last rites
-
అభిషేక్ రెడ్డికి వైఎస్ జగన్ దంపతుల నివాళి
వైఎస్సార్, సాక్షి: వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థీవదేహానికి పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సతీమణి వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వాళ్లలో ఉన్నారు. ఈ సందర్భంగా అభిషేక్ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. వైఎస్ అభిషేక్రెడ్డి.. వైఎస్సార్సీపీ కీలక నేతగా, వైఎస్ జగన్(YS Jagan)కు దగ్గరిబంధువని తెలిసిందే. వైఎస్ జగన్ పెద్దనాన్న వైఎస్ ప్రకాష్రెడ్డి మనవడే ఈ అభిషేక్. అయితే కొద్దిరోజులుగా డెంగీ జ్వరంతో అభిషేక్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. అంతకు ముందు.. పులివెందులోని స్వగృహంలో అభిషేక్ రెడ్డి(ys abhishek reddy) పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పులివెందుల చేరుకున్నారు. అభిషేక్కు భార్య, ఇద్దరు పిల్లలు. చిన్నవయసులోనే అభిషేక్ మృతి చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలు పూర్తిపులివెందులలో వైఎస్ అభిషేక్రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు దారి పొడవునా అభిషేక్ రెడ్డి చిత్రపటాలు ప్రదర్శిస్తూ వీడ్కోలు పలికారు.సుశీలమ్మకు పరామర్శఅభిషేక్రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ ఉదయం బెంగళూరు నుంచి జగన్ దంపతులు పులివెందుల చేరుకున్నారు. అంతకు ముందు.. వైఎస్ జగన్ తన మరో బంధువు వైఎస్ ఆనందరెడ్డి ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మను పరామర్శించి.. వాళ్ల యోగకక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. -
సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
-
ముగిసిన మన్మోహన్ అంత్యక్రియలు
ముగిసిన మన్మోహన్సింగ్ అంత్యక్రియలుసిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన మన్మోహన్ అంత్యక్రియలు#WATCH | Former Prime Minister #DrManmohanSingh laid to rest with full state honours after leaders and family paid last respects at Nigam Bodh Ghat in Delhi. (Source: DD News) pic.twitter.com/Kk9RMgOMz1— ANI (@ANI) December 28, 2024సిక్కు పెద్దల సమక్షంలో అంత్యక్రియలుమన్మోహన్ పార్థివదేహం వద్ద చివరిసారిగా ప్రార్థనలు చేసిన కుటుంబసభ్యులురెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన తుపాకులను గాల్లోకి పేల్చి మాజీ ప్రధానికి సైనికుల గౌరవ వందనంసైనిక లాంఛనాలతో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలుఢిల్లీ నిగమ్బోధ్ స్మశానవాటికలో జరిగిన మన్మోహన్సింగ్ అంత్యక్రియలుసైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలుఅంత్యక్రియలకు హాజరైన రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, ఎల్ఓపీ రాహుల్గాంధీ, భూటాన్ రాజు కేసర్ నామ్గేల్ వాంగ్చుక్, సోనియాగాంధీ, ఖర్గే, అమిత్ షా, ఇతర నేతలుమన్మోహన్ పాడె మోసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీసిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలుసిక్కు మతపెద్దల సమక్షంలో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన మన్మోహన్ అంత్యక్రియలుపార్థివదేహం వద్ద ప్రార్థనలు నిర్వహించిన కుటుంబ సభ్యులుచివరిసారిగా నివాళులర్పించిన ప్రధాని, రాష్ట్రపతిచివరిసారిగా మన్మోహన్కు నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని#WATCH | President Droupadi Murmu arrives at Nigam Bodh Ghat in Delhi to pay her last respects to former Prime Minister #DrManmohanSingh(Source: DD News) pic.twitter.com/bEIFkZzjpb— ANI (@ANI) December 28, 2024ఆర్థిక సంస్కర్తకు నివాళులర్పించిన త్రివిధ దళాలు#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays his last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat(Source: DD News) pic.twitter.com/0Uc3KUhKfg— ANI (@ANI) December 28, 2024 #WATCH | Delhi: Prime Minister Narendra Modi arrives at Nigam Bodh Ghat to attend the last rites of former Prime Minister #DrManmohanSingh.Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi(Source: DD News) pic.twitter.com/qJGKjCA59g— ANI (@ANI) December 28, 2024 #WATCH | Delhi: CPP Chairperson Sonia Gandhi pays her last respects to former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat, where his last rites will be performed. pic.twitter.com/lYkFIg9Yht#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh at Nigam Bodh Ghat for his last rites.Former PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi.(Source: Congress) pic.twitter.com/HJFv8GAPYP— ANI (@ANI) December 28, 2024— ANI (@ANI) December 28, 2024— ANI (@ANI) December 28, 2024 మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం.. మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఏఐసీసీ ఆఫీసు నుంచి నిగమ్బోధ్ ఘాట్ వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. మన్మోహన్ అంతిమయాత్ర వాహనంలోనే కూర్చున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకాసేపట్లో నిగమ్బోథ్ ఘాట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. మన్మోహన్కు వైట్హౌజ్ సంతాపంమన్మోహన్సింగ్ మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపంప్రకటన విడుదల చేసిన వైట్హౌజ్ #WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh being taken out of the AICC headquarters. pic.twitter.com/ouuAgsQ5qf— ANI (@ANI) December 28, 2024 కాంగ్రెస్ ఆఫీసుకు మన్మోహన్సింగ్ పార్థివ దేహం ఇంటి నుంచి కాంగ్రెస్ ఆఫీసుకు చేరుకున్న మన్మోహన్సింగ్ అంతిమయాత్ర మన్మోహన్ పార్థివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ఖర్గే#WATCH | Delhi | Mortal remains of former Prime Minister #DrManmohanSingh kept at AICC headquarters where the party workers will pay their last respects. pic.twitter.com/bhR8iS2dM4— ANI (@ANI) December 28, 2024#WATCH | Delhi | The mortal remains of former Prime Minister #DrManmohanSingh being taken from his residence for AICC headquarters. The mortal remains will be kept at AICC headquarters for the party workers to pay their last respects. pic.twitter.com/iD5JYG102s— ANI (@ANI) December 28, 2024ఏఐసీసీ ఆఫీసులో ప్రజల సందర్శన కోసం పార్థివ దేహంఇక్కడి నుంచి 9.30కు అంతిమయాత్ర ప్రారంభం11.45కు నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలుకాంగ్రెస్ కార్యాలయం నుంచి మన్మోహన్ అంతిమయాత్రఏఐసీసీ ఆఫీసు నుంచి ప్రారంభం కానున్న మన్మోహన్ అంతిమయాత్రపార్టీ ఆఫీసుకు చేరుకున్న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జైరాంరమేష్, పవన్ ఖేరా9.30కు అంతిమయాత్ర ప్రారంభం #WATCH | Delhi: Vehicle in which the mortal remains of former PM Dr Manmohan Singh will be kept, reaches outside the residence of #DrManmohanSinghFormer PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi. pic.twitter.com/xlZvCyWVfu— ANI (@ANI) December 28, 202411.45కు నిగంబోధ్ ఘాట్ స్మశానవాటికలో అంత్యక్రియలుకాసేపట్లో మన్మోహన్సింగ్ అంత్యక్రియలుమాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయిప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్సింగ్కు అంత్యక్రియలు నిర్వహించనున్నారుఉదయం 8 గంటల నుంచి ప్రజల సందర్శనార్థం మన్మోహన్సింగ్ పార్థివ దేహాన్ని కాంగ్రెస్ ఆఫీసులో ఉంచుతారుకాంగ్రెస్ ఆఫీసు నుంచి 9.30కు మన్మోహన్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది11.45కు నిగంబోధ్ ఘాట్ స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి#WATCH | Delhi | Funeral march preparations underway at Nigambodh Ghat ahead of the last rites of former Prime Minister Dr Manmohan SinghFormer PM Dr Manmohan Singh died on 26th December at AIIMS Delhi. pic.twitter.com/smaZvtQDbR— ANI (@ANI) December 28, 2024మన్మోహన్ స్మృతి వనం నిర్మించేందుకు స్థలం కేటాయించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని కోరారుదీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందిఇప్పటికే ఏడు రోజులు సంతాపదినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందిశుక్రవారం మన్మోహన్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము సహా పలువురు నేతలు నివాళి అర్పించారు -
ఇదేం పిచ్చో.. కారును సమాధి చేశారు!
వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదేనేమో. సాధారణంగా మనకు బాగా నచ్చిన వాహనాలకు మనతో పాటే ఉంచుకుంటాం, లేదంటే ఎవరికైనా పనికొస్తే ఇచ్చేస్తాం. కొత్త వెహికల్ కొన్నప్పుడు పాత వాహనం మార్పిడి చేసుకుంటాం. కానీ గుజరాత్లో ఓ వ్యాపారి మాత్రం తనకు బాగా అచ్చొచ్చిన కారును సమాధి చేసేశాడు. అదేదో అషామాషీగా చేయలేదు. ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకగా ఈ తంతు జరిపాడు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. తీరా చూస్తే ఈ కారు ఏ ముప్ఫైనలబై ఏళ్లనాటిదో కాదు.. జస్ట్ 12 ఏళ్లు మాత్రమే వాడారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.15 అడుగుల లోతు గుంతలో..గుజరాత్కు చెందిన ఓ వ్యాపారి తనకు, తన కుటుంబానికి సంపద, పేరు తెచ్చిన లక్కీ కారును ఘనంగా సమాధి చేశారు. అమ్రేలి జిల్లా లాఠీ తాలూకా పదార్సింగ్ గ్రామం ఇందుకు వేదికైంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు సహా 1,500 మంది హాజరయ్యారు. ఫాంహౌస్లో సుమారు 15 అడుగుల లోతు గుంతలో ఉన్న వాగన్ ఆర్ కారు, సంజయ్ పొలారా, అతని కుటుంబం పూజలు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు, పూలు, పూలదండలతో అందంగా అలంకరించిన కారును పొలారా కుటుంబీకులు బాజా భజంత్రీలతో గ్రామంలోని తమ ఇంటి నుంచి ఊరేగింపుగా ఫాంహౌస్లోని తీసుకువచ్చారు. అక్కడున్న ఏటవాలు నిర్మాణం మీదుగా గుంతలోకి దింపారు. కారుపై పచ్చని వ్రస్తాన్ని కప్పారు. పూజారులు మంత్రాలు చదువుతుండగా పొలారా, కుటుంబసభ్యులు కారుపై పూలు చల్లుతూ పూజలు చేశారు. చివరగా బుల్డోజర్ కారును మట్టితో సమాధి చేసేసింది. વ્હાલસોઈ નસીબદાર કારની સમાધિ !!!અમરેલીમાં પરિવાર માટે લકી કારને વેચવાને બદલે ઘામધૂમથી જમણવાર યોજી સમાધિ અપાઈ, કારના સમાધિ સ્થળે વૃક્ષારોપણ કરાશે #Gujarat #Amreli pic.twitter.com/1c4hiogs7n— Kamit Solanki (@KamitSolanki) November 8, 2024కారొచ్చాక కలిసొచ్చింది..ఈ కారు వచ్చిన తనకు బాగా కలిసొచ్చిందని సూరత్లో నిర్మాణ సంస్థను నడుపుతున్న సంజయ్ పొలారా మీడియాతో చెప్పారు. భవిష్యత్ తరాలకు శాశ్వతమైన జ్ఞాపకంగా ఉండాలనే తన లక్కీ కారును సమాధి చేసినట్టు వెల్లడించారు. "దాదాపు 12 సంవత్సరాల క్రితం నేను ఈ కారు కొన్నాను. ఇది మా కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారంలో విజయాలు దక్కాయి. నా కుటుంబ గౌరవం పెరిగింది. అందుకే దీన్ని అమ్మకుండా మా పొలంలో సమాధి చేశామ"ని సంజయ్ వివరించారు. నెటిజనులు మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. ఇదేం పిచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు -
తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం
ఆరిలోవ (విశాఖ జిల్లా): అతను మరణిస్తున్నా.. మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి జిల్లాకు చెందిన నరేష్ పట్నాయక్ (32) రెండు రోజుల క్రితం కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే బంధువులు పర్లాకిమిడిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.పరీక్షలు చేసిన వైద్యులు... నరేష్ పట్నాయక్ బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావమైందని, మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, ఇక్కడ వైద్యులు రెండు రోజులు చికిత్స అందించినా ప్రయోజనం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించారు.జీవన్దాన్ ప్రతినిధులు నరేష్ కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానంపై అవగాహన కల్పించారు.బాధను దిగమింగుకుని నరేష్ కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. ఆస్పత్రిలో వైద్యులు శుక్రవారం నరేష్ దేహం నుంచి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు, లివర్ తొలగించారు. వాటిని జీవన్దాన్ ప్రొటోకాల్ ప్రకారం ఐదుగురికి కేటాయించారు. గ్రీన్ చానెల్ ద్వారా వాటిని అవసరమైనవారికి వెంటనే తరలించినట్లు జీవన్దాన్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
కడసారి వీడ్కోలు.. రతన్ టాటా అంతిమ యాత్ర (ఫోటోలు)
-
టాటాకు పెంపుడు శునకం కన్నీటి బై బై
ముంబయి: వ్యాపార దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు గురువారం(అక్టోబర్10) సాయంత్రం ముగిశాయి. ముంబైలోని వర్లి స్మశానవాటికలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరై హాజరై నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం టాటాకు చివరిసారి వీడ్కోలు పలికారు. టాటాకు కడసారి బై బై చెప్పేందుకు వచ్చిన ఓ పెంపుడు శునకం ఈ అంత్యక్రియల్లో అందరినీ కంటతడి పెట్టించింది. ఈ శునకం ఎవరిదో కాదు..రతన్ టాటా దత్తత తీసుకుని ముద్దుగా పెంచుకున్నదే. దీని పేరు గోవా. టాటా గోవా వెళ్లినపుడు ఓ వీధి శునకం ఆయన వెనకాల నడుస్తూ వచ్చింది. అంతే దాన్ని ముంబై తీసుకువచ్చి పెంచుకున్నారు. 11 ఏళ్లుగా గోవా టాటా వద్దే ఉంది. అంత్యక్రియలు జరుగుతున్నంత సేపు టాటా పార్థివ దేహం పక్కనే కూర్చున్న గోవా తన మాస్టర్కు అశ్రనయనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఈ దృశ్యాలు అక్కడున్నవారందరికీ కన్నీళ్లు తెప్పించాయి. ఇదీ చదవండి: టాటా ప్రతీకారం అలా తీరింది -
పార్సీ అయిన టాటాకు హిందూ పద్ధతిలో అంత్యక్రియలు?
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. దీనికి ముందు ముంబైలోని నారిమన్ మైదానంలో గల ఎన్సీపీఏలాన్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.రతన్ టాటా పార్సీ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీలోగల విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఇక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనలు జరుగుతాయి. అనంతరం అంత్యక్రియల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల పద్ధతి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది.There’s a Hindu pujari, Christian priest, Muslim Imam and a Sikh sant standing behind. Sanghis may not like this, but this is truly secular …..!!Rest in peace Sir Ratan Tata ….. 🙏 pic.twitter.com/DjiYNOPR7C— Mayank Saxena (@mayank_sxn) October 10, 2024 పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరిలో అంత్యక్రియల సంప్రదాయం మూడు వేల సంవత్సరాల నాటిది. పార్సీలు అనుసరించే జొరాస్ట్రియనిజంలో మనిషి మృతి చెందాక ఆ మృతదేహాన్ని రాబందులు తినేందుకు అనువుగా బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. అయితే రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. గతంలో అంటే 2022 సెప్టెంబర్లో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో పార్సీ సమాజంవారు అనుసరించే అంత్యక్రియల ఆచారాలను వివిధ ప్రభుత్వాలు నిషేధించాయి. ఇది కూడా చదవండి: టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో -
రామోజీరావు అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్, సాక్షి: రామోజీగ్రూప్ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు.రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం. ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ -
కొడుకు, కూతుళ్ల నిర్వాకం.. తల్లి అంత్యక్రియలు జరపకుండా..
సాక్షి, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో దారుణం జరిగింది. డబ్బులు కోసం కన్నతల్లి అంత్యక్రియలు జరగకుండా కొడుకు, కూతుళ్లు వదిలేసిన ఉదంతం సభ్య సమాజం తలదించుకునేలా చేస్తోంది. కందువారిగూడెంకు చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్నకుమారుడు కొన్నాళ్లు క్రితమే చనిపోయాడు.కాగా, ఇటీవల లక్ష్మమ్మ ఇటీవల బాత్రూంలో జారిపడి ఆసుప్రతిలో చేరింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వద్ద ఉన్న రూ.20 లక్షలు ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. అయినా అంత్యక్రియల విషయంలో పేచీ పెట్టారు. అంత్యక్రియలు జరపకుండా మృతదేహాన్ని ఇంటివద్దే ఉంచారు. తండ్రితో పాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని పెద్దకొడుకు చెబుతున్నాడు.తన తల్లి లక్ష్మమ్మ డబ్బు, బంగారం కూతుళ్లకే ఇచ్చిందని ఆరోపిస్తున్నాడు. తాను ఇప్పటికే కూలినాలి చేసుకుని బతుకుతున్నానని.. ఖర్చు తాను భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. అయితే. తల్లి అంత్యక్రియల విషయంలో కుమారుడు, కూతుళ్లు గొడవపడటం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు కని పెంచి ప్రయోజకుల్ని చేసిన తర్వాత ఇలా తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకుని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు. -
‘అమ్మ చనిపోయింది.. ఆఖరి చూపులకూ వెళ్లలేకపోయా’
ఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో విధించిన 'ఎమర్జెన్సీ' రోజులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. తనను 18 నెలల పాటు జైలులో పెట్టిన నాటి ప్రభుత్వం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కూడా పెరోల్ ఇవ్వలేదన్నారు. బీజేపీపై కాంగ్రెస్ పార్టీ చేసిన 'నియంతృత్వ' ఆరోపణలపై స్పందింస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ బ్రెయిన్ హెమరేజ్తో మరణించిన తన తల్లి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని భావోద్వేగానికి గురయ్యారు. "ఎమర్జెన్సీ సమయంలో మా అమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి నాకు పెరోల్ ఇవ్వలేదు. ఇప్పుడు వారు ( కాంగ్రెస్ ) మమ్మల్ని నియంతలు అంటున్నారు" అని ఆయన పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజ్నాథ్ సింగ్ వయస్సు 24 సంవత్సరాలు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1977 మార్చి వరకు కొనసాగిన జేపీ ఉద్యమంలో మిర్జాపూర్-సోన్భద్రకు ఆయన కన్వీనర్గా పనిచేశారు. "అప్పుడు నాకు కొత్తగా పెళ్లైంది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన నన్ను అర్ధరాత్రి సమయంలో పోలీసులు జైలుకు తీసుకెళ్లారు. ఏకాంత నిర్బంధంలో ఉంచారు" అని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఒక సంవత్సరం జైలులో గడిపిన తరువాత, ఆయన్ను విడుదల చేస్తారా అని అడిగిన రాజ్నాథ్ సింగ్ తల్లికి ఎమర్జెన్సీని మరో సంవత్సరం పొడిగించారని బంధువు ఆమెకు తెలియజేశారు. ఆ దిగులుతో ఆమెకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చి 27 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. తనకు పెరోల్ రాకపోవడంతో తల్లి అంత్య క్రియలకు వెళ్లలేకపోయానని, దీంతో తన సోదరులే అంత్యక్రియలు నిర్వహించారని వివరించారు. తాను జైలులోనే గుండు గీయించుకున్నానని తెలిపారు. -
ఎమ్మెల్యే లాస్య నందిత పాడె మోసిన హరీష్రావు
సాక్షి, సికింద్రాబాద్: కారు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు ముగిశాయి. మారేడ్పల్లి శ్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. సికింద్రాబాద్ కార్ఖానాలోని ఎమ్మెల్యే నివాసం నుంచి అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాడె మోశారు. కాగా, లాస్య నందిత భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. కాగా, లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో.. అదీ చిన్న వయసులో లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: లాస్య నందితను వెంటాడిన మృత్యువు -
కెప్టెన్కు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
డీఎండీకే అధినేత, నటుడు విజయ్కాంత్ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రునయనాలతో కెప్టెన్ అంతిమయాత్ర ముగిసింది. కాగా.. మొదట విజయ్కాంత్ భౌతికకాయాన్ని డీఎండీకే కార్యాలయానికి తరలించారు. ఆ తర్వాత విజయకాంత్ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడే సినీస్టార్ కమల్ హాసన్, రజనీకాంత్ ఆయనకు నివాళులు అర్పించారు. విజయకాంత్ చివరి చూపు కోసం సామాన్య ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. అనంతరం డీఎండీకే ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా.. కెప్టెన్ విజయకాంత్(71) డిసెంబర్ 28న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణంతో అటు అభిమానులు, సెలబ్రిటీలు విషాదంలో మునిగిపోయారు. ఎంతోమంది హీరోయిన్లకు కెరీర్ ఇచ్చి, మరెందరో హీరోలకు ఆదర్శంగా నిలిచిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. #WATCH | Chennai, Tamil Nadu: A large number of people gathered to pay tribute to DMDK President and Actor Vijayakanth. His mortal remains are being taken from Island ground, Anna Salai to Koyambedu DMDK office for the last rites. pic.twitter.com/cbSweIhY7z — ANI (@ANI) December 29, 2023 -
తండ్రి దహన సంస్కారాలు..అడ్డుకున్న కొడుకు అప్పులోళ్లు
సాక్షి,జగిత్యాల జిల్లా: కొడుకు అప్పుకట్టలేదని తండ్రి దహన సంస్కారాన్ని అప్పులోళ్లు అడ్డుకున్నారు. ఈ ఘటన మెట్ పల్లి పట్టణంలోని చైతన్య నగర్లో జరిగింది. కొంతకాలం నుంచి పలువురి వద్ద 1 కోటి 70 లక్షల రూపాయల దాకా పుల్లూరి శ్రీకాంత్ అనే వ్యక్తి అప్పు చేశాడు. అప్పు చెల్లించలేక శ్రీకాంత్ హైదరాబాద్ పారిపోయాడు. శ్రీకాంత్ తండ్రి పుల్లూరి నారాయణ శనివారం మృతి చెందాడు. అయితే తండ్రి దహన సంస్కారాల కోసం శ్రీకాంత్ తన స్వస్థలం మెట్పల్లికి ఆదివారం వచ్చాడు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ అప్పులోళ్లు దహన సంస్కారాలు జరిగే చోటికి వచ్చారు. అప్పు తీర్చేవరకు తండ్రి శవానికి దహన సంస్కారాలు జరగనివ్వబోమని అడ్డుకున్నారు. దీంతో దహన కార్యక్రమం గంట పాటు నిలిచిపోయింది. చివరకు ఆస్తి అమ్మి అప్పులు చెల్లిస్తానని శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో అప్పుల వాళ్లు వెనుదిరిగారు. తర్వాత తండ్రి నారాయణ దహన సంస్కారాలు జరిగాయి. ఇదీచదవండి..గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా -
సుబ్రతారాయ్ అంత్యక్రియలు: ఎవరు చేస్తున్నారో తెలుసా?
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతా రాయ్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం ఉత్తరప్రదేశ్, లక్నోలోని బైకుంత్ ధామ్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన ఇరువురు కుమారులో అందుబాటులో లేకపోవడంతో సుబ్రాతా రాయ్ మనవడు 16 ఏళ్ల హిమాంక్ రాయ్ చేతుల మీదుగా సాంప్రదాయ బద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహించారు. గంగా నది ఒడ్డున యనవడు హిమాంక్ ఆయన చితికి నిప్పింటించారు. రాయ్ కుమారులు, సుశాంతో, శ్రీమంతోలు విదేశాల్లో ఉన్న కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారని సన్నిహిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో లండన్లో చదువుకుంటున్న హిమాంక్ నేరుగా విమానాశ్రయం నుంచి కోకిలాబెన్ ఆసుపత్రికి వెళ్లి తాత భౌతిక కాయానికి నివాళులర్పించారు. సుబ్రతా రాయ్ చిన్న కుమారు శ్రీమంతో పెద్ద కుమారుడు హిమాంక్ రాయ్ లండన్లో 10వ తరగతి చదువుతున్నాడు. సుబ్రతా రాయ్ భార్య స్వప్న, అతని మేనకోడలు ప్రియాంక సర్కార్,ఇతరకుటుంబ సభ్యుల బుధవారం ప్రత్యేక విమానంలో లక్నో చేరుకుకున్నారు. అటు రాయ్ మృతదేహాన్ని కూడా కూడా చార్టర్ విమానంలో లక్నోకు తరలించారు. సహారా సుబ్రతాకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల, రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు రాయ్కు కడసారి నివాళులర్పించారు. యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నేతలు అరవింద్ సింగ్ గోపే, అభిషేక్ మిశ్రా ఉన్నారు. యూపీ కాంగ్రెస్ నాయకుడు ఆరాధన మిశ్రా మోనా, అనుగ్రహ్ నారాయణ్ సింగ్, అమ్మర్ రిజ్వీ వంటి ఇతర కాంగ్రెస్ నాయకులతోపాటు, మాజీ ఎంపీ నరేష్ అగర్వాల్, యూపీ మంత్రి నితిన్ అగర్వాల్, స్మితా ఠాక్రే, బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్, సున్నీ మత గురువు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ తదిరులు ఆయనను కడసారి దర్శించుకున్నారు. అలాగే కంపెనీకి చెందిన వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఆయన అధికారిక నివాసానికి తరలి వచ్చారు. ఆయన అంతిమయాత్రలో పాల్గొని జోహార్ సహారాజీ అంటూ నినదించారు. #WATCH | Lucknow, Uttar Pradesh: On Sahara Group Chairman Subrata Roy's demise, singer Sonu Nigam says, "Since 1997, I and Subrata Roy have had an association. I have spent a very good time with him. He is like my brother, father, and friend..." pic.twitter.com/vYYnNeICC2 — ANI (@ANI) November 16, 2023 VIDEO | Sahara group founder and chairman Subrata Roy‘s mortal remains being taken for the last rites ceremony at Sahara City in Lucknow. pic.twitter.com/QEngVKsEfS — Press Trust of India (@PTI_News) November 16, 2023 -
ముగిసిన మీరా అంత్యక్రియలు.. బోరున విలపించిన విజయ్ దంపతులు!
విజయ్ ఆంటోనీ కూతురు మీరాకు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఓమందూర్ ఆసుపత్రి నుంచి మీరా మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానిక నుంగమ్బాక్కమ్లోని చర్చికి తరలించారు. అక్కడ ప్రార్థనల అనంతరం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మీరా పార్థీవ దేహానికి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు కార్తీ, సత్తిరాజ్, శింబు, భరత్, సిబి రాజ్, దర్శకులు భారతీ రాజా, శశి, మిష్కిన్, సుశీంద్రన్, ఎడిటర్ మోహన్, మోసన్రాజా, ఎస్ఆర్ ప్రభు, సతీష్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, యువన్ శంకర్ రాజా, ప్రభుదేవా, నటి సుధ పలువురు మీరాకు నివాళులర్పించారు. మీరా చదువుకున్న పాఠశాల నిర్వాహకులు, సహ విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు ఆమె భౌతికాయాన్ని చూడటానికి పెద్దఎత్తున తరలివచ్చారు. మీరా భౌతికకాయాన్ని చూసిన పలువురు విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో మీరా భౌతికాయానికి స్థానిక కీల్పాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిక్రియల సమయంలో మీరా తల్లి ఫాతిమా విజయ్ ఆంటోని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ ఘటన అక్కడ ఉన్న వారందరినీ కంటతడి పెట్టించింది. మీరా సూసైడ్ కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ ప్రైవేట్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న మీరా ఆంటోనీ(16) బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. సౌత్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
భర్త మృతితో కలత.. కొద్దిసేపటికే భార్య కూడా కన్నుమూత!
ఉత్తరప్రదేశ్లోని జాన్సీలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ భర్త మృతిని తట్టుకోలేకపోయింది. అదే ఆవేదనలో 2 గంటల తరువాత ఆమె కూడా మృతి చెందింది. గంటల వ్యవధిలో ఒకే ఇంటిలో ఇద్దరు మృతి చెందడం స్థానికులను విషాదంలో ముంచెత్తింది. బఘౌరా గ్రామానికి చెందిన 50 ఏళ్ల ప్రీతమ్ రోజూ మాదిరిగానే పశువులను మేపేందుకు వాటిని పొలానికి తీసుకు వెళ్లాడు. వర్షాల కారణంగా అక్కడి చెక్ డ్యామ్ లోనికి నీరు ప్రవేశించింది. ఈ విషయం ప్రీతమ్కు తెలియలేదు. సాయంత్రం అతను తిరిగివస్తున్నప్పుడు చెక్ డ్యామ్లో మునిగిపోయాడు. సాయంత్రం ప్రీతమ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం అన్నిచోట్లా వెదికారు. వారికి చెక్డ్యామ్ బయట ప్రీతమ్ చెప్పులు కనిపించాయి. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ఈతగాళ్ల సాయంతో చెక్డ్యామ్లో గాలించగా, ప్రీతమ్ మృతదేహం లభ్యమయ్యింది. ప్రీతమ్ మృతి చెందాడనే విషయం తెలియగానే అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్రమైన ఆవేదనలో కూరుకుపోయిన అతని భార్య.. భర్త మృతి చెందిన రెండు గంటలకు కన్నుమూసింది. ఈ ఉదంతం గురించి మృతుడు ప్రీతమ్ బంధువు ఉధమ్సింగ్ మాట్లాడుతూ రోజూ మాదిరిగానే పశువులను మేపేందుకు వెళ్లిన ప్రీతమ్ అనుకోకుండా చెక్డ్యామ్లో మునిగి మృతి చెందాడని, ఈ విషయం తెలిసిన అతని భార్య గీత కూడా మృతిచెందిదని తెలిపారు. ఇది కూడా చదవండి: 20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’ -
Rajasthan: ఇక మృతదేహాలతో నిరసన కుదరదు
మనుషులు ఎలా బతికినా మరణానంతరం కాస్తయినా మర్యాద ఉండాలి. అంతిమ సంస్కారం గౌరవప్రదంగా సాగాలి. కానీ ఈ విషయంలోనూ కొన్నిచోట్ల పెడ ధోరణులు కనిపిస్తున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం మృతదేహాలతో కూర్చొని నిరసన ప్రదర్శనలకు దిగడం మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది విషయంలో ఈ అంతిమయాత్ర సవ్యంగా జరగడం లేదు. రాజస్తాన్లో మృతదేహాలతో ధర్నాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన ట్రెండ్కు అడ్డుకట్ట వేయడానికి రాజస్తాన్లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొచి్చంది. ‘ది రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు, 2023’కు గత వారమే అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. చట్టంలో ఉన్నదిదీ...! మరణానంతరం హక్కులుంటాయ్! ఎవరైనా వ్యక్తి మరణించిన తర్వాత కూడా వారికి హక్కులుంటాయి. వారి అంతిమ సంస్కారం గౌరవప్రదంగా వారి వారి మతాచారాలు, సంప్రదాయాలకనుగుణంగా నిర్వహించాలి. వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత వీలైనంత త్వరగా వారి అంత్యక్రియలు పూర్తి చేయాలి. చనిపోయిన వారి కుమారులు, కూతుళ్లు దూర ప్రాంతం నుంచి రావల్సి ఉంటే తప్ప వెంటనే అంత్యక్రియలు ముగించాలి. ఒక వేళ కుటుంబ సభ్యులు అలా అంత్యక్రియలు పూర్తి చేయకపోతే ప్రభుత్వ అధికారులే ఆ బాధ్యత తీసుకుంటారు. మృతదేహాలతో నిరసన కుదరదు ఈ చట్ట ప్రకారం మృతదేహాలతో కుటుంబ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేయకూడదు. ఏదైనా కారణంగా వాళ్లు అలా నిరసనలకు దిగితే చర్యలు తీసుకునే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉంటుంది. వెంటనే ఆ మృత దేహాన్ని స్వా«దీనం చేసుకొని అధికారులు తామే అంతిమ సంస్కారం నిర్వహిస్తారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో మృతదేహంతో నిరసనకు దిగినందుకుగాను ఆ కుటుంబసభ్యులకు ఏడాది వరకు జైలు శిక్ష లేదంటే జరిమానా, రెండూ కూడా విధించవచ్చు. ఎందుకీ చట్టం? రాజస్తాన్లో మృతదేహాలతో నిరసనలకు దిగడం సర్వసాధారణంగా మారిపోయింది. ప్రాణాలు కోల్పోయి వారం రోజులు గడిచినా దహన సంస్కారాలు నిర్వహించకుండా ఉద్యోగం కోసమో, డబ్బుల కోసమో ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. 2014–2018 మధ్య బీజేపీ హయాంలో ఇలాంటి ధర్నాలు 82 వరకు జరిగాయి. 30 వరకు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత 2019–2023 మధ్య కాలంలో మృతదేహాలతో ధర్నా కేసులు 306కి పెరిగాయి. అందుకే ఈ చట్టాన్ని తీసుకువచి్చనట్టుగా రాజస్తాన్ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్ చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ దీనిని వ్యతిరేకించింది. మృతదేహాలతో ధర్నాకు దిగారంటే వారిలో ఎంతటి ఆక్రోశం ఉందో అర్థం చేసుకోవాలే తప్ప వారి ఆగ్రహ ప్రదర్శనని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించింది. రాజస్తాన్లో కాంగ్రెస్ సర్కార్కు ఇక ప్రజలే అంతిమ సంస్కారం నిర్వహిస్తారంటూ బీజేపీ నేతలు వ్యంగ్యా్రస్తాలు సంధిస్తున్నారు. అయితే ఈ తరహా ఒక చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా రాజస్తాన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఆ మృతదేహాలు పదిలం ప్రమాదాలు, ఘర్షణలు ఇతర విపత్కర పరిస్థితుల్లో ఎవరైనా మరణించి వారి మృత దేహాన్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోని పక్షంలో ఆస్పత్రులు, జిల్లా యంత్రాంగం ఆ మృతదేహం కుళ్లిపోకుండా, దెబ్బ తినకుండా సకల జాగ్రత్తలతో ఫ్రీజర్లో భద్రపరచాలి. పెనాల్టీ మృతదేహాల మర్యాదకి ఏ మాత్రం భంగం కలిగిందని భావించినా వివిధ రకాల నేరాలకు వివిధ రకాల శిక్షలూ ఉంటాయి. కుటుంబసభ్యులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకోవడానికి నిరాకరించడం, మృతదేహాలతో నిరసన ప్రదర్శనలకి దిగడం, అలాంటి ప్రదర్శనలకు అనుమతులివ్వడం వంటివి నేరాల కిందకే వస్తాయి. ఆ నేరాలకు ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, అయిదేళ్లు ఇలా జైలు శిక్ష పడుతుంది డేటా బ్యాంకు ఈ బిల్లులో అన్నింటికంటే ముఖ్యమైన ది ఎవరూ గుర్తుపట్టని మృతదేహాల డేటా. ఎవరూ గుర్తు పట్టకుండా ఉన్న మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరిపించి జన్యుపరమైన వారి డేటాను ప్రభుత్వం భద్రపరచాలి. అలా గుర్తు పట్టని శవాలకు శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు నిర్వహించినప్పటికీ వారి అస్తికలు, జన్యుపరమైన వివరాలను ఒక డేటా బ్యాంకు ఏర్పాటు చేసి భద్రపరుస్తారు. జిల్లాల వారీగా డిజిటల్ డేటా బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అందులో మృతి చెందిన వారి వివరాలు ఉంచుతారు. పోలీసు స్టేషన్లలో వచ్చే మిస్సింగ్ కేసులతో ఆ డేటాను పోల్చడం ద్వారా కనిపించకుండా వెళ్లిన వారు ఏమయ్యారో అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక ఈ డేటాను అధికారులెవరైనా బయటపెడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..
బతికుండగానే ఓ వ్యక్తి తన అంత్యక్రియలు తానే నిర్వహించుకున్నాడు. తాను చనిపోయినప్పుడూ ఇక్కడే చివరి కార్యక్రమాలు చేయాలని అభ్యర్థించాడు. తద్దినం దగ్గర నుంచి దశదిన కర్మల వరకు అన్ని తానే నిర్వహించుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అతను ఎందుకిలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే.. అసలేం జరిగందంటే..యూపీలోని కేవాన్ గ్రామానికి చెందిన జటా శంకర్కి తన కుటుంబంతో చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తాను చనిపోతే అంత్యక్రియలు చేస్తారో లేదో అన్న భయంతో అన్ని కార్యక్రమాలను తాను బతికుండగానే తానే చేసుకున్నాడు. అందుకోసం తన భార్యతో దెబ్బలాడి మరీ ఒప్పించాడు. జూన్15 తాను చనిపోయిన 13వ రోజుగా తీర్మానించి తనకు తానుగా పిండం పెట్టుకున్నాడు. ఆ తర్వాత గ్రామస్తులకు గ్రాండ్గా విందు కూడా ఏర్పాటు చేశాడు. అంతేగాదు శంకర్ తన సమాధి కోసం ఓ కాంక్రీట్ ఫ్లాట్ఫాంని కూడా నిర్మించాడు. తన అంత్యక్రియలు అక్కడే జరగాలని శంకర్ తమతో చెబుతుండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. తరుచుగా తన కుటుంబంతో తగాదాలు జరగడంతో విరక్తి చెంది ఇంతటి దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు పలువురు చెబుతున్నారు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. (చదవండి: కెఫిన్ లేని కాఫీ గింజలు..హాయిగా సిప్ చేయొచ్చు) -
భర్త చనిపోయాడనుకుని విలవిలలాడింది..కట్ చేస్తే అతను..
భర్త చనిపోయాడనుకుని ఓ భార్య చాలా ఆవేదన చెందింది. ఒక పక్కా ఆమె అతడి కోసం కోర్టులో విడాకుల విషయమై పోరాడుతుంది. ఇంతలో సడెన్గా భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది. అతడి చివరి చూపుకోసం తపించిన భర్త తల్లిదండ్రులు ఆమెను రానివ్వలేదు. ఆ ఆవేదన నుంచి బయటపడలేక పోయింది. తీరా కొన్ని నెలల తర్వాత అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఈఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన అనెస్సా రోస్సీ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన తన భర్తతో పోరాడుతోంది. ఆమె విడాకులిచ్చేందకు సముఖంగా లేదు కూడా. అయితే అనూహ్యంగా తన భర్త చనిపోయాడన్న షాకింగ్ వార్త వచ్చింది. దీంతో ఆమె తన భర్త చనిపోయాడనుకుని చివరి చూపుకోసం అతడి ఇంటికి కూడా వెళ్లింది. అక్కడ అతడి తల్లిదండ్రులు అందుకు అంగీకరించ లేదు. దీంతో ఆమె చాలా పశ్చాత్తాపంతో ఆవేదన చెందింది. విడాకులు ఇచ్చేసినా.. బతికేవాడేమో అనుకుని విలపించింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలో కొన్ని నెలల క్రితం తన భర్త బతికే ఉన్నట్లు తెలుసుకుని షాక్కి గురయ్యింది. అతను మెక్సికోలో మరో గర్ల్ఫ్రెండ్తో ఉన్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. ఆఖరికి వేరో అమ్మాయితో ఉండేందుకు చనిపోయినట్లు నాటకం ఆడినట్లు తెలుసుకుని కుంగిపోయింది. ఈ విషయాన్ని ఆమె టిక్టాక్లో పంచుకుంది. దీన్ని తెలుసుకున్న ఆమె భర్త తానేమి నాటకాలు ఆడలేదని ఆమె విడాకులు ఇవ్వకపోవడంతో మెక్సికోలో గడిపేందుకు వెళ్లినట్లు సమర్ధించుకునే యత్నం చేశాడు. (చదవండి: రిషి సునాక్ విదేశీ పర్యటన ఖర్చు..కేవలం ఫ్లైట్ జెట్లకే రూ. 4 కోట్లు) -
స్నేహితుడి మరణం.. బోరున ఏడ్చేసిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్లో దర్శకనటుడు సతీష్ కౌశిక్(67) హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన మిత్రుడు, మరో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీటర్ ద్వారా వెల్లడించారు. సతీశ్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వీడియోలో సతీశ్ పార్థివదేహం వద్ద అనుపమ్ ఖేర్ బోరున విలపించారు. స్నేహితుని మరణాన్ని తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. సతీశ్ మృతిపట్ల అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ..' మేమిద్దరం మధ్యతరగతి కుటుంబాలకు చెందినవాళ్లం. సొంతంగా పేరు తెచ్చుకున్నందుకు గర్వపడుతున్నాం. ముంబై నగరం మాకు అవకాశం ఇచ్చింది. దాన్ని సాధించాం. కానీ ఇది జీర్ణించుకోవటం చాలా కష్టం. అతను చాలా చమత్కారి. ప్రతి విషయాన్ని తేలికగా అర్థం చేసుకునేవాడు. ఎలా జీవించాలనేది ప్రజలు అతని నుంచి నేర్చుకుంటారు. మమ్మల్ని అకాలంగా విడిచి వెళ్లాడనే పశ్చాత్తాపం నాకు ఎప్పటికీ ఉంటుంది.' అంటూ ఎమోషనలయ్యారు. అదేవిధంగా సతీశ్ కౌశిక్తో తనకు 45 నుంచి అనుబంధమని అనుపమ్ ఖేర్ తెలిపారు. కాగా.. 13 ఏప్రిల్ 1956లో హర్యానాలో పుట్టి, పెరిగిన సతీష్ కౌశిక్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్ ఖేర్తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు.. కమెడియన్గా, స్క్రీన్ రైటర్గా, దర్శకనిర్మాతగానూ ఆయన బాలీవుడ్లో రాణించారు. Anupam Kher Looses A True Friend 💔#AnupamKher #RipLegend #ShatishKaushik #ripshatishkaushik pic.twitter.com/wzbnQ0dR3Z — Yogeshnegi45 (@Yogeshnegi451) March 9, 2023 -
K Viswanath Funeral: ముగిసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ అంత్యక్రియలు
సినీ దిగ్గజం కళాతపస్వి శకం ముగిసింది. లెజెండరీ డైరెక్టర్ కె. విశ్వనాథ్(92)మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ, గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచిన కళాతపస్వి ఇక లేరన్న వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కె. విశ్వనాథ్ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు పూర్తి
అలనాటి అందాల తార జమున అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె కూతురు స్రవంతి జమునకు దహన సంస్కారాలు నిర్వహించింది. జమున మరణంతో ఇండస్ట్రీలో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున ఈరోజు ఉదయం హైదరాబాద్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెను కడసారి చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్ఛాంబర్లోని ఆమె భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. లక్ష్మీ పార్వతి, తమ్మా రెడ్డి భరద్వాజ, మురళి మోహన్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు తదితరులు నివాళులు అర్పించారు. -
చితి మంటల్లోనూ ఒక్కటిగా..
సాక్షి, ప్రత్తిపాడు: ఎన్నో ఆశలు.. మరెన్నో ఆశయాలతో పరాయి దేశం వెళ్లారు. పగలూ రాత్రీ కష్టపడ్డారు. ఇద్దరు పిల్లాపాపలతో జీవితం ప్రశాంతంగా ముందుకు సాగుతున్న వేళ విధికి కన్నుకుట్టినట్లుంది. వారిపై విషం చిమ్మింది. మంచు గడ్డల రూపంలో మృత్యువు కాపు కాసి భార్యాభర్తలిద్దరినీ కానరాని లోకాలకు తీసుకువెళ్లి, వారి ఇద్దరి కుమార్తెలను ఒంటరులను చేసింది. అమెరికాలో దుర్మరణం పాలైన తెలుగు దంపతుల అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య జరిగాయి. అసలేం జరిగిందంటే.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత దంపతులు ఉద్యోగ రీత్యా ఏడేళ్లుగా అమెరికాలోని అరిజోనాలో ఉంటున్నారు. ఈ నెల 26న సెలవు కావడంతో పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలో దంపతులు సరస్సులో గల్లంతై, చివరకు మృత్యుఒడికి చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలు అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నాయి. టీసీఎస్ కంపెనీ సహకారంతో సోమవారం ఉదయం అమెరికాలోని డల్లాస్ నుంచి మృతదేహాలను హైదరాబాద్కు విమానంలో తరలించారు. అక్కడి నుంచి అంబులెన్సులో పాలపర్రులోని స్వగ్రామానికి తీసుకువచ్చారు. వారి పిల్లలను రెండు రోజుల కిందటనే తీసుకువచ్చారు. నారాయణ, హరిత దంపతుల మృతదేహాలను చూడగానే రోదనలు మిన్నంటాయి. బిడ్డా.. ఇక నుంచి మాకు ఫోన్లు ఎవ్వరు చేస్తారు.. అంటూ నారాయణ తల్లి వెంటరత్నం విలపించింది. హరిత తల్లిదండ్రులూ కన్నీరుమున్నీరయ్యారు. నారాయణ, హరిత పిల్లలు పూజిత, హర్షిత నిర్జీవంగా ఉన్న తల్లిదండ్రులను చూసి దిగాలుగా ఉండిపోయారు. నారాయణ, హరిత దంపతుల చితిలను ఒక్కచోటే పేర్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. వారిని ఆఖరి చూపు చూసేందుకు ఊరంతా కదిలివచ్చింది. భౌతికకాయాల వద్ద ఎమ్మెల్సీ లక్ష్మణరావు నివాళులరి్పంచారు. (చదవండి: రాజమండ్రి: తక్షణ సాయం.. సీఎం జగన్ సాయం జీవితాంతం మరువలేనిది) -
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు
-
తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ
-
తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ
గాంధీనగర్: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మోదీ అశ్రునయనాలతో తన తల్లి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్థివ దేహం వద్ద కూర్చుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం గాంధీనగర్లోని ముక్తిధామ్ శ్మశానవాటికిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హీరాబెన్ చితికి నిప్పంటించి అక్కడి నుంచి వెనుదిరిగారు మోదీ. హిరాబెన్ అంతిమయాత్రకు కుటుంబసభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందు గాంధీనగర్లోని నివాసంలో తన తల్లి పార్ధీవ దేహానికి పుష్పాంజలి ఘటించారు మోదీ. కడసారి నివాళులు అర్పించారు. #WATCH | Gandhinagar: Prime Minister Narendra Modi carries the mortal remains of his late mother Heeraben Modi who passed away at the age of 100, today. pic.twitter.com/CWcHm2C6xQ — ANI (@ANI) December 30, 2022 #WATCH | Gujarat: Heeraben Modi, mother of PM Modi, laid to rest in Gandhinagar. She passed away at the age of 100, today. (Source: DD) pic.twitter.com/wqjixwB9o7 — ANI (@ANI) December 30, 2022 ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకొన్న హీరాబెన్ మోదీ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గుజరాత్ అహ్మదాబాద్లోని ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. తన తల్లి మరణించిన విషయాన్ని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. భారమైన హృదయంతో సందేశాన్ని రాసుకొచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు పూర్తి
-
ప్రభుత్వ లాంఛనాలతో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు
-
కైకాల నివాసం నుండి ప్రారంభమైన అంతిమ యాత్ర
-
పెద్ద కొడుకు చేతుల మీదుగా కైకాల అంత్యక్రియలు
Kaikala Satyanarayana Funeral Live Updates: ►కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. హిందూ సాంప్రదాయ పద్దతిలో తంతు ముగించారు. ►కైకాల సత్యన్నారాయణకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ ►చివరిచూపు కోసం తండోపతండాలుగా వచ్చిన కైకాల అభిమానులు.. ► మహా ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ► కైకాల భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు ► కైకాల సత్యనారాయణ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల శుక్రవారం తెల్లవారుజామున ఫిల్మ్నగర్లోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. అయితే నేడు(శనివారం)ఉదయం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం భౌతికకాయన్ని 10.40కి ఫిలిం చాంబర్కు తరలించనున్నారు. అటు నుంచి 11.30గంటలకు మహాప్రస్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి. -
కృష్ణ అంతిమయాత్ర ప్రారంభం
-
గుండెల్ని కదిలించేలా.. ఈపాటి విశ్వాసం మనిషికెక్కడిది?
మనిషికి విశ్వాసం ఏమాత్రం?.. మూగజీవాలతో పోలిస్తే మాత్రం చాలా చాలా తక్కువే!!. ఇది నిరూపించే ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా. ఇన్నాళ్లూ తన కడుపు నింపిన వ్యక్తి చనిపోవడంతో, ఈ కొండముచ్చు ఇలా ఆయన శవం దగ్గరే ఉండిపోయింది. ఆప్యాయంగా ఆయన్ని చూస్తూ.. హత్తుకుని.. కాసేపు అక్కడే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. శ్రీలంక బట్టికలోవాలోని తలంగూడ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల పీతాంబరం రాజన్.. అడవి నుంచి వచ్చిన ఓ కొండముచ్చుకు రోజూ తిండి పెట్టేవారట. అక్టోబర్ 17న ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. ఆయన పార్థీవ దేహాన్ని గ్రామస్థుల సందర్శన కోసం ఉంచగా.. ఆ కొండముచ్చు ఇలా తన విశ్వాసం.. ప్రేమను ప్రదర్శించింది. మరో ఘటనలో.. నంద్యాల డోన్ పట్టణం పాతపేటలో తనకు తిండి పెట్టిన ఓ మహిళ చనిపోతే శవయాత్రలో ఆ కొండ ముచ్చు పరుగులు తీసిన వీడియో ఒకటి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. బలిజ లక్ష్మీదేవి అనే మహిళ బజ్జీల కొట్టు నడిపిస్తోంది. ఓ కొండముచ్చు రోజూ ఆమె దుకాణం వద్దకు వచ్చేది. అలా రోజూ వచ్చే కొండముచ్చుకు.. మంగళవారం నాడు లక్ష్మీదేవి కనిపించలేదు. ఆకస్మాత్తుగా ఆమె గుండెపోటుతో మరణించడంతో బంధవులు అంత్యక్రియల కోసం శవయాత్రను ఓ వాహనంలో నిర్వహించారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. ఆ కొండముచ్చు ఆ వాహనం వెంట పరుగులు తీయడాన్ని కొందరు రికార్డు చేసి వైరల్ చేశారు. All lives, #animals #birds #plants have intelligence & emotions. #Monkey mourns death of man who fed every day. By kissing him. Touching. Happened in #Srilanka. Mattaglabbu. pic.twitter.com/nBLKEW2JUZ — Straight Talk India (@sttalkindia) October 20, 2022 -
అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు
లక్నో: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సైఫాయ్లో జరిగాయి. అంతిమ యాత్రకు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు. 'నేతాజీ అమర్ రహే' నినాదాలతో సైఫాయ్ గ్రామం మారుమోగింది. అంతకుముందు భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ములాయం భౌతికకాయాన్ని సందర్శించేందుకు వేలాది మంది వెళ్లారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసుకున్నారు. అనంతరం ములాయం భౌతికకాయాన్ని ఓ వాహనంలో అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్ సహా కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. #WATCH | A large sea of people chants "Netaji amar rahein" as a vehicle carries the mortal remains of Samajwadi Party (SP) supremo and former Uttar Pradesh CM #MulayamSinghYadav for his last rites, in Saifai, Uttar Pradesh. pic.twitter.com/RMCzht2uI3 — ANI (@ANI) October 11, 2022 గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ములాయం సోమవారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల దేశంలోని రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ములాయం భౌతికకాయాన్ని హోంమంత్రి అమిత్షా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సందర్శించి నివాళులు అర్పించారు. చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం -
నాటకీయ పరిణామాల మధ్య అంకిత అంత్యక్రియలు
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్లో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రిసెప్షనిస్ట్ అంకిత భండారీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మొదట పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆమె భౌతిక కాయాన్ని మార్చురీ నుంచి తీసుకెళ్తామని చెప్పిన కుటుంబసభ్యులు .. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. అంకిత హత్య కేసు విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేయడమే గాక, తుది పోస్టుమార్టం నివేదికను బహిరంగంగా వెల్లడిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామీ హామీ ఇచ్చారు. దీంతో అంకిత భౌతిక కాయాన్ని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు తల్లిదండ్రులు. అయితే ఈ కార్యక్రమానికి స్థానికులను ఎవరినీ అనుమతించలేదు. మరోవైపు అంకిత తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లినప్పుడు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అంకితకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అంకిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం ధామీ చెప్పారు. బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్యకు చెందిన రిసార్టులో రిసెప్షనిస్ట్గా పనిచేసే అంకిత భండారీ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత ఆదివారం అదృశ్యమైన ఆమె శనివారం కాలువలో శవంగా లభించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంకిత్ ఆర్యను విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అంకిత్తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు రిసార్టు సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. -
బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంతిమయాత్రను అధికారిక లాంఛనాలతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. రాణి భౌతికకాయం ఉన్న వెస్ట్మినిస్టర్ అబెలో కుటుంబసభ్యులు సోమవారం తుది ప్రార్థనలు చేశారు. అనంతరం భారీ జన సందోహం మధ్య ఆమె శవపేటికను విండ్సోర్ కాస్టిల్కు తరలించారు. అక్కడే ఖననం చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచ దేశాల అధినేతలు కలిపి మొత్తం 2000 మంది విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. లండన్లోని 125 థియేటర్లరో రాణి అంత్యక్రియలను లైవ్ ప్రదర్శన చేశారు. బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా ఉన్న 96 ఏళ్ల ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న స్కాట్లాండ్లోని బల్మోరల్ కోటలో కన్నుమూశారు. దీంతో రాజకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రపంచ దేశాలు రాణి మృతి పట్ల సంతాపం తెలిపాయి. రాణి వారసుడిగా ఆమె కుమారుడు కింగ్ చార్లెస్-3 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: రాణి చనిపోయింది కాబట్టి మా వజ్రాలు మాకిచ్చేయండి! -
Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమ యాత్ర (ఫొటోలు)
-
కృష్ణంరాజు పార్థివదేహాన్ని మోసిన భార్య.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కడసారి చూపుకోసం అభిమానులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మొయినాబాద్లోని కనకమామిడి ఫామ్హౌజ్లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇప్పటికే ఆయన అంతియాత్ర ప్రారంభమైంది. అయితే ఆయన నివాసం నుంచి ఫామ్హౌజ్కు భౌతికకాయాన్ని తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతమైన దృశ్యాలు కలిచివేస్తున్నాయి. చదవండి: కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా? పార్థివదేహాన్ని మోసుకెళ్లేటప్పుడు సాధారణంగా మహిళలు ముందుకు రారు. కానీ శ్యామలాదేవి మాత్రం తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కృష్ణంరాజు, శ్యామలా దేవిల మధ్య మంచి అనుబంధం ఉండేది. ఇండస్ట్రీలో ఆది దంపతులుగా పేరు సంపాదించుకున్న ఈ జంట ఏ కార్యక్రమానికి వెళ్లినా కలిసేవెళ్లేవారు. అంతేకాకుండా కృష్ణంరాజుగారే నాకు పెద్ద గిఫ్ట్ అని పలు సందర్భాల్లో శ్యామలా దేవి చెబుతుండేవారు. కృష్ణంరాజు పార్థివదేహాన్ని చూసి ఆయన సతీమణి శ్యామలా దేవి విలపించిన దృశ్యాలు హృదయవిదాకరంగా ఉన్నాయి. చదవండి: కృష్ణంరాజు అంతిమయాత్ర.. అంత్యక్రియలకు వాళ్లకు మాత్రమే అనుమతి -
అశ్రునయనాల మధ్య ముగిసిన రారాజు అంత్యక్రియలు
Krishnam Raju Last Rites At Moinabad Latest Updates: ►రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు ముగిశాయి. ఆశ్రునయనాల మధ్య ఆయనకు కుటుంబసభ్యులు తుది వీడ్కోలు పలికారు. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు నిర్వహించారు. ►ప్రారంభమైన అంత్యక్రియలు ప్రముఖ నటుడు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ప్రారంభమయ్యాయి. తమ అభిమాన నటుడ్ని కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే కేవలం కుటుంబసభ్యులు, బంధుమిత్రలను మాత్రమే ఫామ్హౌజ్లోకి అనుమతించారు. ఇక కృష్ణంరాజుకు ప్రభాస్తో పాటు మిగతాకుటుంబసభ్యులు కడసారి వీడ్కోలు పలికారు. . ►రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రభుత్వ లాంఛనాలతో జూబ్లిహిల్స్లోని ఆయన నివాసం నుంచి మెయినాబాద్ ఫామ్హౌజ్కు అంతిమ యాత్ర మొదలైంది. కడసారి చూపు కోసం ఆయన అభిమానులు దారిపొడవునా ఎదురుచూస్తున్నారు. మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో కృష్ణంరాజు ఫామ్హౌజ్లోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాలు జరగనున్నాయి. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు కడసారి చూపుకోసం భారీగా అభిమానులు తరలివస్తున్నారు. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తగా అంత్యక్రియలకు కేవలం కుటుంసభ్యులు,బంధువులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు తొలుత భావించినా, పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ చేతుల మీదుగా సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ► మొయినాబాద్ కనకమామిడిలో ఉన్న ఫాంహౌజ్లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి. ► ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్న కృష్ణంరాజు అంత్యక్రియలు. ► బీఎన్ఆర్ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా అంతిమయాత్ర సాగనుంది. ► అప్పా జంక్షన్ మీదుగా మొయినాబాద్కు అంతిమయాత్ర చేరుకుంటుంది. ► దారిపొడవునా ఉన్న రెబల్స్టార్ ఫ్యాన్స్.. పూలు జల్లుతూ నివాళులర్పిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సినీ, రాజకీయాల్లో రారాజు.. కృష్ణంరాజు: మంత్రి రోజా
సాక్షి, హైదరాబాద్: కృష్ణంరాజు భౌతికకాయానికి సోమవారం నివాళులర్పించారు ఏపీ మంత్రులు. నివాళులు అర్పించిన వాళ్లలో మంత్రులు కారుమూరి, వేణుగోపాలకృష్ణ, రోజా తదితరులు ఉన్నారు. ఈ సందర్భగా.. పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు రారాజు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారి అకాల మరణం బాధాకరం. ఈ వార్త తెలిసి.. ముఖ్యమంత్రి జగన్ చాలా దిగ్భ్రాంతి చెందారు. కృష్ణంరాజుగారు.. రాజకీయాలకు అతీతంగా అందరితో స్నేహ పూర్వకంగా వుండేవారు. ఏపీ తరపున మా మంత్రుల బృందం ఆయనకు నివాళులర్పించింది. మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగాల్లో కృష్ణంరాజు సేవలు మరువలేనివి. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై వుండేవారు. ప్రసాద్ రాజు మాట్లాడుతూ.. కృష్ణంరాజు మరణం చాలా బాధాకరం. ఆపదలో వున్న ఎవరికైనా సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి కృష్ణంరాజు. సూర్య చంద్రులు వున్నంత వరకు అయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గా మిగిలిపోతారు. విశ్వరూప్ మాట్లాడుతూ.. కృష్ణంరాజుగారు సినీ పరిశ్రమలో ఓ ధృవ తారా. నర్సాపురం లో ఏ గ్రామానికి వెళ్లిన ఆయన జాడలు కనిపిస్తాయి. రాజకీయాలలో హుందా కలిగిన వ్యక్తి. ఇదిలా ఉంటే.. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరపు నుంచి వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: రెబల్స్టార్ మృతి పట్ల ఏపీ ప్రముఖుల సంతాపం -
కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు!
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. కాగా నేడు(సోమవారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు భావించారు. అయితే.. పండితుల సూచన మేరకు ఆ తర్వాత స్వల్ప మార్పులు చేశారు. మధ్యాహ్నం జరగాల్సిన అంత్యక్రియలను సాయంత్రానికి మార్చారు. ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్నాహ్నం ఒంటిగంటకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. తమ అభిమాన నటుడు కృష్ణంరాజు చివరి చూపు కోసం అభిమానులు భారీగా తరలిస్తున్నారు. చదవండి: ఆ ఐదు కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణంరాజు ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు మొయినాబాద్ మండలంలోని కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. అక్కడ నివసించేందుకు ఓ ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. అయితే అది పూర్తి కాకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రులు వేణుగోపాలకృష్ణ, రోజా, కారుమూరి, చీఫ్ విప్ ప్రసాదరాజు హాజరు కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: కృష్ణంరాజు ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్నా.. -
మానవత్వమే మనిషికి ముఖ్యం!
వైరల్: మత సామరస్యం.. మతోన్మాదులకు మింగుడు పడని విషయం. కష్టకాలంలో మనిషి.. మతానికి ఓటేస్తాడా? మానవత్వానికి ఓటేస్తాడా? మనిషంటే ఒక నమ్మకం.. ఆత్మీయత, అంతకు మించి అభిమానం. మానవత్వం ఎంతో గొప్పది. ఎందుకనో టీవీల్లో కూడా సరైన విషయాలను చూపించరు. ఒక పిల్లవాడు గాయపడితే.. ముందు అతన్ని పైకి లేపుతాం. గాయానికి మందు వేసి అతన్ని ఓదారుస్తాం. అంతేగానీ.. ఏ మతం బాబూ నీది అని అడగం. అసహ్యించుకోం. హిందువులు మా ఇంట కార్యక్రమాలకు హాజరవుతారు. అదే విధంగా మేం వాళ్ల కార్యక్రమాలకు హాజరవుతాం... దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై మొహమ్మద్ రిజ్వాన్ ఖాన్ చెప్తున్న మాటలివి. రిజ్వాన్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాడు. తన దుకాణంలో పని చేసే రామ్దేవ్ షా అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాడు రిజ్వాన్. బీహార్ రాజధాని పాట్నాలో రిజ్వాన్కు ఓ కుట్లు అల్లికల ఉత్పత్తుల షోరూం ఉంది. తన దగ్గర పాతికేళ్ల పాటు నమ్మకంగా పని చేసిన రామ్ దేవ్ షా ఈ మధ్యే వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలిసిన రిజ్వాన్.. ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. ఆ పెద్దాయన పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. రిజ్వాన్తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అంతిమ యాత్ర సమయంలో వెంటే ఉన్నారు. ‘‘పాతికేళ్ల కిందట ఓ పెద్దాయన రిజ్వాన్ దుకాణానికి వచ్చి పని ఏమైనా ఉందా? అని అడిగాడు. మోటు పని చేయలేవులే అన్నాను. లెక్కలు రాసే పని అయినా ఇమ్మని బతిమాలాడు. ఆయనెంతో సాదాసీదాగా కనిపించాడు. అందుకే పని ఇచ్చా. ఇరవై ఏళ్లకు పైగా ఆయన నా దగ్గరే పని చేశారు. వయసు రిత్యా ఇబ్బందులతో బాధపడుతుంటే.. నెల నెల కొంత డబ్బు పంపించా. షా నాకు తండ్రి లాంటి వారు. నాకు ఒక పెద్ద దిక్కు. ఆయన కుటుంబం.. మా కుటుంబంతో సమానం. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నాకు చేతనైన రీతిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అంటూ గద్గద స్వరంతో మాట్లాడాడు రిజ్వాన్. ఎన్డీటీవీ సౌజన్యంతో.. -
పాడె మోసి మాట నిలబెట్టుకున్న నటుడు.. ఎమోషనల్గా పోస్ట్..
Randeep Hooda Performs Last Rites Of Sarabjit Singh Sister Dalbir Kaur: బాలీవుడ్ ప్రముఖ నటుల్లో రణ్దీప్ హుడా ఒకరు. తాజాగా పంజాబ్కు చెందిన సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ పాడెను మోసి, అంత్యక్రియలు నిర్వహించాడు. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణల కింద సరబ్జిత్ సింగ్కు పాకిస్తాన్ సుప్రీం కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అతని బయోపిక్గా 2016లో తెరకెక్కిన 'సరబ్జిత్' సినిమాలో సరబ్జిత్ సింగ్ పాత్రలో రణ్దీప్ హుడా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్కు రణ్దీప్ హుడాకు మంచి అనుబంధం ఏర్పడింది. రణ్దీప్ హుడాలో తన సోదరుడు సరబ్జిత్ సింగ్ను చూసుకుంటున్నట్లుగా ఆమె అతనితో చెప్పింది. ఈ క్రమంలోనే రణ్దీప్ హుడాను దల్బీర్ కౌర్ ఒక కోరిక కోరింది. తాను చనిపోయినప్పుడు ఆమెకు 'కంధ' (అంత్యక్రియలకు తీసుకువెళ్లేటప్పుడు భుజంపై పాడెను మోయడం) ఇవ్వాల్సిందిగా అడిగింది. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లుగా ఒక సోదరుడిలా దల్బీర్ కౌర్ దహన సంస్కరాలు నిర్వహించాడు రణ్దీప్. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) ఈ విషయంపై తన ఇన్స్టాలో ఆమె చివరిసారిగా చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ 'నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కానీ నేను వెళ్లేసరికి ఆమె వెళ్లిపోయింది. దల్బీర్ కౌర్జీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి పెడతారని అనుకోలేదు. ఆమె తన ప్రియమైన సోదరుడు సరబ్జిత్ సింగ్ను కాపాడుకునేందుకు ఎంతో పోరాటం చేసింది. ఆమె ప్రేమ, ఆశీర్వాదం నాపై ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. ఆమె కట్టిన రాఖీని నా జీవితంలో మర్చిపోలేను.' అని ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. కాగా దల్బీర్ కౌర్ పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో ఉన్న భిఖివింద్లో ఆదివారం (జూన్ 26) గుండెపోటుతో మరణించింది. -
బప్పి లహరి అంత్యక్రియలు వాయిదా.. కారణమిదే
లెజెండరీ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి మృతిపై బాలీవుడ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 27, 1952న పశ్చిమ బెంగాల్లో జన్మించిన బప్పి లహిరి అన్ని భాషల్లో కలిపి 5వేలకు పైగా పాటలు పాడారు. సంగీతానికి వెస్టర్న్ మ్యూజిక్ మిక్స్ చేసి మైమరపించిన సంగీత దిగ్గజం బప్పి లహరి అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు రేపు(గురువారం)నిర్వహించనున్నారు. చదవండి: మరణానికి ముందు.. బప్పి షేర్ చేసిన చివరి పోస్ట్ ఇదే బప్పి లహరి కుమారుడు బప్పా లహరి ప్రస్తుతం లాస్ ఏంజిల్స్లో ఉంటున్నారు. తండ్రి మరణవార్త తెలిసి హుటాహుటిన భారత్కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో కుమారుడు వచ్చాకే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో రేపు ముంబైలో బప్పి లహరి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చదవండి: బప్పి లహరికి బంగారం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? -
గానకోకిల లతా మంగేష్కర్కు కన్నీటి వీడ్కోలు..
Lata Mangeshkar funeral live updates: ముగిసిన అంత్యక్రియలు ►కన్నీటి వీడ్కోలతో లతా మంగేష్కర్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో ఆమెకు ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ►లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. లతాజీ భౌతికకాయానికి మోదీ నివాళులు అర్పించారు. ►సచిన్ టెండ్కూర్ ఆయన సతీమణి లతా మంగేష్కర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. లెజెండరీ సింగర్, భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ మరణం యావత్ సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఎన్నో పాటలకు తన గొంతుతో ప్రాణం పోసిన ఆ గానకోకిల మూగబోయిందని తెలిసి అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఇక చివరిసారిగా ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు సహా అభిమానులు తరలివచ్చారు. అంతకుముందు ముంబైలోని లతాజీ నివాసం నుంచి శివాజీ పార్కు వరకు అంతిమయాత్ర సాగింది. ఈ నేపథ్యంలో లెజెండరీ సింగర్కు తుది వీడ్కోలు పలికేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ముంబైలోని శివాజీ పార్క్లో సాయంత్రం 6.15 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అధికారింగా ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రమేశ్బాబు భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు ఫొటోలు
-
కన్నకొడుకు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణ
Super Star Krishna Cried After Seeing Ramesh Babu For Last Time, Video Viral: సూపర్స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్లోని మహా ప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అయితే అంతకుముందు పద్మాలయ స్టూడియోస్లో రమేశ్ బాబు భౌతికకాయాన్ని కాసేపు ఉంచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అయితే కొడుకును కడసారి చూసేందుకు అక్కడికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కుమారుడి భౌతికకాయన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. 56 ఏళ్ల వయసులోనే కొడుకు చనిపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. -
మహాప్రస్థానంలో ముగిసిన రమేశ్ బాబు అంత్యక్రియలు
Ramesh Babu Last Rites Performed In Maha Prasthanam: సూపర్స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు (56)అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ చితికి నిప్పు పెట్టి తుది వీడ్కోలు పలికారు. కోవిడ్ నిబంధనలతో అతికొద్దిమందితో అంత్యక్రియలు పూర్తి చేశారు. నటుడు నరేష్, తమ్మారెడ్డి భరద్వాజ సహా కొందరు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న మహేశ్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.కాగా కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రమేష్ బాబు అంత్యక్రియలు
-
Rosaiah Last Rites : మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
-
ముగిసిన మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలు
Live Updates ► మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ముగిశాయి. కొంపల్లి రోశయ్య ఫాంహౌస్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రోశయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం రోశయ్య చితికి పెద్ద కుమారుడు శివ సుబ్బారావు నిప్పంటించారు. ►ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చితి వద్దకు మాజీ సీఎం రోశయ్య పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ►అధికారిక లాంఛనాలతో రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కడసారి చూసేందుకు నేతలు భారీగా తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ►గాంధీభవన్ నుంచి ప్రారంభమైన రోశయ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో హైదరాబాద్ శివార్లోని దేవరయాంజాల్లోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ►రోశయ్య పార్థివదేహం గాంధీభవన్కు చేరుకుంది. కాసేపట్లో దేవరయాంజాల్ ఫాంహౌస్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రోశయ్య పార్థివదేహానికి పలువురు నేతలు నివాళులర్పించారు. రోశయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య పార్థివదేహానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్,పేర్ని నాని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు, సినీనటుడు చిరంజీవి నివాళులర్పించారు. రోశయ్య అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నారు. మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియలను మధ్యాహ్నం ఒంటిగంటకు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. రోశయ్య పార్థవదేహాన్ని ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలమైన గాంధీభవన్కు తీసుకెళ్లనున్నారు. సందర్శన తర్వాత హైదరాబాద్ శివార్లోని దేవరయాంజాల్లోని వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు. మధ్యాహం అక్కడ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సిరివెన్నెల అంత్యక్రియలు ఫోటోలు
-
శివశంకర్ మాస్టర్ పాడె మోసిన ఓంకార్
Anchor Omkar At Shiva Shankar Master Last Rites Video Goes Viral: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అంత్యక్రియలు సోమవారం(నవంబర్29)న పూర్తయ్యాయి. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ‘మహాప్రస్థానం’లో ఆయన చిన్న కుమారుడు అజయ్.. శివశంకర్ మాస్టర్ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు పంచవటి కాలనీలోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై శివశంకర్ మాస్టర్కు నివాళులు అర్పించారు. కాగా అంత్యక్రియలకు హాజరైన ప్రముఖ యాంకర్, దర్శకనిర్మాత ఓంకార్తో పాటు ఆయన తమ్ముడు అశ్విన్ బాబు శివశంకర్ మాస్టర్ పాడె మోశారు. అంత్యక్రియల ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కాగా ఓంకార్- శివశంకర్ మాస్టర్ కాంబినేషన్లో వచ్చిన డ్యాన్స్ షోలు అప్పట్లో సూపర్ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరికీ మంచి అనుబంధం ఉంది. ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా కొరియోగ్రాఫర్గా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకర్ మాస్టర్ తమిళం, తెలుగులో ఎన్నో చిత్రాలకు కొరియోగ్రాఫర్గా పనిచేశారు. -
పునీత్కు కన్నీటి వీడ్కోలు
-
పునీత్ రాజ్కుమార్కు నివాళులర్పించిన ఎన్టీఆర్
Puneeth Rajkumar Funerals: పునీత్ రాజ్కుమార్ భౌతికకాయానికి జూ. ఎన్టీఆర్ నివాళులర్పించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి చేరుకున్న ఆయన పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పునీత్ సోదరుడు శివరాజ్ను ఓదార్చారు. మరికాసేపట్లో చిరంజీవి బెంగళూరుకు చేరుకోనున్నారు.ఇప్పటికే బాలకృష్ణ పునీత్ భౌతికకాయాన్ని సందర్శించి, ఆయనకు నివాళులు అర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి బాలయ్య కంటతడి పెట్టుకున్నారు. ఆయనతో పాటునరేశ్, శివబాలాజీ పునీత్కు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్కుమార్న కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు బెంగళూరుకు చేరుకుంటున్నారు. పేరుకు కన్నడ హీరో అయినప్పటికి పునీత్ రాజ్కుమార్కు టాలీవుడ్ హీరోలతో మంచి అనుబంధం ఉంది. దీంతో ఆయనను చివరిసారిగా చూసేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. చదవండి: Puneeth Rajkumar: పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ ఇదే! శోక సంద్రంలో పునీత్ రాజ్కుమార్ అభిమానులు... వారి భయమే నిజమైంది -
హియర్ ఐ యామ్ : 1400 కోవిడ్ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు
బెంగళూరు: సమాజంలో గత ఏడాది కాలంగా అంతిమ సంస్కారాల తీరే మారిపోయింది. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలకు అంత్యక్రియలు ప్రసహనంగా మారింది. అయితే ఈ విపత్కర పరిస్థితిలో ఎంతో మంది తమ వంతు బాధ్యతగా సేవ చేస్తున్నారు. అందరినీ చేరుకోలేకపోయినా అందుబాటులో ఉన్న కొంతమందికి ’’హియర్ ఐ యామ్’’ అని సహాయ పడుతూ మానవత్వాన్ని చాటుతున్నారు. కోవిడ్ మృతుల కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి బెంగళూరు ఆర్చ్ డియోసెస్ ఆధ్వర్యంలో "కోవిడ్ లాస్ట్ రైట్స్ అండ్ ఫ్యూనరల్ స్క్వాడ్" బృందాన్ని ఏర్పాటు చేసింది. 1400 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు కరోనా వైరస్ కారణంగా బెంగళూరులో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనా మొదటి సెకండ్ వేవ్లో ’’హియర్ ఐ యామ్’ అనే బెంగళూరుకు చెందిన బృందం 1400 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకుంది. ఒక్క సెకండ్ వేవ్లోనే 800 మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హియర్ ఐ యామ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ మాట్లాడుతూ.. 60 నుంచి 70 మంది వాలంటీర్లను ఓ నాలుగు జోన్లుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వాలంటీర్లు వేర్వేరు శ్మశానవాటికలలో ఉంటారని పేర్కొన్నారు. ఇక పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్లను ఎలా వాడాలి అనే దానిపై శిక్షణ తీసుకున్నామని వివరించారు. కోవిడ్తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఎలా తాకాలి, దూరం ఎలా ఉంచుకోవాలి అనే వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లు చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకు ఎరరైనా కోవిడ్తో చనిపోతే ఆ మృతదేహాలను ప్యాక్ చేయడానికి, ఆస్పత్రులు, ఇంటి నుంచి మృతదేహాలను తరలించడానికి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. తేకాకుండా ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు. ఇక ఎవరైనా పేదవాళ్లు ఉంటే ఉచితంగా శవపేటిక ఇచ్చి, సమాధి తవ్విన వారికి చెల్లిస్తున్నారు. అంతే కాకుండా కరోనా మృతదేహాలను తరలించేందుకు సహాయపడుతూ శ్మశాన వాటికల్లో చివరి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. చదవండి: దారుణం: నాలుగేళ్లుగా ఆశ్రమంలోని పిల్లలపై లైంగిక వేధింపులు -
పాడె మోసేందుకు ఒక్కడు రాలేదు, తినడానికి 150 మంది వచ్చారు
పాట్నా : సాటి మనిషికి కష్టమొస్తే.. అండగా నిలిచి మానవత్వం చూపాల్సిన వాళ్లే రాబందుల కన్నా హీనంగా వ్యవహరించారు. రాబందులన్నా.. కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రాబందులు బతికున్న వాళ్లను పీక్కుతింటున్నారు. అనాథలైన పిల్లలకు తలో చేయ్యేసి మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన తరుణంలో వీరు తలో చేయ్యేసి వారి సొమ్మును కాజేసి వాటాలు పంచుకున్నారు. బిహార్ అరియా జిల్లాలో బిష్ణుపుర గ్రామపంచాయితీకి చెందిన ముగ్గురు చిన్నారులు సోని(18) నితీష్ (14 ), చాందిని (12)లు నాలుగు రోజుల వ్యవధిలో తల్లితండ్రుల్ని కోల్పోయి అనాథలయ్యారు. అనారోగ్యంతో తండ్రి బిరేంద్ర సింగ్, కరోనాతో తల్లి ప్రియాంక దేవి మరణిస్తే అంత్యక్రియల్ని నిర్వహించేందుకు 18ఏళ్ల కుమార్తె గ్రామస్తుల సాయం కోరింది. ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని ఆ బాలిక తల్లి మృతదేహాన్ని తన ఇంటి సరిహద్దుల్లోనే అంత్యక్రియలు నిర్వహించింది. కానీ తల్లిదండ్రుల ఆత్మశాంతి కోసం నిర్వహించిన దశదిన కర్మకు భోజనం చేసేందుకు 150 మంది గ్రామస్తులు వచ్చారు. భోజనం చేసిన అనంతరం తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ కు తాము ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అందినకాడికి అభంశుభం తెలియని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి వాటాలు పంచుకోవడం పలువురిని కంటతడిపెట్టిస్తోంది. ఈ సందర్భంగా పెద్దకుమార్తె సోని మాట్లాడుతూ.. ‘నా తండ్రి అనారోగ్యంతో మరణించారు. తల్లి కరోనాతో మరణించింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తుల్ని సాయం కోరితే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ దశదిన కర్మకు 150 మంది గ్రామస్తులు వచ్చారు. ఇంతమంది వస్తారని ఊహించలేదు. వచ్చిన వాళ్లు తండ్రి ట్రీట్మెంట్కు డబ్బులు ఇచ్చామని, ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని మాపై ఒత్తిడి తెచ్చారంటూ’ ఆ బాలిక కన్నీటి పర్యంతరమైంది. చదవండి: పేరుకే గుమస్తా, ఇంట్లో ఎటు చూసినా బంగారమే -
పారిపోయిన కొడుకు.. అత్తకు కోడలు అంతిమ సంస్కారాలు
పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న వీరిద్దరు మహిళలు. కన్నతల్లి శవాన్ని తాకడానికి కొడుకే భయపడగా, కోడలే తోడుగా నిలిచి మరో మహిళతో కలిసి అత్త అంత్యక్రియలు పూర్తిచేసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చర్లపల్లికి చెందిన కె.బుచ్చమ్మ (75)కు ఇద్దరు కుమారులు. పెద్దకొడుకు చనిపోగా, అతని భార్య సునీత అత్త బుచ్చమ్మతో కలిసి ఉంటోంది. బుచ్చమ్మ సోమవారం కరోనాతో ఇంట్లోనే చనిపోయింది. ఇది తెలిసి ఆమె రెండో కుమారుడు భయంతో పారిపోయాడు. ఇద్దరు కుమార్తెలున్నా.. కరోనాతో బాధపడుతూ బయటకు రాలేని పరిస్థితి.. దీంతో సునీత.. గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగావత్ శిరీషతో కలిసి పీపీఈ కిట్లు ధరించి అత్త మృతదేహాన్ని జేసీబీతో గ్రామ శివారుకు తరలించి.. అంత్యక్రియలు పూర్తిచేసింది. – బయ్యారం -
హృదయవిదారకం: తోపుడు బండిపై ఓ అమ్మ అంతిమయాత్ర
జైపూర్: కరోనా కారణంగా మాతృదినోత్సవం రోజే ఓ తల్లికి అవమానకర రీతిలో అంతిమయాత్రను ఆమె కొడుకులే నిర్వహించాల్సి వచ్చింది. ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని నావల్పురా చౌక్కు చెందిన దినేష్ కుమార్ తల్లికి ఇటీవల కరోనా సోకడంతో అక్కడి స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే శనివారం ఆమె అస్పత్రిలో వద్దంటూ ఇంటికి తీసుకెళ్లమని తన ఇద్దరి కొడుకులను కోరింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లగా, అక్కడ ఆమె శనివారం మరణించింది. తన తల్లి మృతదేహాన్ని శశ్మానవాటికి తీసుకెళ్లడానికి ఆంబులెన్స్ను ఏర్పాటు చేయాలని అధికారులను, పోలీసులను కోరగా వారు నిరాకరించారు. మృతురాలి ఇద్దరు కొడుకులు ఎంత వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు కరోనా మరణం అని తెలిసే సరికి అక్కడి గ్రామస్తులు కూడా ఆ కుటుంబానికి సహకరించలేదు. దీంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొడుకులిద్దరే ఓ తోపుడు బండిపై తల్లి శవాన్ని పెట్టుకుని శ్మశానానికి తీసుకెళ్లారు. కరోనా నివారణ జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు గానీ కరోనాతో మరణించిన వారి విషయంలో మాత్రం దగ్గరకు రాకూడదనే నిబంధనలను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ( చదవండి: 103 ఏళ్ల పెద్దాయన మనోధైర్యానికి తలవంచిన కోవిడ్ ) -
ముస్లిం మహిళల మానవత్వం
కాజీపేట: సాధారణంగా ఎవరి అంత్యక్రియలకైనా ముస్లిం మహిళలు బయటకురాకుండా పురుషులే పూర్తిచేస్తారు. కానీ పవిత్ర రంజాన్ మాసంలో ఓ మహిళ అంత్యక్రియలను సహచర మహిళలే ముందుండి పూర్తిచేసి మానవత్వమే గొప్ప అని నిరూపించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట ప్రశాంత్నగర్లోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో ఉంటున్న ముస్లిం వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన జులేకా (70) ఇటీవల కాజీపేటలో అచేతనంగా పడి ఉండగా సీఐ నరేందర్ ఇచ్చిన సమాచారంతో ఆమెను ఆశ్రమంలో చేర్పించారు. ఇక్కడ వైద్యసాయంతో కోలుకోని వృద్ధురాలు బుధవారం కన్నుమూసింది. ఆమెకు సంబంధించిన వారెవరూ లేకపోవడంతో సహచర ముస్లిం మహిళల సహకారంతో ఆశ్రమ నిర్వాహకురాలు యాకూబీ సంప్రదాయ పద్ధతిలో ఆమెకు అంతిమ సంస్కారం పూర్తిచేశారు. దీంతో పలువురు యాకూబీని అభినందించారు. -
కరోనా మిగిల్చిన విషాదం: దహనానికి కట్టెలూ లేవు
సాక్షి, ముంబై: కరోనా సోకి మృతి చెందిన మృతదేహాలు కుప్పలు తెప్పలుగా రావడంతో ముంబైలోని అనేక శ్మశాన వాటికల్లో కట్టెల కొరత ఏర్పడుతోంది. గత్యంతరం లేక అప్పటికప్పుడు శవాలను ఇతర శ్మశాన వాటికలకు తరలించాల్సిన దుస్థితి వచ్చింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అదే స్థాయిలో మృతదేహాలు కూడా నగరం, ఉప నగరాల్లోని శ్మశాన వాటికలు వస్తున్నాయి. ఒక్కో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే దాదాపు రూ.4,500 ఖర్చవుతుంది. అన్ని శ్మశాన వాటికల్లో విద్యుత్ దహన యంత్రాలు అందుబాటులో లేవు. కొన్నిచోట్ల ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు, మరమ్మతులకు నోచుకోలేక అవి పనిచేయడం లేదు. దీంతో గత్యంతరం లేక మృతుల బంధువులు కట్టెలపై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ముంబైతోపాటు ఉప నగరాల్లో ఉన్న వివిధ మతాల శ్మశాన వాటికలకు పెద్ద సంఖ్యలో మృతదేహాలు రావడంతో క్యూ కడుతున్నాయి. ఫలితంగా అంత్యక్రియలు నిర్వహించాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ, బీఎంసీ ముందు జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. వేయి మాత్రమే చెల్లిస్తున్న బీఎంసీ.. బీఎంసీ శ్మశాన వాటికలో పేదలకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించింది. దహన క్రియకు అవసరమైన 300 కేజీల కట్టెలు ఉచితంగా అందజేస్తుంది. కానీ, మ«ధ్య తరగతి, ఉన్నత వర్గాలకు కొంత చార్జీలు తీసుకుంటుంది. ఒక్కో శవానికి బీఎంసీ రూ.వేయి చెల్లిస్తుంది. మిగతావి శవం తాలూకు బంధువులే భరించాల్సి ఉంటుంది. కానీ, తాజా పరిస్థితుల దృష్ట్యా అనేక శ్మశాన వాటికలో కట్టెల కొరత ఏర్పడుతోంది. అనేక సందర్భాలలో ఒకే రోజు కొన్ని శ్మశాన వాటికలకు సుమారు 15–20 శవాలు వస్తున్నాయి. కొన్ని శ్మశాన వాటికల్లో దహనం చేసే ప్లాట్ఫారాలు రెండు లేదా నాలుగే ఉంటాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో శవాలు రావడంవల్ల గంటల తరబడి వేచిచూడాల్సి వస్తుంది. అంతేగాకుండా అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎంసీ సిబ్బందిపై అదనపు పని భారం పడుతోంది. మూడు షిప్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి తగినంత విశ్రాంతి, సమయానికి భోజనం లభించడం లేదు. ముఖ్యంగా హిందు శ్మశాన వాటికలో ఈ సమస్య అధికంగా ఉంది. కరోనా సోకి మృతి చెందుతున్న వారి సంఖ్య ఇలాగే పెరిగిపోతే అన్ని శ్మశాన వాటికలో కట్టెలు లేక ఖాళీ అవడం ఖాయం. ఒకవేళ ఇదే పరిస్ధితి వస్తే భవిష్యత్తులో శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం పెద్ద సమస్యగా మారనుంది. -
ఎస్పీ బాలు భౌతికకాయం తరలింపు
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని ఆయన నివాసం నుంచి వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. చెన్నైలోని ఆయన స్వగృహం నుంచి తామరైపాక్కంలోని ఫాంహౌస్కు బాలు భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో తీసుకువెళ్లారు. రేపు (శనివారం) ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని శుక్రవారం రాత్రే వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అంతకుముందు ఆయన నివాసంలో గాన గంధర్వుడిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. ‘స్వరస్మారనీయుడి’కి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. భారీగా జనం వస్తూనే ఉండటంతో బాలు భౌతికకాయాన్ని ఫాంహౌస్కు తరలించారు. రేపు ఉదయం 7.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభవుతుంది. గాన గంధ్వరుడి ప్రతిమ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో శిల్పి రాజకుమార్ వడయార్ శిల్పశాలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రూపుదిద్దుకుంటోంది. గాన గంధ్వరుడిని చిరకాలం స్మరించుకునేలా ఈ ప్రతిమకు ప్రాణం పోశారు. రాజకుమార్ వడయార్ ఇప్పటికే ఎంతో మంది ప్రముఖుల కాంస్య విగ్రహాలను తయారు చేసి పేరు సంపాదించారు. ఎంజీఆర్, జయలలిత తదితర ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. ఇలా జరగడం బాధ కలిగించింది: కైకాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం సినీపరిశ్రమకు తీరని లోటని సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అన్నారు. ఎస్పీ బాలు నేపథ్య గాయకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆరోగ్యం కుదుటపడుతుందనుకున్న సమయంలో ఇలా జరగడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ప్రణబ్కు నివాళులు అర్పించిన ప్రముఖులు
-
ప్రణబ్కు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
-
ప్రణబ్కు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్థీవదేహాన్ని మంగళవారం ఉదయం 9 గంటలకు ఆర్మీ ఆసుపత్రి నుంచి ఆయన నివాసానికి తీసుకొచ్చారు. ఆర్మీ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వాహనంలో 10 రాజాజీ మార్గ్లోని ప్రణబ్ నివాసానికి పార్థివదేహాన్ని తరలించారు. రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఆయన నివాసానికి చేరుకుని ప్రణబ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. త్రివిధ దళాధిపతులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్నాధ్ సింగ్, గులాం నబీ ఆజాద్, తదితర ప్రముఖులు కూడా ప్రణబ్ చిత్రపటానికి అంజలి ఘటించారు. ప్రణబ్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్రమోదీ ఓదార్చారు. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రణబ్ పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు ప్రజలకు అవకాశమివ్వనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రణబ్ ముఖర్జీ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు లోధి రోడ్డులోని శ్మశానవాటికలో ప్రణబ్ అంత్యక్రియలు జరగనున్నాయి. కరోనా బారిన పడి నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. చదవండి: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత -
శ్మశానానికి తీసుకెళ్లగానే శ్వాస పీల్చింది!
వాషింగ్టన్ : అమెరికాలోని డెట్రాయిట్లో ఓ వింత ఘటన జరిగింది. చనిపోయిందనుకున్న 20 ఏళ్ల మహిళ.. శ్మశానవాటికలో శ్వాస పీలుస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహిళ మరణించినట్లు పారామెడిక్స్ తేల్చడంతో.. ఆమెను డెట్రాయిట్లోని జేమ్స్ కోల్ శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. అయితే అక్కడ అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించే సమయంలో ఆ మహిళ శ్వాస పీల్చుతున్నట్లు గుర్తించారు. దీంతో మళ్లీ ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఆసుపత్రి సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఆమె పల్స్రేటు బాగుందని, ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. (చదవండి : బాక్స్ ఓపెన్ చేస్తే.. అనుకోని అతిథి) అసలు విషయానికి వస్తే... గత ఆదివారం గుర్తు తెలియని మహిళ పారామెడిక్స్కు ఫోన్ చేసి ఒక ఇంట్లో మహిళ అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపింది. మహిళ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పారామెడిక్స్ 20 ఏళ్ల మహిళకు పరీక్షలు నిర్వహించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దాదాపు 30 నిమిషాల పాటు సీపీఆర్, ఇతర ప్రక్రియలను నిర్వహించారు. శ్వాస ఆడకపోవడం, గత హెల్త్ రిపోర్ట్ల ఆధారంగా వారు ఆమె మరణించినట్లు నిర్ణయానికి వచ్చారు. అయితే జేమ్స్ కోల్ శ్మశానవాటికకు మహిళను తీసుకువెళ్లిన తర్వాత.. అక్కడ ఎంబాల్మింగ్ చేసే సమయంలో ఆమె శ్వాస ఆడుతున్నట్లు గుర్తించారు. (చదవండి : పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది) -
శవాలపైనా కాసులవేట!
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి మొదలైనప్పట్నుంచి జీవితంలో ఎన్నడూ చూడని అమానవీయ సంఘటనల్ని మన కళ్లముందుంచింది. కరోనా వైరస్ మానవ జీవితంపైనే కాదు వ్యక్తుల అంత్యక్రియలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యక్తి చనిపోతే కడచూపునకు నోచుకోవడం, అంత్యక్రియలకు హాజరుకావడం మరణించిన వ్యక్తికి మనమిచ్చే అంతిమ సంస్కారం. కానీ, కరోనా కాలంలో అంతిమ సంస్కారం ఇప్పుడో ఫక్తు వ్యాపారమైపోయింది. కాసులు కదిలిస్తే కానీ ఖననం కానివ్వమంటున్నాయి శ్మశాన వాటికలు. కరోనా వైరస్తో మరణించిన వ్యక్తి అంత్యక్రియలే కాదు సహజ మరణం పొందిన వ్యక్తి దహనసంస్కారాల ఖర్చును మరింత భారం చేసింది. ఇదివరకు నగరంలోని కుటుంబంలో ఓ వ్యక్తి సహజ మరణం పొందితే అంత్యక్రియలకు అయ్యే ఖర్చు రూ.15వేల లోపు ఉండేది. ప్యాకేజీ రూపంలో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తే ఈ కార్యక్రమాలన్నీ ఏజెన్సీ నిర్వాహకులే చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ప్యాకేజీ ధరను ఏకంగా రూ.25వేలకు పెంచేశారు. సర్వీసు పేరిట వసూళ్లు : ప్రస్తుతం ఎవరైనా మరణిస్తే దగ్గరి బంధువులు మాత్రమే వచ్చి చివరిసారి ముఖాన్ని చూసి వెళ్తున్నారు. చాలావరకు అంతిమసంస్కారాలు పూర్తయ్యే వరకు కూడా ఉండటం లేదు. ఈక్రమంలో ఏజెన్సీ నిర్వాహకు లు మృతదేహాన్ని శ్మశానానికి తరలించడం, తిరిగి శ్మశాన వాటికలో కార్యక్రమాలకు కలిపి సొమ్ము వసూలు చేస్తున్నారు. శ్మశానవాటికలో నిర్వాహకుల కు ప్రత్యేకంగా రూ.5వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇలా అన్ని ఖర్చులు కలుపుకుంటే పట్టణ ప్రాంతాల్లో దహనసంస్కారాలకు రూ.25 వేల నుంచి 30వేలు అవుతున్నాయి. మూసాపేటకు చెందిన ఓ ఇంట్లో వారం వ్యవధిలో ఇద్దరు సభ్యులు మరణించారు. వీరికి వేర్వేరుగా అంతిమ సంస్కారాలు చేస్తే ఖర్చు రూ.80వేల వరకు వచ్చిందని ఆ కుటుంబసభ్యులు తెలిపారు. ఇక, గ్రామీణ ప్రాం తాల్లోనైతే రూ.50 వేలకుపైగా ఖర్చు వస్తోంది. పంచాయతీకి సైతం ఫీజును ఇవ్వాల్సి వస్తోంది. కోవిడ్ మరణానికి అదనం : కరోనా వైరస్ ప్రభావంతో మృతి చెందిన వారి అంత్యక్రియలను జీహెచ్ఎంసీయే నిర్వహిస్తోంది. దీనికి ఎలాంటి చెల్లింపులు చేయొద్దని స్పష్టం చేసినప్పటికీ శ్మశానవాటికలో నిర్వాహకులు మాత్రం ఆ కుటుంబం నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. చితిపైకి మృతదేహాన్ని చేర్చిన తర్వాత ముఖాన్నిచూపించిన అనంతరం కుటుంబ సభ్యుల నుంచి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో నిర్వహకులు పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు జీహెచ్ఎంసీ కంప్లెయింట్ సెల్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. -
నాన్నను బాగా చూసుకోండి: సుశాంత్
ముంబై: కాలం అనుకూలిస్తే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఈ ఏడాదిలోనే ఓ ఇంటివాడయ్యేవాడు. అతనికి పెళ్లి చేయాలన్న తండ్రి కల నెరవేరేది. కానీ అంతలోనే మాయదారి డిప్రెషన్తో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్కు లోనైన అతని స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతడు నవంబర్లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలిపారు. ఇందుకోసం తండ్రితోనూ చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ అమ్మాయి వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు మూడు రోజుల క్రితం సుశాంత్ కుటుంబ సభ్యులు.. నటుడికి ఫోన్ చేసి సంభాషించారు. కరోనా వ్యాపిస్తున్న వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ నివాసంలో నుంచి బయట అడుగు పెట్టవద్దని కోరారు. (సుశాంత్ ఆత్మహత్య : విలపించిన సోదరి) ఇంట్లోనే ఉండాలంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగా సుశాంత్ కూడా ఓ మాట కోరాడు. తన తండ్రిని బాగా చూసుకోండంటూ సూచించాడు. కాగా ఆదివారం ఉదయం సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ ఇక లేడన్న వార్తను అతని కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు(సోమవారం) సాయంత్రం నటుడి అంత్యక్రియలు జరగనుండగా పాట్నా నుంచి అతని తండ్రితోపాటు బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ, ఇతర బంధువులు ముంబైకి చేరుకున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: మాజీ ప్రేయసి స్పందన) -
కన్నీటిపర్యంతమైన అర్జున్
సాక్షి, కర్ణాటక : గుండెపోటుతో ఆదివారం కన్నుమూసిన కన్నడ చిత్ర హీరో చిరంజీవి సర్జా (39) అంత్యక్రియలు కనకపుర రోడ్డులోని నెలగోళి గ్రామంలోని ఫారంహౌస్లో ముగిశాయి. ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జరిపారు. ఆదివారం రాత్రి నుంచి నగరంలోని బసవనగుడిలోని చిరంజీవి సర్జా నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. పెద్దసంఖ్యలో బంధువులు, రాజకీయ నాయకులు, అభిమానులు అంతిమ దర్శనం చేసుకున్నారు. పురోహితులు సంస్కార పూజలను పూర్తి చేసి, మధ్యాహ్నం రెండు గంటలకు పూలతో అలంకరించిన వాహనంలో కనకపుర రోడ్డులోని సొంత ఫాంహౌస్ బృందావనకు తీసుకెళ్లారు. అభిమానులు అధిక సంఖ్యలో వస్తారని భావించి రామనగర జిల్లా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మొదట మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ తమ్ముడు ధృవ సర్జా బృందావనంలోనే అన్న స్మృతి ఉండాలని కుటుంబ సభ్యులను ఒప్పించారు. అశ్రు నివాళులు మధ్య పార్థివ దేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు వెక్కివెక్కి ఏడ్చిన అర్జున్ చిరంజీవి సర్జా మామ, బహుభాషా నటుడు అర్జున్ కుటుంబం ఆదివారం రాత్రి చెన్నై నుంచి కారులో రాత్రి 11:30 గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. నేను మీ మామ వచ్చాను, లేవరా అని బిగ్గరగా విలపించడం చూసి అందరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కరోనా వైరస్ కారణంగా పార్థవశరీరం దర్శించటానికి ప్రముఖులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆత్మీయునికి దూరమయ్యాం యశవంతపుర: కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆకస్మిక మృతి పట్ల శాండల్వుడ్ ముఖ్యలు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సర్జా సతీమణి మేఘనారాజ్ను, కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం డీకేశి మీడియాతో మాట్లాడుతూ మనిషిగా పుట్టాక మరణం అనివార్యమన్నారు. చావు ఎవరి చేతిలో లేదు. యముడు మనపై ఎలాంటి కరుణ చూపడు అనటానికీ చిరంజీవి సర్జా మరణం సాక్షి. చిన్న వయస్సులోని ఒక నటుడు దూరం కావటం సినిమా రంగానికీ తీవ్ర నష్టం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని పేర్కొన్నారు. నాకు గాడ్ ఫాదర్ : చందనశెట్టి తను బెంగళూరుకు వచ్చిన మొదటలో చిరంజీవి సర్జా ఆశ్రయం కల్పించిన్నట్లు బిగ్బాస్ విజేత, గాయకుడు చందనశెట్టి తెలిపారు. చిరంజీవి సర్జా మరణవార్త విని షాక్కు గురైన్నట్లు చెప్పారు. అర్జున్, చిరంజీవి సర్జాలు వారి ఇంటిలోనే పెట్టుకొని సంవత్సరం పాటు తనకు ఆశ్రయం కలి్పంచిన్నట్లు చెప్పారు. చిరంజీవి సర్జా నటించిన వరదనాయక్ సినిమాలో పాటలు పాడే చాన్స్ ఇచ్చాడని తెలిపారు. మిత్రున్ని కోల్పోయా : రాధికా పండిత్ ఒక మంచి స్నేహితుడిని దూరమైనాడని నటి రాధికా పండిత్ సంతాపం వ్యక్తం చేశారు. ఇన్స్ట్రాగాంలో పోస్ట్ చేస్తూ చిరంజీవి సర్జా మరణవార్తను నమ్మలేకపోతున్నా. మేఘనా, ధృవ కుటుంబానికీ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు కల్పించాలని అని కోరుకున్నారు. సర్జా కుటుంబానికి జూన్ నెల విషాదం చిరంజీవి సర్జా ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చిరంజీవి సర్జా అన్న కిశోర్ సర్జా 2009 జూన్ 27న గుండెపోటుతో 50 ఏళ్లు వయస్సులో మృతి చెందారు. దీనితో జూన్ నెల సర్జా కుటుంబానికి కలిసి రావటం లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామస్థులు కన్నీరు చిరంజీవి సర్జా కుటుంబానికి రామనగరకు సమీపంలో నెలగుళి వద్ద నాలుగు ఎకరాల తోట ఉంది. అప్పుడప్పుడు అక్కడకు వెళ్లేవారు. గ్రామస్థులను చూసి ఆయన కారు నిలిపి ఆప్యాయంగా మాట్లాడేవారు. చిరంజీవి సర్జా మరణ వార్తతో గ్రామస్తులు కన్నీరుకార్చారు. సర్జా పెళ్లి సందర్భంగా తోటలో గ్రామస్తులకు విందునిచ్చారని గుర్తుచేసుకున్నారు. -
కరోనా : మహిళ అంత్యక్రియలు అడ్డుకున్నందుకు
సిమ్లా : కరోనాతో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన అంత్యక్రియలను అడ్డుకున్నందుకు గాను హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేతతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మందిపై హిమాచల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. 63 ఏళ్ల కిడ్నీ పేషెంట్ అయిన మహిళకు కరోనా సోకడంతో మండిలోని శ్రీ లాల్ బహుదూర్ శాస్ర్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె సోమవారం మృతి చెందడంతో అంత్యక్రియలు నిర్వహించడానికి సొంతూరుకు తీసుకువచ్చారు. దహన సంస్కారాలకు అంతా సిద్దం చేస్తుండగా ఇంతలో మండి జిల్లా కాంగ్రెస్ చీఫ్ సుమన్ చౌదరీ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కన్సా, తన్వా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను వెంటబెట్టుకొని అంత్యక్రియలు నిర్వహించే చోటుకు చేరుకున్నారు. (వైరలవుతోన్న పెరూ మేయర్ చావు ఫోటోలు) కరోనా వైరస్ సోకిన మహిళ దహన కార్యక్రమాలు నిర్వహించడానికి వీలు లేదంటూ రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తూ మహిళ మృతదేహం ఉన్న ఆంబులెన్స్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమన్ చౌదరీతో పాటు ముగ్గురు కౌన్సిలర్లు, మరో 16 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఇదే సుమన్ చౌదరీ కొన్ని రోజుల క్రితం కరోనా యోదులకు సలాం చేస్తూ 'కరోనాను ఓడిద్దాం.. మానవత్వాన్ని కాపాడుదాం' అంటూ ప్లకార్డును చేత పట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు కరోనా సోకి చనిపోయిన మహిళ అంత్యక్రియలను అడ్డుకొని తాను మానవత్వం మరిచిందంటూ పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా ఉంటూ అంత్యక్రియల కార్యక్రమం అడ్డుకోవడంతో మానవత్వాన్ని మరిచి రాష్ట్రంలో పార్టీ పరువు తీశారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. (మటన్ వ్యాపారి ఇంట్లో 14 కరోనా కేసులు) -
వృద్ధుడి అంత్యక్రియలు జరిపించిన ఎమ్మెల్యే
అన్నానగర్ : అనాధ వృద్ధుడికి అంత్యక్రియలకు సాయం చేసిన ఎమ్మెల్యేపై సోషల్మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. నాగై జిల్లా వేలాంకన్ని ప్రాంతానికి చెందిన వ్యక్తి మురుగన్ (78), భార్య అంజమ్మల్ (68) బిక్షాటన చేస్తూ జీవనం సాగించేవారు. మూడేళ్ల క్రితం తంజావూరు జిల్లా పేరావూరానికి వచ్చారు. అప్పటి నుంచి వారు నీలకంఠపు పిల్లయార్ ఆలయం ముందు బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఆలయం మూతపడింది. దీంతో మురుగన్ దంపతులకు సామాజిక సేవకులు ఆహారం అందజేస్తూ వచ్చారు. ఈ స్థితిలో గురువారం మరుగుదొడ్డికి వెళ్లిన మురుగన్ స్ఫహ తప్పి పడిపోయాడు. ఎంత సేపటికి రాకపోవడతో అంజమ్మాల్ అక్కడికి వెళ్లగా మురుగన్ విగతజీవిగా పడి ఉండడం చూసి బోరున విలపించింది. సమాచారం అందుకున్న పేరావూరని ఎమ్మెల్యే గోవిందరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మురుగన్ బౌతికకాయనికి పూలమాల వేసి అంజలి ఘటించారు. మృతుడి భార్యకు ఆర్థిక సాయం అందించారు. అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యేకు అభినందనలు వెల్లువెత్తాయి. అంత్యక్రియలు జరిపించిన వారిలో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్, గ్రామనిర్వాహక అధికారి శక్తివేల్ ఉన్నారు. -
మా అసోషియేషన్ ఎక్కడ..?
పెరంబూరు: గొల్లపూడి మారుతీరావు భౌతికాకాయానికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన అంతిమయాత్రలో బంధువులతో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక టీ.నగర్లోని కన్మమ్మపేటలోని శ్మశానవాటికలో శస్త్ర బద్ధంగా గొల్లపూడికి అంత్యక్రియలు జరిగాయి. ఆయన పెద్ద కొడుకు రామకృష్ణ కర్మకాండలను నిర్వహించారు. అంతకుముందు ఇంటి వద్ద పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి మారుతీరావు భౌతిక కాయానికి నివాళ్లులర్పించారు. లబ్ద ప్రతిష్టుడు గొల్లపూడి గొల్లపూడి మారుతీరావు లబ్దప్రతిష్టుడని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గొల్లపూడికి అంజలి ఘటించిన బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. గొల్లపూడి సతీమణి తనను చూసి మీరు ఆయనకు ఆత్మబంధువు అని అన్నారన్నారు. అది తన భాగ్యంగా పేర్కొన్నారు. గొల్లపూడి తాను నిర్మించిన శుభసంకల్పం చిత్రానికి మాటలు అందించడంతో పాటు ప్రముఖ పాత్రను పోషించారని గుర్తు చేశారు. ఆ చిత్రం ద్వారా ఆయనతో తన పయనం ఆరు నెలలు అద్భుతంగా సాగిందని తెలిపారు. ఆయన భాషా సాంస్కృతికవేత్తతో పాటు మంచి విశ్లేషకుడని కీర్తించారు. అలా ఆయన నుంచి సాంస్కృతిక పరమైన విషయాలను చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇంట్లో కంటే బయట జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పాల్గొనడాన్ని తాను ఇష్టపడేవాడినని చెప్పారు. ఆయన ఎన్నో జాతీయ, అంతర్జాతీయ విషయాలను చాలా గొప్పగా విశ్లేషించేవారని చెప్పారు. తెలుగు భాష ఏమైపోతుందోనని చాలా మంది బాధ పడుతుంటారన్నారు. నిజానికి భాష ఎక్కడికీ పోదన్నారు. గొల్లపూడి లాంటి వారు ఉన్నంత వరకూ భాషకు కలిగే ముప్పేమీ లేదన్నారు. గొల్లపూడి మహా ప్రతిభామూర్తి అని పేర్కొన్నారు. గొప్ప చేతన, శ్రేయస్సుకారుడని అన్నారు. గొప్పవారు లేని లోటు తీర్చలేనిదంటారని, అయితే నిజంగా ఒక శూన్యం ఉంటుందని, దాన్ని ఎవరూ భర్తీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అలాంటి వారి లక్ష్యాలను మనం ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. మారుతీరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుటూ, ఆయన కటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి నిర్మాత దగ్గుబాటి సురేశ్ గొల్లపూడితో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి చాలా మంచి వ్యక్తి అని అన్నారు. తాము ఈ పక్క వీధిలోనే ఉండేవాళ్లం అని, ప్రారంభ దశ నుంచే నాన్నతో గొల్లపూడికి మంచి అనుబంధం ఉండేదని అన్నారు. వెంకటేశ్ నటించిన పలు చిత్రాల్లో ఆయన నటించారని, లీడర్ చిత్రంలోనూ గొల్లపూడి మంచి పాత్రను పోషించారని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆయన చిన్న కొడుకు మరణించడంతో ఆయన పేరుతో ఒక జాతీయ అవార్డును నెలకొల్పి నూతన ప్రతిభావంతులకు ప్రదానం చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానన్నారు. గొల్లపూడి హీరో కూడా గొల్లపూడి మారుతీరావు హీరో అని సీనియర్ నిర్మాత, దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ పేర్కొన్నారు. గొల్లపూడితో తనకు 1974 నుంచే పరిచయం ఉందన్నారు. ఆయన నాటకాల నుంచి వచ్చిన తరువాత లక్ష్మీ ప్రొడక్షన్లో గోస్ట్ రైటర్గా పని చేశారని గుర్తు చేశారు. ఆ తరువాత తాను నిర్మించిన మూడు చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. గొల్లపూడి మారుతీరావు నటుడు, రచయిత, సాహితీవేత్తనే కాకుండా హీరోగా నటించారన్నారు. సంసారం ఒక చదరంగం చిత్రంలో ఆయనే హీరో అని పేర్కొన్నారు. ఆయన పత్రికల్లో రాసిన శీర్షికలు ఎంతో ప్రాచుర్యం పొందినట్లు తెలిపారు. ఏ రోజు ఏ టాపిక్పై రాస్తారోనని ఆసక్తిగా ఎదురు చూసేవారని అన్నారు. అదే విధంగా సీనియర్ నిర్మాత ఏకాంబరేశ్వరరావు గొల్లపూడి భౌతక కాయానికి నివాళులర్పించి తను అనుభవాలను పంచుకున్నారు. గొల్లపూడిని దర్శకుడు కోడిరామకృష్ణకు పరిచయం చేసింది తానేనని చెప్పారు. తన మిత్రుడు, భాగస్వామి అయిన కే.రాఘవకి సిఫార్సు చేసి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి మాటలు రాయించడంతో పాటు అందులో నటింపజేసినట్లు తెలిపారు. కాగా జేకే రెడ్డి, టీటీడీ స్థానిక సలహామండలి మాజీ అధ్యక్షుడు శ్రీకృష్ణ గొల్లపూడి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కాగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు తొలి గ్రహీత ఆంగ్లోఇండియన్ లెస్లీ కార్వోలో గొల్లపూడికి నివాళులర్పించారు. కాగా ప్రఖ్యాత నటుడు, రచయితగా పేరు గాంచిన గొల్లపూడి మారుతీరావుకు నివాళులర్పించడానికి మా అసోషియేషన్ నుంచి ఏ ఒక్కరూ కూడా వచ్చి నివాళులర్పించకపోవడం ఖండించదగ్గ విషయం. -
వేణుమాధవ్కు కన్నీటి వీడ్కోలు
కుషాయిగూడ : అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్కు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గురువారం ఆయన అంత్యక్రియలను హెచ్బీకాలనీ లక్ష్మీనగర్ శ్మశానవాటికలో నిర్వహించారు. ఉదయం 11 గంటల సమయంలో వేణుమాధవ్ పార్థివ దేహాన్ని హెచ్బీకాలనీ నుంచి ఫిలింనగర్కు తరలించారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హెచ్బీకాలనీకి తీసుకువచ్చి నేరుగా రాజీవ్నగర్ చౌరస్తా నుంచి అంతిమయాత్ర జరిపారు. అక్కడి నుంచి ఇందిరానగర్ చౌరస్తా, వార్డు కార్యాలయం మీదుగా లక్ష్మీనగర్ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. వేణుమాధవ్ చిన్న కొడుకు మాధవ్ ప్రభాకరణ్ తన తండ్రికి అంతిమ సంస్కారాలను నిర్వహించాడు. ఈ అంతిమయాత్రలో గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ, మన ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్, కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య. పన్నాల దేవేందర్రెడ్డి పాల్గొ న్నారు. వ్యాపారవేత్త దేవరకొండ శ్రీనివాసరావు, నటుడు ఫిష్ వెంకట్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. వేణుమాధవ్ కుటుంబాన్ని ఆదుకుంటాం హాస్యనటుడు వేణుమాధవ్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రులు ఈటల, ఎర్రబెల్లి తెలిపారు. తెలంగాణ ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయిందని, ఇది తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని వారన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, వీరేందర్గౌడ్, నివాళులు అర్పించారు. ఫిలింనగర్ వద్ద అగ్ర నటుడు చిరంజీవి, హీరో రాజశేఖర్, నటి జీవిత, మురళీమోహన్, ఉత్తేజ్ తదితరులు వేణుమాధవ్కు నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేపాల్ వాసికి అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: నేపాల్ నుంచి పొట్ట చేతబట్టుకొని నగరానికి వచ్చిన రమేష్(32) అనే యువకుడు మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని మెట్రోస్టేషన్ పార్కింగ్లో మృతి చెందాడు. ఇతడి భార్య మీనా తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందడంతో ఆమె నేపాల్లో ఉంది. భర్త మరణ వార్త తెలిసిన ఆమె అక్కడి నుంచి రాలేని పరిస్థితుల్లో కన్నీరుమున్నీరైంది. రమేష్ బంధుమిత్రులు ఇక్కడే ఉన్నా మృతదేహాన్ని నేపాల్కు తరలించే ఆర్థిక స్తోమత లేదు. దీంతో హైదరాబాద్లోనే అంత్యక్రియలు చేయాలంటూ మృతుడి భార్య సూచించింది. ఇక్కడ అంత్యక్రియల ఖర్చులు భారం కావడంతో బంధుమిత్రులు కూడా చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో యూసుఫ్గూడకు చెందిన రవి తాప అనే సంఘసంస్కర్త పంజగుట్ట స్మశాన వాటికలో దగ్గరుండి చితికి నిప్పంటించి హైందవ సంస్కృతి ప్రకారం అంత్యక్రియలు తంతు పూర్తి చేశారు. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి తనకు సంబంధం లేని వారితో ఇలా అంత్యక్రియలు నిర్వహించుకున్న రమేష్ పరిస్థితిని చూసినవారు కంట తడిపెట్టారు. -
అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆదేశాలిచ్చారు. కాగా, కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్ నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నారు. కార్యకర్తల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఉంచనున్నారు. రేపు (బుధవారం) నరసరావుపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సోమవారం హైదరాబాద్లో అనుమానాస్పదరీతిలో కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సంబంధిత వార్తలు... మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య కొడుకే వేధించాడు: కోడెల బంధువు కోడెల మృతిపై బాబు రాజకీయం! ఆది నుంచి వివాదాలే! కోడెల మృతిని రాజకీయం చేయవద్దు -
సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే
సాక్షి, ముంబై : కాఫీ తోటల్ని ప్రేమించి, మంచి కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ చివరి ప్రస్థానం కూడా ఆ కాఫీ తోటల మధ్యే ముగియనుంది. 12వేల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ అంత్యక్రియలను కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలోని చట్టనహళ్లి గ్రామంలోని కాఫీ ఎస్టేట్లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు అంత్యక్రియలు పూర్తికానున్నాయని భావిస్తున్నారు. మంగళూరు నుండి 150 కిలోమీటర్లు, బెంగళూరుకు వాయువ్యంగా 250 కిలోమీటర్ల దూరంలో ఈ కాఫీ ఎస్టేట్ ఉంది. సోమవారం నుంచి కనిపించకుండా పోయిన సిద్ధార్థ మృతదేహాన్ని నేత్రావతి నది వెనుక నీటిలో తేలుతుండగా బుధవారం ఉదయం ఇద్దరు మత్స్యకారులు గుర్తించారు. బంధువులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మంగళూరులోని వెన్లాక్ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత సిద్ధార్థ మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించారు. ఆయన మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో పోస్ట్మార్టం నివేదిక కీలకంగా మారింది. అయితే పోలీసులు ఈ నివేదికను ఇంకా బహిర్గతం చేయలేదు. మరోవైపు వ్యవస్థాపక చైర్మన్ అకాల మరణం నేపథ్యంలో కెఫే కాఫీ డే ఔట్లెట్లకు సెలవు ప్రకటించారు. మృతదేహాన్ని గ్రామానికి తరలించే మార్గంలో చిక్మంగళూరు పట్టణంలోని కాఫీ డే గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయానికి తరలించారు. దీంతో తమ అభిమాన నేత, లెజెండ్, కాఫీ డే కింగ్ మృతికి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించగా ఆయన మృతదేహాన్ని సందర్శించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల నుంచి చిన్నా, పెద్దా, మహిళలు వేలాదిగా తరలివచ్చారు. తప్పులన్నింటికి నాదే బాధ్యత అంటూ నిశ్శబ్దంగా నిష్క్రమించిన సిద్ధార్థ ..కార్పొరేట్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపారని చెప్పక తప్పదు. ప్రధానంగా ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖలో ప్రస్తావించిన ఐటీ శాఖ అధికారుల వేధింపులు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. Today we remember the legend that inspired us all. Thank you Chairman VG Siddhartha for your vision, leadership and the great legacy. pic.twitter.com/tYMiglgofe — Cafe Coffee Day (@CafeCoffeeDay) July 31, 2019 -
జైపాల్రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య
-
ముగిసిన జైపాల్రెడ్డి అంత్యక్రియలు..
-
జైపాల్రెడ్డి పాడె మోసిన సిద్దరామయ్య
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్రెడ్డి భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సోమవారం మధ్యాహ్నం గాంధీభవన్ నుంచి నెక్లెస్ రోడ్డువరకు సాగిన జైపాల్రెడ్డి అంతిమయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీలో నేడు సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం కాంగ్రెస్ నాయకులు సిద్దరామయ్య, కేఆర్ రమేశ్కుమార్లు హైదరాబాద్కు చేరుకున్నారు. జైపాల్రెడ్డి అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతేకాకుండా ఆయన పాడె మోసి తమ గురుభక్తిని చాటుకున్నారు. మరోసారి కన్నీటి పర్యంతమైన కేఆర్ రమేశ్.. జైపాల్రెడ్డి మరణవార్త విని తీవ్ర దిగ్ర్భాంతికి లోనైన రమేశ్కుమార్.. ఆదివారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జైపాల్రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తుచేసుకుంటూ ఒకింత ఆవేదనకు లోనయ్యారు. అయితే ఈ రోజు జైపాల్రెడ్డి అంత్యక్రియలకు హాజరైన రమేశ్కుమార్ అక్కడున్న ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడుతూ రమేశ్కుమార్ కన్నీటిని ఆపుకోలేకపోయారు. చదవండి : ముగిసిన జైపాల్రెడ్డి అంత్యక్రియలు.. కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్ -
ముగిసిన జైపాల్రెడ్డి అంత్యక్రియలు..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులు, అభిమానుల, పలువురు రాజకీయ నాయకులు కడసారి ఆయనకు అశ్రునయనాలతో నివాళులర్పించారు. అంతిమయాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఆయనకు గౌరవ సూచకంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం జైపాల్రెడ్డి పార్థివదేహానికి ఆయన పెద్ద కుమారుడు అరవింద్ రెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా, జైపాల్రెడ్డి అనారోగ్యంతో ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన విషయం విదితమే. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని జైపాల్రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్కు ఆయన భౌతికకాయాన్ని తరలించారు. అనంతరం అక్కడి నుంచి నెక్లెస్ రోడ్డు వరకు జైపాల్రెడ్డి అంతిమయాత్ర సాగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, సిద్ధరామయ్య, కేఆర్ రమేశ్కుమార్, మల్లికార్జున ఖర్గేలు, ఉత్తమ్కుమార్రెడ్డి, వీహెచ్, గీతారెడ్డి, మధుయాష్కి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే హరీశ్రావు, జైపాల్రెడ్డి అంత్యక్రియలకు హారయ్యారు.