Munugode Bypoll 2022
-
ఎక్కడో తేడా కొట్టింది?.. తెలంగాణలో బీజేపీ స్పీడ్ ఎందుకు తగ్గింది?
తెలంగాణలో కమలం పార్టీ వేగం తగ్గిందా? మునుగోడు తర్వాత నేతల్లో నిస్తేజం ఆవిరించిందా? రాష్ట్ర పార్టీ చీఫ్ పాదయాత్రపైనే ఫోకస్ పెట్టారా? సీనియర్ల సేవల్ని ఉపయోగించుకోవడంలో కాషాయసేన వెనుకబడుతోందా? బీజేపీ స్పీడ్ తగ్గడానికి కారణం ఎవరు? లోపం ఎక్కడుంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ బీజేపీ నాయకులు చాన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ కూడా వారికి ఆమేరకు దిశా నిర్దేశం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఇతర పార్టీలను ఆకర్షించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈటల రాజేందర్ను ఆకర్షించి మళ్ళీ అసెంబ్లీకి ఎన్నికయ్యేలా కమలనాథులు కృషి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ని బీజేపీలోకి ఆకర్షించినప్పటికీ.. ఉపఎన్నికల పోరాటంలో విజయం దక్కలేదు. కాని కమలానికి పునాదులు లేని నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ను వెనక్కు నెట్టేసి..టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చాటుకున్నారు కమలనాథులు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు మర్రి శశిధర్రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారే గాని..వారి సేవల్ని సక్రమంగా వినియోగించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునుగోడు వ్యూహం ఎదురు తన్నిందా? మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డి విజయం సాధిస్తారనే స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ నాయకత్వానికి కంగారు పుట్టించారు కూడా. కాని ఫలితం దక్కలేదు. రాజగోపాల్రెడ్డిని విజయం వరించలేదు. దీంతో నాయకుల్లో స్పీడ్ తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూర్తిగా తన ప్రజా సంగ్రామ యాత్ర మీదే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఏ మాత్రం అవకాశం దొరికినా తన సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినపుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా మిగతా నేతలు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బండి సంజయ్ మాత్రమే ఫోకస్ కావాలనే ఉద్దేశంతో మిగతా నేతలను పాదయాత్రకు సంఘీభావంగా వెళ్ళాలని సూచించలేదా? లేక సంజయ్ పాదయాత్రను మిగతా నాయకులు లైట్ తీసుకున్నారా ? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రెయిడ్స్ వర్సెస్ రెయిడ్స్ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్గా ఉన్నాయి. ఎన్నికలు ఏడాదిలోపే ఉండటంతో మూడు ప్రధాన పార్టీలు కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాయి. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అదే రేంజ్లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఒకవైపు లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు... ఇంకోవైపు రాష్ట్ర మంత్రులపై ఈడీ విచారణ సాగుతోంది. ఇదిలా ఉంటే..తెలంగాణలో గులాబీ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో కమలం పార్టీ నేతలు వెనకబడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బండి సంజయ్ తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా.. ఆయనకు సపోర్టింగ్ గా ఇతర నేతలు ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. దీంతో బీజేపీ వాయిస్ పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది. సీనియర్స్ స్ట్రాటజీ ఏంటీ? మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డి కోసం రాష్ట్రంలోని పెద్దా, చిన్నా నాయకులంతా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఉప ఎన్నిక హడావుడి ముగియగానే వీరంతా సైలెంట్ అయిపోయారు. బండి సంజయ్ తనయాత్రలో మునిగిపోవడం..ఇతర నేతల మధ్య పనివిభజన లేకపోవడంతో ఎవరికీ పని లేకుండా పోయింది. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం మినహా నాయకులకు దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఒకప్పుడు బీజేపీ నాయకులు చాలా కొద్దిమందే ఉండేవారు. ఇతర పార్టీలనుంచి వచ్చినవారితో ఇప్పుడు కమలం పార్టీ నిండుగా కనిపిస్తోంది. కాని సీనియర్ల సేవలను సరిగా వినియోగించుకోలేకపోవడం ఒక లోపంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సీనియర్లను ఖాళీగా ఉంచడం వల్ల పార్టీకి నష్టం కలుగచేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
పదే పదే క్లీన్బౌల్డ్.. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహమేంటి?
హస్తం కిం కర్తవ్యం.? ఇప్పటి వరకు ఏం చేశారు.. ఇకపై ఏం చేస్తారు.. ఇవి కాంగ్రెస్ రివ్యూల్లో వినిపిస్తున్న ప్రశ్నలు. ప్రోగ్రామ్ ప్రోగ్రెస్ లేకుంటే పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్ నేతలు మధన పడుతున్నారట. ప్రజా సమస్యల పై ప్రజల్లోకి వెళ్ళాలని కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చారట హస్తం నేతలు. ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఉపఎన్నికల్లో క్లీన్ బౌల్డ్ వరుస ఓటములతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన పార్టీ.. అవి ప్రత్యేక ఎన్నికలు అని సర్దిచెప్పుకుంది. తాజాగా జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానం ఎలాగైనా గెలవాలి అని కసరత్తు చేసినా డిపాజిట్ కోల్పోయి మళ్ళీ క్లీన్ బౌల్డ్ అయింది. నిజానికి మునుగోడు ఉపఎన్నికలపై అందరికంటే ముందే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయినా ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. పేరుకే రివ్యూ.. జరుగుతోంది వన్ సైడ్ డ్రైవింగే పార్టీ వరుస ఓటముల నుంచి కోలుకునేందుకు పార్టీ ఛీఫ్ వరుస రివ్యూలు చేస్తున్నారు. గతం గతః ఇప్పటి నుండి ఏం చేయాలి అనే దానిపై తాజాగా మరో ఫోకస్ పెట్టింది. ప్రజా సమస్యలను ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారట. ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎజెండాగా మలుచుకుని ప్రత్యక్ష పోరాటాలను చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారట. టీఆర్ఎస్ తెచ్చిన ధరణి పోర్టల్ తెలంగాణ ప్రజలకు గుదిబండగా మారిందని, కేసీఆర్ ఇచ్చిన పోడు భూములు, రుణమాఫీ, అసైన్డ్ భూములు ఇలా తదితర అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయని, వీటి పరిష్కారం కోసం కాంగ్రెస్ పోరాటానికి సిద్దమవుతోంది. ఈ నెల 24న ఎమ్మార్వో కార్యాలయాల ముందు, 30న నియోజకవర్గాల్లో, డిసెంబర్ 5న కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని పీసీసీ ఛీఫ్ చీఫ్ రేవంత్ ప్రకటించారు. బాబు.. బాగా బిజీ పార్టీ కార్యాచరణ కోసం ఇటీవలే జూమ్ మీటింగ్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది గంటలు గడవకముందే మరోసారి గాంధీ భవన్లో అనుబంధ సంఘాలతో మీటింగ్ నిర్వహించింది. ఈ మీటింగులో పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులపై రేవంత్ ఫైర్ అయ్యారట. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ని లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని, దీన్ని అధిగమించాలంటే అందరం కలిసి పనిచేయాలని రేవంత్ దిశానిర్దేశం చేశారట. ఇప్పటివరకు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు చేపట్టిన కార్యక్రమాల వివరాలేంటి, ఇకపై చేయబోయే కార్యక్రమాలేంటో తనకు పది రోజుల్లోగా తెలియచేయాలని రేవంత్ అడిగినట్లు సమాచారం. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని, అందరం కలిసి బాధ్యతగా కార్యక్రమాలు చేపట్టి సమస్యలపై పోరాడాలని చెప్పాడట. చేప.. చేప.. ఎందుకు గెలవలేదు.? ఇంత చేస్తే మునుగోడు ఓటమిపై మాత్రం పూర్తి సమీక్ష చేయలేదంటున్నారు. స్వయానా పీసీసీ చీఫే ఎన్నికలకు ముందుకు కాడి జారేశాడని, సిట్టింగ్ స్థానాన్ని సరైన వ్యూహం లేక పోగోట్టుకున్నారని గొల్లుమంటున్నారు. రేవంత్ తీరు వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని కొందరంటే.. పార్టీ నేతలే ఇక్కడికి తీసుకొచ్చారని అధిష్టానానికి రేవంత్ చెబుతున్నారట. -
Munugode Bypoll Result 2022: అధికార దుర్వినియోగంతో దక్కిన విజయం
తెలంగాణ చరిత్రలోనే మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మిగిలిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలోని 84 మంది ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 12 మంది ఎంపీలు, మునుగోడులో తిష్ఠ వేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి చేసిన ప్రయత్నాలు అంతా ఇంతా కాదు. ప్రతి రెండు గ్రామాలకూ ఒక ఎమ్మెల్యేని మోహరించారు. మండలానికి ముగ్గురు మంత్రులను నియమించి భారతీయ జనతా పార్టీ నాయకులను, గ్రామస్థాయిలో ఉండే యువతను టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగి పోతాయనీ, పింఛన్ దారులకు పింఛను రాదనీ, వృద్ధులను భయభ్రాంతులకు గురిచేశారు. ఇన్ని కుయుక్తులతో సాధించినది విజయమేనా? ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 97,006 ఓట్లు తెచ్చుకొని 10,309 ఓట్ల మెజారిటీ విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 86,693 ఓట్లు పొంది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వణికించారు. కాంగ్రెస్ 23,906 ఓట్లు పొంది డిపాజిట్ కోల్పోయింది. భారతీయ జనతా పార్టీ తమకు పోటీనే కాదనీ, కాంగ్రెస్సే ప్రత్యర్థి అని ఎన్నోసార్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు; ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో ప్రగల్భాలు పలికినప్పటికీ మును గోడులో భారతీయ జనతా పార్టీకి మంచి ప్రజాదరణ కనిపించింది. మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ తమ పార్టీ సాధించిన విజయాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోలేక ‘చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు’ భావిస్తున్నారు. ఎందుకంటే అక్కడ సాంప్రదాయి కంగా బలంగా ఉన్న కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని సాధించిన విజయమే తప్ప కేసీఆర్ ప్రభుత్వ పథకాలను చూసి కానీ, ఆయన పరిపాలనా విధానం చూసి గానీ వచ్చింది కాదు. కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవకపోతే ప్రభుత్వ మనుగడకు ప్రమాదమని భావించి... విజయం కోసం తన అంగ బలాన్నీ, అధికార బలాన్నీ ఉపయోగించారు. తాను చీదరించి మనుగడ లేకుండా చేసిన కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టు కున్నారు. అందుకే కనీస మెజారిటీ అన్నా టీఆర్ఎస్కు దక్కింది. ఈ ఉప ఎన్నిక... భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకు లకు రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రాబోతోందనే సంకేతాన్ని ఇస్తోంది. ఓటమి భయంతో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రెండు గ్రామాలను అప్పగించి ఆయా గ్రామాలలో మెజార్టీ చూపిం చకపోతే వచ్చే ఎలక్షన్లలో వారికి సీటు ఇచ్చేది లేదని చెప్పినట్టు తెలిసింది. దీన్నిబట్టి కేసీఆర్ బీజేపీని చూసి ఎంతగా భయపడ్డారో తెలుస్తోంది. ఇంతజేస్తే... మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్న గ్రామాలలో బీజేపీకి టీఆర్ఎస్ కన్నా ఎక్కువ మెజారిటీని కట్టబెట్టారు ప్రజలు. ఆ విధంగా మంత్రులకు... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వచ్చే అవకాశం లేదన్నమాట. కాబోయే సీఎం అని చెప్పుకునే కేటీఆర్ ఇన్ఛార్జిగా ఉన్న గట్టుప్పల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఉండి... ప్రతి ఒక్క ఓటరుకూ రూ. 4,000 ఇచ్చినా టీఆర్ఎస్కు బీజేపీ కన్నా 65 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి వరుసగా ఇన్ఛార్జ్లుగా ఉన్న ఆరెగూడెం, లింగోజిగూడెం గ్రామాలలో టీఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నిజంగా మునుగోడు నియోజక వర్గంలో చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీలలో; చౌటుప్పల్ గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ కంటే ఎక్కువ మెజార్టీ సాధిస్తుందని అనుకున్నప్పటికీ, అనుకున్నంత మెజారిటీ సాధించలేక పోయింది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు మునుగోడు ఉప ఎన్నిక వస్తుందని ముందుగానే భావించిన టీఆర్ఎస్ చౌటుప్పల్, చండూర్ మున్సిపాలిటీలలో 30 వేల పైన ఓట్లు కొత్తగా నమోదు చేయించడం జరిగింది. ఇలా హడావిడిగా ఇన్ని కొత్త ఓట్లు నమోదు చేయడం అధికార దుర్వినియోగం అవుతుంది అని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో రెండు మూడు వేల ఓట్లు మునుగోడు నియోజకవర్గంలోని నివాసితులవి కాగా, మిగతా ఓట్లన్నీ టీఆర్ఎస్ నాయకులు... మునుగోడు పక్క నియోజకవర్గాల నుంచి తమ కార్యకర్తల చేత ఓటు కోసం అప్లై చేయించినవే అని చెప్పవచ్చు. ఇదే రకమైన విధానాన్ని కేసీఆర్ పట్టభద్రులకు జరిగిన రెండు శాసనమండలి ఎలక్షన్లలో కూడా ఉపయోగించారు. అలాగే ఒకటవ తారీఖు సాయంత్రం ఎన్నికల నిబంధన ప్రకారం బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గం విడిచి వెళ్లకుండా, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి పక్షపాతం చూపించారు. మూడో తారీఖు సాయంత్రం వరకూ డబ్బులు పంచుకుంటూ ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి, మద్యాన్ని ఏరులై పారించి అడ్డదారుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓటర్లను ప్రభావితం చేయడం జరిగింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న ప్రభుత్వానికి ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తనకు తాను జాతీయ నేతగా ప్రకటించుకొని బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఎలాగైనా గెలవాలన్న తపనతో ఏకంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట ఫామ్హౌస్ డ్రామాకు ఎన్నికలకు సరిగ్గా మూడు రోజుల ముందు టీఆర్ఎస్ తెరలేపడం జరిగింది. అయినప్పటికీ మునుగోడులోని ఓటర్లు కానీ, తెలంగాణ ప్రజలు కానీ కేసీఆర్ నాటకాన్ని నమ్మలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఫామ్ హౌస్ డ్రామా రక్తి కట్టలేదు. ఈ మొత్తం ఎన్నికల్లో టీఆర్ఎస్కు సంబంధించిన ఒక రూపాయి కూడా పట్టుబడకపోవడం ప్రభుత్వ వ్యవస్థల దుర్వి నియోగానికీ, అధికార యంత్రాంగం టీఆర్ఎస్ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేసింది అనడానికీ నిదర్శనం. (క్లిక్ చేయండి: బీఆర్ఎస్కు పచ్చాజెండా ఊపిన మునుగోడు ఓటర్లు) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తేల్చిన అనేక సర్వేలు చూసిన తర్వాత అయోమయానికి గురవు తున్న టీఆర్ఎస్ నేతలకు... ఏమి చేయాలో పాలుపోక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధానమంత్రిని కూడా అడ్డుకోవాలని నిరసన కార్యక్రమాలు చేపట్టడం దేనికి అద్దం పడుతుంది? ఈ పనులేవీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అడ్డు కోలేవు. ఇటీవలి కాలంలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. అధికారం దిశగా అడుగులు వేస్తోంది. - ఎన్. రామచందర్ రావు మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ -
మునుగోడు ఓటమిపై సమగ్ర అధ్యయనం
ఎర్రుపాలెం: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటమిపై సమగ్ర విశ్లేషణతో అధ్యయనం చేస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా మద్యం, నగదు పంపిణీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని విమర్శించారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అద్భుతంగా సా గిందని, అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకమయ్యారని తెలిపారు. అందరి చేతుల్లో ఉండాల్సిన దేశ సంపదను కేవలం అంబానీ, ఆదాని లాంటి పెట్టుబడిదారులకు మోదీ పంపిణీ చేస్తున్నారని భట్టి ఆరోపించారు. -
ఫలితమొచ్చి వారం గడుస్తున్నా.. ఒడవని మునుగోడు ముచ్చట!
సాక్షి, హైదరాబాద్: దాదాపు మూడు నెలల పాటు రాష్ట్రంలో హాట్ టాపిక్గా నిలిచిన ‘మునుగోడు’ వేడి ఇంకా చల్లారలేదు. ఉప ఎన్నిక ఫలితం వచ్చి వారం గడుస్తున్నా రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఈ ఫలితం ఇచ్చిన సంకేతాలేంటి? త్రిముఖ పోటీ జరిగితే 2023 ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతోంది? అనే ఎన్నో ప్రశ్నలపై చర్చలు జరుగుతున్నాయి. గేరు మార్చిన ‘కారు’ ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన రాజకీయ సమీకరణాల్లో కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ దోస్తీ గురించే రాష్ట్రంలో ఎక్కువ చర్చ జరుగుతోంది. 2014లో తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాజకీయ రణరంగంలో తిరుగులేని శక్తిగా నిలిచిన టీఆర్ఎస్.. ఇప్పుడు పొత్తు రాజకీయాలకు మునుగోడు నుంచే తొలి అడుగు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలవాలన్న టీఆర్ఎస్ వ్యూహం సత్ఫలితాన్నే ఇచ్చినా.. ‘కారు’కు అదనపు బలం అవసరం పడుతోందనే చర్చకూ తావిచ్చిందని చర్చ జరుగుతోంది. కోరి తెచ్చుకున్నా చేదు తీర్పు! మునుగోడు ఉప ఎన్నిక ద్వారా బీజేపీ దూకుడుకు బ్రేక్ పడిందనే చర్చ జరుగుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. మునుగోడు వేదికగా గోల్ కొట్టి ‘రాజ’సంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావించింది. ఈ క్రమంలో కోరి తెచ్చుకున్న ఉప ఎన్నిక ఫలితం చేదు తీర్పు ఇచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్.. కోలుకునేదెప్పుడు? సిట్టింగ్ స్థానంలో పోటీచేసి.. మూడోస్థానానికి పడిపోయి, డిపాజిట్ను గల్లంతు చేసుకున్న కాంగ్రెస్ పార్టీని ఈ ఉప ఎన్నిక సందిగ్ధంలోకి నెట్టింది. తమకు 23 వేలకు పైగా ఓట్లు రావడం, పార్టీని వీడి బీజేపీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్రెడ్డి ఓడిపోవడంతో సంతోషించాలో.. సిట్టింగ్ నుంచి మూడోస్థానానికి పడిపోవడంపై బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ ఇంకెప్పుడు కోలుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. చిన్నాచితకా పార్టీలు.. ఎప్పటిలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న పార్టీలు కూడా ఎంతోకొంత ప్రభావం చూపుతాయని మునుగోడు ఉప ఎన్నిక తేల్చిందనే చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరిగితే ఫలితం ఎలా ఉంటుందన్నది ఈ ఉప ఎన్నికతో తేలిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి: మోదీ రాక.. రాష్ట్రంలో కాక.. -
మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేయాలి: కేఏ పాల్
నల్గొండ (చండూరు): మునుగోడు ఉప ఎన్నికను రద్దుచేసి బ్యాలెట్ పేపర్తో తిరిగి ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేస్తామని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ అన్నారు. ఆయన మంగళవారం చండూరులో విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అవి నీతి, అక్రమాలు జరగనప్పుడు.. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఎందుకు కౌంటింగ్ చేయలేదన్నారు. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారులు మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్కి తొత్తులుగా పనిచేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలలో బిగించిన సీసీ కెమెరాలకు సంబంధించిన లింక్ తమకు ఎందుకు ఇవ్వలేదన్నారు. స్ట్రాంగ్ రూమ్కు వేసిన సీల్ మారిందని చెప్పారు. టీఆర్ఎస్ ఏజెంట్లు కండువాలు కప్పుకుని కౌంటింగ్ హాల్లో తిరుగుతున్నా ఎందుకు బయటకు పంపించలేదని ఆయన ప్రశ్నించారు. పోలింగ్ స్టేషన్లలో అధికారులు వృద్ధులతో రెండో నంబర్కు ఓటు వేయించారని ఆయన ఆరోపించారు. ఓటుకు డబ్బులు పంచడం అనేది ఎన్నికల అధికారులతో పాటు అందరికి తెలిసినా కూడా ఈ ఎన్నికను ఎందుకు రద్దుచేయలేదో చెప్పాలన్నారు. మునుగోడు ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను చీకొడుతున్నారని, తనను అభిమానిస్తున్నారని పాల్ చెప్పారు. -
సీరియస్ ఎన్నికలో నవ్వుల ‘పాల్’
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఆనంద్ కిలారి పాల్ (కేఏ పాల్) ప్రచారంలో ఓటర్లను భలే అలరించారు. రోజుకో రీతిలో తనదైన శైలిలో ప్రచారం చేశారు. పాల్ ప్రచారానికి ఓటర్లు మునుగోడు ఓటర్లు సైతం బాగా ఆకర్షితులయ్యారు. ఆయన కనిపిస్తే చాలు జనంలో జోష్ వచ్చింది. కానీ, ఓట్లలో మాత్రం పాల్ను ఆదరించలేదు. ఆయనకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రౌండ్లోనూ కనీసం రెండంకెలు కూడా దాటలేదు. కౌంటింగ్ సెంటర్ వద్ద సైతం పాల్ సందడి చేశారు. (క్లిక్ చేయండి: మునుగోడు బరిలో కేఏ పాల్.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..) ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: కేఏ పాల్ నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మాట్లాడుతూ... ఈవీఎంల పనితీరుపై నమ్మకం లేదన్నారు. ఉప ఎన్నికలో తన ఉంగరం గుర్తుకు 1.10లక్షల ఓట్లు పడినట్లు ప్రజలు చెప్పారని, సగం కౌంటింగ్ పూర్తయ్యాక తనకు 600 ఓట్లు కూడా రాలేదని వాపోయారు. ఇదంతా టీఆర్ఎస్, బీజేపీల కుట్ర అని ఆరోపించారు. ఫలితాలు చూస్తుంటే టీఆర్ఎస్ కుట్ర ఎంటో అర్థమవుతోందని, అధికారులంతా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పాల్ ఆరోపించారు. -
సర్వశక్తులు ఒడ్డినా దక్కని గెలుపు (ఫొటోలు)
-
మునుగోడు ఉపఎన్నిక ఫలితం బీజేపీకి చెంపపెట్టు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘డబ్బు, మద్యం, అధికార మదంతో జనం గొంతు నొక్కి, ఓటర్లను కొనాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు మునుగోడు ప్రజల చైతన్యం ముందు విఫలమయ్యాయి. మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని చాటిచెప్తూ బీజేపీకి చెంపదెబ్బ రుచి చూపించారు..’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం అనంతరం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొమ్మిది ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ పెద్దలకు మునుగోడు ఉప ఎన్నిక గట్టి ఎదురుదెబ్బఅని పేర్కొన్నారు. వారు ఇంతా చేసి టీఆర్ఎస్ మెజారిటీని తగ్గించగలిగారే తప్ప మునుగోడు విజయాన్ని ఆపలేకపోయారని చెప్పారు. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారని.. తొలిసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాలు టీఆర్ఎస్కు కట్టబెట్టి కొత్త చరిత్ర లిఖించారని కేటీఆర్ అన్నారు. విచ్చలవిడి ధన ప్రవాహం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను గౌరవించాలనే ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ తెలంగాణలోనూ క్రూర రాజకీయ క్రీడకు తెరలేపిందని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఢిల్లీ, గల్లీ నాయకత్వం తొలిసారిగా ఢిల్లీ నుంచి రూ.వందల కోట్లు తరలించిందని.. డబ్బు, మద్యం, అధికార మదంతో ఓటర్లను కొనాలని అన్నిస్థాయిల్లో ప్రయత్నించిందని ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడు, కరీంనగర్ కార్పొరేటర్ భర్త వేణు కోటి రూపాయలతో దొరికాడు. ఈటల రాజేందర్ పీఏ కడారి శ్రీనివాస్ రూ.90లక్షలతో పట్టుబడ్డాడు. మాజీ ఎంపీ వివేక్ గుజరాత్ నుంచి హవాలా ద్వారా రూ.2 కోట్లు తెప్పించి దొరికింది నిజం కాదా? డాక్యుమెంట్ ఎవిడెన్స్తో, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే దొరికిపోయిన దొంగల గురించి మాట్లాడుతున్నాను తప్ప ఆషామాషీగా ఆరోపణలు చేయడం లేదు. వివేక్ గతంలో ఈటల రాజేందర్కు, ఇప్పుడు రాజగోపాల్రెడ్డికి రూ.75 కోట్లను తన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? రూ.75కోట్లు అభ్యర్థి పార్టీ మారగానే ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా? రాజగోపాల్రెడ్డికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా.. ఆయన అనుచరుడు రూ.కోటితో మణికొండలో పట్టుబడింది నిజం కాదా? జమున హ్యాచరీస్కు రూ.25 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది నిజం కాదా? ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా వివేక్ను అడ్డం పెట్టుకున్నారు. ఎందుకోసం ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా సంస్థ నుంచి రూ.5.25 కోట్లను మునుగోడులోని ఓటర్లు, బీజేపీ నేతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తాము ఫిర్యాదు చేస్తే.. బీజేపీ పెద్దలు ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి తెచ్చి ప్రేక్షపాత్ర వహించేలా చేశారని ఆరోపించారు. వామపక్షాల నేతలకు కృతజ్ఞతలు మునుగోడులో టీఆర్ఎస్ గెలుపునకు తోడ్పడిన సీపీఐ, సీపీఎం నాయకులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్రెడ్డి, జాలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, యాదగిరిరావులకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయానికి దోహదపడిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలు చెప్పారు. నాటకాన్ని నడిపింది మోదీ, అమిత్షా ప్రధాని మోదీ, అమిత్ షాలు అహంకారం, డబ్బుతో కళ్లునెత్తికెక్కి రాజగోపాల్రెడ్డితో రాజీనామా చేయించి బలవంతపు ఉప ఎన్నికను ప్రజలపై రుద్దారని కేటీఆర్ విమర్శించారు. ‘ఉప ఎన్నికను రుద్దిన వారిపై మునుగోడు ప్రజలు గుద్దిన గుద్దుడుకు చెక్కరొచ్చింది. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన ముఖం రాజగోపాల్రెడ్డిదే కావొచ్చు. వెనకుండి నాటకం నడిపింది అమిత్ షా, మోదీ అనే విషయం ప్రజలకు తెలుసు. ఇంతకుముందు ఉపఎన్నికలు జరిగిన నారాయణ్ఖేడ్, హుజూర్నగర్, నాగార్జునసాగర్, దుబ్బాకలలో కనిపించని.. ధన ప్రవాహం హుజూరాబాద్, మునుగోడులలో ఎందుకు వచ్చిందో ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. డబ్బున్న ఈటల, రాజగోపాల్రెడ్డి ఉప ఎన్నికల్లోకి వచ్చాకే కలుషితం అయ్యాయి’ అని పేర్కొన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగం, విచ్చలవిడితనానికి ఈ ఎన్నికలు పరాకాష్ట అని.. 15 కంపెనీల సీఆర్పీఎఫ్, 40 ఐటీ టీమ్లను దించి నియోజకవర్గం మీదికి దండయాత్రకు వచ్చారని విమర్శించారు. అయినా గతంకంటే టీఆర్ఎస్కు ఓటింగ్ శాతం 34.2 శాతం నుంచి 43 శాతానికి పెరిగిందని కేటీఆర్ చెప్పారు. బీజేపీ వాళ్లు జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధానిని ప్రచారానికి తీసుకొచ్చారని.. తమ ఎమ్మెల్యేలు మునుగోడు ప్రచారానికి వెళితే తప్పేమిటని ప్రశ్నించారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: యావత్ తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరభవం చవిచూసింది. డిపాజిట్ కూడా దక్కించుకోలేేక మూడో స్థానానికి పరిమితమైంది. ఈ పరాజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని రేవంత్ పేర్కొన్నారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా, నికార్సుగా, నిబద్ధతగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నది ముఖ్యం. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతగా పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. — Revanth Reddy (@revanth_anumula) November 6, 2022 ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ 10వేలకుపైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచారు. చదవండి: ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం -
ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ప్రజలు కారుకే జై కొట్టారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీని సాధించారు. ఈ ఎన్నికలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ దక్కించుకోలేకపోయారు. 2018 ఎన్నికల్లో కోల్పోయిన మునుగోడు స్థానాన్ని టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో తిరిగి దక్కించుకుంది. ముగ్గురి మధ్యే పోటీ..: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 3న జరగ్గా ఆదివారం నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. 686 పోస్టల్ బ్యాలెట్లు సహా 2,25,878 ఓట్లు (93.41 శాతం) పోలయ్యాయి. ఇందులో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి 97,006 ఓట్లురాగా.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి 86,697 ఓట్లు, పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్లు, 5 సర్వీసు ఓట్లలో.. టీఆర్ఎస్కు 405 పోస్టల్, 3 సర్వీసు ఓట్లు.. బీజేపీకి 211 పోస్టల్, ఒక సర్వీసు ఓటు.. కాంగ్రెస్కు 41 పోస్టల్, ఒక సర్వీసు ఓటు లభించాయి. మిగతా ఓట్లు బరిలో ఉన్న మిగతా 44 మంది అభ్యర్థులు, నోటాకు పడ్డాయి. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే.. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో తొలుత బీజేపీ, టీఆర్ఎస్ మ«ధ్య నువ్వానేనా అన్నట్టుగా కొనసాగింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరింది. ఇందులో 3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యం సాధించగా, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ హవా కనిపించింది. కాంగ్రెస్ తొలి నుంచీ 3వ స్థానంలోనే ఉంది. మొదటి రౌండ్లో బీజేపీపై టీఆర్ఎస్ 1,292 ఓట్ల మెజారిటీ సాధించగా.. రెండో రౌండ్లో బీజేపీ 841 ఓట్ల మెజారిటీ సాధించింది. మూడో రౌండ్లోనూ బీజేపీకి 36 ఓట్లు ఎక్కువ వచ్చాయి. 4వ రౌండ్లో టీఆర్ఎస్కు 299 మెజారిటీ వచ్చింది. 5వ రౌండ్లో 817, 6వ రౌండ్లో 638, 7వ రౌండ్లో 399, 8వ రౌండ్లో 532, 9వ రౌండ్లో 852, 10వ రౌండ్ 488 ఓట్ల మెజారిటీని టీఆర్ఎస్ సాధించింది. అప్పటిదాకా ప్రతిరౌండ్లో వెయ్యిలోపే ఎక్కువ ఓట్లను సాధించిన టీఆర్ఎస్కు తర్వాత ఓట్లు పెరిగాయి. ఆ పార్టీకి 11వ రౌండ్లో 1,361, 12 రౌండ్లో 2వేల ఓట్లు, 13వ రౌండ్లో 1,345 ఓట్లు, 14వ రౌండ్లో 1,055 ఓట్లు మెజారిటీ వచ్చింది. చివరిదైన 15వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి 88 ఓట్లు ఎక్కువ వచ్చాయి. పోస్టల్/సర్వీస్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు మరో 194 ఓట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 10,309 ఓట్లు మెజారిటీ సాధించారు. ఆద్యంతం ఉత్కంఠగా.. ఉప ఎన్నిక పోలింగ్కు సంబంధించి అన్ని సర్వేలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపాయి. భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నా 10,309 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపులో కొద్దిపాటి ఆధిక్యమే కనిపించడంతో ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మొదటి రౌండ్ నుంచి 10వ రౌండ్ వరకు గట్టి పోటీ ఇస్తూ వచ్చింది. తర్వాత పరిస్థితి మెల్లగా టీఆర్ఎస్ వైపు మొగ్గింది. 12వ రౌండ్ సమయానికి టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందన్న అంచనాకు వచ్చేశారు. అయితే నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 2018లో బీజేపీ అభ్యర్థి గంగిడి మనోహర్రెడ్డికి 12,725 ఓట్లు లభించాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డికి 86,694 ఓట్లు వచ్చాయి. మొత్తంగా నియోజకవర్గంలో బీజేపీకి పట్టు పెరిగిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. డిపాజిట్ దక్కించుకోని కాంగ్రెస్ మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థికి డిపాజిట్ దక్కాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం.. మొత్తంగా చెల్లుబాటైన ఓట్లలో ఆరో వంతు (16.7 శాతం) కంటే ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. అంటే మునుగోడులో మొత్తంగా పోలైన 2,25,878 ఓట్లలో ఆరో వంతు అంటే 37,646 ఓట్లు, ఆపై వస్తే డిపాజిట్ దక్కినట్టు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమెతోపాటు పోటీలో ఉన్న 45 మంది అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆశ, నిరాశల మధ్య బీజేపీ శ్రేణులు సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పోరాడి ఓడారు. అధికార పార్టీకి ప్రతి రౌండ్లోనూ నువ్వా నేనా అన్నట్టు గట్టి పోటీ ఇస్తూ వచ్చారు. దీనితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆశనిరాశల మధ్య గడిపారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే పార్టీ కార్యాలయం వద్ద హంగామా చేసేందుకు సరూర్నగర్ కార్పొరేటర్ ఏర్పాట్లు చేశారు. పదో రౌండ్ దాకా బీజేపీ పుంజుకుంటుందనే ఆశలున్నా.. తర్వాత అంతా నిరుత్సాహంలోకి వెళ్లిపోయారు. సమయం గడుస్తూ, బీజేపీ విజయావకాశాలు తగ్గినకొద్దీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆఫీసు నుంచి వెళ్లిపోవడం కనిపించింది. ఉదయం నుంచీ ఓట్ల లెక్కింపు సరళిని పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీనియర్ నేతలు, హిమాయత్నగర్లోని ఎంపీ కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఎప్పటికప్పుడు విశ్లేషించారు. చదవండి: పక్కా వ్యూహంతో విజయం -
టీఆర్ఎస్ గెలుపు పోలీసులు, ఈసీదే..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు కొందరు పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఆదివారం మునుగోడు ఫలితం వెలువడ్డాక బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ నేతలు డాక్టర్ మనోహర్రెడ్డి, ఎస్.కుమార్, టి.వీరేందర్గౌడ్, జె.సంగప్ప, వెంకటరమణలతో కలసి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న ఆ అధికారులు టీఆర్ఎస్ను గెలిపించేందుకు అడ్డదారులు తొక్కారు. పోలీసులే దగ్గరుండి డబ్బు పంచారు. రూ. వందల కోట్లు పంచిన టీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎందుకు పట్టుపడలేదో, ఒక్క కేసు కూడా ఎందుకు నమోదు కాలేదో వారు సమాధానం చెప్పాలి. కాంగ్రెస్కు బీజేపీకంటే అధిక ఓట్లు రావాలని ఆ పార్టీ తరఫున సైతం టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచారు. అయినా ప్రజలు టీఆర్ఎస్కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఆశీర్వదించారు’ అని సంజయ్ పేర్కొన్నారు. అయితే ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని ప్రకటించారు. ఓడిపోయినప్పడు కుంగిపోమని, గెలిచినప్పుడు పొంగిపోమని చెప్పారు. రాజగోపాల్రెడ్డి యుద్ధంలో హీరోలా పోరాడారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం.. ‘టీఆర్ఎస్ నేతల పిచ్చి కూతలతో బీజేపీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. మరింత ఉత్సాహంతో, కసితో ప్రజలపక్షాన పోరాడతాం. వచ్చే ఎన్నికల్లో మునుగోడులో బీజేపీ జెండా ఎగరేస్తాం. మునుగోడు ఫలితంపై విశ్లేషించుకుంటాం’ అని బండి చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఈ ఫలితం ద్వారా మరోసారి నిరూపితమైందన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ ఖతమైంది. సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ కోల్పోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఐ, సీపీఎంతో ప్రత్యక్షంగా, కాంగ్రెస్తో పరోక్షంగా పొత్తు పెట్టుకొని పోటీ చేసినా... మనీ, మద్యం, మాంసం ఏరులై పారించినా... ఎన్నికల సంఘం అధికారులను, పోలీసులను అడ్డుపెట్టుకున్నా టీఆర్ఎస్కు 10 వేలకు మించి మెజారిటీ రాలేదు. బీజేపీ సింహంలా సింగిల్గా పోటీ చేసి గతంతో పోలిస్తే 7 రెట్లు అధికంగా 86 వేలకుపైగా ఓట్లు సాధించింది’ అని బండి సంజయ్ చెప్పారు. ఆ 12 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? సీఎం కేసీఆర్కు ధైర్యముంటే కాంగ్రెస్ నుంచి అనైతికంగా టీఆర్ఎస్లో చేర్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లోకి వెళ్లే దమ్ముందా? అని సంజయ్ సవాల్ విసిరారు. ఉపఎన్నికలో గెలిపిస్తే మునుగోడులోని సమస్యలన్నీ 15 రోజుల్లో పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని... ఆ గడువులోగా హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని లేనిపక్షంలో ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా, మునుగోడులో నైతిక విజయం బీజేపీ, రాజగోపాల్రెడ్డిదేనని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె. లక్ష్మణ్ చెప్పారు. సీఎం కేసీఆర్ మనీ, మద్యాన్ని ఏరులై పారించినా, ఊరికో ఎమ్మెల్యేను, మంత్రిని నియమించినా, రెండుసార్లు సీఎం పర్యటించినా బీజేపీ ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారన్నారు. -
ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి?: రంజిత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే బీజేపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడుతుండటాన్ని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి తప్పుపట్టారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగానే జరుగుతోందని తెలిపారు. బీజేపీకి తొందరపాటు ఎందుకు?. ఈసీ ఎవరి చేతిలో ఉంటుంది?. ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. 'కౌంటింగ్కు కేంద్రం నుంచి అబ్జర్వర్ వస్తారు. వాళ్ల ఆధీనంలోనే కౌంటింగ్ జరుగుతుంది. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మందు పోసినా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం. బీజేపీ నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు బీజేపీ నేతలు ఆగలేరా?. ఖర్చు పెట్టి ఓడిపోతున్నామనే భయంలో ఏదేదో మాట్లాడుతున్నారని' టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి మండిపడ్డారు. చదవండి: (Munugode Results: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి: వికాస్రాజ్) -
‘కౌంటింగ్లో ఇంత గోప్యత ఎందుకు.. మునుగోడులో ఏం జరుగుతోంది?’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. కౌంటింగ్ ఆలస్యంపై టీఆర్ఎస్, బీజేపీ విమర్శలకు దిగుతున్నాయి. కౌంటింగ్లో ఇంత గోప్యత ఎందుకు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఈవో వైఖరి ఏకపక్షంగా ఉందన్నారు. ఒకేసారి 4 రౌండ్లు ఎందుకు అప్డేట్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో ఈసీవో పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చదవండి: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్ బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్ డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల మొదటి రోజు నుండి కౌంటింగ్ దాకా సీఈవో పనితీరు అనుమానాస్పదమేనన్నారు. పోలింగ్ రోజు టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో మకాం వేస్తే.. ఎవరూ లేరని సీఈవో చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి?: రఘునందన్రావు ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఐదో రౌండ్ ఆలస్యానికి కారణమేంటి? అని ప్రశ్నించారు. -
Munugode Results: ఎన్నికల ప్రధానాధికారి తీరుపై బీజేపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్/నల్గొండ: మునుగోడు వార్ కొనసాగుతోంది. కౌంటింగ్ మందకొడిగా సాగడంలో బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రౌండ్ల వారీగా మునుగోడు ఉపఎన్నిక ఫలితాల వెల్లడిలో జాప్యంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈసీ తీరు అనుమానాస్పదం.. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్కు లీడ్ వస్తే తప్ప ఫలితాలు చెప్పరా? అంటూ మండిపడ్డారు. ఫలితాల వెల్లడిలో ఏ పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. సీఈవో విఫలం రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో సీఈవో విఫలం అయ్యిందని డీకే అరుణ అన్నారు. సీఈవో తీరు అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రచార సమయంలో చూపిన పక్షపాతమే ఫలితాల్లో చూపిస్తున్నారన్నారు. మీడియా ప్రతినిధులు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. -
Munugode Election Results: టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు షాక్!
సాక్షి, నల్గొండ: తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక తుది దశకు చేరుకుంది. నవంబర్ 3న ఎన్నిక జరగగా.. నవంబర్ 6న కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ముందునుంచీ అందరూ ఊహించినట్టుగానే ఫలితాలు ఆయా పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. రౌండ్ రౌండ్కు మారుతూ ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. ముందుగా చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కించారు. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 1352 ఓట్ల ఆధిక్యం రాగా.. రెండో రౌండ్లో బీజేపీ 789 ఓట్ల మెజారిటీ సాధించింది. ఆ తర్వాత మూడు రౌండ్లోనూ బీజేపీ 416 ఓట్లతో ఆధిక్యత కనబర్చింది. ఇక నాలుగో రౌండ్లో 299 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 714 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. టీఆర్ఎస్ 26,443, బీజేపీ 25,729, కాంగ్రెస్ 7,380 ఓట్లు సాధించాయి. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి సొంతూరి ప్రజలే షాకిచ్చారు. ఆయన సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యంలోకి రావడం గమనార్హం. ఇదిలాఉండగా.. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి సొంత మండలం చౌటుప్పల్లో టీఆర్ఎస్ పుంజుకోవడం గమనించదగ్గ విషయం. (చదవండి: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు) -
Munugode Round Wise Results: మునుగోడు ఉపఎన్నిక రౌండ్ల వారీగా ఫలితాలు
సాక్షి నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. రెండు, మూడు రౌండ్లు మినహా ఏ రౌండ్లోనూ ఆధిక్యం కనబరచని బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మూడో రౌండ్ తర్వాత ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యంలో నిలిచిన టీఆర్ఎస్.. 14 రౌండ్లు ముగిసే సరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యం సాధించింది. పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. మొత్తం 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులో.. టీఆర్ఎస్-228, బీజేపీ-224, బీఎస్పీ-10, ఇతరులకు 88 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్కు 4 ఓట్ల ఆధిక్యం లభించింది. 21 టేబుళ్ల ఏర్పాటు నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్ బూత్ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. 3-4 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది. 93.41 శాతం పోలింగ్ నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు తుది ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ! కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ సాగింది -
Munugode Result: మునుగోడులో టీఆర్ఎస్ విజయం
Time: 5:10PM ►మునుగోడులో టీఆర్ఎస్ విజయం ►ఏడు మండలాల్లో టీఆర్ఎస్కు ఆధిక్యం ►14 రౌండ్లు ముగిసేసరికి సుమారు 10వేల ఓట్ల ఆధిక్యంలో నిలిచిన టీఆర్ఎస్ ► 14వ రౌండ్లోనూ టీఆర్ఎస్దే ఆధిక్యం Time: 04:35PM ► విజయం దిశగా టీఆర్ఎస్ ► 13 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్9,039 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. ► 13వ రౌండ్లో టీఆర్ఎస్ 1,002 ఓట్ల ఆధిక్యం ► కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంతు. Time: 03:53 PM 7,836 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ 12వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ పార్టీ 7,836 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 12వ రౌండ్లో టీఆర్ఎస్కు 2,042 ఓట్ల ఆధిక్యం దక్కింది. Time: 03:45 PM కేటీఆర్ మీడియా సమావేశం సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం. Time: 03:14 PM తెలంగాణ భవన్లో సంబురాలు షురూ.. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతోంది. రౌండ్లు ముగిసే కొద్ది భారీ ఆధిక్యం సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణభవన్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి. బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Time: 03:09 PM 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 11వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. 11వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 5,794 ఓట్ల ఆధిక్యంలో ఉంది. Time: 02:44 PM 10వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 10వ రౌండ్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కనబరిచింది. 10వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 4,436 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 10వ రౌండ్లో టీఆర్ఎస్ 484 ఓట్ల ఆధిక్యం సంపాదించింది. Time: 02:16 PM 9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 9వ రౌండ్లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యం సాధించింది. 9 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 3,952 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 9వ రౌండ్లో టీఆర్ఎస్ పార్టీకి 7,515 ఓట్లు రాగా.. బీజేపీకి 6,665 ఓట్లు, కాంగ్రెస్కు 1,300 ఓట్లు, ఇతరులకు 1,100 ఓట్లు వచ్చాయి. Time: 01:58 PM చండూరుపైనే బీజేపీ ఆశలు 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరుగనుంది. Time: 01:54 PM 8వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం 8వ రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 8 రౌండ్లు ముగిసేసరికి 3,104 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. 8 రౌండ్లో టీఆర్ఎస్ 536 ఓట్లు ఆధిక్యం కనబర్చింది. Time: 01:45 PM చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ 8వ రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.ఇప్పటివరకు టీఆర్ఎస్కు 45,710, బీజేపీకి 43,155 ఓట్లు పోల్ అయ్యాయి. ఇప్పటివరకు 1,10,000 ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. చండూరు మున్సిపాలిటీ లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. చండూరుపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. 9,10 రౌండ్లలో చండూరు ఓట్ల లెక్కింపు జరగనుంది. Time: 01:27 PM ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ఏడో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఏడు రౌండ్లు ముగిసేసరికి 2,555 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. ఏడో రౌండ్లో టీఆర్ఎస్ 386 ఓట్లు ఆధిక్యం కనబర్చింది. ఏడో రౌండ్ టీఆర్ఎస్- 7,189 బీజేపీ-6,803 Time: 12:59 PM ఏడో రౌండ్ ఓట్లు లెక్కింపు మునుగోడులో హైవోల్టేజ్ హీట్ కొనసాగుతోంది. ఏడో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. ఏడో రౌండ్లో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. Time: 12:34 PM ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం ఆరో రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆరో రౌండ్ ముగిసే సరికి 2,169 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయపురం ఓట్లు లెక్కింపు ముగిసింది. ఆరో రౌండ్ టీఆర్ఎస్-6,016 బీజేపీ- 5,378 Time: 12:05 PM పారదర్శకంగా కౌంటింగ్: సీఈవో ఆరో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. కౌంటింగ్ పారదర్శకంగా జరుగుతోందని సీఈవో వికాస్రాజ్ అన్నారు. ఆలస్యానికి కారణాలు కూడా వివరించాలని చెప్పానన్నారు. కౌంటింగ్లో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. ఎన్నికల పరిశీలకులు కూడా అక్కడ ఉన్నారన్నారు. ఎక్కువ మంది పోటీలో ఉండటం వల్లే కౌంటింగ్ ఆలస్యం అవుతుందని సీఈవో తెలిపారు. Time: 11:47 AM ఐదో రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 1430 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతోంది. ఐదో రౌండ్ టీఆర్ఎస్- 5,961 బీజేపీ-5,245 Time: 11:18 AM ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదంటూ ఆరోపించారు. ఫలితాల్లో ఆలస్యం జరుగుతోంది. జాప్యానికి కారణలేంటో ఈసీ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. Time: 11:13 AM కాసేపట్లో ఐదో రౌండ్ ఫలితం ప్రతి రౌండ్కు ఉత్కంఠ కొనసాగుతుంది. రౌండ్ రౌండ్కు ఆధిక్యం మారుతుంది. ఐదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. Time: 10:39 AM చౌటుప్పల్ మండలంలో పోలైన ఓట్లు-55,678 టీఆర్ఎస్- 21,209 బీజేపీ-21,174 కాంగ్రెస్-5,169 Time: 10:34 AM ఫలితం ఎలానైనా ఉండొచ్చు: రాజగోపాల్రెడ్డి చౌటుప్పల్లో తాను అనుకున్న మెజార్టీ రాలేదని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి అన్నారు. ఫలితం ఎలానైనా ఉండొచ్చన్నారు. చివరి వరకు హోరాహోరీ తప్పకపోవచ్చని ఆయన అన్నారు. Time: 10:31 AM మునుగోడులో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి 714 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. నాలుగో రౌండ్ టీఆర్ఎస్-4,854 బీజేపీ-4,555 కాంగ్రెస్-1817 Time: 10:19 AM టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల సొంత గ్రామం లింగవారి గూడెం లో బీజేపీ ఆధిక్యం Time: 10:09 AM మునుగోడులో బీజేపీ ఆధిక్యం మునుగోడులో బీజేపీ ఆధిక్యంలో ఉంది. నాలుగు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. Time: 10:05 AM ఐదో రౌండ్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు.ఐదో రౌండ్లో నారాయణపురం ఓట్లు లెక్కిస్తున్నారు. నాలుగో రౌండ్లో 1100 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time: 09:57 AM మూడు రౌండ్లు ముగిసే సరికి 35 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. మూడో రౌండ్ టీఆర్ఎస్-7,010 బీజేపీ-7,426 కాంగ్రెస్-1,532 Time: 09:54 AM మొదటి రౌండ్లో కేఏ పాల్కు 34 ఓట్లు కేఏ పాల్కు తొలిరౌండ్లో 34 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. Time: 09:39 AM నాలుగో రౌండ్లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్కు ఆధిక్యం మారుతుంది. Time: 09:39 AM మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో ఉంది. 1000 ఓట్లు పైగా ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. Time: 09:33 AM మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రెండు రౌండు ముగిసే సరికి 563 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. మూడో రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్- 14,211 బీజేపీ-13,648 కాంగ్రెస్-2,100 Time: 09:25 AM ఆధిక్యంలో టీఆర్ఎస్ రెండు రౌండు ముగిసే సరికి 515 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ కొనసాగుతుంది. Time: 09:19 AM చౌటుప్పల్లో బీజేపీ ఆధిక్యం.. తొలిరౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చౌటుప్పల్ అర్బన్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. Time: 09:12 AM రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. బీజేపీ ముందంజలో ఉంది. 789 ఓట్లకుపైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. Time: 09:01 AM చౌటుప్పల్ మండలం జైకేసారంలో టీఆర్ఎస్ లీడ్లో ఉంది. తొలిరౌండ్(14,553) టీఆర్ఎస్- 6,478 బీజేపీ- 5,126 కాంగ్రెస్- 2,100 Time: 08:55 AM 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఈవీఎం తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. 1352 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ఉంది. Time: 08:45 AM పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్కు నాలుగు ఓట్ల ఆధిక్యం, టీఆర్ఎస్కు 228, బీజేపీ 224, బీఎస్పీ -10, ఇతరులకు 88 ఓట్లు పోల్ అయ్యాయి. మొదటి రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. Time: 08:30 AM టీఆర్ఎస్ ముందంజ.. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు Time: 08:15 AM పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను సిబ్బంది లెక్కిస్తున్నారు. 2 టేబుళ్లపై 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. Time: 08:07 AM కౌంటింగ్ కోసం 23 టేబుళ్లు.. మునుగోడు కౌంటింగ్ కోసం 23 టేబుళ్లు ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 2 టేబుళ్లు కేటాయించారు. మిగిలిన 21 టేబుళ్లలపై ఈవీఎం ఓట్లు లెక్కించనున్నారు. Time: 08:01 AM కౌంటింగ్ ప్రారంభం మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. 15 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కించనున్నారు. ముందుగా జైకేసారం, చివరగామహ్మదాపురం ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నానికల్లా విజేతపై స్పష్టత రానుంది. Time: 7:15 AM కాసేపట్లో కౌంటింగ్.. కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ♦1,2,3 రౌండ్లలో చౌటుప్పల్ మండలం ఓట్లు లెక్కింపు ♦4,5,6 రౌండల్లో నారాయణపురం మండలం ఓట్ల లెక్కింపు ♦7,8 రౌండ్లలో మునుగోడు మండలం ఓట్ల లెక్కింపు ♦9,10 రౌండ్లలో చండూరు మండలం ఓట్ల లెక్కింపు ♦11,12,13,14,15 రౌండ్లలో మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కింపు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో వెలువడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు బహిర్గతం కానుంది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం వరకు పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫలితం తేలిపోనుంది. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్ జరిగే విధానంపై సిబ్బందికి సాధారణ ఎన్నికల పరిశీలకులు పంకజ్ కుమార్ పలు సూచనలు చేశారు. నల్లగొండ ఆర్జాలబావిలోని గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం రెండు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 298 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలలోని ఓట్ల›లెక్కింపు కోసం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొదటగా చౌటుప్పల్ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. అందులో మొదటి పోలింగ్ బూత్ అయిన జైకేసారం ఓట్లతో పాటు ఆ మండలానికి చెందిన ఓట్లను లెక్కించనున్నారు. చివరగా నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామం ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రెండ్ తెలిసిపోనుంది. 2 –3 గంటల కల్లా ఎవరి భవితవ్యం ఏంటనేది తేలనుంది. మునుగోడు ప్రజల తీర్పు వెల్లడికానుంది. నియోజకవర్గంలో 2,41,855 ఓటర్లు ఉన్నారు. అందులో సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని ఈ ఉప ఎన్నికల్లో 2,25,878 ఓట్లు పోలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 93.41 శాతం పోలింగ్ నమోదైంది. భారీ స్థాయిలో ఓట్లు పోలైన నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించి ఎంత ఆలస్యం జరిగినా సాయంత్రం 4 గంటల వరకు ఫలితం వెల్లడి కానుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ! కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా నాటి నుంచే అనధికారికంగా ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్నికల షెడ్యూల్ జారీ అయినప్పటి నుంచి అధికారికంగా ప్రచారం కొనసాగింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమ పార్టీకి పట్టం కడతాయని టీఆర్ఎస్ విశ్వసిస్తుండగా ప్రజలకు తాను సేవ చేశానని, అలాగే యువతలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తనను గెలిపిస్తుందని రాజగోపాల్రెడ్డి భావిస్తున్నారు. -
‘కమల్ హాసన్’ గర్వపడేలా నటించాడు.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో భాగంగా పోలింగ్ రోజున ఓ బీజేపీ నాయకుడు పోలింగ్ బూత్ వద్ద వ్యవహరించిన తీరుపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నాయకుడు చేసిన యాక్టింగ్పై వైరల్ అయిన వీడియోపై టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ చేసిన ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ‘కమల్హాసన్’గర్వపడేలా నటించాడు అంటూ కేటీఆర్ చమత్కరించారు. క్రిశాంక్ తన ట్వీట్లో ‘బీజేపీ నాయకుల డ్రామాను ఈ దేశ ప్రజలు తప్పక చూడాలి. పోలింగ్ స్టేషన్లోకి మొబైల్ తీసుకెళ్లొద్దని సూచించినందుకు..వేరే వ్యక్తికి ఫోన్ను విసిరేసి, పోలింగ్ కేంద్రంలోకి పరుగెత్తాడు. తనకు తానే నేలపై పడుకుని, పోలీసులు కొట్టారని ఏడ్చాడు. మోదీ యాక్టింగ్ స్కూల్’అని క్రిశాంక్ ట్వీట్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. 😂 Kamal Hasan would be proud https://t.co/AoOKtSGW40 — KTR (@KTRTRS) November 4, 2022 చదవండి: జాతీయ బరిలో బీఆర్ఎస్.. ‘ఫామ్హౌస్’ ఫైల్స్పై దేశవ్యాప్తంగా ప్రచారం -
ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్దామ్గ జేస్కుండ్రు
నారదుడు నెత్తి మీది కెల్లి తానం జేసిండు. కొప్పేసుకుండు. తంబూర తీస్కున్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు. తెలంగాన దిక్కు రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు గాయినకు ఎదురైంది. ‘‘యాడికెల్లి వొస్తున్నవు?’’ అని నారదుడు దున్నుపోతు నడిగిండు. ‘‘తెలంగానకెల్లి’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘గాడికెందుకు బోయినవ్?’’ ‘‘సదర్ పండ్గకు మా దున్నపోతులు రమ్మంటె బోయొస్తున్న’’ ‘‘పండ్గ మంచిగైందా?’’ ‘‘మునుగోడు ఎలచ్చన్లట. టీఆర్ఎస్ దున్నపోతులనుకుంట మాదాంట్ల కొన్నిటిని మోటర్ మీద గూసుండ బెట్టిండ్రు. కొన్నిటి మెడల తామర పూల దండేసి బీజేపీ దున్నపోతులన్నరు. ఇగ కొన్ని టిని కాంగ్రెస్ దున్నపోతులనుకుంట గవ్విటితోని పాదయాత్ర జేపిచ్చిండ్రు.’’ ‘‘సదర్ పండ్గ అయినంక గుడ్క తెలంగాన లెందుకున్నవ్? ‘‘పండ్గలన్నిట్ల పెద్ద పండ్గ ఓట్ల పండ్గ. గా పండ్గను మునుగోడుల ధూమ్దామ్గ జేస్కుండ్రు. గా బై ఎలచ్చన్ల ఓట్ల పండ్గ అయ్యె దాంక తెలంగానల ఉంటె బాగుంటదనుకున్న. అనుకోని ఇయ్యాల్టిదాంక మునుగోడులనే ఉన్న’’ ‘‘ఓట్ల పండ్గ ఎట్లైంది’’ ‘‘శాన మంచిగైంది. శాన్దార్గ అయ్యింది. నెల న్నర గాకుంట యాడాదంత గీ ఓట్ల పండ్గ ఉంటె బాగుండుననిపిచ్చింది’’ ‘‘గంత గనం బాగుందా?’’ ‘‘అవ్. ఇదువరదాంక ఏ బై ఎలచ్చన్ల ముక్యమంత్రి ప్రచారం జెయ్యలేదు. గని మునుగోడు బై ఎలచ్చన్ల రొండు పార్లు ప్రచారం జేసిండు. చండూరుల మాట్లాడుకుంట వడ్ల కొనుడు శాతగానోల్లు వందు కోట్లు సంచులల్ల బెట్టుకోని మా ఎమ్మెల్యేలను కొనెతంద్కు వొచ్చిండ్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మేము గొన్నం. మేము గొన్న ఎమ్మెల్యేలను బీజేపోల్లు కొనెతంద్కువొచ్చు డేమన్న బాగుందా? పడ్తల్ బడక మా ఎమ్మెల్యేలు గోడదుంకలేదు. జెనం కోసమే నేను గాలి మోటార్ గొన్న. జెనం కోసమే యాద్గిరి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిన. సలికాలం తడి బట్టల తోని ఒట్టు తినెతంద్కు బండి సంజయ్ లెక్క నేనేమన్న అవులగాన్నా? అని కేసీఆర్ అన్నడు’’ ‘‘ముక్యమంత్రి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిండు. గంతేగాకుంట బంగారి గడ్డ మీద్కెల్లి స్పీచ్ గొట్టిండు. తలా తులం బంగార మేమన్న ఇస్తడా?’’ ‘‘మాంసం దినెటోల్లు యాడనన్న బొక్కలు మెడలేసుకుంటరా?’’ ‘‘బై ఎలచ్చన్లు జెయ్య బట్కె మాయబజార్ లెక్క మునుగోడు బదల్ గయా! తొవ్వలు లేని ఊర్లకు తొవ్వలు ఏసిండ్రు. సర్కార్ జీతగాల్లకు పదో తారీకున గాకుంట పహిలీ తారీక్కే జీతాలు బడ్డయి. అంబటాల్ల బువ్వకు 40 లక్షల రూపాయలు మంజూరైనయి. షాదీ ముబారక్, కల్యాన లచ్మిలకు టోల్ రూపాయలు ఇచ్చిండ్రు. డిండి ఎత్తిపోతలు జెయ్య బట్కె ఎవుసం బూములు పోడగొట్టుకొన్న రైతులకు 116 కోట్లు మంజూరు జేసిండ్రు. ముక్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలందరు మునుగోడు జెనం సుట్టూత చక్కర్లు గొట్టిండ్రు. నేను రాజినామ జేసి బీజేపీల దుంకబట్కె గిదంత అయిందని రాజగోపాల్ రెడ్డి అన్నడు. బీజేపీ ఏ ఎమ్మెల్యేను కొనలేదనుకుంట యాద్గిరి గుట్టల దేవుని ముంగట తడి బట్టల్తోని బండి సంజయ్ ఒట్టు దిన్నడు. గడీల కాడ కావలి గాసేటి కూసు కుంట్ల గావాల్నా? కేసీఆర్ గల్ల బట్టె రాజగోపాల్ రెడ్డి గావాల్నా? అని గాయిన అడిగిండు.’’ ‘‘కాంగ్రెస్ సంగ తేంది?’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి స్రవంతి నిలవడ్డది. ఆడోల్ల ఓట్లన్ని గామెకే బడ్తయని కాంగ్రెస్ లీడర్లు అనుకున్నరు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంపెల్లిల మాట్లాడుకుంట అందర్కి దండం బెట్టి అడ్గుతున్న ఆడిబిడ్డకు ఒక్క మోక ఇయ్యుండ్రి. మీ చేతులల్ల బెడ్తున్న గీ బిడ్డను సంపుకుంటరో, సాదుకుంటరో మీ ఇస్టం. ఎన్కకెల్లి కాంగ్రెస్ను బొడ్సి రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం బీజేపీల దుంకిండు అన్నాడు. మీరు టీడీపీని ఎన్కకెల్లి బొడ్సి కాంగ్రెస్లకు దుంకిన తీర్గనా?’’ అని ఎవడో లాసిగ అడిగిండు. ‘‘కేటీఆర్ ఎట్ల ప్రచారం జేసిండు?’’ ‘‘గా గట్టున మాయల మరాటి మోదీ. గీ గట్టున తెలంగాన. గీ గట్టున మోటర్ గుర్తు కూసు కుంట్ల. గా గట్టున బీజేపీ, కాంగ్రెస్ బేకార్ గాల్లు. గీ గట్టున దలిత బందు. గా గట్టున పీక్క తినేటి రాబందు. గీ గట్టున అంబేద్కరసువంటి కేసీఆర్. గా గట్టున మత పిచ్చి మోదీ. గా గట్టున ఉంటరా? గీ గట్టున పంటరా? అని సవాల్లు అడ్గుకుంట కేటీఆర్ ప్రచారం జేసిండు.’’ ‘‘గాయిన గా గట్టున ఉన్నా గీయిన గీ గట్టున ఉన్నా ఇద్దరు గల్సి జెనంను నీల్లల్ల నిండ ముంచుతరు’’ అని నారదుడన్నడు. ‘‘మల్ల గలుస్త’’ అనుకుంట యముని దున్నపోతు నర్కం దిక్కు బోయింది. నారదుడు పీచే ముడ్ అన్కుంట వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: సిత్రాలు సూడరో శివుడో శివుడా!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
ఒక్క మునుగోడులోనే 300 కోట్ల మద్యం అమ్మకాలు
-
మునుగోడు రిజల్ట్ పై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్
-
మునుగోడు ఎవరిది ..?
-
మునుగోడు ఫలితాలపై తేల్చేసిన కేఏ పాల్!
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో 50వేల మెజారిటీతో గెలువబోతున్నానని ప్రజా శాంతిపార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ధీమావ్యక్తం చేశారు. శుక్రవారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోకవర్గంలో యువత, మహిళలు ఇతర ప్రజలు నాపై ప్రేమ చూపించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడులో సందర్శిస్తున్న సమయంలో తనపై మూడు సార్లు దాడులకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆర్ఓ ఇతర అధికారులు రక్షించారని తెలిపారు. 155 దేశాల్లో తిరిగినా దక్కని ప్రేమను మునుగోడు ప్రజలు ఇచ్చారని, వారికి జీవితాంతం కృతజ్ఞడునై ఉంటానని చెప్పారు. మునుగోడులో ప్రజాస్వామ్యం ఖూనీ మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని పాల్ ఆరోపించారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా గెలిచే పరిస్థితి లేదన్నారు. ప్రచారం సందర్భంగా పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, ఎస్పీ కూడా అధికార పార్టీకి ఏజెంట్గా వ్యవహరించిందని ఆరోపించారు. కనీసం గన్మెన్లను కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గద్దర్కు గన్మెన్లు ఇచ్చారు. నాకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు దేశాన్ని , రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని ఆరోపించారు. ఉప ఎన్నికలో అలాంటి పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు వారిని నమ్మలేదన్నారు. ఎమ్మెల్యేలు కొనుగోలు అంతా డ్రామా... ఎమ్మెల్యేల కొనుగోలు అంతా డ్రామా అని ఆయన ఆరోపించారు. సీఎం అయితే తెలంగాణను బంగారు తెలంగాణను చేస్తానన్నారు. అమిత్షా నన్ను పార్టీలో చేరమన్నాడు. మంత్రి పదవి కూడా ఇస్తానని చెప్పారన్నారు. నేను కాదని చెప్పానని , పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని చెప్పాడన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు టీఆర్ఎస్ ఒప్పుకుందని , బీజేపీ ఇండరైక్టుగా మద్దతు ఇస్తే కాంగ్రెస్ నేరుగా మద్దతిచ్చిందని కాబట్టి గెలిచేది ఇక నేనే అని ఆయన చెప్పుకొచ్చారు. -
పాత రికార్డులు బద్దలు.. మునుగోడులో 93.41% పోలింగ్..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే 24 వేల మందికి పైగా ఓటర్లు పెరిగారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల శాతం కంటే ఈసారి 2.11 శాతం అదనంగా పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.30 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఈసారి 93.41 శాతం మంది ఓట్లు వేశారు. నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 686 పోస్టల్ ఓట్లు కాగా, 2,25,192 మంది స్వయంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్, ముంబై నుంచి కూడా.. ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఓటర్లకు రవాణా సదుపాయం కల్పించాయి. దీంతో హైదరాబాద్, ముంబై, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేశారు. దీంతో పోలింగ్ శాతం పెరిగింది. దివ్యాంగులు, మంచానికి పరిమితమైన 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈసారి పోస్టల్ బ్యాలెట్కు అవకాశం ఇవ్వడం పోలింగ్ శాతం పెరగడానికి దోహదపడింది. 686 మంది పోస్టల్బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అత్యధికంగా నారాయణపురం మండలం చిత్తన్నబావి గ్రామంలో 98.34 శాతం పోలింగ్ నమోదైంది. దామెర బీమనపల్లిలోని 240 పోలింగ్ కేంద్రంలో అతి తక్కువ పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా చూస్తే అత్యధికంగా నారాయణపురం మండలంలో 93.76 శాతం పోలింగ్ జరిగింది. చౌటుప్పల్ మండలం నేలపట్లలోని 4వ పోలింగ్ స్టేషన్లో, సంస్థాన్ నారాయణపురం మండలం ఐదుదొనెల తండాలో 72వ పోలింగ్ కేంద్రంలో, గుజ్జ, నారాయణపురంలో ఒక పోలింగ్ స్టేషన్, మునుగోడు మండలం గంగోరిగూడెం, కొండూరు పోలింగ్ కేంద్రాల్లోనూ మహిళలు, పురుషుల ఓట్లు సమాన సంఖ్యలో పోలయ్యాయి. 105 పోలింగ్ కేంద్రాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేశారు. చదవండి: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..? -
Munugode Bypoll: 15 రౌండ్లలో కౌంటింగ్.. మధ్యాహ్నానికి ఫలితం!
నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఆదివారం జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఆర్జాలబావి గోదాముల్లో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ కోసం మొత్తం 75 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఈవీఎంలు అందించేందుకు, ఇతర అవసరాలకు గాను 300 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. పూర్తి ఫలితం మధ్యాహ్నం ఒంటి గంట వరకు వచ్చే అవకాశం ఉంది. 23 టేబుళ్ల ఏర్పాటు..: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం రెండు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈవీఎంలలో ఓట్లను లెక్కించేందుకు 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ను నియమించారు. ఒక్కో టేబుల్ మీద ఒక్కో పోలింగ్ స్టేషన్కు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అలా ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 9 గంటల కల్లా తొలిరౌండ్ ఫలితం మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 686 లెక్కించిన తర్వాత అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లను ఓపెన్ చేస్తారు. ఈవీఎంలను కౌంటింగ్ హాల్కు తీసుకొస్తారు. 21 టేబుళ్లమీద వాటిని లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం 9 గంటలోపు రానుంది. గంటలో 4 రౌండ్లు లెక్కించే అవకాశం ఉండడంతో.. ఒంటి గంట వరకు మునుగోడు ఉప ఎన్నికల ఫలితం తేలిపోనుంది. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల బందోబస్తు మధ్య కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్, ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, రాహుల్శర్మ, రిటర్నింగ్ అధికారి రోహిత్సింగ్ పరిశీలించారు. చదవండి:ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..? -
Munugode ByElection: ఫలితాన్ని నిర్ణయించే ఆ ఓట్లు ఎవరికో..?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో చివరి కొన్ని గంటల్లో పోలైన ఓట్లు ఎవరికి పడ్డాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆ ఓట్లే గెలుపోటములను ప్రభావితం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతుండటంతో ఆ ఓట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం సాయంత్రం 5 గంటల తరువాత 37,665 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి పోలింగ్ ఊపందుకున్నా సాయంత్రం 5 గంటల తరువాత అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు పోలింగ్లో పాల్గొన్నారు. అవి తమకు పడ్డాయంటే తమకే పడ్డాయంటూ అభ్యర్థులు, ఆయా పార్టీల వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే వరకు లైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్నిచోట్ల రాత్రి 9 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. యువత, మహిళలే ఎక్కువ.. గురువారం ఉదయం వేళలో ఎక్కువ మంది వృద్ధులు, మధ్య వయస్కులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాతే ఎక్కువ మంది మహిళలు, యువత, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోలింగ్లో పాల్గొన్నారు. 5 గంటల సమయంలో కూడా ఎక్కువ మంది మహిళలు, యువతే వచ్చి లైన్లలో నిల్చున్నారు. రాత్రి 9 గంటల వరకు కూడా వారే పోలింగ్లో పాల్గొన్నారు. వీరంతా ఎవరికి ఓట్లు వేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఆలస్యం అందుకే.. సాధారణంగా ఇతర ప్రాంతాల వారు ఉదయమే వచ్చి పోలింగ్లో పాల్గొని వెళ్లిపోతారు. అయితే చాలామంది ఆలస్యంగా నియోజకవర్గానికి చేరు కోగా, ఉదయమే వచ్చినవారిలో కూడా చాలామంది సాయంత్రం వరకు వేచి ఉన్నట్లు తెలిసింది. మరోవైపు రెండో విడత డబ్బులు పంచుతారన్న ఆలోచనతో చాలా మంది గ్రామాల్లోనే ఆగిపోయినట్లు సమాచారం. అవి అందాకే పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. ఇంకోవైపు కొందరు ఓటర్లు ఒక పార్టీ నుంచి తమకు డబ్బులు అందలేదంటూ గొడవలకు దిగారు. అవి అందిన తర్వాత సాయంత్రం ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందనుకుంటే.. ఏ పార్టీ అభ్యర్థికైనా లక్ష ఓట్లు మించి పోలైతేనే గెలుపొందే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తే మాత్రం అంత అవసరం లేదని, 90 వేల వరకు వచ్చిన అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. రూ.10 వేల నుంచి లక్షల్లో.. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నికలో గెలిచేదెవరన్నదానిపై బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం, పోలింగ్ రోజు సాయంత్రం మహిళలు, యువత అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడాన్ని పరిగణనలోకి తీసుకుని బెట్టింగ్లను కొనసాగిస్తున్నారు. కొంతమంది టీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని, మరికొంత మంది బీజేపీ అభ్యర్థి గెలుస్తారని పందేలు కాస్తుండగా.. మరికొందరు కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలవచ్చనే అంచనాలతో బెట్టింగ్ కాస్తున్నారు. రూ.10 వేలు మొదలుకొని రూ.లక్షల్లో బెట్టింగ్లు కాస్తున్నట్లు తెలిసింది. తెల్లవారుజామున స్ట్రాంగ్ రూమ్లకు.. పోలింగ్ రాత్రి 9 గంటల వరకు కొనసాగిన నేపథ్యంలో చివరి ఈవీఎంలు శుక్రవారం తెల్లవారుజామున 4.55 గంటలకు స్ట్రాంగ్ రూమ్లకు చేరుకున్నాయి. నల్లగొండ ఆర్జాలబావిలోని ఎఫ్సీఐ గోదాముల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: ఎంత పనైపాయే.. అయ్యో కళ్యాణ్! -
బిగ్ క్వశ్చన్ : పోలింగ్ ముగిసినా తగ్గని పొలిటికల్ హీట్
-
పొలిటికల్ కారిడార్ : కాంగ్రెస్ కు చావో రేవో అన్నట్లుగా మారిన మునుగోడు
-
‘మునుగోడు ఫలితం రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తుంది’
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చివేస్తుందని, తమ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి గెలుపు ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా.. డబ్బు, మద్యం ఏరులుగా పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమే నన్నారు. తమ విజయంతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ల ‘ఖేల్ఖతం’కానుందని అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నాశనం చేశారని ధ్వజ మెత్తారు. పోలింగ్ ప్రకియను సక్రమంగా జరపకుండా ఈసీ కూడా తప్పుచేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రధానాధికారి పూర్తిగా కేసీఆర్ జేబు మని షిగా మారారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాచకొండ కమిషనర్, నల్లగొండ జిల్లా ఎస్పీ టీఆర్ఎస్కు తొత్తులుగా మారారని మండిపడ్డారు. ఏడేళ్లుగా ఒకే చోట పోస్టింగ్ కొనసాగించి అవినీతి, అక్రమాలకు అవకాశం కల్పించినందుకు పోలీస్ కమిషనర్ తోపాటు జిల్లా ఎస్పీ కేసీఆర్కు గులాంగిరీ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రలోభాలపై తాము పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. డబ్బు పంపిణీ చేసిన వారిలో 42 మందే దొరికారని అధికారులు పేర్కొనడం విడ్డూ రంగా ఉందన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసు ల పక్షపాత వైఖరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేస్తామన్నారు. పోలింగ్పై టీఆర్ఎస్ ఫేక్ సర్వేలను ప్రచారంలోకి తెచ్చిందని మండిపడ్డారు. చదవండి: పెరిగిన ఓటింగ్ శాతం.. బీజేపీ ఏమంటోంది? వెయ్యికోట్లు ఖర్చుచేశారు.. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదోనన్న భయంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా మునుగోడులో రూ.వెయ్యికోట్లకు పైగా ఖర్చు చేశారని సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ నెల రోజులుగా మునుగోడు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర రూపాల్లో ప్రలోభాలకు గురిచేసిందన్నారు. టీఆర్ఎస్ నేతలు అంబులెన్స్లు, పోలీసు వాహ నాల్లో పెద్దమొత్తంలో డబ్బులు తరలిస్తే పోలీసులు సహకరించారన్నారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఓటుకు రూ.30 వేలు ఇచ్చినా, బంగారు బిస్కెట్లు ఇచ్చినా ప్రజలు బీజేపీనే గెలిపించబోతున్నారని పేర్కొన్నారు. తమకు అనుకూలమైన పోలీసు అధికారుల లిస్ట్ తయారు చేసుకుని వాళ్లకు డ్యూటీ వేసి బీజేపీ నేతలు, కార్యకర్తలను కొట్టించారని, చండూరులో విచక్షణారహితంగా కొట్టారని ధ్వజమెత్తారు. ఓటుకు రూ.50 వేలు ఇచ్చిండు ‘ఒక గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ఓటుకు రూ.50 వేలిచ్చిండు. ఒక్క గ్రామానికే రూ.20 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుకుంటున్నారంటే.. ఏ స్థాయిలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించారో అర్థమవుతోంది. పోలింగ్ జరుగు తున్న టైంలోనే ట్విట్టర్ టిల్లు.. రంగంతండా, హాజినా తండా ప్రజలకు ఫోన్ చేసి అన్ని విధాలా ఆదుకుంటామని ప్రజలను ప్రలోభపెడుతూ ఎన్ని కల నిబంధనలను ఉల్లంఘించారు’ అని సంజయ్ మండిపడ్డారు. -
Munugode Bypoll: పోటెత్తిన ఓటర్లు.. 92 శాతం పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. 92 శాతం పోలింగ్ నమోదైనట్లు గురువారం రాత్రి 11 గంటల సమయంలో అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా తొలుత మందకొడిగా సాగింది. 50 ఏళ్ల పైబడిన వారు, వృద్ధులు అధికంగా పోలింగ్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు బూత్లకు రావడం పెరిగింది. మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదు కాగా, 11 గంటల వరకు 25.8 శాతం నమోదైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3 శాతం ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక 3 గంటల వరకు 59.92 శాతం మంది ఓట్లు వేశారు. 50 మంది సర్వీసు ఓటర్లు మినహాయిస్తే మిగతా 2,41,805 మందికి గాను 1,44,878 మంది మధ్యాహ్నం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు 1,87,527 మంది ఓటు హక్కును వినియోగించుకోవడంతో 77.55 శాతం పోలింగ్ నమోదైంది. 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి కూడా పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడ్డారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం సహా చాలా గ్రామాల్లో రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఈవీఎంల మొరాయింపు చండూరు మండలం కొండాపురం గ్రామంలో పోలింగ్ ప్రారంభమైన గంట తర్వాత ఈవీఎంలలో సాంకేతిక లోపం తలెత్తింది. చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో ఈవీఎంలలో సాంకేతి లోపం ఏర్పడి దాదాపు గంట పాటు మొరాయించాయి. వాటిని మార్చేసి పోలింగ్ కొనసాగించారు. నాంపల్లి మండల కేంద్రంలో, సంస్థాన్నారాయణపురం మండలం కేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగా పనిచేయలేదు. అల్లందేవి చెరువు గ్రామంలో ఈవీఎంలో ఎర్రర్ చూపించడంతో 20 నిమిషాల వరకు పోలింగ్ ఆగిపోయింది. కేటీఆర్ హామీతో పోలింగ్కు హాజరు! గట్టుప్పల్ మండలం రంగతండా, హజినతండా గ్రామస్తులు మధ్యాహ్నం వరకు ఓటు వేయలేదు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్రామ పంచాయతీలుగా చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాల్లో వసతులు కల్పిస్తామని హామీ ఇస్తేనే ఓటింగ్లో పాల్గొనమంటూ భీష్మించుకుని కూర్చున్నారు. 3 గంటల ప్రాంతంలో తహసీల్దార్ వచ్చి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఓ టీఆర్ఎస్ నాయకుడు..కొందరు గ్రామస్తులను మంత్రి కేటీఆర్తో ఫోన్లో మాట్లాడించారు. సమస్యలను పరిష్కరిస్తానని, తానే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో పోలింగ్లో పాల్గొన్నారు. పలుచోట్ల ఉద్రిక్తతలు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. మర్రిగూడ మండల కేంద్రంలో సిద్దిపేట జిల్లాకు చెందిన వారు ఉన్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారు వెళ్లిపోయేంతవరకు పోలింగ్ను ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో గొడవ ముదిరింది. పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలో వరంగల్కు చెందిన వారు స్థానికంగా ఉన్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. మధ్యాహ్నం తర్వాత చండూరులో డబ్బులు పంచుతున్నారంటూ టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో పాటు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. రూ.14.5 లక్షలు స్వాధీనం నాంపల్లి మండలం మల్పరాజు గ్రామంలో కొందరు ఓటర్లకు డబ్బులు పంపిణీకి ప్రయత్నిస్తుండడంతో పోలీసులు, ఇతర సిబ్బంది వారి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. చండూరు పరిధిలో రూ.1.60 లక్షలు, గట్టుప్పల్ మండలంలో రూ. 2.90 లక్షలు పట్టుకున్నారు. నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి పలు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. చదవండి: న్యాయవ్యవస్థే కాపాడాలి.. దేశంలో ప్రజాస్వామ్యం హత్య: సీఎం కేసీఆర్ -
మునుగోడు పోలింగ్ జాతర.. పోటెత్తిన ఓటర్ మహాశయులు (ఫొటోలు)
-
మునుగోడు ఎగ్జిట్పోల్స్ సర్వేలో ఆ పార్టీదే హవా..!
-
మునుగోడు ఎగ్జిట్పోల్స్ సర్వేలు.. సీన్ రివర్స్ ఆ పార్టీదే హవా!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్పోల్ సర్వేలు తమ నివేదికలను వెల్లడిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. థర్డ్ విజన్ రీసెర్చ్- నాగన్న ఎగ్జిట్పోల్స్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్- 48-51 శాతం బీజేపీ- 31-35 శాతం కాంగ్రెస్- 13-15 శాతం బీఎస్పీ- 5-7 శాతం ఇతరులు- 2-5 శాతం. ఎస్ఏఎస్ గ్రూప్ ఎగ్జిట్పోల్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్- 41-42 శాతం బీజేపీ- 35-36 శాతం కాంగ్రెస్- 16.5-17.5 శాతం బీఎస్పీ- 4-5 శాతం ఇతరులు- 1.5-2 శాతం. నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఎగ్జిట్పోల్ సర్వే ప్రకారం.. టీఆర్ఎస్- 42.11 శాతం బీజేపీ- 35.17 శాతం కాంగ్రెస్- 14.07 శాతం బీఎస్పీ- 2.95 శాతం ఇతరులు- 5.70 శాతం. -
ఈనెల 6న కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాం : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్
-
మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసింది : బండి సంజయ్
-
మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం : కర్నె ప్రభాకర్
-
మునుగోడు ఉప ఎన్నిక వేళ.. ఫేక్ ప్రచారాల గోల..
-
Munugode Bypoll 2022: ఉప ఎన్నికల వేళ.. ఫేక్ ప్రచారాల గోల!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగితేలాయి. పోలింగ్ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరడంతో పార్టీల ప్రచారం పతాకస్థాయికి చేరింది. సోషల్ మీడియా వేదికగా పార్టీలు ఫేక్ పోస్టుల యుద్ధానికి దిగాయి. ఫలానా నేత తమ పార్టీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారని, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. స్రవంతిపై బోగస్ ప్రచారం: కాంగ్రెస్ గతంలో దుబ్బాక లో చేసిన విధంగా నేడు మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై అసత్య ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని అధికార పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను స్రవంతి కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మకై తమ అభ్యర్థి పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బోగస్ వీడియో సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ నేతలు పోరిక బలరాం, పొన్నం ప్రభాకర్, మధుసూదన్రెడ్డి ట్విటర్ ద్వారా కోరారు. నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు: స్రవంతి తనపై జరుగుతున్న అసత్య ప్రచారం గురించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లతామని పాల్వాయి స్రవంతి తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇలాంటి బోగస్ ప్రచారాలతో తన మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని స్రవంతి స్పష్టం చేశారు. బీజేపీలో చేరడం లేదు: కర్నె టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీ మారడం లేదని, మునుగోడులో ఓటమి భయంతో తనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని కర్నె ప్రభాకర్ వివరణయిచ్చారు. ఇటువంటి అసత్య ప్రచారాలతో బీజేపీ గెలవాలనుకుంటే వారి దౌర్భాగ్యపు పరిస్థితికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఇటువంటి వార్తలను నమ్మొద్దని ఆయన కోరారు. మునుగోడులో కచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
పోలింగ్ కేంద్రం నుంచి కేఏ పాల్ పరుగులు ..
-
పోలింగ్ కేంద్రాల నుంచి పరుగులు పెట్టిన కేఏ పాల్.. ఎందుకంటే?
సాక్షి, నల్గొండ జిల్లా: ఉప ఎన్నికల వేళ మునుగోడు పోలింగ్ కేంద్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పరుగులు పెడుతూ కనిపించారు. పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పరిశీలించి బయటకు వచ్చిన కేఏ పాల్ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడానికి వచ్చానన్నారు. మునుగోడు ప్రజలు మార్పు కోసం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ తన విన్యాసాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో ప్రజలతో కలిసి డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉత్సాహంగా ముందుకెళ్లారు. రైతు వేషంతో దర్శనమిచ్చారు. సైకిల్ తొక్కుతూ కనిపించారు. తన మాటలు, చేష్టలతో రైతులను నవ్వించారు. పోలింగ్ రోజున కూడా తన దైన శైలిలో పంచ్లు వేస్తూ, పరుగులు పెడుతూ నవ్వించారు. -
కేసీఆర్ను కలిసినట్లు స్రవంతి ఫేక్ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు పోలింగ్ వేళ ప్రత్యర్థులపై పార్టీలు ఫేక్ ప్రచారానికి తెరలేపాయి. నిన్నటి నుంచి అన్ని పార్టీల మీద ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్ న్యూస్పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసినవారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు. పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్ను కేసీఆర్ను కలిశారంటూ నకిలీ వీడియో ప్రచారం అయ్యింది. చదవండి: పోతరాజు అవతారమెత్తిన రాహుల్.. కొరడాతో విన్యాసం మునుగోడు ఉపఎన్నికల్లో తోడుదొంగలు, మాయా మారీచులు, తెరాస బీజేపీ కలిసి విడుదల చేసిన ఫేక్ న్యూస్ పై విరుచుకు పడ్డ పాల్వాయి స్రవంతి గారు @PalvaiINC ఫేక్ న్యూస్ చేసి విడుదల చేసిన వారి పై లీగల్ యాక్షణ్! సిగ్గు విడిచిన కేసీఆర్, బీజేపీలు! గెలవలేక దొంగ నాటకలు! pic.twitter.com/Xpo2Rz01Jk — Telangana Congress (@INCTelangana) November 3, 2022 -
మునుగోడులో తులం బంగారం, రూ.30వేలు అని ఊరించి.. రూ.3వేలతో
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): ఓటర్లను కొనుగోలు చేసేందుకు ప్రధాన పార్టీలు ముందస్తుగా డబ్బులు, బంగారం ఎర చూపినప్పటికీ తీరా ఎన్నిక దగ్గర పడడంతో రూ.3వేలతోనే సరిపుచ్చడంతో నిర్ఘాంతపోవడం ఓటర్ల వంతు అయింది. మునుగోడు ఉప ఎన్నికలో ఎంతో ఆశతో ఎదురు చూసిన ఓటర్లకు రాజకీయ నాయకులు షాకిచ్చారు. ఇంటికి తులం బంగారం, ఓటుకు రూ.30వేలు ఇస్తామని ఆయా ప్రధాన పార్టీలు గుట్టుగా ప్రచారం చేసినప్పటికీ ఓటరు ఊహకు అందకుండా రూ.3వేలతో సరిపుచ్చారని పలువురు పేర్కొంటున్నారు. ఎవరు ఎక్కువ తాయిలాలు ముట్టజెప్తే వారికే ఓటు వేయాలన్న ఆలోచనతో సగటు ఓటరు ఆలోచిస్తున్నాడు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలైన ప్రధాన పార్టీల నాయకులు పోటాపోటీగా ఓటర్లకు నగదు అందించాలని చూసినా పలుచోట్ల ఓ పార్టీ నాయకులను మరో పార్టీ నాయకులు అడ్డుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆశించిన విధంగా డబ్బులు అందకపోవడంతో ఓటర్లు నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. -
చండూరు మండల కేంద్రంలో ఉద్రికత్త
-
Munugode Bypoll 2022 : పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన ఓటర్లు (ఫొటోలు)
-
మునుగోడుకు బయల్దేరిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అడ్డుకున్నపోలీసులు
-
Munugode Bypoll 2022: మునుగోడులో పోలింగ్ శాతం 90 ప్లస్
90శాతానికిపైగా.. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో 92 శాతం ఓటింగ్ నమోదైంది. Time: 6: 01PM • మునుగోడులో పోలింగ్ ముగిసింది. ఇంకా చాలాచోట్ల ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. Time: 5:26PM సాయంత్రం ఐదు గంటల వరకూ 77.55 శాతం పోలింగ్ Time: 4:00PM నల్లగొండ జిల్లా కొరిటికల్లో ఉద్రిక్తత టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మధ్య ఘర్షణ నాన్ లోకల్స్ తిరుగుతున్నారని బీజేపీ ఆరోపణ పోలీసులతో బీజేపీ కార్యకర్తల వాగ్వాదం, లాఠీచార్జ్ Time: 3:20PM మధ్యాహ్నం మూడు గంటల వరకు 59.92 శాతం పోలింగ్ Time: 01:20 PM మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం పోలింగ్ నమోదైంది. Time: 12:05 PM ఫేక్ న్యూస్ను నమ్మొద్దు: రాజగోపాల్రెడ్డి తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధర్మం వైపే మునుగోడు ప్రజలు నిలుస్తారన్నారు. Time: 11:45 AM ఈసీకి ఫిర్యాదు చేశా.. పాల్వాయి స్రవంతి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. ఫేక్ న్యూస్పై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆమె పేర్కొన్నారు. మార్ఫింగ్ ఫొటోతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసున్నారని తెలిపారు. దుష్ప్రచారం చేసిన వారికి నోటీసులు పంపిస్తానని స్రవంతి తెలిపారు. Time: 11:19 AM ఉదయం 11 గంటల వరకు 25.8 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడులో జోరుగా పోలింగ్ సాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. Time: 10:32 AM పోలింగ్ బూత్ వద్ద అపశ్రుతి చండూరు పోలింగ్ బూత్ వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. పోలింగ్ సెంటర్ గేట్ వద్ద పైపుల్లో మహిళ కాలు ఇరుక్కుపోయింది. స్థానికులు మహిళను రక్షించారు. Time: 9:42 AM చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చండూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికేతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బీజేపీ ఆందోళనకు దిగింది. మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాన్ లోకల్స్ ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. Time: 9:40 AM 11.2 శాతం పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు నిరీక్షిస్తున్నారు. Time: 9:23 AM కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన మునుగోడు పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంస్థాన్ నారాయణపురంలో పోలింగ్ను సీపీ మహేష్ భగవత్ పరిశీలించారు. Time: 9:19 AM టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం మర్రిగూడలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాన్ లోకల్స్ ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. Time: 9:08 AM కొంపల్లిలో ఈవీఎంల మొరాయింపు మునుగోడు మండలం కొంపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు నిరీక్షిస్తున్నారు. రెండు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించామన్నారు. చెకింగ్ పాయింట్స్ వద్ద లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. Time: 9:03 AM ఈవీఎంల వద్ద ఒకరి కంటే ఎక్కువ ఓటర్లు.. వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ను ఈసీ పరిశీలిస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల వద్ద ఒకరి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు ఈసీ గమనించారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ఈవీఎంల వద్ద ఒక్క ఓటరు మాత్రమే ఉండాలని ఆదేశించారు. Time: 8:57 AM ఓటు హక్కు వినియోగించుకున్న పాల్వాయి స్రవంతి చండూరు మండలం ఇడికూడలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. Time: 8:27 AM పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాజగోపాల్రెడ్డి మునుగోడులో పోలింగ్ కేంద్రాలను బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నాంపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించనున్నారు. Time: 8:19 AM ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారి గూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. Time: 8:12 AM మునుగోడు శివాలయంలో రాజగోపాల్రెడ్డి పూజలు మునుగోడు శివాలయంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం మునుగోడులోని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. అనంతరం నాంపల్లి మండలంలో పోలింగ్ కేంద్రాలని పరిశీలించనున్నారు. Time: 8:05 AM స్థానికేతరులు గుర్తింపు యాదాద్రి: పుట్టపాకలో స్థానికేతరులను అబ్జర్వర్ గుర్తించారు. నగదు ఇతర సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. Time: 7:39 AM బారులు తీరిన ఓటర్లు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. Time: 7:21 AM కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు. మనుగోడులో మొత్తం ఓటర్లు 2,41,805 కాగా, పురుషులు 1,21,672.. మహిళలు 1,20,126.. అన్ని బూత్లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. Time: 7:00 AM పోలింగ్ ప్రారంభం మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు.మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటున్నాయి. Time: 6:30 AM మాక్ పోలింగ్ ప్రారంభం కాసేపట్లో మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు.మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాంపల్లి మండలం పోలింగ్ బూత్ 294లో ఈవీఎం మొరాయించింది. మిగతా బూత్లలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు ముందురోజైన బుధవారం ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. ఇదే చివరి అవకాశమంటూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతోపాటు ఇతర అభ్యర్థులు వీలైనంత మేర ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా మద్యం, డబ్బు పంపిణీ అయిందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారం నేపథ్యంలో తమకు ఇస్తానని చెప్పినంత నగదు ఇవ్వలేదంటూ, ఆ మేర ఇప్పించాలంటూ పలుచోట్ల ఓటర్లు ఆందోళనకు దిగడం కూడా కనిపించింది. ఉప ఎన్నిక ప్రక్రియ ఊపందుకున్న నాటి నుంచీ ప్రలోభాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను రుజువు చేస్తూ చాలాచోట్ల నగదు, మద్యం పట్టుబడటం గమనార్హం. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారమే నియోజకవర్గంలో మొత్తం 20 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడ్డాయి. రోజంతా అదే ‘రచ్చ’.. మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నెలరోజులుగా నియోజకవర్గంలో హడావుడి నెలకొంది. ఎన్నికల ప్రచారంతోపాటు సభలు, సమావేశాల పేరిట రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఖర్చు చేశాయి. ప్రచారానికి వచ్చేందుకు ఒకరికి ఇంత అంటూ డబ్బులు ముట్టజెప్పడం ఓవైపు.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలు ఎరవేయడం మరోవైపు కొనసాగాయి. చికెన్, మటన్తోపాటు ఇంటింటికీ మద్యం బాటిళ్లు, కూల్డ్రింకులు, నగదు, పార్టీలు చేసుకునే వారికి అదనంగా లిక్కర్ సరఫరా జరిగాయి. పెద్ద నాయకులు ప్రచారానికి వచ్చినప్పుడు, భారీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఫలానా పార్టీ ఓటుకు ఇంత ఇస్తుందనే ప్రచారం ముందు నుంచే విపరీతంగా జరిగింది. దీనితో చాలామంది ఓటర్లు ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూడటం కనిపించింది. అయితే పోలింగ్కు ముందు రోజు రాజకీయ పార్టీలు తమ టార్గెట్ మేరకు నగదు పంపిణీ చేసినట్టు తెలిసింది. ఓటుకు రూ.1,000 నుంచి రూ.6వేల వరకు ముట్టజెప్పారనే ప్రచారం జరుగుతోంది. బయట వారికోసం భారీ ఏర్పాట్లు నియోజకవర్గానికి బయట, ముఖ్యంగా హైదరాబాద్లో నివాసమున్న ఓటర్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కొందరు ఓటర్లకు కలిపి ఓ వాహనం ఏర్పాటు చేయడం, దారిఖర్చులతోపాటు ఓటు వేసేందుకు నగదు ఇవ్వడం ద్వారా ఓట్లు సమీకరించుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. స్థానిక నాయకులతోపాటు హైదరాబాద్లో నివాసం ఉండే నేతలు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలు తీసుకున్నారు. రాజకీయ పార్టీలు నగదు, మద్యం, దారి ఖర్చులు, వాహనాల ఖర్చులను అందుకున్న ఓటర్లు పోలింగ్ బూత్కు వచ్చి ఓటేసే బాధ్యతను కొందరు నాయకులకు అప్పగించాయి. స్థానిక నేతలపై ఒత్తిళ్లు ప్రచారం గడువు ముగిసిన తర్వాత బయటి నుంచి వచ్చిన నాయకులు వెళ్లిపోవడంతో స్థానికంగా ఉన్న నేతలపై ఒత్తిడి పెరిగింది. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు, బడా నేతలు ఉన్నందున తాము అడగలేకపోయామని, ఇప్పుడు ఓటుకింత ఇస్తేనే ఓటేస్తామని కొందరు స్థానిక నేతలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. స్థానిక నేతలు ఈ విషయాన్ని పైకి చేరవేసి.. వారి సూచనల మేరకు వివిధ స్థాయిల్లో నగదు పంచినట్టు సమాచారం. కొన్నిచోట్ల అనుకున్న సమయానికి నగదు రాకపోవడం, ఓటర్ల నుంచి ఒత్తిడి పెరగడం తమకు తలనొప్పిగా మారిందని.. ఎలాగోలా సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చిందని కొందరు స్థానిక నేతలు వాపోవడం గమనార్హం. మొత్తమ్మీద ధూంధాంగా సాగిన ఉప ఎన్నికల ప్రచారం ముగియడం, పోలింగ్కు సమయం ఆసన్నమవడంతో అంతటా ఆసక్తి నెలకొంది. గురువారం ఉదయం నుంచి మొదలయ్యే ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాజకీయ పార్టీలు, నేతల ప్రలోభాలు ఏ మేరకు ఓటర్లపై ప్రభావం చూపుతాయి, ఎవరిని విజయం వరిస్తుందన్నది ఈ నెల 6న తేలనుంది. ఏర్పాట్లు పూర్తి.. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బందోబస్తులో 2 వేల మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటాయి. -
రాచకొండ నుంచే మునుగోడు ‘కంట్రోల్’.. ప్రతి పోలింగ్ కేంద్రంలో..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్కు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగేలా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును, పోలింగ్ సరళిని పర్యవేక్షించడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఐటీ బృందాలను కూడా నియమించామని వివరించారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రెండు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. అదనపు సీపీ జి.సుధీర్బాబు, డీసీపీలు నారాయణరెడ్డి, శ్రీబాల, అదనపు డీసీపీ భాస్కర్, ఏసీపీ ఉదయ్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బందోబస్తులో 2 వేల మంది.. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తం 2 వేల మంది రాచకొండ పోలీసులతో పాటు కేంద్ర సాయుధ పోలీసులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ వంటి ఆరు కంపెనీల బలగాలను మోహరించినట్లు సీపీ భగవత్ తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక ఎస్ఐ ఇన్చార్జిగా ఉంటారన్నారు. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ స్టేషన్లుండగా.. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల పరిధిలో 82 పోలింగ్ కేంద్రాలలో 122 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వివరించారు. మొబైల్ స్ట్రయికింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రయికింగ్ ఫోర్స్, ప్రత్యేక నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా విధులలో పాల్గొంటాయని చెప్పారు. 16 పోలింగ్ కేంద్రాలలో 35 పోలింగ్ స్టేషన్లను అత్యంత సమస్యాత్మక స్టేషన్లుగా గుర్తించామని, ఆయా స్టేషన్లలో బందోబస్తును మరింత పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించామని వివరించారు. భారీగా నగదు, బంగారం స్వాధీనం.. సరిహద్దు చెక్పోస్టుల వద్ద పోలీసు బృందాలు 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తుంటాయని సీపీ తెలిపారు. ఇప్పటివరకు వాహన తనిఖీలలో రూ.4 కోట్ల నగదు, వెయ్యి లీటర్ల మద్యం, 3.5 కిలోల బంగారం, 11.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం 6 గంటల వరకూ మద్యం దుకాణాలు మూసి ఉంటాయని, పోలింగ్ రోజున అక్రమంగా మద్యం విక్రయాలు, సరఫరా చేసిన వ్యక్తులకు జరిమానాలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. సెల్ఫీలు దిగొద్దు.. పోలింగ్ కేంద్రాల ఆవరణలో సెల్ఫోన్లు నిషేధమని, సెల్ఫీలు దిగడంతో పాటు, ఎవరికి ఓటు వేశారో తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని సీపీ భగవత్ హెచ్చరించారు. చదవండి: ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్ ఆరా -
ఎప్పటికప్పుడు లెక్కలు వేస్తూ..! మునుగోడులో పరిస్థితిపై కేసీఆర్ ఆరా
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డిన టీఆర్ఎస్ పెద్దలు పోలింగ్ ముందు మరింత అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండటం, ఓటేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న స్థానికులు, పోలింగ్ సమయంలో ఓటర్లను తిప్పుకొనేందుకు జరిగే ప్రయత్నాలు.. వంటివాటి నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. నియోజవకర్గంలో పరిస్థితులు, పరిణామాలపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ముఖ్య నేతలతో పలుమార్లు చర్చించారు. వివిధ సంస్థలు, ప్రభుత్వ నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా సూచనలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, పార్టీ నల్లగొండ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావుతోపాటు కొందరు ముఖ్య నేతలు కూడా ఈ టెలీ కాన్ఫరెన్స్లలో పాల్గొన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో యూనిట్ ఇన్చార్జులుగా వ్యవహరించిన నేతలను కేటీఆర్ హైదరాబాద్ నుంచి సమన్వయం చేస్తున్నారు. యూనిట్ ఇన్చార్జులు పోలింగ్ బూత్ల వారీగా స్థానిక నాయకులు, క్రియాశీల కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి కేటీఆర్కు నివేదిస్తున్నారు. నల్లగొండలో మకాం వేసిన మంత్రి జగదీశ్రెడ్డి అక్కడి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. బయటి ఓటర్లపై ప్రత్యేక దృష్టి! మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో సుమారు 40వేల మంది ఉపాధి, ఇతర అవసరాలపై హైదరాబాద్, నల్లగొండతోపాటు ముంబై వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లారు. ఇలాంటి వారందరి వివరాలను 20 రోజుల క్రితమే టీఆర్ఎస్ శ్రేణులు సేకరించాయి. హైదరాబాద్, నల్లగొండ తదితర చోట్ల నివాసం ఉంటున్న ‘మునుగోడు’ఓటర్లను టీఆర్ఎస్ ప్రత్యేక బృందాలు కలుసుకుని.. ఓటింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్లకు చేరుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముంబై వంటి దూరప్రాంతాల నుంచీ ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నించాయి. అప్రమత్తంగా ఉండాలి ఉప ఎన్నిక పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పెద్దలు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ సందర్భంగా కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలకు దిగి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి లబ్ధి పొందే ప్రయత్నాలు చేయవచ్చని.. ఉద్వేగాలకు లోనుకాకుండా అప్ర మత్తంగా ఉండాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. పోలింగ్ బూత్ల వారీగా ఓటింగ్ సరళిని చూసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. చదవండి: ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ -
పొలిమేర నుంచే ప్రణాళిక! సరిహద్దుల నుంచి కీలక నేతల పర్యవేక్షణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. ఈలోగానే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పలివెల వంటి ప్రాంతాల్లో ఒక పార్టీ వారు మరో పార్టీ వారిపై దాడులకు దిగారు. ప్రచారం ముగియడంతో ముఖ్య నేతలంతా నియోజకవర్గాన్ని వదిలివెళ్లారు. కానీ వ్యూహ, ప్రతి వ్యూహాల్లో దిట్టలైన కొందరు నేతలు మాత్రం మునుగోడు నియోజకవర్గం పక్కనే పొలిమేర గ్రామాల్లో తిష్టవేశారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేస్తున్నారని.. ఎప్పటికప్పుడు స్థానిక నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిసింది. ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓట్లు వేయించేలా సూచనలు చేస్తున్నారని.. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ వంటివన్నీ పర్యవేక్షిస్తున్నారని.. స్థానిక నాయకులను పిలిపించుకుని సూచనలు చేస్తున్నారని సమాచారం. సరిహద్దుల నుంచే సలహాలు.. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో బుధవారం ఓ టీఆర్ఎస్ నేతకు చెందిన కారు కనిపించిందని.. ఆయన నియోజకవర్గానికి అవతల ఓ గ్రామంలో మకాం వేశారని స్థానిక నేతలు చెప్తున్నారు. ఓ పార్టీ సీనియర్ నేత నల్లగొండ నియోజకవర్గం కనగల్ మండలంలో ఉండి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. ఇక మర్రిగూడ మండలం శివారు దాటాక రంగారెడ్డి జిల్లా ఆరుట్లలోని ఒక స్థానిక నాయకుడి ఇంట్లో ఓ సీనియర్ నేత మకాం వేసి పర్యవేక్షిస్తున్నారని.. పోల్ మేనేజ్మెంట్పై అక్కడి నుంచే సూచనలు చేస్తున్నారని తెలిసింది. వనస్థలిపురం సంపూర్ణ థియేటర్ పరిసరాల్లోని ఒక హోటల్లో మరో సీనియర్ లీడర్ ఉండి పరిశీలన జరుపుతున్నారని.. మరో ఎమ్మెల్యే వాహనం సంస్థాన్ నారాయణపూర్ మండలంలో కనిపించిందని స్థానిక నేతలు చెప్తున్నారు. నార్కట్పల్లి వివేరా హోటల్లో అడ్డా వేసిన ఓ నేత మునుగోడులోని పరిసర మండలాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు. మరోవైపు చౌటుప్పల్ మున్సిపాలిటీలో బుధవారం అధికార పార్టీ నేత వాహనం కనిపించింది. దీంతో ఆ కారులో డబ్బుల సంచులు ఉన్నాయని, కారును తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగారెడ్డిగూడెంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పీఏ మకాం వేసినట్టు తెలిసింది. తక్కువగా ఇచ్చారంటూ ఓటర్ల ఆందోళన.. ప్రచారం సందర్భంగా ఓటర్లు ఏది అడిగితే అది ఇస్తామన్న నేతలు మంగళవారం సాయంత్రం నుంచే పంపిణీ మొదలు పెట్టగా.. ఈ ‘పని’లో ఏ ఇబ్బందీ రాకుండా ముఖ్యనేతలంతా చూసుకున్నట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార సమయంలో ఓటుకు రూ.20 వేలు.. రూ. 30 వేలు ఇస్తామని ఒక పార్టీ, తులం బంగారం ఇస్తామని మరో పార్టీ వారు చెప్పారని.. తీరా ఇప్పుడు రూ.3 వేలు, రూ.4వేలు ఇస్తున్నారని కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం కనిపించింది. మునుగోడు మండలం కొరటికల్తోపాటు ఇతర మండలాల్లోని పలు గ్రామాల్లో ఓటర్లు తమకు తక్కువ మొత్తం ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మునుగోడు ఉప ఎన్నిక సర్వేలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఓ సర్వే ఒక పార్టీకి అనుకులంగా.. మరో సర్వే ఇంకో పార్టీకి అనుకూలంగా ఉందని ప్రచారం సాగిస్తున్నాయి. సొంత పార్టీ చేసుకున్న సర్వేలోనే వారు ఓడిపోతారని తేలిందంటూ మరికొందరు సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. చదవండి: ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ -
ఓటమి భయంతోనే దాడులు.. ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ
మన్సూరాబాద్/ చాదర్ఘాట్: మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ చేస్తున్న చిల్లర పనులను అందరూ అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మన్సూరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వహిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షుడు మన్నె ప్రతాప్రెడ్డిని బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఒక్క ఉప ఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దొంగల ముఠాగా ఏర్పడి మునుగోడులో దిగారని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలపై ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి ప్రోత్సాహంతో టీఆర్ఎస్ గూండాలు దాడులకు పాల్పడ్డారని, అదేవిధంగా పలివెలలో ఈటల రాజేందర్పై, విశ్వేశ్వరరెడ్డిపై దాడులకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని హితవు పలికారు. సోషల్ మీడియాలో బండి సంజయ్కుమార్ పేరుతో వైరల్ అవుతున్న లెటర్ గురించి ఆయన ప్రస్తావిస్తూ అదెవరో ఫాల్తుగాళ్లు చేస్తున్నారు. ఆ ఫాల్తుగాళ్లపై ఫిర్యాదు కూడా చేయను అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నేతలు ఓటర్లను మభ్య పెడుతున్నారు నిబంధనలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో తిష్టవేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. స్థానికేతరులైన ఇతర పార్టీల నాయకులను పోలీసులు అక్కడి నుంచి పంపించకుంటే బీజేపీ శ్రేణులు కూడా మునుగోడుకు తరలివస్తాయని ఆయన హెచ్చరించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో గాయపడి మలక్పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త రమేష్ యాదవ్ను పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఆయన పరామర్శించారు. చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్పై మంత్రి జగదీష్రెడ్డి ఫైర్ -
‘ఎమ్మెల్యేలకు ఎర’ వికటించడం వల్లే నడ్డా సభ రద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా ప్రధాని మోదీ పేద ప్రజలకు పెద్ద ఉపద్రవంలా పరిణమించారని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’ ప్లాన్ బెడిసికొట్టడంతోనే మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు చేసుకున్నారని, ఓటమి భయంతోనే అమిత్షా ముఖం చాటేశారన్నారు. రాహుల్గాంధీ నోటికి ఏదొస్తే అది మాట్లాడకుండా మొదట కాంగ్రెస్ ప్రాధాన్యతలేమిటో నిర్ణయించుకోవాలని హితవు పలికారు. కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్లో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. మోదీ, బీజేపీ విధానాలపై ఆధారాలతో సహా విమర్శల దాడి చేస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ జడ పదార్ధంలా తయారైంది. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో.. మోదీ 22 సార్లు అక్కడికి వెళితే, కేజ్రీవాల్ తరచూ పర్యటిస్తున్నారు. రాహుల్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్లలేదు. గుజరాత్లో అస్త్ర సన్యాసం చేసి ఇక్కడ గాలి విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ మొదట సొంతింటిని చక్కదిద్దుకోవాలి. దేశ రాజకీయాల్లో రాజకీయ శూన్యత ఉందనే విషయం ఆ పార్టీకి అర్థం కావడం లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబ నామినీ మాత్రమే. బీఆర్ఎస్కు మొదటి మెట్టు మునుగోడు మునుగోడు ఉప ఎన్నిక భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు మొదటి మెట్టు లాంటిది. ఇక్కడి ఫలితం పార్టీకి కొత్త విశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. మునుగోడులో తొలినుంచీ టీఆర్ఎస్కే అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఫ్లోరోసిస్ నుంచి బయటపడేయడంతో మహిళల్లో మాకు ఆదరణ ఉంది. కమ్యూనిస్టులతో పొత్తు అదనపు బలాన్ని ఇచ్చింది. నియోజకవర్గం బయట ఉన్న 40వేల మంది ఓటర్ల పాత్ర బలంగా ఉండబోతోంది. అన్ని పార్టీలు తమ బలగాలను మోహరించినపుడు మేం మా ఎమ్మెల్యేలను రంగంలోకి దింపాం. అందులో తప్పేముంది? కేసీఆర్ దెబ్బకు అంతా కకావికలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి జేపీ నడ్డా సభలో చేర్చుకునేలా బీజేపీ ఎత్తుగడ వేసింది. అది బెడిసికొట్టడంతో నడ్డా సభ రద్దు చేసుకోగా.. అమిత్షా ముఖం చాటేశారు. మరో రెండు, మూడు పార్టీలకు సాధన సంపత్తి సమకూర్చి మా ఓటు బ్యాంకును దెబ్బతీయాలని చూశారు. విద్వేషం, కుటుంబ పాలన ఆరోపణలు, మత కలహాలు వంటి ‘ప్లే బుక్’ను అడ్డుపెట్టుకుని ఓట్లను పోలరైజ్ చేసేందుకు ప్రయత్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ బహుళ మార్గాల్లో ప్రయత్నించినా కేసీఆర్ ‘మాస్టర్ స్ట్రాటజీ’తో వారు కకావికలం అయ్యారు. బీజేపీకి పెద్దగా కేడర్ లేదనే విషయం రాబోయే రోజుల్లో బయటపడుతుంది. ‘కోవర్టు బ్రదర్స్’పదం కోమటిరెడ్డి సోదరులకు అతికినట్టు సరిపోతుంది. సీబీఐ మోదీ చేతిలో చిలుక! బీజేపీ మఠాధిపతుల ముసుగులో ఉన్న ముఠాను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నడిపింది. మా ఎమ్మెల్యేలు దీనిని తొలుత నాదృష్టికి, తర్వాత కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముఠా ఆట కట్టించారు. ఈ వ్యవహారంలో స్వామీజీలు సంచలన విషయాలు బయటపెట్టారు. కుట్ర గురించి బీజేపీ నేతలకు తెలిసినందునే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో సంబంధం లేకపోతే బీజేపీ నేతలు కోర్టులను ఎందుకు ఆశ్రయిస్తున్నారు? గతంలో సీబీఐని ‘కాంగ్రెస్ చిలుక’అని మోదీ అభివర్ణించారు. ఇప్పుడు అది మోదీ చేతిలో చిలుకలా మారింది. ముందస్తు అనుమతితోనే సీబీఐ అడుగు పెట్టాలనే జీవో రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. బ్రిటీషు కాలానికి ప్రతీక గవర్నర్ గిరీ.. కొందరు వ్యక్తులు తమ స్థాయిని, శక్తిని అపరిమితంగా ఊహించుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. గవర్నర్ వ్యవస్థ బ్రిటీషు కాలం నాటిది. బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల పనితీరును చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి మంత్రివర్గం నిర్ణయాలకు అనుగుణంగా గవర్నర్ నడుచుకోవాలి. కానీ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి రాజ్యాంగ సంస్థల నడుమ వివాదం రేపేందుకు గవర్నర్ బిల్లులను ఆపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గొంతు నొక్కి ప్రజల దృష్టిలో కేసీఆర్ను చెడుగా చూపేందుకు బీజేపీ అనేక రూపాల్లో ప్రయత్నిస్తోంది. గవర్నర్ అందులో భాగం కావడం సరికాదు. 2024 ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్కు గుర్తింపు లభించిన తర్వాత 2024 లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా పనిచేస్తాం. పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై దృష్టి పెడతాం. బీజేపీలో పది మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు కేసీఆర్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. మునుగోడు ఓటమి తర్వాత బీజేపీ తన వ్యూహాన్ని సమీక్షించుకుని వెనక్కి తగ్గొచ్చు. లేదా కొత్త ‘ప్లేబుక్’తో రూల్స్ మార్చుకుని జనం ముందుకు రావచ్చు. 2023 ఎన్నికల్లో బీజేపీ శక్తినంతా కేంద్రీకరిస్తే.. ఆ పరిస్థితుల్లో పోటీపడి గెలవడంలోనే మజా ఉంటుంది. మునుగోడు కంటే వారణాసి, గుజరాత్ ఎన్నికలే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. మోదీ గుజరాత్లో ఇప్పటికే రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్పై మంత్రి జగదీష్రెడ్డి ఫైర్ -
బీజేపీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి : కేటీఆర్
-
KTR: మునుగోడులో సానుభూతి కోసం బీజేపీ ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు మండలంలోని పలివెలలో జరిగిన ఘర్షణను సూచిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఢిల్లీ నుంచి ఆదేశాలతోనే బీజేపీ హింసకు పాల్పడుతోందని ఆరోపించారు. హింసకు తావు ఇవ్వని పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ నుంచి ఆదేశాలతో బీజేపీ హింసకు పాల్పడుతోంది. ఎవరు ఎవరి మీద ఎవరు దాడి చేసరో వీడియోలు ఉన్నాయి. ఈటల పీఏ రాళ్ల దాడి చేశారు. మా పై దాడి చేసి.. మళ్ళీ సానుభూతి కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో శాంతి ఉంది. బీజేపీ హింస సిద్ధాంతంను తిప్పి కొట్టే సత్తా ఉంది. బీజేపీ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. మునుగోడులో బీజేపీ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తోంది. బీజేపీ ఇదే సంస్కృతి కొనసాగిస్తే.. మేము తిరగబడతాము. బీజేపీ,మోదీలు ఫేకులు.’అని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఇదీ చదవండి: సానుభూతి కోసమే ఇదంతా.. ఈటల రాజేందర్పై మంత్రి జగదీష్రెడ్డి ఫైర్ -
మునుగోడు ఉప ఎన్నికపై 500 ఫిర్యాదులు: సీఈవో వికాస్ రాజ్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రేపు(గురువారం) ఉదయం జరగనుంది. ఈ క్రమంలో.. ఏర్పాట్ల పర్యవేక్షణపై సాక్షి టీవీతో తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ సాక్షికి వెల్లడించారు. ‘‘వెబ్ క్యాస్టింగ్ ద్వారా 298 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ పరిశీలిస్తాం. పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ఓటర్లకు చేతిపై ఎలాంటి పార్టీల గుర్తులు ఉండరాదు. పోలింగ్ కేంద్రాల్లో గుర్తులు ప్రదర్శించరాదు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి.. దాదాపుగా ఐదు వందల వరకు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేయించాం. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలను తిరిగి రిసెప్షన్ లో ఇచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈవీఎంలను వదిలి వెళ్లవద్దు. స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరించేందుకు ఏర్పాట్లు చేశాం. కౌంటింగ్ ప్రక్రియలో వెయ్యి మందికి పైగా ఏజెంట్లు ఉండే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రంలోకి కూడా అనుమతి ఉన్నవారినే పంపిస్తాం అని సీఈవో వికాజ్రాజ్ సాక్షితో అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక- కీలక పాయింట్లు.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
మునుగోడు: ఐపీఎల్ తరహాలో జోరుగా బెట్టింగ్?!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇందుకోసం బెట్టింగ్ మాఫియా రంగంలోకి దిగింది. ఒకటికి రెండింతలంటూ కోట్ల రూపాయల్లో బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ హోటల్స్లో తిష్ట వేసిన బుకీలు.. ఈమేరకు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని మరీ అడ్వాన్స్ లు పుచ్చుకుంటున్నారని సమాచారం. డిపాజిట్ సాధించేదెవరు? కోల్పోయేదెవరు అంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు.. పోలింగ్ సరళిపై ఐపీఎల్ తరహాలో మునుగోడు ఉప ఎన్నిక బెట్టింగ్ను.. బుకీలు రౌండ్ రౌండ్కు బెట్టింగ్ నిర్వహణకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గూగుల్పే, ఫోన్పే ద్వారా ఆన్లైన్లో పేమెంట్ వ్యవహారం నడుస్తోంది. -
మునుగోడు ఉపఎన్నికపై ఈసీ డేగ కన్ను
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రేపటి పోలింగ్పై ఈసీ డేగ కన్ను వేసింది. హైదరాబాద్ ఎన్నికల కమిషన్ ఆఫీస్లో వెబ్ కాస్టింగ్కు ఏర్పాట్లు చేశారు. 298 కేంద్రాల్లో సీసీ కెమెరాలతో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిని దగ్గరుండి ఎన్నికల ప్రధానాధికారి పర్యవేక్షించనున్నారు. ఎలాంటి సమస్య వచ్చిన తక్షణం స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలలో టెక్నికల్ సమస్యలు వెంటనే తొలగించేలా టెక్నికల్ టీమ్ను అధికారులు అప్రమత్తం చేశారు. ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ జరుగుతుందన్నారు. ప్రలోభాలు జరగకుండా ప్రతి గ్రామంలో తనిఖీలు చేపట్టామన్నారు. ఇప్పటివరకురూ.8 కోట్లు సీజ్ చేశామన్నారు. చదవండి: లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం -
మునుగోడులో జోరుగా డబ్బు పంపిణీ
-
మునుగోడులో కట్టుదిట్టమైన భద్రత
-
Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నికపై సర్వే.. ఆర్ఎస్ఎస్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎలాంటి సర్వే చేయలేదని ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ సర్వే రిపోర్టు పేరిట ఒక అజ్ఞాత వ్యక్తి నకిలీ పత్రంతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ఎస్ సంస్థాగతంగా రాజకీయాలతోగాని, రాజకీయ సర్వేలలోగాని పాల్గొనదని వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు కీలకమైన అంశం కనుక ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. చదవండి: (Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!) -
Munugode Bypoll: ఆఖరి అస్త్రాలు సందిస్తున్నారు.. పోటాపోటీగా పంపకాలు!
నల్లగొండ : మునుగోడు ఉపఎన్నికలో పోటాపోటీగా పంపకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున మద్యం పంచి, సిట్టింగులు నిర్వహించిన పార్టీలు.. ఆఖరి అస్త్రంగా డబ్బు పంపిణీని ప్రారంభించాయి. మొన్నటివరకు ఒక్కో ఓటుకు రూ.5వేలు, రూ.10 వేలు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఓ పార్టీ ఓటుకు రూ.3వేల చొప్పున, మరో పార్టీ రూ.4వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది. కొన్నిచోట్ల రూ.3వేల చొప్పున సమానంగా పంపిణీ జరిగింది. సోమవారం రాత్రి నుంచే పార్టీలు ఓటర్లకు డబ్బులు పంపిని ప్రారంభించాయి. రెండో విడత కూడా డబ్బులు పంపిణీ చేసేందుకు పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత రూ.3వేలు, రూ.4వేలు చొప్పున పంపిణీ చేసిన పార్టీలు తిరిగి రెండో విడత ఎంత పంచుతాయో. నేరుగానే ఇంటింటికి తిరిగి నగదును పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఓటరు ఎటువైపో.. గత రెండు మాసాల నుంచి ఆయా పార్టీలు కులాల వారీగా సమావేశాలు, సభలు పెట్టి ఎన్నో హామీలు ఇచ్చాయి. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు కూడా. ప్రచారాల్లో ఏ పార్టీ మీటింగ్ పెట్టినా జనం భారీగానే హాజరయ్యారు. దీంతో ఓటరుకు ఆయా పార్టీలు డబ్బులు నేరుగా పంపిణీ చేస్తున్నా ఏ పార్టీకి ఓటు వేస్తారన్నదానిపై అంతుచిక్కడం లేదు. అభ్యర్థులు మాత్రం ఎవరి నమ్మకంలో వారు ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 298 పోలింగ్ బూత్లు ఉండగా 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. -
మునుగోడులో ముగిసిన ప్రచారం (ఫొటోలు)
-
మునుగోడు కౌంట్ డౌన్ స్టార్ట్
-
లెక్క తప్పొద్దు.. పట్టు వీడొద్దు.. టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు స్థానికేతర నేతలు, శ్రేణులంతా మునుగోడు నియోజకవర్గం బయటకు వచ్చినా ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఓటర్లపై పట్టు సడలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో యూనిట్ ఇన్చార్జిలుగా వ్యవహరించిన ముఖ్య నేతలు కొందరు జిల్లా కేంద్రం నల్లగొండలో, మరికొందరు హైదరాబాద్ శివార్లలో మకాం వేసి చివరి నిమిషం వరకు మునుగోడు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయాలని నిర్ణయించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలుగా పనిచేసిన నేతలు కూడా సంబంధిత ఓటర్ల ఫోన్ నంబర్లను సేకరించి, వారితో పోలింగ్ ముగిసేంత వరకు టచ్లో ఉండాలని పార్టీ ఆదేశించింది. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో హైదరాబాద్ శివారు, ఇతర ప్రాంతాల్లో ఓటర్లు ఉండటంతో.. పోలింగ్ రోజున వారు స్వస్థలాలకు తరలివెళ్లి తమకు అనుకూలంగా ఓటు వేసేలా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. నేడు సీఎం టెలీ కాన్ఫరెన్స్ సుమారు 20 రోజులు ప్రచార సరళిని విశ్లేషించుకున్న టీఆర్ఎస్.. ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని 298 పోలింగ్ బూత్ల పరిధిలో తమ అభ్యర్థికి పడే అవకాశమున్న ఓట్ల సంఖ్యపై ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అయితే ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుండటంతో పార్టీ అంచనాలు, లెక్కలు తప్పకుండా ఉండేందుకు గురువారం పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. వివిధ సంస్థలు, నిఘా వర్గాల నుంచి అందిన నివేదికల ఆధారంగా సీఎం కేసీఆర్ బుధవారం మునుగోడు ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశముందని తెలిసింది. పక్షం రోజులుగా నియోజకవర్గంలోనే మకాం వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్డీ కేడర్ కలుపుకొని సుమారు మూడు వేల మంది ప్రచారంలో పాల్గొన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. చదవండి: మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు -
రైతుబంధు కావాలా.. రాబందు రాజ్యం కావాలా? నిర్ణయం మీదే..
సాక్షి, యాదాద్రి, మునుగోడు: మునుగోడు ఉపఎన్నిక పోరు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య కాదని.. ఇది రెండు భావజాలాల మధ్య జరగనున్న యుద్ధమని మంత్రి కె.తారకరామారావు అన్నారు. రైతులను ట్రాక్టర్లతో తొక్కించే ఆ గట్టున (బీజేపీ) ఉంటారో లేక రైతు సంక్షేమాన్ని కోరుతున్న సీఎం కేసీఆర్ గట్టున ఉంటారో మునుగోడు ఓటర్లు తేల్చుకోవాలన్నారు. అలాగే రైతుబంధు రాజ్యం కావాలో లేక రాబంధు రాజ్యం కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు. ఉపఎన్నిక చివరిరోజు ప్రచారంలో భాగంగా మంగళవారం మంత్రి కేటీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక, నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన రోడ్డు షోలలో ప్రసంగించారు. ఫ్లోరిన్ సమస్య లేకుండా చేశాం.. మునుగోడులో ఫ్లోరిన్ సమస్యతో అనేక మంది అనారోగ్యానికి గురవుతుంటే సీఎం కేసీఆర్ చలించి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేశారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నేడు నియోజకవర్గంలో ఫ్లోరిన్ సమస్య లేకుండా తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని దండుమల్కాపురం వద్ద టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసి త్వరలో 35 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని చెర్లగూడెం, కిష్టారాయింపల్లి ప్రాజెక్టులను పూర్తిచేసి 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లను పూర్తి చేస్తామని, రాచకొండలో లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని 14 నెలల్లోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. బీజేపీకి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పాలి.. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండగా ప్రస్తుతం రూ. 1,200కు చేరుకుందని.. భవిష్యత్తులో ఇది రూ. 4 వేలకు పెరిగే ప్రమాదం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ను గెలిపిస్తే సంక్షేమం పరుగులు పెడుతుందని, మరిన్ని పథకాలు వస్తాయన్నారు. ‘మనది పేదల ప్రభుత్వం.. కేంద్రంలోని బీజేపీది పెద్దల ప్రభుత్వం. మోదీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. ఆ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుబీమాతోపాటు ఉచిత కరెంట్ను రద్దు చేస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని ఆ పార్టీకి డిపాజిట్ రాకుండా బుద్ధిచెప్పాలి’ అని ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు. తూతూ ప్రమాణం చేసి డబ్బులు తీసుకోండి.. కేంద్రం ఇచ్చిన రూ. 18 వేల కోట్లకు అమ్ముడుపొయి రాజ గోపాల్రెడ్డి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని కేటీఆర్ ఆరో పించారు. బీజేపీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసి రూ. 5 వేల కోట్లకుపైగా వచ్చే లాభంలో రూ. 500 కోట్లు ఖర్చుచేసి గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటికి తులం బంగారం చొప్పున ఇచ్చి ఆయనకే ఓటేసేలా రాజ గోపాల్రెడ్డి ప్రమాణం చేయించుకోజూస్తారని.. కానీ ఏదో తూతూ ప్రమాణం చేసి ఆ బంగారం, డబ్బు తీసుకొని ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేయాలని కేటీఆర్ కోరారు. చదవండి: మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు -
మునుగోడును ముంచెత్తారు.. చివరిరోజు హోరెత్తించిన ప్రధాన పార్టీలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆరోపణలు .. ప్రత్యారోపణలు, వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు, వ్యక్తిగత విమర్శలు.. దాడులు, ప్రలోభాలు .. పంపకాలు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేశాయి. ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే మోహరించారు. సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలతో జోరుగా ప్రచారం కొనసాగించారు. ఇక ప్రచార పర్వం చివరిరోజు మంగళవారం మునుగోడు జనసంద్రాన్ని తలపించింది. నియోజకవర్గానికి పోటెత్తిన వివిధ పార్టీల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు.. ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఎవరికి వారు తమ పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. ఒకటీ రెండుచోట్ల జరిగిన భౌతిక దాడులు, ఘర్షణలు పోలింగ్కు ముందు ఒకింత ఉద్రిక్తతకు తావిచ్చాయి. నియోజకవర్గంలోనే మకాం వేసి.. ఉప ఎన్నిక ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందన్న భావనతో అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్లు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. షెడ్యూల్ వెలువడక ముందే ప్రచారం ప్రారంభించిన పార్టీలు ఆ తర్వాత ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. స్థానిక నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు నియోజకవర్గాన్ని వీడకుండా ఆయా పార్టీల అధిష్టానాలు చివరిరోజు వరకు కట్టడి చేశాయి. దీంతో నాయకులు ఏకంగా ఆయా గ్రామాల్లోనే గదులు అద్దెకు తీసుకుని ప్రచార వ్యూహాలకు పదును పెట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఉప్పు, నిప్పులా తలపడ్డాయి. అక్టోబర్ 26వ తేదీ రాత్రి బయటకు వచ్చిన ‘ఎమ్మెల్యేలకు ఎర’అంశం రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని రాజేసింది. సంక్షేమ మంత్రం .. ఎదురుదాడి యత్నం ప్రచార పర్వంలో అధికార టీఆర్ఎస్ రాష్ట్రంలో ముఖ్యంగా మునుగోడులో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావనతో పాటు, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, కుటుంబ పాలన వంటి ఆరోపణల ఎదురు దాడితో కాషాయ దళం కాక పుట్టించింది. ఇక బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అంటూ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. హోరెత్తిన ప్రచారం మంగళవారం చివరిరోజు కావడంతో అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో పాటు మంత్రులు టి.హరీశ్రావు, జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని వేర్వేరు మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. సంస్థాన్ నారాయణపురం, మునుగోడులో కేటీఆర్, జగదీశ్రెడ్డిలు కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. నాంపల్లి మండలంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు, చండూరులో ఎర్రబెల్లి, చౌటుప్పల్లో శ్రీనివాస్గౌడ్, మలారెడ్డి ర్యాలీలకు నేతృత్వం వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాంపల్లి నుంచి మర్రిగూడ మీదుగా చండూరు వరకు వేలాది బైక్లతో ర్యాలీ నిర్వహించారు. బండి సంజయ్తో పాటు పార్టీ నాయకులు ఈటల రాజేందర్, జితేందర్రెడ్డి, వెంకటస్వామి, సునీల్ బన్సల్ తదితరులంతా నియోజకవర్గంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ మునుగోడులో మహిళా గర్జన నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, రేణుకాచౌదరి, గీతారెడ్డి, సీతక్క తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేలు ప్రచారం ముగియడంతో.. గురువారం జరిగే పోలింగ్లో అనుసరించాల్సిన వ్యూహంపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. డబ్బు, మద్యం పంపిణీ మొదలుపెట్టాయి. ప్రధాన పార్టీలు ఒక్కో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇవ్వడంతో పాటు భారీయెత్తున మద్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది. పోలింగ్కు ముందు బుధవారం ఒక్కరోజే మిగిలి ఉండటంతో అన్ని ఏర్పాట్లూ పకడ్బందీగా చేసే ప్రయత్నాల్లో పార్టీలు నిమగ్నమయ్యాయి. డబ్బు, మద్యం పంపిణీతో పాటు కుల సమీకరణలకు ప్రాధాన్యతనిస్తూ తమవైపు తిప్పుకోవడంపై దృష్టి సారించాయి. ప్రచార గడువు ముగియడంతో నియోజకవర్గాన్ని విడిచిపెట్టిన స్థానికేతర నేతలు ఆ చుట్టుపక్కలే మకాం వేశారు. నియోజకవర్గం బయట ఉన్న ఓటర్లను గురువారం పోలింగ్ కేంద్రాలకు రప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 47 మంది ఉప ఎన్నిక బరిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చదవండి: ఆ గట్టున ఉంటారా? ఈ గట్టున ఉంటారో తేల్చుకోండి: కేటీఆర్ -
ముగిసిన మునుగోడు ఉపఎన్నికల ప్రచారం
-
ముగిసిన మునుగోడు ఉపఎన్నిక ప్రచారం
సాక్షి, హైదరాబాద్: చివరిరోజు పార్టీల ప్రచార జోరుతో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం సరిగ్గా సాయంత్రం ఆరు గంటల సమయంలో మైకులు మూగబోయాయి.. ఎన్నికల ప్రచార వాహనాలు నిలిచిపోయాయి. ఎల్లుండి(3వ తేదీన) ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 6వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రచారం ముగియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మునుగోడును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పరిధిలోని అన్ని లాడ్జిలు, హోటల్స్ను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఖాళీ చేయిస్తున్నారు. ఓటర్లకు ప్రలోభానికి గురి చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు నిలిచారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. తెలంగాణ ఈసీ ప్రకటన ప్రకారం.. ► మునుగోడు నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఐదు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► పోలింగ్ నిర్వాహణ కోసం 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. ► ఫ్లైయింగ్ స్కాడ్తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. -
ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ ఇలాంటి దాడులు చేయడం సహజం : మంత్రి జగదీష్ రెడ్డి
-
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఊరట..
-
మునుగోడు: రాజగోపాల్రెడ్డికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఊరట దక్కింది. రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదులకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఈ మేరకు మంగళవారం ఎన్నికల సంఘం ఒక ప్రకటన చేసింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. సుమారు రూ.5.24 కోట్ల బదిలీ జరిగిందని టీఆర్ఎస్ పార్టీ, రాజగోపాల్రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే టీఆర్ఎస్ ఆరోపణలు నిరాధారమైనవని ఈసీ తేల్చింది. రాజగోపాల్రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాల్లేవని ఈసీ వెల్లడించింది. అంతేకాదు.. ఎన్నికల ఖర్చుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. పలువురు వ్యక్తులు, సంస్థలకు నగదు బదిలీ చేశారన్నది టీఆర్ఎస్ ఆరోపణ. ఈ మేరకు రాజగోపాల్రెడ్డికి చెందిన సంస్థ నుంచి సుమారు రూ.5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంకు ఖాతాలకు మళ్లించారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈ తరహాలో భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. రాజగోపాల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. నగదు లావాదేవీలపై సోమవారం సాయంత్రం 4 గంటల లోపు సమాధానం ఇవ్వాలంటూ రాజగోపాల్రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈసీ నోటీసులకు రాజగోపాల్రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన ఎన్నికల కమిషన్.. రాజగోపాల్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులకు సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: టీఎన్జీవో నేతలకు సిగ్గుండాలి..: బండి సంజయ్ -
రెచ్చగొట్టే చర్యలతో దాడులకు దిగారు : ఈటెల రాజేందర్
-
తమపై తామే దాడి చేసుకుని టీఆర్ఎస్ పై దుష్ప్రచారం : హరీష్ రావు
-
ఓటమి భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోంది : ఈటెల రాజేందర్
-
తెలంగాణాలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు : తరుణ్ చుగ్
-
ఈ ఉద్రిక్తతకు కారణం మీరే.. కాదు మీరే!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ-టీఆర్ఎస్ శ్రేణులు రణరంగం సృష్టించాయి. మునుగోడు మండలం పలివెలలో ఇరు పార్టీ శ్రేణులు కర్రలతో దాడులు చేసుకుని పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చాయి. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. కాగా, తాజా ఘటనపై ఇరు పార్టీ నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. తప్పంతా టీఆర్ఎస్దేనని బీజేపీ ఆరోపిస్తుండగా, బీజేపీనే రెచ్చగొట్టిందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ కార్యకర్తలే రెచ్చగొట్లాని చూశారని మంత్రి జగదీష్రెడ్డి విమర్శించారు. ఈ తరహా రెచ్చగొట్టే చర్యలకు టీఆర్ఎస్ శ్రేణులు దూరంగా ఉండి ఎన్నికలపైనే దృష్టిపెట్టాలని సూచించారు. మరొవైపు మంత్రి హరీష్రావు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఓటమి భయంతోనే బీజేపీ దాడులు చేస్తుందన్న హరీష్రావు.. టీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారు. బీజేపీకి అబద్ధాలు చెప్పడం అలవాటేనని, ఆ పార్టీ కార్యకర్తలే తమపై దాడి చేశారని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకునే దాడికి తెరలేపిందని బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేర్కొన్నారు. అందుకే తమ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తుందని ఆమె ఆరోపించారు. ఓటమి భయం కారణంగానే టీఆర్ఎస్ దాడులు చేసిందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించగా, తమ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చాలా సౌమ్యుడని, ఆయనపైనే టీఆర్ఎస్ దాడులు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇది కూడా చదవండి: ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ -
మునుగోడు లో రణరంగం
-
‘ఓటర్లను ప్రభావితం చేసేందుకు మునుగోడులో ఫోన్ల ట్యాపింగ్’
సాక్షి, న్యూఢిల్లి: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో పార్టీలు పోటాపోటీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి తరుణ్చుగ్. ఫోన్ల ట్యాపింగ్ సహా నగదు లావాదేవీల ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ‘తెలంగాణలో బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నగదు లావాదేవీలపై విష ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు తరుణ్చుగ్. ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి -
మునుగోడులో రణరంగం: ఈటల కాన్వాయ్పై రాళ్ల దాడి.. కార్యకర్తల ఘర్షణ
సాక్షి, నల్లగొండ: మునుగోడు రణరంగంగా మారింది. ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈటల వ్యక్తిగత సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రాళ్ల దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ మునుగోడు ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్పై దాడి జరిగిన క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తి.. పరస్పరం దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బీజేపీ ప్రచార రథానికి ఉన్న బ్యానర్లను చించేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మునుగోడుకు అదనపు బలగాలను తరలించాలని అధికారులను ఆదేశించింది ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిందితులు -
మునుగోడులో మెరిసేదెవరు ?
-
మునుగోడుపై కేసీఆర్ది కపటప్రేమ.. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే..
మునుగోడు/ చండూరు: మునుగోడు ఉప ఎన్నికలో లబ్ధిపొందాలనే చండూరు సభలో సీఎం కేసీఆర్ కపటప్రేమ ప్రదర్శించారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో కొనసాగుతూ చేయని పనులు పక్షం రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. సోమవారం ఆయన మునుగోడు, చండూరులలో విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే చండూరులో 100 పడకల ఆస్పత్రిని 15రోజుల్లో ఏర్పాటు చేస్తానని చెప్పడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లను అద్దంలా మారుస్తానని, చెర్లగూడెం రిజర్వాయర్ను త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పడం కపటప్రేమలో భాగమేనని ఆరోపించారు. మునుగోడుపై అంతప్రేమే ఉంటే ఇంతకాలం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలోని 1.72లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తానని చెప్పి నేటికీ ఒక్క ఎకరాకూ ఇవ్వలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కేసీఆర్ కాళ్ల వద్ద నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. జీఎస్టీ వాటా ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? రూ.40 లక్షల వ్యాపారం దాటిన చేనేతలకు మాత్రమే కేంద్రం 5 శాతం జీఎస్టీ విధించేలా ఒప్పుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు దానిని ఎలా వ్యతిరేకిస్తుందని కిషన్రెడ్డి అన్నారు. నిజంగా సీఎం కేసీఆర్కు చేనేత కార్మికులపై ప్రేమ ఉంటే జీఎస్టీలో రాష్ట్రానికి వచ్చే 2.5 శాతం వాటా ఎందుకు తిరిగి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపిస్తున్న సీఎం ఆ ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ నుంచి గెలిచారని, వారిని టీఆర్ఎస్ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సీబీఐ విచారణ జరగకుండా 51 జీఓ తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగానే సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్తోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోలు అని ఆరోపించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం రూ.800కోట్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు కిషన్రెడ్డి చెప్పారు. మహమ్మారి విముక్తికి రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్రమే ఎక్కువ నిధులు ఖర్చు చేసినా కేసీఆర్ తొమ్మిదేళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టారని విమర్శించారు. అల్లుడు వెన్నుపోటు పొడుస్తాడనే.. తెలంగాణలో కేసీఆర్ పాలన పోతేనే పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పంటలకు సాగునీరు వస్తుందని కిషన్రెడ్డి చెప్పారు. నాడు ఎన్టీఆర్కు అల్లుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, అదే మాదిరిగా అల్లుడు హరీశ్రావు వ్యవహరిస్తారనే భయంతోనే కేసీఆర్ సచివాలయానికి రాకుండా ఫాం హౌస్కే పరిమితం అయ్యారని ఎద్దేవాచేశారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే కల కేసీఆర్కు ఎప్పటికీ నెరవేదన్నారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఎత్తిపోసే పనిలో మేం.. ఎత్తుకెళ్లే పనిలో బీజేపీ! -
Telangana: మంత్రి జగదీశ్రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు
నల్లగొండ క్రైం/ రాంగోపాల్పేట్ (హైదరాబాద్): రాష్ట్ర విద్యుత్ మంత్రి జి.జగదీశ్రెడ్డి పీఏ ప్రభాకర్రెడ్డిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది. నల్లగొండలోని తిరుమలనగర్లో ఉన్న ప్రభాకర్రెడ్డి నివాసంలో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:15 గంటల వరకు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 15 మంది ఐటీ అధికారులు, సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర పోలీసు బలగాల రక్షణలో సోదాలు నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన అధికారులను నోడల్ అధికారులుగా, ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులను ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించింది. జగదీశ్రెడ్డి పీఏ ప్రభాకర్రెడ్డి ఇంట్లో నగదు దాచిపెట్టారని వారికి అందిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్కు చెందిన ఐటీ అధికారుల బృందం ఈ సోదాలు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లతోపాటు, కంప్యూటర్ హార్డ్డిస్క్లు, పెన్డ్రైవ్లు, డైరీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. విశ్వనీయ సమాచారం మేరకు రూ.49 లక్షల నగదును కూడా సీజ్ చేశారని.. దీనికి మంగళవారం సాయంత్రానికల్లా లెక్కలు చెప్పాలని ప్రభాకర్రెడ్డికి నోటీసు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసినట్టు చెప్తున్నారు. కానీ çఅధికారులు దీనిని ధ్రువీకరించలేదు. ఐటీ అధికారుల బృందం రాత్రి 11:15 గంటలకు ప్రభాకర్రెడ్డి నివాసం నుంచి వెళ్లిపోయింది. కాగా సోదాల విషయం తెలిసి ప్రభాకర్రెడ్డి ఇంటి సమీపంలో స్థానికులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దాడులు మొదలైన తర్వాతే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కావేరీ సీడ్స్ కార్యాలయాలపైనా.. సికింద్రాబాద్లోని మినర్వా కాంప్లెక్స్లో ఉన్న కావేరీ సీడ్స్, ఆదిత్య ఆగ్రో సంస్థలపైనా ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కేంద్ర బలగాల రక్షణలో ఈ తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను, బ్యాంకు లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఈ సంస్థల యజమాని జీవీ భాస్కర్రావుకు ప్రభుత్వంలోని ముఖ్యులతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు సమాచారం. ఈ దాడులకు సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. చదవండి: మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర -
‘మునుగోడు’ ముంగిటకు సర్కార్ను తెచ్చాం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక వల్ల ప్రజలకు, పార్టీకి అంతా మంచే జరుగుతోందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని పార్టీలో చేర్చుకొనే క్రమంలో ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించడం ద్వారా ప్రస్తుతం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్నే నియోజకవర్గానికి రప్పించగలిగామని.. ఇది తమ ఘనత అని చెబుతున్నారు. మూడున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధిని రాజగోపాల్రెడ్డి పట్టించుకోలేదన్న వాదనతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా ఆయన చేసిన రాజీనామా వల్ల మునుగోడు ప్రజలకు ఒరిగేదేమీ ఉండదంటూ అధికార టీఆర్ఎస్ చేసిన విమర్శలను గత 2–3 నెలలుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, ఇస్తున్న హామీల ద్వారానే తిప్పికొట్టగలిగామనే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మినహా మిగతా అసెంబ్లీ స్థానాలను ముఖ్యంగా విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధిలో ప్రభుత్వం ఇప్పటిదాకా చూపిన వివక్షను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగామని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ అంశంపై బీజేపీ నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇవీ... రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశాక మునుగోడులో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులకు మోక్షం మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్, చండూరును దత్తత తీసుకుంటానని మంత్రి ఎర్రబెల్లి ప్రకటన. కొత్తగా గట్టుప్పుల్ మండలం ఏర్పాటు. దండుమల్కాపురం బాధితులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని మంత్రి కేటీఆర్ హామీ కొత్తగా అర్హులైన వేలాది మందికి ఆసరా పింఛన్లు, భారీ స్థాయిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు. రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పథకం కింద గొల్ల కురుమలకు నిధులు. ఒక్కొక్కరికీ రూ. 1.53 లక్షల నగదు విడుదల. ఒక్క మునుగోడులోనే రూ. 7,600 మంది గొల్ల కురుమలకు బ్యాంకు ఖాతాల్లో రూ. 93 కోట్లు జమ. చౌటుప్పల్–నారాయణపూర్ రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి. చర్లగూడెం, లక్ష్మణాపురం బాధితులకు నష్టపరిహారం చెల్లింపు (చదవండి: మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర) -
చివరి ఘట్టానికి మునుగోడు ఉప ఎన్నిక.. అంతుచిక్కని ఓటరు నాడి!
సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంటోంది. అయితే ఈ ఎన్నికలో రాజకీయ పార్టీలకు ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. ప్రధాన పార్టీలన్నింటికీ జై కొట్టిన ఓటర్లు.. ఆత్మీయ సమ్మేళనాలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఏ పార్టీ నిర్వహించినా హాజరయ్యారు. ఓట్ల కోసం వచ్చిన వారి వద్ద గుళ్లు, సామాజిక అవసరాలకు పార్టీలతో ప్రమేయం లేకుండా హామీలు తీసుకున్నారు. కానీ ఓటు వేసే విషయంలో మాత్రం గోప్యతను పాటిస్తున్నారు. తమ అంతరంగాన్ని ఎవరికీ చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఓటరు తీరు ప్రధాన రాజకీయ పార్టీల అంతరంగంలో తుఫాన్ సృష్టిస్తోంది. అయితే ప్రధాన పార్టీల ప్రలోభాల ప్రభావం ఓటర్లపై కొంతమేర ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ పార్టీల నాయకులు గెలుపును సవాల్గా తీసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీసీరోడ్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మంచినీటి నల్లాలు ఇలా పలు సమస్యలకు సంబంధించి ఓటర్లు.. అభ్యర్థుల నుంచి కొన్నిసాధించుకోగా, మరికొన్నింటికి హామీలు పొందారు. అయితే ఓటు వేసే విషయంలో ఎవరికి స్పష్టత ఇవ్వకపోవడంతో ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముందే వసూలు సంస్థాన్ నారాయణపురం మండలంలోని గ్రామస్తులు ఓ పార్టీ బహిరంగ సభ కోసం వెళ్లేందుకు ఇస్తామన్న డబ్బును ముందుగానే తీసుకున్నారు. సభ కోసం వెళ్లడానికి గ్రామంలో వాహనం ఎక్కిన వెంటనే డబ్బులు ఇవ్వాలని ఇన్చార్జి నాయకులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో గ్రామ శివారులో వాహనం ఆపి డబ్బులు ఇచ్చిన తర్వాతే సభకు బయలుదేరారు. రెండు పార్టీల సహాయం పొందారు చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో ఓటర్లు మాతమ్మ గుడి అభివృద్ధికి రెండు పార్టీల సహకారం కోరారు. దీంతో ఓ పార్టీ నాయకులు దేవాలయం చుట్టూ కాంక్రీటు, దేవాలయానికి టైల్స్, ఆలయం ముందు పైకప్పుకు రేకులు వేయించారు. మరో పార్టీ.. ఆలయం ముందు భవన నిర్మాణం చేపట్టింది. రెండు పార్టీలను వాడుకున్న ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారన్నది అంచనా వేయలేకపోతున్నారు. పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే ఉందని అంటున్నారు. ఇంకా నిర్ణయించుకోలేదు ఒక్కో అభ్యర్థి ఒక్కో రీతిలో ఉన్నారు. ఏ పార్టీ కూడా భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేకపోతోంది. వాళ్లు చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు. ఓటు ఎవరికి వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. – సుర్కంటి విజయ్, ఎల్లంబావి, చౌటుప్పల్ మండలం ఆలోచిస్తున్నాం ఎవరికి ఓటు వేయాలన్నది ఇంకా ఆలోచిస్తున్నాం. మాకు మంచి చేసిన వాళ్లకే ఓటు వేస్తాం. నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఇల్లు నిర్మించి ఇవ్వాలి. – దోర్నాల సత్యనారాయణ, నారాయణపురం సరైన వ్యక్తికి ఓటు వేస్తా నాకు కొత్తగా ఓటు హక్కు లభించింది. ఇంతలోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు. ఓటు వేయమని అభ్యర్థిస్తున్నారు. తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న క్రమంలో అన్ని రకాలుగా ఆలోచించి సరైన అభ్యర్థికి ఓటు వేస్తాను. – ఎండీ సోహెల్, చౌటుప్పల్ -
చివరి వరకు సర్వశక్తులు! మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్ కృషి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు లక్ష్యంగా నాలుగు నెలలుగా సర్వశక్తులూ ఒడ్డుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ నెల 3న పోలింగ్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసిన ఆ పార్టీ.. ఓటర్లపై పట్టు జారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచార గడువు ముగియనుండటంతో చివరిరోజు ప్రచారాన్ని తారాస్థాయికి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసింది. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలకు గాను ఇప్పటికే చౌటుప్పల్, గట్టుప్పల్, మునుగోడు మండల కేంద్రాల్లో జరిగిన రోడ్షోల్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పాల్గొనగా, మర్రిగూడ రోడ్షోకు ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వం వహించారు. ఇక చివరి రోజున సంస్థాన్ నారాయణపురం, మునుగోడు రోడ్ షోలలో కేటీఆర్, నాంపల్లి, చండూరు రోడ్ షోలలో మంత్రి హరీశ్రావు పాల్గొననున్నారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత నియోజకవర్గం నుంచి తిరుగుముఖం పట్టే పార్టీ ఇన్చార్జిలు, ప్రచార బృందాలు.. పోలింగ్ ముగిసేంత వరకు స్థానిక నేతలు, కేడర్తో సమన్వయం చేసుకోవాలని పార్టీ ఆదేశించింది. రాజగోపాల్ రాజీనామాకు ముందే.. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆగస్టు 2న మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే నెల 8న స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించి, 21న బీజేపీలో చేరారు. అయితే రాజగోపాల్రెడ్డి రాజీనామా ప్రకటనకు ముందే టీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఈ ఏడాది జూన్ చివరి నుంచే ఉప ఎన్నిక కార్యాచరణపై దృష్టి పెట్టింది. మంత్రి జగదీశ్రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్తో పలు దఫాలు సమావేశమైన సీఎం కేసీఆర్ ఉప ఎన్నికపై దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలకు మునుగోడులోని మండలాల వారీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి ప్రచార వ్యూహానికి పదును పెట్టారు. ఆత్మీయ సమ్మేళనాలు, సామాజికవర్గాల వారీగా భేటీలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో సమావేశాలను ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడక ముందే టీఆర్ఎస్ పూర్తి చేసింది. ప్రతి ఓటునూ ఒడిసిపట్టేలా ప్రణాళిక అభ్యర్థిని ఆలస్యంగా ఖరారు చేసినా.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పోటీ చేస్తారనే సంకేతాలను మొదట్నుంచే ఇస్తూ వచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మునుగోడులో పార్టీ యంత్రాంగాన్ని భారీగా మోహరించారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి 10 మంది మంత్రులు, సుమారు 70 మందికి పైగా ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున ఇన్చార్జిలను నియమించి ప్రతి ఓటును ఒడిసిపట్టేలా ప్రణాళికను అమలు చేశారు. ఆగస్టు 20న మునుగోడులో జరిగిన బహిరంగ సభకు హాజరు కావడం ద్వారా ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. అక్టోబర్ 30న చండూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా ప్రచారాన్ని తారస్థాయికి చేర్చారు. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న సుమారు 40 వేల మందికి పైగా మునుగోడు ఓటర్లను పోలింగ్ రోజున నియోజకవర్గానికి రప్పించడంపై దృష్టి సారించింది. చదవండి: మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటితో తెర -
మైక్ కట్.. మునుగోడులో ప్రచారానికి నేటి సాయంత్రం 6 గంటలకు ముగింపు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు రాజకీయ నేతల బహిరంగ ప్రచారానికి తెరపడనుంది. నెలరోజులుగా ఉధృతంగా సాగిన ఈ ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా గ్రామాలన్నీ చుట్టివచ్చారు. గెలుపే ధ్యేయంగా ప్రచారం సాగించారు. ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సీఎం కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్షా, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్కుమార్తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించారు. ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేస్తున్న కె.ఎ. పాల్ కూడా తన వినూత్న ప్రచారంతో ఓటర్లలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. సభలు... సమావేశాలు... ఇంటింటి ప్రచారాలు మునుగోడు ఉప ఎన్నిక వేడి రెండున్నర నెలల క్రితమే ప్రారంభమైంది. రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచే అన్ని ప్రధాన పార్టీలు మునుగోడుపై దృష్టి సారించాయి. కాంగ్రెస్ ఆగస్టులోనే అక్కడ సభ నిర్వహించి కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేసింది. తర్వాత ఆగస్టు 20న మునుగోడులో జరిగిన బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరు కావడంతో టీఆర్ఎస్ పూర్తిస్థాయి ప్రచారాన్ని ప్రారంభించింది. మళ్లీ అక్టోబర్ 30న చండూరులో జరిగిన సభకు కేసీఆర్ వచ్చేంతవరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు అభ్యర్థి ప్రభాకర్రెడ్డి తరఫున ప్రచార బాధ్యతలు అప్పగించారు. బీజేపీ అగ్రనేత అమిత్షా ఆగస్టు 21న మునుగోడు నియోజకవర్గానికి వచ్చి రాజగోపాల్రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచే కమలం పార్టీ ప్రచార ఢంకా మోగించింది. బీజేపీ ఢిల్లీ నేతలు, ఇతర రాష్ట్రాలకు చెందిన మంత్రులు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు ఇక్కడే మకాం వేసి రాజగోపాల్రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. ఇక, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్తో పాటు ఉత్తమ్, భట్టి, శ్రీధర్బాబు, సీతక్క, జగ్గారెడ్డి లాంటి నేతలంతా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి శంకరాచారి గెలుపు కోసం ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్కుమార్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు పనిచేశాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ శక్తి మేరకు ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. చివరి రోజు ఇలా...! ప్రచారంలో చివరి రోజైన మంగళవారం సాయంత్రం వరకు మునుగోడు దద్దరిల్లనుంది. టీఆర్ఎస్ పక్షాన మంత్రులు కేటీఆర్, హరీశ్రావు చివరి రోజున రోడ్షోల్లో పాల్గొననున్నారు. బీజేపీ ముఖ్య నేతలు, రాష్ట్ర నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు.. 7 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో బైక్ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొననున్నారు. ఇక, కాంగ్రెస్ మునుగోడులో మంగళవారం జరిపే ‘మహిళా గర్జన’సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. ఇక, ప్రచారం ముగియనున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచే అన్ని పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పోలింగ్ ఘట్టంపై దృష్టి సారించనున్నారు. చివరి నిమిషంలో ఓటర్లను ఆకర్షించేందుకు ‘అన్ని రకాల’ప్రయత్నాలను చాపకింద నీరులా చేయనున్నారు. చదవండి: టీఆర్ఎస్తో జోడీ లేదు -
మునుగోడు ఉపఎన్నిక కోసం 298 పోలింగ్ బూత్లు ఏర్పాటు
-
ఆ తర్వాత మునుగోడులో స్థానికేతరులు ఉంటే కఠిన చర్యలు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటల వరకేనని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆరు గంటల తర్వాత స్థానికేతరులు ఎవరూ నియోజకవర్గంలో ఉండకూదని ఆదేశించారు. నవంబర్ 3న ఉప ఎన్నిక ఓటింగ్ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సీఈఓ. నాన్ లోకల్ వాళ్ళు మునుగోడులో ఎవరు ఉన్నా చట్ట పరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మునుగోడులో అణువణువు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని గుర్తు చేశారు. ‘మంగళవారం సాయంత్రం ఆరు గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను నియమించాము. ఎవరైనా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్కు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. రేపు సాయంత్రం 6గంటల వరకు మునుగోడులో ప్రచారం ముగుస్తుంది. ఓటర్లకు ఇప్పటికే కొత్త డిజైన్తో కూడిన ఓటర్ ఐడి ఇచ్చాం. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాము. ఫ్లైయింగ్ స్కాడ్తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ఇప్పటి వరకు 111 బెల్ట్ షాపులను సీజ్ చేశాము. 185 కేసులు నమోదు కాగా.. 6.80కోట్ల నగదు 4500లీటర్ల లిక్కర్ పట్టుకున్నాము. కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి వివరణ కాసేపటి క్రితమే అందింది. దీనిపై ఈసీకి నివేదిక పంపాము. రిటర్నింగ్ అధికారిపై సీఈఓ కార్యాలయం నుండి ఎలాంటి ఒత్తిడి లేదు. ’ అని వెల్లడించారు సీఈఓ వికాస్ రాజ్. మునుగోడు ఉప ఎన్నికల ఓటింగ్ కీలక అంశాలు ► నియోజకవర్గంలో 2,41,855 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► నవంబర్ 3న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ► 199 మైక్రో అబ్సర్వస్ అందుబాటులో ఉంటారు. సిబ్బంది, పోలింగ్ స్టాప్ కోసం జిల్లా అడ్మినిస్ట్రేషన్ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ► 3366 పోలింగ్ సిబ్బందిని, 15 బలగాల సిబ్బంది మునుగోడులో మోహరిస్తున్నారు. ► ఫ్లైయింగ్ స్కాడ్తో కలిసి మొత్తం 50 బృందాలు పర్యవేక్షిస్తాయి. ► 45 స్థానాల్లో 105 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ► వంద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: దేవుడే పంపాడేమో! మంటల్లో చిక్కుకున్న నలుగురిని కాపాడిన వ్యక్తి -
నిమ్స్కు మునుగోడు గ్రహణం
సాకక్షి, హైదరాబాద్: నిజాం వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్)కు మునుగోడు ఉప ఎన్నికల గ్రహణం పట్టింది. ఫలితంగా ఆస్పత్రిలో పాలనాపరంగా ఒక్క ఫైల్ కూడా ముందుకు కదలడం లేదు. నిమ్స్కు కొత్త డైరెక్టర్ను నియమించనున్న నేపథ్యంలో ప్రభుత్వం సెర్చ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో వైద్యశాఖ మంత్రి టి.హరీష్రావు, ఆ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, డీఎంఈ డాక్టర్ కె.రమేష్రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ సెర్చ్ కమిటీ సమావేశం అయ్యేందుకు ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నిక అడ్డంకిగా మారింది. అంతేగాకుండా తన అనారోగ్య కారణంగా డైరెక్టర్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు మనోహర్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇటీవల నెలరోజుల పాటు సెలవుపై వెళ్లిన ఆయన గుండె సంబంధిత సమస్యకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకున్న చికిత్స వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరిగి విధులకు హాజరైనప్పటికీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఒక్క ఫైల్ కదలడం లేదు. ఒకటో రెండో ఫైల్స్ మినహా మిగిలిన ఫైళ్లన్నీ డైరెక్టర్ టేబుల్పైనే పేరుకుపోతున్నాయి. ఇదిలా ఉండగా 2015లో డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన మనోహర్ ఇప్పటి వరకూ కొనసాగింపు నిమ్స్ నియమనిబంధనలకు పూర్తి విరుద్ధమని ఓ అధికారి స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం కొత్త డైరెక్టర్ను నియమించాలన్న నిర్ణయానికి వచి్చంది. ఆ మేరకే ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ వేసింది. ఆరుగురు వైద్యుల ప్రయత్నాలు నిమ్స్ సంచాలకుడి పదవిని దక్కించుకునేందుకు ఆరుగురు వైద్యులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో నిమ్స్ రేడియాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఎస్.రామ్మూర్తి, నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, నిమ్స్ డీన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ నగరి బీరప్పతో పాటు డీఎంఈ డాక్టర్ కె.రమేష్రెడ్డితో మరో ఇద్దరు వైద్యులు ఉన్నట్లు సమాచారం. వీరిలో నిమ్స్ డైరెక్టర్ పదవికి అర్హులైన వారిని సెర్చ్ కమిటీ నిర్ణయించాల్సి ఉంది. కానీ మునుగోడు ఉప ఎన్నిక కారణంగా ఇంతవరకు సమావేశం జరగని పరిస్థితి. అయితే నిమ్స్ డీన్గా వ్యవహరించిన రామ్మూర్తి పూర్తి అదనపు బాధ్యతలతో ఇన్చార్జి డైరెక్టర్గా ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ మెప్పు పొందారు. నిమ్మ సత్యనారాయణకు కూడా ఆస్పత్రి పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉంది. అవయవ మారి్పడి ఆపరేషన్లో గుర్తింపు సంపాదించుకున్న డాక్టర్ బీరప్ప ఇటీవలే నిమ్స్ డీన్ బాధ్యతలను చేపట్టారు. డీఎంఈ రమేష్రెడ్డిపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త డైరెక్టర్ ఎవరు వస్తారనే అంశంపై వైద్య, ఉద్యోగవర్గాల్లో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. -
ఢిల్లీ పీఠం కదులుతుంది.. చూసింది కొంతే చూడనిది చాలా ఉంది: కేసీఆర్
మోదీ ప్రమేయం లేకుండానే వచ్చారా? ప్రధాని నరేంద్ర మోదీని అడుగుతున్నా. నీకు ఇంకా ఏం కావాలి. దేశంలో ప్రధాని పదవిని మించి ఇంకా ఏముంది? ఒకసారి కాదు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా? ఇంకా ఎందుకీ కిరాతకం. మోదీ ప్రమేయం లేకుండానే ఆర్ఎస్ఎస్లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్కు వచ్చారా? వాళ్లు ఆఫర్ చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరగాలి. దీని వెనుక ఎవరున్నారో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండటానికి అర్హులు కాదు. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘‘ఢిల్లీ బ్రోకర్గాళ్లు వచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు. ఒక్కొక్కరికి రూ.వంద కోట్లు ఇస్తాం. పార్టీ విడిచిపెట్టి రమ్మంటే మన వాళ్లు వారిని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదురా.. మేం అంగట్లో సరుకులం కాదు అంటూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు. నిన్నమొన్న మీరు టీవీల్లో చూసింది కొంతే. కానీ దొరికిన దొంగతనం ఎంతో ఉంది. ఢిల్లీ పీఠమే దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో పీకేసి, బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప నివృత్తి లేదు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. వంద కోట్లు ఇస్తామంటే గడ్డిపరకతో సమానమని వదిలేసి, నిఖార్సయిన తెలంగాణ బిడ్డలుగా ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల ఎత్తున ఎగరేశారని, అలాంటి బిడ్డలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులోని బంగారిగడ్డలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. మోదీ ఎందుకీ అరాచకం? ‘‘వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొల్లగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? ఎందుకీ అరాచకం. దేశానికి, సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఢిల్లీ నుంచి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికారు. వారు ఇప్పుడు చంచల్గూడ జైల్లో ఉన్నారు. ఎవరో ఒక తలమాసినోడు తడిబట్టలతో ప్రమాణం చేస్తవా అంటడు. ఇంకొకడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తవా అంటడు. ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు కనిపించడం లేదా? నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నా. కేసు న్యాయస్థానాల్లో ఉంది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేశా అంటారు. అందుకే ఆ విషయం నేను ఎక్కువగా చెప్తలేను. కానీ విద్యావంతులు, మేధావులు మౌనంగా ఉంటే మనకు శాపమైతది. మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు ఊరికి వెళ్లాక దీనిపై చర్చ చేయాలి. ఎవడో చెప్పిండని మాయమాటలకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరగదు. జీఎస్టీతో చేనేతకారులకు శిక్ష వేస్తున్న మోదీ దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం మోదీ చేశారు. ఇబ్బందుల్లో ఉన్న చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసి శిక్షిస్తున్నారు. మీ ఓటు వేయించుకొని మిమ్మల్నే పోటు పొడుస్తానని చెప్పే బీజేపీకి ఓటేస్తారా.. ఆలోచించుకోండి. పోస్టు కార్డు ఉద్యమంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటే చేనేత బిడ్డలు బీజేపీకి ఓటు వేయొద్దు. వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాటం చేస్తున్నాయి. బీజేపీ గెలిస్తే ప్రైవేటీకరణే.. ఎన్నికల్లో ప్రలోభాలకు ఆశపడితే గోసపడతాం. 60 ఏళ్ల కింద చిన్న పొరపాటు జరిగితే ఎంత ఏడ్చింది తెలంగాణ. 58 ఏళ్లు కొట్లాడినం. ఎంతోమంది మన బిడ్డలు చనిపోయారు. ఇప్పుడు ఓటు జాగ్రత్తగా వేయకపోతే పెట్టుబడిదారులకు మనమే సద్దికట్టినట్టు అయితది. మనమే ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్టు అవుతుంది. మీటర్లు పెట్టే వారికి డిపాజిట్ వచ్చినా నన్ను పక్కకు నెడతారు. కేసీఆర్ గట్టిగ మాట్లాడుతున్నారని, 20, 30 మంది ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టి, తెలంగాణను కబ్జా పెట్టి ఇష్టారాజ్యంగా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. కార్పొరేట్ గద్దలకు వ్యవసాయాన్ని అప్పగించాలన్న కుట్ర జరుగుతోంది. వారికి బుద్ది చెప్పకపోతే కష్టపడేది మనమే. మునుగోడును గుండెల్లో పెట్టుకుంటా.. మునుగోడును నా గుండెల్లో పెట్టుకుంటాను. మీకు అండదండగా ఉంటాను. చర్లగూడెం ప్రాజెక్టు పూర్తి కావాలె. ఎవరు చేయాలి? ఆపుతున్నది ఎవరు? ఒక రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అయినా మోదీ నీటి వాటా ఎందుకు తేల్చడం లేదు. నేను మహా మొండిని. మునుగోడులో ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత నాది. ఎక్కడి వరకైనా కొట్లాడి తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. వంద పడకల ఆస్పత్రి, చండూరు రెవెన్యూ డివిజన్ కోరుతున్నారు. ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే మీ కోరిక నెరవేరుస్తా. ఇంతకు ముందు గోదలాంటి ప్రభాకర్రెడ్డిని ఓడించి గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నారు. ఆ గొడ్డలి పుణ్యమాని రోడ్లు సరిగా లేవు. ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే ఆ రోడ్లను బాగుచేయించే బాధ్యత నాది. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి దేశంలో సక్కదనం ఏముంది. రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ.. రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలి. డాలర్తో పోల్చితే రూపాయి విలువ ఎంత? 82 రూపాయలా? నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా అధ్వానంగా ఉంటదా? ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా? ప్రకృతి వనరులు, సంపదలున్న దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా? రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు? ధరల పెరుగుదలకు కారణం ఎవరు? సిలిండర్ రూ.1,200 చేసింది ఎవరు? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎవరు? పైగా వారికి ఓటు వేయాలా? అంత పౌరుషం లేకుండా ఉన్నామా? వడ్లు కొనుమంటే కొనరట కానీ రూ.100 కోట్లతో ఎమ్మెల్యేలను కొంటారట. ఓటును సక్రమంగా వినియోగిస్తే ఇలాంటి వారికి బుద్ధి వస్తుంది. జగదీశ్రెడ్డి ఏం తప్పు చేశారు? మంత్రి జగదీశ్రెడ్డి లేకుండా గత 20 ఏళ్లలో ఏ సభలో కూడా మాట్లాడలేదు. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చే ముందు బాధతో వచ్చాను. జగదీశ్రెడ్డి ఏం తప్పు చేశారు. ఎందుకు నిషేధించారు. గుండాగిరి చేశారా? ఎవరినైనా కొట్టారా? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేం చేసుకుంటున్నాం. చాలా బాధగా ఉంది. వీటన్నింటికి 3వ తేదీన ఓటుతో జవాబు చెప్పాలి.’’ -
మునుగోడు ఉప ఎన్నిక: జూనియర్ కేసీఆర్ హంగామా (ఫోటోలు)
-
'బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఏడ్వబోతున్నారు'
సాక్షి, నల్లగొండ: మునుగోడు అభివృద్ధిపై రాజగోపాల్రెడ్డి చేసిన సవాల్పై సీఎం కేసీఆర్ స్పందించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో బండి సంజయ్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'దుకాణం మూతపడే ప్రమాదం ఉందని కేసీఆర్ బయపడుతున్నారు. చండూరు మీటింగ్ ఒక టైమ్ పాస్ మీటింగ్. బహిరంగ సభను చూసి ప్రజలు నవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారో చెప్పాలి. ఎన్ని నిధులు ఇచ్చారు అనేది సభా వేదిక ద్వారా తెలపాలి. అభివృద్ధిపై చర్చ జరగాలి. నియోజకవర్గ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అభివృద్ధిపై ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలను ఏం అమలు చేశావో చెప్పాలి. నీ అభ్యర్థిని పార్టీ ప్రచారానికి తీసుకెళ్లాలంటే అవమానంగా ఎందుకు భావిస్తున్నారు. ఇవాళ బహిరంగ సభ వేదికపై కేసీఆర్ ఏడ్వబోతున్నారు. ఏడ్చి సింపథీని పొందాలని చూస్తున్నాడు. కేసీఆర్ నటించేవాడు కాదు జీవించేవాడు. ఇవాళ జరిగే బహిరంగ సభే సీఎం కేసీఆర్ రాజకీయ జీవితానికి సమాధి' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
చండూరులో కేసీఆర్ సభ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచార పర్వం చివరి అంకానికి చేరుకుంటున్న నేపథ్యంలో, ఆదివారం చండూరులో భారీ బహిరంగ సభ నిర్వహణ ద్వారా పారీ్టకి ఊపు తెచ్చేందుకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మండల కేంద్రంలోని బంగారిగడ్డ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ఆగస్టు 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. మరో సభను చండూరులో ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. జన సమీకరణకు సంబంధించి ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో మండల ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. యూనిట్ ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జన సమీకరణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. చండూరు సభకు ప్రాధాన్యత ఒకవైపు మునుగోడులో అన్ని రాజకీయ పక్షాల ప్రచారం ముమ్మరంగా సాగుతుండగా, రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలతో చండూరు సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. ఆయనతో పాటు పార్టీ యంత్రాంగం అంతా ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. దీంతో చండూరు సభలో సీఎం ఏమైనా మాట్లాడతారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 20న జరిగిన సభలో కేవలం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమైన ముఖ్యమంత్రి.. ఆదివారం జరిగే సభలో రాజకీయ అంశాలపై స్పందించే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంతో సంబంధం కలిగిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చండూరు సభకు సీఎం కేసీఆర్తో పాటు హాజరవుతారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయినందునే ఉప ఎన్నిక వచి్చందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదనే విషయాన్ని సభ ద్వారా చెప్పే అవకాశాలున్నట్లు తెలిసింది. భద్రతా కారణాల వల్లే అజ్ఞాతంలో.. ఎమ్మెల్యేలకు ఎర అంశంపై దర్యాప్తు దశలో స్పందించకూడదని టీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఈ ఘటనతో సంబంధం కలిగిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ నెల 26న పోలీసు భద్రత నడుమ ప్రగతిభవన్కు చేరుకున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజులుగా వీరు ప్రగతిభవన్లోనే బస చేసినట్లు ప్రచారం జరుగుతుండగా, భద్రతా కారణాల దృష్ట్యా వారు ఎక్కడ ఉన్నారనే అంశంపై గోప్యత పాటిస్తున్నట్లు తెలిసింది. అయితే వారు తమ కుటుంబ సభ్యులతో టచ్లో ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
గద్దె దింపి రాష్ట్రాన్ని సంప్రోక్షణ చేస్తాం
మునుగోడు: అధికారంలో ఉన్నామనే అహంకారంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని త్వరలో గద్దె దింపి రాష్ట్రాన్ని సంప్రోక్షణ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ అన్నారు. ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో తమ పార్టీకి సంబంధం లేదని శుక్రవారం యాదగిరిగుట్టలో తడిబట్టలతో సంజయ్ ప్రమాణం చేయగా, ఆ దేవాలయాన్ని సంప్రోక్షణ చేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. మునుగోడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మందుతాగి లక్ష్మీనర్సింహ్మస్వామి పేరు ఉచ్ఛరిస్తున్నందుకు సంప్రోక్షణ చేయాలన్నారు. నాస్తికుడు దైవభక్తి గూర్చి మాట్లాడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నలుగురు ఎమ్మెల్యేలు తప్పుచేయకపొతే ప్రగతిభవన్ నుంచి ఎందుకు బయటకు రావడం లేదని, కేసీఆర్కు ఎలాంటి సంబంధం లేకపొతే దేవుడి వద్ద ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ డబ్బులు ఇచ్చి ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాహుల్గాంధీ చేస్తుంది కాంగ్రెస్ జోడోయాత్ర కాదని, అది టీఆర్ఎస్, కాంగ్రెస్ జోడుయాత్ర అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్కు బానిసలయ్యారని, మమ్మల్ని విమర్శించే అర్హత ఆ బానిసలకు లేదని అన్నారు. మిగిలినివారికి సైతం డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 31న నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 9 బహిరంగ సభలు నిర్వహిస్తామని, వాటిల్లో తమ పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఆరోపణలు నిజం కాదు: తరుణ్ఛుగ్ నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేస్తోందని ఇటీవల వచ్చిన ఆరోపణలు నిజం కాదని, అది అంతా సీఎం కేసీఆర్ ఆడిన డ్రామా అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. నిజంగా సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యేల కోనుగోళ్ల విషయంలో ఎలాంటి సంబంధం లేకపోతే బండి సంజయ్ సవాల్ మేరకు ఎందుకు యాదగిరిగుట్టలో ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. ఆయనకు సంబంధం ఉన్నందునే ప్రమాణానికి రాకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్కు దమ్ముంటే గత 8 ఏళ్ల కాలంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రామాయణంలో అహంకారం తలకెక్కిన రావణుడు ఎట్లా పతనమయ్యాడో కేసీఆర్కు సైతం అదే గతి పడుతుందన్నారు. మునుగోడు ఎన్నిక కేసీఆర్ అహంకారం వల్లే వచ్చిందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, నేతలు గంగిడి మనోహర్రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మునుగోడు ఎన్నికల మూడ్ ఏంటీ?
మూడు పార్టీలకు మునుగోడు టెన్షన్ పట్టుకుంది. అభ్యర్థులతో పాటు నాయకులకు కూడా బీపీ పెరుగుతోంది. పైకి ధీమాగా కనిపిస్తున్నా.. లోలోన ఆందోళనకు గురి చేస్తోంది. డబ్బు మంచినీళ్ళలా ఖర్చవుతోంది. కాని ఓటర్ల మనోగతం ఎలా ఉందో ఎవరికీ అంతుపట్టడంలేదు. చివరికి ఏమవుతుందో అన్న ఆతృత అందరినీ వెంటాడుతోంది. ఇంతకీ ఓటర్లు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీలోనూ కనిపించని గెలుపు ధీమా మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలకు చావో రేవో అన్న పరిస్థితి సృష్టించింది. రెండు నెలలుగా అక్కడ జరుగుతున్న రాజకీయం, పార్టీల మార్పిళ్ళు, డబ్బు ఖర్చు, ఓటర్ల కోసం ఇస్తున్న ఆఫర్లు వంటివి తలపండిన రాజకీయ విశ్లేషకులను సైతం దిగ్ర్బాంతికి గురి చేస్తున్నాయి. మరోవైపు పోటీ చేసే అభ్యర్థులకు, అక్కడ ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ఆయా పార్టీల సీనియర్ నాయకులకు టెన్షన్ రోజు రోజుకూ పెరుగుతోంది. సస్పెన్స్, క్రైం థ్రిల్లర్ను తలపించే విధంగా మునుగోడు రాజకీయాలు అనేక రికార్డులను బద్దలు కొడుతున్నాయి. ఒక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక కంటే... రాష్ట్రం భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికగా ప్రచారం జరుగుతోంది. కాని ప్రజల నాడి పట్టుకోవడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. మంచినీళ్ళలా డబ్బును ఖర్చు పెడుతున్నా.. చివరికి ఓటరు దేవుడు ఎవరిని కరుణిస్తాడో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నాయకులు. అస్త్రశస్త్ర ప్రయోగం ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా నియోజకవర్గంలో మకాం వేశారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకుండా గులాబీ పార్టీ నాయకత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర మంత్రులందరినీ నియోజకవర్గంలోనే మోహరించి ప్రచారం సాగిస్తోంది. బీజేపీ కూడా ఇప్పటి వరకు ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర కీలక నేతలంతా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్, ఉత్తమ్, జానా రెడ్డితో పాటు మాజీ మంత్రులను రంగంలోకి దించి ప్రచారం సాగిస్తోంది. అన్ని పార్టీలకు సంబంధించిన ఇంత మంది నేతలు నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహిస్తున్నా గెలుపుపై ఏ పార్టీలోనూ అంత ధీమా కనిపించడం లేదని ఆయా పార్టీల నేతలే అంటున్నారు. తింటారా.. తాగుతారా? ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. ఓటర్ల అవసరాలను గుర్తించి వాటిని తీర్చి తమవైపుకు తిప్పుకునే యత్నం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన ఓటర్ల వద్దకు కూడా వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పార్టీలు చేస్తున్న పోటా పోటీ ఖర్చును చూస్తున్న ఓటరు కూడా నేతలకే ఆఫర్ ఇస్తున్నాడంట. ఇంతవరకు నేతలే వచ్చి.. గెలిపిస్తే ఇది చేస్తా అది చేస్తానంటూ ఆఫర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులు అయ్యాయని అంటున్నారు. ఎప్పుడు మీరేనా ఆఫర్లిచ్చేది? ఈసారి మేం మీకు ఆఫర్ ఇస్తామంటున్నారట. మేం ఇంతమంది ఓటర్లం ఉన్నాం ఇంత కావాలి.. ఇస్తే ఓటు మీకే అని నాయకులకు ఆఫర్లు ఇస్తున్నారట. చేసేదేం లేక అడిగినంత ముట్టజెప్పేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయని టాక్. -
ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. టీఆర్ఎస్కు కౌంటరిచ్చిన తరుణ్చుగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలతో మొదలైన పొలిటికల్ హీట్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో మరింత ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తాజాగా తరుణ్చుగ్, బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో తరుణ్చుగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంతా ఓ కట్టుకథ. ఈ వ్యవహారంతో బీజేపీకి సంబంధమేలేదు. ఇదంతా టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా. ఇది నిరూపించేందుకే బండి సంజయ్ తడి బట్టలతో వెళ్లి యాదాద్రిలో ప్రమాణం చేశారు. కేసీఆర్కు నిజంగా సచ్ఛిలుడు అయితే యాదాద్రికి ఎందుకు రాలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతికి కేరాఫ్గా మారింది. తెలంగాణలో ఎనిమిదేళ్ల పాలనలో టీఆర్ఎస్ చేసిందేమిటో శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల జస్ట్ ట్రైలర్ మాత్రమే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై కర్నాటకలో డ్రగ్స్ కేసు ఉంది అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం స్పందించారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రిలో సంప్రోక్షణ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. నాస్తికుడికి దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. నువ్వు, నీ కుటుంబం మోసకారి కుటుంబం. మీరు గద్దె దిగాక తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తామన్నారు. మీ ఎమ్మెల్యేలు తప్పు చేయకపోతే ప్రగతి భవన్ నుంచి ఎందుకు బయటకు రాలేదు అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో ప్రమాణం చేయడం పాపం -
Telidevara Bhanumurthy: సిత్రాలు సూడరో శివుడో శివుడా!
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు ఎప్పటిలెక్కనే మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగటాపి హారన్ గొట్టిండు. బేతాలుడింట్ల కెల్లి ఇవుతలకొచ్చిండు. మోటరెన్క సీట్ల ఆరాంగ గూసున్నడు. ‘‘నువ్వు ఎత్తుగడ్డలు, గుంతలని సూడకుంట మోటర్ నడ్పుతనే ఉంటవు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. బల్రు అడ్డం రావొచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతె నీకు తిక్కలెవ్వొచ్చు. నువ్వు బేచైన్ గాకుంట ఉండెతంద్కు మునుగోడు ముచ్చట జెప్త ఇను’’ అన్నడు. ‘‘ఊకూకె మునుగోడు, మునుగోడు అంట వేంది?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘ఎందుకంటె అందర్కి ఒక్క దినమే దివిలె. ఎలచ్చన్ల జాత్ర జెయ్యబట్కె మునుగోడు జెనంకు దినాం దివిలెనే. దినాం దావత్లే. దినాం మందుల తేలకుంట మున్గుడే. అన్ని పార్టిల లీడర్లు ఒక్క తీర్గ చక్కర్లు గొడ్తున్నరు.’’ ‘‘కల్లమున్న కాడ బిచ్చగాల్లు. ఓట్లున్న కాడ లీడర్లు’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి నిలవడ్డ పాల్వాయి స్రవంతి ప్రచారం జేస్కుంట బోతుంటె బీజేపోల్లు అడ్డమొచ్చి శేర్ పటాకులు గాల్సిండ్రు. కాల్లల్ల కట్టె పెట్టినట్లు జేసిండ్రు.’’ ‘‘కాంగ్రెసోల్లు ఊకున్నరా?’’ ‘‘ఎందుకూకుంటరు. తమ్ల పాకుతోని గీల్లంటె తల్పు చెక్కతోని గాల్లన్నరు. బీజేపీ దిక్కుకెల్లి పోటీ జేస్తున్న రాజగోపాల్రెడ్డి జీపు ముంగట కాంగ్రె సోల్లు ఒక్క తీర్గ భూచెక్రాలు గాల్సి అడ్డం బడ్డరు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మందు బోస్తున్నయి. పైసలిస్తున్నయి. నరకాసురుని మీద్కి బానాలిడ్సిన సత్యభామ అసువంటిది మా స్రవంతి అని రేవంత్ రెడ్డి అన్కుంట గామెతోని బీజేపీ, టీఆర్ఎస్ల దిక్కు రొండు రాకిట్లు ఇడిపిచ్చిండు’’. ‘‘టీఆర్ఎసోల్లు పటాకులు గాల్వలేదా?’’ ‘‘గాల్సిండ్రు. సంస్థాన్ నారాయన్పురంల 18 వేల కోట్ల స్టిక్కర్ తోని తయారు జేసిన పటాకులను మంత్రి గంగుల కమలాకర్ గాల్సిండు. రాజ గోపాల్రెడ్డి బోతుంటె టీఆర్ఎసోల్లు అడ్డం దల్గి బాంబులు గాల్సిండ్రు. నాకే అడ్డం దల్గుతరా? మీ తోడ్కల్ దీస్త అన్కుంట గాయిన కప్పగంతులు ముట్టిచ్చిండు. ఇగ టీఆర్ఎస్ దిక్కుకెల్లి పోటి జేస్తున్న కూసుకుంట ప్రభాకర్ రెడ్డి లక్ష్మిబాంబు బత్తి ముట్టిచ్చిండు. గది ధన్మనకుంట తుస్సు మన్నది’’. ‘‘గీ మూడు పార్టీలే గాకుంట కడ్మోల్ల ప్రచారం సంగతేంది?’’ ‘‘కడ్మోల్లు అంటె ఇండిపెండెట్గ నిలవడ్డ కె.ఎ.పాల్ ప్రచారం గురించి రొండు ముచ్చట్లు జెప్త. గాయిన గుర్తు ఉంగ్రం. ఏలుకున్న ఉంగ్రం సూబెట్టుకుంట ఓట్లడ్గుతుంటె మాకు బంగారి ఉంగ్రం జేపిచ్చిస్తవా అని కొందరడిగిండ్రు. నన్ను గెలిపిస్తె మునుగోడును అమెరిక జేస్త. గాలి మోటర్ అడ్డ బెట్టిపిస్త అని పాల్ అన్నడు. రాంగ్ సైడ్ల కొస్తున్నవని ఒక పోలీసాయిన మోటరాపితె నేనంటె ఎవ్వరనుకుంటున్నావు, కాబోయె తెలం గాన ముక్యమంత్రి ననుకుంట పాల్ బెదిరిచ్చిండు. అందరు సూస్తుండంగ ఇంకోతాన చెంగడ బింగడ డ్యాన్సు జేసిండు.’’ ‘‘మునుగోడు ఎలచ్చన్ల ప్రచారంల కొత్త సంగతేమన్న ఉన్నదా?’’ ‘‘ఇంతకుముందు ఎన్నడు లేని తీర్గ గీ బై ఎలచ్చన్ల పోస్టర్ల జంగ్ నడుస్తున్నది. మీ అభిమాన సత్యం థియేటర్లో నేడే బ్రహ్మాండమైన విడుదల. మునుగోడు కాంతి స్రవంతి. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ నీతి నిజాయితీల అడ్డ. దర్శకత్వం: విరాట్ కొహ్లీ అసుంటి రేవత్ రెడ్డి అని కాంగ్రెస్ పోస్టర్ ఏసింది. నేడే విడు దల. అమిత్ షా ప్రొడక్షన్స్ వారి పద్దెన్మిది వేల కోట్ల రూపాయలు. దర్శకత్వం: కోవర్టు రెడ్డి. నర్తకి 70 ఎం.ఎం. థియేటర్ అని టీఆర్ఎస్ పోస్టర్ అంటిచ్చింది. బండి సంజయ్ దర్శకత్వంలో నేడే విడు దల రాజన్న రాజినామా. ముక్యమంత్రి, మంత్రుల బ్యాంకు కాతాలల్ల బడ్డ నిర్వాసితుల బకాయిలు. గొల్రు కొనెతంద్కు గొల్ల కురుమలకు రూపా యలు. కడ్మ సిన్మ ఎండి పర్ద మీద సూడుండ్రి అని బీజేపీ ఏసింది. కానీ గీ ఎలచ్చన్ల ఎవలు గెల్సినా పరకేం బడదు. జెనం బత్కులేం మారయి. పెట్రోలు, గ్యాస్ బండ దరలు మొగులు మీద్కి బోతనే ఉంటయి. రూపాయి బక్కగైతనే ఉంటది. ఎన్కట రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు గదే రూపాయి బిల్ల మీద బొటనేలు బొమ్మ ఎందుకున్నది. గీ సవాల్కు జవాబ్ జెప్పకుంటివా అంటే నీ మోటర్ బిరక్ ఫేలైతది’’ అని బేతాలుడన్నడు. ‘‘ఎన్కట అందర్కి బువ్వ దొర్కుతుండె బట్కె రూపాయి బిల్ల మీద వరికంకి బొమ్మ ఉండేది. గిప్పుడు బువ్వ దొర్కకుండ బట్కె బొటనేలు చీక్కుంట బత్కుండ్రి అని గిప్పటి రూపాయి బిల్ల మీద బొమ్మ జెప్తున్నది’’ అని విక్రమార్కుడు అన్నడు. ఇంతల బొందల గడ్డొచ్చింది. విక్రమార్కుడు మోటరాపిండు. బేతాలుడు మోటర్ల కెల్లి దిగి బంగ్ల దిక్కు బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
రోజుకో గెటప్.. తగ్గేదేలే.. రైతు వేషంలో కేఏ పాల్..
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు సమయం దగ్గర పడటంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు వ్యూహాత్మక ఎత్తుగడలతో మునుగోడులో జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఏ మాత్రం తగ్గకుండా కేఏ పాల్ రచ్చ రచ్చ చేస్తున్నారు.మునుగోడులో గెలిచేది నేనే అంటూ కే ఏ పాల్ హల్చల్ చేస్తున్నారు. రైతు వేష ధారణలో కేఏ పాల్ ఎన్నికల ప్రచారం తాజాగా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో డాన్స్ చేస్తూ, స్టెప్పులేసిన కె ఏ పాల్, రోజుకో రకమైన గెటప్లతో చిత్రవిచిత్రంగా ప్రచారం చేస్తూ కాబోయే సీఎం తానేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న చెప్పులు కుడుతూ కనిపించిన కేఏ పాల్, తాజాగా రైతు వేషధారణలో ప్రత్యక్షమయ్యారు. తలకు కండువా కట్టుకుని చేతిలో కర్ర పట్టుకొని, రైతులతో కలిసి కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. -
దారి తప్పిన మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరతీసింది. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్వి ళ్లూరుతున్న బీజేపీకీ, అధి కార గులాబీ పార్టీకీ ఇక్కడ విజయం అనివార్యంగా మారింది. రాబోయే శాసనసభ ఎన్నికల పోరా టానికి ఇది కచ్చితంగా మొదటి అడుగు కాబో తోంది. కాంగ్రెస్ కూడా సర్వ శక్తులూ ఒడ్డుతున్నా ధన ప్రవాహమే చోదకశక్తిగా మారినందున ఆ పార్టీ దూకుడు కనబర్చలేకపోతోంది. ఢిల్లీలోనూ, రాష్ట్రం లోనూ ఉన్న అధికార పార్టీలపై ఉన్న వ్యతిరేకత పైనే హస్తం పార్టీ ఆశలన్నీ. అయితే ప్రచారంలో పుంజుకుంటున్న కాంగ్రెస్ మిగతా రెండు పార్టీల గెలుపు ఓటములను శాసించే స్థితిలో ఉంది. కాంగ్రెస్ తెచ్చుకునే ఓట్లను బట్టి ఫలితం ఎటైనా తిరగ బడొచ్చు. రాజధానికి అతి సమీపంలో ఉన్నా మును గోడు అభివృద్ధికి నోచుకోలేదు. 2.42 లక్షల ఓట ర్లున్న ఈ నియోజకర్గం ఫ్లోరోసిస్ నుంచి విముక్తమై ఇప్పుడిపుడే కోలుకుంటోంది. మునుగోడు బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు తమ తమ అభివృద్ధి ఎజెండాలను పేర్కొనడం కంటే పరస్పర విమ ర్శలు, తిట్లదండకాలతో వినోదం పంచుతు న్నాయి. మరోవైపు మెజారిటీ ఓటర్లు తమ ఓట్లకు దక్కే మూల్యంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మొత్తం మీద మునుగోడులో ఏ పార్టీ అభ్యర్థి ఎంత వెదజల్లుతారనేదే గెలుపును నిర్ణయించే ప్రధాన అంశం అయింది. రాజ్యాంగం లోని మూడో అధికరణ, ఆర్టికల్ 84 – 174 ప్రకారం పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు ఒక ప్రమాణ పత్రం సమర్పిస్తారు. రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్(ఈసీ) నియమాలను కచ్చితంగా పాటిస్తానని చెప్పడమే ఈ ప్రమాణ పత్రం ఉద్దేశం. కానీ జరుగుతున్నదేమిటి? అసెంబ్లీ అభ్యర్థి ప్రచార వ్యయం ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.40 లక్షలు దాటకూడదు. నామినేషన్ వేసిన రోజు నిర్వహించే ర్యాలీలు, ప్రచార హంగామాకే 50 లక్షల దాకా వెదజల్లు తున్న పరిస్థితి. నేతల ప్రసంగాలు వినడానికి రోడ్డుపై గంట సేపు నిలబడటానికి కార్యకర్తలు చేస్తున్న ఛార్జి రూ. 500 లేదా అంతకు మించి. ఊరేగింపులో ద్విచక్ర వాహనంతో పాల్గొంటే ఒక రేటు, కారుతో వస్తే ఇంకాస్త ఎక్కువ భత్యం ఇవ్వాల్సి వస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్ మొదలై నప్పటి నుంచీ రూ. 20 కోట్ల దాకా లెక్క చెప్పని డబ్బు, హవాలా మనీ పట్టుబడింది. ప్రధాన అభ్య ర్థుల ఎన్నికల వ్యయం రూ. 500 కోట్లు దాటు తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మునుగోడులో మూడు ప్రధాన పార్టీల తరఫున దాదాపు 4 వేల మంది బయటి వాళ్లు తిష్ట వేసి ఉన్నారు. వీరి వాహనాల వ్యయం, బస, తిండి ఖర్చులు అభ్యర్థుల ఖాతాలో వేయాల్సి ఉంది. మునుగోడుకు చెందిన దాదాపు 40 వేల మంది హైదరాబాద్లో ఉద్యోగాలు, చిన్న వ్యాపా రాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలా మందికి నియోజకవర్గం వెలుపలి ప్రాంతాల్లో బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. వాటిలో జమ అయ్యే నిధులను ఎలా లెక్కిస్తారు? పైగా పోలింగ్ రోజు నియోజకవర్గం వెలుపల ఉన్న వారందరినీ డబ్బు ముట్టచెప్పి, రవాణా ఖర్చులు చెల్లించి పిలిపి స్తున్నారు. ఒకప్పటిలా అభ్యర్థులు ప్రచారానికి మీడి యాలో ప్రకటనలు ఇవ్వడం లేదు. పెయిడ్ వార్తలు వేయించుకుని భారీ మొత్తం చెల్లిస్తున్నారు. దీన్ని గుర్తించి నిరూపించడం అంత తేలిక కాదు. ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, కుల సంఘ భవ నాలు, పేద వారికి ఇళ్లు కట్టిస్తామని ఇచ్చే హామీలు ఎన్నికల్లో గెలిస్తే నెరవేరుస్తారు. పోలింగ్ ముగిసిన తర్వాత చేసే వ్యయంపై ఎవరి నిఘా ఉంటుంది? దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మునుగోడు నిలవబోతోంది. ఓటుకు ఎంత చెల్లించి కొనుక్కుం టారనేది పోలింగుకు రెండు, మూడు రోజుల ముందు తెలవొచ్చు. మొత్తంమీద ఉప్పెనలా ప్రవహిస్తున్న ధనం ఈసీ నియమావళిని అపహాస్యం చేస్తోంది. 2019 సాధారణ ఎన్నికల్లో రూ. 50,000 కోట్ల బ్లాక్ మనీ చేతులు మారిందని ఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ వెల్లడించింది. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలని ఆందో ళన వ్యక్తం చేసింది. ఆ తర్వాత జరగాల్సిన ప్రక్షాళన గురించి, డబ్బు, మద్యం ప్రలోభాలు లేని స్వేచ్ఛా యుత ఎన్నికల గురించి అనేక చర్చలు జరిగాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నా అందులో భాగ స్వాములుగా ఉన్న రాజకీయ పార్టీలు పరివర్తనకు సిద్ధంగా లేనప్పుడు మునుగోడు లాంటి బై ఎలక్ష న్లలో అభ్యర్థుల చెల్లింపు శక్తే జయాపజయాలను నిర్దేశిస్తుంది. ఇటువంటి ఎలక్షన్ నిర్వహించడం కంటే టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కువ ‘వితరణ’ కోట్ చేసిన అభ్యర్థి విజయం సాధించినట్టుగా ప్రక టించడం ఉత్తమం అనే నిస్పృహతో కూడిన సూచ నలు వినిపిస్తున్నాయి. ఇలా వచ్చిన డబ్బులో సగం ఓటర్ల ఖాతాలకు బదిలీచేసి మిగిలిన మొత్తాన్నీ అభివృద్ధి పనులకు వ్యయం చేసేలా రాజ్యాంగ సవరణ చేస్తే ఏ గొడవా ఉండదేమో! ప్రజాస్వామ్య విరుద్ధమనిపించినా జరుగుతున్నది అదే కదా!! బీటీ గోవింద రెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మూడు రోజులు వైన్ షాప్లు బంద్
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక కోడ్ నేపథ్యంలో నవంబర్ 1న సాయంత్రం 6గంటల నుంచి 3న సాయంత్రం 6గంటల వరకు వైన్ షాపులు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సంతోష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాలమేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్షాపులు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చాక మునుగోడు పరిధిలో మద్యం అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాల్లో 128 మంది ఎక్సైజ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వారంతా వైన్షాపుల్లో మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత 2,705 లీటర్ల మద్యం, రెండు బైక్లను సీజ్ చేసి.. 48మందిని అరెస్టు చేసి మొత్తం 118 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.5,59,000 ఉన్నట్లు తెలిపారు. -
.... ఉప ఎన్నికలూ జిందాబాద్!
(ఇది కల్పితమే, కానీ అందరినీ ఉద్దేశించిందే.. – ముందస్తు డిస్క్లెయిమర్) నల్లధనంలా నిగనిగలాడుతున్న అమావాస్య చీకటి..అంత చీకట్లోనూ మోదీ కొత్త రెండువేల రూపాయి నోటులా తళతళలాడుతున్న ఓ ఇల్లు.. ఆ ఇంటిలోకి దూరాడో దొంగ.. ఎదురుగా నిలువెత్తు సాయిబాబా ఫొటో..దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ‘పరాయి సొమ్ము ఆశించడం పాపం..’ అని రాసి ఉంది. అది చదివి లెంప లేసుకుని, సాయిబాబాకు దండం పెట్టుకుని వెనక్కు తిరిగాడు. మన దొంగ సాయిబాబా భక్తుడు.. అంతటివాడి మాటను కాదంటాడా! వెనక్కు తిరిగి వెళ్లిపోదామనుకున్న దొంగకు గుమ్మంపైన ఆ ఇంటి ఓనరు ఫొటో కనపడింది.. కాస్త అదో రకం నవ్వుతో. వెంటనే దొంగ ఇలా అనుకున్నాడు... ‘ఇదంతా పరాయి సొమ్ము ఎలా అవుతుంది. మనసొమ్మేగా తప్పేంలేదు’ అనుకుని చేతికందింది పట్టుకు పోయాడు.. ఆ ఇంటి ఓనరెవరో మీకు తెలిసే ఉంటుంది. ...లేకుంటే చివరిలో చూద్దాం... ............ ఇక అసలు విషయానికొద్దాం.. ఈ మధ్య అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై, జనాభివృద్ధిపై, పేదరికంపై జరుగుతున్న పరిశీలనలు, చూపిస్తున్న సూచికలు విపక్షాల విమర్శల్లాగే తప్ప..సరిగ్గా లేనట్లుంది... మొన్నటికి మొన్న ఆకలి సూచిలో 107 స్థానానికి మనను నెట్టాయి. మునుగోడుకు ఆ బృందాలను పంపి పరిశీలించ మనండి. వాళ్ల అంచనాలన్నీ తలకిందులైపోవూ! ప్రజల శ్రేయస్సు కోరి నియోజకవర్గంలోనే తిరుగుతున్న రాష్ట్ర, కేంద్ర మంత్రులు... పొద్దున లేవగానే మంచి చెడుల పరామర్శలు, పనుల్లో పాలు పంచుకుంటూ వందలాది నాయకులు. (వెయ్యి ఓట్లున్న గ్రామంలో అన్ని పార్టీలు కలిపి.. 150 వాహనాలు.. నాలుగైదు వందల కార్యకర్తలు ఎప్పుడూ కనపడుతున్నారట) –ఇంతకు మించి పాలన ఏమి ఉంటుంది? తలలు తెగిపడుతున్న నాటుకోళ్లు, యాటలు... బిర్యానీ పొట్లాల పెళపెళలు... ఐదు రూపాయలకే భోజనం అని ఆహ్వానిస్తున్న హోటళ్లు – ఆకలిసూచిక పొలమారుతోంది... బస్సుల్లో తీసుకువచ్చి హైదరాబాద్లో కార్పొరేట్ వైద్యం చేయించడం, బంకుల్లో రెండు లీటర్ల ఫ్రీ పెట్రోల్, జనం చేసిన అప్పులు తీర్చ డానికి ఆర్థిక సాయం, 20 వేలనుంచి 30 వేల దాకా నడుస్తున్న ఓటు వేలం పాట.. – మానవాభివృద్ధి సూచిక పరిగెత్తించడానికే కదా! యాదాద్రి లాంటి గుళ్లలో ఫ్రీ దర్శనాలు (ప్రమాణానికే అనుకోండి), కాసిన్ని విందులతో ఆనంద విహారాలు, మంచింగ్లు, మందు బాటిళ్ల చప్పుళ్లు. – హ్యాపీ ఇండెక్స్ చిద్విలాసమే కదా! ఎలాగైనా జనం జేబుల్లో డబ్బు చేర్చాలని తహతహలాడే పార్టీలు‘హవాలా’ రిస్కుకూ వెనుకాడడం లేదు... నిఘా కన్ను కప్పి చెక్పోస్టులు దాటి... బైకుల ద్వారా... డొంకల్లోంచి... కోట్లు తీసుకువచ్చే ప్రయత్నాలు.. – ఇంతకు మించి ప్రజాసేవ ఏముంటుంది? ఆరేళ్ల కిందట నల్లధనం బయటికి తెస్తానన్న మోదీ మాట విని నవ్వుకున్న వారు ఇప్పుడు. ‘...అరే వచ్చేసిందే’ అని తెల్లబోతున్న సందర్భం. మాది ‘బంగారు తెలంగాణ’ అన్న కేసీఆర్ మాట విని వెక్కిరించిన వారి ముఖంలో ఇప్పుడు ‘నిజమే...’నన్న ఆశ్చర్యం. సంపద పంపిణీ జరగాలని అరిచి అరిచీ అలసిపోయిన వామపక్షవాదుల కళ్లలో... ఆనంద భాష్పాలు. పక్క నియోజకవర్గాలు కూడా తమ ఆనందా నికి, అభివృద్ధి కోసమై రాజీనామా చేసే ఎమ్మేల్యేల కోసం... ఉప ఎన్నికల కోసం... ఎదురు చూస్తున్న తరుణం. – ఇది కదా ప్రజాస్వామ్య ఔన్నత్యం..! ఇక్కడ కదా ఆనందాభివృద్ధి తూనికలు, కొల మానాలు, సూచికలు లెక్కగట్టాల్సింది.. ఓ ఓటరు మాట.. ప్రస్తుతం జాతర నడుస్తోంది. ఇప్పటి దాకా చేసిందేమీ లేదు, ఇక ఎవరూ గెలిచి చేసేదేమీ లేదు... వారికి ఓట్లు గావాలే మాకు డబ్బులు కావాలే... మా అవకాశం మాది... వారి అవకాశం వారిది. ఇక్కడ మాకు నచ్చింది ఒకటే... ‘...మాకు పైసలి స్తున్నరు... అంతే.’ ఇప్పడు 100 కోట్లు పెడితే తర్వాత రెండొందల కోట్లు సంపాయిస్తడు. వాళ్లకు పోయేదేముంది.. అభివృద్ది లేదు పాడూ లేదు... ఇన్నేళ్లూ లేంది ఇప్పుడయితదా! ఎవడు డబ్బులిస్తే వాడికి ఓట్లె య్యడం మంచిది... గొడవలేకుండా. – ఆహా... ఇది కదా ప్రజాస్వామ్య స్థితప్రజ్ఞత! (మన మంత్రి నిర్మలమ్మ భాషలో చెప్పాలంటే ప్రజాస్వామ్యం విలువ తగ్గట్లే... నాయకుల ‘వ్యాల్యూ’ పెరుగుతోంది అంతే... దానివల్లే ఇన్ని వెసులుబాట్లు) ‘టీ’ వాలా ఎంట్రీ.. ముళ్లపూడి వెంకటరమణ గారి కథోటి ఉంది. ఓ ఊరిలో రోటీవాలా, బేటీవాలా అని ఇద్దరు శత్రువు లుండేవారు. ఓట్లకు నోట్లు జల్లేస్తూ... వచ్చేది పది రూపాయల లాభమైనా నూర్రూపాయలు తగలే సేంత ప్రచారం చేస్తూ పోటీ పడేవారు. వీరికి పోటీగా ‘టీ’వాలా గోదాలోకి దిగడంతో∙సీన్ ఎలా మారిపోయిందో చెప్పే సరదా ఎన్నికల కథ. ఎన్నికలయి పోయాక... నెగ్గినవాడు బాగుపడ్డాడా అని ప్రశ్నిస్తే... నెగ్గినోడు వేరు, బాగుపడ్డవాడు వేరూనూ అని సమాధానం వస్తుంది. కాసిన్ని రోజులు ఆగితే ఇక్కడా మనకు తెలుస్తుంది. బేటీవాలా, రోటీవాలా, ‘టీ’ వాలాల్లో... ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు బాగుపడ్డారూ.. అని. నేతల ఊకదంపుళ్లు, మైకుల సౌండ్లు, వాహనాల హారన్లు, హామీ చప్పుళ్లు, కరెన్సీ పెళపెళలు, మందు బాటిళ్ల సౌండ్ల మధ్య... ఇంకా ప్రజాస్వామ్యంపై, ప్రజా శ్రేయస్సుపై ఆశ చావని మేధావులు బలహీన స్వరంతోనైనా ఓటర్లు అలియాస్ జనాన్ని ప్రశ్నిస్తున్నారు.. ‘...ఓట్లు అమ్ముకోవడం తప్పు కదా..? అని. దానికి సమాధానం మాత్రం గట్టిగానే వస్తోంది. ‘...పంచుతున్న డబ్బులన్నీ వాళ్లు కూలీనాలీ చేసి చెమటోడ్చి సంపాదించినవా? అంతా మా డబ్బే కదా ఇవ్వనివ్వండి...’ అని. – ఇది కదా ప్రజాస్వామ్యం పరిపక్వత! ............ ఇక, పైన మనం చెప్పుకున్న దొంగ ఎవరింటికి దొంగతనానికి వెళ్లాడో, ఎవరి ఫొటో చూశాడో.. ఎందుకు అది పరాయి సొమ్ము కాదను కున్నాడో.. చెప్పనక్కరలేదనుకుంటా! -
మునుగోడు మాజీ ఆర్వో సస్పెన్షన్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఎంవీ జగన్నాథరావును తక్ష ణమే సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11గంటల్లోగా సస్పెన్షన్ ఉత్తర్వులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరింది. రిటర్నింగ్ అధికారికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైనందుకు గానూ స్థానిక డీఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థికి కేటా యించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి బేబీ వాకర్ గుర్తును కేటాయించడా న్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీవ్రంగా పరిగణించిన విషయం తెలి సిందే. ఈ వ్యవహారంలో బాధ్యుడైన రిటర్నింగ్ అధికారి(ఆర్వో) జగన్నాథ రావుపై వేటు వేసి ఆస్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్ను ఆర్వో గా నియమించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్ను కేటాయించింది. తాజాగా ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం జగన్నాథరావును సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. (చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు) మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయండి భారత ఎన్నికల చరిత్రలోనే అతి ఖరీదైన ఎన్నిక మును గోడు ఉపఎన్నిక అని, అక్కడ జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మద్యం పంపిణీని అరికట్టి ఉపఎన్నికను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు గోనెల ప్రకాశ్రావు వినతి పత్రాలు పంపారు. మునుగోడులో అక్టోబర్ నెలలో దాదాపు రూ.132 కోట్ల మద్యం ఏరులైపారిందని, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మునుగోడులో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆరి్టకల్ 324 ప్రకారం ఎన్నికల రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘంకు ఉందని గుర్తు చేశారు. (చదవండి: మునుగోడు సైన్మా.. టక్కర్లు, ట్విస్ట్లు) -
Munugode By Election: గడువు ముగిసే వరకు కదలొద్దు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచార గడువు ముగిసేంత వరకు పార్టీ ఇన్చార్జిలు తమకు కేటాయించిన చోట ప్రచారాన్ని ఉధృతం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ ఇన్చార్జిలతో గురువారం ఉదయం ప్రగతిభవన్ నుంచి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30న చండూరులో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు హాజరవుతున్న నేపథ్యంలో జన సమీకరణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 30న బహిరంగ సభ, 31న నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో రోడ్షోలు నిర్వహిస్తున్నందున ఈ రెండు రోజులను మినహాయిస్తే ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రచారం ముమ్మరం చేయాలని పార్టీ ఇన్చార్జిలకు కేటీఆర్ సూచించారు. వచ్చే నెల ఒకటో తేదీ సాయంత్రం ప్రచారం ముగిసినా పోలింగ్ పూర్తయ్యేంత వరకు ఫోన్ ద్వారా పార్టీ స్థానిక యంత్రాంగాన్ని సమన్వయం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ నెల 30న జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ జన సమీకరణను సవాల్గా తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడొద్దు: కేటీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు విజ్ఞప్తి చేశారు. ‘అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏ మాత్రం పట్టించుకోవద్దు’అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
మునుగోడు సైన్మా.. టక్కర్లు, ట్విస్ట్లు
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ కాక పెంచుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు హోరాహోరీ పోరు సలుపుతూ వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. నాయకులను ఆకర్షించడంలో కూడా పోటీ పడుతున్నాయి. మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ను బిజెపి ఆకర్షిస్తే శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ , మరో నేత దాసోజు శ్రావణ్,మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ లను బిజెపి నుంచి టిఆర్ఎస్ ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ నేతలు గతంలో ప్రత్యర్ధి పార్టీలపై చేసిన విమర్శలు, ప్రతి విమర్శలకు తూచ్ పెట్టారని అనుకోవచ్చు. నాలుగు రోజుల క్రితం కూడా స్వామి గౌడ్ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విరుచుకుపడ్డారట. కాని అంతలోనే కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకం ఉన్నవారందరిని తమ పోల్డ్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకుని వారికి ఆహ్వానం పంపడం,వారు చేరిపోవడం ఆసక్తికర పరిణామం.స్వామిగౌడ్ గతంలో ఉద్యోగ సంఘ నేత. ఆయనకు కెసిఆర్ తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక ఇచ్చారు. తదుపరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చైర్మన్ చేశారు. కాని ఈ పదవికాలం చివరిలో వీరిద్దరి మద్య ఎక్కడ తేడా వచ్చిందో కాని మాటలు లేకుండా పోయాయి.గౌడ్ ఒకప్పుడు మంత్రి పదవి ఆశించినట్లు చెబుతారు. దాని సంగతేమోకాని, టిఆర్ఎస్ కే రామ్ రామ్ అని చెప్పవలసి వచ్చింది. కాగా తాజాగా ఎలాంటి ఒప్పందం కుదిరిందో కాని తిరిగి స్వగృహానికి చేరుకున్నారు. ఇక శ్రావణ్ అయితే తొలుత ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలో క్రియాశీలం అయ్యారు. తదుపరి ఆయన టిఆర్ఎస్ లో చేరి కేసిఆర్ కు సన్నిహితంగా మెలిగారు. కాని రాష్ట్ర సాధన తర్వాత తగు ప్రాధాన్యం లభించలేదని అలిగి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు. ఖైరతాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమి చెందారు. పిసిసి అధ్యక్షుగా ఉత్తంకుమార్ రెడ్డిని తప్పించి ,రేవంత్ రెడ్డిని నియమించడం, తదుపరి ఖైరతాబాద్ నేత విజయారెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకోవడంతో ఆగ్రహం చెంది శ్రావణ్ బిజెపిలోకి వెళ్లారు. మంచి వాదనా పటిమ కలిగిన శ్రావణ్ తిరిగి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనకు భవిష్యత్తులో ఎలాంటి పదవి వస్తుందో తెలియదు. టిఆర్ఎస్ ను వీడకుండా ఉన్నట్లయితే ఈపాటికే ఏదో ఒక పదవి వచ్చి ఉండేదేమో!. రాపోలు ఆనందభాస్కర్ ఒకప్పుడు జర్నలిస్టు. తదుపరి కాంగ్రెస్ పక్షాన గాంధీ భవన్ లో యాక్టివ్ గా ఉండేవారు. ఆ తరుణంలో బిసి వర్గంవారికి రాజ్యసభ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ అదిష్టానానికి రావడం, ఆ చాన్స్ రాపోలుకు దక్కడం జరిగింది. పదవీకాలం ముగిసిన కొన్నాళ్లకు ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. ఇప్పుడు టిఆర్ఎస్ గూటికి వెళ్లారు. వీరే కాదు. ఆయా గ్రామాలలో సర్పంచ్ లు, మండల పరిషత్ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు ఇలా ఒక్కో కేటగిరికి ఒక్కో రేటు పెట్టి టిఆర్ఎస్ ,బిజెపిలు కొనుగోలు చేస్తున్నాయన్నది కాంగ్రెస్ ఆరోపణ.చికెన్, మద్యం బాటిళ్లు తెగ సప్లై చేస్తున్నారట. బస్ లలో ఇతర ప్రాంతాలకు టూర్ తీసుకువెళుతున్నారట. ఇలా ఎన్నెన్నో విన్యాసాలు చేస్తున్నారు. చివరికి బిజెపి అధ్యక్షుడు నడ్డాకు సమాధి కట్టిన వైనం శోచనీయంగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ పదవికి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఇది అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నిక. ఆయన గెలిస్తే బిజెపి గెలిచినట్లుగా దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. బిజెపి ఓడిపోతే అది రాజగోపాలరెడ్డి ఖాతాలోకి వెళుతుంది. టిఆర్ఎస్ అభ్యర్ధి కె.ప్రభాకరరెడ్డికి ఆ సమస్య లేదు. టిఆర్ఎస్ గెలిచినా, ఓడినా అది ముఖ్యమంత్రి కెసిఆర్ , వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఖాతాలోకే వెళుతుంది. అందువల్ల ఇది కెసిఆర్, కెటిఆర్ లకు ఇది సవాల్ వంటిది. కెటిఆర్ స్వయంగా మునుగోడుపై దృష్టి పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన బిజెపి పెద్దలను, ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ పెద్దలు, గద్దలు, దొంగలు అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజగోపాలరెడ్డికి 18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని అంటూ వివాదాస్పదం చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ముడిపెడుతున్నారు. దుబ్బాక, హుజరాబాద్ లలో ఓటమి నేపధ్యంలో టిఆర్ఎస్ ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా జాగ్రత్తపడుతోంది. అందుకే 86 మంది ఎమ్మెల్యేలను మునుగోడులో రంగంలో దించింది. బిజెపి కూడా పోటాపోటీగా తమ పార్టీ నేతలను ప్రచారంలో పెట్టింది.టిఆర్ఎస్ గుజరాత్ దొంగలు అంటూ విమర్శలు చేస్తుంటే, కెటిఆర్ నియోజవర్గం సిరిసిల్లను, కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు టిఆర్ఎస్ అన్యాయం చేస్తోందని బిజెపి నేతలువిమర్శలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ లో ఇప్పటికి మల్లగుల్లాలు సాగుతున్నాయి. తనను ఒంటరి చేయడానికి కాంగ్రెస్ లో కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ కంటతడి పెట్టారన్న వార్త ఆ పార్టీకి నష్టం చేసింది. బిజెపి,టిఆర్ఎస్ లు కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపణలు చేసినా పెద్ద ఫలితం ఉండడం లేదు. పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రచారం చేసుకుంటున్నా , ఆర్ధికంగా చూస్తే బిజెపి, టిఆర్ఎస్ లతో పోటీ పడే పరిస్థితి ఉండదు. ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ ఎమ్.పి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడైన బిజెపి అభ్యర్ధి రాజగోపాలరెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు లీక్ అయిన ఆడియో కలకలం సృష్టిస్తోంది. ఇవన్ని కాంగ్రెస్ కు తలనొప్పిగా మారాయి. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఉప ఎన్నికలలో ఒకటి అవుతుందని అంతా అంచనా వేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసే యత్నం చేసిందన్న ప్రహసనం, అదంతా టిఆర్ఎస్ చిల్లర రాజకీయం అన్న బిజెపి ఆరోపణతో తెలంగాణ రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. -
నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు.. పట్టించుకోవద్దు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.’ అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు — KTR (@KTRTRS) October 27, 2022 ఇదీ చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా? -
అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా?
సాక్షి, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణంలో గురువారం నిర్వహించిన గౌడ ఆత్మీయ సమావేశంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్కు మతి భ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ బేరసారాలు టీఆఎస్ చేసిన డ్రామాగా పేర్కొన్నారు. నెత్తి మీద రూపాయి పెడితే అర్థ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా పెడతారా? వాళ్ళను మేము కాదుకదా ఎవరు ఏ పార్టీలోకి రానివ్వరు అని ధ్వజమెత్తారు. ‘ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడలేదు. ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయం చేస్తున్నారు. దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు కేసీఆర్. ఇటువంటి ముఖ్యమంత్రికి సరైన జవాబు చెప్పాలి. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు చేసే వారివి బానిస బతుకులు. అవమానాలు భరించలేక బూర నర్సయ్య గౌడ్ బయటకు వచ్చారు. ఎంతోమంది ఉద్యమకారులు ఇప్పుడు ఆ పార్టీలో లేరు. దురహంకార పాలనకు చరమగీతం పాడాలి. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి ఆలీబాబా 40 దొంగల ముఠా దిగింది. పోలీస్ జీపులో, ఎస్కార్ట్ జీపులల్లోనే డబ్బులు తీసుకెళుతున్నారు. నీ డబ్బు, నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు.’ అని టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసమని, ప్రస్తుతం పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోయే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఇదీ చదవండి: ఫాంహౌస్ డీల్పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్రెడ్డి ఫిర్యాదులో ఏముంది? -
‘మునుగోడు.. ఒక్కో ఓటర్కు 20 వేలు పంచారు!’
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల దృష్ట్యా.. ఉప ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ను కోరారు మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు. మునుగోడు ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల పేరిట మూడు పేజీల వినతిపత్రాన్ని ఆయన్ని కేంద్ర ఎన్నికల కమీషన్కు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల సంఘానికి.. ఎన్నికలు రద్దు చేసే విస్తృత అధికారం ఉందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు పంపిణి, అధికార దుర్వినియోగం, ఇతర అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను సైతం తన వినతిపత్రంలో ప్రస్తావించారు. భారతదేశ చరిత్రలోనే అతి ఖరీదైన ఉప ఎన్నికగా మునగోడు నిలవనుంది. మునుగోడులో ఒక్క అక్టోబర్ నెలలోనే దాదాపు 132 కోట్ల రూపాయల విలువైన మద్యం ఏరులై పారింది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అక్రమాలకు.. ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిఓటర్కు రూ.20 వేల రూపాయల డబ్బు, మహిళలకు ఒక గ్రాము బంగారం ఇవ్వడానికి పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి అని గోనె ప్రకాష్రావు ఆరోపించారు. మునుగోడులో జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మందు పంపిణీ కట్టడి చేసి.. ఎన్నికలు రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యంపైనే ప్రజలకు నమ్మకం పోతుందన్నారు ఆయన. ఇదీ చదవండి: టీఆర్ఎస్పై కిషన్రెడ్డి కౌంటర్ ఎటాక్ -
Puvvada Ajay Kumar; అప్రతిహత ప్రగతికి పట్టం కట్టండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎన్నో పోరాటాల ఫలితం. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కృషి అనన్యం. ‘రైతుబంధు’ నేడు దేశానికే ఆదర్శవంతమైన పథకం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి కార్యక్రమాలతో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా తెలంగాణ నిలుస్తున్నది. ఒక నాడు ఎక్కడ చూసినా నెర్రెలు– మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ... ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? మీకు వ్యవసాయం వస్తదా? అని ప్రశ్నించిన నోళ్లతోనే మీకే వ్యవ సాయం వస్తదని చెప్పించాలంటే ఎంత సమర్థ వంతమైన నాయకత్వం కావాలి? ఎంతటి అకుంఠిత కార్యాచరణ అవసరం. అంత అద్భుతం జరిగింది కేసీఆర్ వల్లనే. దేశంలో 20, 30 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు కట్టడానికే ఎన్నో ఏండ్లు తీసుకుంటున్న సమయంలో 200 టీఎంసీల నిలువ సామర్థ్యం, అవసరాన్ని బట్టి దాదాపు 500 టీఎంసీల వరకు సామర్థ్యం పెరిగే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేండ్లలో పూర్తిచేసి ప్రారంభించడం కేసీఆర్ దక్షతకు నిదర్శనం. ఒకవైపు భారీ ప్రాజెక్టులను నిర్మిస్తూనే మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులను సైతం సర్కారు అంతే వేగంగా నిర్మించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్ల తరబడి సాగదీతకు గురై, వెనక్కి నెట్టివేయ బడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎల్లంపల్లి, భీమా, మిడ్ మానేరు, సింగూరు, కొమ్రం భీం, నీల్వాయి, జగన్నాథ్పూర్, కోయిల్సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇక చనఖా– కొరటా, సదర్మట్, సీతమ్మసాగర్, గట్టుప్రాజెక్టులు చివరిదశలో ఉండగా సమ్మక్క బ్యారేజీ ఇప్పటికే పూర్తయింది. ఇవేకాదు, నీటిపారుదల రంగంలో రికార్డులు తిరగ రాస్తూ 11 నెలల్లోనే ఖమ్మంలో భక్త రామదాసు, జోగులాంబ గద్వాల జిల్లాలో తుమ్మిళ్ల ఎత్తిపోత లను పూర్తిచేసింది. ప్రాజెక్టులన్నీ పూర్తయితే దాదాపు కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందు తుంది. తెలంగాణలోని ప్రతి అంగుళం భూమికి సాగునీరు చేరుతుంది. తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన కోటి 40 లక్షల ఎకరాల భూమిలో సగానికి కొంచెం అటూ ఇటుగా రైతులు సాగుచేసేవారు. కానీ నేడు 2 కోట్ల 5 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది. అంటే 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. వ్యవసాయరంగం ఏటా 14.5 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్నది. ఈ ప్రగతి అప్రతిహతంగా కొన సాగాలి. మనమందరం ఈ అభివృద్ధిలో భాగస్వా ములం కావాలి. ప్రతీ ఒక్కరు తనవంతు సహ కారం ప్రభుత్వానికి అందించాలి. ఈ నిలువెత్తు ప్రగతి విమర్శకులకు కనిపించదా? అవసరం కోసం, అవకాశాల కోసం రాజకీయాలు చేసేవాళ్లు ఎన్నైనా మాట్లాడుతుంటారు, కానీ బాధ్యతల్ని భుజాలపై మోసే నాయకత్వానికే తెలుస్తుంది కదా ప్రజల జీవితాలను ప్రగతిపథం వైపు ఎట్లా నడిపించాలో! తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం పట్ల బీజేపీ శ్రద్ధ ఎప్పుడూ ప్రశ్నార్థకమే. ప్రాంతీయ అస్తిత్వాలను జాతీయ పార్టీలు ఏనాడూ పట్టించుకోలేదు. గడిచిన ఐదారు దశాబ్దాల్లో జరిగిందిదే. జాతీయ స్థాయి పథకాల గురించి మాట్లాడే బీజేపీ తెలంగాణకు ఒరగ బెట్టిందేమీ లేదు. కాళేశ్వరానికి కానీ, ఇక్కడి మరొక నీటి పథకానికి కానీ జాతీయ హోదాను ఇవ్వడం లేదు. ఆర్థిక సహాయం చేయడం లేదు. పసుపు బోర్డుపై చేసిన వాగ్దానం అట కెక్కింది. కాజీపేట వర్క్ షాపు కాగితాల్లో మురిగింది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి కానీ, బడుగు బలహీన వర్గాల ఉన్నతిని గురించి కానీ ఆ పార్టీకి ఉన్న శ్రద్ధ ఎంతనో తెలంగాణలో అందరికీ స్పష్టం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందిన ఈ పార్టీ టీఆర్ఎస్కు ఏ మాత్రం ప్రత్యామ్నాయంగా నిలువ లేదని ప్రజలకు స్పష్టమైంది. తెలంగాణ అస్తిత్వాన్ని వచ్చే దశాబ్దాలకు కూడా కాపాడగలిగిన యువనాయకత్వం కూడా టీఆర్ఎస్కే ఉన్నది. ప్రాంతీయ అస్తిత్వాలను, ఆత్మ గౌరవాన్నీ కాపాడగలిగేది ప్రాంతీయ పార్టీలే అని చాలా రాష్ట్రాల్లో రుజువైంది. తెలంగాణ అస్తి త్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేది నేడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ మాత్రమేనని ప్రజల్లో స్థిరభావం ఏర్పడింది. ఇటీవల అందరూ తమ దృష్టిని కేంద్రీకరించి ఉన్న మునుగోడు ఉప ఎన్నికలో అధికారం కోసం పాకులాడే పార్టీలు ఒకవైపు, తెలంగాణను బల మైన రాష్ట్రంగా తీర్చిదిద్ది సబ్బండ వర్గాల ఆర్థిక స్థితి గతులను పెంచటానికి కృషి చేస్తున్న టీఆర్ఎస్ మరోవైపు ఉన్నాయి. ప్రజలు దూరదృష్టితో ఆలోచించి టీఆర్ఎస్ పక్షాన నిలబడి ఉద్యమ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఢిల్లీని ప్రతిపక్షాలు నమ్ముకుంటే, టీఆర్ఎస్ పార్టీ గల్లీ ప్రజలనే నమ్ముకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలం గాణ వ్యతిరేకులకు ప్రజలు బుద్ధిచెప్పాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. (క్లిక్ చేయండి: ఓటుబ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్లు?) - పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి -
...మనుగోడును ఇంతమంది పట్టించుకుంటారని ఊహించలేదు! ఐదేండ్లకోసారి...
...మనుగోడును ఇంతమంది పట్టించుకుంటారని ఊహించలేదు! ఐదేండ్లకోసారి ఉప ఎన్నిక వస్తే చాలు! -
Bandi Sanjay: ఓటుబ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్లు?
దళిత గిరిజనులను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం, ఎన్నికల ముందే వారి మీద ప్రేమ కురిపిస్తున్నట్టు నటించడం కేసీఆర్కి వెన్నతో పెట్టిన విద్య. ముందుగా దళితు డినే ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్, తర్వాత తానే ఆ కుర్చీలో కూర్చున్నరు. ఆ తర్వాత దళిత గిరిజనులకు మూడెకరాల సాగు భూమి స్తానని మురిపించిన్రు. అది ఇయ్యకుండా దాన్ని మరిపించడానికి ‘దళిత బంధు’ ఇస్తామన్నరు. ఇట్లా కేసీఆర్ ఏం చెప్పినా... ఆయన మాటలే తియ్యగా ఉంటయ్గానీ, ఆయన చేతలు ఎంత చేదుగా ఉంటయో ఎనిమిదేండ్లుగా యావత్ తెలంగాణ రుచి చూస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దళిత గిరిజనుల అభివృద్ధిని పాలకులు కావాలనే విస్మరించిన్రని, దాంతో వారి పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందని టీఆర్ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో మొసలి కన్నీరు కార్చింది. దళితులకు, గిరిజనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేస్తామని అరచేతిలోనే వైకుంఠం చూపించిన్రు. ఇదే మాటను 2018 ఎన్నికల్లో కూడా చెప్తూ ఇంకొన్ని హామీలు జత చేసిన్రు. కానీ, వాటి అమలుకు ప్రయత్నించిన దాఖలాలు ఎక్కడా కనపడవు. ప్రతి దళిత, గిరిజన కటుంబానికి మూడెక రాల భూమి ఇస్తామన్న, మొదటి సంవత్సరం పంట ఖర్చులు భరించడంతో పాటు ఉచితంగా ఎరువులు ఇస్తామన్న హామీని టీఆర్ఎస్ తుంగలోకి తొక్కింది. రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల దళిత కుటుంబాలకు సెంటు భూమి కూడా లేదు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తప్ప భూపంపిణీ కోసం ఏ బడ్జెట్లోనూ పైసా కేటాయించలేదు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కుపత్రాలు ఇస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన్రు. ఏళ్ల తరబడి ఉన్న ఈ సమస్య పరి ష్కారానికి అధికార యంత్రాంగాన్ని వెంటబెట్టు కొని వచ్చి తాను కుర్చీ వేసుకొని సమస్య పరిష్క రిస్తనని ఆర్బాటం చేసిన్రు. కానీ, ఇప్పటివరకూ ఆ కుర్చీ ఎక్కడికి పోయిందో, ఆయన నిర్వహిస్తనన్న ‘ప్రజాదర్బార్’ ఎక్కడికిపోయిందో టీఆర్ఎస్ నాయకులకే తెల్వాలే. పోడు భూములకు పట్టాలు ఇయ్యకపోగా ఫారెస్టు, రెవెన్యూ అధికారులను గిరిజనులపైకి ఎగదోసి టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతున్నది. 30,40 సంవత్స రాలుగా సాగు చేసుకుంటున్న వారి నుంచి పోడు భూములు లాక్కోని నయవంచన చేస్తున్నది. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సమయంలో, అక్కడ అధికంగా ఉన్న గిరిజనుల ఓట్ల కోసం గిరిజనులకు భూమి హక్కు పత్రాలిస్తానని చెప్పి కేసీఆర్ ఓట్లు కాజేసిన్రు. రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 7 లక్షల ఎక రాల్లో పోడు భూముల సమస్య ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హక్కు పత్రాలను సైతం ప్రభుత్వం గుంజుకోవడం దారుణం. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని నీరుగార్చేందుకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రణాళిక ప్రకారం ఎత్తులు వేసింది. ఈ చట్టంలోని సెక్షన్ (3), ‘11డీ’లో పేర్కొన్న మౌళిక వసతుల అభివృద్ధికి 7 శాతం నిధులు వాడుకోవచ్చు అన్న నిబంధనను ఉపయోగించుకొని సబ్ప్లాన్ నిధులను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వెచ్చించి, ఎస్సీ, ఎస్టీలకు తీవ్రద్రోహం చేసింది. ఇలా ఈ ఎనిమిదేండ్లలో దళిత గిరిజనులకు కేటాయించిన 40 వేల కోట్ల నిధులను దారి మళ్లించింది. ఇగ, 2014 నుంచి 2019 వరకు ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం 5,33,800 మంది దరఖాస్తు చేసుకోగా... ఇప్పటికీ 4,17,011 మంది రుణాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నరు. గిరిజనుల జనాభా నిష్పత్తికి అనుగుణంగా తమకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నరు. కానీ, ఆర్డినెన్స్ తీసుకు రావడం ద్వారా గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా... టీఆర్ఎస్ సర్కారు మీన మేషాలు లెక్కిస్తున్నది. పది శాతం రిజర్వేషన్లు అమలులోకి రాకపోవడం వల్ల గిరిజన యువ తకు ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర నష్టం జరుగుతున్నది. మిషన్ భగీరథ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు గిరిజన ప్రాంతాలకు గుక్కెడు నీళ్లు ఇవ్వలేని అసమర్థ పాలన సాగిస్తున్నరు. అనేక గిరిజన గ్రామాలకు సరైన వైద్య సౌకర్యాలు లేవు. మారుమూల గిరిజన గూడేలకు సరైన రవాణా సౌకర్యాలు లేక ఆస్పత్రులకు పోవాలంటే ఇప్పటికీ ‘డోలె’ను ఆశ్రయించాల్సిన దుఃస్థితి. ఇక, మునుగోడు నియోజకవర్గంలో శివన్న గూడెం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితుల గోడును టీఆర్ఎస్ పట్టించు కున్న పాపాన పోలే. జూఠా మాటలతో, గారడీ హామీలతో పరి పాలన సాగిస్తున్న దొర గడీలకు, నియంతృత్వ కుటుంబ పాలనకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డయ్. మునుగోడులో రాబోయే ప్రజా తీర్పు, భవిష్యత్లో బీజేపీ ప్రభుత్వానికి దారులు వేయబోతున్నది. పేదల పార్టీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత గిరిజనుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తం. దగావడ్డా దళిత గిరిజనుల దుఖ్కం తీరుస్తం. సకల జనుల తెలంగాణకు బాటలు వేస్తం. (క్లిక్ చేయండి: అప్రతిహత ప్రగతికి పట్టం కట్టండి) - బండి సంజయ్కుమార్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు -
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: గువ్వల బాలరాజు
-
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతలకు వల వేసేందుకు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేసి భారీగా నగదు పట్టుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదని చెప్పారు ఎమ్మెల్యే బాలరాజు. ఇది కేసీఆర్ పార్టీ.. ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు.. తెలంగాణ సమాజం అమ్ముడుపోదన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నిస్సిగ్గుగా తమ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీపై తెలంగాణ సమాజం తిరగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సాక్షిగా బీజేపీ కుట్రలు బయటపడ్డాయన్నారు. తమ ఎమ్మెల్యేలు ధైర్యంగా కుట్రను బయటపెట్టారని అన్నారు. ఇదీ చూడండి: మునుగోడు లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలకు వల.. రూ.100 కోట్లతో డీల్ -
తెలంగాణలో ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ భగ్నం!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ.. అధికార పక్ష నేతలకు గాలం వేసే వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్లో.. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నించిన మధ్యవర్తీలు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. వారి నుంచి భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డీల్ విలువ సుమారు రూ.100 కోట్లు నగదు ఉంటుందని అంచనా. నోట్ల కట్టలతో పోలీసులకు చిక్కిన వారిలో రామంచంద్ర భారతి, సోమయాజుల స్వామి, నందకుమార్, తిరుపతిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారంతా ఢిల్లీకి చెందిన వారని పేర్కొన్నారు. బంజారాహిల్స్ డెక్కన్ ప్రైడ్ హోటల్ చెందిన నందకుమార్ ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నందు కిషన్ రెడ్డికి సన్నిహితుడు అని ప్రచారం ఊపందుకుంది. మరోవైపు.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు ప్లాన్ చేసిందంటూ టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి స్కెచ్ వేశారని ఆరోపించింది. ఫిరాయింపుల కోసం భారీగా నగదు ఆఫర్ చేశారని పేర్కొంది. ఆపరేషన్లో లక్క్ష్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్థన్రెడ్డి, రేగ కాంతారావు, పైలట్ రోహిత్రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో డీల్ చేసిన నందు, తిరుపతి, రామ చంద్ర భారతి, సింహా యాజులు. వంద కోట్ల రూపాయల డీల్ కాగా.. స్పాట్లో 15 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే దాడి తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రలోభ పర్వం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ప్రలోభ పర్వం గురించి సమాచారం అందుకోగానే రంగంలోకి దిగినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్లోని బేరసారాలు నడుస్తున్న ఫామ్ హౌజ్పై రైడ్ చేశామని, ముగ్గురు దొరికారని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. రామచంద్రభారతి ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందింది. సింహయాజులు తిరుపతి నుంచి వచ్చాడు. నందకుమార్, సింహయాజులు.. ఫరిదాబాద్ నుంచి రామచంద్రభారతిని ఇక్కడికి తీసుకొచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పదవులు, డబ్బు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టారు. నందకుమార్ మధ్యవవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం ఉంది అని సీపీ వెల్లడించారు. -
మునుగోడు: టీఆర్ఎస్పై సీఈసీకి ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. మునుగోడు ఎన్నికల్లో అధికారపార్టీ(టీఆర్ఎస్) దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే.. మునుగోడు ఎన్నికల్లో నకిలీ ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు కూడా. ఇప్పటికే 12 వేల నకిలీ ఓట్లను తొలగించారని.. మరో 14 వేల ఓట్లను కూడా తొలగించాలని బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల్లో డబ్బులు,మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని,ప్రభుత్వ వాహనాలను సైతం ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు బీజేపీ నేతలు. ఇదీ చదవండి: మునుగోడులో బెట్టింగ్ జోరు.. కోట్లలో లావాదేవీలు -
కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాపోలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, పద్మశాలి సంఘం నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై ప్రశంసలు కురిపించారు రాపోలు. అందరి సమక్షంలో టీఆర్ఎస్ సభ్యుడిగా చేరటం సంతోషంగా ఉందన్నారు. ‘తెలంగాణ విజయ రథ సారథి సీఎం కేసీఆర్ భారీ సంకల్పంతో తెలంగాణ భూ గర్భాన్ని నది గర్భంగా మార్చారు. తెలంగాణ ప్రజల పెద్ద కొడుకు కేసీఆర్. జనగామ పోరాటాలు గుర్తుకు వస్తున్నాయి. నాకు హద్దులు దాటడం అంటే ప్రాణసంకటం. మిషన్ భగీరథను నేను వేరే పార్టీలో ఉన్నప్పుడే పొగిడాను. మంచిని మంచి అనడంలో అస్సలు తప్పు లేదూ.’ అని పేర్కొన్నారు మాజీ ఎంపీ. అంతుకుముందు గత ఆదివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి.. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ చేరిక అనంతరం చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై మాట్లాడారు కేటీఆర్. నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ‘నేత కార్మికులను కేంద్రం చిన్న చూపు చూస్తోంది. భారత ప్రభుత్వం నేతన్నలను పట్టించుకోవడం లేదు. నేతన్నలకు చేనేత పథకంతో సాయం అందిస్తున్నాం. వస్త్రాల ఉత్పత్తిలో చైనా, బంగ్లాదేశ్ మనకంటే ముందున్నాయి. దానిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు మన నేతన్నల్లో ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోండి.’ అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇదీ చదవండి: మునుగోడు వేళ బీజేపీకి మరో షాక్.. టీఆర్ఎస్లోకి మాజీ ఎంపీ రాపోలు.. కేసీఆర్తో భేటీ -
ఆయనకు మనమిచ్చిన షోకాజ్.. సార్!
ఆయనకు మనమిచ్చిన షోకాజ్.. సార్! -
నికార్సైన కాంగ్రెసోడా.. మునుగోడుకు రా!
సాక్షి, హైదరాబాద్: ‘మునుగోడులో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేం. అక్కడ కాంగ్రెస్పై కుట్ర జరుగుతోంది. మనల్ని నిర్వీర్యం చేసి కాంగ్రెస్ను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పథక రచన చేస్తున్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలనుకుంటున్నాయి. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఒక్కటే విజ్ఞప్తి. ఘనమైన పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంచన్ దొరా అని బానిసలవుదామా? నిప్పుకణికలై నిటారుగా నిలబడి కొట్లాడుదామా? తేల్చుకోవాల్సిన సమయం ఇది. నికార్సైన కాంగ్రెసోడా... మునుగోడుకు రా. మీ కోసం ఎదురుచూస్తుంటా’అని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా, ఊరూవాడా, పల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ ఉన్నపళంగా మునుగోడుకు కదలి రావాలని, అక్కడ కార్యకర్తలు కదం తొక్కి తాడోపేడో తేల్చుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రాహుల్గాంధీ చేపట్టిన భారత్జోడో యాత్రకు వేలాదిగా తరలివచ్చి అద్భుత స్వాగతం పలికిన కేడర్కు ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా అధికార, ఆర్థిక బలాలతో కాంగ్రెస్ను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి తీయాలని కక్ష కట్టారని, కాంగ్రెస్ భిక్షతో ఎదిగిన వారే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పైసాకు పనికిరాని వారు రాజ్యమేలుతూ కాంగ్రెస్ను అంతం చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఆడబిడ్డ అనే భావన కూడా లేకుండా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడికి తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేషు్టలుగా ఉందామా? తెలంగాణ అస్తిత్వానికి ప్రాణం పోసిన సోనియాగాంధీకి ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా? కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు చేస్తున్నారు. 60 ఏళ్ల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా? సత్తా చాటి మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం’అని రేవంత్ పేర్కొన్నారు. -
Munugode Bypoll 2022: లక్ష మందితో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ తన ప్రచార వ్యూహానికి మరింత పదును పెడుతోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎదురైన అనుభవాలు మునుగోడులో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళిక అమలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు, హరీశ్రావుతో పాటు పలువురు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు, మరోవైపు క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. వచ్చే నెల 1న ప్రచార పర్వం ముగియనుండగా, రెండురోజుల ముందు అంటే ఈ నెల 30న చండూరులో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. మరోవైపు యూనిట్ ఇన్చారి్జలుగా వ్యవహరిస్తున్న నేతలంతా చివరి నిమిషం వరకు తమకు కేటాయించిన ప్రాంతంలోనే మకాం వేయాలని కేసీఆర్ ఆదేశించారు. వారి పనితీరుపై ప్రభుత్వ నిఘా సంస్థలు, ప్రైవేటు సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు కేసీఆర్, కేటీఆర్కు నివేదికలు అందజేస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన చోట ఇతర ప్రాంతాలకు చెందిన కీలక నేతలను మోహరించి ప్రచార లోపం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రచార సరళి, అభ్యర్థుల ప్రచారానికి వస్తున్న స్పందన, ఆయా పార్టీలు అనుసరిస్తున్న తెర వెనుక వ్యూహాలు గమనిస్తూ తక్షణమే ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీనిని స్వయంగా కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. నగర ఓటర్లపై దృష్టి నియోజకవర్గానికి చెందిన సుమారు 40 వేల మందికి పైగా ఓటర్లు హైదరాబాద్ శివారు కాలనీల్లో ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి సుమారు 300 నుంచి 500 వరకు ఓటర్లు నగరంలో నివాసముంటున్నట్లు తమ పరిశీలనలో తేలిందని యూనిట్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా కాలనీల్లోని మునుగోడు ఓటర్ల వివరాలు.. ఇంటి చిరునామా, ఫోన్ నంబరుతో సహా ఇప్పటికే సేకరించి పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాలను టీఆర్ఎస్ పూర్తి చేసింది. పోలింగ్ రోజున వారంతా మునుగోడులో ఓటు హక్కు వినియోగించుకునలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్న టీఆర్ఎస్.. పోస్టల్ బ్యాలెట్లపైనా దృష్టి సారించి, వారి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉంది. నిరంతరం టచ్లో ఉండేలా.. ఓటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ప్రతి ఓటరును కనీసం అరడజను సార్లు కలిసే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేస్తోంది. యూనిట్ ఇన్చారి్జలుగా వ్యవహరిస్తున్న నేతలు.. తమ పరిధిలోని ప్రతి వంద మంది ఓటర్లకు ఒక పార్టీ నేత చొప్పున బాధ్యతలు అప్పగించారు. పోలింగ్ రోజున ఓటు వేసి వెళ్లేంతవరకు వారితో టచ్లో ఉండేలా ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, సామాజికవర్గాల సమ్మేళనం పేరిట ప్రతి కుటుంబాన్ని చేరుకునేలా టీఆర్ఎస్ ప్రచారం సాగుతోంది. సభ విజయవంతమయ్యేలా.. చండూరు సభకు సుమారు లక్ష మంది హాజరయ్యేలా చూడాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జన సమీకరణపై దృష్టి సారించింది. మంత్రి జగదీశ్రెడ్డి, పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ ఇప్పటికే చౌటుప్పల్, గట్టుప్పల్, మునుగోడు మండల కేంద్రాల్లో రోడ్ షోలు నిర్వహించారు. -
ఏం చేస్తే.. ఏం జరుగుతుందో! మునుగోడు ఎన్నికల అధికారుల్లో వణుకు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ క్షణంలో ఏ పొరపాటు జరుగుతుందోనని వణుకుతున్నారు. విధి నిర్వహణలో ఏ చిన్న పొరపాటు చేసినా కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశం ఉండడంతో అధికారుల్లో భయం పెరిగిపోయింది. సరైన అవగాహన లేక ఇద్దరు అధికారులు చేసిన తప్పిదాలపై ఎన్నికల సంఘం తీవ్ర చర్యలు తీసుకోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తనకు లేని అధికారాలను ఉపయోగించి ఓ అభ్యర్థికి కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి కొత్త గుర్తును కేటాయించినందుకు గాను మునుగోడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి(ఆర్వో) కేవీఎం జగన్నాథరావుపై ఎన్నికల సంఘం వేటు వేసి కొత్త ఆర్వోను నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో జగన్నాథరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్ రాజ్ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. అలాగే ఓ అభ్యర్థికి సంబంధించిన ఓడ (షిప్) గుర్తుకి బదులు పడవ (బోటు) గుర్తును ముద్రించినందుకు గాను చౌటుప్పల్ తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు విధించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మునుగోడు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులుగా బాధ్యతల స్వీకరణకు సైతం అధికారులు ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నాయి. ఎన్నికల నిర్వహణ అంటేనే తీవ్రమైన ఒత్తిడితో కూడిన పని కాగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సాధారణ ఎన్నికలకి మించిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని అధికారులు పేర్కొంటున్నాయి. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సీఈఓ కార్యాలయం అధికారులకు ఫోన్ చేసి సలహాలను అడుగుతున్నారు. -
Munugode Bypoll 2022: ఓటర్లకు ప్రలోభాలపై ఈసీ సీరియస్! కేసులు తప్పవా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు అందిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. విచ్చలవిడిగా డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలను పంపిణీ చేస్తున్నవారిపై, తీసుకున్నవారిపై ఐపీసీ సెక్షన్ 171(బీ) కింద కేసులు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అభ్యర్థిని/ఓటరును/ మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపర్చినా సెక్షన్ 171(సీ) కింద కేసు పెట్టాలని సూచించింది. ఈ రెండు కేసుల్లో ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఈ నిబంధనలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఆదేశించింది. ఉప ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్రాజ్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు. మునుగోడుకు అదనంగా పరిశీలకులు మునుగోడులో అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నికల సంఘం నిఘా పెంచింది. ఎన్నికల అదనపు పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సుభోత్ సింగ్, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారి సమత ముళ్లపూడిని తాజాగా నియమించింది. అక్రమ నగదు ప్రవాహం నియంత్రణలో వీరికి సహకరించేందుకు మరో ఏడుగురు ఆదాయ పన్నుశాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) మునుగోడుకు పంపించనున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.2.49 కోట్ల నగదు, 1,483.67 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వికాస్రాజ్ తెలిపారు. 36 మందిని అరెస్టు చేసి 77 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. (చదవండి: టీఆర్ఎస్లో ముసలం ఖాయం) -
ఆడియో.. వీడియో.. షోకాజ్..!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలో తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి గెలుస్తాడంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఉప ఎన్నిక ఓవైపు, రాహుల్ గాంధీ పాదయాత్ర మరోవైపు ఉన్న సమయంలో వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు కాంగ్రెస్ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించి బహిర్గతమైన ఆడియో, వీడియోల ఆధారంగా చర్యలు చేపట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ గడువు ముగిశాక ఆయనను పార్టీ నుంచి బహిష్కరించే దిశగా చర్యలు ఉండే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రేవంత్తో విభేదాలతో.. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరినప్పటి నుంచీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో విభేదాలను బాహాటంగానే వ్యక్తపర్చడం సంచలనంగా మారింది. తన సోదరుడు బీజేపీలో చేరిన నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రచారానికి తాను వెళ్లలేనంటూ వెంకటరెడ్డి పార్టీ అధినేత్రి సోనియాని కలిసి చెప్పారు కూడా. తనకున్న రాజకీయ, వ్యక్తిగత కారణాలతో ప్రచారానికి వెళ్లకపోవడాన్ని పార్టీ అర్థం చేసుకుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇటీవల లీకైన ఆడియో, వీడియోలలోని వ్యాఖ్యలతో వెంకటరెడ్డి కాంగ్రెస్ వాదిగా ఉండలేకపోతున్నారని స్పష్టమైందని పేర్కొంటున్నాయి. నిజానికి ఈ నెల 19న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్లపై కుమ్మక్కు ఆరోపణలు చేస్తూ.. కాంగ్రెస్లో తనను ఒంటరిని చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని, కొందరిని కోవర్టులుగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి త్వరలోనే వాస్తవాలు బయటికొస్తాయన్నారు. మరుసటి రోజే జబ్బార్ భాయ్తో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో లీక్ అయింది. పార్టీలకు అతీతంగా రాజగోపాల్రెడ్డికి ఓటేయాలని, ఉప ఎన్నిక తరువాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. వెంకటరెడ్డి అదే రోజున కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారితో వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో తన తమ్ముడే గెలుస్తాడని, తాను మునుగోడు ప్రచారానికి వెళ్లినా కాంగ్రెస్కు వచ్చేవి 10వేల ఓట్లేనని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి వీడియో లీకై సోషల్ మీడియాలో హల్చల్ అయింది. ఆడియో ఫేక్ అనుకున్నా తర్వాత వీడియో బయటికి రావడంతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ.. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా.. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం మెంబర్ సెక్రెటరీ తారిఖ్ అన్వర్ ఈ నోటీస్ జారీ చేశారు. ‘‘మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ నేతతో మాట్లాడినట్టు ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వైఖరిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో పది రోజుల్లో వివరణ ఇవ్వండి’’అని ఆదేశించారు. వచ్చేనెల 3న మునుగోడు ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో.. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందేనని టీపీసీసీ నాయకత్వం పట్టుపడుతోందని అంటున్నాయి. -
టీఆర్ఎస్లో ముసలం ఖాయం
సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనను, ప్రజాసమస్యలను గాలికొదిలి.. 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దింపి అడ్డగోలుగా డబ్బు, మద్యం పంపిణీ చేయడాన్ని.. సర్వశక్తులు ఒడ్డి పోలింగ్ బూత్ల వారీగా బాధ్యతలు అప్పగించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ మునుగోడులో ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయమని తేలిపోయిందని.. అందుకే కేసీఆర్ తన పదవిని కాపాడుకొనేందుకు వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అయినా వారికి మునుగోడులో ఓటమి తప్పదని, టీఆర్ఎస్లో ముసలం పుట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్నారన్న, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్న మాటలు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వపరంగా, వివిధ సంస్థల ద్వారా నిర్వహించిన అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయన్నారు. మునుగోడు ఎన్నికల ›ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో బండి సంజయ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు.. సాక్షి: మునుగోడు ఎన్నికను ఎలా అంచనా వేస్తున్నారు? బండి సంజయ్: తెలంగాణలోని పేద ప్రజల భవిష్యత్తో ముడిపడిన ఎన్నిక లివి. కేసీఆర్ అవినీతి, నియంతృత్వ, కుటుంబ, గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ చేసిన తప్పులను, అవినీతిని అంగీకరించినట్టేనని.. మందు, డబ్బుల పంచే టీఆర్ఎస్ గెలిస్తే అంతకంటే అవమానం ఉండదని ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ అభివృద్ధి ప్రదాత కాదు.. ఫక్తు రాజకీయ అవకాశవాది. ఎన్నికలొస్తేనే నిధులిస్తారు, అభివృద్ధి చేస్తారనే రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. ప్రజలు ఇదంతా గమనించి, రాజగోపాల్రెడ్డిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం? రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశాకే మునుగోడులో పలు అభివృద్ధి పనులు జరగడాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. గతంలో నిరాహార దీక్షలు, నిరసనలు చేసినా కానిది రాజీనామా చేశాక గట్టుప్పల్ మండలం ఏర్పాటు, చౌటుప్పల్–సంస్థాన్ నారాయణపూర్ రోడ్డు, ఆసరా పింఛన్లు వంటివన్నీ వచ్చాయి. గొల్లకురుమ సోదరులకు గొర్రెల పైసలు విడుదల చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్కు మార్గం చూపే ఉప ఎన్నిక కాబట్టి ప్రజలంతా ఆలోచిస్తున్నారు. మునుగోడుకు సంబంధించిన హామీలేవీ కేసీఆర్ నెరవేర్చలేదు. డిండి ప్రాజెక్టు పూర్తి కాలేదు, డిగ్రీ కాలేజీ ఇవ్వలేదు. వంద పడకల ఆస్పత్రి ఇస్తామని ఇవ్వలేదు. కిష్టాపురం, చర్లగూడెం ప్రాజెక్టులు పూర్తికాలేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఫ్లోరోసిస్, మూసీ సమస్యలపై చర్చ జరుగుతోంది కదా! గరళంగా మారిన మూసీ నీళ్లను తాగుతూ చస్తూ బతుకున్న మునుగోడు ప్రజలపై కనికరం లేని కేసీఆర్.. ఇప్పుడు ఉప ఎన్నిక రాగానే మందీ మార్బలాన్ని పంపి ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. మూసీ ప్రక్షాళన ఎటు పోయింది? మునుగోడును నిండా ముంచింది కేసీఆరే. ఫ్లోరోసిసేకాదు మూసీ ప్రక్షాళనపైనా మేం చర్చకు సిద్ధం బీజేపీ గెలుపు సాధ్యమని ఎలా అనుకుంటున్నారు? కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ మాది. కొత్త, పాత తేడా లేకుండా అంతా బీజేపీ గెలుపు కోసం కసిగా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చరిష్మా, కేంద్రం చేపడుతున్న పథకాలు, వాటితో పేదలకు చేకూరుతున్న ప్రయోజనాలు బీజేపీని గెలిపిస్తాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మద్దతును కూడగడుతున్నారు. రాజగోపాల్రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసిన విషయాన్ని వివరిస్తున్నాం. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనను, ప్రజాసమస్యలను గాలికొదిలి.. 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దింపి అడ్డగోలుగా డబ్బు, మద్యం పంపిణీ చేయడాన్ని.. సర్వశక్తులు ఒడ్డి పోలింగ్ బూత్ల వారీగా బాధ్యతలు అప్పగించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బీజేపీని, మోదీని కేసీఆర్ విమర్శిస్తున్నందునే లిక్కర్ కేసులు, ఈడీ దాడులు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మీ స్పందన? ఇప్పుడు మునుగోడుపై గుంట నక్కల్లా పడిందెవరు? లిక్కర్ దందా చేసిందెవరు? మునుగోడులో మద్యాన్ని పారిస్తున్నదెవరు? మీ కళ్లముందే సాక్ష్యాలున్నయి. ప్రధాని మోదీ ఎలాంటి ఆరోపణలనైనా పాజిటివ్ ఆలోచనతో చూస్తారే తప్ప.. విమర్శలను తట్టుకోలేని కేసీఆర్ కుటుంబంలా చేయరు. ఏదైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేయకుంటే భయపడటం ఎందుకు? తప్పు చేశారు కాబట్టే ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. గతంలో మోదీ, అమిత్షా ఇలా ఆరోపణలు చేయలేదు. విచారణను ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రజాసంగ్రామయాత్రను వాయిదా వేసుకున్నారేం? ప్రజల కష్టాలను, సమస్యలను స్వయంగా చూడటం, బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాం. ప్రజలు నిండుగా ఆశీర్వదించారు. మునుగోడు ఉప ఎన్నికను, ప్రజాసంగ్రామ యాత్రను వేర్వేరుగా చూడొద్దు. రెండూ కూడా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ల నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఎంచుకున్న క్షేత్రాలే. మునుగోడులో తొలి నుంచీ కాంగ్రెస్, వామపక్షాలకు పట్టుంది కదా! తమ పార్టీ కేసీఆర్ కంట్రోల్లో ఉందని కాంగ్రెస్ నేత స్వయంగా ఒప్పుకొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా మళ్లీ టీఆర్ఎస్లో చేరరనే గ్యారెంటీ లేదని ప్రజలే అనుకుంటున్నారు. టీఆర్ఎస్ కంట్రోల్ ఉన్న తమ పార్టీకి ఎందుకు ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలూ భావిస్తున్నారు. టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతుపై ఆ పార్టీల కేడర్ అయోమయంలో ఉంది. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని బీజేపీ నేతలు అంటున్నారు. ఎందుకు? అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. లిక్కర్ స్కాం, చీకోటి ప్రవీణ్ పేకాట స్కాం, డ్రగ్స్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతల పాత్ర ఉందని మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. ఈడీ, సీబీఐ విచారణలో ఆధారాలు బయటకొస్తున్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యుల బినామీలు, సన్నిహితులు ఒక్కొక్కరుగా అరెస్టవుతున్నారు. వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడి.. పైగా బీజేపీపై ఏడిస్తే మేమేం చేస్తాం? మునుగోడు ఫలితంతో రాష్ట్ర రాజకీయాలపై ప్రభావమేంటి? టీఆర్ఎస్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. మునుగోడులో ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోవడం ఖాయమని తేలడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా తన పదవిని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు. అయినా టీఆర్ఎస్ ఓటమి తప్పదని ఇప్పటికే తేలిపోయింది. దీనితో టీఆర్ఎస్లో ముసలం పుట్టడం ఖాయం. తర్వాత ఆ ప్రభుత్వం ఏ మేరకు బతికి బట్టకడుతుందనే దానిపై ఎలాంటి గ్యారెంటీ లేదు. రాష్ట్రంలో ప్రజలు కూడా ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నారు. కేసీఆర్ పాలన ఇంకా సాగితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునిగి శ్రీలంక గతి పడుతుందని ఆందోళన చెందుతున్నారు. -
కార్పొరేట్ కమలం X గరీబోళ్ల గులాబీ
చండూరు: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక కార్పొరేట్ కమలానికి, గరీబోళ్ల గులాబీ పార్టీకి మధ్య జరుగుతోందని, ఈ ఎన్నికలో కార్పొరేట్లు గెలవాల్నా.. గరీబోళ్లు గెలవాల్నా అని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. ఆయన ఆదివారంరాత్రి నియోజకవర్గంలోని గట్టుప్పల మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్షోలో మాట్లాడారు. ‘ఓటుకు తులం బంగారం ఇస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అంటున్నారు. అవి గుజరాత్ దొంగల పైసలు. దబాయించి తీసుకొని టీఆర్ఎస్కు ఓటు వేయండి’అని పేర్కొన్నారు. 2018లో గెలిచిన రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్లోనే ఉంటూ బీజేపీ కోవర్టుగా మూడున్నరేళ్లు పనిచేశాడని, చివరికి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. ఇది కోవర్టు రాజకీయం కాదా.. మునుగోడు నియోజకవర్గ సమస్యలను రాజగోపాల్రెడ్డి తనకుగానీ, ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్రెడ్డికిగానీ చెప్పిన దాఖలాలు లేవని కేటీఆర్ పేర్కొన్నారు. ఉపఎన్నికలు బీజేపీ కుట్రలో భాగమేనని, ప్రజలు కోరుకున్నవి కావన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ కోవర్టులేనని, రాజగోపాల్ను గెలిపించాలని ఆయన అన్న కాంగ్రెస్ ఎంపీగా ఉండి ఇతరులకు ఫోన్ చేస్తున్నారని, ఇక్కడున్న కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి పంపేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఇది కోవర్టు రాజకీయం కాదా అని ప్రశ్నించారు.‘మాది ఓ చిన్న కంపెనీ అని చెప్పిన రాజగోపాల్.. అదే నోటితో రూ.18 వేల కాంట్రాక్టు వచ్చిందని చెప్పారని, చిన్న కంపెనీకి రూ.18 వేల కాంట్రాక్టు ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు. అది ఇచ్చిన పెద్దలు ఎవరు .. గుజరాత్ గద్దలు ఎవరని అన్నారు. జన్ధన్ ఖాతాలో పేదలకు రూ.15 లక్షల చొప్పున పడాల్సిన డబ్బులన్నీ కోమటిరెడ్డి ఖాతాలో జమ అయ్యాయని ధ్వజమెత్తారు. ఓట్లు వేసిన మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘చేనేత సమస్యలను విస్మరించారు.. డబ్బులు పెట్టి ప్రజలను అంగడి సరుకులు లాగా కొందామని కుట్ర చేస్తున్నారు’అని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చామని.. రైతన్నలు ఓటేసేటప్పుడు ఓసారి ఆలోచించాలని కోరారు. ఫ్లోరైడ్ను సీఎం కేసీఆర్ తరిమికొట్టారు శాశ్వతంగా ఫ్లోరైడ్ను తరిమికొట్టింది ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. జానారెడ్డి, పాల్వాయి గోవర్దన్ రెడ్డిలు మంత్రులుగా ఉండి కూడా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించ లేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటి నల్లా ఇవ్వడంతోపాటుగా సాగు నీరు అందించేందుకు శివన్నగూడెం, లక్ష్మణా పురం ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. పాలమూరు–డిండి ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్గా దూసుకుపోతోందన్నారు. అందుకే బీజేపీ వాళ్ళ కన్ను కుట్దింది.. కుట్రలు మొదలు పెట్టారన్నారు. దళిత బంధులాగా భవిష్యత్తులో అన్ని వర్గాలకు బంధు పథకం అందిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ మోసం చేశాడన్నారు. రాజగోపాల్రెడ్డికి ఓటు వేస్తే సిలిండర్ ధర రెండు వేలవుతుందని చెప్పారు. చేనేతలకు సబ్సిడీలు అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మంత్రులు జగదీశ్రెడ్డి , శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు , మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తా: పనస రవికుమార్
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తాం అని పారిశ్రామిక వేత్త పనస రవికుమార్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో రవి కుమార్ పనస, శ్రవణ్ దాసోజు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవి పనస సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా రవి పనస, డాక్టర్ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ... తెలంగాణ, భారతదేశానికి గుండెలాంటిది. అలాంటి తెలంగాణని తెచ్చిన టీఆర్ఎస్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ... ‘శ్రవణ్, రవి పనస పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వారిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నా’ అన్నారు. -
మునుగోడులో నేతల సిత్రాలు..
-
టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. దాసోజు శ్రవణ్, స్వామిగౌడ్ బాటలో మరికొంత మంది!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోని అసంతృప్తనేతలను చేర్చుకునేందుకు ఒకవైపు టీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు.., మరోవైపు కొందరు నేతలు వరుసగా పార్టీని వీడటం కమలదళం నాయకుల్లో కలకలం సృష్టించింది. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం, గుర్తింపు లభించడం లేదనే భావనతో ఉన్న నాయకులను టీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నట్లు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కొందరు అసంతృప్త నేతలు అధికార పార్టీలో చేరొచ్చన్న ప్రచారంతో బీజేపీ నాయకులు అప్రత్తమయ్యారు. తాజాగా దాసోజు శ్రవణ్, కె.స్వామిగౌడ్ టీఆర్ఎస్లో చేరగా మరికొందరు నాయకులు కూడా పార్టీని వీడవచ్చని ప్రచారం సాగుతోంది. తమ పార్టీకి చెందిన వివిధస్థాయిల నాయకులకు టీఆర్ఎస్ నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయన్న సమాచారంతో జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. మునుగోడు పోలింగ్కు ఇంకా 12 రోజులు ఉండటంతో వలసల రూపంలో పార్టీకి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మునుగోడులో బీసీవర్గాల ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో ఈ వర్గాల నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నాయకత్వం పావులు కదుపుతోందనే అంచనాకు పార్టీనాయకులు వచ్చారు. బూర నర్సయ్య చేరికతోనే .. టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ను బీజేపీలోకి చేర్చుకోగానే తమ పార్టీలోని ఈ వర్గంతో పాటు ఇతర బీసీ వర్గాల నేతలను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ ప్రయత్నాలు సాగించడం కమలం నేతలను ఉలికిపాటుకు గురిచేసింది. మునుగోడులో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ తమ పార్టీ నాయకులను వివిధ రూపాల్లో ప్రలోభపెడుతోందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కొన్ని నెలల కిందటే తమ పార్టీలో చేరిన మాజీ టీఆర్ఎస్నేత కోవర్ట్గా పనిచేశారన్న విషయం ఇప్పుడు స్పష్టమైందని బీజేపీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో అన్నారు. ఇటీవల స్టీరింగ్ కమిటీ సమావేశంలోనూ పాల్గొన్న ఆ నేత, బీజేపీ మునుగోడు వ్యూహాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించారని, ఇదంతా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాలకు అనుగుణంగానే జరిగిందని ఆ నాయకుడు వెల్లడించారు. గతంలో టీఆర్ఎస్లో ఉన్న ఓనేత తనపై ఉన్న కేసుల కారణంగానే మళ్లీ అధికార పార్టీలోకి వెళుతున్నట్టు చెప్పారని ఆ నాయకుడు పేర్కొన్నారు. కేసుల నుంచి విముక్తి కల్పిస్తారనే హామీ నేపథ్యంలోనే ఆ నేత, పార్టీ మారేందుకు సిద్ధమయ్యారన్నారు. కాగా, ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిన నేతలకు బీజేపీలో సముచితస్థానమే లభించిందని గుర్తు చేశారు. వ్యక్తిగత ప్రయోజనం కోసమో, రాజకీయ లబ్ధికోసమో టీఆర్ఎస్లోకి వెళ్లే నాయకులను ఏమనగలమని మరో బీజేపీ నాయకుడు పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్కు బండి సంజయ్ సవాల్
సాక్షి, సంస్థాన్ నారాయణపురం: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ మునుగోడు ఉప ఎన్నిక మీదే ఆధారపడి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని గెలిపించాలని కోరుతూ బండి సంజయ్ సంస్థాన్ నారాయణపురంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ప్రాచీన శివాలయం నుంచి చౌరస్తా వరకు సాగిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. గొర్రెల యూనిట్లకు డబ్బులు రావొద్దని ఈసీకి ఫిర్యాదు చేయలేదన్నారు. ‘కేసీఆర్.. నీకు సిగ్గు, శరం ఉంటే కుంటుంబంతో ఇక్కడే శివాలయానికి రా. నేను నా కుంటుంబంతో వస్తా’అని సవాల్ విసిరారు. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కలిసి గుంటనక్కలు గుంపులుగా వచ్చినా రాజగోపాల్రెడ్డి లాంటి సింహం ఒంటరిగానే వస్తుందన్నారు. సమస్యల పరిష్కారం కోసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతోనే రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ మనిషికి రూ.40వేలు ఇచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం అమ్ముకోవద్దని ప్రజలను కోరారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించకుండా, రిజర్వేషన్ ఇవ్వకుండా సీఎం గిరిజనులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ గడీలు బద్దలుకొట్టాలంటే బీజేపీ అభ్యర్థినే గెలి పించాలని కోరారు. రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. పిట్టల దొరల స్టోరీలు ప్రజలు ఎక్కువ రోజులు నమ్మలేరని, కేసీఆర్ సినిమా క్లైమాక్స్కి వచ్చిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ ఎంపీలు వివేక్, బూర నర్సయ్యగౌడ్, జితేందర్రెడ్డి, నేతలు విఠల్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
Munugode Bypoll: సర్కార్ ఎవల్తోని నడుస్తున్నది?
జిద్దు ఇడ్వని విక్రమార్కుడు మోటర్ల బొందలగడ్డ దిక్కు బోయిండు. గాడ బేతాలుని రొండంత్రాల బంగ్ల ముంగట మోటరాపి హారన్ గొట్టిండు. బేతాలుడు ఇవుతలకొచ్చిండు. మోటర్ ఎన్క సీట్ల గూసుండు. ‘‘ఎత్తుగడ్డలు, గుంతలు సూడకుంట మోటర్ నడ్పుతనే ఉంటవు. బల్రు అడ్డం రావొచ్చు. ఎవడన్న సైడియ్యక పోవచ్చు. ట్రాఫిక్ల ఇర్కపోతే తిక్కలేవొచ్చు. బేచైన్ గాకుంట ఉండెతంద్కు రొండు ముచ్చట్లు జెప్త ఇను’’ అని అన్నడు. ‘‘నువ్వు జెప్తె ఇనకుంట ఉన్ననా?’’ అని విక్రమార్కుడన్నడు. ‘‘మునుగోడు అంటె ఏందో ఎర్కేనా? మును అంటె ముందుగాల, గోడు అంటె గోస. బై ఎలచ్చన్లు వొచ్చె బట్కె సంటర్ మంత్రులు, ముక్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్ని పార్టీల లీడర్లు గదిస్తం గిదిస్త మనుకుంట బొంబై తమాస సూబెడ్తున్నా ఇక ముందుగాల గుడ్క జెనం గోస బదలాయించదు.’’ ‘‘బాగనే ఉన్నది గని ఇంతకు జెనమేమంటున్నరు?’’ ‘‘గిదొక జాత్ర. అందరితాన పైసల్ దీస్కుంటం. మేం జేసేది జేస్తం. తింటం. తాగుతం. ఇంట్ల పంటం. ఏ పార్టి లీడరొస్తె గా పార్టి కండ్వలు గప్పుకుంటం. ఇదువర దాంక ఏ లీడరేం బీకలేదు. ఇంక నాల్గు నెలలల్ల ఏం బీక్తరు. ఫ్లోరైడ్ నీల్లట్లనే ఉంటయి. తొవ్వలల్ల గుంతలట్లనే ఉంటయి’’ అని మునుగోడు జెనమంటున్నరు. ‘‘మునుగోడుల ఎవ్వలెట్ల ప్రచారం జేస్తున్నరు?’’ ‘‘రూపాయలు ఏర్ల లెక్క బారుతున్నయి. మా పార్టి చోటామోటా లీడర్లు, సర్పంచ్లు మమ్ములనే డిమాండ్ జేస్తున్నరు... అవుతల లచ్చల రూపాయిల ఆఫర్ ఉన్నదంటున్నరు. గిట్లయితె ఏం జెయ్యాలెరో అని ఒక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మొత్తుకుండు.’’ ‘‘రాహుల్ గాంది బారత్ జోడో అసరు మునుగోడు మీద ఏమన్న ఉంటదా?’’ అని విక్రమార్కుడు అడిగిండు. ‘‘గాయిన జోడో అంటె గీల్లు తోడో అన్కుంట కొట్లాడ్తున్నరు. కాంగ్రెస్ల ఏ లీడర్ కా లీడర్ తీస్మార్ఖాన్ ననుకుంటడు. మునుగోడుల ప్రచారం జేసెతందుకు నా అసువంటి హోంగార్డుల అవుసరం లేదు. ఎస్పీలే పోతరు. గాయిన మీద నూరు కేసులు పెట్టినా వొచ్చే అసెంబ్లీ ఎలచ్చన్ల గెలిపిచ్చి కాంగ్రెస్ను హుకూమత్లకు దెస్తనని ఒక పెద్దమన్సి అన్నడు. గాయిననే మునుగోడుల కాంగ్రెస్ను గెలిపిస్తడని గా పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని బనాయించిండు.’’ ‘‘బీజేపీ, టీఆర్ఎస్ల సంగతేంది?’’ ‘‘బీజేపీ దిక్కుకెల్లి నిలబడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రొండెక్రాలల్ల క్యాంప్ ఆపీస్ బెట్టిండు. దినాం మటన్, చికెన్ తోని వెయ్యిమంద్కి దావత్ ఇయ్యబట్టిండు. ప్రచారం జేస్కుంట అవ్వా నీ ఓటు నాకే ఎయ్యాలె అని గాయిన అన్నడు. తప్పకుంట చెయ్యి గుర్తుకే ఓటేస్త అని గామె అన్నది. చెయ్యి గాదు పువ్వు అన్కుంట రాజగోపాల్ రెడ్డి మొత్తుకుండు.’’ ‘‘బండి సంజయ్, కేటీఆర్ల సంగతేంది?’’ ‘‘ప్రగతి బవన్ల ఒక మంత్రగానితోని కేసీఆర్ పూజలు జేపిస్తున్నడు అని బండి సంజయ్ అన్నడు. పిచ్చి ముదురుతున్నది, కరుస్తడేమో అని కేటీఆర్ అన్నడు. కావలి కుక్క లెక్క ఉండుమని కుర్సిమీద గూసుండబెడ్తె కచరా కుక్కల్లెక్క, పిచ్చికుక్కల్లెక్క కర్సెతంద్కు ఊరిమీద బడ్డరు అని బండి సంజయ్ అన్నడు. పూజూల్గ గీ లీడర్లు మమ్ములను బద్నాం జేస్తున్నరనుకుంట పట్నంల కుక్కలన్ని రాస్తారోకో జేసినయి.’’ ‘‘చండూరు ర్యాలీ ఎట్లయింది?’’ ‘‘టీఆర్ఎస్ దిక్కుకెల్లి నిలబడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేసన్ ఏసినంక చండూరుల మీటింగ్ బెట్టిండ్రు. కేటీఆర్ పక్కపంటే మైకు బట్కోని, నామినేషన్ కొచ్చిన నందమూరి తారక రామారావు గారికి, తమ్మినేని సీతారాం గారికి అనుకుంట కూసుకుంట్ల మాట్లాడబట్టిండు. యాల పొద్దుగాలే మందుగొట్టినట్లున్నడు అని కేటీఆర్ గాయినను ఎన్కకు బొమ్మన్నడు. ఒక మంత్రి అయితె మన బీఎస్పి పార్టీ అనబట్టిండు. ఇంతకు టీఆర్ఎస్ లీడర్లు పగటీలనే మందు ఎందుగ్గొడ్తున్నరు. గీ సవాల్కు జవాబ్ జెప్పకుంటె నీ మోటర్కు టక్కరైతది’’ అని బేతాలుడన్నడు. (క్లిక్: బీఆర్ఎస్ అంటే ఏంది?) ‘‘గీ సర్కార్ ముక్యమంత్రితోని నడుస్త లేదు. మంత్రుల తోని నడుస్త లేదు. ఎమ్మెల్యేలతోని నడుస్త లేదు. పోలీసోల్లతోని నడుస్త లేదు. మందుతోని నడుస్తున్నదని గాల్లు పగటీలనే మందుగొట్ట బట్టిండ్రు’’ అని విక్రమార్కుడు జెప్పంగనే మోటర్ దిగి బేతాలుడు బంగ్ల దిక్కు బోయిండు. - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
కన్నీటిపర్యంతమైన రేవంతరెడ్డి
-
నన్ను ఒంటరి చేసేందుకు కుట్ర.. కన్నీటి పర్యంతమైన రేవంత్రెడ్డి
సాక్షి, మునుగోడు: కాంగ్రెస్లో తనను ఒంటరి చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన మునుగోడు మండలం కొంపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు పీసీసీ పదవి వచ్చినందుకు సీనియర్ నాయకులు కక్ష పెంచుకొని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నా.. అందరూ అప్రమత్తం కావాలి. మునుగోడులో పెద్ద కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసే ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులను చిత్తు చేసేందుకు, పార్టీని బతికించుకునేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలి. నేను కూడా పోలీసు తూటాలకు సైతం ఎదురు నిలబడతా..’’అని పేర్కొన్నారు. పీసీసీ పదవి నుంచి తొలగించేందుకు.. దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు సీఎం కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఇందుకోసం పదిరోజుల పాటు ఢిల్లీలో ఉండి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలతో రహస్య భేటీలు జరిపారన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడించి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న తనను తొలగించాలనే కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ పేర్కొన్నారు. తనకు పదవులు అవసరం లేదని, పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పారు. తనకు పీసీసీ పదవి వచ్చిననాటి నుంచి బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు అనేక ఒత్తిళ్లు చేస్తున్నాయన్నారు. నిర్వాసితులను నిరాశ్రయులను చేశారు మర్రిగూడ: తాతలు, ముత్తాతల నుంచి వస్తున్న తరతరాల ఆస్తిని రిజర్వాయర్ పేరుతో కాజేసి కేసీఆర్ భూనిర్వాసితులను పూర్తిగా నిరాశ్రయులను చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలోని కుదాభక్ట్పల్లి, రాంరెడ్డిపల్లి, మర్రిగూడలలో గురువారం రాత్రి జరిగిన రోడ్షోలలో మాట్లాడారు. పాల్వాయి గోవర్ధన్రెడ్డి బిడ్డగా, మీ ఆడబిడ్డగా నన్ను గెలిపించాలని కొంగుచాచి అడుగుతున్నానని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి ఓటర్లను వేడుకున్నారు. దేశానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీనే.. ►మీడియా సమావేశంలో ఉత్తమ్, మధుయాష్కీ సాక్షి, హైదరాబాద్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోయే అపురూప ఘట్టమని పీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఎన్. ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూస్తుంటే దేశానికి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీనే అని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని అర్థమవుతుందని అన్నారు. గురువారం ఇక్కడి గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావిద్ తదితరులతో కలిసి మాట్లాడారు. భారత్ జోడో యాత్ర ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా తెలంగాణలో సక్సెస్ అవుతుందని అన్నారు. 23వ తేదీ నుంచి నవంబర్ 7 వరకు సాగే పాదయాత్రలో ప్రజలు, మేధావులు, రాజకీయాలకు అతీతంగా ఉన్నవారు రాహుల్తో సమాలోచనలు జరుపుతారని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ విషయం మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికకావడంతో మరోసారి తేటతెల్లమైందన్నారు. ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని, ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత రెట్టింపు అయిందన్నారు. ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీ మాట్లాడుతూ దేశంలో కుల, మత బేధాలు లేకుండా అందరినీ కలిపేందుకే యాత్ర జరుపుతున్నారని పేర్కొన్నారు. -
Munugode Bypoll: రోడ్డురోలర్ ఎఫెక్ట్.. ఆర్వోపై వేటు.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి, నల్లగొండ/చండూరు: మునుగోడు ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి (ఆర్వో) జగన్నాథరావు యుగతులసి పార్టీ అభ్యర్థికి కేటాయించిన రోడ్డురోలర్ గుర్తును మార్చి మరో గుర్తును కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా మండిపడింది. ఆర్వో తనకు లేని అధికారాలను వినియోగించారని ఆగ్ర హం వ్యక్తం చేసింది. జగన్నాథరావును ఎన్నికల విధుల నుంచి తప్పించి.. రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలను మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్కు అప్పగించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు రోడ్డు రోలర్ గుర్తును కేటాయించింది. ఏం జరిగింది? కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా ఎన్నికలో తొలుత గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకు, తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు లాటరీ ద్వారా గుర్తులను కేటాయిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ఇచ్చిన ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సంఘం చివరిగా 2021 సెప్టెంబర్ 23న ‘ఫ్రీసింబల్స్’ జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 17న జనరల్ అబ్జర్వర్ సమక్షంలో లాటరీ ద్వారా యుగతులసి పార్టీ అభ్యర్థి కె.శివకుమార్కు రోడ్డురోలర్ గుర్తును కేటాయించారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణులు చండూరులోని ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాయి. టీఆర్ఎస్ గుర్తు అయిన కారును పోలి ఉన్న రోడ్డురోలర్ను ఎలా కేటాయిస్తారని మండిపడ్డాయి. నల్లగొండలోని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నివాసం ఎదుట కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. మరోవైపు 18న విడుదల చేసిన గుర్తుల కేటాయింపు జాబితాలో రోడ్డురోలర్ గుర్తు మాయమైంది. రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు.. రోడ్డురోలర్ గుర్తును మార్చి కొత్తగా బేబీ వాకర్ గుర్తును శివకుమార్కు కేటాయించారు. అదికూడా జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లకుండా/ సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చే ముందు అభ్యర్థికి ఎలాంటి నోటీసు/సమాచారం ఇవ్వలేదు. నామినేషన్ పత్రాల్లో శివకుమార్ ఇచ్చిన ప్రాథమ్యాల్లో బేబీ వాకర్ గుర్తు లేదు. రిటర్నింగ్ అధికారి ఎన్నికల గుర్తును మార్చిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తూ.. జనరల్ అబ్జర్వర్ ఈ నెల 18న లేఖ రాశారు. శివకుమార్ కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ ఈ నెల 19న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నివేదిక తెప్పించుకుంది. సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం ‘కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్, 1961లోని నిబంధన 10(5)’ను ప్రయోగిస్తూ ఆర్వో జగన్నాథరావు ఎన్నికల గుర్తు మార్పు ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఒకసారి అభ్యర్థులకు కేటాయించిన ఎన్నికల గుర్తులను మార్చే అధికారం కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. తనకు లేని అధికారాలను వినియోగించి ఎన్నికల గుర్తు మార్చడానికి దారితీసిన పరిస్థితులపై సంజాయిషీ ఇవ్వాలని జగన్నాథరావును ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్కు లేఖ రాశారు. ఈ మేరకు జగన్నాథరావు పంపిన సంజాయిషీని సీఈవో కార్యాలయం గురువారం రాత్రి సీల్డ్ కవర్లో ఈసీకి పంపింది. మారిన గుర్తులతో బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. సీఈవో కార్యాలయాన్నీ సంప్రదించని తీరు ఎన్నికల గుర్తు మార్పు విషయంలో ఆర్వో జగన్నాథరావు సీఈవో కార్యాలయాన్ని కూడా సంప్రదించలేదని అధికారవర్గాలు తెలిపాయి. ఈసీ ఆదేశాల మేరకు జగన్నాథరావుపై చర్యలకు అవకాశముందని పేర్కొన్నాయి. అయితే ఓ పార్టీ ఒత్తిడితోనే జగన్నాథరావు ఎన్నికల గుర్తును మార్చారని ఈసీ నిర్ధారణకు వచ్చిందని.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈసీ నల్లగొండ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) అయిన జగన్నాథరావును తప్పించి.. ఆ స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్ను నియమించింది. తదుపరి పోస్టింగ్ కోసం రెవెన్యూ శాఖలో రిపోర్ట్ చేయాలని జగన్నాథరావుకు సూచించింది. గుర్తుల తొలగింపుపై టీఆర్ఎస్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈసీ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన అంబాసిడర్ కారును పోలిన ఎనిమిది ఎన్నికల చిహ్నాలు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నాయని.. వాటిని తొలగించాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కెమెరా, చపాతీ రోలర్, డోలీ (పల్లకి), రోడ్డురోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, పడవ గుర్తులు తమ పార్టీ గుర్తును పోలి ఉన్నాయని, ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని టీఆర్ఎస్ పేర్కొంది. అయితే టీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తి సజావుగా లేదని కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడినట్టు సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీనిపై సీఈవో వికాస్రాజ్ వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. సీరియల్ నంబర్పైనా ఫిర్యాదు ఇక బ్యాలెట్లో తమకు సీరియల్ నంబర్ కేటాయింపు విషయంలోనూ యుగతులసి పార్టీ రిటర్నింగ్ అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసింది. బ్యాలెట్ పేపర్లో మొదట తమకు సీరియల్ నంబర్ 5ను కేటాయించినా.. తర్వాత 14వ నంబర్కు మార్చారని, దీనిని కూడా సరిదిద్దాలని కోరింది. నాకు ఉన్న అధికారాలతోనే గుర్తును మార్చాం: జగన్నాథరావు యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు తొలుత రోడ్డురోలర్ గుర్తు కేటాయించింది వాస్తవమేనని.. తర్వాత వచ్చిన వినతుల మేరకు తనకున్న అధికారంతో గుర్తును మార్చానని తొలగింపునకు గురైన రిటర్నింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు. చండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ నుంచి వచ్చిన తాజా ఆదేశాల మేరకు యుగతులసి పార్టీకి తిరిగి రోడ్డురోలర్ గుర్తును కేటాయించామన్నారు. యుగతులసి అభ్యర్థికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం సీరియల్ నంబర్ 14 వచ్చిందని, 5వ నంబర్ కాదని చెప్పారు. కాగా.. మునుగోడు ఉప ఎన్నిక రిటర్నింగ్ అ«ధికారిగా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్సింగ్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. -
జేపీ నడ్డాకు సమాధి.. మునుగోడు ఉపఎన్నికల వేళ కలకలం
సాక్షి, చౌటుప్పల్ రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని జాతీయ ఫ్లోరైడ్ పరిశోధనాకేంద్రం ప్రతిపాదిత స్థలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట గుర్తు తెలియని వ్యక్తులు సమాధి కట్టడం కలకలం రేపింది. బుధవారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మట్టితో సమాధిని కట్టి, పూలదండలు వేసి, జేపీ నడ్డా ఫొటో పెట్టి, ఫ్లోరైడ్ పరిశోధన కేంద్రం అంటూ ఫ్లెక్సీ పెట్టారు. గురువారం ఉదయం పోలీసులు దీనిని తొలగించారు. ఈ ఉదంతంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక బీజేపీ నాయకులు సంఘటనాస్థలానికి వెళ్లి ఇది అధికార పార్టీ పనేనని మండిపడ్డారు. పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఫ్లోరైడ్ బాధితులే ఈ పనిచేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నా, ప్రత్యర్థి పార్టీలే ఈ పని చేసి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, కొన్నేళ్ల క్రితం జేపీ నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో మర్రిగూడ మండలంలో పర్యటిస్తూ ఫ్లోరైడ్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. తదనంతర పరిణామాల్లో ఈ కేంద్రం పశ్చిమబెంగాల్కు తరలిపోయింది. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు నడ్డా పేరిట సమాధి కట్టడం గమనార్హం. -
మునుగోడులో తిట్ల దండకం!.. ‘అయ్య ఫాంహౌజ్ స్టార్.. కొడుకు డ్రగ్ స్టార్'
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంటున్న కొద్దీ పార్టీల స్టార్ ప్రచారకర్తలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, వ్యక్తిగత దూషణలతో దుమారం రేపుతున్నారు. అధికార టీఆర్ఎస్తోపాటు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ప్రచార పర్వంలో పైచేయి సాధించేందుకు చేస్తున్న విమర్శలు వివాదాలు రేపుతున్నాయి. కొన్నిచోట్ల ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఓటర్లు, మీడియా దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రచార విన్యాసాలు కొన్ని సందర్భాల్లో వికటిస్తున్నాయి. గురువారం చౌటుప్పల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడికి ఏకంగా సమాధి కట్టిన ఘటన ప్రచారంలో కొత్తపోకడకు దారితీసింది. హడావుడిగా నేతలు అన్ని పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో క్రియాశీల కార్యకర్తలను మోహరించి ప్రతీ ఓటరును చేరుకునేందుకు శ్రమిస్తున్నారు. దీంతో ఊరూరా విందులు జోరుగా సాగుతున్నాయి. మద్యం, శీతల పానీయాలు, చికెన్ విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సామాజిక సమీకరణాలపై అన్ని పార్టీలు దృష్టి సారించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఓటర్లను కలుసుకునే బాధ్యతను అప్పగించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఇతర పార్టీల నుంచి చేరికల పేరిట హడావుడి చేస్తూ నేతలు కండువాలు కప్పే పనిలో తీరికలేకుండా ఉన్నారు. చేరికలు నిరంతరంగా సాగుతుండటంతో ఎవరు పార్టీలో కొనసాగుతున్నారో లేదో చెప్పలేని పరిస్థితి ఉందని అధికార పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్తోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో భాగంగా గ్రామాలను చుట్టబెడుతున్నారు. మండలాలు, గ్రామాలు, సామాజికవర్గాల వారీగా ఎన్ని ఓట్లు ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఓటరు జాబితాను అన్ని పార్టీలు వడపోసి, వివరాలను క్షేత్రస్థాయిలో అందజేశాయి. నాయకుల మాటల తూటాలు... టీఆర్ఎస్ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అయన అసలు ప్రజాప్రతినిధిగానే పనికిరారని, కాంట్రాక్టుల కోసమే ఉపఎన్నిక తెచ్చారని, అదీగాక గెలిచిన పార్టీలో కోవర్టుగా పనిచేశారని తీవ్రంగా విమర్శిస్తోంది. అదే సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్లపై విమర్శలు గుప్పిస్తోంది. బండి సంజయ్, రేవంత్రెడ్డిలు బఫూన్లని, వారు కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కేటీఆర్ విమర్శిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానంగా సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. మంత్రులు/ ఎమ్మెల్యేలను దండుపాళ్యం బ్యాచ్గా, నీతి, జాతిలేని రాక్షసులుగా దుమ్మెత్తిపోస్తున్నారు. ‘అయ్య ఫాంహౌజ్ స్టార్.. కొడుకు డ్రగ్ స్టార్, అల్లుడు వెన్నుపోటు స్టార్.. సడ్డకుడి కొడుకు టానిక్ స్టార్, మిగిలింది లిటిల్ స్టార్. వీళ్లంతా బందిపోటు స్టార్స్’ అంటూ ఆరోపణలు చేయడం గమనార్హం. టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్రెడ్డి సైతం టీఆర్ఎస్, బీజేపీలను ఏకిపారేస్తున్నారు. ‘ఒకరు దొంగ అయితే ఇంకొకరు గజదొంగ.. తాగడానికి గంజి లేని టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బెంజి కార్లలో తిరుగుతున్నారు. మంత్రులు మందు పోసే దివాలాకోరు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అడ్డమైన గాడిదలు టీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాయి’ అంటూ తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. -
సహనానికి హద్దుంటుంది.. టీఆర్ఎస్కు కేంద్రమంత్రి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బతికి ఉన్నవారికీ సమాధి కట్టే దుస్సంప్రదాయానికి టీఆర్ఎస్ తెర తీసిందని, కనీస నైతిక, మానవతా విలువలు, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరిట సమాధి కట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా.. ఆయన మీద ఎందుకు ఈ అక్కసు’అని ప్రశ్నించారు. బతికున్న వ్యక్తికి సమాధి కట్టే నీచ, నికృష్ట చర్యలకు దిగడం ద్వారా అన్ని పరిమితులు, లక్షణరేఖను టీఆర్ఎస్ దాటి దిగజారిందని మండిపడ్డారు. గతంలో తన దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారని, తమ సహనాన్ని అసమర్థతగా కల్వకుంట్ల కుటుంబం భావిస్తే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కల్వకుంట్ల మాఫియా రాజ్యంగా తెలంగాణను మారుస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్ఎస్ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందన్నారు. మునుగోడులో బీజేపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపెడుతున్నారన్నారు. చిల్లర రాజకీయాలతో తొండి చేసి ఎన్నికల్లో గెలవాలని టీఆర్ఎస్ భావిస్తోందని విమర్శించారు. దత్తత అంటారు.. ఆ తర్వాత మర్చిపోతారు.. ‘ఒక ముఖ్యమంత్రి ఉపఎన్నికలో ఒక గ్రామానికి ఇన్చార్జీగా ఉండటమనేది గతంలో ఎప్పుడూ లేదు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇస్తారు. ఆ తరువాత మర్చిపోతారు’అని కిషన్రెడ్డి విమర్శించారు. ‘బయ్యారంలో స్టీల్ప్లాంట్ పెడతామని తాము ఎప్పుడు హామీ ఇవ్వలేదని, స్టీల్ ప్లాంట్ కడతామని కేసీఆర్, కేటీఆర్లే హామీ ఇచ్చారని కిషన్రెడ్డి చెప్పారు. తెలంగాణలో కమిషన్లు లేకుండా కాంట్రాక్ట్లు లేవని, కల్వకుంట్ల కుటుంబం దోచుకోని రంగం లేదని, ఉద్యమకారులను వెన్నుపోటు పొడిచిన కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు వదిలి పెట్టే సమయం వచ్చిందన్నారు. ‘మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీద ఒత్తిడి తెచ్చారు. కోర్ట్కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసీఆర్ ఇష్ట ప్రకారం గుర్తుల కేటాయింపు జరగదు, దానికి ఓ పద్ధతి ఉంటుంది’అని కిషన్రెడ్డి అన్నారు. -
మునుగోడు ఉపఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీపై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యంగ వ్యవస్థలను బీజేపీ ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది మరో తార్కణమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘంపై బీజేపీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అని కేటీఆర్ ధ్వజమెత్తారు. గతంలో తమ అభ్యర్థన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో ఆ గుర్తును తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందేందేకు బీజేపీ కుటిల ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం చర్య.. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్ను బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: మునుగోడు ఉపఎన్నికలో మరో ట్విస్ట్.. రిటర్నింగ్ అధికారి బదిలీ.. -
మునుగోడు ఉపఎన్నికలో రోడ్ రోలర్ గుర్తు మార్చడంపై ఈసీ సీరియస్
-
కేవలం రూ.లక్షతో విజయం సాధించా
మునుగోడు: తాను మొదటిసారి 1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేవలం రూ.లక్ష ఖర్చయ్యిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య చెప్పారు. ఆయన ఇల్లందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నర్సయ్య బుధవారం మునుగోడులో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఎప్పుడు ఎన్నికల్లో నామినేషన్, వాల్ పోస్టర్లు, మైక్లకు ఇతర ఖర్చులు తప్ప.. ఓటర్లకు ఏనాడూ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్తే స్థానికులే తమకు భోజనాలు వండి పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ ఖర్చు రూ.3 లక్షలకు చేరిందన్నారు. కానీ, మునుగోడు ఉప ఎన్నికలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఇది అందరికి పెద్ద ముప్పుగా మారనుందని నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
కోవర్టు రెడ్డిగా ఉంటావో.. కోమటిరెడ్డిగా ఉంటావో నీ ఇష్టం: వీహెచ్
జడ్చర్ల: ‘మునుగోడు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండి మంత్రి కేటీఆర్ అన్నట్లు కోవర్టురెడ్డిలా ఉంటావో.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషిచేసి కోమటిరెడ్డిలా ఉంటా వో నీ ఇష్టం’.. అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మంగళవారం కోమటిరెడ్డిని కలిసిన ప్పుడు.. తమ్ముడి కోసం రాజకీయ భవిష్యత్ ను ఎందుకు పణంగా పెడుతున్నావని ప్రశ్నించినట్లు చెప్పారు. మునుగోడు ఆడబిడ్డను అందరం కలిసి గెలిపించుకుందామని వెంకట్ రెడ్డికి నచ్చజెప్పానని పేర్కొన్నారు. -
యుగతులసి పార్టీకే రోడ్డు రోలర్ గుర్తు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కే రోడ్డు రోలర్ గుర్తును కేటాయించనున్నట్లు తెలిసింది. ఈ నెల 17 రాత్రి జరిగిన నామినేషన్ల ఉపసంహరణ తరువాత రోడ్డు రోలర్ గుర్తు లాటరీ పద్ధతిలో యుగతులసి పార్టీ అభ్యర్థి శివకుమార్కు వచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని ఆయన మీడియాకూ వెల్లడించారు. అయితే 18న బయటకు వచ్చిన జాబితాలో మాత్రం ఆయనకు బేబీ వాకర్ గుర్తును కేటాయించినట్లుగా ఉంది. దీంతో శివకుమార్ రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. గుర్తుల కేటాయింపు రోజున తనకు రోడ్డురోలర్ కేటాయించిన అధికారులు.. మరుసటిరోజు జాబితాలో ఆ గుర్తు లేకుండా చేశారని, తన గుర్తును మార్చేశారని ఫిర్యాదు చేశారు. తమ కారు గుర్తును పోలి ఉన్న రోడ్డురోలర్, క్యాప్, చపాతి రోలర్ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ 17వ తేదీ రాత్రి ఆందోళన చేసింది. దీంతో తెల్లారేసరికి గుర్తులు మారిపోయాయని, దీనిపై వివరణ కోసం తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని శివకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం భారత ఎన్నికల సంఘం వద్దకు కూడా వెళ్లడంతో, వారు పరిశీలన జరిపి రోడ్డు రోలర్ గుర్తును శివకుమార్కే కేటాయించేలా చర్యలు చేపట్టినట్లు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు గుర్తుల విషయంలో రిటర్నింగ్ అధికారిపైనా చర్యలకు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు, ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాల సమాచారం. -
సుప్రీంకోర్డు జడ్జీలు సహా పదివేల మంది ఫోన్లపై కేంద్రం నిఘా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికతోపాటు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలవడం ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్తో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సహా వివిధ రంగాలకు చెందిన పదివేల మంది ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్టులు, డబ్బు సంపాదన కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని విమర్శించారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2.40 లక్షల మంది ఓటర్లు ఉంటే 99 శాతం అంటే 2.38 లక్షల మందికి ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి జరిగిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మునుగోడులో ఓట్లు అడిగే హక్కు తమకే ఉందని.. తమ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. ’మునుగోడు’ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలివీ.. సాక్షి: మునుగోడులో మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మోహరించడంపై వస్తున్న విమర్శలపై స్పందన? కేటీఆర్: 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్కు ప్రధాని మోదీ ఐదు నెలల్లో 16 సార్లు వెళ్లారు. కేంద్ర మంత్రులను మోహరిస్తున్నారు. సొంత రాష్ట్రంలో మోదీకి పలుకుబడి తగ్గిందా? మంత్రులు సహా మునుగోడు ప్రచారంలో ఉన్న వారంతా టీఆర్ఎస్ కార్యకర్తలే. పార్టీ గెలిస్తేనే మాకు మనుగడ. విపక్షాలు తాము చేయనిది కూడా చేసినట్టు ప్రచారం చేస్తున్నాయి. మేం చేసిన పనులను చెప్పేందుకే గడప గడపకూ వెళ్తున్నాం. రాజగోపాల్రెడ్డికి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులనే ఆరోపణలేమిటి? గతంలో నాగార్జునసాగర్, హుజూర్నగర్లలో ఉప ఎన్నికకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్రెడ్డి మూడేళ్లుగా బేరసారాలు చేసుకుని, బేరం కుదిరాక రాజీనామా చేశారు. రాజగోపాల్రెడ్డికి చెందిన చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్టు ఇచ్చిన పెద్దలు ఎవరు?, ఎవరి వాటా ఎంత? దీని వెనుక ఉన్న గుజరాత్ రహస్యమేంటో ప్రజలకు చెప్పాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ కోవర్టులు అనడం సరైనదేనా? కోమటిరెడ్డి సోదరులు కోవర్టు బ్రదర్స్ అనే విమర్శకు వంద శాతం కట్టుబడి ఉన్నాను. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. రాజగోపాల్రెడ్డి ఒక పార్టీ నుంచి గెలిచి మూడేళ్లుగా మరోపార్టీకి వత్తాసు పలకడం అందరూ గమనించారు. మునుగోడులో నాయకుల కొనుగోళ్లు, పార్టీలు మారడంపై మీరేమంటారు? రాజకీయాల్లో డబ్బు ప్రభావంపై చర్చ జరుగుతోంది. దీనికి ఒక పార్టీ లేదా నాయకుడు కారణం కాదు. మునుగోడు ఎన్నికల్లో పంచేందుకు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు బండి సంజయ్ అనుచరుడు చొప్పరి వేణు కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడ్డాడు. పార్టీలు, నాయకుల స్వీయ నియంత్రణతోనే ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గుతుంది. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్న ఆరోపణలపై మీ స్పందన? సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జీలు మొదలుకుని దేశంలో దాదాపు పదివేల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. రాజకీయ నాయకులు, వ్యాపారులు, అధికారులు, జర్నలిస్టుల వరకు అందరి ఫోన్లను మోదీ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్తో ట్యాప్ చేస్తోందనేది బహిరంగ రహస్యం. ప్రైవేటు సంభాషణల్లో జడ్జీలు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక దెయ్యాలు, దేవుళ్లకు మధ్య ఎన్నికలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందన? యాదాద్రి దేవాలయాన్ని నిర్మించినది సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని గుడులకు నయా పైసా ఇవ్వనిది మోదీ ప్రభుత్వం. దేవుళ్లు ఎవరో, దెయ్యాలెవరో ప్రజలే నిర్ణయిస్తారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో ఉండి పాలన పడకేసిందనే ఆరోపణలు వస్తున్నాయేం? ఎవరు ఎక్కడ ఉన్నా పనులు ఆగడం లేదు. నేను, ఆర్థిక మంత్రి హరీశ్, వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి రోజూ చేస్తున్న సమీక్షలు, పాల్గొంటున్న కార్యక్రమాలే నిదర్శనం. టీఆర్ఎస్లో అసంతృప్తులు, పార్టీని వీడుతున్నవారిపై కామెంట్? పార్టీలో అసంతృప్తి లేదు. కారు ఓవర్ లోడ్ అయింది. వాళ్ల గాచారం బాగోలేక కొందరు బయటికి పోతున్నారు. బయటికి పోయినోళ్ల పరిస్థితి చూశాం. బీజేపీ ఏం చేసిందో బూర నర్సయ్యగౌడ్ చెప్పాలి. ఆయన మా సోదరుడు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటం. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం ఎలా ఉంటుంది? రాష్ట్రంలో రాహుల్ యాత్ర సమయంలోనే కాంగ్రెస్ ఎంపీలు ఒకరిద్దరు ఇతర పార్టీల్లోకి వెళతారు. ఆయన నడుస్తుంటే కాంగ్రెస్ కకావికలమై పోతోంది. రాహుల్ చేయాల్సింది భారత్ జోడో కాదు.. కాంగ్రెస్ జోడో యాత్ర. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు ఉంది. రాహుల్ సొంత పార్టీనే కాపాడుకునే స్థితిలో లేరు. 76 ఏళ్ల సోనియా నుంచి ఏఐసీసీ బాధ్యతలు తీసుకుని 80 ఏళ్ల ఖర్గేకు అప్పగిస్తున్నారు. గుజరాత్లో ఎన్నికలు జరుగుతున్నా రాహుల్ భారత్ జోడో యాత్ర ఆ రాష్ట్రాన్ని టచ్ చేయకుండా వెళుతోంది. బీజేపీ, మోదీతో ఏదైనా లోపాయికారీ ఒప్పందం ఉందా చెప్పాలి. కారును పోలిన గుర్తులపై మీ అభ్యంతరమేంటి? కారును పోలిన గుర్తులతో గతంలో భువనగిరి లోక్సభ స్థానంలో, దుబ్బాక ఉప ఎన్నికలో మా పార్టీ అభ్యర్థులు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓటరు తీర్పును ఇలాంటి గుర్తులు ప్రభావితం చేస్తాయి. అందుకే రాజకీయ పార్టీగా మా జాగ్రత్తలు మేం తీసుకుంటున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇది చాలా పెద్ద అంశం. రాష్ట్రం అవసరాలకు సరిపోయేంత ఆదాయం ఉంది. దీనిపై అన్ని వివరాలు మా వద్ద ఉన్నాయి. మునుగోడును దత్తత తీసుకుంటున్నారా? రాజగోపాల్రెడ్డి నాలుగేళ్లుగా నియోజకవర్గాన్ని అనాథ చేశారు. అందుకే నేను దత్తత తీసుకుంటానని ప్రకటించా. మునుగోడులో కొత్త అభివృద్ధి నమూనా ఆవిష్కరించే బాధ్యత నాదే. ముంచే వాడు కావాలా.. ముందుకు తీసుకెళ్లేవాడు కావాలా.. ప్రజలు తేల్చుకుంటారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రచార సరళి ఎలా ఉంది? మునుగోడులో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది. నల్లగొండను పీడించిన ఫ్లోరోసిస్ మహమ్మారిని రూపుమాపాం. పాలమూరు–రంగారెడ్డిని జతచేసి కృష్ణా జలాలను మునుగోడుకు అందించే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 2016లో మునుగోడు వచ్చిన నాటి కేంద్రమంత్రి నడ్డా ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కోసం 300 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామ న్నారు. ఇప్పటివరకు దాని ఊసే లేదు. మునుగోడులో రాజగోపాల్రెడ్డి ఇచ్చేది రూ.3వేల పెన్షన్కాదు.. ఓటుకు రూ.3వేలు లేదా రూ.30వేలు ఇస్తారేమో? మోదీ తెలంగాణపై పగబట్టినట్టున్నారు! కృష్ణా జలాల్లో నీటి వాటాను తేల్చకుండా మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా కాలయాపన చేస్తోంది. దీనితో తెలంగాణతోపాటు ఆంధ్రాకు అన్యాయం జరుగుతోంది. కేంద్రం పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా వివక్ష చూపుతూ అనవసర అవాంతరాలు సృష్టిస్తోంది. కొత్తగా కాళేశ్వరం డీపీఆర్ను స్టడీ చేస్తారట. అమ్మ పెట్టదు. అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా ఉంది. తెలంగాణపై మోదీ వివక్ష చూపుతున్నారు. శత్రుదేశం మీద పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. తప్పుచేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం లిక్కర్ స్కామ్, ఇంకో స్కామ్ అని కాదు.. ఏదైనా సరే విచారణ జరిపి నిరూపిస్తే వద్దనడం లేదు. తప్పుచేస్తే ప్రజల ముందు పెట్టండి. బీజేపీ నేతలంతా హరిశ్చంద్రుడి సోదరులు అనేలా ఉంది మోదీ వైఖరి. ఆ పార్టీ నేతల మీద ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు జరగవు? మాజీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్లపై కేసులు ఏమయ్యాయి? ఎన్నికల సంఘం కూడా బీజేపీ జేబు సంస్థగా మారింది. గుజరాత్తోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు. నీతులు ఇతరులకేనా?. మునుగోడు ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందా? మునుగోడులో గెలుస్తాం. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బరాబర్ గెలుస్తాం. దక్షిణ భారతదేశంలో వరుసగా మూడుసార్లు ఎన్నికై హ్యాట్రిక్ కొట్టిన సీఎం ఎవరూ లేరు. 2023లో కేసీఆర్ మూడోసారి సీఎం అయి చరిత్ర సృష్టిస్తారు. దక్షిణాదిలో ఎన్టీఆర్, కరుణానిధి, నంబూద్రిపాద్, రామకృష్ణ హెగ్గే, చంద్రబాబు వంటి ఉద్ధండులకు సాధ్యంకాని హ్యాట్రిక్ను కేసీఆర్ సాధిస్తారు. ఒకప్పుడు వైఎస్ వంటి పెద్దస్థాయి నేతలతో కేసీఆర్ కొట్లాడారు. రేవంత్, బండి సంజయ్ వంటివారు బఫూన్లు. వాళ్లు కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరు. ఎవరి సత్తా ఏమిటో వచ్చే నెల ఆరున తేలిపోతుంది. ఈ ఉప ఎన్నిక ప్రభుత్వాలను మార్చేందుకు వచ్చినదికాదు. ఒక వ్యక్తి స్వార్థంతో ప్రజల మీద రుద్దబడింది. కాంట్రాక్టర్ అహంకారానికి, ప్రజల ఆత్మాభిమానానికి మధ్య ఎన్నిక. -
కులాలకు గాలం.. ఏమడిగినా తగ్గేదేలా అంటున్న పార్టీలు
సాక్షి, నల్లగొండ: చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఓ సామాజిక వర్గం ఓట్లకు ముఖ్యనాయకుడు ఒకరు బేరం పెట్టారు. మీ కులం ఓట్లన్నీ మాకే కావాలి.. మీకేం కావాలో చెప్పండి.. అని అడిగితే ఆ కులం వారు రూ.12 లక్షలు అడిగారు. అంతే.. వెంటనే రూ.2 లక్షలు ఇచ్చేశారు. మిగతా రూ.10 లక్షలు మంత్రి కోటాలో సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మొత్తంతో గుడికి ప్రహరీ గోడ, లేదంటే కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలని భావిస్తున్నారు. ►మునుగోడు మండలం కొరటికల్లో కంఠమహేశ్వరస్వామి గుడికి రూ.5 లక్షలు ఇస్తామని టీఆర్ఎస్ నాయకుడు ఒప్పుకున్నారు. అందులో రూ.లక్ష మూడు రోజుల కిందట సోమవారమే ఇచ్చారు. మిగతా మొత్తాన్ని మరో వారంలో ఇస్తామని ఒప్పుకున్నారు. ►విరాళాల సంగతి అలా ఉంటే ఇక కులాల వారీగా కూడా సమ్మేళనాలను షురూ చేశాయి. గిరిజనులు అధికంగా ఉన్న సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని బొర్లగడ్డతండాకు ఇన్చార్జ్గా గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ను టీఆర్ఎస్ నియమించింది. ఆమె అక్కడ ఉండి ప్రచారం చేస్తున్నారు. ►మునుగోడులో మంగళవారం నాయీబ్రాహ్మణుల సమ్మేళనానికి బీజేపీ ఈటల రాజేందర్ హాజరై హామీలిచ్చారు. రజక కులస్తులతో ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షుడు కొండూరి సత్యనారాయణ సమావేశం అయ్యారు. మునుగోడు నియోజకవర్గంలో ముఖ్య నేతలు, ఇన్చార్జీలంతా ఇప్పుడు కులాల ఓట్లపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ సామాజికవర్గం వారికి ఎన్ని ఓట్లు ఉన్నాయి... ఆయా వర్గాలకు అక్కడ సంఘాలు ఏమైనా ఉన్నాయా? వాటికి నేతృత్వం వహిస్తున్నదెవరు? అన్న వివరాలను సేకరించాయి. టీఆర్ఎస్, బీజేపీలు ప్రతి వంద ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా నియమించాయి. ఆ వంద మంది ఓటర్లలో ఎంత మంది ఏ కులం వారు ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నారు. గ్రామాల్లో ఏ కులం ఓట్లు ఎక్కువగా ఉంటే ఆ కులం వారినే అక్కడ ఇన్చార్జీలుగా నియమించారు. వారు రంగంలోకి దిగి మనం మనం ఒకటి అంటూ సంబంధాలు కలుపుకుంటూ మా పార్టీకి ఓటేయండి. మీకు అండగా ఉంటామంటూ అభయం ఇస్తుండగా, వీలుకాని చోట కుల సంఘాలకు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల అభివృద్ధికి డబ్బులు ఇవ్వడం షురూ చేశారు. చౌటుప్పల్ మండలం డి.నాగారంలో రూ.5లక్షలతో పెద్దమ్మ గుడి కట్టించేందుకు బీజేపీ నేతలు కొబ్బరికాయ కొట్టగా అదే మొత్తంతో తాము కట్టిస్తామని టీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయ కొట్టారంటే వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వివిధ పార్టీలు సేకరించిన కొన్ని కులాల వారీగా ఓటర్లు గౌడ్ – 37,891, మాదిగ – 26,896, మాల – 9,967, రెడ్డి – 24,950, యాదవ (గొల్ల, కురుమ)– 25,856, పద్మశాలి – 18,615, లంబాడి – 10,334, ముస్లిం – 7,490, రజక – 6,752, మున్నూరుకాపు – 4,129, ముదిరాజ్ – 20,691, వడ్డెర – 3,850, కుమ్మరి – 5,205, కమ్మ – 4,880, నాయీబ్రాహ్మణ – 5,178, ఎరుకలి – 4064, బ్రాహ్మణ – 2076, విశ్వబ్రాహ్మణ – 4813, వైశ్య – 6841, వెలమ – 1360, క్రిస్టియన్ – 1027. -
మునుగోడు ఉప ఎన్నికలో వారే కీలకం.. గెలుపోటములు వారి చేతిలోనే!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల్లో 30 ఏళ్లలోపు వయసు ఓటర్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నారు. మిగతా వయసు వారితో 30–39 ఏళ్లవారు ఎక్కువగా ఉండగా.. ఆ తర్వాత 30 ఏళ్లలోపువారి సంఖ్యే ఎక్కువగా ఉంది. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న 18–19 ఏళ్లవా రు 8,432 మంది ఉంటే.. 20 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్య వయసువారు ఏకంగా 51,131 మంది ఉన్నారు. అంటే 59,563 మంది ఓటర్లు 30ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ప్రసన్నం చేసుకునే దిశలో.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మొదట్లో లక్ష ఓట్లను సాధించడం టార్గెట్గా పెట్టుకోగా.. కొత్త ఓటర్లతో సంఖ్య పెరగడంతో ఇప్పుడు లక్షా 25వేల ఓట్ల టార్గెట్తో పనిచేస్తున్నాయి. విపరీతమైన పోటీకారణంగా ఈసారి పోలింగ్ 90శాతానికి పైగా నమోదుకావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో యు వ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో యువతపై పట్టున్న స్థానిక నాయకులను తమవైపు తిప్పుకొనేందుకు తాయిలాలు ఇస్తున్నాయి. ఆయా నేతల స్థాయిని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.40 లక్షలదాకా ఇచ్చేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. కొత్త ఓటర్లు 15,134 మంది ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన అక్టోబర్ 4వ తేదీ నాటికి ఓటు నమోదు, సవరణల కోసం 25,831 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 15,134 మంది ఓట్లు/సవరణలను ఆమోదించారు. మరో 10,696 మంది దరఖాస్తులను తిరస్కరించగా, ఒకరి దరఖాస్తు పెండింగ్లో పెట్టారు. -
అందుకే టీఆర్ఎస్ నుంచి బూర నర్సయ్య గౌడ్ బయటికి..
టీఆర్ఎస్ నుంచి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ బయటికి రావడం ఆత్మగౌరవ ప్రకటనగా భావించాలి. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర సాధారణమైంది కాదు. హైదరాబాదులో లాప్రోస్కోపిక్ సర్జన్గా మంచి పేరున్న ఆయన ఒకవైపు వృత్తిని కొనసాగిస్తూనే... మరోవైపు డాక్టర్స్ సంఘ అధ్యక్షులుగా, తెలంగాణ జేఏసీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద దాదాపుగా 200 మంది డాక్టర్లు నిరాహార దీక్షలు చేపట్టారు. మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి అనేక ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రత్యేక తెలంగాణ ఏర్పాడడానికి కారకులలో ఆయన ఒకరయ్యారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ తరువాత జరిగిన ఎన్నికలలో బోనగిరి నుండి ఎంపీగా గెలిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి మేలు జరిగే పనులు చేశారు. అంతే కాకుండా యాదాద్రి గుడి పునఃనిర్మాణంలో ఆయన పాత్రను తక్కువగా అంచనా వేయలేము. గౌడ సామాజిక వర్గానికి కోకాపేటలో 5 ఎకరాల భూమి కేటాయించి, భవన నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే గీతన్నలు ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుండి కిందపడి చనిపోతే గతంలో ఉన్న రూ. 50,000 నష్టపరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచేలా చేసి బాధిత కుటుంబానికి ఆసరాగా నిలిచే విధంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో రెండవసారి జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ అగ్రకుల నాయకుల కుట్రల వ్యూహాలతో ఓడిపోయారు. ఆ తర్వాత నర్సయ్యకు టీఆర్ఎస్లో తగిన గౌరవం, ప్రాధాన్యం లభించలేదు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన టికెట్ ఆశించినా ఫలితం లేకపోయింది. ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇచ్చారు. దీంతో ఆయన టీఆర్ఎస్లో ఉన్న అణచివేత ధోరణిని నిరసిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది ముమ్మాటికీ సమర్థనీయమైన చర్య. (క్లిక్ చేయండి: టీఆర్ఎస్ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు) – డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్, హైదరాబాద్ -
మునుగోడులో ధనప్రభావం
-
మునుగోడు ఎన్నిక తర్వాత బీజేపీలోకి మాజీ మంత్రి.. ఎవరాయన!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరికల అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాక తమ పార్టీలోకి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతాయనే ధీమాను ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ముఖ్యనేతలతో కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కొందరు ప్రస్తుత ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీలోకి మాజీ మంత్రి మునుగోడు ఎన్నిక అనంతరం బీజేపీలో భారీగా చేరికలుంటాయని పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ 3 రోజుల కిందట తెలిపారు. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని సోమవారం మీడియా ప్రతినిధులతో లక్ష్మణ్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ వెల్లడించారు. త్వరలోనే హైదరాబాద్ నగరానికి చెందిన మాజీ మంత్రి ఒకరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్నారు. దీంతో ఆ మాజీమంత్రి ఎవరనేది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ కాదు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి కూడా మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ కాదని, రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని తాజాగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మరిన్ని ఊహాగానాలకు తావిస్తున్నాయి. టీఆర్ఎస్ సర్కార్పై వ్యతిరేకతను ఎత్తిచూపేందుకు, ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ఇంకా ఒకటి, రెండు ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో సాగుతోంది. (క్లిక్ చేయండి: టీఆర్ఎస్ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు) -
తెలంగాణలో కమల వికాసం ఎలా ఉంది?.. అమిత్ షాకు నేరుగా రిపోర్ట్లు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ చేస్తున్న కృషి, సన్నద్ధతపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం తెలంగాణలో వాస్తవ పరిస్థితులేంటీ అన్న దానిపై క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు రహస్య నివేదికలు తెప్పించుకుంటోంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నేరుగా నివేదికలు పంపేలా ఎలక్షన్స్ ప్రొఫెషనల్స్ బృందం ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’ గత ఏడాదికి పైగా ఇక్కడి నుంచే పనిచేస్తోంది. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల ద్వారా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా ఇక్కడి నుంచి విడిగా రిపోర్ట్లు పంపే ఏర్పాటు ఉంది. వీటితో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరుపై పార్టీతో సంబంధం లేని స్వతంత్ర పరిశోధన, అధ్యయన సంస్థల ద్వారా జాతీయ నాయకత్వానికి ‘క్షేత్ర నివేదిక’లు అందుతున్నాయి. రాష్ట్ర పార్టీలో వివిధ స్థాయిల నాయకుల పనితీరు, నిర్వహిస్తున్న కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజల్లోకి ప్రభావం చూపేలా పార్టీ ప్రచారం వెళుతోందా..? లేదా అన్న అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. పార్టీలో సోషల్ ఇంజనీరింగ్ ఎలా జరుగుతోంది, సాధారణ కార్యకర్త మొదలు రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలు, జాతీయ కార్యవర్గ సభ్యుల వరకు వారికి అప్పగించిన బాధ్యతలు సరిగా నిర్వహిస్తున్నారా లేదా వారి పనితీరు ఎలా ఉంది? రాష్ట్ర పార్టీ పదాధికారులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు ఎలా పని చేస్తున్నారన్న అంశాలపై ఫోకస్ పెట్టింది. ఈ సంస్థల అధ్యయనం, పరిశీలనలతో సిద్ధం చేసిన తటస్థ రిపోర్ట్ల ఆధారంగా తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణను అధినాయకత్వం సిద్ధం చేస్తున్నట్టు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు సంకేతాలు అందాయి. పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువగా.. అంతా బాగుంది అధికారంలోకి రావడమే తరువాయన్న ఫీల్గుడ్ ఫ్యాక్టర్ తో రాష్ట్ర నాయకులు అలసత్వం ప్రదర్శించకుండా ఉండేలా జాతీయ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. పార్టీలో కొత్త– పాత నేతలు, సీనియర్– జూనియర్ల మధ్య సమన్వయ లోపాలు, కొందరు ముఖ్య నేతలతోపాటు ఇతర స్థాయిల నాయకులు వ్యవహారశైలిని మార్చుకోవా లనే సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్ర ముఖ్యనేతల్లో అధిక శాతం వ్యక్తిగత ప్రతిష్టతో పాటు సొంతంగా ప్రమోట్ చేసుకునేందుకే ఎక్కువగా ప్రాధాన్యత నివ్వడం, పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలే ఎక్కువగా మొగ్గుచూపుతు న్నట్టు జాతీయ నాయక త్వానికి అందిన నివేదికల్లో స్పష్టమైంది. రాష్ట్ర పార్టీలోని వివిధ స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఒక సంఘటిత, ఉమ్మడి శక్తిగా కాకుండా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలో పార్టీ ఆశించిన ప్రయోజనాలు పూర్తి స్థాయిలో సాధించలేదని ఈ రిపోర్ట్ల్లో వెల్లడైనట్టు ముఖ్య నేతలు చెబు తున్నారు. ఈ నివేదికల ఆధారంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మొద లుకుని జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యర్శులు, రాష్ట్ర పదాధికా రులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గాలు, ఇలా యావత్ పార్టీకి నూత న దిశానిర్దే శనం సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన స్పష్టమైన కార్యా చరణను రాష్ట్ర పార్టీకి నాయకత్వం ఇవ్వ బోతున్నట్టు ‘సాక్షి’కి ఓ ముఖ్యనేత వెల్లడించారు. -
మునుగోడులో డబ్బు ప్రవాహం.. మరో వాహనం!
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికలో ధన ప్రవాహం వెల్లువెత్తుతోంది. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీలతో పాటు ఇతర అభ్యర్థులు.. డబ్బు పంపిణీ, ఇతర ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. మంగళవారం చండూరు మండల పరిధిలోని గుట్టుప్పల్ శివారులో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.19 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. కారు ఢిక్కీలో ఈ డబ్బును తరలిస్తుండగా.. పోలీసులు గుర్తించారు. కారులోని వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నగదుతో పాటు ఓ పార్టీకి సంబంధించిన ప్రచార సామాగ్రి ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. మునుగోడులో గత రెండు వారాల్లో భారీగా నగదు పట్టుబడడం ఇది మూడోసారి. పదిరోజుల కిందట రూ. 10 లక్షలు, సోమవారం(నిన్న) కోటి రూపాయలు తరలిస్తున్న ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
మునుగోడు గుర్తుల వివాదం.. టీఆర్ఎస్కు ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల గుర్తుల వివాదంలో టీఆర్ఎస్కు ఎదురు దెబ్బ తగిలింది. టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. కారును పోలిన గుర్తులను ఇవ్వొద్దని టీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈసీ వాదనతో ఏకీభవించిన కోర్టు సదరు పిటిషన్ను కొట్టేసింది. మునుగోడు స్వతంత్ర అభ్యర్థులకు ఇప్పటికే గుర్తులు కేటాయించామని హైకోర్టుకి నివేదించింది ఎన్నికల సంఘం. దీంతో ఈ సమయంలో ఈ పిటిషన్ పై జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు.. టీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది. -
Munugode War: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్ఎస్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: తమ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్ను స్వతంత్రులకు కేటాయించొద్దని.. ఆ మేరకు ఎన్నికల కమిషన్కు ఆదేశాలివ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి హైకోర్టులో లంచ్మోషన్ పిటి షన్ వేసింది. ఈ పిటిషన్పై నేడు సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. పిటిషన్లో వివరాలివి.. ‘మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులు ఇవ్వొద్దంటూ ఈ నెల 10న ఈసీని కలసి విజ్ఞప్తి చేసినా సమస్య పరిష్కారం కాలేదు. ఈవీఎంలో స్టాంప్ పరిమాణంలో ఉండే కారును పోలిన గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడే అవకాశం ఉంది. రోడ్రోలర్ గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ 2011లో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆ గుర్తును కేటాయించింది. 2018లో రోడ్డు రోలర్ గుర్తుకు జహీరాబాద్లో ఏకంగా 4330 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సీపీఐకి 1,036 ఓట్లే పోలయ్యాయి. డోర్నకల్లో రోడ్డురోలర్కు 4,117 ఓట్లు, సీపీఐకి 1,361 ఓట్లు, మునుగోడులో రోడ్డు రోలర్కు 3,569 ఓట్లు, బీఎస్పీకి 743 ఓట్లు వచ్చాయి. దీనికి కారణం రోడ్ రోలర్ గుర్తు కారు పోలి ఉండటమే. మరికొన్ని చోట్ల ఇదే కారణంగా కెమెరాకు 3 వేల నుంచి 9 వేల ఓట్లు.. టీవీకి 2వేల నుంచి 3 వేల ఓట్లు వచ్చాయి. ఇలాంటి గుర్తులను స్వతంత్రులకు కేటాయిస్తే టీఆర్ఎస్ నష్టపోయే అవకాశం ఉంది.’ స్వతంత్రులకు ‘కారు’ ఇవ్వొద్దు సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ తరువాత బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సోమవారం రాత్రి గుర్తులను కేటాయించారు. కొందరు అభ్యర్థులు టీఆర్ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టే గుర్తులను ఎంచుకోవడంతో ఆ పార్టీల్లో ఆందోళన నెలకొంది. కారు గుర్తును పోలి ఉన్న డోజర్, రోడ్డు రోలర్లను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో వాటిని జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వాటిని ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ నేతలు చండూరులోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. గత అనుభవాల నేపథ్యంలో టీఆర్ఎస్కు చెందిన కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని, వాటిని జాబితా నుంచి తొలగించాలన్నారు. -
Munugode Bypoll: చుట్టూ మనవాళ్లే.. జేబులోని నోట్ల కట్ట ఎలా మాయం?
సాక్షి, నల్లగొండ(మర్రిగూడ): మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో దుండగులు చేతివాటం ప్రదర్శించి జేబులు కత్తిరించేస్తున్నారు. ఏకంగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థి జేబులోంచి నోట్ల కట్ట కొట్టేశారు. మర్రిగూడ మండలం నామాపురం, కొట్టాల గ్రామంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి సోమవారం కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రచారం ముగిసిన తర్వాత తన జేబు చూసుకుంటే అందులోని రూ.50 వేల నోట్ల కట్ట కనిపించలేదు. చుట్టూ మనవాళ్లే ఉన్నారు.. జేబులోని నోట్ల కట్ట ఎలా మాయమైందంటూ ఆ అభ్యర్థి నోరెళ్లబెట్టాడు. అనంతరం ఆయన వెంట ఉన్న నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ వాగ్వా దానికి దిగారు. దీంతో మరో నాయకుడు కలుగజేసుకుని పోయిన డబ్బులు ఎలాగూ పోయాయి.. మనమెందుకు తగువులాడుకో వడం.. అంటూ వివాదాన్ని చల్లార్చారు.