NATO
-
మా ప్రమేయం లేని ఒప్పందాలను అంగీకరించం: జెలెన్స్కీ
కెమెల్నిత్స్కీ (ఉక్రెయిన్): యుద్ధ విరమణపై తమ ప్రమేయం లేని ఎలాంటి చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. వాటిని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్– రష్యా యుద్ధ విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రష్యా అ« ద్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన జెలెన్స్కీతోనూ చర్చలు జరిపారు. చర్చలకు చొరవ తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించాక.. జెలెన్స్కీ గురువారం దీనిపై తొలిసారిగా స్పందించారు. ‘ప్రతీది పుతిన్ ప్రణాళిక ప్రకారం జరగడానికి వీల్లేదు. దీన్ని మేము అంగీకరించం, అనుమతించం’ అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఒక స్వతంత్ర దేశంగా మా ప్రమేయం లేని ఎలాంటి చర్చలూ మాకు ఆమోదయోగ్యం కాదని మా మిత్రదేశాలకు స్పష్టం చేస్తున్నాని తెలిపారు. శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరప్లను దూరంగా పెట్టడం సబబు కాదని నాటో దేశాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం అసాధ్యమని, రష్యా ఆక్రమిత భూభాగాలను ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుందని అమెరికా రక్షణ మంత్రి పీటే హెగ్సెత్ బుధవారం వ్యాఖ్యానించడంతో.. నాటో దేశాలు చర్చలు ఏకపక్షంగా ఉంటాయేమోనని ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్కు అన్యాయం చేస్తున్నారనే వాదనను హెగ్సెత్ గురువారం ఖండించారు. ‘ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఉక్రెయిన్ గురించి చర్చలు ఉండకూడదు. ఉక్రెయిన్ వాదనకు చర్చల్లో ప్రాధాన్యం దక్కాలి’ అని బ్రిటన్ రక్షణమంత్రి జాన్ హీలి అన్నారు. -
ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం అసాధ్యం
బ్రస్సెల్స్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపుతానంటూ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మొదటిసారిగా బుధవారం నాటో ప్రధాన కార్యాలయంలో ‘ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్’సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం అసాధ్యమన్నారు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వంతో శాంతి ఒప్పందం కార్యరూపం దాలుస్తుందనే విశ్వాసం తనకు లేదన్నారు. అంతర్జాతీయ బలగాల దన్నుతో ఆ దేశం రష్యాతో చర్చలకు, శాంతి ఒప్పందానికి సిద్ధ పడాలని సూచించారు. అంతేకాదు, 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాలను వదులు కోవాల న్నారు. ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్కు ఏ మేరకు సైనిక, ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉందో తెలుసుకోవాలనుకున్న నాటో దేశాలకు ఈ వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు. అంతేకాదు, ఉక్రెయిన్ రక్షణ, ఆర్థిక, సైనిక పరమైన అంశాలను ఇకపై యూరప్ దేశాలే చూసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారని కూడా హెగ్సెత్ బాంబు పేల్చారు. ఒక వేళ శాంతి పరిరక్షక బలగాల అవసరముంటే అందులో అమెరికా బలగాల పాత్ర ఉండబోదని కూడా తేల్చేశారు. ఈ బలగాలతో రష్యా ఆర్మీకి ఘర్షణ తలెత్తే సందర్భాల్లో అమెరికా లేదా నాటో దేశాల నుంచి ఎటువంటి రక్షణలు కల్పించలేమన్నారు. ఉక్రెయిన్ కోరుతున్న భూభాగంలో కొంత ప్రాంతాన్ని రష్యా ఉంచుకుంటుందన్నారు. ‘ బదులుగా సమర్థమైన యూరప్, లేదా నాన్ యూరప్ బలగాలతో భద్రత కల్పించడం మంచిది. ఏదేమైనా, ఎలాంటి భద్రతా ఒప్పందం కుదిరినా ఉక్రెయిన్లో అమెరికా బలగాలను మోహరించబోం. ఉక్రెయిన్లో భవిష్యత్తులో చేపట్టే ఎలాంటి మిలటరీ మిషన్కైనా నాటోకు, సభ్య దేశాలకు ఎలాంటి పాత్రా ఉండదు. నాటోలోని ఏ దేశంపై దాడి జరిగినా మిగతా దేశాలన్నీ రక్షణగా నిలవాలన్న ప్రాథమిక సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. ఉక్రెయిన్కు భవిష్యత్తులో అవసరమయ్యే సైనిక, ఇతరత్రా సాయంలో ఎక్కువ భాగాన్ని యూరప్ దేశాలే చూసుకోవాల్సి ఉంటుంది’అని కుండబద్దలు కొట్టారు. అయితే, హెగ్సెత్ చెప్పిన అంశాలు త్వరలోనే మూనిక్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ఇతర అధికారులతో జరిగే సదస్సులో జరిగే చర్చలను మరింత సంక్లిష్టంగా మారు స్తాయని భావిస్తున్నారు. -
ఉక్రెయిన్లో తక్షణమే శాంతి నెలకొనాలి
వాషింగ్టన్: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం తక్షణమే ఆగిపోవాలని అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. నాటో నుంచి అమెరికా వైదొలిగే అంశాన్ని పరిశీలిస్తున్నామని కూడా ఆయన వెల్లడించారు. పారిస్లో శనివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్లో.. ‘రష్యాతో వెయ్యి రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఉక్రెయిన్ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. ‘అవసరమే లేని యుద్ధంలో రష్యా, ఉక్రెయిన్లు రెండూ వేలాదిగా సైనికులను పోగొట్టుకున్నాయి. అందుకే చర్చలు ప్రారంభించి, వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి. ఎన్నో ప్రాణాలు అనవసరంగా బలయ్యాయి. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను కోరుతున్నా’ అని ఆయన పేర్కొన్నారు. ట్రంప్తో సమావేశం నిర్మాణాత్మకంగా జరిగిందని అంతకుముందు జెలెన్స్కీ పేర్కొన్నారు. ‘శాంతి ఒప్పందంతో మాకు న్యాయం జరగాలి. రష్యా, పుతిన్, ఇతర దురాక్రమణదారులు ఇలాంటి యుద్ధాలకు దిగే అవకాశం మళ్లీ ఇవ్వరాదు’అని స్పష్టం చేశారు. ఈ యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని, మరో 3.70 లక్షల మంది క్షతగాత్రులయ్యారని జెలెన్స్కీ చెప్పారు. ఉక్రెయిన్తో చర్చలకు సిద్ధమేనని రష్యా ట్రంప్ ప్రకటనపై ఈ మేరకు స్పందించడం గమనార్హం. అయితే, అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంతకాలం రష్యాతో చర్చల ప్రసక్తే లేదని గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రకటనను గుర్తు చేసింది.నాటో నుంచి బయటికొస్తాంనాటో నుంచి అమెరికా బయటికి వచ్చే విషయం ఇప్పటికీ తమ పరిశీలనలో ఉందని, అది సాధ్యమేనని ట్రంప్ ఎన్బీసీ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘నాటోలో అమెరికా బలగాలుండాలంటే బదులుగా యూరప్, కెనడా ప్రభుత్వాలు అందుకయ్యే వ్యయం భరించాలి. అప్పుడే వాళ్లు మమ్మల్ని సమభావంతో చూస్తున్నట్లు లెక్క. అలాగైతేనే మేం నాటోలో కొనసాగుతాం’ అని ఆయన స్పష్టం చేశారు. యూరప్, కెనడాలకు తామెందుకు భద్రత కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా గతంలోనే ఆయన ప్రశ్నించడం తెల్సిందే. -
Russia Ukraine War: నాటోలో చేర్చుకోండి.. యుద్ధం ఆపేస్తాం
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఇరుదేశాల సైనికులు నీరసించిపోతున్నారు. శత్రుదేశంలో ఇక పోరాడలేమంటూ ఉక్రెయిన్, రష్యా జవాన్లు తేల్చిచెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలూ యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకొచ్చిన రష్యా సైన్యం అక్కడే తిష్టవేసింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ భూభాగాలు రష్యా నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్లో ఐదింట ఒక వంతు భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. సాంకేతికంగా, చట్టపరంగా ఇది ఉక్రెయిన్ పరిధిలోనిదే. అయినప్పటికీ ప్రస్తుతం దానిపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి పట్టులేదు. మరోవైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) కూటమిలో చేరికపట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉత్సాహం చూపిస్తున్నారు. కనీసం ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని అయినా నాటోలో చేర్చుకుంటే యుద్ధంతో అత్యంత కీలక దశను ముగించే అవకాశం ఉందని చెప్పారు. ఇదంతా చాలా వేగంగా జరగాలని అభిప్రాయపడ్డారు. తాజాగా స్కైన్యూస్ సంస్థకు జెలెన్స్కీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ అ«దీనంలో ఉన్న ప్రాంతానికి పూర్తి భద్రత కల్పిస్తామంటూ హామీ ఇవ్వాలని నాటోను కోరారు. అలాగైతే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని తెలిపారు. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం భూభాగాన్ని.. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో సహా నాటోలో చేర్చుకోవాలని చెప్పారు. దాంతో రష్యా ఆక్రమించిన భూమిని దౌత్య మార్గాల్లో మళ్లీ తాము స్వా«దీనం చేసుకొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం కల్పిస్తే రష్యాతో యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధంగా ఉన్నామని జెలెన్స్కీ స్పష్టంచేశారు. కానీ, సభ్యత్వం విషయంలో నాటో దేశాల నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ను ఇప్పటికిప్పుడు తమ కూటమిలో చేర్చుకోవడానికి నాటోలోని కొన్ని దేశాలు ఇష్టపడడం లేదని సమాచారం.ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
యుద్ధానికి తెర దించేందుకు..రష్యా రెడీ!
రెండున్నరేళ్లు దాటిన యుద్ధం. కనీవినీ ఎరగని విధ్వంసం. ఇరువైపులా లెక్కకైనా అందనంత ఆస్తి, ప్రాణనష్టం. యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరూ ఉండరని ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నిరూపిస్తోంది. అగ్ర రాజ్యపు అపార ఆర్థిక, సాయుధ సంపత్తి ముందు ఏ మూలకూ చాలని ఉక్రెయిన్ యుద్ధంతో కకావికలైంది. ఆర్థికంగా, సైనికంగా మాత్రమే గాక జనాభాపరంగా, అన్ని రకాలుగానూ దశాబ్దాలు గడిచినా కోలుకోలేనంతగా నష్ట పోయింది. అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక, సాయుధ దన్నుతో నెట్టుకొస్తున్నా ట్రంప్ రాకతో ఆ సాయమూ ప్రశ్నార్థకంగా మారేలా కన్పిస్తోంది. అదే జరిగితే చేతులెత్తేయడం మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే. ఇంతటి యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ. అందులో ముఖ్యమైనది సైనిక నష్టం. యుద్ధంలో ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి! దీనికి తోడు కనీసం మరో 5 లక్షల మంది సైనిక విధులకు పనికిరానంతగా గాయపడ్డట్టు సమాచారం. ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బే. యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలూ పెద్దగా ఫలించడం లేదు. యుద్ధ భూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతోంది. దాంతో సైనికుల కొరత కొన్నాళ్లుగా రష్యాను తీవ్రంగా వేధిస్తోంది. మరో దారి లేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి! దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నిండుకోవడంతో రష్యాకు ఎటూ పాలుపోవడం లేదు. ఉక్రెయిన్పై సైనిక చర్యను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెర పడాలని ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా కోరుకుంటున్నట్టు సమాచారం. ఇటీవలి పుతిన్ ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చిందంటున్నారు.ఇవీ షరతులు...→ భూతల యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యానికి గతంలోలా కొన్నాళ్లుగా పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు.→ దాంతో నెనెట్స్క్ తదితర ఉక్రెయిన్ భూభాగాల్లోకి రష్యా నానాటికీ మరింతగా చొచ్చుకుపోతోంది.→ కానీ ఇందుకు చెల్లించుకోవాల్సి వస్తున్న సైనిక, ఆయుధ మూల్యం తదితరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆలోచనలో పడేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏదోలా ఉక్రెయిన్పై యుద్ధానికి తెర దించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.→ కొన్ని ప్రధాన షరతులకు ఉక్రెయిన్ అంగీకరించే పక్షంలో యుద్ధా్దన్ని నిలిపేసేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.→ ఆక్రమిత ప్రాంతాలకు తోడు మరింత భారీ భూభాగాన్ని ఉక్రెయిన్ తమకివ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు.→ అది కనీసం అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వర్జీనియా పరిమాణంలో ఉండాలని కోరుతున్నారు.→ ఉక్రెయిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండ్ను నాటో పరిగణనలోకే తీసుకోవద్దని కోరుతున్నారు. యుద్ధంలో మరణించిన రష్యా సైనికులు: 1.5 లక్షల నుంచి 2లక్షలుగాయపడ్డ సైనికులు: 5 లక్షల పైచిలుకువామ్మో సైన్యం!రష్యా యువతలో వణుకుసైన్యంలో చేరడమనే ఆలోచనే రష్యా యువతకు పీడకలతో సమానం! కొత్తగా చేరేవారిని వేధించడంలో రష్యా సైనికుల ట్రాక్ రికార్డు సాధారణమైనది కాదు! రిటైరైన తర్వాత కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ వణికిపోయే పరిస్థితి! వాటి బారిన పడే బదులు బతికుంటే బయట బలుసాకైనా తినొచ్చని రష్యా యూత్ భావిస్తుంటారు. డెడొవ్షినా అని పిలిచే ఈ వేధింపుల జాఢ్యం ఇప్పటిది కాదు. రష్యా సైన్యంలో 17వ శతాబ్దం నుంచే ఉందని చెబుతారు. దీనికి భయపడి రష్యా యువత సైన్యంలో చేరకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తుంటుంది. ఉక్రెయిన్ యుద్ధంలో కనీవినీ ఎరగనంత సైనిక నష్టం జరుగుతుండటంతో భారీగా రిక్రూట్మెంట్కు రష్యా రక్షణ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. యువతీ యువకులకు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని పేర్కొనే ‘డ్రాఫ్ట్ నోటీస్’ పంపిస్తోంది. దాంతో సైనిక జీవితాన్ని తప్పించుకునేందుకు రష్యా యువత లక్షలాదిగా విదేశాల బాట పట్టారు. అలా వెళ్లలేని వారిలో చాలామంది ఫేక్ మెడికల్గా అన్ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తుంటారు. ఆ క్రమంలో అవసరమైతే తమ ఎముకలు తామే విరగ్గొట్టుకుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! దాంతో చెచెన్యా, యకుట్జియా, దగెస్తాన్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతను రక్షణ శాఖ కొన్నాళ్లుగా ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఖైదీలను నిర్బంధంగా సైన్యంలో చేరుస్తోంది. ఇలాంటి వారిని సైన్యంలో దారుణంగా చూస్తున్నారు. చనిపోతే మృతదేహాలను గుర్తించి గౌరవప్రదంగా కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి కూడా ఉండటం లేదు! దీనికి తోడు రష్యాలో మామూలుగానే సైనికులు దారుణమైన పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. వారికి అత్యంత అవసరమైన పౌష్టికాహారానికే దిక్కుండదు! పైగా సరైన వైద్య సదుపాయమూ అందదు. సంక్షేమం దేవుడెరుగు, చివరికి సైనికుల భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మామూలు సమయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటుందంటే ఇక యుద్ధ సమయాల్లోనైతే సైనికుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సర్కారు అక్షరాలా గాలికే వదిలేస్తుంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్ డీసీ : తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని నిలిపి వేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ ఆదేశాలపై రష్యా మద్దతివ్వగా.. రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా నాటోలో చేరకుండా సుధీర్ఘకాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బదులుగా అమెరికా.. ఉక్రెయిన్కు భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జోబైన్ ఉక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆర్ధికంగా,ఆయుధాల్ని అందించడంపై ట్రంప్ పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే ట్రంప్ ఉక్రెయిన్కు ఆయుధ సంపత్తిని సమకూర్చనుండడం ఆసక్తికరంగా మారింది.ట్రంప్పై జెలెన్స్కీ ప్రశంసలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. అనంతరం ‘ మా ఇద్దరి మధ్య సంభాషణ సన్నిహితంగా జరిగింది. అమెరికా-ఉక్రెయిన్ దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగించేందుకు అంగీకరించాం. బలమైన, తిరుగులేని అమెరికా నాయకత్వం ప్రపంచానికి, న్యాయమైన శాంతికి చాలా అవసరం’ అని ఎక్స్ వేదికపై జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
ఉక్రెయిన్పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లకు పైగా సాగుతున్న దాడుల్లో రెండు దేశాల సైన్యం వీరోచితంగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు. ఈ పోరులో ఉక్రెయిన్ సైన్యం.. రష్యా భూభాగంలో అడుగుపెట్టింది. రష్యాతో పోరులో ఉక్రెయిన్కు సాయం చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకు వచ్చాయి. మరోవైపు.. రష్యాకు సాయం చేసేందుకు ఉత్తర కొరియా బలగాలు రంగంలోకి దిగాయి.ఉక్రెయిన్తో యుద్ధంలో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నాటో వెల్లడించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలను మోహరించినట్లు నాటో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు తెలిపారు. ఇక, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇది రెండు మధ్య యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు.NATO confirms North Korean troops have been sent to Russia to support its war in Ukraine. This marks a dangerous escalation, violating UN resolutions and risking global security. As Putin turns to Pyongyang for military aid, democracies must unite to uphold peace and security.… pic.twitter.com/kHT1g57y68— Pete (@splendid_pete) October 28, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే పుతిన్.. ఉక్రెయిన్పై పోరుకు నార్త్ కొరియా సాయం కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం రష్యాకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా సైన్యంలోకి భారీగా యువత వచ్చి చేరారు.మరోవైపు.. రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే చర్చ కూడా జరుగుతోంది. -
విజ్ఞత మరిచిన నాటో!
వ్యక్తిగా ఒక్కరు తీసుకునే నిర్ణయం కంటే సమష్టి నిర్ణయమే ఎప్పుడూ సరైందని పెద్దలు చెబుతారు. కానీ వాషింగ్టన్లో మూడు రోజులపాటు జరిగిన నాటో 75 ఏళ్ల వార్షికోత్సవాల్లో దేశాధినేతలు మాట్లాడిన తీరు చూసినా, చివరిలో ప్రకటించిన డిక్లరేషన్ గమనించినా పరిణతికన్నా పరమ మూర్ఖత్వమే కనబడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం దిశగా ప్రపంచ దేశాలను కదిలించే ప్రయత్నం దర్శనమిస్తుంది. రష్యా దురాక్రమణపై పోరాడుతున్న ఉక్రెయిన్కు వచ్చే ఏడాదిలోగా సైనిక సాయం రూపంలో కనీసం 4,000 కోట్ల యూరోలు అందజేయాలని నాటో సంకల్పించింది. అంటే రెండున్నరేళ్లుగా వేలాదిమంది మరణాలకూ, కోట్లాది డాలర్ల ఆస్తుల విధ్వంసానికీ కారణమైన ఆ యుద్ధాన్ని మరింత ఎగదోస్తూ పోతారన్నమాట! ఇంకా విడ్డూరమేమంటే నెదర్లాండ్స్ భూభాగంలో ఎఫ్–16 యుద్ధ విమానాలను మోహరించి రష్యాపై దాడులకు ఉక్రెయిన్ను పురిగొల్పుతారు. అంతేకాదు... ఎన్నడూ లేనివిధంగా తొలిసారి చైనాపై నాటో నిప్పులు చెరిగింది. దురాక్రమణ యుద్ధం కొనసాగించేందుకు రష్యాకు దన్నూ, ధైర్యమూ ఇస్తున్నది చైనాయేనని డిక్లరేషన్ ఆరోపించింది. నాటో ఎప్పుడూ చైనా జోలికి పోలేదు. అయిదేళ్లుగా చైనా వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. అది కూడా చాలా మర్యాదైన, మృదువైన పదాలతోనే! ఇప్పుడేమైంది? నాటో కొత్త రాగం వెనకున్న కారణమేమిటి?నిజానికి నాటో సదస్సులో ఈసారి జో బైడెన్ ఆరోగ్యం, ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ ప్రస్తావనకొస్తాయని అందరూ ఆశించారు. అమెరికా అధ్యక్ష పదవి రేసులో బైడెన్ ఆరోగ్యం ప్రధాన అంశంగా మారింది. ఆయన కొనసాగితే ఓటమి ఖాయమని డెమాక్రాట్లు నిర్ణయానికొచ్చారు. సర్వేలు సైతం రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ బలపడుతున్న వైనాన్ని ఏకరువు పెడుతున్నాయి. అందుకే నాటో స్వరం మారిందని విశ్లేషకుల ఆరోపణ. ట్రంప్ వస్తే నాటో ఉనికే ప్రశ్నార్థకం కావటం ఖాయం. ఉక్రెయిన్ భవిష్యత్తు అనిశ్చితం. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ వల్ల ఇంతవరకూ 1,86,000 మంది పౌరులు మరణించారని లాన్సెట్ నివేదిక అంచనా. ఈ నేపథ్యంలో ఆ యుద్ధాన్ని నివారించటంపై నాటో దృష్టి పెడుతుందని అందరూ అంచనా వేయగా, తీరా దాని గురి చైనా వైపు మళ్లింది! మరోపక్క భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ... ఘర్షణల సమయంలో ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ ఉండదంటూ పరోక్షంగా మనల్ని హెచ్చరించారు. ‘అవసర సమయాల్లో’ భారత్, అమెరికాలు సమష్టిగా పనిచేయాల్సి వుంటుందని చెప్పారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై లోపాయికారీగా మన అధికారుల వద్ద అమెరికా అసంతృప్తి వ్యక్తంచేసినట్టు కథనాలొచ్చాయి. గార్సెటీ దాన్నే బహిరంగంగా చెప్పారు. రెండేళ్లక్రితం తాను చెప్పిందేమిటో అమెరికాకు గుర్తుందా? ఉక్రెయిన్కు చేయూతగా పోలాండ్ నుంచి మిగ్–29 యుద్ధ విమానాలను రంగంలోకి దించటానికి గ్రీన్సిగ్నల్ ఇస్తామని 2022 మార్చిలో అమెరికా విదేశాంగమంత్రి బ్లింకెన్ చేసిన ప్రకటనను అమెరికా రక్షణ శాఖ తప్పుబట్టింది. ఇందువల్ల రష్యా తీవ్రంగా ప్రతిస్పందించే ప్రమాదం వుంటుందని పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ హెచ్చరించారు. ఆ సమయంలోనే జో బైడెన్ సైతం ఉక్రెయిన్ గగనతలంపై నాటో నో ఫ్లైజోన్ విధించాలన్న ప్రతిపాదనను కొట్టిపడేశారు. దాన్ని అమలు చేయటానికి నాటో నేరుగా యుద్ధరంగంలోకి దిగాల్సివస్తుందని చెప్పారు. మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభించాలని అమెరికా భావించటం లేదని అన్నారు. ఆఖరికి నాటోలో ప్రధాన భాగస్వాములైన జర్మనీ, ఫ్రాన్స్ సైతం అదే ఉద్దేశంతో ఉన్నాయి. నిరుడు ఫిబ్రవరిలో ఒక విందు సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి జర్మనీ చాన్సలర్ ఓలోఫ్ షుల్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియేల్ మేక్రాన్లు హితవు చెప్పారు. ‘ఈ యుద్ధంలో మీరు ఓడిపోబోతున్నారు. కనుక రష్యాతో చర్చలకు సిద్ధపడి సంధి చేసుకోవటం అత్యుత్తమం’ అని సలహా ఇచ్చారు. హిట్లర్ కాలంలో జర్మనీ తమ దేశాన్ని దురాక్రమించినా ఆ తర్వాత జర్మనీ, ఫ్రాన్స్లు రెండూ పాత వైరాన్ని మరిచిపోయిన సంగతిని గుర్తుచేశారు. ‘నువ్వు గొప్ప యుద్ధ వీరుడివే కావొచ్చుగానీ... ఈ వైరంలో రాజనీతిజ్ఞత అవసరం.నొప్పి కలిగించినా కష్టమైన నిర్ణయం తీసుకోవటానికి సిద్ధపడాలి’ అని జెలెన్స్కీకి మేక్రాన్ హితబోధ చేశారు. అవన్నీ ఏమైనట్టు? నాటో పుట్టిననాటి నుంచి దాన్ని కొనసాగించటానికి అమెరికా సాకులు వెదుకుతూనే వుంది. సోవియెట్ యూనియన్ పెను భూతమనీ, అది యూరప్ను కబళించబోతున్నదనీ ఊదరగొట్టి ఏర్పరిచిన నాటో ఉనికిని కాపాడేందుకు పడరాని పాట్లు పడుతోంది. 1989లో పనామా పాలకుడు నొరీగా, 1999లో సెర్బియా పాలకుడు స్లోబోదన్ మైలోసెవిక్, 2003లో ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్లు ప్రపంచాన్ని కబళించటానికి సిద్ధంగావున్న హిట్లర్లుగా చిత్రీకరించి ఆ దేశాలపై అమెరికా, నాటో దళాలు విరుచుకుపడి గుల్లచేశాయి. లక్షలాదిమంది అమాయక పౌరులు బలయ్యారు. ఇన్నాళ్లకు నాటోకు యూరప్లో పుతిన్ రూపంలో శత్రువు ‘తారసపడ్డాడు’. ఆ లంపటంలోకి ప్రపంచ దేశాలన్నిటినీ దించి లోకరక్షకుడిగా ఆవిర్భవించాలని అమెరికా తలపోస్తున్నట్టు కనబడుతోంది. రష్యా అణ్వాయుధాల ప్రయోగానికి దిగదని అమెరికా, నాటోలు నమ్ముతున్నట్టున్నాయి. ఇలాంటి తప్పుడు సూత్రీకరణలతో, అసంబద్ధ అంచనాలతో ప్రపంచాన్ని యుద్ధంలోకి నెడితే ఊహకందని పర్యవసానాలు ఏర్పడే ప్రమాదముంది. అగ్రరాజ్యాలు విజ్ఞతతో మెలిగి ఉక్రెయిన్, రష్యాల మధ్య సంధికి ప్రయత్నించాలి. ఆ మేరకు ప్రపంచ ప్రజానీకం ఒత్తిడి తేవాలి. -
NATO: విధ్వంసకారి చైనా
వాషింగ్టన్/బీజింగ్: చైనా–రష్యా దేశాల మధ్య బంధం నానాటికీ బలపడుతుండడం పట్ల నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) సభ్యదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం పేరిట ఉక్రెయిన్లో విధ్వంసానికి రష్యాకు చైనా అండదండలు అందిస్తోందని మండిపడ్డాయి. డ్రాగన్ దేశం నిర్ణయాత్మక విధ్వంసకారిగా మారిందని ఆరోపించాయి. రష్యాతో భాగస్వామ్యానికి ఎలాంటి పరిమితులు లేవంటూ చైనా నాయకత్వం చేసిన ప్రకటనలను నాటో దేశాలు ప్రస్తావించాయి. రష్యా రక్షణ పారిశ్రామిక రంగానికి చైనా పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తోందని, దీనివల్ల రష్యా పొరుగు దేశాలతోపాటు యూరో–అట్లాంటిక్ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో నాటోలోని 32 సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు సమావేశమయ్యారు. కూటమి 75వ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. కూటమిలో 32వ సభ్యదేశంగా చేరిన స్వీడన్కు సాదర స్వాగతం పలికారు. భేటీ అనంతరం ‘వాషింగ్టన్ సమ్మిట్ డిక్లరేషన్’ పేరిట ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. చైనా దుందుడుకు విధానాలు, చర్యలు తమ ప్రయోజనాలకు, భద్రతకు, విలువలకు సవాలు విసిరేలా ఉంటున్నాయని మండిపడ్డారు. రష్యాకు మద్దతిస్తే చైనాకే నష్టం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన చైనా బాధ్యతాయుతంగా మసలుకోవాలని నాటో సభ్యదేశాల ప్రతినిధులు హితవు పలికారు. ఉక్రెయిన్లో అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న రష్యాకు సహకరించుకోవడం తక్షణమే నిలిపివేయాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి చార్టర్కు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత చైనాపై ఉందని పునరుద్ఘాటించారు. రష్యాకు ఆయుధపరంగా, రాజకీయంగా ఎలాంటి సహకారం అందించవద్దని స్పష్టం చేశారు. రష్యాను గుడ్డిగా వెనుకేసుకొస్తే చైనాయే నష్టపోతుందని, ప్రపంచంలో ఏకాకిగా మారుతుందని తేలి్చచెప్పారు. రష్యా–చైనా–ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహ సంబంధాలు కొత్త చివుళ్లు తొడుగుతున్న నేపథ్యంలో దానికి ప్రతిచర్యగా ఇండో–పసిఫిక్ దేశాలతో భాగస్వామ్యాన్ని మెరుగుపర్చుకుంటామని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ప్రకటించారు. అలజడి యత్నాలు మానుకోండి: చైనా ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో చైనా విధ్వంసకారిగా మారిందంటూ నాటో కూటమి నేతలు చేసిన విమర్శలను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ గురువారం ఖండించారు. సొంత భద్రత కోసం ఇతర దేశాల ప్రయోజనాలను బలిపెట్టడం నాటో దేశాలకు అలవాటేనని విమర్శించారు. ఆసియాలో అలజడి సృష్టించాలన్న ప్రయత్నాలు మానుకోవాలని చెప్పారు.నాటో సభ్య దేశాలు ఇవి...1.అమెరికా, 2.యునైటెడ్ కింగ్డమ్, 3.అల్బేనియా, 4.బెల్జియం, 5.బల్గేరియా, 6.కెనడా, 7.క్రొయేíÙయా, 8.చెక్రిపబ్లిక్, 9.డెన్మార్క్, 10.ఎస్తోనియా, 11.ఫిన్లాండ్, 12.ఫ్రాన్స్, 13.జర్మనీ, 14.గ్రీస్, 15.హంగేరీ, 16.ఐస్లాండ్, 17.ఇటలీ, 18.లాతి్వయా, 19.లిథువేనియా, 20.లక్సెంబర్గ్, 21.మాంటెనిగ్రో, 22.నెదర్లాండ్స్, 23.నార్త్ మాసిడోనియా, 24.నార్వే, 25.పోలాండ్, 26.పోర్చుగల్, 27.రొమేనియా, 28.స్లొవాకియా, 29.స్లొవేనియా, 30.స్పెయిన్, 31.స్వీడన్, 32.తుర్కియే -
భారత్–రష్యా సాన్నిహిత్యం
దౌత్య ప్రపంచంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు. పర్యటనలైనా, ప్రసంగాలైనా, సమావేశాలైనా, ఒప్పందాలైనా– దేశాల ప్రయోజనాలతో ముడిపడివుంటాయి. సమయం, సందర్భం తప్పనిసరిగా ఉంటాయి. తమ ఆలోచనలేమిటో నిక్కచ్చిగా చెప్పడం కూడా వీటి ఉద్దేశం కావొచ్చు. ప్రధాని మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాక తన తొలి విదేశీ పర్యటన కోసం ఇరుగు పొరుగు దేశాలను సందర్శించే ఆనవాయితీని పక్కనబెట్టి రష్యాను ఎంచుకున్నారు. రెండు రోజుల ఆ పర్యటన మంగళ వారం ముగియబోతుండగా అమెరికా ప్రాపకంతో 75 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన సైనిక కూటమి నాటో వజ్రోత్సవాలు వాషింగ్టన్లో మొదలయ్యాయి. ఇవి మూడురోజులపాటు సాగుతాయి. రష్యా పూర్వరూపమైన సోవియెట్ యూనియన్కు వ్యతిరేకంగా నాటో ప్రారంభమైంది. కనుక మోదీ రష్యా పర్యటన సహజంగానే అమెరికాకు కంటగింపుగా ఉండొచ్చు. ఈ పర్యటన ‘శాంతి ప్రయత్నాలకు’ తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. పైగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాధినేత అత్యంత క్రూరుడైన నేరగాణ్ణి హత్తుకోవటం ఏమిటని విమర్శించారు. జెలెన్స్కీ చెబుతున్న శాంతి ప్రయత్నాలేమిటో ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తెలిసిందల్లా రష్యాను ఎదుర్కొనటానికి యుద్ధం మొదలైననాటి నుంచీ ఉక్రెయిన్కు అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎడాపెడా ఆయుధాలు, డబ్బు సరఫరా చేయటం. అందువల్లే ఆ ఘర్షణ ఎడతెగకుండా సాగుతోంది. ఇందులో శాంతి ప్రసక్తి ఎక్కుడుందో అర్థంకాదు. రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ఖండించాల్సిందే. కానీ ఇందులో ఉక్రెయిన్ బాధ్యత కూడా ఉంది. దాని సంగతలావుంచితే భారత–రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధానంగా మోదీ రష్యా వెళ్లారు. ఈ సందర్భంగా వివిధ ఒప్పందాలు కూడా కుదిరాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, మోదీకి తమ అత్యున్నత పౌర పురస్కారాన్ని కూడా అందజేశారు. అయితే మంగళవారం ఉక్రెయిన్ రాజధాని కియూవ్లో ఒక ఆసుపత్రిపై జరిగిన క్షిపణి దాడిలో 37 మంది చనిపోయిన ఉదంతాన్ని ఖండించటానికి మోదీ వెనకాడలేదు. రష్యాతో మనకున్న మైత్రి ఈనాటిది కాదు. ఆ మైత్రికి ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. మోదీ అన్నట్టు రష్యా అన్ని కాలాల్లోనూ దృఢంగా మన వెనక నిలబడింది. స్నేహ హస్తం అందించింది. 1971లో పాకిస్తాన్తో మనకు యుద్ధం వచ్చినప్పుడు అన్నివిధాలా ఆదుకుంది. ఆ యుద్ధంలో మనం సాధించిన విజయంలో సోవియెట్ పాత్ర కీలకమైనది. మన అమ్ములపొదిలో ఉన్న రక్షణ పరికరాల్లో అత్యధిక భాగం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకున్నవే. ఇది కేవలం కొనుగోలుదారు– అమ్మకందారు సంబంధం కాదు. పరిశోధన, అభివృద్ధితో మొదలెట్టి ఉమ్మడి ఉత్పత్తుల వరకూ ఇరు దేశాలూ సహకరించుకుంటున్నాయి. మనకున్న రెండు విమానవాహక నౌకల్లో ఒకటి రష్యానుంచి వచ్చినదే. ఇంకా ఎస్–400 గగనతల రక్షణ క్షిపణి వ్యవస్థ, మిగ్–29, ఎస్యూ–30 ఎంకెఐ యుద్ధ విమానాలు, సైనిక హెలికాప్టర్లు, ఏకే–203 రైఫిళ్లు, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు తదితరాలున్నాయి. ఇవిగాక తన టీ–90 శతఘ్నుల ఉత్పత్తికి మనకు అనుమతులిచ్చింది. విడి భాగాల దగ్గర్నుంచి నూతన పరిశోధనల వరకూ మన రక్షణ వ్యవస్థ పూర్తిగా రష్యాతో ముడిపడివుంది. అణు విద్యుత్ కర్మాగారాల స్థాపన, నిర్వహణలో తోడ్పడుతోంది. ఇరవై అయిదేళ్ల క్రితం మనకు అమెరికాతో కూడా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ తదితర దేశాల నుంచి కూడా మనం రక్షణ పరికరాలు కొనుగోలు చేస్తున్నాం. మనను రష్యాకు దూరం చేయాలని ఆది నుంచీ అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాకైతే ఇది మరింతగా పెరిగింది. ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి వంటి అంతర్జాతీయ సంస్థల్ని బేఖాతరుచేసి ఘర్షణలు నివారించే పేరుమీద అమెరికా ఒక పక్షాన్ని సమర్థించటం, అవతలిపక్షంతో ఎవరూ సాన్నిహిత్యం నెరపకూడదని ఫర్మానా జారీచేయటం ఆశ్చర్యకరం. వాస్తవా ధీన రేఖ వద్ద చైనాతో మనకు అయిదేళ్లుగా లడాయి నడుస్తోంది. ఆ దేశంతో ఘర్షణలు వస్తే మనకు రష్యా నుంచి రక్షణ పరికరాలు, విడిభాగాలు అత్యవసరమవుతాయి. అంతేకాదు... రక్షణ సాంకేతి కతలు చైనాకు పోకుండా చూడటం మనకు ముఖ్యం. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రయోజనాలూ వదులుకుని తాను చెప్పినట్టల్లా నడుచుకోవాలని అమెరికా భావించటం ఎంతమాత్రం సరికాదు. పాకిస్తాన్తో మనకున్న సమస్యల విషయంలో ఏనాడూ అమెరికా సానుభూతిగా లేదు. కంటితుడుపు చర్యలు తీసుకోవటం, ఏదో వంకన ఆ దేశానికి సైనిక, ఆర్థిక సాయం అందించటం అమెరికాకు రివాజుగా మారింది. మనం మాత్రం తన ఫర్మానాలు పాటించాలని ఆ దేశం ఆశిస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక రష్యా నుంచి ముడి చమురు దిగుమతి వద్దన్న అమెరికా ఒత్తిడిని కాదని, రోజుకు 21 లక్షల బ్యారెళ్ల చొప్పున దిగుమతి చేసుకుంటున్నాం. చౌకగా లభించే ఆ ముడి చమురు వల్ల మనం లాభపడటం మాట అటుంచి ప్రపంచ చమురు మార్కెట్ స్థిరత్వం సాధించింది. వర్తమాన సంక్లిష్ట పరిస్థితుల్లో రష్యాతో సాన్నిహిత్యం ఇబ్బందికరమే అయినా, దేశ ప్రయోజనాల రీత్యా దాన్ని కొనసాగించాలనుకున్న మన దేశ వైఖరి మెచ్చదగినది. ఏదేమైనా రెండు దేశాల మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలను మూడో దేశం ప్రభావితం చేయాలనుకోవటం, వాటిని తెంచుకోవాలని ఒత్తిడి తీసుకురావటం మంచి సంప్రదాయం కాదు. తన పర్యటన ద్వారా అమెరికాకు ఈ సంగతిని స్పష్టం చేసిన ప్రధాని మోదీ చర్య ప్రశంసించదగ్గది. -
వృద్ధ జంబూకం ‘నాటో’
రెండు ఖండాలను కలుపుతూ ప్రపంచానికి శాంతినీ, సుస్థిరతనూ, రక్షణనూ వాగ్దానం చేస్తూ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో ఏర్పడిన నాటో కూటమి గురువారం తన 75 వసంతాల సంబరాలను జరుపుకొంది. అయితే ప్రకటిత సంకల్పానికీ, దశాబ్దాల దాని ఆచరణకూ ఎక్కడా పొంతన కనబడదు. నాటో నేపథ్యం, దాని ఉద్దేశాలు పూర్తిగా కొట్టిపారేయదగ్గవి కాదు. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ సైన్యాన్ని మట్టికరిపించిన సోవియెట్ యూనియన్ సేనలు తూర్పు యూరప్ దేశాల్లో తిష్ఠవేసి కదల్లేదు. అవి తమవైపు చొచ్చుకు రావొచ్చన్న సందేహం పశ్చిమ యూరప్ దేశాలకుంది. తాము ఒక్కటై ఎదిరించకపోతే దురాక్రమణకు బలి కావటం ఖాయమన్న భయం వాటికి పట్టుకుంది. నాటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ దీన్ని చక్కగా వినియోగించుకుని ఉత్తర అమెరికా ఖండంలో తన పొరుగు దేశమైన కెనడాను కలుపుకొని పశ్చిమ యూరప్ దేశాలతో జతకట్టి పటిష్ఠమైన సైనిక కూటమి నాటోకు అంకురార్పణ చేశారు. సోవియెట్ సేనలకు వ్యతిరేకంగా దృఢమైన సైనిక కుడ్యం ఏర్పర్చటమే దీని ప్రధాన ధ్యేయం. నాటో దేశాలు రోజూ పరస్పరం సంభాషించుకుంటాయని, పరిస్థితులను సమీక్షించుకుంటూ నిరంతర సంసిద్ధ తలో వుంటాయని, తగిన నిర్ణయాలు తీసుకుంటాయని నాటో వెబ్సైట్ ఘనంగా చెబుతోంది. మంచిదే. కానీ ఇన్నేళ్ల దాని ఉనికిలో ఒక్కసారైనా సోవియెట్ యూనియన్ నుంచీ లేదా దాని ప్రస్తుత రూపమైన రష్యా నుంచీ ప్రత్యక్షంగా కావొచ్చు... పరోక్షంగా కావొచ్చు ఏనాడూ సవాళ్లు ఎదురు కాలేదు. సైనిక కూటమి ఆవిర్భావం దానికదే ప్రత్యర్థిని హద్దు మీరకుండా చేసివుండొచ్చన్న వాదన కూడా కొట్టి పారేయలేం. కానీ నాటో హడావిడి గమనించాక 1955లో సోవియెట్ యూనియన్ సైతం తన ఆధ్వర్యంలోని తూర్పు యూరప్ దేశాలను కలుపుకొని వార్సా కూటమి పేరుతో మరో సైనిక కూటమి నిర్మించింది. ఇరుపక్షాలూ అణ్వాయుధాలనూ, ఇతర భారీ ఆయుధ సామగ్రిని మోహరించటంతో ప్రచ్ఛన్న యుద్ధ దశలో యూరప్ ఖండం మొత్తం నిరంతర యుద్ధ భయంతో వణికింది. మరి ప్రపంచ శాంతి, సుస్థిరతల జాడెక్కడ? పరస్పర మోహరింపులతో నెలకొన్న ఒక రకమైన స్తబ్దతను శాంతిగా భావించటం సాధ్య మేనా? నాటో అంచనాకు తగ్గట్టు సోవియెట్ సేనలు దండయాత్రలు చేయకపోలేదు. 1956లో హంగరీ, 1968లో జెకొస్లోవేకియా, 1979లో అఫ్గానిస్తాన్ దేశాలను అవి దురాక్రమించాయి. కానీ యూరప్ ఖండంలోని తటస్థ దేశాలు ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, యుగోస్లేవియా, ఆస్ట్రియా వైపుగానీ... నాటో దేశాలవైపుగానీ చొచ్చుకొచ్చే ఆలోచన చేయలేదు. నిజానికి తాను కూడా నాటోలో చేరతానన్న సోవియెట్ యూనియన్ వినతిని 1954లో తోసిపుచ్చాకే వార్సా కూటమి ఏర్పడింది. 1989లో సోవియెట్ పతనం, అంతకుముందే తూర్పు యూరప్ దేశాలు ఒక్కొక్కటిగా దాన్నుంచి దూరం జరగటం, వార్సా కూటమి కనుమరుగవటం వంటి పరిణామాల తర్వాత వాస్తవానికి నాటో అవసరం ఎంతమాత్రం లేదు. చిత్రం ఏమంటే... సోవియెట్ పతనానికి బాటలు పరిచిన నాటి అధ్యక్షుడు గోర్బచెవ్, ఆ తర్వాతకాలంలో ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం నాటోలో చేరటా నికి సిద్ధపడ్డారు. కానీ ఆ ప్రతిపాదనను నాటో తోసిపుచ్చింది. అంతేకాదు... ఉభయ జర్మనీల విలీ నానికి సహకరించాలంటూ పశ్చిమ యూరప్ దేశాల నేతలు గోర్బచెవ్ను అర్థించినప్పుడు ఆయన కొక హామీ ఇచ్చారు. నాటోను ఒక్క అంగుళం కూడా విస్తరించబోమన్నదే ఆ హామీ సారాంశం. కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. సోవియెట్ పతనం నాటికి నాటో సభ్య దేశాలు 16 కాగా, రష్యా అభ్యంతరాలనూ బేఖాతరు చేస్తూ మరో 15 దేశాలను చేర్చుకున్నారు. ఇందులో పూర్వపు వార్సా కూటమి దేశాలున్నాయి. కనీసం తన ఇరుగు పొరుగు దేశాలకు సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా ప్రతి పాదన సైతం బుట్టదాఖలా అయింది. పొరుగునున్న కెనడా, మెక్సికో దేశాలకు వార్సా కూటమి సభ్యత్వం ఇస్తే అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? నాటో పుట్టుకకు దారితీసిన మూలకారణమే మాయమైనప్పుడు విశాల యూరప్ భద్రత కోసం ఒక నూతన వ్యవస్థ ఏర్పాటు చేయటానికి బదులు రష్యాను ఏకాకి చేయాలన్న వ్యూహం వెనకున్న విజ్ఞతేమిటో ఆ కూటమి నేతలు చెప్పగలరా? నిజానికి నాటో చిత్తశుద్ధితో విశాల యూరప్ భద్రతపై దృష్టి సారించివుంటే పుతిన్ ఉక్రెయిన్ దురాక్రమణకు సాహసించేవారు కాదు. యూరప్ ఖండంలో అణ్వాయుధాల బెడద పూర్తిగా సమసిపోయేది. అసలు ప్రపంచ శాంతి, సుస్థిరతలకు దోహదం కలగటం మాట అటుంచి నాటో వల్ల ప్రపంచానికి వచ్చిన సమస్యలే అధికం. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ 200 సైనిక ఘర్షణలు చోటు చేసుకోగా అందులో 20 వరకూ విస్తృతమైనవి. వెళ్లినచోటల్లా విధ్వంసమే తప్ప నాటో సాధించిందేమీ లేదు. ఇందుకు లిబియా, సిరియా, అఫ్గానిస్తాన్, సూడాన్, సోమాలియా వగైరాలను ఉదా హరించవచ్చు. స్థానిక ప్రభుత్వాలను కూలదోసేందుకు విచ్చలవిడిగా మిలిటెంట్ సంస్థలకు నాటో ఆయుధాలందించటం పర్యవసానంగా ఐసిస్ అనే భయంకర ఉగ్రవాద సంస్థ పురుడుపోసుకుంది. కనిపించని శత్రువుపై కత్తి ఝుళిపించటం కోసం నాటో సభ్యదేశాల్లో ప్రతి ఒక్కటీ తమ జీడీపీల్లో 2 శాతం నాటోకు అర్పిస్తున్నాయి. తన ఉనికి కోసం శత్రువును ‘సృష్టించుకునే’ ధోరణి నుంచి నాటో బయటపడనంతకాలం ఈ పరిస్థితి మారదు. ప్రపంచంలో శాశ్వత శాంతి కోసం ప్రయత్నించ టమా... నిరంతరం యుద్ధ భయంతో అణ్వాయుధాల నీడలో మనుగడ సాగించటమా అన్నది యూరప్ దేశాల ప్రజలే తేల్చుకోవాలి. -
రష్యాతో నాటో ఘర్షణకు దిగితే... మూడో ప్రపంచ యుద్ధమే
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. ‘‘అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరు’’ అన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కదనరంగంలోకి ఫ్రాన్స్ బలగాలను దింపే ఉద్దేశముందన్న ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలపై పుతిన్ ఇలా స్పందించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లిష్, ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఇది సరికాదు’’ అన్నారు. చర్చలకు సదా సిద్ధం ఉక్రెయిన్ సైన్యం దాడులు ఇలాగే కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్ను సృష్టిస్తామని పుతిన్ అన్నారు. ‘‘దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మేం మొదట్నుంచీ చెబుతున్నాం’’ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగలేదన్న అమెరికా, పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోనే ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2030 దాకా అధ్యక్ష పీఠంపై రష్యా రాజకీయ వ్యవస్థపై పుతిన్ పట్టు మరోసారి రుజువైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్ల) ఓట్లు ఆయనకు పడ్డట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. పుతిన్కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఆరేళ్లపాటు, అంటే 2030 దాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత సుధృఢంకావాలని అభిలషించారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, ఉత్తరకొరియా పాలకుడు కిమ్, హోండురాస్, నికరాగ్వా, వెనిజులా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలూ పుతిన్కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమదేశాలు మాత్రం ఈ ఎన్నికలు పెద్ద మోసమని విమర్శించాయి. నవాల్నీని వదిలేద్దామనుకున్నాం.. దివంగత విపక్ష నేత అలెక్సీ నవాల్నీ ప్రస్తావనను పుతిన్ తొలిసారిగా బహిరంగంగా తెచ్చారు. ‘‘ఖైదీల మార్పిడిలో భాగంగా నవాల్నీని విదేశాలకు అప్పగించి పశ్చిమదేశాల జైళ్ల నుంచి రష్యన్లను వెనక్కు తెద్దామని మా అధికారుల సలహాకు వెంటనే ఒప్పుకున్నా. ఆ లోపే ఆయన జైల్లో చనిపోయారు. కొన్ని అలా జరుగుతాయంతే. ఇదే జీవితం’’ అన్నారు. -
అడుగు దూరంలో వరల్డ్ వార్-3.. హెచ్చరించిన పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలోనే ఉందని పశ్చిమ దేశాలను పుతిన్ హెచ్చరించారు. ఇక, తాజాగా జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్ భారీ మెజార్టీతో మరోసారి ఆ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దాదాపు 88శాతం ప్రజల మద్దతుతో ఆయన రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉంది. రష్యా, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికీ మధ్య ఘర్షణ తలెత్తితే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. అయితే దీన్ని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. ఇదే సమయంలో భవిష్యత్తులో తమ సైన్యాన్ని ఉక్రెయిన్కు పంపుతామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యలను పుతిన్ తప్పుబట్టారు. ఇక, మార్చి 15 నుంచి 17 మధ్య రష్యా ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసింది. సరిహద్దు ప్రాంతాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్లోని ఖార్కివ్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం అవసరమని మీరు భావిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు పుతిన్.. దాడులు ఇలాగే కొనసాగితే తమ భూభాగాన్ని రక్షించడానికి రష్యా మరింత ఉక్రేనియన్ భూభాగం నుంచి బఫర్ జోన్ను సృష్టిస్తుందని చెప్పారు. ఇది చదవండి: రష్యా అధ్యక్ష ఎన్నికలు.. పుతిన్ ఘన విజయం ఉక్రెయిన్లో నాటో సైనిక సిబ్బంది ఇప్పటికే ఉన్నారని, రష్యా యుద్ధభూమిలో ఇంగ్లిష్, ఫ్రెంచ్ దళాలు తలపడుతున్నాయి. ఇందులో వారికి ఎటువంటి మంచి జరగడం లేదు.. ఎందుకంటే వారు అక్కడ పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని అన్నారు. ఈ రోజు జరుగుతున్న విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, కీవ్ పాలనలోని భూభాగాల్లో ఒక నిర్దిష్ట 'శానిటరీ జోన్'ని సృష్టించడానికి మేము ఏదో ఒక సమయంలో బలవంతపు చర్యలు చేపడతామని పుతిన్ చెపుకొచ్చారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించడానికి మాత్రం పుతిన్ నిరాకరించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్లో యుద్ధాన్ని తీవ్రతరం చేయడాన్ని మెక్రాన్ ఆపివేసి.. శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించాలని తాను కోరుకుంటున్నానని పుతిన్ అన్నారు.. ‘నేను పదే పదే చెబుతున్నాను.. నేను మళ్లీ అదే చెబుతాను.. మేము శాంతి చర్చల కోసం ఉన్నాం.. కానీ శత్రువుల తూటాలు అయిపోతున్నందుకు కాదని వ్యాఖ్యలు చేశారు. -
నాటోలో స్వీడన్ చేరికకు తుర్కియే ఆమోదం
అంకారా: నాటోలో స్వీడన్ సభ్యత్వానికి తుర్కియే గురువారం అధికారికంగా ఆమోదం తెలిపింది. హంగేరీ కూడా ఓకే చెబితే నార్డిక్ దేశం స్వీడన్ నాటో దేశంగా మారిపోనుంది. ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనకు తుర్కియే పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే ఫిన్లాండ్ సభ్యత్వానికి మాత్రమే సమ్మతం తెలిపింది. స్వీడన్ సభ్యత్వంపై అభ్యంతరం తెలుపుతూ వస్తోంది. వాటికి కూడా తగు పరిష్కారం దొరకడంతో తాజాగా ఆమోదం తెలిపింది. ఇక, నాటోలో స్వీడన్ చేరికపై హంగరీ పార్లమెంట్లో ఫిబ్రవరి ఆఖరులో చర్చించొచ్చని భావిస్తున్నారు. -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందటే..
ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఇప్పటికి ఏడాదిన్నర పైబడింది. అయినా కూడా అక్కడ యుద్ధం సద్దుమణిగే పరిస్థితులైతే కనుచూపుమేరలో కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో కూడా ఇదే అభిప్రాయం నెలకొందని ఉక్రెయిన్లో యుద్ధం ఇప్పటిలో ఆగదని సుదీర్ఘంగా కొనసాగుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టన్బెర్గ్. ఏడాదిన్నర పైబడింది.. ఫిబ్రవరి 2022లో మాస్కో ఉక్రెయిన్కు బలగాలను పంపడంతో మొదలైన యుద్ధంలో ఉక్రెయిన్ మొదట్లో అంత దూకుడుగా వ్యవహారింకపోయినా జూన్ నుంచి మాత్రం దూకుడు పెంచి ప్రతిదాడులు కూడా మొదలు పెట్టిందని ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశముందని అన్నారు నాటో చీఫ్ స్టోల్టన్బెర్గ్. చాలా వరకు యుద్ధాలు మొదలైనప్పుడు ఊహించినదానికంటే ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటాయని చెబుతూనే వీలైనంత తొందరగా అక్కడ శాంతి స్థాపించబడాలని కోరుకుంటున్నానన్నారు. ఆపితే అంతే సంగతులు.. యుద్ధంలో వ్లాదిమిర్ జెలెన్స్కీ గానీ ఉక్రెయిన్ గానీ పోరాడకపోతే ఆ దేశం తుడిచి పెట్టుకుపోతుందనడంలో సందేహమే లేదు. ఎప్పుడైతే రష్యా ఆయుధాలను విడిచిపెడుతుందో అప్పుడే యుద్ధం సద్దుమణుగుతుందని అన్నారు. ఇక ఉక్రెయిన్ నాటో సభ్యత్వం గురించి ప్రస్తావిస్తూ ఉక్రెయిన్ నాటోలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని క్యివ్ ఇప్పటికే నాటోకు చాలా దగ్గరైందని అన్నారు. యుద్ధం ముగిశాక ఉక్రెయిన్కు అన్నివిధాలా భద్రతా భరోసా కల్పించాలని అన్నారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రూ.330 -
వినాశకర సాటన్-ll మిసైల్ను బయటకు తీసిన రష్యా.. ఏమీ మిగలదు!
మాస్కో: రష్యా అత్యంత వినాశకరమైన అణుక్షిపణి (సర్మాత్)సాటన్-ll ను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణి విజయవంతమైనప్పుడు దీని గురించి చెబుతూ.. ఇకపై మాతో కయ్యానికి కాలు దువ్వే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిదని ప్రత్యర్థులను హెచ్చరించారు. తాజాగా ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఈ క్షిపణిని బయటకు తీయడం చర్చనీయాంశమైంది. శుక్రవారం సాటన్-llగా పిలవబడే ఈ సర్మాత్ ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ను రష్యా సైన్యం బయటకు తీసినట్లు రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కాస్మోస్ ప్రకటించింది. ఈ మేరకు రోస్కాస్మోస్ జనరల్ డైరెక్టర్ యూరి బోరిసోవ్ సాటన్-ll విధినిర్వహణకు సిద్ధమైందని ప్రకటించారు. అసలేంటి సాటన్-ll ప్రత్యేకత.. సాటన్-ll మిసైల్ పొడవు 116 మీటర్ల. 220 టన్నులు బరువుండే ఈ మిసైల్ 10-15 వార్హెడ్లను అమర్చే వీలుంటుంది. అందుకే ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సులువుగా ఛేదిస్తుంది. శత్రువుల రాడార్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు ఈ మిసైల్ను గుర్తించే లోపే ఇది లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సాటన్-ll గంటకు 10 వేల నుంచి 18 వేల కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. ఐరోపాలోని ఏ ప్రాంతానికైనా ఇది కేవలం 3 నిమిషాల్లోపే చేరుకోగలదు. ఇక అగ్రరాజ్యం అమెరికా చేరుకోవడానికి ఈ క్షిపణికి కేవలం 14 నిముషాలు మాత్రమే పడుతుంది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలై ఏడాదిన్నర పైబడిండి. ఇప్పటికీ యుద్ధం ఒక కొలిక్కి రాకపోగా ఉక్రెయిన్ రష్యా దాడులను సమర్ధవంతనగానే తిప్పికొట్టింది. ఇక ఇప్పుడైతే అమెరికా అండదండలతో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తూ రష్యా సేనలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యుద్ధప్రారంభంరోజుల్లో రష్యా స్వాధీనం చేసుకున్న ఒక్కో ప్రాంతాన్ని తిరిగి తన వశం చేసుకుంటోంది. ఇప్పటికే డిఫెన్స్లో పడిన రష్యా సేనలు ఈ నేపథ్యంలోనే ఈ భయానక మిసైళ్లను బయటకు తీసిందని చెప్పేవారు లేకపోలేదు. మరోపక్క రష్యా ఈ క్షిపణిని నాటో సంస్థ మూలస్థంభాలైన అమెరికా, యూకెలపై మాత్రమే ప్రయోగించడానికి సిద్ధం చేసిందనే వారూ ఉన్నారు. ఏదైతేనేం ప్రస్తుతానికైతే రష్యా తన అమ్ములపొదిలోని అత్యంత భయంకరమైన మిసైళ్లను బయటకు తీసి కీలక ప్రాంతాల్లో మోహరించింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతీయ టీవీ ఛానల్లో ప్రసంగిస్తూ.. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి మాకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని అన్నారు. అందులో భాగంగానే ఈ చర్యకు ఉపక్రమించారని మాత్రం అర్ధమవుతోంది. BREAKING: Putin has put the ‘Satan-2’ nuclear weapon on combat duty for the first time Putin unveiled the RS-28 Sarmat rocket system along with five other weapons in this video at a conference in March 2018 Putin claimed the Sarmat can fly a trajectory over the South Pole and… pic.twitter.com/otKqUi6uIw — Liam McCollum (@MLiamMcCollum) September 1, 2023 ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. పశువుల తరహాలో నడక! -
ఈ విస్తరణ మంచిదేనా?
అనేక సందర్భాల్లో ఆగి ఆలోచించడం, జరిగిన కథను సింహావలోకనం చేసుకోవడం అత్యవసరం. వివిధ దేశాల అంతర్ ప్రభుత్వ సైనిక కూటమి ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’ (నాటో) సభ్యులు గత వారం లిథువేనియాలో ఆ పనే చేశారు. ఉక్రెయిన్పై రష్యా దాడికి 500 రోజులు పూర్తయిన వేళ బాధితదేశానికి తామిస్తున్న ఆర్థిక, సైనిక సహకారాలను పరిశీలించడానికి సమావేశ మయ్యారు. ‘నాటో’లో స్వీడన్ చేరేందుకు టర్కీ, ఆ వెంటనే హంగరీ అంగీకరించడం తాజా సమా వేశంలోని కీలక పరిణామం. అదే సమయంలో ఉక్రెయిన్ చేరికపై మాత్రం నిర్ణీత కాలవ్యవధి ఏదీ ఈ కూటమి ప్రతిపాదించ లేదు. అమెరికా అధ్యక్షుడు సాంత్వన వచనాలు పలికినా, ఇది ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీలో నిరుత్సాహం రేపింది. వెరసి, యుద్ధక్షేత్రంలో ఉక్రెయిన్ ఎదురుదాడి నిదానించిందేమో కానీ, ఆ దేశానికి వెన్నుదన్నుగా నిలిచిన పాశ్చాత్య కూటమి బలోపేతమవుతోంది. రష్యాను చక్రబంధంలో ఇరికించే ప్రయత్నం నిరంతరాయంగా సాగుతోంది. మొన్నటి దాకా స్వీడన్ చేరికను వీటో చేస్తూ టర్కీ అడ్డుకుంటోంది. ఇప్పుడు ఎత్తివేతతో స్వీడన్కు ఇక అన్ని అవరోధాలూ తొలగిపోయినట్లే! అటు రష్యాతో సుదీర్ఘమైన సరిహద్దున్న ఫిన్లాండ్, అలాగే ఇటు బాల్టిక్ సముద్రంలోని కీలకమైన గాట్లాండ్ తన చేతుల్లో ఉన్న స్వీడన్... రెండూ నాటో వైపు మొగ్గడం రష్యాకు చీకాకు పెంచే విషయమే. అసలైతే... ఫిన్లాండ్, స్వీడన్లు సాంప్రదాయికంగా సైనిక వ్యవహారాల్లో ఏ కూటమి వైపూ మొగ్గకుండా అలీన విధానాన్ని అనుసరించినవే. గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగడంతో అవి తమ వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది. 2022 మేలోనే ఫిన్లాండ్తో పాటు స్వీడన్ కూడా సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంది. మొన్న ఏప్రిల్లో ఫిన్లాండ్ ‘నాటో’లో 31వ దేశ సభ్యదేశం కాగా, త్వరలోనే స్వీడన్ 32వది కానుందన్న మాట. తాజా పరిణామాలతో ఒక విషయం అర్థమవుతోంది. బెలారుస్, ఉక్రెయిన్, జార్జియా మినహా పడమటి సరిహద్దులంతా ఇక నాటో బలగాల ఉనికితో రష్యా సర్దుకుపోక తప్పదు. అంతా అనుకు న్నట్టు జరిగి నాటో ఇలాగే విస్తరిస్తూపోతే, యూరోపియన్ ప్రపంచ భద్రతా వలయంలోనూ మరిన్ని మార్పులు తథ్యం. దశాబ్దాలుగా రక్షణ వ్యయంపై వైముఖ్యం ప్రదర్శించిన దేశాలు సైతం ఇప్పటికే తమ సైనిక సన్నద్ధతకు పదును పెట్టుకుంటున్నాయి. ‘నాటో’ను విస్తరించబోమంటూ సోవియట్ పతనకాలంలో వాగ్దానం చేసిన అమెరికా ఆ మాట తప్పి, ఉక్రెయిన్ను చేర్చుకొనేందుకు ఉత్సాహప డడమే సమస్యకు మూలమనేది రష్యా ఆరోపణ. నాటో విస్తరణతో తనకు భౌగోళిక, వ్యూహాత్మక ప్రమాదాలున్నాయనేది దాని వాదన. అందుకే కీవ్పై దాడికి తెగబడింది. ఈ రష్యా దురాక్రమణ వైఖరిని అటుంచితే దాని భయసందేహాలు సమంజసమే. ఆ సంగతి పాశ్చాత్యప్రపంచానికీ తెలుసు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఇటు పాశ్చాత్య ప్రపంచ ‘నాటో’ ఏర్పాటు, అటు దానికి ప్రతిగా సోవి యట్ యూనియన్ కూటమి ‘వార్సా’ ఒప్పందం గత చరిత్ర. సోవియన్ యూనియన్ విచ్ఛిత్తితో ‘వార్సా’నే రద్దయ్యాక, ఇప్పుడు నాటో ప్రాసంగికత, దాన్ని విస్తరించాలనే అమెరికా ఆకాంక్ష దేనికి చిహ్నమనేది కొందరి ప్రశ్న. అయితే, రష్యాతో యుద్ధం ముగిసేవరకు ‘నాటో’లో ఉక్రెయిన్ చేరిక అసాధ్యమే. స్వీయభద్రత సాకుతో రష్యా దండెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్కు అధికారికంగా సభ్యత్వమిచ్చి, మరింత కోపం తెప్పించడం తెలివైన పని కాదు. అది పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయవచ్చు. అందుకే పాశ్చాత్య లోకం కీవ్కు కావాల్సిన ఆర్థిక, సైనిక సహకారమిస్తూనే సాంకేతికంగా కూటమిలో చేర్చుకోకుండానే కథ నడిపించే పనిలో ఉంది. నాటో భేటీ అదే ధ్రువీకరించింది. మరోపక్క ఉక్రెయిన్పై దాడితో... నాటో వైపు చూస్తున్న పొరుగు దేశాలను దారికి తేవచ్చను కున్న రష్యా అధినేత పుతిన్ అంచనాలూ తప్పాయి. నాటోలో సంఘీభావాన్ని బలహీనపరచడం, రష్యా సరిహద్దుల వైపు నాటో మరింత విస్తరించకుండా ఆపడమనే లక్ష్యంలో ఆయన విఫల మయ్యారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు నాటోతో రష్యా భూ సరిహద్దు 754 మైళ్ళే. ఇవాళ అది 1584 మైళ్ళయింది. రేపు ఉక్రెయిన్ కూడా ఆ కూటమిలో చేరితే, అది మరింత పెరుగుతుంది. పెనునష్టం తెచ్చిపెట్టిన యుద్ధంతో ఉక్రెయిన్ భూభాగంలో 17 నుంచి 18 శాతం రష్యా కలుపుకో గలిగింది. ఈ కలుపుకొన్న కొద్ది ప్రాంతం సాంకేతికంగా లాభదాయకమే కానీ, అంతకన్నా విశ్వ వేదికపై వ్యూహపరంగా రష్యాకు జరిగిన నష్టమే అధికం. ఒక్కమాటలో పుతిన్ సెల్ఫ్ గోల్ చేసు కున్నారు. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలు తప్పవని తీవ్రంగా హెచ్చరించినా, ఇప్పటికే ఫిన్లాండ్, త్వరలోనే స్వీడన్ నాటోతో జట్టు కడుతున్నాయి. ఇక పుతిన్ ఏం చేస్తారో? వాస్తవానికి, ఉక్రెయిన్ యుద్ధంతో నిరంతర నాటో విస్తరణ రాజకీయ వ్యూహ అనివార్యతగా తయారైంది. కానీ, ఇది రెండంచులా పదునైన కత్తి. ఈ చర్య రష్యా పొరుగుదేశాలకే చేటు తేవచ్చు. నిత్యం సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, వివాదాలు ఏదో ఒక సమయంలో యుద్ధానికి దారి తీయ వచ్చు. పొరపాటున అది ప్రపంచ యుద్ధమైనా ఆశ్చర్యం లేదు. నిర్ణీత ప్రాంతంలో భద్రత, సుస్థిరత కోస మంటూ సైనిక కూటములలో చేరుతున్నామంటారు. తీరా ఆ కూటములు మరింత అస్థిరతకూ, భావి యుద్ధాలకు పునాదులు వేస్తున్నాయనిపిస్తుంది. నాటో విస్తరణతో ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా, ఐరోపా మాత్రం వ్యూహాత్మక సుస్థిరతను అందుకుంటున్న దాఖలాలైతే లేవు. పైపెచ్చు, అది దీర్ఘకాలిక అస్థిరత, నిరంతర అభద్రత వైపు అడుగులేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ అనుమానాల రీత్యా చూస్తే, నాటో సభ్య దేశాలు పెరగడం పాశ్చాత్య ప్రపంచానికి నిజంగా శుభప్రదమేనా అన్నది ప్రశ్న. -
Ukraine-Russia war: నాటో నాటో.. ఎప్పుడో ఎప్పుడో!
ఎస్.రాజమహేంద్రారెడ్డి: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సమావేశం ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. నాటో.. నాటో అంటూ కలవరించిన ఉక్రెయిన్ ఇప్పుడు నాటు.. నాటు అనక తప్పడం లేదు. గతేడాది మాడ్రిడ్లో జరిగిన సమావేశం అనంతరం స్వీడన్, ఫిన్లండ్లను కూటమిలో చేర్చుకుంటున్నట్టు నాటో ప్రకటించింది. ఆ రెండు దేశాలు జూలై 11, 12 తేదీల్లో లిథువేనియాలో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాయి. ఇదే బాటలో నాటో కూటమి తమను కూడా అక్కున చేర్చుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశించారు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి! ఉక్రెయిన్ భవిష్యత్తు తమతోనే ముడిపడి ఉంటుందని సమావేశం చివరి రోజు నాటో పేరుకు ఒక ప్రకటన చేసినా, ఆ భవిష్యత్తు ఎప్పుడు ఆరంభమవుతుందో మాత్రం స్పష్టం చేయలేదు. దాదాపు 500 రోజులకు పైగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు పశి్చమ దేశాలు ఆయుధ సామగ్రితో పాటు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను సమకూరుస్తూ అండగా ఉన్నప్పటికీ, ఆ సాయం వెనక ఆయా దేశాల ఊగిసలాట ధోరణి జెలెన్స్కీని కలవరపరుస్తూనే వస్తోంది. ప్రతిదానికీ చేతులు జోడించి ఎదురు చూడాల్సి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నాటో కూటమిలోకి ప్రవేశం దక్కితే ఈ అవస్థ ఉండదన్నది జెలెన్స్కీ ఆలోచన. నిజానికి నాటోలో చేరితే ఉక్రెయిన్ రక్షణ బాధ్యతను కూటమి దేశాలన్నీ సంయుక్తంగా మోయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ భవితవ్యాన్ని, రష్యాతో జరుగుతున్న యుద్ధ గమనాన్ని శాసించే నాటో సభ్యత్వ వ్యవహారంలో నిజానికి ఏం జరిగింది? ఉక్రెయిన్కు సభ్యత్వమిచ్చేందుకు ఎందుకు నాటో పచ్చజెండా ఊపలేదు? అసలు జెలెన్స్కీ ఆశించిందేమిటి? వివరాల్లోకి వెళ్దాం... అనుకున్నదొక్కటి... జెలెన్స్కీ ఏం ఆశిస్తున్నదీ సుస్పష్టం. గత సెపె్టంబరుకు ముందు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం కావాలన్న తన అభ్యర్థనను 2023 జూలైలో లిథువేనియాలో జరిగే కూటమి సమావేశంలో వ్యక్తం చేస్తానని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యల్లో మొక్కుబడితనమే తప్ప గాఢమైన కోరికేమీ ధ్వనించలేదు. ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్్క, డొనెట్స్్క, ఖెర్సన్, జపోరిజియాలను తమ భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సెపె్టంబరులో ప్రకటించగానే జెలెన్స్కీ స్వరం మారిపోయింది. నాటోలో తమకు పూర్తి సభ్యత్వమిచ్చే అంశాన్ని ఆగమేఘాల మీద పరిశీలించాల్సిందిగా జెలెన్స్కీ అభ్యరి్థంచడం మొదలెట్టారు. అంటే నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ సీరియస్గా ఆశిస్తున్నది కేవలం ఏడాది క్రితం నుంచేనని సుస్పష్టం. నాటో మార్గదర్శకాల ప్రకారం యూరప్లోని ఏ దేశమైనా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పన్నెండు దేశాల కూటమిగా మొదలైన నాటో సభ్య దేశాల సంఖ్య ఇప్పుడు 32కు పెరిగింది. లిథువేనియాలోని విలి్నయస్లో జరిగిన నాటో భేటీకి హాజరైన జెలెన్స్కీ పనిలో పనిగా లుకిస్కస్ స్క్వేర్లో జరిగిన ఓ సభలో తమ అభీష్టాన్ని అక్కడి జనాలతో పంచుకున్నారు. సభా వేదికపై ‘ఉక్రెయిన్–నాటో 33’ నినాదాన్ని కూడా ప్రదర్శించడం విశేషం. నాటో నేతలకే ఇష్టం లేదు...! లుకిస్కస్ స్క్వేర్ సభా వేదికపై ప్రదర్శితమైన ‘ఉక్రెయిన్–నాటో 33’ బ్యానర్ అక్కడివారి మది దోచినా, ఉక్రెయిన్ మెడలో ఇప్పటికిప్పుడే ‘నాటో–33’ గుర్తింపు కార్డు పడటం మాత్రం నాటో నేతల్లోనే చాలామందికి అసలు ఇష్టం లేదు. అందుకే ‘అప్పుడే కాదం’టూ ఉక్రెయిన్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఉక్రెయిన్కు సభ్యత్వాన్ని మంజూరు చేస్తే నాటో దేశాలన్నీ రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధ బరిలోకి దిగాల్సి వస్తుంది. నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్య దేశంపై దాడి జరిగినా కూటమిలోని దేశాలన్నీ సంయుక్తంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. నాటో నిబంధనల్లోని ఆరి్టకల్–5 ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశించింది. నాటో చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి, అమెరికాపై 9/11 ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఈ నిబంధన అమలైంది. ఒకవేళ ఇప్పుడు గనక ఉక్రెయిన్కు సభ్యత్వమిస్తే కూటమిలోని మిగతా 32 దేశాలూ రష్యాపై యుద్ధానికి దిగాల్సి వస్తుంది. ‘నాటో దేశాల భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. ఇప్పుడు యుద్ధం నడిమధ్యలో ఉంటే తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మేమంతా రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటో కూటమి తమ సభ్య దేశాల పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో బైడెన్ ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటారు. అయితే బైడెన్ వ్యాఖ్య వెనక అసలు ఉద్దేశాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జెన్ వాలెస్ కుండబద్దలు కొట్టారు. ‘ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్న దేశాన్ని ఇప్పటికిప్పుడు కూటమిలోకి ఆహా్వనించలేం. అలా చేయడం మొత్తం కూటమినీ యుద్ధభూమిలోకి లాగడమే అవుతుంది’’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. యుద్ధం ముగిశాక గెలుపోటములతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సభ్యత్వానికి నాటో ఇలా సూత్రప్రాయంగా అంగీకరించినా అధికార ముద్ర ఎప్పుడు పడుతుందో చెప్పలేం. యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్కు నాటో మోక్షం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది మాత్రం అస్పష్టం! జెలెన్స్కీకీ ముందే తెలుసు...! యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం రావడం కల్లేనని జెలెన్స్కీకీ తెలుసు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆయన పదేపదే నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం మాటే ఉండదు. మాకది ఇష్టం లేక కాదు, కానీ అసాధ్యం’ అని జెలెన్స్కీ ఐదారు నెలల క్రితం కీవ్లో తన మనసులో మాటను సుస్పష్టంగా చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే నాటో సభ్యత్వం లభించేలా ఓ రోడ్మ్యాప్ను ఖరారు చేసుకోవడానికే పదేపదే ఇలా సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సభ్యత్వంపై ఎటూ తేల్చని నాటో కనీసం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడిని నిరాశకు గురి చేసింది. ఇది ఒకరకంగా ఉక్రెయిన్ను ఆగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టిందనే భావించాలి. ఉక్రెయిన్ ఉక్రెయిన్గా నిలవాలంటే యుద్ధాన్ని గెలవాలి, లేదా రష్యాతో సంధి కుదుర్చుకోవాలి. ఈ రెండు పరిస్థితుల్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరగలుగుతుంది. ఓడిపోతే ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగంగా మారిపోతుంది. అప్పుడిక దానికి నాటో ప్రస్తావన అవసరమే లేకుండా పోతుంది. గెలుపోటములను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటిదాకా ‘అయితే గియితే’లో ఉన్న నాటో సభ్యత్వ అంశం ‘ఆ సుదినం ఎప్పుడు’ అనేదాకా అయితే వచి్చంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్కు ఊరటనిచ్చే విషయం ఇదొక్కటే. యుద్ధం త్వరలో ఓ కొలిక్కి వచ్చి ఉక్రెయిన్కు నాటో తలుపులు తెరుకోవాలని కోరుకుందాం! తెరుచుకుంటాయనే ఆశిద్దాం!! -
నాటోలో సభ్యత్వం: స్వీడన్కు సై.. ఉక్రెయిన్కు నై.. కారణమిదే!
విల్నియస్: స్వీడన్ను తమ కూటమిలో 32వ సభ్యదేశంగా చేర్చుకునేందుకు నాటో అంగీకరించింది. లిథువేనియా దేశంలోని విలి్నయస్ నగరంలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సు ఇందుకు వేదికగా నిలిచింది. అయితే ఉక్రెయిన్కు సభ్యత్వంపై 31 సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇప్పట్లో ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం దక్కకపోవచ్చు. యుద్ధంలో నిమగ్నమైన దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదన్న నిబంధన కారణంగా ఇప్పుడే కూటమిలో చేర్చుకోలేమని, యుద్ధం ముగిశాక వెంటనే సభ్యత్వం ఇచ్చేలా పాత రెండంచెల పద్ధతిని సరళతరం చేశామని నాటో ప్రధాన కార్యదర్శి జీన్స్ స్టోల్టెన్బెర్గ్ మీడియాతో చెప్పారు. కాగా, తమ పట్ల నాటో వైఖరిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా తప్పుబట్టారు. -
బలపడుతున్న భారత్–నాటో బంధం?
భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, మన సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ ధోరణి అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అన్యోన్యతను కలిగి ఉంది. హిందూ మహాసముద్రంలో దొంగతనాల (పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం స్పష్టంగా ఉంది. కాబూల్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు భారత అధికారులు నాటో అధికారులతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు. 2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్ దాడుల తర్వాత భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్) ఫిన్లాండ్తో, నాటోతో సహకరించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) వార్షిక శిఖరాగ్ర సమావేశం లిథువేనియా రాజధాని విల్నియస్లో జరుగుతోంది (జూలై 11–12). ఉత్తర అమెరికా, ఐరోపా దేశాల పరస్పర రక్షణ కూటమిగా 1949 నుండి ఉంటూ వస్తున్న నాటోను ఇటీవలి వరకు చాలామంది ప్రచ్ఛన్న యుద్ధ అవశేషంగానే భావించారు. (ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మెక్రాన్ అయితే 2019లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాటో బ్రెయిన్ డెత్ గురించి ప్రముఖంగా ప్రకటించారు కూడా.) కానీ ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం నాటో కూటమిలో సరికొత్త ప్రయోజనాత్మక లక్ష్యాన్ని నింపింది. గత సంవత్సరంలో ఫిన్లాండ్ను నాటోలో చేర్చుకున్నారు. సభ్యులందరి ఆమోదానికి లోబడి స్వీడన్ కూడా కూటమిలో చేరుతుందని భావిస్తున్నారు. దీంతో నాటో సభ్యత్వం 32 దేశాలకు పెరగనుంది. పైగా, మంగోలియా, పాకిస్తాన్ వంటి విభిన్న దేశాలతో సహా 39 దేశాలతో నాటో అధికారిక భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. వాటిలో మూడు (రష్యా, బెలారస్, అఫ్గానిస్తాన్) దేశాల సభ్యత్వాన్ని ప్రస్తుతం నిలిపివేశారు. ఇవి పార్లమెంటరీ వ్యవహారాల నుండి సాంకేతిక సహకారం వరకు వివిధ స్థాయుల్లో ప్రమేయాన్ని కలిగి ఉన్నాయి. కొన్ని నాటో భాగస్వామ్య దేశాలైన జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్... రష్యాకు వ్యతిరేకంగా సమన్వయం విషయంలో మరింత సన్నిహితంగా ఉన్నాయి. నాటో 2022 వ్యూహాత్మక భావన అనేది రష్యాపై దృష్టిని తిరిగి కేంద్రీకరించడం, కూటమి సభ్యత్వ విస్తరణను చేపట్టడంతో సహా చైనా ప్రజా రిపబ్లిక్కు (పీఆర్సీ) కొంత ప్రాధాన్యమిచ్చింది. బీజింగ్ ‘ప్రకటిత ఆశయాలు, దాని బలవంతపు విధానాలు, మన ఆసక్తులను, భద్రతను, విలువలను సవాలు చేస్తున్నాయి’ అని ప్రకటించింది. ‘యూరో–అట్లాంటిక్ భద్రతకు పీఆర్సీ ద్వారా ఎదురయ్యే దైహిక సవాళ్లను పరిష్కరిస్తా’మని ఈ డాక్యుమెంట్ ప్రతినబూనింది. నాటో ఆందోళన చెందుతున్న అంశాల్లో చైనాను కూడా చేర్చడం వల్ల భారత్తో ఈ కూటమి చర్చలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇండో–పసిఫిక్ దేశాలతో నిమగ్నమవ్వడానికి జపాన్లో నాటో కార్యాలయాన్ని ప్రారంభించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. మారుతున్న ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా దాని వ్యూహాత్మక ప్రాధాన్యాలు ఉంటున్నాయి. భారతదేశం సాంప్రదాయికంగా నాటోతో వ్యవహారంలో జాగరూకతతో వ్యవహరిస్తోంది. కూటమి చారిత్రక లక్ష్యం, భారతదేశ సన్నిహిత సైనిక భాగస్వామి రష్యాపై దాని వైఖరిని దృష్టిలో ఉంచుకుంటే ఈ మౌనం కొంతవరకు అర్థం చేసుకోదగినదే. ఇంత స్పష్టమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, భారత్ గత రెండు దశాబ్దాలుగా నాటోతో ఆశ్చర్యకరమైన రీతిలో అధికారిక అన్యోన్యతను కలిగి ఉంది. భారత్, నాటో మధ్య ప్రారంభ వ్యవహారాలు... ఆయుధాల నియంత్రణ, తీవ్రవాద వ్యతిరేక సమస్యలతో నడిచాయి. వాటి మొదటి అధికారిక ఒడంబడిక 2005లో జరిగింది. తరువాతి రెండేళ్లలో, అంటే 2006, 2007లో ఇండియా తరఫున ప్రణబ్ ముఖర్జీ రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిగా ఇరు హోదాల్లో నాటో సెక్రటరీ జనరల్తో సమావేశమయ్యారు. నాటో డిప్యూటీ సెక్రటరీ జనరల్ 2007లో భారత్ను సందర్శించారు. 2019లో నాటో–భారత్ మధ్య జరిగిన రాజకీయ చర్చల్లో చైనా, తీవ్రవాదం, పాకిస్తాన్ వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. రెండు సంవత్సరాల తరువాత, నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ న్యూఢిల్లీలో యేటా జరిగే ‘రైజీనా డైలాగ్’ని ఉద్దేశించి ప్రసంగించారు. హిందూ మహాసముద్రంలో దొంగతనాల(పైరసీ) విషయంలో ఉమ్మడి భాగస్వామ్య సవాలుపై భారత్, నాటో మధ్య ఆచరణాత్మక సహకారం చాలా స్పష్టంగా ఉంది. 2009, 2011 మధ్య, బీజింగ్లో చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆతిథ్య భేటీలోనూ, బ్రస్సెల్స్లో నాటో నిర్వహించిన సమావేశంలోనూ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో పైరసీ వ్యతిరేక ప్రయత్నాలను సమన్వయం చేయడంలో భారత్, నాటో అధికారులు పాల్గొన్నారు. భారత నౌకాదళం వాలెన్సియాలోని నాటో ర్యాపిడ్ డిప్లాయబుల్ కోర్తో కూడా పరిచయాలను ఏర్పరచుకుంది. ఈ దశలు కొన్ని కచ్చితమైన ఫలితాలను అందించాయి. ఉదాహరణకు, 2011 మే నెలలో, అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడిని అడ్డుకోవడానికి భారత నౌకాదళం నాటో పెట్రోలింగ్ నౌకలతో సమన్వయం చేసుకుంది. రెండు సంవత్సరాల తరువాత, నాటో నౌకాదళ వాహనాలు గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో 14 మంది భారతీయ నావికులను రక్షించడంలో సహాయపడ్డాయి. నాటో, భారత్ మధ్య కాలానుగుణమైన అధికారిక వ్యవహారాలు అఫ్గానిస్తాన్, సైనిక విద్య, శాంతి పరిరక్షక కార్యకలాపాలు, సైబర్ భద్రత వంటి ఇతర రంగాలకు విస్తరించాయి. కాబూల్ నుండి అమెరికా బలగాల ఉపసంహరణకు ముందు, భారత అధికారులు అక్కడి అంతర్జాతీయ భద్రతా సహాయ దళం (ఐఎస్ఏఎఫ్)లో పాల్గొన్న నాటో అధికారులతోనూ, సైనిక కమాండర్లతోనూ తమ దృష్టికోణాలను పంచుకున్నారు. 2007లో ఎస్తోనియాపై గణనీయమైన సైబర్ దాడుల తర్వాత భారత్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్) ఫిన్లాండ్తో, నాటోతో సహకరించింది. తర్వాత 2008లో ఉత్తర సముద్రంలో నాటో కసరత్తులకు భారత అధికారులను పరిశీలకులుగా ఆహ్వానించారు. ఇటీవల, కమాండెంట్ నేతృత్వంలోని భారత జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం, నాటో మారిటైమ్ ఇంటర్డిక్షన్ ఆపరేషనల్ ట్రైనింగ్ సెంటర్ను సందర్శించింది. బ్రస్సెల్స్ సదస్సు దృక్పథం నుండి అఫ్గానిస్తాన్ ఇప్పుడు వెనక్కిపోయి ఉండవచ్చు. అయినప్పటికీ ఇది న్యూఢిల్లీకి అధిక ప్రాధాన్యంకలిగిన అంశమే. ఏదేమైనా, అతి వ్యాప్తి చెందుతున్న వారి ఎజెండాల స్వరూపాలు నేడు మరింత సులభంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఇండో–పసిఫిక్లో రాజకీయ పరిణామాలు, వృత్తిపరమైన సైనిక విద్య, వాతావరణ మార్పులు, బహుశా ఆయుధాల నియంత్రణతోపాటు అణు ఎస్కలేటరీ డైనమిక్స్ ఇందులో ఉన్నాయి. సహజంగానే, వేర్వేరు ప్రయోజనాలు, ఆసక్తులు, తరచుగా భిన్నమైన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతల దృష్ట్యా... భారత్, నాటోలు రష్యాతో పరస్పర చర్చలకు భిన్నమైన విధానాలను కొనసాగిస్తాయనడంలో సందేహం లేదు. ఆర్మేనియా, కజకిస్తాన్, సెర్బియా వంటి రష్యాతో సన్నిహితంగా ఉన్న అనేక భాగస్వామ్యదేశాలతో నాటో తలపడుతోంది. అంతే కాకుండా, ఇటీవలి వరకు అది న్యూఢిల్లీతో కంటే బీజింగ్, మాస్కోలతో మరింత విస్తృతమైన సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారులు నాటోతో విద్యా శిక్షణా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. నవంబర్ 2021 వరకు, మాస్కోలో నాటో తన కార్యాలయం కూడా కలిగి ఉంది. వాటి మధ్య విభిన్న అనుకూలతలు ఉన్నప్పటికీ... ఇండో–పసిఫిక్లో పెరుగుతున్న వ్యూహాత్మక పోటీని నాటో అంగీకరించడం అనేది భారతదేశంతో విస్తృతమైన, లోతైన సంభాషణకు తలుపులు తెరుస్తుంది. – ధ్రువ జైశంకర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఓఆర్ఎఫ్ అమెరికా; అమ్మార్ నైనార్, జూనియర్ ఫెలో, ఓఆర్ఎఫ్ అమెరికా (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఉక్రెయిన్కు నాటో భారీ ఆయుధ సాయం
కీవ్: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ చెప్పారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. -
పుతిన్కు పెరిగిన తలనొప్పి
మూలిగే నక్క మీద తాటిపండు పడడమంటే ఇదే! ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో)లో చేరడానికి ఉక్రెయిన్ ఉత్సాహపడుతోందని కోపగించి, కదనానికి కత్తి దూసిన రష్యాకు ఆ తలనొప్పి తగ్గకపోగా, ఇప్పుడు ఫిన్లాండ్ రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. అమెరికా సహా మొత్తం 30 పాశ్చాత్య దేశాల కూటమి ‘నాటో’లో 31వ దేశంగా మంగళవారం ఫిన్లాండ్ అధికారికంగా చేరింది. దీంతో, రష్యాకు కంటి మీద కునుకు పట్టనివ్వకుండా ఆ దేశంతో ‘నాటో’ సభ్య దేశాల సరిహద్దు రెట్టింపయింది. పాశ్చాత్య ప్రపంచంతో దీర్ఘకాలంగా ఘర్షణలో ఉన్న మాస్కో విషయంలో ఇన్నేళ్ళుగా తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ ఇప్పుడిలా ప్రత్యర్థితో జట్టు కట్టడం రష్యాకూ, ఆ దేశాధినేత వ్లాదిమిర్ పుతిన్కూ పెద్ద ఎదురుదెబ్బ. కానీ, ఉక్రెయిన్తో ఏడాది పైగా ఎగతెగని పోరు చేస్తూ, ముందుకు పోలేక వెనక్కి రాలేక సతమతమవుతున్న మాస్కో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఫిన్లాండ్ చేసినపనికి తగురీతిలో ప్రతిచర్యలు ఉంటాయని హూంకరించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి తమను తాము రక్షించుకొనేందుకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, నెదర్లాండ్స్, కెనడాలు స్థాపించిన సైనిక కూటమి ‘నాటో’. 1949లో సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని ఇది అమలు చేస్తుంది. ‘నాటో’లోని ఏ సభ్యదేశం పైన అయినా బయట దేశాలు దాడికి దిగితే, మిగతా సభ్యదేశాలన్నీ సాయం చేయాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకోవడమూ ‘నాటో’ లక్ష్యం. తన ప్రయోజనాలకు విరుద్ధంగా పాశ్చాత్య ప్రపంచం కూడగట్టిన ఈ కూటమి అంటే రష్యాకు అందుకే ఒళ్ళు మంట. 1990ల ద్వితీయార్ధం నుంచి తన పొరుగు దేశాలను ‘నాటో’లో చేర్చుకొని, పక్కలో బల్లెంలా మార్చడాన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘నాటో’ విస్తరణ విషయంలో ఉక్రెయిన్కు సంబంధించి ఇచ్చిన మాట తప్పేందుకు పాశ్చాత్య ప్రపంచం సిద్ధపడడాన్ని మాస్కో జీర్ణించుకోలేకపోయింది. అందుకే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏడాది క్రితం ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగారు. సరిహద్దు వెంట ‘నాటో’ బెడద తగ్గించుకోవాలనీ, యూరప్లో మరే దేశమూ ‘నాటో’లో చేర కుండా చేయాలనీ ఉక్రెయిన్తో పోరాటం ప్రారంభించిన పుతిన్ సఫలం కాలేదు. పైపెచ్చు, అందుకు పూర్తి విరుద్ధంగా ఆ సైనికకూటమి విస్తరణకు కారణమయ్యారు. ఇది విరోధాభాస. మాస్కో చేపట్టిన యుద్ధంతో ‘నాటో’ పట్ల ఆకర్షణ పెరిగింది. రష్యాతో తిప్పలు తప్పవనే అనుమానంతో, ‘నాటో’ సైనిక కూటమిలో సభ్యత్వానికి మరిన్ని మధ్యయూరప్ దేశాలు క్యూ కట్టాయి. ఆ క్రమంలో ఫిన్లాండ్, స్వీడన్లు ‘నాటో’ సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. నిజానికి, ఫిన్లాండ్ దాదాపు 1,340 కిలోమీటర్ల తూర్పు సరిహద్దును రష్యాతో పంచుకుంటోంది. ఆ దేశం ఎన్నడూ రష్యా వ్యతిరేకి కాదు. పైగా, రెంటికీ మధ్య ఎన్నడూ విభేదాలు లేవు. అలాంటిది– ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణతో ‘నాటో’లో చేరేందుకే ఫిన్లాండ్లో 80 శాతం మేర ప్రజాభిప్రాయం మొగ్గింది. చివరకు అదే జరిగింది. సభ్యత్వానికి ఫిన్లాండ్ పెట్టుకున్న దరఖాస్తు రికార్డు సమయంలో ఆమోదం పొందింది. ఫిన్లాండ్ అధికారికంగా ‘నాటో’లో చేరినా, స్వీడన్కు మాత్రం ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. సభ్యత్వానికి స్వీడన్ అంగలారుస్తున్నా, టర్కీ, హంగరీలు అడ్డంగా నిలిచాయి. టర్కీలో మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రజాస్వామ్య ప్రమాణాల గురించి స్వీడన్ వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశం కినుక వహించింది. మే 14న టర్కీలో ఎన్నికల తర్వాత కానీ ఆ దేశం స్వీడన్ దరఖాస్తుకు ఆమోదముద్ర వేయకపోవచ్చని విశ్లేషకుల అంచనా. హంగరీ విషయానికొస్తే, స్వీడన్ అనేక సంవత్సరాలుగా హంగరీ పట్ల వైరభావంతో వ్యవహరిస్తోంది. పైగా, హంగరీలో న్యాయం క్షీణించిందంటూ స్వీడన్ ప్రధాని ఆ మధ్య వ్యాఖ్యానించారు. దాంతో, హంగరీకి పుండు మీద కారం రాసినట్లయింది. టర్కీ లాగా డిమాండ్ల జాబితా లేకున్నా, తన సాధకబాధకాలను తీరిస్తే హంగరీ సైతం ‘నాటో’లో స్వీడన్ ప్రవేశానికి ఓకే అంటుంది. మొత్తానికి, అమెరికా సారథ్యంలోని ద్వితీయ ప్రపంచ యుద్ధానంతర కూటమి బలోపేతమవుతోంది. బోలెడన్ని నిధులందిన ఆధునిక రక్షణ దళాలతో కూడిన ఫిన్లాండ్ ‘నాటో’కు బలమైన చేర్పు. రేపు ఉక్రెయిన్ యుద్ధం ఎటు తిరిగి ఎలా ముగిసినా, రష్యా మాత్రం బలహీనపడింది. ఏదైతే జరగరాదని పుతిన్ ఆశించారో, అదే జరిగి సరిహద్దు వెంట ‘నాటో’ దేశాల సంఖ్య, సత్తా ఇనుమడించాయి. ఈ పాపపుణ్యాలు పూర్తిగా పుతిన్వే. దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ, నియమాను సారం సాగే అంతర్జాతీయ క్రమాన్ని ఆయన తోసిపుచ్చారు. పాశ్చాత్య ప్రపంచం ఉలిక్కిపడి, కార్యా చరణకు ఉద్యుక్తమయ్యేలా చేశారు. ఇకపై రష్యా – యూరప్ల మధ్య బంధం మునుపటిలా ఉండబోదు. మరోపక్క చైనా సైతం నిత్యం ఎవరో ఒకరితో కయ్యానికి కాలుదువ్వుతోంది. వీటన్నిటి దృష్ట్యా ‘నాటో’ లాంటి సైనిక కూటములు మరింత విస్తరించడం ఖాయం. ఇప్పటికే ప్రచ్ఛన్న యుద్ధ కాలం నుంచి తటస్థంగా ఉన్న ఫిన్లాండ్, స్వీడన్లు పాశ్చాత్య ప్రపంచ మిత్రపక్షాలుగా మారాయి. రష్యాతో చేతులు కలిపి ఆర్కిటిక్లో చైనా తన ప్రాబల్యం పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో ధ్రువవృత్తం దాటి, ఆర్కిటిక్ ప్రాంతమంతటా సైనికీకరణ తప్పకపోవచ్చు. భారత్ సైతం ఆర్కిటిక్లో తలెత్తే పరిణామాలనూ, ప్రభావాన్నీ జాగ్రత్తగా గమనించక తప్పదు. వెరసి, ఆర్కిటిక్ ప్రాంతం మరింత సమస్యాత్మకం కానుంది. పుతిన్తో పాటు ప్రపంచానికీ తలనొప్పి పెరగనుంది! -
భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు
భారత్తో సంబంధాల కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) తలుపులు తెరిచే ఉంచింది అని నాటోలోని యూఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్తో సాన్నిహిత్యంగా ఉండటం తమకు చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు. అంతేగాదు భారత్ కోరుకుంటే ఏ సమయంలోనైనా దీని గురించి చర్చిండానికి నాటో సిద్ధంగా ఉందని కూడా స్మిత్ చెప్పారు. దీంతో ఒకరకంగా నాటోలో భారత్ చేరేలా యూఎస్ ప్రత్యక్ష సంకేతాలిస్తునట్లుగా ఉంది. ఈ మేరకు భారత్, యూఎస్ల మధ్య సన్నిహిత సంబంధాలు గురించి మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య భాగస్వామ్యం అత్యంత దృఢంగా ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాలు ప్రజాస్వామ్యం, నియమాల ఆధారిత క్రమం, వాతావరణ మార్పు, హైబ్రిడ్ బెదిరింపులు, సైబర్ భద్రత, సాంకేతికత, విఘాతం కలిగించడం తదితర అంశాలపై కలిసి పనిచేయడంపై నిమగ్నమయ్యాయని అన్నారు. సోవియట్ యూనియన్ కోసం ఏర్పడ్డ నాటో తొలిసారిగా ఇండో పసిఫిక్తో తన విస్తరణను పెంచుకుందని తెలిపారు. అలాగే చైనాను నాటో వ్యవస్థాగత సవాలుగా గుర్తించిందని చెప్పారు. అయితే ఆయా ప్రాంతాలలోని భాగస్వామ్యుల వ్యూహాత్మక విధానాల తోపాటు ముఖ్యంగా చైనా దూకుడు విధానానికి సంబంధించి వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నాలుగు ఇడో పసిఫిక్ దేశాలు జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లిథువేనియాలో జరగనున్న అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందినట్లు ఆమె తెలిపారు. ఈ దేశాలతో తమ భాగస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం మీద నాటో ఏ ఇండో పసిఫిక్ దేశంతోనూ పొత్తుల పెట్టుకునే యోచన చేయడం లేదని, పైగా విస్తృత కూటమిగా విస్తరించే ఆలోచన కూడా లేదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేవలం ఒక్క రోజులో యుద్ధాన్ని ముగించగలరని అన్నారు. పశ్చిమ దేశాలు కేవలం ఉక్రెయిన్కు అవసరమైన వాటిని అందించడమే కాకుండా భవిష్యత్తులో రష్యన్లు చేసిన పనిని ఇతర దేశాలు చేసే ప్రమాదం ఉందని స్మిత్ హెచ్చరించారు. అలాగే ఈ యుద్ధంలో ఉక్రెయిన్కి భారత్ అందించిన మానవతా సాయాన్ని నాటో ప్రశంసించింది. యుద్ధాన్ని ముగించాలని పిలుపునివ్వడమే గాక ఇతర దేశాల యూఎన్ నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. ఏదీఏమైనా ఈ ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని స్మిత్ అన్నారు. ఈ యుద్ధంలో రష్యా గనుక అణ్వాయుధాలను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. దీని గురించి నాటో నిఘా ఉంచినట్లు కూడా యూఎస్ నాటో ప్రతినిధి స్మిత్ వెల్లడించారు. (చదవండి: పంజాబ్ సీఎం కూతురు సహా.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు ఖలీస్తానీ గ్రూపుల బెదిరింపులు) -
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. సాయానికి నాటో దేశాల కీచులాట? కారణాలేంటి?
దొడ్డ శ్రీనివాస్రెడ్డి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో నాటో దేశాల మధ్య మనస్పర్థలు తలెత్తుతున్నాయా? ఉక్రెయిన్ మరో అఫ్గానిస్తాన్గా మారుతుందేమోననే అనుమానాలు నాటో కూటమిలో కలుగుతున్నాయా? ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న సంప్రదాయక యుద్ధం ముదిరి నాటో దేశాలు కూడా ప్రభావితమై భీకర యుద్ధంగా మారుతుందా? ఉక్రెయిన్ పద్మవ్యహంలో పీకల దాకా చిక్కుకుపోయామనే సందేహం నాటో దేశాల అధినేతల్లో మొదలవుతోందా? ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యాను నిలువరించేందుకు ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు సరఫరా చేసే విషయంలో నాటో కూటమిలో చెలరేగిన పొరపొ చ్చాలను గమనిస్తే కూటమి మధ్య స్నేహ సంబంధాలు సజావుగా సాగడం లేదని అర్థం అవుతోంది. ఉక్రెయిన్కు సాయం అందించడంలో తామంతా ఒక్కతాటిపై ఉన్నట్లు పైకి చెబుతున్నా నాటో దేశాధినేతల మధ్య అనేక అంశాలపై విభేదాలు ఉన్నట్లు బయటపడింది. ఒత్తిడికి తలొగ్గిన అగ్రరాజ్యం... నాటో కూటమిలో విభేదాలు తలెత్తే పరిస్థితులను గమనించి అమెరికా తలొగ్గక తప్పలేదు. ఉక్రెయిన్ బెటాలియన్కు సరిపడా 31 అబ్రహం ట్యాంకులను పంపడానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయిష్టంగానే అంగీకరించారు. ఆ వెంటనే జర్మనీ సహా ఇతర యూరప్ దేశాలన్నీ తమ వద్ద ఉన్న లెపర్డ్–2 ట్యాంకులను ఉక్రెయిన్కు పంపుతున్నట్లు ప్రకటించాయి. నాటో కూటమిలో చీలికలు తప్పవని ఎదురుచూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు నిరాశే ఎదురయ్యింది. ఇప్పుడు జరుగుతోంది రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కాదని... అమెరికా తెరవెనుక ఉండి నిర్వహిస్తున్న యుద్ధమని అమెరికాలోని రష్యా దౌత్యవేత్త అనతోలి టానోల్ వ్యాఖ్యానించారు. లెపర్డ్–2 యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్ పట్టు సుదీర్ఘ చర్చలు, మంతనాల తర్వాత ఉక్రెయిన్కు ట్యాంకులు సరఫరా చేయడానికి నాటో కూటమి అంగీకరించిందో లేదో ఇప్పుడు తమకు యుద్ధవిమానాలు కూడా కావాలని ఉక్రెయిన్ సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చింది. భూతలంపై ఉన్న తమ సైనిక బలగాల రక్షణకు గగనతలంలో యుద్ధవిమానాల అవసరం ఉందని ఉక్రెయిన్ అధినేతలు నాటోను కోరుతున్నారు. నాలుగో తరానికి చెందిన ఎఫ్16, యూరోఫైటర్స్, టోర్నడో, ఫ్రెంచ్ రఫేల్ యుద్ధవిమానాల అవసరాన్ని ఉక్రెయిన్ అధినేతలు బహిరంగంగానే చెబుతున్నారు. రష్యా దగ్గర నాలుగోతరం యుద్ధవిమానాలు 772 ఉంటే తమ దగ్గర సోవియెట్ యూనియన్ నాటి పాతబడిన 69 విమానాలే ఉన్నాయని... వాటితో రష్యాను నిలువరించడం కష్టమని ఉక్రెయిన్ రక్షణ శాఖ సలహాదారు యూరి సక్ చెబుతున్నారు. ట్యాంకుల పంపిణీపై అంగీకారానికి రావాడానికి తల బొప్పికట్టి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న నాటో దేశాలు ఈ కొత్త డిమాండ్తో బిత్తరపోయాయి. ఎఫ్16 విమానాలను ఉక్రెయిన్కు కేటాయిస్తున్నారా అని ఓ విలేఖరి అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ‘నో’అని ఒకమాటలో కొట్టిపారేశారు. ఇది అర్థంపర్థంలేని డిమాండ్ అని జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్ స్పష్టం చేశారు. అయితే ఈ యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్ చేసిన వినతిపట్ల కొన్ని నాటో దేశాలు సానుకూలంగా స్పందించాయి. ఎఫ్16 యుద్ధవిమానాల కోసం ఉక్రెయిన్ అధికారికంగా కోరితే సానుకూలంగా పరిశీలిస్తామని నెదర్లాండ్ విదేశాంగ మంత్రి హొప్కి హోక్స్ట్రా అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ కూడా తమ దేశ యుద్ధవిమానాలను ఉక్రెయిన్కు పంపడానికి సిద్ధమన్నారు. లిథువేనియా అధ్యక్షుడు గిటినస్ న్యూసెథా కూడా సానుకూలంగా స్పందించారు. అయితే యుద్ధ విమానాల అంశం నాటో కూటమిలో మరోసారి విభేదాలకు దారితీయవచ్చని దౌత్యవేత్తలు అనుమానిస్తున్నారు. అసలు భయం ఇదీ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు అండగా నిలిచిన నాటో కూటమిలో ఆయా దేశాలు అందిస్తున్న సాయంపై అంతర్మథనం జరుగుతోంది. ఏడాదిపాటు రష్యా లాంటి అతిశక్తివంతమైన దేశాన్ని నిలువరించగలిగిన ఉక్రెయిన్... ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మరింత దూకుడుగా వెళ్లి యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకువెళుతుందేమోనన్న అనుమానాలు కూటమి దేశాల్లో మొదలయ్యాయి. రష్యా ఆక్రమించుకున్న క్రిమియా వంటి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉక్రెయిన్ ఉవ్విళ్లూరుతున్న విషయం ఆ దేశ నాయకుల ప్రకటనల్లో అర్థమవుతోంది. నాటో అందిస్తున్న ఆయుధ సంపత్తితో ఉక్రెయిన్ కనుక ఇలాంటి దుస్సాహసం చేస్తే అది యుద్ధం విస్తృతరూపం దాల్చడానికి దారితీస్తుందని అమెరికా, జర్మనీ వంటి దేశాలు భయపడుతున్నాయి. తామిచ్చే సాయం రష్యా దురాక్రమణలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ ఉపయోగించుకోవాలని, ఇది శ్రుతి మించితే యుద్ధం తమ సరిహద్దుల వరకూ వచ్చే ప్రమాదం ఉందని నాటో దేశాలు ముఖ్యంగా రష్యా సరిహద్దుగా ఉన్న యూరప్ దేశాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్కు అందిస్తున్న సాయంపై ఆయా దేశాల ప్రజల్లో కొంత అసహనానికి దారి తీస్తుందని సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ కనుక తమ భూభాగాలను టార్గెట్ చేయడానికి ఉపయోగపడే యుద్ధవిమానాలు, క్షిపణి ప్రయోగ యంత్రాల వంటివి అందిస్తే నాటో హద్దు మీరుతున్నట్లుగా భావించాల్సి వస్తుందని పుతిన్ సహా రష్యా నేతలు హెచ్చరిస్తున్నారు. తమ పట్టణాలపై దాడి చేసే ఆయుధ సంపత్తిని నాటో గనక ఉక్రెయిన్కు అందిస్తే తీవ్ర రూపంలో ప్రతిఘటిస్తామని... దీనివల్ల యుద్ధం స్వరూపం మారే ప్రమాదం ఉందని రష్యా దౌత్యాధికారి గౌవ్రిలోవ్ హెచ్చరించారు. ట్యాంకులపై గొడవ ఉక్రెయిన్ కోరిన యుద్ధ ట్యాంకులు అందించడంపై వారాల తరబడి సాగిన మంతనాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చి నాటో దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఉక్రెయిన్కు సమీపాన ఉన్న యూరప్ దేశాలు ట్యాంకులు సరఫరా చేయాలని అమెరికా కోరుకుంది. అక్కడి భూ ఉపరితల పరిస్థితులకు ఐరోపా ట్యాంకులు సరితూగుతాయి కాబట్టి అయా దేశాలే ట్యాంకులు పంపిణీ చేయాలని అమెరికా వాదించింది. కానీ యూరప్లోని నాటో దేశాలు ముఖ్యంగా జర్మనీ అందుకు అంగీకరించలేదు. నాటో కూటమి సభ్యుల మధ్య అధికారికంగా జరిగిన అనేక సమావేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాయి. అమెరికా ముందుగా ట్యాంకులు పంపేందుకు ఒప్పుకుంటేనే తాము కూడా సిద్ధమవుతామని జర్మనీ తేగేసి చెప్పింది. అమెరికా తన దగ్గరున్న అధునాతన అబ్రహం ట్యాంకులను ఉక్రెయిన్కు అందజేయడానికి అంగీకరిస్తేనే తాము లెపర్డ్–2 ట్యాంకులు ఇవ్వడానికి ఒప్పుకుంటామని జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్ పట్టుబట్టారు. అమెరికా భాగస్వామ్యం లేకుండా తాము ట్యాంకులు పంపితే రష్యా తన ఆగ్రహాన్ని తమపై గురిపెడుతుందన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెరవెనుక చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యూరప్లోని నాటో దేశాలు స్పెయిన్, పోలాండ్, ఫిన్లాండ్, నార్వే తమ వద్ద ఉన్న లెపర్డ్–2 ట్యాంకులను పంపడానికి సిద్ధంగా ఉన్నా జర్మనీ అనుమతి లేకుండా వాటిని ఇతర దేశాలకు పంపకూడదన్న ఒప్పందాన్ని అనుసరించి ముందడుగు వేయలేని పరిస్థితి. అబ్రహం ట్యాంకులు అత్యాధునికమైనవని, వాటిని ఉపయోగించడం కష్టసాధ్యమని, వాటి తయారీకి అనేక నెలలు పడుతుందని, రిపేర్లు చేయడం ఉక్రెయిన్కు సాధ్యం కాదని అమెరికా అధినేతలు బహిరంగంగా వాదిస్తూ వచ్చారు. పెంటగాన్ అధికారి కాలిన్ హెబ్ కాల్, అమెరికా జాతీయ భద్రతా దళ ప్రతినిధి జాన్ కిర్బి ఈ వాదనలు ముందుకు తెచ్చారు. అయినా కూడా జర్మనీ ససేమిరా అంది. -
అందుకు అమెరికా ఒప్పుకుంటే చర్చలకు రెడీ!...భారీ ట్విస్ట్ ఇచ్చిన పుతిన్
ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యాని ఎంతమంది చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోమని సలహ ఇచ్చిన అందుకు అంగీకరించలేదు. కానీ ఇప్పుడూ అనుహ్యంగా తాము చర్చలకు సిద్ధం అంటూ అనుహ్యంగా ముందుకు వచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అదీగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశాక అనుహ్యంగా పుతిన్ చర్చలకు తెరతీయడం అందర్నీ షాక్కి గురి చేసింది. ఇరు దేశాలవైపు భారీ మొత్తంలో సైనికులు నేలకొరిగి, జరగాల్సిన తీవ్ర నష్టం చవిచూశాక రష్యా అధ్యక్షుడు ఇలా అనడంలో ఆంతర్యం తెలియదు గానీ అందర్నీ మాత్రం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే పుతిన్ చర్చలకు సిద్ధం అంటూనే మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఉక్రెయిన్లో రష్యా తన సొంతమని చెప్పుకుంటున్న భూభాగాలను అమెరికా గుర్తించాలి అని ఒక షరతు పెట్టాడు. అమెరికా అందుకు అంగీకరిస్తానే తాను యుద్ధ ప్రాతికన చర్చలకు సిద్ధం అని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ఆసక్తి చూపితే తాను పుతిన్తో మాట్లేడేందుకు సిద్దం అని చెప్పారు కూడా మెరికా అధ్యక్షుడు బైడెన్ . అయితే బైడెన్ నాటో మిత్ర దేశాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే తన నిర్ణయం ఉంటుందని చెప్పారు. -
పోలండ్పైకి క్షిపణులు... రష్యా దాడి కాదు
షెవాడో (పోలండ్): పోలండ్ సరిహద్దుల్లోని పంట పొలాల్లో మంగళవారం ఇద్దరిని బలిగొన్న క్షిపణి దాడులు రష్యా పనేనంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలానికి దారితీశాయి. దీని ఫలితంగా ఉక్రెయిన్కు బాసటగా నాటో రంగంలోకి దిగొచ్చని, దాంతో రష్యా 9 నెలలుగా చేస్తున్న యుద్ధం రూపురేఖలే మారిపోవచ్చని ఒక దశలో ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ దాడితో రష్యాకు సంబంధం లేదని పోలండ్తో పాటు నాటో కూటమి కూడా బుధవారం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘అది ఉద్దేశపూర్వక దాడి ఎంతమాత్రమూ కాదనిపిస్తోంది. బహుశా తమ విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం చేస్తున్న భారీ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణులు దురదృష్టవశాత్తూ సరిహద్దులు దాటి ఉండొచ్చు’’ అని పోలండ్ అధ్యక్షుడు ఆంద్రే డూడ అభిప్రాయపడ్డారు. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్బర్గ్ కూడా బ్రసెల్స్లో జరిగిన నాటో భేటీలో అదే అన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్ను తప్పుబట్టలేం. యుద్ధానికి కారణమైన రష్యాయే ఈ క్షిపణి దాడులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అంటూ నిందించారు. ఈ ఉదంతంలో కచ్చితంగా ఏం జరిగిందో త్వరలోనే తేలుస్తామన్నారు. రష్యా క్షిపణిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు ఈ క్షిపణులను ప్రయోగించినట్టు ప్రాథమికంగా తేలిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. -
పోలాండ్లో మిస్సైల్ అటాక్.. టెన్షన్లో జో బైడెన్!
ఉక్రెయిన్లో దాడులతో ప్రపంచదేశాలను రష్యా ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ సరిహద్దు దేశం పోలాండ్ సరిహద్దులోకి ఓ మిస్సైల్ను ప్రయోగం జరగడం కలకలం సృష్టించింది. కాగా, ఈ మిస్సైల్ రష్యాకు చెందినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ దాడిలో ఇద్దరు మరణించారు. మరోవైపు.. ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్న సమయంలో పోలాండ్లో ఇలా జరగడం మరింత టెన్షన్కు గురిచేస్తోంది. కాగా, ఈ మిస్సైల్ దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బో బైడెన్ అప్రమత్తమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బైడెన్.. జీ-7, నాటో దేశాల నేతలతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా, జీ-20 సమావేశాల అనంతరం ఈ వీరితో బైడెన్ భేటీ కానున్నారు. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. నాటోలో పోలాండ్ సభ్య దేశంగా ఉంది. ఇక.. పోలాండ్లో మిస్సైల్ దాడిని నాటో సభ్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మిస్సైల్ దాడికి రష్యానే పాల్పడిందని ఆరోపిస్తూ పుతిన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఇక, ఈ మిస్సైల్ దాడి చేసింది.. రష్యా అనేందుకు ఆధారాలు లేవని, అయినప్పటికీ వివరణ కోరుతూ మాస్కో రాయబారికి సమన్లు జారీ చేసినట్లు పోలాండ్ ప్రకటించింది. మరోవైపు ఇదే విషయాన్ని పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు. President Biden on Missile Strike in Poland: "I'm going to make sure we figure out exactly what happened...and then we're going to collectively determine our next step as we investigate and proceed." pic.twitter.com/pY55Feq66m — CSPAN (@cspan) November 16, 2022 -
పుతిన్ వార్నింగ్ని బేఖాతారు చేస్తూ..నాటో సైనిక కసరత్తులు
ఉక్రెయిన్పై మిసైల్ దాడులతో దూకుడు పెంచిన రష్యా ఒకవేళ నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు అని హెచ్చరించింది. అవసరమనుకుంటే అణ్వాయుధ దాడికి దిగుతానని వార్నింగ్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ ఉద్రిక్తతల నడుమ పశ్చిమ యూరప్లో నాటో దళాలు అణు నిరోధ కసరత్తులు నిర్వహించాయి. ఇది తమ రోటిన్ అణు నిరోధక డ్రిల్ అని నొక్కి చెబుతోంది. వాస్తవానికి ఈ కసరత్తులు రష్యా ఉక్రెయిన్తో యుద్ధానికి దిగక మునుపే ఈ కసరత్తుల ప్రణాళిక ఉందని తెలిపింది. ఈ విన్యాసాలకు రష్యా బెదిరింపులతో సంబంధంల లేదని నాటో స్పష్టం చేసింది. పుతిన్ బెదిరింపుల మధ్య తాము కసరత్తులు నిర్వహించకపోతే తప్పు అర్థం వస్తుందని స్పష్టం చేసింది. అలా రద్దు చేస్తే తమ సైనిక బలాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని చెప్పింది. అయినా పుతిన్ అణ్వాయుధాలకు పాల్పడతానని హెచ్చరిక నేపథ్యంలో నాటో జనరల్ స్టోలెన్బర్గ్ ఈ కసరత్తులు రద్దు చేయకూడదని నిర్ణయించారు. ఏం చేసినా రష్యా అణుదాడికి సంబంధించిన వైఖరిలో మార్పు ఉండదని తెలుసన్నారు. ఏదీఏమైన తాము మాత్రం అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. (చదవండి: జిన్పింగ్కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...:) -
'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
Direct clash of NATO troops: ఒకవేళ రష్యా సైన్యంతో నాటో దళాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగితే గనుక ప్రపంచానికి ప్రమాదకరమైన విపత్తు ఏర్పడుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టిగా హెచ్చరించారు. ఈ మేరకు ఆయన కజకిస్తాన్ రాజధాని అస్తానాలో విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అదీగాక గతనెలలో ఉక్రెయిన్లో నాలుగు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన తదనంతరం తమ రష్యా భూభాగాలను రక్షించడానికి ఎంతకైన తెగిస్తాం, అవసరమైతే అణ్వాయుధాలను సైతం ఉపయోగిస్తానంటూ.. వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యాఖ్యలను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఉక్రెయిన్పై అణ్వాయుధాలను ప్రయోగిస్తే తీవ్ర పరిణామలు ఉంటాయని జీ7 దేశాలు తీవ్రంగా హెచ్చరించాయని వాషింగ్టన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు జీ7 నాయకులు రష్యా ఉద్యేశపూర్వక దురాక్రమణ దాడిని, ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు వాటిల్లే పెద్ద ఎత్తున సాగించిన సైనిక సమీకరణ వంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండించారు. అంతేగాదు రష్యా రసాయన, జీవ సంబంధింత అణ్వాయుధాలను వినియోగిస్తోందేమోనని భయాందోళనలను కూడా వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్ నగరంలో నిధుల సేకరణ కోసం జరిగిన డెమోక్రటిక్ సెనేటోరియల్ క్యాంపెయిన్ కమిటీలో ప్రసంగిస్తూ...ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడాన్ని ఉద్దేశిస్తూ...ఈ యుద్ధం మహా సంగ్రామంగా మారుతుందనుకోలేదన్నారు. అలాగే కెన్నడీ, క్యూబా క్షిపణి సంక్షోభంలో కూడా మహా సంగ్రామాన్ని చవిచూడలేదన్నారు. అణ్వాయుధాలను ఉపయోగించే సామర్థ్యం గల రష్యా దురాక్రమణ యుద్ధానికి అడ్డుకట్టవేసే పరిష్కార మార్గం ఏముందే తెలియడం లేదన్నారు. వాస్తవానికి రష్యా సైన్యం తక్కువగా ఉంది, మరోవైపు ఉక్రెయిన్పై పూర్తి పట్టు కూడా సాధించలేకపోతుంది కాబట్టి రష్యా ఎలాంటి దుశ్చర్యకైనా దిగే ప్రమాదం లేకపోలేదు అన్నారు. ఈ కారణాల రీత్యా పుతిన్ పెద్ద ఎత్తున్న ఆర్మీ సమీకరణ, అణ్వయుధాల దాడి వంటి బెదిరింపులకు దిగుతున్నాడంటూ విమర్శించారు. తాను అనుకున్నట్లుగా చేసేందుకు పుతిన్ ఏం చేసేందుకైనా వెనుకాడడు, పైగా ఏ చిన్న అవకాశాన్ని సైతం వదలుకోడని అన్నారు. అందువల్లే పుతిన్ తన ప్రతిష్టను దిగజార్చుకోవడమే కాకుండా రష్యాలో తన ప్రాభవాన్ని సైతం కోల్పోతున్నాడంటూ బైడెన్ తిట్టిపోశారు. (చదవండి: ఖేర్సన్పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్) -
Russia-Ukraine War: యుద్ధం– శాంతి కింకర్తవ్యం!
(ఎస్.రాజమహేంద్రారెడ్డి) ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. రష్యా సేనలు ప్రతీకారేచ్ఛతో ముందూ వెనకా చూసుకోకుండా వరుసపెట్టి దాడులు చేస్తున్నాయి. కీవ్ను హస్తగతం చేసుకుని ఉక్రెయిన్ను తమ కబంధ హస్తాలతో ఆక్రమించుకోవాలనేదే రష్యా ఆశగా కనిపిస్తోంది. తలవంచడానికి సిద్ధంగా లేని ఉక్రెయిన్ వీరోచితంగా ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ స్థాయి ప్రతిఘటనను ఆర్నెల్ల కింద యుద్ధం మొదలైనప్పుడు ఎవరూ ఊహించలేదు. రష్యా ఒక్క ఉదుటున ఉక్రెయిన్లోకి చొరబడి దాడికి దిగగానే కథ రెండు మూడు వారాల్లోనే ముగుస్తుందని భావించారు. ఉక్రెయిన్ పరిస్థితిని చూసి జాలి పడ్డవాళ్లూ ఉన్నారు. అటు నాటో కానీ, ఇటు అమెరికా కానీ తొలినాళ్లలో ఉక్రెయిన్కు అండగా నిలిచేందుకు సంశయించాయి. కానీ, ఆర్నెల్లు దాటిపోయినా యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాడులు, ప్రతి దాడులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అంచనాలను వమకమే చేస్తూ ఉక్రెయిన్ నిలబడి పోరాడుతూనే ఉంది. ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ మంకుపట్టు వీడటం లేదు. అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్థైర్యాన్ని కోల్పోవడం లేదు. మరి యుద్ధం ఎప్పుడు ముగిసేను?! ఉక్రెయిన్ రష్యా నీడలోకి వచ్చేదాకా అని పుతిన్ అంటాడు, వచ్చే ఏడాదిలో తమ విజయంతోనే ముగుస్తుందని అంటాడు! పెనం నుంచి పొయ్యిలోకి... ఉక్రెయిన్లో యుద్ధం ఇప్పుడు రెండు ప్రాంగణాలుగా విడిపోయింది. తూర్పులో డోన్బాస్ ప్రాంతాన్ని రష్యా దాదాపు పూర్తిగా ఆక్రమించేసుకుంది. మిగతా కొద్ది ప్రాంతాన్ని కాపాడుకుందామని ఉక్రెయిన్ సేనలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు దక్షిణాన చేజారిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకోవడానికి ఉక్రెయిన్ సంసిద్ధమవుతోంది. ప్రాణనష్టం లెక్కలపై వైరిపక్షాలు ఎంత బింకానికి పోయినా భారీ మూల్యాన్నే చెల్లించాయి. రష్యా దాదాపు 80 వేల మంది సైనికులను కోల్పోయిందని పెంటగాన్ అంచనా. క్షతగాత్రులు ఇంకెంతమందో! రష్యా అమ్ములపొది కూడా ఖాళీ అవుతూ వస్తోంది. ఉక్రెయిన్కూ ప్రాణనష్టం భారీగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దాడుల తీవ్రతను బట్టి రోజుకు 100 నుంచి వెయ్యి మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా కనీసం 12 వేల మంది సామాన్యులు కూడా చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరిగిందని ఐరాస అంచనా. నిజానికి పౌర నష్టం అంచనాలకు మించి ఉందనేది నిపుణుల వాదన. మరింత ఆయుధ సాయం చేయాలనడమే కాకుండా నేరుగా కీవ్లో అమెరికా రక్షణ దళాలను మోహరించాలని జెలెన్స్కీ తాజాగా అభ్యర్థించడం పరిస్థితికి అద్దం పడుతోంది. తిండికి అల్లాడుతున్న దేశాలు యుద్ధానికి మరోవైపు చూస్తే ఆహార సంక్షోభం పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గోధుమలు, మొక్కజొన్నలు, బార్లీ ఉత్పత్తుల్లో రష్యా, ఉక్రెయిన్లదే ప్రపంచంలో అగ్ర స్థానం. యుద్ధం వల్ల రవాణా నిలిచిపోవడంతో ఈ రెండు దేశాల దిగుమతులపై ఆధారపడ్డ పలు దేశాలు దాదాపు కరువు పరిస్థితులతో అల్లాడుతున్నాయి. గత నెల రెండు దేశాలు ఒప్పందానికి వచ్చి ఉక్రెయిన్లోని ఆహార ధాన్యాల ఎగుమతులకు అంగీకరించాయి. కానీ 45 దేశాల్లోని కోట్లాది మందికి ఇవి సరిపోతాయా అన్నదే ప్రశ్న. మరోవైపు యుద్ధానికి ముగింపు ఎప్పుడన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్నగానే ఉంది. ఇటీవలే పశ్చిమ దేశాలు సమకూర్చిన అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్ స్థైర్యం కాస్త ఇనుమడించింది. దేశ దక్షిణాది ప్రాంతాల్లో తిష్ట వేసి కూర్చున్న రష్యా సేనలను తరిమికొట్టడమే వ్యూహంగా ఉక్రెయిన్ సాగుతోంది. అత్యంత కీలకమైన ఖెర్సన్ను తిరిగి చేజిక్కించుకుంటే ఉక్రెయిన్ ఒక ముందడుగు వేసినట్టేనని నిపుణుల అంచనా. అదే జరిగితే రష్యాకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అసలే అరకొర సైన్యంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రష్యాను ఇది మరిన్ని కష్టాల్లోకి నెడుతుంది. రిటైరైన సైనికులను సైతం యుద్ధానికి సన్నద్ధం చేయాల్సి వస్తుంది. ఇది పుతిన్కు సుతరామూ ఇష్టం లేకున్నా, తప్పేట్టు లేదు. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో తమ పట్టును కొనసాగిస్తే జెలెన్స్కీకి కష్టకాలం మొదలైనట్టే. మరీ మొండితనానికి పోయి యావత్ సైన్యాన్ని దక్షిణంలోనే మోహరించడానికి ఉక్రెయిన్ సిద్ధపడితే తూర్పు ప్రాంతంలో రష్యాకు పూర్తిగా తలొంచక తప్పదని అంచనా. ఇదంతా ఒకెత్తయితే ఇప్పటిదాకా అంటీముట్టనట్టు ఉన్న చైనా బాహాటంగా రష్యాకు తమ మద్దతు ప్రకటించి రంగంలోకి దిగితే యుద్ధ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. యుద్ధం తొలినాళ్లలోనే చైనాను రష్యా సైనిక మద్దతు కోరడం తెలిసిందే. మరో ప్రచ్ఛన్న యుద్ధం దిశగా... ఉక్రెయిన్కు అమెరికా ఆర్థిక, ఆయుధ సాయం ఒకరకంగా యుద్ధాన్ని ప్రేరేపించినట్టే అయిందన్న వాదన కూడా ఉంది. చినికిచినికి గాలివాన అయినట్టు చివరికిది రెండు అగ్రరాజ్యాల మధ్య పోరుగా మారితే పరిణామాలు భయానకంగా ఉంటాయి. ప్రపంచ శాంతి అల్లకల్లోలం అవుతుంది. అణ్వాయుధ ప్రయోగానికి కూడా వెనకాడనంటూ పుతిన్ ఇప్పటికే బెదిరించడం తెలిసిందే. నాటోకు, రష్యాకు మధ్య ఈ పోరు ప్రచ్ఛన్న యుద్ధానికి దారి తీయకముందే అమెరికా వంటి దేశం సంధికి ప్రయత్నిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే మధ్యేమార్గంగా కనీసం యుద్ధ విరామానికన్నా ప్రయత్నించి చర్చలకు తెర తీయాలి. పోనీ, యుద్ధం కొనసాగుతుండగానే చర్చలను మొదలుపెట్టినా బాగానే ఉంటుంది. ఏదో ఒక ముగింపు తప్పక దొరికే అవకాశముంటుంది. రష్యా తన విధ్వంసక దాడులను ఆపకపోతే అటు అమెరికా, ఇటు నాటో ఉక్రెయిన్కు ఇలాగే సాయాన్ని కొనసాగించడం తప్పనిసరవుతుంది. కాబట్టి యుద్ధానికి రాజకీయ పరిష్కారం దిశగా రెండు దేశాలు కదిలేలా చేయడానికి ఇదే సరైన సమయం. ఈ బాధ్యతను అమెరికా, నాటో దేశాలే భుజానికెత్తుకోవాలి. లేదంటే దౌత్యం కూడా వీలుపడని స్థాయికి పరిస్థితి చేజారే రోజు ఎంతో దూరం లేదు! -
పుతిన్ సంచలన నిర్ణయం.. ప్రపంచానికి పెను సవాల్?
ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా తయారైంది రష్యా. చిన్నదేశం ఉక్రెయిన్పై ఏకపక్ష యుద్ధానికి కాలు దువ్వింది. పెను విధ్వంసం సృష్టించినా ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా నిలబడటంతో తడబడుతోంది వ్లాదిమిర్ పుతిన్ సేన. దీంతో, ఇప్పుడు అణుబాంబును అటక మీద నుంచి దింపి.. ప్రయోగిస్తానంటూ పుతిన్ బెదిరిస్తున్నాడు. మరోవైపు రష్యాలో సైన్యంలోకి పనికొచ్చే వయసున్న అందరినీ బలవంతంగా ఆర్మీలో చేర్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో లక్షలాది మంది మాకొద్దీ ఆర్మీ జాబ్ అంటూ దేశం విడిచి పోతున్నారు. ప్రపంచానికి పెనుముప్పు.. రష్యా బాధ్యతారహితంగా అణ్వాయుధాలను ప్రయోగిస్తే మాత్రం ప్రపంచం పెను ముప్పులోకి జారిపోవడం ఖాయం. ప్రపంచాన్ని అశాంతిలోకి నెట్టేసేలా అణ్వాయుధాలతో భూమండలాన్ని హింస పెట్టేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ బాధ్యతారహిత వ్యాఖ్యలు, నిర్ణయాలతో దుర్మార్గంగా దూసుకుపోతున్నాడు. ఉక్రెయిన్లో లక్షలాది మంది ఉసురు పోసుకున్న పుతిన్.. హింస అక్కడితో ఆపేదేలే అంటున్నారు. రష్యా ఆయుధాగారంలో అణ్వాయుధాలు కూడా ఉన్నాయి తెలుసా? అని బెదిరిస్తున్నారు. అవసరమైతే అణుబాంబు ప్రయోగించడానికి కూడా ఏమాత్రం వెనుకాడబోమని భయపెడుతున్నాడు. పుతిన్ ఆలోచనలను వ్యతిరేకిస్తోన్న లక్షలాది మంది రష్యన్లు దేశానికి గుడ్ బై చెప్పి పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పారిపోతున్నారు. పారిపోదాం బ్రదర్..! రష్యా సరిహద్దుల్లో ప్రత్యేకించి జార్జియా, ఫిన్లాండ్ దేశాల వైపు సరిహద్దుల్లో నిత్యం ఇలా జనం పోటాపోటీగా తమ కార్లలో, బస్సుల్లోనూ దేశం విడిచిపోతున్న దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజులు అయితే దేశం నుండి ఎవరూ పారిపోకుండా ఉండేందుకు వీలుగా సరిహద్దులను మూసివేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నిపుణులు. రష్యా అధినేత పుతిన్ మనసులో పుట్టిన యుద్ధ కాంక్ష నెలల తరబడి రగులుతూనే ఉంది. అది రేపిన సెగలు ఉక్రెయిన్పై విధ్వంస సంతకాలు చేస్తూనే ఉన్నాయి. పెరుగుతున్న అసహనం.. నెలలు గడిచే కొద్దీ రష్యా అధ్యక్షుడు పుతిన్లో అసహనం పెరిగిపోతోంది. ఉక్రెయిన్ ఇంత ప్రతిఘటన ఇవ్వగలగడానికి కారణం దానికి నాటో దేశాల ఆయుధ సరఫరానే అని పుతిన్ భావిస్తున్నారు. అందుకే నాటో దేశాలనూ, మిగతా ప్రపంచ దేశాలనూ భయపెట్టేలా పుతిన్ ఓ ప్రకటన చేశారు. అవసరమనుకుంటే అణుబాంబులు పేల్చడానికి కూడా వెనకాడేదిలేదని పుతిన్ అల్టిమేటం జారీ చేశారు. ఈ బెదిరింపు ఉక్రెయిన్ ప్రభుత్వానికా? నాటో కూటమికా? లేక పెద్దన్న అమెరికాకా? అన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, తేలికపాటి అణ్వాయుధాలను ప్రయోగించడం ద్వారా ఉక్రెయిన్ ఆర్మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని పుతిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అణుబాంబు పేలుస్తా అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
రష్యా ఆక్రమిస్తోంది.. ‘నాటో’లో త్వరగా చేర్చుకోండి మహా ప్రభో!
కీవ్: ఉక్రెయిన్లోని నాలుగు ఆక్రమిత ప్రాంతాలను తమ దేశంలో అధికారికంగా విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఈ క్రమంలో మిలిటరీ కూటమి నాటోవైపు చూస్తోంది ఉక్రెయిన్. రష్యా ఆక్రమణల వేళ నాటో సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని పశ్చిమ దేశాలను కోరినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఈ మేరకు జెలెన్స్కీ మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అధ్యక్ష కార్యాలయం. ‘ఇప్పటికే నాటో కూటమి ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నామని మేము నిరూపించుకున్నాం. నాటోలో సభ్యత్వం వేగవంతం చేయాలని కోరుతూ చేసే దరఖాస్తుపై సంతకం చేస్తూ మేము నిర్ణయాత్మక అడుగు వేస్తున్నాం. వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రష్యాతో కీవ్ చర్చలు చేపట్టదు. కొత్త అధ్యక్షుడితోనే సంప్రదింపులు చేపడతాం.’ అని వీడియోలో మాట్లాడారు జెలెన్స్కీ. ఉక్రెయిన్లోని ఖేర్సన్, జపోరిజియా, లుహాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ప్రకటన వచ్చిన కొద్ది సేపటికే జెలెన్స్కీ ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా రష్యాలో చేరేందుకే ప్రజలు మొగ్గు చూపినట్లు అక్కడి నేతలు తెలిపారు. దీంతో ఉక్రెయిన్ ప్రాంతాలను అధికారికంగా తమలో విలీనం చేసుకుంది రష్యా. Ukrainian President Volodymyr Zelenskyy signs application for fast-track NATO membership after Russia's annexation of Lugansk, Donetsk, Kherson and Zaporizhzhia.#NATORussia #RussiaUkraineWar #UkraineRussianWar pic.twitter.com/i1YXuJ0B4I — Annu Kaushik (@AnnuKaushik253) September 30, 2022 ఇదీ చదవండి: రష్యా రక్తపిపాసి! ఉగ్రవాదులే ఇలా చేయగలరు: జెలెన్స్కీ -
నాటోతో భేటీ వల్ల ఒరిగేదేమిటి?
సంక్షోభాలు చిక్కబడుతున్నప్పుడు రాగల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులేయడం ఏ దేశానికైనా తప్పనిసరి. దౌత్యపరంగా పైకి ఏం మాట్లాడుతున్నా, పాత విధానాలనే కొనసాగిస్తున్నట్టు కనిపించినా మారుతున్న ప్రపంచపోకడలకు అనుగుణంగా కొత్త ఎత్తుగడలకు దిగడం దేశాలకు అతి ముఖ్యం. నాటో కూటమితో రెండేళ్లక్రితం మన దేశం తొలిసారి రాజకీయ చర్చలు జరిపిందని, ఈ చర్చలు అత్యంత గోప్యంగా ఉంచారని వచ్చిన కథనాలను ఈ నేపథ్యంలో చూడటం తప్పనిసరి. నాటో కూటమి ప్రధాన కార్యక్షేత్రం యూరోప్. ఆ ఖండంలోని 28 దేశాలతోపాటు ఉత్తర అమెరికాలోని అమెరికా, కెనడాలకు సైతం అందులో సభ్యత్వం ఉంది. ఇది ప్రధానంగా సైనిక కూటమే అయినా, ఈ దేశాల మధ్య రాజకీయ చెలిమి కూడా కొనసాగుతుంటుంది. అయితే నాటో దీనికి మాత్రమే పరిమితమై ఉండదు. అది రష్యా, చైనా, పాకిస్తాన్ తదితర దేశాలతో కూడా రాజకీయ, సైనిక చర్చలు కొనసాగిస్తుంటుంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరోప్ దేశాలు ఆర్థికంగా, సైనికంగా బలహీనపడటం... ఈ సంక్షోభ పర్యవసానంగా కమ్యూనిస్టు, సోషలిస్టు భావనల ప్రాబల్యం పెరగడం గమనించిన అమెరికా ‘మార్షల్ ప్లాన్’ కింద పశ్చిమ, దక్షిణ యూరోప్ దేశాలకు భారీయెత్తున ఆర్థిక సాయాన్ని అందించి అవి కోలుకోవడానికి దోహదపడింది. ఆ దేశాల మధ్య రక్షణ, భద్రతా రంగాల్లో సహకార భావనల్ని పెంపొందించింది. ఈ క్రమంలోనే ఆ దేశాలు నాటో కూటమిగా ఆవిర్భవించాయి. పైకి ఎన్ని చెప్పినా ఆనాటి సోవియెట్ యూనియన్ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయడం నాటో ఏకైక లక్ష్యం. అటు తర్వాత అమెరికా ప్రయోజనాలు ప్రపంచంలో ఏమూల దెబ్బతిన్నా నాటో సైనికంగా రంగంలోకి దిగడమే ప్రధాన కార్యక్రమం అయింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి సాగినంతకాలం నాటోకు గడ్డురోజులే. మీ భద్రత కోసం అమెరికా ప్రజల సొమ్ము ఎందుకు వృథా చేయాలన్నది ట్రంప్ తర్కం. ఇకపై ఏ రకమైన సైనిక శిక్షణ, సైనిక స్థావరాల నిర్వహణైనా యూరోప్ దేశాలు తగిన మొత్తం చెల్లిస్తేనే సాధ్యమని ఆయన ప్రకటించి, ఆ దిశగా చర్యలు కూడా ప్రారంభించారు. పరిస్థితులు ఎల్లకాలమూ ఒకేలా ఉండబోవన్న జ్ఞానోదయం నాటోకు కలిగింది అప్పుడే. తన దోవ తాను చూసుకోవడం తప్పనిసరన్న గ్రహింపు కలిగింది కూడా ఆ సమయంలోనే. ఆ తర్వాత నాటో తీరు మారింది. ట్రంప్ పోయి బైడెన్ వచ్చినా, మునుపటి విధానాలే కొనసాగిస్తామని హామీ ఇచ్చినా ఆ కూటమి భరోసాతో లేదు. ఆ తర్వాతే చైనాతో సంప్రదింపులు చేస్తుండటం, పాకిస్తాన్కు సైనిక శిక్షణ ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. నాటో కూటమిలోని వేరే దేశాలు అభ్యంతర పెట్టినా ప్రధాన దేశమైన జర్మనీ రష్యాతో నార్డ్ స్ట్రీమ్–2 గ్యాస్ పైప్లైన్ ఒప్పందం కుదుర్చుకోవడం ఆ కూటమిలోని పొరపొచ్చాలకు అద్దం పడుతుంది. ఉక్రెయిన్పై దురాక్రమణ తర్వాత రష్యా విషయంలో జర్మనీ వైఖరి మారింది గానీ లేనట్టయితే ఆ బంధం మరింత బలపడేది. వర్తమాన ప్రపంచంలో మన దేశం ప్రాముఖ్యతేమిటో నాటో సరిగానే గ్రహించింది. అయితే కీలకమైన అంశాల్లో దాని వైఖరికీ, మన వైఖరికీ ఎంతమాత్రం పొసగదు. నాటో రష్యాను బూచిగా చూస్తున్నది. దాని దూకుడు యూరో–అట్లాంటిక్ భద్రతకు ముప్పు తెస్తుందని నమ్ముతోంది. మనకు అది మిత్ర దేశం. చైనాతో అమెరికాకు సమస్యలున్న మాట వాస్తవమే అయినా, నాటో మాత్రం ఆ దేశంతో ఉదారంగా ఉంటున్నది. చైనా కారణంగా సవాళ్లు ఎదురవుతున్నది నిజమే అయినా, ఆర్థికరంగంలో ఎదగడానికి ఆ దేశం ఉపకరిస్తుందని నాటో దేశాలు భావిస్తున్నాయి. ఆ ధోరణి మనకు మింగుడుపడనిది. ఇక తాలిబాన్ల విషయంలో నాటోది సైతం అమెరికా తోవ. దాన్నొక రాజకీయ శక్తిగా నాటో పరిగణిస్తోంది. ప్రస్తుతం అఫ్ఘాన్లో తాలిబాన్ల ఏలుబడి వచ్చింది కనుక మన దేశం తప్పనిసరై దానితో ఏదోమేరకు సంబంధాలు నెరపవలసి వస్తోంది. నాటోకూ, మనకూ ఇలా భిన్న ఆలోచనలున్నప్పుడు ఆ కూటమికి దగ్గరకావడం వల్ల ఒరిగేదేమిటన్నది కీలకమైన ప్రశ్న. అయితే సంప్రదింపుల వల్ల మన ఆలోచనల వెనకున్న కారణాలు గ్రహించడం నాటోకు సులభమవుతుంది. 2019 డిసెంబర్లో మన దేశానికీ, నాటోకూ జరిగిన చర్చలను ఈ కోణంలో చూడటం అవసరం. కోవిడ్ ఉత్పాతంవల్ల తదుపరి సంప్రదింపులు జరగలేదు. నాటోలో సభ్యత్వం తీసుకోవడం, కనీసం సాగరప్రాంత భద్రత వంటి అంశాల్లో భాగస్వామిగా ఉండటం వంటివి మన దేశంపై ప్రభావం చూపకమానవు. ప్రస్తుతం మన దేశం ఏదోమేరకు తటస్థత పాటిస్తున్న భావన కలిగిస్తోంది. నాటో సభ్యత్వం తీసుకున్న మరుక్షణం అది పోయి పాశ్చాత్యదేశాల మిత్రదేశమన్న ముద్రపడుతుంది. అంతర్జాతీయంగా భారత్ సమతూకం పాటిస్తున్నదన్న అభిప్రాయం అంతరిస్తుంది. సహజంగానే మన దేశం ఈ పరిస్థితిని కోరుకోదు. రష్యాతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధపడదు. పైగా పాకిస్తాన్ భాగస్వామ్య దేశం హోదాలో నాటోతో సంబంధాలు నెరపుతోంది. అది మన దేశానికి నచ్చదు. సభ్యదేశాలైన టర్కీ, గ్రీస్ వంటి వాటితో ఆ కూటమి ఇప్పటికే ఇబ్బందులు పడుతోంది. భారత్, పాకిస్తాన్లతో అలాంటి తలనొప్పులు భరించడానికి నాటో సిద్ధపడకపోవచ్చు. ఏదేమైనా నాటోతో సంబంధాలు నెరపే అంశంలో మన దేశం ఆచితూచి అడుగేయాలి. ప్రపంచంలో ఘర్షణ వాతావరణం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో మన నిర్ణయాలు ఎలాంటి పర్యవసానాలు కలిగిస్తాయన్నది బేరీజు వేసుకోవాలి. -
ఈ యుద్ధంలో శృంగభంగం ఎవరికి?
ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా పనయిపోయిందనీ, పుతిన్ నుంచి అధికారం చేతులు మారనుందనీ, రష్యన్లు తమ ప్రభుత్వాన్ని ఏవగించుకుంటున్నారనీ, గత కొన్ని నెలలుగా పాశ్చాత్య మీడియా ఊదరగొట్టింది. ఈ ప్రచారంలో ఏ హేతువూ లేదని తేలిపోతోంది. రష్యాలో అధికారం చేతులు మారడం మాట అటుంచి, అమెరికా విశ్వసనీయత, నాటో వైఖరే ఇప్పుడు ప్రమాదంలో పడింది. యూరోపియన్ ఆర్థిక వ్యవస్థలు మెల్లగా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తున్నాయి. రష్యాపై అవి విధించిన ఆంక్షలు వారికే ఎదురు తన్నుతున్నాయి. యుద్ధం అనివార్యంగా తీసుకొచ్చే అలసట పాశ్చాత్య కూటమిలో చీలికలను తెచ్చే సూచనలు కనబడుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఆవరణలో రష్యా తిరిగి పైచేయి సాధించనుందని అమెరికా భయపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా పనయిపోతోం దంటూ పాశ్చాత్య ప్రపంచం సాగిస్తున్న ప్రచారం, ప్రచ్చన్నయుద్ధ కాలంలో కూడా ఇంత తీవ్రస్థాయిలో జరిగి ఉండదు. దీనికి తోడుగా విరుద్ధమైన వార్తలను తొక్కిపెట్టడం లేదా తుడిచిపెట్టేయడం ద్వారా రష్యా తన సైనిక చర్యలకు సంబంధించి పూర్తిగా విఫలమైందంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ రకమైన అంచనా ఏ స్థాయికి వెళ్లిందంటే, రష్యన్ ప్రజల్లో తీవ్ర అసమ్మతి పెరిగిన కారణంగా రష్యాలో ప్రభుత్వ మార్పు అనివార్యమని చెప్పేంతవరకూ! ప్రజల జీవితాలను ధ్వంసం చేసి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన విధ్వంసకరమైన యుద్ధంలో రష్యా చిక్కుకు పోయిందనీ, అదే రష్యన్ల అసమ్మతికి కారణమైందనీ పాశ్చాత్య దేశాలు ప్రచారం చేస్తూవచ్చాయి. వాస్తవానికి ఈ యుద్ధంలో రష్యా వ్యతిరేక పాశ్చాత్య కూటమి బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. యూరోపియన్ దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా విధించిన ఆంక్షలు ఆ దేశాలను ఇలా దెబ్బ కొట్టాయన్న మాట. రష్యన్ సైనిక, రాజకీయ ఉద్దేశాలకు సంబంధించి పాశ్చాత్య నిఘావర్గాలు దారుణ వైఫల్యం చెందాయి. మార్చి నెలలో కీవ్ నుంచి, ఉక్రెయిన్ ఉత్తర ప్రాంతాలనుంచి సైనిక ఎత్తుగడల కారణంగా రష్యన్ బలగాలు వెనక్కు తిరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయసూచకంగా పోలండ్లో కాలు మోపి, పక్కనే క్రెమ్లిన్లో ఉన్న రష్యన్ ప్రభుత్వానికి వినిపించేలా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పతనాన్ని ప్రకటించేశారు. ఉక్రెయిన్లో సైనిక ఘర్షణ ఒక కొసకు చేరింది కానీ ఫలితం వేరేలా ఉంది. యుద్ధంలో నష్టపోవడం రష్యాకు అలవాటు లేదు. లేదా సుదీర్ఘ యుద్ధం కొనసాగించగల అనంతమైన సామర్థ్యం కలిగిన దాని చరిత్ర నిస్సందేహంగా ఈ వాస్తవాన్ని రుజువు చేస్తోంది. ఇది రష్యాకు తన ఉనికికి సంబంధించిన ఘర్షణ. ఇక అమెరికా, నాటోలకు అయితే, రష్యాను బలహీనపర్చడానికి 2014 నుంచి ప్లాన్ చేసి, అమలు పర్చిన సైనిక కుట్రలో చివరి ఆట మాత్రమే. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బెర్గ్ ఇటీవలే నర్మగర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టారు కూడా. ఏ దేశమైనా భౌగోళిక రాజకీయపరంగా దెబ్బ తిన్న తర్వాత కూడా రష్యన్ సమాఖ్యలాగా కోలుకుని తిరిగి పైకి లేవగలదు. కానీ నెపోలియన్ లేదా హిట్లర్ చేతుల్లో ఓడిపోయి ఉంటే రష్యా చరిత్ర మరో రకంగా ఉండేది. చారిత్రక దృక్పథంలో నుంచి చూస్తే ఉక్రెయిన్ సైనిక ఘర్షణలో కీలకమైన అంశం ఇదే మరి. పాశ్చాత్య దేశాల ప్రచారంలోని ఈ భ్రమాత్మకమైన విజయో త్సాహం హేతుబద్ధ ఆలోచననే మసకబార్చింది. వాస్తవానికి అమెరికాకు అందుబాటులో ఉన్న హేతుపూర్వకమైన అవకాశం ఏమిటంటే, ఈ సైనిక ఘర్షణకు ముగింపు పలకడమే. ఉక్రెయిన్, రష్యా ప్రతినిధి బృందాలు ఇస్తాంబుల్లో సమావేశమై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పుడు, మాస్కో అంచనాలకు అను గుణంగానే ఉక్రెయిన్ను నిస్సైనికీకరణ చేయాలనీ, తటస్థ స్థితిని పాటించాలనీ, విడిపోయిన రెండు డోన్బాస్ రిపబ్లిక్కుల స్వాతంత్య్రాన్ని గుర్తించాలనీ, క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా కూడా గుర్తించాలనీ ఇరుదేశాల మధ్య దాదాపుగా ఒప్పందం కుదిరినట్లుగా కనిపించింది. అది అమెరికాకు కూడా ఆమోద నీయమైన ఒప్పందంగా ఉండేది కానీ రష్యాను చిత్తుగా ఓడించ గలమనీ, క్రెమ్లిన్లో ప్రభుత్వ మార్పిడి కూడా జరిగిపోతుందనే భారీ అంచనాలతో మత్తెక్కి ఉన్న బైడెన్ పాలనా యంత్రాంగం కీవ్లోని తోలుబొమ్మ ప్రభుత్వాన్ని నమ్ముకుని ఇస్తాంబుల్ ఒప్పందాన్ని కుదరనీయకుండా చేసింది. ఆ తర్వాత సైనిక ఘర్షణ కొత్త దశకు చేరుకుంది. మరీయూ పోల్లో రష్యా విజయం సాధించడమే కాదు, అజోవ్ సముద్రంపై కూడా పట్టు సాధించింది. డోన్బాస్ పాలనా సరిహద్దుల వెనక్కు ఉక్రెయిన్ బలగాలు తిరిగిపోయేలా తీవ్ర దాడిని ప్రారంభించింది. దీంతో 2014లో ఉక్రెయిన్ ప్రభుత్వం తలపెట్టిన కుట్రకు ముందునాటి పరిస్థితులు తిరిగి ఏర్పడ్డాయి. తాజాగా సెవరెదోనెట్స్క్– లీసిచాన్స్క్ ప్రాంతంలో సాధించిన అద్భుత విజయాలతో, వెనువెంటనే స్లావ్యాన్స్క్, క్రామతోర్స్క్ ప్రాంతాలపై కూడా రష్యా దాడి మొదలెట్టింది. దీంతో ఉక్రెయిన్ బలగాల చివరి రక్షణ పంక్తి కూడా మరి కొన్ని వారాల్లో విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడటం ఈ మొత్తం యుద్ధంలో చివరి ముగింపు కానుంది. మొత్తంమీద ఈ సైనిక ఘర్షణ బైడెన్ యంత్రాంగం విశ్వసనీయతనూ, నాటో వైఖరినీ దెబ్బతీసింది. వాస్తవానికి అమెరికా యుద్ధానికి ముగింపు పలికే స్థానంలో ఉండి కూడా అలా చేయలేకపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్లో నెలకొన్న పరిస్థితి ప్రపంచ ప్రేక్షకుల ముందు అమెరికా శక్తికున్న పరిమితులను బహిర్గతం చేస్తుందనీ, భౌగోళిక రాజకీయ ఆవరణలో రష్యా తిరిగి పైచేయి సాధించనుందనీ బైడెన్ యంత్రాంగం భయపడుతోంది. పైగా బహళ ధ్రువ ప్రపంచానికి అనుకూలత అనివార్యం అయేటట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో చైనా అగ్రరాజ్యంగా ఎదిగే ప్రమాదం పొంచి ఉందని అమెరికా భీతిల్లుతోంది. మరో విషయం ఏమిటంటే, యుద్ధం అనివార్యంగా తీసుకొచ్చే అలసట పాశ్చాత్య కూటమిలో చీలికలను తీసుకువస్తున్న సూచనలు కనబడుతున్నాయి. యూరోపియన్ ఆర్థికవ్యవస్థలు మెల్లగా ఆర్థిక మాంద్యంలోకి ప్రవేశిస్తున్నాయి. రష్యాపై అవి విధించిన ఆంక్షలు బూమెరాంగ్గా వారికే ఎదురు తన్నుతున్నాయన్న మాట. అంతకు మించి, రష్యా ఒక కొత్త వ్యవస్థను ఏర్పర్చబోతోంది. ఇది అమెరికా ట్రాన్స్ అట్లాంటిక్ నాయకత్వంపై భవిష్యత్తులో తీవ్రమైన ఫలితాలను తీసుకురానుంది. అలాగే, ఉక్రెయిన్ యుద్ధంలో ఆంగ్లో–అమెరికన్ల కాళ్లకింది నేల నాటకీయంగా మార్పు చెందుతోంది. ఈ తరుణంలో ఒప్పందం కుదిరితే ఇస్తాంబుల్లో ఆనాడు కుదిరిన ఒప్పందానికి అనుగుణంగానే ఉండబోతుంది. నిజంగానే ఇప్పుడు డోన్బాస్ పాలనా సరిహద్దులను నిర్ణయించిన 2014 నాటి ఒప్పందాన్ని పాశ్చాత్యకూటమి యథా తథంగా అంగీకరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా... క్రిమియాను రష్యా లోతట్టుప్రాంతంతో అనుసంధానించడం ద్వారా ఖేర్సన్, జొపోరోజియాతో పాటు క్రిమియా ఉత్తర ప్రాంతంలోకి రష్యా సులువుగా కాలు మోపేందుకు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. పైగా పాశ్చాత్య దేశాలు తనపై విధించిన అన్ని ఆంక్షలను తొలగించాలని కూడా రష్యా డిమాండ్ చేసే అవకాశం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. స్పష్టంగానే అలాంటి లొంగుబాటును అంగీకరించినట్లయితే ఉక్రెయిన్లో జెలెన్స్కీ ప్రభుత్వం కుప్పగూలడం ఖాయం. అదే సమయంలో ఉక్రెయిన్లో 2014 నుంచి అమెరికా నిఘా సంస్థ సీఐఏ అమలు చేస్తున్న కుట్ర మొత్తంగా భగ్నమైపోతుంది. ఉక్రెయిన్ రాజకీయాల్లో నాటి అధ్యక్షుడు ఒబామా తరపున తలదూర్చి 2014 కుట్రలో భాగం పంచుకున్న బైడెన్కు ఈ పరిణామం రాజకీయంగా తలనొప్పిని తెచ్చిపెడుతుంది. 2024లో అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యే అవకాశం లేకుండా పోతుంది. ఉక్రెయిన్లో జరగనున్న చివరి పరిణామంలో పాస్ కావాలని బైడెన్ భావిస్తున్నారు. యుద్ధం ద్వారా లాభాలను ఆశిస్తున్న వారి వైఖరీ ఇదే. అత్యధు నాతనమైన పాశ్చాత్య ఆయుధ వ్యవస్థలతో కూడిన రైలు ఉక్రెయిన్ వైపు పరుగెడుతున్నప్పుడు అక్కడి బ్లాక్ మార్కెట్ లక్షా 20 వేల డాలర్ల లాభాలపై కన్నేసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం వచ్చే శరదృతువు నాటికి మరొక చివరి పరిణామం కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఎం.కె. భద్రకుమార్ వ్యాసకర్త మాజీ రాయబారి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రపంచానికి ప్రమాద ఘంటికలు.. ‘నాటో’ విస్తరణకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు!
స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో జూన్ 28 నుండి 30 వరకూ ‘నాటో’ సదస్సు జరిగింది. ఇందులో నాటో మిలిటరీ కూటమి విస్తరణౖకై తీవ్ర ప్రమాదకర నిర్ణయాలు వెలువడ్డాయి. ఐరోపాలో నాటో సైనికుల సంఖ్యను పెంచడంతోపాటు, ఆ కూట మిని మొదటిసారిగా ఆసియా పసిఫిక్ ప్రాంత దేశా లలో విస్తరించే ప్రణాళికలు తయారైనాయి. ప్రస్తుతం యూరప్ లోనున్న 40 వేల సంసిద్ధతా దళాలను ఒకే సారి 3 లక్షల వరకూ పెంచుతామనీ, లెక్కలేనన్ని యుద్ధ ట్యాంకులను, విమానాలను రష్యా సరిహద్దుకు పంపిస్తామనీ; రష్యా, చైనాలతో నూతన వ్యూహాత్మక పోటీకి దిగుతామనీ నాటో ప్రధాన కార్యదర్శి స్టోల్టెన్ బర్గ్ అన్నాడు. లాత్వియా, లిథువేనియా, ఎస్తోనియా దేశాల్లో ఉన్న సైనిక శిబిరాలకు బ్రిగేడ్ హోదా కల్పిస్తా మనీ నాటో అంటోంది. నార్డిక్ తటస్థ దేశాలైన నార్వే, స్వీడన్లను తన పరిధిలోకి నాటో ఆహ్వానించటంతో దశాబ్దాల యూరప్ భద్రత ప్రశ్నార్థకమయింది. ‘‘ఈ దేశాల్లో మిలిటరీ మౌలిక సదుపాయాలతో నాటో స్థావరాలను మోహరిస్తే అందుకు దీటుగా మా ప్రతిస్పందన ఉంటుం’’దని పుతిన్ అన్నాడు. ఉక్రె యిన్ను అడ్డం పెట్టుకొని రష్యాతో పరోక్ష యుద్ధం చేస్తూ, శాంతి చర్చలు కాదని యూరప్ కల్లోలానికి కారణమైన నాటో కూటమి యూరప్లో భారీగా మిలి టరీ మోహరింపునకు సన్నద్ధం అవుతూనే, ‘‘మా భద్రతకు, మా ఆసక్తులకు, విలువలకు చైనా విసిరే సవాళ్ళను స్వీకరించటానికి ఆసియా పసిఫిక్ దేశాలకు కూడా నాటోను వ్యాప్తి చేస్తాం’’ అని నాటో ప్రధాన కార్యదర్శి అన్నాడు. చదవండి👉లుహాన్స్క్లో జెండా పాతేశాం: పుతిన్ చైనా సరిహద్దుల వరకు వెళ్ళటం తమ విధానాలలో వచ్చిన మార్పు అని చెప్పుకొచ్చాడు. రష్యాపై దాడి చేయటానికి అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి పాశ్చాత్య నాటో దేశాల కాల్బలంతో పాటు... ఆయా దేశాల నౌకలు, యుద్ధ విమానాలతో మూకుమ్మడి దాడిని గంటల వ్యవధిలో చేస్తాయని స్టోల్టెన్బర్గ్ యుద్ధోన్మాదాన్ని బయటపెట్టాడు. నాటో కూటమి రష్యాతో యుద్ధంలో పాల్గొనదని అధ్యక్షుడు బైడెన్ చాలాసార్లు చెప్పినా... ఆచరణలో ఉక్రెయిన్ మిలిటరీ ముసుగున అనేకమంది నాటో సైని కులు, సలహాదారులు, శిక్షణలు ఇచ్చే జనరల్స్ను ఉక్రెయిన్కు నాటో పంపింది. రష్యాకు చెందిన వందల కోట్ల డాలర్లను విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసి, ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటానికి కంకణం కట్టుకొన్న పశ్చిమ దేశాలు, 1918 తర్వాత మొదటిసారిగా రష్యా చెల్లించవల్సిన వాయిదాను తీర్చలేని స్థితికి తీసుకు రాగలిగాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా పాల్గొంటున్న నాటో ఇప్పటివరకూ విజయాలను సాధించలేకపోయింది. తూర్పు డోనబాస్ ప్రాంత మంతా రష్యా ఆధీనంలోకి రావటంతోపాటు, నల్ల సముద్ర తీర ప్రాంతాలు 90 శాతం రష్యా సేనలు ఆక్ర మించడం గమనార్హం. రష్యా–ఉక్రెయిన్ వివాదం ద్వారా నాటో యుద్ధ కూటమి ఐక్యంగా బయటకు కనబడటానికి ప్రయత్ని స్తోంది. కానీ అంతరంగాన నాటో సభ్యదేశాల మధ్య లుకలుకలున్నాయి, చర్చల ద్వారా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ఒత్తిడి వస్తోంది. ప్రపంచం మొత్తంలో రెండంకెలు దాటిన ద్రవ్యోల్బణంతో పాటు రికార్డు స్థాయిలో నిరుద్యోగం, ధరలు పెరుగు తున్నాయి. అమెరికా, చైనా కూటములకు తటస్థంగా భారత్ ఉండి అలీనోద్యమ పూర్వ వైభవానికి కృషి చేస్తే... ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణుల నుండి కాపాడుకొనే అవకాశాలుంటాయి. ఆంక్షల ఫలితంగా యూరప్ ఇంధన సమస్య తీవ్ర స్థాయికి చేరుకొంది. తొందరలోనే ప్రపంచ ఆర్థిక మాంద్యం సంభవించ వచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నాటో విస్తరణ ఏ పరిస్థితులకు దారి తీస్తుంది? చదవండి👉ట్రంప్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అదే జరిగితే అధ్యక్ష పోటీ ఆశలు గల్లంతు వ్యాసకర్త: బుడ్డిగ జమిందార్, కె.ఎల్. యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ‘ మొబైల్: 98494 91969 -
నాటో భద్రతకు రష్యాతో ముప్పు
మాడ్రిడ్ (స్పెయిన్): నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గజేషన్ (నాటో) సభ్య దేశాల శాంతిభద్రతలకు రష్యా నేరుగా ముప్పుగా పరిణమించిందని అమెరికా సహా పలు దేశాలు ఆందోళన వెలిబుచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద భద్రతా ముప్పుని ఎదుర్కొంటున్నామన్నాయి. యూరప్లో ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత కుదుర్చుకున్న భద్రతాపరమైన ఒప్పందాలను రష్యా తుంగలోకి తొక్కి ఉక్రెయిన్పై దండెత్తిందని ధ్వజమెత్తాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో బుధవారం నాటో సభ్య దేశాల వార్షిక సదస్సు జరిగింది. అనంతరం 30 దేశాల నాటో కూటమి ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు రాజకీయంగా, ఆచరణీయంగా మద్దతిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యూరప్లో శాంతిని విచ్ఛిన్నం చేశారని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోటెన్బెర్గ్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నాటో సభ్య దేశాలకు భద్రతాపరంగా పెను సవాళ్లు విసురుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలండ్లో శాశ్వత సైనిక కేంద్రం యూరప్కు మరిన్ని అమెరికా బలగాలను తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ప్రాంతీయ భద్రత కోసం పోలండ్లో తొలి శాశ్వత మిలటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమెరికాకు చెందిన లక్ష బలగాలు నిరంతరం యూరప్లో ఉండేలా చూస్తామన్నారు. -
ఫిన్లాండ్, స్వీడన్లకు రూట్ క్లియర్... కూటమిలోకి ఆహ్వానం
Agreement that paves the way for Finland and Sweden to join NATO: ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మాడ్రిడ్లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. అదీగాక టర్కీ తన అభ్యంతరాలను ఉపసంహరించుకునేలా ఒప్పందం కుదుర్చోకోవడంతో ఆయా దేశాలు నాటోలో చేరే మార్గం సుగమం అయ్యిందని నాటో చీఫ్ స్టోలెన్బర్గ్ చెప్పారు. ఈ మేరకు టర్కీ, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు ఆయుధాల ఎగుమతులు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంతో సహా టర్కీ ఆందోళనలను పరిష్కరించే దిశగా మెమోరాండంపై సంతంకం చేశాయని చెప్పారు. తదనంతరం నాటో నాయకులు ఫిన్లాండ్, స్వీడన్ దేశాలను అధికారికంగా కూటమిలోకి చేరాలని ఆహ్వానిస్తారని స్టోలెన్బర్గ్ తెలిపారు. దీంతో ఫిన్లాండ్, స్వీడన్ దేశాలకు నాటోలో చేరేందుకు మార్గం సుగమం అయ్యిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాని కూడా అన్నారు. -
Russia-Ukraine war: ఏళ్ల తరబడి ఉక్రెయిన్ యుద్ధం!
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ చెప్పారు. జర్మనీ వార పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరు దేశాల నడుమ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉందని, దానికి అందరూ సిద్ధపడాలని చెప్పారు. ప్రపంచదేశాలు ఉక్రెయిన్కు వివిధ రూపాల్లో ఇస్తున్న మద్దతును ఇలాగే కొనసాగించాలని సూచించారు. మద్దతును బలహీనపర్చరాదని అన్నారు. జవాన్లను కలుసుకున్న జెలెన్స్కీ చాలారోజులుగా రాజధాని కీవ్కే పరిమితం అవుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా మైకోలైవ్, ఒడెసాలో జవాన్లను, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందిని కలుసుకున్నారు. స్వయంగా మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై ఆరా తీశారు. విశేషమైన సేవలందిస్తున్న పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. వారి సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. మైకోలైవ్లో జెలెన్స్కీ పర్యటన ముగిసిన కొద్దిసేపటి తర్వాత రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. ప్రావ్డైని, పొసద్–పొక్రోవ్స్క్, బ్లహోదట్నే ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ఫిరంగులతో దాడి చేశాయి. గలిస్టీన్ కమ్యూనిటీలో రష్యా దాడుల్లో ఇద్దరు మరణించారు. జవాన్లలో అడుగంటుతున్న నైతిక స్థైర్యం! ఉక్రెయిన్– రష్యా మధ్య నాలుగు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న సైనికుల్లో నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. తరచూ సహనం కోల్పోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఇరు దేశాల సైన్యంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. డోన్బాస్లో ఇరు పక్షాల నడుమ భీకర పోరాటం సాగుతోందని, ఆదే సమయంలో జవాన్లు నిరాశలో మునిగిపోతున్నారని పేర్కొంది. -
Russia-Ukraine War: ఉక్రెయిన్ వెన్నంటే..
కీవ్: ఉక్రెయిన్కు బాసటగా నిలుస్తామని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, రొమేనియా అధినేతలు మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ వెంటే ఉంటామని ఉద్ఘాటించారు. వారు గురువారం అనూహ్యంగా ఉక్రెయిన్లో పర్యటించారు. ఈయూలో చేరాలన్న ఉక్రెయిన్కు ఆకాంక్షకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ ఉజ్వల భవిష్యత్తు కోసం తాము చేయాల్సిందంతా చేస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ హామీ ఇచ్చారు. నాలుగు దేశాల అధినేతలు తొలుత రైల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకున్నారు. శివారులోని ఇర్పిన్లో పర్యటించారు. రష్యా దాడుల్లో ఇర్పిన్లో జరిగిన విధ్వంసాన్ని చూసి చలించిపోయారు. రష్యా రాక్షసకాండను ఎవరూ మర్చిపోలేరని జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి యూరప్ దేశాలు సాయం అందిస్తాయని ఇటలీ అధినేత మారియో డ్రాఘీ చెప్పారు. ఈ మానవీయ విషాదాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదని రొమేనియా అధ్యక్షుడు క్లౌస్ ఐయోహన్నిస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కీవ్లో నేతలు హోటల్లో ఉండగా బయట ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించడం గమనార్హం. వారి పర్యటనతో నైతిక స్థైర్యం పెరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. యుద్ధక్షేత్రం సెవెరోడొనెట్స్క్ డోన్బాస్లోని సెవెరోడొనెట్స్క్ సిటీ వద్ద భీకర పోరు సాగుతోంది. నగరాన్ని 90 శాతం రష్యా సేనలు ఆక్రమించాయి. అజోట్ కెమికల్ ప్లాంట్లో 500 మంది పౌరులు, ఉక్రెయిన్ సైనికులు తలదాచుకుంటున్నారు. ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి అందుతున్న ఆయుధాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని రష్యా సైన్యం దాడులు సాగిస్తోంది. మరోవైపు పశ్చిమ లెవివ్లో జొలోచివ్ శివారులో నాటో దేశాలు సరఫరా చేసిన ఆయుధాల డిపోను లాంగ్–రేంజ్ క్షిపణులతో ధ్వంసం చేశామని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ ప్రకటించారు. రెండేళ్ల దాకా ఉక్రెయిన్ ఉంటుందా? కేవలం ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకోవడమే తమ లక్ష్యం కాదని, ఒకదేశంగా ఉక్రెయిన్ను పూర్తిగా తెరమరుగు చేయాలన్నదే అసలు ఉద్దేశమని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ చెప్పారు. పశ్చిమ దేశాల నుంచి సహజ వాయువు కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని ఉక్రెయిన్ కోరుకోవడం, రెండేళ్లలో డబ్బు చెల్లించాలని భావిస్తుండడంపై మెద్వెదేవ్ స్పందించారు. రెండేళ్లలో ప్రపంచ పటంపై ఉక్రెయిన్ ఉంటుందని ఎవరు చెప్పగలరని ప్రశ్నించారు. మరిన్ని ఆయుధాలు: నాటో ఉక్రెయిన్కు సైనిక సాయం విషయంలో రష్యా హెచ్చరికలను నాటో దేశాలు లెక్కచేయడం లేదు. మరిన్ని లాంగ్–రేంజ్ ఆయుధాలు అందజేస్తామని తాజాగా ప్రకటించాయి. అదనంగా బిలియన్ డాలర్ల సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అదనపు సాయానికి జర్మనీ కూడా అంగీకారం తెలిపింది. యుద్ధ రంగంలో తమ సేనలు వీరోచితంగా పోరాడుతున్నాయని జెలెన్స్కీ ప్రశంసించారు. 112 రోజులుగా సాగుతున్న యుద్ధంలో శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంటున్నాయని చెప్పారు. -
100 రోజుల వార్.. మరుభూమిగా ఉక్రెయిన్.. దశలవారీగా ఏమేం జరిగిందంటే?
ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగి నేటికి 100 రోజులు. ఏడాదికి పైగా సన్నాహాలు జరిపి ఫిబ్రవరి 24న హఠాత్తుగా దాడికి దిగాయి పుతిన్ సేనలు. ‘ఉక్రెయిన్ నిస్సైనికీకరణ’ కోసం ‘ప్రత్యేక సైనిక చర్య’ ప్రకటనతో ప్రపంచ దేశాలకు పుతిన్ షాకిచ్చారు. కానీ కీవ్ను పట్టుకుని అధ్యక్షుడు జెలెన్స్కీని తప్పించి కీలుబొమ్మ సర్కారును గద్దెనెక్కించాలన్న ఆశలు మాత్రం నెరవేరలేదు. అమెరికా, పశ్చిమ దేశాలు భారీగా అందిస్తున్న ఆయుధాల సాయంతో రష్యాను ఉక్రెయిన్ దీటుగా ప్రతిఘటిస్తోంది. దాంతో సైనికంగా కనీవినీ ఎరగని నష్టాలతో, వాటికి తోడు పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలతో రష్యా సతమతమవుతోంది. నాటో విస్తరణను అడ్డుకోవడం, ఉక్రెయిన్ అందులో చేరకుండా చూడటం కూడా పుతిన్ యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. కానీ స్వీడన్, ఫిన్లండ్ వంటి తటస్థ యూరప్ దేశాలు కూడా రక్షణ కోసం నాటో గూటికి చేరాలని నిర్ణయించుకోవడానికి యుద్ధమే కారణమవడం ఆయనకు మింగుడుపడని పరిణామమే. 70 లక్షలకు పైగా ఉక్రేనియన్లు శరణార్థులుగా దేశం వీడటంతో పాటు మొత్తమ్మీద కోటిన్నరకు పైగా నిరాశ్రయులైన వైనం గుండెల్ని మెలిపెట్టింది. ఉక్రెయిన్ను మరుభూమిగా మార్చడమే గాక ప్రపంచమంతటినీ ధరాభారం, ఆహార కొరత వంటి పెను సమస్యల వలయంలోకి నెట్టిన యుద్ధంపై ఓ సింహావలోకనం... మొదటి దశ భీకర దాడి ఫిబ్రవరి 24: ఉక్రెయిన్వ్యాప్తంగా భారీ క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడింది. అధ్యక్ష భవనంలోకి చొరబడి ప్రెసిడెంట్ జెలెన్స్కీని హతమార్చేందుకు రష్యా పారాట్రూపర్లు విఫలయత్నం చేశారు. ఫిబ్రవరి 25: దేశం వీడాలని జెలెన్స్కీకి అమెరికాతో పాటు పలు దేశాధ్యక్షులు సూచించారు. అందుకు సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. కానీ ఆయన ససేమిరా అన్నారు. ‘‘కీవ్లోనే ఉన్నా. ఇక్కడే ఉంటా. నా సైనికులతో కలిసి ఆక్రమణదారులను తుది రక్తపు బొట్టు దాకా ఎదుర్కొంటా’’ అంటూ వీరోచిత వీడియో సందేశంతో సైన్యంలో స్థైర్యం నింపారు. ఫిబ్రవరి 28: తొలి ఐదు రోజుల యుద్ధంలో ఉక్రెయిన్ విపరీతంగా నష్టపోయింది. కీవ్ విమానాశ్రయం కూడా రష్యా దళాల చేతికి వచ్చినట్టు కన్పించింది. ఇరు దేశాలు తొలి దఫా చర్చలు జరిపాయి. మార్చి 2: కీలకమైన రేవు పట్టణం మారియుపోల్ను రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఖెర్సన్పైనా పట్టు సాధించాయి. 2014లో ఆక్రమించిన క్రిమియాకు రష్యా నుంచి భూమార్గాన్ని దాదాపుగా ఏర్పాటు చేసుకున్నాయి. రెండో దశ ఎదురుదెబ్బలు మార్చి 4: జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని రష్యా ఆక్రమించింది. ఈ క్రమంలో జరిగిన బాంబు దాడుల్లో ఓ రియాక్టర్ దెబ్బ తినడంతో యూరప్ మొత్తం వణికిపోయింది. మార్చి 6: రష్యా సైన్యానికి గట్టి ఎదురుదెబ్బలు తాకడం మొదలైంది. కీవ్లోకి వాటి రాకను అడ్డుకునేందుకు ఇర్పిన్ నదిపై బ్రిడ్జిని పేల్చేయడంతో రష్యా సేనల కదలికలు నెమ్మదించాయి. మార్చి 11: 40 మైళ్లకు పైగా పొడవున్న రష్యా సాయుధ శ్రేణి కీవ్కేసి సాగుతూ కన్పించింది. దాన్ని ఉక్రెయిన్ దళాలు అడుగడుగునా దాడులతో అడ్డుకుంటూ, నష్టపరుస్తూ చీకాకు పెట్టాయి. రష్యా సాయుధ వాహనాలపై తొలిసారిగా డ్రోన్ దాడులకు దిగాయి. ఆ ఫుటేజీని కూడా బయట పెట్టాయి. మారియుపోల్లో స్టీల్ ఫ్యాక్టరీని స్థావరంగా చేసుకుని భారీ ప్రతిఘటనకు ఉక్రెయిన్ దళాలు శ్రీకారం చుట్టాయి. 25వ రోజు మార్చి 22: రష్యాకు నష్టాలు నానాటికీ పెరగడం మొదలైంది. యుద్ధంలో వెనకంజ వేస్తున్న తొలి సంకేతాలు వెలువడ్డాయి. రష్యా సైన్యం వద్ద ఆహార, ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. వాటికి సరఫరాలు కూడా సజావుగా అందని వైనం వెలుగులోకి వచ్చింది. సైనికులతో పాటు భారీ సంఖ్యలో ఉన్నతాధికారులు కూడా చనిపోతూ వచ్చారు. ‘యుద్ధంతో ఇప్పటిదాకా మేం సాధించిందేమీ లేద’ంటూ పుతిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ పెదవి విరిచారు! మూడో దశ వెనకడుగు, వ్యూహం మార్పు మార్చి 29: పోరులో ఉక్రెయిన్ పై చేయి సాధిస్తున్న వైనం స్పష్టమైంది. నాలుగు దఫాల చర్చల్లో ఏమీ తేలకపోయినా కీవ్, చెహిర్నివ్ నగరాల వద్ద సైనిక మోహరింపులను బాగా తగ్గిస్తామంటూ రష్యా అనూహ్య ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సైన్యాల భారీ ప్రతిఘటనతో కీవ్ను ఆక్రమించలేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. తూర్పున ఇప్పటికే సగానికి పైగా తమ అనుకూల వేర్పాటువాదుల అధీనంలో ఉన్న డోన్బాస్ను పూర్తిగా ఆక్రమించి యుద్ధానికి గౌరవప్రదంగా ముగింపు పలికేలా పుతిన్ వ్యూహం మార్చారు. 50వ రోజు ఏప్రిల్ 14: రష్యాకు యుద్ధ నౌక మాస్క్వాను ఉక్రెయిన్ నల్లసముద్రంలో ముంచేసి భారీ దెబ్బ కొట్టింది. డ్రోన్లతో దృష్టి మళ్లించి నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైల్తో చేసిన ఈ దాడిలో నౌకతో పాటు వందల మంది సిబ్బంది కూడా జలసమాధయ్యారు. రష్యా కోలుకునేదాకా ఒకట్రెండు వారాల పాటు యుద్ధ తీవ్రత కాస్త తగ్గింది. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షల తీవ్రత మరింతగా పెరిగింది. 75వ రోజు మే 9: విక్టరీ డే సందర్భంగా యుద్ధానికి సంబంధించి పుతిన్ కీలక ప్రకటనలు చేస్తారని అంతా భావించినా ఆయన మాత్రం సాదాసీదా ప్రసంగంతోనే సరిపెట్టారు. నాలుగో దశ మారియుపోల్ పతనం మే13: డోన్బాస్లో కూడా రష్యా సేనలకు ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. డొనెట్స్ నది దాటే ప్రయత్నంలో ఉక్రెయిన్ దాడిలో భారీ సైనిక నష్టం చవిచూశాయి. ఖర్కీవ్ శివార్ల నుంచీ రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్ దళాలు వెనక్కు తరిమాయి. మే 17: మూడు నెలల పోరాటం తర్వాత స్టీల్ ప్లాంటులోని సైనికులంతా లొంగిపోవడంతో మారియుపోల్ పూర్తిగా రష్యా వశమైంది. 98వ రోజు జూన్ 1: రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేయాలని యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. 99వ రోజు జూన్ 2: ఉక్రెయిన్కు అత్యాధునిక మధ్య శ్రేణి క్షిపణులు ఇవ్వాలని అమెరికా, ఇంగ్లండ్ నిర్ణయించాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
నాటోలో చేరిక.. ఫిన్లాండ్, స్వీడన్లకు షాక్..?
Turkey Blocking Sweden and Finland NATO Bids: ఉక్రెయిన్లో రష్యా ఆక్రమణ దాడులు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిన్లాండ్, స్వీడన్.. నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. నాటో చేరువద్దంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రస్సెల్స్లోని నాటో ప్రధాన కార్యాలయంలో బుధవారం అందజేయనున్నాయి. ఇక, ఈ రెండు దేశాలకు నాటో సభ్యత్వం దక్కలంటే.. అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఏ ఒక్క దేశం వ్యతిరేకంగా ఉన్నా కొత్త దేశం నాటోలో చేరలేదు. అయితే, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో చేరికపై అగ్రరాజ్యం అమెరికా సహా మరిన్ని దేశాలు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. కానీ, టర్కీ మాత్రం అడ్డుపుల్ల వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డోగన్.. రష్యా దాడుల భయంతోనే ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరేందుకు ముందుకు వచ్చాయని సెటైరికల్గా ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి ఈ రెండు దేశాలు కుర్దీస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తున్నాయని కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ తగిలింది. దీంతో టర్కీ అడ్డుపడుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. నాటోలో చేరేందుకు సిద్ధమైన స్వీడన్, ఫిన్లాండ్ దేశాధినేతలతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీ కానున్నారు. వైట్హౌస్ వేదికగా గురువారం స్వీడన్ ప్రధాని మాగ్డెలినా అండర్సన్,ఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోలతో బైడెన్ సమావేశం కానున్నట్లు వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వీరి మధ్య భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది కూడా చదవండి: అమెరికాలో కరోనా కల్లోలం.. బైడెన్ కీలక నిర్ణయం -
మీరొస్తానంటే.. నేనొద్దంటా!
స్టాక్హోమ్: నాటో కూటమిలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను టర్కీ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. అవి కుర్దిష్ మిలిటెంట్లకు సాయం చేస్తున్నాయని ఆరోపించింది. టర్కీ అభ్యంతరాలు నాటో కూటమిలో కలకలం సృష్టిస్తున్నాయి. టర్కీ వ్యాఖ్యల్లో ఇటీవలి కాలంలో మార్పు వచ్చిందని ఫిన్లాండ్ ప్రధాని నినిస్టో అన్నారు. చర్చలతో సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. నాటోలో చేరాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ఫిన్లాండ్ పార్లమెంట్ మంగళవారం 188–8 ఓట్లతో మద్దతు పలికింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సభ్యత్వ దరఖాస్తులను బ్రస్సెల్స్లోని నాటో కేంద్ర కార్యాలయంలో అందించారు. టర్కీ అభ్యంతరాల నేపథ్యంలో వీటి సభ్యత్వంపై నిర్ణయానికి సమయం పట్టవచ్చని అంచనా. టర్కీతో చర్చలకు బృందాన్ని పంపుతామన్న స్వీడన్ ప్రతిపాదనను కూడా ఎర్డోగన్ వ్యతిరేకించారు. టర్కీతో చర్చలకు ఎదురుచూస్తున్నామని, నాటో దేశాలతోనూ చర్చిస్తున్నామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా చెప్పారు. టర్కీ అభ్యంతరాలు అమెరికాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. వాటి సంబంధాలు ఇటీవల బాగా క్షీణించాయి. రష్యా నుంచి టర్కీ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను కొనడం అమెరికాకు నచ్చలేదు. చర్చలే చర్చలు నాటోలో చేరాలని నిర్ణయించిన స్వీడన్, ఫిన్లాండ్ ప్రధానులతో త్వరలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చర్చిస్తారని వైట్హౌస్ వర్గాలు తెలిపాయి. వీటిపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు టర్కీ విదేశాంగ మంత్రి కవుసోగ్లు అమెరికాకు పయనమ్యారు. ఈ రెండు దేశాలు ఏళ్లుగా తటస్థంగా ఉంటున్నాయి. నాటోలో చేరితే తీవ్ర పరిణామాలుంటాయని వాటిని రష్యా పలుమార్లు హెచ్చరించింది. మంగళవారం ఇద్దరు ఫిన్లాండ్ దౌత్యాధికారులను రష్యా బహిష్కరించింది. చదవండి: (ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు) నార్డిక్ దేశాలు నాటోలో చేరడంపై టర్కీ అభ్యంతరాలు త్వరలో సమసిపోతాయని నాటో అధికారులు అంచనా వేస్తున్నారు. వీటి చేరికను పలు యూరప్ దేశాలు స్వాగతించాయి. తమ దేశం కోరిన ఒక్క కుర్దిష్ నాయకుడిని కూడా నార్డిక్ తమకు దేశాలు అప్పగించలేదని టర్కీ ఆరోపించింది. నాటోలో కొత్తగా సభ్యత్వం పొందాలంటే ప్రస్తుతమున్న 30 సభ్యదేశాలు ఏకగ్రీవంగా అంగీకరించాల్సిఉంది. స్టీల్ ప్లాంట్ ఫైటర్ల తరలింపు మారియుపోల్లో చిక్కుకున్న తమ సైనికులను రక్షించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తోంది. 264 మందిని తరలించామని తెలిపింది. మరోవైపు డోన్బాస్లో పలు నగరాలపై రష్యా బాంబింగ్ కొనసాగుతూనే ఉంది. సివియర్డొనెట్స్క్లో 10మంది మరణించారు. పశ్చిమాన లివివ్పైనా రష్యా దాడులు చేసింది. ఖార్కివ్లో మాత్రమే ఉక్రెయిన్ సేనలకు కొంత ఊరట లభించింది. నగరానికి సమీపంలోని రష్యా సరిహద్దు వద్దకు ఉక్రెయిన్ సేనలు చేరుకున్నాయి. ఇకపై డోన్బాస్ నగరాలపై రష్యా తీవ్రంగా విరుచుకుపడవచ్చని బ్రిటన్ ఇంగ్లండ్ హెచ్చరించింది. -
అనుకొన్నదొకటి! అయినదొకటి!
అవును. ఉక్రెయిన్ విషయంలో రష్యాకు ఎదురైన అనుభవం ఇదే! పొరుగింటి ఉక్రెయిన్ ‘నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్’ (నాటో)కు దగ్గరవుతుండడంతో, భద్రతకు ముప్పు ఉందంటూ రష్యా యుద్ధానికి దిగింది. అమెరికా అగ్రాధిపత్య బాహువుల్లోకి పొరుగు దేశాలు చేరకుండా తమ సైనికచర్య అడ్డుకుంటుందని రష్యా భావించింది. తీరా అందుకు సరిగ్గా వ్యతిరేకంగా జరుగుతోంది. ఉక్రెయిన్ లొంగకపోగా, ప్రచ్ఛన్నయుద్ధ కాలం నుంచి తటస్థంగా ఉన్న ఫిన్లాండ్, స్వీడన్ సైతం ‘నాటో’కు దగ్గరవుతున్నాయి. ఆ దేశాల ప్రకటనలు, వాటి సభ్యత్వానికి పెరుగుతున్న మద్దతు చూస్తే– రష్యా అభీష్టానికి భిన్నంగా ‘నాటో’ బలపడుతోందన్న మాట. యుద్ధాన్ని ఆపాల్సిన పాశ్చాత్య దేశాలేమో చిత్తశుద్ధితో ఆ ప్రయత్నం చేయకపోగా, ఉక్రెయిన్కు మరింత ఆయుధ సంపత్తి తరలిస్తూ, అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. వెరసి, సులభంగా నివారించదగ్గ యుద్ధం ఓ అంతులేని కథగా, పలు ఆర్థిక పర్యవసానాలతో ప్రపంచానికి వ్యధగా మారింది. ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగమైన ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియాలు 2004 లోనే ‘నాటో’లో చేరాయి. 200 ఏళ్ళుగా సైనిక కూటములకు దూరంగా, తటస్థంగా ఉన్న స్వీడన్ సైతం ఇప్పుడు ‘నాటో’కు వెలుపల ఉంటే, రష్యా నుంచి భద్రతకు ముప్పనే పరిస్థితికి వచ్చింది. ఫిన్లాండ్, ఆ వెంటనే స్వీడన్ ‘నాటో’ వైపు మొగ్గడంతో కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేనట్టు ఈ సైనిక కూటమి విస్తరిస్తోంది. నిజానికి, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ 2019లో ‘నాటో’ బ్రెయిన్డెడ్ అవుతోందని వ్యాఖ్యానించారు. ‘నాటో’ దేశాలకు రష్యా నుంచి రక్షణ అవసరమైతే ట్రంప్ సారథ్యం లోని అమెరికాను నమ్మలేమనే భయాల మధ్య ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. తీరా మూడేళ్ళలో పరిస్థితి మారిపోయింది. ‘నాటో’లోని 30 దేశాల్లో 8 మాత్రమే నిరుడు తమ జీడీపీలో 2 శాతాన్ని రక్షణకు ఖర్చు చేశాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాలన్నీ రక్షణ వ్యయాన్ని బాగా పెంచేశాయి. స్వీడన్ ప్రధాని అన్నట్టు – ఈ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టడానికి ముందు ‘నాటో’ వేరు. ఇప్పుడు వేరు. మాస్కోకు భయపడి ఏళ్ళ తరబడి చేతులు ముడుచుకు కూర్చున్న పొరుగు దేశాలు రెండూ రష్యాకు తగిలిన తాజా ఎదురుదెబ్బలతో ఇప్పుడు ధైర్యంగా రెక్కలు చాస్తున్నాయి. ఫిన్లాండ్, స్వీడన్ల చేరికతో బాల్టిక్ సముద్ర ప్రాంతాన్ని కాపాడుకోవడంలో ‘నాటో’ బలం పెరుగుతుంది. అక్కడ రష్యా బలగాలకు కేంద్రమైన కలినిన్గ్రాడ్ దిగ్బంధమైనట్లవుతుంది. నిజా నికవి ఇప్పటి దాకా కూటమిలో చేరలేదన్న మాటే కానీ, సన్నిహిత భాగస్వాములుగా మెలిగాయి. కూటమిలో చేరిక వల్ల ఒప్పందంలోని 5వ ఆర్టికల్ కింద సభ్యదేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా, అన్నింటి పైనా జరిగినట్టే భావించి, ఇతర దేశాలన్నీ రక్షణకు కదలి వస్తాయి. అయితే, దీనికి కొన్ని బాలారిష్టాలు లేకపోలేదు. ‘నాటో’ సభ్యదేశమైన టర్కీ కొత్తగా ఈ రెండు దేశాలకు సభ్యత్వమివ్వ డాన్ని వ్యతిరేకిస్తోంది. తీవ్రవాద సంస్థలకు స్వీడన్ పెంపుడు కేంద్రమని ఆరోపిస్తోంది. కూటమి విస్తరణపై జర్మనీ, ఫ్రాన్స్లు ఆచితూచి మాట్లాడుతుంటే, రష్యాతో అనుబంధమున్న హంగరీ తన వైఖరి స్పష్టం చేయలేదు. అలాగని రష్యాను బలహీనపరచడానికి అంది వచ్చిన అవకాశాన్ని అమెరికా, దాని అనుంగు దేశాలు అంత తేలిగ్గా వదులుకోవు. అలా ‘నాటో’ బలోపేతం కావడానికి రష్యా పరోక్ష కారణమవుతోంది. ‘నాటో’ విస్తరణ ఇప్పటికే ఐరోపాలో ఉద్రిక్తతల్ని పెంచుతోంది. ఇన్ని రోజులుగా యుద్ధం చేస్తున్నా, ఉక్రెయిన్ గడ్డపై రష్యా ఘన విజయాలను నమోదు చేయలేకపోయింది. రాజధాని కీవ్ ఇప్పటికీ చేజిక్కలేదు. కీలకమైన ఖార్కివ్ పట్టణ శివారు ప్రాంతాలపై ఆధిపత్యం సంపాదించినా, గత వారం అక్కడ నుంచీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం డాన్బాస్ ప్రాంతంలో తన పట్టును విస్తరించడానికి చూస్తున్నా, ఉక్రెయిన్కు అందుతున్న అపార ఆయుధ సంపత్తితో అదెంత వరకు సాధ్యమో చెప్పలేం. ‘నాటో’ పైనా ఊహించినదానికి విరుద్ధంగా జరగడంతో, రష్యా తన స్వరం మార్చుకోక తప్పలేదు. ఫిన్లాండ్, స్వీడన్ల నిర్ణయం నేరుగా ముప్పు అనుకోవట్లేదని అనాల్సి వచ్చింది. కాకపోతే – ఆ దేశాల్లో గనక ‘నాటో’ మిలటరీ మౌలిక సదుపాయాలను విస్తరిస్తే, తప్పకుండా తగురీతిలో జవాబిస్తామని బింకం చూపింది. బాల్టిక్లో అణ్వస్త్రాలను మోహరిస్తామంటూ మాస్కో బెదిరిస్తోంది కానీ, అసలు యుద్ధమంతా సైబర్ దాడులు, తప్పుడు సమాచార వ్యాప్తి ద్వారానే జరిగే సూచనలున్నాయట. మూడు నెలల క్రితం మొదలుపెట్టిన యుద్ధాన్ని ఎలా ముగించాలో తెలియక రష్యా అస్తుబిస్తు అవుతుంటే, 1949లో ఆరంభమైన ‘నాటో’కూ కొన్ని సమస్యలున్నాయి. ఉక్రెయిన్కు 40 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ పట్ల అమెరికన్ పార్లమెంట్లో భిన్నస్వరాలు వచ్చాయి. రష్యా నుంచి నాటో దేశాలను రక్షించేది లేదని గతంలో అన్న ట్రంప్ లాంటి వారెవరో ఈసారి దేశానికి 47వ అధ్యక్షులైతే ఇబ్బందే. గత నెల ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మరైన్ లీ పెన్ ఓడినా, ఐరోపాలో నాటో వ్యతిరేకత ఇంకా తగ్గనే లేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సిన ఇటలీలో సైతం ఉక్రెయిన్కు ఆయుధాలు పంపాలనీ, రక్షణ వ్యయం పెంచాలనీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అధిక శాతం ఓటర్లు వ్యతిరేకిస్తున్నారు. అంటే, రష్యాను అడ్డుకోవాలి అనుకుంటున్న ‘నాటో’ ముందుగా అంతర్గత బలహీనతలపైన దృష్టి పెట్టక తప్పదు. ఆ సంగతి ఎలా ఉన్నా... ఉక్రెయిన్ పుణ్యమా అని ‘నాటో’ పునరుజ్జీవనం ఐరోపాలోనూ, ప్రపంచంలోనూ పెద్ద పరిణామమే! -
స్వీడన్ నాటో బాట
స్టాక్హోమ్: నాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్ సోమవారం ప్రకటించారు. తద్వారా 200 ఏళ్లుగా అనుసరిస్త్ను తటస్థ వైఖరికి స్వీడన్ ముగింపు పలుకుతోంది. ఈ నిర్ణయాన్ని దేశ రక్షణ విధానంలో చరిత్రాత్మక మార్పుగా మగ్డలీనా అభివర్ణించారు. నాటో సభ్యత్వంతో లభించే భద్రతా గ్యారెంటీలు స్వీడన్కు అవసరమన్నారు. నాటోలో చేరికపై ఫిన్లాండ్తో కలిసి పనిచేస్తామన్నారు. ఈ నిర్ణయానికి స్వీడన్ పార్లమెంట్ రిక్స్డగెన్లో భారీ మద్దతు లభించింది. 8 పార్టీల్లో కేవలం రెండు మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. రెండు దేశాల్లో కూడా నాటో చేరికపై ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వీడన్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. నాటోలో చేరినా తమ దేశంలో అణ్వాయుధాలను, నాటో శాశ్వత బేస్లను అంగీకరించబోమని మగ్డలీనా చెప్పారు. డొనెట్స్క్పై దాడులు ఉధృతం తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్పై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. మారియుపోల్లోని స్టీల్ ప్లాంట్ చుట్టూ వైమానిక దాడులు కొనసాగాయి. పలు పట్టణాలలోని పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఖర్కివ్ చుట్టూ రష్యన్ దళాలు తమను నిరోధించే యత్నాల్లో ఉన్నాయని ఉక్రెయిన్ తెలిపింది. అయితే సరిహద్దులో బెలరాస్ బలగాలున్నందున ఉక్రెయిన్ సేనలు ఉన్నచోటే ఉండి పోరాడడం మేలని బ్రిటీష్ సైన్యం సూచించింది. తూర్పు ప్రాంతంలో రష్యా ఒక ఆస్పత్రిపై జరిపిన దాడిలో ఇద్దరు మరణించారని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యాలో వ్యాపారాల అమ్మకం పలు పాశ్చాత్య కంపెనీలు రష్యాలోని తమ వ్యాపారాలను తెగనమ్ముకుంటున్నాయి. రష్యాలో వ్యాపార విక్రయ ప్రక్రియను ఆరంభించామని మెక్డొనాల్డ్స్ తెలిపింది. సంస్థకు రష్యాలో 850 రెస్టారెంట్లున్నాయి. వాటిలో 62 వేల మంది పని చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సంస్థ లాభాలపై ప్రభావం పడే అవకాశముందని తెలిపింది. ఇదే బాటలో కార్ల తయారీ సంస్థ రెనో సైతం రష్యాలో తమ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థకు స్థానిక అవటోవాజ్ కంపెనీలో ఉన్న 67.69 శాతం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇదే కోవలో పలు పాశ్చాత్య కంపెనీలు పయనించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. (చదవండి: పుతిన్ అనారోగ్యం.. నయం చేయలేనంత రోగమా?) -
ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ
నాటోలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్న ఫిన్లాండ్కు రష్యా మొదటి దెబ్బ రుచి చూపించింది. ఫిన్లాండ్కు రష్యా సరఫరా చేసే విద్యుత్తును శనివారం నుంచి నిలిపివేసింది. ఈ విషయాన్ని ఫిన్నిష్(ఫిన్లాండ్) ఆపరేటర్ ఒకరు ధృవీకరించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో చేరేందుకు ఫిన్లాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఆలస్యం చేయకుండా తమకు సభ్యత్వం ఇవ్వాలంటూ నాటోకు విజ్ఞప్తి చేసింది ఫిన్లాండ్. ఈ పరిణామం రష్యాకు మంట పుట్టించింది. దీన్నొక ‘బెదిరింపు’ చర్యగా అభివర్ణిస్తూనే.. తర్వాతి పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది కూడా. ఈ మేరకు మే 14 నుంచి(శనివారం) విద్యుత్ సరఫరాను ఫిన్లాండ్కు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రష్యా విద్యుత్ సరఫరాదారు కంపెనీ రావో నోర్డిక్ మాత్రం చెల్లింపులకు సంబంధించిన వ్యవహారంతోనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చెల్లింపుల వ్యవహారంపై స్పష్టత ఏంటన్నది ఇటు రావో నోర్డిక్ కంపెనీగానీ, అటు ఫిన్గ్రిడ్ మాత్రం వెల్లడించలేదు. ఫరక్ పడదు ఇరవై ఏళ్ల ఇరు దేశాల వర్తక వాణిజ్యంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉంటే.. విద్యుత్ సరఫరా నిలిపివేతపై ఫిన్లాండ్ స్పందించింది. రష్యా విద్యుత్ సరఫరా నిలిపివేసినంత మాత్రాన ఫరక్ పడదని ప్రకటించుకుంది. సరఫరా చేసుకునేది కొద్ది శాతమే కాబట్టి ఇబ్బంది ఏం ఉండబోదని ఫిన్నిష్ గ్రిడ్ ఆపరేటర్ ప్రకటించారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి ఫిన్లాండ్కు సరఫరా అయ్యేది పది శాతం విద్యుత్ మాత్రమే. ఆ లోటును స్వీడన్ నుంచి దిగుమతి చేయడమో లేదంటే సొంతంగా ఉత్పత్తి చేసుకోవడమో చేస్తామని ఫిన్లాండ్ ప్రకటించుకుంది. కానీ, రష్యా విద్యుత్ చౌకదనంతో పోలిస్తే.. ఫిన్లాండ్ భరించాల్సిన ఖర్చు ఎక్కువే కానుంది. ఇదిలా ఉంటే.. రష్యా ఫిన్లాండ్తో 1,300 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. నాటోలో చేరాలని ఫిన్లాండ్కు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. కేవలం రష్యా బెదిరింపుల మేరకు వెనక్కి తగ్గింది. ఈ మేరకు ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యం, ప్రజా ఒత్తిడి నేపథ్యంలో నాటో సభ్యత్వం కోసం అధికారికంగా ఒక ప్రకటన చేసింది. చదవండి👉🏼: ఉక్రెయిన్ యుద్ధం.. భారత్ కీలక నిర్ణయం -
నాటో దిశగా ఫిన్లాండ్ అడుగులు
కీవ్: నాటో సభ్యత్వం కోసం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు ఫిన్లాండ్ నాయకులు చెప్పారు. దీంతో ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ ఇకపై రష్యా వ్యతిరేక కూటమిలో చేరబోతున్నట్లవుతోంది. నాటోలో చేరడం ఫిన్లాండ్ రక్షణను బలోపేతం చేస్తుందని, అదేవిధంగా నాటో కూటమి దేశాలకు బలాన్నిస్తుందని ఆదేశ అధ్యక్షుడు సౌలి నినిస్టో, ప్రధాని సన్నా మరిన్ చెప్పారు. నాటోలో వెంటనే చేరాలని, ఇందుకు అవసరమైన చర్యలను రాబోయే రోజుల్లో చేపడతామని తెలిపారు. ఫిన్లాండ్ ప్రకటనపై రష్యా హెచ్చరిక స్వరంతో స్పందించింది. ఆ దేశం నాటోలో చేరితే రష్యాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని, ఉత్తర యూరప్లో స్థిరత్వం నాశనమవుతుందని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. తమ భద్రతకు ముప్పు తెచ్చే చర్యలకు తాము తగిన మిలటరీ చర్యలతో స్పందిస్తామన్నారు. రష్యాతో ఫిన్లాండ్ ఎందుకు ఘర్షణ కోరుతుందో, ఎందుకు స్వతంత్రాన్ని వద్దనుకొని వేరే కూటమిలో చేరుతుందో భవిష్యత్ చరిత్ర నిర్ధారిస్తుందన్నారు. నాటో పొరుగుదేశం స్వీడన్ సైతం త్వరలో నాటోలో చేరడంపై నిర్ణయం తీసుకోనుంది. నాటోలో చేరికకు ఈ దేశాలు దరఖాస్తు చేసుకుంటే వాటిని నాటో దేశాల పార్లమెంట్లు ఆమోదించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నాటోలో చేరాలన్న ఫిన్లాడ్ నిర్ణయాన్ని నాటో సభ్యదేశాలు స్వాగతించాయి. మీ వల్లనే...: నాటోలో చేరాలని తాము భావించేందుకు రష్యానే కారణమని ఫిన్లాండ్ నాయకులు ఆరోపించారు. తమకు హెచ్చరికలు చేసేముందు రష్యా అద్దంలో చూసుకోవాలన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు పరోక్షంగా చెప్పారు. ఉక్రెయిన్కు మద్దతుపై ఇటీవలే ఫిన్లాండ్ నేతలు జెలెన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్పై దాడి వల్లనే ఇంతకాలం తటస్థంగా ఉన్న స్వీడన్, ఫిన్లాండ్ నాటోవైపు మొగ్గు చూపాయి. ఆదేశాల్లో ప్రజానీకం కూడా నాటోలో చేరడంపై సుముఖంగా స్పందించింది. రష్యా దాడి మొత్తం యూరప్ భద్రతను సంశయంలో పడేసిందని ఈ దేశాలు ఆరోపించాయి. ఈ దేశాలు నాటోలో చేరితే తమకు మరింత బలం చేకూరుతుందని నాటో అధిపతి జనరల్ స్టోల్టెన్బర్గ్ అభిప్రాయపడ్డారు. దరఖాస్తు చేసిన రెండువారాల్లో వీటి అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని నాటో అధికారులు చెప్పారు. దాడులే దాడులు..: ఒకపక్క అనుకున్న విజయం దక్కకపోవడం, మరోపక్క తటస్థ దేశాలైన స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరాలనుకోవడం.. రష్యాకు అసహనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తూర్పుప్రాంతంపై రష్యా తన దాడులు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో మారియుపోల్లో మిగిలిన ఉక్రెయిన్ సేనలను తుడిచిపెట్టేందుకు వాయుదాడులు కూడా జరిపింది. ఇది కూడా చదవండి: ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం -
అమెరికా నిర్మించిన రాడార్ స్టేషన్ని ధ్వంసం చేసిన రష్యా
it would consider NATO transport carrying weapons in Ukraine: ఉక్రెయిన్లోని జోలోట్ పట్టణం సమీపంలో అమెరికా నిర్మించిన రాడార్ స్టేషన్ను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్లో ఆయుధాలను మోసుకెళ్లే నాటో రవాణాను నాశనం చేసేందుకు ఉద్దేశించిన లక్ష్యంలో భాగంగా ఆ స్టేషన్ని ధ్వంసం చేసినట్లు రష్యా మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ సాధించిన విజయానికి గుర్తుగా రష్యా బలగాలు ఈ ఘటనకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. పైగా మే 9 రష్యా విక్టరీ డే పురస్కరించుకుని మాస్కోలోని రెడ్ స్క్వేర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైనిక బలగాలకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వ్లాదిమిర్ పుతిన్ తన బలగాలను ఉద్దేశించి ..."మీరు మాతృభూమి కోసం, భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. పైగా మీరు రెండవ ప్రపంచ యుద్ధం నుంచి నేర్చుకున్న పాఠాలను ఎప్పటికీ మర్చిపోరు. అయినా ఈ గడ్డ పై ఉరితీసేవారికి, వేధించేవారికి, నాజీలకు చోటు ఉండదు." అని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ కూడా రష్యా విక్టరీ డే సంర్భంగా ఓ వీడియోను విడుదల చేస్తూ... ఉక్రెయిన్కు రెండు విక్టరీ డేస్లు ఉంటాయని చెప్పడం కొసమెరుపు. పైగా జెలన్ స్కీ కూడా రెండవ ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకులు చేసిన వాటిని ఎప్పటికీ మరచిపోం అని వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు ఇక్కడ 8 మిలియన్లకు పైగా ఉక్రేనియన్లు మరణించడమే కాకుండా ప్రతి ఐదవ ఉక్రేనియన్ ఇంటికి తిరిగి రాలేదన్నారు. ఈ మేరకు ఈ యుద్ధం దాదాపు 50 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొందని జెలెన్ స్కీ అన్నారు. అదీ గాక ఉక్రెయిన్ పై రష్యా నిరవధిక దాడుల జరిపి నేటికి 75వ రోజుకు చేరుకుంది. ఐతే రష్యా ప్రధాన సంధానకర్త వ్లాదిమిర్ మెడిన్స్కీ ఉక్రెయిన్తో శాంతి చర్చలు ఆగలేదని కాకపోతే మెక్కుబడిగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. (చదవండి: అంచనాలను తలకిందులు చేస్తూ.. ఉక్రెయిన్లోని ‘మాతృభూమి’ రక్షణ కోసమే పోరాటం: పుతిన్) -
మేము తలచుకుంటే అరగంటలో నాటో దేశాలన్నీ ధ్వంసం: రోస్కోస్మోస్ చీఫ్
కీవ్/మాస్కో: రష్యా విక్టరీ డే వేడుకల నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యా దేశాల ముఖ్య నేతల వ్యాఖ్యలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము గనుక నిజంగా అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ కేవలం అరగంటలో పూర్తిగా ధ్వంసమైపోతాయని అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న దిమిత్రి రోగోజిన్ తాజాగా మీడియాతో మాట్లాడారు. శత్రువు (పశ్చిమ దేశాలు)ను ఓడించడమే పుతిన్ లక్ష్యమని పేర్కొన్నారు. నాటో తమపై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోందని మండిపడ్డారు. బహిరంగంగా అంగీకరించకపోయినప్పటికీ పశ్చిమ దేశాలు లోలోపల రష్యాపై యుద్ధం సాగిస్తున్నాయని ఆరోపించారు. శత్రువుపై అణ్వాయుధాలను ప్రయోగించే సామర్థ్యం తమకు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అణు యుద్ధం ప్రపంచ పరిణామాలతోపాటు మన భూగోళం స్థితిగతులనే మార్చేస్తుం దని, అందుకే అది తమకు ఇష్టం లేదని వెల్లడిం చారు. బలవంతుడైన శత్రువును ఆర్థిక, సైనికపరమైన మార్గాల ద్వారా, సంప్రదాయ యుద్ధరీతులతోనే ఓడిస్తామని దిమిత్రి రోగోజిన్ పేర్కొన్నారు. చదవండి👉 రష్యా ‘విక్టరీ డే’.. పుతిన్ కీలక ప్రకటన? కాగా, 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యాలో ప్రతిఏటా మే 9న విక్టరీ డే జరుపుకుంటారు. ఈసారి ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో విక్టరీ డేకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. మే 9 రష్యా విక్టరీ డేను ఉద్దేశించి.. ‘చెడు మళ్లీ తిరిగొచ్చింది. అయితే, అది వేరే రూపంలో, వేర్వేరు నినాదాలతో వచ్చింది. కానీ, ప్రయోజనం మాత్రం అదే’ అని పేర్కొన్న సంగతి తెలిసిదే. కాకపోతే ఈసారి ఉక్రెయిన్ దాని మిత్రదేశాలు గెలుస్తాయని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. మంచిపై చెడు ఎన్నడూ విజయం సాధించలేదని అన్నారు. చదవండి👉🏻 వేలంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి జాకెట్.. ఎంత ధర పలికిందంటే? -
మాక్రాన్ గెలుపుతో ఉక్రెయిన్కు ఊరట
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోమారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం సాధించడంతో ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంది. అయితే గతంతో పోలిస్తే లీపెన్కు మద్దతు బాగా పెరిగినట్లు కనిపించింది. అతివాద నాయకురాలు లీపెన్ నెగ్గొచ్చన్న ఊహాగానాలు తొలుత యూరప్ హక్కుల సంఘాలకు, ఉక్రెయిన్ నాయకత్వానికి ఆందోళన కలిగించాయి. ఆమె బహిరంగంగా పుతిన్కు అనుకూలంగా మాట్లాడటం, ఈయూకు, నాటోకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆమె అధ్యక్షురాలైతే తమకు ఒక పెద్ద అండ లోపిస్తుందని జెలెన్స్కీసహా ఉక్రెయిన్ నాయకత్వం భయపడింది. లీపెన్ పదవిలోకి వస్తే జీ7లాంటి కూటములు కూడా ప్రశ్నార్థకమయ్యేవని జపాన్ ఆందోళన చెందింది. లీపెన్పై మాక్రాన్ విజయం సాధించినప్పటికీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య స్వదేశంలో పెరిగిపోతోంది. ఈ అంశాన్ని గుర్తించిన మాక్రాన్ స్వదేశంలో తనను వ్యతిరేకిస్తున్నవారి ధోరణికి కారణాలు కనుగొంటానని, వారిని సంతృప్తి పరిచే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. తాను దేశీయులందరికీ అధ్యక్షుడినన్నారు. అయితే స్వదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విదేశీ వ్యవహారాల్లో పెద్దమనిషి పాత్ర పోషిస్తున్న మాక్రాన్పై స్వదేశంలో చాలామంది గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి మద్దతు ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి ఆరంభం కావడానికి ముందే యుద్ధ నివారణకు మాక్రాన్ చాలా యత్నాలు చేశారు. వ్యక్తిగతంగా పుతిన్తో చర్చలు జరిపారు. యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యా చర్యను ఖండించడంలో ఉక్రెయిన్కు సాయం అందించడంలో ముందున్నారు. అందుకే మాక్రాన్ను నిజమైన స్నేహితుడు, నమ్మదగిన భాగస్వామిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొనియాడారు. పుతిన్ చర్యకు వ్యతిరేకంగా రష్యాపై మాక్రాన్ ఆంక్షలను కూడా విధించారు. అలాగే రష్యా సహజవాయువు అవసరం ఫ్రాన్స్కు లేదని, తాము గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడతామని మాక్రాన్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఇకపై పుతిన్కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్కు మద్దతు కొనసాగిస్తామని మాక్రాన్ చెప్పారు. ఒకపక్క రష్యా చర్యను వ్యతిరేకిస్తూనే పుతిన్తో చర్చలకు తయారుగా ఉన్నానని ప్రకటించడం ద్వారా మాక్రాన్ హుందాగా వ్యవహరించారని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ముదురుతున్న ఈ తరుణంలో ఫ్రాన్స్ ఈ సమతుల్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అయితే అస్తవ్యస్తంగా మారిన ఫ్రాన్స్ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడమనే పెద్ద సవాలు ప్రస్తుతం మాక్రాన్ ముందున్నదని నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అదంత సులభం కాబోదంటున్నారు. ఫ్రాన్స్ పీఠం మాక్రాన్దే ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు మరీన్ లీ పెన్ (53)పై మాక్రాన్ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో ఆయన 66 శాతం ఓట్లు సాధించారు. గెలుపు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తదితరాల నేపథ్యంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నానా అనుమానాలతో, పలు రకాల విభజనలతో అతలాకుతలంగా ఉన్న దేశాన్ని మళ్లీ ఒక్కతాటిపైకి తెస్తా’’ అని ప్రకటించారు. యూరప్ దేశాధినేతలంతా ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాక్రాన్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇండో–ఫ్రాన్స్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఆయనతో మరింతగా కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
Russia War: మరో రెండు దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
కీవ్: ఉక్రెయిన్లో రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఓడరేవు నరగం మరియుపోల్పై రష్యా దాడుల కారణంగా వేల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులు మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. మారియుపోల్ నుండి ఉక్రెయిన్ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి రష్యా ఒప్పుకున్నట్టు ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్చుక్ టెలిగ్రామ్లో స్పష్టం చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం మానవతా కారిడార్పై రష్యాతో ప్రాథమిక ఒప్పందాన్ని పొందినట్టు ఆమె వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం మరియుపోల్ నుంచి ఉక్రెయిన్ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించనున్నట్టు ఇరినా తెలిపారు. కాగా, ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుండి మానవతా కారిడార్ల ద్వారా సుమారు 3,00,000 మంది ఉక్రెయిన్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్టు ఉక్రెయిన్ పేర్కొంది. #Ukrainian Deputy Prime Minister Iryna #Vereshchuk announced that a preliminary agreement on the organization of a humanitarian corridor for the residents of #Mariupol had been reached. pic.twitter.com/WTa57olA3O — NEXTA (@nexta_tv) April 20, 2022 మరోవైపు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరికల పర్వం కొనసాగుతూనే ఉంది. నాటోలో చేరడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఫిన్లాండ్, స్వీడన్లను తాజాగా రష్యా హెచ్చరించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రకటించారు. ఇక, యుద్దం వేళ పుతిన్, జెలెన్ స్కీ మధ్య జెరూసలెంలో శాంతి చర్చల సమావేశాన్ని నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ ఓ ప్రకటనలో తెలిపింది. ‼️#Russia warned #Finland and #Sweden about the consequences of joining #NATO. This was declared by spokeswoman of the Ministry of Foreign Affairs Maria #Zakharova. pic.twitter.com/zt6RqQ7i3T — NEXTA (@nexta_tv) April 20, 2022 ఇదిలా ఉండగా.. బుధవారం రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్కు చెందిన 1053 సైనిక కేంద్రాలను తమ దళాలు అటాక్ చేసినట్టు పేర్కొన్నది. ఉక్రెయిన్కు చెందిన 73 మిలిటరీ సంస్థలపై తమ దళాలు ఫైరింగ్ చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్కు చెందిన 106 ఆర్టిల్లరీ ఫైరింగ్ పొజిషన్స్తో పాటు ఆరు పైలెట్ రహిత విమానాలను కూల్చినట్లు వెల్లడించింది. హై ప్రిషిషన్ మిస్సైల్ దాడి వల్ల 40 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు రష్యా తెలిపింది. ఇది చదవండి: బుధవారం రికార్డు స్థాయిలో ఎండలు.. ఆందోళనలో భారత సైంటిస్టులు -
Russia Warns: ఆ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
మాస్కో: నాటో కూటమిలో చేరాలని స్వీడన్, ఫిన్లాండ్ నిర్ణయించుకుంటే తమ అణ్వాయుధాలను స్కాండినేవియన్ దేశాలకు సమీపంగా మోహరించాల్సిఉంటుందని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిట్రీ మెద్వదేవ్ హెచ్చరించారు. ఈ దేశాలు నాటోలో చేరితే రష్యాకు నాటో సభ్యదేశాలతో ఉన్న సరిహద్దు రెట్టింపవుతుందని, అలాంటప్పుడు తాము సరిహద్దు భద్రతను పెంచుకోవాల్సిఉంటుందని టెలిగ్రామ్లో పోస్టు చేశారు. ఈ దేశాలు నాటో కూటమిలో చేరితే బాల్టిక్ పరిధిలో నాన్ న్యూక్లియర్ స్థితి ఉండదనానరు. గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్లోకి యుద్ధ నౌకలు కూడా పంపాల్సివస్తుందన్నారు. డిమిట్రీ వ్యాఖ్యలను ప్రభుత్వ ప్రతినిధి పెస్కోవ్ సమర్ధించారు. ఉక్రెయిన్పై రష్యా దాడి అనంతరం ఎలాంటి మిలటరీ కూటమిలో చేరకూడదన్న స్కాండినేవియన్ దేశాల ధృక్పథంలో మార్పు వస్తోంది. నాటో సభ్యత్వానికి దరఖాస్తు చేయడంపై చర్చిస్తామని ఫిన్లాండ్, స్వీడన్ తెలిపాయి. మరోవైపు జపాన్ సముద్రంలో రష్యా మిసైల్పరీక్షలు నిర్వహించడాన్ని గమనిస్తున్నామని జపాన్ తెలిపింది. సీ ఆఫ్ జపాన్లో అమెరికా, జపాన్ సంయుక్త విన్యాసాలు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజు రష్యా జలాంతర్గాముల ద్వారా మిసైల్ పరీక్షలు నిర్వహించింది. చదవండి: (రష్యా యుద్ధనౌకకు భారీ నష్టం) అమెరికాపై ఒత్తిడి రష్యాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఉక్రెయిన్కు మరింత అందజేయాలని అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. రష్యాపై యూఎస్ సేకరించిన సమాచారం ఒక్కోమారు ఉక్రెయిన్కు అందజేస్తుండగా, కొన్నిమార్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. రష్యాతో అణుయుద్ధ ప్రమాదం పెరగకుండా ఉండేలా, ఇంటిలిజెన్స్ సోర్సులను రక్షించేలా సమాచారం అందించాల్సిఉంటుందని యూఎస్ వర్గాలు తెలిపాయి. గతంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందించేటప్పుడు అమెరికాకు ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. గతంలో పోగొట్టుకున్న భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే యత్నం చేస్తుందన్న అనుమానం వచ్చినప్పుడు సమాచారాన్ని పరిమితం చేస్తున్నారు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు
కీవ్: ఉక్రెయిన్పై దాడిలో రష్యా అమానవీయంగా ప్రవర్తిస్తుందన్న నివేదికల నేపథ్యంలో ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలివ్వాలని నాటో కూటమి దేశాలు గురువారం నిర్ణయించాయి. రష్యా దారుణాలు నిజమేనని జర్మనీ నిఘా సంస్థ ధృవీకరించినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఒక కూటమిలాగా ఉక్రెయిన్కి సాయం చేయడానికి నాటో నిరాకరించింది. సభ్యదేశాలు విడిగా యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ ట్యాంక్ తదితర ఆయుధాలు, ఔషధాలు ఇచ్చేందుకు అంగీకరించాయి. కూటమిలో ఏ దేశం ఎలాంటి సాయం చేయనుందనే వివరాలు తెలిపేందుకు సెక్రటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్ నిరాకరించారు. ఉక్రెయిన్కు ఆధునిక ఆయుధాలు అందిస్తామని, అక్కడ యుద్ధం కొత్త దశకు చేరుతోందని బిట్రన్ వ్యాఖ్యానించింది. అంతకుముందు రష్యా దాడిని ఎదుర్కొనేందుకు తమకు ఆయుధ సహకారం అందించాలని పాశ్చాత్య దేశాలను, నాటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులెబా కోరారు. నాటో విదేశాంగ మంత్రులతో చర్చలకు ఆయన బ్రసెల్స్ వచ్చారు. ఆయుధాలందిస్తే రష్యా తదుపరి లక్ష్యంగా మారతామని నాటో దేశాల్లో కొన్ని భయపడుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు ఉక్రెయిన్కు అనేక ఆయుధాలను అందించాయి. అయితే విమానాలు, ట్యాంకుల్లాంటి ఆయుధాలను ఇవ్వలేదు. తమకు మిస్సైల్స్, సాయుధవాహనాలు, డిఫెన్స్ సిస్టమ్స్ కావాలని కులెబా కోరుతున్నారు. జర్మనీ లాంటి దేశాలు తమకు మరింత వేగంగా సాయం అందించాలన్నారు. కీవ్, చెర్నిహివ్ ప్రాంతాల నుంచి రష్యా 24 వేల మంది సైనికులను ఉపసంహరించుకుందని, వీరిని తూర్పు ప్రాంతంలో యుద్ధానికి సన్నద్ధం చేస్తోందని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. లుహాన్స్క్, డొనెట్సెక్ ప్రాంతాల్లాగే డోన్బాస్లో కూడా కొన్ని ప్రాంతాలను ఉక్రెయిన్ నుంచి విడగొట్టాలన్నది పుతిన్ యత్నంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. తూర్పు ప్రాంతంపై రష్యా సేనలు దృష్టి పెడుతున్న వేళ అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోవాలని స్థానికులను ఉక్రెయిన్ ప్రభుత్వం కోరింది. రష్యాపై ఆంక్షల రూపంలో ఒత్తిడి పెంచుతామని జీ7 దేశాలు ప్రకటించాయి. హక్కుల మండలి నుంచి రష్యా సస్పెన్షన్ మానవహక్కుల సమాఖ్య నుంచి రష్యాను సస్పెండ్ చేసే తీర్మానానికి ఐరాస ఆమోదం లభించింది. ఈ తీర్మానంపై ఐరాస జనరల్ అసెంబ్లీలో గురువారం ఓటింగ్ జరిగింది. రష్యా సస్పెన్షన్కు అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. ఐరాస శాశ్వత సభ్యదేశాల్లో ఇంతవరకు ఏ దేశం కూడా ఐరాస అనుబంధ విభాగాల నుంచి సస్పెండ్ కాలేదు. -
నాటో, తూర్పు ఐరోపా దేశాలపై పరోక్ష దాడులకు దిగిన రష్యా..!
గత కొన్ని వారాల నుంచి ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా, రెండూ దేశాల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. అయితే, ఇలాంటి సమయంలో రష్యా పరోక్షంగా నాటోపై దాడులు చేసేందుకు సిద్ద పడినట్లు సమాచారం. రష్యా హ్యాకర్లు ఇటీవల నాటో నెట్వర్క్, కొన్ని తూర్పు ఐరోపా దేశాల సైనిక దళాలలకి చెందిన భద్రత వ్యవస్థపై దాడులు చేసేందుకు ప్రయత్నించారని గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ బుధవారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. "కోల్డ్ రివర్/కాలిస్టో" అనే రష్యన్ హ్యకర్ గ్రూప్ ఏ దేశ మిలిటరీని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు అని "Credential Phishing Campaigns" నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. హ్యాకర్లు కొత్తగా క్రియేట్ చేసిన జీమెయిల్ ఖాతాలను ఉపయోగించి నాన్-గూగుల్ ఖాతాలకు ఈ ప్రచారాలను పంపారని, అందువల్ల ఈ ప్రచారాలు ఎంత వరకు విజయవంతం అయ్యాయో అనేది పూర్తిగా తెలియదని ఈ నివేదిక తెలిపింది. ఈ నివేదికపై నాటో ఇంకా స్పందించలేదు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలని రష్యా నిర్ణయం తీసుకున్న తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై భారీగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయితే, అప్పటి నుంచి పాశ్చాత్య దేశాలపై రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ దాడుల ఆరోపణలను ఖండించింది. నాటో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఈ బృందం లక్ష్యంగా చేసుకున్నట్లు నాటి గూగుల్ నివేదిక తెలిపింది. (చదవండి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, భారత్ వృద్ధికి ఇండియా రేటింగ్స్ కోత!) -
యుద్ధ లాభం
-
మీ రక్షణ మా బాధ్యత
వార్సా: ‘‘మీ రక్షణ మా బాధ్యత. రష్యా ఒకవేళ దాడికి దిగితే మేం రక్షిస్తాం. మీ స్వేచ్ఛకు మాది పూచీ’’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలండ్కు హామీ ఇచ్చారు. నాలుగు రోజుల యూరప్ పర్యటన ముగింపు సందర్భంగా పోలండ్ అధ్యక్షుడు ఆంద్రె డూడాతో ఆయన భేటీ అయ్యారు. నాటో కూటమిని విడదీయాలన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలలు కల్లలుగానే మిగిలాయని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ శరణార్థులకు భారీ సంఖ్యలో ఆశ్రయమిచ్చిందంటూ పోలండ్ను కొనియాడారు. శరణార్థులను ఆదుకుంటున్న పోలండ్కు ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. అదనంగా లక్ష మంది ఉక్రెయిన్ వాసులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తామని ఉద్ఘాటించారు. పుతిన్ ఓ నరహంతకుడు వార్సాలో ఉక్రెయిన్ శరణార్థుల శిబిరాన్ని బైడెన్ సందర్శించారు. గంటపాటు శరణార్థులతో మాట్లాడారు. వారి కష్టాలు విని చలించిపోయారు. పుతిన్ నరహంతకుడంటూ మండిపడ్డారు. పుతిన్ దాష్టీకాల వల్ల వేలాది మంది మహిళలు, పిల్లలు పొరుగు దేశాల్లో తలదాచుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శిబిరాల్లో చిన్నారులను చూస్తే మనసు ద్రవిస్తోందన్నారు. పోలండ్కు 20 లక్షల మంది ఉక్రెయిన్తో పోలండ్ దేశం 300 మైళ్ల సరిహద్దును పంచుకుంటోంది. 35 లక్షల మంది ఉక్రెయిన్ శరణార్థుల్లో 20 లక్షల మంది పోలండ్కు చేరుకున్నారు. వారికి స్వచ్ఛంద సంస్థలు, పలు దేశాలు నిత్యావసరాలు పంపిస్తున్నాయి. -
ఉక్రెయిన్ రష్యా యుద్ధం.. నాటోలో కీలక పరిణామం
నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సెక్రటరీ జనరల్గా జెన్స్ స్టోల్టెన్బర్గ్ పదవీకాలాన్ని ఒక సంవత్సరంపాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్ను 2023 సెప్టెంబర్ 30 వరకు పదవీలో కొనసాగించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రస్సెల్స్లో జరిగిన నాటో సదస్సు అనంతరం సభ్య దేశాల నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నార్వే మాజీ ప్రధాని అయిన స్టోలెన్బర్గ్.. నాటో సెక్రటరీ జనరల్గా 2014 అక్టోబర్లో నియమితులయ్యారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తోపాటు నాటో సభ్యత్వ దేశాల అధికారులు బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో కీలక చర్చ జరిగింది. ఈ భేటీలోనే స్టోలెన్బర్గ్ పదవీ కాలాన్ని పెంచేందుకు నాటో దేశాల నేతలు అంగీకారం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలాన్ని పెంచడం గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టోలెన్బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Russia-Ukraine war: కలకలానికి నెల! ‘నాటో సెక్రటరీ జనరల్గా నా పదవీకాలాన్ని 30 సెప్టెంబర్ 2023 వరకు పొడిగించాలని నాటో దేశాధినేతలు నిర్ణయం తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ప్రస్తుతం మేము అతిపెద్ద భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, మా కూటమిని బలంగా, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మేమంతా కలిసి ఐక్యంగా పోరాడతాం’ అని స్టోల్టెన్బర్గ్ ట్వీట్ చేశారు. కాగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, బెల్జియం, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 30కి పెరిగింది. సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపైన అయినా సాయుధ దాడి జరిగితే.. ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా రావాలన్నది ఈ కూటమి ఒప్పందం. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడిని నాటో పలుమార్లు ఖండించిన సంగతి తెలిసిందే. Honoured by the decision of #NATO Heads of State and Government to extend my term as Secretary General until 30 September 2023. As we face the biggest security crisis in a generation, we stand united to keep our Alliance strong and our people safe. https://t.co/06YkRkmX8J — Jens Stoltenberg (@jensstoltenberg) March 24, 2022 -
మాకు మరింత ఆయుధ సంపత్తిని ఇవ్వండి! జెలెన్ స్కీ విజ్ఞప్తి
Russian Phosphorus Bombs Were Used: ఉక్రెయిన్ పై రష్యా నిరవధికంగా గత మూడు వారాలకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. రష్యా ప్రపంచ దేశాల ఆంక్షలను, అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఖతరు చేయకుండా మరింతగా బాంబుల వర్షంతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఫాస్ఫరస్ వంటి ప్రమాదకరమైన బాంబులతో మరింతగా విరుచుకుపడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ ఆవేదనగా చెప్పారు. మళ్లీ ఈ భయానక విధ్వంసంలో పెద్ద ఎత్తున్న పిల్లలు, పెద్దలు మృతి చెందారని అన్నారు. పైగా రష్యా తన భయంకరమై ఆయుధ సంపత్తితో ఎలాంటి ఆంక్షలు లేకుండా యథేచ్ఛగా దాడి చేస్తోందని తెలిపారు. అందువల్ల తమకు విస్తృత ఆయుధ సాయాన్ని అందించాలని నాటోని కోరారు. ఉక్రెయిన్లోని నగరాలను ప్రజలను రక్షించుకునేందకు ఉక్రెయిన్కి ఆంక్షలు లేని సైనిక సహాయం అవసరం అని నొక్కి చెప్పారు. ఇంతవరకు ఆయుధ సామాగ్రిని సమకూర్చిన పాశ్చాత్య సైనిక కూటమి సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ ...మీ యుద్ధ విమానాల్లో ఒక శాతం మాకు ఇవ్వండి. మీ ట్యాంకులలో ఒక శాతం ఇవ్వడం అని కోరారు. అంతేగాక రష్యా తమ దేశంలో ఫాస్ఫరస్ ఆయుధాలతో మోహరించిందని చెప్పారు. రష్యన్ దాడులను ఎదుర్కొనేలా దురాక్రమణకు గురికాకుండా తమ దేశాన్ని రక్షించుకునేందుకు విస్తృతమైన ఆయుధ సాయాన్ని అందించి ఉక్రెనియన్ల మరణాన్ని నిరోధించాలని నాటోకి విజ్ఞప్తి చేశారు. (చదవండి: భారత్ ఆ నిర్ణయం తీసుకుంటే...నేను సంతోషకరమైన రాయబారిని అవుతా!) -
మమ్మల్ని రక్షించండి.. జెలెన్ స్కీ ఆవేదన..
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు (ఫిబ్రవరి 24న) మొదలై నేటికి మార్చి 24 నాటికి నెల రోజులు పూర్తైంది. దాడుల కారణంగా ఉక్రెయిన్ విలవిల్లాడుతోంది. ప్రపంచ దేశాలు తమ వంతు సాయంగా ఉక్రెయిన్కు బాసటగా నిలుస్తున్నప్పటికీ దాడుల తీవ్రత కారణంగా భారీగా నష్టపోయింది. మరోవైపు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా పుతిన్ మాత్రం దాడులను ఆపడం లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచ దేశాల ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తాను మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ దేశంపై రష్యా దాడికి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరులు వీధుల్లోకి రావాలని జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వడానికి, స్వేచ్ఛకు మద్దతు ఇవ్వడానికి, తమ జీవితాలకు మద్దతు ఇవ్వడానికి ఉక్రేనియన్ దేశ జెండాలను చేతపట్టుకొని శాంతి కోసం పోరాడాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ఉక్రెయిన్లో శాంతి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఇళ్లు, స్కూల్స్, యూనివర్సీటీలు, ఆఫీసుల నుంచి శాంతి ర్యాలీలు తీయాలని పేర్కొన్నారు. రష్యా రక్తపాత యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడాలని ఉద్వేగంగా ప్రసంగించారు. అయితే, బ్రస్సెల్స్లో నాటో శిఖరాగ్ర సమావేశానికి కొన్ని గంటల ముందు జెలెన్ స్కీ ఈ వీడియోను విడుదల చేశారు. చర్చల్లో పురోగతి.. ఇదిలా ఉండగా.. రష్యాతో శాంతి చర్చల్లో కొంత పురోగతి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. పలు కీలకాంశాలపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం దిశగా పరిస్థితులు సాగుతున్నాయని తెలిపారు. కాగా, పశ్చిమ దేశాలు మాత్రం రష్యా దిగొస్తున్న సూచనలేవీ ఇప్పటిదాకా కన్పించడం లేదంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ఆపితే అందుకు మేం సిద్ధం
రష్యా సేనలు కాల్పులు ఆపి దేశం వీడటంతో పాటు భద్రతాపరమైన హామీలిస్తే పుతిన్ కోరుతున్నట్టు నాటో సభ్యత్వ డిమాండ్ను పూర్తిగా వదులుకునేందుకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు. ‘‘నాటో విస్తరణకు రష్యా బద్ధ వ్యతిరేకి. మమ్మల్ని చేర్చుకునేందుకు పశ్చిమ దేశాలూ సుముఖంగా లేవు. రష్యా తక్షణం యుద్ధమాపి వెనుదిరగడం మాకు ముఖ్యం. కాబట్టి అందరికీ అంగీకారయోగ్యమైన రాజీ మార్గమిది’’ అన్నారు. తనతో ముఖాముఖి చర్చలకు రావాలని పుతిన్ను కోరారు. నోబెల్ మెడల్ వేలం వేస్తా: మురతోవ్ ఉక్రెయిన్ శరణార్థులకు నిధులు సేకరించేందుకు తన నోబెల్ మెడల్ను వేలం వేస్తానని 2021 నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, రష్యా జర్నలిస్టు ద్మిత్రీ మురతోవ్ ప్రకటించారు. చదవండి: (Ukraine Russia War: రసాయన దాడి ఖాయం: బైడెన్) -
War Crisis: రంగంలోకి దిగిన అమెరికా.. ఉక్రెయిన్ సరిహద్దులకు జో బైడెన్
వాషింగ్టన్: ఉక్రెయిన్లో రష్యా బలగాల దాడి కొనసాగుతోంది. పుతిన్ దళాల దాడిలో ఉక్రెయిన్ అస్తవ్యస్తమైంది. బాంబుల దాడితో పలు నగరాలు ధ్వంసమయ్యాయి. భారీ ఆస్తి నష్టంతో పాలుగా ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఈ వారంలో యూరప్ పర్యటనకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టి దాదాపు నెల రోజులకు చేరుకోబోతోంది. ఈ సమయంలో జో బైడెన్ యూరప్ పర్యటనకు వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా బైడెన్.. బ్రస్సెల్స్ చేరుకొని అక్కడ నాటో, యూరప్ మిత్ర దేశాలతో సమావేశం జరుపనున్నారు. అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్లో బైడెన్ పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుబాతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్లో పరిస్థితులపై చర్చించనున్నట్టు సమాచారం. కాగా, రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు పోలాండ్కు వలస వెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 20 లక్షల మంది శరణార్థులు పోలాండ్కు చేరుకున్నట్లు సమాచారం. అయితే, ఉక్రెయిన్లో బైడెన్ పర్యటన ఉండదని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, దాడుల నేపథ్యంలో బైడెన్.. రష్యా, పుతిన్పై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్కు భద్రతాపరంగా, మానవతా పరంగా ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని అమెరికా స్పష్టం చేసింది. అంతకు ముందు ఉక్రెయిన్కు అమెరికా భారీ సాయం అందజేసింది. మరోవైపు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. పుతిన్తో చర్చలకు తాను సిద్ధమని, ఒకవేళ అవి గనుక విఫలం అయితే తదనంతర పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. -
రష్యాకు చైనా మద్దతు.. ‘నాటో అటువైపునకు వెళ్లకపోవడమే మంచిది’
బీజింగ్: ప్రపంచంలో తూర్పు భాగంవైపు విస్తరించబోమంటూ గతంలో ఇచ్చిన హామీకి ‘నాటో’ కట్టుబడి ఉండాలని చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి లీ యూచెంగ్ డిమాండ్ చేశారు. తూర్పు వైపు విస్తరణ ఆకాంక్షను వదులుకోవాలని నాటోకు హితవు పలికారు. ఆయన శనివారం బీజింగ్లో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడాన్ని ఖండించారు. ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి మూలాలు ప్రచ్ఛన్న యుద్ధంలో, ఆధిపత్య రాజకీయాల్లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఒకవేళ నాటో గనుక తూర్పు వైపు విస్తరిస్తే అది రష్యా శివార్లకు చేరుతుందని పేర్కొన్నారు. రష్యా భద్రతకు అది క్షేమకరం కాదని వెల్లడించారు. అందుకే నాటో విస్తరణ లక్ష్యానికి ముగింపు పలకాలని అన్నారు. రష్యా వైపు వెళ్లకుండా యుగోస్లోవియా, ఇరాక్, సిరియా, అఫ్గానిస్తాన్ దేశాల్లో భద్రతను పటిష్టం చేయాలని సూచించారు. (చదవండి: కుప్పకూలిన నాటో విమానం.. ‘ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో సంబంధం లేదు’) -
కుప్పకూలిన నాటో విమానం.. ‘ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో సంబంధం లేదు’
హెల్సింకీ: నార్వేలో ఆర్కిటిక్ సర్కిల్లో కోల్డ్ రెస్పాన్స్ పేరిట ‘నాటో’ దేశాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమెరికా నావికా దళానికి చెందిన ఎంవీ–22బీ ఓస్ప్రే ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది. ఇందులో ఉన్న నలుగురు అమెరికా నావికాదళం సైనికులు మృత్యువాత పడ్డారు. ఉత్తర నార్వేలోని నార్డ్ల్యాండ్ కౌంటీలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన జరిగింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ఈ సంఘటనతో సంబంధం లేదని నార్వే ప్రధానమంత్రి జోనాస్ గెహర్ స్టొయిరీ, రక్షణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ప్రతికూల వాతావరణం వల్లే అమెరికా విమానం కూలిపోయిందని నార్వే పోలీసులు వెల్లడించారు. ఈసారి నాటో సైనిక విన్యాసాల్లో 27 దేశాలకు చెందిన 30 వేల మంది సైనికులు, 220 విమానాలు, 50 నౌకలు పాల్గొంటున్నాయి. నాటోయేతర దేశాలైన ఫిన్ల్యాండ్, స్వీడన్ కూడా ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటున్నాయి. ఇవి ఏప్రిల్ 1న ముగియనున్నాయి. (చదవండి: ఉక్రెయిన్పై ‘అణు’ ఖడ్గం!) -
Kamala Harris: ఉక్రెయిన్పై కమలా హ్యారిస్ ట్వీట్.. దుమారం
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో వేసిన ఓ ట్విటర్ పోస్ట్ దుమారం రేపుతోంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో భాగమేనంటూ అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన ఆమె.. కాసేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. కానీ, ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో యూరప్లో పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా పోల్యాండ్ వెళ్లిన ఆమె.. అక్కడి ప్రెసిడెంట్ అండ్ర్జెజ్ డూడాతో రష్యా దురాక్రమణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె పోల్యాండ్ అధికారులకు, పోల్యాండ్లోని అమెరికా రక్షణ అధికారులతోనూ భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేసి.. ఉక్రెయిన్ వెంట అమెరికా ఉందంటూ ట్వీట్ చేశారు. అయితే ఆమె చేసిన ట్వీట్లో ఉక్రెయిన్, నాటో కూటమిలో భాగం అని అర్థం వచ్చేలా ఉంది. ఆ పోస్ట్కి నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో అసలు విషయం అర్థమైన ఆమె.. గంట తర్వాత ఆ ట్వీట్ తొలగించి.. మరో ట్వీట్ చేశారు. చివర్లో మరియు and అనే పదం చేర్చి మరోసారి ట్వీట్ చేశారు. కానీ, అప్పటికే కమలా హారిస్ డిలీట్ చేసిన ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్లు షేర్ అయ్యాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలికి వాస్తవ పరిస్థితుల మీద కనీస అవగాహన కూడా లేదు. ఆమె మూర్ఖత్వం మహా ప్రమాదకరమంటూ మాజీ భద్రతా అధికారి డెర్రిక్ కామెంట్ చేశాడు. ఈయనే కాదు.. వేలమంది యూజర్లు కమలా హారిస్ రాంగ్పోస్ట్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. -
టాప్ స్పీడ్లో దూసుకుపోతున్న పుతిన్.. ఆదుకోవాలని జెలెన్ స్కీ ఆవేదన..
కీవ్: ఉక్రెయిన్పై రష్యా బలగాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటి వరకు కీవ్ను టార్గెట్ చేసిన దాడుల చేసిన బలగాలు.. తాజాగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. వైమానిక దాడులతో రష్యా బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాగా, దాడుల నేపథ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా దాడులను ఆపేందుకు తమ దేశ గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించాలని నాటో దేశాలను మళ్లీ కోరారు. ఉక్రెయిన్పై 19వ రోజుకు చేరుకున్న రష్యా దాడుల్లో రాకెట్లు నాటో భూభాగంపైనా పడతాయని జెలెన్ స్కీ హెచ్చరించారు. పుతిన్ ఆపకపోతే.. పశ్చిమ దేశాలతో యుద్దానికి దిగుతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్ సభ్యత్వంపై కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మైకెల్తో తాను మాట్లాడినట్టు జెలెన్ స్కీ తెలిపారు. ఈ క్రమంలో ఈయూలో ఉక్రెయిన్కు సభ్యత్వానికి ప్రాధాన్యమిస్తామని వెల్లడించారని అన్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్కు ఆర్థిక సాయం, రష్యాపై మరిన్ని ఆంక్షలు వంటి అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు. పుతిన్ వార్నింగ్.. ఉక్రెయిన్పై రష్యా దాడుల్లో పుతిన్ గేరు మార్చారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మారుస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్కు ఆయుధాల పరంగా సాయం చేసే దేశాలను తాము టార్గెట్ చేస్తామని పుతిన్ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే రష్యా బలగాలు.. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు విస్తరించి.. పోలాండ్ సరిహద్దుల్లో బాంబు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 35 మంది మృత్యువాతపడగా.. మరో 134 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉండగా సోమవారం మరోసారి ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి చర్చలు జరుగనున్నాయి. -
పశ్చిమ ఉక్రెయిన్పై గురి
లెవివ్/న్యూయార్క్/లండన్: ఇన్నాళ్లూ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో దాడులు సాగించిన రష్యా సైన్యం ఇప్పుడు తొలిసారిగా నాటో దేశాల సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ ప్రాంతంపై గురిపెట్టింది. శుక్రవారం పశ్చిమ ఉక్రెయిన్లోని ఎయిర్పోర్టులపై ఉధృతంగా వైమానిక దాడులు చేసింది. పశ్చిమ లట్స్క్ ఎయిర్ఫీల్డ్పై జరిగిన దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ సైనికులు మరణించారని, ఆరుగురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. ఉక్రెయిన్లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదన్న సంకేతం ఇవ్వాలన్నదే రష్యా ఉద్దేశమని భావిస్తున్నారు. దినిప్రో నగరంలో రష్యా దాడుల్లో ఒక పౌరుడు మరణించాడు. ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతాలపై రష్యా సైన్యం ఇప్పటికే పట్టు సాధించింది. ఉత్తర ప్రాంతంలో స్థానికుల నుంచి భారీ ప్రతిఘటన ఎదురవుతోంది. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకొనేందుకు రష్యా వేగంగా ముందడుగు వేస్తోంది. నగర శివార్లలో నిలిచిపోయిన 64 కిలోమీటర్ల పొడవైన భారీ సైనిక వాహన శ్రేణి ముందుకు కదులుతోంది. కీవ్ను చుట్టుముట్టి, పూర్తిగా దిగ్బంధించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్పై అత్యంత కచ్చితత్వంతో కూడిన లాంగ్రేంజ్ ఆయుధాలు ప్రయోగిస్తోందని రష్యా రక్షణ శాఖ చెప్పింది. ‘స్వచ్ఛంద సైనికులకు’ పుతిన్ అంగీకారం సిరియా నుంచి సైనిక బలగాలను ఉక్రెయిన్కు తరలిస్తామని రష్యా సంకేతాలిచ్చింది. రష్యా తరపున స్వచ్ఛందంగా పోరాడుతామంటూ మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి 16,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగూ చెప్పారు. వారిని సైన్యంలో చేర్చుకొనేందుకు అధ్యక్షుడు పుతిన్ అంగీకారం తెలిపారని వెల్లడించారు. రష్యా నుంచి తమ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు టర్కీకి చెందిన పెగాసస్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. మరోవైపు ఉక్రెయిన్ నుంచి వలసలు ఇప్పటికే 25 లక్షలు దాటినట్టు ఐరాస శరణార్థుల విభాగం ప్రకటించింది. రష్యా ఉత్పత్తులపై భారీ టారిఫ్లు! వాణిజ్యం విషయంలో రష్యాకు ఉన్న ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా’ను తొలగించాలని అమెరికా, ఈయూ దేశాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఇక రష్యాతో వాటి ‘శాశ్వత సాధారణ వాణిజ్య సంబంధాలు’ రద్దవుతాయి. రష్యా పార్లమెంట్ దిగువ సభ డ్యూమాలోని 386 మంది సభ్యులపై ఇంగ్లండ్ శుక్రవారం ఆంక్షలు విధించింది. -
ఉక్రెయిన్ సాయాన్ని అడ్డుకున్న అమెరికా!!
ఉక్రెయిన్కు ప్రత్యక్ష సాయం చేయని అమెరికా.. పరోక్షంగా బయటి నుంచి అందే సాయాన్ని అడ్డుకోవడం విశేషం. అమెరికా ఎయిర్ బేస్ ద్వారా ఉక్రెయిన్కు MiG-29 ఫైటర్ జెట్లను పంపాలనుకున్న పోల్యాండ్ ప్రతిపాదనను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అసలు ఆ ప్రతిపాదనను అమెరికా తప్పు పట్టింది. ఉక్రెయిన్కు సాయం చేయాలన్న పోల్యాండ్ ప్రతిపాదన.. మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమైని పేర్కొంది. జర్మనీలోని రామ్స్టెయిన్లో ఉన్న యూఎస్ ఎయిర్బేస్కు చెందిన సోవియట్ కాలం నాటి విమానాలను ఉక్రెయిన్కు తరలించే ప్రతిపాదనను అమెరికా అధికారులు వ్యతిరేకించారు. ఒప్పందం ప్రకారం MiG-29 ఫైటర్ జెట్లను ఉక్రెయిన్ పంపడం సాధ్యపడదని తెలిపారు. అయితే వాటి స్థానంలో F-16 ఫైటర్లను తరలించవచ్చని చెప్పారు. కానీ, ఇది పోల్యాండ్కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయంపై పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్పై రష్యా వైమానికదాడులు చేస్తున్న క్రమంలో యూఎస్-నాటో ఎయిర్ బేస్ నుంచి MiG-29 ఫైటర్ జెట్లను పోల్యాండ్ పంపాలన్న ప్రతిపాదన సరైంది కాదని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రతిపాదన మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. తాము పోల్యాండ్, ఇతర NATO మిత్రదేశాలతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. లాజిస్టికల్ సవాళ్లతో కూడిన పోల్యాండ్ ప్రతిపాదన సమర్థనీయం కాదని తెలిపారు. మరోవైపు రష్యా బలగాలు.. ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. రష్యా మిలటరీ బలగాలు విధ్వంసం 14వ రోజు కూడా కొనసాగుతోంది. ఇక, ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంతా. చదవండి: భారత్కు రుణపడి ఉంటా: పాక్ విద్యార్థిని భావోద్వేగం -
ఉక్రెయిన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
యుద్ధం వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వరం మారింది. నాటో సభ్యత్వం విషయంలో చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నాటో సభ్యత్వం కోసం ఇకపై కూటమిపై ఎలాంటి ఒత్తిడి చేయబోనని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు రష్యాతో శాంతియుత చర్చల కోసమే తాను సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నాడు. ఏబీసీ న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చాలాకాలం తర్వాత విషయం ఏంటో నాకు అర్థం అయ్యింది. ఉక్రెయిన్ కోసం నాటో సిద్ధంగా లేదు. మిత్రపక్షాలు (Eastern European country) వివాదాస్పద అంశాల జోలికి పోయేందుకు భయపడుతున్నాయి. ముఖ్యంగా రష్యాను ఎదుర్కొనేందుకు అవి సిద్ధంగా లేవు. ఇది గుర్తించడం కాస్త ఆలస్యమైంది. ఈ తరుణంలో నేనే చల్లబడడం మంచిది అనిపించింది. నాటో కోసం నేనింక బతిమాల దల్చుకోవడం లేదు. మోకాళ్లపై కూర్చుని అడుక్కుకోవాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్ కంటూ ఒక ఆత్మగౌరవం ఉంది. ఈ దేశాన్ని(ఉక్రెయిన్ను) అలా చూడాలనుకోవడం లేదు. అలాంటి దేశానికి నేను అధ్యక్షుడిగా ఉండాలనుకోవడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు జెలెన్స్కీ. అంతేకాదు రష్యా స్వతంత్ర్య రాజ్యాలుగా గుర్తించిన ఉక్రెయిన్ రెబల్స్ విషయంలోనూ కాంప్రమైజ్ కావాలని నిర్ణయించుకున్నట్లు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్లో భాగం కావాలనుకునే వ్యక్తులు అక్కడ ఎలా జీవిస్తారన్నది నాకు ముఖ్యం. రష్యన్ ఫెడరేషన్ యొక్క పౌరులుగా తమను తాము చూసే వారి అభిప్రాయంపై నాకు ఆసక్తి ఉంది. అయితే, ఈ సమస్య గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకు నేను సిద్ధం’’ అంటూ ప్రకటించాడు. దీంతో రష్యాతో శాంతియుతంగా సమస్య పరిష్కారానికి జెలెన్స్కీ సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు పంపినట్లయ్యింది. మరి రష్యా నుంచి బదులు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే రష్యా ఆయిల్పై అమెరికా దిగుమతి ఆంక్షలు విధించింది. ఈ తరుణంలో అగ్గిమీద గుగ్గిలంగా ఉన్న పుతిన్.. మరింత రెచ్చిపోతాడా? శాంతిస్తాడా?.. నేడు మూడో దఫా చర్చలపైనే(జరగొచ్చనే ఆశాభావం) ఆసక్తి నెలకొంది. 2008లో ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై అభ్యంతరాలతోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్పై మిలిటరీ చర్యకు దిగాడు. ఫిబ్రవరి 24 నుంచి జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున నాలుగు నుంచి ఏడు వేల మధ్య సైనికులు చనిపోయినట్లు అంచనా. అలాగే ఉక్రెయిన్ తరపు నుంచి నష్టంపై స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. సంబంధిత వార్త: నాటోపై ఆసక్తి లేదంటూనే.. జెలెన్స్కీ డబుల్ గేమ్! -
నాటోపై జెలెన్స్కీ డబుల్ గేమ్!
వాషింగ్టన్: ఒకపక్క నాటో సభ్యత్వం కోరమని, వివాదాస్పద డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలపై చర్చకు సిద్ధమని ప్రకటించిన జెలెన్స్కీ బ్రిటన్ పార్లమెంట్ ముందు చేసిన ప్రసంగంలో భిన్నంగా స్పందించారు. తాము చివరి వరకు పోరాడతామని గతంలో విన్స్టన్ చర్చిల్ చేసిన ప్రసంగంలో భాగాలను ఉటంకించారు. అన్ని రకాలుగా తాము పోరాటం చేస్తామని, ప్రతి చోటా పోరాడతామని, ఎప్పటికీ ఓడిపోమని ఆయన యూఎస్ పార్లమెంట్నుద్దేశించి చేసిన ఆన్లైన్ ప్రసంగంలో చెప్పారు. నాటో తమ కోరిక మేరకు నో–ఫ్లై జోన్ ప్రకటించలేకపోయిందని ఆయన విమర్శించారు. అయితే పాశ్చాత్య దేశాలు తమకు యుద్ధంలో ఎనలేని సాయం చేస్తున్నాయని కొనియాడారు. రష్యాపై ఆంక్షలను మరింత పెంచాలని ఆయన కోరారు. రష్యాను ఉగ్రదేశంగా ప్రకటించాలన్నారు. జెలెన్స్కీ ప్రసంగం లాంటి ప్రసంగాన్ని ఎవరూ చేయలేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. రష్యాపై తప్పక మరిన్ని ఆంక్షలు విధిస్తామన్నారు. రష్యా ఇంధన దిగుమతులపై యూఎస్ నిషేధం రష్యా నుంచి అన్ని రకాల ఇంధన దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. అయితే ఈ చర్యతో తమ దేశంలో ఇంధన ధరలు పెరగవచ్చని, అందుకు అమెరికన్లు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అమెరికా ఇంధన దిగుమతుల్లో రష్యా వాటా 8 శాతముంటుంది. మరోవైపు యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఇంధనావసరాలకోసం అధికంగా ఆధారపడుతున్నాయి. అందుకే యూరప్ దేశాలు తమలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో లేవని గుర్తించామని బైడెన్ చెప్పారు. ఈ దేశాలు రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు తాము సాయం చేస్తామన్నారు. తమ ఇంధన ఎగుమతులపై నిషేధం విధిస్తే క్రూడాయిల్ బ్యారెల్ ధర 300 డాలర్లకు చేరుతుందని ఇప్పటికే రష్యా హెచ్చరించింది. యుద్ధం ఆగుతుందా? ఉక్రెయిన్పై రష్యాదాడికి కీలక కారణమే నాటో సభ్యత్వం. దీనిపై జెలెన్స్కీ స్పష్టత ఇవ్వడంతో కాల్పుల విరమణ ప్రకటన వస్తుందని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే రష్యా కోరినట్లు ఉక్రెయిన్ తటస్థంగా ఉంటుందా?, ఈయూలో చేరికను కూడా కాదనుకుంటుందా? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. తాము కోరిన డిమాండ్లపై పూర్తిస్థాయి స్పష్టత వస్తే తప్ప రష్యా తక్షణ కాల్పుల విరమణ ప్రకటించే అవకాశం లేదన్నది యుద్ధ నిపుణుల విశ్లేషణ. ఇప్పటికే దాడి కారణంగా రష్యాకు అటు మిలటరీ నష్టాలు ఇటు ఆర్థిక కష్టాలు ఎదురయ్యాయి. పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో రష్యా ఎకానమీ దెబ్బతిన్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తమకు నష్ట పరిహారం అందితే తప్ప కాల్పుల విరమణ ప్రకటించమని రష్యా చెప్పే అవకాశాలు అధికమని నిపుణుల భావన. ఉక్రెయిన్ కేవలం నాటో సభ్యత్వం వద్దనుకోవడంతో సరిపోదని, ఈయూలో చేరిక ఆశలను వదులుకోవడం, జెలెన్స్కీ ప్రభుత్వ స్థానంలో రష్యా అనుకూల ప్రభుత్వం ఏర్పడడం, నిస్సైనికీకరణకు అంగీకరించడం వంటి డిమాండ్లకు కూడా ఆమోదం లభిస్తేనే రష్యా యుద్ధం నుంచి వెనుదిరుగుతుందని అంచనా. అయితే ఈ డిమాండ్లకు అంగీకరించమని జెలెన్స్కీ ఇప్పటికే స్పష్టం చేసినందున నాటో సభ్యత్వ తిరస్కరణ అనే ఒక్క అంశంపై రష్యా వెనక్కు తగ్గకపోవచ్చు. (చదవండి: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన) -
ఉక్రెయిన్కు నాటో సాయం.. ఉత్తదేనా?
వాషింగ్టన్: ఉక్రెయిన్లో వైమానిక దాడులను ఉధృతం చేయాలని రష్యా ఒకవైపు యోచిస్తుండగా, మరోవైపు అమెరికా సైతం వ్యూహాలకు పదును పెడుతోంది. రష్యాను ఢీకొట్టడానికి గాను ఉక్రెయిన్ దళాలకు ఫైటర్ జెట్లు అందజేయడానికి నాటో దేశాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, నాటో దేశాల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం గమనార్హం. ఉక్రెయిన్కు Fighter Jets అందజేసి, సహకరించడానికి ఇప్పటిదాకా నాటో దేశాలేవీ ముందుకు రాలేదు. కేవలం ప్రకటనల వరకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన విన్నపాలు సైతం పనిచేయడం లేదు. ఫైటర్ జెట్లు పంపించాలని ఆయన పదేపదే కోరుతున్నా మిత్ర దేశాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. గగనతల శక్తిలో ఉక్రెయిన్ కంటే రష్యా ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. ఉక్రెయిన్ వద్ద కేవలం 67 ఫైటర్ జెట్లు, 34 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. రష్యా అమ్ముల పొదిలో ఏకంగా 1,500 ఫైటర్ జెట్లు, 538 అటాక్ హెలికాప్టర్లు ఉన్నాయి. ఉక్రెయిన్కు ఏ దేశమైనా సహకరిస్తే ఆ దేశం నేరుగా తమపై యుద్ధం సాగిస్తున్నట్లుగానే పరిగణిస్తామని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్కు ఆర్మీని గానీ, వైమానిక దళాన్ని గానీ పంపించబోమని అమెరికా ఇప్పటికే తేల్చిచెప్పింది. చదవండి: యుద్ధ గందరగోళంలో పాపం ఆయన్ని కాల్చి చంపేశారు! -
మేం మీ బానిసలం కాదు: ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం
పాలనాపరంగానే కాదు.. దౌత్య విషయాల్లోనూ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ‘పూర్’ అని నిరూపించుకుంటున్నాడు. ఆ మధ్య వాణిజ్యం పేరిట చైనా పర్యటనకి వెళ్లి మరీ.. వేర్పాటువాద దాడుల విషయంలో అక్షింతలు వేయించుకుని వచ్చాడు. ఇక ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలో రష్యా పర్యటనకు వెళ్లి మరీ తిట్లు తిన్నాడు. ఇప్పుడేమో అమెరికా-యూరప్ మిత్రపక్షాలపై అసంతృప్తి వెల్లగక్కి మరోసారి విమర్శల పాలయ్యాడు. పశ్చిమ దేశాల దౌత్య వేత్తలను ఉద్దేశించి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను ఖండించాలని, తాము విధిస్తున్న ఆంక్షలను సమర్థించాలంటూ పశ్చిమ దేశాల రాయబారులు, ఖాన్ సాబ్ మద్దతు కోరారు. ఈ మేరకు ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ఇవ్వాలని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలతో సహా 22 దౌత్య మిషన్ల అధిపతులు మార్చి 1న సంయుక్త లేఖను విడుదల చేశారు. అయితే.. దీనికి ఇమ్రాన్ ఖాన్ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ‘‘అసలేం అనుకుంటున్నారు? మీరు చెప్పిందల్లా చేయడానికి మేం మీ బానిసలం అనుకుంటున్నారా?. యూరోపియన్ ఎంబాసిడర్లకు నా సూటి ప్రశ్న. ఇలాంటి లేఖ మీరు భారత్కు రాశారా? ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో వాళ్లను(భారత్) నిలదీశారా?. లేదుకదా? మాటిమాటికి మమ్మల్నే ఎందుకు బద్నాం చేస్తారు? మేం అంత తేలికగా దొరికామా?’’ అంటూ ఆదివారం సాయంత్రం ఓ పొలిటికల్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించాడు. అంతేకాదు.. ఆఫ్ఘనిస్తాన్లో పాశ్చాత్య నాటో కూటమికి మద్దతివ్వడం వల్ల పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయిందని, కృతజ్ఞతతో కాకుండా విమర్శలను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ‘‘మేం రష్యాకు స్నేహితులం. అమెరికాకు స్నేహితులం. చైనా, యూరప్ దేశాలతోనూ స్నేహంగానే ఉంటాం. వేరేవాళ్లలాగా క్యాంపులు నడిపించడం మాకు చేతకాదు. అందుకే తటస్థంగా ఉండాలనుకుంటున్నాం’’ అని ప్రకటించాడు ఇమ్రాన్ ఖాన్. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ సంక్షోభంపై దౌత్య వేత్తలు బహిరంగంగా లేఖ రాయడం వల్లే పాక్ ఇలా చిందులు తొక్కుతోంది. -
పోలండ్లో ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వం!
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొనేందుకు అమెరికా, నాటో సభ్యదేశాలు సంకోచిస్తున్నాయి. ఉక్రెయిన్కు మద్దతుగా రష్యాపై నేరుగా దండెత్తితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్న సందేహాలు లేకపోలేదు. ఉక్రెయిన్ నుంచి రష్యా సేనలను ఇప్పటికిప్పుడు బయటకు తరిమేయడం సాధ్యం కాదు కాబట్టి అమెరికా ప్రభుత్వ పెద్దలు కొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ ఆధ్వర్యంలోనే పొరుగు దేశం పోలండ్లో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై అమెరికా దృష్టి పెట్టినట్లు ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది. ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని అధికారిక ప్రభుత్వంగా గుర్తించడంతోపాటు తగిన సాయం అందించడానికి పశ్చిమ దేశాలు రంగం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా స్వాధీనం చేసుకునే పరిస్థితి తలెత్తితే మాత్రం ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయక తప్పదని అమెరికా రక్షణ శాఖ, విదేశాంగ శాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. (చదవండి: మాట తప్పిన రష్యా: ‘ఆపరేషన్ గంగ’కు ఆఖరి దశలో అడ్డంకులు!) -
War Updates: ఉక్రెయిన్కు బ్రిటన్ సాయం.. 400 మిలియన్ పౌండ్లు..
Russia-Ukraine war Live Updates: యుద్ధ వాతావరణం నడుమే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది రష్యా. మరోవైపు తామేమీ తగ్గబోమంటూ ప్రకటించిన ఉక్రెయిన్ సైతం చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో యుద్ధం 12వ రోజు కొనసాగుతుండగా.. చర్చలూ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో.. ►ఉక్రెయిన్కు బ్రిటన్ దేశం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మానవతా దృక్పథంతో 175 మిలియన్ల పౌండ్లను అందజేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ బ్రిటన్ 400 మిలియన్ పౌండ్లను ఉక్రెయిన్కు సాయంగా అందించింది. ►ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను పొరుగు దేశాల ద్వారా సోమవారం 7 విమానాల ద్వారా మొత్తం 1,31 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు పౌరవిమనయానశాఖ తెలిపింది. ►రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్లో 406 మంది పౌరుల మరణించినట్లు ధృవీకరించినట్లు ఐరాస మానవ హక్కుల కార్యాలయం తెలిపింది. ఆదివారం నాటికి మరో 801 మంది గాయపడినట్లు వెల్లడించింది. ►ఉక్రెయిన్ తమ షరతులను అంగీకరించినట్లయితే సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా పేర్కొంది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్మాట్లాడుతూ..కైవ్ తన షరతులను నెరవేర్చినట్లయితే తక్షణం సైనిక చర్యను నిలిపివేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉక్రెయిన్ ఏ కూటమిలో చేరకుండా ఉండేందుకు వారు రాజ్యాంగ సవరణలు చేయాలని కోరారు. ►ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాల నుంచి మైకోలాయివ్ ప్రాంతీయ విమానాశ్రయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయని స్థానిక గవర్నర్ విటాలి కిమ్ సోమవారం తెలిపారు. ►ఉక్రెయిన్లో చిక్కుకున్న 400 మంది భారతీయులను తీసుకొచ్చేందుకు రొమేనియా నుంచి మంగళవారం రెండు విమానాలను నడపనున్నట్లు పౌర విమానయానశాఖ పేర్కొంది. ►రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్కు సమీపంలోని గోస్టోమెల్ మేయర్ను కాల్చి చంపినట్లు సోమవారం స్థానిక అధికారులు తెలిపారు. గోస్టోమెల్ మేయర్ యూరి ఇల్లిచ్ ప్రైలిప్కో స్థానికంగా ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని,యు రోగులకు మందులు పంపిణీ చేస్తున్నప్పుడు ఆయనతోపాటు మరో ఇద్దరిని కాల్చిచంపారని పేర్కొన్నారు.అని అది పేర్కొంది. ఆయన తన ప్రజల కోసం, గోస్టోమెల్ కోసం హీరోగా ప్రాణాలు విడిచాడని తెలిపారు. ►రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పరోక్షంగా నష్టపోతున్న ప్రపంచ దేశాల స్థితిగతులపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. 21వ శతాబ్దంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధానికి స్వాగతం చెబుతూ.. రష్యా - ఉక్రెయిన్ తోపాటు మిగిలిన ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. ►ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య సోమవారం మూడో విడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో రష్యా ప్రతినిధు బృంధం నేడు బెలారస్కు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ►రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ పరిస్థితులపై 50 నిమిషాలపాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఉక్రెయిన్తో చర్చల వివరాలను పుతిన్ మోదీకి వివరించారు. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా మాట్లాడాలని పుతిన్ను మోదీ కోరారు. ఉక్రెయిన్లో నగరాలు, సుమీ ప్రాంతాల్లో కాల్పుల విరమణ చేసి మానవతా కారిడార్ను ఏర్పాటు చేయడంపై పుతిన్కు మోదీ అభినందనలు తెలిపారు. ►తమ దేశంపై రష్యా తన సైనిక చర్యను వెంటనే నిలిపి వేయాలని ఆదేశించాలని కోరుతూ ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనపై అంతర్జాతీయ న్యాయస్థానం రెండు రోజుల విచారణను సోమవారం ప్రారంభించింది. ఈ మేరకు ఐసీజే ప్రధాన కార్యాలయం పీస్ ప్యాలెస్లో ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ తన వాదలను నేడు కోర్టు ముందు ఉంచనుంది. రష్య మంగళవారం స్పందించే అవకాశం ఉంది. ►భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా బలగాలకు ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంటున్న విధానాన్ని మోదీ ప్రశంసించారని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధ సమయంలో అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలు చేసినందుకు, ఉక్రెయిన్ ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నరేంద్రమోదీతో 35 నిమిషాల పాటు ఫోన్లో ఆయన మాట్లాడారు. అనంతరం ఆయనఅధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ►రష్యా-చైనా మధ్య స్నేహం ఇప్పటికీ చాలా ధృడంగా ఉన్నట్లు చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యూ సోమవారం స్పష్టం చేశారు. అవసరమైనప్పుడు ఇరు దేశాల శాంతి పునరుద్ధర కోసం మధ్యవర్తిత్వంపై పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నన నేపథ్యంలో చైనా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా మానవతా సహాయాన్ని ఉక్రెయిన్కు అందిస్తున్నామని వాంగ్ తెలిపారు. ►ఉక్రెయిన్లో బాంబుల మోత మోగుతుంటే తన ప్రాణాలకు ఏమైనా ఫర్వాలేదు కానీ కొడుకు క్షేమంగా ఉండాలని రైలులో ఒంటరిగా పంపించింది ఓ తల్లి. తన 11 ఏళ్ల కొడుకుకి ధైర్యం చెప్పి..తినటానికి తిండి తాగటానికి నీళ్లు అన్నీ బ్యాగులో సర్ది.. చేతిపై ఫోన్ నెంబర్ రాసి ‘క్షేమంగా..జాగ్రత్తగా వెళ్లు నాన్నా’అంటూ కొడుకును పంపించింది. అమ్మ చెప్పిన మాటలు అన్ని శ్రద్ధగా విన్న ఆ పిల్లాడు బాంబులు, క్షిపణులు, తుపాకులు గర్జిస్తూ, ఆర్తనాదాలు వినిపించే యుద్ధ భూమిలో ఒంటరిగా 1,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యుక్రెయిన్లోని జపోరిజియా ప్రాంతం నుంచి స్లొవేకియా దేశానికి చేరుకున్నాడు. పిల్లాడు సురక్షితంగా అనుకున్న గమ్యానికి చేరుకున్నాడని తెలిసిన ఆ తల్లి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ► రష్యా మా బంధం బలంగానే ఉంది: చైనా రష్యా తమకు మిత్రదేశమని, బంధం ఇంకా బలంగానే ఉందని చైనా ప్రకటించుకంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మరోసారి ‘అవసరమైతే ఉక్రెయిన్-రష్యా సంధిలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమ’ని స్పష్టమైన ప్రకటన చేశారు. ► ఆపరేషన్ గంగలో భాగంగా.. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు స్పెషల్ విమానాల్లో భారత్కు చేరుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ ఆపరేషన్ ముగించాలని భారత్ భావిస్తోంది. #WATCH | Tears of joy and some sweets at Delhi airport, as a mother breaks down on seeing her daughter Saloni, who has arrived from war-torn #Ukraine "Can't be expressed in words how happy I feel to see my child back home with me," the mother said pic.twitter.com/V2xUzXgHLG — ANI (@ANI) March 7, 2022 ► రష్యాపై ఆంక్షలు మాత్రమే సరిపోవని, యుద్ధం ఆపేలా చేయడానికి తీవ్ర చర్యలకు దిగాల్సిందేనని పశ్చిమ దేశాలతో జెలెన్స్కీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ► రష్యా సెంట్రల్ బ్యాంక్తో లావాదేవీలను నిలిపివేసిన సౌత్ కొరియా. ► జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. వీరిద్దరి మధ్య దాదాపు 35 నిమిషాల పాటు సంభాషణ కొనసాగింది. ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపులో సాయం పట్ల జెలెన్ స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ కొందరు భారత పౌరులు ఉక్రెయిన్లోనే ఉండడంతో భారత పౌరుల తరలింపులో నిరంతరం సహకారం ఉండాలని మోదీ కోరారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మోదీకి జెలెన్ స్కీ వివరించారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరుగుతోన్న తీరును మోదీ అభినందించారు. దౌత్య మార్గాల్లో సమస్యలను పరిష్కరించాలని ఆయన చెప్పారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, ఖార్కీవ్, మరియూపోల్, సుమీ నగరాల్లో మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాల నుంచి కాల్పుల విరమణ మొదలవుతుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ విషయాన్ని పలు న్యూస్ ఏజెన్సీలు సైతం ధృవీకరించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ వ్యక్తిగత రిక్వెస్ట్ మేరకు రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విరమణ ఎంత సేపు ఉంటుందనేది మాత్రం పేర్కొనలేదు. ఈ లోపు కారిడార్ల ద్వారా పౌరులను తరలించనున్నారు. ►ఉక్రెయిన్లోని క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది.వాయుసేన జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని ఉక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ తెలిపింది. Russian military declares ceasefire in Ukraine from 0700 GMT to open humanitarian corridors at French President Emmanuel Macron's request: Sputnik — ANI (@ANI) March 7, 2022 ఇంకోపక్క సుమీలో భారతీయ విద్యార్థుల తరలింపు కష్టతరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మధ్యాహ్నాం ఫోన్లో సంప్రదించనున్నట్లు పీఎంవో వెల్లడించింది. ► ఖార్కివ్ మీదుగా ఎగురుతున్న రష్యన్ యుద్ధ విమానాన్ని కూల్చేశామని, ఈ ఘటనలో పైలట్ చనిపోయినట్టు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వెల్లడించింది. కులినిచివ్ ప్రాంతంలో విమానం కూలిపోయినట్టు వివరించింది. పైలట్కు తప్పించుకునే సమయం కూడా లేకపోయిందని, ఘటనా స్థలంలోనే ఆయన చనిపోయారని పేర్కొంది. ► బాంబులతో దద్దరిల్లుతున్న మికోలాయివ్ పోర్టు నగరం మికోలాయివ్ బాంబులతో దద్దరిల్లుతోంది. ప్రధాన నగరాలకు వశపర్చుకునే క్రమంలో రష్యా బలగాలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో దాడులు ఉదృతం చేయాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి పిలుపు ఇచ్చాడు. Russian forces appear to have launched a heavy artillery barrage against Mykolaiv, a day after Ukrainian troops pushed them from the city and recaptured the airport. From my vantage, I could see flashes from the attack lighting up the night sky along a large swath of the city. pic.twitter.com/cm4E0cNtN3 — Michael Schwirtz (@mschwirtz) March 7, 2022 ► రష్యాపై ఆంక్షల పర్వం రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా, మిత్రపక్షాలు రష్యా ఆయిల్పైనా బ్యాన్ విధించే యోచనలో ఉన్నాయి. ► అంతర్జాతీయ న్యాయస్థానంలో.. మారణహోమం దావాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ మరియు రష్యాలు తలపడనున్నాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో జరుగుతున్న దారుణాల నేపథ్యంలోనే ప్రత్యేక మిలిటరీ చర్యలకు దిగినట్లు రష్యా.. ఆధారాల్లేకుండా ఆరోపణలపై ఉక్రెయిన్ పరస్పరం వాదించనున్నాయి. ► జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్! ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఫోన్లో మాట్లాడుకోనున్న ఇరు దేశాల నేతలు. మరోసారి భారత్ సాయం కోరనున్న జెలెన్స్కీ. భారత విద్యార్థుల తరలింపుపైనే ప్రధానంగా ప్రధాని మోదీ ఆరా తీసే అవకాశం. PM Narendra Modi to speak to Ukrainian President Zelenskyy on the phone today: GoI sources (file photos) pic.twitter.com/PuWuCv2Fqw — ANI (@ANI) March 7, 2022 ► అత్యాధునిక ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మానవ సంక్షోభంగా ఉకక్రెయిన్ యుద్ధం నిలిచిపోనుందనే ఆందోళన ఐరాస వ్యక్తం చేస్తోంది. సుమారు 70 లక్షల మంది ఉకక్రెయిన్ను వీడొచ్చని అంచనా వేస్తోంది. ► ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో నేడు(సోమవారం).. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నాటో ఎంట్రీ ► నాటో దళాల ఎంట్రీని ఖంచిస్తున్న రష్యా. ఇది తీవ్ర యుద్ధానికి దారితీస్తుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిహెచ్చరిక. ► ఉక్రెయిన్కు మద్దతుగా రంగంలోకి దిగిన నాటో దేశాలు. జెలెన్స్కీ సాయం కోరిన తర్వాత అమెరికా చొవరతో నాటో దేశాల్లో కదలిక. రొమేనియాకు 40 వేల మంది సైనికులు. ఫ్రాన్స్ రాఫెల్ విమానాలు, 4 పైటర్జెట్లు. పోలాండ్కు చేరుకున్న బ్రిటన్ రాయల్ ఎయిర్ఫోర్స్. ► ఫలించిన జెలెన్స్కీ విజ్ఞప్తి. నాటోకు అమెరికా గ్రీన్ సిగ్నల్. పోలాండ్కు సాయం తరలింపు. ► యుద్ధంతో నన్ను చంపేస్తే.. ఉక్రెయిన్కు సాయం చేయాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ► ఉక్రెయిన్పై రష్యా యుద్ధం12వ రోజూ కొనసాగుతోంది. మిస్సైల్స్తో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. మికోలాయివ్ దగ్గర హోరాహోరీ పోరు. ► యుద్ధ భయంతో ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస వెళ్లిపోయారు: ఐరాస This horrific 500-kg Russian bomb fell on a residential building in Chernihiv and didn’t explode. Many other did, killing innocent men, women and children. Help us protect our people from Russian barbarians! Help us close the sky. Provide us with combat aircraft. Do something! pic.twitter.com/3Re0jlaKEL — Dmytro Kuleba (@DmytroKuleba) March 6, 2022 ► పౌరుల తరలింపునకు సహకరిస్తామని ప్రకటించిన రష్యా.. యుద్ధం ఆపట్లేదు. దీంతో ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు కష్టతరంగా మారింది ఉక్రెయిన్కు. ముఖ్యంగా మరియూపోల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒకవైపు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యా.. పవర్, వాటర్ను కట్ చేసి పడేసింది నగరానికి. ► రష్యా దాడులతో మధ్య ఉక్రెయిన్లోని విన్నిట్సియా ఎయిర్పోర్ట్ సర్వనాశనం అయ్యింది. ► ఉక్రెయిన్లోని పౌరులపై రష్యా బలగాలు దాడులకు పాల్పడుతున్నాయని అమెరికా భద్రత ప్రతినిధి ఆంటోనీ బ్లింకెన్ ఆరోపిస్తున్నారు. ► ఇర్పిన్ నగరాన్ని వీడాలని ప్రయత్నిస్తున్న పౌరులు.. రష్యా దాడుల భయంతో, సైనికుల తుపాకీ బెదిరింపులతో వెనక్కి మళ్లుతున్నారు. ► ఓటీటీ కంపెనీ నెట్ఫ్లిక్స్తో పాటు కేపీఎంజీ, పీడబ్ల్యూసీ లాంటి అకౌంటింగ్ సంస్థలు, అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి ఫైనాన్షియల్ కంపెనీలు రష్యాతో పూర్తిగా సంబంధాలు తెంపేసుకున్నట్లు ప్రకటించాయి. ► ఉక్రెయిన్కు మద్ధతుగా రష్యాలో కొనసాగుతున్న నిరసనలు. 4,500 మంది నిరసనకారులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ► అయితే సంధి లేకుంటే సమరం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని ఉక్రెయిన్తో తేల్చి చెప్పారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. -
మాపై బాంబులు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా.. జెలెన్ స్కీ ఆవేదన..
కీవ్: ఉక్రెయిన్లో పది రోజులుగా జరుగుతున్న భీకర దాడులకు కొంత విరామం దొరికింది. శనివారం రష్యా.. యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ నుంచి పౌరుల తరలింపునకు రష్యా అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా.. నాటోపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఉక్రెయిన్పై నో-ఫ్లై జోన్ను ప్రకటించాలని జెలెన్ స్కీ నాటోను అభ్యర్థించారు. ఉక్రెయిన్ విజ్ఞప్తిని నాటో తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో జెలెన్ స్కీ.. శనివారం ఓ వీడియో ప్రసంగాన్ని విడుదల చేశారు. ఈ ప్రసంగంలో నాటోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో సమావేశం చాలా బలహీనమైనది, అయోమయంతో కూడుకున్నదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాటో నిర్ణయం వల్ల ఉక్రెయిన్లోని నగరాలు, పట్టణాలపై రష్యా బాంబులు వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే యూరప్ స్వేచ్చనే మొట్టమొదటి లక్ష్యమని నాటో గుర్తించాలన్నారు. ఇదిలా ఉండగా.. నో-ఫ్లైజోన్ విధించడం కారణంగా ఓ దేశాన్ని శత్రు దేశాల నుంచి కాపాడుకోవడం సులభతరం అవుతుంది. ఓ దేశంలో నో-ప్లై జోన్ అమలులోకి వస్తే.. ఆ గగనతలంలోకి వచ్చే శత్రుదేశ విమానాలను కూల్చి వేసేందుకు మార్గం సుగమం అవుతుంది. -
రష్యా ను కోలుకోలేని దెబ్బ కొట్టబోతున్న అమెరికా..
-
ఉక్రెయిన్కు మరో షాక్.. జెలెన్ స్కీకి హ్యాండ్ ఇచ్చిన నాటో
కీవ్: ఉక్రెయిన్పై రష్యా బలగాల ముప్పెట దాడి కొనసాగుతోంది. రష్యా వైమానిక దళం ఉక్రెయిన్లోని నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నది. దీంతో ఉక్రెయిన్ పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బలగాల ధాటికి ఆసుపత్రులు, పలు భవనాలు శిథిలమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దాడులను అడ్డుకునేందుకు తమ దేశాన్ని ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించాలని నాటో దేశాలను అభ్యర్థించారు. ఉక్రెయిన్ విజ్ఞప్తిపై నాటో దేశాలు మరోసారి జెలెన్ స్కీకి షాకిచ్చాయి. ‘నో-ఫ్లై జోన్’ విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. శుక్రవారం రాత్రి బస్సెల్స్లో నాటో విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాటో జనరల్ సెక్రటరీ స్టోలెన్ బర్గ్ వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నో-ఫ్లై జోన్ విధించాలంటే నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ ఎయిర్స్పేస్లోకి పంపాల్సి ఉంటుందన్నారు. అలాగే, రష్యా యుద్ధ విమానాలను కూల్చేయడం ద్వారా నో -ఫ్లైజోన్ విధించాల్సి ఉంటుందని తెలుపుతూ.. అలా చేస్తే.. యూరోప్లో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేపినట్టు అవుతుందన్నారు. ఇది పలు దేశాలతో ముడిపడిన వ్యవహారమే కాకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిట్రో కులెబా కీవ్ నుంచి మాట్లాడుతూ.. తమ దేవంలో ఉద్రిక్తతలు చేయిదాటకముందే తగు చర్యలు తీసుకోవాలని నాటో దేశాలను కోరారు. ఉక్రెయిన్ను మరో సిరియాగా మార్చవద్దంటూ అభ్యర్థించారు. ఈ క్రమంలోనే తమ సైన్యం పోరాటం మాత్రమ ఆపేది లేదని.. ప్రతి దాడులు కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్కు తమ భాగస్వామ దేశాల నుంచి సహాకారం అందాలని విజ్ఞప్తి చేశారు. -
నాటో’లో ప్రతి అంగుళం కాపాడుకుంటాం
వాషింగ్టన్: తమ భూభాగంలో ప్రతి అంగుళా న్ని కాపాడుకొనేందుకు ‘నాటో’ సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. ఒకవేళ రష్యా దాడికి దిగితే నాటో తగు రీతిలో స్పందిస్తుందన్నారు. రష్యాతో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని, ఉక్రెయిన్ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని వెల్లడించారు. నాటో అనేది ఒక రక్షణ కూటమి అని గుర్తుచేశారు. శుక్రవారం బ్రస్సెల్స్లో నాటో సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో బ్లింకెన్ పాల్గొన్నారు. 30 సభ్యదేశాల రక్షణ బాధ్యత తమపై ఉందని నాటో అధినేత జెన్స్ స్టోల్టెన్బర్గ్ వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో పాటు తాజా పరిణామాలపై చర్చించినట్లు చెప్పారు. ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలో నాటో భాగస్వామి కాదని స్పష్టం చేశారు. (చదవండి: శత్రువుని సైలెంట్గా లేపేసే అస్త్రం!.) -
గ్యాస్ క్వీన్ ఉంటే...యుద్ధమే వచ్చేది కాదు!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వైపు ఆసక్తిగా చూస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకీ తీవ్రంగా మారి అణు ఆయుధాలు వాడే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యంతోపాటు అక్కడి పౌరులు సైతం రంగంలో దిగి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడుతున్నారు. కానీ మరికొద్ది గంటల్లోనో, రోజుల్లోనో ఉక్రెయిన్ రష్యా కబంధ హస్తాల్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ‘యులియా టిమోషెంకో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదని గుర్తు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. గ్యాస్ క్వీన్ గా పాపులర్ అయిన యులియా మరెవరో కాదు ఉక్రెయిన్ కు తొలి మహిళా ప్రధాని. రష్యా నిర్ణయాలకు తాము వ్యతిరేకమని బహిరంగంగానే చెప్పే తెగువ ఆమెది. పశ్చిమ దేశాలతో మంచి దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ నాటోలో ఉక్రెయిన్ ను చేర్చేందుకు ప్రయత్నించింది. యులియా ప్రభుత్వం ఉన్నంత కాలం.. ఉక్రెయిన్ కు రష్యా కనీసం యుద్ధ భయాన్ని కూడా కలిగించలేక పోయింది. అందుకే అంతా యులియాను తలచుకుంటున్నారు. ఉక్రెయిన్ తొలి మహిళా ప్రధానిగా పని చేసిన యులియా 1960 నవంబర్ 27న అప్పటి యూఎస్ఎస్ఆర్ ఉక్రెయిన్ లో జన్మించింది. ఎకనామిక్స్– సైబర్నెటిక్స్ డిగ్రీని డిస్టింక్షన్ లో పూర్తిచేసింది. డిగ్రీ అయ్యాక లెనిన్ కంపెనీలో ఇంజినీర్–ఎకనమిస్ట్గా చేరింది. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్ సెంటర్ టెర్మినల్కు కమర్షియల్ డైరెక్టర్గా పనిచేసింది. ఆ తరువాత ఉక్రెయిన్ యునైటెడ్ ఎనర్జీ సిస్టమ్స్ స్థాపించి దేశంలో అనేక పరిశ్రమలకు గ్యాస్ను సరఫరా చేసింది. దీనిద్వారా దేశంలోని ధనవంతుల జాబితాలో ఒకటిగా నిలిచింది. యునైటెడ్ ఎనర్జీని విజయవంతంగా నడిపించడంతో అంతా యులియాను ‘ద గ్యాస్ ప్రిన్సెస్’ అని, గ్యాస్ క్వీన్ అనీ పిలిచేవారు. ఆరెంజ్ రివల్యూషన్ మహిళా వ్యాపార వేత్తగా నిరూపించుకున్న తరువాత రాజకీయాల్లో అడుగుపెట్టింది యులియా. రాజకీయాల్లోనూ తన ముద్రవేస్తూ ఒక్కో పదవిని అలంకరిస్తూ దేశానికి తొలి మహిళా ప్రధాని అయ్యింది. 2004లో రష్యాకు అనుకూలుడైన విక్టర్ యుష్నకోవ్ 2004 ఎన్నికలలో గెలిచినప్పుడు ఆయన గెలుపుని యులియా వ్యతిరేకించింది. రిగ్గింగ్ చేసి గెలిచారని ఆరోపిస్తూ ‘ఆరెంజ్ రివల్యూషన్ ’ను తీసుకొచ్చింది. విక్టర్ పదవి నుంచి తప్పుకోవాలని ఆరెంజ్ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి భారీఎత్తున మద్దతు లభించింది. ఆరెంజ్ రివల్యూషన్ విజయవంతం కావడంతో యులియా దేశానికి ప్రధాని అయింది. 2005లో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొలి మహిళా ప్రధానిగా, 2007 డిసెంబర్ నుంచి 2010 మార్చి వరకు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించింది. అంగుళం కూడా ఆక్రమించలేరు! తన హయాంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది యులియా. ముఖ్యంగా జీతాలు పెంచడం, యుటిలిటీ టారిఫ్లు తగ్గించడం వంటి వినూత్న నిర్ణయాలు ఉక్రేనియన్లను ఎంతగానో ఆకర్షించాయి. అంతేగా ‘మా మాతృభూమిని మీకు అప్పగించడానికి మేము సిద్ధంగా లేము’ అని అనేకసార్లు బహిరంగంగానే స్పష్టం చేసింది. అంగుళం భూమిని కూడా ఆక్రమించలేరని రష్యాకు సవాళ్లు విసిరేది. రెండోసారి ప్రధాని అయినప్పుడు గ్యాస్ ఒప్పందం విషయంలో చర్చలు సఫలం కాకపోవడంతో రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. ఈ సమయంలో యులియా రష్యాను తెలివిగా ఒప్పించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించింది. అందుకే ఇప్పుడంతా ఆమె నాయకత్వంలో దేశం ఉండి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావని వాపోతున్నారు. ఆరుసార్లు పార్లమెంట్కు ఎంపికై, రెండుసార్లు ప్రధానిగా తనదైన ముద్ర వేసిన యులియా ఇరవై ఏళ్లకుపైగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ దేశం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. -
చర్చలు జరిగేందుకైన దాడి చేయడం ఆపండి!
legally binding security guarantees if NATO shut the Door: రష్య ఉక్రెయిన్పై తన దాడిని ఏడో రోజు కూడా కొససాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ప్రజా ఆవాసాలపై కూడా దాడి చేసి రాజధాని కైవ్లోకి చొరబడేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే పలు నగరాలలోకి బలగాలు చొరబడ్డాయి. దీంతో ఉక్రెయిన్ అద్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అర్థవంతమైన చర్చలు జరిగేందుకైన ముందు ఉక్రెయిన్లోని నగరాలపై దాడి చేయడం ఆపేయాలని అన్నారు. కనీసం ప్రజలపై బాంబు దాడి చేయడం ఆపేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఉక్రెయిన్ను నాటోలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేకున్నా.. రష్యా ఉక్రెయిన్ నాటోలో ఉండకూడదనుకుంటే గనుక కనీసం ఉక్రెయిన్కు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే భద్రతా హామీలను రూపొందించాలి అని భాగస్వామ్య దేశాలను జెలెన్ స్కీ కోరారు. ఉక్రెయిన్ పతనమైతే ఈ రష్యన్ దళాలన్నీ మీ నాటో సభ్య దేశాల సరిహద్దుల్లో ఉంటాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నారు. అంతేకాదు అక్కడ కూడా మీకు ఇదే ప్రశ్న తలెత్తుందని స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్ గత వారం రష్యన్ దళాల దండయాత్రను తట్టుకోవడంలో సహాయపడటానికి నాటో సభ్యుల నుంచి ఆయుధాల రవాణాను పొందింది. అంతేగాక రష్యాను కట్టడి చేసి దిశగా పశ్చిమ దేశాలు రష్యా ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలను కూడా ప్రవేశపెట్టాయి. అయితే జెలన్ స్కీ నో ఫ్లై జోన్ విధించడంతో పాటు మరిన్ని చేయాలని జెలెన్స్కీ అంతర్జాతీయ సమాఖ్యను కోరారు. రష్యా సైనిక చర్యతో త్వరితగతిన లాభలు పొందలేదని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధ భూమిలో ఒంటరిగా నిలబడి ఉందని, పైగా దాని స్వంత భద్రత పశ్చిమ దేశాలతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అంతేకాదు తమకు ప్రతి రోజు యుద్ధం ఉందని, తమకు సహాయం కావాలని చెప్పారు. "నేను నా దేశం కోసం నిరంతరం పనిచేస్తున్నా, మేము మా భూమిని, మా ప్రజలను రక్షించుకునేందకు చివరి వరకు నిలబడి పోరాడుతాం. మా పిల్లల భవిష్యత్తు కోసం నిలబడతాం ". అని జెలెన్ స్కీ చెప్పారు. (చదవండి: పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!) -
ఎక్కడ చూసినా ‘నాటో’ చర్చ! సభ్య దేశాల జాబితా తెలుసా?
ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి ఆరో రోజులైంది. అసలు ఒక దేశానికి మరో దేశానికి మధ్య ఎంత శత్రుత్వం ఉన్న మాటల పరంగానో, ఆంక్షలు పరంగానో ఉండేవి గానీ యుద్ధం వరకు వెళ్లేది కాదు. కానీ తాజాగా ఉక్రెయిన్ రష్యా ఉదాంతాం మాత్రం అలా కాకుండా నేరుగా రణరంగంలో ఢీకోడుతున్నాయి. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణం నాటోలో ఉక్రెయిన్ చేరాలనుకోవడమే. అసలు నాటో అంటే ఏమిటి. అందులో ఉక్రెయిన్ చేరితో రష్యాకు ఎందుకు నచ్చట్లేదు.. తెలుసుకుందాం! నాటో అంటే.. నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) అనేది ఉత్తర అట్లాంటిక్ కూటమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా 12 దేశాల సైనిక కూటమి. ఈ సంస్థ 4 ఏప్రిల్ 1949న సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని అమలు చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి తమని తాము రక్షించుకనేందుకు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, నెదర్లాండ్స్, కెనడా నాటోని స్థాపించాయి. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్లో ఉంది. ఇందులోని ఒప్పందం ప్రకారం.. నాటోలో సభ్య దేశాలుగా ఉన్న ఏ ఒక్క దేశంపైన ఏ కారణం చేతనైనా బయట దేశాలు సాయుధ దాడి జరిపినట్లయితే.. ఆ దేశానికి నాటోలోని మిగిలిన సభ్య దేశాలన్నీ సహాయం చేయాలి. మరో లక్ష్యం ఏమంటే.. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకునేందకని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం రష్యా కూడా నాటోలో ఉక్రెయిన్ చేరాలంటే వ్యతిరేకిస్తోంది కూడా అందుకే! ప్రపంచంలోనే పవర్పుల్ కూటమి.. ప్రస్తుతం నాటోలో 30 దేశాలు ఉన్నాయి. వారు అధికారికంగా నాటో సభ్యులు. నాటోలో 27 యూరోపియన్ దేశాలు, యురేషియాలో ఒక దేశం, ఉత్తర అమెరికాలో 2 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నాటో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమిగా పిలుస్తారు. ఎందుకుంటే శక్తివంతమైన యూరోపియన్ దేశాలు, సంపన్న దేశాలు నాటో సభ్య దేశాలుగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా పిలువబడే అమెరికా కూడా దానిలో భాగం. నాటో కూటమి సైనిక బలగం, వారి వద్ద ఉండే అత్యాధునికి ఆయుధాలు ఇలా ఒక్కటేంటి.. నాటో కూటమిలోని దేశాలలో ఏ ఒక్క దేశంతో యుద్ధం చేస్తే వార్ వన్సైడ్ అని క్లారిటీగా చెప్పవచ్చు. నాటో అంటే గిట్టని రష్యా.. రష్యా మినహా పూర్తి యూరోపియన్ దేశాలు దానిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ కూటమిలో భాగం కాని ఏకైక దేశం ఇది. దీనికి రష్యా , నాటో అంతర్గత కారణాలే అని చెప్పచ్చు. తాజాగా ఉక్రెయిన్ రష్యా సరిహద్దు దేశం కావడం , అది నాటో చేరాలని ప్రయత్నించడంతో రష్యాకు దిగులు పట్టుకుంది. ఎందుకంటే ఉక్రెయిన్ నాటోలో చేరితో పశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని రష్యాను ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పుతిన్ భావించాడు. అందుకు ఉక్రెయిన్ విషయంలో పరిస్ధితులు యద్ధానికి దారితీశాయి. సభ్య దేశాలు చేరిన సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ 1949 యునైటెడ్ కింగ్డమ్ 1949 పోర్చుగల్ 1949 నార్వే 1949 ఐస్లాండ్ 1949 నెదర్లాండ్స్ 1949 లక్సెంబర్గ్ 1949 ఇటలీ 1949 ఫ్రాన్స్ 1949 డెన్మార్క్ 1949 కెనడా 1949 బెల్జియం 1949 టర్కీ 1952 గ్రీస్ 1952 జర్మనీ 1982 స్పెయిన్ 1955 పోలాండ్ 1999 హంగేరి 1999 చెక్ రిపబ్లిక్ 1999 స్లోవేకియా 2004 స్లోవేనియా 2004 రొమేనియా 2004 లిథువేనియా 2004 లాట్వియా 2004 ఎస్టోనియా 2004 బల్గేరియా 2004 క్రొయేషియా 2009 అల్బేనియా 2009 ఉత్తర మాసిడోనియా 2020 మోంటెనెగ్రో 2017 -
అమెరికాను నమ్మడం నాటో దేశాల వెర్రితనమా.. అమాయకత్వమా..?
అమెరికా అగ్రరాజ్య హోదాను డొనాల్డ్ ట్రంప్ హయాంలో సొంతంగానే దాదాపుగా వదిలేసుకుంది. ఎవరి కోసమో మనం యుద్ధం చేయడమేమిటి? లక్షల కోట్ల డాలర్లను వెచ్చించడమేమిటి? వందల సంఖ్యలో అమెరికన్ సైనికులను బలిపెట్టడమేమిటి? మనకెందుకొచ్చిన పెత్తనం.. అనేది ట్రంప్ వాదన. అందుకే అఫ్గానిస్థాన్ నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలని తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కొరకరాని కొయ్య లాంటి ఉత్తరకొరియాకు చెక్ పెడుతున్న దక్షిణ కొరియాకు అమెరికా సైన్యాన్ని పంపినందుకు డబ్బు చెల్లించమనే దాకా వచ్చారు. ‘పలువురి మేలు ఇంత మానుకొని.. సొంత లాభం కొంత చూసుకోవోయ్’ అనే ట్రంప్ మంత్రాన్ని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ సైతం అనుసరిస్తున్నారు. మరి ఉక్రెయిన్ సంక్షోభంలో ఇలాంటి అమెరికా మాట.. నాటో దేశాలు ఎందుకు గుడ్డిగా అనుసరిస్తున్నాయి? సొంత ప్రయోజనాలను వదులుకొని అమెరికా మాటను ఎందుకు పాటిస్తున్నాయి. వెర్రితనమా? అమాయకత్వమనుకోవాలా! చదవండి: (Vladimir Putin: అదే పుతిన్ బలమా..?) ఆంక్షలివీ.. కానీ అందరితో పాటే: అమెరికా ►వీఈబీ, సైనిక బ్యాంకు, వాటి 42 అనుబంధ సంస్థలపై నిషేధం ►ఐదుగురు రష్యా కుబేరుల బ్యాంకు ఖాతాల స్తంభన ►డాన్బాస్ ప్రాంతంతో అమెరికా పౌరులెవరూ ఆర్థిక లావాదేవీలు సాగించవద్దని ఆదేశం ►రష్యా బ్యాంకింగ్ రంగం, ప్రభుత్వ రంగ సంస్థల లావాదేవీలపై కొత్తగా ఆంక్షలు విధించాలని నిర్ణయం ►అయితే ఈ నిర్ణయాలన్నీ యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు అమలులోకి తెచ్చినపుడే తామూ పాటిస్తామని స్పష్టం చేసింది. ►2021లో రష్యాకు అమెరికా ఎగుమతులు 6,388 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇంత చిన్నమొత్తాన్ని వదులుకోవడానికి కూడా అమెరికా సిద్ధ పడటం లేదనేది ఇక్కడ గమనార్హం. అమెరికా మాయలో పడి ‘లైఫ్లైన్’ పనులను ఆపేసిన జర్మనీ రష్యా– జర్మనీని కలుపుతూ నిర్మాణంలో ఉన్న నార్డ్స్ట్రామ్–2’ గ్యాప్ పైప్లైన్ పనులను జర్మనీ తక్షణం నిలిపివేసింది. పైగా జర్మనీ దేశీయ గ్యాస్ వినియోగంలో రష్యా నుంచి వచ్చే గ్యాస్ వాటా ఏకంగా 65 శాతం ఉండటం గమనార్హం. మరి ఈ దేశాలు ఎందుకు ఎగిరెగిరి ఆంక్షలు పెడుతున్నాయో పైవాడికే తెలియాలి. – నేషనల్ డెస్క్, సాక్షి