో కార్యాలయంలో కొన్ని శాంపిల్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు. మీ దుస్తులకు అనుమతి కోసం సభ్యులు మా వద్దకు తీసుకురావాలి. స్టాంప్లు వేసిన దుస్తులనే వేసుకోవాలి. సభ్యులు సరైన బూట్లు ధరించాలి. పరిశుభ్రంగా ఉండాలి. సాక్స్లు రోజుకొకసారి తప్పనిసరిగా ఉతకాలి. అపరిశుభ్రమైన బూట్లు.. వాసన వచ్చే సాక్స్లు ధరిస్తే ఆ సభ్యులకు జరిమానా విధిస్తాం. వాసన పరీక్ష (స్మెల్ టెస్ట్)లో మీరు ఫెయిలైతే చర్యలు ఉంటాయి. శారీరక దుర్వాసన కూడా రాకుండా చూసుకోవాలి. జిమ్ పరికరాలు శబ్ధం రాకుండా కసరత్తులు చేయాలి. కసరత్తులు చేసేప్పుడు అరవకూడదు.. శబ్దాలు చేయవద్దు. ఇతర భాషలు మాట్లాడేందుకు అనుమతి లేదు. కేవలం పంజాబీ భాషలోనే మాట్లాడాలి. అనుమతించిన తిట్లు మాత్రమే మాట్లాడాలి. జిమ్కు షార్ట్స్ వేసుకుని వచ్చేవారు తమ కాళ్లను షేవ్ చేసుకుని రావాలి. ఏకాగ్రత కోల్పోకుండా కాళ్లకు పట్టీలు ఉంటే ఇంట్లో ఉంచి రావాలి. ఉల్లంఘించినవారు శిక్షార్హులు. అని ఈ విధంగా నిబంధనలు పెట్టడంతో సభ్యులు ఖంగు తిన్నారు. జిమ్ చేయాలంటే ఇన్నేసీ రూల్సా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేసి రూల్స్ పాటించాలా? అని ప్రశ్నిస్తున్నారు. వాసన పరీక్షను సభ్యులు ఎలా పరాజయం పొందుతారు? అని ప్రశ్నిస్తున్నారు. * How does a member fail the "smell test"? * Who is incharge of smelling members ? * Can members wax instead of shave ? * "Only approved undergarment are to be worn ! And who will check the brand of the underwear ?" * what if the member abuses in another language ? 💪 — Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) August 3, 2021 Gym Suit pic.twitter.com/6VisGaHjOU — AchaTheekHai! (@neelaneelaamber) August 3, 2021 -
రొయ్యల చెరువు వద్ద విద్యుత్ షాక్తో ఆరుగురు మృతి
-
లంకెవాని దిబ్బలో ఆరుగురు సజీవ దహనం
రేపల్లె (గుంటూరు)/సాక్షి, అమరావతి: పగలంతా కాయకష్టం చేసి ఆదమరిచి నిద్రిస్తున్న ఆరుగురు యువకులు నిశిరాత్రి వేళ అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం నుంచి మరో నలుగురు తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బ గ్రామంలోని రొయ్యల చెరువుల వద్ద గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని రాయగఢ్ జిల్లా గునుపూర్ మండలానికి చెందిన 25 మంది యువకులు లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం వచ్చారు. చెరువుల వద్ద ఉన్న షెడ్లలోనే వారంతా మకాం ఉంటున్నారు. ఎప్పటిమాదిరిగానే గురువారం చెరువుల్లోని రొయ్యలకు మేత వేశారు. రాత్రి వారంతా భోజనాలు చేసి షెడ్లలోని రెండు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి వేళ షెడ్లోని ఒక గదిలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని పేలుడు సంభవించగా, అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ గదిలో 10 మంది నిద్రిస్తుండగా.. మంటల్లో చిక్కుకుపోయిన నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ æ(18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అదే గదిలో నిద్రిస్తున్న సునామో కజ్జీ, రాహుల్ సబార్, సంతోషి సబార్, అశోక్సబార్ బయటకు పరుగులు తీసి ప్రాణాలతో బయటపడ్డారు. పక్క గదిలో నిద్రిస్తున్న మరో 15 కూడా భయంతో పరుగులు తీశారు. ఘటన వెనుక అనుమానాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని కొందరు చెబుతుండగా.. ప్రమాదం జరిగిన గదిలో బ్లీచింగ్ బస్తాలు ఉన్నాయని, కూలీలు నిద్రపోయే సమయంలో మస్కిటో కాయిల్స్ వెలిగించారని.. వాటివల్ల ఆ గదిలోని బ్లీచింగ్ బస్తాలకు నిప్పంటుకుని ప్రమాదం సంభవించి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. బ్లీచింగ్ బస్తాలు అంటుకుంటే పేలుడు ఎలా సంభవిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా బ్లీచింగ్ నిల్వ చేసిన గదుల్లో కూలీలు ఎలా నిద్రించగలరని, బ్లీచింగ్ వాసన ధాటికి తట్టుకోవడం కష్టమని పేర్కొంటున్నారు. ఈ ఘటనపై శాస్త్రీయ పద్ధతుల్లో అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్గున్నీ చెప్పారు. చెరువుల యజమాని బెయిలీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు. గవర్నర్ సంతాపం ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. ఆరుగురు యువకుల మరణంపై సంతాపం ప్రకటించిన గవర్నర్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కంపుకొడుతున్న చెరువుకట్ట.. కారణం ఏంటంటే!
సాక్షి, సిరిసిల్ల(కరీంనగర్): సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలోని ఈదుల చెరువు కట్ట పరిసర ప్రాంతాల్లో చెత్త, కోళ్ల వ్యర్థాలను పడవేస్తున్నారు. చెరువు చుట్టు పక్కల ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతుందోని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని చెత్తచెదారాన్ని, చికెన్సెంటర్ నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను చెరువుకట్ట చుట్టూ పక్కల డంప్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈదుల చెరువు మత్తడి దూకడానికి సిద్ధంగా ఉందని, చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తను డంప్ చేయకుండా, నీరు కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
చెరువును మింగిన తెలుగు తమ్ముళ్లు : విశాఖ
-
కాళ్లకు బురద అంటిందని క్వారీ గుంతలోకి.. నలుగురు గల్లంతు
-
శామీర్పేట చెరువులో శవాలై తేలిన డాక్టర్లు, సెల్ఫీనే కారణమా?
మేడ్చల్: శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద చెరువులో దూకి ఇద్దరు యువ డాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు వైద్యులు ఆదివారం సాయంత్రం ఎఫ్జడ్ బైక్పై వచ్చి శామీర్పేట చెరువులో దూకినట్లు తెలిపారు. వీరిలో ఒకరు అల్వాల్ ఎక్సెల్ ఆస్పత్రిలో హోమియోపతి జూనియర్ డాక్టర్ నందన్ కాగా.. మరొకరు ఆయుర్వేదిక్ వైద్యుడు గౌతంగా వెల్లడించారు. అల్వాల్ సూర్య నగర్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివాసముండే ఈ ఇద్దరు వైద్యులు అన్నాదమ్ములని పోలీసులు తెలిపారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటికి తీసినట్టు వెల్లడించారు. డాక్టర్లిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వారిద్దరూ ఆత్మహత్య చేసకున్నారా? లేక ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బైక్ వెళ్లి చెరువులో శవాలుగా తేలారని మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. శామీర్పేట్ అన్నదమ్ముల మృతికి సేల్ఫీనే కారణమా? ఈ ఘటనపై శామీర్పేట సీఐ మాట్లాడుతూ.. యువ డాక్టర్లు ఫోటోలు తీసుకుంటుండగా చెరువులో జారీ పడిపోయినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. కాగా, వారం రోజుల క్రితం నందన్ దగ్గరకి సోదరుడు గౌతం వచ్చినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఇద్దరు కలిసి శామీర్పేట చెరువు వద్దకు వచ్చినట్లు తెలిపారు. నందన్ ఫోటోలు తీసుకునే క్రమంలో నీటిలో పడిపోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నందన్ను కాపాడేందుకు గౌతం నీటిలో దూకి ఉంటాడని అన్నారు. కాగా ఈతగాళ్లు ఇద్దరు యువ డాక్టర్ల మృత దేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు శామీర్పేట సీఐ తెలిపారు. చదవండి: భూతగాదాలు, పాత కక్షలు.. పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. -
దారుణం: కళ్ల ముందే మునిగిపోయాడు!
మేళ్లచెరువు (నల్గొండ): ప్రమాదవశాత్తు సున్నపురాయి క్వారీ నీటికుంటలో పడి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం మండలంలోని రామాపురం పరిధిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మండలంలోని రామపురం గ్రామానికి చెందిన ఉండేటి కొండలు కుమారుడు ఉండేటి వెంకటేష్ (15) సోమవారం ఉదయం తన స్నేహితులు నలుగురితో కలిసి క్వారీ వైపు బహిర్భూమికి వెళ్లారు. అదే సమయంలో వెంకటేష్ క్వారీలోకి దిగి కాళ్లు కడుక్కుంటుండగా కాలు జారి నీటిలో పడిపోయాడు. మునిగిపోతున్న వెంకటేష్ను చూసిన అతని స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ లోపు గ్రామస్తులు, కుంటుంబ సభ్యులు క్వారీ వద్దకు చేరుకొని వెంకటేష్ ఆచూకీ కోసం గాలించారు. క్వారీలో నీరు సుమారు 30అడుగుల లోతు ఉండడంతో మూడు గంటలపాటు గాలించి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో సున్నపురాయి క్వారీ లోతుగా ఉండడంతోపాటు దానికి రక్షణ ఏర్పాటు చేయకపోవడం వలన తమ కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి తండ్రి కొండలు, బంధువులు స్థానిక భీమా సిమెంట్ గేటు వద్ద ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ.నరేష్ సంఘటనా స్థలాకి చేరుకుని పరిశీలించారు. -
మినీ ట్యాంక్బండ్లో మొసలి
సాక్షి, హైదరాబాద్: సరూర్నగర్ చెరువు మినీ ట్యాంక్బండ్లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్పార్క్ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. చెరువుకు ఆనుకొని పుర్తిగా ఇళ్లు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెరువులోని మొసలిని పట్టుకెళ్లాలని కోరుతున్నారు. చదవండి: డ్యాన్సర్కు రూ.11.75 లక్షల టోకరా -
గడ్డకట్టే నీటిలో అన్వేషణ.. ఎందుకంటే?
ఢిల్లీ: ఉత్తరాఖండ్లోని తపోవన్ సరస్సు లోతును కనుగొనడాన్ని ‘నేవీ డైవర్స్’ సవాల్గా తీసుకున్నారు. వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన భారీ కృత్రిమ సరస్సు సముద్రమట్టానికి 14 కిలో మీటర్లు పైకి ఎగిసి అల్లకల్లోలం సృష్టిస్తోందని తెలిపారు. ఈ విపత్తులో చాలా మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది జాడ తెలియటంలేదని పేర్కొన్నారు. తపోవన్ సరస్సు అత్యధికంగా గడ్డకట్టే పరిస్థితులను కలిగి ఉందని, అందుకే నేవీ అధికారులు సరస్సు లోతును కనుగొనడానికి ఎకోసౌండర్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. డామ్పై నీటి ఒత్తిడిని హై రిజల్యూషన్ ఉపగ్రహంతో అధ్యయనం చేస్తున్నారు. నీరు అధిక బరువును కలిగి ఉందని భవిష్యత్తులో ఎప్పుడైనా డ్యామ్ను ఢీకొట్టి మరో వరదకు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఘర్వాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైపీ సండ్రియల్ వరద సంభవించిన ప్రదేశంలో పర్యటించి వరదకు గల కారణాలను అధ్యయనం చేశారు. ఏ క్షణంలో అయినా వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి వైమానిక దళానికి చెందిన అత్యాధునిక లైట్ హెలికాప్టర్ను ఉపయోగిస్తామని తెలిపారు. చదవండి: ఉత్తరాఖండ్ ముంగిట మరో ముప్పు -
ఉత్తరాఖండ్ ముంగిట మరో ముప్పు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో హిమానీనదం కారణంగా వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో అత్యంత ప్రమాదకరమైన భారీ సరస్సు ఏర్పడిందని ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడైంది. నదీ ప్రవాహ మార్గంలో భారీగా రాళ్లు, మట్టి పడడంతో ప్రవాహం పాక్షికంగా ఆగి కృత్రిమంగా ఓ సరస్సు తయారైంది. ఈ సరస్సుతో మళ్లీ ముప్పు రాకుండా ఉండడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఒ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ ఎన్డీటీవీతో చెప్పారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించిన ప్రాంతంలో సరస్సు ఎలా ఉంది, ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో తెలుసుకోవడం కోసం ఇప్పటికే కొన్ని బృందాలు హెలికాప్టర్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాయి. డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని కూడా ఆ ప్రాంతానికి పంపించి అవి తీసిన చిత్రాలు, వీడియోలను పరిశీలిస్తున్నట్టుగా ప్రధాన్ వెల్లడించారు. ఆ సరస్సు మహోగ్రరూపం దాల్చకుండా నిరోధించేలా డీఆర్డీఓ, ఎన్డీఆర్ఎఫ్లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. మరోవైపు ఈ సరస్సు వల్ల కలిగే ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ‘‘ఇప్పుడు మనం ఆందోళన పడకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కొన్ని బృందాలు ఆ సరస్సు గురించి తెలుసుకునే పనిలో ఉన్నాయి’’అని రావత్ చెప్పారు. ఫుట్బాల్ స్టేడియం కంటే మూడింతలు పెద్దది డ్రోన్లు, ఇతర విమానాలు తీసిన చిత్రాల్లో సరస్సు చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఫుట్బాల్ గ్రౌండ్ కంటే మూడు రెట్లు పొడవున సరస్సు ప్రవహిస్తోంది. 350 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు, 10 డిగ్రీల లోతు ఉన్న ఈ సరస్సు నుంచి మంచు పెళ్లలు, బురద, రాళ్లతో కూడిన నీళ్లు రిషిగంగ నదిలోకి ప్రవహించి రెండు విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఏర్పడిన కృత్రిమ సరస్సుని మట్టి పెళ్లలు, రాళ్లతో కూడిన శిథిలాలు అడ్డుగోడగా ఉన్నాయి. అయితే బుధవారం నాడు తీసిన శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ అడ్డుగోడని ఛేదించుకొని సరస్సు ప్రవహిస్తే ఏ స్థాయిలో ముప్పు జరుగుతుందో ఎవరి అంచనాకి అందడం లేదు. ఆ సరస్సు చాలా ప్రమాదకరంగా మారుతోందని శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన ఘర్వాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైపీ సండ్రియల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేను రిషిగంగ నదికి ఈశాన్యంవైపు ఉన్నాను. ఆ పై నుంచే నీటి ప్రవాహం ముంచుకొస్తోంది. ప్రస్తుతానికి రాళ్లు ఒక గోడలా అడ్డుగా ఉండడం ఊరట కలిగించే అంశం. కానీ ఏ క్షణంలోనైనా అది కొట్టుకుపోతే చాలా ప్రమాదం. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది’’అని చెప్పారు. 38కి చేరుకున్న మృతుల సంఖ్య ఉత్తరాఖండ్లోని తపోవన్ సొరంగ మార్గం దగ్గర వరుసగా ఆరో రోజు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న 30–35 మందిని కాపాడడానికి సహాయ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. సొరంగానికి అడ్డంగా కొట్టుకొచ్చిన రాళ్లను డ్రిల్లింగ్ చేయడం, బురదని తోడడం వంటి పనులు ఏక కాలంలో నిర్వహిస్తున్నట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. మరోవైపు శుక్రవారం నాడు మరో రెండు మృతదేహాలు లభ్యమవడంతో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. మరో 166 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రిషిగంగ హైడల్ ప్రాజెక్టు దగ్గర ఒక మృతదేహం లభిస్తే, మైథన ప్రాంతంలో మరొకటి గుర్తించినట్టుగా సహాయ బృందాలు తెలిపాయి. సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాల ఆవేదనకు అంతే లేదు. లోపల వాళ్లు ఏ స్థితిలో ఉన్నారో ఊహించుకోవడానికే వారు భయపడుతున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు తమ ప్రాంతానికి ఒక శాపంగా మారిందని స్థానికులు అంటున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్న ప్రాంతానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్టీపీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తపోవన్ గ్రామ సభకు చెందిన మహిళలు అత్యధికులు వచ్చి తమ నిరసన తెలిపారు. మొదట మా పొలాలను పోగొట్టుకున్నాం, ఇప్పుడు మా ప్రియమైన వారినే పోగొట్టుకున్నామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. -
ఉత్తరాఖండ్: ‘కలవరపెడుతోన్న సరస్సు’
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో ధౌలిగంగా నది భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందగా.. 204 మంది గల్లంతయ్యారు. ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్ట్ తపోవన్ సొరంగంలో ఇప్పటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ప్రమాదం తర్వాత హిమాలయ మంచు పర్వతాల్లో ఓ ‘ప్రమాదకర సరస్సు’ ఏర్పడినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు, సరస్సుకు సంబంధించిన మరింత సమాచారం కోసం విశ్లేషణ జరపడంతోపాటు వరద ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. దుర్ఘటన జరిగిన రైనీ గ్రామానికి సమీపంలో కొత్తగా ఓ సరస్సు ఏర్పడినట్లు నిపుణులు గుర్తించారు. దాదాపు 350 మీటర్ల పొడవు.. 60 మీటర్ల ఎత్తులో ఈ ప్రమాదకర సరస్సు ఏర్పడినట్లు వెల్లడించారు. మరో ఆందోళనకర అంశం ఏంటంటే సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఇది ఇలానే కొనసాగితే మరో ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచు కరుగుతున్న కొద్ది నీటిమట్టం పెరుగుతోంది. ఫలితంగా సరస్సు ఏ క్షణమైనా ఉప్పొంగి మరోసారి వరదలు సంభవించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఇదే జరిగితే ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని.. వీటి నుంచి బయటపడేందుకు ప్రణాళిక రచిస్తున్నామని ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మాట్లాడుతూ, ‘‘రైనీ గ్రామానికి సమీపంలో ఏర్పడిన సరస్సు గురించి మాకు తెలిసింది. మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీనిపై పని చేస్తోన్న శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎయిర్ డ్రాఫ్ట్ నిపుణులను పంపి పరిస్థితిని సమీక్షిస్తాం’’ అన్నారు. ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంతంలో సరస్సు ఏర్పడిందని తెలిసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సంయుక్త దళాలను అక్కడకు పంపాము’’ అన్నారు. చదవండి: ఉత్తరాఖండ్ జలవిలయం: ఓ కుక్క కథ! జల విలయం నేర్పుతున్న గుణపాఠం -
నా చావుని త్వరగా మర్చిపోయి.. పెళ్లి చేసుకో
సాక్షి, ఒంగోలు: స్థానిక రంగారాయుడు చెరువులో దూకి ఓ తల్లి తన బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో రంగారాయుడు చెరువు సమీపంలో ఓ తల్లి తన బిడ్డను ఆడిస్తూ స్థానికులకు కనిపించింది. జనం పూర్తిగా పలచబడిన తర్వాత ఆమె తన 11 నెలల బిడ్డను పొట్టకు చున్నీతో కట్టుకుని నీటిలోకి దూకింది. ఎదురుగా ఉండే అపార్టుమెంట్లోని ఓ మహిళ చూసి సమీపంలో వాకింగ్ చేస్తున్న యువకుడికి పెద్దగా కేకలు వేసి చెప్పింది. ఆ యువకుడు తాను నీటిలోకి దూకలేనని, పోలీసులను తీసుకొస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చివరకు విషయం పోలీసులకు తెలిసి 2.10 గంటలకు సంఘటన స్థలానికి వచ్చారు. అప్పటికే తల్లి, బిడ్డ మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి. సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా విషయాన్ని పోలీసులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. గంట వ్యవధిలోనే మృతురాలి సోదరుడు, తల్లి సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: నిజమే.. ముగ్గురు కాదు ..ఒక్కడే! మెట్టినింట వివాదమే కారణం సుమారు రెండేళ్ల క్రితం ఒంగోలు గోపాల్నగర్ మొదటి లైనుకు చెందిన ఉలిచి విజయమ్మ కుమార్తె కమలను నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వరిగొండకు చెందిన చిల్లకూరు అఖిలేష్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఏడో నెలలోనే బాబు జన్మించాడు. వీరితోపాటు అఖిలేష్ తల్లి, అమ్మమ్మ కూడా అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో కమలకు వారితో మనస్పర్థలు వచ్చాయి. భర్త అఖిలేష్తో వేరు కాపురం పెట్టాలంటూ ఒత్తిడి తెచ్చింది. ఇందుకు అతడు ససేమిరా అన్నాడు. చివరకు ఆమె అలిగి పుట్టింటికి వస్తుంటే కన్న బిడ్డను కూడా వారి వద్దే ఉంచుకునే ప్రయత్నం చేశారు. చివరకు అక్కడి పోలీసులు జోక్యం చేసుకుని బిడ్డను తల్లికి అప్పగించారు. అనంతరం దంపతుల మధ్య ఏర్పడిన వివాదానికి సంబంధించి పలు పర్యాయాలు పెద్ద మనుషులు, పోలీసుల ద్వారా పుట్టింటి వారు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. 40 రోజులుగా పుట్టింటి వద్ద ఉంటున్న ఆమెకు భర్త వైపు నుంచి వేరు కాపు రానికి సంబంధించి ఎటువంటి హామీ లభించలేదు. తీవ్ర మనస్తాపం చెంది కమల అఘాయిత్యానికి పాల్పడింది. చదవండి: బాగా చదువుకో.. వెళ్తున్నా ! డైరీలో అన్నకు సూచనలు కమల తన ఆవేదనను ఆత్మహత్యకు ముందు డైరీలో రాసింది. తల్లి విజయమ్మ, అన్న సిద్ధార్థలు తనను ఎంత ప్రేమగా చూసుకునేవారో పేర్కొంది. నా మరణాన్ని త్వరగా మర్చిపోవాలని, పెళ్లి చేసుకుని వదినను నాకంటే బాగా చూసుకోవాలని కోరింది. అమ్మా.. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సిందని, అత్తింటికి వెళ్లి అక్కడ నరకయాతనను ఊహించుకోవాలంటేనే కన్నీళ్లు ఆగడం లేదంటూ బాధను వ్యక్త పరిచింది. నా బిడ్డను నేను చంపుకోవాలంటే బాధగానే ఉందని, వదిలేస్తే పెద్దయ్యాక నేను ఒంటరిని చేసి వెళ్లాననే బాధ నా బిడ్డకు ఉండకూడదని, అందుకే ధైర్యం చాలకున్నా నా బిడ్డను నాతోటే తీసుకెళ్తున్నా.. అంటూ పేర్కొంది. నా మరణాన్ని అవమానకరంగా చూడొద్దని, మనం ఇచ్చిన కట్నకానుకలు తీసుకుని వారిని వదిలేయాలని అత్తింటి వారిని ఉద్దేశించి తన తల్లిని, అన్నను కమల డైరీలో కోరింది. అంతేకాకుండా తన అంత్యక్రియలు అన్న సిద్దు చేతుల మీదుగానే జరగాలని. తన పేరును కూడా ఉలిచి (పుట్టింటి పేరు) కమలగానే చూడాలంటూ కోరింది. ఒన్టౌన్ సీఐ సీహెచ్ సీతారాం మాట్లాడుతూ కమల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసిందని తెలిసిందని, డైరీని సీజ్ చేస్తున్నామని, పూర్తి విషయాలు తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
వాగులో పడ్డ యువకులు.. తప్పిన ప్రమాదం
-
వాగులో పడ్డ యువకులు.. తప్పిన ప్రమాదం
సాక్షి, జగిత్యాల : కల్లెడ సమీపంలో అనంతారం వాగు వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు జారీ వాగులో పడిపోయారు. జగిత్యాలకు చెందిన శ్రీనివాస్ తన మిత్రుడితో కలిసి కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకుని తిరుగు ప్రయాణం కాగా వాగువద్ద ఈ ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి వాగులో పడిపోతుండగా వెనకాల కూర్చున్న వ్యక్తి తప్పించుకొగా, డ్రైవింగ్ చేసే శ్రీనివాస్ కొద్దిదూరం ఆ వరద ప్రవాహం కొట్టుకుపోయారు.అక్కడే ఉన్న స్థానికులుగమనించి వెంటనే ఆ యువకుడిని కాపాడారు. అయితే ఈ దృశ్యాలను బైక్ వెనక కారులో వస్తున్న వారు వీడియో చిత్రీకరించారు. (వాగులో చిక్కుకుని.. రాత్రంతా కారులోనే..) -
సరస్సులో సినిమా
కృష్ణశాస్త్రిగారు ప్రకృతి ప్రేమికులు. ఎక్కడో దేనికో హర్ట్ అయ్యారు. ‘లేవు నాకు ఉగాదులు, లేవు నాకు ఉషస్సులు’ అని కవిత్వంలో చింతించారు. ఫస్ట్ టైమ్ ఈ ఏడాది మనకూ ఉగాదులు, ఉషస్సులు లేకుండా పోయాయి. యూత్ది ఇంకో ప్రాబ్లమ్. లేవు వారికి సినిమాలు. లేవు వారికి సాయంత్రాలు. కరోనా ఎఫెక్ట్. కవిత్వం చదివే జనరేషన్ కూడా కాదు. కాళ్లూ చేతులు ఆడటం లేదు. ఓవర్–ది–టాప్ అని ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారు? వీళ్ల బాధను చూళ్లేక ఇజ్రాయిల్లో ఇప్పుడు సాయంత్రపు ‘సెయిల్–ఇన్’ సినిమాలను ప్రదర్శిస్తున్నారు! ఒక సరస్సును చూసుకుంటారు. అందులో ఓ గట్టు వైపు తెర కడతారు. సరస్సులోని నీళ్ల పై తేలియాడే చిన్న చిన్న పడవల్లో సీట్లను అరేంజ్ చేస్తారు. వాటిల్లో ఆసీనులై ఒకరికొకరు దగ్గరవకుండా, పొరపాటున దగ్గరయే ప్రమాదం ఏర్పడితే దూరంగా జరుగుతూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సినిమా చూడొచ్చు. మొదట టెల్ అవివ్ మున్సిపాలిటీ అక్కడి సరస్సులో ఈ సెయిల్–ఇన్ మూవీలు ప్రారంభించింది. ఆగస్టు చివరి వరకు రోజూ సాయంత్రం రెండు షోలు వేస్తున్నారు. యవ్వనస్తులు ఎలాగూ సూర్యుడు భూమధ్య రేఖమీదకు వచ్చేవరకు లేవరు కనుక వారికి ఉషస్సులతో పని లేదు. వీళ్లు లేకుండా సాయంత్రాలకు, సినిమాలకు ఎలాగూ పొద్దుపోదు. ఇక ఉగాదులు అంటారా? ఒక్క ఉగాది అనేముందీ. ప్రతిరోజు పండుగ రోజే.. సినిమాలు ఆడుతుంటే. -
ఎంత పని చేశావు తల్లీ!
ఆలూరు రూరల్: భర్త దారి తప్పాడు. పెళ్లి ప్రమాణాలను మరచిపోయి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయినా ఆమె భరించింది. కానీ భర్త, అతని ప్రియురాలి వేధింపులు అధికమయ్యాయి. ఇక ఓర్చుకునే శక్తి లేకపోయింది. మూడేళ్ల కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకుంది. తానొక్కతే చనిపోతే బిడ్డకు దిక్కు ఉండరన్న భయంతో ఆ చిన్నారినీ వెంట తీసుకెళ్లిపోయింది. ఈ సంఘటన వినాయక చవితి పండుగ నాడు ఆలూరు పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్ఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆలూరులోని గోవర్ధన్ టాకీస్ సమీపంలో నివాసముంటున్న ఏక్నాథ్ ఈరన్న, హైమావతి కుమారుడు నాగార్జునకు కర్ణాటకలోని శిరుగుప్ప తాలూకా దరూరు గ్రామానికి చెందిన చంద్రప్ప, వన్నూరమ్మ కుమార్తె శిల్పా (24)కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్ఞానేశ్వరి (3) అనే కుమార్తె ఉంది. నాగార్జునకు పట్టణానికే చెందిన మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఏడాది క్రితం నుంచి ఆ అమ్మాయితో కలిసి వేరే ప్రాంతంలో కాపురం పెట్టాడు. విషయం తెలిసినా శిల్పా ఏమీ చేయలేక.. అత్తామామ దగ్గర ఉండేది. నాగార్జున తన ప్రియురాలిని అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకొచ్చేవాడు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి శిల్పాను మానసికంగా వేధించేవారు. ఇటీవల కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక తన భర్త ప్రవర్తనలో మార్పు రాదని భావించిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తానొక్కతే చనిపోతే బిడ్డ అనాథ అవుతుందని భయపడింది. శనివారం అత్తమామలతో కలిసి పొలానికి వెళ్లింది. అందరూ పొలం పనులలో నిమగ్నమై ఉండగా.. శిల్పా బిడ్డతో సహా సమీపంలోని నీటికుంటలో దూకింది. పొలంలో పనిచేస్తున్న వారు గమనించి బయటకు తీసేలోపు ఇద్దరూ ప్రాణాలు విడిచారు. మృతదేహాలకు ఆలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఐదు రోజుల తర్వాత నదిలో శవమై తేలిన నటి
ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయినా ప్రముఖ హాలీవుడ్ నటి నయా రివీరా మృతదేహాన్ని పెరూలేక్లో గుర్తించారు పోలీసులు. ‘గ్లీ’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రివీరా. ఐదు రోజుల క్రితం కాలిఫోర్నియాలోని పెరూ లేక్లో ఓ బోటును అద్దెకు తీసుకుని తన నాలుగేళ్ల కుమారిడితో బోటు షికారుకు వెళ్లింది రివీరా. సాయంత్రం అయినా బోట్ తిరిగి రాకపోవడంతో.. బోటు యజమాని పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బోటు కనిపించింది. దానిలో రివీరా కుమారుడు ఒక్కడే పడుకుని ఉన్నాడు. పిల్లాడి పక్కనే ఓ లైఫ్ జాకెట్, రివీరా పర్స్ ఉన్నాయి. ‘నేను, అమ్మ ఈత కొట్టడానికి వెళ్లాం. నేను తిరిగి వచ్చాను. కానీ అమ్మ ఇంకా రాలేదు’ అని పిల్లాడు రివీరా కుటుంబ సభ్యులకు తెలిపాడు. దాంతో నటి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు పోలీసులు. ఈ క్రమంలో ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.(డయానా పోలికలు) దాదాపు ఐదు రోజుల పాటు లేక్ను జల్లెడ పట్టిన పోలీసులు నిన్న సాయంత్రం రివీరా మృతదేహాన్ని గుర్తించారు. ఫాక్స్ మ్యూజికల్ కామేడి చిత్రం ‘గ్లీ’ ఆరు సీజన్లలో రివీరా పాటలు పాడే చీర్ లీడర్ సంటాన లోపెజ్ పాత్రలో నటించింది. అయితే దీనిలో నటించి.. ముప్సై ఏళ్లలోపు మరణించిన వారిలో రివీరా మూడో వ్యక్తిం. ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయంలో రివీరా సహనటుడు కోరి మాంటెయిత్ 31 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. మద్యం, హెరాయిన్ కలిపి తీసుకోవడం వల్ల అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గ్లీ చిత్రంలో తనతో పాటు నటించిన మార్క్ సాలింగ్తో రివీరా కొద్ది రోజులు డేటింగ్ చేసింది. అయితే అతడిపై చైల్డ్ పోర్నోగ్రఫి ఆరోపణలు రుజువు కావడంతో.. 2018లో తన 35 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. -
నలుగురు ప్రాణాలు తీసిన ఈత సరదా
-
మానుకోటలో విషాదం
సాక్షి, మహబూబాబాద్ : ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. శనిగాపురం బోధ్ తండాకు చెందిన నలుగురు చిన్నారులు శనివారం సాయంత్రం తుమ్మల చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ వీరంతా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు మృత్యువాత పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. మృతులు : 1,ఇస్లావత్ లోకేష్ (10) 2,ఇస్లావత్ ఆకాష్ (12) 3, బొడా దినేష్ ( 10) 4,బొడా జగన్ (14) -
రాత్రికి రాత్రే గులాబీ రంగుకి..
ముంబై: దాదాపు 50 వేల సంవత్సరాల క్రితం మంచు యుగంలో భూమి ఉపరితలాన్ని తాకిన ఉల్కాపాతం వల్ల లోనార్ సరస్సు ఏర్పడింది. అయితే ఈ సరస్సులోని నీరు ఉన్నట్లుండి గులాబీ రంగులోకి మారిపోయింది. ఈ ఘటన స్థానికులనే కాక శాస్త్రవేత్తలను, నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. ముంబయికి 500 కిలో మీటర్ల దూరంలో బుల్హంద జిల్లాలో ఉన్న లోనార్ సరస్సును చూసేందుకు పర్యాటకులతోపాటు శాస్త్రవేత్తలు కూడా ఎక్కువగా వస్తుంటారు. నిపుణులు చెబ్తున్న ప్రకారం రంగు మారడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి బాగా ఎక్కువగా మారింది అంటున్నారు. ఈ క్రమంలో లోనార్ సరస్సు సంరక్షణా కమిటీ సభ్యులు గజానన్ మాట్లాడుతూ ‘జాతీయ స్మారక చిహ్నంగా ఉన్న ఈ సరస్సులో 10.5 పిహెచ్తో ఉప్పునీరు ఉంది. నీటి లోపల ఆల్గేలు ఉన్నాయి. ఈ మార్పుకు లవణీయత, ఆల్గేలే కారణమవుతాయి’ అన్నారు. అంతేకాక గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే లోనార్ సరస్సులో నీటి మట్టం ప్రస్తుతం తక్కువగా ఉందని, అందులో మంచినీరు చేరడానికి వర్షం లేదని గజనన్ అన్నారు. తక్కువ స్థాయి నీరు, వాతావరణ మార్పుల వల్ల లవణీయత, ఆల్గే వల్ల నీరు రంగు మారిందని తెలిపారు. ఇరాన్లోని ఒక సరస్సు కూడా ఉప్పునీటి కారణంగా నీరంతా ఎర్రగా మారిపోయాయని తెలిపాడు. సరస్సు నీరు రంగు మారడంతో స్థానికులు గుంపులు గుంపులుగా వచ్చి చూస్తున్నారు. -
గ్రీనరీ.. సీనరీ.. చూసి రావాలి మరి!
సాక్షి, హైదరాబాద్ : కాంక్రీట్ జంగిల్గా మారిన నగరం నుంచి సిద్దిపేట వైపు ఉన్న శామీర్పేటకు వెళ్తే చాలు.. భూమికి పచ్చని రంగేసినట్టు కనిపించే గ్రీనరీ.. పెద్ద చెరువు అందాల సీనరీ.. రిసార్టుల్లో విడిది.. కట్టమైసమ్మ తల్లి సన్నిధి.. ఇలా ఎన్నెన్నో అందాలు కట్టిపడేస్తాయి.. పల్లె ముచ్చట్లు ఆలోచనల్లో ముంచెత్తుతాయి.. రుచులు ఆహా అనిపిస్తాయి.. స్టార్ రిసార్టులు పట్నం వాసులను రారమ్మంటున్నాయి. శామీర్పేట్: శామీర్పేట పెద్దచెరువును పాలకులు అందంగా ముస్తాబు చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లను కేటాయించగా పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ మహానగరానికి అతిచేరువలో ఉన్న శామీర్పేట పర్యాటక ప్రాంతంగా మారనుంది. అంతేగాక చెరువు సమీపంలో పచ్చని పంటపొలాలు, ఆహ్లాదకర వాతావరణం ఉండటంతో శని, ఆది వారాల్లో కుటుంబసమేతంగా ఇక్కడికి వచ్చి సంతోషంగా గడిపి వెళ్తున్నారు పట్టణ ప్రజలు. ప్రత్యేక ఆకర్షణగా.. ► శామీర్పేట పెద్దచెరువులో ’బంగారు తెలంగాణ’ అని తెలుగు అక్షరాలతో ఏర్పాటు చేసిన లోగో అందరినీ ఆకర్షిస్తోంది. అంతేగాకుండా పెద్దచెరువు పరిసరాల్లో పర్యాటకులు ► కూర్చొనేందుకు వివిధ పండ్ల ఆకారాల్లో కుర్చీలు, గజబోసులు ► పర్యాటకుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. వీటిని రంగులతో సుందరంగా ► తీర్చిదిద్దుతున్నారు. చెరువు పరిసరాల్లో ఏర్పాటు చేసిన గజబోసులపై ► రకారకాల బొమ్మలతో సుందరంగా అలంకరిస్తున్నారు. -
అక్రమార్కుల చెరలో హఫీజ్పేట్ కాయిదమ్మకుంట
-
అక్రమార్కుల చెరలో హఫీజ్పేట్ కాయిదమ్మకుంట
సాక్షి, సిటీబ్యూరో/హఫీజ్పేట్: గ్రేటర్లో చెరువుల అభివృద్ధికి గ్రహణం పట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 185 చెరువులకు గానూ..19 చెరువులనుతొలివిడతగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఏడాది క్రితం నిర్ణయించింది. ఇందుకోసం రూ.280 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించింది. కానీ ఏడాదిగా ఇందులో కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా పనులుఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పూర్తి చేసిన పనులకు గాను రూ.10 కోట్ల మేర పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. మరో వైపు డంపింగ్ యార్డులుగా మారిన ఆయా చెరువుల్లో తాము తొలగించిన ఘన వ్యర్ధాల పరిమాణం ఆధారంగా బిల్లులు చెల్లించడం లేదని పనులు చేపట్టిన ఏజెన్సీలు వాపోతున్నాయి. మరోవైపు పలు చెరువులు అక్రమార్కుల చెరలో చిక్కి డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా హఫీజ్పేట్లోని కాయిదమ్మకుంట నిలుస్తుంది. శాఖల మధ్య సమన్వయ లేమి.. తొలి విడతగా చేపట్టిన 19 చెరువుల అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో..మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టటంతో నీటిపారుదల శాఖ పర్యవేక్షణ సైతం ఈ పనులకు తప్పనిసరిగా మారింది. అయితే ఈ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బల్దియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ చెరువుల విభాగాన్ని ఇరిగేషన్ శాఖకు బదిలీ చేస్తేనే పనులు ముందుకు సాగుతాయని నీటి పారుదల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డ్గాకాయిదమ్మ కుంట... హఫీజ్పేట్లోని కాయిదమ్మకుంట జలాశయం బఫర్ జోన్లో అక్రమార్కులు ఇష్టానుసారంగా చెలరేగిపొతున్నారు. ఓ వైపు ప్రైవేట్ వ్యక్తులు మట్టితో పూడ్చి చదును చేస్తుంటే, జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని చెత్త డంపింగ్ స్థలంగా మార్చారు. మరో వైపు కుంట సమీపంలోని స్థలం ఉన్న వారు నిర్మాణ వ్యర్థాలతో డంపింగ్ చేస్తున్నారు. ఇదే తరహాలో మరికొద్ది రోజులు అక్రమాలు కొనసాగితే కాయిదమ్మ కుంట కానరాదేమోనని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాయిదమ్మ కుంట బఫర్ జోన్ ప్రైవేట్ వ్యక్తులకు ఫలహరంగా మారింది. కొద్ది సంవత్సరాలుగా బండరాళ్లు, మట్టితో యధేచ్ఛగా పూడ్చుతూ చదును చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ మార్చేందుకు కుట్ర పన్నుతున్నారు. ఇంత జరిగినా ఇరిగేషన్, శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. బఫర్ జోన్లో అక్రమంగా చెత్తను ఆటోల ద్వారా డంపింగ్ చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది తాజాగా కొందరు వ్యక్తులు ట్రాక్టర్లతో నిర్మాణ వ్యర్థాలను చెరువు సమీపంలో ప్రైవేట్ స్థలంలో డంపింగ్ చేస్తున్నారు. దీంతో వరద రాకపోవడమే కాకుండా వర్షాకాలంలో వచ్చే వరదనీరు కలుషితమై చెరువులో కలిసే వీలుంది. బఫర్ జోనల్లో కొంత మంది అక్రమంగా సెల్టవర్ ఏర్పాటు చేశారు. విద్యుత్ కనెక్షన్ కోసం ఏకంగా అధికారులను సంప్రదించకుండా దొడ్డి దారిన విద్యుత్ స్థంభాలను ఏర్పాటు చేసి కేబుల్ వైర్లను లాగి ఉంచారంటే టీఎస్సీపీడీసీఎల్ అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అపర్ణ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీ దగ్గరగా స్తంభాలు వేశారని, దీంతో సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు టీఎస్పీడీసీఎల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కేసు నమోదు చేసి..మట్టి తొలగిస్తాం కాయిదమ్మ కుంట బఫర్ జోన్లో చెరువు స్థలాన్ని మట్టితో పూడ్చివేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. బఫర్ జోనల్లో మట్టితో పూడ్చి చదును చేస్తే కేసులు నమోదు చేస్తాం. మట్టిని తొలగిస్తాం. విషయం తెలిసిన వెంటనే పూడ్చివేతను అడ్డుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం.– వంశీమోహన్, శేరిలింగంపల్లి తహసీల్దార్ -
చేతులు కలిపారు... చెరువును శుభ్రం చేశారు..
సాక్షి, హైదరాబాద్: ‘పరుగు పెట్టండి.. ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించండి’ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం మన్కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన మాట. శరీర ఆరోగ్యానికి పరుగు ముఖ్యమని, అదే సమయంలో రోడ్డుపై కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలను తీసి చెత్తకుండీలో వేయాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు రిపుదమన్ బెల్వి అనే యువకుడు చేపట్టిన ఈ తరహా ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ స్వయంగా అతడికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. దానిని ఆదర్శంగా తీసుకోవాలని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో నగరానికి చెందిన 10 మందితో కూడిన యువ బృందం ఓ చెరువును తమ స్థాయిలో శుభ్రపరిచి ఆకట్టుకున్నారు. ‘యానిమల్ వారియర్స్ కన్సర్వేషన్ సొసైటీ’ సభ్యులు నగర శివారులోని అమీన్పూర్ చెరువుకు చేరువలో ఉన్న కింగ్ఫిషన్ చెరువును శుభ్రం చేశారు. సొసైటీ ఫౌండర్ ప్రదీప్ నాయర్ ఆధ్వర్యంలో సంజీవ్ వర్మ, సంతోషి, ప్రభు, మనీష్, పవన్, అనిరుధ్, అనురుధ్ సహదేవ్, నమ్రత, పూజిత, రాఘవ్ తదితరులు చెరువు నుంచి 12 బస్తాల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఉదయపు వ్యాయామంలో భాగంగా ఆ చెరువు వద్దకు వెళ్లిన వారు అది ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయినట్లు గుర్తించారు. దీంతో జాలరులకు చెందిన రెండు తెప్పలను తీసుకుని చెరువులోకి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించారు. ‘ఈ చెరువు సహజ అందాలకు నెలవు. ఇక్కడికి విదేశీ పక్షులు క్రమం తప్పకుండా వలస వస్తాయి. అయితే దీనిపై అవగాహన లేక స్థానికులు ప్లాస్టిక్ వ్యర్ధాలను అందులో డంప్ చేస్తుండటంతో చెరువు కాలుష్య కాసారంగా మారింది. ఇది వలస పక్షుల రాకపై ప్రభావం చూపనుంది. అందుకే మాకు చేతనైన స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించాం’ అని సొసైటీ సభ్యుడు సంజీవ్ వర్మ పేర్కొన్నారు. కొందరు తాగుబోతులు ఈ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని మద్యం తాగేందుకు ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చి నిత్యం చెరువులో పడేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిని అరికట్టాలని సంబంధిత అధికారులను కోరారు. అమీన్పూర్ శివారులోని చిట్టడివిలో సమీపంలోని ప్రాంతాల చిన్నారులతో సభ్యులు మోగ్లీ వాక్ నిర్వహించారు. పర్యావరణం, ప్రకృతి, జీవవైవిధ్యం, పక్షులపై చిన్నారులకు అవగాహన కల్పించారు. గతంలో మన చుట్టూ పక్షులు ఎలా ఉండేవో, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయావో, అవి అంతరించకుండా మనం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. -
రక్షించేందుకు వెళ్లి..
సాక్షి, శృంగవరపుకోట(విజయనగరం): మండలంలోని పోతనాపల్లి శివారు కృష్ణంరాజు చెరువులో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించేందుకు దిగిన విశాఖ డెయిరీ పాలకేంద్రం–2 అధ్యక్షుడు కూనిరెడ్డి సత్తిబాబు (58) మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించి మృతుని బంధువులు, ప్రత్యక్షసాక్షులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పోతనాపల్లి గ్రామానికి చెందిన చలుమూరి ప్రసాద్ తన గేదెలను గ్రామ సమీపంలో గల ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాల వైపు మేత కోసం తీసుకెళ్లాడు. ఉదయం 11.30 గంటల సమయంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న కృష్ణంరాజు చెరువులో గేదెలు దిగాయి. అయితే గేదెలు ఒడ్డుకు రాకపోవడంతో ప్రసాద్ చెరువులో దిగి వాటిని తోలే ప్రయత్నంలో మునిగిపోసాగాడు. ఇంతలో ఒడ్డున ఉన్న ప్రసాద్ భార్య తన భర్త మునిగిపోతున్నాడంటూ పెద్దగా కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న కూనిరెడ్డి జగదీష్, కాటకాని రాజు, పాముల ప్రసాద్, కూనిరెడ్డి సత్తిబాబులు చెరువులో దిగారు. మునిగిపోతున్న చలుమూరి ప్రసాద్ను రక్షించి ఒడ్డుకు తీసుకుని వస్తున్న క్రమంలో కూనిరెడ్డి సత్తిబాబు చెరువులో మునిగిపోయాడు. ప్రసాద్ను మాత్రం కూనిరెడ్డి జగదీష్, కాటకాని రాజు, పాముల ప్రసాద్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తీరా చూస్తే చలుమూరి ప్రసాద్ను రక్షించేందుకు దిగిన కూనిరెడ్డి సత్తిబాబు మునిగిపోయాడని గుర్తించారు. వెంటనే మళ్లీ చెరువులో దిగి మునిగిపోయిన సత్తిబాబును ఒడ్డుకు తీసుకుని వచ్చి ప్రైవేట్ వాహనంలో హుటాహుటిన ఎస్.కోట పట్టణంలో గల ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. సీహెచ్సీ డాక్టర్ మహర్షి కూనిరెడ్డి సత్తిబాబుని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో ఆస్పత్రి ఆవరణ మృతుని బంధువుల రోధనలతో మిన్నంటింది. అప్పుడే ఇంటి వద్ద స్నానం చేసి బయటకు వచ్చిన కూనిరెడ్డి సత్తిబాబు తన సోదరి కుమారుడు ప్రసాద్ చెరువులో మునిగిపోతున్నాడని తెలిసి రక్షించేందుకు దిగి తను విగతజీవిగా మారాడాంటు భార్య రమణమ్మ, బంధువులు, పోతనాపల్లి గ్రామస్తులు బోరున విలపించారు. మృతుని సోదరుడు కూనిరెడ్డి వెంకటరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కె. నీలకంఠం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో సౌమ్యుడిగా పేరు.. మృతిచెందిన కూనిరెడ్డి సత్తిబాబు గ్రామంలోని విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో నడుస్తున్న పాల ఉత్పత్తిదారుల సంఘం – 2 అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. గ్రామ ప్రజలు, బంధువులు అందరితో సత్తిబాబు ఎంతో చనువుగా ఉంటూ సౌమ్యుడిగా పేరు పొందారు. ఈయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈయన మృతికి సంతాప సూచకంగా గ్రామంలో ఉన్న దుకాణాలు మూసివేశారు. -
ఉప్పొంగిన భీమేశ్వర వాగు
తాడ్వాయి(నిజామాబాద్) : తాడ్వాయి మండలంలో గురువారం భారీ వర్షం కురవడంతో మండలంలోని సంతాయిపేట్ శివారులోని భీమేశ్వర వాగు ఉప్పొగింది. ప్రతిరోజు మాదిరి గానే గ్రామానికి చెందిన 18 మహిళ కూలీలు, ఆరుగురు వ్యవసాయ కూలీలు గురువారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం వాగు దాటి వెళ్లారు. కానీ సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా వాగు పెద్ద ఎత్తున పొంగుతూ పారింది. భయపడి కూలీలు వాగు అవతల నిలిచిపోయారు. ఎనిమిది గంటల పాటు వాగు అవతల ఉన్న భీమేశ్వరాలయంలో తల దాచుకున్నారు. మహిళలు అధికంగా ఉండటంతో ఆందోళన చెందారు. ఎప్పుడు నీళ్లు తగ్గుతాయో.. ఎప్పుడు తెల్లవారుతుందా.. అని నిరీక్షించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు, గ్రామ పెద్దలు, యువకులు భీమేశ్వరా వాగు వద్దకు వెళ్లారు. యువకులు ముందుకు వచ్చి వాగులో దిగి కర్రల సహాయంతో అక్కడి ఒడ్డుకు వెళ్లి తాడు కట్టారు. ఆ తాడు సహాయంతో కూలీలను ఒక్కొక్కరిని వాగు దాటించారు. దీంతో 24 మంది కూలీలు క్షేమంగా ఇండ్లకు చేరుకున్నారు. శుక్రవారం వాగులో నీరు పారడం తగ్గుముఖం పట్టింది. వాగు అవతల గ్రామానికి చెందిన 100 మంది రైతులకు సంబధించిన 200ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే ప్రసిద్ధి గాంచిన భీమేశ్వరాలయం ఉంది. ఈ ఆలయంలో ప్రతి రోజు పూజలు జరుగుతతాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వాగుపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. తాడు సహాయంతో వాగు దాటుతున్న కూలీలు భయం భయంగా.. ఎప్పుడు తెల్లారుతుందోనని భయంభయంతో ఎదురుచూశాం. మా కుటుంబ సభ్యుల వద్దకు ఎప్పుడు చేరుతామోనని ఆందోళన చెందాము. – గొల్ల సాయవ్వ, కూలీ ఎనిమిది గంటల పాటు.. భయంతో శివున్ని ప్రార్థించుకుంటూ ఉన్నాను. 8 గంటల పాటు నిద్ర లేకుండా ఉండి పోయా. రాత్రి కావడంతో చాలా భయం వేసింది. వాగు దాటి కూలీ చేయాలంటే భయమైతుంది. – మ్యాదరి బాలమణి, కూలీ -
ఆ సరస్సులో దిగారా.. ఇక అంతే!
మాడ్రిడ్: ఇన్స్టాగ్రామ్ వచ్చాక స్పెయిన్లోని ‘మోంటే నేమ్’ సరస్సు టూరిస్ట్ స్పాట్గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఎందరో పర్యాటకులు ఈ సరస్సును సందర్శిస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా ఈ సరస్సుకు సంబంధించి రకరకాల వార్తలు వెలుగు చూస్తూ.. పర్యాటకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. విషయం ఏంటంటే.. ఈ సరస్సులో స్నానం చేసిన వారంతా అనారోగ్యం పాలవుతున్నారట. గత వారం ఈ సరస్సులో స్నానం చేసిన ఇద్దరు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుండగా.. మరి కొద్ది మంది చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీని గురించి ఓ పర్యాటకురాలు మాట్లాడుతూ.. ‘ఈ నీటిలో దిగగానే నాకు వాంతికి వచ్చిన భావన కల్గింది. అలానే నా ఒంటి మీద రాష్ కూడా వచ్చింది’ అని వెల్లడించారు. సరస్సుపై ఇలాంటి ఫిర్యాదులు ఎక్కవ కావడంతో నిపుణల బృందం రంగంలోకి దిగింది. చివరగా ఆసిక్తకర విషయాలు వెల్లడించింది. వారు చెప్పిన దాని ప్రకారం మోంటే నేమ్ అనేది సరస్సు కాదు.. గతంలో ఓ క్వారీ. టంగస్టన్ గనికి అనుబంధంగా దీన్ని తవ్వారు. ఆ తర్వాత దీన్ని వినియోగించడం మానేశారు. దాంతో అది కాస్త సరస్సులా మారింది. ఇంతకు ముందు ఆ ప్రాంతంలో వెలువడిన రసాయనాల వల్ల సరస్సు నీటి రంగు ప్రస్తుతం ఉన్న విధంగా మారింది. ఇక్కడ కాలుష్యం ఎంతలా ఉండేదంటే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ‘గెలీషియన్ చెర్నోబిల్’గా పిలిచేవారు అని తెలిపింది నిపుణుల బృందం. View this post on Instagram Este lago situado na zona do monte Neme convértese nun sitio de interés cultural para zalapastrans. As augas cristalinas e minerais que conectan con unha antiga mina chaman a atención de miles de miñocas que se acercan a bañarse para ver como a súa pel se desvanece. A post shared by A non Xunta de Galicia (@anonxuntadegalicia) on Jul 13, 2019 at 10:38am PDT అయితే ఈ సరస్సు చుట్టూ ఉన్న అందమైన నేపథ్యం ఇది పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. ఇన్స్టాగ్రామ్లో ఈ ప్రాంతానికి చెందిన ఫోటోలను పోస్ట్ చేయడంతో మరింత క్రేజ్ సంపాదించుంది. -
రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే చేపల సాగు..
రెండున్నర ఎకరాల చేపల చెరువులో సాగు చేసే చేపలను కేవలం 484 (22 “ 22) చదరపు అడుగుల పంజరాల(కేజ్ల)లో సాగు చేయడం ద్వారా.. నెల నెలా రూ. 25,750ల చొప్పున ఏడాదికి రూ. 3.09 లక్షల ఆదాయం పొందే ఇంటెన్సివ్ కేజ్ కల్చర్ పద్ధతిని కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రూపొందించింది. పెరట్లో తక్కువ స్థలంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ పునర్వినియోగించే ఆక్వా సాగు పద్ధతి కావడంతో రోజుకు కేవలం వెయ్యి లీటర్ల నీరు మాత్రమే అవసరం అవుతుంది. 484 చదరపు అడుగుల పంజరాలలో చేపలు పెంచుతారు. అయితే, నీటి శుద్ధి పరికరాలకు, షేడ్నెట్ వేసుకోవడానికి మొత్తం 200 చదరపు మీటర్ల విస్తీర్ణం చోటు అవసరమవుతుంది. రైతులకు నెల నెలా చెప్పుకోదగిన ఆదాయం పొందే ఈ పద్ధతి ద్వారా నీటి వనరులకు తీవ్ర కొరత ఉండే జిల్లాల్లో కూడా యువతను ఆక్వా సాగులోకి ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.), జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ సంస్థ (ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.) ఆవరణలో ఈ రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. రైతులు, యువత స్వయంగా వెళ్లి చూసి అవగాహన కలిగించుకోవచ్చు. యూనిట్ వెల రూ. 5.6 లక్షలు 22 “ 22 చదరపు అడుగుల్లో ఒక రీ–సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడానికి రూ. 5.6 లక్షలు ఖర్చవుతుంది. జనరల్, ఒబిసి అభ్యర్థులకు 40%, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యుర్థులకు 60% మేరకు ఎన్.ఎఫ్.డి.బి. సబ్సిడీ ఇస్తుంది. మిగతా సొమ్ముకు బ్యాంకు రుణం పొందవచ్చు. పక్కపక్కనే మూడు కేజ్లను (ఈ మూడూ కలిపి 22 “ 22 చదరపు అడుగులే) ఏర్పాటు చేస్తారు. ఒక్కో కేజ్లో 45 రోజుల తేడాతో చేప పిల్లలను వదులుకుంటే.. 3 నెలల తర్వాత నుంచి ఏడాది పొడవునా దశల వారీగా చేపల దిగుబడి వస్తుందని, తద్వారా రైతుకు ప్రతి నెలా ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు వెయ్యి లీటర్ల నీరు చాలు.. మొదట్లో 90 వేల లీటర్ల నీరు నింపుతారు. గిఫ్ట్ తిలాపియా, జెల్ల (పంగాసియస్), కొర్రమేను (ముర్రెల్), కషిమీర (పెర్ల్ స్పాట్) వంటి చేప పిల్లలను వదులుతారు. రెండు వేల నుంచి మూడు వేల చేప పిల్లలను వదులుతారు. అనుదినం నీటిని శుద్ధి చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తారు. కాబట్టి రోజుకు 800–1,000 లీటర్ల మడ్డి నీటిని బయటకు తోడేసి, ఆ మేరకు మంచి నీటిని నింపాల్సి ఉంటుంది. ఈ మడ్డి నీరు పోషకాలతో కూడి ఉంటుంది. రోజూ చేపల వయసును బట్టి నీటిపై తేలాడే బలపాల (పెల్లెట్స్) మేత వేస్తారు. మేత అవశేషాలు, చేపల విసర్జితాలు కలిసిన ఈ నీటిలో నత్రజని వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషక జలాన్ని కూరగాయలు, ఇతర పంటలకు పారగట్టవచ్చు. ఇలా పెరిగే చేప పిల్లలు మూడు నెలల్లో మంచి సైజుకు పెరుగుతాయి. నీరు ఎప్పటికప్పుడు శుద్ధి అవుతూ ఉంటుంది కాబట్టి జబ్బుల సమస్య ఉండదు. ప్రతి మూడు నెలలకు 1,620 కిలోల చేపల దిగుబడి వస్తుందని, కిలో రూ. 180 నుంచి 200 వరకు గిట్టుబాటవుతుందని నిపుణుల అంచనా. ప్రతి 3 నెలలకు రూ. లక్షా 40 వేల వరకు మేత, తదితర ఖర్చులు ఉంటాయి. ఈ యూనిట్ను ఏర్పాటు చేసుకునే వారికి మొదటి 3 నెలలకు అవసరమైన పెంపకం ఖర్చు రూ. లక్షా 40 వేలను ఎన్.ఎఫ్.డి.బి. అందిస్తుందని అధికారులు తెలిపారు. ప్రతి 3 నెలలకు రూ. 2.4 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఏడాదికి 4 పంటలు తీయవచ్చు. అంటే మొత్తం రూ. 7.29 లక్షల ఆదాయం వస్తుంది. ఇందులో రూ. 4.2 ఖర్చులు పోను నికరంగా రైతుకు రూ. 3.09 లక్షల(నెలకు రూ. 25,750 చొప్పున) నికరాదాయం వస్తుందని ఎన్.ఎఫ్.డి.బి., ఎన్.ఐ.ఆర్.డి. నిపుణులు అంచనా వేస్తున్నారు. కిలో రూ. 400 ధర పలికే కాట్ ఫిష్ను కూడా పెంచుకోవచ్చు. ఎవర్ని సంప్రదించాలి? తక్కువ స్థలంలో అధిక సాంద్రతలో చేపలను ఉత్పత్తి చేసే ఈ బాక్యార్డ్ రీ–సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ను ఏర్పాటు చేయదలచుకునే వారు సబ్సిడీ, సాంకేతిక సహాయం కోసం హైదరాబాద్లోని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి.) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (టెక్నికల్) ను 040–24000113 నంబరు లో సంప్రదించవచ్చు. లేదా హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.కు చెందిన రూరల్ టెక్నాలజీ పార్క్లోని శేఖర్ను 98487 80277 నంబరులో సంప్రదించవచ్చు. ఈ రెండు చోట్లా ఈ కేజ్ కల్చర్కు సంబంధించిన నమూనాలను ప్రదర్శనకు ఉంచారు. ఎవరైనా వెళ్లి చూడవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ జిల్లాలోనైనా ఈ పెరటి చేపల చెరువులను ఏర్పాటు చేసుకోవచ్చని.. అయితే, వీటిపై నీడ కోసం, పక్షుల నుంచి రక్షణ కోసం షేడ్నెట్ షెడ్ వేసుకోవడం తప్పనిసరి. అయితే, షేడ్నెట్ హౌస్ ఖర్చును రైతులే భరించాల్సి ఉంటుందని రూరల్ టెక్నాలజీ పార్క్ డైరెక్టర్ రమేశ్ శక్తివేల్ ‘సాక్షి’తో చెప్పారు. -
‘టిక్ టాక్’ లైక్ల కోసం..
కుత్బుల్లాపూర్: ‘టిక్ టాక్’ యాప్ మరో ప్రాణం తీసింది.. లైక్ల కోసం ప్రమాదకరంగా వీడియో తీసుకుంటూ ఓ యువకుడు నీట మునిగి మృత్యువాత పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుం ది. సీఐ మహేశ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం, సజ్జాపూర్ గ్రామానికి చెందిన కరణప్ప, బాలామణి దంపతుల కుమారుడు చిన్నా(22) బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి దూలపల్లిలో ఉంటూ ఎర్రగడ్డలోని ఓ పళ్ల దుకాణంలో పని చేస్తున్నాడు. మంగళవారం అతను తన పెద్దమ్మ కొడుకు ప్రశాంత్తో కలిసి దూలపల్లిలోని తూ మార్ చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో సోష ల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’ సభ్యుడిగా ఉన్న చిన్నా తాను నీటిలో ఉన్నప్పుడు వీడియో తీయాల్సిందిగా ప్రశాంత్ను పురమాయించాడు. ప్రశాంత్ వీడియో తీస్తుండగా చిన్నా చెరువు వద్ద నీటిలో టిక్టాక్కు అనుగూణంగా నటిస్తుండగా ప్రమాదవశాత్తు లోతుగా ఉన్న గుంతలో పడిపోయాడు. ప్రశాంత్ అతడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్థానికులు అక్కడికి చేరుకునేలోగా చిన్నా నీటిలో గల్లంతయ్యాడు. బుధవారం చిన్నా మృతదేహాన్ని వెలికి తీసిన బషీరాబాద్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నా తండ్రి కరణప్ప అతడి చిన్నతనంలోనే మృతి చెందగా, తల్లి బాలామణి సజ్జాపూర్లో ఒంటరిగా ఉంటోంది. -
ఆశలు జలసమాధి
ఉక్కునగరం(గాజువాక): అనకాపల్లిలో ఎంసీఏ పూర్తి చేశాడు... అమెరికాలో ఎంఎస్ పూర్తిచేశాడు... అక్కడే ఉద్యోగం సంపాదించుకుని హాయిగా గడుపుతున్నాడు... భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలు కంటున్న తరుణంలో మృత్యువు కాటేసింది. ఇష్టమైన బోటింగ్కు వెళ్లి ఈతకు దిగగా నీటిలో మునిగి చనిపోయాడు. ఈ దుర్ఘటన అమెరికాలోని న్యూజెర్సీలోని సరస్సులో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్టీల్ప్లాంట్ ఇంజినీరింగ్ షాప్స్ అండ్ ఫౌండ్రీ విభాగంలో జనరల్ ఫోర్మెన్ కూన వెంకటరావుకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన కుటుంబంతో సెక్టార్ – 3లోని 144ఎ క్వార్టర్లో నివసిస్తున్నారు. కుమార్తె మృదులకు వివాహమైంది. కుమారుడు కె.అవినాష్ (31) అనకాపల్లి డైట్ కాలేజీలో ఎంసీఎ పూర్తి చేశాడు. అమెరికాలోని న్యూమెస్సికాన్ స్టేట్ యూనివర్సిటీలో 2016లో ఎంఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం న్యూజెర్సీలో యూనియన్ పోస్టల్ సర్వీసులో పని చేస్తున్నాడు. స్వతహాగా చురుకుగా, ఉత్సాహంగా ఉండే అవినాష్ బోట్ డ్రైవింగ్, స్విమింగ్లో నిష్ణాతుడు. శనివారం తన స్నేహితులతో సమీపంలో ఉండే హోప్తాకాంగ్ ఫిష్ లేక్లో బోటింగ్ వెళ్లాడు. తనే బోట్ డ్రైవ్ చేశాడు. ఒక ప్రాంతంలో ఈతకు డైవ్ చేయగా నీటిలోకి వెళ్లిన అవినాశ్ తేలలేదు. దీంతో కంగారుపడిన స్నేహితులు ఎంత వెతికినా కనిపించలేదు. వెంటనే స్థానిక అదికారులకు సమాచారం అందించగా వారు గాలింపు చేపట్టారు. ఈ విషయం ఆదివారం ఉదయం తండ్రి వెంకటరావుకు సమాచారం అందింది. దీంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. గాలింపులో సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. న్యూజెర్సీ సమీపంలో ఉన్న బంధువులు, అక్కడి తెలుగు వాళ్లు అవినాష్ ప్రమాద సంఘటన విషయంలో స్థానిక పోలీసులతో సమన్వయం చేస్తున్నారు. అవినాశ్ తల్లి ప్రస్తుతం అనారోగ్యంతో ఉక్కు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడి అధికారుల సూచనల మేరకు మృతదేహాన్ని విశాఖకు తీసుకురానున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా ఆకస్మికంగా మృతి చెందటంతో ఉక్కునగరంలో విషాదం నెలకొంది. -
తాళ్ల చెరువును తోడేస్తుండ్రు...
సాక్షి, వనపర్తి: ఓవైపు చెరువులకు పూర్వ వైభవం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం రూ.కోట్ల ప్రజాధనం వెచ్చించి నాటి గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేస్తుంటే, కొందరు చెరువుల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవల మరమ్మతు చేసిన వనపర్తి జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువు ఓ వైపు ఆక్రమణకు గురైంది. మరోవైపు అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు రియల్ వ్యాపారులు చెరువులోని మట్టిని తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషమై స్థానికులు అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొంచి ఉన్న ముప్పు చిన్ననీటి పారుదల నిబంధనల ప్రకారం చెరువు కట్టకు పదిమీటర్ల దూరం వరకు కనీసం పూడికతీత పనులు చేపట్టనివ్వరు. చెరువుకట్టకు సమీపంలో గోతి ఎక్కువగా చేస్తే నీరు నిల్వ అయిన సమయంలో కట్ట కిందభాగం నుంచి అవతలికి నీరు వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీంతో క్రమక్రమంగా కట్టబలహీనపడి తెగిపోయే పరిస్థితులు వస్తాయి. ఇంత ప్రమాదం ఉన్నా.. అధికారులతో ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రభుత్వ ఆధీనంలోని చెరువులో నుంచి కొందరు రియల్ వ్యాపారులు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ చెరువు కింద ప్రస్తుతం ఆయకట్టు చాలా తక్కువగా ఉంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చిన్నపాటి తాళ్ల చెరువును మినీ ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేయాలని ఏడాది పొడవునా.. నీటితో నిల్వ ఉంచి భూగర్భజలాలను పునఃరుద్ధరించాలని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. తాళ్ల చెరువు అభివృద్ధి పనుల కోసం ఎస్టిమేట్ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులకు మౌకిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోపక్షం రోజుల్లో ఎస్టిమేట్ సిద్ధమయ్యే సమయంలో రియల్ వ్యాపారులు చెరువులో మట్టితవ్వకాలకు తెగబట్టారు. సుమారు 2వేల ట్రాక్టర్ల వరకు మట్టిని తరలించినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యమే తాళ్ల చెరువులో కొందరు ఓ ప్రొక్లెయినర్, సుమారు పది ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారని చెరువుకు సమీపంలో నివాసం ఉండేవారు చిన్ననీటి పారుదలశాఖ అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. దీనికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఓ ఉన్నతస్థాయి అధికారి సమాధానం ఇచ్చారని సదరు వ్యక్తి తెలిపారు. సమాచారం ఇచ్చిన వారిని ప్రశ్నలతో ఎదురుదాడి చేయటానికి ప్రయత్నించటం విస్మయానికి గురిచేసిందని ‘సాక్షి’తో వాపోయారు. అక్రమణల పర్వం ఇలా.. ఇప్పటికే తాళ్ల చెరువు వాగు ఆక్రమణకు గురైంది. 1999, 2008లో రెండుసార్లు కురిసిన భారీ వర్షాలకు నీరంతా నిండి ఇళ్లలోకి, రోడ్లపైకి వచ్చాయి. 1999లో చోటుచేసుకున్న సంఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు గతంలో చోటుచేసుకున్న విషయం తెలిసినా.. అధికారులు చెరువుల విషయంలో అలసత్వం ప్రదర్శించటం ఏమిటని పలువురు అసహనం వ్యక్తంచేశారు. గతంలో చెరువులో నుంచి అలుగుపారడంతో పట్టణంలోని భగత్సింగ్నగర్, శ్వేతానగర్, దామోదర్ కాలనీ, బ్రహ్మంగారివీధి, శంకర్గంజ్, రాంనగర్ కాలనీ, రామాటాకీస్, బంగారం దుకాణాలు, ఆర్అండ్బీ కార్యాలయం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, టౌన్పోలీస్స్టేషన్ జలమయం అయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం రియల్ వ్యాపారులు చేసిన తవ్వకాలతో భవిష్యత్లో కట్టకు ఏదైనా ప్రమాదం జరిగితే సంభవించే నష్టాన్ని ఊహించటం కష్టమే. వెంటనే చర్యలు తీసుకుంటాం తాళ్ల చెరువులో మట్టి తవ్వకాల గురించి ఇప్పటికే స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే చెరువును సందర్శిస్తాం. అక్రమ మట్టి తరలింపును అడ్డుకుంటాం. మినీట్యాంక్బండ్ తరహాలో తాళ్ల చెరువును అభివృద్ధి చేసేందుకు ఎస్టిమేట్లు త్వరలో పూర్తి చేస్తాం. – భరత్, అసిస్టెంట్ ఇంజనీర్, వనపర్తి -
అటకెక్కిన చెరువుల సుందరీకరణ
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని చెరువుల సుందరీకరణ అటకెక్కింది. ప్రస్తుతం ఉన్న దాదాపు 170 చెరువుల్లో 20 తటాకాలను ప్రక్షాళన చేసి, సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించి ఏడాదైనా ఇంతవరకు కార్యరూపం దాల్చనేలేదు. ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మిషన్ కాకతీయ నిధులతో నగరంలోని 20 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించి ఆ మేరకు గతేడాది మార్చిలో ప్రభుత్వం అనుమతించింది. ఏడాది కాలం గడిచి.. మళ్లీ మార్చి నెల వచ్చినా ఇంతవరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.. ఒక్క చెరువూ ప్రక్షాళన కాలేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆరా తీయగా.. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాకపోవడమేనని తేలింది. దాదాపు ఐదారు పర్యాయాలు ఈ పనుల కోసం టెండర్లు పిలిచినా నాలుగైదు పనులకు తప్ప మిగతా వాటిని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. వ్యయ ప్రయాసలకోర్చి పనులు చేసినా సకాలంలో బిల్లులు అందుతాయో లేదో అనే సంశయంతోనే కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాలేదని సమాచారం. దీంతోపాటు గతేడాది ఎన్నికల కారణంగానూ కొన్ని నెలలపాటు అధికారులు కూడా వీటిపై శ్రద్ధ చూపలేదు. దీంతోపాటు ఎన్నికల కోడ్తోనూ టెండరు అగ్రిమెంట్లకు అవకాశం లేకపోవడం తదితరమైనవి మరికొన్ని కారణాలుగా ఉన్నాయి. అయితే, అన్నీ చక్కబడ్డాక.. ఇప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకొచ్చే అవకాశం కనిపించడం లేదు. కేవలం చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లిచరనే కాంట్రాక్టర్లు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అమలుకు నోచని హామీ.. గత సంవత్సరం నగరంలోని సరూర్ చెరువు దుస్థితిని వివరిస్తూ నగర పౌరుడొకరు అప్పటి మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. దాంతో సహా నగరంలోని 20 చెరువుల్ని ప్రక్షాళన చేసి సుందరంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ ప్రకటించడమేగాక.. సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. వెంటనే అధికారులు పనుల కుపక్రమించి.. ఈ పనులకు రూ.287.93 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇవన్నీ పరిశీలించిన ప్రభుత్వం మిషన్ కాకతీయ నాలుగో దశ కింద రూ.282.63 కోట్లు విడుదల చేస్తూ పరిపాలన పర అనుమతులు జారీ చేసి టెండర్లు ఆహ్వానించారు. కానీ.. పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలింది. ♦ వీటిలో మూడు చెరువుల అభివృద్ధికి సీఎస్సార్ కింద నిధులిచ్చేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకు దచ్చాయి. దీంతో వాటి స్థానే ఇతర చెరువులను అభివృద్ధి చేయాలని భావించారు. అందుకు అనుగుణంగా అంచనాలు రూ.279.78 కోట్లకు తగ్గాయి. ♦ కార్యరూపం దాల్చని ‘ప్రైవేట్’ ప్రతిపాదన నగరంలోని మిగతా చెరువులను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ నిధులతో అభివృద్ధి చేయాలని అధికారులు భావించారు. చెరువుల ప్రక్షాళన పూర్తయ్యాక, తిరిగి మురుగునీరు చేరకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు దిగువన సదుపాయాలు కల్పించడం ఇందులోని ప్రధాన లక్ష్యం. 1. చెరువు/సరస్సు స్థలం మేర ప్రహరీ/ఫెన్సింగ్ ఏర్పాటు 2. ప్రహరీ లోపల చెరువు ఒడ్డున అందమైన పచ్చిక, ఫౌంటెన్లు వంటి సుందరీకరణ పనులు 3. నడక మార్గాల ఏర్పాటు 4. వివిధ రకాల మొక్కలతో పచ్చదనం 5. కూర్చునేందుకు బెంచీలు, కుర్చీల వంటి ఏర్పాట్లు 6. వాహన పార్కింగ్ సదుపాయం 7. రాత్రివేళల్లో అందమైన లైటింగ్ 8. స్నాక్స్, టీ/కాఫీల కేఫటేరియా 9. వాననీరు వెళ్లేందుకు బైపాస్ డ్రెయిన్లు 10. టాయిలెట్లు తదితర సదుపాయాలు ♦ చెరువుల వద్ద జలక్రీడలు, బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలతో వచ్చే ఆదాయన్ని చెరువు పనులు చేసిన ప్రైవేట్ సంస్థకు కొన్నేళ్ల పాటు ఇవ్వాలనేది లక్ష్యం. తర్వాత సదరు చెరువులు జీహెచ్ఎంసీ అజమాయిషీలోకే వస్తాయని పేర్కొన్నారు. కానీ ఆ దిశగానూ ఇప్పటి వరకు ఎలాంటి పనులు జరగలేదు. -
చెరువులో జారిపడి నలుగురు విద్యార్థుల మృతి
-
చెరువులకు మహర్దశ
సాక్షి, సిటీబ్యూరో: కలుషిత జలాలు, ఆక్రమణలతో చిన్నబోతున్న గ్రేటర్ చెరువులను పరిరక్షించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మహానగరం పరిధిలోని సుమారు 185 చెరువులను ఆక్రమణలు, కలుషిత జలాల బారి నుంచి రక్షించేందుకు బల్దియాలోని ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) విభాగం ఆధ్వర్యంలో ఆయా జలాశయాల వద్ద సీసీ టీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ కెమెరాలను నిరంతరం ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో పర్యవేక్షించేందుకు ఎల్బీనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఆయా చెరువుల్లోకి నిర్మాణ వ్యర్థాలను వదులుతున్న అక్రమార్కులు, కబ్జాలకు పాల్పడే వారిని అడ్డుకునేందుకు వీలుంటుంది. చెరువుల్లోకి నిర్మాణ వ్యర్థాలు వదిలిపెట్టే వారిపై నిరంతర నిఘా పెట్టడంతో పాటు వారి ఆగడాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. నిలువెల్లా కాలుష్యం... నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారంగా మారుతున్నాయి. పలు చెరువుల్లో ఇటీవల కాలంలో గుర్రపుడెక్క విస్తృతంగా విస్తరించింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి వదులుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గందభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా మలమూత్రాదులు, వ్యర్థజలాల్లో ఉండే ఫేకల్కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరగడంతో పాటు నీటిలో కరిగిన ఘన పదార్థాల మోతాదు అనూహ్యంగా పెరిగినట్లు పీసీబీ తాజా పరిశీలనలో తేలింది. ఈ ప్రభావంతో ఆయా జలాశయాల్లో సూక్ష్మజీవులు, జలచరాల మనుగడకు అవసరమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు దారుణంగా పడిపోవడం గమనార్హం. మురుగుతో అవస్థలు... ♦ సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. ♦ గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాలకు గురవడం, చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో చెరువులు మురుగు కూపాలవుతున్నాయి. ♦ పలు చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో సగం భూములను కోల్పోయి చిక్కి శల్యమైకనిపిస్తున్నాయి. ♦ రోజువారీగా గ్రేటర్వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థ జలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధి చేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధి లేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. ప్రక్షాళన చర్యలివీ... ♦ చెరువుల ప్రక్షాళన, పరిరక్షణకు తీసుకోవాల్సి న చర్యలపై ‘సేవ్ అవర్ అర్బన్ లేక్స్’ సంస్థ నిపుణులు సూచిస్తున్న పరిష్కారాలివీ... ♦ గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల్లో తక్షణం పూడిక తొలగించాలి. ఆయా చెరువుల్లో అట్టడుగున పేరుకుపోయిన ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. ♦ జలాశయాల ఉపరితలంపై ఉధృతంగా పెరిగిన గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలి. ♦ చెరువుల్లో ఆక్సిజన్ మోతాదు పెరిగేందుకు ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ♦ గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి నేరుగా వ్యర్థజలాలు చేరకుండా దారి మళ్లించాలి. ♦ ఆయా నీటిని మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన అనంతరమే చెరువులో చేరే ఏర్పాట్లు చేయాలి. ♦ చెరువులు అన్యాక్రాంతం కాకుండా ఎఫ్టీఎల్ బౌండరీలు, రక్షణ కంచె ఏర్పాటు చేయాలి. నిరంతరం నిఘా పెట్టాలి. ♦ జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తునహరితహారం చేపట్టాలి. ♦ వర్షపు నీరు చేరే ఇన్ఫ్లో చానల్స్ను ప్రక్షాళన చేయాలి. వాటిపై ఉన్న ఆక్రమణలను తొలగించాలి. ♦ జలాశయాల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేయాలి. ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలి. ♦ కాలుష్యం, కబ్జాలకు కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. -
చెరువులో హెచ్ఐవీ రోగి శవం.. 36 ఎకరాల చెరువును..
బెంగళూరు : అనుమానం ఆ గ్రామస్తుల పాలిట పెనుభూతంలా మారింది. ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ సోకిన మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటంతో.. 36 ఎకరాలలో విస్తరించి ఉన్న చెరువులోని నీటిని తోడిపడేస్తున్నారు. తాగటానికి ప్రధాన వనరుగా ఉన్న ఆ చెరువును ఖాళీ చేసే పనిలో తలమునకలయ్యారు. ఈ సంఘటన కర్ణాటక హుబ్లీ జిల్లా మొరాబ్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 29న మొరాబ్ గ్రామంలో ఓ మహిళ హెచ్ఐవీతో బాధపడుతూ అక్కడి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కొద్దిరోజుల తర్వాత మహిళ శవం నీటిపై తేలడంతో గుర్తించిన గ్రామస్తులు దాన్ని బయటకు తీశారు. అప్పటికే ఆ శవాన్ని చేపలు కొద్దిగా పీక్కుతిన్నాయి. దీంతో గ్రామస్తుల్లో భయం మొదలైంది. హెచ్ఐవీ సోకిన మహిళ శవంతో చెరువు నీరు కలుషితమై ఉంటుందని, ఆ నీటిని వాడితే హెచ్ఐవీ తమకు కూడా వస్తుందన్న అనుమానంతో తాగటానికి ఏకైక మార్గంగా ఉన్న 36 ఎకరాల చెరువులోని నీళ్లను తోడేయ్యాలని నిశ్చయించుకున్నారు. దాదాపు గత నాలుగు రోజులనుంచి చెరువులోని నీళ్లను తోడేయ్యటానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పదుల సంఖ్యలో మోటార్లు ఉపయోగించి చెరువును తోడేస్తున్నారు. మొరాబ్ మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. చాలా కాలం కిందట అదే చెరువులో ఒక బాలుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అప్పుడు చెరువును తోడేయ్యాలన్న ఆలోచన గ్రామస్తులకు రాలేదని, ఈ మధ్య చెరువులో దూకిన మహిళకి హెచ్ఐవీ ఉండటం వల్ల ఆ నీటిని తాగితే రోగం అందరికి వచ్చే అవకాశం ఉందన్న అనుమానంతో చెరువు నీళ్లను తోడుతున్నారని తెలిపారు. -
సరస్సులోకి దూసుకెళ్లింది..
మజురో(మార్షెల్ ఐలాండ్స్): న్యూజిలాండ్లో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్వే నుంచి పక్కకు జారిన విమానం సరస్సులోకి దూసుకెళ్లింది. సరుస్సు లోతుగా లేకపోవడంతో కొందరు ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన న్యూజిలాండ్లోని మైక్రోనేసియా ద్వీపంలో జరిగింది. 36 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వస్తున్న ఎయిర్ న్యుగిని బోయింగ్ 737 విమానం వెనో విమానాశ్రయంలో దిగుతూ అదుపుతప్పింది. ఒక్కసారిగా విమానం రన్వే పై నుంచి పక్కనే ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది. సరస్సు లోతు తక్కువ కావడంతో పూర్తిగా మునగలేదు. స్థానికులు పడవలతో వెళ్లి ప్రయాణికులు, సిబ్బందిని కాపాడారు. కొందరేమో ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని ఎయిర్పోర్టు సిబ్బంది తెలిపారు. ప్రమాద కారణాలు స్పష్టంగా తెలియకున్నా.. ప్రమాద సమయంలో భారీ వర్షం, తక్కువ వెలుగు ఉండటం కారణం కావచ్చని ఎయిర్లైన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక్కడ రన్వే పొడవు కేవలం 1831 మీటర్లు. 2008లో ఏసియా పసిఫిక్ ఎయిర్లైన్స్ కార్గో బోయింగ్ 727 విమానం కూడా రన్వేను దాటి ముందుభాగం వరకు సరస్సులోకి దూసుకెళ్లింది. -
ది క్వీన్
భారతదేశంలోని అతిపొడవైన సరస్సు, కేరళలో అతి పెద్దదైన సరస్సు – ‘వెంబనాడ్’ను ఈదిన తొలి మహిళగా మాలు వార్తలకెక్కింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న అమ్మాయి విజేతగా నిలవడమే ఈ కథ. చిన్నప్పుడు ఆ అమ్మాయిని వాళ్ల నాన్న ‘షయిఖా’ అని పిలిచేవాడు. అంటే అరబిక్లో యువరాణి అని అర్థం. అమ్మ ‘మాలు’ అని పిలుచుకునేది ముద్దుగా. బాల్యం అంటే ఆ పిల్లకు ఉన్న ఇష్టమైన జ్ఞాపకం ఆ పేరే... ‘మాలు షయిఖా’!ఆ తర్వాత ఆ జంట పదం విడిపోయింది. ఎందుకంటే అమ్మానాన్న భార్యాభర్తలుగా విడిపోయి మాలు షయిఖాను వదిలించుకుని వేరు వేరు పెళ్లిళ్లు చేసుకొని స్థిరపడ్డారు. ఫలితంగా ‘మాలు షయిఖా’ జీవితం అనామకంగా గడిచిపోవాల్సింది. కాని ఆ అమ్మాయి ఇవాళ దేశానికి తెలిసింది. తొమ్మిది కిలోమీటర్ల వెడల్పు‘వెంబనాడ్’ సరస్సు చుట్టూ ఈది వెంబనాడ్ను చుట్టిన మొదటి మహిళగా వార్తల్లో నిలిచింది. ఆత్మహత్య చేసుకోబోయి... మాలూకి ఎనిమిదేళ్లు వచ్చేదాకా ఆమె బాల్యం ఆనందంగానే గడిచింది. వాళ్ల నాన్న అన్నట్లు ఆ పిల్ల ఆ ఇంటికి యువరాణిలాగే ఉంది. కాని ఆ వయసులోనే ఆమె అమ్మా నాన్న విడిపోయారు. వెంటనే నాన్న ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు. అప్పటి నుంచి తన పదహారవ యేట వరకూ తల్లితోనే ఉంది మాలూ. తర్వాత తల్లీ తనను వదిలేసి మరో పెళ్లితో ఇంకో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంది. అప్పటికి మాలూ బెంగుళూరులో పదకొండో తరగతి చదువుతోంది. తల్లి పెళ్లితో మాలూ బాధ్యతను ఆమె అమ్మమ్మ వాళ్లు తీసుకున్నారు. అంతే వేగంగా ఆ భారాన్ని వదిలించుకోవాలనుకున్నారు. సొంతూరైన అలువా (కేరళ)కి తీసుకెళ్లి ఆ పెళ్లికి ఏర్పాట్లు చేశారు. బాగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేయాలనేది మాలూ కల. దాంతో అమ్మ వాళ్ల బంధువులు చేస్తున్న తతంగానికి బాధపడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ రాత్రే తమ ఊరి పొలిమేరల్లోని నది ఒడ్డుకు వెళ్లింది. చుట్టూ చూసింది.. ఆ చీకట్లో ఎవరూ లేరని నిర్థారించుకొని నదిలోకి దూకబోయింది. ‘‘ఆగు’’ అంటూ వెనక నుంచి భుజం పట్టుకొని లాగాడు ఓ వ్యక్తి. తిరిగి చూసింది. ఎవరో అపరిచితుడు. ‘‘నీకే సమస్యలున్నాయో నాకు తెలీదు.కాని వాటికి పరిష్కారం ఆత్మహత్య మాత్రం కాదు. ఈ థైర్యమేదో బతుకులో చూపించు. పది మందికి సహాయపడు’’అని చెప్పాడు. ఆ మాటలకు వెక్కి వెక్కి ఏడ్చింది. భుజం తట్టి వెళ్లిపోయాడు అతను. ఏదో శక్తి వచ్చినట్టు ఫీలైంది మాలూ. అతను చెప్పినట్టుగా బతికి చూపించాలని నిర్ణయించుకుంది. ఎవరికీ భారం కాకుండా... అమ్మమ్మ వాళ్ల మీద ఆధారపడకుండా బతకడమెలాగో ఆలోచించసాగింది. చిన్నప్పటి నుంచీ తనకు డ్రైవింగ్ అంటే ఇష్టం. ఆ ఇంట్రెస్ట్తోనే డ్రైవింగ్ నేర్చుకుంది. అది చాలు కాస్తంత ఆర్థిక వెసులుబాటుకు అని ముందడుగేసింది. అలువాలోని క్వీన్స్ మదర్స్ కాలేజ్లో బీకాంలో చేరింది. పార్ట్టైమ్ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా కొలువు చూసుకుంది. అమ్మమ్మ వాళ్లింట్లోంచి విమెన్స్ హాస్టల్కు మారింది. హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. ఎల్ఐసీ ఏజెంట్గా కూడా పని చేయడం మొదలుపెట్టింది. తన చదువుకు సరిపడే సంపాదనకు చేరుకుంది. టర్నింగ్ పాయింట్... జీవితం సాగిపోతోంది.. కాని మాలూ మనసులో ఓ కోరిక.. స్విమ్మింగ్ నేర్చుకోవాలని. ఏ నీళ్లలో మునిగి లైఫ్కు ఎండ్ పలకాలనుకుందో ఆ నీళ్లనే చాలెంజ్ చేయాలని ఆశ. వాళ్లుండే ప్రాంతంలో స్విమ్మింగ్ కోచ్ అయిన సాజీ వలస్సేర్రీని కలిసింది. పేరెంట్స్ కూడా వస్తేనే చేర్చుకుంటా అన్నాడు. అప్పుడు తన గురించి చెప్పింది. మారుమాట్లాడకుండా మాలూని స్టూడెంట్గా తీసుకున్నాడు. పధ్నాలుగు రోజులయ్యేటప్పటికీ మాలూలో ఏదో కాన్ఫిడెన్స్. పదిహేనో రోజు నాలున్నర గంటల్లో తమ ఊళ్లోని నదిని ఈదేసింది. ‘‘సర్.. ఇప్పుడు నేను ఏ రివర్నైనా అవలీలగా ఈదేయగలను’’అంది పెరిగిన ఆత్మవిశ్వాసంతో. ఆ మాటను సాజీ తేలిగ్గా తీసుకోలేదు. ఆమె ఆత్మవిశ్వాసానికి పరీక్ష పెట్టాడు. వెంబనాడ్ ఈదమని చెప్పి. ‘‘అయ్యో... మాట వరసకు అన్న మాటలను సీరియస్గా తీసుకుంటారేంటి సర్?’’ అని వెనకడుగు వేయబోయింది మాలూ. ‘‘చేతల్లో ఉంటేనే మాట్లాడాలి’’ మాట్లాడాలి అన్నాడు సాజీ. ఈసారి తను సీరియస్గా తీసుకుంది. చాలెంజ్కు ఓకే అంది. సాజీకి తెలుసు.. మాలూ ఈజీగా ఈదగలదని. ఆమె టాలెంట్ను ప్రపంచానికి చెప్పడానికే మాలూని ఆ చాలెంజ్కు సిద్ధం చేశాడు. ఆ రోజు రానే వచ్చింది. వెంబనాడ్ చుట్టూ తొమ్మిది కిలోమీటలర్లను ఈది వెంబనాడ్ను చుట్టొచ్చిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. పడ్డ కష్టాలను కసిగా వెనక్కి నెట్టి బతుకు మీదున్న ఆసక్తిని చాటుకుంది. ఐఏఎస్ కావాలని... మాలూ గెలుపు ఇంకెదరికో కూడా స్ఫూర్తి అయింది. ఆమె గురించి వార్తా పత్రికల్లో చూసి నటుడు మమ్మూట్టీ అబ్బురపడ్డాడు. ‘‘క్వీన్’’ అంటూ ప్రశంసించడమే కాక తర్వాత చదువు కోసం లక్షరూపాయల బహుమానాన్ని ఇచ్చాడు. ఐఏఎస్ కావాలని మాలూ ఆశయం. కోచింగ్లో చేరింది. సివిల్స్నూ సవాలుగా తీసుకుంది. సాధించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ‘‘మా నాన్న నన్ను ప్రిన్సెస్ అని పిలిచేవాడు. Mమమ్మూట్టి సర్ నన్ను క్వీన్ అంటే మా నాన్నే గుర్తొచ్చాడు. ఆ క్షణానికి మమ్మూట్టీ సర్లోనే మా నాన్నను చూసుకున్నాను. నన్ను ఇప్పుడు ఏ హార్డిల్స్ ఆపలేవు. వెంబనాడ్ అలలు అంతటి శక్తినిచ్చాయి’’ అంటుంది మాలూ షయిఖా.. ది క్వీన్! -
వెండి చేపపిల్ల కథ
అనగనగా ఓ కొండ పక్కనున్న సరస్సులో ఓ వెండి చేపపిల్ల నివసించేది. అదే సరస్సులో ఎర్రటి ముక్కున్న, తెల్లటి రాజహంస కూడా నివసించేది. ఓ రోజు హంసకు, వెండి చేపపిల్ల తారసపడింది. హంస దాన్ని తినేద్దామనుకుంది. వెండి చేపపిల్ల ఇలా ప్రార్థించసాగింది – ‘‘రాజహంస గారూ! రాజహంస గారూ!! దయచేసి నన్ను చంపొద్దు. నా ప్రాణాలు కాపాడండి’’. రాజహంస ఇలా అంది – ‘‘సరే! నిన్ను నేను వదిలేస్తాను. ఈ సరస్సు పైనున్న మంచు వల్ల నా కాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నాయి. నాకో చక్కని బూట్ల జతని సంపాదించు. బూట్లు లేకుండా తిరిగి వచ్చావో, నీ పని అయిపోయినట్లే’’. వెండి చేపపిల్ల సరస్సు అంతా గాలించింది. చివరికి సరస్సు అడుగున కూడా వెతికింది. ఎంత వెతికినా బూట్ల జత మాత్రం కనిపించలేదు. నిరాశ చెందింది. చివరకు సరస్సు ఒడ్డు దగ్గరున్న రెల్లు గడ్డి పొదల వద్దకు చేరింది. బిగ్గరగా ఏడ్వసాగింది. చేపపిల్ల ఏడుపుని ఓ ఆకుపచ్చని కప్ప వినింది. ‘‘ఓ వెండి చేపపిల్లా! వెండి చేపపిల్లా! ఎందుకు ఏడుస్తున్నావ్? ఏం కష్టమొచ్చింది?’’ అని అడిగింది కప్ప. వెండి చేపపిల్ల తన కథంతా చెప్పి తన దురదృష్టానికి బాధపడింది.ఆకుపచ్చ కప్ప ఇలా అంది – ‘‘నేను నీకు సాయం చేస్తాను. కానీ నువ్వు ఇక్కడే ఉండు. నాకోసం ఎదురుచూడు’’. సరేనంది చేపపిల్ల. ఆకుపచ్చ కప్ప ఒడ్డుకు బాగా దగ్గరగా ఉన్న గడ్డి పొదల దగ్గరకు వెళ్లింది. ‘బెక్.. బెక్.. బెక్.. బెక్..’ అని అరవసాగింది. ఒడ్డు పక్కనున్న విల్లో చెట్టుపై కూర్చుని ఉన్న ఓ పిచ్చుక, కప్ప అరుపులు వినింది. ‘క్రిప్.. క్రిప్.. క్రిప్.. క్రిప్..’ అని పిచ్చుక అరవసాగింది. ‘‘ఆకుపచ్చ కప్పా! ఎందుకు అరుస్తున్నావు? నీకు ఏం సాయం కావాలి?’’ అని అడిగింది పిచ్చుక. కప్ప వెండి చేపపిల్ల కథంతా చెప్పింది. తనకు బూట్ల జత ఎంత అవసరమో వివరించింది. పిచ్చుక ఇలా అంది – ‘‘నేను నీకు సాయం చేస్తాను. కానీ నువ్వు ఇక్కడే ఉండు. నా కోసం ఎదురుచూడు’’. సరేనంది ఆకుపచ్చ కప్ప. పిచ్చుక ఎగురుకుంటూ సరస్సు పక్కనున్న ఓ గ్రామానికి వెళ్లింది. అక్కడ ఓ ఇంటి పెరడులో ఓ చిన్నపాప ఆడుకుంటోంది. ఆ పాప పేరు నటలోష్కా. ‘క్రిప్.. క్రిప్.. క్రిప్.. క్రిప్’ అని పిచ్చుక అరవసాగింది. ‘‘ఓ బుజ్జి పిచ్చుకా! ఎందుకు అరుస్తున్నావు? నీకు ఏం సాయం కావాలి’’ అని అడిగింది పాప. పిచ్చుక వెండి చేపపిల్ల కథంతా చెప్పింది. చేపపిల్ల బూట్ల జత లేకుండా, రాజహంస వద్దకు వెళ్తే ప్రాణగండం ఉందని వివరించింది. సాయం కావాలని అర్థించింది. చిన్నపాప ఇలా అంది – ‘‘నేను నీకు సాయం చేస్తాను. కానీ నువ్వు ఇక్కడే ఉండు. నాకోసం ఎదురుచూడు’’. సరేనంది పిచ్చుక. పాప ఇంట్లోకి వెళ్లి, తన ఎర్రటి అందమైన బూట్ల జతను తీసుకొచ్చి వాటిని పిచ్చుకకు ఇచ్చింది. పాప పిచ్చుకతో ఇలా అంది – ‘‘నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా వెళ్లు. వెండి చేపపిల్ల ప్రాణాలు కాపాడు’’.పిచ్చుక కృతజ్ఞతలు తెలిపింది. వాయు వేగంతో ఎగురుతూ ఆకుపచ్చ కప్ప వద్దకు చేరింది. బూట్ల జతను ఇచ్చింది. కప్ప పిచ్చుకకు కృతజ్ఞతలు తెలిపింది. కప్ప ఆ బూట్ల జతను వెండి చేపపిల్లకు అప్పగించింది. వెండి చేపపిల్ల కప్పకు కృతజ్ఞతలు తెలిపింది. ఎర్రటి అందమైన బూట్ల జతను తీసుకెళ్లి, రాజహంసకు ఇచ్చింది. అవి హంస పాదాలకు చక్కగా సరిపోయాయి. చేపపిల్ల జోలికి తను జీవితంలో రానని మాట ఇచ్చింది రాజహంస. ఎంతో ఆనందించింది చేపపిల్ల. ఈ విషయాన్ని ఆకుపచ్చ కప్పతో చెప్పింది. ‘‘నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు నేస్తం’’ అంది వెండి చేపపిల్ల. కప్ప పిచ్చుక గురించి, చిన్నపాప గురించి చెప్పింది.వెండి చేపపిల్ల తన కృతజ్ఞతల్ని పిచ్చుకకు, చిన్నపాపకు కూడా చెప్పమని అభ్యర్థించింది. ఆకుపచ్చ కప్ప ఈ విషయాన్ని పిచ్చుకకు చెప్పింది. పిచ్చుక ఈ సంగతిని పాపకు చెప్పింది. పాప ఆనందంతో చిరునవ్వు నవ్వింది. ఇదండీ నా చిన్నారి నేస్తాలూ! వెండి చేపపిల్ల కథ. మీరు మీ స్నేహితులకు ఇలాంటి సాయం ఏదో చేసే ఉంటారు. ఆ కథ నాకూ చెప్తారు కదూ!! (‘అపూర్వ రష్యన్ జానపద కథలు’ పుస్తకం నుంచి...) -
అమెరికాలో తెలుగు యువకుడు మృతి
అమెరికాలోని బ్లూమింగ్ టౌన్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. మాన్రో సరస్సులో పడి తెలుగు విద్యార్థి అనూప్ తోట (26) ప్రాణాలు కోల్పోయాడు. అనూప్ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బోటింగ్కి వెళ్లాడు. ఈ క్రమంలో అతను అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. దీంతో తన స్నేహితులు 911కి ఫోన్ చేసి రెస్క్యూ సిబ్బంది సమాచారం అందించారు. సిబ్బంది రెండు రోజులపాటు అనూప్ కోసం గాలింపులు చేశారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు అతడి మృతదేహాన్ని వెలికి తీశారు. రెస్కూ సిబ్బంది సోనార్ స్కానర్ ద్వారా మృతదేహాన్ని 15 అడుగుల లోతులో గుర్తించారు. -
అవి హత్యలే.. తమిళ సంఘాలు ఫైర్..!
సాక్షి, చెన్నై: వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట చెరువులో ఐదు మృతదేహాల లభ్యం కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు తమిళ కూలీల మృతదేహాలను తమిళనాడు పోలీసులకు అప్పగించారు. అయితే వారి మరణం పై తమిళ మానవ హక్కుల సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఇవాళ తమిళ మానవ హక్కుల సంఘాలు మృతదేహాలను పరిశీలించాయి. అయితే మానవ హక్కుల సంఘాలు పోలీసులను తీవ్రంగా విమర్శించాయి. ఇది ఆంధ్రా పోలీసులు చేసిన హత్యలే అని తమిళ సంఘాలు ఆరోపించాయి. ఈ విషయంపై తమిళనాడు పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం మృతదేహాలను తీసుకెళ్ళుతున్నాం. మా ప్రభుత్వం ఆదేశాల మేరకు భవిష్యత్లో విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. 3లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. ఒంటిమిట్ట చెరువులో చనిపోయిన కుటుంబాలను అదుకుంటామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అంతేకాక చనిపోయిన వారికి ఒక్కొక్కరికి మూడు లక్షల ఎక్స్గ్రేషియో ఇస్తామని తమిళ ప్రభుత్వం ప్రకటించింది. -
కుడి ఎడమల దగా
సాక్షి, సిద్దిపేట: చేర్యాల పట్టణంలోని కుడి చెరువు కళ్లెదుటే దర్జాగా కబ్జా అవుతోంది. బస్టాండ్ సమీపంలో ఉన్న ఈ చెరువు నీటిపారుదలశాఖ లెక్కల ప్రకారం 60.20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు పూర్తిగా నిండితే (ఎఫ్టీఎల్) విస్తీర్ణం 93 ఎకరాలుగా నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చివరి సరిహద్దుగా ఉన్న చేర్యాల.. జిల్లాల విభజనలో సిద్దిపేట జిల్లాలో కలిసింది. దీంతో చేర్యాల.. పట్టణ రూపు సంతరించుకుని వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇది గుర్తించిన ప్రభుత్వం చేర్యాలకు నగర పంచాయతీ హోదాను ప్రకటించింది. కుడి చెరువు శిఖం ప్రాంతం చేర్యాల నుంచి హైదరాబాద్, సిద్దిపేట పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారి దుద్దెడ రోడ్డుకు ఆనుకుని ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు శిఖం ప్రాంతం చేర్యాల పట్టణంలో ప్రధాన వాణిజ్య కేంద్రం కానుంది. దీంతో దీనిపై కన్నేసిన ఆక్రమణదారులు చెరువుకు పక్కనే ఉన్న పట్టా భూముల్ని ఎరగా చూపి.. శిఖాన్ని మింగేస్తున్నారు. అందులో వర్తక వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. ఇలా కుడి చెరువు శిఖంలో 30 వరకు అక్రమ కట్టడాలు వెలిశాయి. హద్దులు మీరుతున్న అధికారం చెరువు హద్దులు దాటి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపడుతున్నా ఇటు రెవెన్యూ, అటు గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. చెరువు సాధారణ విస్తీర్ణం వరకు ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉండగా, ఎఫ్టీఎల్ ప్రాంతం ఉన్న సర్వే నంబర్లలో పట్టాదారులు ఉన్నారు. ఎఫ్టీఎల్ ప్రాంతంలోని భూముల్లో నీరు నిండుగా లేనప్పుడు మాత్రమే సాగు చేసుకోవాలని రెవెన్యూ చట్టం చెబుతోంది. అలాగే, ఎఫ్టీఎల్కు 30 మీటర్ల దూరాన్ని బఫర్ జోన్గా పరిగణిస్తారు. ఈ స్థలంలో నిర్మాణాలకు పంచాయతీ అధికారులు అనుమతి ఇవ్వకూడదు. కానీ అవేమీ పట్టనట్లు పలువురు చెరువులో కొంత భాగంతోపాటు, ఎఫ్టీఎల్ ప్రాంతంలో మట్టి నింపి మరీ నిర్మాణాలు చేపట్టారు. హద్దురాళ్లు పారేసినా.. చర్యల్లేవ్ కబ్జాలపై గతంలో నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేయించి ఎఫ్టీఎల్ హద్దురాళ్లు పాతారు. అక్రమ నిర్మాణాలపై చర్యలకు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు సిఫార్సు చేశారు. ఈ రెండు శాఖల అధికారులు ఒకరిద్దరికి నోటీసులు జారీచేసి చేతులు దులుపుకున్నారు. విలువైన భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించకుండా ఉండేందుకు రెవెన్యూ, పంచాయతీ అధికారులకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని, రాజకీయ నాయకులకూ వాటాలు ముట్టాయని, అందుకే ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఆక్రమణదారులు రెచ్చిపోయి ఇటీవల హద్దురాళ్లను సైతం తీసిపారేశారు. జిల్లా అధికారులు స్పందించి చేర్యాల కుడి చెరువును రక్షించాలని, విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. చెరువును కాపాడాలి చేర్యాలలోని కుడి చెరువు శిఖం మొత్తం 60 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఐదెకకరాల భూమి ఆక్రమణకు గురైంది. దీనిపై పూర్వపు వరంగల్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పందించి చెరువు ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని చెరువును కాపాడాలి. – అందె బీరన్న. చేర్యాల కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం చేర్యాల కుడి చెరువు ఎఫ్టీఎల్ పరిధి దాటి నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమే. గతంలో మా శాఖ తరపున సర్వే చేయించి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పంచాయతీ అధికారులను కోరాం. పలువురికి మా శాఖ తరపున నోటీసులు జారీ చేశాం. ఇటీవల ఎఫ్టీఎల్ రాళ్లను పలువురు తీసివేశారు. తిరిగి వాటిని ఏర్పాటు చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. శిఖం భూమిలో నిర్మాణాలు చేపట్టిన వారెవరినీ వదలం. – స్వామిదాసు, నీటిపారుదలశాఖ డీఈ చెరువు ఉనికి కోల్పోతోంది చేర్యాల కుడి చెరువు సర్వే నంబర్ 202, 203లలో విస్తరించి ఉంది. కబ్జాలతో చెరువు ఉనికి కోల్పోతోంది. చెరువులోకి నీరు రాకుండా మార్గాలు మూసివేసిన విషయమై అప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాం. ఎన్నో ధర్నాలు చేశాం. ఫలితం లేదు. ఇప్పుడు చేర్యాల సిద్దిపేట జిల్లాలో విలీనమయ్యాక ఫిర్యాదు చేస్తే ఇక్కడి అధికారులు ఎఫ్టీఎల్ హద్దులు ఏర్పాటు చేశారు కానీ, వాటిని కబ్జాదారులు కొద్దిరోజులకే తొలగించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయలేదు. – అనెబోయిన స్వామి, చేర్యాల -
ఒంటిమిట్ట చెరువులో మృతదేహాల కలకలం..
-
యాద్గార్పల్లి చిన్న చెరువు ఆక్రమణ
మిర్యాలగూడ : కోట్ల రూపాయల విలువైన యాద్గార్పల్లి చిన్న చెరువు ఆక్రమణకు గురైంది. కనీసం చెరువు ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. ఆక్రమిత స్థలంలో వరినాట్లు వేసుకోవడంతోపాటు రోడ్డు వెంట ఆక్రమించుకున్న స్థలంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడ మండలంలోని యాద్గార్పల్లిలోని రోడ్డు వెంటనే ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 16 ఎకరాలు. ప్రస్తుతం చెరువు శిఖం భూమి ఏ మాత్రం మిగల్లేదు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎకరం భూమి 50 లక్షల రూపాయల విలువ చేస్తుంది. సుమారు 8 కోట్ల రూపాయల విలువైన చెరువు శిఖం భూమి ఆక్రమణకు గురైంది. చెరువు శిఖంలో కొంత భూమి ఉండగా దానిలో ఒక సంఘ కార్యాలయం ఏర్పాటు చేయడానికి గాను మట్టి పోయిస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న మధ్యవర్తులు చెరువు ఆక్రమణకు సంబందించి అధికారులు ఎవరు కూడా తమ వద్దకు రాకుండా ఉండేందుకు గాను డబ్బులు ఇవ్వాలని మధ్యవర్తులు ఆక్రమితదారులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. చెరువు శిఖంలో సాగు చేసుకుంటున్న వారితోపాటు రోడ్డు వెంట ఉన్న వారు సైతం డబ్బులు ఇచ్చినట్లు తెలిసింది. పరిశీలించిన అధికారులు యాద్గార్పల్లి చిన్న చెరువును రెవెన్యూ అధికారులు, ఐబీ అధికారులు గురువారం సందర్శించారు. తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చెరువు ఆనవాళ్లు లేకుండా ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆక్రమితదారులందరికి నోటీసులు ఇస్తామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. విలువైన చెరువు భూమిని ఆక్రమించుకున్న వారందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఎఈ విజయలక్ష్మి, ఆర్ఐ, వీఆర్ఓ ఉన్నారు. -
’అధికార’ దందా
అటవీ భూమిని కాజేసి..సాగులోకి.. కొంత భాగం రొయ్యల చెరువుల తవ్వకం... ఎత్తిపోతల కింద భూములు పోయినట్లుగా అక్రమ రికార్డులు పరిహారం డబ్బులు అప్పనంగా జేబులోకి... చోద్యం చూస్తున్న అధికారులు కలరాయనగూడెంలో టీడీపీ నేత భూబాగోతం సాక్షి ప్రతినిధి, ఏలూరు: అయన అధికార పక్ష నాయకుడు... ఓ పదవి కోసం పోటీలో ఉన్నారు...ఆ చుట్టుపక్కల ఆయన మాటే శాసనం... దీంతో ఆయన చెలరేగిపోయారు. తన భూముల పక్కన ఉన్న అటవీ శాఖ భూములను కూడా తన పొలంలో కలిపేసుకున్నారు... అందులో రొయల్య చెరువుతో పాటు పామాయిల్ తోటలను కూడా వేసుకున్నారు.... చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ తన పొలాల పక్కనే ఉన్న అటవీ శాఖ భూమిలో నుంచి వెళ్తోంది. దీన్ని కూడా సొమ్ము చేసుకోవాలనుకున్న ఆ నేత రెవెన్యూ అధికారులను ఉపయోగించి అది తన సొంత భూములు ఉన్న సర్వే నెంబర్గా చూపించి నష్టపరిహారం కూడా కొట్టేయడానికి ప్లాన్ చేశారు. లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత తన కుటుంబ సభ్యులు కలసి గత కొన్నేళ్లుగా ఆర్ఎస్ నెంబరు 269 అటవీ భూమిలో సుమారు 18 ఎకరాలు సాగుచేస్తున్నారు. ఈ భూమికి పక్కనే ఆర్ఎస్ నెంబరు 264/3, 264/4లో ఈ నేతకు సొంత జిరాయితీ భూమి ఉంది. ఈ భూమికి పక్కనే తాను ఆక్రమించుకున్న అటవీ శాఖ భూముల గుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వెళ్లింది. అటవీ భూములకు నష్టపరిహారం రాదు. దీంతో తన సొంత భూమి ఉన్న ఆర్ఎస్ నెంబర్లో కొంత భూమి కాల్వకు పోయినట్లుగా చూపిస్తున్నారు. రెవిన్యూ సిబ్బంది కుమ్మక్కు కావడంతో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్లో అటవీ భూమి అని కాకుండా దాని పక్కన ఉన్న సర్వే నెంబర్లను నోటిఫికేషన్లో ఇచ్చింది. కలరాయనగూడెంలో ఇటీవల చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా సర్వేచేసి, భూసేకరణ చేసి నోటిఫికేషన్ ఇచ్చింది. వాస్తవంగా జరుగుతున్న భూసేకరణకు, నోటిఫికేషన్లో ప్రకటించిన భూమి విస్తీర్ణానికి సంబంధించి చాలా అవకతవకలు జరిగినట్లు ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. కాలువకు సంబంధించి భూసేకరణ కోసం సర్వే అధికారులు వచ్చి కొలతలు నిర్వహించారు. ఆ సమయంలో ఈ నాయకుడు అటవీ భూమిలో అనుమతులు లేకుండా గత కొన్నేళ్లుగా రెండు చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్న విషయాన్ని గుర్తించినా వారు అధికార పార్టీ నేత కావడంతో మౌనంగా ఉండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖ భూమిలో అక్రమంగా తవ్విన రొయ్యల చెరువులకు ప్రభుత్వం వారు ఇచ్చే ఉచిత విద్యుత్ను ఉపయోగిస్తున్నారు. సింగల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ పెట్టి 24 గంటలపాటు నీటిని మోటార్తో తోడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోలేదు. రెవెన్యూ, ఫారెస్ట్, విద్యుత్ శాఖలకు చెందిన స్ధానిక అధికారులకు ఈ నేతతో మంచి సంబంధాలు ఉండటంతో ఇక్కడ అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ భూ బాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమంగా సాగుచేస్తున్న అటవీ భూములతోపాటు ఎత్తిపోతల పథకం కాలువకు సంబంధించి సొమ్మును కాజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పది కిలోల పండుగప్ప
మొగల్తూరు: ముత్యాలపల్లికి చెందిన రైతు కొల్లాటి నాగేశ్వరరావుకు చెందిన చెరువులో పది కిలోల పండుగప్ప చిక్కింది. నాగేశ్వరరావు చెరువులో బుధవారం పట్టుబడి పట్టారు. దీంతో ఈ భారీ పండుగప్ప జాలరుల వలలో పడింది. మార్కెట్లో దీని ధర సుమారు రూ.4 వేలు ఉంటుందని రైతు నాగేశ్వరరావు తెలిపారు. -
కొల్లేరు కటకట
ఏలూరు : జలకళ.. పచ్చని పైరులు.. విదేశీ విహంగాల కిలకిలరావాలతో ప్రకృతి హŸయలొలికించే కొల్లేరు వెలవెలబోతోంది. ఆసియాలోని పెద్ద మంచినీటి సరస్సు దుస్థితి ఇది. నిత్య జలం.. పచ్చతోరణం అన్నట్టుండే కొల్లేరును కరువు కాటేసింది. ఏప్రిల్ మొదట్లోనే కష్టాలను తెచ్చిపెట్టింది. సరస్సులో పలు ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి. బీటలు వారడంతో పచ్చదనం కనుమరుగై పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. చుక్కనీరు జాడ లేక ఆకలితో అలమటిస్తున్నాయి. అక్కడక్కడా కనిపిస్తున్న కొద్దిపాటి నీటి వద్ద విదేశీ పక్షులు సేద తీరుతున్నాయి. మరిన్ని రోజులు గడిస్తే నీటి కష్టాలు మరింత పెరుగుతాయని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొల్లేరు దుర్భిక్షానికి సజీవ సాక్ష్యాలు ఈ దృశ్యాలు. -
చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
మాచర్ల(గుంటూరు): గుంటూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతిచెందారు. జిల్లాలోని మాచర్ల మండలం లింగాపురం గ్రామానికి శ్రీవరామ కృష్ణ(5), శ్రీసాయి(3) అనే ఇద్దరు చిన్నారులు ఆదివారం స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు మృతితిచెందారు. అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలువుకున్నాయి. -
కింద సరస్సు... పైన కొలను
ఫొటో చూడగానే విషయం అర్థమైపోరుుందా! సరే... ఈ వై ఆకారపు ఇంటిని త్వరలో తైవాన్లో నిర్మించనున్నారు. నెదర్లాండ్సకు చెందిన ఎంఆర్వీడీవీ అనే సంస్థ డిజైన్ చేసిన ఈ వినూత్నమైన ఇల్లు దాదాపు 330 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం నాలుగు బెడ్రూమ్లు, ఒక లివింగ్ రూమ్తోపాటు గ్రౌండ్ లెవెల్లో అందమైన చిన్న సరస్సు, లాన్, పార్క్లు ఉంటాయి. అంతేనా... అనకండి.. ఫొటోను కొంచెం జాగ్రత్తగా చూస్తే... ఇంటిపైభాగంలో అందమైన ఓ స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది. ఆ రూఫ్టాప్పైనే... పూల్కు పక్కన చిన్న చిన్న పార్టీలు చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా ఉన్నారుు. భలే ఉంది కదూ...! -
‘నీరు’పయోగమే..!
► రబీ పంటలకు సాగునీటి కష్టాలు ► ఏళ్ల తరబడిగా మరమ్మతుకు నోచుకోని కాలువలు ► చెరువులకు కాలువలు కరువు ఇచ్చోడ : ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు జల కళను సంతరించుకున్నారుు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల్లో పూడిక తొలగించడం, తూములు, కట్టల మరమ్మతు చేపట్టడం కారణంగా నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నారుు. కాని ఆయకట్టులో సాగవుతున్న పంటలకు చుక్క నీరందే పరిస్థితి లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. జిల్లాలో రబీ పంటలు 70 శాతం వరకు సాగయ్యూరుు. ప్రాజెక్టు, చెరువుల కాలువలు ఏళ్ల తరబడిగా మరమ్మతుకు నోచుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయూరుు. దీంతో చివరి ఆయకట్టులోని పంటలకు నీరందుతుందో లేదోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో రెండు మధ్య తరహా ప్రాజెక్టులు తాంసి మండలం మత్తడివాగు ప్రాజెక్టు, ఆదిలాబాద్ మండలం సాత్నాల ప్రాజెక్టు ఉన్నారుు. సాత్నాల ప్రాజెక్టు కింద 14 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా.. కాలువలు మరమ్మతుకు నోచుకోకపోవడంతో లక్ష్యం మేరకు సాగునీరు అందడం లేదు. చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి నెలకొంది. మత్తడివాగు ప్రాజెక్టు కుడి కాలువ దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల మేరకు నిర్మించినా సాగునీరు అందించే పరిస్థితి లేదు. కాలువలో పిచ్చిమొక్కలు పెరిగిపోరుు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్మించి 12 ఏళ్లు కావస్తున్నా కుడి కాలువ పనులు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 8వేల ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉన్నా.. వందల ఎకరాలకు కూడా నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. కాలువలు లేని చెరువులే అధికం.. జిల్లాలో కాలువలు లేని చెరువులే అధికంగా ఉన్నారుు. ఇచ్చోడ మండలం అడేగామ కే, గేర్జం, సిరికొండ, గుడిహత్నూర్ మండలం మూత్నూర్, తొషం, సీతాగొంది గ్రామాల్లో చెరువులకు కాలువలు లేవు. బేల మండలంలో ఆరు చెరువుల ఉండగా వాటిలో సోన్కాస్ చెరువుకు మాత్రమే మట్టికాలువ ఉంది. వరూర్, సాంగ్వి, సాక్లి, పీడ్గావ్, కాప్సి గ్రామాల చెరువులకు కాలువల నిర్మాణం జరగలేదు. నేరడిగొండ మండలంలో వడూర్, కుమారి, వాంకిడి, పురుషోత్తంపూర్, బజార్హత్నూర్ మండలం భూతయి, జాతర్ల, కాండ్లి, తలమడుగు మండలంలో లింగి, ఝరి, బరంపూర్, నందిగామ, తాంసి మండలం తాంసి, అర్లి జల్కొటి గ్రామాల్లో చెరువులకు కాలువలు లేవు. బజార్హత్నూర్ మండలం దెగామ చెరు వు కుడి కాలువ పనులకు సిమెంట్ లైనింగ్ ప నులు ప్రారంభించి సంవత్సరం గడుస్తున్నా ప నులు పూర్తి కాలేదు. దీంతో రబీలో నీటిని వి డుదల చేసినా మూడు కిలోమీటర్ల దూరం కం టే ఎక్కువ పారే అవకాశాలు లేవు. ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో చెరువుల ద్వారా రబీకి నీరందించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది రబీలో ఒక్క సాత్నాల ఆయకట్టుకు మినహా మరెక్కడా నీరందే అవకాశాలు లేవు. -
ధైర్యంగా కబ్జా చేసేస్తున్నారు..
–ప్రజాప్రతినిధుల మద్దతుతోనేనా –గజం ధర రూ 15 నుండి 20వేలు –సుమారు అరెకరం వరకూ కబ్జా –పట్టించుకోని అధికారులు పాలకొల్లు సెంట్రల్ ః పట్టణంలో అనేక రిజర్వ్డ్ స్థలాలు, చెరువులు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. ఈ కబ్జాలు చేసేది బడాబాబులే. ఇక్కడ కబ్జాకు గురవుతున్న స్థలం విలువ ఎంతో తెలుసా సుమారు ఐదు కోట్లు. వింటే ఆశ్చర్యం కలగవచ్చు కాని అక్కడ మార్కెట్ ధర వింటే మాత్రం వాస్తవమే అనిపిస్తుంది. ఇక్కడ స్థలం గజం ధర సుమారు రూ.15 నుండి 20వేలు పలుకుతుంది. ఇక్కడ కబ్జాకు గురైన స్థలం దాదాపుగా అరెకరం పైనే ఉంటుందని పలువురు అంటున్నారు. అధికారులు వారి లెక్కల ప్రకారం కొలతలు వేస్తే చెరువు ఎంత కబ్జా అయ్యిందో బయటపడుతుందని దాదాపుగా ఐదు కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు. పట్టణంలోని 9వ వార్డులో సుమారు ఐదెకరాలు శ్మశానం చెరువు ఉంది. సాయినగర్ కాలనీకి వెనుక ఉన్న ఈ చెరువును కొందరు ప్రభుద్దులు వారి భవనాలకు అనుకూలంగా ఉన్నంత పరిదిలో పూడ్చుకుంటున్నారు. ఇప్పటికి వీరి పూడికలతో చెరువు పడమర భాగాన్ని కనుమరుగు చేసేసారు. గతంలో ఆదిత్యా కాలనీలో నిర్మించిన సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధుల మద్ధతుతో ఆలయానికి సుమారు 1500 గజాల స్థలాన్ని పూడ్చుకుని మండపం నిర్మించారు. ఇది పదిమందికి ఆధ్యాత్మికతకు ఉపయోగపడేది కాబట్టి అందరూ సహకరించారు నిర్మాణం పూర్తిచేసుకుని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ గుడికి దక్షిణం వైపున ఉన్న సాయినగర్ కాలనీ వాసులు కొందరు వారి ఇష్టానుసారంగా పుడ్చుకుంటున్నారు. కాలనీకి ఉత్తరంలో చెరువు పక్కన సాయిబాబా ఆలయం అడ్డు ఉండడంతో వీళ్లు యదేచ్చగా పూడ్చేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఓ ఇంటి యజమాని శనివారం పూడికపనులు ప్రారంభించారు. దర్జాగా రోడ్డుపై మట్టి వేసుకుని మనుషులతో చెరువును పూడ్పిస్తున్న ఈ యజమాని దైర్యానికి ఏ ప్రజాప్రతినిధి అండవుందో అని ఎవ్వరూ అధికారులకు పిర్యాదు చేయలేకపోతున్నారు. పేదవాడికి సెంటు స్థలం ఇవ్వడానికి కాళీ స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం బడాబాబులు కబ్జాలు చేస్తుంటే మాత్రం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
పర్యాటకుల.. సందడి
మండలంలోని పాకాల సరస్సు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలతో సరస్సు మత్తడి పోస్తుండడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ మేరకు ఆదివారం సెలవు రోజు కావడంతో సుమారు 5వేల మంది తరలివచ్చి మత్తడి అందాలను తిలకించి జలకాలాడారు. అలాగే సరస్సులో బోటు షికారు చేసి ఆనందంగా గడిపారు. కట్టమైసమ్మ వద్ద పూజలు చేసి కోళ్లు, యాటలు బలిచ్చి వనభోజనాలు చేశారు. - ఖానాపురం -
చెరువులోపడి వ్యవసాయ కూలీ మృతి
∙కుమారుడికి పాలు పట్టేందుకు ఇంటికి వస్తుండగా ప్రమాదం నల్లబెల్లి : వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన ఓ తల్లి తన చిన్నారి కుమారుడికి పాలు ఇచ్చేందుకు కొద్ది సమయం ముందుగా ఇంటికొస్తుండగా ప్రమాదవశాత్తు చెరువులోపడి మృతి చెందింది. ఈ ప్రమాదం మండలంలోని శనిగరంలో ఆదివారం జరిగింది. ఎస్సై, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శనిగరం గ్రామానికి చెందిన మామిడిపల్లి సరిత(25) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ జీవిస్తోంది. ఇదే క్రమంలో ఆదివారం కూలీ పనులకు వెళ్లింది. తన కుమారుడికి పాలు ఇచ్చేందుకు పనులు వేగంగా పూర్తి చేసుకుంది. సాయంత్రం తోటి కూలీ మంద రజితతో కలిసి ఇంటికి తిరిగొస్తుండగా శనిగరం మైసమ్మచెరువులో ప్రమాదవశాత్తు పడిపోయింది. రజిత చెరువులోకి దూకి సరితను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం పరిసర ప్రాంతాల రైతులు సరితను చెరువు కట్టపైకి తీసుకొచ్చారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా సరిత కన్నుమూసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. మృతురాలికి భర్త రవి, కుమార్తె సంధ్య, కుమారుడు చింటు ఉన్నారు. ఎస్సై మేరుగు రాజమౌళి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మడుగు కాదు.. మైదానమే
అనంతపురం న్యూసిటీ: అనంతపురంలో ప్రప్రథమంగా జరిగిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని పీటీసీలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంను కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరించారు. ఈ నెల 29న కురిసిన వానకు స్టేడియం మడుగును తలపిస్తోంది. వర్షపునీటితో వాకర్స్, క్రీడాకారులు నడిచేందుకు కూడా వీల్లేకుండా పోయింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునైనా వర్షం వస్తే నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు చాలాసార్లు ఏర్పాట్లను పరిశీలించారు. కానీ ఏం ప్రయోజనం..? వారి ముందుచూపు ఏమాత్రమో ఇట్టే అద్దం పడుతోంది. స్టేడియం నుంచి నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేసి ఉంటే చాలా బాగుండేదని నగరవాసులు పేర్కొంటున్నారు. -
సెల్ఫీమోజుకు ముగ్గురు విద్యార్థులు బలి
మాలెగావ్: సెల్ఫీ మోజు కు మరో ముగ్గురు విద్యార్థులు బలైపోయారు. ఈ ఘటన మహారాష్ట్ర్ర నాసిక్ జిల్లాలోని సింగవ్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతులను తేజాస్ ఎం లాల్వానీ(15), కేశవ్ గ్వైకాడ్(16), అజిమ్ పఠాన్ గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఐదుగురు పాఠశాల విద్యార్థులు తోటి స్నేహితుని పుట్టిన రోజును జరుపుకోవడానికి ఊరిచివర ఉన్న చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవషాత్తు అందులో ఒకరు చెరువులో పడిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో మరో ఇద్దరు కాలులో పడిపోయారు. స్థానికుల సాయంతో మృత దేహాలను వెలికితీసిన పోలీసులు కేసును నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ విద్యార్థుల కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. -
ఎట్టకేలకు పూడిక తీత పనులకు మోక్షం
మందపల్లి(ఖానాపూర్) : మండలంలోని పెంబి భీమన్న చెరువులో నీటిని నింపే కాలువలో పేరుకుపోయిన పూడికతీత పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. చెరువుకు నీటి సరఫరా అయ్యే సరస్వతి కాలువ డీ–27 ఉప కాలువలో రెండు కిలోమీటర్ల మేర పేరుకుపోయిందని పూడిక తొలగించాలని గ్రామస్తులు, రైతులు ఇటీవల ఎమ్మెల్యే రేఖాశ్యాంనాయక్ దష్టికి తీసుకెళ్లారు. దీంతో రైతుల సమస్యను టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పాకల రాంచందర్ ఎమ్మెల్యేకు వివరించడంతో ఎస్పారెస్పీ అధికారులతో మాట్లాడి పెంబి రైతులకు సాగు నీరు అందించాలని కోరారు. ఎస్సారెస్పీ ఎస్ఈ టీ సత్యనారాయణ సంబంధిత అదికారులతో కలిసి స్వయంగా పెంబి, మందపల్లి గ్రామాల్లోని కాలువను పరిశీలించి సమస్యను గుర్తించారు. దీంతో ఎస్ఈ ఆదేశంతో అంచనాలు వేసిన అధికారులు మంగళవారం పెంబి కాలువలో పూడికతీత పనులు ప్రారంభించారు. జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్ రైతులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పూడిక తీత పనులు ప్రారంభించారు. త్వరలో పనులు పూర్తవుతాయని తద్వారా నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఈ జగదీశ్వర్, ఏఈ రవికుమార్నాయక్, జేఈ సంజీవ్, పెంబి రైతులు పాల్గొన్నారు. -
సోయగాల సరస్సు
మండలంలోని లక్నవరం సరస్సు ఇటీవల కురుస్తున్న వర్షాలతో పూర్తిస్థాయిలో నిండింది. ఆదివారం మధ్యాహ్నం వరకు 33 అడుగుల 5 అంగుళాలకు నీరు చేరింది. దీంతో జిల్లాతోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాట కులు భారీగా తరలివచ్చి సరస్సు అందాలను తిలకించారు. ఉయ్యాల వంతెనపై నుంచి నడుస్తూ సందడి చేశారు. – గోవిందరావుపేట -
నిన్న మునిగి.. నేడు శవమై..
చెరువులో లభ్యమైన కనకయ్య మృతదేహం వర్గల్: అన్నా.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా అంత్యక్రియలు బాగా చేయిండ్రి..అని గురువారం సోదరుడికి ఫోన్లో చెప్పిన జిలకర కనకయ్య(30) అన్నంత పని చేశాడు. జీవితంపై విరక్తి చెందాడో, మరే కారణమోగాని గ్రామ సమీపంలోని పటేల్ చెరువులో జేసీబీ గొయ్యి పక్కన దుస్తులు, చెప్పులు విడిచి అందులో దూకాడు. మండలంలోని ఇప్పలగూడ సమీప పటేల్ చెరువులో శుక్రవారం కనకయ్య గల్లంతైన విషయం తెల్సిందే. రాత్రి వరకు గొయ్యిలో గాలింపు జరిపినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో మృతదేహం గాలింపు ప్రక్రియను శుక్రవారానికి వాయిదా వేశారు. ఉదయం గాలింపులో మృతదేహం లభ్యమైంది. కనకయ్య అన్నంత పని చేస్తడని మేము అనుకోలేదని మృతుడి కుటుంబీకులు బోరుమన్నారు. అప్పుల బాధతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య జ్యోతి పేర్కొంది. మృతుడికి సాయి కిరణ్(9), సాయి తేజ(7) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కూలీనాలీ పనులతో కాలం వెల్లదీసే కుటుంబంలో విషాదం అలుముకుంది. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్కు తరలించినట్లు గౌరారం ఏఎస్సై దేవీదాస్ తెలిపారు. -
చెరువులో విష ప్రయోగం: చేపలు మృతి
హైదరాబాద్ : నగర శివారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని లక్ష్మీగూడ మద్దికుంట చెరువులో సుమారు లక్ష రూపాయల విలువైన చేపలు గురువారం మృత్యువాత పడ్డాయి. గత కొన్నేళ్లుగా స్థానిక మత్స్యకారులు చెరువులో చేపలు పెంచి వాటిని పట్టి విక్రయించి... జీవనం సాగించేవారు. మృగశిర కార్తె కావడంతో చేపలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపధ్యంలో గురువారం ఉదయం చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు షాక్కు గురయ్యారు. చేపలన్నీ మృతి చెంది నీటిపై తేలడంతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అన్ని చేపలు ఒక్కసారిగా మృతి చెందడంపై వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీటిలో ఆగంతకులు విషం కలిపి ఉంటారని భావిస్తున్నారు. ఈ మేరకు మత్స్యకారులు మైలార్దేవ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నైనిటాల్.. నయన మనోహరం!
వేసవి మొదలైందంటే చాలు.. మండే ఎండల నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు చల్లటి ప్రాంతాల సందర్శనకు టూర్లు ప్లాన్లు మొదలు పెడతారు. వాటిలో హిల్స్టేషన్లదే అగ్రస్థానం. అలాంటి వాటిలో ఉత్తరాంచల్లో ఉన్న అతి సుందర ప్రాంతం నైనిటాల్ ఒకటి. హిమాలయ ప్రాంతంలో అందమైన ప్రకృతి సోయగాలతో 12 చ.కిమీ విస్తీర్ణంలో 6000 అడుగల ఎత్తులో ఉన్న ఈ హిల్స్టేషన్ విశేషాల గురించి మనమూ తెలుసుకుందామా..! భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలిచే నైనిటాల్ హిమాలయ శ్రేణుల్లో ఉంది. కుమావోస్ హిల్స్ మధ్య భాగంలో అందమైన సరస్సులతో నిండి ఉంది. నైనిటాల్ను పూర్వం నైనితాల్ అని పిలిచేవారు. నైనీ అంటే నయనం, తాల్ అంటే సరస్సు అని అర్థం. ఇది ప్రసిద్ధ హిల్స్టేషన్ గానేకాక పుణ్యక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. పర్యాటక ఆకర్షణలు.. కిల్బరీ.. నైనిటాల్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న అందమైన పిక్నిక్ స్పాట్ ఇది. పచ్చని ఓక్, పైన్, రోడోడెండ్రాడ్ అడవులు ఈ ప్రాంతాన్ని ఒక చక్కటి విశ్రాంతి ప్రదేశంగా మార్చాయి. ఈ అడవుల్లో సుమారు 580 జాతులకు పైగా పలు రకాల వృక్ష జాతులు, రంగురంగుల పక్షులు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2481 అడుగుల ఎత్తున ఉన్న లరికంత పర్యాటకులకు ఎన్నో అందమైన హిమాలయ దృశ్యాలను చూపుతుంది. ఇది నైనిటాల్లో రెండో ఎత్తై ప్రాంతం. నైనాదేవి ఆలయం.. నైనాదేవి ఆలయం ఒక శక్తి పీఠం. నైని సరస్సుకు ఉత్తర దిశగా ఉంది. ఈ గుడిలో హిందువుల దేవత నైనాదేవి కొలువై ఉంది. ఈమె విగ్రహంతో పాటు గణపతి, కాలి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న పెద్ద రావిచెట్టు ఎంతో పురాతనమైంది. చైనా శిఖరం.. నైనా శిఖరాన్నే చైనా శిఖరం అంటారు. ఇది నైనిటాల్లో ఎత్తై శిఖరం. సముద్ర మట్టానికి 2611 మీటర్ల ఎత్తులో ఉంది. దీన్ని చేరుకోవాలంటే గుర్రంపై వెళ్లాలి. టిఫిన్ టాప్ లేదా డొరొతి సీట్ అనేది ఒక పిక్నిక్ ప్రదేశం. ఇక్కడ చాలా ఆహ్లాదంగా గడపొచ్చు. ఇక్కడే ఒక ఎకోకేవ్ గార్డెన్ కూడా ఉంది. రోప్.. నైనిటా రోప్ వే ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. దీన్ని కుమావొస్ మండల వికాస్ నిగం నిర్వహిస్తుంది. ఇది ఇండియాలో స్థాపించిన తొలి కేబుల్ కార్. సుమారు 705 మీటర్ల దూరం 300 మీటర్ల ఎత్తులో కవర్ చేస్తుంది. ప్రతి కేబుల్ కార్ 825 కిలోల బరువు మోయగలదు. ఈ రోప్ వే స్నోవ్యూను కలుపుతుంది. రోప్ వే సెకనుకు 6 మీల దూరం ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో టూరిస్టులు అద్భుత దృశ్యాలు చూసేందుకు అవకాశం ఉంటుంది. నైనీ సరస్సు.. నైనిటాల్లో నైనీ సరస్సు ప్రధానాకర్షణ. చుట్టూ పచ్చని కొండలతో కన్ను ఆకారంతో ఉంటుంది. దీన్నే ‘ముగ్గురు రుషుల సరస్సు’ అని కూడా అంటారు. ఈ పేరు స్కందపురాణంలోని మానస్ఖండ్ అధ్యాయంలో ఉంది. ఈ సరస్సు చాలా పొడవైంది. దీని ఉత్తరపు కొనను ‘మల్లితాల్’ అని, దక్షిణపు కొనను ‘తల్లితాల్’ అనీ అంటారు. స్నో వ్యూ.. స్నో వ్యూ అనేది సముద్ర మట్టానికి 2270 మీటర్ల ఎత్తున ఉన్న ఒక సుందర ప్రదేశం. ఇది నైనిటాల్ సిటీకు 2.5 కి.మీల దూరంలో ఉంది. పర్యాటకులు ఇక్కడకు చేరుకోవాలంటే రోప్వే, వాహనాల ద్వారా ప్రయాణించొచ్చు. ఇది షేర్ క దండ అనే ఎత్తై చిన్న కొండపై ఉంది. గుహల తోట.. గుహలతోటను ఇకో గుహ గార్డెన్ అనికూడా పిలుస్తారు. ఈ గార్డెన్ పర్యావరణాన్ని ఆరాధించే వారికి ఆసక్తిగా ఉంటుంది. ఇందులో ఆరు అండర్ గ్రౌండ్ గుహలు పెట్రోమాక్స్ దీపాలతో ఒక మ్యూజికల్ ఫౌంటెన్తో ఉంటాయి. ఈ గుహలను టైగర్ కేవ్, పాంథర్ కేవ్, బాట్ కేవ్, స్క్విరాల్ కేవ్, ఫ్లై ఇంగ్ ఫాక్స్ కేవ్, ఏప్ కేవ్.. అని రకరకాల పేర్లతో పిలుస్తారు. హార్స్ రైడింగ్.. నైనిటాల్లో హార్స్రైడింగ్ ప్రధాన ఆకర్షణ. ఇక్కడ వివిధ ప్రదేశాలను వీక్షించేందుకు గుర్రాలను రవాణాకు వినియోగిస్తారు. సిటీలో గుర్రపుస్వారీని నిషేధించినప్పటికీ బారాపత్తర్ వద్ద దీన్ని ఆనందించొచ్చు. గుర్రాల పేడ సరస్సును కలుషితం చేస్తోందన్న కారణంతో నగరంలో గుర్రాల వినియోగం నిషేధించారు. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.. ‘ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్’ నైనిటాల్లో ప్రధాన ఆకర్షణ. ఈ సంస్థ మనోర శిఖరంపై నైనిటాల్కు 9 కి.మీ దూరంలో ఉంది. ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ఈ సంస్థ ఆసక్తి కలవారికి ముందస్తు అనుమతులతో వారి టెలిస్కోప్లలో గ్రహాలు, నక్షత్రాలు పరిశీలించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ సంస్థను 1955లో స్థాపించారు. చరిత్ర.. బ్రిటిష్ వ్యాపారి బర్రోన్ అనే వ్యక్తి ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839లో ఇక్కడ ఒక బ్రిటిష్ కాలనీని స్థాపించి ప్రసిద్ధి చేశాడు. ఆంగ్లో నేపాలీ యుద్ధం (1814-1816) తర్వాత కుమాన్ హిల్స్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. దీని పూర్తి స్థాయి అభివృద్ధి మాత్రం 1841 తర్వాతే ప్రారంభమయింది. షాజాన్వూరుకు చెందిన ఒక చక్కెర వ్యాపారి భక్తుల వసతి గృహం స్థాపించడంతో ఇక్కడ తొలి నిర్మాణం ప్రారంభమయింది. 1846లో బెంగాల్ సైన్యానికి చెందిన కేప్టన్ అర్టిల్లరీ నైనిటాల్ను సందర్శించాడు. తర్వాత యునెటైడ్ ప్రొవిన్స్ గవర్నర్కు వేసవి విడిదిగా మారింది. -
చెరువులో శవమైతేలిన ఇంటర్ విద్యార్థి
కాణిపాకం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ఐరాల మండలం పందిగొట్టూరు గ్రామానికి చెందిన రాజేష్(19) అనే ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో శనివారం ఉదయం చెరువులో శవమై తేలాడు. ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న రాజేంద్ర కుమారుడైన రాజేష్ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ఈ మేరకు ఐరాల పోలీస్ స్టేషన్లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం పందిగొట్టూరు శివారులోని చెరువులో రాజేష్ శవం తేలడంతో చూసిన స్థానికులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యులు సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. రాజేష్ మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. -
తిరుచానూరులో విషాదం
-
జీవితంపై విరక్తిచెంది.. బుద్ధుని చెంతకొచ్చి!
ప్రశాంతమైన బుద్ధుని వదనం. చుట్టూ సాగరపు అలల అల్లరి అలికిడి. చల్లని గాలులు! చూడటానికి అదొక నందనవనంలా కనిపిస్తుంది. హైదరాబాద్ నడిబొడ్డున నగరానికి తలమానికంగా ఉన్న హుస్సేన్సాగర్ గురించే ఇదంతా! భాగ్యనగరానికే భాగ్యరేఖలా ఉన్న హుస్సేన్ సాగర్ను చూడటానికి రోజూ వేలమంది పర్యాటకులు తరలివస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలను వేరుచేస్తూ నగరానికి నగలా తళుకులీనుతున్న హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఓవైపు కాలుష్యకాసారంగానే కాదు.. మరోవైపు ఆత్మహత్యలకు హాట్స్పాట్గా నిలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో ఉంటున్న భగ్నజీవులు, జీవితంపై విరక్తి చెందిన వాళ్లు తమ బలవన్మరణాలకు హుస్సేన్సాగర్ను వేదికగా చేసుకుంటున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 40 మంది హుస్సేన్సాగర్లో దూకి ప్రాణాలు తీసుకున్నారు. మరో 205 మంది కూడా ఆత్మహత్యాయత్నాలకు ఒడిగట్టారు. పోలీసులు చురుగ్గా స్పందించడంతో వారి ప్రాణాలు బతికి ఒడ్డున పడ్డాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య చిక్కులు, ఇంట్లో గొడవలు, అనుబంధాల్లో చిచ్చులా ఇలా సాధారణ కారణాలతోనే చాలామంది బలవన్మరణాలకు సిద్ధపడుతున్నారని, దీనికితోడు చాలామంది యుక్తవయస్కులు చాలా అల్పమైన విషయాలకు ఆత్మహత్యలకు సిద్ధపడుతున్నారని, తల్లిదండ్రులు తిట్టడం, తోబుట్టువులు కొట్లాడుకోవడం వంటి కారణాలకే చేజేతులా తమ సొంత ప్రాణాలను తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. హుస్సేన్ సాగర్లో పిల్లలతో సహా దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించిన ఎంతోమంది మహిళలను పోలీసులు అడ్డుకోగలిగారు. నిజానికి ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు ఎవరులేని నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లడమో, ఇంట్లోనే ఎవరు లేనప్పుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడమో చేస్తారని, కానీ చాలామంది బలవన్మరణాలకు హుస్సేన్సాగర్ను ఎందుకు ఎంచుకుంటున్నారో కారణాలు తెలియడం లేదని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
శవమై తేలిన బాలుడు
నగరం: గుంటూరు జిల్లా నగరం మండలం చిరకాలవారిపాలెం గ్రామంలోని చెరువులో ఆదివారం సాయంత్రం ఓ బాలుడి మృతదే హం లభ్యమైంది. మృతుడు నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన పమిడిమర్రు గ్రామానికి చెందిన ఆలమూరు ప్రమోద్(15) గా గుర్తించారు. ప్రమోద్కు మతిస్థిమితం సరిగా ఉండదు అని గ్రామస్తులు తెలిపారు. నాలుగు రోజులు క్రితమే ప్రమోద్ తల్లిదండ్రులు బాలుడు కనిపించటంలేదని నగరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వాగు దాటుతూ వ్యక్తి మృతి
కామేపల్లి (ఖమ్మం) : వాగు దాటుతూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పెంజరమడుగు గ్రామం సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్ము మల్లయ్య (40) రోజూ మాదిరిగానే శనివారం కూలి పనికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నాడు. దారిలో బుగ్గవాగు దాటుతున్న సమయంలో కాళ్లకు రాళ్లు బలంగా తాకడంతో గాయపడి పడిపోయాడు. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. -
ఉప్పే ముప్పు...
రాకాసి సరస్సు ఏదైనా సరస్సు చుట్టూ చెట్లూ పుట్టలూ, గట్టులూ ఉండటం సహజం. సరస్సులోని నీటిని తాగడానికి, అందులో ఉండే చేపలను, ఇతర జలచరాలను తినడానికి వచ్చే పక్షులు కిలకిలారావాలు చేస్తూ, సరస్సు చుట్టూ తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. అయితే సరస్సు ఒడ్డున పక్షులు గుట్టలు గుట్టలుగా విగతజీవుల్లా కనిపిస్తే చూసిన వారికెవరికైనా మనసు చలించక మానదు. అదేం సరస్సురా దేవుడా? అసలు అదెక్కడుంది అనుకుంటున్నారా? అది ఉత్తర టాంజానియా దేశంలో ఉంది. ఆ సరస్సు పేరు నాట్రాన్. అది ఉండే ప్రాంతం కెన్యా దేశపు సరిహద్దుల్లో ఉంటుంది. నాట్రాన్ పూర్తిగా ఉప్పు నీటి సరస్సు. ఉప్పు నీరున్నంత మాత్రాన పక్షులు ఎందుకు చనిపోతాయి? అదే కదా ప్రశ్న... ఆ నీటిలో సోడియం కార్బొనేట్ శాతం మరీ ఎక్కువగా ఉంటుంది. అలాగే వాటి ఉష్ణోగ్రత కూడా ఎక్కువే. అక్కడి నీటిలోని పీహెచ్ విలువ 10.5-12 వరకు ఉంటుందట. దాంతో ఆ నీటిని తాకిన జంతువులు లేక పక్షుల చర్మం, కళ్లు నిమిషాల్లో కాలిపోతాయట, అలా వాటి ప్రాణాలు తీసే రాక్షసి ఆ నాట్రాన్ సరస్సు. అలా అని ఆ సరస్సులో ఏ ప్రాణులూ ఉండవా అంటే ఉండవని కావు. ఉప్పుతో జీవించగలిగే విభిన్న జాతి పక్షులు, చేపలు అందులో జీవిస్తుంటాయి. ఆ సరస్సు చూడడానికి కూడా వింతగానే ఉంటుందట. ఎలా అంటే అందులోని నీరు ఎర్రగా కనిపిస్తుందట. ఎందుకంటే ఆ నీటిలో జీవించే ప్రాణుల్లో ఎర్రటి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటమే కారణం. -
ఎర్రచెరువులో మహిళ మృతదేహం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలోని ఎర్రచెరువులో గురువారం గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎర్రచెరువు వద్దకు చేరుకుని మహిళ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళ వయస్సు 40 - 50 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మహిళ మృతదేహన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్య లేక ఆత్మహత్య అనేది పోస్ట్మార్టం నివేదిక అందిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాగులో పడి వివాహిత మృతి
అదిలాబాద్(దహేగాం): వాగులో పడి వివాహిత మృతి చెందిన సంఘటన దహేగాం మండలం రాళ్లగూడలో చోటుచేసుకుంది. గ్రామంలోని పెద్దవాగులో కారు రేవతి(24) అనే వివాహిత మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆమె చెప్పులు గట్టుపై వదిలేయడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టానికి తరలించెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేవతికి నాలుగు నెలల క్రితమే పెళ్లయింది. కుటుంబకలహాలతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
సరస్సులో పడిన ట్రక్ : 11 మంది దుర్మరణం
లీమా: పెరూ కుజికో ప్రాంతంలో 52 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్ బ్రిడ్జిపై నుంచి సరస్సులో పడింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. మరో 41 మంది గాయపడ్డారని మీడియా బుధవారం వెల్లడించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ... వెంటనే సహాయక చర్యలు చేపట్టి నీట మునిగిన ట్రక్ నుంచి ప్రయాణికులను రక్షించి ఆసుపత్రి తరలించినట్లు పేర్కొంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, 12 ఏళ్ల బాలిక కూడా ఉందని తెలిపింది. పెరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జూలై 28వ తేదీ. ఈ నేపథ్యంలో పెరూ రాజధాని లీమాలో దేశ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వేడుకల్లో నిర్వహించే పరేడ్లో పాల్గొనేందుకు 52 మంది ట్రక్ లో బయలుదేరారని మీడియా వివరించింది. -
విహారంలో విషాదం.
-
'మన ఊరు - మన చెరువు'పై దేవినేని ఉమ
-
అధికారముందని చెరువును తవ్వేశారు!
-
గుండె చెరువు
మంచినీటి కోసం చెరువులోకి దిగిన ముగ్గురిని, స్నానం చేస్తున్న ఓ విద్యార్థిని గంగమ్మ తల్లి తనలో కలిపేసుకుంది. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదవ శాత్తూ చెరువుల్లో పడి నలుగురు మృతి చెందారు. అయినవారిని పోగొట్టు కున్న ఆయా కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జి.వేమవరం (ఐ.పోలవరం) : తాగునీరు తెచ్చుకునేందుకు రక్షిత మంచినీటి చెరువుకు వెళ్లిన తల్లీ కూతురు మృత్యువాతపడ్డారు. ఐ.పోలవరం మం డలం జి.వేమవరం పంచాయతీ పరిధి కొడపలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీ అధికారులు నాలుగు రోజులుగా గ్రామంలో తాగు నీరు సరఫరా చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం గ్రామానికి చెందిన పెనుమాళ దివ్య (25) తన పెద్ద కూతురు ప్రసన్న, చిన్న కూతురు పూజిత(4)తో కలసి మంగళవారం ఉదయం స్థానికంగా ఉన్న రక్షిత మంచినీటి వద్దకు వెళ్లింది. ఇద్దరు పిల్లలను గట్టుపై ఉంచి ముందుగా బిందెతో నీరు తీసుకుని ఒడ్డుకు వస్తుంది. ఇంతలో చిన్న కూతురు పూజిత ప్రమాదవశాత్తు మంచినీటి చెరువులోకి జారిపడింది. కూతురిని రక్షిద్దామని దివ్య చెరువులోకి దిగింది. సుమారు పది అడుగుల లోతు వరకు నీరు ఉండడంతో తల్లీ కూతురు మునిగిపోయారు. కళ్లముందే తల్లి, చెల్లి చెరువులో మునిగిపోవడాన్ని గమనించిన పెద్దకుమార్తె ప్రసన్న కేకలు వేస్తూ గ్రామంలోకి పరుగులు తీసింది. గ్రామస్తులు అక్కడకు చేరుకునే సమయానికే తల్లీ కూతురు మరణించారు. ఉదయాన్నే కూలి పనికి దివ్య భర్త వెంకటేశ్వర్లుకు విషయం తెలియడంతో ఇంటికి చేరుకుని బోరున విలపించాడు. ఐ.పోలవరం ఎస్సై పాండుదొర సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం తీరును అడిగి తెలుసుకున్నారు. దివ్య, పూజిత మృతదేహాలకు ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రి వైద్యుడు మోహనరావుతో పోస్టుమార్టం చేయించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్సై పాండుదొర తెలిపారు. కూడా వస్తానని .. కడతేరిపోయాడు కూనవరం (సీతానగరం) : ఉపాధి పనులకు వెళుతున్న తండ్రి, అన్నలతో పాటు తాను వస్తానని చెప్పిన ఇంటర్ విద్యార్థి చెరువులో పడి మృతి చెందాడు. కూనవరం గ్రామానికి చెందిన నండూరి ఏడుకొండలు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆయనతో పాటు పెద్ద కుమారుడు వెంకట్రాజు కూడా ఉపాధి పని కూలీలు. వారిద్దరూ మంగళవారం ఉదయం పనులకు వెళ్లారు. వారితో పాటు తాను కూడా చూసేందుకు వస్తానని ఇంటర్ చదువుతున్న చిన్న కుమారుడు రాము వెళ్లాడు. రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న పాతూరి వారి చెరువులో కొంత భాగం నీరు లేకపోవడంతో ఉపాధి పథకంలో మట్టిని తీసి బండ ఏర్పాటు చేస్తున్నారు. పది గంటలకు పని పూర్తి కావడంతో రాము, వెంకట్రాజు స్నానం చేసేందుకు చెరువులో దిగారు. రాము మునిగిపోతూ కేకలు వేయడంతో రక్షించేందుకు అన్న ప్రయత్నించాడు. ఆ క్రమంలో వారిద్దరూ మునిగిపోయారు. ఇది గమనించిన తోటి కూలీలు వెంకట్రాజును బయటకు లాగారు. రాము మాత్రం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గాలించగా మధ్యాహ్నం 12 గంటలకు మృతదేహం లభ్యమైంది. రాము మృతితో తల్లి లక్ష్మి, తండ్రి ఏడుకొండలు, చెల్లెలు దుర్గ ఇతర కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివస్తాడనుకున్న కొడుకు విగతజీవుడు కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. -
న్యూజిలాండ్లో భారతీయ విద్యార్థి దుర్మరణం
వెల్లింగ్టన్: న్యూజిలాండ్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ మరణించాడు. సిద్ధాంత్ శర్మ అనే 21 విద్యార్థి మంగళవారం మరో ముగ్గురితో కలసి పడవలో ఓ సరస్సులో విహారానికి వెళ్లాడు. ఈత కొట్టేందుకు సరస్సులో దూకిన అతను సురక్షితంగా ఒడ్డుకు చేరుకోలేకపోయాడు. ఓ విదేశీ టూరిస్ట్ సరస్సులోకి దూకి అతన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న శర్మను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్య కోసం హామిల్టన్కు తరలించినా ఫలితం దక్కలేదు. బుధవారం అతను మరణించాడు. -
నీటి కింది నగరం..
నీటిలో నగరం అద్భుతంగా ఉంది కదూ.. ఒకప్పుడు చైనాలోని జెజియాంగ్లో ఆర్థిక, రాజకీయ కేంద్రంగా ఉండేది ఈ లయన్ సిటీ. అయితే, 1959లో చైనా ప్రభుత్వం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో మానవనిర్మిత సరస్సును నిర్మించింది. ఆ సమయంలోనే ఇది ఆ సరస్సు గర్భంలోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోకున్నా.. ఇటీవల ట్రావెల్ కంపెనీల దృష్టి దీనిపై పడింది. ఇన్నాళ్లూ 130 అడుగుల లోతులో అలా నీటిలోనే ఉన్నా.. ఎక్కడా చెక్కుచెదరకుండా ఉండటంతో త్వరలో దీన్నో పర్యాటక స్థలంగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
వికాసం: నాలుగు రకాల తండ్రులు
పరీక్షలు ఇంకో వారం రోజుల్లో ఉన్నాయనగా ఒక కొడుకు ‘పక్క ఊరి గుడికి మా స్నేహితులందరూ వెళ్తున్నారు. అక్కడ గుండు గీయించుకొని, చెరువులో మునిగి, దేవుడికి దండం పెట్టుకుంటే ఫస్టు ర్యాంకు వస్తుందట’ అని చెప్పాడనుకుందాం. వివిధ రకాల తండ్రులు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూద్దాం. హిరణ్యకశ్యపులు: ‘పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని గుళ్లకీ గోపురాలకీ తిరుగుతావా? (మధ్యలో భార్య అడ్డొస్తే) నోర్ముయ్! నీ మూలానే వీడిలా తయారయ్యాడు.’ పిల్లల్ని సొంతగా ఆలోచించనివ్వకుండా ప్రతి చిన్న విషయంలోనూ వేలుపెట్టడం, క్రమశిక్షణ పేరుతో కొట్టడం, తిట్టడం, తాము సాధించలేని పెద్ద పెద్ద ఆశలు పిల్లవాడి మీద పెట్టుకోవడం, అవి తీరకపోతే నిరాశతో మరింత రాక్షసులుగా మారటం, తమ మాటే వేదవాక్కులా నడవాలి అనుకోవటం ఈ టైపు తండ్రుల లక్షణాలు. వీళ్లకి తమ మీద, తమ మేధస్సు మీద గొప్ప నమ్మకం. పై ఉదాహరణలో ఆ పిల్లవాడు గాని పరీక్ష ఫెయిల్ అయితే ‘నా తప్పేమీ లేదు. గుడికి వెళ్తానంటే నాన్న వద్దన్నాడు. అందువల్ల భగవంతుడు నా తండ్రిపై ఈ విధంగా కక్ష తీర్చుకున్నాడు’ అని ఎస్కేప్ అయిపోతాడు. దృతరాష్టులు: ‘తప్పకుండా వెళ్దాం నాయినా! రేపే వెళ్దాం! నీతో పాటు నేను, మీ అమ్మ, అక్కయ్య కూడా గుండు కొట్టించుకుంటాం. నువ్వు పాసైతే మాకదే చాలు. నీ కోరిక మేమెప్పుడైనా కాదన్నామా?’ వీళ్లకి సంతానం ఏది చెప్తే అదే వేదం. ఆ తరువాత పిల్లవాడు ఫెయిల్ అయితే, ‘భగవంతుడి మీద (చదవటం మానేసి) భారం మోపాను. నేనేం చెయ్యను’ అని సమర్థించుకుంటాడు. చాలామంది తాగుబోతులు, క్లబ్బుల్లో జూదగాళ్లు, రాజకీయ నాయకులు తమ తమ రంగాల్లో చాలా బిజీగా ఉన్నాం అనుకొనేవారు ఈ విభాగంలోకి వస్తారు. పిల్లల మానసిక అవసరాలను పట్టించుకోకపోవటం, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి పిల్లవాడు ఏది అడిగితే అది ఇవ్వటం ఈ రకపు తల్లిదండ్రుల అవలక్షణాలు. మరికొందరు పెద్దలు ‘నే చిన్నప్పుడు ఇవన్నీ అనుభవించలేదు. మా పిల్లలైనా అనుభవించనీ’ అన్న ఉద్దేశంతో పిల్లల్ని విపరీతమైన గారాబంతో పెంచుతూ వారి భవిష్యత్తుని పాడుచేస్తారు. చిన్న వయసులోనే పిల్లలు హుక్కా హౌసుల్లో గంజాయికి అలవాటు పడటానికి, కారు ఆక్సిడెంట్లలో మరణించటానికి ఇలాంటి తల్లిదండ్రులే కారణం. జనకులు: ‘నేను నీ నమ్మకాన్ని కాదనను. కానీ పరీక్షలు ఇంకో వారం రోజుల్లో పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రయాణాల్తో చదువు పాడుచేసుకోకు. పరీక్షలయ్యాక, తప్పకుండా వెళ్దాం. కానీ కేవలం చెరువులో మునిగి గుండు గీయించుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తే ఈ పాటికి చాలామందికి రావాలి కదా? తార్కికంగా ఆలోచించు. చదువుకోవటం ముఖ్యం. నమ్మకం తరువాత.’ పిల్లల్ని చిన్నతనంలోనే గురుకులానికి పంపించి వేయటం వల్ల పురాణాల్లో (పిల్లల్ని బాగా పెంచటానికి ఉదాహరణగా నిలిచే) మంచి తండ్రులు తక్కువ కనపడతారు. ఒకవైపు స్త్రీ ధర్మాన్ని, మరొకవైపు ఆత్మగౌరవాన్ని సీతకు బోధించిన జనకుడు, ఇంకా కొంతవరకూ... దశరథుడు, అర్జునుడు వగైరా మంచి జనకులు. బాధ్యత తెలిసిన తల్లిదండ్రులు పిల్లలకి చేదోడు వాదోడుగా నిలిచి, వాళ్ల గమ్యాన్ని నిర్దేశించుకోవటానికి సహాయపడతారు. దుర్యోధనులు: పిరికితనానికి మరోపేరైన లక్ష్మణ కుమారుడు ఇతడి కొడుకు. ఇతడి ప్రస్తావన ఉదాహరణకే తప్ప వాదనకి కాదు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా భయంతోను, బలహీనతతోను ఉంటారు. కూతురికి ఐఐటీ సీటు వస్తే, ‘తాము నివసించే ప్రాంతానికి అది దూరం’ అని వదులుకున్న తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు. ఒక అమ్మాయి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి స్వరంతో కర్ణాటక సంగీతం అద్భుతంగా పాడుతుంది. చదువు పాడవుతుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బలవంతంగా ఆ ట్రైనింగ్ మాన్పించారు. ఒక చెట్టు కింద ఒకామె ఏడుస్తుంటే గమనించాను. ఆ తరువాత తెలిసిన విషయమేమిటంటే, ఆమె కొడుకు లోపల ఎల్.కె.జి. ప్రవేశ పరీక్ష రాస్తున్నాడు. ఇది టెన్షన్కి పరాకాష్ట.అమ్మ మమకారం అందిస్తే, నాన్న ధైర్యం ఇస్తాడు. అమ్మలా అక్కున చేర్చుకోకపోవచ్చు. కానీ వెన్నెముక బలంగా అయ్యేందుకు తోడ్పడ్తాడు. తండ్రి అవటం సులభం. మంచి సంతానానికి తండ్రి అవటం కష్టం. భగవంతుడు అన్నిచోట్లా దీపం పట్టుకుని నిలబడి దారి చూపించలేడు. అందుకే తండ్రుల్ని సృష్టించాడు. - yandamoori@hotmail.com యండమూరి వీరేంద్రనాథ్ -
విహారం: భీమ్తాల్- ఇతిహాసకాలంలో విహారం
కుమావ్ పర్వతశ్రేణుల మధ్య విశాలమైన సరస్సు. ఆ సరస్సు మధ్యలో చిన్న దీవి. సరస్సు ఒడ్డున ఉన్న పురాతనమైన శివాలయం. పేరు భీమేశ్వర మహదేవ్ ఆలయం. ఇది స్వయానా పాండవ మధ్యముడు కట్టిన ఆలయం. అందుకే ఈ ఆలయానికి భీమేశ్వర ఆలయం అని, ఈ సరస్సుకు భీమ్తాల్ అని భీముడి పేరుతో వాడుకలోకి వచ్చాయి. తాల్ అంటే సరస్సు అని అర్థం. భీమేశ్వర ఆలయ నిర్మాణశైలిని చూస్తే... క్రీస్తుపూర్వం వేలాది ఏళ్ల కిందట కూడా ఇలా నిర్మించేవారా అనే సందేహం కలగడం సహజమే. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో ఈ ప్రదేశాన్ని పాలించిన చాంద్ వంశీయుడు బాజ్ బహదూర్ పునర్నిర్మించాడు. కుమావ్ పర్వతశ్రేణుల మధ్య ఉన్న ఈ అటవీ ప్రదేశం పాండవులు వనవాసం చేసినప్పుడు సంచరించిన నేల. క్రీ.పూ. వేల ఏళ్ల నాటి మానవ సంచారాన్ని, జీవనశైలిని అధ్యయనం చేయడానికి ఆర్కియాలజీ నిపుణులు తరచూ ఇక్కడ పర్యటిస్తుంటారు. ఇప్పుడు ఈ దారులన్నీ ట్రెకింగ్ చేయాలనుకునే వాళ్లకి మార్గదర్శనాలు. ఇక్కడ ట్రెకింగ్ క్యాంపులు కూడా ఎక్కువే. మౌంటెయిన్ రూట్లో ట్రెకింగ్ సాహసోపేతమే అయినా ఉద్వేగంతో ఒళ్లు పులకించిపోతుంది. భీమ్తాల్ పట్టణంలో నేషనల్ కోల్డ్వాటర్ ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ను చూసినప్పుడు తప్ప... ఇంత చల్లటి వాతావరణంలో కూడా సరస్సుల్లో చేపలుంటాయనే ఆలోచన రానేరాదు. ఫోక్ కల్చరల్ మ్యూజియంలోకి వెళ్తే జానపద సినిమా సెట్టింగులో అడుగుపెట్టినట్లు ఉంటుంది. షోదశ మహా జనపదాల నాటి జీవనశైలిని ప్రతిబింబిస్తుంటాయి ఇక్కడి హస్త కళాకృతులు. పట్టణానికి కనుచూపు మేరలో ఉన్న సాత్విక్ సదన్ వైపు అడుగులు వేస్తే భారతీయులతోపాటు యోగవిద్యను, వేద తత్వాన్ని అభ్యసిస్తున్న పాశ్చాత్యులు కనిపిస్తారు. భీమేశ్వర ఆలయానికి దగ్గరలోనే ఉన్న చిన్న కొండ పేరు గర్గ్ పర్వత్. గర్గి నది పుట్టింది ఈ కొండమీదనే. ఇక్కడ దాహం తీర్చే గంగామాత ఈ నదే. భీమ్తాల్ సరస్సుకు ఒక చివరగా డ్యామ్ ఉంది. సరస్సు మధ్యలో చిన్న దీవి ఉంది. సరస్సులో బోట్ షికారు అంటే ఈ దీవి చుట్టూ తిప్పుతారు. భీమ్తాల్ నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే దమయంతి తాల్ వస్తుంది. ఇక్కడ నలమహారాజు మందిరం ఉండేదని, ప్రకృతి వైపరీత్యాలకు ఆ మందిరం కాస్తా మునిగిపోయిందని చెబుతారు. మరో మూడు కిలోమీటర్లు వెళ్తే సాత్ తాల్కి చేరుతాం. ప్రకృతి ప్రేమికులను ఆకర్షించే ప్రదేశం ఇది. సముద్రమట్టానికి దాదాపుగా పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో పచ్చటి దట్టమైన అడవుల మధ్య స్వచ్ఛమైన నీటి సరస్సుల నిలయం ఇది. సాత్తాల్ అంటే ఏడు సరస్సుల సమూహం. రెండు సరస్సులు ఇంకిపోగా ఇప్పుడు ఐదు సరస్సులు మాత్రమే ఉన్నాయి. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉండే ఈ ప్రదేశంలో పక్షుల కువకువలు తప్ప ఏ ఇతర శబ్దాలూ వినిపించవు. పర్యాటకులు పడవ విహారంలో, చేపలు పట్టడంలో నిమగ్నమై ఉంటారు. సాత్తాల్ పక్కనే ఉన్న కొండ హిడింబ పర్వత్. భీముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు హిడింబాసురుణ్ని సంహరించి, అతడి చెల్లెలు హిడింబిని వివాహమాడినట్లు చదివిన పౌరాణిక కథలకు ఆనవాలుగా ఉంటుంది. ఇప్పుడీ కొండ మీద ఆశ్రమంలో వన్క్షాంది మహరాజ్ అనే సాధువు నివసిస్తున్నాడు. ఇది వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడ. ఇక్కడికి దగ్గరలోని కర్కోటక పర్వత్ మీద ఉన్న ఆలయంలోని నాగదేవుడిని కర్కోటక మహారాజ్గా కొలుస్తారు. భీమ్తాల్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో నౌకుచియాతాల్ ఉంది. తొమ్మిది భుజాల సరస్సు ఇది. పర్యాటకులు ఉన్నప్పటికీ హడావిడి తక్కువ. బోటింగ్ ఎంజాయ్ చేసేవాళ్లు ఇక్కడికి వస్తారు. భీమ్తాల్ నుంచి 22 కి.మీ.లు వెళ్తే నైనితాల్ వస్తుంది. ఎనభైల నాటి సినిమాల ద్వారా ఈ ప్రదేశం మనకు పరిచయమే. పెళ్లయి కుటుంబం ఉన్న హీరో ఆఫీసు పని మీద నైనితాల్కు క్యాంపుకెళ్లడం, అక్కడ ఆపదలో ఉన్న యువతికి సాయం చేయడం... వంటి సన్నివేశాలు ఉండేవి. ఆ సినిమాల్లో... కొండలు, లోయల మయంగా ఉన్న ప్రదేశంలో ఇళ్లు అక్కడక్కడా విసిరేసినట్లు ఉండేవి. మగవాళ్లు తలకు మంకీక్యాప్, మెడకు స్టోల్ చుట్టుకుని, స్వెట్టర్ ధరించి, మహిళలు భుజాల చుట్టూ షాల్ చుట్టుకుని కనిపించేవారు. ఈ సీన్లు చల్లటి వాతావరణాన్ని ప్రతిబింబించేవి. ఈ ప్రదేశానికి నైనితాల్ అనే పేరు ఎలా వచ్చిందీ అంటే... దక్షయజ్ఞం సమయంలో దక్షప్రజాపతి చేసిన అవమానానికి దహించుకుపోయిన సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని పిచ్చివాడిలా సంచరిస్తుంటాడు పరమశివుడు. అప్పుడు సతీదేవి కన్ను పడిన ప్రదేశమే నైనితాల్. అప్పటి వరకు ఈ సరస్సును అత్రి, పులస్త్య, పులహ రుషుల పేరుతో త్రిరుషి తాల్ అనేవారు. భీమ్తాల్, సాత్తాల్, నైనితాల్, నౌకుచియాతాల్, దమయంతి తాల్... ఇవన్నీ ఉన్న కుమావ్ పర్వతశ్రేణులు ప్రకృతి సౌందర్యానికి నిలయాలు. పచ్చదనాన్ని, సహజత్వాన్ని ఆస్వాదిస్తూ పర్వతాల మీదకు నడిచి వెళ్లి, రాత్రికి అక్కడే బస చేసి నిర్మలాకాశంలో కనిపించే చుక్కలను చూస్తూ గడపడం అనిర్వచనీయమైన అనుభూతి. ఈ కొండల్లో యువకులు రాక్క్లైంబింగ్ సాహసం కూడా చేయవచ్చు. పెద్దవాళ్లు దేవాలయాలు పూజలు చేసుకోవచ్చు. ఔషధాలకు పుట్టిల్లయిన భారతదేశంలో ప్రతిచెట్టూ మనిషికి స్వస్థత కలిగిస్తూ తన బాధ్యతను మౌనంగా నిర్వర్తిస్తుంది. పెట్రోల్ పొగతో ఆకాశం కనిపించని నగరాల నుంచి ఓ వారం రోజులు బయటకు వచ్చి... మంచు కప్పుకున్న కొండలకు, మబ్బుల మాటున కనిపించే ఆకాశానికి మధ్య విహరించడం ఆహ్లాదకరం మాత్రమే కాదు ఆరోగ్యకరం కూడ. ఎక్కడ ఉంది? భీమ్తాల్ ఉత్తరాఖండ్ రాష్ట్రం, నైనితాల్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి 22 కి.మీ.లదూరాన సముద్రమట్టానికి 1,370 మీటర్ల ఎత్తులో ఉంది. ఎప్పుడు వెళ్లవచ్చు? వర్షాకాలం మినహాయించి ఎప్పుడైనా వెళ్లవచ్చు. శీతాకాలంలో ఇక్కడ చలితీవ్రత ఎక్కువ, టూరిస్టులకు అన్ సీజన్. ఈ సమయంలో హోటళ్లలో గది అద్దె తక్కువ, గదులు సులభంగా దొరుకుతాయి కూడ. ఎలా వెళ్లాలి? సమీప విమానాశ్రయం... పంత్నగర్, ఇక్కడి నుంచి భీమ్తాల్కి 60 కి.మీ.లు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి భీమ్తాల్కి 300 కి.మీ.లు. ఇక్కడి నుంచి రైలు లేదా రోడ్డుమార్గాన వెళ్లవచ్చు. సమీప రైల్వే స్టేషన్... కత్గోదామ్ స్టేషన్, ఇక్కడి నుంచి భీమ్తాల్కి ఇరవై కిలోమీటర్లు. ఎక్కడ ఉండాలి? శిఖా ఇన్ రిసార్టు, మౌంటెయిన్ క్లబ్ రిసార్టు, కంట్రీ ఇన్, నైని రిట్రీట్ వంటి విలాసవంతమైన హోటళ్లలో ఒక రోజుకు గది అద్దె దాదాపుగా ఐదు వేలు. వీటిలో బ్రేక్ఫాస్ట్ ఉచితం. ‘హోటల్ న్యూ భారత్లో ఒక రోజు అద్దె తొమ్మిది వందలు, ‘హోటల్ లేక్ ఇన్’లో 1,400 రూపాయలు. భోజనం ఎలా? సదరన్ డిలైట్లో దక్షిణాది వంటకాలు ఉంటాయి. ‘గ్రావిటీ బై ద లేక్’రెస్టారెంటు నుంచి సరస్సు వ్యూ అందంగా ఉంటుంది. అందుకోసమే పర్యాటకులు ఇక్కడ ఒక్క భోజనమైనా చేయాలని ఉత్సాహపడుతుంటారు. ఇటలీరుచుల కోసం ‘ఇటాలియానో’ రెస్టారెంట్కెళ్లాలి. వాతావరణం? భీమ్తాల్లో ఉష్ణోగ్రతలు వేసవిలో 15-28 డిగ్రీల మధ్య, శీతాకాలంలో 4-8 డిగ్రీల మధ్య ఉంటాయి. ఏమేం తీసుకెళ్లాలి? ఎగుడుదిగుడు నేల మీద కూడా సౌకర్యంగా నడవడానికి వీలుగా ఉండే షూస్ తీసుకెళ్లాలి. వాతావరణం మారినప్పుడు ఎదురయ్యే జలుబు, అజీర్తి, విరేచనాలు, జ్వరం వంటి సాధారణ అరోగ్య సమస్యలకు మందులు తీసుకెళ్లాలి. వేసవిలో ఒక స్వెటర్, శీతాకాలం అయితే హెవీ ఉలెన్ జాకెట్, మఫ్లర్, క్యాప్ కూడా ఉండాలి. ఏమేమి కొనుక్కోవచ్చు! భీమ్తాల్ పట్టణం నడిబొడ్డున మాల్ రోడ్డు ఉంది. ఇది హస్తకళలకు ప్రసిద్ధి. ఇక్కడ చేతితో తయారు చేసిన కొవ్వొత్తులు, పూసల ఆభరణాలు దొరుకుతాయి. తివాచీలు, దారుకళాకృతులు, చేతిలో ఇమిడిపోయే చిన్న విగ్రహాలు, గర్వాలీ స్టైల్ చిత్రలేఖనాలు ఉంటాయి. -
కన్నీటి కొల్లేరు