luxury cars
-
ఆ కార్లలో సాఫ్ట్వేర్ సమస్య.. కంపెనీ కీలక నిర్ణయం
కొరియన్ కంపెనీ కియా మోటార్స్.. ఈవీ 6 కార్లకు రీకాల్ ప్రకటించిన తరువాత, జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz).. సీ-క్లాస్, ఈ-క్లాస్ కార్లకు రీకాల్ ప్రకటించింది.రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో.. 2022 ఏప్రిల్ 29 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య తయారైన 2,543 యూనిట్ల E-క్లాస్ కార్లు & 2021 ఆగస్టు 31 నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య తయారైన 3 యూనిట్ల సీ-క్లాస్ కార్లు ఉన్నాయి. ఈ కార్లలో ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.ఈసీయూ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా.. ఎటువంటి హెచ్చరిక లేకుండా కారు ప్రొపల్షన్ కోల్పోయే అవకాశం ఉంది. అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. కాబట్టి దీనిని సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. -
కొనాలన్నా.. ఈ రెండు కార్లు దొరకవు!
ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన.. ఆడి (Audi) కంపెనీ రెండు కార్లను వెబ్సైట్ నుంచి తొలగించింది. ఇందులో ఏ8ఎల్, ఆర్ఎస్ 5 స్పోర్ట్బ్యాక్ ఉన్నాయి. ఈ రెండు కార్లు భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారానే వచ్చాయి. ఆడి ఏ8 ఎల్ భారతదేశంలో 2020లో లాంచ్ అయింది, ఆర్ఎస్5 స్పోర్ట్బ్యాక్ 2021 నుంచి అమ్మకానికి ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1.63 కోట్లు, రూ. 1.13 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా).నాల్గవ తరం ఆడి ఏ8 ఎల్ 2017 నుంచి గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే 2020లో భారతదేశానికి వచ్చింది. ఆ తరువాత 2022లో ఫేస్లిఫ్ట్ వెర్షన్ రూపంలో లాంచ్ అయింది. ఏ8 ఎల్ నాలుగు, ఐదు సీట్ల కాన్ఫిగరేషన్లలో.. సౌకర్యవంతమైన రియర్ సీటు పొందుతుంది. ఇందులోని 3.0 లీటర్ TFSI వీ6 టర్బో పెట్రోల్ ఇంజిన్.. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది.ఇక ఆడి ఆర్ఎస్5 స్పోర్ట్బ్యాక్ విషయానికి వస్తే.. ఇది ఆగస్టు 2021లో ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది. ఇందులోని 2.9 లీటర్ ట్విన్ టర్బో వీ6 ఇంజిన్ 450 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ8 మాదిరిగానే ఇది కూడా వెబ్సైట్ నుంచి కనుమరుగైంది. కాగా కంపెనీ ఫిబ్రవరి 17న భారతదేశంలో RS Q8 ఫేస్లిఫ్ట్ లాంచ్ చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: బుకింగ్స్లో కనీవినీ ఎరుగని రికార్డ్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? -
నో కార్, నో బంగ్లా, నో డిజైనర్ వేర్ : ఇదే వారి సక్సెస్ సీక్రెట్!
విలాసవంతమైన కార్లు, డిజైనర్ దుస్తులు, లగ్జరీ బంగ్లాలు, విలాసవంతమై హాలి డే ట్రిప్లు ఇదీ సంపన్నుల జీవనశైలి గురించి తరచుగా వినిపించే మాటలు. కానీ ఈ ప్రపంచంలో అపరకుబేరుల జీవన విధానం దీనికి పూర్తిగా భిన్నమైందిగా ఉంది అంటే నమ్ముతారా? విలాస జీవితాన్ని పక్కన బెట్టి అది సాధారణంగా అతి తక్కువ ఖర్చుతోనే కాలం గడుపున్న సంపన్నుల (Millionaires) సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరో విధంగా చెప్పాలంటే ఇది లేటెస్ట్ ట్రెండ్.. ఆసక్తికరంగా ఉంది కదూ.. పదండి వీరి గురించి తెలుసుకుందాం.సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు చెప్పేమాట. అధిక ఆదాయాన్ని ఆర్జించే వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. 'తక్కువ ఖర్చు’ అనే పద్దతిలో జీవనశైలిని మార్చున్నారు. పొదుపు, తక్కువ ఖర్చు దీర్ఘకాలిక భద్రతనిస్తుందని ఇది ముందస్తు పదవీ విరమణ ,ఆర్థిక స్వేచ్ఛకు గేట్వే అని విశ్వసిస్తున్నారు. ది ఎకానమిక్ టైమ్స్ అందించిన కథనం ప్రకారం అలాంటి వారిలో షాంగ్ సావెడ్రా,డా. రాబర్ట్ చిన్, అనీ కోలెది ముందు వరుసలో ఉన్నారు.షాంగ్ సావేద్ర: పొదుపు ద్వారా సంపదను నిర్మించడం39 ఏళ్ల షాంగ్ సావెడ్రా ఒక వ్యాపారవేత్త, రచయిత.ఫార్చ్యూన్ ప్రకారం తన భర్తతో కలిసి మల్టీ మిలియన్ డాలర్ల నికర విలువను సొంతం చేసుకుంది. పర్సనల్ ఫైనాన్స్ వెబ్సైట్ను నిర్వహిస్తున్నషాంగ్ దంపతులు లైఫ్స్టైల్ చూస్తే ఔరా అనాల్సిందే. లాస్ ఏంజిల్స్లో అద్దెకు తీసుకున్న నాలుగు పడకగదుల ఇంటిలో నివాసం. ఇప్పటికీ 16 ఏళ్ల పాత సెకండ్ హ్యాండ్ కారే వాడతారు. ఎక్కడ తక్కువకు కిరాణా సరుకులు దొరుకుతాయో అక్కడే కొటారు. అంతేకాదు పిల్లలకు సెకండ్ హ్యాండ్ దుస్తులు వాడతారు. ఫేస్బుక్ వేదికగా అమ్మకానికి పెట్టిన బొమ్మలే కొనిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, పిల్లల చదువు, పెట్టుబడులు, దాతృత్వ కార్యక్రమాలకు మాత్రం డబ్బు ఖర్చుపెడతారు. షాంగ్ దంపతులకు న్యూయార్క్లో ఆస్తులున్నాయి. లక్షల్లో జీతం, అతితక్కువ ఖర్చుడెంటిస్ట్ రాబర్ట్ చిన్, జెస్సికా ఫారర్ దంపతులదీ దాదాపు ఇదే స్టైల్. నెలకు లక్షల్లో జీతం. లాస్ వెగాస్లో అద్దె ఇంట్లో నివాసం. ఇద్దరూ కలిసి ఒక కారునే వాడతారు. నెలలో ఒకటి రెండుసార్లు తప్ప బయట ఫుడ్ తినరు. హోం ఫుడ్కే ప్రాధాన్యత. కిరాణా సరకులు, దుస్తులన్నీహోల్సేల్గానే కొంటారు. వారు కావాలనుకున్నప్పుడు నచ్చినట్టుగా ఓ ఇంటిని కొనుగోలు చేయాలని భావిస్తున్నారట.కోట్ల ఆస్తి, తొడిగేదిమాత్రం సెకండ్ హ్యాండ్ దుస్తులురీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అనీ కోలెది ఈ కోవకు చెందిన వారే. వీరి ఆస్తులు మిలియన్ డాలర్లకుపై మాటే. అయినా ఎక్కువగా సెకండ్ హ్యాండ్ దుస్తులనే వాడతారు. డబ్బును ఎలా పొదుపు చేయాలో మహిళలకు సూచనలిచ్చే ఈమె ఏడాదికి మూడుసార్లు మాత్రమే దుస్తులు కొంటారట.పైసా ఖర్చుపెట్టాలంటే ఆచితూచి వ్యవహరిస్తారు. విమాన ప్రయాణాల విషయంలో డిస్కౌంట్లు, ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటుంటారు.ఉచితంగా ఎక్కడ స్విమ్మింగ్ చేసుకొనే అవకాశం ఉంటే అక్కడికే వెళతారు. ఇలా సంపన్నుల మన్న ఆర్భాటం లేకుండా అత్యంత సాధారణమైన జీవితాన్ని సాగిస్తూ, రిటైర్మెంట్ జీవితానికి చక్కటి బాటలు వేసుకుంటున్నారు.ఆదాయం తక్కువ, అప్పులెక్కువ అనే ధోరణితో జీవించే వారికి వీరి జీవనశైలి కనువిప్పు కావాలి. లేనిపోని ఆడంబరాలు, హంగూ ఆర్భాటాలు లేకుండా సంపాదించే ప్రతీ పైసాని సద్వినియోగం చేసుకుంటూ, భవిష్యత్తుకు బాటలు వేసే మార్గాలను ఆచరించడం ఆదర్శనీయం. -
లగ్జరీ కార్ల పండుగ
న్యూఢిల్లీ: దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పండుగ సీజన్లో హైఎండ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాహన దిగ్గజాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఆరి్థక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో లగ్జరీ సెగ్మెంట్పై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా చెప్పారు. ’బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియాకు ఆర్డర్లు భారీగా ఉన్నాయి. కస్టమర్లకు వాటిని వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దసరా, దీపావళి సందర్భంగా అదనపు బుకింగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఏడాది గణనీయ వృద్ధినే నమోదు చేస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓనంతో ప్రారంభించి దీపావళితో ముగిసే పండుగ సీజన్ సందర్భంగా ఇప్పటికే పలు మోడల్స్లో ప్రత్యేక ఎడిషన్స్ను ప్రవేశపెట్టినట్లు విక్రమ్ వివరించారు. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ కార్ల వాటా 2 శాతం లోపు ఉంటుంది. రెండంకెల స్థాయిలో వృద్ధి.. సాధారణంగా ఈ సీజన్లో గరిష్ట రెండంకెల స్థాయిలో విక్రయాల వృద్ధి నమోదవుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ విభాగం చాలా చిన్నదే అయినప్పటికీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, అన్ని కంపెనీలూ అదే స్థాయిలో వృద్ధి చెందడం లేదని చెప్పారు. కొన్ని సంస్థల అమ్మకాలు ఒక మోస్తరుగా ఉండగా, కొన్నింటి విక్రయాలు క్షీణించాయని, ప్రతికూల పరిస్థితులును ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. అయినప్పటికీ ఈ ఏడాది లగ్జరీ కార్ల విక్రయాలు 50,000–51,000 స్థాయిలో ఉండొచ్చని ఈ విభాగంలో కీలకమైన కంపెనీగా అంచనా వేస్తున్నట్లు అయ్యర్ వివరించారు. మరోవైపు, పండుగ సీజన్లో సానుకూల కొనుగోలు ధోరణులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్ మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటోందని వివరించారు. అలాగే ఈ–ట్రాన్ శ్రేణికి కూడా ఆదరణ కనిపిస్తోందన్నారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఉమ్మడి ప్లాట్ఫాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి వివిధ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహించే చార్జింగ్ స్టేషన్ల సమగ్ర వివరాలు ఉండేలా ఒక ఉమ్మడి ప్లాట్ఫాం ఉండాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వాహనదారులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చార్జింగ్కు సంబంధించి ఒకదానితో మరొకదానికి సంబంధం లేని 3–4 యాప్లను వాహనదారులు ఉపయోగించాల్సి వస్తోందని అయ్యర్ చెప్పారు. అలా కాకుండా యూపీఐ ఆధారిత సిస్టమ్ తరహాలో ప్రభుత్వం దీనికి కూడా ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
కారు.. మేకోవర్ జోరు
దేశంలో యువ తరంగం ఇప్పుడు లగ్జరీ కారును కొనుగోలు చేయాలన్న తమ కలను సాకారం చేసుకోవడంతోనే సరిపెట్టడం లేదు. తమకు నచ్చినట్టుగా దాన్ని ముస్తాబు చేయడం కోసం లక్షల్లో ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. కోరుకున్నట్లుగా కారును కస్టమైజ్ చేసుకోవడానికి సై అంటున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా ఎలా కావాలంటే అలా.. ఏది కావాలంటే అది నేరుగా ప్లాంట్లలోనే మార్పుచేర్పులు చేసి కస్టమర్ల చెంతకు చేరుస్తున్నాయి. తాజాగా ఆడి ఇండియా భువనేశ్వర్లో ఒక కారు కొనుగోలుదారు కోసం ‘ఆర్ఎస్ క్యూ8’లో 17 రకాల మార్పులు చేసి మరీ అందించడం విశేషం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రత్యేకమైన పెయింట్ షేడ్. ‘జావా గ్రీన్‘గా పిలిచే ఈ పెయింట్ వర్క్ ఒక్కదానికే కస్టమర్ ఏకంగా రూ. 12.29 లక్షలు వెచి్చంచడం మేకోవర్ మేనియాకు నిదర్శనం. ఇక కోయంబత్తూరుకు చెందిన మరో యువ కార్ లవర్... ఆడి ఫ్లాగ్íÙప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘ఆర్ఎస్ ఈ–ట్రాన్ జీటీ‘ని ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నాడు. దీనికి కార్బన్ ఫైబర్ రూఫ్, మ్యాట్రిక్స్ డిజైన్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్ (లైట్ బీమ్ ఫర్ఫెక్ట్గా పడేందుకు ఒక్కో హెడ్ల్యాంప్లో 10 లక్షల మైక్రో మిర్రర్లు ఉంటాయి), ఆల్–కాంటారా టెక్స్టైల్తో కూడిన స్టీరింగ్ వీల్ వంటి పలు రకాల హంగులను జోడించేందుకు పెట్టిన ఖర్చు రూ. 36 లక్షలు. ముంబైలో మెర్సిడెజ్ బెంజ్ జీ400డీ / ఏఎంజీ జీ63 మోడళ్లకు చెందిన మూడు కార్లను 30కి పైగా కస్టమైజేషన్లతో విక్రయించింది. ఈ మార్పుల కోసం కొనుగోలుదారులు జస్ట్ రూ.1.5 కోట్లు ధారపోశారట! యువ కస్టమర్ల హల్ చల్ అరుదైన పెయింట్ వర్క్ దగ్గర నుంచి ప్రత్యేకంగా చేతితో మలిచిన లెదర్ ఇంటీరియర్స్. నచ్చిన పరికరాలు, న్యూమరాలజీ, జ్యోతిష నమ్మకాలకు అనుగుణంగా స్పెషల్ రిజి్రస్టేషన్ నంబర్ ఇలా ప్రతిదీ సరికొత్త లగ్జరీయే. ‘జీ–వ్యాగన్స్లో 70%, మేబ్యాక్ మోడళ్లలో 74% కస్టమర్లు కోరుకున్న మార్పులతోనే అమ్ముడవుతున్నాయి. రంగులు, మెటీరియల్, ఫ్యాన్సీ నంబర్లు ఇలా తమ అభిరుచులకు అదనంగా చెల్లించేందుకు మా కొనుగోలుదారులు ఎప్పుడూ సిద్ధమే’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా డీ సంతోష్ అయ్యర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ డిమాండ్కు తోడు ఇప్పుడు దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ యువరక్తంతో పరవళ్లు తొక్కుతోంది. మెర్సిడెస్ బెంజ్ భారతీయ కస్టమర్ల సగటు వయస్సు 38 ఏళ్లే. ప్రపంచవ్యాప్తంగా మనోళ్లే ఈ కంపెనీకి యువ కొనుగోలుదారులు కావడం మరో విశేషం. ’కస్టమర్లు ప్రత్యేకతకు పెద్దపీట వేస్తున్నారు. తమ కార్లను వ్యక్తిత్వ చిహ్నంగా భావిస్తున్నారు’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ «థిల్లాన్ చెబుతున్నారు. ఆడి భారతీయ కస్టమర్లు తమ కార్లలో హంగుల కోసం రూ. 70 లక్షల వరకు వెచి్చస్తున్నారు. ఇక మెర్సిడెస్ బెంజ్ విషయానికొస్తే, మేబ్యాక్, ఏఎంజీ వంటి టాప్–ఎండ్ మోడళ్ల కస్టమర్లు కారు ధరలో 20% కస్టమైజేషన్కు వెచ్చి స్తున్నారు. బీఎండబ్ల్యూ కస్టమర్లు రూ. 50 లక్షల వరకూ ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉన్నారు. ఈ మోడల్స్లో చాలా కార్ల ప్రారంభ ధర రూ. 1.5 కోట్లు పైనే. కార్తీక్.. హైదరాబాద్లో యువ వ్యాపారవేత్త. కొత్తగా లగ్జరీ కారు కొన్నాడు. ఇందులో పెద్ద విశేషం ఏముంది అంటారా? కారు కోసం రూ. 1.5 కోట్లు ఖర్చుపెడితే.. అందులో తన అభిరుచికి తగ్గట్టుగా రకరకాల హంగులను జోడించడం కోసం సదరు కార్ల కంపెనీకి రూ. 50 లక్షలు చెల్లించాడు! కార్ల కస్టమైజేషన్ క్రేజ్కు ఇది జస్ట్ చిన్న ఉదాహరణ మాత్రమే... -
Luxury Cars: లగ్జరీ వాహనాలపై టాలీవుడ్ సెలబ్రిటీస్ క్రేజ్
నగరంలో నివసించే స్టార్లు.. తమ ఇమేజ్కు తగ్గట్టుగా షి‘కార్లు’ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్లకు ధీటుగా రెమ్యునరేషన్స్లో పోటీపడుతున్న టాలీవుడ్ స్టార్స్ కార్ల వేటలోనూ ముందున్నారు. దీంతో రూ.కోట్ల విలువ చేసే కార్లకు నిలయంగా మన భాగ్య నగరాన్ని మార్చడంలో టాలీవుడ్ సెలబ్రిటీలదే పైచేయి. ఆ విషయం ప్రస్తుతం మన స్టార్ల దగ్గరున్న ఖరీదైన కార్లను పరిశీలిస్తే అర్థమవుతుంది. దీని గురించిన మరిన్ని విశేషాలు...⇒బాలీవుడ్ స్టార్లకు ధీటుగా మోడళ్లు.. ⇒కాస్ట్లీ కార్లకు కేరాఫ్గా హైదరాబాద్.. ⇒అరడజన్కు తగ్గకుండా కలెక్షన్.. ⇒లగ్జరీ వాహనాలపై టాలీవుడ్ సెలబ్రిటీస్ క్రేజ్ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. గత తరం సూపర్ స్టార్స్ లాగా టాలీవుడ్ యంగ్ స్టార్స్.. ఒకటీ అర కార్లతో సరిపుచ్చుకోవడం లేదు. టాప్ 5 హీరోలుగా ఉన్న వారంతా కనీసం అరడజను కార్లకు తగ్గకుండా కలెక్షన్ను మెయిన్టైన్ చేస్తూ, కార్లపై వారికి ఉన్న క్రేజ్ను చాటుకుంటున్నారు.అల్లు అర్జున్ని దాటేసిన రామ్చరణ్..ఇప్పటిదాకా టాలీవుడ్లో అత్యంత ఖరీదైన స్టార్ కార్ స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర ఉన్న రూ.6.95 కోట్లు ఖరీదు చేసే రోల్స్ రాయిస్ క్యులినన్ కాగా ఆ తర్వాత స్థానం రెబల్ స్టార్ ప్రభాస్ దగ్గర ఉన్న రూ.6 కోట్ల విలువైన లంబొర్గని అవెంటాడర్ ఎస్ రోడ్స్టార్ ది కాగా ఇప్పుడు వీరిద్దరినీ తోసిరాజని రామ్ చరణ్ తాజాగా కొన్న రూ.7.5 కోట్ల ఖరీదైన బ్లాక్ రోల్స్ రాయిస్ స్పెక్ట్రా నెం1 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే రామ్ చరణ్కు రూ.2.8కోట్ల ఖరీదైన మెర్సిడస్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600తో పాటు పలు కంపెనీల లగ్జరీ కార్లు ఉన్నాయి.స్టైలిష్ కలెక్షన్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దగ్గర కూడా మంచి కలెక్షన్ ఉంది.. ఆయన దగ్గర రూ.2.5కోట్లు ఖరీదు చేసే రేంజ్ రోవర్ వోగ్, రూ.1.6 కోట్లు ఖరీదైన వాల్వో ఎక్స్సీ90టీ8 లతో పాటు మరికొన్ని కార్లూ ఉన్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర రూ.3.10 కోట్లు ఖరీదు చేసే లంబొర్గని యురస్ని తో పాటుగా పోర్ష్ 718 కేమ్యాన్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్, రేంజ్ రోవర్, మెర్సిడస్ మేబ్యాచ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్.. తదితర కార్లతో అదిరిపోయే కలెక్షన్ ఉంది. రూ.4.37కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీని నాగ చైతన్య వినియోగిస్తున్నారు. ఆయన గత నెల్లోనే తన లగ్జరీ కార్ల కలెక్షన్కు రూ.3.51 కోట్లు ఖరీదైన పోర్ష్ 911 జీటీ3 ఆర్ఎస్ కార్ను కూడా జత చేశారు. ఇక ప్రిన్స్ మహేష్బాబు రూ.2.6కోట్ల విలువైన రేంజ్రోవర్ వోగ్ వాడుతుండగా. ఆయన సమకాలీకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు రూ.4.5 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ 3.0 ఎస్వి ఆటోబయోగ్రఫీ ఉంది. గత తరం టాప్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి రూ.2 కోట్లపైన విలువ చేసే రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉండగా, కింగ్ నాగార్జున రూ.2.5 కోట్లు విలువ చేసే మెర్సిడస్ బెంజ్ జీ3 ఏఎమ్జీ వాడుతున్నారు. స్టార్స్ని మించిన కార్స్.. టాలీవుడ్ సెలబ్రిటీలను తలదన్నుతూ నగరానికి చెందిన వ్యాపారవేత్త నజీర్ ఖాన్ రూ.12 కోట్లు విలువ చేసే మెక్ల్యారెన్ 765ఎల్టీ స్పైడర్ను గత ఏడాది కొనుగోలు చేసి సంచలనం సృష్టించారు. అప్పటి దాకా ఇదే భారతదేశంలో ఖరీదైన కారు కావడం విశేషం. -
మెర్సిడెస్ ఈవీ @ 66 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆవిష్కరించింది. ఎక్స్షోరూంలో ధర రూ.66 లక్షలు. కంపెనీ నుంచి చిన్న, అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే. 70.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్తో 560 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఏడు ఎయిర్బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. జీఎల్ఏ ప్లాట్ఫామ్పై రూపుదిద్దుకున్న ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ మెర్సిడెస్ నుంచి భారత్లో నాల్గవ బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు. 2024 చివరినాటికి మరో రెండు ఈవీలు రానున్నాయి. తొలిసారిగా లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ ఎంట్రీ–లెవల్ మోడళ్లను కంపెనీ పరిచయం చేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. -
తెలంగాణ మంత్రులకు లగ్జరీ కార్లు
-
Deepika Padukone : దీపికా పడుకోణె అమేజింగ్ లగ్జరీ కార్లు, విలువ ఎంతో తెలుసా?
బాలీవుడ్లో స్టార్ హీరోల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న అద్భుతమైన నటి దీపికా పదుకొణె. రెమ్యూనరేషన్ విషయంలో హీరోలతో పోటీ పడుతూ టాప్ నటుల్లో ఒకరిగా నిలిచింది. అందానికి తోడు నటనా నైపుణ్యంతో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో చోటు సంపాదించింది. అంతేనా మూడు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ టైమ్ మ్యాగజీన్ 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచింది. 2022లో టైమ్100 ఇంపాక్ట్ అవార్డు సొంతం చేసుకుంది.అద్భుతమైన నటనతో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను పెళ్లాడి పవర్ కపుల్ స్టేటస్ను దక్కించుకుంది. త్వరలో దీపికా, రణ్వీర్ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లగ్జరీ కార్లు, బంగ్లా లాంటి విలాసవంతమైన జీవనశైలి వారి సొంతం. ఈ నేపథ్యంలో దీపికా గ్యారేజ్ కొలువుదీరిని లగ్జరీ వాహనాలకు గురించి తెలుస్తే షాక్ అవ్వాల్సిందే,. ఎందుకంటే దీపికా మొత్తం కార్ కలెక్షన్ విలువ రూ. 10 కోట్లు. దీపికా పదుకొణె కార్ కలెక్షన్..ఆడి క్యూ7 – ధర రూ. 80 లక్షలుమెర్సిడెస్ మేబ్యాక్ S500 – రూ. 2.40 కోట్లురేంజ్ రోవర్ వోక్ – రూ. 1.40 కోట్లుమినీ కూపర్ కన్వర్టిబుల్ – రూ. 45 లక్షలుమెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్- రూ. 1.60 కోట్లుఆడి A8 L- రూ. 1.20 కోట్లుఆడి A6- రూ. 55 లక్షలుBMW 5 సిరీస్- రూ. 60 లక్షలుపోర్షే కయెన్- రూ. 1 కోటిప్రస్తుతం దీపికా పదుకొణె కల్కి 2898 ఏడీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అలాగే "సింగం ఎగైన్"లో అనే మూవీలోనూ నటిస్తోంది. ఇందులో పోలీసు యూనిఫాంలో యాక్షన్ సన్నివేశాల్లో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. -
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
గ్లోబల్ స్టార్, మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీ నటిస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. చెర్రీ ఇవాళ 40వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపాసన, క్లీంకారతో కలిసి తిరుమలకు వెళ్లిన చెర్రీ స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బర్త్ డే కావడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో చెర్రీ ఆస్తులపై నెట్టింట చర్చ మొదలైంది. రామ్ చరణ్ ఆస్తుల గురించి సినీ ప్రియులతో పాటు నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తుల విలువ ఎంత? నెలకు ఎంత సంపాదిస్తున్నారన్న విషయాలపై ఓ లుక్కేద్దాం. ఓ నివేదిక ప్రకారం మెగా హీరో రామ్ చరణ్కు దాదాపు రూ.1370 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్కు ముందు ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల పారితోషికం తీసుకునే చెర్రీ.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి దాదాపు రూ.45 కోట్ల పారితోషికం అందుకున్నారు. అంతే కాకుండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల ద్వారా భారీగానే ఆర్జిస్తున్నారు. ఒక్కో ప్రకటనకు దాదాపుగా రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చెర్రీ ఇప్పటివరకు దాదాపు 34 ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో కనిపించారు. ప్రస్తుతం నెలకు కేవలం ప్రకటనల ద్వారానే రూ.3 కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. లగ్జరీ హోమ్ రామ్ చరణ్కు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో స్విమ్మింగ్ పూల్, జిమ్, టెన్నిస్ కోర్ట్ లాంటి ఆధునాతన సౌకర్యాలున్నాయి. ఆ ఇంటి విలువు దాదాపు రూ.38 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. అంతే కాకుండా రామ్ చరణ్కు ముంబయిలోనూ ఖరీదైన పెంట్ హౌస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్లు మన గ్లోబల్ స్టార్ రేంజ్కు తగ్గట్టుగానే లగ్జరీ కార్లు ఉన్నాయి. దాదాపు రూ.4 కోట్ల విలువైన మెర్సిడెజ్తో పాటు ఆడి మార్టిన్, రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, ఫెరారీ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా నడిపిస్తున్నారు. ఈ బ్యానర్లో ఖైదీ నెం.150 మూవీని తెరకెక్కించారు. వీటితో పాటు రామ్ చరణ్కు ట్రూజెట్ అనే ఎయిర్లైన్ సంస్థను నడుపుతున్నారు. ఇలా అన్ని విధాలుగా ఆస్తులు, వాణిజ్య ప్రకటనలు, బిజినెస్ కలిపితే రామ్ చరణ్ ఆస్తులు రూ.1370 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
ఐటీ దాడులు.. ఆ కార్ల విలువే 60 కోట్లు!
ఢిల్లీ: ఇన్కమ్ టాక్స్ (ఐటీ) దాడులనగానే.. కరెన్సీ లేదంటే నగలు లేకుంటే కీలక పత్రాలు బయటపడుతుండడం చూస్తుంటాం. కానీ, ఖరీదైన కార్లు.. అందునా కోట్లు విలువ చేసే పోష్ కార్లు బయటపడడం ఎప్పుడైనా చూశామా?.. తాజాగా ఓ టొబాకో కంపెనీపై జరిగిన ఐటీ దాడుల్లో ఇదే వెలుగుచూసింది. అధికారుల దాడుల్లో అత్యంత ఖరీదైన కార్లు పట్టుబడ్డాయి. తమ దాడుల్లో కనిపించిన ఖరీదైన కార్లను చూసిన ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారు. శుక్రవారం ఐటీ అధికారుల బృందం.. కాన్పూర్కు చెందిన ఓ టొబాకో కంపెనీపై దాడిలు చేసింది. ఢిల్లీలోని ఆ కంపెనీ యజమాని నివాసంలో కూడా సోదాలు జరిపిపారు. ఈ సోదాల్లో వారికి ఆశ్చర్యపరిచే రీతిలో అత్యంత ఖరీదైన.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెక్లారెన్, లంబోర్ఘిని, ఫెరారీ కార్లు పట్టుపడ్డాయి. వాటివిలువ సుమారు రూ.60 కోట్లు ఉండనుందని ఐటీ అధికారుల అంచనా వేస్తున్నారు. ఆదాయపు పన్ను బృందం అనేక ముఖ్యమైన డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లతో పాటు కంపెనీ యజమాని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. నోట్ల కట్టలతో ఉన్న పలు బ్యాగులతో సుమారు రూ.4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. కాన్పూర్కు చెందిన బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఐటీ అధికారులు గురువారం సాయంత్రం నుంచే సోదాలు చేస్తున్నారు. ఈ కంపెనీలో సంబంధాలు ఉన్న ఐదు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులపై ఏకకాలంలో 15-20 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. పలు పరిశ్రమలకు పొగాకు సంబంధిత సరుకు ఎగుమతి చేసే ఈ కంపెనీ.. భారీ ఎత్తున టాక్స్లు, జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ యజమాని అయిన పారిశ్రామికవేత్త కేకే. మిశ్రా (అలియాస్ మున్నా మిశ్రా) సంబంధించిన ప్రాపర్టీ వివరాలు.. పలువురితో చేసిన ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. బన్సిధర్ టొబాకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. తమకు ఏడాదికి రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల టర్నోవర్ మాత్రమే వస్తుందని చెబుతోంది. కానీ, ఆ కంపెనీ అసలు టర్నోవర్ రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్ల వరకు ఉంటుందని ఐటీ భావిస్తోంది. ఐటీ అధికారుల దాడుల్లో లభ్యమైన పలు ఖరీదైన కార్లతో పోజులు ఇచ్చిన కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రా ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. శివం మిశ్రా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సినిమాలోని ‘కహో నా ప్యార్ హై’ అనే పాటలోని ఉన్న వేషధారణతో ఉండటం గమనార్హం. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రోజు(శుక్రవారం) కూడా ఐటీ దాడుల కొనసాగుతున్నాయి. -
జియో మాల్పై పోలీసుల దాడి: లగ్జరీ కార్లు సీజ్.. స్టోరీ ఏంటంటే?
విలాసవంతమైన జీవితానికి, ఖరీదైన కార్లకు పెట్టింది పేరు రిలయన్స్ అధినేత బిలియనీర్ అంబానీ కుటుంబం. తాజాగా ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్పై పోలీసుల దాడి వార్తల్లో నిలిచింది. ఈ మాల్లో 41 ఖరీదైన కార్లతో పాటు ఫెరారీస్, లంబోర్గినీ లాంటి లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏం జరిగిందంటే..? టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అంబానీకి చెందిన మాల్ పార్కింగ్ స్థలంలో ముంబై పోలీసులు 41 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఫెరారీ, లంబోర్ఘిని, పోర్షెస్ తదితర అత్యాధునిక లగ్జరీ కార్లు ఉన్నాయి. భారతదేశంలోని అతిపెద్ద మాల్స్లో ఒకటి ముఖేష్ అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ దేశంలోనే యాపిల్ స్టోర్ ఉన్న తొలి మాల్ కూడా ఇదే. తాజా వార్తలపై రిలయన్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్, ర్యాలీకిగా ను ముంబై పోలీసుల ముందస్తు అనుమతి పొందలేని కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారని సమాచారం. అయితే ఈ కారు అంబానీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ చెందకపోవడం గమనార్హం. ముంబైలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రిపబ్లిక్ డే రోజున నిర్వహించిన ర్యాలీలో ఫెరారీలు, లంబోర్గినిలు, పోర్షెస్, మెక్లారెన్స్, బిఎమ్డబ్ల్యూలు, జాగ్వార్లు, ఆడి, మెర్సిడెస్తో సహా 100కి పైగా కార్లు పాల్గొన్నాయని అంచనా. దీంతో పబ్లిక్ సర్వెంట్ అండ్ మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ 1951 ద్వారా సక్రమంగా ప్రకటించిన ఆర్డర్ను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కార్ల యజమానులపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నయనతార కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఫోటోలు వైరల్
Mercedes-Benz Maybach: ప్రముఖ నటి నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టినరోజు జరుపుకుంది. బర్త్డే జరిగిన రెండు వారాల తరువాత తన భర్త శివన్ నుంచి ఓ ఖరీదైన గిఫ్ట్ అందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నయనతార కోసం.. శివన్ సుమారు రూ. 3 కోట్ల జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఖరీదైన గిఫ్ట్ అందుకున్న నయన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేస్తూ.. వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, మధురమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, లవ్ యు అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. నయనతార గిఫ్ట్గా పొందిన కారు మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాచ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో ఏ మోడల్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బెంజ్ మేబ్యాచ్ కార్లు జీఎల్ఎస్, ఎస్-క్లాస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఈ రెండు లగ్జరీ కార్ల ధరలు రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ఇప్పటికే ఈ లగ్జరీ కారుని దీపికా పదుకొణె, కృతి సనన్, రామ్ చరణ్ వంటి ప్రముఖ సినీతారలు కూడా కొనుగోలు చేశారు. భారతదేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన బీవేంజ్ కార్లలో మేబ్యాచ్ కూడా ఒకటి. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు దీనిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే..
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ దేశంలో ఖరీదైన అన్యదేశ కార్లను కలిగి ఉంది. గతంలో వీరు చాలా సందర్భాల్లో తమ లగ్జరీ కార్లలో కనిపించారు. తాజాగా మరో సారి ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. అంబానీ ఫ్యామిలీ ఓ గుడికి మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ కార్లలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి కొడుకు అనంత్ అంబానీ బయటకు రావడం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 గార్డ్ గోల్డెన్ షేడ్లో కనిపిస్తోంది. మరోక బెంజ్ ఎస్ 680 కారు కలర్ స్పష్టంగా కనిపించడం లేదు, బహుశా ఇది మాట్టే సిల్వర్ షేడ్ పొందినట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్లు అత్యాధునిక భద్రతలను పొందినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు! నిజానికి ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రతలు కల్పించడంలో భాగంగా ఏ మెర్సిడెస్ బెంజ్ కార్లను చాలా పటిష్టంగా తయారు చేశారు. అంబానీకి కుటుంబానికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ కార్లు దాదాపు 2 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి 3.5 నుంచి 4 ఇంచెస్ మందం గల బుల్లెట్ ప్రూఫ్ మల్టీ-లేయర్ గ్లాస్, స్ప్లింటర్ రక్షణ కోసం పాలికార్బోనేట్ లేయర్ పొందాయి. ఈ సెడాన్లోని ఒక్కో డోర్ బరువు సుమారు 250 కేజీల వరకు ఉంటుంది. వీటి ఒక్కక్క ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
గన్స్ & కార్స్
సాక్షి, హైదరాబాద్: సొంతకారు కూడా లేని సీఎం కేసీఆర్, మంత్రులు మల్లారెడ్డి, సబిత, ఎమ్మెల్యేదానం నాగేందర్ వంటి వారు ఒకవైపు... లగ్జరీ కార్లు, అత్యాధునిక ఆయుధాలున్న హరీశ్రావు, రేవంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, అక్బరుద్దీన్, శ్రీలతారెడ్డి వంటి అభ్యర్థులు మరోవైపు. ఆత్మరక్షణ కోసమో, ఫ్యాషనో, వారసత్వమో కారణమేదైనా పలువురు రాజకీయ నాయకుల వద్ద అత్యాధునిక ఆయుధాలున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు .22 పిస్టల్ వారసత్వంగా రాగా.. యాకుత్పుర బరిలో ఉన్న జాఫర్ అమెరికా కంపెనీ నుంచి తుపాకులు కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి అజారుద్దీన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్ కారులో చక్కర్లు కొడుతుండగా.. హుజూర్నగర్ బరిలో ఉన్న శ్రీలతారెడ్డికి 1.38 కోట్ల ఖరీదైన ఐదు లగ్జరీ కార్లున్నాయి. ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి టెక్సాస్ నుంచి టెస్లా, ల్యాండ్ రోవర్ కార్లు దిగుమతి చేసుకున్నారు. వీరంతా ఆయా వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో పొందుపరిచారు. విదేశాల నుంచి గన్స్ దిగుమతి.. యాకుత్పుర నుంచి పోటీ చేస్తున్న జాఫర్ హుస్సేన్ మిరాజ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఆయుధాల తయారీ సంస్థ స్మిత్, వెస్సన్ బ్రాండ్ తుపాకులు కొనుగోలు చేశారు. రూ.2 లక్షలు ఖరీదైన 32 బోర్ రివాల్వర్, .32 పిస్టల్ రాఫ్టర్ ఈయన వద్ద ఉన్నాయి. రూ.19.50 లక్షల విలువైన ఆడి క్యూ3 కార్ కూడా ఉంది. మలక్పేట అభ్యర్థి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల వద్ద రూ.లక్ష విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన 12 బోర్ గన్లు ఉన్నాయి. బలాలకు రూ.26.69 లక్షలు ఖరీదైన ఇన్నోవా, అర్బన్ క్రూయిజర్ వాహనాలున్నాయి. బలాలకు షహనాజ్ సుల్తానా, తాహేరా ఫర్హా, సనా సుమేరా ముగ్గురు భార్యలు ఉన్నారు. వీరి పేర్ల మీద రూ.59 లక్షలు విలువ చేసే హోండా బీఆర్వీ, టొయోటా ఫార్చ్యూనర్ కార్లున్నాయి. హరీశ్ వర్సెస్ రేవంత్.. రాజకీయ క్షేత్రంలోనే కాదు ఆయు« దాల విషయంలోనూ హరీశ్రావు, రేవంత్రెడ్డి పోటీ పడుతున్నారు. ఆర్థిక మంత్రి తన్నీరు హరీశరావుకు రూ.1.30 లక్షలు విలువ చేసే .32 ఎన్పీ బోర్ పిస్టల్ ఉండగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వద్ద రూ.2 లక్షలు విలువ చేసే పిస్టల్, రూ.50 వేలు విలువైన రైఫిల్ ఉన్నాయి. రేవంత్ పేరు మీద సెకండ్ హ్యాండ్ మెర్సిడెస్ బెంజ్తో పాటు హోండా సిటీ కార్లు కూడా ఉన్నాయి. ఎస్బీబీఎల్ పంప్ యాక్షన్ గన్ మంత్రి శ్రీనివాస్గౌడ్ వద్ద రూ.లక్ష విలువ చేసే రివాల్వర్, రూ.60 వేలు విలువ చేసే 12 బోర్ సింగిల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (ఎస్బీబీఎల్) పంప్ యాక్షన్ గన్ ఉంది. ఆయన భార్య శారద పేరు మీద వోల్వో ఎక్స్సీ 90 కారు ఉంది. 2017లో కొనుగోలు చేసిన ఈ కారు విలువ రూ.71.82 లక్షలు. ఉప్పల్ అభ్యర్థి లక్ష్మారెడ్డి వద్ద రూ.1.50 లక్షలు విలువ చేసే రివాల్వర్తోపాటు రూ.70.82 లక్షల ఖరీదైన బీఎండబ్ల్యూ 530డీ స్పోర్ట్ లగ్జరీ కారు, రూ.34.92 లక్షల ఖరీదైన ఫార్చ్యూనర్ ఉన్నాయి. సలావుద్దీన్ ఒవైసీ నుంచి.. గతంలో హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వద్ద వారసత్వంగా వచ్చిన ఆయుధాలు, కార్లున్నాయి. ప్రధానంగా కుటుంబ సెంటిమెంట్గా భావించే .22 పిస్టల్ ఉంది. దీని విలువ రూ.20 వేలు. దీంతో పాటు వేట కోసం వినియోగించే 30–06 స్ప్రింగ్ ఫీల్డ్ రైఫిల్ ఉంది. దీన్ని 1996లో రూ.20 వేలతో కొనుగోలు చేశారు. 2016లో రూ.11,450తో కొనుగోలు చేసిన 12 బోర్ డబుల్ బ్యారెల్ బ్రీచ్ లోడింగ్ (డీబీబీఎల్) గన్ కూడా ఉంది. తండ్రి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నుంచి బహుమతిగా వచ్చిన జీపు కారు కూడా ఉంది. దీంతో పాటు 2007లో జిప్సీ కారు, 2005లో రూ.2 లక్షలతో కొనుగోలు చేసిన డ్యుకాటీ 900 ఎస్ఎస్ మోటార్ సైకిల్స్ కూడా అక్బరుద్దీన్ పేరు మీద ఉన్నాయి. ఈయన భార్య సాబీనా ఫర్జానా పేరు మీద మహీంద్రా స్కార్పియో వీఎల్ఎక్స్ వాహనం ఉంది. దీని విలువ రూ.12.95 లక్షలు. స్పోర్ట్స్ కారులో అజార్, టెస్లాలో శ్రీలత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ వద్ద రూ.71.89 లక్షలు ఖరీదైన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్స్, రూ.28 లక్షలు విలువైన హోండా సీఆర్–వీ కార్లున్నాయి. హుజూర్నగర్ అభ్యర్థి చల్లా శ్రీలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.1.38 కోట్ల విలువ చేసే ఐదు లగ్జరీ కార్లున్నాయి. రూ.62.63 లక్షల విలువ చేసే టెస్లా కారుతో సహా రూ.29.15 లక్షల హ్యుందాయ్ టక్సన్, రూ.36 లక్షల ఖరీదైన ఇన్నోవా క్రిస్టా, వెంటోతో పాటు రూ.11 లక్షల విలువైన మారుతీ బాలెనో కార్లున్నాయి. ఆదిలాబాద్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి వద్ద 2021 మోడల్ టెస్లా కారు ఉంది. దీని విలువ రూ.51.75 లక్షలు. రూ.18.16 లక్షల విలువైన 2016 మోడల్ ల్యాండ్ రోవర్ వాహనం కూడా ఉంది. వీటిని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. -
భారత్ మార్కెట్లోకి లోటస్ లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ: బ్రిటన్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల బ్రాండు లోటస్ తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. తొలుత ఎలక్ట్రిక్ ’ఎలెటర్ ఆర్’ ఎస్యూవీని ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇందులో మూడు వెర్షన్స్ ఉంటాయి. ధర రూ. 2.55 కోట్ల నుంచి రూ. 2.99 కోట్ల (దేశవ్యాప్తంగా ఎక్స్షోరూమ్) వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 265 కి.మీ.గా ఉంటుంది. 2.95 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని (గంటకు) అందుకోగలదు. ఒకసారి చార్జి చేస్తే ఈ ఫైవ్–సీటరు వాహనంలో గరిష్టంగా 600 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది సంప్రదాయ ఇంధనాలతో నడిచే ఎమిరా స్పోర్ట్స్ కారును కూడా అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది. లోటస్ కార్స్కు భారత్లో అ«దీకృత సంస్థగా ఎక్స్క్లూజివ్ మోటర్స్ వ్యవహరిస్తుంది. లోటస్ కార్లు అధునాతన టెక్నాలజీతో అసమాన అనుభూతిని అందిస్తాయని ఎక్స్క్లూజివ్ మోటర్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. -
అవార్డుల జాతర.. నామినేషన్ కోసం సిద్దమైన కార్లు ఇవే!
2023 అక్టోబర్ 30న 'ఆటో అవార్డ్స్ సెషన్ 3' (Auto Awards Season 3) కార్యక్రమం జరగనుంది. ఇందులో ఫ్యూయెల్, ఎలక్ట్రిక్ కార్లు చూపరులను కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్తో సహా వివిధ విభాగాల్లో అవార్డుల కోసం నామినేషన్లు జరుగుతాయి. సోమవారం (2023 అక్టోబర్ 30న) జరగనున్న ఈ కార్యక్రంలో ఏ అవార్డు ఏ కారు సొంత చేసుకుంటుందనే విషయాలు అధికారికంగా విడుదలవుతాయి. ఆటో అవార్డ్స్ 2023 కార్యక్రమంలో నామినేషన్ కోసం సిద్దమైన కార్ల జాబితా (విభాగాల వారీగా): ఫేస్లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ హోండా సిటీ ఫేస్లిఫ్ట్ ఎంజీ హెక్టర్ ఫేస్లిఫ్ట్ కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (బడ్జెట్ కార్లు) టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్ మారుతి ఫ్రాంక్స్ హ్యుందాయ్ వెర్నా హ్యుందాయ్ ఎక్స్టర్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ (లగ్జరీ కార్లు) మెక్లారెన్ ఆర్టురా మెర్సిడెస్ ఏఎంజీ ఎస్ఎల్ 55 4మ్యాటిక్ ప్లస్ రోడ్స్టర్ ఆస్టన్ మార్టిన్ డీబీ12 హ్యుందాయ్ ఐయోనిక్5 ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎంజీ కామెట్ సిట్రోయెన్ ఈసీ3 టాటా నెక్సాన్ ఈవీ ఫేస్లిఫ్ట్ ఇదీ చదవండి: రూ.20 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే కార్లు - వివరాలు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4 మ్యాటిక్ వోల్వో C40 రీఛార్జ్ బీఎండబ్ల్యూ ఐ7 ఆడి క్యూ8 ఈ-ట్రాన్ -
స్టార్ కమెడియన్ కళ్లు చెదిరే ఇల్లు, ఆస్తి గురించి తెలుసా?
Comedian Kapil Sharma net worth స్టార్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన కామిక్ టైమింగ్, డైలాగ్ డెలివరీతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కపిల్ శర్మ పలు బాలీవుడ్ మూవీల్లో కూడా నటుడిగా సత్తా చాటాడు. ముఖ్యంగా తన కామెడీ షో, కామెడీ నైట్స్ విత్ కపిల్ తో పాపులర్ అయ్యాడు. దీంతోపాటు చాలా షోలకు హోస్ట్గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలో కపిల్ శర్మ నెట్వర్త్, కార్లు, తదితర వివరాలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్లో చక్కటి ఫాం హౌస్తోపాటు, ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. దీంతో పాటు లోఖండ్వాలాలో మరొక లగ్జరీ ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది. విజయవంతమైన కెరీర్తో పాటు, కపిల్ అందమైన కుటుంబం కూడా ఆయన సొంతం. గర్ల్ ఫ్రెండ్ గిన్ని చత్రాత్ను డిసెంబర్ 12, 2018న వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె అనయ్రా ,కుమారుడు త్రిషాన్ను ఉన్నారు. ఇక కపిల్ ఆస్తిపాస్తులను గమనిస్తే మీడియా నివేదికలప్రకారం స్వస్థలమైన పంజాబ్లో అందమైన ఫామ్హౌస్ని కూడా కలిగి ఉన్నాడు. ఈ ఫామ్హౌస్ విలువ రూ. 25 కోట్లు. పంజాబ్ గొప్ప సాంస్కృతిక వారసత్వంతో బహుళ ఎకరాల్లో విస్తరించి ఉందీ విశాలమైన ఎస్టేట్. ఈ విలాసవంతమైన రిసార్ట్ చుట్టూ పచ్చని పొలాలు , అందమైన పూదోటలతో,అత్యాధునిక ఫీచర్లతో ప్రకృతి ఒడిలో ఒక రాజభవనంలా ఉంటుంది. విజువల్ ట్రీట్ అందించే ఈ ఫామ్హౌస్లో విశ్రాంతి, వినోదానికి ఎక్కడా కొదవే ఉండదు. విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్, ఇంటి బయట గెజిబో, అందమైన ఫౌంటెన్తో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ముంబైలోని పశ్చిమ శివార్లలో లగ్జరీ అపార్ట్మెంట్ కూడా ఉంది. భార్య గిన్ని చత్రత్, పిల్లలతో ఈ ఇంట్లో నివసిస్తున్నాడు. దీని ధర 15 కోట్లకు పైమాటే. జిమ్, టెర్రస్ గార్డెన్, సినిమా థియేటర్ ఉన్న ఈ యింటికి సంబంధించిన ఫోటోలను కపిల్ భార్య గిన్ని చత్రాత్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో పోస్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే దీపావళి సందర్భంగా ఈ ఇంటిని బాగా అలంకరించడం వారికి అలవాటు. విలాస వంతమైన ఫర్నిచర్, అద్భుత లైట్లు, మొక్కలు, బుద్ధ విగ్రహంతో తీర్చిదిద్దిన బాల్కనీ వీడియోను గతంలో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కపిల్ శర్మ నెట్వర్త్ స్టాండ్-అప్ కమెడియన్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటుడు, టెలివిజన్ నిర్మాతగా ఉన్న కపిల్ శర్మ నికర విలువ సుమారు రూ.280 కోట్లు. గత 5 సంవత్సరాలలో ఆయన సంపద 380 శాతం పెరిగింది. నెలవారీ ఆదాయం ,జీతం 3 కోట్లు. తాజా వార్తల ప్రకారం తన షో కొత్త సీజన్ కోసం, అతను ఒక్కో ఎపిసోడ్కు రూ. 50 లక్షలు వసూలు చేస్తాడు. ఇది కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తాడు. ఒక్కో ఎండార్స్మెంట్కు కోటి రూపాయలు చార్జ్ చేస్తాడు. ఇక దాతృత్వం విషయంలో గొప్ప మనుసు చాటుకునే టాప్ సెలబ్రిటీలలో ఒకడు. భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడుగా ఉన్నాడు. ఖరీదైన కార్ కలెక్షన్ కపిల్ శర్మ , గిన్ని చత్రత్ జంట ఖరీదైన కార్ కలెక్షన్ , ఇతర లగ్జరీ వస్తువులతోపాటు, హై-ఎండ్ ఆటోమొబైల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫెరారీ, పోర్షే లాంటి అత్యాధునిక కార్లు అంటే పిచ్చి. రూ. 1.36 ఖరీదైన Mercedes Benz S350 CDI, రూ. 80 లక్షల వోల్వో XC 90, రేంజ్ రోవర్ ఎవోక్ Mercedes-Benz S-క్లాస్, BMW X7 హోండా సివిక్ లాంటి కార్లున్నాయి. DC డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ దిలీప్ ఛబ్రియా డిజైన్ చేసిన వానిటీ వ్యాన్ విలువ రూ. 5.5 కోట్లు . బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్. లాంజ్ ఏరియాతో కూడిన ఖరీదైన ఇంటీరియర్ దీని సొంతం. -
భర్త కంటే 120 రెట్లు ఎక్కువ: పరిణీతి షాకింగ్ నెట్వర్త్, లగ్జరీ కార్లు
Pari-Raghav Chadha Networth బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ వేడుక, ఫోటోలు ఇంటర్నెట్లో లేటెస్ట్ బజ్గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది మేలో నిశ్చితార్థం చేసుకున్న లవ్బర్డ్స పరి- రాఘవ్ చద్దా లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ముచ్చటగా సాగింది. అలాగే పెళ్లి దుస్తుల్లో సరికొత్త లుక్లోఈ జంట మెరిసిపోయారు. ఈక్రమంలో వారి ఆస్తి ఎంత అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రాఘవ్ కంటే పరిణీతి నెట్వర్త్ 120 రెట్లు ఎక్కువ అని టాక్. 2011లో విడుదలైన లేడీస్ వర్సెస్- రికీ బాహ్ల్ సినిమాతో తెరంగేట్రం చేసిన అనేక సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఆమె ఒకరు. సినిమాలతో బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తుంది. దీంతో పరిణీతి చోప్రా నికర విలువ సుమారు 74 కోట్లుగా అంచనా. పరిణీతి ఆడి డ్రైవ్ చేస్తే, భర్త రాఘవ్ స్విఫ్ట్ డిజైర్ను నడుపుతాడు అంటూ సోషల్ మీడియాలోకమెంట్లు వినిపిస్తున్నాయి. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) పలు మీడియా నివేదికల ప్రకారం ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన క్లెన్స్టాలో మైనారిటీ వాటా, హైదరాబాద్కు చెందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ తృతీయలో పెట్టుబడులు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో ఒక అద్భుతమైన అపార్ట్మెంట్ పరిణీతి సొంతం. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంటి ఇంటీరియర్స్ తో అద్భుతంగా కనిపించే ఈ ఇల్లు ధర సుమారు రూ. 22 కోట్లు (బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?) లగ్జరీ కార్లు పరిణీతికి కూడా ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. రూ. 99.56 లక్షలు జాగ్వార్ XJL,దాదాపు రూ 1.30 కోట్ల లువైన రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ కార్లు పరిణీతి సొంతం. ఇంకా 43.19 లక్షల విలువైన ఆడి క్యూ4, రూ. 69.27 లక్షలు Q7, ఆడి ఏ-6 లాంటివి కూడా ఆమె గ్యారేజ్లో ఉన్నాయి. ఆమె ధరించే దుస్తులు, బ్యాగ్లు స్పెషల్ ఎట్రాక్షన్గా ఉంటాయి. బ్రాండెడ్ బ్యాగ్స్, షూ ఫ్యాన్ 2.05 లక్షల ఖరీదుచేసే లూయిస్ విట్టన్ న్యూ వేవ్ మల్టీ-పోచెట్ బ్యాగ్తో కనిపించింది .అలాగే ఒక ఈవెంట్లో ఆమె ధరించిన ఫిగర్-హగ్గింగ్ ఫెండీ దుస్తుల ధర సుమారు 1.64 లక్షలు. అంతేకాదు పరిణీమి షూ ఫ్యాన్ కూడా. జిమ్మీ చూ నుండి బాలెన్సియాగా వరకు అన్ని హై-ఎండ్ బ్రాండ్లంటే మోజు. నటిగానే కాకుండా ఒక అద్భుతమైన గాయని కూడా. ప్లేబ్యాక్ సింగర్గా ఐకానిక్ సాంగ్ బతెరి మిట్టి మహిళా వెర్షన్తో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆయుష్మాన్ ఖురానా సరసన 2017లో వచ్చిన రొమాంటిక్ డ్రామా మేరీ ప్యారీ బిందులో గాయనిగా విశ్వరూపాన్ని చూపించింది ఇషాక్జాదే (2012), శుద్ధ్ దేశీ రొమాన్స్ (2013), హసీ తో ఫేసీ (2014), డిషూమ్ (2016), గోల్మాల్ ఎగైన్ (2017) బ్లాక్బస్టర్ హిట్మూవీల్లో నటించిన పరిణీతి మిషన్ రాణిగంజ్లో అక్షయ్ కుమార్తో కలిసి పరిణీతి చోప్రా కనిపించనుంది.ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘చమ్కిలా’లో దిల్జిత్ దోసాంజ్తో కలిసి చమ్కిలా లో యాక్ట్ చేసింది. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన పరిణీతి పరిణీతి చోప్రా 1988న అక్టోబర్ 22న న హర్యానాలోని అంబాలాలో జన్మించింది. పరిణీతి చోప్రా ధనిక కుటుంబం నుంచి వచ్చింది. తండ్రి, పవన్ చోప్రా, వ్యాపారవేత్త, అంబాలా కంటోన్మెంట్లో భారతీయ సైన్యానికి డీలర్ కూడా తల్లి రీనా చోప్రా. అంబాలాలోని జీసస్ మేరీ కాన్వెంట్లో, UKలోని మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్, ఎకనామిక్స్ ఫైనాన్స్లో ట్రిపుల్ హానర్స్ డిప్లొమా పొందింది. అలాగే మ్యూజిక్లో బి.ఎ. హానర్స్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు 43.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. యష్ రాజ్ ఫిల్మ్ ప్రొడక్షన్స్కు PRగా తన వృత్తిని ప్రారంభించింది. రాఘవ్ చద్దా నికర విలువ రాఘవ్ చద్దా పార్లమెంటులో అతి పిన్న వయస్కుడిగా పాపులర్అయిన ఈ ఆప్ ఎంపి.యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ వంటి ప్రసిద్ధ సంస్థల్లో విద్యనభ్యసించాడు. నికర విలువ రూ. 50 లక్షలుగా తెలుస్తోంది. పరిణీతి లగ్జరీ కార్లతోపోలిస్తే రాఘవ్ చద్దా వద్ద ఉన్నది స్విఫ్ట్ డిజైర్ కారు. -
భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది!
భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా చాలా మంది కొత్త కార్లను లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో మార్కెట్లో ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లగ్జరీ వాహన తయారీ సంస్థలు ఈ సమయం కోసం వేచి చూస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలతో పాటు జపనీస్ కంపెనీ లెక్సస్ కూడా పండుగ సీజన్లో తమ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ నాలుగు నెలల పాటు ఉంటుందని ఈ సమయంలో అమ్మకాల వృద్ధి ఎక్కువగా ఉంటుందని బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'సంతోష్ అయ్యర్' తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కార్లతో పాటు హై ఎండ్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖరీదైన కార్లు దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేస్తున్నాయి. గతం కంటే దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ 'నవీన్ సోనీ' అన్నారు. ఇదీ చదవండి: దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా! 2022 పండుగ సీజన్తో పోలిస్తే ఈ ఏట లగ్జరీ కార్ల బుకింగ్స్ & అమ్మకాలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ 3,474 యూనిట్లను రిటైల్ చేసి 97 శాతం వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు.. ఆడి ఏ4, ఏ6, క్యూ3 అండ్ క్యూ5 వంటి మోడళ్లకు దేశీయ విఫణిలో బలమైన డిమాండ్ ఉందని ధిల్లాన్ వెల్లడించారు. వీటితో పాటు క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్బ్యాక్ ఈ-ట్రాన్లతో ఈవీ పోర్ట్ఫోలియో రోజు రోజుకి విస్తరిస్తోంది. ఇటీవల కంపెనీ క్యూ8 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పండుగ సీజన్ మొత్తంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10 లక్షల యూనిట్లు దాటవచ్చని అంచనా. -
ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పరిశీలిస్తున్నాం...
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) దేశీయంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు (బీఈవీ) గల డిమాండ్ను పరిశీలిస్తోంది. తదనుగుణంగా మరిన్ని మోడల్స్ను ప్రవేశపెట్టడానికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించుకోనుంది. జేఎల్ఆర్ ప్రస్తుతం జాగ్వార్ భారత్లో ఐ–పేస్ అనే ఏకైక ఎలక్ట్రిక్ మోడల్ను విక్రయిస్తోంది. జేఎల్ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా లగ్జరీ వాహనాల సెగ్మెంట్ వేగంగా వృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ మార్కెట్లో విక్రయాల వృద్ధి అత్యంత మెరుగ్గా ఉండగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 1,048 యూనిట్ల విక్రయాలతో అత్యుత్తమ పనితీరు కనపర్చినట్లు పేర్కొన్నారు. అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా తమ సేల్స్ నెట్వర్క్ను కూడా విస్తరించే పనిలో ఉన్నట్లు రాజన్ వివరించారు. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 సేల్స్ అవుట్లెట్స్, 27 సరీ్వస్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. జేఎల్ఆర్ ఇటీవలే కొత్త రేంజ్ రోవర్ వేలార్ వాహనాన్ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 94.3 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇప్పటికే వేలార్కు 750 బుకింగ్స్ వచ్చాయని, ఏటా 1,500 యూనిట్ల మేర అమ్మకాలకు అవకాశాలు ఉన్నాయని రాజన్ చెప్పారు. -
ప్రౌడ్ ఫాదర్ జస్ప్రీత్ బుమ్రా నెట్వర్త్, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?
స్కిల్డ్ పేసర్గా పాపులర్ అయిన భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయిన ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న బుమ్రా అంగద్ జస్ప్రీత్ బుమ్రా అంటూ తన బుజ్జాయి పేరును కూడా ప్రకటించేశాడు. దీంతో బుమ్రా-సంజన దంపతులకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఫ్యాన్స్ కూడా తెగ సంతోష పడిపోతున్నారు. ఈ క్రమంలో బుమ్రా నెట్వర్త్, కార్లు తదితర ఆస్తులపై ఆసక్తి నెలకొంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి, క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో జట్టులో కీలక క్రికెటర్గా ఎదిగిన వాడు బుమ్రా. తనదైన స్పెషల్ బౌలింగ్ యాక్షన్ , యార్కర్లతో నిలకడైన బౌలింగ్ సామర్థ్యంతో పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బుమ్రా తరువాతే ఎవరైనా. ఇప్పటివరకు తన చిన్న కెరీర్లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. బుమ్రా 2013 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతూ జట్టుకు కీలక టైటిళ్లను అందించిన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. మరి ఇంత పాపులర్ అయిన బుమ్రా సంపాదన, ఇతర వివరాలను పరిశీలిస్తే.. వివిధ మీడియా నివేదికల ప్రకారం 2023 మార్చి నాటికి జస్ప్రీత్ బుమ్రా నికర విలువ రూ. 55 కోట్లు(7 మిలియన్ డాలర్లు)గా అంచనా. అలాగే కాంట్రాక్టు ఆటగాళ్లకు బీసీసీఐ చెల్లింపు విధానం ప్రకారం బుమ్రా వార్షిక వేతనం రూ.7 కోట్లు. దీనికి తోడు భారత జట్టు కోసం ఆడే ప్రతి టెస్ట్, ODI, T20I మ్యాచ్లకు అందే రెమ్యునరేషన్ వరుసగా రూ. 15 లక్షలు, రూ. 6 లక్షలు , రూ. 3 లక్షలు. View this post on Instagram A post shared by Sanjana Ganesan (@sanjanaganesan) బ్రాండ్లు భారత క్రికెట్ జట్టు గ్రౌండ్లో స్టార్ క్రికెటర్గానే కాదు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టీమ్ కాంట్రాక్టులు,బ్రాండ్ ఎండార్స్మెంట్లు ద్వారా కూడా బుమ్రా సంపాదన పెరుగుతూనే ఉంది. బుమ్రా డ్రీమ్11, ఆసిక్స్, వన్ప్లస్ వేరబుల్స్, జాగల్, బోట్, సీగ్రామ్ రాయల్ స్టాగ్, కల్ట్స్పోర్ట్, ఎస్ట్రోలో, యునిక్స్ భారత్ పే వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లు అతని చేతిలో ఉన్నాయి. ప్రముఖ క్రికెట్ యాంకర్ సంజనా గణేశన్తో పెళ్లి తరువాత బుమ్రా పూణేలోని అనేక ఆస్తులతో పాటు, ముంబైలో సుమారు రూ. 2 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లును సొంతం చేసుకున్నాడు. 2015లో అహ్మదాబాద్లో విలాసవంతమైన డిజైనర్ ఇంటిని కొనుగోలు చేశాడు.దీని విలువ ప్రస్తుతం రూ. 3 కోట్లు. ఈ ఆస్తులతో పాటు దేశ వ్యాప్తంగా పలు రియల్ ఎస్టేట్ ఆస్తులను కూడా కలిగి ఉన్నాడు. లగ్జరీ కార్లు: బుమ్రా గ్యారేజీలో రూ. 2.54 కోట్ల విలువైన మెర్సిడెస్-మేబ్యాక్ S560, రూ. 2.17 కోట్ల విలువైన నిస్సాన్ GT-R, రూ. 90 లక్షల విలువైన రేంజ్ రోవర్ వెలార్ , టయోటా ఇన్నోవా క్రిస్టా ఉన్నాయి. వీటి విలువ రూ.25 లక్షలు. కాగా బుమ్రా డిసెంబర్ 6, 1993న గుజరాత్లోని అహ్మదాబాద్లో జన్మించాడు. తన సొంత రాష్ట్రం గుజరాత్ కోసం ఆడుతున్న క్రమంలో ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. 2013లో, జస్ప్రీత్ తన తొలి ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియాలో జస్ప్రీత్ బుమ్రా జనవరి 2016లో, జస్ప్రీత్ ఆస్ట్రేలియాపై అంతర్జాతీయ T20 అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు తన కెరీర్లో, బుమ్రా 2019లో ICC ODI ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెల్చుకున్నాడు. View this post on Instagram A post shared by jasprit bumrah (@jaspritb1) ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న జస్ ప్రీత్ బుమ్రా ఇండియాకు తిరిగి రావడంతో ఫ్యాన్స్ను గందరగోళంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో భాగంగా భారత్, పాకిస్తాన్ (IND vs PAK మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా నేపాల్తో జరగనున్న మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే, సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఆ భారత్ సూపర్-4కు క్వాలిఫై అయిన తరువాత పాకిస్తాన్తో సెప్టెంబర్ 10న తదుపరి మ్యాచ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం తండ్రిగా ప్రమోట్ అయిన ఆనందంలో ఉన్న బ్రుమా సూపర్-4 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
టాలీవుడ్ మన్మధుడి కళ్లు చెదిరే నెట్వర్త్, కార్లు, ఇల్లు ఈ విషయాలు తెలుసా?
ఇండియన్ సౌత్ ఫిల్మ్స్ మెగాస్టార్ గురించి పరిచయం అవసరం లేదు. 63 ఏళ్ల వయసులో కూడా టాలీవుడ్ మన్మధుడిగా అక్కినేని నాగార్జున ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో ఒకరు. అలనాటి టాప్ హీరో దివంగత అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ, తనదైన నటన, ప్రతిభతో సూపర్ స్టార్గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను మాత్రమేకాదు బాకాఫీస్ బ్లాక్ బస్టర్ మూవీలతో అటు దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు. అద్భుత నటనలో విమర్శకుల ప్రశంసలందుకున్న నటుడు. కేవలం నటుడుగా మాత్రమే కాదు నిర్మాతగా, థియేటర్ ఆర్టిస్ట్, పాపులర్ టీవీ షోకు హోస్ట్గా పాత్ర ఏదైనా తనదైన శైలిలో ఆకట్టు కోవడం ఆయన స్పెషాల్టీ. ‘నాగ్’ బర్తడే సందర్భంగా ఆయన నెట్వర్త్ తదితర విషయాలను గురించి చూద్దాం. 1959, ఆగస్టు 29న చెన్నైలో పుట్టిన నాగార్జున 1986లో తెరంగేట్రం చేశారు. అనతికాలంలోనే అనేక బాక్లబస్టర్ సినిమాలను అందించి స్టార్గా తన వారసత్వాన్ని నిలుపు కున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎవర్ గ్రీన్ కింగ్ నటనా ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. అలాగే హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నటుల్లో ఒకరిగా ఉన్నాడు. దేశంలో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో నాగార్జున కూడా ఒకరు. 2016లో మొత్తం ఆదాయపు పన్ను చెల్లింపులు రూ.16 కోట్లకు పైగా ఉన్నాయి. 2023 నాటికి నాగార్జున నికర విలువ 950 కోట్ల రూపాయలుగా ఇండస్ట్రీ వర్గాల అంచనా. వార్షిక ఆదాయం దాదాపు 40కోట్ల రూపాయలు. నాగార్జున లగ్జరీ కార్లు: BMW 7-సిరీస్ , ఆడి A-7 తదితర కార్లు ఉన్నాయి. వీటిలో ఒక్కో కారు ధర 1- 2.5 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగం సినిమాలే. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం భారీ మొత్తంలోనే వసూలు చేస్తాడని ఇండస్ట్రీ టాక్. నాగార్జునకు హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్లోని లగ్జరీ భవనం ఉంది. దీని అంచనా విలువ దాదాపు రూ.42.3 కోట్లు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు ఆస్తులు కూడా ఉన్నాయి.రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ పెట్టుబడులున్నాయి. ప్రస్తుతానికి కళ్యాణ్ జ్యువెలర్స్ మినహా కళ్యాణ్ జ్యువెలర్స్కు అక్కినేని నాగార్జునకు బ్రాండ్ ఎండార్స్మెంట్లు లేవు. దీనికి ఏడాదికి రూ.2 కోట్లు తీసుకుంటాడు. మరో పాపులర్ షోకు సంబంధించి 40 ఎపిసోడ్ల షో కోసం నాగార్జున రూ.3 కోట్లు ప్లస్ రెమ్యునరేషన్ను ఆఫర్ చేసినట్లు తాజా సంచలనం. ఒక్కో సినిమాకు ఆయన తీసుకునే రెమ్యునరేషన్ 9-11 కోట్ల ఉంటుంది. దీనికి తోడు కేబీసీ తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడుకి నాగార్జున హోస్గ్గా భారీ మొత్తంలోనే సంపాదించాడు. నాగార్జున పలు సామాజిక, సంక్షేమ కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. HIV/AIDS అవగాహన ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. 2010లో, అతను స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో స్థాపించబడిన టీచ్ఎయిడ్స్ రూపొందించిన ఒక HIV/AIDS యానిమేటెడ్ సాఫ్ట్వేర్ ట్యుటోరియల్లో కూడా నటించాడు. -
మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా..
తెలుగు సినీ ప్రపంచంలో అగ్రగామి నటుడిగా కీర్తి పొంది, ఎంతోమంది యువ నటులకు ఆదర్శమైన 'చిరంజీవి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే నేడు మెగాస్టార్ జన్మదిన సందర్భంగా ఆయన ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారు? నెట్వర్త్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే 150 కంటే ఎక్కువ చిత్రాలలో నటించిన చిరంజీవికి అన్యదేశ్య కార్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే బ్రిటన్, జర్మన్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ (Rolls Royce Phantom) ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' చిరంజీవి గ్యారేజిలో ఉంది. ఈ కారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దగ్గర కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 8 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. ఈ కారుని రామ్ చరణ్ చిరంజీవి 53వ పుట్టినరోజు గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోల్స్ రాయిస్ ఫాంటమ్ అద్భుతమైన డిజైన్ కలిగి 6.8 లీటర్ వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 460 Bhp పవర్ అండ్ 720 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టయోటా ల్యాండ్ క్రూయిజర్ (Toyota Land Cruiser) చిరంజీవి గ్యారేజిలో రెండు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి భారతీయ మార్కెట్లో విడుదలకాక ముంచే దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వినియోగిస్తారు. సేఫ్టీ పరంగా ప్రసిద్ధి చెందిన ఈ కారు చాలామంది సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ. 1 కోటి కంటే ఎక్కువే. రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue) ల్యాండ్ రోవర్ కంపెనీకి రేంజ్ రోవర్ వోగ్ కూడా మెగాస్టార్ గ్యారేజిలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోగ్ కారు కంటే కూడా పాత వెర్షన్ అత్యంత శక్తివంతమైన ఇంజిన్ పొందుతుంది. దీని ధర కూడా రూ. కోటి కంటే ఎక్కువే అని తెలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేంజ్ రోవర్ వోగ్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్లతో లభిస్తుంది. ఇదీ చదవండి: నీరు తాగి మనిషి చేతులు కడిగిన చింపాంజీ - ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్! నెట్వర్త్ (Net Worth) చిరంజీవికి హైదరాబాద్ నగరంలో అత్యంత విశాలమైన & విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇది రూ. 30 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ బంగ్లాను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీకి చెందిన ఆర్కిటెక్చరల్, ఇంటీరియర్ డిజైన్ సంస్థ రూపొందించింది. ఇందులో అవుట్డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్, ఫిష్పాండ్ అండ్ గార్డెన్ స్పేస్ వంటివి ఉన్నాయని చెబుతారు. ఇదీ చదవండి: దినేష్ ఠక్కర్ గ్యారేజిలో మరో సూపర్ కారు.. ధర ఎన్ని కోట్లంటే? చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. 1988లో నాగబాబుతో కలిసి 'అంజన ప్రొడక్షన్స్ హౌస్' స్థాపించారు. ఇది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధ బ్యానర్లలో ఒకటిగా నిలిచింది. మొత్తం మీద మెగాస్టార్ ఆస్తుల విలువ సుమారు రూ. 1650 కోట్ల కంటే ఎక్కువ అని సమాచారం. -
మెర్సిడెస్ నుంచి మరో 4 మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది భారత మార్కెట్లో మరో 4 మోడళ్లను పరిచయం చేస్తోంది. 2023లో ఇప్పటికే ఆరు మోడళ్లు రోడ్డెక్కాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. కొత్త జీఎల్సీని హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 10 మోడళ్లను తీసుకు రావాలని నిర్ణయించామన్నారు. ‘వచ్చే 12–18 నెలల్లో 3–4 ఎలక్ట్రిక్ మోడళ్లు ప్రవేశపెడతాం. కొత్త జీఎల్సీ దేశవ్యాప్తంగా 1,500 బుకింగ్స్ నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 200 ఉన్నాయి. జనవరి–జూన్లో అన్ని మోడళ్లు కలిపి 8,500 యూనిట్లు విక్రయించాం. జూలై–డిసెంబర్లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. -
‘దేవర’ స్టార్ యాక్టర్ నెట్వర్త్, లగ్జరీ కార్లు: తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ప్యాన్ ఇండియాస్టార్ జూ.ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీ దేవర మూవీలో విలన్ అలరించబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్. బర్త్డే సందర్భంగా సైఫ్ ఫస్ట్ లుక్ బాగానే ఆకట్టుకుంది. దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్న సైఫ్ భారీ బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీసు వద్ద భారీ హిట్ల లిస్ట్ పెద్దదే. మంచి నటుడిగా, ఫిట్నెస్ ఫ్రీక్గా అంతకుమించి బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ భర్తగా మంచి మార్కులే కొట్టేశాడు.ఆ క్రమంలో సైల్ అలీ ఖాన్ ఆస్తిఎంత? సినిమాకు ఎంత తీసుకుంటాడు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. View this post on Instagram A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) పర్సనల్ లైఫ్, రాయల్ ఫ్యామిలీ 1970, ఆగస్టు 16న నటుడు, ప్రముఖ క్రికెటర్ , భారత జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిలా టాగోర్ ల కుమారుడే సైఫ్ అలీ ఖాన్. సైఫ్ పూర్వీకులు పటౌడీ సంస్థానానికి చెందిన నవాబులు. ఇతని ముత్తాత ఇఫ్తికార్ అలీఖాన్ పటౌడీ, తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడిలు నవాబులుగా చలామణి అయ్యారు. సబా అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ అనే ఇద్దరు చెల్లెళ్లున్నారు. 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్తో వివాహ జరిగింది. వీరికి సారా అలీ ఖాన్ ,ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు సంతానం.. అయితే 13 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత 2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012, అక్టోబర్ 16న బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు తైమూర్ అలీ ఖాన్ , జహంగీర్ అలీ ఖాన్ అనే ఇద్దరు కుమారులున్నారు. దశాబ్దాల సినీ కరియర్ 1993లో సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన దగ్గరనుంచీ ఐకానిక్ క్యారెక్టర్స్తో వెనుదిరిగి చూసింది లేదు. ఓంకార, లవ్ ఆజ్ కల్, కల్ హో నా హో, హమ్ తుమ్, దిల్ చాహ్తా హై, తన్హాజీ: ది అన్సంగ్ వారియర్, లాల్ కప్తాన్, మెయిన్ ఖిలాడి తూ అనారీ, పరిణీత, సలామ్ నమస్తే, రేస్ ఆదిపురుష్ , బంటీ ఔర్ బబ్లీ-2తదితర చిత్రాలలో సైఫ్ గుర్తుండిపోయే పాత్రలు చాలా ఉన్నాయి. సైఫ్ అలీఖాన్ కోట్ల విలువైన ఆస్తులు మీడియా నివేదిక ప్రకారం, సైఫ్ అలీ ఖాన్ రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పెట్టుబడి పెట్టాడు. ముంబైలోని ప్రసిద్ధ ఫార్చ్యూన్ హైట్స్ భవనంలో విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. దీని విలువ దాదాపు రూ. 4.2 కోట్లు. దీంతోపాటు సైఫ్ తమ అపార్ట్మెంట్కి ఎదురుగా ఉన్న విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది దీన్ని అద్దెకిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ముంబైలో 6 కోట్లు విలువ చేసే మరో లగ్జరీ బంగ్లా కూడా ఉంది. జిస్టాడ్లో సైఫ్ అలీ ఖాన్ చాలెట్ విలువ రూ. 33 కోట్లు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్కి ఫారిన్ లొకేషన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీతో కలిసి విదేశాలలో కొత్త ప్రదేశాల్లో చక్కర్లు కొట్టి వస్తుంటాడు. స్విట్జర్లాండ్లో జిస్టాడ్లో చాలెట్( ఫాంహౌస్ లాంటిది) ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీని రూ. రూ. 33 కోట్లు. భార్య కరీనా, పిల్లలు తైమూర్ , జహంగీర్ అలీ ఖాన్లతో కలిసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. సైఫ్ అలీ ఖాన్ పూర్వీకుల ఇల్లు, పటౌడీ ప్యాలెస్ ముంబైలో సైఫ్ అలీ ఖాన్ కలిగి ఉన్న అన్ని అత్యంత ఖరీదైన ఆస్తులతో పాటు, హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ చాలా ప్రత్యేకమైన ఆస్తిగా చెప్పుకోవచ్చు. సైఫ్ వారసత్వ సంపద విలువ రూ. 5000 కోట్లు. చివరి పాలక నవాబ్ ఇఫ్తికార్ ఖాన్, దివంగత మన్సూర్ అలీ ఖాన్ వారసత్వ ఆస్తిలో ముఖ్యమైంది. పటౌడీ ప్యాలెస్ 'ఇబ్రహీం కోఠి' పేరుతో కూడా పిలుస్తారు.150 గదులు, ఏడు బెడ్రూమ్లు, పలు డ్రాయింగ్ రూమ్లు, ఏడు బిలియర్డ్ రూమ్లులాంటి ఫీచర్లతో హర్యానాలో 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. బహుళ నివేదికల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్కు చెందిన పటౌడీ ప్యాలెస్ విలువ రూ. 800 కోట్లు. అలాగే భోపాల్లోని పటౌడీ ప్యాలెస్ రూ. 4,200 కోట్లు. లగ్జరీ కార్లు రాయల్ ఇమేజ్, డాషింగ్ యాక్టర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూపర్ కార్లు అతని గ్యారేజీలోఉన్నాయి. లగ్జరీ కార్ కలెక్షన్లో ఫోర్డ్ మస్టాంగ్ జిటి (రూ. 74 లక్షల నుండి రూ. 76 లక్షలు), రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.39 కోట్ల నుండి 4.17 కోట్లు), ల్యాండ్ రోవర్ డిఫెండర్ (రూ. 93 లక్షలు) , లెక్సస్ 470 (రూ. 35 లక్షల నుండి రూ. 38 లక్షలు), BMW 7 సిరీస్ (రూ. 1.70 కోట్లు), బెంజ్ ఎస్- క్లాస్ (రూ. 1.71 కోట్ల నుండి 1.80 కోట్లు), ఆడి R8 (రూ. 2.72 కోట్లు) . డైమండ్ రోలెక్స్ వాచ్ ఖరీదైన బంగ్లా, కార్లతోపాటు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, రాయల్ వాచీల కలెక్షన్ సైఫ్ సొంతం. బ్రూనై సుల్తాన్ కుమార్తె నుండి తనకు లభించిన బహుమతి అని సైఫ్ ఒక సందర్భంలో వెల్లడించాడు. అంతేకాదు కోటి రూపాయల విలువైన లగ్జరీ వాచ్ను ఒకానొక సందర్బంగా విక్రయించాలని చూశాననీ, ఆ తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకుని తన భార్య కరీనా కపూర్కి ఇచ్చినట్టు తెలిపాడు. రెమ్యూనరేషన్, నెట్వర్త్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్లో ‘రావణ్’ పాత్రకోసం 12 కోట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతని రెమ్యూనరేషన్ రూ. ఒక్కో సినిమాకు 10-15 కోట్లుగా అంచనా. దీంతోపాటు బ్రాండ్ ఎండార్స్మెంట్స్, ఓటీటా ప్రాజెక్ట్లలో కూడా చాలా యాక్టివ్. అలా వార్షిక ఆదాయంరూ. 28 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు పైమాటే. సో సుదీర్ఘకాలంగా బాలీవుడ్లో కొనసాగుతున్న సైఫ్ అలీ ఖాన్ నికర విలువ సుమారు రూ. 1,180 కోట్లుగా ఉంటుందని అంచనా. -
HBDMaheshBabu: మహేష్బాబు నెట్వర్త్, లగ్జరీ కార్లు,ఖరీదైన జెట్, ఈ విషయాలు తెలుసా?
సౌత్సూపర్ స్టార్, తెలుగు సినిమా దిగ్గజం మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్తో పాటు, అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోల్లో ఒకరు. టాలీవుడ్కి అనేక బ్లాక్బస్టర్ సినిమాలను అందించిన మహేష్ బాబు బర్త్డే సందర్బంగా ఆయన లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లపై ఫ్యాన్స్లో భారీ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పరిసరాల్లో అద్భుతమైన, విలాసవంతమైన ఇంట్లో టాలీవుడ్ ప్రిన్స్ ,భార్య నమ్రతా శిరోద్కర్ , గౌతమ్ , సితారతో ఉంటాడు. ఈ ఇంట్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్, హోమ్ జిమ్, బహుళ బెడ్రూమ్లతో పాటు విశాలమైన, ఖరీదైన పెరడు లాంటి పలు విధ సౌకర్యాలతో కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాదు తన సన్నిహితులు, ఫ్యామిలీ మెంబర్స్తో ఈ బ్యాక్యార్డ్లో ఎక్కువగా పార్టీలు ఇస్తూ ఉంటాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు దీని విలువ రూ. 28 కోట్లు. దీంతోపాటు ముంబై, బెంగళూరులో కూడా భారీ ఆస్తులే ఉన్నాయి. ప్రైవేట్ జెట్ విలాసవంతమైన ప్రైవేట్ జెట్ కూడా మహేష్ బాబు సొంతం. తరచుగా తన కుటుంబంతో కలిసి తన విమానంలోనే పర్యటిస్తారు. నమ్రతా శిరోద్కర్ తరచుగా వారి చార్టర్లో విహారయాత్ర చేస్తున్న చిత్రాలను పంచుకుంటారు. స్విట్జర్లాండ్, పారిస్ , దుబాయ్ , జపాన్ ఇలా అద్భుతమైన డెస్టినేషన్ ఏదైనాతరుచుగా ఈ జెట్లోనేఎగిరిపోతారు. లగ్జరీ కార్ల సముదాయం సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మినహాయింపేమీ కాదు. టాలీవుడ్లోనే దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన మహేష్ బాబు చాలా ఖరీదైన నాలుగు చక్రాల వాహనాలను కలిగి ఉండటంలో ఆశ్చర్యం ఏముంది. సౌత్ సినిమా ఐకాన్ గ్యారేజీలో రూ. 1.19 కోట్ల విలువైన ది ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్, రూ. 2.26 కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ వంటి కార్లు ఉన్నాయి. ఇంకా BMW 730Ld, మెర్సిడెస్ GL క్లాస్ కూడా ఉన్నాయి. ఈ ఏడాదిలోనే మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు కొన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కారు ఖరీదు రూ. 5.40 కోట్లు, ఇది మహేష్ బాబు కార్ కలెక్షన్లో అత్యంత ఖరీదైన కారిదే. మహేష్తో పాటు మోహన్లాల్, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి ప్రముఖ స్టార్లు కూడా రేంజ్ రోవర్ ఎస్వీని కలిగి ఉన్నారు.అంతేకాదు హైదరాబాద్లో గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి కూడా మహేష్. కొద్ది రోజుల క్రితం కేజీఎఫ్ స్టార్ యష్ కూడా రేంజ్ రోవర్ కారు కొన్నాడు. ఈ కారులో అనేక లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. కాగా కెరీర్లో వన్ నేనొక్కడినే, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, సర్కారు వారి పాట వంటి పలు సూపర్డూపర్ హిట్లను అందించిన టాలీవుడ్ సూపర్స్టార్ ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ రూ.80కోట్లకుపై మాటే. దీనికితోడు యాడ్స్, ఎండార్స్మెంట్లు కూడా భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు 2022 లెక్కల ప్రకారం నికర విలువ దాదాపు రూ. 244 కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు మహేష్. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లను పలకరించనున్న ఈ మూవీలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
లగ్జరీ కార్ల జోరు : అదీ లెక్క
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ 2023 జనవరి-జూన్లో భారత్లో 8,528 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో రూ.1.5 కోట్లకుపైగా ధర కలిగిన టాప్ ఎండ్ వెహికిల్స్ (టీఈవీ) వాటా 25 శాతంపైగా నమోదై 2,000 యూనిట్లకు చేరింది. 2022 జనవరి-జూన్తో పోలిస్తే టీఈవీల అమ్మకాలు 54 శాతం పెరిగాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ఈ ఏడాది టాప్ ఎండ్ వెహికిల్స్ విభాగంలో అయిదు ఉత్పత్తులను ప్రవేశపెట్టాం. టీఈవీలకు వెయిటింగ్ పీరియడ్ 6-24 నెలలు ఉన్నప్పటికీ విక్రయాలు పెరుగుతున్నాయి. రెండవ అర్ధ భాగంతోపాటు పూర్తి ఏడాదికి మొత్తం అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం. నూతన తరం జీఎల్సీ మోడల్ను మూడవ త్రైమాసికంలో పరిచయం చేస్తున్నాం. పండుగల సీజన్కు ముందే ఈ కారు రానుంది’ అని వివరించారు. 2022లో భారత్లో మెర్సిడెస్ బెంజ్ నుంచి మొత్తం 15,822 యూనిట్లు రోడ్డెక్కాయి. వీటిలో 69 శాతం వృద్ధితో 3,500 పైచిలుకు టాప్ ఎండ్ వెహికిల్స్ ఉన్నాయి. -
స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్
సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిక్రికెటర్గా తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. అలాగే తన గ్యారేజీలో ఖర్జీదైన కార్ల విషయం, స్పోర్ట్స్ కార్లంటే కోహ్లికి ఉన్న పిచ్చి ప్రేమ కూడా తెలిసిన సంగతే. విదేశీ కార్లు, స్వదేశీ కార్లతో ఈ విషయంలో చాలా స్పెషల్గా ఉంటాడు. కింగ్ కోహ్లీగా పాపులర్ అయిన కోహ్లీ తనకిష్టమైన, ఫస్ట్ కారు గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది హాట్టాపిక్గా నిలిచింది. దీనిపై ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ చర్చించుకుంటున్నారు. రూ.1,000 కోట్లకు పైగా నికర విలువతో టాప్లో ఉన్న కోహ్లీ తొలి కారేంటో తెలుసా? మెర్సిడెస్ బెంజో , బీఎండబ్ల్యూనో, ఆడి కాఓ కాదు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన టాటా సఫారీ. అవును ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ఈ కారును తన సొంత డబ్బుతో కొనుగోలు చేశాడట. సఫారీని ఎంచుకోవడానికి గల కారణాన్ని కూడా స్టార్ స్పోర్ట్స్తో కోహ్లీ వెల్లడించాడు. కేవలం ఫీచర్లే కాదు, దీని గుర్తింపు ఆధారంగా ఈ కారుపై మనసు పడినట్టు విరాట్ తెలిపాడు. ఒక సందర్భంలో ఈ కారులో డీజిల్కి బదులుగా పెట్రోల్ నింపడం, ఆతరువాత విషయం తెలిసి ట్యాంకుని ఖాళీ చేసిన సంగతులను కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. (కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్) జర్మన్ ఆటోమేకర్ ఆడికి బ్రాండ్ అంబాసిడర్గా అన్నవిరాట్ కోహ్లీ ఎక్కువ స్పేస్ ఉన్న కార్లంటే ఇష్టమని చెప్పాడు. ప్రస్తుతం కోహ్లీ చేతిలో ఆధునాతన కార్లులిస్ట్ ఒకసారి చూద్దాం. భారతదేశపు అత్యంత సంపన్న క్రీడాకారుడు, ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్ళలో ఒకరైన విరాట్ కోహ్లీ 22 కోట్లకుపై విలువైన ఆడి A8 L W12, బెంట్లీ కాంటినెంటల్ GT , ల్యాండ్ రోవర్ వోగ్తో సహా ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లను సొంతం చేసుకున్నాడు. (ప్రియుడి బర్త్డే బాష్: మలైకా డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) కోహ్లి గ్యారేజీలోని అత్యంత ఖరీదైన కార్లు బెంట్లీ కాంటినెంటల్ GT, రూ. 4.04 కోట్లు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ రూ. 3.41 కోట్లు ఆడి R8 LMX లిమిటెడ్ ఎడిషన్, రూ. 2.97 కోట్లు ఆడి ఆర్8 వి10 రూ. 2.97 కోట్లు అత్యంత వేగవంతమైన కారు ఆడి A8L W12 క్వాట్రో ధర: రూ. 1.87 కోట్లు -
ఇటలీలో లగ్జరీ విల్లా: రూ.40 లక్షల అద్దె సంపాదన, ఎవరీ సూపర్స్టార్?
ఆదిపురుష్ సినిమాతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి హల్ చల్ చేస్తోంది. సూపర్స్టార్కి ఇటలీలో లగ్జరీ విల్లా ఉందట. ఈ విల్లాలోని కొంత భాగాన్ని అద్దెకిచ్చాడట. తద్వారా నెలకు రూ.40 లక్షల అద్దెను ఆర్జిస్తున్నాడు అనే టాక్ జోరుగా నడుస్తోంది. అయితే ఎప్పుడు కొన్నాడు అనేది మాత్రం స్పష్టత లేదు కానీ, ఈ ఊహాగానాలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. (రికార్డు రెమ్యూనరేషన్: ఈ రికార్డ్ సాధించిన తొలి హీరో ఎవరో తెలుసా?) దీంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ఇతర పెట్టుబడులు పెట్టాడని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. మూవీలు లేకుండా లీజర్గా ఉన్న సమయంలో ఇక్కడే హ్యాపీగా కాలం గడిపేస్తాడట. ఇంకా హైదరాబాద్లో విలాసవంతమైన ఇల్లు కూడా ప్రభాస్ సొంతం. అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఈ ఇల్లు దాదాపు 90 కోట్ల రూపాయలు. డ్రెస్సింగ్ విషయంలో కూడా ఎక్కడా తగ్గని డార్లింగ్ ప్రభాస్కు రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ జాగ్వార్ తదితర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. (రూ. 13 కోట్ల ఆస్తులను కొనుగోలు చేసిన సుహానా ఖాన్) ఆదిపురుష్ మూవీతో ఆకట్టుకుంటున్న ప్రభాస్, టాలీవుడ్ జక్కన్ తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్క్లూజన్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్యాన్ ఇండియా హీరోగా పాపులర్ అయిపోయాడు. దీంతో ప్రభాస్ రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్లో పెరిగింది. ఈ నేపథ్యంలోనే లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ కోసమే ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్లు అందుకున్నాడని టాక్. (అపుడు కరోడ్పతి షో సెన్సేషన్: మరి ఇపుడు) కాగా నెక్ట్స్ పాన్ ఇండియా మూవీ సలార్ బిజినెస్పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్కు రడీ అవుతోంది. దీంతోపాటు ప్రభాస్ ప్రాజెక్ట్ కే, స్పిరిట్, రాజా డీలక్స్ తదితర భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
ప్రభాస్ రేంజే వేరు.. డార్లింగ్ కార్ల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిరగాల్సిందే!
ఈశ్వర్ సినిమాతో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన నటుడు 'ప్రభాస్' (Prabhas) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టి ఇప్పుడు ఆదిపురుష్ చిత్రంలో తెరకెక్కాడు. సుమారు రూ. 200 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన ప్రభాస్ సినిమాల గురించి తెలిసిన చాలా మందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడనేది తెలిసి ఉండక పోవచ్చు. ఈ కథనంలో ప్రభాస్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లంబోర్ఘిని అవెంటడోర్ భారతదేశంలో లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ కలిగి ఉన్న కొంతమందిలో ప్రభాస్ ఒకరు. ఈ కారు ధర రూ. 6 కోట్లు వరకు ఉంటుంది. ఇది లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ ఎస్ రోడ్స్టర్. ఇది 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 740 హార్స్ పవర్ 690 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో సింగిల్ క్లచ్ 7 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండటం వల్ల అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఒకటి. ఈ కారు ప్రభాస్ గ్యారేజిలో కూడా ఉంది. 2016లో బ్లాక్ కలర్ ఫోర్త్ జనరేషన్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కొనుగోలు చేశారు. ఈ SUV లో 4.4 లీటర్ డీజిల్ వి8 ఇంజిన్ కలిగి 340 పీఎస్ పవర్, 740 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ ప్రభాస్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన లగ్జరీ కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన 'ఫాంటమ్' కారుని కూడా కలిగి ఉన్నారు. ఈ కారు ధర సుమారు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ. ప్రభాస్ గ్యారేజిలో ఉన్న అత్యంత ఖరీదైన కారు కూడా ఇదే. దీనిని 2013లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ వి12 ఇంజిన్ కలిగి 460 పీఎస్ పవర్, 720 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?) జాగ్వార్ ఎక్స్జే భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే జాగ్వార్ ఎక్స్జే ప్రభాస్ కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటుంది. సిల్వర్ కలర్ ఆప్షన్లో కనిపించే ఈ కారుని 2012లో కొనుగోలు చేశారు. ఇది 3.0-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజిన్ కలిగి 275 పీఎస్ పవర్ 600 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ -స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) బీఎండబ్ల్యూ ఎక్స్3 జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ఎక్స్3 మోడల్ కారుని 2018లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారుని ప్రభాస్ చాలా అరుదుగా వినియోగిస్తారని తెలుస్తోంది. నిజానికి బీఎండబ్ల్యూ ఎక్స్3 మూడు వేరియంట్లలో లభిస్తుంది. కావున ప్రభాస్ ఇందులో ఏ వేరియంట్ కొన్నారనేది స్పష్టంగా తెలియదు. ఇది డీజిల్ ఇంజిన్ కలిగి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుందని తెలుస్తుంది. -
ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!
M.A Yusuf Ali Car Collection: భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' (Lulu Group International) అధినేత 'ఎమ్ఏ యూసఫ్ అలీ' (M.A Yusuf Ali) గురించి దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే ఈయన ఇండియాలోని సంపన్నుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, కోట్లు విలువ చేసే అనేక అన్యదేశ్యపు లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో కూడా ఒకరు. యూసఫ్ అలీ గ్యారేజిలోని లగ్జరీ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కేవలం సంపన్న వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ జాబితాలో యూసఫ్ అలీ ఉన్నారు. ఈయన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఘోస్ట్ కారుని కలిగి ఉన్నారు. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారతదేశంలో ఉన్నప్పుడు ఈయన ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తారని సమాచారం. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ఖరీదైన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఈయన గ్యారేజిలో ఉంది. యూసఫ్ అలీ కొనుగోలు చేసిన ఈ కారు వైట్ కలర్ పెయింట్ స్కీమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇతని వద్ద బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీటిని తన కుటుంబంతో పాటు ప్రయాణించడానికి ఉపయోగిస్తాడని తెలుస్తోంది. ఈ కార్లు కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండటం గమనార్హం. బెంట్లీ బెంటాయగా బెంట్లీ కంపెనీకి చెందిన బెంటాయగా వంటి విలాసవంతమైన SUV కూడా యూసఫ్ అలీ ఖాన్ గ్యారేజిలో ఉంది. ఇది కూడా కేరళ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. భారతదేశంలో మొట్ట మొదటి బెంట్లీ బెంటాయగా కొనుగోలు చేసిన వ్యక్తి యూసఫ్ అలీ కావడం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) రోల్స్ రాయిస్ కల్లినన్ ముఖేష్ అంబానీ వంటి కుబేరుల వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా యూసఫ్ అలీ గ్యారేజిలో ఉంది. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే రోల్స్ రాయిస్ కార్లలో కల్లినన్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. ఈ కారుని అతడు దుబాయ్లో ఉపయోగిస్తాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి కార్లతో పాటు యూసఫ్ అలీ మినీ కూపర్ కంపెనీకి చెందిన మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్-మేబ్యాక్ GLS, లెక్సస్ LX750, BMW 7-సిరీస్, మెర్సిడెస్-మేబ్యాక్ S600 వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజిలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే ధనవంతుల జాబితాలో యూసఫ్ అలీ ఖాన్ కూడా ఒకరుగా ఉన్నారు. -
అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్,నెట్వర్త్ గురించి తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో జరగబోయే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్బంగా అంబటి రాయుడు ఏం చేయబోతున్నాడు. అతని ఆస్తి, నికర విలువ ఎంత అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్) ఫ్యాన్స్ అభిమానంగా రాయుడు అని పిలుచుకునే ఆల్ రౌండర్గా అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. భారత క్రికెట్ జట్టులో రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ,రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్గా క్రికెట్లోకి ప్రవేశించాడు. 2010లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘకాలం అంటే 2017 దాకా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2013 సీజన్లో ఐపీఎల్ టైటిల్ సాధనలోనూ, ఆ తరువాత 2018లో సీఎస్కే జట్టులోకి మారిన తరువాత 2018, 2021లో టైటిల్ గెలిచిన కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్వర్త్ ఎంతో తెలుసా?) నికర విలువు అంబటి రాయుడు మొత్తం నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు. సంవత్సరానికి రూ 7 కోట్లకు పైనే. ఐపీఎల్ ద్వారా లభించిన ఫీజు 6.25కోట్లు. లగ్జరీ కార్ల విలువ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోటి దాకా ఆర్జిస్తాడనేది తాజా నివేదికలద్వారా తెలుస్తోంది. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) అంబటి రాయుడు ఇల్లు కార్లు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో లగ్జరీ డిజైనర్ ఇల్లు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ అనంతగరిలో రిసార్ట్ బిజినెస్, సిద్దిపేట వైపు ఫార్మింగ్ బిజినెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అధిక బ్రాండ్ వాల్యుయేషన్ కారణంగా గత కొన్నేళ్లుగా అంబటి రాయుడు నికర విలువ 40 శాతం పెరిగిందట. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా రాయుడి నికర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది నిపుణుల మాట. వ్యవసాయ చేసుకుంటూ ఫామ్హౌస్లో ఎక్కువ సమయం గడుపుతానని ఒక ఇంటర్వ్యూలో అంబటి చెప్పినప్పటికీ ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన తరువాత ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో చేరతాడనే ఊహాగానాలున్నాయి. కార్లు : రూ. 1.5 నుంచి 2 కోట్లు అంబటి రాయుడు కార్ల కలెక్షన్ చాలా చిన్నది. అయినా ఆడి కారుతోపాటు ప్రపంచంలోని ది బెస్ట్ లగ్జరీ కార్లు కొన్ని అంబటి రాయుడు సొంతం. కరియర్ 2004 అండర్-19 ప్రపంచకప్లో అంబటి రాయుడు కెప్టెన్ ఇంగ్లండ్పై అజేయంగా 177 పరుగులు చేసి టైటిల్ సాధించాడు వయసు కేవలం 16 ఏళ్లు. ఇక అప్పటినుంచి మరో సచిన్ పేరు తెచ్చుకున్నాడు.తరువాత హైదరాబాద్ దేశవాళీ జట్టుకు ఎంపిక, కేవలం 17 సంవత్సరాల వయస్సులో నే ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు . భారత జట్టులో ఎంపికై 2013లో జింబాబ్వేపై మ్యాచ్లో రావడం 63 పరుగులతో అజేయంగా పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో 203 ఐపీఎల్ మ్యాచులాడిన రాయుడు. 127.26 స్ట్రైక్రేట్తో 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1985, సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు అంబటి రాయుడు. 1992లో మూడో తరగతి చదువుతున్నప్పుడే రాయడిని తండ్రి హైదరాబాద్లోని విజయ్ పాల్ క్రికెట్ అకాడమీలో చేర్చించారు. 14 ఫిబ్రవరి 2009న తన స్నేహితురాలు విద్యను పెళ్లి చేసుకున్నాడు రాయుడు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
సంపాదనలో మాత్రమే కాదు లగ్జరీ కార్ల విషయంలో అంతకు మించి
Kumar Mangalam Birla Car Collection: భారతదేశంలో ఉన్న అగ్రశ్రేణి ధనవంతులలో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ మాత్రమే కాకుండా.. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్కి ఛాన్సలర్ కూడా. గతంలో ఈయన సక్సెస్ సీక్రెట్, నికర ఆస్తులు వంటి వాటిని గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కథనంలో మంగళం బిర్లా ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కారుని (రోల్స్ రాయిస్ ఘోస్ట్) కలిగి ఉన్నారు. ఈ కారు ఖరీదు రూ. 8 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే ఇది కొంత కస్టమైజేషన్ పొందినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 9 కోట్లు వరకు ఉండవచ్చు. ఈ కారుని ఆయన అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తారని సమాచారం. ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తల గ్యారేజిలో కూడా ఉంది. ఇందులో 6.7 లీటర్ వి12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 520 బిహెచ్పి పవర్, 780 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 250 కిమీ. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 (Mercedes-Maybach S500) జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థకు మెర్సిడెస్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన కారు 'మేబ్యాచ్ ఎస్500' సెడాన్ కూడా కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.86 కోట్లు. ఇందులో 4663 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 453 బిహెచ్పి పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెడాన్ కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంది. భారతదేశంలోని సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానమైనదని. బీఎండబ్ల్యూ 760ఎల్ఐ (BMW 760LI) కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉన్న కార్లలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ ఒకటి. దీని ధర రూ. 2.46 కోట్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేయడానికి ముందు ఈయన ఎక్కువగా ఈ కారునే ఉపయోగించేవారని సమాచారం. ఇది బుల్లెట్ ప్రూఫ్ సెడాన్. కావున వినియోగదారులకు పటిష్టమైన భద్రతను అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!) జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF) బ్రిటీష్ వాహన తయారీ సంస్థకు చెందిన జాగ్వార్ ఎక్స్ఎఫ్ 'కుమార్ మంగళం బిర్లా' గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 55.67 లక్షలు. ఇందులోని 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ 247 బిహెచ్పి పవర్ & 365 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతమవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 365 కిమీ. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5-Series) బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన మరో కారు 5 సిరీస్ కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 62.90 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 2993 ఇంజిన్ కలిగి 261 బిహెచ్పి పవర్ పవర్, 620 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కాగా, టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 28 సంవత్సరాల వయసులో తండ్రి మరణించిన తరువాత ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు చేప్పట్టిన కుమార్ మంగళం బిర్లా 47 బ్రాండ్లు, 27 ఎంటర్ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను విజయపథంలో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
లెక్సస్ కారు @ రూ.2.39 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ లెక్సస్.. తాజాగా భారత్లో కొత్త ఎల్సీ 500హెచ్ మోడల్ను పరిచయం చేసింది. నాలుగు సీట్లు ఉన్న ఈ లగ్జరీ కూపే ధర రూ.2.39 కోట్లు. గ్లాస్ బ్లాక్ మెటాలిక్ ఫినిష్, 3డీ మెషీన్డ్ టెక్స్చర్తో అలాయ్ వీల్స్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, 3.5 లీటర్, 6 సిలిండర్, మల్టీ స్టేజ్ హైబ్రిడ్, లీటరుకు 12.3 కిలోమీటర్ల మైలేజీ, 264 కిలోవాట్ పవర్ ఏర్పాటు ఉంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇదీ చదవండి: ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5 సెకన్లలోనే చేరుకుంటుంది. పనోరమిక్ వ్యూ మానిటర్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 10 ఎయిర్బ్యాగ్స్, కార్బన్ ఫైబర్ రీ–ఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ రూఫ్, డైనమిక్ హ్యాండ్లింగ్ సిస్టమ్, వేరియేబుల్ గేర్ రేషియో స్టీరింగ్, డ్రైవ్ స్టార్ట్ కంట్రోల్, వెహికిల్ డైనమిక్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్, ఈబీడీతో ఏబీఎస్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు జోడించారు. భారత్లో హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో లెక్సస్ షోరూంలు ఉన్నాయి. (వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో) లగ్జరీ కార్లు, స్మార్ట్ఫోన్లు, ఈవీల పై తాజా సమాచారం కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!
Ajay Singh Tanwar: భారతదేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో 'అజయ్ సింగ్ తన్వర్' కూడా ఒకరు. పాతికేళ్ళు కూడా నిండని ఈ యువకుడు ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తులలో కూడా ఒకరుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఉపయోగించే కార్లలో చాలా వరకు ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉండటం గమనార్హం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నిజానికి అజయ్ తన్వర్ ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడుగా ఎదిగిన 'కన్వర్ సింగ్ తన్వర్' మనవడు. ఢిల్లీకి చెందిన సంపన్న పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ తన్వర్ రాజకీయ, వ్యాపారం రంగాలకు చెందిన కుటుంబంలో జన్మించారు. ఇతడు ప్రపంచములోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను కలిగి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి ఖరీదైన కార్లను కూడా చూడవచ్చు. అజయ్ గ్యారేజీలో మూడు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు, మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ లగ్జరీ సెడాన్ వంటివి ఉన్నాయి. ఈ మెర్సిడెస్ బెంజ్ కారు ధర రూ. 2.79 కోట్లని తెలుస్తోంది. దీనితో పాటు కస్టమైజ్డ్ వైట్ ఫోర్డ్ ముస్టాంగ్ సెడాన్, మెర్సిడెస్ బెంజ్జి 63 AMG వంటివి కూడా ఇతని గ్యారేజిలో ఉండటం గమనార్హం. భారతీయ రోడ్ల మీద అరుదుగా కనిపించే 'హమ్మర్ హెచ్2' కూడా ఇతని వద్ద ఉంది. దీనిని భారతదేశానికి ప్రైవేట్గా దిగుమతి చేసుకోవడం జరిగింది. (ఇదీ చదవండి: వాట్సాప్లో అదిరిపోయే 'ఎడిట్ మెసేజ్ ఫీచర్'.. దీన్నెలా వాడాలో తెలుసా?) రూ. 3 కోట్ల విలువైన లెక్సస్ LX530, రూ. 1.94 కోట్ల విలువైన బిఎండబ్ల్యు ఎక్స్5 ఎమ్, రూ. 1.5 కోట్ల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, రూ. 2.30 విలువైన ఆడి ఆర్8 స్పోర్ట్స్, ఆడి ఆర్ఎస్5, లంబోర్ఘిని గల్లార్డో కార్లు మాత్రం కాకుండా DC రూపొందించిన రూ. 2 కోట్ల విలువైన కారవ్యాన్ కూడా ఉంది. కార్లు మాత్రమే కాకుండా రెండు హెలికాఫ్టర్లు కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) నివేదికల ప్రకారం, అజయ్ చత్తర్పూర్లో ఉన్న ఓషన్ పెరల్ గార్డెనియా, కింగ్స్ ఫోర్త్ అనే రెండు హోటళ్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యాపారం అనేది కుటుంబం నుంచి వారసత్వంగా లభించినట్లు గతంలోనే వెల్లడించారు. వ్యాపారంలో ఇతని కృషికి ఎలైట్ మ్యాగజైన్ 'మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ 2020' అవార్డును కూడా అందించింది. -
Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!
గ్లోబల్ స్టార్, ఆస్కార్ విన్నింగ్ హీరో జూ.ఎన్టీఆర్ ఈరోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా నందమూరి నటవారసుడి ఆస్తి, విలువైన కార్లు, ఇల్లు తదితర అంశాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆసక్తి ఉంటుంది. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, మెడ్రన్ వాచెస్, ప్రైవేట్ జెట్ తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడే నందమూరి తారక రామారావు. 1991లో బాలనటుడిగా అరంగేట్రం చేసి తాతకు తగ్గమనవడిగా, జూ.ఎన్టీఆర్గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, మూవీ ఏదైనా బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవడం ఆయన స్పెషాల్టీ. అందుకే అభిమానులు ఆయనను టాలీవుడ్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా అతని సింప్లిసిటీకి కూడా పెట్టింది పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరు. తాజాగా సెన్సేషనల్ టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్కి ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, ఒక ప్రైవేట్ జెట్ వీటన్నింటికి మించి సూపర్ వాచ్ కలెక్షన్స్ ఉన్నాయి. రూ. 25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం, రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయభూమి కూడా ఉందని, దీనిని ఆయన లక్ష్మీ ప్రణతికి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారని చెబుతారు. దీని వాల్యూ సుమారు 9 కోట్ల రూపాయలట. దీంతోపాటు బెంగుళూరులో కూడా ఆయనకు పలు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు రకరకాల వాచీలను ఇష్టపడే అతను రిచర్డ్ మిల్లే వాచ్ అంటే ఎక్కవగా లైక్ చేస్తారు. దీని ధర రూ. 4 కోట్లు. అలాగే 40MM వాట్ వాచ్ ధర రూ. 2.5 కోట్లు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆస్కార్ రెడ్కార్పెట్ లుక్ అభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా తారక్ ధరించిన పాటెక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ వాచ్. దీని ధర రూ. 1. 56 కోట్ల రూపాయలు. టోటల్గా జూ.ఎన్టీరా్ ఆయన ఆస్తి విలువ రూ.571 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. పలు మీడియా నివేదికల ప్రకారం ఆయన నెలవారీ ఆదాయం రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. ఇక కార్ల విషయానికి వస్తే లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్ని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ మన జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. రూ. 2 కోట్ల రేంజ్ రోవర్ రోగ్ కారు, సుమారు 5 కోట్ల విలువైన నీరో నోక్టిస్ (బ్లాక్) ఉంది. దీని కస్టమ్ నంబర్ ప్లేట్ ధర 15 లక్షల రూపాయల కంటే ఎక్కువేనట. పోర్లే 718 కేమాన్రూ. కోటి, రూ. 2 కో ట్లబీఎండబ్ల్యూ 720 ఎన్డీ, కోటి రూపాయల మెర్సిడెస్బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మే 20, 1983లో జన్మించారు. బాల రామాయణం చిత్రంలో తన నటనకు ఉత్తమ బాలనటుడి అవార్డును గెలుచుకోవడమే కాదు హీరోగా తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. -
జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!
దీపిందర్ గోయల్ (Deepinder Goyals) అనగానే అందరికి జొమాటో గుర్తొస్తుంది. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అందరూ మెచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్లలో జొమాటో ఒకటిగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతులకు జన్మించిన గోయల్ ఈ రోజు రూ. 2వేల కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. కోటీశ్వరుడైన దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫెరారీ రోమా జొమాటో ప్రధాన కార్యాలయం సమీపంలోని రోడ్ల మీద తరచుగా దీపిందర్ గోయల్ తన ఫెరారీ రోమా కారులో కనిపిస్తూ ఉంటాడు. ఈ కారు రెడ్ కలర్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్లో ఉండటం గమనార్హం. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్బాక్స్తో వస్తుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన 911 టర్బో ఎస్ కూడా దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లలో ఒకటి. దీని ధర రూ. 3.13 కోట్లు. ఈ కారు కేవలం 8.9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఇంజిన్ 650 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్క్రీమ్ - ఈ ధరతో ఒక కారు కొనేయొచ్చు!) లంబోర్ఘిని ఉరుస్ మన దేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీల వద్ద ఉన్న లగ్జరీ కార్లలో లంబోర్ఘిని ఉరుస్ ఒకటి. ఈ కారుని దీపిందర్ గోయల్ కూడా కొనుగోలు చేశారు. దీని ధర రూ. 4.18 కోట్లు. ఇందులో 4.0-లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ఉంటుంది. ఇది 650 hp పవర్, 850 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. పోర్స్చే కారెరా ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన కారెరా ఎస్ దీపిందర్ గోయల్ వద్ద ఉన్న సూపర్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 1.88 కోట్లు. ఇందులోని 3.0 లీటర్ ప్లాట్ సిక్స్ సిలిండర్ బాక్సర్ పెట్రోల్ ఇంజిన్ 450 bhp పవర్, 530 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉండటమే కాకుండా పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: అపర కుబేరులు జిమ్లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి!) ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
క్రికెట్ దేవుడు సచిన్కు ఎన్ని వేల కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
క్రికెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. కాబట్టి సచిన్ టెండూల్కర్ గురించి దాదాపు అందరికి తెలుసు. సచిన్ ఆటల్లో మాత్రమే కాదు ఆటో మోటివ్ ఔత్సాహికుడు కూడా అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. ఈ రోజు క్రికెట్ గాడ్ సచిన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఆస్తులు విలువ ఎంత? లగ్జరీ కార్లు ఎన్ని ఉన్నాయి వంటి విషయాలతో వాటితో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. క్రికెట్ తన ఊపిరిగా క్రికెట్ ద్వారానే ఉన్నత స్థాయికి ఎదిగిన సచిన్ నికర ఆస్తుల విలువ కొన్ని నివేదికల ప్రకారం సుమారు 165 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1350 కోట్ల కంటే ఎక్కువ. బెంగళూరులో రెండు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం. (ఇదీ చదవండి: సత్య నాదెళ్ల లగ్జరీ హౌస్ చూసారా - రెండంతస్తుల లైబ్రరీ, హోమ్ థియేటర్ మరెన్నో..) 11 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలకు ఓర్చుకుని ఇప్పుడు క్రికెట్ గాడ్ అయ్యాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన అంజలిని వివాహం చేసుకున్న సచిన్ ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వెస్ట్లో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్నారు. (ఇదీ చదవండి: 28 ఏళ్లకే తండ్రి మరణం.. ఇప్పుడు లక్షల కోట్లకు యజమాని) క్రికెట్ అంటే ప్రాణమిచ్చే సచిన్ మొదటి కారు మారుతి 800 కావడం గమనార్హం. ప్రస్తుతం అత్యంత ఖరీదైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో బిఎండబ్ల్యూ 30 జహ్రే ఎమ్5, ఎమ్ 6 గ్రాన్ కూపే, 7 సిరీస్, నిస్సాన్ జిటి-ఆర్, ఐ8, ఫెరారీ-360-మొడెనా మొదలైనవి ఉన్నాయి. సచిన్ వద్ద ఉన్న కార్ల ఖరీదు రూ. 15 కోట్లకంటే ఎక్కువ. ఖరీదైన కార్లు, బంగ్లా కలిగి ఉన్న సచిన్ పెప్సి, అడిడాస్, టీవీఎస్, బ్రిటానియా, వీసా, బూస్ట్, ఎయిర్టెల్, కోకాకోలా, కోల్గేట్ వంటి అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. దీని ద్వారా వచ్చే వార్షిక ఆదాయం సుమారు రూ. 17 నుంచి 20 కోట్లు. -
జోరుగా ఆడి కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల సంస్థ ఆడి ఇండియా మార్చి త్రైమాసికంలో 1,950 యూనిట్లను విక్రయించింది. 2022 మొదటి మూడు నెలల కాలంలో విక్రయాలు 862 యూనిట్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. తమ ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో 16 మోడళ్లు వచ్చి చేరాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. బలమైన ఎస్యూవీ పోర్ట్ఫోలియో కలిగి ఉన్నామని, తమ మొత్తం విక్రయాల్లో ఎస్యూవీ వాటా 60%గా ఉన్నట్టు చెప్పారు. కొత్తగా విడుదల చేసిన క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్కు దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్ కనిపిస్తున్నట్టు తెలిపారు. మంచి వృద్ధి మార్గంలో ఉన్నామని, 2023లోనూ బలమైన పనితీరు చూపిస్తామనే నమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రీఓన్డ్ (అప్పటికే మరొకరు వినియోగించిన) కార్ల వ్యాపారాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 ప్రీఓన్డ్ కార్ల ఔట్లెట్లను ఆడి నిర్వహిస్తోంది. ఈ ఏడాది చివరికి వీటి సంఖ్యను 25కు చేరుస్తామని దిల్లాన్ తెలిపారు. -
పేరుకే యూట్యూబర్.. ఆస్తుల్లో కుబేరుడు: ఎవరతడు?
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన చాలా మందిలో గౌరవ్ చౌదరి ఒకరు. వృత్తిపరంగా టెక్నికల్ గురూజీ పేరుతో సుపరిచితుడైన ఈ యూట్యూబర్ దుబాయ్లో నివసిస్తున్నాడు. భారతదేశంలో ఎక్కువ మంది అనుసరించే టెక్ యూట్యూబర్ కూడా. ఈయన రెండు యూట్యూబ్ ఛానెల్లను నడుపుతూ కోట్ల కొద్ది సంపాదిస్తున్నారు. గౌరవ్ చౌదరి అండ్ టెక్నికల్ గురూజీ పేరుతో రెండు యూట్యూబ్ ఛానెల్లను నడుపుతున్న ఇతనికి సుమారు 27 మిలియన్స్ పాలొవర్స్ ఉన్నారు. ప్రపంచంలో అతి పెద్ద టెక్ ఛానెల్లలో ఒకటి టెక్నికల్ గురూజీ యూట్యూబ్ ఛానెల్. 1991లో రాజస్థాన్లో అజ్మీర్లో జన్మించిన టెక్నికల్ గురూజీ BITS పిలానీ దుబాయ్ క్యాంపస్లో మైక్రో ఎలక్ట్రానిక్స్లో డిగ్రీని పూర్తి చేసాడు. 2015లో యూట్యూబ్ ప్రారంభించాడు. ఈ ఛానల్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే గొప్ప సక్సెస్ సాధించాడు. ఒక పక్క యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదించమే కాకుండా, దుబాయ్ పోలీసులకు, ఇతర సంస్థలకు భద్రతా సామగ్రిని సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు దుబాయ్ పోలీస్ సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఇంజనీర్ అని సమాచారం. ప్రస్తుతం దుబాయ్లో రూ. 60 కోట్ల విలువైన ఇల్లు ఉంది, అంతే కాకుండా అతడు ఇప్పటికే ఖరీదైన సుమారు 11 కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో రూ. 8 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెక్లారెన్ GT, రేంజ్ రోవర్ వోగ్, పోర్స్చే పనామెరా GTS, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్, బిఎండబ్ల్యు 750ఎల్ఐ, మెర్సిడెస్ బెంజ్ 500ఎమ్ఎల్, ఆడి ఏ6, మహీంద్రా థార్ మొదలైనవి ఉన్నాయి. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లను కలిగి ఉన్న టెక్నికల్ గురూజీ మొత్తం ఆస్తుల విలువ 45 మిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 369 కోట్లు. అతని నెల సంపాదన కోటి కంటే ఎక్కువే. అతనికి ఇన్స్టాగ్రామ్లో కూడా మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. -
ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!
బెంగళూరు రమేష్ బాబు లేదా ‘ఇండియన్ ' బిలియనీర్ బార్బర్’. 600 కార్ల కలెక్షన్ను గమనిస్తే ఎవరైనా ఔరా అనక తప్పదు. అందులోనూ అన్నీ ఖరీదైన కార్లే. ఎక్కువ భాగం బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్ రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్సే.బిలియనీర్ బాబుగా పాపులర్ అయిన రమేష్ బాబు ఒకప్పుడు కడు పేదవాడే. ఒక పూట తింటే రెండోపూటకు కష్టమే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూలిపనులకెళ్లాడు. జీవితం గడవడానికి అమ్మకు తోడుగా చాలా ఉద్యోగాలు చేశాడు. మరి బిలియనీర్గా ఎలా అవతరించాడు..? రమేష్ బాబు తండ్రి గోపాల్ బెంగళూరులో క్షురకుడుగా పని చేసేవారు. రమేష్ ఏడేళ్ల వయస్సులోనే తండ్రి కన్నుమూశారు. దీంతో తల్లి ముగ్గురు పిల్లలున్న కుటుంబానికి బెంగళూరులోని బ్రిడ్జ్ రోడ్లోని చిన్న బార్బర్ షాప్ ఒక్కటే జీవనాధారం. కేవలం 40-50 రూపాయలతో పిల్లల్ని పోషించేది. పిల్లల్ని చదివించింది. బట్టలు, పుస్తకాలు, ఫీజులు, అన్నింటికీ వినియోగించేది. మరోవైపు బార్బర్షాప్ను నిర్వహించలేక రోజుకు రూ.5 అద్దెకు ఇచ్చేయడంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకునే వారు. 13 సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్ డెలివరీ,మిల్క్ హోమ్ డెలివరీలాంటి ఎన్నో పనులు చేసిన కుటుంబ పోషణలో తల్లి ఆసరాగా ఉండేవాడు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ 10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, చివరికి తండ్రి పాత దుకాణం 'ఇన్నర్ స్పేస్' లో బార్బర్గా పని చేయడం ప్రారంభించాడు. పట్టుదలతో కష్టించి పనిచేశాడు. అది త్వరలోనే ట్రెండీ స్టైలింగ్ అవుట్లెట్గా మారిపోయింది. హెయిర్స్టయిలిస్ట్గా బాగా పేరు గడించాడు. ఆ తర్వాత రమేష్ బాబు 1993లో తన మామ దగ్గర కొంత డబ్బు తీసుకుని మారుతీ ఓమ్నీ వ్యాన్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఈఎంఐ చెల్లించేలేక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాడు. అలా తన తల్లి పనిచేసే కుటుంబానికి చెందిన ఇంటెల్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చే పని తీసుకుని ట్రావెల్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అది లాభసాటిగా ఉండటంతోపాటు, పర్యాటక రంగానికి ప్రభుత్వంప్రోత్సాహంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని లాంచ్ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ముప్పై ఏళ్లుగా సేవలందిస్తూ, ఖరీదైన కార్లను సేకరిస్తూనే ఉన్నాడు. అలా 600కు పైగా కార్లు అతని గారేజ్లో ఉన్నాయి.దాదాపు అన్నీ బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లంటేనే అతని వ్యాపారాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు వ్యాన్లు, మినీబస్సులు కూడా ఉన్నాయి. తొలి లగ్జరీ కారు మెర్సిడెస్ ఈ కాస్ల్ సెడాన్ అతని తొలి లగ్జరీ కారు. దీని ధర రూ.38 లక్షలు. ప్రస్తుతం 3 కోట్ల ఆర్ఆర్ ఘోస్ట్, 2.6 కోట్ల ఖరీదైన మేబ్యాచ్ అతని ట్రావెల్స్లో ఉన్నాయి. రమేష్ బాబు కంపెనీ ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో నడుస్తుంది. అదే సమయంలో, అతని వ్యాపారం కొన్ని ఇతర దేశాలలో కూడా విస్తరించింది. దాదాపు 300 పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. బిగ్బీ, ఆమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీ కస్టమర్లు రమేష్ అన్ని కార్లను డ్రైవ్ చేయగలడు. అతని క్లయింట్ల జాబితా అంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు కూడా వారు పట్టణంలో ఉన్నప్పుడు కార్లను అద్దెకు తీసుకుంటారట. రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. అన్నట్టు ఇప్పటికీ తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. బిలియనీర్ బాబు మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్లోని తన దుకాణానికి వెళ్తాడు. నిజంగా రమేష్ బాబు కథ స్ఫూర్తిదాయకం. 2 బిలియన్ డాలర్ల నెట్వర్త్తో ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్గా ఫోర్బ్స్ గుర్తించింది. -
వీధుల్లో మొదలైన వ్యాపారం, 5వేల కోట్ల సామ్రాజ్యంగా..
భారతదేశంలో ఎంతోమంది వ్యాపారవేత్తలకు స్ఫూర్తిగా నిలిచిన 'మహాశయ్ ధరంపాల్ గులాటీ' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన చనిపోయి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ పేరు మాత్రం సజీవంగానే ఉంది. కేవలం రూ. 1500తో భారతదేశానికి వచ్చి ఏకంగా 5వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1923లో పాకిస్థాన్ సియాల్కోట్లో సుగంధ ద్రవ్యాల వ్యాపారి చున్నీలాల్ కుటుంబంలో జన్మించిన ధరంపాల్ చిన్నప్పటి నుంచే వ్యాపారంలో తండ్రికి సహాయం చేస్తూ ఆ వ్యాపారాన్నే నేర్చుకున్నాడు. ఆ తరువాత చాలా తక్కువ డబ్బుతో భారతదేశంలో అడుగుపెట్టాడు. తన దగ్గర ఉన్న ఆ తక్కువ డబ్బుతోనే ఒక గుర్రపు బండిని కొనాలని నిర్ణయించుకున్నాడు. గుర్రపు బండి కొన్న తరువాత దానిపైనే ఢిల్లీ నగరంలో మసాలాలు విక్రయిస్తూ వ్యాపారం ప్రారంభించాడు. చిన్న కొట్టుతో మొదలై మహాషియాన్ డి హట్టి (MDH) పేరుతో మంచి ఆదాయం పొందాడు. అతి తక్కువ కాలంలో భారతదేశపు 'మసాలా కింగ్'గా కీర్తి పొందాడు. (ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్ - సులభంగా ఇలా!) ధరంపాల్ గులాటీ కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా తన వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేసి కోట్లలో సంపాదించడం మొదలెట్టాడు. 2017లో ఆయన సంస్థ ఆదాయం ఏకంగా రూ. 1000 కోట్లు దాటింది. కాగా 2020లో 98 సంవత్సరాల వయసులో మరణించారు. అప్పటికి ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 5,000 కోట్లు దాటింది. అతి తక్కువ కాలంలోనే భారతదేశపు మసాలా కింగ్ స్థాయికి ఎదిగిన ధరంపాల్ గులాటీ విలాసవంతమైన కార్లను కూడా కలిగి ఉన్నారు. నివేదికల ప్రకారం ఆయన గ్యారేజీలో రోల్స్ రాయల్ ఘోస్ట్, క్రిస్లర్ 300 సి లిమోసిన్, మెర్సిడెస్ బెంజ్ ఎం-క్లాస్ ఎంఎల్ 500 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా ఆయన మరణానికి ముందే ఫుడ్ ప్రాసెసింగ్ ఫీల్డ్లో ఆయన కృషికి భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారం అందించి గౌరవించింది. -
విజయ్ దేవరకొండ గ్యారేజీలో కాస్ట్లీ కార్లు..
తెలుగు సినీ ప్రపంచంలో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాలో ఓ డాక్టర్గా, గీత గోవిందంలో మేడమ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటూ అమ్మాయిల మనసు దోచుకున్న ఈ వరల్డ్ ఫెమస్ లవర్ గ్యారేజిలో జర్మన్, బ్రిటీష్, అమెరికన్, స్వీడన్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ఫోర్డ్ మస్టాంగ్: ఒకప్పటి నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన అమెరికన్ కార్ తయారీ సంస్థ ఫోర్డ్ గత సంవత్సరం భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ మస్టాంగ్ విజయ్ దేవరకొండ గ్యారేజిలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో కనిపిస్తాయి. మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జిఎల్సి విజయ్ గ్యారేజిలో ఉంది. ఈ కారుని యితడు ఇతర కార్లకంటే ఎక్కువగా ఉపయోగిస్తాడని సమాచారం. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్ ఆప్సన్లలో లభిస్తుంది. వోల్వో ఎక్స్సి 90: విజయ్ దేవరకొండ గ్యారేజిలో స్వీడన్ బ్రాండ్ కారు వోల్వో ఎక్స్సి 90 కూడా ఉంది. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 90 లక్షల నుంచి రూ. 1.31 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. వోల్వో కంపెనీ భారతదేశంలో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన, సురక్షితమైన కార్లలో ఇది ఒకటి కావడం విశేషం. రేంజ్ రోవర్: ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్లలో ల్యాండ్ రోవర్ ఒకటి. విజయ్ దేవరకొండ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 60 లక్షల కంటే ఎక్కువ. ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. బిఎమ్డబ్ల్యూ 5-సిరీస్: విజయ్ దేవరకొండ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ కారు మాత్రమే కాకుండా బిఎండబ్ల్యు కంపెనీకి చెందిన 5-సిరీస్ కూడా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 60 లక్షల కంటే ఎక్కువ. 2021 బిఎండబ్ల్యు 5-సిరీస్ 530ఐ ఎమ్ స్పోర్ట్స్, 520డి మరియు 530డి ఎమ్ స్పోర్ట్స్ అనే మూడు వేరియంట్లో విడుదలైంది. వీటి ధరలు రూ. 63 లక్షల నుంచి రూ. 72 లక్షల వరకు ఉన్నాయి. -
రూ.100 కోట్లు.. లగ్జరీ కార్లు, విల్లా నుంచి .. బిల్లులు కట్టలేని దీనస్థితికి!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. కాలం కలిసి వస్తే రాత్రి రాత్రి సెలబ్రిటీలైన వారు ఉన్నారు, అదృష్టంతో ఒక్క రోజులో ధనవంతులుగా మారిన వారు ఉన్నారు. ఇక్కడ వరకు ఓకే గానీ దీని తర్వాత అంతా మన చేతులోనే ఉంటుంది. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా, నిర్లక్ష్యం వహించినా సీన్ ఒక్కసారిగా తారుమారవుతుంది. సరిగ్గా ఇదే తరహాలోనే ఓ వ్యక్తి అకస్మాత్తుగా 100 కోట్లకు యజమానిగా మారాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఉన్నదంతా పోయి చివరికి రోడ్డున పడ్డాడు. ఈ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. లక్లో లాటరీ.. అంతా పోయింది ఇది జాన్ మెక్గిన్నిస్ కథ. అతను 1997లో రూ. 100 కోట్ల భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. దీంతో అతని లైఫ్ స్టైయిల్ మారింది. అయితే క్రమశిక్షణ అనేది ఎవరికైన ముఖ్యం. అది ప్రవర్తన పరంగా కావచ్చు లేదా ఆర్థికపరంగానే కావచ్చు. ఇది లేకపోతే ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా అవేవి నిలబడవు. జాన్ గురించి తెలుసుకుంటే ఈ విషయం మీకే అర్థమవుతుంది. లక్లో లాటరీని గెలుచుకున్న తర్వాత జాన్ చాలా ఖరీదైన కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో బెంట్లీ, మెర్సిడెస్, జాగ్వార్, ఫెరారీ, బీఎండబ్ల్యూ మోడల్స్ కార్లు ఉన్నాయి. యూకేలోని సౌత్ లానార్క్షైర్లోని బోత్వెల్లో రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేశాడు. సముద్ర తీరంలో రూ. 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను కొన్నాడు. ఇది కాకుండా దాదాపు 30 కోట్ల రూపాయలను తన కుటుంబం కోసం ఖర్చు చేశాడు. చాలా చోట్ల అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. కొన్ని సమస్యల కారణంగా కోర్టుకు కూడా హాజరు కావాల్సి వచ్చింది.పక్కా ప్రణాళిక లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టడంతో లాటరీ సొమ్ముతో కూడబెట్టినదంతా పోగొట్టుకున్న జాన్ చివరికి క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా కట్టుకోలేని స్థితికి చేరుకున్నాడు. -
Keerthy Suresh: వామ్మో.. మహానటి ఆస్తులు అన్ని కోట్లా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించిన హీరోయిన్స్లో కీర్తి సురేశ్ ఒకరు. నేను శైలజ సినిమాతో మొదలై మహానటి సినిమాతో తరువాతి తరాలు కూడా గుర్తుపెట్టుకునేంత పాపులారిటీ సంపాదించిందామె. ప్రస్తుతం నాని సరసన దసరా మూవీలో నటించింది కీర్తి. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన కీర్తి సురేశ్ ఆస్తులు కూడా బాగానే కూడబెట్టింది. కొన్ని నివేదికల ప్రకారం ఈమె ఆస్తి విలువ సుమారు రూ. 35 కోట్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే కీర్తి దసరా సినిమా కోసం ఏకంగా 4 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఉద్యోగుల పాలిట అమావాస్య.. విప్రో నుంచి 120 మంది అవుట్) కీర్తి సురేశ్ రిలయన్స్ ట్రెండ్స్, ఉషా ఇంటర్నేషనల్, జోస్ అలుక్కాస్ వంటి అనేక ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోంది. ఇందులో ఒక్కో ఎండార్స్మెంట్కు 15 నుంచి 30 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమెకు చెన్నైలో ఒక విలాసవంతమైన ఇల్లు, హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ పోష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్ కూడా ఉంది. కీర్తి సురేశ్ ఖరీదైన ఆస్తులలో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇందులో BMW X7 సిరీస్ ఒకటి. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 1.18 కోట్ల నుండి రూ. 1.78 కోట్ల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్, టొయోటా ఇన్నోవా క్రిస్టా వంటి కార్లను కూడా కలిగి ఉంది. -
Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?
తెలుగు చిత్ర సీమను ప్రపంచానికి ఎలుగెత్తి చూపి ఆస్కార్ సొంతం చేసుకున్న 'ఆర్ఆర్ఆర్' గురించి, అందులో నటించిన నటీ, నటులను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే చరణ్ సినిమాల గురించి తెలిసిన చాలామందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడు, అతని ఆస్తుల విలువ ఎంత అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి వారికోసం ప్రత్యేక కథనం.. చిరుత సినిమాతో తెలుగు సినీ రంగప్రవేశం చేసిన చరణ్.. మగధీరతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఖైదీ నంబర్ 150 నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా పెప్సీ, టాటా డొకోమో, వోలానో, అపోలో జియా, హీరో మోటోక్రాప్, ఫ్రూటీ వంటి దాదాపు 34 బ్రాండ్లను అంబాసిడర్గా వ్యవహరిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. కొణిదెల రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 1370 కోట్లు ఉంటుందని అంచనా. ఈయన నెల సంపాదన రూ. 3 కోట్లకంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. RRR సినిమాలో తన పాత్ర కోసం రూ. 45 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద మన దేశంలో ఎక్కువ ట్యాక్స్ చెల్లిస్తున్నవారిలో రామ్ చరణ్ ఒకరు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: సిట్రోయెన్ సి3 కొత్త ధరలు.. వాహన ప్రియులకు షాక్) రామ్ చరణ్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగ్లా కలిగి ఉన్నారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్, జిమ్, ఫిష్ పాండ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయని తెలుస్తోంది. దీని విలువ రూ. 38 కోట్లు ఉంటుందని అంచనా. దీనితో పాటు ముంబైలో పెంట్ హౌస్ కూడా ఉందని చెబుతున్నారు. ఇక చివరగా రామ్ చరణ్ ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తారు అనే విషయానికి వస్తే, ఈయన వద్ద దాదాపు రూ.4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 తో పాటు, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్ మరియు ఫెరారీ పోర్టోఫినో ఉన్నాయి. అంతే కాకుండా చరణ్ ఒక సొంత ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు. -
ముఖేష్ అంబానీ ఉపయోగించే టాప్ 5 లగ్జరీ కార్లు
ప్రముఖ పారిశ్రామికవేత్త, అపరకుబేరుడు ముఖేష్ అంబానీ గురించి దాదాపు అందరికి తెలుసు. ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ఈయన అత్యంత విలాసవంతమైన లగ్జరీ కార్లను ఉపయోగిస్తారు. ముఖేష్ అంబానీ ఉపయోగించే టాప్ 5 లగ్జరీ కార్లను గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. రోల్స్ రాయిస్ ఫాంటమ్: ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారుచేసే కంపెనీలలో చెప్పుకోదగ్గది రోల్స్ రాయిస్. ఈ సంస్థకు చెందిన ఫాంటమ్ SUV ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 13.50 కోట్లు. ఈ లగ్జరీ కారు 6.75 లీటర్ V12 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉత్తమమైన పనితీరుని అందిస్తుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్660 గార్డ్: జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 'మేబ్యాచ్ ఎస్660' ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 10.50 కోట్లు. ఈ కారు అత్యంత సురక్షితమైన, అధిక సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇది బుల్లెట్లు, బాంబులు ఇతర ప్రాణాంతక ప్రమాదాల్లో రక్షించడానికి ప్రత్యేకంగా తయారుచేశారు. బిఎండబ్ల్యు 760ఎల్ఐ సెక్యూరిటీ: రూ. 8.9 కోట్లు విలువ చేసే బిఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ సెక్యూరిటీ కూడా ముఖేష్ అంబానీ వినియోగించే కార్లలో ఒకటి. ఈ లగ్జరీ సెడాన్ 6 లీటర్ V12 ఇంజన్ కలిగి 544 బిహెచ్పి పవర్, 880 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అధిక భద్రతా ఫీచర్స్ కలిగిన కార్లలో ఇది ఒకటి. ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్: అంబానీ గ్యారేజిలోని మరో ఖరీదైన కారు ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్. దీని ధర రూ. 7.50 కోట్లు. ఈ స్పోర్ట్స్ కారు 2019లో ప్రారంభమై హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించిన మొదటి కారు. ఇది 4 లీటర్ వి8 ఇంజిన్ కలిగి 769 బిహెచ్పి పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్: బెంట్లీ కంపెనీకి చెందిన కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్ ధర రూ. 3.69 కోట్లు. ఇది 2005లో బెంట్లీ ఆర్నేజ్కు వారసుడిగా పరిచయమైంది. కావున ఇది కూడా అదే ప్లాట్ఫారమ్పై ఆధారపడి ఉంటుంది. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ 6 లీటర్ డబ్ల్యు12 ఇంజన్తో అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ కార్లతో పాటు ముఖేష్ అంబానీ గ్యారేజిలో మరిన్ని ఖరీదైన కార్లు ఉన్నాయి. -
ఊరేగింపులో రూ.కోట్ల విలువైన కార్లు.. అయినా ఎద్దుల బండి మీద వరుడు ఎంట్రీ!
ఇటీవల పెళ్లి వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు వధువు దగ్గర నుంచి వరుడు వరకు పాటించే ఆచారాలు ఎవరో ఒకరు చిత్రీకరించడంతో అవి నెట్టింట వైరల్గా మారడం షరా మామూలుగా మారింది. ఈ ట్రెండ్ కరోనా నుంచి కాస్త ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. తాజాగా ఓ వరుడు ఊరేగింపులో రూ. కోట్లు విలువైన లగ్జరీ కార్లను ఉపయోగించాడు. అయితే కార్ల నుంచి కాకుండా మండపంలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు ఆ వరడు! వివరాల్లోకి వెళితే.. గుజరాత్లోని సూరత్కు చెందిన భాజపా నేత భరత్ వఘాశియా తన కుమారుడి పెళ్లి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన 100 విలాసవంతమైన కార్లను వినియోగించారు. అందులో అత్యంత ఖరీదైన కార్ల సరికొత్త మోడల్స్ అన్నీ కనిపించాయి. ఊరేగింపులో ఖరీదైన కార్లు రావడం చూసి పెళ్లికి వచ్చి బంధువులు, చుట్టూ ఉన్న ప్రజలు సైతం ఆశ్చర్యపోయారు. కానీ, ఆ వరుడు ఊరేగింపులో ఉన్న లగ్జరీ కార్లలో కాకుండా ఎద్దుల బండిపై వచ్చి ఊహించని షాకిచ్చాడు. కారణం ఏంటంటే.. గుజరాత్లో వరుడు ఎప్పుడూ ఎద్దుల బండిలో రావడం అనాదిగా వస్తున్న ఆచారం. గుజరాత్ సంస్కృతి ,సంప్రదాయాలతో పాటు ఆధునిక, సాంకేతికతతో నడిచే జీవనశైలిని ప్రదర్శించాలని వరుడు కోరుకున్నాడట. తన కుమారుడికి ఖరీదైన కార్లంటే ఇష్టమని, అందుకే ఊరేగింపులో రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన కార్లను ఉపయోగించామని, అలాగే సంప్రదాయాన్నీ కొనసాగించినట్లు వరుడు తండ్రి తెలిపాడు. చదవండి వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి! -
బడాబాబులు ఎక్కడా తగ్గట్లే: లంబోర్ఘిని కార్ల హాట్ సేల్
న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్ కార్-మేకర్ లంబోర్ఘిని ఇండియాలో రికార్డ్ సేల్స్ నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన కార్లను విక్రయిస్తున్న సంస్థ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఇండియాలో తమ టార్గెట్ రీచ్ అయిందని కంపెనీ ప్రకటించింది. 2023లో భారతదేశంలో 100 కార్లను విక్రయించాలనేది అసలు ప్లాన్. అయితే, ఇంకా ఫిబ్రవరి పూర్తి కాకుండానే వీటిలో 90 కార్లను ఇప్పటికే ఆర్డర్స్ను అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు (UHNIలు) హాట్కేక్లా కొనుగోలు చేస్తున్నారని లంబోర్ఘిని ఆసియా-పసిఫిక్ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో స్కార్డొని తెలిపారు. లంబోర్ఘిని ఉరుస్ లగ్జరీ SUV, అవెంటడోర్, హురాకాన్ వంటి లగ్జరీ కార్లను ఇండియాలో విక్రయిస్తోంది. భారతదేశంలో దాని అన్ని కార్ల ధరలు రూ. 4 కోట్లకు పైమాటే. అయినప్పటికీ, సెలబ్రిటీలు , వ్యాపారవేత్తలు ఈ కార్లను ఎగరేసుకు పోవడం విశేషం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లంబోర్ఘిని మార్కెట్లలో ఇండియా ఒకటి. వార్షిక ప్రాతిపదికన 30 శాతం అమ్మకాలను సాధిస్తోంది. 2022లో దేశంలో 90 కార్లు విక్రయించగా, చైనాలో 1,000 కార్లను విక్రయించింది. మహమ్మారి అనంతర డిమాండ్ లంబోర్ఘిని ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. గ్లోబల్ ట్రెండ్ల గురించి మాట్లాడుతూ 2023 ఏడాదికి సంబంధించిన ఆర్డర్లు ముగిసాయి. 2024 ఆర్డర్లను తీసుకుంటున్నాం. రోజువారీ ఆర్డర్బుక్ ఇంత ఎక్కువగా ఉండటం ఆశ్చర్యంగా ఉందని స్కార్డొని సంతోషం ప్రకటించారు. ఆర్డర్ బుకింగ్ సగటున 18 నెలల కంటే ఎక్కువే. -
సూపర్ స్పీడ్లో దూసుకెళ్తున్న అల్ట్రా లగ్జరీ కార్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్ట్రా లగ్జరీ కార్లు భారత్లో కనీవినీ ఎరుగని రీతిలో దూసుకెళ్తున్నాయి. లగ్జరీ కార్లకు మారుపేరైన రోల్స్ రాయిస్, ఆస్టన్ మార్జిన్, లంబోర్గీని, ఫెరారీ, బెంట్లే, పోర్ష.. అన్నీ కూడా 2022లో అత్యధిక అమ్మకాలను సాధించాయి. భారత్లో ఈ కంపెనీలు అల్ టైమ్ హై విక్రయాలను గతేడాది నమోదు చేయడం గమనార్హం. 2023లో సైతం ఇదే స్థాయిలో సేల్స్ ఉంటాయని ధీమాగా ఉన్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో రెండేళ్లుగా విదేశీ టూర్లు వాయిదా వేసుకుని ఇంటికే పరిమితమైన బిలియనీర్లు, మిలియనీర్లు ఖరీదైన ఇళ్లు, వాహనాలను సమకూర్చుకుంటున్నారు. ‘కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరూ జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. మహమ్మారి చాలా మందికి షాక్ ఇచ్చింది. ధనవంతులుగా చనిపోయే బదులు ధనవంతులుగా జీవించాలని అనుకుంటున్నారు’ అని ఒక డీలర్ వ్యాఖ్యానించారు. కొనడంలో తగ్గేదే లే.. యూఎస్, చైనాతో పోలిస్తే అల్ట్రా లగ్జరీ కార్ల విపణి భారత్లో స్వల్పమే. సంపన్నుల నుంచి వీటికి డిమాండ్ నేపథ్యంలో అమ్మకాల వేగం పెరిగింది. విదేశాల్లో లభిస్తున్న మోడళ్లను ఇక్కడి కస్టమర్లు కోరుకుంటున్నారు. లగ్జరీ కార్ల మార్కెట్లో రూ.2 కోట్లు ఆపైన ఖరీదు చేసే అల్ట్రా మోడళ్ల అమ్మకాలు 2022లో 450 యూనిట్లు. ఇప్పటి వరకు భారత్లో ఇదే అత్యధికం. 2021లో 300 యూనిట్లు రోడ్డెక్కాయి. అంటే గతేడాది ఈ మార్కెట్ 50 శాతం వృద్ధి సాధించింది అన్నమాట. ప్రస్తుత ఏడాది ఈ సంఖ్య 30 శాతం వృద్ధితో 580 యూనిట్లు దాటుతుందని మార్కెట్ రిసర్చ్ కంపెనీ టెక్సీ రిసర్చ్ అంచనా. 2018లో భారత్లో 325 అల్ట్రా లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయి. బెంట్లే ఇటీవలే భారత్లో సరికొత్త బెంటేగా ఎక్స్టెండెడ్ వీల్బేస్ ఎస్యూవీ మోడల్ను ప్రవేశపెట్టింది. ఢిల్లీ ఎక్స్షోరూంలో ధర రూ.6 కోట్లు. సుంకాలే అడ్డంకి.. ‘అధిక దిగుమతి సుంకాలు, పన్నుల కారణంగా అల్ట్రా లగ్జరీ కార్లు భారత్లో అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. అయితే ఇటువంటి కారును కలిగి ఉండటం లగ్జరీ, ప్రతిష్ట అని భావించే వినియోగదారులను అధిక సుంకాలు, పన్నులు నిరోధించలేవు’ అని టెక్సీ డైరెక్టర్ కరన్ ఛేసి వ్యాఖ్యానించారు. ‘దేశంలో అల్ట్రా లగ్జరీ కార్ల విభాగం పెరుగుతోంది. అధిక దిగుమతి సుంకాలు మాత్రమే పరిశ్రమ వృద్ధికి అడ్డంకిగా ఉన్నాయి. క్రమంగా ప్రభుత్వం పన్నులను హేతుబద్ధం చేస్తుందని ఆశిస్తున్నాం. ఇది జరిగితే ఏటా 1,000 యూనిట్లను కూడా విక్రయించగలం’ అని భారత్లో బెంట్లే డీలర్ అయిన ఎక్స్క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బగ్లా ధీమా వ్యక్తం చేశారు. ఒకదాన్ని మించి ఒకటి.. సూపర్ లగ్జరీ కార్ల విక్రయంలో ఉన్న కంపెనీలు ఒకదాన్ని మించి ఒకటి భారత్లో పోటీపడుతున్నాయి. 2007లో దేశీయ మార్కెట్లో 2007లో లంబోర్గీని ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు భారత్లో ఈ కంపెనీ 400 యూనిట్లు విక్రయించింది. గతేడాది 30 శాతం వృద్ధితో 92 లంబోర్గీని కార్లు రోడ్డెక్కాయి. ఈ కంపెనీ అమ్మకాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 25 శాతం ఉందట. 2023లో 100 యూనిట్ల మార్కును చేరుకుంటామని కంపెనీ ధీమాగా ఉంది. లంబోర్గీని కార్ల ఖరీదు రూ.3.8 కోట్లకుపైమాటే. 2022లో పోర్ష 64 శాతం అధికంగా 779 యూనిట్ల అమ్మకాలను సాధించింది. 2014 నుంచి చూస్తే కంపెనీకి ఇదే అత్యధిక విక్రయాలు. 40 శాతంపైగా వృద్ధితో ఈ ఏడాది 60 యూనిట్ల స్థాయికి చేరుకోవాలని బెంట్లే లక్ష్యంగా చేసుకుంది. -
ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: విదేశాల్లో పూర్తిగా తయారై (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్/సీబీయూ) భారత్లోకి దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ కార్లు సహా అన్ని రకాల కార్లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. విదేశాల్లో పూర్తిగా తయారైన వాటిని ‘సీబీయూ’లుగా చెబుతారు. 40,000 డాలర్ల కంటే తక్కువ ధర (ఇన్వాయిస్ వ్యాల్యూ) ఉన్నవి లేదంటే ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే తక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ ఇంజిన్ కార్లపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. ఎలక్ట్రిక్ కార్లు 40,000 డాలర్లకు పైన ధర ఉంటే వాటిపై కస్టమ్స్ డ్యూటీని 60% నుంచి 70%కి పెంచారు. సెమీ నాక్డ్ డౌన్ (ఎస్కేడీ/పాక్షికంగా తయారైన) కార్లపై (ఎలక్ట్రిక్ సహా) కస్టమ్స్ డ్యూటీని 30% నుంచి 35%కి పెంచారు. ప్రస్తుతం విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే కార్లు 40,000 డాలర్లు లేదా ఇంజిన్ సామర్థ్యం 3,000 సీసీ కంటే ఎక్కువ ఉన్న పెట్రోల్ కార్లు, 2,500 సీసీ మించిన∙డీజిల్ కార్లపై 100% కస్టమ్స్ డ్యూటీ ఉంది. 2 శాతం వరకు పెరగనున్న ధరలు ప్రభుత్వం కస్టమ్స్ సుంకం పెంపు ప్రతిపాదనలతో కార్ల ధరలు 2 శాతం వరకు పెరుగుతాయని లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన బీఎండబ్ల్యూ, మెర్సెడెజ్ బెంజ్, లెక్సస్ ప్రకటించాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ప్రభుత్వం సవరించడంతో, ఎస్ క్లాస్ మేబ్యాచ్, జీఎల్బీ, ఈక్యూబీ ధరలపై ప్రభావం పడుతుందని మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. భారత్లోనే ఎక్కువ తయారీ చేస్తున్నందున 95 శాతం మోడళ్ల ధరలపై ప్రభావం ఉండదని చెప్పారు. చదవండి: Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్, రూ. 5 లక్షలు దాటితే! -
లగ్జరీ క్రేజ్.. హైదరాబాద్ రోడ్లపై రూ.కోటి నుంచి రూ.7 కోట్ల ఖరీదైన కార్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ రహదారులపై ఖరీదైన కార్లు దూసుకెళ్తున్నాయి. ‘హై ఎండ్’.. సిటీ ట్రెండ్గా మారింది. ఒకవైపు నగరం నలువైపులా ఆకాశమే హద్దుగా వెలిసే హైరేజ్ అపార్ట్మెంట్లు, విశాలమైన విల్లాలతో భాగ్యనగరం అంతర్జాతీయ హంగులను సంతరించుకొంటోంది. బడా కార్పొరేట్ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలోనే నగరంలో తిరిగే హైఎండ్ కార్ల సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు రూ.కోట్లు ఖరీదు చేసే కార్లను వినియోగిస్తున్నాయి. పదేళ్ల క్రితం వరకు నగరంలో అక్కడక్కడా అరుదుగా మాత్రమే హైఎండ్ వాహనాలు కనిపించేవి. కానీ ఇప్పుడు అన్ని చోట్ల ‘భారీ బడ్జెట్’ విలాసవంతమైన కార్లు విరివిగా రోడ్డెక్కుతున్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో నగరానికి దిగుమతి అవుతున్నాయి. రవాణాశాఖ లెక్కల ప్రకారం ఏటా వెయ్యికి పైగా కార్లు, 300కు పైగా బైక్లు నమోదవుతున్నాయి. హై...రయ్.. హై ఎండ్ వాహనాల్లో బైక్ల కంటే కార్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. రూ.50 లక్షల ఖరీదు చేసే ఫార్చునర్ లెజెండర్ వంటి కార్లు మొదలుకొని రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల ఖరీదు చేసే రోల్స్ రాయిస్ వంటి కార్ల వరకు ఇప్పుడు హైదరాబాద్ అంతటా కనిపిస్తున్నాయి. ఎగువ మధ్య తరగతి, ఒక స్థాయి సంపన్న వర్గాలు ఎంజీఎం హెక్టార్, ఇన్నోవా, కియా వంటి కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో పారిశ్రామిక, సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులలో హైఎండ్ కేవలం స్టేటస్ సింబల్గానే కాకుండా అభిరుచిగా కూడా మారింది. దీంతో లంబోర్గిని, ఫెరారీ, బుగాటి, బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ, పోర్షే వంటి విలాసవంతమైన కార్లు రహదారులపై పరుగులు తీస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, నగరమంతటా పరుచుకున్న ఫ్లై ఓవర్లు, తళతళలాడుతూ దూసుకొనిపోయే ఈ లగ్జరీ కార్లతో హైదరాబాద్ అందం మరింత ద్విగుణీకృతమై కనిపిస్తోంది. అలాగే ఖరీదైన బైక్లు కేటీఎం, జావా, బుల్లెట్ వంటివి సైతం పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. చదవండి: కాలేజీలకు ‘ఐటీ’ టెన్షన్.. డొనేషన్ల వివరాలు చెప్పొద్దంటూ తల్లిదండ్రులకు ఫోన్లు ఇలా తగ్గి.. అలా పెరిగాయి.. కోవిడ్ మహమ్మారి విజృంభించిన 2020 సంవత్సరం మినహా హైఎండ్ వాహనాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఆ ఒక్క సంవత్సరం మాత్రం 998 కార్లు, 342 బైక్లు ఆరీ్టఏలో కొత్తగా నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1,879 లగ్జరీ కార్ల విక్రయాలు జరిగాయి. బైక్ల సంఖ్య మాత్రం 309కి తగ్గుముఖం పట్టింది. రూ.లక్షలు వెచి్చంచి స్పోర్ట్స్ బైక్లు కొనుగోలు చేయడం కంటే కార్లు సొంతం చేసుకోవడం మంచిదనే భావనతో బైక్ల కొనుగోళ్లు కొద్దిగా తగ్గినట్లు షోరూంల నిర్వాహకులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత స్పోర్ట్స్ బైక్ల పట్ల యువతలో ఆసక్తి కూడా తగ్గినట్లు కనిపిస్తోందని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయిదేళ్లుగా హైఎండ్ వాహనాల నమోదు ఇలా.. సంవత్సరం బైక్లు కార్లు మొత్తం 2018 321 1,270 1,591 2019 374 1,334 1,708 2020 342 998 1,340 2021 326 1,642 1,968 2022 309 1,879 2,188 మొత్తం 7,123 1,672 8,795 -
లగ్జరీ కార్లు రయ్.. రయ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో లగ్జరీ కార్లు అమ్ముడవుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. హై ఎండ్ మోడళ్లకు డిమాండ్ నేపథ్యంలో 2019 సంవత్సరాన్ని మించి అమ్మకాలు నమోదవుతాయని ధీమాగా ఉన్నాయి. పండుగల సీజన్లో పెద్ద ఎత్తున విక్రయాలు ఉంటాయని చెబుతున్నాయి. 2019లో దేశంలో 40,000 లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. ఒక ఏడాదిలో ఈ స్థాయి అమ్మకాలు ఇదే తొలిసారి. ‘పరిశ్రమ మరింత స్థితిస్థాపకంగా మారింది. కోవిడ్ థర్డ్ వేవ్ అంత తీవ్రంగా లేకపోవడంతో స్థిరమైన పునరుద్ధరణ ఉంది. లగ్జరీ కస్టమర్ల తీరులో మార్పు, స్టార్టప్లు విజయవంతం కావడం, యువ సంపన్న వినియోగదారులు, దేశీయంగా కార్ల తయారీ.. వెరశి అధిక అమ్మకాలకు దారి తీస్తుంది. విక్రయాలు 2019 స్థాయిని దాటతాయి’ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని తెలిపారు. జూలైలో కంపెనీ అత్యధిక యూనిట్లను సాధించింది. ఇప్పటి వరకు సంస్థ సాధించిన ఉత్తమ అమ్మకాలతో పోలిస్తే పండుగల సీజన్లో మూడు రెట్ల వృద్ధి ఆశిస్తున్నామని వివరించారు. సెంటిమెంట్ సానుకూలం.. వినియోగదార్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో రెండవ త్రైమాసికం నుంచి పండుగల సీజన్ వరకు బలమైన డిమాండ్ ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ‘సరఫరా సవాళ్లు ఉన్నాయి. పండుగల సీజన్లో సెమీకండక్టర్ల కొరత కొనసాగుతుందని భావిస్తున్నాం. ఏఎంజీ, ఇతర వర్షన్స్లో ఈక్యూఎస్ లగ్జరీ సెడాన్ ఈ పండుగలకు రానుంది’ అన్నారు. కొన్ని నెలలుగా డిమాండ్ క్రమంగా పెరుగుతోందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. కంపెనీ కార్లకు డిమాండ్ తీవ్రం కావడంతో వెయిటింగ్ పీరియడ్ అధికమైందని చెప్పారు. ప్రపంచ సవాళ్లు కొత్త కార్ల సరఫరాను ప్రభావితం చేయడమే కాకుండా ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయని వెల్లడించారు. దేశంలో మొత్తం కార్ల పరిశ్రమలో లగ్జరీ మోడళ్ల వాటా 2 శాతం లోపే ఉంది. ఈ విభాగం దశాబ్ద కాలంగా అదే స్థాయిలో కొనసాగుతోంది. లగ్జరీ కార్లపై జీఎస్టీ 28 శాతంగా ఉంది. సెడాన్స్పై 20, ఎస్యూవీలపై 22 శాతం సెస్ అదనం. -
కటింగ్ రూ.15 లక్షలు, 7వేలకుపైగా లగ్జరీ కార్లు.. ఈ సుల్తాన్ రూటే సెపరేటు!
దర్పంగా సెల్యూట్ చేస్తున్న ఈ పెద్దమనిషి బ్రునెయి సుల్తాన్ హసనల్ బొల్కియా. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరిగా రికార్డులకెక్కిన ఘనత ఈయన సొంతం. నిజానికి 1980 వరకు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా ఈయన కొనసాగాడు. తర్వాతి కాలంలో వ్యాపార దిగ్గజాలు భారీగా సంపద పోగేసుకోవడం మొదలుపెట్టాక, కొద్దిగా వెనుకబడ్డాడు. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బంగారు వన్నె కారు ఈ సుల్తాన్గారి వాహనమే! కేవలం రంగు కాదు, అచ్చంగా బంగారు తాపడం చేయించిన రోల్స్రాయ్స్ కారు ఇది. ఈయనగారి రాజప్రాసాదంలో ఏడువేలకు పైగా లగ్జరీకార్లు కొలువుదీరి కనిపిస్తాయి. వీటిలో మూడువందలకు పైగా ఫెరారీ, ఆరువందల రోల్స్రాయ్స్ కార్లు ఉంటాయి. ఈ సుల్తాన్గారికి సొంతగా బోయింగ్–747 విమానం కూడా ఉంది. సంపదను పోగు చేయడంలోనే కాదు, విలాసవంతంగా ఖర్చు చేయడంలోనూ బ్రునెయి సుల్తాన్ అభిరుచే వేరు! ఒకసారి క్షౌరం చేయించుకోవడానికి ఈయన ఏకంగా 20వేల డాలర్లు (రూ.15.85 లక్షలు) ఖర్చుచేస్తాడంటే, ఎంతటి విలాస పురుషుడో అర్థం చేసుకోవాల్సిందే! ఈ ఫొటోల్లో కనిపిస్తున్న భవంతి ఈయన రాజప్రాసాదం. ఇందులో విలాసమైన 1700 గదులు, అధునాతనమైన సౌకర్యాలతో అడుగడుగునా కళ్లుచెదిరేలా కనిపించే ఈ ప్రాసాదం బురుజులకు బంగారు తాపడం అదనపు ఆకర్షణ. చదవండి: రాకేష్ ఝున్ఝున్వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా? -
భారత్లో సూపర్ లగ్జరీ కార్ల వేగానికి అదే అడ్డంకి
న్యూఢిల్లీ: దేశంలో సూపర్ లగ్జరీ కార్ల వృద్ధి వేగానికి అధిక పన్నులే అడ్డంకి అని లంబోర్గినీ వెల్లడించింది. వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్ చిన్నదిగా ఉంటుందని ఆటోమొబిలి లంబోర్గినీ చైర్మన్, సీఈవో స్టీఫెన్ వింకిల్మన్ తెలిపారు. 2022 జనవరి–జూన్లో కంపెనీ అంతర్జాతీయంగా 4.9 శాతం వృద్ధితో 5,090 యూనిట్లను విక్రయించింది. భారత్లో ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని కృతనిశ్చయంతో ఉన్నట్టు స్టీఫెన్ చెప్పారు. లంబోర్గినీ ప్రారంభ ధర రూ.3.16 కోట్లు. 2021లో కంపెనీ నుంచి 69 కార్లు రోడ్డెక్కాయి. 2019లో 52 కార్లు, 2020లో 37 యూనిట్లను విక్రయించింది. ఖరీదు, బీమా, రవాణా చార్జీలతో కలిపి 40,000 డాలర్లకుపైగా విలువ కలిగిన పెట్రోల్ ఇంజన్ 3,000 సీసీ, డీజిల్ ఇంజన్ 2,500 సీసీ, ఆపైన సామర్థ్యం ఉన్న కార్లను దిగుమతి చేసుకుంటే సుంకం 100 శాతం ఉంది. అన్ని ఖర్చులు కలిపి 40,000 డాలర్లకులోపు ఉండి, పెట్రోల్ ఇంజన్ 3,000 సీసీ, డీజిల్ ఇంజన్ 2,500 సీసీకి తక్కువగా ఉంటే దిగుమతి సుంకం 60 శాతం వసూలు చేస్తారు. రూ.2.5 కోట్లకుపైగా ఖరీదు కలిగిన సూపర్ లగ్జరీ కార్లు 2021లో 300 యూనిట్లు అమ్ముడయ్యాయి. చదవండి: Adani: అదానీ దూకుడికి బ్రేక్.. గ్రీన్ డీలా! -
మార్కెట్లోకి ఆడి కొత్త కారు..! అదిరిపోయే లుక్.. వావ్ అనేలా ప్రత్యేకతలు..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో లగ్జరీ కార్ల హవా కొనసాగుతోంది. టాప్ బ్రాండ్ల ప్రీమియం కార్లకు లగ్జరీతో పాటు అదిరిపోయే ఫీచర్లు ఉంటే చాలు, ఆ కార్ల డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి సీరిస్ నుంచి మరో కొత్త కారును ఇండియన్ మార్కెట్లోకి గ్రాండ్గా లాంచ్ చేసింది. సెడాన్ ఫ్లాగ్షిప్ ఆడి ఏ8 ఎల్ (Audi A8 L)ను తాజాగా విడుదల చేసింది. కారు లాంచింగ్ సందర్బంగా ఆ సంస్థ ఇండియన్ హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. ఆడి ఏ8 ఎల్ మోడల్ కస్టమర్లని మరింత ఆకట్టుకునేలా, బెస్ట్ టెక్నాలజీతో పాటు కస్టమర్ల సౌకర్యంలో ఏ మాత్రం రాజీపడకుండా ఉండే ఫీచర్లతో తయారుచేసినట్లు తెలిపారు. ఇండియాలో ఆడి A8L కారు.. ఆడి A8 L సెలబ్రేషన్ ఎడిషన్, (ధర రూ.1.29 కోట్లు), ఆడి A8 L టెక్నాలజీ (ధర రూ. 1.57 కోట్లు) రెండు వేరియంట్లో డిజైన్ చేసినట్లు చెప్పారు. ఆడి A8 L సెలబ్రేషన్ ఎడిషన్ 5- సీటర్గా అందుబాటులో ఉండగా, ఆడి A8 L టెక్నాలజీ వేరియంట్ మాత్రం 4, 5-సీట్ల కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఈ మోడల్ ప్రత్యేకతలను ఓ లుక్కేద్దాం. కలర్ ఆప్షన్స్ ఈ సెడాన్ ఎనిమిది స్టాండర్ట్ ఎక్స్టీరియర్ కలర్స్లో లభిస్తుంది. ఈ కొత్త ఆడి కారును టెర్రా గ్రే, ఫిర్మామెంట్ బ్లూ, డిస్ట్రిక్ట్ గ్రీన్, ఫ్లోరెట్ సిల్వర్, గ్లేసియర్ వైట్, మాన్హట్టన్ గ్రే, వెసువియస్ గ్రే, మైథోస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇంటీరియర్ విషయానికొస్తే.. మదర్ ఆఫ్ పెర్ల్ బీజ్, కాగ్నాక్ బ్రౌన్, సార్డ్ బ్రౌన్, బ్లాక్ వంటి నాలుగు కలర్స్లో అందుబాటులో ఉంది. ఇంజిన్ కెపాసిటీ డైనమిక్ 3.0L టర్బో చార్జ్ TFSI (పెట్రోల్), 48V మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఫీచర్స్ ఉన్న ఈ కారు.. 340 hp పవర్ను, 500 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా కేవలం 5.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. కారులోని సస్పేన్షన్ ఫీచర్ ఏర్పాటు చేయడంతో ఇది కస్టమర్లకు సౌకర్యవంతమైన రైడ్ అనుభూతిని కలిగిస్తుంది. సేఫ్టీ సూట్.. కారులో మొత్తం 8 ఎయిర్ బ్యాగ్స్(ఫ్రంట్ అండ్ రియర్ సీట్లుతో పాటు సైడ్ బ్యాగ్స్తో కలిపి) ఉన్నాయి. కారుకు ఏదైనా ప్రమాదం జరిగిన కేవలం మిల్లీసెకన్ల సమయంలోనే ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చేలా అమర్చారు. చదవండి: Bajaj Pulsar Price Hike.. ఆ బైక్ మోడళ్ల ధరలు పెంచిన బజాజ్.. ఎంతంటే? -
బర్త్డే గర్ల్ సమంత వద్ద ఉన్న ఈ కాస్ట్లీ వస్తువులు తెలుసా ?
Samantha Luxury Cars Bags Collection On Her Birthday Special: అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది యాపిల్ బ్యూటీ సమంత. తన నటన, గ్లామర్, ఫ్యాషన్, ఫిట్నెస్తో ప్రేక్షకులు, అభిమానులకు బోర్ కొట్టించకుండా ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తుంది. టాలీవుడ్ గుడ్ బాయ్ నాగ చైతన్యతో విడాకుల అనంతరం తన కెరీర్పై మరింత ఫోకస్ పెడుతూ దూసుకుపోతోంది. ఐటమ్ సాంగ్ నుంచి విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన మార్క్ చూపిస్తుంది. సినిమాలే కాకుండా ఫ్యాషన్లోనూ సత్తా చాటుతోంది సామ్. నేడు (ఏప్రిల్ 28) పుట్టిన రోజు సందర్బంగా సామ్ దగ్గర ఉన్న లగ్జరీ కార్లు, కాస్ట్లీ బ్యాగులు ఇతర వస్తువులపై ఓ లుక్కేద్దామా ! సమంత వద్ద 6 లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వాటిలో రూ. 2.55 కోట్ల విలువ చేసే మెర్సిడేజ్ బెంజ్ జీ63, రూ. 2.26 కోట్ల రేంజ్ రోవర్, రూ. 1.46 కోట్ల స్వాంకీ పోర్చే కేమన్, రూ. 1.42 కోట్ల బీఎండబ్ల్యూ 7 సిరీస్, రూ. 83 లక్షల ఆడి క్యూ 7, రూ. 72 లక్షల జాగ్వర్ ఎక్స్ఎఫ్ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సామ్కు హ్యాండ్బ్యాగ్లపై ఆసక్తి ఎక్కువే. సామ్ వద్ద వైఎస్ఎల్ లవ్ బాక్ క్లచ్ బ్యాగ్, బట్టేగా వెనెటా పంచ్ స్లింగ్ బ్యాగ్, ప్రద వింటేజ్ బ్యాగ్, లూయిస్ వుయిట్టన్ బ్లీకర్ బ్యాగ్, లూయిస్ వియుట్టన్ ట్విస్ట్ బ్యాగ్ వంటి తదితర లగ్జరీ బ్యాగులు ఉండటం విశేషం. వీటి ధర ఏకంగా రూ. 1.40 లక్షలు ఉంటుందని అంచనా. వీటితోపాటు సామ్ వాడే మనోలో బ్లాక్ హై హీల్స్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. వీటి ధర సుమారు రూ. లక్ష ఉంటుందని టాక్. అయితే తాను ఈ స్థాయికి రావడం వెనుక ఎంతో కష్టముందని ఇదవరకు అనేకసార్లు సామ్ చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: బర్త్డే స్పెషల్ పోస్టర్: ఎదురుచూపుల్లో సమంత! చదవండి: సమంత, నయనతార మధ్య నలిగిన హీరో.. ఆసక్తిగా ట్రైలర్ ఇదిలా ఉంటే 2010లో వచ్చిన 'ఏ మాయ చేశావే' సినిమాతో వెండితెరకు తెరంగేట్రం చేసిన సామ్ తన క్యూట్ అండ్ లవ్లీ ఎక్స్ప్రెషన్స్తో సినీ లోకాన్ని మాయ చేసింది. తాజాగా కణ్మనీ రాంబో ఖతీజా (కాతువాక్కుల రెండు కాదల్) సినిమాతో తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం (ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి, సామ్, నయన తార కలిసి నటించిన ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. చదవండి: ఆ గాయం తగ్గడానికి ఆరు నెలలు పట్టింది : సమంత పచ్చబొట్టు వేసుకోవాలన్న ఆలోచనే వద్దంటున్న సమంత var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1591342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
దూసుకెళ్తున్న లంబోర్గినీ కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్ మహమ్మారిలోనూ సూపర్ లగ్జరీ కార్లకు ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఇటలీకి చెందిన సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆటోమోబిలీ లంబోర్గినీ భారత్లో అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసింది. 2021లో 69 కార్లను విక్రయించింది. 2020తో పోలిస్తే ఇది 86 శాతం అధికం. భారత్లో లంబోర్గినీ కార్ల ధర రూ.3.16 కోట్ల నుంచి ప్రారంభం. 2019లో దేశంలో 52 లంబోర్గినీ కార్లు రోడ్డెక్కాయి. 52 మార్కెట్లలో 173 డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ 8,405 యూనిట్లను విక్రయించింది. సంస్థ ఖాతాలో ఒక ఏడాదిలో ఇదే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. 2020తో పోలిస్తే ఇది 13 శాతం వృద్ది. తొలి స్థానంలో ఉన్న యూఎస్లో 2,472 యూనిట్లు అమ్ముడయ్యాయి. చైనా, జర్మనీ, యూకే, ఇటలీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
లగ్జరీ కార్లు అతని టార్గెట్! ఎవరీ ‘కారు కింగ్’
లగ్జరీ కార్లను చోరీ చేయడామే వృత్తిగా ఎంచుకున్న ఓ దొంగను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద మూడు కార్లు, కారు రిజిస్ట్రేషన్కు సంబంధించిన నంబర్ ప్లేట్లు, కార్ల తాళాలు, విడి భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కునాల్ అనే 42 ఏళ్ల వ్యక్తికి 2003 నుంచి లగ్జరీ కార్లను దొంగిలించడం ఓ అలవాటుగా మారింది. డబ్బు కోసం చోరీ చేసిన కార్లను ఉత్తప్రదేశ్, కశ్మీర్లో అమ్మకం పెట్టేవాడు. అయితే ఇటీవల సివిల్ లైన్స్కు చెందిన శ్రేతాంక్ అగర్వాల్.. తన ఇంటి వద్ద పార్క్ చేసిన టయోటా ఫార్చ్యూనర్ కారు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కశ్మీరీ గేట్ వద్ద ఫార్చ్యూనర్ కారుతో కునాల్ను పట్టుకున్నారు. పోలీసులు చేపట్టిన విచారణలో అతని వద్ద పట్టుకున్న కారు రిజిస్ట్రేషన్, నంబర్ సంబంధం లేకపోవడంతో అరెస్ట్ చేశారు. అయితే కునాల్కు 100 కార్లు దొంగతనం చేసి ‘కారు కింగ్’ అని పిలిపించుకోవాలని ఉందని పోలీసు విచారణలో పేర్కొన్నాడు. నిందితుడిపై ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కునాల్ విలాసవంతమైన జీవితం గడపడం కోసం తరచు లగ్జరీ కార్ల చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు పేర్కొన్నారు. -
రయ్ రయ్మంటూ రోడ్లపైకి.. 5 నిమిషాల్లోనే ‘పెద్దల’ నుంచి ఫోన్స్
సాక్షి, హైదరాబాద్: అతివేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్ధం ఇచ్చే సైలెన్సర్ల గోల.. కరోనా లాక్డౌన్తో వీటన్నీంటికి కొంతకాలంగా బ్రేక్ పడింది. అనంతరం కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్లాక్తో మళ్లీ మొదలయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో గత రెండు వారాల నుంచి దూసుకెళ్తున్న బైక్లు, కార్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ► కొత్తకొత్త మోడల్స్లో వస్తున్న కార్లు, బైక్లు రయ్.. రయ్.. మంటూ దూసుకెళ్తున్నాయి. గతంలో శని, ఆదివారాల్లో రాత్రిపూట మాత్రమే తిరిగిన ఈ స్పోర్ట్స్ బైక్లు, కార్లు ఇప్పుడు పట్టపగలు కూడా సాధారణ రోజుల్లో చెలరేగిపోతున్నాయి. ► గతంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పోష్ లొకాల్టీల్లో ప్రధాన రహదారుల్లో తనిఖీలు నిర్వహించే వారు. అదుపుతప్పిన వేగం, అధిక శబ్ధంతో వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించే వారు. ► కోవిడ్ కారణంగా గత ఏడాదిన్నర నుంచి పోలీసుల తనిఖీలు అటకెక్కాయి. ఇదే అదనుగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచి్చ»ౌలి రోడ్లు సైలెన్సర్లు తొలగించిన వాహనాల అధిక శబ్ధంతో అల్లాడిపోతున్నాయి. చదవండి: ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు: సీపీ అంజనీ కుమార్ ► శబ్ధ కాలుష్యం ఒకవైపు, మితిమీరిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇంకోవైపు సాధారణ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ► పబ్ల నుంచి బయటికి వచ్చే క్రమంలో యువత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు, బైక్లపై అర్ధరాత్రి అతివేగంతో దూసుకెళ్తుండటంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ► ఒకవైపు అధిక వేగం ఇంకోవైపు అధిక శబ్ధం స్థానికులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా స్పెషల్ డ్రైవ్ చేపట్టాల్సిన అవసరం ఉంది. ► గడిచిన ఏడాదికాలంగా సంపన్నులు నివసించే ఈ కాలనీల్లో 250కి పైగా ఖరీదైన కార్లు రోడ్లెక్కాయి. ఇందులో చాలా కార్లకు ఇంకా నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయలేదు. దీనిపై కూడా పోలీసులు దృష్టి సారించడం లేదు. పొరపాటున పట్టుకుంటే ఫోన్కాల్స్... ► కోట్లాది రూపాయలు వెచ్చిం కొనుగోలు చేస్తున్న కొత్త మోడల్ కార్లను అదుపుతప్పిన వేగంతో నడుపుతున్న వారిని పొరపాటున పోలీసులు ఆపితే వారికి ఐదు నిమిషాల్లోనే ‘పెద్దల’ నుంచి ఫోన్కాల్స్ వస్తున్నాయి. ► ఆ కారు మన వాళ్లదే.. వదిలేయండి.. అంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఇక వీటిని పట్టుకోవడం ఎందుకంటూ వదిలిపెడుతున్నారు. ► ఇదే అదనుగా బడాబాబుల పుత్రరత్నాలు చెలరేగిపోతున్నాయి. ► రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఓ సమావేశానికి బందోబస్తుకు వెళ్లిన జూబ్లీహిల్స్ పోలీసులకు ఆ రోడ్లపై రయ్..రయ్.. మంటూ దూసుకెళ్తున్న ఫెరారీ కారు కనిపించింది. దీంతో ఆ కారు ఆపి నడిపిస్తున్న వ్యక్తిని ప్రశ్నించగా కొద్దిసేపట్లోనే పోలీసులకు ఆ కారు వదలాలంటూ ఫోన్కాల్ వచ్చింది. చదవండి: రెండు తలల పాము @ 70 లక్షలు.. ఈ పాము ఇంట్లో ఉంటే.. -
వీడు గజదొంగ గంగన్నా!.. పోలీసులకే కాల్ చేసి సవాల్?
సాక్షి, హైదరాబాద్: అత్యంత ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ లగ్జరీ కార్లను అపహరిస్తున్న చోరుడిని పట్టుకోవడంలో పోలీసులు చేతులెత్తేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్లో గత జనవరి 26న రాత్రి కన్నడ నిర్మాత వి.మంజునాథకు చెందిన ఫార్చునర్ కారు (కేఏ 04 ఎంఎక్స్ 1000)ను దొంగిలించి పరారైన ఈ దొంగను పట్టుకోవడానికి స్థానిక పోలీసులు యత్నిస్తుండగానే మళ్లీ గత మే నెలలో నాచారం పోలీస్స్టేషన్ పరిధిలో, ఆగస్టు 5వ తేదీన బౌరంపేటలో రెండు కార్లను అపహరించాడు. చదవండి: చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..! ► పార్క్ హయత్ హోటల్లో దొంగతనం చేసిన తర్వాత నిందితుడి కోసం బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి గాలించగా ఇంటర్స్టేట్ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకా వత్గా గుర్తించారు. గతంలో ఢిల్లీ, మహా రాష్ట్ర, గుజరాత్ పోలీసులు ఇతగాడిని అరెస్ట్ చేసినట్లు కూడా తేలింది. బెయిల్పై విడుదలైన షెకావత్ కన్ను హైదరాబాద్పై పడింది. ► నాలుగు నెలల క్రితమే బంజారాహిల్స్ పోలీసులు ఈ కార్ల దొంగను పట్టుకోవడానికి రాజస్థాన్కు వెళ్లారు. ‘నన్ను పట్టుకునే దమ్ము ఉందా’ అంటూ పోలీసులకే సవాల్ విసి రాడు. ‘నేను ఇక్కడే ఉన్నాను. పట్టుకోండి చూద్దాం’ అంటూ ఇంటర్నెట్ వాట్సాప్ కాల్లో సవాల్ విసిరి తప్పించుకున్నాడు. ► పోలీసులు వారం రోజుల పాటు అక్కడ తిష్టవేసి షెకావత్ తండ్రిని ప్రశ్నించారు. అతని భార్యతో కూడా మాట్లాడారు. వారి కదలికలపై దృష్టి పెట్టిన విషయాన్ని షెకావత్ గుర్తించి నేరుగా బంజారాహిల్స్ పోలీసులకే ‘నన్ను పట్టుకోవడం మీ తరం కాదంటూ మరోసారి సవాల్ విసిరాడు. మీరు వాడుతున్న టెక్నాలజీ చాలా పాతదని అప్డేట్ అవ్వాలని ఆ తర్వాతే తనను పట్టుకోగలుగుతారని హెచ్చరించారు. దీంతో పోలీసులు వెనక్కి వచ్చారు. చదవంండి: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు ► నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు ప్రయత్నాలు సాగిస్తుండగానే నగర శివార్లలో మరో రెండు ఖరీదైన కార్లను చోరీ చేయడం కలకలం రేపింది. నాచారం పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు చెందిన ఇసుజు వాహనాన్ని తస్కరించిన షెకావత్ కోసం నాచారం పోలీసులు ఇటీవల జైపూర్ వెళ్లారు. ► భర్తకు సహకరిస్తున్న షెకావత్ భార్యను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయతి్నంచారు. ఆమెకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆగస్టు 5న దుండిగల్ పోలీస్ స్టేషన్పరిధిలోని బౌరంపేటలో ఓ గేటెడ్ కమ్యూ నిటీలో నివాసం ఉంటున్న గ్లాండ్ ఫార్మా సంస్థకు చెందిన డీజీఎం రవీంద్ర వర్మ కారును కూడా టెక్నాలజీ సహాయంతో షెకావత్ తస్క రించాడు. ఈ కేసులో కూడా సైబరాబాద్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: ప్రియుడి ఘాతుకం: నడిరోడ్డుపై యువతి దారుణ హత్య ►ఇప్పటిదాకా దేశంలోని పలు నగరాల్లో షెకావత్ వందకుపైగా కార్లను తస్కరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తస్కరించిన కార్లను డ్రగ్ డీలర్లు, ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పని చేస్తున్న వారికి అమ్ముతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ► దొంగిలించిన కార్లను స్వయంగా నడుపుకొంటూ వెళ్లి గుర్తు తెలియని ప్రాంతంలో కొన్నాళ్లు ఉంచిన తర్వాత తాపీగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్న షెకావత్ను ఎవరు పట్టుకుంటారో వేచి చూడాల్సిందే. -
పేరుకి కోటీశ్వరులు.. మరి అందులో కక్కుర్తి ఎందుకో
అంతా కోటీశ్వరులే. కారు రేసింగ్ వాళ్ల అభిరుచి. అందుకోసం ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారు. మెర్సిడస్ బెంజ్, మాసరట్టి, పెరారీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గిని వంటి ఒక్కొక్కటి రూ.2 కోట్లకు పైగా విలువైన కార్లు. అర్ధరాత్రి హైదరాబాద్ రహదారులపై ఈ కార్లను వాయువేగంతో పరుగెత్తించడం వాళ్లకు సరదా. కానీ ఈ వాహనాల పన్ను చెల్లింపులపైన మాత్రం తమ సంకుచిత బుద్ధినిప్రదర్శిస్తున్నారు. రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. తాజాగా పట్టుబడిన 11 వాహనాల నుంచే రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మరో వందకు పైగా వాహనాల నుంచి రూ.100 కోట్ల మేర ఆదాయం రావచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వాహన యజమానులంతా పన్ను ఎగవేసేందుకే తమ వాహనాలను హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరిలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అధికారులు జప్తు చేసిన పదకొండు వాహనాల్లో కొన్ని హర్యానాకు చెందినవి కాగా..మరికొన్ని ఢిల్లీ, పాండిచ్చేరిల్లో నమోదైనట్లు అంచనా. సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఏ చిన్న వాహనం కొనుగోలు చేసినా సదరు వాహన యజమాని మోటారు వాహన నిబంధనల మేరకు షోరూమ్లోనే జీవితకాల పన్ను చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకుంటాడు. కానీ ఖరీదైన కార్లు కొనుగోలు చేసే బడాబాబులు మాత్రం ఆ పన్ను తప్పించుకొనేందుకు పక్కదారి పడుతున్నారు. నగరంలో ఇప్పుడిప్పుడే ఇలాంటి వారి బోగోతాలు వెల్లడవుతున్నాయి. అక్కడ పన్ను తక్కువ.. వాహనాలపైన విధించే జీవితకాల పన్ను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. జీవిత కాల పన్ను ఏ మేరకు విధించాలనే అంశం రాష్ట్రాల పరిధికి చెందినది కావడంతో ఇలా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు విధించారు. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో ఇది 5 శాతం నుంచి 7 శాతం వరకు ఉన్నట్లు అంచనా. మహారాష్ట్రలో వాహనాల ఖరీదు మేరకు రకరకాల స్లాబుల్లో జీవితకాల పన్ను విధించారు.తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడులలో ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో ఖరీదైన వాహనాల పైన 14 శాతం వరకు జీవితకాల పన్ను విధించారు. అంటే రూ.2 కోట్ల ఖరీదైన వాహనంపైన సుమారు రూ.70 లక్షల వరకు పన్ను కట్టాల్సివుంటుంది. ఈ పన్నును ఎగ్గొట్టేందుకే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి, తదితర చోట్ల కేవలం రూ.30లక్షలలోపు జీవిత కాలపన్నుతో వాహనాలు నమోదు కావడంతో నగరవాసులను ఆ రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. -
హైదరాబాద్: 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్
-
హైదరాబాద్లో 11 హై ఎండ్ లగ్జరీకార్లు సీజ్, ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: పన్ను ఎగవేసి తిరుగుతున్న హై ఎండ్ లగ్జరీ కార్లపై ఆర్టీఏ కొరడా ఝుళిపించింది. రవాణ శాఖ అధికారులు ఆదివారం ఆకస్మిక దాడులు చేసి 11 వాహనాలను సీజ్ చేశారు. వివరాలు... డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ కె.పాపారావు నేతృత్వంలో మోటారు వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్ అయిన ఈ లగ్జరీ కార్లు రవాణా శాఖకు జీవితకాల పన్ను చెల్లించకుండా హైదరాబాద్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్నెల్లుగా ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి పథకం ప్రకారం దాడులు నిర్వహించి 11 కార్లను సీజ్ చేశారు. జఫ్తు చేసిన వాహనాల నుంచి జీవితకాల పన్ను రూపంలో రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశంఉంది. సీజ్ చేసిన వాటిలో మెర్సెడస్ బెంజ్, మాసరట్టి, పెర్రారి, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గీని తదితర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. హై ఎండ్ వాహనాలపై దాడులు నిర్వహించడం ఆర్టీఏ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి కావడం గమనార్హం. -
పన్ను ఎగవేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి
సాక్షి, హైదరాబాద్: దౌత్యవేత్తలకు లభించే మినహాయింపులను వినియోగించుకొని లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుంటూ పన్నులు ఎగవేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారమంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొదట రాయబారుల పేరుతో కార్లు దిగుమతిని ముంబై మాఫియా చేస్తోంది. అనంతరం దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్లకు మణిపూర్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అన్ని తతంగాలు పూర్తయ్యాక ఈ లగ్జరీ కార్లను ముంబై మాఫియా నుంచి కొందరు బడాబాబులు కొంటున్నారు. ప్రస్తుతం విదేశీ కార్లు కొనుగోలు చేసిన వారి వివరాలను డీఆర్ఐ సేకరిస్తోంది. పన్ను ఎగవేత కార్లు వాడుతున్న వారిలో రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. -
హైస్పీడులో లగ్జరీ కార్ సేల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెర్సిడెస్ మైబాహ్ జీఎల్ఎస్ 600.. ధర ఎక్స్షోరూంలో రూ.2.43 కోట్లు. ఇందులో విశేషం ఏమిటంటారా? ఈ సూపర్ లగ్జరీ కారు భారత మార్కెట్లోకి రాక ముందే ఇక్కడి కస్టమర్లు బుక్ చేసుకున్నారట. కంపెనీ భారత్ కోసం కేటాయించింది అటూ ఇటుగా 50 యూనిట్లు మాత్రమే. రెండవ లాట్ వచ్చేది 2022 జనవరి–మార్చిలోనే. సూపర్ లగ్జరీ కార్లకు భారత విపణిలో ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ఇదొక్కటే చెబుతోంది. ఇక రూ.2.5 కోట్లకుపైగా ధర కలిగిన సూపర్ లగ్జరీ కార్లు 2019లో దేశవ్యాప్తంగా 265 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోవిడ్–19 ముందస్తు స్థాయికి ఈ ఏడాది విక్రయాలు ఉంటాయని లంబోర్గినీ అంచనా వేస్తోంది. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి నుంచి మొత్తం 50కిపైగా కొత్త మోడళ్లు ఈ ఏడాది విడుదల కానుండటం కంపెనీల ఆసక్తికి నిదర్శనం. చిన్న మార్కెట్ అయినప్పటికీ భారత్పై సూపర్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. కోవిడ్–19 సమయంలోనూ.. దేశంలో సూపర్ లగ్జరీ కార్ల అమ్మకాలు కోవిడ్–19 సమయంలోనూ కొనసాగుతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ప్రకారం 2020–21లో పోర్ష 249 కార్లను విక్రయించింది. లంబోర్గినీ 26 కార్లు, రోల్స్ రాయిస్ 21, ఫెరారీ 16, బెంట్లే నుంచి 12 కార్లు రోడ్డెక్కాయి. 2019–20తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో లంబోర్గినీ ఏకంగా 100 శాతం వృద్ధి సాధించింది. ఊరూస్ మోడల్కు విపరీత డిమాండ్ కారణంగానే ఈ స్థాయి వృద్ధి నమోదు చేసింది. ఎక్స్షోరూంలో ఊరూస్ ధర రూ.3.15 కోట్ల నుంచి ప్రారంభం. మెర్సిడెస్ 2021లో 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. జనవరి–జూన్లో ఇప్పటికే ఎనిమిది మోడళ్లు కొలువుదీరాయని తెలిపింది. కన్జూమర్ సెంటిమెంట్ తిరిగి బలపడిందనడానికి మైబాహ్ జీఎల్ఎస్ 600 బుకింగ్స్ ఉదాహరణగా వివరించింది. తొలి అర్ధ భాగంలో 50% వృద్ధి సాధించామని.. వచ్చే త్రైమాసికాల్లోనూ అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తోంది. ఇన్నాళ్లు ఖర్చులకు దూరంగా.. షికార్లు, షాపింగ్కు సంపన్నులు తరచూ విదేశాలు చుట్టి వస్తుంటారు. కోవిడ్–19 మూలంగా విమాన ప్రయాణాలకు పరిమితులు ఉండడం, వైరస్ భయం కారణంగా గతేడాది నుంచి వీరంతా షికార్లు, షాపింగ్కు దూరంగా ఉన్నారు. వీరి వద్ద ఆర్థిక సామర్థ్యం ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ‘మెరుగైన ఇల్లు, కార్లవైపు వినియోగదార్లు చూస్తున్నారు. ఆరోగ్యం, జీవితంపై అనిశ్చితి నేపథ్యంలో స్తోమత ఉన్నప్పుడు ఈ రోజే ఎందుకు సొంతం చేసుకోకూడదు. ఎందుకు ఓ అయిదేళ్లు ఆగాలి అన్న భావన కస్టమర్లలో ఉంది. ఈ అంశమే అమ్మకాలకు బూస్ట్నిస్తోంది’ అని లంబోర్గినీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏటా 30–40 సూపర్ లగ్జరీ కార్లు రోడ్డెక్కుతున్నాయని వసంత్ మోటార్స్ ఫౌండర్ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి తెలిపారు. రూ.220 కోట్లకుపైగా సంపద కలిగిన అల్ట్రా హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ ప్రస్తుతం దేశంలో 6,884 మంది ఉన్నారు. అయిదేళ్లలో ఈ సంఖ్య 63% వృద్ధి చెందుతుం దని ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ తెలిపింది. -
రూ.8.82 కోట్ల విలువైన కార్లను తుక్కుతుక్కు చేశారు..
మనీలా: లక్షల రూపాయలు ఖరీదు పెట్టి ఎంతో ఇష్టంగా కొనుకున్న కారు మీద చిన్న గీత కనిపించినా మనసు కలుక్కుమంటుంది. చాలా రోజుల పాటు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది కోట్ల రూపాయలు విలువ చేసే కార్లను తుక్కుతుక్కుగా మార్చితే.. అబ్బో తల్చుకోవడానికే బాధగా ఉంది కదా. కానీ ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మాత్రం ఇదేం పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయలను విలువ చేసే లగ్జరీ కార్లను వరుసగా పార్క్ చేసి ఆ తర్వాత బుల్డోజర్తో వాటిని తుక్కుతుక్కుగా మార్చేస్తుంది. ఎందుకంటే ఈ కార్లను దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చారట. దాంతో కార్ స్మగ్లర్స్ను గట్టిగా హెచ్చరించడం కోసం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 1.2మిలయన్ డాలర్లు(రూ. 8,89,72,920.00) విలువ చేసే 21 కార్లను ఇలా తుక్కుగా మార్చేసింది. ఇలా ధ్వంసం చేసిన కార్లలో మెక్లారెన్ 620 ఆర్, పోర్స్చే 911, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతేకాకుండా, మెర్సిడెస్ ఎస్ఎల్కే, లోటస్ ఎలిస్, మాడిఫైడ్ హ్యుందాయ్ జెనెసిస్ కూపే, టయోటా సోలారా, 14 “మిత్సుబిషి జీపు’’లను ఇలా తుక్కుగా మార్చింది. బ్యూరో ఆఫ్ కస్టమ్స్ ప్రకారం, ఈ లగ్జరీ కార్లన్నీ వేర్వేరు మార్గాల ద్వారా దేశంలోకి "అక్రమ రవాణా" చేయబడ్డాయి. 2018 నుంచి 2020 వరకు వేర్వేరు సందర్భాల్లో వీటిని స్వాధీనం చేసుకుని తుక్కుగా మార్చారు. “ప్రెసిడెన్షియల్ డైరెక్టివ్ 2017-447 ప్రకారం, ప్రభుత్వం కార్ల స్మగ్లర్ల పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలపడం కోసం వీటిని ఇలా నాశనం చేయవలసిందే’’ అని అధ్యక్షుడు రోడ్రిగో రో డ్యూటెర్టే పునరుద్ఘాటించారు. దేశంలోకి అక్రమ రవాణా చేసిన లగ్జరీ కార్లను ఇలా తుక్కుగా మార్చడం ఇది రెండో సారి. గతంలో బీఎమ్డబ్ల్యూ జెడ్ 1, ఫెరారీ 360 స్పైడర్, లంబోర్ఘిని గల్లార్డోతో సహా 17 వాహనాలను ఫిబ్రవరి 9 న బ్యూరో ఆఫ్ కస్టమ్స్ తుక్కుతుక్కు చేసింది. ఇది ఇక్కడ చాలా సాధారణ విషయం. గతంలో ఇలా తుక్కుగా మార్చిన వాటిలో రెనాల్ట్ 5 టర్బో, మెర్సిడెస్ ఎస్ఎల్ 55 ఏఎమ్జి, ఒపెల్ మాంటా, మసెరటి క్వాట్రోపోర్ట్, కాక లెక్కలేనన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వ చర్యలపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. ఇంత ఖరీదైన కార్లను ఇలా ధ్వంసం చేసే బదులు ప్రభుత్వమే వేలం వేసి.. వచ్చిన డబ్బును మంచి పనుల కోసం వాడవచ్చు కదా అంటున్నారు జనాలు. చదవండి: ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే! -
soldout: రూ.2.43 కోట్ల కారు.. క్షణాల్లో ఇయర్ స్టాక్ మొత్తం అమ్ముడైంది
ముంబై: కరోనా దెబ్బకు కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ, మందగిస్తున్న ఆర్థిక గమనం వంటి పరిణామాల నేపథ్యంలో ఓ ఖరీదైన అల్ట్రా లగ్జరీ కారు మార్కెట్లోకి వచ్చింది. ఆ కారు ఖరీదు ఎక్స్షోరూం ధరనే రూ. 2.43 కోట్ల రూపాయలు. అమ్మకాలు ఎలా అనే సందేహమే లేకుండా క్షణాల్లోనే ఏడాది స్టాక్ అంతా మనవాళ్లు కొనేశారు. మెర్సిడెజా మజాకా లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియాలో తాజాగా మైబెక్ జీఎల్ఎస్ 600 సిరీస్లో 4 మాటిక్ అల్ట్రామోడ్రన్ లగ్జరీ కారును రిలీజ్ చేసింది. ఈ కారు ఎక్స్షోరూం ధర రూ. 2.43 కోట్లుగా నిర్ణయించింది. ఇలా లాంఛ్ అయ్యిందో లేదో అలా మొత్తం స్టాక్ మొత్తం అమ్ముడైపోయి రికార్డు సృష్టించింది. 500 కార్లు సోల్డ్ అవుట్ ప్రీమియం కేటగిరి లగ్జరీ కారైన మైబెక్ జీఎల్ఎస్ 600 4 మాటిక్ లగ్జరీ కారును ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఏడాదిలో 500 కార్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లాంఛింగ్కి ముందే మొత్తం కార్లన్నీ బుక్ అయిపోయాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే బుక్ చేసుకున్న వారికి ఈ కార్లు డెలివరీ చేస్తామని ఆ సంస్థ ఈసీవో మార్టిన్ ప్రకటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు -
వావ్.. మీ మానవత్వానికి హ్యాట్సాఫ్
జైపూర్: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. మొదటి దశలో కంటే సెకండ్వేవ్లో వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని ప్రభావానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. కాగా, ఇప్పటికే అనేక ఆసుపత్రులలో కరోనా బాధితుల తాకిడి ఎక్కువైంది. వారికి సరైన బెడ్లు, ఆక్సిజన్, వ్యాక్సిన్లు సదుపాయం కల్పించలేక చాలా ఆసుపత్రులు ఇప్పటికే చేతులేత్తాశాయి. ఇదిలా ఉండగా, కరోనా బాధితులను ఆసుపత్రులకు చేర్చే అంబులెన్స్ల కోరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. కాగా ఈ కష్టకాలంలో కొంత మంది ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్ డ్రైవర్లు ఎక్కువ డబ్బులను వసూలు చేస్తూంటే మరోవైపు కొంత మంది కరోనా బాధితులకు తమ కున్న పరిధిలో సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వివరాలు.. రాజస్తాన్లోని కోటా నగరానికి చెందిన అయిదుగురు మిత్రులు తమ లగ్జరీ కార్లను కోవిడ్ అత్యవసర ఆసుపత్రిగా మార్చారు. కాగా, కోటా పట్నంలో కార్ సర్వీస్ సెంటర్ ను నిర్వహించే చందేష్ గుహిజా తన చుట్టు ఉన్న ప్రజలకు ఆక్సిజన్ కోసం పరుగెత్తడం చూసి చలించిపోయాడు. వెంటనే తన మిత్రులు ఆశిష్సింగ్, భారత్ సమ్నాని, రవికుమార్ లతో పంచుకున్నాడు. వీరంతా కలసి బాధితుల కోసం ఏదైనా సహయం చేయాలనుకున్నారు. వారి ఆలోచనను వెంటనే అమలులోకి తీసుకొచ్చారు. వెంటనే, వారి మూడు లగ్జరీకార్లను అత్యవసర ఆసుపత్రిగా మార్చేశారు. దీనిలో బెడ్, ఆక్సిజన్, మందులు, ఇతర సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా తమ వద్ద ఉన్న మరో రెండు కార్లను అంబులెన్స్గా మార్చారు. వీటిల్లో ఆక్సిజన్ కిట్ కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని కోసం ప్రతిరోజు రూ. 5000 నుంచి 7000 వేల వరకు ఖర్చువుతుందన తెలిపారు. తమ కారులో అమర్చిన ఒక సిలెండర్తో ముగ్గురు రోగులకు ఆక్సిజన్ను అందించగలదని తెలిపారు. గడచిన 10, 12 రోజుల నుంచి రోగుల కుటుంబాలకు ఉచితంగా ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. కరోనా బాధితులను ఆసుపత్రులకు ఉచితంగా చేర్చే వాహనాల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. కాగా, తమ సేవలను కోరుకునేవారి కోసం కొన్ని నెంబర్లను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు మీ మానవత్వానికి హ్యట్సాఫ్.. మీ ఆలోచన బాగుంది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, గతంలో రాంచీకి చెందిన ఒక ఆటోరిక్షా డ్రైవర్ తన ఆటోను కరోనా బాధితుల కోసం అంబులెన్స్గా మార్చిన సంగతి తెలిసిందే. -
సెకండ్హ్యాండ్ లగ్జరీ కార్లకు ఫుల్ డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఏటా కొత్త లగ్జరీ కార్లు సుమారు 30,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. కొత్త వాటితో పోలిస్తే పాత (సెకండ్ హ్యాండ్) లగ్జరీ కార్లు ఏకంగా రెండింతలు చేతులు మారుతున్నాయట. దీనికంతటికీ కారణం కస్టమర్లు తక్కువ ధరలో లగ్జరీని కోరుకోవడమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం వాడుతున్న కారు కంటే మెరుగైన మోడల్, ఖర్చు చేసిన దానికంటే విలువైనది కోరుకోవడం, ఉన్నతంగా ఉండాలన్న ఆకాంక్ష.. వెరసి ప్రీ-ఓన్డ్ లగ్జరీ కారుకు సై అంటున్నారట. తొలిసారిగా కొత్త లగ్జరీ కారు కొనే ముందు పాతదాన్ని సొంతం చేసుకుంటున్నవారు ఎక్కువేనని కంపెనీలు చెబుతున్నాయి. ప్రీ-ఓన్డ్ కార్లకు రిపేర్లు చేసి నాణ్యత ధ్రువీకరణ, వారంటీతో పాటు ఫైనాన్స్ సౌకర్యం కల్పించడంతో వినియోగదార్లలో వీటిపట్ల ఆసక్తి పెరిగింది. రెండు మూడేళ్లకే మారుస్తున్నారు.. లగ్జరీ కార్ల యజమానులు ఎక్కువ మంది రెండు మూడేళ్లకే వాహనాన్ని మారుస్తున్నారట. ఆరు నెలలు కూడా ఉపయోగించకుండానే కారును అమ్మేసి మరో కొత్త మోడల్ స్టీరింగ్ తిప్పే కస్టమర్లూ ఉన్నారు. లగ్జరీ కారు సొంతం చేసుకోవడం గతంలో ఒక కల. ఇప్పుడు విరివిగా ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. పైగా నాలుగేళ్లకే ధర సగానికి వచ్చి చేరుతోంది. ఇక లంబోర్గిని కొత్తది కావాలంటే కనీసం రూ.4 కోట్లు ఖర్చు చేయాలి. పదేళ్ల ప్రీ-ఓన్డ్ కారైతే రూ.50 లక్షలకే దొరుకుతోందని వసంత్ మోటార్స్ ఫౌండర్ కొమ్మారెడ్డి సందీప్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూ.5 లక్షల నుంచి పాత లగ్జరీ కార్లు లభిస్తాయని చెప్పారు. చిన్న కారు ధరలో ప్రీ-ఓన్డ్ లగ్జరీ కారు కొనుక్కోవచ్చని అన్నారు. రూ.10 లక్షల్లో జాగ్వార్, ల్యాండ్ రోవర్ సైతం లభిస్తున్నాయని తెలిపారు. ఒక్కో కంపెనీ ఒక్కోలా.. బీఎండబ్ల్యూ గతేడాది 6,600 కొత్త కార్లను విక్రయించింది. యూజ్డ్ కార్ల కోసం ఏర్పాటు చేసిన బీఎండబ్ల్యూ ప్రీమియం సెలెక్షన్ ద్వారా 1,600 యూనిట్లు అమ్మింది. ఇప్పటి వరకు 10,000 పైచిలుకు ప్రీ-ఓన్డ్ కార్లను ఈ షోరూంల ద్వారా విక్రయించింది. బీఎండబ్ల్యూ 3, 5, ఎక్స్1 సిరీస్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. సంస్థ మొత్తం కార్ల అమ్మకాల్లో 25 శాతం ప్రీ–ఓన్డ్ ఉన్నాయని మెర్సిడెస్ బెంజ్ చెబుతోంది. ఈ కంపెనీకి చెందిన సి-క్లాస్, ఈ-క్లాస్ సెడాన్స్ అధికంగా చేతులు మారుతున్నాయి. ఎంట్రీ లెవెల్ కస్టమర్లపై ఫోకస్ చేసేందుకు యూజ్డ్ కార్లు దోహదం చేస్తున్నాయని ఆడి అంటోంది. ప్రతి కారు కనీసం రెండుసార్లు అమ్ముడవ్వాలన్నది కంపెనీ లక్ష్యం. మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్, రేంజ్ రోవర్స్, లంబోర్గిని యూరస్, బీఎండబ్ల్యూ ఎక్స్7 హాట్ సెల్లర్స్ అని లగ్జరీ కార్ల రిటైల్లో ఉన్న బిగ్ బాయ్ టాయ్జ్ చెబుతోంది. చదవండి: అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్’ ముప్పు -
5 కోట్ల లగ్జరీ కారు కొన్న ఎన్టీఆర్
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు ఖరీదైన లగ్జరీ కార్లను వాడుతున్నారు. కొందరేమో తరచూ మారుస్తుంటారు. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకునేవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. తమ అభిరుచి, హోదా, ట్రెండ్కి తగ్గ కార్లను విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్న స్టార్లూ లేకపోలేదు. తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా లాంబోర్గిని ఉరుస్ అనే కారుని కొనుగోలు చేశారట. మామూలుగా ఎన్టీఆర్కి కార్లంటే చాలా ప్యాషన్. ఇప్పుడు ఎంతో ముచ్చటపడి ఈ ఇంపోర్టెడ్ కారుని కొనుగోలు చేశారట. ఇటలీ నుంచి ఈ కారును దిగుమతి చేయిస్తున్నారని సమాచారం. ఈ సూపర్ స్పోర్ట్స్ కారు ఖరీదు 5 కోట్ల వరకు ఉంటుందని టాక్. లాంబోర్గిని ఉరుస్ మోడల్ -
ఈ దొంగకు ఛారిటీ వర్క్ ‘కిక్’ ఇస్తుంది!
‘కిక్’ సినిమాలో మీకు హీరో గుర్తున్నాడా? అదేనండీ..మన కల్యాణ్! కల్యాణ్ ‘జస్ట్ ఫర్ ఫన్’ ‘కిక్’ కోసం దొంగతనాలు చేస్తుంటాడు. ఇక ఇర్ఫాన్ విషయానికి వస్తే ‘కిక్’ కోసం కాదుగానీ ఛారిటీ కోసం దొంగతనాలు చేస్తుంటాడు.పోష్ కాలనీలు, ఖరీదైనా కార్లు అంటే అతడికి వల్లమాలిన ప్రేమ. సోలోగా దొంగతనాలు చేయడానికి ఇష్టపడే ఇమ్రాన్, దోచిన సొమ్మును అందరికీ పంచడానికే మొగ్గు చూపుతాడు. ముప్పై సంవత్సరాల ఇర్ఫాన్ది బిహార్ రాష్ట్రం. సితమది జిల్లాలోని తన స్వగ్రామం ఉజాలలో బీదప్రజలకు సహాయపడడం, ఉచితభోజనాలు ఏర్పాటు చేయడం, హెల్త్ క్యాంప్లు నిర్వహించడం...మొదలైన మంచి పనులు చేస్తుంటాడు. అందుకే ఇర్ఫాన్ను ‘రాబిన్హుడ్ ఉజాల’ అని పిలుచుకుంటారు.‘రాబిన్హుడ్ ఉజాలా’ బిహార్లో మార్చిలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. అయితే ఈలోపే ఢిల్లీలోని ఒక ఫ్లైవోవర్ దగ్గర...చిన్నపాటి సినిమా చేజ్ తరువాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: భర్తకు షాక్! భార్యతో సహా కారు దొంగతనం -
ఇక మన రోడ్లపైనా ఎలక్ట్రిక్ కార్ల హవా
ముంబై, సాక్షి: ఇటీవల ప్రపంచ మార్కెట్లను వేడెక్కిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ దేశీయంగానూ ఊపందుకోనుంది. 2021లో పలు దిగ్గజ కంపెనీలు దేశీ మార్కెట్లో విభిన్న ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల పోటీకి ఆడి, జాగ్వార్, టెస్లా తదితరాలు సై అంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి గతంలో ఎన్నడూలేని విధంగా దేశీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పలు మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 2,500 వాహనాల వరకూ దిగుమతి చేసుకునేందుకు అనుమతించడం మద్దతిస్తున్నట్లు చెప్పారు. దీంతో అత్యున్నత సాంకేతికతతో కూడిన ఆధునిక వాహనాలు దేశీ రహదారులపై పరుగులు తీసేందుకు సన్నద్ధమవుతున్నట్లు వివరించారు. ఆటో రంగ నిపుణులు వెల్లడించిన వివరాలు చూద్దాం.. ఆడి ఈ-ట్రాన్ ఆడి సంస్థ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ-ట్రాన్ కీలక మోడల్. పూర్తి ఎలక్ట్రిఫికేషన్ దిశలో ఆడి తీసుకువస్తున్న ఈ-ట్రాన్ బ్రాండ్ దేశీయంగా విడుదలకానున్న తొలి విలాసవంత(హైఎండ్) కారుగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 17,641 వాహనాలు విక్రయమయ్యాయి. దేశీ మార్కెట్లో తొలిగా విడుదలైన మోడల్గా ప్రయోజనాలు పొందే వీలుంది. తొలి దశలో పూర్తిగా నిర్మితమైన వాహనం(సీబీయూ)గా తక్కువ సంఖ్యలోనే దిగుమతికానున్నాయి. అయితే రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా విడివిడిగా యాక్సిల్స్ను నడిపించే శక్తితో వాహనం, అమ్మకాలు వేగాన్ని అందిపుచ్చుకోనున్నాయి. జనవరి చివర్లో విడుదలకానున్న ఈ-ట్రాన్ గరిష్టంగా 357 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. జాగ్వార్ 1-పేస్ 2019 వరల్డ్ కార్గా ఎంపికైన జాగ్వార్ 1-పేస్ వాహనాలు ఇటీవల పరిశీలనాత్మకంగా ముంబైలో సందడి చేస్తున్నాయి. యూఎస్ దిగ్గజం టెస్లా ఇంక్ సైతం రేసులోకి రానుండటంతో అతిత్వరలోనే కారు విడుదల తేదీ ఖరారయ్యే వీలుంది. 90 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీతో, 394 బీహెచ్పీ గరిష్ట శక్తిని అందుకోనుంది. టాప్ఎండ్ హెచ్ఎస్ఈ మోడల్ ద్వారా దేశీయంగా తయారవుతున్న రెండో ఎలక్ట్రిక్ లగ్జరీ కారుగా నిలవనుంది. గరిష్టంగా 470 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. అంచనా ధర రూ. 1.5-2 కోట్లు. (జీప్ స్పీడ్కు ఫియట్ క్రిస్లర్ సై) టెస్లా మోడల్-3 యూఎస్ కంపెనీ టెస్లా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు మోడల్-3 దేశీయంగా విడుదలకానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశాక ఆసక్తి బాగా పెరిగింది. గ్లోబల్ ఆటో రంగంలో సంచలనాలకు నెలవుగా నిలుస్తున్న మోడల్-3 ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగవంత విక్రయాలను సాధిస్తోంది. టెస్లా ఇంక్ తయారీలో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న ఈ వాహనం ఎంట్రీలెవల్ విభాగంలో పోటీకి దిగనుంది. 5 సెకన్లలోపే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల మోడల్-3 గరిష్టంగా 420 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. డాష్బోర్డుకు అనుసంధానించిన ల్యాప్టాప్ మోడల్ 15 అంగుళాల టచ్ స్క్రీన్తో రానుంది. ఏప్రిల్ తదుపరి మార్కెట్లో విడుదలకావచ్చు. అంచనా ధర: రూ. 60 లక్షలు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) పోర్ష్ టేకెన్ కంపెనీకున్న దశాబ్దాల ఇంజినీరింగ్ సామర్థ్యాలతో నాలుగు డోర్లు కలిగిన ఎలక్ట్రిక్ కారును టేకెన్ బ్రాండుతో పోర్ష్ రూపొందించింది. కోవిడ్-19 కారణంగా విడుదల ఆలస్యమైన టేకెన్ ఫిబ్రవరిలో దేశీ మార్కెట్లలో ప్రవేశించే వీలుంది. పోర్ష్ నుంచి వస్తున్న తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఇది. ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో అత్యంత శక్తికలిగిన కారు కూడా. 79.2 కిలోవాట్స్ బ్యాటరీ, 600 బీహెచ్పీ శక్తితో రూపొందింది. గరిష్టంగా 500 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. 3.5 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 800 వోల్డ్ ఫాస్ట్ చార్జింగ్ ద్వారా 20 నిముషాల్లోనే 80 శాతం చార్జింగ్కు వీలున్నట్లు కంపెనీ చెబుతోంది. అంచనా ధర: రూ. 2.2-2.5 కోట్లు వోల్వో ఎక్స్సీ40 రీచార్జ్ స్వీడిష్ దిగ్గజం వోల్వో రూపొందించిన పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్సీ 40 రీచార్జ్. వోల్వో తయారీ ఎస్60 మోడల్ విడుదల తదుపరి మార్కెట్లో ప్రవేశించనుంది. ట్విన్ మోటార్లు కలిగిన రీచార్జ్ 408 బీహెచ్పీ పవర్ను కలిగి ఉంది. 78 కిలోవాట్ల బ్యాటరీతో వెలువడనుంది. ఏసీ లేదా 150 కిలోవాట్స్ డీసీ ఫాస్ట్ చార్జర్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. తొలిసారి ఆండ్రాయిడ్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ను వోల్వో ఏర్పాటు చేసింది. గరిష్టంగా 400 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశముంది. అంచనా ధర: రూ. 50 లక్షలు. టాటా ఆల్ట్రోజ్ఈవీ ఓవైపు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో విలాసవంత మోడళ్ల హవా ప్రారంభంకానున్నప్పటికీ మరోపక్క దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టి సాగుతోంది. దేశంలోనే చౌక ఎలక్ట్రిక్ కారుగా టాటా నెక్సాన్ ఈవీను తీసుకువచ్చిన కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్గా ఆల్ట్రోజ్ ఈవీని రూపొందించింది. అందుబాటు ధరల ఈ కార్ల వినియోగదారులు టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న చార్జింగ్ నెట్వర్క్ ద్వారా లబ్ది పొందేందుకూ వీలుంటుంది. గరిష్టంగా 300 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంది. ఫిబ్రవరిలో మార్కెట్లో ప్రవేశించవచ్చు. అంచనా ధర: రూ. 14 లక్షలు. -
ఆయన లగ్జరీ చూస్తే.. బిలియనీర్లకు కూడా షాకే!
వియన్నా: అందమైన ఇల్లు, విలాసవంతమైన కారు సొంతం చేసువాలనే కోరిక సగటు మానవుడికి అందమైన కలగానే మిగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక పెద్దాయన కార్లను చూస్తే పలువురు సెలబ్రిటీలు, బిలియనీర్లకు సైతం అసూయ కలగాల్సిందే. అది కూడా ఆయన కొన్నది అలాంటి ఇలాంటి కార్లు కాదు.. ప్రపంచంలోనే అతి ఖరీదైన కార్లు. గత ఐదు దశాబ్దాలుగా కార్లను కొంటూనే ఉన్న ఆయన తన 80 ఏళ్ల వయసుకి తగ్గట్టుగా ఏకంగా 80 కార్లను సొంతం చేసుకున్నాడు. అభిరుచికి తగ్గట్టుగా కార్లను కొనడమే కాదు.. అంతే గొప్పగా గ్యారేజీని కూడా ఏర్పాటు చేశారు. ‘లివింగ్ రూం’ గా పిలుచుకునే తన గ్యారేజ్ను అంతకంటే ఖరీదైన భవనంగా తీర్చిదిద్దుకోవడం మరో విశేషం. దీన్ని బట్టే లగ్జరీకార్లపై ఆయనకున్న మోజును అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చెందిన 80ఏళ్ల ఒట్టొకర్ జె ఏకంగా 80 లగ్జరీ కార్లను సేకరించడం విశేషంగా నిలిచింది. లగ్జరీ కార్లు సేకరించటమంటే జెకు కొన్ని దశాబ్దాలుగా సరదా. తాజాగా ఒట్టొకర్ జె 80వ పోర్సే బాక్స్టర్ స్పైడర్ కారును కొనుగోలుచేసి మొత్తం ప్రపంచాన్నే తన వైపునకు తిప్పుకున్నారు. 1972లో ఒట్టొకర్ మొదటి పోర్సే కారును కొన్నాడు. ఇక అప్పటి నుంచి తన గ్యారేజీని వివిధ పోర్సే మోడళ్లతో నింపేస్తూనే ఉన్నారు. దాదాపు 50ఏళ్ల క్రితం ఒకరోజు అతడు రోడ్డుపై వెళ్తుండగా పోర్సే కారు అతని పక్కనుంచి దూసుకెళ్లిందట. ఇక అంతే అప్పటినుంచి వాటిపై ప్రేమ పిచ్చి పిచ్చిగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే డబ్బులు పొదుపు చేసి మరీ కార్లను కొనుగోలు చేసేవారు. అలా తొలి పోర్సే స్పీడ్ ఎల్లో 911 ఈ కారును ఇంటికి తెచ్చుకున్నారు. ప్రస్తుతం జె గ్యారేజీలో 38 వేర్వేరు పోర్సే మోడల్ కార్లు ఉన్నాయి. నెలలో రోజుకు ఒకటి, రెండు వారాల్లో వీకెండ్స్ ఒకటి చొప్పున వాడతానని చెప్పుకొచ్చారు ఒట్టొకరే. తాజాగా మియామి బ్లూ కలర్ పోర్సే బాక్స్స్టర్ స్పైడర్ కారును సొంతం చేసుకున్నారు. దీనికి తొలి కస్టమర్ ఒట్టొకరే కావటం మరో విశేషం. ఇంకా రేస్ కార్లు, ఎనిమిది సిలిండర్ల ఇంజిన్ ఉండే పోర్స్చే 910, 917, 956, 904, 964 కప్ లాంటి మోడల్స్ ఆయనగ్యారేజ్లో కొలువుదీరాయి.ఇప్పటి వరకు తొమ్మిది వెర్షన్ల కారెరా ఆర్ ఎస్ మోడళ్లను సేకరించగా, భవిష్యత్తులో మరికొన్ని కార్లను సేకరిస్తానని ఒట్టొకర్ చెబుతున్నారు. హ్యూమన్ టచ్ లేకపోతే..పోర్సే కార్లు కేవలం యంత్రాలు మాత్రమే.. అదే మనుషుల తోడుంటే.. అవి కూడా ప్రాణం ఉన్న మనుషుల్లాంటివే..అంటారు మురిపెంగా జె .. తన గ్యారీజేలోని అందమైన గ్యాలరీని చూసుకుంటూ.. -
పీఎన్బీ : మూడు ఆడి కార్లు, విమర్శలు
సాక్షి, ముంబై : దేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) మరోసారి వార్తల్లో నిలిచింది. వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణంతోపాటు, కరోనా వైరస్, దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సంక్షోభంలో పడిన బ్యాంకు టాప్ మేనేజ్ మెంట్ కోసం అత్యంత విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడం సంచలనం రేపుతోంది. ఆర్థిక నష్టాలను పట్టించుకోకుండా గత నెలలో సుమారు రూ .1.34 కోట్ల విలువైన హై-ఎండ్ లగ్జరీ కార్లను అందించడం విమర్శలకు తావిచ్చింది. అయితే బోర్డు ఆమోదం పొందిన తరువాత, ఫుల్ టైం డైరెక్టర్లకు మంజూరు చేసిన పరిమితిలోనే వీటిని కొనుగోలు చేసినట్లు బ్యాంకు వర్గాలు ప్రకటించాయి. అలాగే గత సంవత్సరం ఉపయోగించకుండా మిగిలిన నిధులతో కలిపి వీటిని కొనుగోలు చేసినట్టు వెల్లడించాయి. పీఎన్బీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ కార్లను ఉపయోగిస్తారని తెలిపాయి. (లాక్డౌన్ ఎఫెక్ట్ : రికార్డు అమ్మకాలు) ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, క్యాబినెట్ మంత్రులు కూడా జర్మన్ లగ్జరీ కారు ఆడి కంటే చాలా తక్కువ ఖరీదైన మారుతి సుజుకి సియాజ్ను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శికి సమానం. అటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ (ఎండీ కంటే ఎక్కువ స్థాయి ర్యాంకు) కూడా టయోటా కరోలా ఆల్టిస్ను ఉపయోగిస్తున్నారని మార్కెట్ వర్గాలు విశ్లేషించాయి. డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ అతని మామ మెహుల్ చోక్సీకు మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ (ఎల్ఓయూ) జారీ చేయడం ద్వారా రూ .14 వేల కోట్ల కుంభకోణం 2018లో వెలుగు చూసింది. 2020 జనవరితో ముగిసిన మూడవ త్రైమాసికంలో, బ్యాడ్ లోన్లు గణనీయంగా పెరగడంతో బ్యాంక్ రూ. 502 కోట్ల నష్టాన్ని నివేదించింది. ఏడాది క్రితం ఇదే కాలానికి బ్యాంక్ నికర లాభం రూ .249.75 కోట్లు. (పెట్రో షాక్ : నాలుగో రోజూ) కాగా కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాలను ప్రారంభించవద్దని ఆర్థిక మంత్రిత్వ శాఖ గత వారం అన్నిమంత్రిత్వ శాఖలను కోరింది. ఈ క్లిష్ట సమయాల్లో మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను వివేకంతో ఉపయోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
24 వరకు రిమాండ్లో నీరవ్
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ కోర్టు మే 24 వరకు రిమాండ్ విధించింది. భారత్కు నీరవ్ను తిరిగి అప్పగించే కేసు లండన్లోని వెస్ట్మినిస్టర్ కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో నీరవ్ గత నెలలో అరెస్టయ్యారు. అప్పటినుంచి వాండ్స్వర్త్ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు రాగా, వెస్ట్మినిస్టర్ కోర్టు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నాట్ ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీరవ్ హాజరయ్యారు. మే 30న పూర్తి స్థాయి వాదనలు వింటామని, ఆ రోజు వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఎమ్మా ఆదేశించారు. అయితే మే 24న మరోసారి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాలని చెప్పారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని నీరవ్ తరఫు న్యాయవాది జెస్సికా జోన్స్ను అడగగా.. ఏమీ లేవని బదులిచ్చారు. దీంతో నీరవ్ తరఫున వేరే బెయిల్ పిటిషన్ ఏదీ దాఖలు కాలేదని ఎమ్మా రుజువు చేసుకుని విచారణ కొనసాగించారు. నీరవ్కు బెయిల్ మంజూరు చేస్తే తిరిగి లొంగిపోరనే కారణంతో మార్చి 29న ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. నీరవ్ కార్ల వేలం.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన 13 లగ్జరీ కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేలం వేసింది. నీరవ్కు చెందిన 11 కార్లు, చోక్సీకి చెందిన రెండు కార్లను ఈ–వేలం వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3.29 కోట్ల ఆదాయం వచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద వారి కార్లను ఈడీ అటాచ్ చేసింది. వాటిని వేలం వేసుకోవచ్చని ఈడీకి మార్చిలోనే ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు అనుమతులిచ్చింది. దీంతో గురువారం వాటిని ఈడీ ఆన్లైన్లో వేలం వేసింది. మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ వేలాన్ని నిర్వహించింది. -
రోల్స్ రాయిస్ సహా 13 లగ్జరీ కార్లు వేలానికి
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్మోదీపై దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఫ్యుజిటివ్ వ్యాపారి మోదీకి చెందిన ఖరీదైన పెయింటింగ్లను గత వారం వేలం వేసిన ఈడీ, సిబీఐలు తాజాగా మరో వేలానికి సిద్ధపడ్డాయి. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మెటల్ స్ర్కాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎస్టీసీ) ద్వారా 13 విలాసవంతమైన కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చే వారం వేలం నిర్వహించనుంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్, పోర్షే పనమేరా, రెండు మెర్సిడెస్ బెంజ్ కార్లు, మూడు హోండాకార్లు, ఒక టొయాటా ఫార్చునర్, ఇన్నోవా తదితర కార్లను వేలానికి పెట్టింది. ఏప్రిల్ 18న ఆన్లైన్ ద్వారా వీటిని విక్రయించనుంది. వేలం వేయనున్న కార్లకు సంబంధించిన ధర, ఫోటోలు, కంపెనీ తదితర వివరాలను ఆన్లైన్లో పొందుపర్చనుంది. పీఎంఎల్ఏ కోర్టు ప్రత్యేక అనుమతితో ఈడీ వీటిని వేలం వేయనుంది. మరోవైపు లండన్ వాండ్స్వర్త్ జైల్లో ఉన్న నీరవ మోదీ గత శుక్రవారం పెట్టుకున్న రెండవ బెయిల్ పిటిషన్ కూడా వెస్ట్మినిస్టర్ కోర్టు నిరాకరించింది. దీంతో ఏప్రిల్ 26 తదుపరి విచారణ వరకు మోదీ జైలు ఊచలు లెక్క బెట్టాల్సిందే. కాగా 14 వేల కోట్ల రూపాయల పీఎన్బీస్కాం విచారణలో భాగంగా గత ఏడాది ఫిబ్రవరిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రెండు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 350 సీడీఐలు, టొయోటా ఫార్చునర్, ఇన్నోవా కారు, పోర్షే పనమేరా, మూడు హోండా కార్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 7.80 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్, షేర్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నీరవ్ మోదీ గుండె పగిలే వార్త -
సీఎం కోసం రూ.80 కోట్లతో కొత్త వాహనాలు
చంఢీగర్ : పంజాబ్ ప్రభుత్వం దాదాపు 80 కోట్ల రూపాయలు వెచ్చించి 400 లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి, అతని మంత్రి వర్గం, అధికారుల కోసం ఈ లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. ఇప్పటికే 16 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 16 వాహనాల్లో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉన్నాయి. వీటిని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కోసం వినియోగించనున్నట్లు సమాచారం. అలానే ముఖ్యమంత్రి అధికారుల కోసం 13 మహీంద్ర స్కార్పియో వాహనాలను, స్పెషల్ డ్యూటీ అధికారుల కోసం 14 హోండా మారుతీ కార్లను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్కు, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇచ్చేందుకు అమరేందర్ సింగ్ ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ అధ్యక్షులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలనే వాడుతున్నారని.. అవి మంచి స్థితిలోనే ఉన్నాయని పంజాబ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ వెల్లడించారు. ఈ కొత్త వాహనాల కొనుగోలు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 80 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2018, మార్చి నాటికే ప్రభుత్వ ఖజానా రు. 1,95,978 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నట్లు తెలిసింది. -
ఎంత సక్కగున్నవే.. కత్తి.. ఖతర్నాక్!
దీని స్టైల్ చూశారూ.. కత్తి.. ఖతర్నాక్ కదా.. ఇది రెనాల్ట్ కంపెనీకి చెందిన ఈజెడ్–అల్టిమో కాన్సెప్ట్ కారు.. ఇటీవల దీన్ని ప్యారిస్ ఆటోషోలో ప్రదర్శించారు. చూసినోళ్లంతా ఫిదా అయిపోయారంటే నమ్మండి. విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించడమే ఈ కాన్సెప్ట్ కారు తాలూకు లక్ష్యమని రెనాల్ట్ ప్రతినిధులు తెలిపారు. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. అంటే డ్రైవర్తో పనిలేదన్నమాట. పైగా పర్యావరణానికి హాని చేయని రీతిలో ఇది ఎలక్ట్రిక్ కారు కూడా. మొబైల్లో లోడ్ చేసిన ప్రత్యేకమైన యాప్లో మనం వెళ్లాల్సిన ప్రాంతం తాలూకు వివరాలు ఫీడ్ చేస్తే.. దాని ప్రకారం కారు వెళ్లిపోతుంది. అందుకు అనుగుణంగా ఇందులో కెమెరాలు, రాడార్లు, సెన్సర్లు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఈ వాహనం 19 అడుగుల పొడవు ఉంటుంది. లోపల చూశారుగా.. హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంటుంది. ఇంటీరియర్ అంతా లెదర్, మార్బుల్, చెక్కతో చేశారు. సీటు అటూ ఇటూ కదిలేలా ఏర్పాటు చేశారు. వ్యక్తిగత అవసరాల కోసమే కాకుండా.. పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లు.. కార్పొరేట్ సంస్థలు తమ క్లయింట్లను ఎయిర్పోర్టు నుంచి తేవడానికి, బిజినెస్ మీటింగుల కోసం దీన్ని తప్పక కొనుగోలు చేస్తాయని రెనాల్ట్ నమ్ముతోంది. మార్కెట్లోకి ఎప్పుడొస్తుంది.. ధర ఎంత ఉండొచ్చన్న వివరాలను రెనాల్ట్ వెల్లడించలేదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)