massage
-
యవ్వన కాంతితో కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉండాలంటే..
వయసు పెరిగే కొద్ది, చర్మంలో చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా కంటి చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, గీతలు, ముడతలు అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి సమస్యకు చెక్ పెడుతుంది ఈ ‘ఐ రీజెనరేటింగ్ టూల్’. దీన్ని వినియోగించడంతో కళ్లు మిరుమిట్లు గొలిపే అందంతో మృదువుగా మారతాయి. ముఖం యవ్వనకాంతితో మెరుస్తుంది.ముందుగా కళ్ల కింద చర్మానికి అనువైన క్రీమ్స్, సీరమ్స్ అప్లై చేసుకుని, అనంతరం ఈ డివైస్ సాయంతో మసాజ్ చేసుకోవాలి. కేవలం క్రీమ్ అప్లై చేసి వదిలేయడానికీ, క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఈ టూల్తో మసాజ్ చేయడానికీ తేడా స్పష్టంగా కనిపిస్తోందని, ఈ టూల్ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తోందని చాలా మంది వినియోగదారులు రివ్యూస్ ఇస్తుండటంతో ఇలాంటి పరికరాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది.ఈ పరికరంతో క్రీమ్ లేదా సీరమ్ను కంటి కింద అప్లై చేసుకుంటే, చర్మం 53 శాతం వేగవంతం రికవరీ అవుతోందట! నల్లటి వలయాలను 18 శాతం, పొడిబారిన చర్మం 32 శాతం, గీతలు, ముడతలు 16 శాతం తగ్గుతున్నాయని ఐ రీజెనరేటింగ్ టూల్ని రూపొందించిన కంపెనీ వెల్లడిస్తోంది. హె ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్తో, 38–42 డిగ్రీల సెల్సియస్ హీట్ థెరపీతో ఈ మసాజ్ డివైస్ పని చేస్తుంది. దీనిలోని లిఫ్టింగ్ మోడ్.. కంటి కండరాలను ఉత్తేజపరచేందుకు, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది.ఈ మసాజ్ హెడ్ కంటికి అనువుగా, చికిత్సకు వీలుగా డబుల్–కాంటాక్ట్ ప్రాంగ్లతో రూపొందింది. దీని హెడ్పైన రెండు సెమీ–కర్వ్డ్ హైపోఅలెర్జెనిక్ మెటల్ ఎలక్ట్రోడ్ పోల్స్ ఉండటంతో మసాజ్ చేసుకునేటప్పుడు అవి కంటి చర్మంపై సున్నితంగా జారుతూ, మంచి ఫలితాన్ని ఇస్తాయి. (చదవండి: మెనోపాజ్లో నిద్రలేమితో సతమతమవుతున్నారా..? బీకేర్ఫుల్..!) -
తలకు మర్దనా చేస్తున్నారా..?
తలకు మర్దనా చేస్తున్నారా ..?. అయితే ఈ కొద్దిపాటి చిట్కాలు ఫాలోకండి. కేశ సౌందర్యానికే కాదు మన ఆరోగ్యానికి మంచిదట. ఇలా మర్దన చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన మటుమాయం అవుతాయంటున్నారు నిపుణులు. పైగా మనసుకు తేలిగ్గా అనిపించడమే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవట. మరీ అనుసరించాల్సిన చిట్కాలేంటో చూద్దామా..!.తలకు మసాజ్ చేసేటప్పుడు ఒకసారి మొత్తంగా వలయాకారంగా మర్దన చేసిన తర్వాత క్రాస్స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి బొటన వేలు – చూపుడు వేలిని మాత్రమే వాడాలి. రెండు వేళ్లలో ఇమిడేటంత జుట్టును కుదుళ్లకు దగ్గరగా పట్టుకుని ఇంగ్లిష్ అక్షరం ఆకారంలో అటూ ఇటూ లాగి వదలాలి. ఇలా నుదుటి దగ్గర నేరుగా పాపిడి తీసే దగ్గర మొదలు పెట్టి తల వెనుక వరకు వెళ్లి తర్వాత పక్కనే మరొక వరుస... ఇలా తలంతా చేయాలి.ఇక పించింగ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి అన్నివేళ్లనూ వాడాలి. రెండు వేళ్లతో గిచ్చడం కాకుండా అన్నివేళ్లతో పుర్రెను గిచ్చుతున్నట్లు (గోళ్లు తగలకూడదు) ఒత్తిడి కలిగించాలి. చివరగా మరొకసారి తలంతా వలయాకారంగా మర్దన చేయాలి. ఇంతటితో తలకు మసాజ్ పూర్తవుతుంది. మసాజ్ పూర్తయిన తర్వాత పది నిమిషాలకు తలస్నానం చేస్తే ఆహాయి రెండు– మూడు రోజులు ఉంటుంది. ఈ మసాజ్ కేశ సౌందర్యానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. కొన్ని రకాల తలనొప్పులు, ఒత్తిడి కారణంగా వచ్చే చికాకులు మాయమవుతాయి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.క్రమం తప్పకుండా జుట్టుకు ట్రీట్మెంట్ జరుగుతుంటే జుట్టు రాలడం, చిట్లిపోవడం, చుండ్రు మొదలైన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉండదు. వంశపారంపర్యంగా కాక పోషకాహార లోపం వల్ల, సంరక్షణలోపం వల్ల చిన్న వయసులోనే తెల్లబడడాన్ని సమర్థంగా నివారించవచ్చు. టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు బాదంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నాబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు పట్టించి, మెల్లగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. (చదవండి: పారిపోవాలని అనిపిస్తోంది..! ఈ సమస్య నుంచి బయటపడేదెలా..?) -
ఈ డివైజ్ ఇట్టే వయసుని దాచేస్తుంది..!
వయసును దాచుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వయసును దాచుకోవడం కుదరక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారి కోసం అందుబాటులోకి వచ్చింది ఈ హోమ్ స్కిన్కేర్ టూల్. దీని పేరు లక్సేన్ బ్యూటీ ఫర్మాగ్లో బాడీ మైక్రోడెర్మాబ్రేషన్ డివైస్. ఇది ఇట్టే వయసును దాచేస్తుంది. యాంటీ ఏజింగ్, స్కిన్ టైటెనింగ్ వంటి ప్రయోజనాలను అందించే ఈ పరికరం శరీరంలోని ప్రతిభాగాన్నీ యవ్వనం తొణికిసలాడేలా తీర్చిదిద్దుతుంది. ఇది కాళ్లు, చేతులు, తొడలు, నడుము, వీపు, పొట్ట తదితర భాగాలకు చక్కని మర్దన అందిస్తుంది.అరచేతి పరిమాణంలో ఉండే ఈ పరికరం చర్మాన్ని తేలికగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చర్మం బిగిని పునరుద్ధరిస్తుంది. మృతకణాలను తొలగించి, కొలాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ పరికరం ముఖం సహా శరీర భాగాల్లోని చర్మం పైపొరను సున్నితంగా తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. చర్మంపై ముడతలు, వయసుతో వచ్చే మచ్చలు సహా చిన్నచిన్న సౌందర్య సమస్యలను తగ్గిస్తుంది. ఇది మంచి స్క్రబర్లా, బ్రష్లా పనిచేసి చర్మానికి కొత్త మెరుపునిస్తుంది.ఇది మన్నికైన, సరసమైన, సులభమైన మాన్యువల్ సాధనం కావడంతో దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంది. వారానికి ఐదే ఐదు నిమిషాలు కేటాయించి.. పైనుంచి కింద వరకూ ఆయిల్ లేదా క్రీమ్ ఏదైనా అప్లై చేసుకుని, దీనిని రబ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీన్ని చాలా తేలికగా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. ఈ పరికరాన్ని శుభ్రం చేసుకోవడం చాలా తేలిక. దీని ధర 149 డాలర్లు. అంటే 12,810 రూపాయలు. (చదవండి: షాదీ అంటే విధ్వంసం..! బారాత్ అటే బాంబ్!) -
అందమైన ముఖాకృతి కోసం..!
చక్కటి ముఖాకృతితోనే అందం ఇనుమడిస్తుంది. నలుగురిలోనూ ప్రత్యేకంగా నిలుపుతుంది. చిత్రంలోని ఈఎమ్ఎస్ మైక్రోకరెంట్ ఫేస్ స్లిమ్మింగ్ స్కిన్కేర్ మెషిన్ ముఖకండరాలను బిగుతుగా మార్చి, ముఖాన్ని షేప్లోకి మారుస్తుంది. నిజానికి చబ్బీగా, గుండ్రటి ముఖంతో కనిపిస్తే, ఎంత అందంగా ఉన్నా, కండరాలు కాస్త పట్టు సడలగానే వయసు ఎక్కువగా కనిపిస్తారు. అదే ముఖం షేప్లో ఉంటే ఆ అందం మరింతగా ఆకట్టుకుంటుంది. ఈ డివైస్ చూడటానికి హెడ్ఫోన్స్ మాదిరిగా ఉంటుంది. దీని హెడ్స్ని బుగ్గలకు ఆనించి పెట్టుకుని, బటన్ ఆన్ చేస్తే, వైబ్రేట్ అవుతూ ట్రీట్మెంట్ అందిస్తుంది. ముఖంపై పేరుకున్న అదనపు కొవ్వును క్రమంగా కరిగిస్తుంది. చర్మాన్ని బిగుతుగా మార్చి, యవ్వనంతో తొణికిసలాడేలా చేస్తుంది. దవడ ప్రాంతంలో సడలిన కండరాలను, గడ్డం కింద డబుల్ చిన్ను తిరిగి యథాస్థితికి తీసుకొస్తుంది. ఈ పరికరం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ అయాన్లు వేగంగా చర్మం లోతుల్లోకి చొచ్చుకునిపోతాయి. దీనివల్ల కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, ముడతలు తగ్గుతాయి. చర్మం నిగారింపు పెరుగుతుంది. ఈ పరికరం చాలా మోడల్స్లో, చాలా రంగుల్లో లభిస్తోంది. ఫేస్ మాస్క్ వేసుకుని కూడా ఈ పరికరంతో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ మైక్రోకరెంట్ రోలింగ్ను ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీనికి ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకోవచ్చు. దీని ధర సుమారు 28 డాలర్లు. అంటే 2,374 రూపాయలు. (చదవండి: న్యూయార్క్లో డబ్బావాలా బిజినెస్..!అచ్చం భారత్లో..) -
శీతాకాలంలో చుండ్రు, జుట్టు సమస్యలు : నువ్వులతో చెక్
చర్మం లాగానే జుట్టు కూడా పొడిబారుతుంది. ముఖ్యంగా చల్లని శీతాకాలంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. చుండ్రు సమస్యకూడా ఎక్కువగా వేధిస్తుంది. కాబట్టి జుట్టును తేమగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్తో మసాజ్ చేసుకోవడం, ఎక్కువ హైడ్రేటింగ్ షాంపూలను ఉపయోగించడం లాంటివి చెయ్యాలి. కండిషనింగ్ విషయంలో నువ్వుల నూనె బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి జుట్టు సంరక్షణలో ఎలా వాడవచ్చో తెలుసుకుందాం!జుట్టు సంరక్షణలో నువ్వులుకప్పు నల్లనువ్వులను తీసుకుని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. అరలీటరు కొబ్బరి నూనెను మందపాటి పాత్రలో పోయాలి. దీనిలో నువ్వుల పొడి, నాలుగు మందార పువ్వులు, పది కరివేపాకులు వేసి సన్నని మంటమీద మరిగించాలి. మందారపువ్వులు, కరివేపాకు వేగాక నూనెను దించేసి చల్లారనిచ్చి, ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోవాలి. రెండురోజుల కొకసారి ఈ ఆయిల్ను తలకు పట్టించి మర్దన చేసి నాలుగు గంటల తరువాత తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమేగాక, బాలనెరుపు నియంత్రణలో ఉంటుంది. జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుంది. తెల్లనువ్వుల్లో పోషకాలు ఉంటే నల్ల నువ్వుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మాడుని పొడిబారకుండా చేసి, చుండ్రుని తగ్గిస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రుని మరింత విస్తరించకుండా నియంత్రిస్తాయి. -
తల మసాజ్ వల్ల పక్షవాతం
బనశంకరి: కటింగ్ షాపులో తల మసాజ్ చేసుకున్న యువకునికి పక్షవాతం వచ్చింది, చికిత్స తీసుకుని రెండు నెలల విశ్రాంతి తరువాత కోలుకున్నాడు. సరైన శిక్షణ లేకుండా మసాజ్ చేయడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు. వివరాలు.. బెంగళూరులో హౌస్కీపింగ్ చేస్తున్న బళ్లారికి చెందిన యువకుడు (30) ఓ కటింగ్ షాపునకు వెళ్లి క్షవరం చేయించుకున్నాడు. తరువాత ఉచితంగా తల మసాజ్ చేస్తానంటే సరే అన్నాడు. ఈ సమయంలో ఆకస్మికంగా గొంతు తిప్పిన సమయంలో నొప్పి కలిగింది. మసాజ్ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. కానీ గంట తరువాత దేహం ఎడమవైపు స్వాధీనం కోల్పోయింది. దీంతో భయపడిన కల్లేశ్ సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు. మెడకాయ తిప్పడంతో శీర్ష ధమని దెబ్బతిని మెదడుకు రక్త సరఫరా క్షీణించి పక్షవాతం వచ్చిందని వైద్యులు తెలిపారు. వైద్యనిపుణుడు శ్రీకంఠస్వామి మాట్లాడుతూ బాధితుడు సాధారణ పార్శ్వవాయువు కు భిన్నమైన సమస్యకు గురయ్యాడు. బలవంతంగా గొంతు– మెడను తిప్పడం వల్ల ఈ సమస్య తలెత్తిందని వివరించారు. తల మసాజ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. బాధితుడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తరువాత కోలుకుంటున్నాడు. -
ఈ డివైజ్తో కాళ్లు నొప్పులు మాయం!
తరుచు పెద్దవాళ్లు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ సమస్య ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వేధిస్తుంటుంది. అలాగే ఎక్కువ గంటలు నిలబడి పనిచేసే ఉద్యోగులు కూడా ఇలాంటి సమస్యనే ఫేస్ చేస్తుంటారు. ముప్పై దాటిన మహిళలు, కొంతమంది పిల్లలు తరుచుగా కాళ్లు పీకేస్తున్నాయని అంటుంటారు. అలాంటి వాళ్ల కోసం అద్భుతమైన డివైజ్వచ్చింది. దీంతో దెబ్బకు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఈ 8 పిక్స్ లెగ్ మసాజ్ మిషాన్ అలసిన కాళ్లకు చక్కటి రిలీఫ్ని ఇస్తుంది. చిటికెలో మీ కాళ్ల నొప్పులు మాయం అవుతాయి. అరికాళ్లు, మోకాళ్లు పీకేస్తున్నట్లు ఉన్నవాళ్లకి ఈ డివైజ్ అద్భుతమైన వరం. కాళ్లకు చాలా సున్నితంగా మసాజ్ చేస్తూ మొత్తం కాళ్లకు రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. ఇది ఒకరకంగా అసౌకర్యాన్ని తెలియని ఒత్తడిని కూడా దూరం చేస్తుంది. కాళ్లు నొప్పులుగా ఇబ్బందిగా ఉంటే ఒక విధమైన అసౌకర్యంగా, ఏమయ్యిందనే టెన్షన్ ఉంటుంది. ఈ మసాజ్ మెషిన్తో ఆ సమస్యలు దూరమవ్వడమే గాక మీ కాళ్ల సమస్యలు కూడా మాయం అవుతాయి. ఈ డివైజ్ ఖరీదు రూ. 13 వేలు పైనే ఉంటుందట. (చదవండి: 'జలుబు' ఇంత ప్రమాదకరమైనదా? ఇలా కూడా ఉంటుందా..?) -
క్షణాల్లో ముఖాన్నీ క్లీన్ చేసి మెరిసేలా చేసే డివైజ్!
ఫౌండేషన్స్, గ్లాసీ లోషన్స్తో ముఖాన్ని తాత్కాలికంగా మెరిపించడం ఈజీయే! కష్టమల్లా తర్వాత ఫేస్ని క్లీన్ చేసుకోవడమే! అందుకే ఈ బ్రష్ని మీ మేకప్ కిట్లో పెట్టేసుకోండి. మేకప్ను తొలగించడంతో పాటు బ్లాక్ హెడ్స్, డెడ్ స్కిన్ వంటి సమస్యల నుంచి బయటపడేందుకూ ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ 3–ఇన్–1 ఎలక్ట్రిక్ మసాజ్ టూల్.. చర్మాన్ని శుభ్రపరచడమే కాక మృదువుగానూ మారుస్తుంది. ముఖం, మెడ, వీపు ఇలా ప్రతిభాగాన్నీ క్లీన్ చేస్తుంది. స్కిన్ మసాజర్లా పనిచేసి స్కిన్ టోన్ను మెరుగుపరుస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. ముడతలను మాయం చేస్తుంది. ఒత్తిడిని.. అలసటను దూరం చేస్తుంది. ఈ డివైస్.. అన్ని వయసుల వారికీ అనువైనది. అలాగే స్త్రీ, పురుషులనే భేదం లేకుండా దీన్ని అందరూ వాడుకోవచ్చు. నచ్చినవారికి బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. మసాజర్ను అవసరమైన విధంగా స్లో లేదా ఫాస్ట్ మోడ్లో ఉపయోగించుకోవచ్చు. యూజ్ చేసిన ప్రతిసారీ నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎలక్ట్రిక్ గాడ్జెటే అయినా .. వాటర్ ప్రూఫ్ కావడంతో స్నానంచేసేటప్పుడూ వాడుకోవచ్చు. ఇందులో మూడు వేరువేరు బ్రష్లు ఉంటాయి. ఒకటి సెన్సిటివ్ ఫేస్ బ్రష్.. ఇది సున్నితమైన చర్మం కోసం మృదువుగా, సౌకర్యవంతంగా పని చేస్తుంది. రెండవది డీప్ క్లెన్సింగ్ బ్రష్.. ఇది రంధ్రాలను శుభ్రపరచి.. చర్మాన్ని నీట్గా మారుస్తుంది. మూడవది సిలికాన్ బ్రష్.. ఇది అన్ని చర్మతత్వాలకూ ఉపయోగపడుతుంది. ఈ బ్రష్లను స్కిన్ టైప్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి. ఈ మెషిన్కి చార్జింగ్ పెట్టుకుని.. వైర్ లెస్గానూ వాడుకోవచ్చు. ఇందులో పింక్, బ్లూ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: సంగీతం వస్తేనే సింగర్ అయిపోరు అని ప్రూవ్ చేసింది!) -
టెక్ టాక్: ఈ సరికొత్త వాటిని గురించి ఎప్పుడైనా విన్నారా..!
నిత్య జీవితంలో.. టెక్నాలజీ పరంగా నూతన మార్పులు సంభవిస్తున్నాయి. మానవ అన్నీ అవసరాలను తీర్చిదిద్దేలాగా ఈ టెక్నాటజీ వృద్ధి చెందుతుంది. విద్య, వైద్య, ఉద్యోగాలలోనూ దీని అవసరం మరెంతగానో ఉండేలా కాలం మారుతుంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త పరికరాలు మీ ముందుకొచ్చాయి. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇది కట్టుకుంటే నొప్పులు మాయం.. జిమ్లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ధర 149 డాలర్లు (రూ.12,350) మాత్రమే! హైడ్రోజన్తో పరుగులు తీసే కారు.. జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ ‘హోండా’ తాజాగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచే కారును రూపొందించింది. హోండా మోడల్స్లోని ‘సీఆర్–వి’ మోడల్ ఎస్యూవీకి అవసరమైన మార్పులు చేసి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్తో నడిచేలా ‘సీఆర్వీ: ఈఎఫ్సీఈవీ’ మోడల్కు రూపకల్పన చేసింది. ఇందులో ఉపయోగించే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్ తయారీకి మరో కార్ల తయారీ సంస్థ ‘జనరల్ మోటార్స్’ సహకారం తీసుకుంది. ఇందులో అమర్చిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మాడ్యూల్స్లోని 110 వోల్టుల పవర్ ఔట్లెట్ ద్వారా ఇంజిన్కు దాదాపు 1500 వాట్ల విద్యుత్తు సరఫరా అవుతుంది. బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేసుకున్నట్లయితే, ఇది ఏకంగా 435 కిలోమీటర్ల వరకు నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఈ కారును హోండా మోటార్స్ వచ్చే ఏడాది నాటికి మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీతో నడిచే ఈ–విమానం ఇది బ్యాటరీతో నడిచే ఈ–విమానం నమూనా. ఇది అందుబాటులోకి వస్తే, విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పు రాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే రోడ్లపైకి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ విమానం కూడా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. డచ్ విమానాల తయారీ కంపెనీ ‘ఎలీసియన్’ ఈ బ్యాటరీ విమానం నమూనాకు ఇటీవల రూపకల్పన చేసింది. ‘ఎలీసియన్–ఈ9ఎక్స్’ పేరుతో రూపొందించిన ఈ విమానం 2033 నాటికి అందుబాటులోకి రానున్నట్లు ‘ఎలీసియన్’ కంపెనీ ప్రకటించింది. సాధారణ విమానాల కంటే చాలా తక్కువ బరువుతో రూపొందించిన ఈ విమానం వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఇందులో 90 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇవి చదవండి: వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు! -
హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్కి చెక్!
ఏ డ్రెస్ వేసుకున్నా.. అతికినట్టు సరిపోవాలంటే బాడీ సరైన షేప్లో ఉండాలి. అందుకే స్లిమ్ అండ్ ఫిట్ షేప్ కోసం నానాతంటాలు పడేది! ఆ కష్టాన్నించి గట్టెక్కించేదే ఈ మసాజర్. ఇది చక్కటి శరీరాకృతిని అందిస్తుంది. దీన్ని సాధారణ సమయాల్లోనే కాదు.. స్నానం చేస్తున్నప్పుడూ వాడుకోవచ్చు. సాధారణంగా మెషిన్స్కి వాటర్ తగిలితే పనిచేయవు. కానీ ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందిన మెషిన్ కాబట్టి.. వాటర్ప్రూఫ్గా పనిచేస్తుంది. దాంతో స్నానం చేస్తూ కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. మొదట ఏదైనా ఆయిల్ లేదా స్కిన్ టైటెనింగ్ క్రీమ్ని అప్లై చేసుకుని.. ఈ మసాజర్తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మొత్తం 8 రోలర్లు, 13 ప్రోట్రూషన్ లతో కూడిన ఈ బ్యూటీ మసాజర్.. ఒత్తిడిని దూరం చేస్తుంది. డివైస్కి అమర్చుకునే రోలర్స్.. నాలుగు నాలుగు చొప్పున రెండు పార్ట్స్గా అమర్చి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని మార్చుకోవచ్చు. మసాజ్ సమయంలో స్పీడ్ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇది కొవ్వును తగ్గిస్తూ యవ్వనంగా మారుస్తుంది. ఈ డివైస్తో పాటు.. ఎసిటినో 5డి డిజైనింగ్ క్రీమ్ కూడా లభిస్తుంది. దీన్ని విడిగా కూడా మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్లాల్సిన పని లేకుండానే.. ఈ డివైస్ మిమ్మల్ని నాజూగ్గా, స్లిమ్గా మారుస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్ పెడితే.. సుమారు 30 గంటల పాటు పని చేస్తుంది. కాళ్లు, చేతులు, నడుము, మెడ, పొట్ట భాగాల్లో పేరుకున్న కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దీన్ని మెత్తటి క్లాత్ లేదా టిష్యూ సాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వినియోగించడం.. ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం అంతా సులభమే. దీని ధర 207 డాలర్లు. అంటే 17,167 రూపాయలు. ఇవి చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే! -
ఈ డివైజ్తో అందమైన ముఖ ఆకృతి మీ సొంతం!
ముఖాన్ని కాస్టీ కాస్మెటిక్స్తో, మేకప్తో తీర్చిదిద్దడం కంటే.. ఇలాంటి డివైస్ల సాయంతో తీర్చిదిద్దితే ఆ అందం ఎక్కువ కాలం నిలుస్తుంది. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేషియల్ మసాజర్ను ఉపయోగించి.. డబుల్ చిన్ను తగ్గించుకోవచ్చు. ముడతలు, గీతలు లేకుండా మృదువుగా మార్చుకోవచ్చు. ఈ స్కిన్ లిఫ్ట్ పరికరం.. హీటింగ్, వైబ్రేషన్తో పనిచేస్తుంది. ఇది కళ్లు, పెదవులు, బుగ్గలు ఇలా ప్రతి భాగంలోనూ ముడతలు, మచ్చలు, మొటిమలు, సన్స్పాట్లను పూర్తిగా మాయం చేస్తుంది. అలాగే ముఖ ఆకృతిని మార్చి.. డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది. ప్రత్యేకమైన గ్లోను అందిస్తుంది. ఎలక్ట్రిక్ డివైస్ అయిన ఈ మసాజర్.. ఎలాంటి ప్రమాదాలను కలిగించదు. స్కిన్ రిజువనేషన్ స్కిన్ కేర్ టూల్గా గుర్తింపు పొందిన ఈ మెషిన్కి చిత్రంలో చూపిన విధంగా చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన బేస్ లభిస్తుంది. దానిమీద ఈ టూల్ని అమర్చుకుని చార్జింగ్ పెట్టుకోవాలి. ఇందులో మొత్తం నాలుగు రంగుల ప్రత్యేకమైన మోడ్స్ ఉంటాయి. రెడ్, పర్పుల్తో పాటు బ్లూ కలర్లో రెండు మోడ్స్ ఉంటాయి. ఈ డివైస్ని ఎలా వాడాలో తెలుపుతూ ఒక బుక్లెట్ కూడా లభిస్తుంది. దీనికి రెండు హెడ్స్ ఉంటాయి. ఒకటి క్లీనింగ్ బ్రష్ హెడ్, రెండు మసాజింగ్ హెడ్. వాటిని మార్చుకుంటూ చర్మాన్ని మొదట శుభ్రం చేసుకుని.. తర్వాత మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం అందుతుంది. (చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!) -
ఇంట్లోనే ఈజీగా మసాజ్ చేయించుకోవచ్చు ఇలా..!
శారీరకంగా బాగా అలసిపోయినప్పుడు చాలామంది మర్దనతో సేదదీరాలని కోరుకుంటారు. ఒంట్లోని కండరాలు సేదదీరేలా మర్దన చేయడం ఒక కళ. ఈ కళలో నిపుణులైన వాళ్లు స్పాలు, మసాజ్ సెంటర్లలో సేవలందిస్తుండటం తెలిసిందే. ‘కరోనా’ కాలంలో మనిషి పొడ సోకితేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. మనిషిని మనిషి తాకకుండా మర్దన చేయడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే, మనిషితో ప్రమేయం లేకుండానే చక్కగా మర్దన చేయగల రోబోను అమెరికన్ కంపెనీ ‘ఫిలాన్ ల్యాబ్స్’ రూపొందించింది. ఈ మసాజర్ రోబో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. మనిషి శరీరాకృతి, కండరాల పనితీరు ఆధారంగా తగిన రీతిలో మర్దన చేస్తుంది. ఈ రోబోకు అమర్చిన 35 సెంటీమీటర్ల భుజం మంచం మీద పడుకున్న మనిషి శరీరం అంతటా సంచరిస్తూ, గరిష్ఠంగా 6.8 కిలోల ఒత్తిడి కలిగిస్తూ మర్దన చేస్తుంది. సున్నితంగా మర్దన చేయాల్సిన చోట సున్నితంగా, ఎక్కువగా ఒత్తిడి కలిగించాల్సిన చోట ఎక్కువగా ఒత్తిడి కలిస్తూ నిమిషాల్లోనే కండరాలు సేదదీరేలా చేస్తుంది. దీని ధర 3,499 డాలర్లు (రూ.2.91 లక్షలు) మాత్రమే! (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
అలసిన కళ్లకు రిలీఫే ఈ ఐ మసాజర్!
మారిన లైఫ్ స్టయిల్ వల్ల మన బాడీలో బాగా స్ట్రెయిన్ అవుతున్నవి కళ్లే! కంప్యూటర్, సెల్ఫోన్.. కళ్లకు క్షణం తీరికనివ్వడం లేదు. దాంతో ఆ అలసట అందాన్ని ఎఫెక్ట్ చేస్తోంది. దానికి చక్కటి రిలీఫే ఐ మసాజర్. చిత్రంలోని ఈ హీటింగ్ ఫటీగ్ థెరపీ వెల్నెస్ డివైస్.. కళ్ల భారాన్ని, ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇందులో హై, మీడియం, లో అనే త్రీ మోడ్స్ ఉంటాయి. ‘లో’ ఆప్షన్కి 36 డిగ్రీల సెల్సియస్ (97 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటే.. ‘మీడియం’ ఆప్షన్కి 39 డిగ్రీల సెల్సియస్ (102 డిగ్రీల ఫారెన్ హీట్) ప్రభావం ఉంటుంది. ఇక ‘హై’ ఆప్షన్లో 42 డిగ్రీల సెల్సియస్ (108 డిగ్రీల ఫారెన్ హీట్) టెంపరేచర్ ఉత్పత్తి అవుతుంది. ఈ డివైస్ చేతిలో ఇమిడిపోయేంత చిన్నగా.. కళ్లకు అమరేంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది వేడెక్కడానికి 10 సెకన్ల సమయం పడుతుంది. అలాగే దీనికి చార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైన ప్యాడ్ లభిస్తుంది. దాంతో ఈ మసాజర్ని వైర్లెస్గా వినియోగించుకోవచ్చు. ఇది ఒత్తిడిని తగ్గించడంతో పాటు.. అలసటను దూరం చేస్తుంది. కళ్ల చుట్టూ మచ్చలు, ముడతలు ఏర్పడి, కళాహీనంగా మారకుండా సంరక్షిస్తుంది. అలాగే సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చి రిలాక్స్ చేస్తుంది. ఈ పోర్టబుల్ పర్ఫెక్ట్ ఐ మసాజర్ని ప్రతిరోజూ వినియోగించుకోవచ్చు. (చదవండి: ముఖానికి ఫేస్ యోగా! దెబ్బకు మొటిమలు, మచ్చలు మాయం!) -
ఈ పోర్టబుల్ డివైజ్ ఉంటే ఇంట్లోనే ఈజీగా రోల్ మసాజ్!
చర్మం బిగుతుగా.. మృదువుగా మెరవాలంటే తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అందులో ఈ ప్రత్యేకమైన రోల్ మసాజ్ ట్రీట్మెంట్ మంచి ఫలితాన్ని అందిస్తోంది. జపనీస్ టెక్నాలజీతో రూపొందిన ఈ బ్యూటీ ఫేస్ రోలర్.. వినియోగం చాలా తేలిక. ముఖ కండరాలను ఉత్తేజపరచడంలో.. చర్మం మీదున్న ముడతలు తగ్గించడంలో.. ఇది ఎంతగానో సహకరిస్తుంది. దీనికి చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకోవాలి. సుమారు 90 నిమిషాల పాటు చార్జింగ్ పెట్టుకుంటే.. 150 నిమిషాల పాటు ఈ డివైస్ నిరంతరాయంగా పని చేస్తుంది. ఈ చర్మ సంరక్షణ పరికరాన్ని ఈజీగా ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు. దీనిలో రెండు రోల్స్.. వి షేప్లో ఫిక్స్ చేసి ఉంటాయి. అవి చర్మం మీద సులభంగా రోల్ అవుతాయి. బుగ్గలు, మెడ భాగాల్లోని ఒంపుల్లో మసాజ్ చేసుకోవడానికి వీలుగా ఇది రూపొందింది. వైబ్రేట్ అవుతూ మసాజ్ చేసేందుకు ఇవి అనువుగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్.. ఫేస్ని ఎంతగానో మెరిపిస్తుంది. దీని ధర 32 డాలర్లు. అంటే 2,664 రూపాయలు. అయితే ఈ ట్రీట్మెంట్కి ముందు చర్మాన్ని శుభ్రంగా చల్లటి వాటర్తో కడుక్కుని.. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. మోడ్స్ ఆన్ చేసుకుని.. మసాజర్ వినియోగించుకోవాలి. ఇది ఆన్లో ఉంటే.. సుమారు మూడు నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. గ్లాస్ స్కిన్ కోసం.. ఒక కప్ ఓట్స్.. ఒక టేబుల్ స్పూన్ తేనెకు ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసి అది పేస్ట్లా మారేవరకు బాగా కలిపి ఆ పేస్ట్తో ఫేస్ రుద్దుకుని ఓ 15 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. తర్వాత చన్నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లయ్ చేసుకోవాలి. -
చక్కగా మసాజ్,ఈ బ్రష్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..
చూడటానికి కంప్యూటర్ మౌస్లా కనిపించే ఈ పరికరం హెడ్మసాజర్. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని అడుగుభాగంలో సున్నితమైన బ్రష్ ఉంటుంది. ఆన్ చేసుకుని, కోరుకున్న వేగాన్ని సెట్ చేసుకుంటే చాలు. తలదిమ్ము వదిలేలా, తలకు హాయి కలిగించేలా ఇంచక్కా మర్దన చేస్తుంది. దీని బ్రష్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా జుట్టురాలడాన్ని అరికడుతుంది. జుట్టు ఇప్పటికే రాలిపోయిన చోట కొత్త వెంట్రుకలను మొలిపిస్తుంది. జపాన్కు చెందిన ‘హెబావోడాన్’ కంపెనీ ఈ పరికరాన్ని ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 5200 యెన్లు (రూ.2,925) మాత్రమే! -
ఒత్తిడితో బాధపడుతున్నారా? దీన్ని తలకు ధరించండి చాలు
మనసు ఆహ్లాదంగా ఉంటేనే మొహం మెరుస్తుంది. అలసట లేని అందం కావాలంటే.. హ్యాండ్స్–ఫ్రీ హెడ్ మసాజర్ మీ ఇంట్లో ఉండాల్సిందే. ఈ ఎలక్ట్రిక్ స్కాల్ప్ మసాజర్.. మొత్తం నాలుగు వైబ్రేషన్ మోడ్స్తో పనిచేస్తుంది. దీన్ని తలకు పెట్టుకుంటే.. రక్త ప్రసరణ పెరుగుతుంది. నిద్రలేమి దూరమై.. హాయిగా నిద్రపడుతుంది. అలసట మాయమవుతుంది.ఉద్యోగులు, డ్రైవర్లు, క్రీడాకారులు, వృద్ధులు, అలసటతో ఉన్న వారు, కార్మికులు, తలనొప్పి లేదా ఒత్తిడితో బాధపడుతున్న వాళ్లందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. యాక్టివ్ మోడ్, రిలాక్స్ మోడ్, బ్యూటీ మోడ్, స్లీప్ మోడ్ ఇలా.. ప్రతి మోడ్ భిన్నంగా ఉంటుంది. కావల్సిన ఆప్షన్ను ఈజీగా ఎంచుకోవచ్చు. చూడటానికి సాలెపురుగులా ఉన్న ఈ మసాజర్ పొడవాటి పది ఫ్లెక్సిబుల్ టూల్స్.. చేతి వేళ్ల మాదిరిగా తలను పట్టి ఉంచుతాయి. లోపలి భాగంలో బాల్స్ లాంటి మెత్తటి నాలుగు టూల్స్ ఉంటాయి. వాటన్నిటి నుంచి తలకు మృదువైన వైబ్రేషన్ లభిస్తుంది. సుమారు 15 నిమిషాలు దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అన్ని తెలిసిన స్టార్టర్స్కైనా.. ఆప్షన్స్ పెద్దగా తెలియని పెద్దవాళ్లకైనా దీని వాడడం సులభం. మెషీన్ను స్టార్ట్ చేయడానికి లేదా షట్ డౌన్ చేయడానికి పవర్ బటన్ ను 3 సెకన్ల పాటు నొక్కి ఉంచాలి. మోడ్ మారడానికి అదే బటన్ ఉపయోగపడుతుంది. హైక్వాలిటీ సిలికాన్తో రూపొందిన ఈ డివైజ్ చాలా తేలికగా.. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుంది. డిజైన్ను బట్టి దీని దీని ధర ఉంటుంది. -
బౌల్ మసాజ్తో మెరిసిపోండి!
కొబ్బరి నూనె, ఫేస్ ఆయిల్, మాయిశ్చరైజర్... వీటిలో ఏదైనా ఒకటి ముఖానికి రాయాలి. ఇప్పుడు చిన్న స్టీల్గిన్నెను తీసుకుని ముఖమంతా మర్దన చేయాలి. నుదురు, కనుబొమ్మలు, బుగ్గలు, మెడ భాగంలో గిన్నెను గుండ్రంగా తిప్పుతూ ముఖానికి రాసిన నూనె లేదా మాయిశ్చరైజర్ చర్మంలోకి పూర్తిగా ఇంకిపోయేంత వరకు మర్దన చేయాలి. ఇలా చేస్తే... ముఖం మీద ముడతలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. కండరాల మీద ఒత్తిడి తగ్గి చర్మానికి విశ్రాంతి దొరుకుతుంది. ఈ బౌల్ మసాజ్ ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు కూడా. దీంతో కేవలం ముఖం మాత్రమే కాకుండా పాదాలు దగ్గర నుంచి బాడీ అంతా మసాజ్ చేస్తారు. ప్రత్యేకించి ఇత్తడి వంటి బౌల్తో మసాజ్ చేస్తారు. ఇది అలసట, వాపును తగ్గిస్తుంది. నిద్రలేమి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే అలసటతో ఉన్న పాదాలను ఈ బౌల్తో మసాజ్ చేసుకుంటే రిలీఫ్గా ఉండటమే గాక రక్తప్రసర సంక్రమంగా జరిగి చాలా ఉపశమనంగా ఉంటుంది. కంటి పనితీరుకి ఈ మసాజ్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ బౌల్ మసాజ్ విధానం వల్ల శరీరీ పనితీరుని నియంత్రించే వాతపిత్త కఫా దోషాలను సమతుల్యం చేస్తుందట. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ఈ బౌల్ మసాజ్ ట్రై చేయండి. (చదవండి: ఈ కిట్ మీవద్ద ఉంటే..పార్లర్కి వెళ్లాల్సిన పని ఉండదు!) -
ఫేషియల్ మెషిన్.. ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది
స్కిన్ కేర్లో స్త్రీలు పాటించే పద్ధతులు చాలా ప్రత్యేకం. తెలిసిన చిట్కాలు.. నిపుణుల సలహాలు.. పార్లర్స్లో ట్రీట్మెంట్లు.. ఇలా రకరకాల పద్దతులను పాటిస్తుంటారు. అయినా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అందుకు మంచి సొల్యూషన్.. ఈ హ్యాండ్హెల్డ్ ఫేషియల్ మసాజర్. బెస్ట్ స్కిన్ స్పెషలిస్ట్లా ఉపయోగపడుతుంది.ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఫేస్ అండ్ స్కిన్ కేర్ థెరపీ టూల్.. సులభమైన ఎన్నో చికిత్సలను అందిస్తుంది. దీనిలోని ఎల్ఈడీ లైట్ థెరపీ హెడ్.. ముడతలను, మచ్చలను పోగొడుతుంది. చర్మం లోతుల్లోకి వెళ్లి శుభ్రపరుస్తుంది. ముఖ కండరాలను ఉత్తేజపరిచేందుకు.. కొల్లాజెన్ను నిర్మించడానికి.. తగిన మోతాదులో వైబ్రేషన్ను అందిస్తుంది. కాంతిమంతమైన ముఖాన్ని తీర్చిదిద్దడంలో ఈ పర్సనల్ బ్యూటీ మెషిన్ చక్కగా ఉపయోగపడుతుంది. హాట్ అండ్ కోల్డ్ రింగ్స్తో పాటు క్లీనింగ్ రింగ్నూ అవసరాన్ని బట్టి మార్చుకుంటూ స్వయంగా ఎవరికి వారే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మైక్రోకరెంట్ టెక్నాలజీతో ఈ ఫేషియల్ మెషిన్.. కళ్ల చుట్టూ ఉండే నల్లటి మచ్చలను పోగొడుతుంది. అలాగే చర్మపు బిగువును కాపాడుతుంది. ముఖ కండరాల్లో రక్తప్రసరణను బాగా పెంచి.. స్కిన్ టోన్ను మెరిపిస్తుంది. చిగుళ్ల నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలను.. అలసట, ఒత్తిడినీ దూరం చేస్తుంది.ఈ మెషిన్ ని భద్రపరచు కోవడానికి సాఫ్ట్ కేరింగ్ బ్యాగ్ లభిస్తుంది. అలాగే చార్జింగ్ పెట్టుకోవడానికి ఒక యూఎస్బీ చార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇలాంటి డివైజెస్ను ఆన్లైన్లో కొనుక్కునే ముందు వినియోగదారుల రివ్యూస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దీని ధర 395 డాలర్లు. అంటే రూ. 32 వేల పైనే. అయితే ఆప్షన్స్ని బట్టి.. అదనపు రింగ్స్ కొనుగోలుచేయడానికి అదనపు ధర ఉంటుంది. దీన్ని పురుషులు కూడా వినియోగించుకోవచ్చు. -
‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’.. మసాజ్ మిషన్లో నుంచి కేకలు..
పెద్దపెద్ద ఎలక్ట్రానిక్ స్టోర్స్లో మసాజ్ చైర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడకు షాపింగ్కు వచ్చిన వినియోగదారులు ఒక్కోసారి ఇటువంటి చైర్లలో సేదతీరుతుంటారు. అయితే ఈ విధంగా మసాజ్చైర్లో కూర్చున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురయ్యింది. ఈ ఉదంతం జపాన్లో చోటుచేసుకుంది. ఒక వినియోగదారు మసాజ్ చైర్లో సేద తీరుతూ నిద్రపోయాడు. రాత్రి కావడంతో స్టోర్ బంద్ అయిపోయింది. ఆ వ్యక్తి ఫోనులో ట్వీట్ ద్వారా సాయం అడినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. @_Asphodelus అనే పేరు కలిగిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ వ్యక్తి ట్వీట్ చేశాడు. చీకటితో కూడిన ఒక ఫొటోను షేర్ చేసిన ఆయన ‘అయ్యయ్యో.. లోపలుండిపోయానే’ అని రాశాడు. కేఎస్ అనే పేరు కలిగిన స్టోర్ బంద్ అయి ఉండటాన్ని ఫోటోలో చూడవచ్చు. కాగా అనంతరం ఆ వ్యక్తి స్టోర్లోని అలారం మోగించగా పోలీసులకు ఈ సమాచారం అందింది. వెంటనే వారు స్టోర్ యజమానికి ఈ విషయాన్ని తెలియజేశారు. మొత్తం 10 మంది పోలీసు అధికారులు స్టోర్లో నుంచి అతనిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అతనిని దొంగ కాదని నిర్ధారించుకున్నారు. కాగా స్టోర్కు తాళాలు వేసిన సిబ్బంది మసాజ్ చైర్లో ఉండిపోయి ఇబ్బందిపడిన వ్యక్తిని క్షమాణలు కోరారు. అయితే ఈ స్టోర్లో ఆ వ్యక్తి ఎంతసేపు బందీ అయిపోయారన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన పోస్టుకు 39 వేలకుపైగా షేర్లు వచ్చాయి. ఈ పోస్టు చూసిన ఒక యూజర్ ‘డిపార్ట్మెంటల్ స్టోర్లో బంద్కావడం అనేది తన చిన్నప్పటి కల అని అన్నారు. మరొక యూజర్ తాను అలా బందీ అయితే ‘ఎస్కేప్ ది రూమ్’ స్టయిల్ గేమ్స్ ఆడుకుంటానని అన్నారు. ఇది కూడా చదవండి: ‘ఏంట్రా ఇదంతా’..‘ఎవర్రా మీరు’.. ‘ఇదేందిది’.. వీటికి బాప్ ఈ వీడియో! え…… pic.twitter.com/AalynpL1PB — こばたつ (@afdc1257) August 15, 2016 -
చైనీయుల స్కిన్ సీక్రెట్ ఇదే.. ఇలా చేస్తే మీరు కూడా యవ్వనంగా
వయసు పెరిగే కొద్ది ముఖమైనా, శరీరమైనా తగిన కొలతలతో, నాజూగ్గా కనిపించాలంటే.. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోక తప్పదు. చర్మం వదులుగా మారిపోకుండా.. బుగ్గలు, మెడ భాగాల్లో కొవ్వు పేరుకుపోకుండా, డబుల్ చిన్ ఏర్పడకుండా, కళ్లచుట్టు ముడతలు, వలయాలు పెరిగిపోకుండా జాగ్రత్త వహించాలంటే ఈ స్కిన్ రోలర్ మీ పర్సనల్ బ్యూటీ కిట్లో భాగం కావాల్సిందే! చిత్రంలోని ఈ టూల్ని గువా షా ఫేషియల్ రోలర్ అని కూడా పిలుస్తారు. గువా షా అంటే చైనీస్ సంప్రదాయ సౌందర్య సాధనం. తేలికపాటి టూల్తో ఫేస్ లేదా బాడీ మీద ఆక్యుప్రెజర్ పాయింట్స్ని ఉత్తేజపరిచే పద్ధతి. ఈ రోలర్ అలాంటిదే! ఇన్నోవేటివ్ షేప్ డిజైన్తో, అల్ట్రా–స్మూత్ జింక్ అల్లాయ్ మెటీరియల్తో రూపొందిన ఈ టూల్.. చర్మ ఆకృతిని బిగుతుగా చేస్తుంది. పోగొట్టుకున్న యవ్వనాన్ని తిరిగి ఇవ్వడంలో సహకరిస్తుంది. చర్మాన్ని తాజాగా మారుస్తుంది. ఈ టూల్లోని రోలింగ్ బాల్ కళ్లు, ముక్కు వంటి భాగాల్లోని సున్నితమైన మూలల్లో బాగా పని చేస్తుంది. చేరుకోలేని చిన్నచిన్న భాగాల్లో అది చక్కగా ఉపయోగపడుతుంది.ఈ ట్రీట్మెంట్ని దినచర్యలో భాగం చేసుకుంటే.. చర్మం మీద చిన్నచిన్న గీతలు, ముడతలు తగ్గి చర్మం మృదువుగా మారుతుంది. అనవసరమైన కొవ్వు పేరుకుపోదు. కండరాల్లో ఒత్తిడి కూడా తగ్గి ఉపశమనంగా ఉంటుంది. దీన్ని ఫ్రిజ్లో పెట్టుకుని, అవసరమైనప్పుడు తీసి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. పని పూర్తి కాగానే క్లీన్ చేసి మళ్లీ ఫ్రిజ్లో భద్రపరచుకోవచ్చు.ఈ రోలర్లో గుండ్రటి బాల్ 360 డిగ్రీలు రొటేట్ అవుతుంది. మధ్యభాగంలో ఒకవైపు వీపు వెనుక, నుదుట మీద మసాజ్ చేసుకోవడానికి.. మరోవైపు బుగ్గలు, మెడ, కాళ్లు, చేతులు వంటి ఒంపులున్న భాగాల్లో మసాజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక కింది భాగంలో చేప తోకలా కనిపిస్తున్న ఆ భాగంతో గడ్డం చుట్టు మసాజ్ చేసుకోవచ్చు. -
ప్లాటినం బాడీ మసాజర్.. అందంతో పాటు ఆరోగ్యం కూడా
అందం, ఆరోగ్యం రెండింటినీ అందించే డివైస్లకు ఈ రోజుల్లో గిరాకీ ఎక్కువ. చిత్రంలోని ఈ మసాజర్ బ్యూటీ ప్రొడక్ట్తో పాటు హెల్త్ టూల్ కూడా. ఈ డ్యూయల్ రోలర్ ప్లాటినం బాడీ మసాజర్.. రెండు రోలర్లను కలిగి ఉంటుంది. ఈ రోలర్స్ను పక్కపక్కనే ఉంచుకుని వినియోగించుకోవచ్చు లేదా ‘వి’ షేప్లా మార్చుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. దాంతో ముఖం, మెడ, నడుము, తొడలు, కాళ్లు, చేతులు ఇలా అన్ని భాగాల్లో మసాజ్ చేసుకోవచ్చు. సాధారణంగా చాలామంది మహిళలు తమ చర్మ సంరక్షణను చాలా సీరియస్గా తీసుకుంటారు. అలాంటి వారు రోజుకి కొన్ని నిమిషాల పాటు బాడీ మొత్తాన్ని ఈ మసాజర్తో మసాజ్ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. కండరాల్లో ఉత్తేజం కలిగించడానికి, ముడతలు, నొప్పులు పోగొట్టడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. చర్మం కూడా కాంతిమంతమవుతుంది. దీనికి చార్జింగ్తో పని లేదు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ సెట్ని జాగ్రత్త చేయడానికి ప్రత్యేకమైన పర్స్తో పాటు.. రోలర్ని శుభ్రం చేయడానికి మెత్తటి క్లాత్ కూడా లభిస్తుంది.అల్యూమినియం, స్టెయిన్లెస్ స్టీల్, ప్లాటినం పౌడర్, జర్మేనియం పౌడర్ వంటి మెటీరియల్స్తో రూపొందిన ఈ టూల్ నాణ్యమైనది.. మన్నికైనది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం తేజోవంతమవుతుంది. బాడీ ఎనర్జిటిక్గా మారుతుంది. బాగుంది కదూ! -
కళ్లకు గంతలు కాదు.. హైటెక్ మసాజర్
ఫొటోలో కనిపిస్తున్న యువతి కళ్లకు తెల్లని గంతలు తొడుక్కున్నట్లు కనిపిస్తోంది కదూ! ఆమె కళ్లకు తొడుకున్నది గంతలు కాదు, హైటెక్ మసాజర్. అమెరికన్ కంపెనీ ‘ట్రూరెల్’ రూపొందించిన ‘ఐ మసాజర్’. ఇది బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది. అలసిన కళ్లను సుతారంగా మర్దన చేస్తుంది. కళ్ల చుట్టూ తగినంత నులివెచ్చదనాన్ని కలిగిస్తుంది. (Radhika Merchant Bag: అంబానీకి కాబోయే కోడలు చేతిలో చిన్న బ్యాగు.. అందరి దృష్టి దానిపైనే.. ధర ఎంతో తెలుసా?) ఇందులోని ఎస్టీవీ టెక్నాలజీ ద్వారా కోరుకున్న రీతిలో వైబ్రేషన్స్, పల్సింగ్ సృష్టించి, తగినంత వెచ్చదనాన్ని, గాలి పీడనాన్ని కలిగించి కళ్ల అలసటను ఇట్టే మటుమాయం చేస్తుంది. ఇది అడ్జస్టబుల్ హెడ్సెట్తో లభిస్తుంది. తల పరిమాణానికి తగినట్లుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోని ప్లేలిస్ట్లో ఉన్న పాటలను వింటూ, కళ్లకు మర్దన తీసుకుంటూ, హాయిగా సేదదీరవచ్చు. దీని ధర 105 డాలర్లు (రూ.8,678) మాత్రమే. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) -
హెయిర్ కేర్ టిప్స్
ప్రతి రోజూ పది నుంచి పదిహేను నిమిషాలపాటు తలకు మసాజ్ చేసినట్లయితే జుట్టు కుదుళ్లు గట్టిపడి జుట్టు రాలడం తగ్గుతుంది. రోజూ తలస్నానం చేసేవాళ్లు తల రుద్దుకునేటప్పుడే పది నిమిషాల సేపు మసాజ్ చేసినట్లు రుద్దితే రెండు పనులూ అవుతాయి. ఉసిరిక పొడి, కుంకుడుకాయ, శీకాయపొడి అన్నీ సమపాళ్లలో అంతా కలిసి రెండు టేబుల్స్పూన్లు ఉండేటట్లు చూసుకోవాలి. ఇందులో కోడిగుడ్డు సొన కలిపి అవసరమైతే కొద్దిగా నీటిని కలిపి పేస్టు చేసుకుని తలంతా పట్టించి పది నిమిషాల సేపు మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయిన తర్వాత ఇరవై నిమిషాలకు కడిగేయాలి. అవసరమనిపిస్తే కొద్దిగా గాఢత తక్కువగా ఉన్న షాంపూ వాడవచ్చు. వారానికి కనీసం మూడుసార్ల చొప్పున నెల రోజుల పాటు ఈ ట్రీట్మెంట్ చేస్తే హెయిర్లాస్ను పూర్తిగా నివారించవచ్చు. హెయిర్లాస్ను కంట్రోల్ చేయడానికి ఆముదం, బాదం నూనె చక్కటి కాంబినేషన్. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకుని గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. మసాజ్ పూర్తయిన అరగంటకు తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిఫలితం ఉంటుంది. ఆముదం, బాదం బదులుగా కొబ్బరి నూనెను కూడా వాడవచ్చు. రోజూ పది నిమిషాల సేపు ఆల్మండ్ ఆయిల్తో తలకు మసాజ్ చేస్తే జుట్టు రాలదు. -
ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి..
గుంటూరు మెడికల్: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న వృద్ధుడికి గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ జరుగుతుండగా రోగి గుండె ఆగిపోగా.. అప్రమత్తమైన జనరల్ సర్జన్ నేరుగా కడుపులో నుంచి చేతిని గుండెపైకి పంపించి గుండెకు మసాజ్ చేసి ఆగిన గుండెను కొట్టుకునేలా చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. బుధవారం గుంటూరు జీజీహెచ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను జనరల్ సర్జరీ రెండో యూనిట్ ఇన్చార్జి డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ మీడియాకు చెప్పారు. ప్రకాశం జిల్లా నందనవనం గ్రామానికి చెందిన విట్టా వెంకటేశ్వర్లు (70) నెల రోజులుగా కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడటం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జనవరి 17న గుంటూరు జీజీహెచ్కు తీసుకువచ్చారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ ఆధ్వర్యంలో వృద్ధుడికి అత్యవసర సేవల విభాగంలో పరీక్షలు చేసి (గ్యాస్టిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్) చేసి కడుపులో క్యాన్సర్ వల్ల ఆహారం పొట్టలోకి వెళ్లడం లేదని నిర్ధారించి వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. జనరల్ సర్జరీ వార్డులో మెరుగైన చికిత్స అందించేందుకు సీటీ స్కాన్, బేరియం ఎక్స్రే, గ్యాస్ట్రోస్కోపి, ఎండోస్కోపి చేశారు. స్కానింగ్లో గుండె చాలా బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. దాంతోపాటుగా లక్షల్లో ఒకరికి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన డయాఫ్రాగ్మెటిక్ హెరి్నయాతో రోగి బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె, ఊపిరితిత్తులు, కడుపుకి మధ్యలో ఉండే డయాఫ్రమ్కు రంధ్రం ఏర్పడి అందులో నుంచి కడుపు, పెద్దపేగు సగభాగం గుండెకు, ఊపిరితిత్తులకు అతుక్కున్నట్లు నిర్ధారించారు. సాధారణంగా పుట్టుకతో డయాఫ్రమ్కు రంధ్రాలు ఏర్పడి వయసు పెరిగే కొద్ది పూడుకుపోతుందని కిరణ్కుమార్ చెప్పారు. వెంకటేశ్వర్లు విషయంలో డయాఫ్రమ్కు ఉన్న రంధ్రం పూడుకుపోకుండా పేగులు, కడుపు, గుండె, ఊపిరితిత్తుల మధ్యకు వెళ్లిపోయిందని తెలిపారు. ఆగిన గుండె.. గుండె, ఊపిరితిత్తుల మధ్య అతుక్కుని ఉన్న పేగులు, కడుపును కిందకు తీసేందుకు ఫిబ్రవరి 2న ఆపరేషన్ ప్రారంభించామని, ఆపరేషన్ చేస్తోన్న సమయంలో వృద్ధుడి గుండె ఆగిపోయిందన్నారు. మత్తు వైద్యులు ఛాతిపై నుంచి మసాజ్ చేసే (సీపీఆర్) ప్రయత్నం చేస్తామని, ఆపరేషన్ ఆపాలని సూచించినట్లు చెప్పారు. తక్షణమే తాను డయాఫ్రమ్కి ఉన్న రంధ్రం ద్వారా చేతిని గుండెపైకి పోనిచ్చి నేరుగా చేతితో ఆగిపోయిన గుండెను నొక్కి కార్డియాక్ మసాజ్ చేయడంతో కొద్ది క్షణాల్లో ఆగిన గుండె కొట్టుకోవడం ప్రారంభించిందన్నారు. 3 గంటల సేపు ఆపరేషన్ చేసి ఛాతి, గుండెలోకి వెళ్లిన పెద్ద పేగు, కడుపును కిందకు లాగి మరలా సమస్య ఉత్పన్నం కాకుండా ప్రొలేన్ మెష్ అమర్చి డయాఫ్రమ్ను మూసివేశామన్నారు. 48 గంటల పాటు ఐసీయూలో రోగిని ఉంచి గుండె, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు బాగున్నాయని నిర్ధారించుకున్న తరువాత వెంటిలేటర్ తొలగించి సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. వృద్ధుడు కోలుకోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. చదవండి: భారీగా తగ్గిన చికెన్ ధరలు కిలో ఎంతంటే? ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. జీజీహెచ్కు సీఎం వైఎస్ జగన్ అత్యాధునిక వైద్య పరికరాలు అందజేయడంతో జనరల్ సర్జరీ వైద్య విభాగంలో కార్పొరేట్ ఆసుపత్రి కంటే మెరుగైన ఆపరేషన్లను తాము పేదలకు ఉచితంగా చేస్తున్నామన్నారు. ఆపరేషన్లో తనతోపాటు వైద్యులు రమణాచలం, వంశీ, వెంకటరమణ, సంతోష్, నిఖిల్, అనూష, లిఖిత, కిషోర్, వేణు, కోటి, మత్తు వైద్యులు మహే‹Ùబాబు, ప్రదీప్, ధరణి, శ్వేత పాల్గొన్నట్లు వెల్లడించారు. జనరల్ సర్జరీ వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు. -
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలకు చెక్! ధర ఎంతంటే
Manual Eye And Face Massager: ముఖంలో కళ్లు ఎంత ప్రత్యేకమో అంతే సున్నితం. కళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సురక్షితమైన జాగ్రత్తలు తప్పనిసరి. పైగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలను దూరం చేయాలంటే.. ఇక్కడ కనిపిస్తున్న మసాజర్ని వెంట ఉంచుకోవాల్సిందే. ఈ మాన్యువల్ ఐ అండ్ ఫేస్ మసాజర్.. కళ్లకు సంబంధించి పర్ఫెక్ట్ బ్యూటీ టూల్ అని చెప్పుకోవచ్చు. ముఖానికి కూడా చక్కటి మసాజ్ని అందిస్తుంది. ఇది ఐ బ్యాగ్స్ని దూరం చేయడంతో పాటు డార్క్ సర్కిల్స్ని తొలగించి కళ్లను, ముఖాన్ని అందంగా మారుస్తుంది. ముఖ కండరాలకు రిలాక్స్ మసాజర్లోని బాల్ 360 డిగ్రీలు తిరుగుతూ సరికొత్త యవ్వనాన్ని అందిస్తుంది. కంటి చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖ కండరాలను రిలాక్స్ చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నుదుటి మీద ఏర్పడే ముడతలను దూరం చేయడంతో పాటు.. పెదవులు, బుగ్గల మధ్య ఏర్పడే సన్నటి గీతలను పోగొడుతుంది. దీని ఎర్గోనామిక్ నాన్ – స్లిప్ హ్యాండిల్.. కాంపాక్ట్ డిజైన్తో, స్కిన్ ఫ్రెండ్లీ టచ్తో.. ఏ వేళలోనైనా ఎక్కడైనా వినియోగించడానికి.. చాలా సులభంగా ఉంటుంది. ఈ టూల్ ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగేంత చిన్నది. తేలికైనది కూడా. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్లో లేదా కాస్మెటిక్ బ్యాగ్లో చక్కగా సరిపోతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ధర 199 డాలర్లు. అంటే 16,251 రూపాయలు. దీన్ని ప్రియమైన వారికి బహుమతిగానూ ఇవ్వచ్చు! చదవండి: Anasuya Bharadwaj: ఎప్పుడు ఒకే ఆహారపదార్థాలను తినలేం కదా.. ఇదీ అంతే: అనసూయ తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
ముద్దుల పెట్కు గ్లామర్...
సాక్షి, హైదరాబాద్: నేటి ఆధునిక కాలంలో గ్లామర్ మేనియా ఇంట్లో వారికే కాదు.. వాళ్ల పెంపుడు జంతువులకూ ముఖ్యమైపోయింది. ముద్దొచ్చే తమ పెట్స్ను మరింత అందంగా చూడాలనుకుంటున్న యజమానులు ఇందుకోసం ఎంతయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పెంపుడు జంతువులను ముస్తాబు చేసే సంస్థలు హైదరాబాద్లో క్రమంగా పెరుగుతున్నాయి. మసాజ్, గోళ్ల కత్తిరింపు, బబుల్ బాత్ వంటి సేవలను పెంపుడు జంతువులకు అందిస్తున్నాయి. తరలి వచ్చె తళుకులద్దగ... గతంలో ఈ తరహా పెట్ గ్రూమింగ్ సేవల్ని హైదరాబాద్లో కొన్ని సంస్థలు మాత్రమే అందించేవి. అయితే కరోనా సమయంలో తమ పెంపుడు జంతువులను గ్రూమింగ్ పార్లర్స్కు తీసుకెళ్లలేక నగరవాసులు పడిన ఇబ్బందులు మొబైల్ పార్లర్స్కు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు డజనుకుపైగా మొబైల్ వ్యాన్లు పెట్ స్పాలను ఇంటింటికీ మోసుకొస్తున్నారు. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నామని మొబైల్ పార్లర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు గంట పడుతుందని... బొచ్చు కుక్కలకు మాత్రం 90 నిమిషాల వరకు సమయం పడుతుందంటున్నారు. అలాగే పిల్లులను పెంచుకొనే వారికి కూడా సేవలు అందిస్తున్నామని వివరిస్తున్నారు. పెట్ను ఫంక్షన్ లేదా ఫోటోషూట్కు తీసుకెళ్లాల్సి వస్తే అందుకు తగిన దుస్తులు ధరింపజేయడం, ప్రత్యేకంగా హెయిర్ను సెట్ చేయడం కూడా చేస్తామని చెబుతున్నారు. వెటర్నరీ డిప్లొమా వారినే తీసుకున్నాం... మా మొబైల్ సెలూన్లలో పనిచేసే గ్రూమర్లందరూ వెటర్నరీ కళాశాల డిప్లొమా హోల్డర్లు. ఉద్యోగంలో భాగంగా తొలుత వారికి 3 నెలలపాటు శిక్షణ సైతం అందిస్తున్నాం. – జస్ట్ గ్రూమ్ నిర్వాహకురాలు చైత్ర వ్యాధుల వ్యయంతో పోలిస్తే నయమే.. శుభ్రత పాటిస్తే పెట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి సరైన విధంగా స్నానం చేయించడం మన వల్ల సాధ్యం కాదు. ఫలితంగా పెట్స్కు చర్మవ్యా« దుల వంటివి రావచ్చు. అందుకే నా పెట్కి నెలకో సారి స్పాలో స్నానం, 3 నెలలకు ఒకసారి గ్రూమింగ్ చేయిస్తాను. సగటున దాని శుభ్రతకు నెలవారీగా రూ. 3 వేలు ఖర్చు పెడుతున్నా. అయితే పెట్స్కు వ్యాధులు సోకితే అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాలి. పెట్ మొబైల్ సేవల వల్ల పెట్ స్పా కోసం దూరభారం ప్రయాణించే అవసరం పోయింది. – పరిమళ, సికింద్రాబాద్ -
Satyendar Jain: తీహార్ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు మసాజ్
తీహార్ జైల్లో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు మసాజ్ -
ఆప్ మంత్రికి మసాజ్.. కొత్త మలుపు
-
Tihar Jail: ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్
ఢిల్లీ: తిహార్ జైలులో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ రాజభోగాల వ్యవహారంలో మరో ట్విస్ట్ ట్విస్ట్ చేసుకుంది. మంత్రి మసాజ్ చేయించుకున్న వీడియోను ఫిజియోథెరపీగా ఆప్ చిత్రీకరించగా.. అందులో వాస్తవం లేదని తిహార్ జైలు అధికారులు చెప్పారు. మంత్రికి మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్ట్ కాదని, రేపిస్ట్ అని నిర్ధరించారు. పోక్సో చట్టం సహా ఐపీసీ 376, 506, 509 సెక్షన్ల ప్రకారం అభియోగాలు ఎదుర్కొంటున్న రింకుగా గుర్తించినట్లు తెలిపారు. సత్యేంద్ర జైన్.. సహచర జైలు ఖైదీలతో మసాజ్ చేయించుకుంటున్నారని వెల్లడించారు. తిహార్ జైలులో సత్యేంద్ర జైన్ మసాజ్ చేయించుకున్న వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో అరెస్టయిన వారు జైలులో రాజభోగాలు అనుభవించడమేంటని బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే ఈ ఆరోపణలను ఆప్ తిప్పికొట్టింది. మంత్రి మసాజ్ చేయించుకోలేదని, ఫిజియెథెరపీలో భాగంగా చికిత్స తీసుకున్నారని చెప్పింది. వైద్యుల సూచనమేరకు చికిత్స అందించినట్లు పేర్కొంది. కానీ తాజాగా తిహార్ జైలు అధికారులు అతను ఫిజియోథెరపిస్ట్ కాదని, రేప్ కేసు నిందుతుడు అని చెప్పడంతో ఆప్కు షాక్ తగిలనట్లయింది. So instead of Sazaa - Satyendra Jain was getting full VVIP Mazaa ? Massage inside Tihar Jail? Hawalabaaz who hasn’t got bail for 5 months get head massage !Violation of rules in a jail run by AAP Govt This is how official position abused for Vasooli & massage thanks to Kejriwal pic.twitter.com/4jEuZbxIZZ — Shehzad Jai Hind (@Shehzad_Ind) November 19, 2022 చదవండి: ఫుట్బాల్ చూసేందుకు రూ.లక్షలు పెట్టి ఇల్లు కొన్న క్రేజీ ఫ్యామిలీ.. -
అది మసాజ్ కాదు.. ట్రీట్మెంట్.. జైలు వీడియోపై ఆప్ కౌంటర్..
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోను రిలీజ్ చేసిన బీజేపీ కేజ్రీవాల్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే ఆప్ దీనికి కౌంటర్ ఇచ్చింది. సత్యేందర్ జైన్ చేయించుకుంది మసాజ్ కాదని, ట్రీట్మెంట్అని వివరణ ఇచ్చింది. జైలులో ఉన్న ఆయన 4 నెలలుగా ఆహారం తీసుకోలేదని, కేవలం పండ్లు మాత్రమే తింటున్నారని తెలిపింది. ఈ కారణంగానే ఆయనకు ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స అందించాలని కోర్టు ఆదేశించిందని చెప్పింది. సత్యేందర్ జైన్ నరాల సమస్యతో బాధుపడుతున్నారని, ఆక్సీజన్ తీసుకోలేక ఇబ్బందిపడుతున్నారని పేర్కొంది. అందుకే ఆక్యుప్రెషర్ థెరపీ ద్వారా చికిత్స అందించినట్లు చెప్పుకొచ్చింది. సత్యేందర్ జైన్ రోజు గుడికి వెళ్లకుండా ఆహారం తీసుకోరని, జైలులో ఉన్న కారణంగా పండ్లపైనే ఆదారపడ్డారని ఆప్ వివరించింది. ఆయనకు చేసింది మసాజ్ కాదని, థెరపీ అని స్పష్టం చేసింది. #WATCH | CCTV video emerges of jailed Delhi minister Satyendar Jain getting a massage inside Tihar jail. pic.twitter.com/VMi8175Gag — ANI (@ANI) November 19, 2022 రూ.16 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్ను మే 30న అరెస్టు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. బెయిల్ కోసం రెండుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే బీజేపీ విడుదల చేసిన సత్యేందర్ జైన్ మసాజ్ వీడియో పాతదని, ఇప్పటికే ఈ ఘటనతో సంబంధం ఉన్న జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. చదవండి: ఆప్ మంత్రికి తీహార్ జైల్లో మసాజ్.. వీడియో వైరల్ -
ఆప్ మంత్రికి తీహార్ జైల్లో మసాజ్.. వీడియో వైరల్
వైరల్/ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్కు.. వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జైల్లో ఆయన మసాజ్ చేయించుకుంటున్న వీడియోలు శనివారం జాతీయ మీడియా ఛానెల్స్లో ప్రముఖంగా చక్కర్లు కొడుతున్నాయి. జైల్లో జైన్కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారని, వీఐపీ ట్రీట్మెంట్ అందుతోందని ఈడీ, కోర్టుకు తెలిపిన కొన్నిరోజులకే ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. తల, కాళ్లకు ఓ మనిషితో ఆయన మసాజ్ చేయించుకుంటున్న ఫుటేజీ అది. సెప్టెంబర్లోనే ఇది జరిగినట్లు ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకమైన సదుపాయాలు.. పక్కనే మినరల్ వాటర్ బాటిల్స్ ప్యాక్ కూడా గమనించవచ్చు. జైళ్ల నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు సదుపాయాలు అందాయన్నది ప్రధాన విమర్శ. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సదరు వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. దీనిపై తీహార్ జైల్ అధికారులు స్పందించాల్సి ఉంది. మే 30వ తేదీన మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ఈడీ సమక్షంలో అరెస్ట్ అయ్యారు. మరోవైపు అవినీతి స్కామ్లో జైన్తో పాటు ఆయన భార్యాబిడ్డలకు ప్రమేయం ఉందని అభియోగాలు నమోదు చేసింది. So instead of Sazaa - Satyendra Jain was getting full VVIP Mazaa ? Massage inside Tihar Jail? Hawalabaaz who hasn’t got bail for 5 months get head massage !Violation of rules in a jail run by AAP Govt This is how official position abused for Vasooli & massage thanks to Kejriwal pic.twitter.com/4jEuZbxIZZ — Shehzad Jai Hind (@Shehzad_Ind) November 19, 2022 -
ఢిల్లీలోని తిహార్ జైల్లో ఆప్ మంత్రికి వీఐపీ ట్రీట్మెంట్
-
సాయ్(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్
టీనేజ్ అథ్లెట్తో సాయ్(SAI) మహిళా అధికారి మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చేసింది. విషయంలోకి వెళితే.. షర్మిలా తేజావత్ అనే మహిళ ధార్లోని కుషాభౌ ఠాక్రే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పెషల్ ఏరియా గేమ్స్ సెంటర్లో ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వ్యవహరిస్తోంది. సాయ్ సెంటర్కు వచ్చే టీనేజ్ అథ్లెట్స్ను షర్మిలా తేజావత్ తరచూ తన ఇంటికి తీసుకెళ్లి పర్సనల్ పనులకు వాడుకోవడమే కాకుండా వారితో మసాజ్ చేయించుకోవడం అలవాటుగా చేసుకుంది. తాజాగా ఇద్దరు టీనేజ్ అథ్లెట్లను తన ఇంటికి తీసుకెళ్లిన షర్మిలా తేజావత్ వారితో మసాజ్ చేయించుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వీడియో తేదీ, సమయం, మసాజ్ చేస్తున్న అథ్లెట్స్ ఏ క్రీడకు చెందినవారు అనే దానిపై క్లారిటీ లేదు. కానీ షర్మిలాతో పాటే ఉన్న మరొక వ్యక్తి ఈ తతంగమంతా తన సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సాయ్ ఇంతవరకు స్పందించలేదు. అయితే మసాజ్ వ్యవహారంపై సదరు మహిళా అధికారిణిని ప్రశ్నించగా.. ఆమె తన సమాధానాన్ని దాటవేశారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన క్రీడా శిక్షణా శిబిరంగా పేరున్న సాయ్కు ఇది పెద్ద మచ్చ లాంటిదని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడ్డారు. బాధ్యత గల పదవిలో ఉంటూ మంచి అథ్లెట్స్గా తీర్చిదిద్దాల్సింది పోయి వారితో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏంటని మండిపడ్డారు. కాగా ధార్లోని జెట్పురాలోని కేంద్రానికి దేశం నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున శిక్షణ కోసం వస్తుంటారు. #धार #साई ट्रेनिंग सेंटर स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया का वीडियो वायरल हो रहा है, जिसमें साई सेंटर केंद्र प्रभारी सर्मिला तेजावत खिलाड़ियों से पैर दबवातीं नज़र आ रहीं हैं। खिलाड़ियों का ऐसा शोषण? कृपया संज्ञान लें @Media_SAI @YASMinistry @ianuragthakur #वायरल_वीडियो pic.twitter.com/JxxzJTR080 — 🇮🇳Sandeep Singh संदीप सिंह (@Sandeep_1Singh_) August 28, 2022 చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
Health Tips: బీ12 లోపించడం వల్లే ఇలా! పాదాలకు మసాజ్ చేశారంటే..
కొంతమందికి ప్రతిరోజూ పాదాలు నొప్పి, అరికాళ్లు చురుక్కుమని మంటలు పుట్టడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. సాధారణంగా విటమిన్ బీ12 లోపం వల్ల, డయాబెటిస్ ఉండటం వల్ల ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతుంటాయి. అయితే విటమిన్ టాబ్లెట్లు వాడుతూ, డయాబెటిస్కు చికిత్స తీసుకుంటున్నా కూడా ఈ సమస్య వేధిస్తుంటే పాదాలకు మసాజ్ చేయడం చాలా ఉపశమనాన్నిస్తుందంటున్నారు నిపుణులు. అదేమిటో చూద్దాం... అనేక ప్రయోజనాలు! చాలామంది ఇళ్లలో పెద్దవాళ్లు ఇప్పటికీ కూడా అరికాళ్లకు, పాదాలకు కొబ్బరినూనె రాయించుకుని కాళ్లు పట్టించుకుంటూ ఉండటం చూస్తుంటాం. అయితే అది పాతకాలం పద్ధతి అని కొట్టిపారేయద్దని, పాదాలకు మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆధునిక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అరికాళ్ల మసాజ్ కాళ్ల నొప్పులతోపాటు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. రోజూ పాదాలకు మసాజ్ చేస్తే కాళ్లకు సత్తువ పెరుగుతుంది. ఒక పరిశోధన ప్రకారం... పాదాలకు మసాజ్ చేయడం నాడీవ్యవస్థను ఉత్తేజ పరుస్తుంది. మెదడులో ఉండే ఎండార్ఫిన్ రసాయనాల ఉత్పత్తిని పెంచుతుంది. కొన్నిరకాల శస్త్ర చికిత్సల తర్వాత పాదాలకు మసాజ్ చేసిన వారికి నొప్పి తక్కువగా ఉండడంతోపాటు శస్త్ర చికిత్సానంతరం తలెత్తే కొన్ని రకాల ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటారని తెలిపింది. ఫుట్ మసాజ్ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఫుట్ మసాజ్ చేయడం వల్ల... కండరాలను బలపరుస్తుంది... రెగ్యులర్ ఫుట్ మసాజ్ కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చాలాకాలం పాటు కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాదాలను మర్దన చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది నరాలు దెబ్బతినడం, డయాబెటిస్ వంటి వాటిలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. డిప్రెషన్ దూరం... ►మానసికంగా అస్వస్థతకు గురై, డిప్రెషన్కు లోనవుతున్నవారు ఫుట్మసాజ్ చేయించుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుంది. ►మంచి నిద్ర కోసం... మీకు రాత్రి నిద్ర రాకపోతే మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో పాదాలను సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ►సత్వర ఉపశమనం... ఫుట్ మసాజ్ సహాయంతో మీరు మడమలు, బూట్లు, పాదాలు మొదలైన వాటికి తగిలిన గాయాల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ముఖ్యంగా అథ్లెట్లు లేదా ఎక్కువ పనిచేసే వ్యక్తులు. ►గర్భధారణ సమయంలో... గర్భధారణ సమయంలో పాదాలు వాపు సర్వసాధారణం. అలాంటి సమయంలో వారికి ఫుట్ మసాజ్ వల్ల హాయిగా ఉండటమే కాకుండా పాదాలవాపు సమస్య కూడా దూరమవుతుంది. ►ఇన్ని ఉపయోగాలున్న ఫుట్మసాజ్ను పక్కన పెట్టెయ్యరు కదా.. ఇంక? చదవండి: Rainy Season Tips: అసలే వర్షాకాలం.. లో దుస్తుల విషయంలో జాగ్రత్త! ఇలా మాత్రం చేయకండి! Health Benefits Of Corn: మొక్కజొన్న పొత్తు తరచుగా తింటున్నారా? ఇందులోని లైకోపీన్.. -
స్టూడెంట్తో మేడమ్ మసాజ్.. వేటు
లక్నో: పాఠాలు నేర్పే గురువులు తమను వదిలి వెళ్తుంటే.. పిల్లలు కన్నీళ్లు పెట్టుకుంటూ అడ్డుకునే దృశ్యాలను చాలానే చూశాం.. చూస్తున్నాం. అదే సమయంలో ఆ వృత్తికి కళంకం తెస్తున్న వాళ్ల గురించి వింటున్నాం. తరగతి గదిలో అదీ.. పిల్లలందరి ముందే ఓ టీచర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. స్టూడెంట్స్లోని ఓ పిల్లాడితో చేతులను మసాజ్ చేయించుకుంది. హాయిగా కుర్చీలో రిలాక్స్ అవుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో.. సదరు టీచర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తర ప్రదేశ్ హర్దోయ్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఉర్మిలా సింగ్ ఆ స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా పని చేస్తోంది. వీడియో వైరల్ అయిన వెంటనే ఆమెపై వేటు వేస్తూ జిల్లా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వీడియో తనదాకా వచ్చిందని, ఆమెపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కానీ, ఆమె వ్యవహరించిన తీరుపై తగిన చర్యలు ఉంటాయని చెప్పారు హర్దోయ్ విద్యాధికారి బీపీ సింగ్. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆమెను స్కూల్ నుంచి తొలగిస్తేనే.. తమ పిల్లలను బడికి పంపుతామంటూ ధర్నా చేపట్టారు అక్కడ. Teacher having bicep Massage by students, Viral video from Hardoi UP govt school. pic.twitter.com/MF8lEQPvEZ — Grading News (@GradingNews) July 27, 2022 ఇదీ చూడండి: ‘సార్.. ప్లీజ్ మమ్మల్ని విడిచి వెళ్లొద్దు’ -
మసాజ్ కోసం పిలిచి వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్ కొట్టి...
సాక్షి, హైదరాబాద్: వివస్త్రను చేసి.. కళ్లల్లో, నోట్లో హిట్ కొట్టి... మసాజ్ థెరపిస్టును హింసించిన వ్యవహారంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితురాలి నుంచి డయల్– 100 ద్వారా ఫిర్యాదు అందుకుని వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ఆ అయిదుగురు విటుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారు. నాలుగు రోజులు పూర్తయినా ఈ విషయంపై విచారణ, బాధ్యులపై చర్యల విషయంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. బాధితురాలితో పైశాచికంగా ప్రవర్తించిన ఆమె స్నేహితురాళ్లు ముగ్గురినీ ఆదివారం పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో చాప కింద నీరులా ఇలాంటి వ్యవహారాలు సాగిస్తున్న ముఠాలు మరికొన్ని ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. ‘పరిష్కరించడ’మంటే ఏంటో? కోల్కతాకు చెందిన బాధితురాలు (26) తన స్నేహితురాలు సంజన సూచనలతో బంజారాహిల్స్ రోడ్ నం.11లోని స్పా సెంటర్లో థెరపిస్ట్గా పని చేయడానికి ఈ నెల 9న వచ్చింది. మసాజ్ ముసుగులో ఆమెతో వ్యభిచారం చేయించడానికి సంజనతో పాటు కోమతి, సునీత ఒప్పించారు. గురువారం మధ్యాహ్నం బాధితురాలిని క్యాబ్లో జూబ్లీహిల్స్ రోడ్ నం. 25లోని ఫ్లాట్కు సంజన పంపింది. అప్పటికే అక్కడ కోమతి, సునీతలతో పాటు అయిదుగురు యువకులు ఉన్నారు. అక్కడ ఉన్న కస్టమర్లతో మెసలుకోనే విషయంలో తలెత్తిన వివాదం బాధితురాలిపై దాడి చేసే వరకు వెళ్లింది. దీంతో ఆమె 100కు ఫోన్ చేయగా... ఆ ఫ్లాట్ వద్దకు వెళ్లిన పెట్రోలింగ్ అధికారులు విషయం ‘పరిష్కరించారు’. ఈ పరిష్కారమే బాధితురాలిపై హత్యాయత్నం వరకు వెళ్లింది. నిందితుల్ని ఎలా వదిలిపెడతారు? ఈ ఉదంతంలో బాధితురాలితో పాటు కోమతి, సునీత తదితరులతో వ్యభిచారం జరుగుతున్నట్లు స్పష్టమైంది. ఈ విషయం అక్కడకు వెళ్లిన పోలీసులకు అర్థం కాకపోవడం గమనార్హం. అలాంటి కేసులను పోలీసులు ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ (పీటా) కింద నమోదు చేస్తారు. దీని ప్రకారం ఆ ఫ్లాట్లో ఉన్న యువతులను బాధితులుగా, యువకులను విటులుగా పరిగణించాలి. బాధితురాళ్లను రెస్యూ హోమ్ తరలించి విటులను అరెస్టు చేయడం లేదా సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇదేమీ జరగకుండా కేవలం విషయం ‘పరిష్కారమైంది’. అధికారుల ఈ నిర్లక్ష్యం కారణంగానే బాధితురాలు కొన్ని గంటల పాటు చిత్రహింసలు అనుభవించాల్సి రావడంతో పాటు నగ్నంగా అపార్ట్మెంట్ బయట పరుగుపెట్టాల్సి వచ్చింది. చర్యలకు ఎందుకో వెనుకడుగు? ఈ వ్యవహారంలో డయల్–100 ద్వారా సమాచారం అందుకుని, జూబ్లీహిల్స్ రోడ్ నం. 25లోని ఫ్లాట్ వద్దకు వెళ్లిన పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ రోజు అక్కడ ఉన్న ఐదుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా సమాచారం. దీనిపై ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. బాధితురాలితో అమానుషంగా ప్రవర్తించి, నిర్బంధించి, హత్యాయత్నం చేసిన సంజన, కోమతి, సునీతలపై కేసు నమోదు చేసి శనివారం అరెస్టు చేశారు. బాధితురాలికి తెలియకపోయినా.. వీరిని విచారిస్తే ఆ అయిదుగురు ఎవరన్నది తెలిసే అవకాశం ఉంది. అలా ఈ వ్యవహారం మొత్తానికి కారణమైన విటులపై చర్యలు తీసుకోవచ్చు. దీంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులకూ విషయం ‘బోధపడేలా’ చెప్పాల్సి ఉంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. చదవండి: ప్లాటు బదులు పైసలివ్వు.. లేదంటే చావు -
ఫిర్యాదు కోసం వెళ్తే.. మసాజ్ చేయించుకున్నాడు
అధికార మదం.. మరో అధికారిని వార్తల్లోకి ఎక్కించింది. విధి నిర్వహణలో ఉండగానే మసాజ్ దుకాణం తెరిచిన ఓ పోలీస్ అధికారి వీడియో ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్ల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇంకేం ఆయనగారిపై చర్యలు తీసుకున్నారు అధికారులు. బీహార్ సహస్రా జిల్లా నౌహట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని దాహర్ అవుట్పోస్ట్లో విధులు నిర్వహించే సీనియర్ అధికారి శశిభూషణ్ సిన్హా.. మసాజ్ వీడియోతో అడ్డంగా బుక్కయ్యాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను అవుట్పోస్ట్లోని రెసిడెన్షియల్ క్వార్టర్స్కు పిలిపించుకున్నాడాయన. ఆపై ఆమెతో బలవంతంగా మసాజ్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. షర్ట్ను అక్కడే వేలాడదీసి.. ఆపై ఆమెతో ఒళ్లు రుద్దించుకున్నాడు. ఆ టైంలో ఆయన సీరియస్గా ఫోన్ మాట్లాడుతుండగా.. ఎవరో ఆయన్ని వీడియో తీశారు. ఆ టైంలో అక్కడ మరో మహిళ కూడా ఉంది. ఈ వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తగా.. ఆయనపై వేటు పడినట్లు సమాచారం. అయితే బీహార్ పోలీస్ శాఖ వీడియోపై, ఘటనపై, చర్యలపై అధికారికంగా మాత్రం స్పందించలేదు. Bihar police exposed on camera! Woman forced to give massage to cop to secure release of her son. Aditya joins us with details. #Bihar pic.twitter.com/8KNWWpZ9Ez — TIMES NOW (@TimesNow) April 29, 2022 -
నడము, పొట్ట భాగాల్లో కొవ్వు తగ్గించుకోండి ఇలా.. ఈ డివైజ్ ధర.. 9 వేలు
ఈరోజుల్లో అందాన్ని కాపాడుకోవడమంటే ఓ టాస్క్. ప్రతిరోజూ యోగా, వ్యాయామాలు చేస్తుండాలి, వేళకు సరైన ఆహారం తీసుకోవాలి, వంటింటి చిట్కాలు, వాటర్ థెరపీలు.. ఇలా సౌందర్య సాధనలో లెక్కకు మించిన సలహాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ సమయం ఉండాలి కదా? అదనపు ఒత్తిళ్లతో సాగే మన ఉరుకుల పరుగుల జీవనానికి కాస్త తీరిక దొరికితే విశ్రాంతి తీసుకోవడం తప్ప మరే పని చెయ్యాలనిపించదు. అలాంటి వారికి అందాన్ని, ఆరోగ్యాన్ని రెండింటినీ పుష్కలంగా అందిస్తుంది ఈ ఎల్ఈడీ స్లిమ్మింగ్ డివైజ్ (హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్ అల్ట్రాషేప్ బాడీ స్లిమ్మింగ్ మెషిన్). మూడు టెంపరేచర్ మోడ్స్, ఐదు ఎనర్జీ లెవల్స్ కలిగిన ఈ డివైజ్ని వినియోగించడం చాలా సులభం. తీరిక ఉన్న సమయంలో చేత్తో దీన్ని సన్నని బాటిల్ (హ్యాండిల్ గ్రిప్ ఉంటుంది) పట్టుకున్నంత తేలిగ్గా పట్టుకుని అవసరమైన చోట మసాజ్ చేసుకోవచ్చు. తీరిక లేనప్పుడు బెల్ట్ సాయంతో బాడీలో ఏ భాగానికి కావాలనుకుంటే ఆ భాగాని ఫిక్స్ చేసుకోవచ్చు. ►ఈ డివైజ్ అడుగు భాగంలో నాలుగు వైపులా నాలుగు మిడ్–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్స్ ఫిక్స్ చేసి ఉంటాయి. ►మధ్యలో ఒక సెన్సర్ పాయింట్, దాని చుట్టు 18 ఎల్ఈడీ లైట్స్, వాటి చుట్టు హై–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్ అమరి ఉంటాయి. ►మెషిన్ ఆన్ చెయ్యగానే ఆ భాగాన్ని చర్మానికి ఆనిస్తే.. ట్రీట్మెంట్ అందుతుంది. డివైజ్కి అదనంగా చార్జింగ్ కేబుల్, ఒక పట్టీ(బెల్ట్) లభిస్తాయి. ►బాడీ స్లిమ్మింగ్, స్కిన్ టైటెనింగ్, బాడీ షేపింగ్తో పాటు మెటబాలిజమ్ (జీవక్రియ) వేగవంతమవుతుంది. ►దీన్ని వినియోగించి, చేతులు, తొడలు, నడము, పొట్ట వంటి భాగాల్లో కొవ్వుని సులభంగా తగ్గించుకోవచ్చు. దీని ధర 121 డాలర్లు అంటే 9,062 రూపాయలు. చదవండి: UFO Mystery In Telugu: డ్యానీని హెచ్చరించింది ఎవరు? అది ఏలియన్స్ పనా? ఏమిటా కథ! -
Baby Massage: ఆవనూనె.. లేదంటే వెన్న, మీగడతో మసాజ్ చేస్తే..
Winter Care Tips In Telugu: Massage For Babies Helpful: శీతాకాలం ప్రతిఒక్కరికీ పరీక్ష పెడుతుంది. ఏడాదిలోపు చంటిపిల్లలను సంరక్షించడం అంటే తల్లికి చిన్న పరీక్ష కాదు. అనుక్షణం బిడ్డ ధ్యాసలోనే గడపాల్సి ఉంటుంది. పాపాయికి తినిపించే ఆహారం నుంచి స్నానం చేయించడం, దుస్తులు, ఒంటికి నూనెలు పట్టించి మసాజ్ చేయడం ప్రతిదీ అత్యంత జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా మసాజ్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించి తీరాలి. ►శీతాకాలంలో మసాజ్కు ఆవనూనె అయితే మంచిది. ఇది ఒంటికి సహజంగా వేడినివ్వడంతోపాటు ర్యాష్ వంటి చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది. ఒకవేళ న్యాపీ ర్యాష్ వంటి సమస్యలు ఉన్నా కూడా తగ్గిస్తుంది. ఆవనూనె సాధ్యం కానప్పుడు వెన్న, మీగడలతో మసాజ్ చేయవచ్చు. ఇవి అన్ని కాలాల్లోనూ వాడదగినవే. ►మసాజ్ కోసం బిడ్డను చేతుల్లోకి తీసుకునే ముందు తల్లి తన చేతులను వేడి నీటితో కడుక్కోవాలి. ఈ కాలంలో చేతులు చల్లగా ఉంటాయి. చల్లటి చేయి ఒంటికి తగలగానే పాపాయి భయంతో ఉలిక్కిపడుతుంది. అందుకే ఈ జాగ్రత్త. ►మసాజ్కు వాడే నూనెను చిన్న స్టీలు గిన్నెలో తీసుకుని గోరువెచ్చగా చేసిన తర్వాతనే పాపాయి ఒంటికి పట్టించాలి. వేడి చేయడం వీలుకాకపోతే నూనెను రెండు చేతుల్లో వేసుకుని రుద్దుకుంటే చల్లదనం తగ్గుతుంది. పాపాయి చర్మానికి సౌకర్యంగా ఉంటుంది. గదిని వెచ్చబరచాలి.. ►నూనె పట్ల తీసుకునే జాగ్రత్తలతోపాటు మసాజ్ చేయడానికి ముందు దుస్తులు తొలగించడంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. వేసవిలో చేసినట్లు ఒకేసారి దుస్తులన్నీ తీసేయరాదు. ముందు సాక్స్, ప్యాంటు తీసి కాళ్లకు మసాజ్ చేయాలి. అప్పుడు కాళ్ల మీద మందపాటి టవల్ కప్పి ఆ తర్వాత చేతులకున్న మిటెన్స్, స్కార్ఫ్, చొక్కా తీసి పై భాగానికి మసాజ్ చేయాలి. ►వీటన్నింటికంటే ముందు గదిని వెచ్చబరచాలి. రూమ్ హీటర్లు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. కాబట్టి చంటిబిడ్డ ఉన్న ఇంట్లో రూమ్ హీటర్ తప్పకుండా ఉండాలి. మసాజ్ మొదలు పెట్టడానికి పది నిమిషాల ముందు రూమ్ హీటర్ ఆన్ చేయాలి. హీటర్ నుంచి వచ్చే గాలిని నేరుగా పాపాయికి తగలనివ్వకూడదు. హీటర్ సాధ్యం కానప్పుడు సాంబ్రాణి పొగ లేదా ధూప్ స్టిక్తో గదిని వెచ్చబరచవచ్చు. నిజానికి జలుబుకు కారణం మసాజ్ కాదు ►సాధారణంగా చేసే పొరపాటు ఏమిటంటే... పక్క దుస్తులకు నూనె జిడ్డు అంటకుండా ఉండడానికి మసాజ్ చేసేటప్పుడు పాపాయిని ప్లాస్టిక్ షీట్ మీద పడుకోబెడుతుంటారు. ఈ సీజన్లో మాత్రం ఆ పని చేయనే చేయకూడదు. ప్లాస్టిక్ షీట్ చల్లగా ఉంటుంది. పాపాయికి జలుబు చేసే ప్రమాదం ఉంది. అందుకే పాతబడిన దుప్పటిని హీటర్ ముందు పెట్టి గోరువెచ్చగా చేసిన తర్వాత పాపాయిని పడుకోబెట్టాలి. ►పాపాయి చర్మ సంరక్షణకు, కండరాల వ్యాయామానికి మసాజ్ను మించిన ఔషధం మరొకటి ఉండదు. కాబట్టి శీతాకాలంలో కూడా చక్కగా మసాజ్ చేయవచ్చు. ఈ కాలంలో మసాజ్ చేస్తే జలుబు చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. పైన చెప్పుకున్న జాగ్రత్తలు పాటించకుండా వేసవిలో మసాజ్ చేసినట్లే పాపాయిని దుస్తులు లేకుండా ఎక్కువ సేపు చలిగాలికి ఉంచినప్పుడు జలుబు చేస్తుంది. ఈ జలుబుకి కారణం మసాజ్ కాదు. తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే. -
మీ చర్మ కాంతిని మరింత పెంచే మసాజ్ స్క్రాపర్.. ధర ఎంతంటే..
చర్మ సంరక్షణకు మించిన సౌందర్య రహస్యం మరోకటి లేదు. దానికి అద్భుతమైన టూల్ ఈ మసాజ్ స్క్రాపర్. హై క్వాలిటీ ఆక్రిలోనిట్రైల్ బుటాడిన్ స్టెరిన్ – స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్తో రూపొందిందీ మినీ డివైజ్. దీని నుంచి విడుదలయ్యే 45 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్.. స్కిన్ కేర్కు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వైబ్రేషన్స్.. చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, కాంతిమంతం చేయడానికి తోడ్పడతాయి. అంతేకాదు ఇది ఒత్తిడిని దూరం చేసి.. ప్రశాంతతను అందిస్తుంది. అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఈ స్క్రాపింగ్ మసాజ్ టూల్.. చర్మంపైన ఆక్యుపాయింట్స్ని ప్రేరేపించేలా త్రికోణ ఆకారంలో ఉంటుంది. దీనిలో స్మూతింగ్ మోడ్, యాక్టివేటింగ్ మోడ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. స్మూతింగ్ మోడ్.. లో–వైబ్రేషన్ అందిస్తే, యాక్టివేటింగ్ మోడ్.. హైయర్–వైబ్రేషన్ను అందిస్తుంది. దాంతో కొన్ని నిమిషాల్లోనే చర్మం తేజోవంతమవుతుంది. ఇక్కడున్న చిత్రాన్ని గమనించినట్లైతే.. కింద ఉన్న చార్జింగ్ బేస్కి వెనుక భాగంలో యు.ఎస్.బి పోర్ట్ ఉంటుంది. దాంతో ఈ డివైజ్ని చార్జింగ్ బేస్లో అమర్చి.. యు.ఎస్.బి పోర్ట్కి చార్జర్ పెట్టుకుంటే.. వైర్లెస్ మసాజర్గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మరోసారి ఉపయోగిస్తున్నప్పుడు.. చివరిగా ఏ మోడ్తో ఆఫ్ అయ్యిందో అదే మోడ్తో పని చేస్తుంది. ఈ ట్రయాంగిల్ టూల్ వాటర్ ప్రూఫ్ కావడంతో నీటితో శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర 159 డాలర్లు. అంటే సుమారు 12 వేల రూపాయలు. చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న తుపాకి.. లక్షల్లో ధర! -
Viral Video: గొర్రెకు మసాజ్ చేస్తున్న పిల్లి
పిల్లి ఏం చేసినా క్యూట్గా ఉంటుందంటారు క్యాట్ లవర్స్. కానీ దొంగలా పాలు తాగి ఏమీ ఎరగనట్టు నటించే ఆ మూగజీవిని చూస్తే చిర్రెత్తిపోతారు మరికొందరు. అయితే ఇక్కడ మాత్రం ఓ పిల్లి ఎలాంటి దొంగ వేషాలు వేయకుండా ఓ గొర్రెకు మసాజ్ చేసి నిద్ర పుచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో గొర్రె , పిల్లి మంచి ఫ్రెండ్స్గా మారాయి. గొర్రె కింద పడుకుంటే పిల్లి దాని వీపు మీద ఎక్కింది. ఏదో పరుపుపై పడుకున్నట్లుగా హయిగా అక్కడే సెటిలైంది. అంతటితో ఆగకుండా అది గొర్రెకు మసాజ్ చేయడం మొదలు పెట్టింది. పిల్లి తన రెండు కాళ్లతో గొర్రెను పైకి కిందకు నొక్కుతుంటే అది హాయిగా పడుకుంది. నిండుగా ఉన్న గొర్రె బూరులో పిల్లి తల దూర్చి మరీ పడుకుంది. ఇంత జరుగుతున్నా గొర్రె మాత్రం ఎటూ కదలకుండా నిద్రలో మునిగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'పిల్లి ఎంత బాగా మసాజ్ చేస్తుంది', 'గొర్రె అలసిపోయిందేమో.. కనీసం లేవడం లేదు', 'అది పిల్లి చేస్తున్న మసాజ్ను ఎంజాయ్ చేస్తున్నట్లుంది', 'పిల్లి మాకు కూడా మసాజ్ చేస్తుందా..' అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. -
రాత్రి వేళ రోడ్డు పక్కన హెడ్ మసాజ్..
-
రాత్రి వేళ రోడ్డు పక్కన హెడ్ మసాజ్..
హీరోయిన్ ఓ వెలుగు వెలిగిన చార్మి ఇటీవల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి చార్మి నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. షూటింగ్ వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకుంటున్న చార్మి.. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ‘నిర్మాతగా ఉంటే దక్కే ప్రయోజనాలు..’ అంటూ చార్మి ఓ సరదా వీడియోను అభిమానులతో పంచుకున్నారు. రోడ్డు పక్కన రాత్రి వేళ షూటింగ్ జరుగుతున్న సమయంలో.. హెడ్ మసాజ్ చేయించుకుంటున్న వీడియోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఆ వీడియోలో చార్మి ఓ వైపు మసాజ్ చేయించుకుంటూనే.. మరోవైపు షూటింగ్ సీన్ గురించి పూరితో మాట్లాడుతూ కనిపించారు. కాగా, ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ ఫైటర్గా కనిపిస్తున్న ఈ సినిమాలో.. అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తున్నారు.(నా క్యారెక్టర్ నాలానే ఉంటుంది!) -
ఈ మసాజ్ ఒక్కసారి చాలు! రోగాలన్నీ మటుమాయం
సాక్షి, ముంబై: కార్పోరేట్ దిగ్గజం, మహీంద్ర అండ్ మహీంద్ర ఛైర్మన ఆనంద్ మహీంద్రా మరోసారి ఆసక్తికరమైన ట్విట్తో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు ఆసక్తికరమైన, ఇన్నోవేటివ్ అంశాలను షేర్ చేస్తూ వుంటారు. తాజాగా ఒక హిల్లేరియస్ ఫోటోను ట్వీట్ చేశారు. తద్వారా తన సెన్సాఫ్ హ్యూమర్ను చాటుకున్నారు. ఒక రోడ్ రోలర్ చక్రంపై బాడీ మసాజ్ ప్రకటన పోస్టర్ నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా కంట పడింది. ఈ ప్రకటనకు సంబంధించిన పోస్టర్ ఒక రోడ్ రోలర్ చక్రం మీద అంటించడమే ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బాడీ మసాజ్ కేవలం రూ.499 మాత్రమే అని దానిపై రాసి ఉంది. ఇక ఆయన ఊరుకుంటారా? వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి చక్కటి కమెంట్ యాడ్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. ఇలాంటి మసాజ్ ఒకసారి చేసుకుంటే చాలు...ఇక జీవితంలో మరోసారి దీని అవసరం రాదు. ఈ మసాజ్తో శరీరంలోని రుగ్మతలన్నీ మటుమాయమంటూ పేర్కొన్నారు. అంతేకాదు ఈ పోస్టర్ అంటించిన వ్యక్తికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ అయినా ఉండాలి లేదంటే ఐక్యూ లెవల్ అయినా తక్కువగా ఉండాలని ట్వీట్ చేశారు. కాగా ట్విటర్లో ఆనంద్ మహీంద్రాకు 70 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. Hilarious. After this massage, you’ll never need another one; it’ll be a permanent remedy for all ailments... (The guy who plastered that poster either had a delicious sense of humour or a seriously low IQ!) pic.twitter.com/92UIQaCmhq — anand mahindra (@anandmahindra) June 3, 2019 -
మహిళా టీచర్లకు అసభ్యకర సందేశాలు..
విజయనగరం ,కొత్తవలస: తల్లితండ్రుల తర్వాత అంతటి గౌరవాన్ని ఉపాధ్యాయులకు ఇచ్చింది మన సమాజం. కాని సభ్య సమాజం సిగ్గుపడేలా సాటి మహిళా ఉపాధ్యాయినులకు అభ్యంతకర మెసేజ్లు పంపిస్తూ ఉపాధ్యాయ వృత్తికే మచ్చతెచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. అతని వేధింపులు భరించలేక బాధిత ఉపాధ్యాయినులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని కంటకాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న జి. వెంకటనాయుడు అభ్యంతకర మెసేజ్లతో మహిళా ఉపాధ్యాయులను వేధిస్తున్నాడు. ఓ దాత మీ పాఠశాలకే రెండు కంప్యూటర్లు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని దిగువ ఎర్రవానిపాలెం పాఠశాల ఉపాధ్యాయిని హెచ్. రమాదేవికి.. ఎర్నడ్ లీవ్ చేయించుకోవడంలో ఎంఈఓను బాగానే మేనేజ్ చేశావంటూ కొత్తవలస పాఠశాల ఉపాధ్యాయురాలు హెచ్. శోభారాణికి వెంకటనాయుడు మెసేజ్లు పంపించాడు. అలాగే చీడివలస పాఠశాల హెచ్ఎం బంగారుపాపను ఉద్దేశిస్తూ ఎన్నిసార్లు అవార్డులు తీసుకుంటావంటూ మెసేజ్లతో వేధిస్తున్నాడు. బంగారుపాపకు జిల్లా స్థాయి అవార్డు రావడంతో ఇటీవల మండల కేంద్రంలో జరిగిన అభినందన సభలో కూడా తక్కువ చేసి మాట్లాడినట్లు బాధిత ఉపాధ్యాయురాలు తెలిపింది. ఈ మేరకు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ముగ్గురు మహిళా ఉపాధ్యాయినులు పోలీసులను ఆశ్రయించారు. తోటి ఉపాధ్యాయులు, ఆయా గ్రామాల ప్రజలతో కలిసి పోలీస్స్టేషన్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా వెంకటనాయుడు ఆగడాలను బాధిత ఉపాధ్యాయినులతో పాటు తోటి ఉపాధ్యాయులు చుక్క ఈశ్వరఅప్పారావు, బి. శ్రీనివాసరావు, నాగభూషణరావు, పి. రవి, బి. రామకృష్ణారావు, తదితరులు సీఐకి వివరించారు. కులంపేరుతో తక్కువగా మాట్లాడుతున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే బంధువు కావడంతో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటనాయుడు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బంధువులు కావడంతో అందరినీ బెదిరిస్తున్నాడని పలువురు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కనీసం అతడ్ని పిలిచి విచారించలేదని బాధిత మహిళలు వాపోయారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఐ ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిందితుడితో పాటు గ్రూప్ అడ్మిన్ సోలురాజును పిలిచి విచారిస్తామని చెప్పారు. -
రైలొచ్చేలోగా.. రిలాక్స్
రైలు దిగగానే ఎక్కడో ఒక చోట అలా వాలిపోతే బావుండుననిపించేంతటి బడలిక. ఒత్తిడి. అదిగో ... సరిగ్గా అలాంటి ప్రయాణికుల కోసమే దక్షిణ మధ్య రైల్వే చక్కని సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణ బడలికను తీర్చి ఎంతో ఊరటను, హాయిని కలిగించే మసాజ్ చైర్లను తొలిసారి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రారంభించింది. ఇప్పటి వరకు ఎయిర్పోర్టులకు మాత్రమే పరిమితమైన మసాజ్ చైర్ సేవలు ఇప్పుడు రైల్వేస్టేషన్లలో సైతం అందుబాటులోకి వచ్చాయి. గురువారం సికింద్రాబాద్ స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫామ్పై సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదాన్ ఈ మసాజ్ చైర్లను లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణికులకు విమానాశ్రయం తరహాలో సదుపాయాలను అందజేసేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు చర్యలు చేపట్టిందన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ట్రైన్ దిగగానే కొద్ది సేపు సేదదీరేందుకు ఈ చైర్లు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఐదు నిమిషాల మసాజ్ అనంతరం తిరిగి తమ గమ్యస్థానానికి బయలుదేరవచ్చునని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోనే అతి పెద్ద స్టేషన్ అయిన సికింద్రాబాద్లో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలను అందజేస్తున్నట్లు చెప్పారు. 50 రూపాయలు 5 నిమిషాలు.. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్ఫామ్పైన రెండు, పదో నంబర్ ప్లాట్ఫామ్పైన రెండు మసాజ్ చైర్లను ఏర్పాటు చేశారు. ఈ చైర్లో 5 నిమిషాల సర్వీసుకు రూ.50 చార్జీ ఉంటుంది. దీనితో పాటు శరీరం మొత్తం రిలాక్స్ అయ్యేవిధంగా మసాజ్ అవుతుంది. శరీరంలోని ప్రతి కండరానికి రక్తసరఫరా పెరిగి ఒత్తిడి తగ్గేలా ఈ చైర్ చక్కటి మసాజ్ను అందజేస్తుంది. సుదూరప్రయాణాలు చేసి వచ్చే వారికి ఇది ఎంతో అవసరమని, శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న మసాజ్ చైర్లకు అనూహ్యమైన డిమాండ్ ఉందని నిర్వాహకుడు శివకుమార్ తెలిపారు. ‘సాధారణంగా మసాజ్ సెంటర్లు, ఫిజియోథెరపీ కేంద్రాల్లో రూ.వందల్లో ఫీజు తీసుకుంటారు. రైల్వేస్టేషన్లో కేవలం రూ.50లు తీసుకుంటున్నాం. బయట ఒక అరగంట పాటు మసాజ్ చేసినప్పుడు ఎలాంటి రిలాక్స్ అనుభూతి కలుగుతుందో ఈ చైర్లో కేవలం 5 నిమిషాల్లో కూడా అలాంటి అనుభూతినే పొందవచ్చు.’’అని చెప్పారు. ఒక్కసారిగా బడలిక ఎగిరిపోతుందన్నారు. ఇవీ ప్రయోజనాలు.. ►తల, మెడ, వెన్ను భాగం మొదలుకొని కాళ్లు, చేతుల వరకు అన్నింటికి మసాజ్ అందుతుంది. ►ఒకే సమయంలో శరీరంలోని అన్ని భాగాలు రిలాక్స్ అవుతాయి. ► క్షణాల్లో ఒత్తిడి మాయమవుతుంది. రక్తసరఫరా బాగా మెరుగు పడుతుంది. ►శరీరంలో ఉండే నొప్పులు, బాధలు తగ్గిపోతాయి. ►దశలవారీగా కాచిగూడ, నాంపల్లి, తదితర ప్రధాన స్టేషన్లలోనూ మసాజ్ చైర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ -
అమ్మా క్షమించు మెసేజ్ చేసి యువతి అదృశ్యం
రాజేంద్రనగర్: అమ్మా క్షమించు అంటూ ఓ విద్యార్థిని సెల్ఫోన్కు మెసేజ్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయిన సంఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిరేవుల ప్రాంతానికి చెందిన బుర్రయ్య కూతురు అర్చన(26) డిగ్రీ పాసై వివిధ ఉద్యోగాల పరీక్షలు రాసేందుకు సిద్దమవుతుంది. ఇందులో భాగంగా నగరంలోని ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతుంది. ఈ నెల 19న ఉదయం 11గంటలకు ఇంటి నుంచి కోచింగ్కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. అనంతరం 11:58 నిమిషాలకు తల్లి సెల్ఫోన్కు అమ్మా క్షమించు అంటూ మెసేజ్ పెట్టి సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో తల్లి విషయాన్ని కుమారుడికి తెలిపింది. శిక్షణ పొందుతున్న కోచింగ్ సెంటర్కు వెళ్లగా అక్కడికి రాలేదని తేలింది. చూట్టు పక్కల ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసిన ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం ఉదయం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నువ్వు నాకు బా..గా నచ్చావ్!
శ్రీకాళహస్తి: ‘నువ్ అందంగా ఉంటావ్..నువ్వంటే నాకిష్టం..నీ వాయిస్ చాలా బాగుంటుంది..నువ్వు నాకు బా..గా నచ్చావ్..! ఇదీ ఓ బ్యాంకు మేనేజర్కు అర్ధరాత్రి వేళ శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ ముఖ్యనేత పెట్టిన మెసేజ్లలో కొన్ని! ఆయనగారిలోని ‘అపరిచిత కాముడి’ తీరుపై ఆ బ్యాంకు మేనేజర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇది కాస్తా చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. పార్టీ పరువుపోతుందని మధ్యస్థాలకు పూనుకున్నారు. సేకరించిన వివరాల మేర కు..స్థానికంగా ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్న అధికారిణికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఆ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న టీడీపీ ముఖ్యనేత గురువారం రాత్రి 11.30 గంటల నుంచి పలు అసభ్యకకరమైన మెసేజ్లు బ్యాంకు మేనేజర్కు పెట్టారు. శుక్రవారం ఉదయాన్నే వీటిని గమనించిన ఆమె దిగ్భ్రాంతి చెందారు. తన భర్తకు తెలియజేశారు. ఆ తర్వాత తన సిబ్బందితో కలిసి ఆ ‘కాముకుడి’ని చడామడా దులిపేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పడి శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఇది పార్టీకి నష్టదాయకమని మరో నలుగురు టీడీపీ ముఖ్యనేతలు రంగంలో దిగారు. బ్యాంకు మేనేజర్ను, ఆమె భర్తను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆమెతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె భర్తతో సైతం ఓ హోటల్లో సుదీర్ఘంగా మధ్యస్తం చేసినా అది ఫలించలేదని తెలియవచ్చింది. లైంగిక వేధింపుల కేసు నమోదు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు, టీడీపీ నాయకుడు అత్తింజేరి బాలాజిపై 354ఏ సెక్షన్ కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
పాపాయికి మసాజ్
♦ పిల్లలకు మసాజ్ చేసే ఆయిల్ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే తరచుగా చేతులు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఒంటికి రుద్దిన ఆయిల్ కడుపులోకి పోయే అవకాశం ఉంది. ఆయిల్ కొనే ముందు తయారీకి ఏమేమి వాడారో లేబుల్ను చెక్ చేసుకోవాలి. వెన్న, మీగడ వంటివైతే ఏ ఇబ్బంది ఉండదు. ♦ మసాజ్ చేయడానికి ఆయిల్ను అరచేతిలోకి వంపుకుని రెండు చేతులతో రుద్ది పాపాయి ఒంటి మీద కొద్దిగా రాసి పాపాయి కదలికలను గమనించాలి. ముఖ్యంగా కళ్లలోకి చూస్తే కొత్త రకం స్పర్శకు స్వాగతం పలుకుతోందా వద్దని చిరాకు పడుతోందా అన్నది తెలుస్తుంది. కొంతమంది పిల్లలు ఒంటికి కొత్త స్పర్శ తగిలిన వెంటనే తల అడ్డంగా తిప్పుతూ, కాళ్లు చేతులు విదిలిస్తూ తమ అయిష్టతను వ్యక్తం చేస్తారు. అలాంటప్పుడు ఒంటికి నూనెను కొద్దికొద్దిగా రాస్తూ పాపాయిని మసాజ్కు మానసికంగా సిద్ధం చేయాలి. ఆ తర్వాత ఏ ఇబ్బందీ లేకుండా హాయిగా చేయించుకుంటారు. -
నేను ఏ తప్పూ చేయలేదు
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అక్రమంగా తన ఆస్తులను అటాచ్ చేసిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) భారీ రుణ కుంభకోణ నిందితుడు మేహుల్ చోక్సీ ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన వెల్లడించారు. ఆంటిగ్వా నుంచి పంపిన తొలి వీడియో మేసేజ్లో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్కు చెందిన రూ.13,500 కోట్ల రుణ కుంభకోణంలో ప్రధాన వ్యక్తుల్లో ఒకరిగా అనుమానిస్తున్న మేహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. చోక్సీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంలో...ఎలాంటి వివరణ లేకుండానే తన పాస్పోర్ట్ను సస్పెండ్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈడీ తనకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలన్నీ తప్పు అని, నిరాధారమైనవని ఆయన వివరించారు. తన ఆస్తులను అక్రమంగా అటాచ్ చేశారని ఆరోపించారు. భారత భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో తన పాస్పోర్ట్ను రద్దు చేస్తున్నట్లు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి తనకొక ఈ మెయిల్ వచ్చిందని వివరించారు. తన పాస్పోర్ట్పై విధించిన సస్పెన్షన్ను తొలగించాల్సిందని కోరుతూ ముంబై ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి ఒక మెయిల్ పంపానని, దానికి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. -
ఆర్టీసీ కార్యాలయంలో మసాజ్ సేవలు
ఉప్పల్: ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో ఓ అధికారి కింది స్థాయి సిబ్బందితో మసాజ్ చేయించుకుంటూ బహిరంగంగా దొరికిపోయా డు. లైసెన్స్ల కోసం కార్యాలయానికి వచ్చిన వారు దీనిని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ)గా పనిస్తున్న సురేష్రెడ్డి తన సీట్లోనే కూర్చుని బనియన్పై కిందిస్థాయి సిబ్బందితో మసాజ్ చేయించుకుంటుండటాన్ని గుర్తించిన కొందరు వ్యక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ఉంచారు. తప్పుగా అర్థం చేసుకోవద్దు : సురేష్రెడ్డి గత కొన్నేళ్లుగా వెన్ను నొప్పితో బాధపడుతున్నా. శుక్రవారం పని ఒత్తిడితో నొప్పి తీవ్రతరం కావడంతో గార్డెన్లో పనిచేసే వ్యక్తికి ఫిజియోథెరపీ తెలుసని చెప్పడంతో డ్యూటీ ముగిసిన తర్వాత మెడనరం వదిలించడానికి మెల్లగా నొక్కాడు. దయచేసి దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఉద్యోగితో మసాజ్ చేసుకునే తత్వంకాదు. -
ఒక్క ఫోన్కాల్.. రూ.42 లక్షలు మాయం
చిత్తూరు అర్బన్: ఒక్క ఫోన్కాల్.. ఇద్దరి వద్ద ఉన్న రూ.42 లక్షల్ని మాయం చేసింది. ఎవరు, ఏమిటని ఆలోచించకుండా సెల్ఫోన్కు వచ్చే కాల్స్కు, మెసేజ్లకు రిప్లై ఇవ్వడం ద్వారా బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.లక్షలు మోసపోయినట్లు గుర్తిం చారు. బాధితులు సోమవారం చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పోలీసు గ్రీవెన్స్డేకు ఏఎస్పీ రాధికను కలిసి గోడు వెల్లబోసుకున్నారు. గంగాధరనెల్లూరు మండలం ఎల్లమరాజులపల్లెకు చెంది న లోకనాథరెడ్డి భారత సైన్యంలో జేసీవోగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఇటీవల ఆయనకు ఒక ఫోన్కాల్ వచ్చింది. తాము ఢిల్లీలోని కోకా–కోలా శీతల పానీయం కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నారు. జిల్లాలో తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఏజెన్సీ ఇస్తామని నమ్మబలి కారు. తొలుత కాస్త అనుమానించినా ఫోన్లో అవతలివారి మాటలను బట్టి నమ్మేశాడు. ఇలా ఏజెన్సీ కోసం దశలవారీగా తన బ్యాంకు ఖాతా నుంచి రూ.33,56,361 డిపాజిట్ చేశాడు. అయినా ఇంకా కొంత డిపాజిట్ చేయాలని చెప్పడంతో లోకనాథరెడ్డి గట్టిగా కేకలు వేశాడు. దీంతో ఫోన్ స్విచ్ఆఫ్ చేసే శారు. ఏంచేయాలో తెలియని బాధితుడు ఏఎస్పీని కలిసి తన బాధను విన్నవించుకున్నాడు. చిత్తూరు నగరం ఎస్టేట్ రోడ్డులో ఉన్న రఘురామ్నగర్ కాలనీకి చెందిన అరుణకుమారి సెల్ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. అందులో శ్యామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇటీవల నిర్వహించిన లక్కీడిప్లో రూ.1.50 కోట్ల విలువైన బహుమతి గెలుచుకున్నారని, మెయిల్, ఫోన్, చిరుమానా చెప్పాలని ఉంది. ఆమె వివరాలు ఇచ్చింది. తర్వాత ఓ బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చి ఇందులో తాము చెప్పినంత నగదు డిపాజిట్ చేయాలని అవతలి వ్యక్తులు పేర్కొన్నారు. అరుణకుమారి తన ఖాతా నుంచి పలుమార్లు రూ.8.58 లక్షలు ఆ కంపెనీ చెప్పిన ఖాతాలోకి వేసింది. తీరా తాను మోసపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ రెండు ఘటనల్ని సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఏఎస్పీ అధికారులను ఆదేశించారు. -
బ్యూటిప్
ఒక టీ స్పూన్ మీగడలో అంతే మోతాదులో నిమ్మరసం కలిపితే హోమ్మేడ్ క్లెన్సింగ్ క్రీమ్ రెడీ. దీనిని ముఖానికి పట్టించి సున్నితంగా మర్దన చేసి పది నిమిషాల తర్వాత చన్నీటితో కాని గోరువెచ్చటి నీటితో కాని శుభ్రం చేయాలి. ఇది చర్మానికి టోనర్గా పనిచేస్తుంది. చర్మాన్ని తెల్లబరుస్తుంది కూడా. రోజుకు ఒక టేబుల్ స్పూన్ తేనెలో అంతే మోతాదులో ఉల్లిపాయరసం కలిపి చప్పరిస్తే క్రమంగా చర్మం కాంతిని సంతరించుకుంటుంది. టేబుల్ స్పూను శనగపిండి, ఒకటిన్నర టీ స్పూన్ల నీళ్లు, చెంచాడు తేనె కలిపి ముఖానికి రాసి, పదిహేను నిమిషాల తర్వాత కడిగితే ముఖం కాంతివంతంగా ఉంటుంది. నిమ్మరసంలో రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగితే ముఖం నిగనిగలాడుతుంది. -
అందమే ఆనందం
గంధం పొడి, శనగపిండి, బాదంపప్పు పేస్ట్లను టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. అందులో ఐదు రేకల కుంకుమపువ్వు, గుడ్డులోని తెల్లసొన, కొన్ని పచ్చిపాలను చేర్చి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి మూడుసార్లు ఈ విధంగా చేస్తుంటే చర్మానికి మెరుపు వస్తుంది. ఓ నిమిషం అరటిపండు గుజ్జులో ఒక స్పూను పెసరపిండి, మంచి గంధం, తేనె వేసి కలపాలి. దీనితో ముఖానికి ప్యాక్ వేసుకుని, పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. టమాటా గుజ్జులో కొద్దిగా తేనె కలిపి చేతులకు పట్టించాలి. అరగంట తర్వాత కాసిన్ని పచ్చిపాలతో మసాజ్ చేసి అప్పుడు కడిగేసుకుంటే... మృతకణాలు తొలగిపోతాయి. -
మసాజ్ + మ్యూజిక్ = ఆరా సెన్స్!
ఈ కాలపు ఉరుకులు, పరుగుల జీవితంలో ఒక రోజు గడిచిందంటే చాలు.. శరీరం నీరసించి పోతుంది.. ఎప్పుడెప్పుడు నడుం వాలుద్దామా అనిపిస్తూంటుంది. అలాంటప్పుడు చెవులకు ఇంపైన సంగీతం, ఒళ్లునొప్పులు దూరమయ్యేలా సున్నితమైన మసాజ్ ఉంటే ఎలా ఉంటుందంటారూ? ఓహో.. సూపర్ అంటున్నారా? అయితే ఫొటోలో కనిపిస్తున్న ఆరా సెన్స్ హైటెక్ వాలు కుర్చీ మీ కోసమే. లాస్వెగాస్లోని సీఈఎస్ 2018లో ప్రదర్శితమవుతున్న ఈ ఫ్రెంచ్ స్టార్టప్ కంపెనీ ఉత్పత్తి అక్షరాలా హైటెక్! అత్యాధునిక హ్యాప్టిక్ టెక్నాలజీల సాయంతో మృదువైన మసాజ్ చేస్తుంది ఇది. శరీరంలోని దాదాపు 32 చోట్ల ఒత్తిడి కలిగించడం ద్వారా పూర్తిగా రిలాక్స్ కావచ్చునని సంస్థ చెబుతోంది. అదే సమయంలో చెవులకు హెడ్ఫోన్స్ తగిలించుకుంటే ఇంపైన సంగీతం వినవచ్చునన్నమాట. కాకపోతే.. ఒక్కో ఆరాసెన్స్ కుర్చీ ఖరీదు దాదాపు రూ.12 లక్షల వరకూ ఉంటుంది! -
మంత్రికి కార్యకర్తల మసాజ్
అలహాబాద్(యూపీ) : పార్టీ కార్యకర్తలు ఓ మంత్రి కాళ్లుపట్టుకుని మసాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలహాబాద్ సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉత్తర ప్రదేశ్ మంత్రి నందగోపాల్ వరండా మీద పడుకుని ఉండగా.. బీజేపీకి చెందిన ఓ కార్యకర్త ఆయన కాళ్లు పట్టారు. ఆ తర్వాత మరో కార్యకర్త కూడా మంత్రి కాళ్లు పట్టుకొని మసాజ్ చేశారు. మంత్రి వరండాపై ప్రశాంతంగా పడుకోగా, ఆయన తల దగ్గర అలహాబాద్ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్షవర్ధన్ బాజ్పాయ్ కూర్చుని ఉన్నారు. మరికొందరు బీజేపీ కార్యకర్తలు అక్కడే నిల్చొని ఉన్నారు. ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగుచూసింది. నవంబర్ 22న ఉత్తర్ప్రదేశ్లోని అలహాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరు నెలల పనితీరుకు ఈ ఎన్నికలు కొలమానంగా భావిస్తోంది బీజేపీ. దీంతో ఎలాగైనా అలహాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. ఈ క్రమంలో మంత్రి నందగోపాల్ అలహాబాద్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాస్త ఎక్కువగా నడవడంతో అలసిపోయి ఓ కార్యకర్త ఇంటికి వెళ్లి వరండాపై పడుకున్నారు. మంత్రి కాళ్లు నొప్పి పుట్టాయని భావించిన కార్యకర్తలు..వెంటనే ఆయన కాలికి మసాజ్ చేయడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత ఒకరు ఆయన కాళ్లు పడుతున్నా మంత్రి కనీసం వారిని వారించలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు మంత్రిపై మండిపడుతున్నారు. మంత్రి కాళ్లు పట్టుకొని మసాజ్ చేసిన కార్యకర్తలు -
మంత్రికి మసాజ్ చేసిన కార్యకర్తలు
-
ఏఎస్ఐ హసన్పై సస్పెన్షన్ వేటు
సాక్షి, గద్వాల : మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న గద్వాల ఏఎస్ఐ హసన్పై సస్పెన్ష్ వేటు పడింది. ఏఆర్ ఏఎస్ఐ హసన్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీచేశారు. ఏఎస్ఐ హసన్...ఓ మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న వీడియో బయటకు రావడంతో జిల్లాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. జిల్లా సాయుధ రిజర్వు పోలీసు కార్యాలయంలో సిబ్బంది విశ్రాంతి గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా హోంగార్డ్తో ఏఎస్ఐ వ్యక్తిగత సేవలు చేయించుకున్నాడు. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం వెలుగుచూసింది. -
బరితెగించిన ఏఎస్ఐ..
సాక్షి, జోగుళాంబ: జిల్లాలోని ఓ ఏఎస్ఐ బరితెగించాడు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఓ మహిళా కానిస్టేబుల్తో మసాజ్ చేయించుకుంటూ సిక్రెట్గా అమర్చిన కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. జోగులాంబ గద్వాల్ సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ గత కొద్దికాలంగా కిందిస్థాయి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను సాక్ష్యాలతో పట్టుకోవాలనుకున్న కొంతమంది సీక్రెట్ కెమెరాలు అమర్చారు. స్టేషన్ విశ్రాంతి గదిలో మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటున్నట్లు ఉన్నఈ వీడియోను సోమవారం మీడియాకు అందజేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ వెంటనే విచారణకు ఆదేశించారు. -
మహిళా హోమ్ గార్డుతో ఏఎస్ఐ మసాజ్
-
స్ట్రాబెర్రీ మసాజ్
పది స్ట్రాబెర్రీ కాయలు, రెండు టేబుల్ స్పూన్ల ఆప్రికాట్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్, రెండు టీ స్పూన్ల రాతి ఉప్పు తీసుకుని అన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టించి పది నిమిషాల తర్వాత చర్మాన్ని సున్నితంగా మర్దన చేస్తే ఆరిన మిశ్రమంతోపాటు చర్మంలోని మురికి, మృతకణాలు పోతాయి. తర్వాత మామూలుగా స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే రెండు వారాల్లోనే చర్మసౌందర్యంలో వచ్చిన మార్పును గమనించవచ్చు. -
సీఐ మసాజ్ బాగోతంపై సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్ : సరూర్నగర్ సిఐ లింగయ్య తన స్టేషన్లో హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న బాగోతంపై రాచకొండ కమిషనర్ సీరియస్ అయ్యారు. కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ మహేష్ భగవత్ దీనిపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని డీసీపీ(అడ్మిన్) ప్రకాష్రెడ్డిని సంఘటనపై విచారణ అధికారిగా నియమించారు. వివరాల్లోకి వెళితే... సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సుందరి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. స్టేషన్లో పనిచేసే హోంగార్డుతో ఇంటి వద్ద బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు మీడియా ఛానెల్లో హల్చల్ చేశాయి. మన్సూరాబాద్లోని ఇంటివద్ద సీఐ లింగయ్య యూనిఫామ్లో ఉన్న హోంగార్డు సైదానాయక్తో బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే మీడియాలో ప్రసారం అయిన దృశ్యాల్లో ఉన్నది తాను కాదని, తనకు మసాజ్ చేయించుకోవటంకానీ, మద్యం సేవించే అలవాటు అసలే లేదని సీఐ లింగయ్య పేర్కొన్నారు. సైదానాయక్ అనే హోంగార్డు అక్టోబర్ 14న రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సెలవులో ఉన్నాడని, అనంతరం ఇక్కడినుంచి బదిలీపై వెళ్ళాడని అన్నారు. మూడు నెలలుగా సరూర్నగర్లో హోంగార్డు లేడని ఆయన స్పష్టం చేశారు. తనపై గిట్టనివాళ్లే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. -
బ్యూటిప్స్
ఆముదం, కొబ్బరినూనె సమపాళ్లలో కలిపి వేడిచేయాలి. ఈ నూనె గోరు వెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్ల వరకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. రెండు గంటల తర్వాత హెర్బల్ షాంపూతో తలంటుకోవాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఎండ, దుమ్ము, ధూళి వల్ల జుట్టు రాలిపోవడమే కాక, జీవం లేనట్టుగా కనిపిస్తుంటుంది కూడ. కప్పు పాలలో ఒక కోడిగుడ్డు సొన కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత కేశాలను శుభ్రపరుచుకోవాలి. వారానికి ఓసారి ఈ విధంగా చేస్తుంటే శిరోజాలు నిగనిగలాడుతూ కనిపిస్తాయి. -
ఆరోగ్యవంతమయిన చర్మం కోసం...
బ్యూటిప్స్ అర కప్పు పెసరపిండిలో టేబుల్ స్పూన్ పెరుగు, పేస్ట్ చేయడానికి సరిపడా నీటిని కలపాలి. ఈ మిశ్రమంతో ముఖాన్ని అయిదు పది నిమిషాల పాటు మర్దనా చేసి, ఆ తరవాత చన్నీటితో కడిగేయాలి.రెండు టీ స్పూన్ల శనగపిండిలో సరిపడా తేనె కలపాలి. ముఖానికి పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. కొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే కాంతివంతమయిన చర్మం మీ సొంతం అవుతుంది. -
మసాజ్ ముసుగులో వ్యభిచారం
-
మసాజ్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో మాదాపూర్ , గచ్చిబౌలి , రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 మసాజ్ సెంటర్లు , స్పాల పై సైబరాబాద్ స్పెషల్ టీమ్ పోలీసులు దాడులు నిర్వహించారు. 30 మంది యువతులను , 25 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖుల పుత్ర రత్నాలు ఉన్నట్టు సమాచారం. వీళ్లని అదుపులోకి తీసుకున్న మాదాపూర్ పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. థాయిలాండ్ దేశానికి చెందిన 20మంది మహిళలు, మేఘాలయ ,త్రివేండ్రం, సిక్కింకు చెందిన మహిళలు ఉన్నారు. టూరిస్ట్ వీసాపై విదేశీ మహిళలతో క్రాస్ మసాజ్తో పాటు సెక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. -
తెల్లదనమా? వద్దనే వద్దు!
బ్యూటిప్స్ నలభై ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం సహజంగా వచ్చే మార్పే కాని, ఈ జనరేషన్లో పదేళ్లకే తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. సమస్య స్పష్టంగా అద్దంలో కనిపించిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ముందుగా జాగ్రత్తపడితే మంచిది కదా! రెండు వందల మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూను కర్పూరం పొడిని కలిపి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మసాజ్ చేసుకోవాలి.తలస్నానానికి కుంకుడుకాయ, శీకాయవంటి సహజమైన షాంపూలనే వాడాలి. తలస్నానానికి ముందు పది నిమిషాల సేపు తలకు వేడినీటిలో ముంచిన టవల్ను చుడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలస్నానం పూర్తయిన తరువాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలని మసాజ్ చేయడం వల్ల సెబాసియస్ గ్రంథులు ఉత్తేజితం కావడంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. రోజూ నూనె పెట్టడం సాధ్యం కానప్పుడు వారానికి కనీసం రెండుసార్లయినా ఆముదం లేదా కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల కలిగే మేలు శరీరానికి మాత్రమే కాదు కేశాలకు కూడ. వ్యాయామం మనసుకు ప్రశాంతత నిస్తు్తంది. కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతి రోజూ తలకు పట్టిస్తుంటే చుండ్రు సమస్య తగ్గడంతోపాటు కేశాలు నల్లబడతాయి. వీటితోపాటుగా చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారించాలంటే కాఫీ, టీ, మసాలాలు తగ్గించాలి వీలయితే పూర్తిగా మానేయాలి. -
కళ్లకింద వలయాలను వెళ్లగొడదాం...
బ్యూటిప్స్ కొందరికి పనివత్తిడివల్ల లేదా ఇతర కారణాల వల్ల కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అందవికారంగా అనిపించడమే కాకుండా అనారోగ్యాన్ని కూడా సూచిస్తాయి. అలాంటప్పుడు కళ్లచుట్టూ స్వచ్ఛమైన ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసి తేలిగ్గా మసాజ్ చేయాలి. ఇందుకు ఉంగరం వేలిని ఉపయోగిస్తూ ఒక్కో కంటికి ఒక్కో నిమిషం చొప్పున చేసి పదిహేను నిమిషాల తర్వాత తడిదూదితో తుడిచేయాలి. ఇలా కొన్నిరోజులపాటు చేయాలి. కీరా రసం, బంగాళదుంప రసం సమపాళ్లలో తీసుకుని కళ్లకింద రాసి 20 నిమిషాలు ఆగి నీటితో కడిగేయాలి. బయటకు వెళ్లేముందు ఒకచుక్క నీటిని అద్ది సన్స్క్రీన్ను కళ్లకింద అప్లై చేయడం వల్ల కళ్లకింద వలయాలు ఏర్పడకుండా ఉంటాయి. కొందరికి కళ్లకింద సంచుల్లా ఉబ్బెత్తుగా ఉంటుంది. అలాంటివారు వాడేసిన టీ బ్యాగ్స్ను ఫ్రిజ్లో పెట్టి తీసి, వాటితో కళ్లమీద కాచినట్లు చేయాలి. అలా చేస్తుంటే తొందరలోనే తగ్గిపోతాయి. -
‘కత్తి’లాంటి మసాజ్
చాలా రకాల మసాజ్లను మనం చూశాం.. కానీ ఇలాంటిది ఎక్కడైనా చూశామా? మటన్ కత్తులతో మసాజ్.. కీమా కొట్టినట్లు లయబద్ధంగా మన శరీరంపై అవి నాట్యం చేస్తుంటే..కొందరికైతే.. టెన్షన్ తగ్గడానికి బదులు మరింత పెరుగుతుందేమో.. ఈ కత్తిలాంటి మసాజ్ మీకూ కావాలంటే తైవాన్లోని తైపీకి వెళ్లాల్సిందే.. అక్కడ హియో మీ ఫాంగ్ అనే మహిళ తమ సెంటర్లో ఈ చిత్రమైన మర్దన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 2,500 ఏళ్ల క్రితం నుంచి ఈ తరహా మర్దన కార్యక్రమం ఉందట. చైనాలో ఫస్ట్ టైం చేశారట. తొలుత చాలా మంది ఇదేదో సరదా కోసం చేస్తున్నదని భావించినా.. మసాజ్ పూర్తయిన తర్వాత దాని ఫలితాలను చూశాక.. ఇది చేయించుకోవాలని తమకు తెలిసినవారికి సిఫార్సు చేస్తున్నారని ఆమె తెలిపారు. దీని వల్ల కణాలు పునరుజ్జీవం కావడంతోపాటు శరీరం అంతా రిలాక్స్గా అయిపోతుందని చెప్పారు. ఇది చేయించుకున్నప్పుడు శరీరంలో కరెంటు ప్రవహిస్తున్నట్లు అనిపించిందని ఓ వ్యక్తి తెలిపారు. దీని వల్ల తన మెడనొప్పి తగ్గిందన్నారు. -
ఆయిల్ మసాజ్
బ్యూటిప్స్ వార్ధక్యం కారణంగా వచ్చే ముడతలు, డెలివరీ తర్వాత పొట్టమీద వచ్చే స్ట్రెచ్మార్క్స్ పోవడానికి, ఎండకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి తెల్లబడడానికి సాండల్వుడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. పైగా ఎండకాలంలో ఈ ఆయిల్ వాడకం వల్ల శరీరానికి చక్కటి సాంత్వన కలుగుతుంది. ఈ ఆయిల్ను నేరుగా కాని మరేదైనా ఆయిల్తో కలిపి కాని మర్దన చేయవచ్చు. సాండల్వుడ్ ఆయిల్ సౌందర్యాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎగ్జిమా, ర్యాష్ కారణంగా వచ్చిన వాపులకు ఈ ఆయిల్తో మర్దన చేస్తే తక్షణ ఉపశమనం ఉంటుంది. -
కేశ సౌందర్యం
అందమె ఆనందం ⇒ కొబ్బరి నూనె, ఆముదం ఒక్కొక్కటి ఒక కప్పు తీసుకుని అందులో అర కప్పు కరివేపాకు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే కరివేపాకు గలగలలాడే వరకు మరిగించి దించిన తర్వాత రెండు – మూడు కర్పూరం ముక్కలు వేసి చల్లారిన తర్వాత వడపోయాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రి పూట తలకు పట్టించి మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే కుదుళ్లు గట్టిపడి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది. నూనె మిశ్రమాన్ని ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని నిలవ చేసుకుని వాడుకోవచ్చు. ⇒ కరివేపాకు, తులసి, మందార పూల రసాన్ని కొబ్బరి నూనెలో కలిపి మరిగించిన మిశ్రమాన్ని రాత్రి తలకు పట్టించి ఉదయం తలస్నానం చేస్తే కేశాలు నిగనిగలాడతాయి. ఇలా వారానికి ఒకటి రెండు సార్లు చేయాలి. ⇒క్రమం తప్పకుండా వారానికొకసారి కొబ్బరి నూనెతో మర్దన చేసినా కూడ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ⇒నాలుగు కప్పుల నీళ్లలో ఒక కప్పు ఉసిరిక కాయలు, చిటికెడు ఉప్పు వేసి నీళ్లు ఒక కప్పుకు వచ్చేదాకా మరిగించాలి. ఆ నీటిలో రెండు కప్పుల గోరింటాకు, ఒక కోడిగుడ్డు, నిమ్మరసం (ఒక కాయది) కలిపి జుట్టుకుదుళ్లకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది, ఆరోగ్యంగా నిగనిగలాడుతుంది. ⇒గుప్పెడు ఉసిరిక కాయలను ఒక కప్పు పాలలో నానబెట్టి రెండు గంటల తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. ⇒ఒక టేబుల్ స్పూన్ గోరింటాకు పొడిలో ఒక కోడిగుడ్డు సొన, ఒక టీ స్పూన్ నిమ్మరసం, ఒక టీ స్పూన్ ఇన్స్టంట్ కాఫీ పొడి లేదా కాఫీ డికాషన్ కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి ముప్పావు గంట తర్వాత తలస్నానం చేస్తే కేశాలు మృదువుగా, ఆరోగ్యంగా ఉంటాయి. -
జామపండు ఫేషియల్ ప్యాక్
బ్యూటిప్స్ బాగా పండిన జామ పండును తీసుకుని రెండు భాగాలుగా చేయాలి. మధ్యలో ఉండే గింజలను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆ ముక్కలకు రెండు లేదా మూడు జామాకులను కలపి పేస్ట్ చేసుకోవాలి. ఒక స్పూను పేస్ట్ను చిన్న బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పేస్ట్లో రెండు స్పూన్లు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జిడ్డు చర్మం వాళ్ళు అర స్పూను ఉప్పును వేసుకోవాలి. ముందుగా ముఖాన్ని నీటితో కడిగి క్లెన్సింగ్ చేయాలి. పేస్ట్ను ముఖంపై వలయాకారంలో రబ్ చేయాలి. పది నిమిషాలపాటు మసాజ్ చేసి తడి కాటన్ బాల్స్తో ముఖాన్ని క్లీన్ చేయాలి. ఫేషియల్ ప్యాక్ను తీసుకుని ముఖానికి పొరలు పొరలుగా అప్లై చేసుకుని పావుగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ను వారానికోసారి చేస్తే యాక్నే సమస్య రాకుండా ఉంటుంది. చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. -
ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. మసాజ్!
అమృత్సర్: పంజాబ్లో ఓ పోలీస్ అధికారి అమానుష ప్రవర్తనకు సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారింది. స్టేషన్కు ఓ సమస్యపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తితో పోలీస్ అధికారి మసాజ్ చేయించుకున్నాడు. ఫిర్యాదుదారుడితో.. అతడి కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోలీసు అధికారి మసాజ్ సరదా తీర్చుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించిన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రబ్జోత్ సింగ్.. సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. -
బ్యూటిప్స్
రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టుకొని, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. దూది ఉండను ఈ నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలకూ తొలగిస్తాయి. దురద, దద్దుర్లు లాంటివాటినీ, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. పచ్చిపాలు, అలొవెరా జెల్, తేనె టీ స్పూన్ చొప్పున తీసుకొని, అందులో ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు కలపాలి. ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకొని, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత పాల మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని, ముఖానికి రాసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఆరేంత వరకు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మకాంతి పెరుగుతుంది. -
నిద్రలేమితో బాధపడుతుంటే...
హెల్త్టిప్స్ ఒక గ్లాసు వేడిపాలలో ఒక టీ స్పూన్ తేనె కలిపి రాత్రి పడుకోవడానికి అరగంట ముందుగా తాగితే బాగా నిద్రపడుతుంది. పాలతో అరిపాదాలకు మసాజ్ చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు పెరుగు తీసుకుని తలకు పట్టించి, పది నిమిషాల సేపు మర్దన చేసి తలస్నానం చేస్తుంటే నిద్రలేమి సమస్య బాధించదు. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది. {పతిరోజూ రాత్రి అర కప్పు సొరకాయ రసంలో, అంతే మోతాదులో నువ్వులనూనె కలిపి తలకు మర్దన చేయాలి. అలాగే సొరపాదు ఆకులను ఉడకబెట్టి ఆహారంతోపాటు తీసుకుంటే కూడా మంచి ఫలితాన్నిస్తుంది కప్పు నీటిలో రెండు టీ స్పూన్ల తేనె కలిపి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. 350 ఎం.ఎల్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు లేదా సోంపు పొడి వేసి మరిగించాలి. పాత్రకు మూత పెట్టి సన్న మంట మీద పదిహేను నిమిషాల సేపు ఉడికించి, వడపోసి, వేడిగా కాని గోరువెచ్చగా కాని తాగాలి. రుచికోసం తగినంత తేనె, పాలను కూడ కలుపుకోవచ్చు. ఈ టీని రాత్రి భోజనం తర్వాత లేదా నిద్రపోయే ముందు తాగవచ్చు. -
నవనవలాడే చర్మానికి... నైట్ టైమ్ లోషన్
బ్యూటిప్స్ పగటి పూట కంటే రాత్రివేళలో తీసుకునే జాగ్రత్తలే చర్మాన్ని మరింత ఆరోగ్యవంతం చేస్తాయి. ఇందుకు ఇంట్లోనే నైట్క్రీమ్ను తయారుచేసుకుని ఉపయోగించవచ్చు.ఒక గిన్నెలో బాదం నూనె, బీస్ వ్యాక్స్, కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. సువాసన రావడానికి ఒక్క చుక్క రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని బాటిల్లో పోసుకుని, ఫ్రిజ్లో పెట్టుకోవాలి. రాత్రిపూట, మేకప్ తీసేసిన తర్వాత ఈ లోషన్ని కొద్దిగా వేణ్ణీళ్లతో తీసుకుని ముఖానికి సున్నితంగా మసాజ్ చేసినట్టుగా రాసుకోవాలి. తర్వాత టిష్యూ పేపర్తో లోషన్ను పూర్తిగా తుడిచేయాలి. అలాగే చేతులకూ, పాదాలకూ రాసుకుని వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల చర్మం పొడిబారదు. నవనవలాడుతూ కనిపిస్తుంది. -
స్కిన్ టైట్నింగ్
బ్యూటిప్స్ రెండు లేదా మూడు క్యాబేజీ ఆకులు, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, గుడ్డు తెల్ల సొన తీసుకుని అన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. అవసరమైతే నీటిని కలుపుకోవచ్చు. పొడి చర్మం వాళ్ళు మూడు చుక్కలు ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ను కలుపుకోవచ్చు. ఈ పేస్ట్ని ముఖమంతా అప్లై చేసుకోవాలి. మసాజ్ చేయకూడదు. ప్యాక్ టైట్ అయ్యేంతవరకూ లేదా ప్యాక్ పొడిబారేంత వరకూ ఉంచుకుని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా, వదులు అవకుండా ఉంటుంది. ఇంట్లోనే బ్లీచింగ్ తయారి: బాగా మరిగిన పాలు చల్లారిన తర్వాత పై మీగడను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ముఖాన్ని నీటితో కడిగి శుభ్రం చేసుకోవాలి. తయారుచేసుకున్న బ్లీచ్ను ముఖమంతా అప్లై చేసుకోవాలి. వేలితో ముఖంపై నెమ్మదిగా వలయాకారంలో రబ్ చేయాలి. పది నిముషాలపాటు ఉంచుకుని కడిగేసుకోవాలి. తేడా మీరే గమనిస్తారు. మార్కెట్లో లభించే బ్లీచ్ కంటే బాగా పనిచేస్తుంది. -
బ్యూటిప్స్
మోచేతులు దగ్గర చర్మం పొడిబారి, నల్లగా ఉంటుంది. ఇటువంటి చర్మాన్ని క్యారెట్ మామూలుగా చేయగలదు. దీనికోసం క్యారెట్ జ్యూస్లో పంచదార, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు మోచేతిపై మసాజ్ చేస్తుండాలి. మెడ చుట్టూ ఉండే చర్మం అప్పుడప్పుడు నల్లగా మారతుంటుంది. అలాంటప్పుడు క్యారెట్ జ్యూస్, నిమ్మరసం, పంచదార పొడి మూడింటినీ కలుపుకోవాలి. ముందుగా నెక్ అంతటా నూనె అప్లై చేసుకుని తర్వాత క్యారెట్ మిశ్రమంతో మసాజ్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కప్పు పాలలో గుప్పెడు ఉసిరికాయల్ని రెండు గంటలపాటు నానబెట్టాలి. ఆ తరువాత పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటలపాటుంచి తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా అవుతుంది. పెరుగులో మెంతులు వేసి రాత్రంతా నానబెట్టాలి. ఈ మిశ్రమంలో మందారం ఆకులను వేసి పేస్ట్ చేసి జుట్టు కుదుళ్ల నుండి కొసళ్ళ వరకూ పట్టించి అరగంట వరకు పాటు ఉంచుకుని తలస్నానం చేస్తే జుట్టు మెత్తగా, సిల్కీగా ఉంటుంది. ఉల్లిపాయ రసం, తేనె, రాళ్ళ ఉప్పు మూడింటిని కలిపి మొటిమలపై రాసి, 20 నిముషాలకు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే యాక్నే మచ్చలు తొలగిపోతాయి. -
కోమలమైన పాదాలు..
సరైన శుభ్రత పాటించకపోతే పాదాలు, చేతులు అందవికారంగా కనిపిస్తాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే రోజూ సరైన జాగ్రత్తలు పాటించాలి. * ఉల్లిపాయను నూరి, ఆ ముద్దను మడమల మీద రాసి, 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే కాలి పగుళ్లు తగ్గుతాయి. * రోజూ రాత్రి పడుకునే ముందు ఆవనూనె పాదాలకు, చేతులకు రాసుకోవాలి. * అర కప్పు పెరుగులో అర టీ స్పూన్ వెనిగర్ కలిపి పాదాలకు మసాజ్ చేయాలి. * క్యాండిల్ వ్యాక్స్, ఆవనూనె కలిపిన మిశ్రమాన్ని రాత్రిపూట కాలి పగుళ్లకు రాసి సాక్స్ ధరించాలి. నిద్ర లేచాక శుభ్రపరుచుకోవాలి. * తాజా గులాబీ పువ్వులు కప్పు, అరకప్పు పాలు కలిపి మెత్తగా నూరాలి. దీంట్లో టీ స్పూన్ శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు, చేతులకు పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రపరచాలి. * పెట్రోలియమ్ జెల్లీలో టీ స్పూన్ విటమిన్ ‘ఇ’ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. * బొప్పాయి అరకప్పు, పైనాపిల్ అర కప్పు, తేనె నాలుగు టేబుల్స్పూన్లు కలిపి పాదాలకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. -
బ్యూటిప్స్
ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ బాదం పొడి తగినన్ని నీళ్లు కలిపిన మిశ్రమాన్ని కలిపిన వెంటనే ముఖానికి ప్యాక్ వేయాలి. పది- పదిహేను నిమిషాల తర్వాత మెల్లగా మర్దన చేసినట్లు రుద్దుతూ కడగాలి. తర్వాత పన్నీరు కాని మాయిశ్చరైజర్ కాని అప్లై చేయాలి. ఇది సున్నితమైన చర్మానికి, సాధారణ చర్మానికి చక్కటి మాస్క్. క్రమం తప్పకుండా ఈ మాస్క్ వేస్తుంటే చర్మం బంగారు రంగులో కాంతులీనుతుంది. వారానికి కనీసం రెండుసార్లయినా ఆయిల్తో శరీరాన్ని మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ సరిగా జరిగి చర్మం సున్నితంగా, కాంతివంతంగా తయారవుతుంది. -
ఫిర్యాదుకు వెళ్తే.. కాళ్లు నొక్కించుకున్న పోలీస్
-
ఫిర్యాదుకు వెళ్తే.. కాళ్లు నొక్కించుకున్న పోలీస్
లక్నో: ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఓ వ్యక్తి పట్ల మోహన్ లాల్ గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ఓ) అమానుషంగా ప్రవర్తించాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే తన కాళ్లు నొక్కాలంటూ ఎస్ హెచ్ఓ రామ్ యాగ్య యాదవ్ అతనికి చెప్పాడు. గత్యంతరం లేక ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తి ఎస్ హెచ్ఓ కాళ్లు నొక్కాడు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన మొత్తం వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయింది. వీడియోలో చూపిన ప్రకారం.. సమస్యను పోలీసులతో చెప్పుకోవడానికి వెళ్లిన వ్యక్తిని తొలుత యాదవ్ అవమానించాడు. తర్వాత తన కాళ్లు నొక్కాలని అతనికి చెప్పాడు. యాదవ్ అలా చెప్పడాన్ని ఆ వ్యక్తి మొదట జోక్ గా భావించాడు. కానీ బలవంతంగా యాదవ్ అతనితో తన కాళ్లు నొక్కించుకున్నాడు. కుర్చీలో కూర్చుని ఫోన్ మాట్లాడుతూ అతనితో కాళ్లు పట్టించుకున్నాడు. స్టేషన్ లో మిగిలిన అధికారుల అందరూ అక్కడే ఉండి ఈ ఉదంతాన్ని చూస్తూ నిలబడిపోయారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) మంజిల్ సైనీ... ఎస్ హెచ్ఓ యాదవ్ ను సస్పెండ్ చేసి, విచారణకు ఆదేశించారు. అయితే, ఆ వ్యక్తి ఏ సమస్యపై ఫిర్యాదు చేయడానికి వెళ్లాడన్న వివరాలు తెలియరాలేదు. -
మెడనొప్పి మరీ తీవ్రం...
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. నాకు మెడనొప్పి వస్తోంది. ఇటీవల అది మరీ తీవ్రమైంది. మందులు వాడటం అంటే నాకు కాస్త భయం. నొప్పి తగ్గడానికి జాగ్రత్తలు చెప్పండి. - సుధాకర్, నల్లగొండ మనం నిల్చునే, కూర్చొనే భంగిమలు సరిగా లేకపోవడం వల్లనే మెడనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూస నుంచి మెదడులోకి వెళ్లే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్ ఆర్టరీస్ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్ రక్తప్రసారంలో తేడాలు వచ్చి మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవచ్చు. దీనివల్ల నొప్పితో పాటు తలతిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతులు కావడం జరుగుతుంది. మెడ దగ్గర ఉండే వెన్నుపూసల్లో ఏడు పూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్ అని, రెండో వెన్నుపూసను యాక్సిస్ అని అంటారు. ఆ తర్వాత వెన్నుపూసలను 3, 4, 5, 6, 7 అని నెంబర్లతో పిలుస్తారు. ఇవన్నీ ఒకదానితో మరొకటి జాయింట్ అయినట్లుగా అమరి ఉంటాయి. అందులో ఏర్పడ్డ బోలు ప్రదేశంలో స్పైనల్కార్డ్ అంటే వెన్నుపాము ఉంటుంది. మెదడు నుంచి కాళ్లకు, చేతులకు నరాలను తీసుకెళ్తూ ఉంటుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఖాళీ స్థలం ఇంటర్ వర్టిబ్రల్ పారామినా నుంచి ఒక్కొక్కనరం బయటకు వస్తుంది. ఈ నరాలు ఒక్కోవైపునకు విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్ ఒక షాక్ అబ్జార్బర్లా పనిచూస్తుంది. డిస్క్కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువును బ్యాలెన్స్ చేయడానికి ఇది దోహదపడుతుంది. నిర్ధారణ మెడనొప్పి వచ్చే వారికి ఎక్స్-రే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్-రే బట్టి మెడపూసల్లో ఏవైనా తేడాలు ఉన్నాయా అని తెలుసుకొని దాన్ని బట్టి చికిత్స చేస్తారు. సూక్ష్మమైన సమస్యలు ఉన్నవారికి ఎమ్మారై స్కాన్ ద్వారా పరీక్షలు నిర్వహించి, దాని సహాయంతో ఏ నరం మీద ఎంత ఒత్తిడి ఉంది తెలుసుకోవచ్చు. ఆ ఒత్తిడి దేని వల్ల వచ్చింది, ఏదైనా ఎముక ఫ్రాక్చర్ అయిందా, నరాల్లో వాపు ఏమైనా ఉందా, గడ్డలు ఉన్నాయా వంటి అంశాలను తెలుసుకోవచ్చు. డిస్క్ ప్రొలాప్స్ (డిస్క్ తాను ఉన్న స్థానం నుంచి తొలగడం) జరిగితే... ఆ సమస్య ఎంత మేర ఉందో గమనించి, దానికి చికిత్స చేస్తారు. జాగ్రత్తలు ఇవి... మెడ నొప్పి వచ్చినప్పుడు వేడినీళ్లలో మెత్తటి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం పెట్టడం లేదా ఐస్ ముక్కను గుడ్డలో చుట్టి కాపడం పెట్టడం వల్ల సాధారణ నొప్పి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు వాటికి తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే... అలా నొప్పి వస్తుందంటే కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి. అందుకే విశ్రాంతి ఇవ్వాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఫిజియోథెరపిస్ట్ను కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్ ఎక్సర్సైజ్లు తెలుసుకొని వాటిని క్రమం తప్పకుండా చేయాలి సాధారణ నొప్పి అయితే పెయిన్కిల్లర్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. వాటిని రాస్తూ సున్నితంగా రోజుకు ఐదారుసార్లు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది బరువైన బ్యాగ్లను ఒకే భుజానికి తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలపై, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది నడిచేటప్పుడు ఒకేవైపునకు ఒంగడం సరికాదు. -
సహజమైన రంగు...
బ్యూటిప్స్ హెయిర్ కలర్స్ వాడకం వల్ల వాటిలోని రసాయనాలు కొందరి చర్మతత్త్వానికి సరిపడకపోవడం, జుట్టు సహజమైన కాంతి కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. వీటికి విరుగుడుగా కురులకు మంచి అందాన్ని, రంగును ఇచ్చేవి ప్రకృతిలోనే సహజసిద్ధమైనవి ఉన్నాయి. వాటిలో... ఎర్రని బంతిపూలను వేసి, బాగా మరిగించిన కప్పుడు నీటిని మాడునుంచి శిరోజాలకు పూర్తిగా పట్టించాలి. గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. తలలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలు ఎర్రగా అవుతాయి. జట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారికి ఇది ఆర్గానిక్ హెయిర్ డైలా ఉపయోగపడుతుంది. బీట్రూట్ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. కురులకు కొద్దిగా పర్పుల్ కలర్ వస్తుంది. హెయిర్ కలర్స్ వాడే యువతరపు జుట్టుకు ఇది మంచి ఆప్షన్. హెయిర్ కలర్స్ వాడేవారు జుట్టు పొడిబారి వెంట్రుకుల బిరుసుగా అవుతాయనుకుంటే... టేబుల్ స్పూన్ పెరుగులో పెసరపిండి కలిపి, రెండు రోజులు బయటే ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే కలర్లో ఉండే రసాయనాల ప్రభావం తగ్గడమే కాకుండా వెంట్రుకలు మృదువుగా అవుతాయి. -
జుట్టు మెరుపు కోల్పోకుండా ఉండాలంటే...
బ్యూటిప్స్ పొడిబారిన జుట్టు అందవిహీనంగా కనిపించేలా చేస్తుంది. అంతే కాదు, జుట్టు రాలడం, వెంట్రుకలు చిట్లడం, తెల్లబారడం.. వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. ఈ సమస్య దరిచేరకుండా ఉండాలంటే... తల స్నానం చేయడానికి ముందు తలకు నూనె పట్టించి, మర్దనా చేయాలి. కనీసం వారానికి ఒకసారైనా ఈ జాగ్రత్త తప్పనిసరి. తలంటుకోవడానికి హైడ్రేటింగ్ షాంపూనే ఎంచుకోవాలి. షాంపూ పాకెట్ లేదా బాటిల్ మీద ఫర్ డ్రై హెయిర్, నార్మల్ హెయిర్.. అనే సూచన ఉంటుంది. డ్రై హెయిర్కి అని ఉన్నదాంట్లో హైడ్రేటింగ్ గుణాలు ఎక్కువ ఉంటాయి. అలొవెరా శాతం ఎక్కువ షాంపూలను కూడా పొడిజుట్టుగలవారు ఎంచుకోవచ్చు. నాణ్యమైన హెయిర్ సీరమ్ను ఎంచుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి కురులైనా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకల చివరలను కత్తిరించడం, సీరమ్ వాడటం వంటి జాగ్రత్తలు తప్పనిసరి. వారానికి ఒక్కసారి హైడ్రేటింగ్ మాస్క్ వేసుకోవాలి. అంటే షాంపూతో తలంటుకున్న తర్వాత కండిషనర్ని తప్పక ఉపయోగించాలి. తడి జుట్టుకు హెయిర్ క్రీమ్ మాడుకు తగలకుండా రాయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ కేశసంపద దెబ్బతినకుండా మృదువుగా, నిగనిగాలాడేలా ఉంటుంది. -
పాదాలు పదిలం
బ్యూటిప్స్ వర్షాకాలం పాదాల సంరక్షణ కష్టంగానే ఉంటుంది. రోజువారీ తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తల వల్ల పాదాల ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు. కప్పు మామిడిపండు గుజ్జు, కప్పు పెరుగు, అరకప్పు ఓట్స్, మూడు టీ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు స్క్రబ్గా ఉపయోగించాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. పాదాల చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. చేతులు, పాదాలపై ట్యాన్ పోవాలంటే మామిడిపండు గుజ్జులో, టీ స్పూన్ తేనె కలిపి ఐదు నిమిషాలు మసాజ్ చేయాలి. మరో ఐదు నిమిషాల తర్వాత శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి.ఐదు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్, కప్పుడు వైట్ వెనిగర్, గోరువెచ్చని నీళ్లలో కలపాలి. ఆ నీటిలో పాదాలను పదిహేను నిమిషాలు ఉంచాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ విధంగా చేస్తుంటే కాలి పగుళ్లు తగ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా అవుతుంది. వాన నీళ్లలో నానితే వేళ్ల మధ్య తడి వల్ల ఫంగస్ చేరుతుంటుంది. ఇలాంటప్పుడు బేకింగ్ పౌడర్లో మూడు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి, పాదాలకు, వేళ్ల మధ్య రాసుకోవాలి. ఫంగస్ తగ్గడంతో పాటు చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాళ్లు, పాదాల చర్మం పొడిబారి పొలుసులుగా కనిపిస్తుంటుంది. సీ సాల్ట్లో కొద్దిగా పాలు కలిపి చర్మంపై రాసి, మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇది శక్తిమంతమైన క్లెన్సర్గా ఉపయోగపడుతుంది. మృతకణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది. రాత్రి పడుకునే ముందుగా పాదాలను శుభ్రపరచాలి. తర్వాత కరిగించిన వ్యాక్స్లో కొద్దిగా ఆవనూనె కలిపి రాసుకోవాలి. పది-పదిహేను రోజుల్లో కాలి పగుళ్లు త గ్గుతాయి. పాదాల చర్మం మృదువుగా మారుతుంది. ఉప్పు లేని బటర్ టేబుల్ స్పూన్, స్ట్రాబెర్రీ ఒకటి, చిన్నముక్క కీరా, టీ స్పూన్ నిమ్మరసం, గుడ్డులోని పచ్చసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి, ఇరవై నిముషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. పాదాల చర్మం మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. -
కురులకు నిగనిగలు...
బ్యూటిప్స్ శిరోజాల అందానికి, ఆరోగ్యానికి ఇంట్లోనే చేసుకోదగిన మేలైన చిట్కాలు... టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ను నాలుగు కప్పుల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు కండిషనర్గా ఉపయోగపడి, శిరోజాలు మృదువుగా అవుతాయి. ఉసిరి, తులసి, వేప ఆకులను మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకుని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే వెంట్రుకలు చిట్లే సమస్య తగ్గుతుంది. కురుల మృదుత్వం పెరుగుతుంది. పెరుగులో పెసరపిండి కలిపి, రెండు రోజులు బయటే ఉంచాలి. తర్వాత రోజు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు తగ్గుతుంది. వెంట్రుకలు మృదువుగా అవుతాయి. ఆలోవెరా జెల్ను రాత్రి పడుకునేముందు మాడుకు పట్టించి, మరుసటి రోజు శుభ్రపరుచుకోవాలి. ఇది జుట్టుకు మంచి మాయిశ్చరైజర్లా ఉపయోగపడటమే కాకుండా, చుండ్రు తగ్గుతుంది.ఎర్రని బంతిపూలను వేసి, బాగా మరిగించిన కప్పుడు నీటిని మాడునుంచి శిరోజాలకు పూర్తిగా పట్టించాలి. గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. తలలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలు ఎర్రగా అవుతాయి. జుట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారికి ఇది ఆర్గానిక్ హెయిర్ డైలా ఉపయోగపడుతుంది.బీట్రూట్ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. -
బ్యూటిప్స్
కొబ్బరి నూనెలో భృంగరాజ్, ఉసిరిక పొడి కలిపి మరిగించి ఆ నూనెతో తలకు మర్దన చేస్తే కేశాలు తెల్లబడకుండా, నల్లగా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ నూనెను తలస్నానం చేయడానికి ముందు రోజు రాత్రి మర్దన చేసుకోవచ్చు లేదా రోజూ తలకు పెట్టుకోవచ్చు. తులసి ఆకులు, భృంగరాజ, ఉసిరిక, కలబంద, మందార ఆకులు, కరక్కాయ, కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు పెరుగుదల అనూహ్యంగా ఉంటుంది. జుట్టుకు నలుపుదనం వస్తుంది. తలకు చల్లదనాన్నిస్తుంది. తలనొప్పి దూరమవుతుంది. కలబందను రెండుగా చీల్చి మధ్యలో ఉలవలను పెట్టి కట్టేయాలి. రెండు రోజుల తర్వాత మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అలాగే తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఉలవలలోని పోషకాలు జుట్టు కుదుళ్లను పటిష్ఠపరిచి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. కలబంద జుట్టుకు మెరుపునిస్తుంది. -
ఎండాకాలం... శిరోజాల సంరక్షణ...
బ్యూటిప్స్ ఈ కాలం శిరోజాలూ చమట, జిడ్డు కారణాలతో త్వరగా మురికి అవుతాయి. పొడిబారి చిట్టుతుంటాయి. ఈ సమస్యకు విరుగుడుగా ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కురుల నిగనిగలను కాపాడుకోవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, అర టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు. ఈ మూడింటిని కలిపి బియ్యం ముదురు గోధుమరంగులోకి వచ్చేవరకు మరిగించి, దించి, చల్లారనివ్వాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను వేడి చేసి, తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు మృదువుగా అవడమే కాకుండా, రాలడం సమస్య తగ్గుతుంది. వారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం, నెలకు ఒకసారి హెన్నా ప్యాక్ వాడితే కురుల అందం పాడవదు. వేడిమి వల్ల రోజూ తలస్నానం చేస్తుంటారు. దీంతో మాడు పై చర్మం పొడిబారి వెంట్రుకలు చిట్లడం, రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రాత్రి సమయాల్లో ఉసిరి, తులసి, వేప ఆకులను మరిగించిన కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే కుదుళ్లు బలంగా ఉంటాయి. -
ఇక ఆయిలీతో నో ప్రాబ్లమ్..
బ్యూటిప్స్ జిడ్డు చర్మం వారు ఏ కాలాన్నీ ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే ముఖం కడుక్కున్న రెండు నిమిషాలకే చర్మం ఆయిలీగా మారుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా అలాంటి వారు కొన్ని సూచనలు, చిట్కాలు పాటించక తప్పదు.. నిమ్మకాయ మంచి బ్లీచింగ్ ఏజెంట్. కాబట్టి రోజూ నిమ్మరసంతో కానీ నేరుగా నిమ్మకాయ ముక్కలతో ముఖాన్ని మర్దనా చేయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేసి ముఖాన్ని క్లీన్ చేసుకుంటే జిడ్డుతనం తగ్గుతుంది. ఇంట్లోనే ఫేస్ స్ప్రే తయారు చేసుకొని వాడటం మేలు. ఒక కప్పు నీళ్లలో రెండు టీ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ఏదైన చిన్న బాటిల్లో నింపుకోవాలి. ఇంట్లో ఉన్నా లేక ఆఫీసులో రెండు నిమిషాలకోసారి ముఖంపై చల్లుకోవాలి. ఇలా శుభ్రం చేసుకుంటూ ఉంటే చర్మం ఎప్పుడూ తాజాగా ఉంటుంది. ఎండలో నడిచేటప్పుడు కచ్చితంగా గొడుగును వాడటం మర్చిపోకండి. అది వాన నుంచే కాదు మనల్ని ఎండ నుంచీ కాపాడుతుంది. కాబట్టి బయటికి వెళ్లే ముందు బ్యాగ్లో గొడుగును తీసుకెళ్లండి.సన్స్క్రీన్ లోషన్ లేదా మాయిశ్చరైజర్ను ప్రతి రోజూ చర్మానికి రాసుకోవాలి. అది చెమట కారణంగా అయ్యే డీహైడ్రేషన్ను నియంత్రిస్తుంది. -
కూల్ ప్యాక్
బ్యూటిప్స్ చలిపోయింది. ఎండలు పెరుగుతున్నాయి. ఈ సంధికాలంలో ఎదురయ్యే సమస్యల నుంచి చర్మాన్ని కాపాడేవే ఈ కూల్ప్యాక్లు. ఎండకు వాడిన చర్మానికి ఈ ప్యాక్లు వేస్తే తక్షణం సాంత్వన కలుగుతుంది. బంగాళాదుంపను తురిమి ముఖమంతా పరిచి అరగంట తర్వాత చన్నీటితో కడగాలి. ఇలా వారానికొకసారి చేస్తుంటే సన్ట్యాన్ను అరికట్టవచ్చు. అలాగే ముఖం మీద మచ్చలు, గీతలు పోయి చర్మంకాంతులీనుతుంది. కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి పొడిచేసి ప్యాక్ తయారు చేసుకోవాలి. పొడి చర్మానికయితే ఒక టేబుల్స్పూన్ పౌడర్లో అంతే మోతాదులో పాలమీగడ లేదా తాజాపాలు లేదా పెరుగు కలిపి ప్యాక్ వేయాలి. జిడ్డు చర్మానికయితే తగినంత పన్నీరు కలిపి ప్యాక్ వేయాలి. ఈ ప్యాక్ వేసిన తర్వాత ఐదు నిమిషాల సేపు వలయాకారంగా మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది మేనిఛాయను మెరుగుపరుస్తుంది కూడ. తాజా బత్తాయి రసాన్ని ముఖానికి రాసి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.రెండు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా పేస్టు చేయాలి. అందులో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే ముఖం మీద గుల్లలు, మచ్చలు, గీతలు కూడా పోతాయి. ఈ ప్యాక్ చర్మాన్ని తెల్లబరుస్తుంది కూడ. -
అప్లై చెయ్యండి ఆరాక కడగండి
బ్యూటిప్స్ ఒక టీ స్పూను చక్కెరలో అంతే మోతాదులో నిమ్మరసం, కొద్దిగా నీటిని వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ప్యాక్లు వేసుకునే బ్రష్తో ముఖానికి (అవాంఛిత రోమాలు ఉన్న చోట) అప్లయ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది.ఒక టేబుల్ స్పూను నిమ్మ రసంలో నాలుగు టీ స్పూన్ల తేనె కలిపి బ్రష్తో ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తర్వాత కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. పాలలో పసుపు వేసుకుని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిగా ఆరనివ్వాలి. ఇప్పుడు ముఖానికి వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ మర్దన చేయాలి. ఇది అవాంఛిత రోమాలను తొలగించడంతోపాటు స్క్రబ్గా పని చేసి మృతకణాలను కూడా పోగొడుతుంది. మర్దన చేయడం పూర్తయిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి. ఒక టేబుల్ స్పూను శనగపిండిలో ఒక టీ స్పూను పసుపు వేసి తగినంత నీటితో పేస్టులా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత సున్నితంగా రుద్దుతూ కడగాలి. -
శీతాకాలంలో పొడిచర్మానికి చికిత్స!
బ్యూటిప్స్ {పతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి బాదం నూనె లేదా ఆలివ్ ఆయిల్ రాయాలి. అలాగే పొడిబారిన మోచేతులు, పాదాలు వంటి శరీర భాగాల్లోనూ రాయాలి. పొడిచర్మాన్ని రోజుకు పదినిమిషాలు హాట్థెరపీ ఇవ్వాలి. గోరువెచ్చటి నీటిని దోసిట్లోకి తీసుకుని ముఖాన్ని నీటిలో మునిగేటట్లు ఉంచాలి. ఇదే హాట్థెరపీ. ఒక కోడిగుడ్డు సొనలో, ఒక టీ స్పూన్ కమలారసం, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, నాలుగైదు చుక్కల పన్నీరు, అంతే మోతాదులో నిమ్మరసం తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి. బాగా మగ్గిన అరటిపండును మెత్తగా చిదిమి ముఖానికి, మెడకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చటి కడగాలి. ఇది పొడిచర్మానికి మాయిశ్చరైజర్గా పని చేస్తుంది, మెడ నల్లగా ఉంటే క్రమంగా ఆ నలుపు వదులుతుంది. పొడిచర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేప్సీడ్ ఆయిల్ బాగా పని చేస్తుంది. ఆయిల్ను యథాతథంగా ఒంటికి రాసి మర్దన చేస్తే సరిపోతుంది. ఇది ఇప్పుడు అన్ని సూపర్మార్కెట్లలోనూ దొరుకుతోంది. ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. రకరకాల కాంబినేషన్లతో ప్యాక్లు తయారు చేసుకోవడానికి సాధ్యం కానప్పుడు చర్మానికి స్వచ్ఛమైన ఆముదం లేదా అవొకాడో ఆయిల్ రాసి సున్నితంగా మర్దన చేయాలి. -
ఆరోగ్యం
మెరిసే చర్మం కావాలని ఎవరికి ఉండదు. మరి దానికి ఇంట్లోనే స్టీమ్ పెట్టుకుంటే సరి. అదెలా అంటారా? అయితే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో ఒక టీ బ్యాగ్ను వేయండి. తర్వాత ముఖాన్ని ఆ గిన్నెకు దగ్గరగా పెట్టి మీద ఒక టవల్ కప్పేసుకోండి. 5-6 నిమిషాల తర్వాత ముఖాన్ని టిష్యూ పేపర్తో తుడిచేసుకోండి.కొబ్బరి నూనె కేవలం జుట్టుకే ఉపయోగపడుతుందనుకుంటారు. కానీ అది ముఖానికి చేసే మేలు చాలామందికి తెలీదు. రోజుకు ఒకసారి ముఖాన్ని కొబ్బరినూనెతో మర్దన చేసుకోండి. తర్వాత ముఖంపై నూనెను 5 నిమిషాలు అలాగే ఉంచేయండి. అది పూర్తిగా ఆరిపోయాక చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి. కళ్ల కింద నల్లటి వలయాలతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. దానికి ఫ్రిజ్లోంచి అప్పుడే తీసిన చల్లటి బంగాళదుంప ముక్కలను కళ్లపై పెట్టుకొని 10 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. అందులోని బ్లీచింగ్ ఏజెంట్ ఆ మచ్చలను మటుమాయం చేస్తుంది.బయటి నుంచి ఇంటికి రాగానే ముఖానికి ప్యాక్ వేసుకోవడం మరచిపోకండి. అందుకు బ్రౌన్ షుగర్, శనగపిండి, ఆలివ్ ఆయిల్తో కలిపిన మిశ్రమంతో ఫేస్ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే దూరమైన నిగారింపు మీ సొంతం. -
తల్లుల బాధ్యత..
కేరెంటింగ్ పసిపిల్లలకు స్నానానికి ముందు ఏదైనా నూనెతో మసాజ్ చేస్తుంటారు. దాంతో పాటు బ్రెడ్తో స్క్రబ్ కూడా చేస్తే వారి మృదువైన చర్మం మరింత కాంతిమంతంగా మారుతుంది. అందుకోసం 3-4 బ్రెడ్ ముక్కలను పచ్చిపాలలో నానబెట్టాలి. అందులోకి పాలు ఇంకి మెత్తగా అయ్యాక వాటిని పేస్ట్లా చేయాలి. ఆ మిశ్రమాన్ని పిల్లల చర్మానికి స్క్రబ్లా వాడాలి. అలా ప్రతిరోజూ చేస్తే మృదువైన చర్మంతో పాటు వారికి ఎలాంటి అలర్జీలు రాకుండా ఉంటాయి. చిన్నారులకు డైపర్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అవి వాడిన ప్రదేశాల్లో అలర్జీ, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంట్లోనే డైపర్ క్రీమ్ తయారు చేసుకోవడం మంచిది. దానికి ఓ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి. దాని పైన ఓ మూతలో కొద్దిగా కొబ్బరి నూనె, రెండు చేమంతి పూలు వేయాలి. కొద్దిసేపటి తర్వాత ఆ కొబ్బరి నూనె ఎల్లో క్రీమ్లా తయారవుతుంది. దాన్ని డైపర్ల అంచుకు రాస్తే అది మంచి లోషన్గా ఉపయోగపడుతుంది. -
చర్మకాంతికి ప్రొటీన్లు...
బ్యూటిప్స్ విటమిన్-ఇ క్యాప్సుల్స్ రెండు తీసుకుని, చివరలు కట్ చేసి, చెంచాడు రోజ్ వాటర్లో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. ఎక్కువ మొత్తం కావాలంటే మరిన్ని క్యాప్సుల్స్, అంతే పరిమాణంలో రోజువాటర్ తీసుకోవాలి. చర్మానికి మంచి మాయిశ్చరైజర్ లభించి మృదుత్వం, కాంతి పెరుగుతాయి. గుడ్డు తెల్లసొనను ముఖమంతా మొత్తం రాసుకుని, 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే గుడ్డులోని తెల్ల సొన చర్మం ముడతలను నివారిస్తుంది. కళ్ల కింది నలుపును పోగొడుతుంది. అలొవెరా జెల్ను ముఖానికి, మెడకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. రాత్రి పడుకునేముందు ఇలా మసాజ్ చేసుకుంటే చర్మానికి మరింత మృదుత్వం లభిస్తుంది. -
అందమె ఆనందం
కప్పు కొబ్బరి నూనెలో టీ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మిరియాలు కలిపి వేడి చేయాలి. బియ్యం గోధుమవర్ణంలోకి వచ్చేంతవరకు వేడి చేసి, చల్లార్చి బాటిల్లో భద్రపరుచుకోవాలి. కొద్దిగా వేడి చేసి, ఈ నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ నూనెను వాడుతుంటే వెంట్రుకలు రాలడం, చుడ్రు సమస్యలు తగ్గుతాయి. -
కోమలమైన ముఖానికి...
ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల పెరుగు, ఆరస్పూన్ తేనె, ఐదారు చుక్కల గ్లిజరిన్ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడగాలి. వేసవి కాలంలో శనగపిండి సరిపడని శరీర తత్త్వం గలవారు పెసరపిండితో ప్యాక్ వేసుకోవచ్చు. పుచ్చకాయ రసం, కమలా పండు రసం, మామిడి పండు గుజ్జు, దోసకాయ గుజ్జు... దేనినైనా ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే చర్మం లావణ్యంగా ఉంటుంది. జిడ్డు చర్మానికి పుల్లటి పండ్లు వాడితే మంచిది. సాధారణ చర్మం, పొడి చర్మానికి అరటి, మామిడి వంటి తియ్యని పండ్లు వాడాలి. బంతి, చామంతి, గులాబీ వంటి పూల రెక్కలను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేస్తే చర్మం నునుపుదనం సంతరించుకుంటుంది. గులాబీలు అన్ని వయసుల వారూ వాడవచ్చు. చామంతి పూలను టీనేజ్ దాటిన తర్వాత వాడాలి. -
పండ్లతో మేనికాంతి...
బ్యూటీ దుమ్ము, ఎండ, కాలుష్యం, రసాయన సౌందర్య ఉత్పత్తుల మూలంగా చర్మం నల్లబడటమే కాకుండా పొడిబారి జీవం కోల్పోతుంది. అలాంటప్పుడు పండ్లతో మసాజ్ చేసుకోవడంవల్ల కణాలను శుభ్రపరిచి, చర్మానికి విశ్రాంతినివ్వడమే కాదు పండ్లు సహజ కాంతిని, మెరుపును తీసుకువస్తాయి. పొడిబారిన చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సర్లా పనిచేస్తుంది. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి, అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మసాజ్ చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, చల్లని నీటితో శుభ్రపరచాలి. వారానికి రెండుసార్లైనా ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం నిస్తేజంగా మారదు. జిడ్డు చర్మం గలవారికి టొమాటో సరైన ఎంపిక. సాధారణంగా జిడ్డుచర్మం గలవారికి మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా పండిన టొమాటా గుజ్జును ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. స్క్రబ్ చేయడం వల్ల మొటిమలున్న చోట చర్మం ఎర్రబడే అవకాశం ఉంది. 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా రుద్దుతూ కడగాలి. చర్మంపై స్వేదరంధ్రాలు శుభ్రపడి మొటిమల సమస్య తగ్గుతుంది. ముఖంపై అక్కడక్కడా మొటిమలు విపరీతంగా గడ్డల్లా ఏర్పడుతుంటాయి. దీనినే యాక్నె అంటుంటారు. ఈ సమస్య నివారణకు దాక్ష్ర పండ్లు మహత్తరంగా పనిచేస్తాయి. ద్రాక్షపండ్ల గుజ్జును ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయకారంగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరిచి, మెత్తని కాటన్ క్లాత్తో తడిని అద్దాలి. ఎండకు కమిలిన చర్మం (ట్యాన్) నిస్తేజంగా మారుతుంది. ఈ సమస్య నుంచి స్ట్రాబెర్రీ సత్వర ఉపశమనం ఇస్తుంది. స్ట్రా బెర్రీలను కొద్దిగా నీరు కలిపి గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జును ట్యాన్ అయిన శరీర భాగాలకు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల నిస్తేజంగా మారిన చర్మం పూర్వపు కాంతిని పొందుతుంది. -
కొండచిలువతో మసాజ్కి సిద్ధమా!!
-
కొండచిలువా... మసాజ్ వారెవా...
ఈ కొండ చిలువలు ఈమెను మింగేయడం లేదు.. ఎంచక్కా మసాజ్ చేస్తున్నాయి. తమ మసాజ్ సెంటర్కు వచ్చిన వినియోగదారులకు సేవలను అందిస్తున్నాయి. మీరు చాలా రకాల మసాజ్లను చేయించుకుని ఉంటారు. ఓసారి.. ఫిలిప్పీన్స్లోని సెబూ సిటీ జూకి వెళ్తే.. అక్కడ మీరు ఈ కొండ చిలువల మసాజ్ కూడా చేయించుకోవచ్చు. మసాజ్ లో భాగంగా.. ఒక్కోటి 13 అడుగుల పొడవున్న నాలుగు బర్మీస్ కొండచిలువలను జూ నిర్వాహకులు మన మీద వదులుతారు. అవి అటూ ఇటూ తిరుగుతూ.. మసాజ్ చేస్తాయి. మొత్తం 15 నిమిషాలపాటు ఈ సేవ కొనసాగుతుంది. ఇంత పెద్దవి కదా.. ఆకలేస్తే మింగేయవా అని డౌటా.. అదే అనుమానం జూ వాళ్ల వద్ద వ్యక్తం చేస్తే.. మసాజ్కు ముందు ఒక్కోదానికి 10 కోళ్లను పలహారంగా పెడతారట. కాబట్టి.. భయమక్కర్లేదని చెబుతున్నారు. మొదట్లో ఈ మసాజ్ చేయించుకోవడానికి చాలా మంది జడుసుకున్నా.. చేయించుకున్నవాళ్లు మాత్రం అదుర్స్ అంటున్నారని జూ సిబ్బంది చెబుతున్నారు. -
గోవా ఫుల్ బాడీ మసాజ్ తో గోవిందా గోవింద
గోవా అంటేనే మందు, విందు, పొందు. గోవా అంటేనే బీచ్ బ్యూటీలు, బికినీ బేబ్ లు. గోవా అంటే భలే భలే పసందైన ఫుల్ బాడీ మసాజ్. కానీ చాలా మందికి ఫుల్ బాడీ మసాజ్ అంటే నిలువు దోపిడీ. ఇటీవలే ఏడుగురు మిత్రులు గోవాకు వెళ్లారు. అక్కడ మంచి మసాజ్ ఆఫర్ వచ్చింది. మూకుమ్మడి మసాజ్ మహా బాగుంటుందనుకుని వెళ్లారు. అయితే అక్కడ వెళ్లాక ఎక్కడెక్కడో మసాజ్ చేస్తారనుకుంటే ఎక్కడపడితే అక్కడ పిడిగుద్దులు కురిపించి, ఉన్నదంతా దోచేసుకున్నారు. చివరికి గోవిందా గోవిందా అయిపోయింది. కట్టుబట్టలతో లారీల్లో పడి, రైలు కంపార్ట్ మెంట్ బాత్రూముల్లో దాగి ఎలాగోలా ఇల్లు చేరుకున్నారు. ఫుల్ బాడీ మసాజ్ అంటే గోవాలో నిలువు దోపిడీ అని అర్థం. గోవాలో మూడు బ్రాలు, ముప్ఫై ఆరు బికినీలుగా విస్తరిస్తున్న సెక్స్ టూరిజం టూరిస్టులను దోచేసుకుంటోంది. చాలా మంది కారులో మసాజ్, టెంపోలో మసాజ్ అని ప్రజలను మోసం చేస్తున్నారు. ఏడాదికి 30 లక్షల మంది టూరిస్టులు వచ్చే గోవాకి ఇప్పుడు ఈ మసాజ్ మోసం ఒక మాయని మచ్చగా మారింది. దీంతో ఇప్పుడు గోవా ప్రభుత్వం ఈ మసాజ్ పార్లర్లను నియంత్రించేందుకు, లైసెన్సులు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. అయితే సర్కారు ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అన్నది త్వరలోనే తెలుస్తుంది.