NGOs
-
ఆ జీవోను వెంటనే ఆపెయ్యండి
-
యాపిల్లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను తొలగించిందన్న వార్త సంచలనంగా మారింది. ఇందులో భారతీయ ఉద్యోగులు, ముఖ్యంగా తెలుగువారు ఉన్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. యాపిల్ మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్కు సంబంధించి నిధుల దుర్వినియోగం చేసి జీతాల్లో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై కాలిఫోర్నియా కుపెర్టినో హెడ్క్వార్టర్స్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేసింది. వీరిలో ఆరుగురిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఉద్యోగుల తొలగింపుపై యాపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది.యాపిల్ తొలగించిన ఉద్యోగులలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కూడా ఉన్నారు. తొలగించిన ఆరుగురి ఉద్యోగులకు బే ఏరియాలోని అధికారులు వారెంట్లు కూడా జారీ చేశారు. ఈ ఆరుగురు ఇండియన్స్గా గుర్తించబడనప్పటికీ, గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉండవచ్చని సమాచారం. వీరంతా ఆమెరికాలోని కొన్ని తెలుగు స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఈ దుర్వినియోగం పాల్పడినట్టు తెలుస్తోంది.అక్రమాలు తెరలేచింది ఎలా? ఉద్యోగుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు, లాభేతర సంస్థల సేవాకార్యక్రమాలకు విరాళాలిచ్చేందుకు సంస్థ ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది. అంటే తమ ఉద్యోగులు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తే, దానికి కొంత మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఆ సంస్థకు విరాళంగా ఇస్తుంది యాపిల్. ఇక్కడే ఉద్యోగులు అక్రమాలకు తెరలేపారు. ఆయా సంస్థలతో కుమ్మక్కై స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన సొమ్మును తమ ఖాతాలో వేసుకునేవారు. ఇవీ చదవండి: గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం అమెరికన్ చైనీస్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్ఛేంజ్ (ACICE) , Hop4Kids అనే రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాల ఇచ్చినట్టుగా తప్పుగా చూపించారు.ఇలా మూడు సంవత్సరాల వ్యవధిలో ఆరుగురు వ్యక్తులు సుమారు 152వేల డాలర్ల అక్రమాలనకు పాల్పడ్డారని శాంటా క్లారా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం పేర్కొంది. అభియోగాలు మోపబడిన వారిలో సియు కీ (అలెక్స్) క్వాన్, యథీ (హేసన్) యుయెన్, యాట్ సి (సన్నీ) ఎన్జి, వెంటావో (విక్టర్) లి, లిచావో నీ మరియు జెంగ్ చాంగ్ ఉన్నారు.తానాపై ఎఫ్బీఐ కన్ను టైమ్స్ఆఫ్ ఇండియా నివేదికలప్రకారం ఈ సంఘటనలతో పాటు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వివిధ కార్పొరేషన్ల నుండి మ్యాచింగ్ గ్రాంట్ల దుర్వినియోగానికి సంబంధించి FBI విచారిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా యూఎస్ జిల్లా కోర్టు గ్రాండ్ జ్యూరీ తానాకు సబ్పోనా జారీ చేసింది. డిసెంబర్ 26న హాజరు కావాల్సిందిగా డిసెంబర్ 12న జారీ చేసింది.దీనిపై తానాకు ఒక నెల పొడిగింపు లభించినట్టు కూడా తెలుస్తోంది. అలాగే 2019 నుండి 2024 వరకు వివిధ స్థానాల్లో ఉన్న తానా ప్రతినిధులందరికీ అందిన విరాళాలు, ఖర్చులు , సమాచారాన్ని డాక్యుమెంటేషన్గా ఉంచాలని కోర్టు ఆదేశించింది.మరోవైపు ఈ ఆరోపణలపై అటు యాపిల్ నుంచిగానీ, ఇటు తానా నుంచి గానీ ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. -
మహిళలు పనిచేసే ఎన్జీవోల మూత
కాబూల్: అఫ్గానిస్తాన్లోని తాలిబన్ పాలకులు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ మహిళలు పనిచేసే జాతీయ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలన్నిటినీ మూసివేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ధరించాల్సిన హిజాబ్ను ఆయా సంస్థల్లోని అఫ్గాన్ మహిళలు ధరించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆర్థిక శాఖ ఆదివారం రాత్రి ‘ఎక్స్’లో ఈ విషయం వెల్లడించింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేసే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా అందులో హెచ్చరించింది. నాన్ గవర్నమెంటల్ సంస్థల రిజిసే్ట్రషన్, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ సహా అన్ని కార్యకలాపాల బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. తాలిబాన్ నియంత్రణలో లేని సంస్థలు అన్నిటిలోనూ మహిళలు పనిచేయడం ఆపేయాలని మరోసారి హుకుం జారీ చేసింది. అత్యవసరమైన మానవతా సాయం అందించే కార్యక్రమాల్లోనూ మహిళల ప్రాతినిథ్యాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఇటీవల ఐరాస సైతం ఆరోపించడం గమనార్హం. బాలికలు ఆరో గ్రేడ్ మించి చదువుకోరాదని, బహిరంగంగా కనిపించే విధుల్లో పాల్గొనరాదని ఇప్పటికే తాలిబన్ పాలకులు నిషేధం విధించడం తెలిసిందే. కిటికీల నుంచి మహిళలు కనిపించొద్దు తాలిబన్ నేత హిబతుల్లా అఖుంద్జాదా మరో తాఖీదు జారీ చేశారు. మహిళలు, నిలబడి లేదా కూర్చున్నట్లుగా కనబడేలా భవనాలకు కిటికీలు ఉండరాదన్నారు. కొత్తగా నిర్మించే వాటితోపాటు ఇప్పటికే ఉన్న భవనాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. వరండాలు లేదా వంటగదులు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒక వేళ కిటికీలుంటే భవన యజమాని ఆ స్థానంలో గోడను నిర్మించడం లేదా ఏదైనా అడ్డుగా ఉంచడం చేయాలన్నారు. నివాస భవనాల్లోపలి భాగం కనిపించేలా కొత్తగా భవన నిర్మాణం చేయరాదని ఆయన మున్సిపల్, ఇతర అధికారులకు సైతం నిర్దేశించడం గమనార్హం. -
పుట్టింది కెనడాలో. అన్నీ ఎదురుదెబ్బలే.. కట్ చేస్తే!
బాధితురాలిగా సానుభూతి తప్ప సరిౖయెన సలహాలు, సహాయం అందుకోలేకపోయింది రసిక సుందరం.తన చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇమార’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. జెండర్ బేస్డ్ వయొలెన్స్ను నివారించడానికి, బాధితులకు అనేక రకాలుగా అండగా నిలవడానికి ‘ఇమార’ ద్వారా కృషి చేస్తోంది రసిక సుందరం.రెండు సంవత్సరాల క్రితం రసిక సుందరపై క్లోజ్ఫ్రెండ్ దాడి చేశాడు. ఊహించని ఈ సంఘటనకు భీతిల్లిన రసిక డిప్రెషన్లోకి వెళ్లింది. ఆ చీకటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలనుకుంది. అయితే వారితో వరుసగా చేదు అనుభవాలు ఆమెను నిరాశకు గురి చేశాయి.‘చాలామంది నన్ను అవమానించారు. చికిత్స ఫీజులు కూడా ఎక్కువే’ గతాన్ని గుర్తు చేసుకుంది రసిక.మంచి లాయర్ దొరకక పోవడం ఆమెకు మరో అడ్డంకిగా మారింది. దీంతో తనను వేధించిన వ్యక్తిపై కేసు పెట్టలేదు.తన అనుభవాల నేపథ్యంలో ‘ఇమార సర్వైవర్ సపోర్ట్’ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇది సెక్సువల్ అండ్ జెండర్–బేస్డ్ (ఎస్జీబీవి) నివారించడానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ‘హింస నుంచి ప్రాణాలతో బయటపడిన వారికి మేము అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలోకి వెళ్లి జెండర్–బేస్డ్ వయొలెన్స్ అంటే ఏమిటి అనేదాని గురించి అవగాహన కలిగించడం, ప్రాణాలతో బయటపడిన వారికి ఎలా సహాయపడవచ్చో చెప్పడం, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా ఉండవచ్చో చెబుతాం’ అంటున్న రసిక విద్యాలయాల నుంచి కాలనీ వరకు ఎన్నో వర్క్షాప్లు నిర్వహిస్తోంది. (పాల వ్యాపారంతో ఏడాదికి రూ.3 కోట్లు సంపాదన: రేణు విజయ గాథ)న్యాయ, వైద్యసహాయం, పోలీసు సహాయం కోసం వన్–స్టాప్ సెంటర్లకు రూపకల్పన చేయనుంది. ‘ఇమార’ ఫౌండేషన్ కోసం ఫెమినిస్ట్ రిసెర్చర్ కృతి జయకుమార్ మార్గదర్శకంలో ఎంతోమంది వాలెంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రసిక. ఆర్థిక వేధింపులు, బలవంతపు గర్భస్రావం....ఇలా ఎంతో మంది బాధితులు ‘ఇమార’ను సంప్రదిస్తున్నారు.‘వరల్డ్ పల్స్ ప్లాట్ఫామ్’ ద్వారా ఆఫ్రికాలోని మానవ అక్రమ రవాణా బాధితురాలు ఒకరు రసికను సంప్రదించారు. మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు తనను లక్ష్యంగా చేసుకొని ఎలా కష్టపెడుతున్నారో చెప్పింది. కొన్నేళ్ళుగా వారి చెరలో ఉన్న బాధితురాలు తన ఇద్దరు పిల్లలతో కలిసి బయటికి రావడానికి భద్రతను కోరింది. ‘ఇం పాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు పల్లవి ఘోష్ సహాయ సహకారాలతో బాధితురాలిని, ఆమె పిల్లలను చెర నుంచి విముక్తి కలిగించగలిగింది రసిక. అయితే బాధితురాలి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు. కొత్త దేశంలో ఆహారం, ఆశ్రయం, ఆర్థిక సమస్యలలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ఇది తెలుసుకొని యాంటీ ట్రాఫికింగ్ న్యాయవాదుల సహకారంతో గ్లోబల్ నెట్వర్కింగ్ ద్వారా ఆమెకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది రసిక. ఇప్పటి వరకు ఏడు వందల మందికి పైగా బాధితులకు ‘ఇమార’ సహాయ సహకారాలు అందించింది. ధైర్యాన్ని ఇచ్చింది. (భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!)కెనడాలో పుట్టిన రసిక ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి భారతదేశానికి తిరిగివచ్చింది. తమ కుమార్తెలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మధ్య పెరగాలనే తల్లిదండ్రుల కోరికే వారు భారత్కు తిరిగిరావడానికి కారణం. చెన్నైలో డిగ్రీ చేసిన రసిక టొరంటోలోని యార్క్ యూనివర్శిటీలో పై చదువులు చదివింది. శరణార్థుల హక్కులు, వలస హక్కులు, లింగ–ఆధారిత హింస(జెండర్ బేస్డ్ వయొలెన్స్) చుట్టూ కేంద్రీకృతమైన మానవ హక్కులకు సంబంధించి ఇంటర్న్షిప్ చేసింది. జెండర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్లలో పనిచేసింది.‘ఏ స్వచ్ఛంద సంస్థకు అయినా నిధుల సమీకరణకు సంబంధించి మొదటి మూడేళ్లు కష్టకాలం’ అంటున్న రసిక సుందరం తన కుటుంబం, స్నేహితులు ఇచ్చిన డబ్బుతో ‘ఇమార’ను నడుపుతోంది. ‘ఒక్క క్లిక్తో డేటాబేస్ను బాధితులు యాక్సెస్ చేసే యాప్ను రూపొందించడంపై దృష్టి పెట్టింది .లింగ ఆధారిత హింసను అంతం చేయడం కోసం పని చేస్తున్న ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయాలనుకుంటుంది రసిక సుందరం. -
కార్మికులను ఆదుకునేందుకు గనిలోకి వలెంటీర్లు
దక్షిణాఫ్రికాలో బంగారు గనిలో అక్రమ మైనింగ్ ఉదంతం ముదురు పాకాన పడుతోంది. నార్త్వెస్ట్ ప్రావిన్స్లో మూసేసిన స్టీల్ఫాంటీన్ గనిలో 4 వేల మంది దాకా కార్మికులు చిక్కుకుపోవడం తెలిసిందే. వారిని అరెస్టు చేసేందుకు పోలీసు లు భారీగా మోహరించారు. ఆహారం తది తరాలు అందకుండా అడ్డుకుంటున్నారు. ‘‘దాంతో మరో దారిలేక వారే బయటకు వస్తారు. రాగానే అరెస్టు చేస్తాం. అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలంటే ఇలాంటి కఠిన చర్యలు తప్పవు’’అని అధికారులు చెబున్నారు. ఈ ఉదంతం దక్షిణాఫ్రికాలోనే గాక అంతర్జాతీయంగా కూడా సంచలనం సృష్టిస్తోంది. ప్రాణాలు నిలుపుకోవడానికి మరో దారి లేక కార్మికులు టూత్పేస్టు తింటూ, వెనిగర్ తాగుతున్నారన్న వార్తలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఇంకొద్ది రో జులు గడిస్తే వాళ్లు పూర్తిగా నీరసించి స్పృహ తప్పవచ్చంటున్నారు. ప్రభుత్వ చర్యలు హత్యాయత్నానికి ఏమాత్రం తీసిపోవంటూ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. జీవించే హక్కును కాలరాసే అధికారం సహా ఎవరికీ లేదని వాదిస్తున్నాయి. అధికారులు మాత్రం చిక్కుబడ్డ కార్మికుల్లో పలువురి వద్ద ఆయుధాలుండే ఆస్కారం కూడా ఉందని చెబుతున్నారు. మరోవైపు కార్మికుల్లో పలువురు అక్రమంగా దేశంలో ప్రవేశించిన వారే కావడంతో కఠిన శిక్షలకు భయపడి బయటికొచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులను ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. చాలామంది స్వచ్ఛంద కార్యకర్తలు ఆహారంతో పాటు నిత్యావసరాలు వెంట తీసుకుని భూగర్భ గనిలోకి ప్రవేశించారు. వారు 50 మందితో కూడిన బృందాలుగా లోనికి వెళ్తున్నారు. కార్మికులకు ఆహారం తదితరాలు అందించడమే గాక వారికి నచ్చజెప్పి బయటికి తీసుకొచ్చే పనిలో కూడా పడ్డారు. వాళ్లలో చాలామంది పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఉండటంతో ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చేందుకు గంటకు పైగా పడుతోందట. గనిలో పలు మృతదేహాలను కూడా వలెంటీర్లు గుర్తించినట్టు సమాచారం. అవి కుళ్లి కంపు కొడుతున్నట్టు చెబుతున్నారు! గత వారం రోజుల్లో 1,000 మంది దాకా కార్మికులు బయటికొచ్చి లొంగిపోయారు. దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ భారీ ఎత్తున జరుగుతుంటుంది. ఫలితంగా ఖజానాకు వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా వాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కొన్నేళ్లలో వందలాది గనులను మూసేయడంతో అప్పటిదాకా వాటిలో పని చేసిన కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. బతుకుదెరువు కోసం అక్రమ మైనింగ్కు పాల్పడే ముఠాల చేతిలో చిక్కుతున్నారు. ఆ క్రమంలో నెలల తరబడి భూగర్భంలో గడుపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ ఫుడ్స్ తింటే అంతే..షాకింగ్ స్టడీ! టాక్స్ విధించండి బాబోయ్!
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ప్రమాదకరమన్న తాజా సంచలన నివేదికల నేపథ్యంలో అటువంటి ఆహారాలపై పన్ను విధించాలంటూ మహారాష్ట్రలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు, మనస్తత్వ వేత్తలతోకూడిన సంఘాలు కేంద్ర వినియోగ దారుల వ్యవహారాల మంత్రి, ఆహార మంత్రికి విన్నవించాయి. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు , కొవ్వుతో కూడిన అధిక ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై పన్ను విధించాలని కోరుతూ ఎర్లీ చైల్డ్హుడ్ అసోసియేషన్ (ECA) , అసోసియేషన్ ఫర్ ప్రిపరేటరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (APER), కేంద్రమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాయి. తద్వారా పాఠశాలల్లో చాక్లెట్లు, కేకులు, కుకీలు , పుట్టినరోజులు మరియు ఈవెంట్ల వంటి ఇతర వస్తువుల వినియోగం, పంపణీ ఆగిపోతుందని నమ్ముతున్నారు. ఈ పదార్థాల స్థానంలో తాజాపండ్లను చేర్చుకోవాలని కూడా ప్రజల్ని, పాఠశాలల్ని కోరారు. వీరి డిమాండ్లు ♦ అన్ని ఫుడ్ చెయిన్స్, రెస్టారెంట్లు మెనూలు, ప్యాకేజింగ్ , ప్రతీ బాక్సుపైనా ఉప్పు-చక్కెర-కొవ్వు శాతం వివరాలను తప్పనిసరిగా ప్రింట్ చేయాలి. ఉప్పు-చక్కెర-కొవ్వుతో సహా వీటి స్థాయి ఎక్కువుంటే ఎరుపు రంగు, మధ్యస్థానికి గుర్తుగా కాషాయం, తక్కువగా ఉంటే ఆకుపచ్చ రంగుల లేబులింగ్ ఉండాలి. ♦ బ్రాండ్ పేరు లేదా రిజిస్టర్డ్ ట్రేడ్మార్క్తో రెస్టారెంట్లు విక్రయించే బర్గర్లు, పిజ్జాలు, టాకోలు, డోనట్స్, శాండ్విచ్లు, పాస్తా, బ్రెడ్ ఫిల్లింగ్లపై పరోక్ష కొవ్వు కంటెంట్ పన్ను 14.5 శాతం విధించాలి. ♦ చక్కెరపై ఆరోగ్య పన్నును ప్రవేశపెట్టాలి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల వినియోగం చాలా ప్రమాదకరమని, ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని సైంటిస్టులు ఇటీవల హెచ్చరించారు. వీటితో ప్రాణాలకే ప్రమాదం వస్తుందని ఇటీవల అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏకంగా 32 రకాల ప్రమాదకర వ్యాధులు వస్తాయని కూడా వెల్లడించారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, ఐర్లాండ్ దేశాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కోటి మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యాయంలో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలతో వస్తున్న ముప్పుపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటీష్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్తో మానసిక, శ్వాసకోశ , హృదయ, జీర్ణకోశ సమస్యలు వస్తాయని, మొత్తం 32 ప్రమాదకర వ్యాధులు వస్తాయి. మరణాలు సంభవించిన కేసులు కూడా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉందని వారు నొక్కి చెప్పారు. అంతేకాదు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్తో 50 శాతం పెరుగుతుందని కూడా హెచ్చరించారు. డిప్రెషన్ 22 శాతం అధికంగా పెరిగే అవకాశం ఉందట. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఫుడ్స్లో విటమిన్లు, పీచు తక్కువ, ఉప్పు, చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉంటాయి, అందుకే కేన్సర్, గుండె వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యం తోపాటు, మెటబాలిజంకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని ఈ స్టడీ పేర్కొంది. -
విశాఖ మధురవాడ ఎన్జీవోస్ కాలనీలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
త్వరలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ పేరు మార్పు
సాక్షి, అమరావతి: ఇప్పటివరకు ఏపీ ఎన్జీవో అసోసియేషన్గా ఉన్న తమ సంఘం పేరును త్వరలో ఏపీ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీజీవో) అసోసియేషన్గా మార్పు చేయనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. సంఘం రాష్ట్ర 21వ కౌన్సిల్ సమావేశాల్లో రెండో రోజు ఆయన మాట్లాడారు. సంఘం పేరు మార్చేందుకు తీర్మానం చేసినట్లు చెప్పారు. గెజిటెడ్ అధికారులకు సంఘంలో సభ్యత్వం ఇచ్చేందుకు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. గతంలో తమ సంఘంలో ఉన్న ఉద్యోగులు కొందరు గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులోకి వెళ్లారని, దీంతో వారిని కూడా సంఘంలో చేర్చుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచామని, వీలైనంత వేగంగా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ప్రభుత్వంతో సామరస్యంగా ఉండి డిమాండ్లను సాధించుకుంటామన్నారు.సంఘం నిర్వహించే మహాసభలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించడం 7 దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే సీఎం జగన్ను ఆహ్వానించామని చెప్పారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేందుకు ప్రభుత్వం అంగీకరించడం శుభ పరిణామమన్నారు. కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా జిల్లాల పునర్విభజనతో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవాలని, మరింత మంది మహిళలకు నూతన కార్యవర్గంలో చోటు కల్పించాలని తీర్మానించారు. ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్రెడ్డి, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సురేష్ లాంబ, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారు'
అమరావతి: చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు చులకన భావం ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులతో అడ్డగోలుగా వ్యవహరించిందని విమర్శించారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో 21 రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిధిగా సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లులు కురిపించారు. ఉద్యోగులకు వరాలు.. సోమవారం ఏపీ ఎన్జీవో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్.. ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించారు. పెండింగ్లో ఉన్న డీఏను దసరా కానుకగా ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. హెల్త్ సెక్టార్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐదు రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 2019 నుంచి 3 లక్షల 19 వేల ప్రభుత్వ ఉద్యోగులను నియమించామని స్పష్టం చేశారు. 53 వేల మంది హెల్త్ సెక్టార్లో నియమించామని అన్నారు. 2,06,668 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని సీఎం జగన్ తెలిపారు. వేతనాలపై రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు రాసిన 'మనసులో మాట' పుస్తకాన్ని ఉటంకిస్తూ.. ఉద్యోగుల గురించి చంద్రబాబుకు దారుణమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. బాబు దృష్టిలో కొందరే మంచోళ్లు అందరూ లంచగొండులేనని అన్నారు. ఉద్యోగులను నిందించే హక్కు ఆయనకు ఎవరిచ్చారని మండిపడ్డారు. అలాంటి బాబు ఉద్యోగులకు మంచి చేయగలడా? అలోచించాలని ఉద్యోగులను ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని సీఎం జగన్ అన్నారు. మొక్కుబడిగా కొన్ని మాత్రమే ఉద్యోగులకు మిగిల్చారని దుయ్యబట్టారు. బాబు హయాంలో దాదాపు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారని చెప్పారు. బాబు కాలంలో ఆర్టీసీ పరిస్థితి ఏంటి?.. పాఠశాలల దుస్థితి ఎలాంటిది? అలాంటివారు ఉద్యోగులకు న్యాయం చేయగలరా? అని ప్రశ్నించారు. బాబు, ఆయన వర్గానికి తమ ప్రభుత్వంపై కడుపు మంట అని సీఎం జగన్ మండిపడ్డారు. గ్యారెంటీ పెన్షన్ స్కీం.. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీంను అమలులోకి తెచ్చిన్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. జీపీఎస్ స్కీంకు త్వరలో ఆర్డినెన్స్ వస్తుందని చెప్పారు. జీపీఎస్ దేశంలోనే విప్లవాత్మకమైన నిర్ణయమని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తినని సీఎం జగన్ చెప్పారు. రిటైరయ్యాక ఉద్యోగులకు మంచి జరగాలనే ఈ స్కీం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దేశంలో ఈ స్కీం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఉద్యోగులే వారదులు.. అభివృద్ధి, సంక్షేమంలో తమది ప్రజా ప్రభుత్వం అని సీఎం జగన్ అన్నారు. ప్రజలకు పప్రభుత్వాలకు మధ్య ఉద్యోగులు వారదులని చెప్పారు. ఏ ప్రభుత్వంతో పోల్చినా మెరుగ్గానే ఉన్నామని అన్నారు. అన్ని సేవలను గ్రామస్థాయికి విజయవంతంగా చేర్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడు సానుకూలంగానే ఉందని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ గురించి అందిరికీ తెలుసని అన్నారు. 2019 నుంచి ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చిత్తశుద్దిని చాటుకున్నట్లు వెల్లడించారు. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 వరకు పెంచామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిజాయితీగా కమిట్మెంట్తో ఉన్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల వలె కాకుండా ఎన్నికలతో సంబంధం లేకుండా జీతాలు పెంచామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశామని అన్నారు. గత ప్రభత్వాలు 6 న కరోనా సమయంలోనూ.. కోవిడ్ టైంలో రెవెన్యూ తగ్గినా డిబీటీని అమలు చేసిన ప్రభుత్వం తమదని సీఎం జగన్ అన్నారు. దేశానికే ఆదర్శంగా పాలన చేస్తున్నామని చెప్పారు. ఎక్కడా వివక్ష, లంచాలకు తావివ్వలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు వదిలేసిన కారుణ్య నియామకాల్లో పారదర్శకత పాటించామని తెలిపారు. పదివేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలోనూ ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పారు. మినిమం టైం పేస్కేల్.. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించి కార్మికులకు తోడుగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. ఉద్యోగుల ముఖంలో చిరునవ్వును చూడటమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేశామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం పేస్కేల్ అచ్చామని వెల్లడించారు. నెల మొదటి వారంలోనే జీతాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి చోట దళారి వ్యవస్థను నిర్మూలించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడులు భేష్.. ప్రస్తుతం గ్రామ స్థాయిలో గవర్నమెంట్ బడులు కార్పొరేట్ ప్రమాణాలతో నడుస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసిందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులను నాశనం చేసిందని అన్నారు. జిల్లాల విభజనతో పాలన ప్రజలకు మరింత దగ్గరైందని చెప్పారు. గత ప్రభుత్వాలు పక్కన పడేసిన అనేక సమస్యలకు పరిష్కారం చూపామని వెల్లడించారు. ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి ఏపీ ఎన్జీవో మహాసభలు జరుగుతుంటాయి. సంఘం ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఈ మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి జరుగుతున్న మహాసభలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తోపాటు పలువురు మంత్రుల, ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇదీ చదవండి: పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం -
111 రద్దుపై సుప్రీంకోర్టుకు..!
సాక్షి, హైదరాబాద్: జంట జలాశయాల పరిరక్షణ కోసం తెచ్చి న జీవో 111ను పూర్తిగా తొలగించడంపై స్వచ్ఛంద సంస్థలు న్యాయపోరాటానికి సన్నద్ధమవుతున్నాయి. భావితరాల కోసం జంట జలాశయాలను కాపాడుకోవలసిన అవసరముందంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చి న సూపర్ ఆర్డర్ను ధిక్కరించి ప్రభుత్వం జీవోను ఎత్తివేయడం పట్ల పర్యావరణ పరిరక్షణ సంస్థలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వం జీవోను ఎత్తివేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం దూరదృష్టితో జీవో 111ను సమర్థించిందని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయకుండానే ఏ విధమైన అధ్యయనం లేకుండానే జీవోను తొలగించిందన్నారు. జీవో 111పై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను త్వరలో ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పర్యావరణానికి ముప్పు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ రిజర్వాయర్లు రాజధాని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా భారీ వరదల నుంచి నగరాన్ని కాపాడుతున్నాయి. 1908లో నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు మరోసారి అలాంటి వరదల వల్ల నష్టపోకుండా ఉండేందుకు అప్పటి చీఫ్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచన మేరకు ఈ రెండు జలాశయాలను నిర్మించారు. 1912లో మొదట గండిపేట్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి 1917లో పూర్తి చేశారు. ఆ తరువాత 1921లో హిమాయత్సాగర్ నిర్మాణం ప్రారంభించి 1927 నాటికి వినియోగంలోకి తెచ్చారు. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని అందిస్తున్న ఈ రిజర్వాయర్ల నుంచి ఇప్పటికీ 65 మిలియన్ గ్యాలన్ల నీరు లభిస్తోంది. ప్రస్తుతం ఇవి స్వచ్ఛమైన వర్షపునీటితో నిండి ప్రజలకు అంతే స్వచ్ఛమైన జలాలను అందిస్తున్నాయి. ‘గోదావరి జలాల వల్ల భూగర్భ నీటిమట్టం పెరగదు. గతంలో నిర్మించిన ఏ ఎస్టీపీలు, రింగ్మెయిన్లు చెరువులను కాపాడలేకపోయాయి. ఇప్పటి కే నగరంలో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్లో ఈ జలాశయాలు దెబ్బతింటే భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూతాపం విపరీతంగా పెరుగుతుంది’అని నిపుణులు చెబుతున్నారు. జీవవైవిధ్యానికి హాని ఈ జలాశయాల వల్ల కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో జీవవైవిధ్యానికి రక్షణ లభిస్తుంది. అనేక రకాల పక్షులు, వన్యప్రాణులు మనుగడ సాగిస్తున్నాయి. జీవో 111 ఎత్తివేయడంతో జీవవైవిధ్యం ప్రమాదంలో పడుతుంది. మృగవనం పార్కుకు నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే పెరిగిన భారీ నిర్మాణాల వల్ల ఎన్నో విలువైన పక్షి జాతులు అంతరించాయి. భవిష్యత్తులో ఈ ముప్పు ఇంకా ఎక్కువవుతుంది. ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది హైదరాబాద్ను వరదల బారి నుంచి కాపాడేందుకు అప్పటి నిజాం నవాబు కట్టించిన జంట జలాశయాలు నగరాన్ని భూతా పం నుంచి రక్షిస్తున్నాయి. జీవ వైవిధ్యా న్ని రక్షించుకొనేందుకూ దోహదం చేస్తున్నాయి. జీవో 111ను ఎత్తివేసి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించింది. సహజవనదరులను, జీవవైవిధ్యాన్ని ధ్వంసం చేయడం ఏ విధంగా కూడా ప్రజా సంక్షేమం కాదు. – లూబ్నా సార్వత్, సామాజిక కార్యకర్త సూపర్ ఆర్డర్ను ఎలా ధిక్కరిస్తారు ఏ నగరంలో అయినా 20 శాతం నీటి వనరులు ఉండాలి. కానీ హైదరాబాద్లో వందలాది చెరువులు మాయమయ్యాయి. భవిష్యత్లో ఈ జలాశయాలు కూ డా అలాగే మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు, సంపన్నులకు కొమ్ముకాసే పాలకులు పర్యావరణాన్ని కాపాడుతారనుకోవడం భ్రమే అవుతుంది. గతంలోనూ జీవోకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాం. జీవో 111ను సమర్థిస్తూ 2000 సంవత్సరంలో సుప్రీంకో ర్టు సూపర్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని ఎలా ధిక్కరిస్తారు. న్యాయనిపుణుల తో చర్చిస్తున్నాం. మరోసారి కోర్టుకెళ్తాం. – ప్రొఫెసర్ పురుషోత్తమ్రెడ్డి -
మూడేళ్లలో రూ.2,430 కోట్లు
న్యూఢిల్లీ: గత మూడేళ్లకాలంలో భారతీయ ఎన్జీవో సంస్థలు విదేశాల నుంచి విరాళాల రూపంలో రూ.2,430.80 కోట్లను స్వీకరించాయని కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలు చెప్పారు. 2019–20లో రూ.727.1 కోట్లు, 2020–21కాలంలో రూ.798.1 కోట్లు, 2021–22కాలంలో రూ.905.5 కోట్ల విరాళాలు పొందాయని పేర్కొన్నారు. ఈ నెల పదోతేదీ నాటికి దేశవ్యాప్తంగా 16,383 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని తెలిపారు. వీటిలో దాదాపు 15వేల సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికలను సమర్పించాయి. కొన్ని సంస్థల నిధుల దుర్వినియోగం/ నిధుల మళ్లింపుపై ఫిర్యాదుల నేపథ్యంలో చర్యల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. -
ఉద్యోగుల మధ్య సూర్యనారాయణ చిచ్చు పెడుతున్నాడు: బండి శ్రీనివాస్
-
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో ఎన్జీవో పాత్ర?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా నగరానికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) పాత్రపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్మాదిగకు సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విచారణాధికారి ముందు శనివారం హాజరయ్యా రు. కేసులోని నిందితులతో ఉన్న సంబంధాలపై అధికారులు ఆయనను ప్రశ్నించారు. కేసుతో తన కుగానీ, సంస్థకు గానీ ఎలాంటి సంబంధమూ లేదని దాటవేసినట్లు తెలిసింది. అధికారులు సాంకేతిక ఆధారాలు చూపించడంతో జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. విజయ్.. గతంలో నగరానికి చెందిన ఓ సామాజికవర్గ రిజర్వేషన్ల పోరాట సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రతాప్గౌడ్ బ్యాంకు లావాదేవీలపై ఆరా.. అంబర్పేటకు చెందిన న్యాయవాది పోగులకొండ ప్రతాప్గౌడ్ రెండో రోజూ విచారణకు హాజరయ్యారు. నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్లతో జరిపిన పలు బ్యాంకు లావాదేవీలపై ప్రతాప్ను ప్రశ్నించగా.. ఆయన మౌనం వహించినట్లు తెలిసింది. దీంతో బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇతరత్రా సాంకేతిక ఆధారాలను ఆయన ముందు పెట్టగా.. వ్యక్తిగత అవసరాల కోసం ఆయా మొత్తాన్ని వారికి ఇచ్చానని సమాధానమిచి్చనట్లు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేసినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆ ‘35’పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ -
SWAS NGO వ్యవస్థాపకుడు కరింగుల ప్రణయ్ కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
స్వయంకృషి: ఇష్టమైన పనులతో కొత్తమార్గం...
పడుతున్న కష్టమే మనకు బతుకుదెరువును నేర్పుతుంది. కొత్తగా ఆలోచించమంటుంది. ఒంటరి గడపను దాటుకొని నలుగురిలో కలవమంటుంది నేనుగా ఉన్న ఆలోచనల నుంచి మనంగా మూటగట్టుకొని సమష్టిగా పయనం సాగించమంటుంది. శ్రీకాకుళం, తిరుపతి నుంచి హైదరాబాద్ లోని ఒక ఎన్జీవో ప్రోగ్రామ్కి ఎవరికి వారుగా వచ్చారు శోభారాణి, ప్రమీల, దేవి, అరుణ, పద్మ, చైతన్య... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఈ మహిళలు తమ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఒక్కరుగా ఎదగడానికి కృషి చేస్తున్నారు. ఇప్పుడు కలిసికట్టుగా పనిచేద్దాం అని తమకై తాముగా కొత్త మార్గం వేసుకుంటున్నారు. సైదాబాద్లోని యాక్సెస్ లైవ్లీ హుడ్లో మహిళా సాధికారత కోసం అక్కడి వారు చేస్తున్న పనుల గురించి తెలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఓ ఆసక్తికరమైన సంభాషణ మమ్మల్ని ఆకర్షించింది. ‘నేను మళ్లీ హైదరాబాద్కు వచ్చే టైమ్కి నా మిల్లెట్ లడ్డూలను ప్లాస్టిక్ బాక్స్ల్లో కాకుండా ఆర్గానిక్ స్టైల్ బాక్స్ల్లో తీసుకువచ్చి మార్కెటింగ్ చేస్తా..’ అని తన పక్కనున్నవారితో చెబుతోంది ఓ అమ్మాయి. ‘‘నేను కూడా శానిటరీ ప్యాడ్స్ను అలాగే తయారుచేసి తీసుకువస్తా’’ అంది మరో మహిళ. ‘మీ బనానా చిప్స్... మాకు పంపించండి. మా దగ్గర మార్కెట్ చేస్తా!’ అని ఇంకో మహిళ మాట్లాడుతోంది. వారితో మేం మాటలు కలిపినప్పుడు వారి గ్రూప్లోకి మమ్మల్నీ అంతే సాదరంగా కలుపుకున్నారు. ‘ఇల్లు నడుపుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా మేమూ ఏదో పని చేసుకోవాలనుకున్నవాళ్లమే..’ అంటూ తమ గురించీ, తాము చేస్తున్న పనుల గురించి ఆనందంగా వివరించారు. మిల్లెట్ లడ్డూలను తయారుచేస్తున్నది మీనా. శానిటరీ న్యాప్కిన్ల గురించి, మిల్లెట్ మిక్స్ల గురించి వివరించింది ప్రమీల. వీరిద్దరూ తిరుపతి నుంచి వచ్చినవాళ్లు. ‘నేను బనానా చిప్స్ చేస్తాను’ అని శ్రీకాకుళంలోని సీతం పేట నుంచి వచ్చిన శోభారాణి చెబితే, రాగి బిస్కెట్లను, రాగులకు సంబంధించిన ఉత్పత్తులను తయారుచేస్తుంటాను’ అని చెప్పింది బ్రాహ్మణ మండలం నుంచి వచ్చిన అరుణ. ‘హోమ్మేడ్ స్నాక్స్ చేసి అమ్ముతుంటాను’ అని వివరించింది దేవి. తిరుపతిలో న్యూట్రిషనిస్ట్గా డిప్లమా చేసిన చైతన్య మల్టీ మిల్లెట్స్ ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తోంది. కరోనా సమయంలో... ప్రమీల మాట్లాడుతూ –‘మా ఆయనది ప్రైవేటు ఉద్యోగం. కరోనా కారణంగా పోయింది. పిల్లల చదువు, కుటుంబ పోషణకు ఏం చేయాలో అర్ధం కాలేదు. దీంతో ఉదయాన్నే రాగి జావ చేసి, దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరకు వెళ్లి కూర్చోనేదాన్ని. మొదట్లో ఎవరు కొంటారో.. అనుకునేదాన్ని. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ నేను చేసే రాగి జావకు డిమాండ్ పెరిగింది. దీంతో పాటు మొలకెత్తిన గింజలు కూడా పెట్టి అమ్మేదాన్ని. తెల్లవారుజామున మూడు గంటల నుంచి నా పని మొదలవుతుంది. మా చుట్టుపక్కల ఉన్న ఇద్దరు ఆడవాళ్లు కూడా మాకూ పని ఇప్పించమంటే, ఇదే పని నేర్పాను. తయారుచేసుకున్నది పార్క్ల వద్దకు తీసుకెళ్లి అమ్మడం, అలా వచ్చిన ఆదాయాన్ని వాళ్లకూ పంచడం.. కరోనా సమయం నుంచి చేస్తున్న. దీంతో పాటు రకరకాల మల్టీగ్రెయిన్ మిక్స్లు, డ్రింక్స్ స్వయంగా చేసి అమ్ముతున్నాను. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా సొంతంగా తయారుచేస్తున్నాను. దీని వల్ల నాకే కాదు, మా దగ్గర ఉన్న కొంత మంది ఆడవాళ్లకైనా పని ఇప్పించగలుగుతాను’ అని వివరిస్తుంటే కష్టం నేర్పిన పనిలో ఉన్న తృప్తి ఆమె మోములో కనిపించింది. కూలీ పనుల నుంచి... శ్రీకాకుళం నుంచి వచ్చిన శోభారాణి మాట్లాడుతూ ‘మా దగ్గర అటవీ ఉత్పత్తులు ఎక్కువ. కానీ, వాటికి మా దగ్గర పెద్దగా మార్కెట్ లేదు. వాటి మీద మంచి ఆదాయం వస్తుందన్న విషయం కూడా నాకు అంతగా తెలియదు. కూలీ పనులకు వెళ్లేదాన్ని. ఏడాదిగా అరటికాయలతో చిప్స్ తయారీ చేసి అమ్ముతున్నాను. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఆర్డర్ల మీద పంపిస్తున్నాను. ఎగ్జిబిషన్లలోనూ పాల్గొంటున్నాను. మా ఊళ్లో జరిగిన మహిళా సంఘాల కార్యక్రమాల్లో ‘మీ దగ్గర దొరికే ఉత్పత్తులతో ఏమైనా తయారుచేయచ్చు’ అంటే నేనిది ఎంచుకున్నాను. ఎక్కడా దొరకని స్పెషల్ అరటికాయలు మా ప్రాంతంలో లభిస్తాయి. వాటితోనే ఈ మార్గంలోకి వచ్చాను. మా ఇంటి దగ్గర ఉన్న ఇద్దరు వికలాంగులు నాకు ప్యాకింగ్లో సాయపడతారు. వారికి రోజుకు 200 రూపాయలు ఇస్తాను’ అని ఆనందంగా వివరించింది. కుటుంబ పోషణే ప్రధానంగా... ‘స్కూల్ ఏజ్లోనే పెళ్లవడం, పాప పుట్టడం.. ఆ తర్వాత వచ్చిన కుటుంబసమస్యలతో నా కాళ్ల మీద నేను నిలబడాలనే ఆలోచన కలిగింది’ అంటూ వివరించింది పాతికేళ్లు కూడా లేని మీనా. మిల్లెట్ లడ్డూల తయారీని సొంతంగా నేర్చుకుని, వాటిని మార్కెటింగ్ చేస్తోంది. మొదట ఇంటి చుట్టుపక్కల వాళ్లకే అమ్మేదని, తర్వాత్తర్వాత చిన్న చిన్న ఎగ్జిబిషన్స్లో పాల్గొనడం చేశాన’ని తెలియజేసింది. ‘‘కుటుంబాలను పోషించుకోవడానికే కాదు, మాకై మేం ఎదిగేందుకు, మాతో పాటు కొందరికి ఉపాధి ఇచ్చేందుకు మేం ఎంచుకున్న ఈ మార్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళుతుంటాం..’’ అని వివరించారు దేవి, అరుణ. మిగతావారూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ పనిలో మా కుటుంబసభ్యులందరినీ పాల్గొనేలా చేస్తున్నాం. పనితో పాటు నెలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. మా స్వశక్తితో మేం ఎదుగుతున్నాం అన్న ఆనందం కలుగుతుంది. మొదట్లో మాకెవ్వరికీ ఒకరికొకరం పరిచయం లేదు. మహిళా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా కలుసుకున్నవాళ్లమే. మంచి స్నేహితులమయ్యాం. ఒకరి ఉత్పత్తులను మరొకరం ఆర్డర్ల మీద తెచ్చుకొని, మా ప్రాంతాలలో వాటినీ అమ్ముతుంటాం. ఎవరికి వారుగా వచ్చినా, ఈ ఏడాదిగా ఒకరికొకరం అన్నట్టుగా ఉన్నాం. మా వ్యాపారాలను పెంచుకునేందుకు, ఇక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాం’ అని వివరించారు. మొదటి అడుగు ఎప్పుడూ కీలకమైనదే. కష్టం నుంచో, ఎదగాలన్న తపన నుంచో పుట్టుకు వచ్చేదే. తమ ఎదుగుదలకు మద్దతుగా నిలిచే అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. మరెన్నో అడుగులు వేయడానికి సిద్ధమవుతున్న వీరిని మనసారా అభినందిద్దాం. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
4 సెకన్లకో ఆకలి చావు..
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా 45 దేశాల్లోని 34.5 కోట్ల మంది ప్రజలు తీవ్ర క్షుద్బాధతో తనువు చాలిస్తున్నారని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్(ఎన్జీవోలు) పేర్కొన్నాయి. రోజుకు 19,700 మంది వంతున ప్రతి సెకనుకు నలుగురు చొప్పున ఆకలితో చనిపోతున్నట్లు అందులో పేర్కొన్నాయి. 2019తో పోలిస్తే ఆకలి చావులు రెట్టింపయ్యాయని తెలిపాయి. 75 దేశాలకు చెందిన ఆక్స్ఫామ్, సేవ్ ది చిల్డ్రన్, ప్లాన్ ఇంటర్నేషనల్ వంటి 238 ఎన్జీవోలు ఈ మేరకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యే ప్రపంచ దేశాల నేతల నుద్దేశించి లేఖ రాశాయి. ‘‘21వ శతాబ్దంలో కరువు పరిస్థితులను రానివ్వబోమంటూ ప్రపంచ నేతలు ప్రతినబూనినప్పటికీ సొమాలియాలో మరోసారి తీవ్ర కరువు తాండవిస్తోంది. 45 దేశాల్లోని మరో 5 కోట్ల మంది ప్రజలు కరువుకు చేరువులో ఉన్నారు’’ అని ఆ ప్రకటనలో తెలిపాయి. ‘కేవలం ఒక దేశం లేదా ఖండానికి సంబంధించింది కాదు. మొత్తం మానవాళికే జరుగుతున్న అన్యాయమిది’’ అని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్త ఆకలి సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వాలు నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని కోరాయి. ‘‘21వ శతాబ్దంలో కూడా కరువు గురించి మాట్లాడుకోవాల్సి రావడం దారుణం. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు తక్షణమే ఆహారంతోపాటు దీర్ఘకాలం పాటు వారికి సాయం కొనసాగించడంలో ఏమాత్రం ఆలస్యం తగదు’’ అని పేర్కొన్నాయి. -
విరాళాలు సరిపోవు.. ఊతంగా నిలవాలి: పార్వతి నౌరియాల్
చిన్నచిన్న పదాలు, అంకెలు పలకడం, అర్థం చేసుకోవడం చిన్నారి పార్వతి నౌరియాల్కు చాలా కష్టమైంది. ‘‘చిన్నపిల్ల కదా నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతుంది అని అనుకోలేదు తల్లిదండ్రులు. బద్దకస్తురాలు... ఏదీ వెంటనే నేర్చుకోదు’’ అని విసుక్కునేవారు. బుడిబుడి అడుగులతో, బుజ్జిమాటలతో ఆకట్టుకునే వయసులో అమ్మానాన్నల నిరాదరణకు గురైన ఆ చిన్నారి నేడు వందల మంది పిల్లలకు చదువు చెప్పడంతోపాటు, ఎంతోమంది సెక్స్వర్క్ర్లను వేశ్యావృత్తినుంచి బయటకు తీసుకువచ్చి గౌరవంగా బతికేందుకు అవకాశాలు కల్పిస్తోంది. మహారాష్ట్రకు చెందిన పార్వతి నౌరియాల్కు చిన్నతనంలో డిస్లెక్సియా సమస్య ఉండడంతో మూడేళ్లు వచ్చేంత వరకు పదాలు, అంకెలు కూడా సరిగా పలకలేక పోయేది. స్కూలుకెళ్లి చదువుకోవాల్సి వస్తుందని ఇలా చేస్తుంది అని చిరాకుపడుతుండేవారు తల్లిదండ్రులు. అయితే అదేమీ పట్టించుకోకుండా చదువుకుంటూ అతికష్టం మీద పదోతరగతి పాసయ్యింది పార్వతి. టెంత్ తరువాత పార్వతి డిస్లెక్సియాతో బాధపడుతోందని ఆమె తల్లి గుర్తించింది. అప్పటి నుంచి ఆమె వెన్నంటే ఉండి సమస్యను అధిగమించేందుకు సాయం చేసింది. పార్వతి తల్లి చదువుకోకపోయినప్పటికీ చదువు విలువ తెలియడం వల్ల తన పిల్లలతోపాటు, సమీపంలోని మురికివాడల్లోని అమ్మాయిలను చదివించమని పదేపదే చెబుతుండేది. తల్లి ప్రోత్సాహమే తనను ఇప్పుడు సమాజ సేవకురాలిగా నిలబెట్టిందని చెబుతుంది పార్వతి. ట్రిప్ నుంచి తిరిగి వస్తుండగా.. చక్కగా చదువుకుని విపత్తు నిర్వహణల ఉద్యోగం చేస్తోన్న పార్వతి 2015లో ఒకసారి కర్జత్ ట్రిప్కు వెళ్లింది. ట్రిప్ పూర్తిచేసుకుని అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఆమెకు కొంతమంది బాలకార్మికులు కనిపించారు. బాలలతో పనిచేయించకూడదని చట్టాలు చెబుతున్నప్పటికీ అక్కడ అంతమంది బాలకార్మికులు కనిపించడం విచిత్రంగా అనిపించింది. ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు సైతం వారిని చూసీ చూడనట్లు వదిలేయడం తనకు నచ్చలేదు. బాలకార్మికుల కష్టాలను తీర్చేందుకు అధికారులను కలిసి వారి దైన్యస్థితిని గురించి వివరించింది. నెలరోజులు తిరిగాక ఓ వ్యాపార వేత్త .. బాలకార్మికులకు వారాంతాల్లో చదువు చెప్పించడానికి టీచర్లను నియమించాడు. దీంతో కర్జత్లోని పిల్లలు చదువుకోవడం ప్రారంభించారు. 139 మంది బాలకార్మికులు బడిబాట పట్టడం ఎంతో సంతోషాన్నిచ్చింది. కోవిడ్ తర్వాత కామటిపురాకు... వందకుపైగా బాలకార్మికులని విద్యార్థులుగా మార్చిన ఆనందంలో మరింత మందిని చదివించాలని నిర్ణయించుకుంది పార్వతి. అప్పుడే కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధించడంతో పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తరువాత ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది కుటుంబాలను కలిసింది. కుటుంబపోషణకు ఆధారం లేక చావే శరణ్యమంటోన్న అనేకమంది కన్నీటి బాధలు వింటోన్న సమయంలో ఓ నిరుపేద తల్లిదండ్రులు తమ కుమార్తెని పెంచే స్థోమతలేక కామటిపురాకు అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడు ఆ అమ్మాయిని ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకుని కామటి పురాలో అడుగుపెట్టింది. అక్కడ ఎంత వెతికినా ఆ అమ్మాయి కనిపించలేదు కానీ, అక్కడ బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నలుగురు అమ్మాయిలను చేరదీసి సొంత డబ్బుతో శిక్షణ ఇప్పించి, వేశ్యావృత్తిని వదిలేలా చేసింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వేశ్యావృత్తిలోకి బలవంతంగా వస్తోన్న వారిని బయటకు తీసుకువచ్చి, వారికి వివిధ రకాల వృత్తులలో శిక్షణæఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఇలా ఇప్పటిదాకా వెయ్యిమందిని కామటిపురా నుంచి బయటకు తీసుకువచ్చి సమాజంలో గౌరవంగా బతికేలా చేసింది. వీరిలో ఎక్కువమంది చిన్నవయసు అమ్మాయిలు ఉన్నారు. వీరి పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతూ అక్కడి వారికి తన వంతు ఊతం ఇస్తోంది పార్వతి. విరాళాలు కాదు ప్రేరణగా నిలవాలి ‘‘సమాజానికి ఎంతోకొంత తిరిగిచ్చేయాలని..మన దగ్గర ఉన్న డబ్బును దానాలు, విరాళాలుగా ఇవ్వడం, లేదా ఎన్జీవోలతో కలిసి కొంతకాలం పనిచేస్తే సరిపోదు. మరణించేలోపు మనం కొంతమందికి ప్రేరణగా, సలహాదారుగా, శిక్షకులుగా నిలవాలి. అప్పుడు సమాజంలో చాలామంది మారతారు. – పార్వతి నౌరియాల్ -
‘బ్యాక్ప్యాక్’ హీరోలు!
ఈసారి ప్రపంచంలో ఎక్కడైనా భారీ భూకంపం సంభవిస్తే శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సరికొత్త ‘హీరోలు’రంగంలోకి దిగనున్నారు! వీపుపై మైక్రోఫోన్లు, వీడియో కెమెరాలు, లొకేషన్ ట్రాకర్లతో కూడిన బ్యాక్ప్యాక్లు తగిలించుకొని చిన్నచిన్న రంధ్రాల్లోకి సైతం అలవోకగా దూసుకెళ్లనున్నారు!! హీరోలేమిటి.. రంధ్రాల్లోకి దూరడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ మీరు చదివింది నిజమే.. కానీ ఈ హీరోలు ఆరడుగుల బుల్లెట్లు కాదు... కేవలం మన అరచేయికి కాస్త అటుఇటు సైజులో ఉండే ఎలుకలు!! ఇంతకీ విషయం ఏమిటంటే.. భూకంపాలు వచ్చినప్పుడు కుప్పకూలే భవనాల శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను కచ్చితత్వంతో గుర్తించడం సహాయ సిబ్బందికి పెను సవాలే. దీనికితోడు సమయంతో పోటీపడాల్సి ఉంటుంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు, క్షతగాత్రులు శిథిలాల్లో ఎక్కడ చిక్కుకున్నారో కచ్చితత్వంతో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు తాజాగా ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పనిని శునకాలు సైతం చేస్తున్నప్పటికీ వాటితో పోలిస్తే ఎలుకలు ఎన్నో రెట్లు చిన్నగా ఉండటం, చిన్నచిన్న ఖాళీ ప్రదేశాల్లోకి అలవోకగా వెళ్లే సామర్థ్యం ఉండటంతో ఇందుకోసం వాటిని ఎంచుకున్నారన్నమాట. ట్రైనింగ్లో ‘ర్యాట్’దేలుతూ.. టాంజానియాలోని మొరోగొరోలో ఎలుకలకు శిక్షణ ఇచ్చే అపోపో అనే ఎన్జీవో సంస్థతో కలసి శాస్త్రవేత్తలు సుమారు ఏడాదిగా పనిచేస్తున్నారు. తమ పరిశోధనకు హీరో ర్యాట్స్ అనే పేరుపెట్టారు. ప్రస్తుతం ఖాళీ బ్యాక్పాక్లతో వాటిని ‘డమ్మీ శిథిలాల్లో’కి వదిలి అక్కడ బాధితులెవరైనా కనపడగానే ఒక బటన్ నొక్కేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. అలాగే ‘బీప్’శబ్దం వినపడగానే ఎలుకలు తిరిగి తమ వద్దకు వచ్చేలా నేర్పుతున్నారు. ఎలుకల వీపులపై అమర్చే సాంకేతిక పరికరాలతో కూడిన బ్యాక్ప్యాక్లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎలుకల బ్యాక్పాక్లలో సాంకేతిక పరికరాలను సిద్ధం చేశాక శిథిలాల్లోకి వెళ్లే ఎలుకలు ఎక్కడ ఉన్నాయో లొకేషన్ ట్రాకర్ల ద్వారా గుర్తిస్తామని... అప్పుడు ఎలుకల వద్ద ఉండే మైక్రోఫోన్ల ద్వారా క్షతగాత్రులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న స్కాట్లాండ్లోని గ్లాస్గోకు చెందిన డాక్టర్ డోనా కీన్ చెప్పారు. ప్రస్తుతం ఏడు ఎలుకలకు శిక్షణ ఇచ్చామని... కేవలం రెండు వారాల్లోనే శిక్షణ వేగం పుంజుకుందని చెప్పారు. త్వరలోనే మొత్తంగా 170 ఎలుకలను భూకంపాలు ఎక్కువగా సంభవించే టర్కీకి తరలించనున్నారు. ఎలుకల సాయంతో భూకంప శిథిలాల్లో గాలింపు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అంగీకరించడం విశేషం. ఇదంతా బాగానే ఉంది కానీ... మనమంటే మానవత్వం కోసం తోటివారిని కాపాడాలనుకుంటాం... మరి ఎలుకలు ఎందుకు మనుషులకు సాయం చేస్తాయనే డౌట్ మీకు వచ్చిందా? దానికీ ఓ ఆన్సరుంది. ఇలా శిథిలాల్లోకి వెళ్లి చెప్పిన పని చేసొచ్చే ఎలుకలకు రుచికరమైన ఆహారాన్ని సిరంజీల ద్వారా లంచంగా ఇస్తున్నారట. దీంతో ఎలుకలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ మరికొన్ని ప్రమాదకర టాస్కుల్లోనూ... ల్యాండ్మైన్ల వంటి పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంతోపాటు పశువులకు సోకే టీబీ, బ్రుసెల్లోసిస్ వంటి ప్రమాదకర రోగాలను కనిపెట్టడంలోనూ ఎలుకల సాయం తీసుకోవాలనుకుంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. పేలుడు పదార్థాల్లో ఉపయోగించే టీఎన్టీ (ట్రైనైట్రోటోల్యూని) లేదా టీబీ పాజిటివ్ నమూనాల వాసనలను ఎలుకలు పసిగట్టేలా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. శునకాలతో పోలిస్తే నామమాత్రమైన బరువుండే ఎలుకలు పేలుడు పదార్థాలపై కాలుమోపినా పేలుళ్లు జరగవని... అలాగే శునకాల తరహాలోనే వాటి గ్రాహణ శక్తి కూడా అమోఘమని పేర్కొన్నారు. -
స్వఛ్చందసేవకు ఆసరాగా...హెచ్సీఎల్
విద్య, ఆరోగ్యం, పర్యావరణం ఈ మూడింటిలో పనిచేస్తున్న ఎన్జీఓలకు ఆర్ధికంగా సాయం చేసేందుకు ప్రత్యేక గ్రాంట్ ఏర్పాటు చేశామని హెచ్సీఎల్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి పుందిర్ తెలిపారు. హెచ్సీఎల్ గ్రాంట్ 8వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... మూడేళ్ల పాటు ఆర్ధిక సాయం... హెచ్సిఎల్ ఫౌండేషన్లో భాగంగా హెచ్సీఎల్ గ్రాంట్ ను 2015లో లాంచ్ అయింది. మా సాయం పొందేందుకు ఒక ఎన్జీఓ ప్రారంభించి కనీసం మూడేళ్లు పూర్తి చేసుకుని ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. సంస్థల నిర్వహణ, అందిస్తున్న సేవల్లో పారదర్శకత వంటివి చూసి కేటగిరీల వారీగా ఎంపిక చేస్తాం. మా ప్రాధామ్యాల పరంగా సరితూగే సంస్థలను నిపుణుల జ్యూరీ ఎంపిక చేస్తుంది. కేటగిరీ వారీగా 3 ఫైనలిస్ట్స్ను ఎంపిక చేశాక ఏడాదికి మొత్తం రూ. 16.5 కోట్లు చొప్పున అందిస్తాం. మరో 30 ఎన్జిఓ సంస్థల గురించి ఒక పుస్తకం ప్రచురిస్తాం. ప్రస్తుతం 6వ వాల్యూమ్ ప్రచురించనున్నాం. అది ప్రభుత్వ శాఖలు, దాతలకు చేరుతుంది. వాళ్ల కార్యక్రమాల శైలులు అందరికీ తెలుస్తాయి. దరఖాస్తులకు ఆహ్వానం... ఇది 8వ ఎడిషన్. ఇటీవలే అప్లికేషన్స్ ఓపెన్ చేశాం. ఏవైనా అనివార్య కారణాలు ఉంటే తప్ప సాధారణంగా 60 రోజులు ఓపెన్ చేసి ఉంచుతాం. కేవలం ఆన్లైన్ ద్వారా తప్ప మరే విధంగాననూ దరఖాస్తులు స్వీకరించం. ఏ రాష్ట్రం నుంచైనా, ఏ నగరం, జిల్లా,గ్రామం నుంచైనా దీనికి దరఖాస్తు చేయవచ్చు. వీలైనన్ని ఎక్కువ ఎన్జిఓ సంస్థలు దీని గురించి తెలుసుకోవాలనేదే మా ఉద్ధేశ్యం. అందుకే నగరాల వారీగా సింపోజియమ్స్ నిర్వహిస్తున్నాం. ఎన్జీఓలు వాటికి అర్హతలు ఉన్నా లేకున్నా దీనికి హాజరు కావచ్చు. సీఎస్ఆర్ చట్టాలు,, ప్రాంతీయ అంశాలు, ఉపయుక్తమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ సదస్సులు ఉపకరిస్తాయి. విభిన్న మార్గాల ద్వారా ఎన్జీఓలు సాయం పొందే అవకాశాలు కూడా తెలుస్తాయి. చదవండి: ఉక్రెయిన్ కోసం గూగుల్.. సుందర్ పిచాయ్ డేరింగ్ స్టెప్. -
సంచారుల కేరాఫ్ అడ్రస్.. మిత్తల్ పటేల్
అవి చేద్దాం ఇవి చేద్దాం అని జీవితంలో ఎన్నో కలలు కంటుంటాం కానీ, అన్నీ నిజం కావు. కొంతమంది కలలు ఒకరకంగా ఉంటే వారి డెస్టినీ మాత్రం మరోలా ఉంటుంది. కొన్నిసార్లు కల చెదిరినప్పటికీ డెస్టినీ చూపిన మార్గంలో మరెంతోమంది కలలను నిజం చేసే అవకాశం లభిస్తుంది. ఇలా లభించిన అవకాశంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది మిత్తల్ పటేల్. చిరునామా లేని వేలమందికి గుర్తింపు కార్డులతోపాటు, ఒక అడ్రెస్ను ఏర్పాటు చేసి, జనజీవన స్రవంతిలో కలుపుతోంది. గుజరాత్లోని సంఖల్పూర్లోని ఓ రైతు కుటుంబంలో పుట్టింది మిత్తల్ పటేల్. చిన్నప్పటి నుంచిఐఏఎస్ అధికారి కావాలనేది ఆమె కల. బీఎస్సీ అయ్యాక ఐఏఎస్ కోచింగ్ కోసం అహ్మదాబాద్ వెళ్లింది. ఒకపక్క ఐఏఎస్కు సన్నద్ధమవుతూనే గుజరాత్ విద్యాపీఠ్లో జర్నలిజం కోర్సులో చేరింది. ఇక్కడే ఆమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. రెండు నెలల ఫెలోషిప్లో భాగంగా బార్డోలి గ్రామానికి వెళ్లింది మిత్తల్. అక్కడ ఓ సంచార తెగను చూసింది. ఈ తెగకు చెందిన వాళ్లలో కొందరు ఏవో చిన్నపాటి గుడ్డపీలికలు మాత్రమే ధరించడం, మరికొందరు అదీ లేకుండా అలాగే ఒకచోటనుంచి మరో చోటుకి వలస వెళ్తుండడం వల్ల రోజుల తరబడి తిండిలేక బక్కచిక్కిన శరీరాలను చూసి ఆమె చలించిపోయింది. పేదరికం ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది మిత్తల్కు. వీరికోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. రెండేళ్ల పాటు సంచార జాతుల గురించి పూర్తిగా తెలుసుకుని వారి కనీస అవసరాలు తీర్చి, వారికో గుర్తింపు ఇవ్వాలని పూనుకుంది. వీరి గురించి ఎంతోమంది అధికారులకు విన్నవించింది. వారికి సాయం చేయడానికి ఏ సీనియర్ అధికారీ ముందుకు రాలేదు. ప్రభుత్వ అధికారులే ఏం చేయలేనప్పుడు .. నేను ఆఫీసర్ను అయితే మాత్రం ఏం లాభం అనుకుంది. అప్పటిదాకా ఐఏఎస్ పరీక్షకు సిద్ధమైన మిత్తల్ ప్రిపరేషన్ను పక్కన పెట్టింది. విచారత సంస్థాన్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగే సంచార జాతులు ఒక్క గుజరాత్లోనే 40 రకాలు ఉన్నారు. ముఫ్పై నుంచి నలభై లక్షల వరకు జనాభా ఉండే ఈ సంచారులకు ఆధార్ కార్డు, ఓటరు కార్డు, జనన ధ్రువీకరణ, చిరునామా సంబంధిత పత్రాలు ఏవీలేవని గుర్తించింది. వీరికి కనీస అవసరాలు కల్పించడానికి పూర్తిస్థాయిలో పనిచేయాలనుకుంది. భర్త ప్రోత్సహించడంతో 2015 విచారత కమ్యునిటీ పేరిట ఎన్జీవోను ప్రాంభించింది. సంచార జాతులను వెతకడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరికి సంబంధించిన పెళ్లిళ్లు, ఇతర విందు వినోద కార్యక్రమాల వద్దకు వెళ్లి వారి గురించి వివరాలు అడిగేది. ఈమె ఎవరో ఏమిటో తెలియక మొదట్లో తిరస్కరించినప్పటికీ తరువాత ఆమెను నమ్మి తమ వివరాలు చెప్పేవారు. వాళ్లు నివసించే ప్రాంతంలో టెంట్ వేసుకుని మరీ వారి స్థితిగతులను అధ్యయనం చేసేది. ఈ క్రమంలోనే పద్నాలుగు వందల కుటుంబాలకు పక్కా ఇళ్లను సమకూర్చింది. విచారత ఆధ్వర్యంలో మూడు హాస్టల్స్ను నిర్మించింది. వీటిలో వందలమంది సంచారుల పిల్లలు చదువుకుంటున్నారు. ఐడెంటిటీతో అందర్ని కదిలించింది గుజరాత్ ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు అందరి చుట్టూ తిరిగి సంచారులకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని వినతి పత్రం సమర్పించింది. చివరికి 2010లో తొంబై వేలమంది సంచారులకు రాష్ట్రప్రభుత్వం ఐడెంటిటీ కార్డులు జారీ చేసింది. ఇదే సమయంలో విచారత సంస్థాన్ ‘అమె పన్ చియే’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సంచారులకు ఐడెంటిటీ కార్డులు అందించారు. అప్పట్లో ఈ కార్యక్రమం అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలను ఆకర్షించింది. దీంతో ఆ తరువాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల్లో పార్టీలన్నీ సంచారులకు అనేక హామీలు ఇచ్చాయి. ఊరు, పేరు లేని సంచారులకు ఐడెంటిటీని కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మిత్తల్ని 2017లో ‘నారీ రత్న’ అవార్డు వరించింది. దాదాపు పదిహేనేళ్లుగా సంచారుల అభ్యున్నతికి పాటుపడుతోన్న మిత్తల్ ప్రస్తుతం రాజాస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లలోని సంచార, బంజార జాతుల అభివృద్ధే లక్ష్యంగా నిర్విరామంగా కృషిచేస్తోంది. చదవండి: అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్! -
మనసున్న మారాజు..
శిఖరం చేరడమే విజయం అనుకుంటే...అది చేరే ప్రస్థానంలో కష్టాలు పడుతున్న వారికి చేయూత ఇచ్చి, వెన్నుతట్టి, దారి చూపడం ఘన విజయం. ‘ఏకలవ్య’ మూమెంట్ ద్వారా రాజు కేంద్రె ఆ పనే చేస్తున్నాడు... విదర్భ(మహారాష్ట్ర)లోని సంచార తెగల్లో చదువు అనేది అరుదైన విషయం. అయితే రాజు కేంద్రె తల్లిదండ్రులు మాత్రం చదువుకు బాగా విలువ ఇచ్చారు. తమకు అక్షరం ముక్క రాకపోయినా పిల్లలను మాత్రం అవకాశం ఉన్నంత వరకు చదివించాలనుకున్నారు. రాజు చదువు ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగింది. హైస్కూలు వరకు పెద్దగా తెలియలేదుగానీ, కాలేజిలో చేరిన తరువాత రకరకాల దూరాలు పరిచయం అయ్యాయి. ఇంగ్లీష్కు తనకు మధ్య ఉండే దూరం, కమ్యూనికెషన్స్ స్కిల్క్కు తనకు మధ్య ఉండే దూరం, ఇంకా రకరకాల ఆర్థిక, సామాజిక దూరాలు! పుణె యూనివర్శిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు కూడా ఇదే దూరం తనకు అడ్డుగా నిలిచించి. బుల్దాన జిల్లాలోని తన ఊరు నుంచి అక్కడికి 400 కిలోమీటర్ల దూరం. పుణె వెళ్లి చదువుకోవాలంటే, చదువు సంగతి సరే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. దీంతో యశ్వంత్రావు చవాన్ మహారాష్ట్ర ఒపెన్ యూనివర్శిటీలో చదుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(తుల్జాపూర్)లో చేరడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. మేల్ఘాట్లోని ‘కొర్కు’లాంటి గ్రాస్రూట్ కమ్యూనిటీలతో కలిసి పనిచేసే అవకాశం లభించింది. వారి పనితీరు, నైపుణ్యాలను దగ్గరి నుంచి చూశాడు. ‘వీరికి చదువు వస్తే ఎన్ని గొప్ప విజయాలు సాధించేవారో కదా’ అనుకున్నాడు. అట్టడుగు వర్గాల విద్యార్థుల కోసం ‘ఏకలవ్య ఇండియా’ అనే స్వచ్ఛందసంస్థకు ఉద్యమస్ఫూర్తితో శ్రీకారం చుట్టాడు రాజు. స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, టెక్నాలజికల్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూ వరకు ఎన్నో నేర్పిస్తుంది ఏకలవ్య. దీంతో పాటు చదువుల ప్రస్థానంలో తన కష్టాల నుంచి ప్రతిష్ఠాత్మకమైన చీవ్నింగ్ స్కాలర్షిప్(యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం) గెలుచుకోవడం వరకు ఎన్నో విషయాలు చెబుతున్నాడు రాజు. అట్టడుగు వర్గాల తొలితరం విద్యార్థులకు కొండంత అండగా ఉన్న ‘ఏకలవ్య’కు ఎంటర్ప్రెన్యూర్స్, సోషల్ వర్కర్స్, డాక్టర్లు, వివిధ రంగాల ప్రముఖలు సహకారం అందిస్తున్నారు. ‘ఏకలవ్య’ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 300 మంది విద్యార్థులు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో చదువుకునేందుకు సహాయం చేసింది. చదువు విలువ గురించి పేదకుటుంబాల దగ్గరకి వెళ్లి ప్రచారం చేస్తుంది ఏకలవ్య, 2030 నాటికి వెయ్యిమంది వరకు గ్రాస్రూట్స్ లీడర్స్ను తయారుచేయాలనేది ‘ఏకలవ్య’ లక్ష్యంగా పెట్టుకుంది. ‘అట్టడుగు వర్గాల గురించి అంకితభావంతో పనిచేస్తున్న రాజు ఎంతోమందికి స్ఫూర్తి ఇస్తున్నాడు’ అని ప్రశంసపూర్వకంగా అంటున్నారు స్కూల్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(టిస్) అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ సుధీర్ పటోజు. -
సినిమాలో ఆ పాత్ర.. ఇప్పుడు వారి కోసం రియల్ లైఫ్లో ఇలా
Yami Gautam Joins Hands With NGOs To Help Rape Survivors: బాలీవుడ్ ముద్దుగుమ్మ యామీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నితిన్ సరసన కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, నువ్విలా తదితర చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఆడియెన్స్కు చేరువైంది. అయితే ఆశించినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించలేకపోయింది. అందుకే మళ్లీ బాలీవుడ్లోనే తనను తాను నిరూపించుకుంటోంది. అయితే తాజాగా ఈ భామ లైంగిక వేధింపులకు గురైన బాధితులకు మద్దతు తెలిపింది. అలాంటి వారికి పునరావాసం కల్పించడానికి మజ్లిస్, పారి పీపుల్ ఎగైనెస్ట్ రేప్ ఇన్ ఇండియా అనే రెండు ఎన్జీవోలతో కలిసి పనిచేయనుంది. 'లైంగిక వేధింపుల బాధితుల పునరావాసానికి కృషి చేస్తున్న రెండు ఎన్జీవోలతో నేను కలిసి పనిచేయబోతున్నాని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. చాలా గర్వంగా కూడా ఉంది. మహిళల భద్రత సమస్యలపై పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉంది. భవిష్యత్తులో అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి, వారికి మెరుగైన వనరులను సేకరించడంలో సహాయపడేందుకు నేను మరింత సహకారం అందించాలనుకుంటున్నాను.' అని యామీ పేర్కొంది. ఇదిలా ఉంటే యామీ గౌతమ్ నటించిన తాజా చిత్రం 'ఏ థర్స్డే'. ఇందులో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో యామీ అత్యాచార బాధితురాలి పాత్రను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే లైంగిక వేధింపులకు గురైన బాధితుల పునరావాసం కోసం అందుబాటులో ఉన్న ప్రస్తుత మౌలిక సదుపాయాల గురించి మనందరం ఆలోచింపజేసింది. ఇప్పుడు నిజ జీవితంలో లైంగిక వేధింపుల బాధితుల కోసం తనవంతు సహకారం అందించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే. -
రూ. 8లక్షల ఉద్యోగం కాదని చిత్తూరు కుర్రోడి సరికొత్త ఆలోచన.. ఫోర్బ్స్ జాబితాలో చోటు
డొనేట్కార్ట్. స్వచ్ఛంద సంస్థలకు, దాతలకు మధ్య వారధి. ఏ ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థ అయినా వెబ్సైట్లో వారి సేవలకు అవసరమైన వస్తు, సామగ్రి, పరిమాణాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ వివరాల ఆధారంగా దాతలు అందుకు అవసరమైన మొత్తాన్ని డొనేట్కార్ట్కు సమకూరుస్తారు. ఆ నగదుతో సంబంధిత స్వచ్ఛంద సంస్థ వెబ్సైట్లో నమోదు చేసిన అవసరాలను సమకూరుస్తుంది. వెబ్సైట్ వేదికగా పని చేస్తున్న ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు బి.అనిల్కుమార్రెడ్డి. 26 ఏళ్ల ఈ యువకుని స్వగ్రామం జిల్లాలోని బి.కొత్తకోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామం చలిమామిడి. ఫోర్బ్స్ జాబితాలో ఈ సంస్థ చోటు దక్కించుకోవడంతో ఈ యువకుడి సేవాగుణం వెలుగులోకి వచ్చింది. సాక్షి, చిత్తూరు: కష్టాలను కళ్లారా చూసి.. సావాసం చేసి.. పోరాడి నిలిస్తే ఆ నీడ ఎంతో మందికి సేదతీరుస్తుంది. ఓ నిరుపేద కుటుంబం.. అందునా వ్యవసాయమే ఆధారం.. చదువును పెట్టుబడిగా మలుచుకుని రాణించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఎదిగి పది మందికి సహాయపడే స్థాయికి చేరుకున్నాడు. లక్ష్యం బలంగా ఉంటే ఎంతటి కష్టమైనా తలవంచుతుందని నిరూపించాడు ఓ మారుమూల అటవీ సరిహద్దు గ్రామ యువకుడు. ఇప్పుడు అతని పేరు ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవడంతో ఊరంతా గర్వపడుతోంది. బి.కొత్తకోట మండలంలోని అటవీ సరిహద్దు గ్రామం చలిమామిడికి చెందిన రైతు దంపతులు సుశీలమ్మ, గోవిందరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. రెండో కుమారుడు బి.అనిల్కుమార్రెడ్డి బి.కొత్తకోటలో ప్రాథమిక విద్య, తిరుపతిలో 9, 10.. నెల్లూరులో ఇంటర్, నాగ్పూర్లో ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రోఫోర్స్ సంస్థలో ఏడాదికి రూ.8 లక్షల వేతనంతో ఉద్యోగం వచ్చినా చేరలేదు. సొంతంగా ఓ సంస్థను స్థాపించాలనే లక్ష్యంతో ఎన్ఐటీ నాగ్పూర్లో చదివిన తెలంగాణలోని కోదాడకు చెందిన సందీప్ శర్మతో కలిసి డొనేట్కార్ట్ను 2016 అక్టోబర్ 11 ప్రారంభించగా ఇందులో మహారాష్ట్రకు చెందిన సారంగ్ బోబాడే సహా వ్యవస్థాపకులుగా సంస్థను నడిపిస్తున్నారు. చదవండి: ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ముగ్గురు తెలుగు కుర్రాళ్లకు చోటు! వినూత్న ఆలోచన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డొనేట్కార్ట్ సంస్థ ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 గ్రూపు ఎన్జీఓలు–సోషల్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో స్థానం దక్కించుకుంది. 30 ఏళ్లలోపు వయసు కలిగిన వారు నిర్వహిస్తున్న 30 సంస్థలను ఫోర్బ్స్ ఇండియా ఎంపిక చేయగా అందులో డొనేట్కార్ట్ ఒకటి. సాధారణ రైతు కుటుంబానికి చెందిన అనిల్కుమార్రెడ్డి అందరిలా ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడితే చాలనుకోలేదు. తనవంతుగా సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకుని బలంగా సంకల్పించాడు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ‘సేవల వారధి’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రూ.5వేల కోట్ల విరాళాలు లక్ష్యం 2016 ఆగస్టులో మా సంస్థను స్థాపించగా ఇప్పటి వరకు 10లక్షలకు పైగా దాతల నుంచి రూ.150 కోట్ల విరాళాలు సేకరించాం. భవిష్యత్తులో విరాళాలను రూ.5వేల కోట్లకు పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. విరాళాలు అత్యధికంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ల నుంచే అందుతున్నాయి. – బి.అనిల్కుమార్రెడ్డి, ఫోర్బ్స్ సహ వ్యవస్థాపకుడు వెబ్సైట్ వేదికగా.. మొదట నాగ్పూర్లో వెబ్సైట్ వేదికగా ప్రారంభమైన డొనేట్కార్ట్ ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్కు మకాం మార్చింది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ రెండుచోట్లా పనిచేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డొనేట్కార్ట్ రూ.90 కోట్ల టర్నోవర్ సాధించింది. స్వచ్ఛంద సంస్థలకు సమకూర్చాల్సిన వస్తు సామగ్రిని బల్క్గా కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది. ఆ మొత్తమే రూ.90కోట్లు. ఈ నిధుల నుంచే సంస్థలో పనిచేస్తున్న 75 మంది ఉద్యోగులకు వేతనాలు, ఖర్చులు వెచ్చిస్తున్నారు. ఉద్యోగులకు నెలసరి వేతనం రూ.25వేల నుంచి రూ.4లక్షల వరకు చెల్లిస్తుండటం విశేషం. -
కష్టకాలంలో మంచి నిర్ణయాలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, సొంతింటి కల దిశగా ఎంఐజీ లే అవుట్లలో ప్లాట్లు తాము ఊహించలేదని, మొత్తంగా పీఆర్సీ పట్ల సంతృప్తిగా ఉన్నామని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. చాలా సమస్యలకు పరిష్కారం లభించిందని, కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్ మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వారు సీఎంవో అధికారులతో సమావేశం అయ్యారు. అనంతరం అక్కడి మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. జగన్ చిత్రపటానికి స్వర్ణ కమలాభిషేకం శ్రీకాళహస్తి: ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఇతర వరాలు ప్రకటించిన నేపథ్యంలో శనివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఆయన చిత్రపటాన్ని స్వర్ణ పుష్పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘం నాయకులు చెంచురత్నంయాదవ్, నారాయణరెడ్డి, రవికాంత్, నాగేశ్వర్రెడ్డి, ఉపాధ్యాయ సంఘం నేతలు కృష్ణగిరి రెడ్డి, గోపి, విశ్రాంత ఉద్యోగుల సంఘం నేత రమణయ్య, పురపాలక, ఆర్టీసీ తదితర ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల్లో పండుగ సందడి ప్రభుత్వం పీఆర్సీ 23 శాతం పెంచడంతో పాటు పలు అనుకూల నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఉద్యోగులందరూ ఆనందంగా ఉన్నారని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాపరెడ్డి అన్నారు. శనివారం ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఆయన ఉద్యోగుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు గుంటూరులో ఎమ్మెల్సీ కల్పలత ఉపాధ్యాయ, ఉద్యోగులతో కలసి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులు ఆశించినట్లే హెచ్ఆర్ఏ ఉంటుంది హెచ్ఆర్ఏ విషయంలో ప్రస్తుత శ్లాబులనైనా కొనసాగించాలి, లేదా పీఆర్సీ కమిషనర్ సూచించిన శ్లాబులనైనా పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశాం. పెన్షనర్లకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పాం. హెచ్ఆర్ఏ ఉద్యోగులు ఆశించినట్లే ఉంటుంది. సీఎం నిర్ణయాల పట్ల అందరూ ఆనందంగా ఉన్నారు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రభుత్వంపై నమ్మకం ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, ప్రభుత్వ ఉన్నతాధికారుల మీద మాకు నమ్మకముంది. అదనపు పెన్షన్ విషయంలో సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే పెన్షనర్లు ఇబ్బందులు పడతారని చెప్పాం. 62 ఏళ్లకు పదవీ విరమణ, సొంతింటి కల మేము ఊహించని నిర్ణయం. అన్ని సమస్యలపై సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి సచివాలయాల ఉద్యోగులకు మేలు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలిసీ తెలియక కొంత మంది ఆందోళన చేస్తున్నారు. వాళ్లందరికీ తప్పకుండా రెగ్యులర్ అవుతుంది. ఇతర ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని విషయాల్లో న్యాయం జరుగుతుంది. కారుణ్య నియామకాల విషయంలో ఏ శాఖలో అయినా నియామకం చేయాలని కోరాం. – కె.వి.శివారెడ్డి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేటి సమావేశం వాయిదా ఈ నెల 7న సీఎం జగన్ ప్రకటించినవి కాకుండా మిగిలిన విషయాల గురించి శనివారం సీఎంవో అధికారులతో చర్చించాం. కోవిడ్, నాన్ కోవిడ్లో చనిపోయిన వారికి కూడా కారుణ్య నియామకాలు చేయాలని కోరాం. సానుకూలంగా నిర్ణయాలు జరిగాయి కాబట్టి మా కార్యాచరణ కోసం ఆదివారం జరగాల్సిన సమావేశం వాయిదా వేస్తున్నాం. – వైవీ రావు, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం నేత డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ ఫిట్మెంట్ విషయంలో ఉపాధ్యాయులు కొంత అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. కానీ డీఏలు అన్నీ ఒకేసారి క్లియర్ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. సీఎం రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచించాలని చెప్పారు. మేమంతా అర్థం చేసుకుని ఆమోదించాం. ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతున్నాయి. – జోసెఫ్ సుధీర్ బాబు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని కోరాం. సీఎంవో అధికారులను కలిసి మా సమస్యను వివరించాం. ఎలిజిబిలిటీ ఉన్న వారికి వెంటనే ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని విన్నవించాం. ఉన్నతాధికారి అజయ్ జైన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమావేశం నిర్మాణ భవన్లో నిర్వహిస్తామన్నారు. – బత్తుల అంకమ్మ రావు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు కొత్త పీఆర్సీలో భాగంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొత్త స్కేల్స్ వర్తింప చేస్తామని ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత కార్యక్రమాలతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు దక్కడం పట్ల గర్వంగా ఉంది. – కె.నాగరాజు, స్టేట్ సెర్ప్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ సీఎం నిర్ణయం సాహసోపేతం ఉద్యోగుల పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం సాహసోపేతమైనది. ఈ పీఆర్సీలో మానవత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉద్యోగులను వేరుగా చూడటంలేదు. ప్రభుత్వంలో అంతర్భాగంగా చూస్తోంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా ఉద్యోగుల కష్టాలను తీరుస్తోంది. రిటైర్మెంట్ వయో పరిమితి పెంచటంపై ఎల్లో మీడియా పెదవి విరచడం దారుణం. చంద్రబాబు వయస్సు ఎంత, ఎందుకు రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వడంలేదో చెప్పాలి. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లకు జగనన్న ఇచ్చిన సంక్రాంతి కానుక. – వెన్నపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ -
ఐఐటీ ఢిల్లీకి విదేశీ విరాళాలు బంద్
న్యూఢిల్లీ: లైసెన్స్ రెన్యువల్ కాని కారణంగా దేశంలోని 5,789 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాలను అందుకునే అవకాశాన్ని కోల్పోయాయి. ఐఐటీ ఢిల్లీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ), జామియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరణ, తదితర కారణాలతో ఈ సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోం శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల గత లైసెన్స్ శనివారం(జనవరి ఒకటిన) ముగిసింది. ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్ఫామ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రేజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్స్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాల లైసెన్స్ గడువు ముగిసింది. భారత్లోని ఎన్జీవోలు విదేశీ విరాళాలను సమీకరించాలంటే ఎఫ్సీఆర్ఏ కింద దరఖాస్తు చేసుకుని లైసెన్స్ను కలిగి ఉండటం తప్పనిసరి. శుక్రవారం నాటికి వీటి సంఖ్య 22,762కాగా శనివారం తర్వాత వీటి సంఖ్య 16,829కి తగ్గింది. -
12,580 ఎన్జీవోల లైసెన్సులు రద్దు! ఇక నో ఫారిన్ ఫండ్స్..
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్సీఆర్ఏ) 2010 కింద ఎన్జీవోలకు విదేశీ నిధులు చేరాలంటే లైసెన్సులను తప్పనిసరిగా కలిగి ఉండాలి. కాగా దాదాపు 12,580 ఎన్జీవో (నాన్ ఫ్రోఫిట్ ఆర్గనైజేషన్లు)ల లైసెన్సుల తుది గడువు నిన్నటితో ముగియడంతో వారి లైసెన్సులన్నీ శనివారం సీజ్ చేసినట్లు కేంద్ర హోం శాఖ తాజాగా విడుదల చేసిన జాబితాలో తెల్పింది. ఎఫ్సిఆర్ఎ కింద క్రితం రోజు వరకు యాక్టివ్గా ఉన్న 22,762 ఎన్జీఓలు ప్రస్తుతం 16,829కి తగ్గాయి. దాదాపు 5,933 ఎన్జీఓల రిజిస్ట్రేషన్లు రద్దు చేయబడ్డాయి (రెన్యూవల్ చేసుకోకపోవడంతో). మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఇమాన్యుయేల్ హాస్పిటల్ అసోసియేషన్, ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆశాకిరణ్ రూరల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ, చైతన్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, ఎఫ్సిఆర్ఎ లైసెన్స్లు స్వాధీనం చేసుకున్నట్లు తాజా జాబితాలో ఉంది. హమ్దర్డ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ సొసైటీ, డీఏవీ కాలేజ్ ట్రస్ట్ అండ్ మేనేజ్మెంట్ సొసైటీ, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, జేఎన్యూలోని న్యూక్లియర్ సైన్స్ సెంటర్, ఇండియా హాబిటాట్ సెంటర్, లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే 6587 ఎన్జీఓలు జాబితాలో ఉన్నాయి.లైసెన్స్ల రెన్యువల్ కోసం గడువుకాలం పొడిగించినప్పటికీ ఆయా సంస్థలు అప్డేట్ చేసుకోలేదు. కాగా కొన్ని ఎన్జీఓల ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేన్కు తుది గడువు 2021 సెప్టెంబర్ 29,30 తేదీల్లో ముగియనుండగా, ఆ సమయాన్ని మార్చి 2022 వరకు హోం శాఖ పొడిగించింది. చదవండి: Online Frauds: అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్లో.. -
భారత్లో జీరో రూపాయి నోటు ఉందని మీకు తెలుసా!...
Zero Rupee Note Create For Corruption: ఎవరైనా మీకు సున్నా రూపాయి నోటును అందజేస్తే మనం కచ్చితంగా అది నకిలీ నోటుగా భావించి వదిలేయడం లేదా పడేయడమో చేస్తాం. మనందరి దృష్టిలో రూ.10, 20 నుంచి రూ.500, 2000లు విలువ కలిగిన నోటులు. కానీ సున్న రూపాయి నోటుకి కూడా అది పెద్ద విలువ ఉంది. అది కేవలం సాధారణ కాగితం కాదని మీకు తెలిస్తే? బహుశా మీరు ఆశ్చర్యపోవచ్చు. (చదవండి: రాయ్ తుపాను ధాటికి 208 మంది మృతి) భారతదేశంలో సున్నా-రూపాయి నోటు అనేది లంచాలు లేకుండా చేసేలా మొత్తం వ్యవస్థాగత రాజకీయ అవినీతిని అరికట్టడానికి ఒక సాధనంగా జారీ చేసిన బ్యాంకు నోట్ల అనుకరణ. పైగా దీన్ని 50 రూపాయల నోటును పోలి ఉండేలా తయారు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాలుగు మూలస్థంభాలుగా శాసనసభ, కార్యనిర్వాహకుడు, న్యాయవ్యవస్థ, మీడియా అని మాత్రమే తెలుసు. కానీ ఐదవ స్థంభంగా ప్రభుత్వేతర సంస్థ ఒకటి పనిచేస్తుందని మనకెవరికి తెలియదు. తమిళనాడుకు చెందిన ఎన్జీవో ఐదవ స్తంభంలా శాంతియుత ప్రజాస్వామ్య రక్షణకై తనవంతు కీలక పాత్రను పోషిస్తోంది. అంతేకాదు 2007లో లంచం తీసుకోవడానికి నిరాకరించడాన్ని నమోదు చేసేందుకు జీరో రూపాయి నోటును రూపొందించింది. అంతేకాదు ఈ నోటు రూ. 50కి చాలా సారూప్యంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిపై "అన్ని స్థాయిలలో అవినీతిని నిర్మూలించండి" "నేను లంచం తీసుకోనని లేదా ఇవ్వనని వాగ్దానం చేస్తున్నాను." అనే అవినీతి వ్యతిరేక నినాదాలు ఉంటాయి. పైగా దశాబ్ద కాలంగా ప్రతి నెలా ఈ సున్న రూపాయి నోట్ల పంపిణీ జరుగుతోంది. అయితే నిజానికి అవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)చే ముద్రించినవి కావు. ఈ ఐదవ స్థంభానికి అధ్యక్షుడు అయిన విజయ్ ఆనంద్ ఈ కార్యక్రమ సమర్థత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయ్ ఆనంద్ మాట్లాడుతూ..."ప్రజలు ఇప్పటికే వాటిని ఉపయోగించడం ప్రారంభించారు. అది పని చేస్తోంది కూడా. ఒక ఆటో-రిక్షా డ్రైవర్ను అర్ధరాత్రి ఒక పోలీసు తన ఆటోని ఆపి డబ్బు ఇస్తే వెళ్లిపోవచ్చు అని అన్నప్పుడు ఆ డ్రైవర్ ఈ సున్న రూపాయి నోటుని ఇచ్చాడు. ఆ పోలీసు ఒక్కసారిగా షాక్ అయ్యి నవ్వుతూ ఆ ఆటో డ్రైవర్ని విడిచి పెట్టాడు. దీని ఉద్దేశ్యం లంచం వద్దు అని ప్రజలలో విశ్వాసం కలిగించడమే" అని అన్నారు. ఈ మేరకు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం వంటి వివిధ భాషల్లో లక్షలాది జీరో రూపాయల నోట్లను ముద్రించాం అని చెప్పారు. అంతేకాదు ముఖ్యంగా అవినీతి, లంచగొండితనంపై అవగాహన కల్పించేందుకు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వాలంటీర్లు పంపిణీ చేశారని విజయ్ ఆనంద్ చెబుతున్నారు. (చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది') -
డ్రగ్స్ అడిక్ట్ టూ విన్నర్!: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది'
ఇటీవలకాలంలో యువత ఎక్కువగా సిగరెట్స్, మద్యం, డ్రగ్స్ వంటి వాటికి బానిసై తమ జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నారో చూశాం. ఆఖరికి సినితారలను సైతం ఈ జాడ్యం వదలడం లేదు. ప్రముఖ సెలబ్రెటి పిల్లలతో సహా అందరూ వీటికి బానిసై పోతున్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోనూ, యువతలోను మార్పు రాకపోవడం మన దురదృష్టమో లేక మరోకటో తెలియదు. అయితే ఇక్కడొక మహారాష్ట్రవాసి చిన్నవయసులో సిగరెట్ కాల్చడం, మద్యం సేవించడం వంటి వాటికి బానిసయ్యాడు. అయితే అతను అలా వాటికి అడిక్టి అవ్వడమే తనకు వరంగా మారిందనే చెప్పలి. ఒక రకంగా తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది. అసలు విషయంలోకెళ్లితే...మహారాష్ట్రలోని గోధాని గ్రామ నివాసి అయిన పంకజ్ మహాజన్ నాల్గవ తరగతి చదువుతున్నప్పటి నుంచి పొగాకు, మద్యపానానికి బానిసయ్యాడు. దీనికితోడు మద్యానికి బానిసైన తండ్రి, వికలాంగురాలైన తల్లి ఉండటంతో పంకజ్కి సరైన మార్గదర్శకత్వం లేకుండా పోయింది. అయితే పంకజ్ తండ్రి పోగాకుతో సహా నిత్యావసరాల వస్తువులు విక్రయించే దుకాణాన్ని నడిపేవాడు. ఈమేరకు పంకజ్ తన తండ్రి, ఆ గ్రామ పెద్దలు స్టైయిలిష్గా పొగాకు తాగటం చూసి తాను కూడ వారి అడుగుజాడల్లోనే నడవాలని అనుకున్నాడు. అంతేకాదు ఎవరికి తెలియకుండా పొగాకు కాల్చడం కూడా నేర్చుకున్నాడు. అమ్మను కాపాడుకోలేని స్థితి.... అయితే అది ఎంతవరకు వచ్చిందంటే ఒక్కరోజులోనే పొగాకు ప్యాకెట్ మొత్తం అయిపోయిలా తాగేంతవరకు వచ్చింది. అంతేకాదు పంకజ్ సిగరెట్ కాలుస్తున్నప్పటికీ తండ్రి మందలించకపోవడంతో పంకజ్కి అది తప్పు అన్న విషయం తెలియలేదు. ఆ తర్వాత పంకజ్ మద్యం సేవించటం కూడా మొదలు పెట్టేశాడు. దీంతో ఆ బస్తీలో ఉన్న మిగతా పిల్లల తల్లిదండ్రులు పంకజ్ దగ్గరకు వెళ్లనిచ్చేవారు కాదు. మరోవైపు తన తండ్రి మద్యానికి బానిసై డబ్బులు కోసం తన తల్లిని, తనను కొడతుండటంతో పదిలోనే చదువుకు స్వస్తి పలికి డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు. అయితే ఒకరోజు తన తండ్రి తాగి వచ్చి తన తల్లిని చితకొట్టాడు. ఈ క్రమంలో ఆమె తలకు పెద్ద గాయం అవుతుంది. అయితే అక్కడే ఉన్న పంకజ్ తన తండ్రిని ఆపడానికి గాని తన తల్లిన కాపాడుకోవటానికి గాని ప్రయత్నించకుండా అలా చూస్తుండిపోతాడు. జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన.... చుట్టుపక్కల వాళ్లు వాళ్ల అమ్మను ఆసుపత్రిలో జాయిన్ చేసి కాపాడతారు. ఆ సంఘటనే తన జీవితాన్ని మారుస్తుంది. పంకజ్ ఈ చెడ్డఅలవాట్లకు బానిసయ్యి నీరసించపోవటం, అలిసిపోయి ఏ పని చేయలేని స్థితికి చేరుకుంటాడు. అందువల్లే ఆ రోజు అతను తన తండ్రి దాడి చేస్తున్నప్పుడు తల్లిని కాపాడే శక్తి కూడా లేక నిస్సత్తువగా చూస్తుండిపోయాడు. ఆ సంఘటనే తన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అనుకోకుండా పంకజ్ గ్రామానికి ఎన్జీవోలు వచ్చారు. అయితే ఆ గ్రామస్తులు కారణంగా పంకజ్ గురించి ఎన్జీవోలకు తెలుస్తుంది. ఈ మేరకు వారు స్వచ్ఛందంగా పంకజ్ విషయంలో జోక్యం చేసుకుని విజయ్ బార్సే ప్రారంభించిన ఆశ్రమంలో జాయిన్ చేశారు. అది ఎన్జీవోల ద్వారా జాయిన్ అయిన నిరాశ్రయులైన పిల్లలకు ఉచితంగా ఫుట్బాల్ శిక్షణ ఇచ్చే సెంటర్. ఈ మేరకు ఉచిత ఫుట్బాల్ శిక్షణ మాత్రమే కాక స్టైఫండ్ ఇచ్చి స్కూలుకి కూడా పంపిస్తారు. అయితే ఒక్కొక్కసారి తన చెడ్డ అలవాట్ల వైపు వెళ్లాలనిపించినా అతను వెళ్లలేదు. ఆ సంఘటనే కళ్ల ముందు మెదలడంతో... ఆ రోజు తన తల్లి నెత్తురోడుతుంటే అంబులెన్స్కి కూడా కాల్ చేయలేని నిస్సహాయ స్థితి అతనికి గుర్తుకు వచ్చేదని పంకజ్ ఇతరులకు పదే పదే చెబుతూ ఉండేవాడు. అంతేకాదు పంకజ్ ఎంతో కసిగా ఫుట్ బాల్ ఆడటం కూడా నేర్చకునేవాడు. పైగా ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయడం మానేవాడు కాదు. ఆ నిర్విరామ కృషే అతన్ని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫుట్బాల్ని ఆడేలా చేసింది. ఆ తర్వాత అతను 2013లో హోమ్లెస్ వరల్డ్ కప్ కోసం తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు పోలాండ్కు వెళ్లాడు. అప్పుడే అతని గురించి పత్రికల్లోనూ, మీడియాల్లోనూ బాగా వచ్చింది. అంతేకాదు ఏ గ్రామస్థులైతే అసహ్యంగా చూశారో వారే నన్ను ఇప్పుడూ మెచ్చకుంటున్నారని చెప్పాడు. అయితే తనలాంటి పిల్లలకు సాయం చేయడం కోసం ఎన్జీవోలో పేరు నమోదు చేసుకున్నానని, పైగా తాను ఫిజికల్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశానని చెప్పాడు. ఇతని కథ నిజంగా స్ఫూర్తిధాయకం కదా! (చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో) -
భారత సంస్థలకు గూగుల్ సాయం
Google Impact Challenge Programme: మహిళలు, ఆడపిల్లలకు సంబంధించి ‘ఇంపాక్ట్ చాలెంజ్’ కార్యక్రమం కింద ప్రపంచవ్యాప్తంగా 34 సంస్థలను గూగుల్ డాట్ ఓఆర్జీ ఎంపిక చేసింది. ఇందులో భారత్కు చెందిన మూడు స్వచ్చంద సంస్థలు కూడా ఉన్నాయి. ఎంపికైనవి గూగుల్కు చెందిన దాతృత్వ కార్యక్రమాల సంస్థే గూగుల్ డాట్ ఓఆర్జీ. భారత్ నుంచి సంహిత–సీజీఎఫ్, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, స్వ తలీమ్ ఫౌండేషన్ సంయుక్తంగా 2.5 మిలియన్ డాలర్లు (రూ.18.75 కోట్లు) ఆర్థిక సాయాన్ని గూగుల్ డాట్ ఓఆర్జీ నుంచి అందుకోనున్నాయి. ‘‘గూగుల్ ఓఆర్జీ నిర్వహించిన ఇతర ఏ ఇంపాక్ట్ చాలెంజ్తో పోల్చినా స్పందన ఎక్కువగా ఉంది. 7,800 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంస్థలన్నీ కూడా.. నైపుణ్యాభివృద్ధి, కెరీర్లో పురోగతి, ఎంర్ప్రెన్యుర్షిప్, వ్యాపారం, విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, మద్దతు అనే అంశాలపై దృష్టి సారించాయి’’ అని గూగుల్ డాట్ ఓఆర్జీ ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళలకు చేదోడు.. సంహిత సీజీఎఫ్ ‘రివైవ్ అలయన్స్’ ప్రాజెక్ట్కు గూగుల్ డాట్ ఓఆర్జీ నుంచి 8 లక్షల డాలర్ల సాయం లభించనుంది. ఈ నిధితో 10వేల మంది మహిళలకు సాయం అందించే లక్ష్యాన్ని సంహిత పెట్టుకుంది. సంప్రదాయ మార్గాల్లో రుణాలు పొందలేని మహిళలు వారి వ్యాపార అవసరాలు, డిజిటైజేషన్పై పెట్టుబడులకు వీలుగా వడ్డీలేని రుణాలను అందించనుంది. వడ్డీ లేకుండా తిరిగి చెల్లించాల్సిన రుణాలు ఇవి. ఇలా తిరిగి చెల్లించిన మహిళలు.. సంహిత సీజీఎఫ్ బ్యాంకింగ్, సూక్ష్మ రుణ భాగస్వాముల నుంచి మరింత సాయానికి అర్హత సాధిస్తారని ఈ ప్రకటన తెలియజేసింది. యువతులకు ఉపాధి శిక్షణ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఒక మిలియన్ డాలర్ల సాయాన్ని పొందనుంది. దీని ద్వారా 7,000 మందికిపైగా గ్రామీణ యువతులకు బ్యూటీ, ఆరోగ్య సంరక్షణ, మెకానిక్స్, ఎలక్ట్రికల్ పరిశ్రమల్లో పనిచేసే విధంగా నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనుంది. 300–500 గంటలపాటు శిక్షణ ఇచ్చి, నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అక్రెడిటేషన్ ఇప్పించనుంది. స్వ తలీమ్ ఫాండేషన్ తనకు లభించే 7 లక్షల డాలర్ల సాయంతో గ్రామీణ మహిళలు, ఆడపిల్లలకు టెక్నాలజీ పెద్దగా అవసరం లేని స్పీకర్ ఫోన్లు తదితర మార్గాల ద్వారా మ్యాథ్స్, సైన్స్, ఆర్థిక అవగాహన తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనుంది. - న్యూఢిల్లీ -
Vidya: చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి.. నేనే ఉద్యోగం ఇస్తాను..
ఎం.ఎస్.సి డిజిటల్ సొసైటీ కోర్స్లో గోల్డ్ మెడలిస్ట్ ఆమె. కాని ఆమె ఫ్రెండ్స్ అందరికీ క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాలు వచ్చాయి. ఆమెకు రాలేదు. ‘మీరు చూడగలిగితే బాగుండు’ అన్నారు అంతా. విద్యా పుట్టుకతో అంధురాలు. కాని అందరూ నిరాకరిస్తున్నా మేథమెటిక్స్లో గొప్ప ప్రావీణ్యం సంపాదించింది. ‘నాకు ఉద్యోగం ఇవ్వడం కాదు.. నాలాంటి వారికి నేనే ఉద్యోగాలు కల్పిస్తాను’ అని స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉపాధి చూపిస్తోంది విద్య. ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఆమె సాధిస్తున్న గెలుపులు కూడా. ‘ప్రపంచంలోని అంధుల జనాభాలో మూడొంతుల మంది భారతదేశంలో ఉన్నారు. వారిలో 70 శాతం మంది పల్లెల నుంచే ఉన్నారు. మన దేశంలో అంధ బాల బాలికల్లో 68 శాతమే చదువుకోవడానికి వెళుతున్నారు. వీరిలో మళ్లీ మేథ్స్, సైన్స్ వంటివి తీసుకోవడానికి స్కూల్స్ అంగీకరించవు. సాధారణ కోర్సులే వీళ్లు చదవాలి. ఏం? ఎందుకు వీళ్లు మేథ్స్ చదవకూడదు?’ అంటుంది విద్య. బెంగళూరుకు చెందిన ఈ పాతికేళ్ల అమ్మాయి ఎం.ఎస్.సిలో గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థ స్థాపించి దేశంలోని అంధ విద్యార్థినీ విద్యార్థులకు మేథ్స్, సైన్స్ చదవడంలో మెటీరియల్ తయారు చేస్తోంది. వారి కోసం ట్యూషన్లు, క్లాసులు ఏర్పాటు చేస్తుంది. వారికై పని చేసే అంధ టీచర్లనే సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు విద్యకు. కాని ఇప్పుడు విద్యే తన సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రిమెచ్యూర్ రెటినోపతి విద్య బెంగళూరు సమీపంలోని పల్లెటూరిలో పుట్టింది. సాధారణ జననమే. కాని పుట్టాక మూడు నెలలు ఇంక్యుబేటర్లో పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రిమెచ్యూర్ రెటినోపతి వల్ల ఆమె రెండు కళ్లకూ చూపు పోయింది. ప్రపంచ సాక్షరతా దినోత్సవం రోజు పుట్టడం వల్ల, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ‘పాపకు ఎలాగూ కళ్లు రావు. కాని బాగా చదివిస్తే తన కాళ్ల మీద తాను నిలబడుతుంది’ అని సలహా ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు ‘విద్య’ అని పేరు పెట్టారు. ‘సాధారణంగా మన దేశంలో జరిగే తప్పేమిటంటే అంధ పిల్లలకు భవిష్యత్తు ఉండదని వారిని బడికి పంపరు పల్లెటూళ్లలో. నా అదృష్టం నా తల్లిదండ్రులు నన్ను బెంగళూరులోని ఒక మిషనరీ స్కూల్లో 7 ఏళ్ల వయసులో వేశారు. అక్కడే నేను 7 వ క్లాస్ వరకూ స్పెషల్ స్టూడెంట్గా చదువుకున్నాను. కాని అసలు సమస్య నా 8 వ తరగతి నుంచి అందరిలాగే మామూలు బడిలో చదువుకునే సమయంలో మొదలైంది‘ అంటుంది విద్య. లెక్కల పిచ్చి విద్యకు చిన్నప్పటి నుంచి లెక్కల పిచ్చి. ఇంట్లో చేటలో తల్లి బియ్యం పోసిస్తే ప్రతి గింజను లెక్క పెట్టేది. బియ్యం ఏమిటి... ఆవాలు పోసిచ్చినా ప్రతి ఆవాల గింజను లెక్క పెట్టేది. తల్లిదండ్రులు ఆమె లెక్కల ఇష్టాన్ని గమనించారు. కాని హైస్కూల్లో లెక్కలు చదవడం ఆమెకు కష్టమైంది. క్లాసులన్నీ బోర్డు మీద రాతలతో ఉంటాయి. మేథమెటికల్ సింబల్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ ఉంటాయి. వీటిని చూడకుండా అర్థం చేసుకోవడం అసాధ్యం. కాని విద్య పట్టుదలగా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించేంది. ‘నేను చేయాల్సింది మరిన్ని గంటలు కష్టపడటమే అని అర్థం చేసుకున్నాను. ఉదయం నాలుగున్నరకు లేచి చదివేదాన్ని’ అంటుంది విద్య. డిగ్రీలో మేథ్స్, కంప్యూటర్ సైన్స్ తీసుకుని కంప్యూటర్లో ఆడియో మెటీరియల్ ద్వారా వీలైనంత చదువుకుంటూ పాస్ అయ్యింది. ఆ తర్వాత బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటిలో ఎంఎస్సీ డిజిటల్ సొసైటీ కోర్సును టాపర్గా పాసైంది. ‘నా చదువుంతా నా ప్రయోగమే. నేను గణితాన్ని అర్థం చేసుకోవడానికి పడిన తపన, కష్టమే నా చదువు. ట్రిపుల్ ఐటి నుంచి మేథమేటిక్స్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి స్టూడెంట్ని నేనే’ అంటుంది విద్య. అందరి కోసం విద్యకు ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి ఆమె అంధత్వం వల్ల. చాలా కంపెనీలు దయతలిచి కాల్సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థను బెంగళూరులో స్థాపించింది. నాలుగేళ్లుగా ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంధ విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతానికి కర్నాటకలోని అంధ విద్యార్థులను ప్రపంచ అంధ విద్యార్థులతో, విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తోంది. విద్య చేస్తున్న ఈ పనిని సమాజం గుర్తిస్తోంది. ఆమెను పిలిచి స్ఫూర్తివంతమైన ప్రసంగాలను వింటోంది. ‘అప్పుడే ఏమైంది. ఇది మొదలు మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది’ అంటోంది విద్య. చాలా కంపెనీలు దయతలిచి కాల్సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగ ప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే సంస్థను స్థాపించింది. -
మహా గంగ
మనిషి బతకాలంటే గాలి తర్వాత అంత ముఖ్యమైనది నీటిచుక్క. గాలి మన చుట్టూ ఆవరించి ఉంటుంది. మరి నీరు... అవి మన దగ్గరకు రావు, మనమే నీటి దగ్గరకు వెళ్లాలి. అందుకే ప్రాచీన నాగరకతలు నీటి ఆధారంగానే విస్తృతమయ్యాయి. మరి ఈ ఆధునిక కాలానికి ఏమైంది? మనిషి టెక్నాలజీని అందిపుచ్చుకున్నాడు. తానున్న చోటుకే నీటి తెచ్చుకునే టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని కొండ మీద కూడా కాలు మీద కాలేసుకుని జీవిస్తున్నాడు. మరి భూగర్భంలో జలం పాతాళానికి ఇంకిపోతే ఏం చేయాలి? బిందెలు తలమీద పెట్టుకుని నీటిబొట్టును వెతుక్కుంటూ మైళ్లకు మైళ్ల దూరం నడిచి వెళ్లాలి. మహారాష్ట్ర గ్రామాల పరిస్థితి అదే. ఇరవై ఏళ్ల కిందట అయితే మరీ దుర్భరంగా ఉండేది. అక్కడి నీటి ఎద్దడిని నివారించడానికి విశాల మనస్కులు వస్తూనే ఉన్నారు. వారికి చేతనైంత మేర గంగను పునఃప్రతిష్ఠించి జనం గొంతు తడుపుతున్నారు. బెంగళూరుకు చెందిన జయశ్రీ అయితే ఏకంగా రెండు వందల గ్రామాల దాహార్తిని తీర్చింది. నీటి కొరతతో గంగవెర్రులెత్తుతున్న మహారాష్ట్ర గ్రామాల పాలిట గంగాభవానిగా మారింది. తిరిగి ఇవ్వాల్సిన సమయం జయశ్రీ వయసు 72. బెంగళూరులో పుట్టి పెరిగింది. చదువుకునే రోజుల్లో ఆసక్తి కొద్దీ ఒక ఎన్జీవోలో ఉద్యోగం చేసింది. పెళ్లి తర్వాత భర్తతోపాటు యూకేకి వెళ్లి పోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు కుటుంబంతో తిరిగి ఇండియాకి వచ్చిందామె. ఆమె తండ్రి నిర్వహిస్తున్న జేఆర్రావు అండ్ కో బాధ్యతలను చేపట్టింది. అది ఇంజనీరింగ్ పరికరాలు తయారు చేసే పరిశ్రమ. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. పరిశ్రమ నిర్వహణలో మంచి పట్టు వచ్చేసింది. 2006లో ఓరోజు... ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన చోటు చేసుకుంది. ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. మెషినరీ పరికరాల అమ్మకంలో నికరంగా లక్ష రూపాయలు మిగిలాయి. జయశ్రీ సంతోషంగా ఇంటికి వచ్చింది. రోజూ కూరగాయలిచ్చే అతడు వచ్చాడు. ఐదు రూపాయలు తగ్గింపు కోసం బాగా బేరం చేసింది. ఆమె కోరినట్లే ఐదు రూపాయలు తగ్గించి కూరగాయలిచ్చి వెళ్లిపోయాడతడు. అప్పుడు ఆమెలో ఆత్మావలోకనం మొదలైంది. ‘నేనేం చేశాను. లక్ష రూపాయలు లాభంతో సంతోషంగా ఇంటికి వచ్చాను. బేరం చేయకుండా కూరగాయలు కొని ఉంటే కూరగాయలమ్మే అతడు కూడా ఎంతో కొంత సంతోషంగా ఇంటికి వెళ్లే వాడు కదా’ అనుకుంది. మన జీవిక కోసం సమాజం నుంచి తీసుకుంటాం. అలాగే సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన సందర్భాలను కూడా గమనింపు లో ఉంచుకోవాలి’ అనుకుందా క్షణంలో. ఆ ఆలోచన అక్కడితో ఆగిపోలేదు. ఏం చేయాలి? ఎలా చేయాలి అని గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. నాటి చిత్రమే నేటికీ జయశ్రీకి తాను పెళ్లికి ముందు పని చేసిన మహారాష్ట్ర గ్రామాలు గుర్తుకు వచ్చాయి. నీటి కోసం బిందె తల మీద పెట్టుకుని నడుస్తున్న మహిళల ఫొటోలు పేపర్లలో చూసిన సంగతి గుర్తు వచ్చింది. ఒకసారి ఆ గ్రామాలకు వెళ్లి చూసింది. వెంటనే పని మొదలు పెట్టింది జయశ్రీ. సమావేశం ఏర్పాటు చేసి తాను ఏం చేయదలుచుకున్నాననేది గ్రామస్థులకు వివరించడమే పెద్ద సమస్య అయింది. మీటింగ్ అంటే ఎవరూ వచ్చే వాళ్ల కాదు. గ్రామస్థులను కూర్చోబెట్టడానికి రకరకాల మార్గాల్లో ప్రయత్నించింది. చివరికి ఒక దీపావళికి ప్రమిదలు తయారు చేసే అవకాశం కల్పించడంతో మహిళలు వచ్చారు. వారికి ప్రమిదలు చేసినందుకు డబ్బు ఇవ్వడంతోపాటు నీటి సంరక్షణ కోసం తాను చేయదలుచుకున్న విషయాన్ని కూడా చెప్పి వారిని సమాధాన పరిచింది. ఎండిపోయిన నీటి కుంటల పూడిక తీయించడానికి రంగం సిద్ధం చేసింది. యంత్రాల సహకారం ఆమె వంతు భాగస్వామ్యం– శ్రమదానం గ్రామస్థుల భాగస్వామ్యం. ఈ అంగీకారంతో ఒక్కో గ్రామంలో ఉన్న చెరువులు, కుంటలు, సరస్సులు, కాలువలు శుభ్రపడ్డాయి. తర్వాతి వర్షాకాలం నీటితో కళకళలాడాయి. అలాగ ఒక ఊరి తర్వాత మరో ఊరు... అలా రెండు వందల గ్రామాల్లో నీటి సంరక్షణను విజయవంతంగా పూర్తి చేసింది జయశ్రీ. వాటర్ కన్సర్వేషన్ స్ప్రింగ్ బాక్స్ గ్రామస్తులను చైతన్యపరుస్తున్న జయశ్రీ జయశ్రీ -
సీఎం వైఎస్ జగన్ ని కలిసిన ఏపీ ఎన్జీవోలు
-
స్వచ్ఛంద సంస్థల్లో రూ. 49 వేల కోట్ల విదేశీ నిధులు
న్యూఢిల్లీ: భారత్కు చెందిన 18 వేలకు పైగా స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు) కలసి మూడేళ్లలో రూ. 49 వేల కోట్లుకు పైగా విదేశీ నిధుల్ని పొందాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2017–18లో రూ. 16,940.58 కోట్లు, 2018–19లో రూ. 16,525.73 కోట్లు, 2019–20లో రూ. 15,853.94 కోట్ల విదేశీ నిధులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విదేశీ భాగ స్వామ్య నియంత్రణ సవరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)–2020 చట్టానికి ముందు ఎఫ్సీఆర్ఏ ఖాతాలను ఐచ్ఛికంగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. అయితే సవరణ చట్టం వచ్చాక దగ్గర్లో ఉన్న ఎస్బీఐలో ఎఫ్సీఆర్ఏ ఖాతా తెరవడాన్ని తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. 2021 జూలై 31న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన ప్రకారం మొత్తం 18,377 గుర్తింపు పొందిన ఎఫ్సీఆర్ఏ ఖాతాలు ఉన్నాయి. పోలీస్ కస్టడీలో 348 మంది మృతి.. గత మూడేళ్లలో పోలీసుల కస్టడీలో 348 మంది వ్యక్తులు మరణించారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. మరో 5,221 మంది జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మరణించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలవారీగా చూస్తే 2018–20 మధ్య ఉత్తరప్రదేశ్లో పోలీస్ కస్టడీలో 23, జ్యుడీషియల్ కస్టడీలో 1,295 మంది మరణించారు. మధ్యప్రదేశ్లో పోలీస్ కస్టడీలో 34, జ్యుడీషియల్ కస్టడీలో 407 మంది మరణించారు. పశ్చిమబెంగాల్లో పోలీస్ కస్టడీలో 27, జ్యుడీషియల్ కస్టడీలో 370 మంది మరణించారు. -
పూర్ కోసం ప్యూర్...
ఆమె వయసు ఏడు పదులు.. మనసుకు మాత్రం రెండు పదులే.. అందుకే కాబోలు ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా.. నేనున్నానంటూ చకచక పరుగులు తీస్తారు.. ప్యూర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. ప్రపంచవ్యాప్తంగా ఐదు దేశాలలో 350 మంది కార్యకర్తలతో వేలాదిమందికి సేవలు అందిస్తున్నారు. నిరాడంబర జీవితం.. నిరంతర సేవానిరతి... అన్నీ కలిపితే... హైదరాబాద్ కిస్మత్పూర్లో పచ్చని చెట్ల మధ్య ఫలవృక్షంలా జీవిస్తున్న సంధ్య గోళ్లమూడి.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పుట్టిన సంధ్య తమ ఇంట్లో తాతముత్తాతల నుంచి దేశసేవ చేయటం చూస్తూ పెరిగారు. దాంతో తాను కూడా బడుగు, బలహీన వర్గాల వారికోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనకు బీజం పడింది. భర్త బ్యాంకు ఉద్యోగి డాక్టర్ శాంతారామ్... రైతుల కోసం ఏర్పాటు చేసిన ఫార్మర్స్ సొసైటీలకు మేనేజింగ్ డైరెక్టర్గా పని చేశారు. ఉద్యోగరీత్యా అనేక పల్లెసీమలకు తిరిగేవారు. ఈ క్రమంలో తనకు తారసపడిన నిరుపేదలకు అండగా నిలబడాలనుకున్నారామె. అందుకోసం బుట్టలు అల్లటం,పెట్టీకోట్స్ కుట్టడం, ఎంబ్రాయిడరీ... వంటి పనులు నేర్చుకున్నారు. పేద స్త్రీలకు వీటన్నింటినీ ఉచితంగా నేర్పించారు. పేదలకు అండగా.. నెల్లూరు వచ్చాక, ట్యూషన్లు చెబుతూ డబ్బు సంపాదించి, సంఘసేవ కోసం ఖర్చుచేశారు. తన సేవాకార్యక్రమాలకోసం భర్త మీద ఆధారపడదలచుకోలేదు. తన సంపాదన నుంచే ఖర్చు పెట్టేవారు. అందుకోసం టీచింగ్ దగ్గర నుంచి చిరు వ్యాపారాల వరకు ఎన్నో పనులు చేసేవారు. ఖమ్మంలో ఒక స్కూల్లో పుస్తకాలు లేక తండా పిల్లలు చదువు మానేసి మిరప చేలలో కూలికి వెళ్తున్న సంగతి తెలుసుకున్న సంధ్య తమ కుమార్తె శైలజ సహకారంతో సుమారు యాభైవేల రూపాయలు సేకరించి ఆ మొత్తాన్ని ఆ పిల్లలకు అందించి, వారి చదువు సజావుగా సాగేలా చూశారు. ‘‘అదే సమయంలో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, దాని ద్వారా అవసరంలో ఉన్నవారికి సహాయ పడాలనుకున్నాను. మా అమ్మాయి, తన స్నేహితులు అందరూ లక్ష రూపాయల చొప్పున డిపాజిట్ చేశారు. సంస్థకు pure (people for rural and urban education) అని పేరు పెట్టి, 2016 మార్చిలో రిజిస్టర్ చేశాం. నేను చలాకీగా ఉండటంతో డైరెక్టర్గా కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 69 సంవత్సరాలు’’ అంటారు సంధ్య గోళ్లమూడి. విపత్తు సమయంలో అండగా... కేరళలో వరదలు వచ్చిన సమయంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, సహాయ కార్యక్రమాలు చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద పిల్లలకు కావలసిన ఆర్వో వాటర్, బెంచీలు, లైబ్రరీ, కిచెన్ డెవలప్మెంట్, నోట్బుక్స్, టాయిలెట్స్, ఆడపిల్లలకు ప్యాడ్స్.. ఇలా ఇబ్బంది లేకుండా చదువుకోవటానికి అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. 2017 – 2018 మధ్య ప్రాంతంలో 1,75,000 కి.మీ. డ్రైవర్ ని పెట్టుకుని ఒంటరిగా వివిధ పాఠశాలలకు ప్రయాణించారు. హైదరాబాద్లో ఉన్న ఏడువేల స్లమ్స్లో ప్రతి బుధవారం ఒక్కో స్లమ్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యులకు మోదుగ ఆకుల విస్తర్లు కుట్టడానికి అనువుగా రెండు మెషీన్లు అందించారు. వారే మా వలంటీర్లు.. ‘‘సమాజసేవ చేయాలనుకునే టీచర్లే మాకు ప్రతినిధులు. ఆయా ప్రాంతాల ఎన్జీఓ ల సహాయంతో ఈ పనులు చేయగలుగుతున్నాం. కడపలో కోవిడ్ కారణంగా మరణించిన వారి కోసం వ్యాన్, ఐస్ బాక్స్ అందచేశాం’’ అని చెబుతారు సంధ్య గోళ్లమూడి. అమ్మమ్మ... అభ్యాస పాఠశాలలు.. అటవీ ప్రాంతాలలో కొండ మీద నివసించేవారి కోసం అభ్యాస విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ‘‘అందరూ నన్ను ‘మా అమ్మమ్మ’ అని ఎంతో ప్రేమగా అక్కున చేర్చుకుంటారు’’ అంటున్న సంధ్య గోళ్లమూడి, వివిధ సమస్యల మీద ఛందోబద్ధంగా 3000 కవితలు రాశారు. 65 సంవత్సరాల వయసులో కూచిపూడి నాట్యం చేసి, ఫేస్బుక్లో పెట్టారు. ఋతువులను అనుసరించి ఇల్లు సర్దుకుంటారు. ‘‘ప్రతిదీ ప్రభుత్వమే చేయాలంటే కుదరకపోవచ్చు. అందరం ప్రభుత్వంలో భాగస్వాములమే కనుక దేశపౌరులుగా ఇది మనందరి బాధ్యత’’ అంటారు ఎంతో హుందాగా. –వైజయంతి పురాణపండ లాక్డౌన్ విధించటానికి ముందే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కావలసిన నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని సప్లయి చేశాం. సమతుల ఆహారాన్ని అందించాం. వివిధ ప్రాంతాలకు చెందినవారు వారి ఇళ్లకు చేరుకోవటం కోసం రెండు బస్సులు ఏర్పాటు చేశాం. రెండు కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. మేం నడిపిన కోవిడ్ సెంటర్లలో అందరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క మరణం కూడా లేదు. – సంధ్య గోళ్లమూడి సంధ్య గోళ్లమూడి -
ఆకలిపై పోరులో డ్రీమ్ కేర్
వాషింగ్టన్ : అమెరికా లోని వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియాకి చెందిన కుషాల్ దొండేటి నిర్వహిస్తోన్న డ్రీం కేర్ ఫౌండేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్ ఆహార ప్యాకెట్లను సరఫరా చేసింది. ఫండ్ రైజింగ్ ద్వారా సుమారు రూ. 2.62 లక్షలను డ్రీం కేర్ ఫౌండేషన్ సమీకరించింది. ఈ నిధులతో పది వేల మీల్ ప్యాకెట్లను తయారు చేశారు. ఒక్కో ప్యాకెట్లో ఆరుగురికి సరిపడా ఆహారం ఉంటుంది. దీన్ని అమెరికా, ఇండియాతో పాటు పలు దేశాల్లోని అవసరం ఉన్న చోటుకి పంపారు. ఈ కార్యక్రమంలో రైజ్ ఎగైనెస్ట్హంగర్ అనే స్వచ్చంధ సంస్థ సైతం సహాయ సహకారాలు అందించింది. హై స్కూల్ స్థాయిలోనే ఫండ్ రైజింగ్ ద్వారా అమెరికా, ఇండియాలతో పాటు ఆకలితో ఉన్న వారికి సాయపడే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న కుషాల్ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో 60 మంది స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. -
కొత్త జోనల్ విధానంతో స్థానికులకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు న్యాయం జరిగేలా నూతన జోనల్ విధానాన్ని సీఎం కె.చంద్రశేఖర్రావు రూపొందించి చట్టం చేయడం, అది రాష్ట్రపతి ఆమోదం పొందడం చిరస్మరణీయమని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి. ఈ విధానానికి రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు కృషి చేసినందుకు, అందుకనుగుణంగా 50 వేల కొత్త ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం ప్రగతిభవన్లో సీఎంను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, కార్యదర్శి, టీజీవో అధ్యక్షురాలు మమత, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కలిశారు. ఉద్యోగులు సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి విన్నవించిన సమస్యలివీ.. ఆర్డర్టుసర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జోనల్ విధానాన్ని అనుసరించి వారి స్వస్థలాలకు/ జిల్లాలకు ఆప్షన్ ద్వారా పంపించడానికి చర్యలు తీసుకుని ఆర్డర్టుసర్వ్ను రద్దు చేయాలి. ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించడం కోసం పీఆర్సీ సూచన మేరకు ఒక శాతం మూల వేతనాన్ని ప్రభుత్వ కార్పస్ ఫండ్కు ఇవ్వడానికి రాష్ట్రంలోని ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు తదితర ఉద్యోగులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టంగా అమలు చేసేలా జీవో విడుదల చేయాలి. ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో ఉన్న వ్యత్యాసాలను సవరించడానికి అనమలీస్ కమిటీని ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీలతో ఏర్పాటు చేయాలి. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయాలి. ఆంధ్రాలో మిగిలి ఉన్న జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ స్థాయి, గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ శాఖల్లో జనాభా ప్రాతిపదికన పోస్టులు మంజూరు చేయాలి. -
మాస్క్ ధరిస్తే రూ.350 కట్టాలంట !
కాలిఫోర్నియా: వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ కేఫ్లో మాస్క్ ధరిస్తే ఫైన్ కట్టాలంట. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల ఓ కేఫ్ యజమాని ఈ వింత రూల్ని పెట్టాడు. అదేంటి ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో అల్లాడిపోతూ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిస్తుంటే ఇక్కడ మాత్రం ఇలాంటి రూల్ పెట్టారని అనుకుంటున్నారా? అసలు ఆ కేఫ్ యజమాని కరోనా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి నిబంధన ఎందుకు పెట్టాడో తెలుసుకుందాం. ఓ కేఫ్ యజమాని తన కస్టమర్లలో మాస్క్ ధరించిన వారి నుంచి బిల్లుపై 5 డాలర్లు (సుమారు 350 రూపాయలు) అదనంగా కట్టించుకుంటున్నాడు. దీనికి ఓ కారణం ఉందని ఆ యజమాని అంటున్నాడు. వారు ఈ మొత్తాన్ని గృహహింస బాధితులకు సహాయపడే స్వచ్ఛంద సంస్థలకు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో వీరు చేస్తున్న మంచి పనిని కస్టమర్లు సైతం స్వాగతిస్తున్నారు. అంతే గాక అదనుపు బిల్లు చెల్లించడంలోనూ వెనకాడటం లేదు. ‘మొదట్లో 5 డాలర్లను కొంతమంది కస్టమర్లు చెల్లించగా, మరికొందరు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని’ కేఫ్ యజమాని క్రిస్ కాజిల్మాన్ ఎన్బిసి న్యూస్కు చెప్పారు. Hey #medtwitter, leave Fiddleheads Cafe in Mendocino, CA a review on Google and Yelp and tell them what you think. pic.twitter.com/8qkYTtILhM — Optimistic Radiologist (@responsibleMDs) May 29, 2021 చదవండి: బీప్: ప్రియుడికి పంపాల్సిన మెసెజ్ లెక్చరర్కు.. -
Ayesha Charugulla: విజయవాడ టు అమెరికా
పై చదువుల కోసం విదేశాలకు వెళ్లినవారు అక్కడే ఉద్యోగం చూసుకొని, స్థిరపడిపోతారు. ఎప్పుడైనా ఒకసారి స్వదేశానికి వచ్చి, తల్లిదండ్రులను కలిసివెళ్లిపోతారు. ఆయేషా చారుగుళ్ల విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అయితే, కొన్నాళ్లకు తను పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదైనా సాయం చేయాలనుకున్నారు. నిరుపేద, వికలాంగబాలల చదువులు, ఆటిజమ్ చిన్నారులకు సెంటర్లు, ట్రాఫికింగ్కు గురైన మైనర్ అమ్మాయిల భవిష్యత్తు కోసం కృషి చేసే ఆయేషా ఇప్పుడు మహమ్మారి కష్టకాలంలో తనూ ఓ చేయూతగా మారారు. తెలుగు రాష్ట్రాల్లో తను అందిస్తున్న సేవల గురించి ఆయేషా ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. ‘‘పాతికేళ్ల క్రితం విజయవాడ నుంచి అమెరికా వెళ్లాను. భర్త, ఇద్దరు పిల్లలు, సాఫ్ట్వేర్ ఉద్యోగం.. రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. ఐదేళ్ల క్రితం మా ఇద్దరు పిల్లలతోపాటు, కమ్యూనిటీ లో ఉన్న పిల్లలను సెలవుల సమయం లో గమనించాను. అంతా ఒకే మూస పద్ధతిలో పెరుగుతున్నారనిపించింది. లగ్జరీ జీవనం కాకుండా మెరుగైన జీవన విలువలు తెలియజేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అలా, వారాంతాల్లో పిల్లలను కూడగట్టుకొని వర్క్షాప్స్ ఏర్పాటు చేసేదాన్ని. మంచి స్పందన వచ్చింది. బాగానే స్థిరపడ్డాం కదా అనే ఆలోచనతో ఉద్యోగం మానేసి పిల్లలందరినీ కూడగట్టుకొని వారిచేత రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. పిల్లలు కూడా నేను చేస్తున్న కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం మొదలు పెట్టారు. ఈ పనిలో కొంతమంది స్నేహితులు, పిల్లల తల్లిదండ్రులు జత కలిశారు. దీంతో స్నేహితుల సలహా మేరకు 2015లో ఆరుగురు పిల్లలతో ‘ఎంపవర్ అండ్ ఎక్సెల్’ అనే పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాను. ఇప్పుడు 500 మంది పిల్లలే స్వచ్ఛందంగా కార్యక్రమాలను నిర్వహించే దశకు చేరుకున్నారు. వారాంతాల్లో ఓల్డేజీహోమ్లకు వెళ్లడం, తామే స్వయంగా వంట చేసి, ఆహారాన్ని పంచడం, వారికన్నా చిన్న పిల్లలకు వర్క్షాప్స్ కండక్ట్ చేయడం.. ఎంతగా మారిపోయారు పిల్లలు అనిపిస్తుంది వారిని చూస్తుంటే. ప్రతి యేటా వేసవి సమయం మా అమ్మానాన్నలు ఆంధ్రాలోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతి యేటా నిర్వహించేవాళ్లం. నాతో పాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్ చేసే పిల్లలు కనీసం పది మందైనా ఇండియాకు వచ్చేవారు. వారితో ఇక్కడి స్కూల్ పిల్లలకు ఇంగ్లిషు వర్క్షాప్స్ కండక్ట్ చేసేదాన్ని. నాతోపాటు వచ్చిన స్టూడెంట్స్లో స్ఫూర్తి వెల్లంకొండ అనే అమ్మాయి ఇండియాకి ఆమె తల్లితో కలిసి వచ్చి ఇండియా చాప్టర్ ఆధ్వర్యంలో అడపిల్లలకి శరీర శుభ్రత, నెలసరి గురించి 50 సెషన్స్ నడిపించింది. ఆ విద్యార్థిని హైజీన్ మీద స్వయంగా రాసిన ’జాగృతి’ అనే బుక్ కూడా రిలీజ్ చేశాం. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. మరిన్ని అడుగులు.. ప్రకాశం జిల్లా మాచవరంలో ఆశాసదన్ ట్రాఫికింగ్ మైనర్ విక్టిమ్స్ గురించి తెలిసినప్పుడు చాలా బాధగా అనిపించింది. దాదాపు 70 మంది పిల్లలు. ఒక విధంగా సమాజం నుంచి దూరమైన పిల్లలు అనుకోవచ్చు. వారికి అండగా ఉండాలని ఏడాది పొడవునా ఆహారంతోపాటు వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని, వారికి బేకింగ్ సామాను అమెరికా నుంచి తెచ్చి ప్రొఫెషనల్స్తో ట్రైనింగ్ ఇప్పించాం. జూట్ బ్యాగ్ తయారీ నేర్పించి, ఆ బ్యాగులను అమెరికాలో మార్కెట్ చేసి ఆ సొమ్ము మొత్తాన్ని వారికి అందించాం. సెల్ఫ్డిఫెన్స్లో అమ్మాయిలకు శిక్షణ ఇప్పించాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆశా జ్యోతి అనే సంస్థ మానసిక – భౌతిక వికలాంగులకు సర్వీస్ చేస్తుంటుంది. అక్కడి పిల్లల పరిస్థితి చూసి, చలించిపోయాం. వారికి కావాల్సిన భోజన సదుపాయాలు, సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. వికలాంగ బాలలకు వీల్ చైర్స్తోపాటు హైడ్రోథెరపీకి సంబంధించిన పూల్ని ఏర్పాటు చేశాం. పిల్లలకి పాల కోసం పాడి గేదెలను, ఆవులను కొనిచ్చాం. కృష్ణాజిల్లా నూజివీడులోని ఓ హెచ్ఐవి పాజిటివ్ సంస్థలోని చిన్నారులకు దుస్తులు, భోజన సదుపాయం, ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు కాలేజ్ ఫీజు ఏర్పాటు చేశాం. ముంబాయ్కి చెందిన ‘లిటిల్ హార్ట్స్’ అనే ఆటిజం సెంటర్ లో చిన్నారులకు అమెరికాలోని స్పెషలిస్ట్స్ ద్వారా టెలీ మెడిసిన్ థెరపీ ఇప్పించాం. తెలంగాణలోని ఖమ్మంలో చేగొమ్మ, కనికెళ్ల గ్రామాల్లోని స్కూల్ టీచర్లు వలంటీర్ల ద్వారా లైబ్రరీ ఏర్పాటుకు సంప్రదించడంతో వారికి ఆ ఏర్పాటు చేశాం. సాయానికి సిద్ధం 2020లో మేమంతా కరోనా సృష్టించిన దారుణాలను చవిచూశాం. ఇప్పుడు కాస్త కుదుటపడ్డాం. కాని, భారత్ పరిస్థితి మమ్మల్ని కలచివేస్తోంది. ఏదోవిధంగా మనవాళ్లకి సహకరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి ఆంధ్రలో విజయవాడ, వినుకొండ, నరసరావుపేట, తెనాలిలో 500, తెలంగాణలో 300 బెడ్స్, ఆక్సిజన్ ఫ్లోమీటర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించాం. గుంటూరు ఫీవర్ హాస్పిటల్కి మరిన్ని బెడ్స్ అందించనున్నాం. మహమ్మారి నుంచి అందరూ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ బెడ్స్ను ఓల్డేజీ హోమ్స్కు ఇవ్వాలనుకుంటున్నాం. తెలంగాణలో హైదరాబాద్ జవహర్నగర్లో ఏర్పాటు చేసిన క్యాంప్కి, ఖమ్మంలోని బివికే భవన్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్కి బెడ్స్ అందించాం. మరిన్ని బెడ్స్ అవసరం గురించి తెలిసింది. వాటి ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సర్వీస్ వెహికిల్ను ఏర్పాటు చేశాం. తాడేపల్లి నుంచి మంగళగిరి చుట్టుపక్కల ఊళ్లలో ఉన్న కరోనా పేషెంట్స్ను ఉచితంగా ఆసుపత్రికి చేర్చాలనేది మా ఉద్దేశ్యం. ఈ వెహికిల్ డ్రైవర్స్, అటెండర్స్కి పీపీఈ కిట్లు, మాస్కులు ఇతరత్రా జాగ్రత్తలు తీసుకున్నాం. మా హస్బెండ్ సంజయ్ చారుగుళ్ల 50 బెడ్స్ స్పాన్సర్ చేశారు. ఇదే విధంగా ఫండ్ రైజింగ్ మొత్తం మా మిత్రులు, మా వలంటీర్ కుటుంబాల నుంచే ఉంటుంది. రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ అంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఆందోళన ఓ వైపు ఉన్నా, తట్టుకొని నిలబడానికి మా వంతుగా ఇవ్వదగ్గ సహకారానికి సమాయత్తం అవుతున్నాం’’ అంటూ వివరించారు ఆయేషా. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
NGO: శ్మశానాల్లో అధిక వసూళ్లా?
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాప్తితో ఒకవైపు జనం అల్లాడుతుంటే మరోవైపు శ్మశానాల్లో అంత్యక్రియలకు అధికంగా డబ్బులు వసూలు చేస్తుండడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ఓ పిటిషన్ దాఖలైంది. అంబులెన్స్ సేవలకు కూడా ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తుండడంపై పిటిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్ట్రెస్ మేనేజ్మెంట్ కలెక్టివ్ ఇండియా అనే ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) ఈ వ్యాజ్యం దాఖలు చేసింది. చనిపోయిన వారికి కూడా హక్కులు ఉంటాయని పేర్కొంది. ఆ హక్కులను కాపాడేందుకు ఒక పటిష్టమైన విధానాన్ని రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరింది. శ్మశానాల్లో కరోనా బాధితుల మృతదేహాల దహనానికి, ఖననానికి నిర్ధారిత రుసుము మాత్రమే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని విన్నవించింది. శ్మశానాల్లో అంత్యక్రియలకు అధిక రుసుములు చెల్లించలేక డబ్బుల్లేక కరోనా బాధితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు నదుల్లో వదిలేస్తుండడం బాధాకరమని వెల్లడించింది. అంబులెన్స్ సేవల విషయంలోనూ అధిక వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని ఎన్జీవో తన పిటిషన్లో పేర్కొంది. (చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్... పడవ పల్టీ) -
సేవా ‘మార్గం’.. ‘డాక్టర్స్’ ఔదార్యం
కరోనా మానవ సంబంధాలను దూరం చేస్తోంది. అయిన వారిని సైతం కాకుండా చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కోవిడ్ బాధితులకు మేమున్నామంటూ పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వారికి అవసరమైన మందులు, ఆహారాన్ని ఉచితంగా అందించడమే కాకుండా.. నేరుగా వారి ఇంటికే వెళ్లి వారిలోని ఆందోళనను తొలగించేలా మనో స్థైర్యాన్ని నింపుతున్నాయి. విజయవాడలోని మార్గం ఫౌండేషన్ కూడా ఇదే విధంగా హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్న రోగులకు రోజూ రెండు వందల మందికి భోజనాన్ని పంపిణీ చేస్తోంది. ఆహారం ప్యాకెట్లను సిద్ధం చేస్తున్న ‘మార్గం’ సభ్యులను చిత్రంలో చూడొచ్చు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ ‘డాక్టర్స్ ఫర్ యూ’ ఔదార్యం విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి డాక్టర్స్ ఫర్ యూ ఆర్గనేషన్ సంస్థ 8 లక్షల రూపాయల విలువచేసే మూడు జంబో ఆక్సిజన్ సిలెండర్లను వితరణ చేసింది. వీటిని కొత్త ప్రభుత్వాసుపత్రి ఆవరణలోడాక్టర్స్ ఫర్ యూ ఆర్గనేషన్ సంస్థ ప్రతినిధులు బుధవారం కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్కు అందజేశారు. క్రయోజనిక్ లిక్విడ్ ఆక్సిజన్ జంబో సిలెండర్ల ద్వారా ఎక్కువ మందికి ప్రాణవాయువు సరఫరా చేసే వీలు కలుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. డాక్టర్స్ ఫర్ యూ ఆర్గనేషన్ సంస్థ ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. గతంలోనూ ఈ సంస్థ బెడ్లు, మాస్క్లు, కిట్స్ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. పెద్దయ్యాక సీఎం అవుతా.. ఓ చిన్నారి ఆకాంక్ష -
Corona Warriors: డాక్టర్ల కన్నా ముందే..‘ఊపిరి’ పోస్తున్నారు
హిమాయత్నగర్: గాంధీ, కింగ్కోఠి (కేకేహెచ్), చెస్ట్ ఆసుపత్రులు నిత్యం కోవిడ్ పాజిటివ్ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో సిబ్బం ది కొరత కారణంగా అడ్మిషన్ సుమారు గంటవరకు ఆలస్యం అవుతుంది. ఎంతోమందికి అడ్మిషన్ దొరి కి బెడ్పైకి చేరేవరకూ ఆక్సిజన్ అందడం లేదు. ఈ ఆలస్యంతో ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్ సమయంలో అత్యవసరంగా ఆక్సిజన్ అందించే విధానం లేదు. దీంతో ఇటు రోగులు, అటు రోగుల సహాయకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అడ్మిషన్ ఆలస్యంతో ఆక్సిజన్ అందక ఏ ఒక్కరి ప్రాణం పోకుండా ఉండేందుకు నడుం బిగించారు సోషల్ డేటా ఇన్షేటివ్స్ ఫోరం (ఎస్డీఐఎఫ్), యాక్సెస్ ఫౌండేషన్, సఫియా బైత్వాల్ మాల్ (ఎస్బీఎం) ఎన్జీఓలు. 15 రోజులుగా మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన రోగులకు ప్రాణవాయువును అందిస్తూ వందలాది ప్రాణాలను కాపాడుతున్నారు. కింగ్కోఠి ఆసుపత్రిలో.. గాంధీ, కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో ఏర్పాటు.. 15 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో 47 కేజీల సామర్థ్యం కలిగిన 15 సిలిండర్లను ఈ ఎన్జీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నిత్యం గాంధీకి వచ్చే వందలాది కరోనా రోగులకు ఈ ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా కింగ్కోఠి ఆసుపత్రి, ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రుల్లో గత ఆదివారం 47 కేజీల సామర్థ్యం కలిగిన మూడు సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఇవి 24 గంటలూ రోగులకు అందుబాటులో ఉంటున్నాయి. మూడు ఆసుపత్రుల్లో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ సిలిండర్స్కు మంచి ఆదరణ లభిస్తోంది. గాంధీలో ప్రతిరోజూ వందకు పైగా రోగులు లబ్ధి పొందుతుండగా, కేకేహెచ్, చెస్ట్ ఆసుపత్రుల్లో ఒక్కో ఆసుపత్రిలో 30–40 మంది ఈ ఆక్సిజన్తో ప్రాణాలు కాపాడుకుంటున్నారు. కరోనా బాధితుల్లో ఆక్సిజన్ అవసరమైన రోగులు ఎక్కువగా ఆస్పత్రులకు వస్తున్నారని, అడ్మిషన్ సమయంలో ఆక్సిజన్ అందక ఎవరూ ఇబ్బంది పడకూడదన్నదే మా లక్ష్యం అంటున్నారు ఎస్డీఐఎఫ్ ఫౌండర్ ఆజంఖాన్, యాక్సెస్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హఫ్స, ఎస్బీఎం వైస్ ప్రెసిడెంట్ అజర్. ప్రతి 24 గంటలకు 47 కేజీల ఆక్సిజన్ సిలిండర్స్ 15 చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు ఆజంఖాన్ తెలిపారు. కింగ్కోఠి, చెస్ట్ ఆసుపత్రుల్లో ప్రతి 24 గంటలకు 47 కేజీల ఆక్సిజన్ సిలిండర్స్ మూడు లేదా నాలుగు ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ హఫ్స తెలిపారు. మూడు ఆసుపత్రులకుగాను ప్రతి 24 గంటలకు వెయ్యి కేజీల ఆక్సిజన్ను ఉచితంగా ఇస్తున్నట్లు అజర్ పేర్కొన్నారు. చదవండి: కరోనా బాధితుల ఇంటికే ఆక్సిజన్ ఊరట: దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కేసులు.. -
Hyderabad: ఆపదలో.. సంప్రదించండి
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ నిస్వార్థ సేవ చేయడంలో ఎన్జీవోలది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ మేమున్నామంటూ అనేక విధాలుగా ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి. ఇందులో కొందరు సంస్థలుగా, ఇంకొందరు వ్యక్తిగతంగా, మరికొందరు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆపదలో అండగా నిలుస్తున్నారు. ఇలా అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించే కొన్ని సంస్థల, వ్యక్తుల వివరాలను తెలంగాణ రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. 1. ఆక్సిజన్ సిలిండర్స్, అంబులెన్స్ సేవలు సకిన ఫౌండేషన్... 8008008012 ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్స్ అందిస్తున్నాయి సహారా అంబులెన్స్ సేవలు... 7569600800 కొన్ని ఎన్జీవోల కలయికతో అంబులెన్స్లను అందిస్తున్నాయి, రోగులను ఇతర ప్రాంతాలకు చేరవేయడానికి వాహనాలను కూడా సమకూర్చుతున్నాయి. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్.. 8790679505 ఆక్సిజన్ సిలిండర్స్, మరికొన్ని కోవిడ్ సేవలు సఫా బైతుల్ మాల్ అండ్ యాక్సెస్ ఫౌండేషన్... 7306600600 ూ మెడిసిన్స్, కోవిడ్ కిట్స్, ఆక్సిజన్. ఫీడ్ ది నీడి... 7995404040 అంత్యక్రియలు.. (ఉ.8 గం నుంచి సా.6 గం వరకు) జైన్ రిలీఫ్ ఫౌండేషన్... 9849159292 కోవిడ్ రోగులకోసం హోటల్స్లో ప్రత్యేకంగా ఆక్సిజన్, వెంటిలేటర్లు తదితర వైద్య సేవలతో ఐసోలేషన్ సెంటర్ల ఏర్పాటు. (ఒక రోజుకి కనీస చార్జీ రూ.3 వేల నుంచి) 2. ప్లాస్మా సేవలు https://donateplasma.scsc.in/ సైబరాబాద్ పోలీస్ శాఖ, ఎస్సీఎస్సీ సంయుక్తంగా స్వచ్ కర్మ ఫౌండేషన్.. 7407112233 కోవిడ్ యోధుల నుంచి ప్లాస్మా డొనేషన్ ఎన్టీఆర్ ఛారిటబుల్ సర్వీసెస్... 8555036885, 9000166005 ఉచిత ఆన్లైన్ కన్సల్టేషన్. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ గ్రూప్... bit.ly/covid-hyd ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్స్, ఫుడ్, ప్లాస్మా డోనర్స్ హైదరాబాద్ కోవిడ్ హెల్ప్... @hyderabadcovid కోవిడ్ సేవలు covidastra.com కోవిడ్ సేవల సమాచారం 3. ఫుడ్ డెలివరీ, ఇతర సేవలు... సేవ ఆహార్... 7799616163 లంచ్ (ఉ.7 గంటలలోపే ఆర్డర్ పెట్టాలి) తెలుగు ఇంటి భోజనం... 9100854558 కరోనా పేషెంట్కి ఫుడ్ డెలివరీ సేవలు (కేపీహెచ్బీ, మియాపూర్, చందానగర్, మదీనాగూడ, బాచుపల్లి, కొండాపూర్) నిహారికా రెడ్డి 9701821089 కోవిడ్ బాధితులకు ఆహార పంపిణీ సేవలు (యూసుఫ్గూడ, శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్) 7 క్లౌడ్ కిచెన్..8978619766 కరోనా పేషెంట్కి ఫుడ్ డెలివరీ సేవలు జాహ్నవి ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్... 6300975328 కోవిడ్ బాధితులకు ఆహార సరఫరా సేవలు (బోయిన్పల్లి, మారేడ్పల్లి, బేగంపేట్, పంజాగుట్ట, సైనిక్పురి, తిరుమలగిరి) 4.పెంపుడు జంతువుల సంరక్షణ సేవలు పీపుల్ ఫర్ ఎనిమల్స్... 7337350643 బ్లూ క్రాస్ హైదరాబాద్... 040–23545523 5.తెలంగాణ కోవిడ్ కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్... 9490617440 చైల్డ్ కేర్... 080–45811215 ఫ్రీ కోవిడ్ టెలీ మెడిసిన్ 080–45811138 అత్యవసర వైద్య సేవలు 9490617431 ప్లాస్మా దాతలు, స్వీకరణ 9490617440 అంత్యక్రియల సేవలు... 7995404040 జీహెచ్ఎంసీ కోవిడ్ హెల్ప్లైన్.. 040–21111111 List of #NGOs & good samaritans & their are of work & contact # Slide 1 & 2 - dealing with Covid patients / home service Slide 3- supplying food at home etc Slide 4 - pet care & @GHMCOnline emergency contact # Will keep adding ..@KTRTRS pic.twitter.com/Ol7g5rm8HV — Arvind Kumar (@arvindkumar_ias) May 11, 2021 -
కరోనా మృతదేహాలకు... వారే ఆ నలుగురై...!
బెంగళూరు: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో చనిపోయే వారి సంఖ్య కూడా రోజు పెరుగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో స్మశాన వాటికల్లో స్థలం సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొన్ని సంఘటనల్లో కరోనాతో చనిపోయే వారికి బంధువులు అంత్యక్రియలు చేయలేని పరిస్థితి. మరికొన్ని సంఘటనల్లో జేసీబీ వాహనాలను ఉపయోగించి మృత దేహాలను ఖననం చేసే పరిస్థితి ఏర్పడింది. చనిపోయిన వారికి ఎలాంటి గౌరవం ఇవ్వకుండా అంత్యక్రియలు చేస్తున్నారు. కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియల్లో ‘ఆ నలుగురు’ అనే వారే లేకుండా పోయారు. ఈ సమయంలో బెంగళూరుకు చెందిన ‘మేర్సి ఎంజిల్స్’ ఎన్జీవో కరోనా మృత దేహాలకు ఆ నలుగురై అన్ని గౌరవ మర్యాదలతో అంత్యక్రియలను నిర్వ హిస్తున్నారు. కోవిడ్తో మరణించిన అన్ని మతాలవారిని, వారి మతాలకు అనుగుణంగా అంత్యక్రియలను నిర్వ హిస్తున్నారు. ఈ ఎన్జీవోకు చెందిన అన్నే మోరిస్ గత ఏడాది సుమారు 120కు కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేశారు. ఈ సంవత్సరం సుమారు 600 పైగా చేశానని తెలిపారు. ప్రస్తుతం కరోనా ఉదృతితో మృత దేహాల సంఖ్య మరిచిపోయానని పేర్కొంది. కరోనా మృత దేహాలకు కొవిడ్-19 మార్గదర్శకాలకు అనుగుణంగా అంత్యక్రియలను చేస్తున్నారు. కాగా, బుధవారం కర్ణాటకలో కొత్తగా 23,558 కరోనా కేసులు, 116 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు కర్ణాటకలో 12.22 లక్షల కరోనా కేసులు, 13762 మరణాలు సంభవించయ్యాయి. చదవండి: ఈ పరికరం కరోనా బాధితులకు ఓ వరం -
మానవత్వం చాటిన మగువ..
కరోనా మహామ్మారి రోజురోజుకూ ఉధృతమవుతున్న తరుణంలో అందరికీ మాస్క్ అందించేందుకు కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఇండియన్ యూత్ సెక్యూర్డ్ సంస్థ ఈ మాస్క్ వాల్ ఏర్పాటు చేసింది. మాస్కులు కావాల్సినవారు వాటిని తీసుకోవచ్చు. ఈ క్రమంలో 2 చేతులు కోల్పోయి భిక్షాటన చేస్తున్న ఓ వృద్ధుడు అక్కడకు వచ్చాడు. అతడికి మాస్కు లేదు.. పెట్టుకుందామంటే చేతులు లేవు. ఏం చేయాలా అని అలా నిలబడి చూస్తున్న సమయంలో ముగ్గు రు యువతులు బస్టాండులోకి వెళ్తూ అతడిని చూశారు. వారిలో ఓ యువతి ఆ వృద్ధుడి దగ్గర కు వెళ్లి మాస్క్ వాల్ నుంచి ఒక మాస్కు తీసి అతడికి తొడిగి మానవత్వాన్ని చాటుకుంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
ఈ టాగ్తో నోరులేని జీవాలు సేఫ్!
ప్రస్తుతమున్న బిజీ లైఫ్లో ముందుకు దూసుకుపోవడమేగానీ.. పక్కవారిని పట్టించుకునే తీరికలేదు. రోడ్డుమీద డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు వెనకాముందు చూసుకోకుండా ఎదురుగా వస్తున్న వాహనాలు, నోరులేని జంతువులనూ గుద్దేస్తున్నారు. రోడ్డెక్కిన మనిషికే సేఫ్టిలేని ఈరోజుల్లో.. మూగ జీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రమంగా అడవులు కనుమరుగవుతుండడంతో కాంక్రీట్ జంగిల్ల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మూగ జీవాల పరిస్థితిని అర్థం చేసుకున్న.. చైతన్య గుండ్లూరి.. వినూత్న ఐడియాతో వాటికి రక్షణ కల్పిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన చైతన్య మూగజీవాల పరిరక్షణకు ఏకంగా ఓ ఎన్జీవోని స్థాపించారు. వేగంగా దూసుకుపోయే వాహనాల మధ్య నలిగి ప్రాణాలు కోల్పోతున్న కుక్కలకు ఫ్లోరోసెంట్ ట్యాగ్లు, బెల్టులు అమర్చి కాపాడుతున్నారు. చైతన్య మాట్లాడుతూ..‘‘ నా పనిలో భాగంగా నేను ఎక్కువ సమయం ప్రయాణాలు చేస్తూ ఉంటాను. ఆ సమయంలో పలుమార్లు వేగంగా దూసుకుపోతున్న వాహనాల కింద పడి జంతువులు చనిపోవడం చూసేవాడిని. అంతేగాకుండా నాకెంతో ఇష్టమైన నా బెస్ట్ ఫ్రెండ్ ఒక కుక్కను తప్పించబోయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఈ సంఘటన నన్ను ఎంతో కలిచి వేసింది. దీంతో రోడ్డు మీద తిరిగే కుక్కలు వాహనాలకు అడ్డుపడకుండా, ఇంకా అవి బిక్కుబిక్కుమంటూ తిరగకుండా ఉండేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. ఇందులో భాగంగానే గతేడాది నవంబర్లో ప్లోరోసెంట్ ట్యాగ్లను కుక్కలు, ఆవులు, గేదెల మెడలో వేయడం ప్రారంభించాం. రాత్రి సమయంల్లో అవి రోడ్ల మీదకు వచ్చినా డ్రైవింగ్ చేసేవారికి క్లియర్గా కనిపిస్తాయి. దీంతో యాక్సిడెంట్లు అవ్వవు. ఫ్లోరోసెంట్ పదార్థంతో తయారైన ఈ ట్యాగ్లపై లైట్ పడగానే మెరుస్తాయి. దీంతో దూరం నుంచే ఎదురుగా జంతువు ఉన్నట్లు గుర్తించి వాహనం స్పీడు తగ్గించి పక్క నుంచి వెళ్లిపోతారు. దీని వల్ల ఇటు మూగజీవాలకు, అటు వాహనదారులకు ఏ ఇబ్బంది ఉండదు’’ అని చైతన్య చెప్పాడు. ప్రస్తుతం చైతన్య ఎన్జీవో ఆరు రాష్ట్రాలో చురుకుగా పనిచేస్తోంది. 36 నగరాల్లో 270 మంది వలంటీర్లు మూగజీవాలను రక్షిస్తున్నారు. రోజుకి దాదాపు 200 కుక్కలకు ట్యాగ్లు వేస్తున్నారు. ఇలా రోజూ జంతువులకు ట్యాగ్లు, ఫ్లోరోసెంట్ బెల్టులు వేయాలంటే భారీసంఖ్యలో అవి అవసరమవుతాయి. అందుకే గ్రామాల్లోని స్మాల్ ఉమెన్ ఎంట్రప్రెన్యూర్ గ్రూపులతో వీటిని తయారు చేయిస్తూ.. వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. -
ఎలా చూస్తే అలా.. ఆ సంకేతం మార్పు
‘పొలిటికల్ కరెక్ట్నెస్’ అనే మాట ఒకటి ఉంది. ఏ భావననైనా.. అది అక్షరం అయినా, చిత్రం అయినా, మాట అయినా.. సంస్కారవంతంగా వ్యక్తం చేసేలా జాగ్రత్త పడటమే పొలిటికల్ కరెక్ట్నెస్. సాటి మనిషి మనోభావాలు దెబ్బతినకుండా ఎరుక (లేక) స్పృహ కలిగి ఉండటం అది. బెంగళూరులోని ప్రసిద్ధ ఇ–కామర్స్ కంపెనీ ‘మింత్రా’ లోగో విషయంలో ఇలాంటి పొలిటికల్ కరెక్ట్నెస్ లేదని ‘అవెస్టా ఫౌడేషన్’ అనే ఎన్జీవో సంస్థ ప్రతినిధి ఒకరు డిసెంబరులో ఫిర్యాదు చేయడంతో మింత్రా రెండు రోజుల క్రితం తన లోగోను మార్చుకుంది. పాత లోగోని ఒక భాగం స్త్రీ జననావయవాన్ని సంకేత పరుస్తోందని ఆ ప్రతినిధి అభ్యంతరం. (చదవండి: ఎస్బీఐ : యోనో బంపర్ ఆఫర్లు) దాంతో లోగోను పూర్తిగా మార్చకుండానే ‘ఆ’ సంకేతాన్ని మార్పు చేయడంతో మింత్రా తన ఉనికిని నిలుపుకోగలిగింది. అయితే.. పొలిటికల్ కరెక్ట్నెస్ పేరుతో ప్రతి విషయాన్నీ వేరే కోణంలోంచి చూడటం సరికాదని నెటిజన్లు అంటున్నారు. ఇలాగైతే ఎన్నని మార్చుకుంటూ పోవాలి అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అందు నిదర్శనంగా కొన్ని కంపెనీల లోగోలను, వాటిలో ‘కనిపిస్తున్న’ అభ్యంతరాలను నెటిజెన్లు ట్వీట్ చేశారు. -
ఆన్లైన్ సోల్
వస్తువులు, పుస్తకాలు, దుస్తులు, నగదు రూపేణా ఎవరికైనా సాయం చేయాలనుకున్న దాతలు వారి కోసం సదరు స్వచ్ఛంద సంస్థలను వెతుకుతుంటారు. ఆ వెతుకులాటలో తమ సాయం సరైన వారికి చేరుతుందా లేదా అనే సందేహమూ ఉంటుంది. బెంగళూరు వాసి సోనికా గహ్లోట్ నాయక్ ఈ పరిస్థితిని గమనించి దేశంలోని అన్ని ఎన్జీవోలను అనుసంధానిస్తూ ‘హ్యాపీ సోల్’ పేరుతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్ఫాం ఎవరికైనా సరే అవసరమైన ఎన్జీఓలకు దానం చేయడానికి సహాయపడుతుంది. దీని రూపకర్త సోనికా గహ్లోట్ నాయక్. 2017 సంవత్సరంలో వారాంతాల్లో ఓ రోజు బట్టలు, పుస్తకాలను దానం చేయడానికి స్వచ్ఛంద సంస్థల గురించి ఆన్ లైన్ జాబితా వెతకడం మొదలుపెట్టింది. భారతదేశం అంతటా ధృవీకరించిన స్వచ్ఛంద సంస్థల జాబితా గల ప్లాట్ఫారమ్ ఏదీ లేవని తెలిసి ఆశ్చర్యపోయింది. ఎన్జీఓల అనుసంధానం ఈ అంతరాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్జీఓలను అనుసంధానించే ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది సోనికా. వ్యక్తులు, కార్పొరేట్లు, ఎన్జీఓలను కలిపే ఒక వేదిక అయిన హ్యాపీ సోల్ను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన ఈ పోర్టల్ ద్వారా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, జంతువుల ఆశ్రయాలు, నిరుపేద పాఠశాలల జాబితా చేసింది. ఆమె మొదట దీనిని ప్రారంభించినప్పుడు సమాచార సేకరణకు వ్యక్తిగతంగా బెంగళూరులోని ప్రతి ఎన్జీఓలను కలిసింది. కొన్ని చిన్న సంస్థలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను కూడా గుర్తించింది. ధృవీకరించిన చట్టపరమైన పత్రాలతో పారదర్శకత, జియోట్యాగ్ చేయబడిన ఎన్జీఓలను నమోదు చేసే వెబ్సైట్ ప్రారంచింది. ఈ ప్లాట్ఫాంపై తమ ప్రొఫైల్స్ను రూపొందించడానికి ఎన్జీఓల నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయదు. ఇది ఎన్జీఓల కార్యకలాపాలు, ఫోకస్, ప్రాంతాలు, లక్ష్యం, ప్రేక్షకుల వివరాలతో మినీ వెబ్సైట్గా పనిచేస్తుంది. వనరుల సద్వినియోగం ఈ పోర్టల్ ద్వారా కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రజలు తమ ఇంటి నుండి సరుకులను నేరుగా స్వచ్ఛంద సంస్థలకు పంపించటానికి వీలుగా సేవలను పొందారు. ఈ ప్లాట్ఫామ్ వినియోగదారులు ఎంపిక చేసిన ఎన్జీఓలకు పికప్–డ్రాపింగ్ సేవలను కూడా అందించింది. కస్టమర్ల రియల్ టైమ్ అప్డేట్స్, వారి వస్తువులు సరైన ఆశ్రమాలకు చేరడం నిర్ధారణతోపాటు, పర్యావరణానికి వారు ఎలా వైవిధ్యం చూపించారనే వివరాలను కూడా ఇందులో జత చేశారు. హ్యాపీ సోల్ నమూనా ఒక సరళమైన రెండుదశల ప్రక్రియ. కస్టమర్ మొదట ఒక ఎన్జీఓ పోస్ట్ చేసిన వాంటెడ్ ఐటమ్స్ జాబితాను తీసుకొని, దానిద్వారా వెళతారు, తరువాత వారు దానం చేయదలిచిన వస్తువుల పరిమాణాన్ని జోడించి, బ్యాగులు లేదా డబ్బాల్లో వాటిని సిద్ధం చేస్తారు. వస్తువుల డెలివరీ కోసం రూ. 200 నుండి రూ .5000 వరకు సౌలభ్య రుసుము వసూలు ఉంటుంది. ఎన్ని వస్తువులు పంపబడుతున్నాయి, డెలివరీ మోడ్ ద్విచక్ర వాహనమా, త్రీవీలరా లేదా మినీ ట్రక్కా... వంటి ఎంపికలు కూడా ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా వనరులను సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే, దేశమంతటా మిగులు, వస్తువుల కొరత మధ్య అంతరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. -
రహదార్ల విస్తరణలో ఎన్జీవోల భాగస్వామ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదార్ల విస్తరణ, అభివృద్ధిలో ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోలు) ప్రతినిధులు భాగస్వాములు కానున్నారు. భూసేకరణ, పునరావాస కార్యాచరణ ప్రణాళికల్లో రైతులు, ప్రజలను ఒప్పించడంలో వీరు కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు చిత్తూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో 37 కిలోమీటర్ల మేర రహదార్లను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డీసీ) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. రహదారి ప్రాజెక్టులకు కన్సల్టెంట్లుగా వ్యవహరించేందుకు ఎన్జీవోలను టెండర్ల ద్వారా ఎంపిక చేయనుంది. టెండర్ల దాఖలుకు ఈ నెల 25 తుది గడువుగా పేర్కొంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణసాయంతో ప్రభుత్వం విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా పోర్టులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వేస్టేషన్లు, పట్టణ ముఖ్య కేంద్రాలను కలుపుతూ రహదార్ల విస్తరణ పనులు చేపట్టింది. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రైతుల వద్ద భూములు సేకరించాలి. అంతేకాకుండా మెరుగైన పునరావాస, పునర్నిర్మాణ కార్యక్రమాలు (ఆర్ అండ్ ఆర్) చేపట్టాలి. ఈ నేపథ్యంలో రైతులను ఒప్పించడానికి ఎన్జీవోలను ఎంపిక చేయాలని ఏడీబీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. విదేశీ రుణ సాయంతో పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయనుండటంతో ఏడీబీ సూచనలను పరిగణనలోకి తీసుకుని ఎన్జీవోల ఎంపికకు సర్కార్ టెండర్లు పిలిచింది. ఇందులో భాగంగా తొలుత ఎన్జీవోల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఆహ్వానించింది. ఎన్జీవోలు ఏం చేయాలంటే.. ► టెండర్ల ద్వారా ఎంపికైన ఎన్జీవోలు రహదార్ల విస్తరణకు అవసరమైన భూసేకరణపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలి. ► ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ► స్థానిక ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి జరిగే అభివృద్ధిపై ప్రచారం చేయాలి. ► రహదారి భద్రతపై అవగాహన కల్పించాలి. -
మా ప్రాణాలను పణంగా పెట్టలేం: చంద్రశేఖర్ రెడ్డి
-
మా ప్రాణాలను పణంగా పెట్టలేం: చంద్రశేఖర్ రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందిని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దేశంలో ఇటు వంటి వ్యవస్థ ఎక్కడ లేదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా సచివాలయ వ్యవస్థను అభినందించారని ఆయన గుర్తుచేశారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లడుతూ.. త్వరలోనే ఉద్యోగులు అందరూ అమరావతి నుంచి వైజాగ్ వస్తున్నారని, వారంతా వైజాగ్ను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో నిలిపివేసిన జీతాలను ఈ నెల నుంచి ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ('దొడ్డి దారిన పదవి పొందిన దద్దమ్మవి నువ్వు') మూడు డీఏలు ఇవ్వడంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పేరు చెప్తేనే అందరూ భయపడే పరిస్థితి ఉన్న సందర్భంలో ఎన్నికలు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని.. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు. కరోనా తగ్గిన తరువాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. (దేవినేని ఉమకు షాకిచ్చిన జక్కంపూడి గ్రామస్తులు) -
ఎన్జీవోలకు ఆంక్షల సంకెళ్లు
కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడి సమస్త కార్యకలాపాలూ స్తంభించి ఒక అసాధారణమైన స్థితి నెలకొన్న తరుణంలో ప్రపంచ దేశాలన్నిటా పాలకులు భవిష:్యత్తులో తీవ్ర పర్యవసానాలుండ గల కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. మన పార్లమెంటు గత నెల మూడో వారంలో ఆమోదించిన విదేశీ విరాళాల(నియంత్రణ) సవరణ బిల్లు కూడా అటువంటిదే. సాగురంగ, కార్మిక రంగ సంస్కర ణలకు సంబంధించిన బిల్లుల మాదిరే ఈ బిల్లుపై కూడా పెద్దగా చర్చ జరగలేదు. మన దేశంలో వివిధ రంగాలను ఎన్నుకుని లక్షల సంఖ్యలో స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీవోలు) పనిచేస్తున్నాయి. వాటికి మరింత జవాబుదారీతనం అలవర్చడమే ఈ సవరణ బిల్లు ఉద్దేశమని, అవి పారదర్శకంగా వ్యవహరించేందుకు ఇది దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది. దేశంలో 31 లక్షలకు పైగా ఎన్జీ వోలు పనిచేస్తున్నాయని 2015లో సుప్రీంకోర్టుకు అందించిన నివేదికలో సీబీఐ తెలిపింది. మన దగ్గర ప్రతి 709మందికి ఒక పోలీస్ కానిస్టేబుల్ వుంటే, ఎన్జీవోలు మాత్రం ప్రతి 400మందికి ఒకటి ఉన్నాయని కూడా అది వివరించింది. ప్రభుత్వ తాజా నిబంధనల పర్యవసానం వెంటనే తెలి సింది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రభుత్వం తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినందువల్ల భారత్లో కార్యకలాపాలు నిలిపేస్తున్నామని ఈమధ్యే ప్రకటిం చింది. మున్ముందు మరెన్ని సంస్థలకు ఈ పరిస్థితి ఏర్పడుతుందో చూడాల్సివుంది. ఎక్కడో యూరప్లోని మారుమూల పుట్టి, మన దేశంలో అట్టడుగు వర్గాలవారికి అసాధారణ మైన సేవలందించి అమ్మగా అందరితో పిలిపించుకున్న స్వర్గీయ మదర్ థెరిసా స్వచ్ఛంద సేవ గురించి ఆణిముత్యంలాంటి మాట చెప్పారు. ‘మనలో అందరం గొప్ప పనులు చేయలేం. కానీ గొప్ప ప్రేమతో చాలా చిన్నవైన పనులుకూడా బాగా చేయగలం’ అన్నారామె. అలా భిన్న రంగాల్లో సేవే ధ్యేయంగా పనిచేస్తున్న సంస్థలు ఎక్కువే వున్నాయి. ఎయిడ్స్ బాధితుల సంక్షేమం మొదలుకొని వీధి బాలలకు ఆవాసం, విద్య అందించి ఆదుకుంటున్నవి... గ్రామసీమల్లో కౌమార బాలికల, మహి ళల ఆరోగ్యం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నవి... దళితులు, అనాథ బాలబాలికలు, వృద్ధులు తదిత రులకు ఆశ్రయం కల్పిస్తున్నవి ఎన్నో వున్నాయి. వారికి ఆశ్రయం కల్పించడమే కాదు... తదనంతర జీవితంలో స్వశక్తితో ఎదిగేందుకు కృషి చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, లీగల్ ఎయిడ్, కార్మిక హక్కులు, మానవ హక్కులు వంటి ఎన్నో అంశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. మారు మూల ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అలసత్వాన్ని ప్రదర్శించినప్పుడు జనం నిలదీయడానికి, ప్రభుత్వ పథకాలు సక్రమంగా వారికి చేరేందుకు దోహదపడుతున్నాయి. ఎవరికీ పట్టని ఎన్నో అంశా లను ఈ స్వచ్ఛంద సంస్థలు పట్టించుకుని వాటి పరిష్కారానికి కారణమవుతున్నాయి. మొన్నటికి మొన్న లాక్డౌన్ సమయంలో ప్రభుత్వాలు చాలాచోట్ల చేతులెత్తేసినప్పుడు వలసజీవుల్ని ఎక్కడి కక్కడ ఆదుకున్నది ఈ స్వచ్ఛంద సంస్థలే. అయితే ఇక్కడ కూడా సేవ ముసుగులో కైంకర్యం చేసే సంస్థలు... అనాథ బాలబాలికల ఆశ్రమాల పేరిట వారిపట్ల క్రౌర్యంగా వ్యవహరించే సంస్థలు వున్నాయి. అలాంటి సంస్థల పని పట్టాల్సిందే. అందుకెవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఆ వంకన ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేసే సంస్థలకు ఆటంకాలు కల్పించడం అవాంఛనీయం, ప్రమాదకరం. ఎన్జీవోలను క్రమబద్ధం చేయడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. 1976లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన సమయంలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తొలిసారి విదేశీ విరాళాలు అందుకునే సంస్థల నియంత్రణకు చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఎదురయ్యే అనుభవాల ఆధారంగా ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ వచ్చాయి. 2010లో అలాంటి చట్టాలన్నిటినీ క్రోడీకరిస్తూ అప్పటి యూపీఏ ప్రభుత్వం విదేశీ విరాళాల(నియంత్రణ) చట్టం తెచ్చింది. అది తీసుకురావడం వెనకున్న ఉద్దేశమేమిటో స్పష్టమే. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలు ప్రభుత్వాలకు కంట్లో నలుసులయ్యాయి. అవి దేశంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని నాటి యూపీఏ ప్రభుత్వం ఆరోపించింది. థర్మల్ విద్యుత్, అణు విద్యుత్, అల్యూమినియం మైనింగ్ ప్రాజెక్టులు ముందుకెళ్లకుండా ఉద్యమాల ద్వారా అడ్డుకుంటోందని వచ్చిన నివేదిక ఆధారంగా 2013లో గ్రీన్పీస్ సంస్థకు మన్మోహన్ సర్కారు విదేశీ విరాళాలు రాకుండా నిలిపివేసింది. రష్యా సహకారంతో నిర్మాణమవుతున్న కూదంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సాగే ఆందో ళనల వెనక అమెరికా నుంచి నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల పాత్ర ఉన్నదని మన్మోహన్సింగ్ అప్పట్లో ఆరోపించారు. ఇలా అభివృద్ధి ప్రాజెక్టుల్ని ఎన్జీవోలు అడ్డుకోవడం వల్ల వృద్ధి రేటు 2 నుంచి 3 శాతం పడిపోతుందని నిఘా సంస్థ అంచనా వేసింది. స్వచ్ఛంద సంస్థలు అటు వామపక్ష ఉద్యమ సంఘాలనుంచీ, ఇటు ప్రభుత్వాలనుంచీ అభ్యం తరాలెదుర్కొన్నాయి. జనంలో వుండే ఆగ్రహావేశాలను చల్లార్చి, వ్యవస్థపట్ల వారిలో భ్రమలు రేకెత్తించి పరోక్షంగా స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలకు తోడ్పడుతున్నాయని ఉద్యమ సంఘాలు ఆరోపించేవి. ఆదివాసీల్లో పనిచేసే అనేక సంస్థలు గతంలో నక్సలైట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆ ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి. మహాత్మా గాంధీ, వినోబా భావేల స్ఫూర్తితో ఛత్తీస్గఢ్లో ఆదివాసీ పిల్ల లకు చదువు నేర్పడానికి వనవాసి చేతనా ఆశ్రమ్ పేరిట స్వచ్ఛంద సంస్థ నడిపిన హిమాన్షుకుమార్ భద్రతా బలగాల బెదిరింపులతో కార్యకలాపాలు నిలిపేయాల్సివచ్చింది. విరాళాల సేకరణలోగానీ, ఇతరత్రా కార్యకలాపాల నిర్వహణలోగానీ స్వచ్ఛంద సంస్థలు పారదర్శకంగా పనిచేయాలనడాన్ని ఎవరూ కాదనరు. కానీ ఆ వంకన సహేతుకమైన, చట్టబద్ధమైన కార్యకలాపాలను నడిపే సంస్థలను సైతం అడ్డుకోవడం... వేధించడం సరైంది కాదు. అది అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. -
ఫౌండేషన్ ద్వారా సచిన్ కార్యక్రమాలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సృష్టించిన రికార్డులు మనందరికి తెలిసిందే. క్రికెట్ చరిత్రలో ఎన్నో మైలురాళ్లను సచిన్ సాధించాడు. కేవలం క్రికెట్లోనే కాక ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించాడు. తాజాగా ప్రముఖ ఎన్జీఓ సంస్థ పరివార్తో కలిసి ఆర్థికంగా వెనుకబడిన 560 గిరిజన చిన్నారులకు చేయుత ఇవ్వనున్నాడు. ఇప్పటికే మధ్యప్రదేశ్లోని సేహోర్ జిల్లాల్లో (గ్రామీణ ప్రాంతాలు) సేవా కుటిర్స్ను పరివార్ సంస్థ నిర్మించింది. మరోవైపు సేవానియా, బీల్పాటి, కాపా తదితర గ్రామాలలో మధ్యాహ్మ భోజనం, ఉచిత విద్యను టెండూల్కర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాంతాలలో పోషకాహార లోపం, నిరక్షరాస్యత తదితర సమస్యలను పత్రికలో చూసి సచిన్ గిరిజన గ్రామాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. -
కరోనా రోగులకు ఎన్జీవోల అండ
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారిపై పోరులో స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవోలు) సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ ఆసుపత్రి సహా పలు కరోనా చికిత్స కేంద్రాలు, ఐసోలేషన్ సెంటర్లలో వారి సేవలను ఉపయోగించు కోనుంది. కరోనా కేసులు పెరుగు తుండటం, కొన్ని చోట్ల ప్రభుత్వ వైద్యులు, నర్సులు వైరస్ బారిన పడిన నేపథ్యంలో రోగులకు చికిత్స, ఉపశమన చర్యల్లో ఎన్జీవోలను భాగస్వాములను చేయనుంది. ఇందు కోసం ఐదారు ఎన్జీవోలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సంస్థల ప్రతినిధులు తాజాగా మంత్రి ఈటల రాజేందర్తో ఒప్పందానికి వచ్చారు. ఆ సంస్థల్లోని వారంతా వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందే కావడం గమనార్హం. ఒక్కో ఎన్జీవోలో 100 మంది వరకు వైద్య సిబ్బంది ఉన్నారు. ఆ ప్రకారం ఐదారు వందల మంది ఎన్జీవోల సభ్యులు.. ప్రభుత్వ ఆసుపత్రులు, ఐసోలేషన్ వార్డులు, హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా రోగులకు సేవలు అందించనున్నారు. ఎలాంటి సేవలంటే? రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 44 వేలు దాటింది. బాధితుల్లో కొందరు కోలుకోగా మిగిలిన వారిలో అనేక మంది వివిధ ఆసుపత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు క్వారంటైన్, ఐసోలేషన్ కేంద్రాల్లో సేవలు అందించడానికి ముందుకు వచ్చాయి. ఆయా కేంద్రాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. మరికొన్ని సంస్థలు సామాన్య ప్రజలలో అవగాహన పెంచడానికి, సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నివృత్తి చేయడానికి నడుంబిగించాయి. అందుకోసం అవసరమైన పోస్టర్లు, వీడియోలు, ఆడియోలు తయారు చేసి చైతన్యం కలిగించనున్నాయి. ఈ ప్రచారంలో టీవీ చానళ్లు, రేడియోలను భాగస్వాములను చేసుకోనున్నాయి. మరికొన్ని సంస్థలు కరోనాతో చనిపోయిన వారిని ఖననం చేయడంలో సహకారం అందించనున్నాయి. యువజన సంక్షేమ బృందాల సహకారంతో గౌరవప్రదమైన ఖనన సేవలను అందించనున్నాయి. అలాగే వేలాది మాస్క్లను ప్రజలుకు అందించడంతోపాటు ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. లైసెన్స్ పొందిన, పేరున్న బ్లడ్ బ్యాంక్తో కలసి ప్లాస్మా డొనేషన్ బ్యాంక్ను ప్రారంభించాలని నిర్ణయించాయి. కోలుకున్న రోగులు వారి ప్లాస్మాను దానం చేసేలా ప్రోత్సహించనున్నాయి. కరోనా అనుమానితులకు వీడియో సంప్రదింపుల ద్వారా చికిత్స చేయడం, ఇంట్లో చికిత్స పొందే వారికి ఆక్సిజన్ ఏర్పాటు చేయడంలో సాయం అందించనున్నాయి. ఉపశమన చర్యలు కూడా... తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతున్న రోగుల్లో ధైర్యం నింపడం, అవసరమైన సేవలు అందించడం ద్వారా వారి రోగాన్ని తగ్గించేలా స్వచ్ఛంద సంస్థలు పనిచేయనున్నాయి. పాలియేటివ్ కేర్గా పిలిచే ఈ విధానంలో రోగులకు తరచూ ఉపశమనం కల్పించడం, ఓదార్చడం కీలకంగా ఉంటుంది. ఇటువంటి సేవలకూ ఎన్జీవోలు ముందుకొచ్చాయి. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో ఇటువంటి సేవలు అందించనున్నాయి. అలాగే హోం ఐసోలేషన్లో చికిత్స పొందే వారిని చూసుకోవడానికి కమ్యూనిటీ నర్సింగ్ సిబ్బందిని నియమించనున్నాయి. నిపుణులు అందుబాటులో లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు మందుల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నాయి. ఒకవేళ ఆసుపత్రిలో ఉంటే బంధువులతో ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా రోగులు మాట్లాడే అవకాశం కల్పించనున్నాయి. రోగుల్లో ఎవరైనా మరణశయ్యపై ఉంటే భావోద్వేగ, ఆధ్యాత్మిక సాయం అందించనున్నాయి. -
కరోనాపై పోరులో కానరాని ఎన్జీవోలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ ప్రజారోగ్య వ్యవస్థకు ఎన్జీవో సంస్థలను పునాదులుగా పేర్కొంటారు. గతంలో మలేరియా మొదలుకొని ఏ మహమ్మారి దాడి చేసినా మేమున్నామంటూ ఎన్జీవో సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలిచేవి. నేడు ప్రాణాంతక కరోనా వైరస్ కోరలుచాచి కాటేస్తున్నా చెప్పుకోతగ్గ స్థాయిలో ఎన్జీవో సంస్థలు ముందుకు వచ్చి క్రియాశీలకంగా పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకేనేమో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తమవంతు సేవలను అందించాల్సిందిగా ఎన్జీవో సంస్థలకు ‘నీతి ఆయోగ్’ ఇటీవల పిలుపునిచ్చింది. (చదవండి: 5 సెకన్లలో కరోనా వైరస్ను గుర్తించవచ్చు!) ఢిల్లీలోని ‘ఎంసీకేఎస్ ఫుడ్ ఫర్ ది అంగ్రీ ఫౌండేషన్’, సాఫా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ‘యూత్ ఫీడ్ ఇండియా ప్రోగ్రామ్’, ‘శరణార్థి సేవ’ లాంటి సంస్థలు ప్రజల అన్నదాన కార్యక్రమాలకు మాత్రమే పరిమితమై పనిచేస్తున్నాయి. దేశంలోని ఎన్జీవో సంస్థలకు అందుతున్న విదేశీ విరాళాలను నియంత్రించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్’ను తీసుకొచ్చింది. దాంతో ఒక్కసారిగా దేశంలోని 20 వేలకు పైగా ఎన్జీవో సంస్థల లైసెన్స్లు రద్దయ్యాయి. దేశంలో పని చేస్తున్న ఎన్జీవో సంస్థలకు కొలరాడో కేంద్రంగా పని చేస్తోన్న ‘క్రిస్టియన్ చారిటీ కంపాషన్ ఇంటర్నేషనల్’ అత్యధికంగా అంటే, ఏటా 45 మిలియన్ డాలర్లు (దాదాపు 344 కోట్ల రూపాయలు) విరాళంగా ఇచ్చేది. ముఖ్యంగా దారిద్య్రంలో బతుకుతున్న నిమ్న వర్గాల పిల్లల కోసం కషి చేస్తున్న ఎన్జీవోలకే విరాళాలు ఎక్కువగా ఇచ్చేది. ('రికవరీ రేటు మన దేశంలో చాలా బాగుంది') -
మానవత్వం చాటిన వియ్ ఫర్ ఆర్పాన్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు లాన్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలు, దినసరి కూలీల పరిస్థితి దీనంగా మారింది. చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక బాధ పడుతున్నారు. మరోవైపు అత్యవసర ఇబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ పలు స్వచ్ఛంద సంస్థలు అన్నపానీయాలు సమకూరుస్తున్నాయి. తెలంగాణలో సేవలు అందిస్తున్న వియ్ ఫర్ ఆర్పాన్ ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో తమ వంతు సాయం చేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది, రోడ్డుపై ఉన్న పేదలు, దినసరి కూలీలకు అల్పాహారం, మంచినీళ్లు అందించి మానవత్వం చాటుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ అనుమతి తీసుకుని సీహెచ్ రాజేశ్, జైహింద్, రాము తదితరులు ఈ సేవ కార్యక్రమం చేపట్టారు. మార్టిన్, సంపత్, రవికాంత్, అడ్వొకేట్ తేజ, మాలికార్జున్, రమేష్, యాదగిరి, అరుణ్ సహాయ సహకారాలు అందించారు. -
వెల్లువలా వలసలు
కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని వలస వచ్చిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం మహాకవి శ్రీశ్రీ రాసిన ఈ కవితకి దృశ్యరూపం ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. కోవిడ్–19 మహమ్మారిని అడ్డుకోవడానికి దేశం లాక్డౌన్ ప్రకటించడంతో వారికి పనుల్లేవు. తిండి లేదు, నీళ్లు లేవు. ఉండడానికి చోటు లేదు. ఏదో మహమ్మారి పెనుభూతమై కాటేస్తుందన్న భయంతో సొంతింటికి చేరుకోవాలన్న ఆరాటం ఎక్కువైపోయింది. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వలసదారులు తమ కాళ్లకి పని చెప్పారు. నెత్తి మీద ఒక మూట, చంకలో పిల్ల, రెండు చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగుల్లో సామాన్లతో వలస కార్మికులు నడుస్తున్న దృశ్యాలు అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. గమ్యస్థానం ఎప్పుడొస్తుందో తెలీదు, ఇల్లు చేరడానికి ఎన్నాళ్లవుతుందో అర్థం కాదు. అయినా ప్రాణాలను నిలుపుకోవాలన్న ఒకే ఒక్క ఆరాటంతో పళ్ల బిగువున అన్ని కష్టాలను నొక్కిపెట్టి కిలో మీటర్లకి కిలోమీటర్లు నడుస్తున్నారు. ఢిల్లీ, హరియాణా, గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు కర్ణాటక నుంచి రాజస్తాన్కు వేలాది మంది రోడ్లపై నడుస్తున్న దృశ్యాలు అందరి గుండెల్ని పిండేస్తున్నాయి. మన దేశంలో బెంగాల్, ఒడిశా, బిహార్ నుంచి అత్యధికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లి పని చేస్తుంటారు. చాలా ప్రాంతాల్లో కాలినడకన వెళుతున్న కార్మికుల్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆదుకుంటున్నాయి. వారికి మంచినీళ్లు, ఆహారపొట్లాలు అందిస్తూ గమ్యస్థానాలు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వాళ్లు అక్కడే ఉండాలని విజ్ఞప్తి చేసి, వారి బసకి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇంటికి తొందరగా చేరాలన్న ఆత్రుతలో వందలాది కిలోమీటర్లు నడిచి వెళుతున్నారు. బెంగళూరులో వెల్డర్గా పనిచేసే శశిరామ్ అనే వెల్డర్ బెంగళూరు నుంచి 1300 కి.మీ. దూరంలో ఉన్న రాజస్తాన్లో తన స్వగ్రామానికి కాలినడకన వెళ్లే సాహసం చేశాడు. ‘‘నేను ఇల్లు చేరడానికి 10 రోజులైనా పట్టొచ్చు, 12 రోజులైనా పట్టొచ్చు. కానీ నాకు వేరే దారి లేదు. బెంగళూరులో పని లేదు. తిండి లేదు. అందుకే రాజస్తాన్లో ఉన్న మా సొంతింటికి బయల్దేరాను’’అని శశిరామ్ అనే వెల్డర్ చెప్పారు. ‘‘మా స్వగ్రామం యూపీలో ఝాన్సీ. మా కుటుంబం అంతా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాం. దేశం లాక్డౌన్తో ఒక్కసారిగా పనులు నిలిచిపోవడంతో మాకు దిక్కు తోచలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఎక్కడ ఉండాలో తెలీదు. అందుకే నడక మొదలు పెట్టాం’’అని పానిపట్కు చెందిన రోహిత్ తెలిపారు. బస, ఆహారం ఏర్పాటు చేయండి వలస కార్మికుల కష్టాలను తీర్చడానికి రంగంలోకి దిగిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఎక్కడి వారు అక్కడే ఉండే ఏర్పాట్లు చేయాలన్నారు. వారందరికీ బస ఏర్పాటు చేసి ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా వందలాది మంది జట్లు జట్లుగా గమ్యస్థానాలకు బయల్దేరిపోతున్నారు. దీంతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హైవే అధికారుల్ని వారు క్షేమంగా ఇళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యూపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళుతున్న వారి కోసం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 300 బస్సుల్ని ఏర్పాటు చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కార్మికులు సురక్షితంగా స్వస్థలాలకి చేరడానికి 100 బస్సుల్ని ఏర్పాటు చేసింది. పాఠశాలలన్నింటినీ బసలుగా మారుస్తామని ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వానిదే బాధ్యత: రాహుల్ వలస కార్మికుల దుస్థితికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల్ని ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టేయడం అతి పెద్ద నేరమని చెప్పారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో నడుస్తూ వెళుతున్న వారందరికీ మద్దతుగా నిలవడం మన బాధ్యత. ఈ సమస్య మరింత దుర్భరంగా మారడానికి ముందే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి’’అని రాహుల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ– ఘజియాబాద్ సరిహద్దుల్లో... న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలూ మూసుకుపోవడంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు శనివారం తమ స్వస్థలాలకు పయనమయ్యారు. ఢిల్లీ–ఘజియాబాద్ సరిహద్దుకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో తమ ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే బస్సులు సరిపడా లేకపోవడంతో సీట్ల కోసం కార్మికులు తమలో తాము గొడవపడ్డారు. బస్సు నిండిపోయాక, బస్సు పైన కూడా కూర్చొని ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు. బస్సుల్లో పరిస్థితి లాక్డౌన్ ఏమాత్రం అమలవుతున్నట్లుగా కనిపించడం లేదు. కొంత మంది ముఖాలకు మాస్కులు పెట్టుకున్నప్పటికీ అందులో ఎక్కువ కర్చీఫులనే కట్టుకొని కనిపించారు. ఢిల్లీలోని చార్కి దాద్రి నుంచి 110 కిలోమీటర్లు నడిచి సరిహద్దు వరకు చేరుకున్న సంతోశ్ సింగ్ (23)కు బస్సులో సీటు దొరకలేదు. దీంతో మరో 20 కిలోమీటర్లు నడిచి లాల్ కౌన్కు చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడి నుంచైనా బస్సు దొరుకుతుందనే ఆశతో నడిచి వెళుతున్నట్లు చెప్పాడు. సరిహద్దుల వద్ద పోలీసులు ఉన్నప్పటికీ కార్మికులు ఎక్కువగా ఉండటంతో నియంత్రించలేకపోతున్నారు. ఎంత మంది సరిహద్దు దాటి రాష్ట్రంలోకి వచ్చారన్న విషయాన్ని కూడా చెప్పలేమని వారు పేర్కొన్నారు. వృద్ధుడిని తమ సొంత గ్రామానికి మోసుకెళుతున్న కార్మికులు -
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఏపీ ఎన్జీవో సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ఎన్నికల అధికారులు చేపట్టారు. గడువు ముగిసిన తర్వాత ఒక్కో పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బండి శ్రీనివాస రావు, సహాధ్యక్షుడిగా పురుషోత్తం నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఏపీ ఎన్జీవో ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాపై ఇప్పుడు మీరు మరిన్ని బాధ్యతలు పెట్టారు. ప్రభుత్వంతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తూ.. ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాము. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. పాలనా రాజధానిని విశాఖగా ప్రకటించిన సందర్భంగా ఉద్యోగులు వైజాగ్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను అన్ని విధాలుగా మోసం చేసింది' అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు అన్నారు. చంద్రశేఖర్రెడ్డి 1985 నుంచి ఏపీ ఎన్జీవో సంఘంలో వివిధ పదవులు నిర్వహించారు. ఐదున్నరేళ్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బండి శ్రీనివాస్ ప్రకాశం జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షునిగా, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. -
హర్షిణి
నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు.. నువ్వేంటో నీ వ్యక్తిత్వం చెప్తుంది.. నువ్వేంటో నీ జీవన శైలి చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని మించిన అస్తిత్వం లేదు అని అమ్మ చెప్పిన మాటలను మంత్రంలా ఆచరించి తనను తాను గౌరవించుకున్న ఒక హర్షిణి కథ ఇది.. ‘‘నిజం చెబితే ఎందుకు ఉద్యోగం ఇవ్వరో చూడాలి.. నిజం చెప్పే ఉద్యోగాన్ని సాధించాలి’’ అని నిర్ణయించుకుంది ఆమె. ఆ పట్టుదలతోనే ‘జేఎల్ఎల్’ లో ఇంటర్వ్యూకి హాజరైంది. ఎప్పటిలాగే తొలి రెండు రౌండ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఆఖరి రౌండూ పూర్తయి, ఉద్యోగం ఖాయమని తేలగానే చెప్పింది ఆమె ఇంటర్వ్యూ ప్యానెల్కు.. ‘సర్ .. నేను ట్రాన్స్ ఉమన్ని’ అని. ఆ జవాబుకి ప్యానెల్ ఉలిక్కిపడలేదు. ‘మీరు ఎవరైనా మాకు అభ్యంతరం లేదు. అయితే ఈ విషయాన్ని స్టాఫ్తో చెప్పకండి. వాళ్లు సరిగా రిసీవ్ చేసుకోలేకపోతే మీరే ఇబ్బంది పడ్తారు’’ అని సలహా మాత్రం ఇచ్చారు. ఆమె ఆత్మవిశ్వాసం ఉప్పొంగింది. ఆమె పేరు హర్షిణి మేకల. అమ్మ చెప్పినట్టుగా.. ఆమెకు మాటిచ్చినట్టుగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించి .. ఆత్మగౌరవంతో బతుకుతోంది! ఆంధ్రప్రదేశ్కు చెందిన హర్షిణి సొంతూరు కృష్ణాజిల్లా.. జగ్గయ్యపేట మండలంలోని బలుసుపాడు అనే చిన్న గ్రామం. తల్లి, తండ్రి ఇద్దరూ వ్యవసాయ కూలీలే (ఇప్పుడు లేరు, చనిపోయారు). హర్షిణికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. ఇదీ హర్షిణికి సంబంధించిన ప్రాథమిక సమాచారం. తన జీవితంలోని మిగిలిన విషయాల గురించి ఆమె మాటల్లోనే... ‘‘అబ్బాయిగానే పుట్టినా ఆలోచనలన్నీ అమ్మాయిలాగే ఉండేవి. స్కూల్ నుంచి రాగానే అక్క వాళ్ల బట్టలు వేసుకునేదాన్ని. కళ్లాపి చల్లి ముగ్గుపెట్టడం వంటివి చేసేదాన్ని. అమ్మ వారించేది. కౌన్సెలింగ్ ఇచ్చేది. వినకపోగా వయసు పెరుగుతున్నకొద్దీ మరీ నేను అమ్మాయిలాగే ప్రవర్తిస్తుంటే అమ్మ.. వీడి శరీరం అబ్బాయిదే కాని మైండ్ అమ్మాయిదే అని ఒక అభిప్రాయానికి వచ్చేసింది. కుటుంబంలో మిగిలిన వాళ్లు నా పట్ల ఎలా ఉన్నా అమ్మ మాత్రం నన్ను అర్థంచేసుకోవడానికే ప్రయత్నించింది. నిజం చెప్పాలంటే నాకొక స్నేహితురాలిగా ఉంది. అమ్మాయిలాంటి నా నడత చూసి బయట, స్కూల్లోని అబ్బాయిలు గేలిచేసేవారు, భయంకరంగా ఏడిపించేవారు. భరించలేక ఇంటికొచ్చి అమ్మను పట్టుకొని ఏడ్చేసేదాన్ని. ‘ఇంత చిన్నవాటికే భయపడి ఏడిస్తే ఎలా? రేప్పొద్దున జీవితంలో చాలా ఎదుర్కోవాలి. బాగా చదవాలి.. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. గొప్పగా బతకాలి’’ అంటూ ధైర్యం చెప్పేది. ఎంత ధైర్యం కూడదీసుకున్నా హేళనలు, అవమానాలు తప్పలేదు. వాటిమధ్యే పెరిగాను. ముంబైకి నేను డిగ్రీ సెకండియర్లో ఉన్నప్పుడు ఓ ఎన్జీవోలో పనిచేసే ఒక ట్రాన్స్ ఉమన్ పరిచయమై ‘‘ముంబైకి వెళితే నువ్వు మొత్తం అమ్మాయిలా మారిపోవచ్చు’’అని సలహా ఇచ్చారు. అది మనసులో పెట్టుకొని డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ముంబై వెళ్లిపోయా. కానీ ఆ వాతావరణంలో ఇమడలేక మూడు రోజులకే తిరిగొచ్చేశా. ఈలోపు మా అమ్మ నా మీద బెంగపెట్టుకొని ఆసుపత్రిపాలైంది. గుండె జబ్బు అని తేలింది. ‘‘ఇంకోసారి ఇలాంటివి చేయొద్దు.. నువ్వు గౌరవంగా బతకాలి’’ అంటూ ఏడ్చేసింది అమ్మ. బాగా చదువుకొని, చక్కగా స్థిరపడాలని ఒట్టుపెట్టించుకుంది నాతో. అప్పుడు పీజీ ఎంట్రెన్స్ రాశా. ఆచార్య యూనివర్సిటీ, ఎమ్.ఏ. ఎకనామిక్స్లో సీట్ వచ్చింది. పూర్తయ్యాక నేను డిగ్రీ చేసిన కాలేజ్లోనే లెక్చరర్గా చేరా. యేడాదిన్నరకు అమ్మ చనిపోయింది. అంతా చీకటయిపోయినట్టే అనిపించింది. నా దుఃఖం, సంతోషం, కష్టం, సుఖం అన్నీ ఎరిగిన మనిషి.. నాకున్న ఏకైక స్నేహితురాలు అమ్మ.. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించుకోలేకపోయా. కుంగిపోయి.. ఆత్మహత్యా ప్రయత్నమూ చేశా. అక్కా, తమ్ముడు రక్షించారు. అప్పటికే మా అక్కలిద్దరికీ పెళ్లిళ్లయి పిల్లలు కూడా. పెద్దక్క భర్త చనిపోవడంతో మా ఇంటికే తెచ్చేసుకున్నాం. తమ్ముడు చదువుకుంటున్నాడు. అమ్మ పోయిన బాధలో నాన్న తాగుడికి బానిసయ్యాడు. బాధ్యతగా మసలుకోవాలన్న స్పృహ వచ్చింది. ఊళ్లోనే ఉంటే అమ్మ జ్ఞాపకాలతో దిగులు పెరగడం తప్ప ఏమీ చేయలేనని గ్రహించి మళ్లీ ముంబై వెళ్లిపోయా. అక్కడ ‘త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర’ అనే స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్గా కొన్నాళ్లు, క్రిస్టియన్ ఎన్జీవో ‘సేవానికేతన్’లో కొన్నాళ్లు పనిచేశా. ఆ టైమ్లోనే ఢిల్లీ వెళ్లి స్త్రీగా మారిపోయే సర్జరీ చేయించుకొని ‘పూర్తిగా అమ్మాయే’అనే సర్టిఫికెట్ తీసుకున్నా. దీంతో నా ‘ఐడెంటిటీ’ మార్చుకోవాలని కోర్టు అఫిడవిట్ కూడా తెచ్చుకొని ‘హర్షిణి’ నయ్యాను. ఎమ్ఎన్సీలలో ఉద్యోగం సంపాదించాలనుకున్నా. జేఎల్లో సాధించా. స్టాఫ్ దగ్గర నేనెవరో చెప్పొద్దన్న నా పై అధికారులే నేను చేరిన ఆరునెలలకు నా గురించి స్టాఫ్కి చెప్పారు గర్వంగా. అందరూ షాక్. నిజమే అంటూ నా స్ట్రగుల్ని నేను చెబితేగాని నమ్మలేదు ఎవరూ. బ్యూటిఫుల్ స్మైల్ ఉద్యోగం చేస్తూనే ట్రాన్స్ విమెన్ కోసం ప్రారంభించిన అందాల పోటీల్లో పాల్గొన్నా. ‘టాప్ సిక్స్’లో నిలిచి, ‘బ్యూటిఫుల్ స్మైల్’ టైటిల్నూ గెలుచుకున్నా. అలా జాతీయ అందాల పోటీలో పాల్గొన్న మొదటి తెలుగు ట్రాన్స్ ఉమన్ని నేనే. మోడలింగ్ కూడా చేశా. రెండు హిందీ లఘుచిత్రాల్లో నటించా. ముంబైలోని మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ పత్రికలు నా గురించి రాశాయి. ఇదంతా మా ఊరికి ఇంకోరకంగా చేరి మా అక్కతో కొందరు ‘మీ చెల్లెలు ముంబైలో బెగ్గింగ్ చేసుకుంటోందట కదా’ అన్నారట. దాంతో మా అక్క ఏడుస్తూ ఫోన్ చేసింది ‘ముంబై వద్దు.. ఏమొద్దు ఇక్కడికి వచ్చెయ్’ అని. హైదరాబాద్లో ఉన్న మా ఆఫీస్ బ్రాంచ్కి బదిలీ చేయించుకుని వచ్చేశా. నటి కావాలనే కోరిక చిన్నప్పటి నుంచీ ఉంది. ఇక్కడికి వచ్చాక సినిమాల్లో చాన్స్కోసం ప్రయత్నించడం మొదలుపెట్టా. నా గురించి తెలిసి రచయిత, దర్శకుడు అమాన్ అహ్మద్ ‘బద్లావ్’ అనే హిందీ నాటకంలో నాకు వేషం ఇచ్చారు. దానికి మంచి పేరు వచ్చింది. సినిమా చాన్సే ఇంకా రాలేదు. తమిళంలో, మలయాళంలో ట్రాన్స్ ఉమన్కు హీరోయిన్ అవకాశాలు ఇస్తున్నారు. మమ్ముట్టి లాంటి పెద్ద పెద్ద హీరోల పక్కనా చేస్తున్నారు. కానీ మన తెలుగులో కనీసం క్యారెక్టర్ రోల్స్ కూడా ఇవ్వడం లేదు. సీరియళ్లలో ‘ట్రాన్స్ ఉమన్’ పాత్రనూ ఆడవాళ్లే చేస్తున్నారు. కానీ మాకు ఇవ్వడం లేదు’’ అంటుంది హర్షిణి మేకల. ►ఏ ఊళ్లో అయితే ఒకప్పుడు అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానో ఆ ఊరి వాళ్లే ఇప్పుడు అభిమానిస్తున్నారు. నా లైఫ్ స్టైల్ చూసి సంతోషపడుతున్నారు. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి అమ్మ లేదనే దిగులు వెంటాడుతూనే ఉంది. అమ్మా.. నువ్వు కోరుకుంటున్నట్టే గౌరవంగా బతుకుతున్నాను అని చెప్పాలనుంటుంది. – హర్షిణి -
రాయలసీమ అభివృద్ధి చెందుతుంది: ఎన్జీవోలు, విద్యార్థులు
-
తక్షణమే మార్షల్స్కు చంద్రబాబు లోకేష్ క్షమాపంణ చెప్పాలి
-
నో ఫుడ్ వేస్ట్ ప్లీజ్
దేశంలో ఆహారం కొరత..ఆహార పదార్థాల వృథా దాదాపు సమాన స్థాయిలో ఉందని ఇటీవలి ఓ కమిటీ నివేదికలో వెల్లడైంది. అన్నం ఎక్కువైపారవేస్తుండగా..ఆహారం లభించక అల్లాడుతున్న వారూ ఎక్కువే ఉన్నారు. ముఖ్యంగా వివాహం, వార్షికోత్సవం, పుట్టినరోజు...ఇలా వేడుక ఏదైనా 25 శాతం మేర ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అతిథ్య రంగ సంస్థలు ఏర్పాటుచేసేకార్యక్రమాల్లో 15 నుంచి 25 శాతం ఆహారం వృథా అవుతున్నట్లు తేల్చారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఓ సంస్థ ఆహారం వృథా కానీయకుండా పేదల ఆకలి తీర్చేందుకు కంకణం కట్టుకుంది. ఏదైనా వేడుకలో చేసిన వంటకాలు మిగిలిపోతే సాధారణంగా డస్ట్బిన్లోకి వేస్తారు. అలా కాకుండా ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు..ఆ సంస్థ ప్రతినిధులు అక్కడ వాలిపోయి ఆ ఆహారాన్ని అన్నార్తుల చెంతకు చేర్చి కడుపునింపుతారు. ఔను..ఆహార కొరత ఎదుర్కొంటున్న ఎందరికో ‘నో ఫుడ్ వేస్ట్’ సంస్థ ఒక వరంగా మారిందనే చెప్పాలి. తమిళనాడులోనికోయంబత్తూర్లో వెలిసిన ఈ సంస్థ ఇప్పుడు నగరంలోనూ సేవలందిస్తోంది. దాదాపు 100 మందివాలంటీర్లు స్వచ్ఛందంగా ‘నో ఫుడ్ వేస్ట్’ సంస్థలో సభ్యులుగా చేరి ఎక్కడ ఆహారం మిగిలినా అక్కడ నుంచి బస్తీలకు చేర్చి పేదోళ్ల ఆకలి తీరుస్తున్నారు. సనత్నగర్: కోయంబత్తూర్లో ప్రారంభమైన ‘నో ఫుడ్ వేస్ట్’ సేవలను స్ఫూర్తిగా తీసుకుని యూసుఫ్గూడ గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఉండే మురళి కలిగొట్ల తానొక్కడే నగరంలో ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన మురళి తనకు తెలిసిన చోట ఫుడ్ మిగిలిపోయి ఉందంటే దానిని తీసుకుని అన్నార్తులకు వడ్డించేవాడు. ఇలా రెండున్నర ఏళ్లుగా సేవలందిస్తూ వస్తున్నారు. మురళి అందిస్తున్న సేవలు సోషల్ మీడియా కేంద్రంగా కోయంబత్తూర్లోని ‘నో ఫుడ్ వేస్ట్’ సంస్థ ప్రతినిధులకు తెలిసి..వారు మురళిని సంప్రదించారు. ఆయనకు సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్గా బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి నో ఫుడ్ వేస్ట్ సంస్థ కేంద్రంగా చేసుకుని మురళి తన సేవా యజ్ఞాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్ళారు. నగరానికి చెందిన దాదాపు 100 మంది వలంటీర్లుగా చేరిపోయారు. ఎనిమిదేళ్ల నుంచి 80 ఏళ్ళ ప్రాయం వరకు నో ఫుడ్ వేస్ట్ సంస్థ సభ్యులు చేరి ఆహారం వృథా కానీయకుండా అన్నార్తుల చెంతకు చేరుస్తున్నారు. వలంటీర్లు ఏం చేస్తారంటే... నో ఫుడ్ వేస్ట్ సంస్థకు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎక్కడైనా ఫంక్షన్ జరిగి అక్కడ ఆహారం మిగిలిపోయి ఉందంటే నో ఫుడ్ వేస్ట్కు కాల్ చేస్తే వెనువెంటనే ఆ సమాచారం గ్రూప్లో ప్రత్యక్షమవుతుంది. ఎంతమందికి ఆహారం మిగిలి ఉంది, ఏయే రకాల వంటకాలు ఉన్నాయనే వివరాలు కూడా గ్రూప్లో ఉంచుతారు. తదనంతరం ఆ ఫంక్షన్ జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఉండే వాలంటీర్లు అక్కడకు వెళ్తారు. ఆహారం ఎప్పుడు వండింది, క్వాలిటీ ఏవిధంగా ఉంది, భుజించడానికి వీలుగా ఉందా? లేదా అని ముందుగా పరీక్షలు చేస్తారు. వారే స్వయంగా తిని చూస్తారు. అక్కడి నుంచి ఆహారాన్ని తీసుకెళ్లి పేదల ఆకలి తీరుస్తారు. 50 హంగర్ స్పాట్స్ గుర్తింపు... ♦ సంస్థ ప్రతినిధులు 50 హంగర్ స్పాట్స్ను గుర్తించారు. నిమ్స్, గాంధీ ఆస్పత్రి, బేగంపేటలోని నైట్ షెల్టర్స్, అమీర్పేట ప్రభుత్వ బాలికల హాస్టల్, నాంపల్లి డాన్బాస్కో, ఎల్బీనగర్, కార్వాన్, మల్కాజ్గిరి తదితర ఏరియాల్లో స్పాట్స్ను గుర్తించారు. ♦ నో ఫుడ్ వేస్ట్ సంస్థ అక్టోబర్ 7 నుంచి ఇప్పటివరకు 15 వేల మంది ఆకలిని తీర్చారు. ప్రతిరోజూ సగటున 20–30 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ♦ పది మందికి లోపు సరిపడా ఆహారం ఉంటే పికప్ డెలివరీ యాప్ ప్రతినిధులను పంపించి వారి చేతనే పేదల ఆకలిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ♦ ఇతరులు కూడా సంస్థతో కలిసివచ్చేందుకు వీరి సేవల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. దాతల సహకారంతో మినీ వ్యాన్.. పెద్ద మొత్తంలో ఆహారం మిగిలిపోయి ఉన్న సందర్భాల్లో వాలంటీర్లు బైక్పై గానీ, లేదా కిరాయి వాహనంలో గానీ తీసుకువెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పలువురు దాతలు ఈ సంస్థ ప్రతినిధులకు మారుతి ఈకో వ్యాన్ను బహుమతిగా అందించారు. తమకు దగ్గరలోని ప్రాంతానికి వాలంటీర్లు మినీ వ్యాన్ను తీసుకువెళ్లి ఆహారాన్ని సేకరించి పేదలకు చేర్చుతారు. ఈ వాహనాన్ని అందరికీ మధ్యలో ఉండేలా అమీర్పేటలో ఉంచుతారు. భవిష్యత్తులో మరో వ్యాన్తో పాటు ఆహారం నిల్వ ఉండేలా ఫ్రిడ్జ్ను కూడా సమకూర్చుకోవాలనే ఆశయంతో ముందుకుసాగుతున్నారు. ఆ సంతృప్తి మాటల్లోచెప్పలేం.. ఆహారం వేస్ట్ చేయకుండా పేదల కడుపు నింపినప్పుడు పేదల ముఖాల్లో కనిపించే ఆ ఆనందం ఎనలేనిది. ఒక్కోసారి ‘రెండు మూడు రోజులైంది బాబూ..అన్నం తిని.. దేవుడిలా వచ్చి ఆకలి తీర్చారంటూ’ చెబుతుంటే మనసు కలచివేస్తోంది. అదే క్రమంలో ఆకలి తీర్చామన్న ఆత్మసంతృప్తి మాటల్లో చెప్పలేం. తమ సేవలతో కలసివచ్చేలా మరింత మంది వాలంటీర్గా ముందుకు వస్తే బాగుంటుంది. ఎవరైనా సరే ఆహారం మిగిలితే పడేయకుండా మాకు సమాచారం అందించండి. మా వలంటీర్లు వచ్చి సేకరించి పేదల కడుపు నింపుతారు.– మురళి, నో ఫుడ్ వేస్ట్ సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఆహారం మిగిలితే ఫోన్ చేయండి నంబర్లు: 98660 06269 కాల్సెంటర్: 90877 90877 -
‘వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం విశాఖ’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో... ప్రగతి భారత్ ఫౌండేషన్ పేరుతో విజయసాయిరెడ్డి ఎన్జీవో కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలోని ప్రముఖులతో కలిసి సంఘసేవలో భాగంగా ఎన్జీవోను ప్రారంభిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా సంస్థ కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. కోటి రూపాయల నిధితో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ కార్యక్రమాలను మొదటగా విశాఖలో ప్రారంభించి, ఆ తర్వాత రాష్ట్రమంతటా వ్యాప్తి చేస్తామని వెల్లడించారు. అదే విధంగా విశాఖ తీర ప్రాంతాన్ని కొబ్బరి మొక్కలు నాటి అభివృద్ది చేస్తామని, ఇప్పటికే తమ ట్రస్టు తరపున ఆర్కె బీచ్ వద్ద యాభై లక్షలతో కొబ్బరి మొక్కలను నాటడం జరిగిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేపట్టబోతున్నామని, దీని ద్వారా నాణ్యమైన విద్య, నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ నైపుణ్యంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య శిబిరాల ద్వారా అందరికీ వైద్యాన్ని చేరువ చేసేందుకు కృషి చేస్తామని.. అదేవిధంగా కార్పోరేట్ సంస్థలు కూడా సమాజాభివృద్దిపై దృష్టి సారించాలని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కాగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆయన చైర్మన్గా వ్యవహరించనున్నారు. -
'పల్లవిం'చిన సేవా స్ఫూర్తి
చక్కని ఉద్యోగం.. ఐదంకెల జీతం.. చేతి నిండా డబ్బు.. ఎంజాయ్ చేసే వయసు.. మనిషికి ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ ఇవన్నీ ఉన్నా ఆ యువతి మాత్రం నలుగురికి సాయం చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంది. అదే మానవ జన్మకు సార్థకమంటోంది. తండ్రి నుంచి సేవచేయడాన్ని వారసత్వంగా తీసుకున్న ఆమె పేరు ‘పల్లవి ప్రియ’. ఉత్తరప్రదేశ్లో పుట్టి పెరిగిన ఈమె సిటీలో ఇన్ఫోసిస్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అంతేకాదు.. ‘కాజ్ ఫర్ సెలబ్రేషన్’ పేరుతో ఓ ఎన్జీఓను నెలకొల్పి దాని ద్వారా వందలాది మందికి అండగా నిలుస్తోంది. సాక్షి,సిటీబ్యూరో: పల్లవి ప్రియ సిటీలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తునే అదే కంపెనీలోని సీఎస్ఆర్లో కోర్ మెంబర్గాను ఉంది. ఉత్తరప్రదేశ్లో చదువుకునే రోజుల్లో ఎన్ఎస్ఎస్ మెంబర్గా కాలేజీ అయ్యాక తన స్నేహితులతో కలసి సమీపంలోని బస్తీల్లో పర్యటించి అక్కడి వారి అవసరాలను గుర్తించేంది. అలా తన వద్దనున్న డబ్బులతో చేతనైన సాయం అందించేది. ఉద్యోగం వచ్చాక ఈసేవను మరింత విస్తృతం చేసింది. పల్లవిప్రియ చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. ప్రస్తుతం వర్షాకాలంలో రోడ్డుపై ఉండే చిరు వ్యాపారులు వర్షంలో తడుస్తునే తమ పనులు చక్కబెట్టుకోవడం చూసిన ఆమె ‘ఫుట్పాత్ వ్యాపారులకు పెద్ద పెద్ద గొడుగులను ఇవ్వాలనే లక్ష్యంతో నేను ఓ అడుగు వేస్తున్నా.. ఆసక్తి ఉన్నవారు నాతో చేయి కలపండి’ అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. అది జరిగి ఆరు గంటల్లో పదుల సంఖ్యలో ఆమెను సంప్రదించి నగర వ్యాప్తంగా ఫుట్పాత్పై ఉండే చిరు వ్యాపారులకు గొడుగులు పింపిణీ చేసే నగదు సమకూర్చుకుని వారిసి సాయం అందించింది. చిన్నారులకు బహుమతులు ఇస్తున్న పల్లవి ప్రియ ఒక్క రోజులో ఏడాదికి సరిపోయే బుక్స్ గత ఏడాది సెప్టెంబర్లో తన పుట్టిన రోజున నగరంలోని ఓ అనాథ ఆశ్రమానికి వెళ్లిన పల్లవి ప్రియ అక్కడి పిల్లలతో సరదాగా గడిపి, వారికి కడుపునిండా భోజనం పెట్టింది. తిరిగి వచ్చే సమయంలో వారంతా ‘అక్కా..మాకు నోట్ బుక్స్ లేవు, చదువుకోవడానికి, రాయడానికి చాలా ఇబ్బంది ఉంద’నడంతో అనాథ పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేసేందుకు దాతలు కావాలంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. కొన్ని గంటల్లోనే 12 మంది ముందుకు వచ్చారు. అక్కడి పిల్లలకు ఏడాది పాటు కావాల్సిన నోట్బుక్స్, బట్టలు, షూస్, ఇతరాత్ర అవసరాల కోసం సాయం అందించారు. మరోరోజు ఇన్ఫోసిస్ కార్యాలయానికి కొందరు పిల్లలు విజిటింగ్ కోసం వచ్చారు. ఆ సమయంలో వారి కాళ్లకు చెప్పులు లేవు. వారి వద్దకు వెళ్లి వారి గురించి ఆరా తీసింది పల్లవిప్రియ. వారంతా నిరుపేదలని తెలిసి రాచకొండ పోలీస్ కమిషనర్ సాయంతో ఆ రోజు అక్కడకు వచ్చిన పిల్లలందరికీ చెప్పులతో పాటు చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి వారిలో ఆనందాన్ని నింపింది. అంతేకాదు.. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ స్కూల్స్లో బెంచ్లు, ఫ్యాన్లు పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది పల్లవిప్రియ. ఈమెకు ప్రకృతి అంటే ఎంతో ప్రేమ. అందుకే పర్యావరణంపై శ్రద్ధను తీసుకుంటోంది. స్కూలు విద్యార్థులను కలిసి పర్యావరణం ప్రాముఖ్యతను వివరిస్తూ వారితో ఎస్సై రైటింగ్స్ పోటీలు నిర్వహిస్తోంది. వక్తృత్వ పోటీలు పెట్టి బహుమతులు సూతం ఇస్తోంది. ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల కలిగే అనర్థాలు వివరించి చెబుతోంది. పల్లవి ప్రియ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇన్ఫోసిస్ ఉన్నతోద్యోగలు, స్వచ్ఛంద సంస్థలు సైతం అభినందింది సత్కరించడం గమనార్హం. నాన్నే స్ఫూర్తి.. మా నాన్నకు ఇతరులకు సాయం చేయడం అంటే ఇష్టం. ఆయన మార్గంలోనే నేనూ నడుస్తున్నాను. సమాజానికి నా వల్ల ఏ విధమైన ఉపయోగం ఉంటుందనేది గుర్తించాను. అప్పటి నుంచే పేదలకు నాకు తోచిన విధంగా సాయం చేస్తున్నా. అందుకు ఫేస్బుక్ను వేదికగా చేసుకున్నా. నా సొంత డబ్బులతో పాటు నాకెంతో మంది అండగా నిలుస్తున్నారు. వారు ఇచ్చిన ప్రతి రూపాయికి బిల్లులతో సహా లెక్క కూడా చెప్తుంటాను. అందుకే సహాయం కోసం పోస్ట్ పెట్టిన ప్రతిసారీ నాకు తోడుగా ఎంతో మంది వెన్నంటి వస్తున్నారు. – పల్లవి ప్రియ, ఇన్ఫోసిస్ ఉద్యోగి -
‘సీఎం జగన్ నిర్ణయం హర్షనీయం’
సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం సంతోషమని, ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రత్యేక రవాణా విభాగాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. ఆంధ్రబ్యాంక్ పేరును యధావిధిగా ఉంచాలని చేసిన కేబినెట్ తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తునట్లు ప్రకటించారు. ఆశా కార్యకర్తల జీతాలు మూడు వేల నుంచి పది వేలకు పెంచడం అభినందనీయమన్నారు. -
కూన రవి అరెస్టుకు రంగం సిద్ధం
సాక్షి, శ్రీకాకుళం/విజయవాడ : ప్రభుత్వ ఉద్యోగిపై బెదిరింపులకు దిగిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అరెస్టుకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు రంగం సిద్ధం చేశారు. మండల అభివృద్ధి అధికారి అల్తాడు దామోదరరావు ఫిర్యాదు మేరకు రవికుమార్పై సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 353, 427, 506 ప్రకారం మంగళవారం కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కూన అమ్మినాయుడు, కూన సంజీవరావు, నందివాడ గోవిందరావు, పల్లి సురేశ్, గండెం రవి, తాడేల రమణ, యండ రామారావు, గుర్రాల చినబాబు, ఊడవల్లి రామకృష్ణ, అంబళ్ల రాంబాబు, బాన్న గురువులుపై కేసు పెట్టారు. కాగా, పోలీసులు అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో కూన రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. కూన రవికుమార్ అరెస్ట్ చేయాలి: ఏపీఎన్జీవో కూన రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలను ఏపీఎన్జీవో నేతలు ఖండించారు. టీడీపీ నేతలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారని ఉద్యోగుల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏకంగా ఓ ప్రభుత్వ ఉద్యోగిని చెట్టుకు కట్టేసి కొడతాననడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. కూన రవి వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే కూన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. (చదవండి: చెట్టుకు కట్టి కాల్చేస్తా; టీడీపీ నేత బెదిరింపులు) -
‘సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం’
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గర్తింపు ఇవ్వడాన్ని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండగా ఆయన సంతకం లేకుండా కొంతమంది అధికారులు రహస్యంగా గుర్తింపు ఇచ్చారని ఆరోపించారు. గుర్తింపు ఇచ్చిన అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం రోసా నిబంధనలను అనుసరించి ఎన్నికల ద్వారా నిర్వహణ సభ్యుల నియామకం చేపడుతుందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రోసా నిబంధనలు పాటించకుండా జీవో 103 ద్వారా గుర్తింపుకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఖండించారు. ప్రభుత్వం సంఘాలకు గుర్తింపు ఇవ్వడానికి తప్పనిసరిగా ఏపీ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి కమిటీ లో చర్చించాలని పేర్కొన్నారు. స్టాఫ్ కౌన్సిల్ లో ఎటువంటి సమాచారం లేకుండానే దొడ్డిదారిన 103 జీవోతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గుర్తింపు ఇచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే జీవో 103 రద్దు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆమే ఒక సైన్యం!
నగరానికి చెందిన ఈరంకి నాగభూషణం, జానకి దంపతులు కుమార్తె హారిక ఎంబీఏ పూర్తి చేసింది. ఓ పేరున్న కంపెనీలో ఉద్యోగాన్ని సైతం సాధించింది. ఉద్యోగంతో పాటు సేవా కార్యక్రమాలను సైతం చేయసాగింది. ఈ క్రమంలో సేవా కార్యక్రమాలకు ఉద్యోగం అడ్డుగా ఉందని భావించి దానికి రాజీనామా చేసి 2016లో ‘అనర్ఘ్య’ పేరుతో ఓ ఎన్జీఓను స్థాపించింది. హిమాయత్నగర్ :సమాజం మనకేమిచ్చిందన్నది కాదు.. సమాజానికి మనమేం చేశామన్నదే ప్రధానమంటోంది ‘అనర్ఘ్య’ ఎన్జీఓ వ్యవస్థాపకురాలు హారిక. యువతరం తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదంటోంది. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న ఎంతో మందికి రక్తదానం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నడుంకట్టింది. ఐదంకెల జీతాన్ని సైతం వదులుకుని సేవా దృక్పథంతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేద పిల్లలకు వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోందిఈరంకి హారిక. రక్తదానంతో ప్రాణదాత 2013లో ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి తాను రక్తం ఇచ్చి ఆదుకుంది. ఆ తర్వాత తండ్రి నాగభూషణం, తల్లి జానకి, సోదరుడు డాక్టర్ హరీష్, సోదరితో సైతం రక్తదానం చేయించింది. తన ఎన్జీఓ, మిత్రులు, వారి స్నేహితులు ద్వారా వందలాది మందికి రక్తదానం చేయించినట్లు హారిక పేర్కొంది. ఒక్క ఫోన్ కాల్తో నగరంతో పాటు, ఏపీలోని పలు ప్రాంతాల్లో రక్తం అందించేందుకు కృషి చేస్తూ ప్రాణదాతగా నిలుస్తోంది. పాఠశాలల్లో మరుగుదొడ్లు.. నగర శివారు ప్రాంతాలైన శివరాంపల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలను తాను సందర్శించిన సమయంలో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నట్లు గ్రహించిన హారిక. ఈ విషయమై ప్రభుత్వ అధికారులను నిలదీసింది. వారినుంచి నిధులు లేవనే సమాధానం రావడంతో.. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తన సొంత డబ్బులతో మరుగుదొడ్ల నిర్మించింది. నెలసరి సందర్భంగా ప్యాడ్లు కొనే ఆర్థిక స్థోమత లేని పలువుర విద్యార్థినులకు ఏడాదికి సరిపడా వాటిని ఉచితంగా పంపిణీ చేస్తోంది. 24 గంటల్లో తాగునీరు.. శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు లేకపోవడంతో.. విషయాన్ని అక్కడి విద్యార్థులు హారిక దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన హారిక అక్కడి ప్రధానోపాధ్యాయుడిని నిలదీసింది. స్పందన లేకపోవడంతో మండల విద్యాశాఖ అధికారిని అడగ్గా.. ఆయన నిధులు లేవన్నారు. పాఠశాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను కోరగా.. వారు కొత్త కనెక్షన్ కోసం రూ.78 వేలు అడిగారు. దీంతో ఆమె అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావుకు ఫోన్ చేసింది. ‘నేను మంత్రి హరీష్రావును మాట్లాడుతున్నా. మీరు ఏం చేస్తారో తెలియదు సదరు పాఠశాలకు 24 గంటల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలి’ అని అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో అధికారులు 24 గంటల్లోనే తాగునీటి వసతి కల్పించినట్లు హారిక వివరించింది. గతంలో పలువురు విద్యార్థులను ఆటో డ్రైవర్ల వేధింపుల నుంచి రక్షించింది. ఇలా ఎన్నో విధాలుగా సామాజిక సేవలో తరిస్తోంది నగర యువతి హారిక. -
ఎన్నికల బరిలో భార్యా బాధితుల సంఘం నేత
అహ్మదాబాద్ : ఎన్నికల బరిలో రాజకీయ నేతలే కాదు భిన్న రంగాలకు చెందిన వారూ తమ తలరాతను పరీక్షించుకుంటున్నారు. భార్యా బాధితుల సంఘం నేత సైతం గుజరాత్ నుంచి లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగారు. ఎన్నికల్లో తాను గెలుపొందితే భార్యల చేతిలో వేధింపులు ఎదుర్కొంటున్న పురుషుల గొంతును చట్టసభలో వినిపిస్తానని ఆయన హామీలు గుప్పిస్తున్నారు. అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి అఖిల భారత భార్య వేధింపుల వ్యతిరేక సంఘాన్ని నడుపుతున్న దశరధ్ దేవ్డా మంగళవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భార్యలు, అత్తింటి వేధింపులు ఎదుర్కొంటున్న మగవారి కోసం తన పోరాటం కొనసాగిస్తానని ఈ సందర్భంగా దేవ్డా పేర్కొన్నారు. కాగా గతంలో ఆయన 2014 లోక్సభ ఎన్నికల్లో, 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక దేవ్డా సంస్థలో 69,000 మంది సభ్యులున్నా గత ఎన్నికల్లో ఆయనకు గత లోక్సభ ఎన్నికల్లో కేవలం 2300 ఓట్లు రాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 400 ఓట్లే పోలయ్యాయి. అయితే ఇతర అభ్యర్ధుల మాదిరిగా తాను ప్రచారంపై ఖర్చు చేయనని, ఇంటింటికీ తిరిగి పురుషులకూ సమాన హక్కులు కల్పిస్తానని వాగ్ధానం చేస్తానని చెప్పుకొచ్చారు. జాతీయ పురుషుల కమిషన్ ఏర్పాటు చేయాలన్నది తన ప్రధాన డిమాండ్ అని చెప్పారు. -
ఎన్జీవో ఎన్నికల్లోనూ ‘ఏబీవీ’ జోక్యం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు తాబేదారులా మారిన ఇంటెలిజెన్స్ మాజీ బాస్ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) ఆ పోస్టులో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇంటెలిజెన్స్ బాస్గా తాను చేయాల్సిన ఉద్యోగం మానేసి అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు నుంచి డేటా లీకేజీ వరకూ బరితెగించి చేయడం.. చివరకు ఎన్నికల సంఘం ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బాస్గా ఆయన అరాచకాలు, ఒత్తిళ్లు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సీఎం అండ చూసుకుని ప్రతి పనిలో ఆయన వేలు పెట్టినట్టు విదితమవుతోంది. ఈ క్రమంలో 2 నెలలక్రితం రాష్ట్రంలో జరిగిన నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్(ఎన్జీవో) ఎన్నికలను సైతం ఆయన వదల్లేదని తాజాగా బయటపడింది. ఈ ఎన్నికల్లో ఉద్యోగులను బెదిరించి, సీఎం చెప్పినట్టు చేయాలని ఏబీవీ ఒత్తిడి తెచ్చినట్టు వెల్లడైంది. ఉద్యోగుల నిర్ణయం మేరకు ఎన్నిక జరగకూడదని, సీఎం చెప్పినవారు.. సీఎంకు అనుకూలంగా ఉండేవారే నాయకుడుగా ఉండాలని ఫోన్లో ఒత్తిడి తెచ్చారని తెలిసింది. సీఎం సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలంటూ ఒత్తిడి.. దాదాపు 2 నెలలక్రితం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న అశోక్బాబు పదవి నుంచి తప్పుకోవడంతో ఎన్జీవో ఎన్నికలకు తేదీ ఖరారు చేశారు. ఎన్నికలు జరగడానికి ఒకరోజు ముందు ఇంటెలిజెన్స్ బాసు కొంతమంది ఎన్జీవో నేతలకు ఫోన్ చేసి.. కావాలంటే అధ్యక్షుడు, మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకోండి గానీ, సెక్రటరీ జనరల్ పోస్టుకు మాత్రం సీఎం సామాజికవర్గానికి చెందిన పశ్చిమ, కృష్ణా బాధ్యతలు చూస్తున్న నాయకుడిని ఎంపిక చేయాలని, లేదంటే ఖాళీగా ఉంచాలని కోరారు. కీలకమైన ఆ పోస్టును ఎలా ఖాళీగా ఉంచుతామని, అలా చేయడానికి వీల్లేదని ఎన్జీవో నేతలు ఇంటెలిజెన్స్ చీఫ్తో చెప్పారు. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ చీఫ్ తెల్లవారుజాము 3 గంటల వరకూ ఫోన్లు చేస్తూనే ఉన్నారని, అలా కుదరదని ఎంతగా చెప్పినా బెదిరింపు ధోరణిలో మాట్లాడారని కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు తాజాగా వెల్లడించారు. సీఎం నియమించాలనుకున్న వ్యక్తి, ఇంటెలిజెన్స్ చీఫ్ ముందురోజు సీఎం చంద్రబాబు వద్ద సుమారు 3 గంటలపాటు సమావేశమయ్యారని, ఆ తర్వాత ఎన్జీవో ఎన్నికలపై దృష్టి సారించి బెదిరింపులకు దిగారని పలువురు ఉద్యోగులు తెలిపారు. కానీ సీఎంగానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ గానీ చెప్పినట్టుగా చెయ్యలేమని, మెజారిటీ ఉద్యోగుల నిర్ణయాన్ని బట్టే ఉంటుందని స్పష్టం చేసిన ఉద్యోగులు.. చివరకు తాము నిర్ణయించిన వారినే సెక్రటరీ జనరల్గా నియమించారు. సచివాలయ ఎన్నికల్లోనూ జోక్యం సీఎం స్థాయి వ్యక్తితోపాటు ఇంటెలిజెన్స్ చీఫ్... చివరకు 2 వేల మంది కూడా లేని సచివాలయ ఉద్యోగుల ఎన్నికల్లోనూ జోక్యం చేసుకున్నారంటే ఎంతగా దిగజారారో అర్థం చేసుకోవచ్చు. సచివాలయ ఉద్యోగుల సంఘానికి మురళీకృష్ణ, కె.వెంకటరామిరెడ్డి అధ్యక్ష స్థానానికి పోటీపడ్డారు. ప్రభుత్వానికి మురళీకృష్ణ అనుకూలంగా ఉన్నారని, వెంకటరామిరెడ్డి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎంకు నివేదించారు. దీంతో సీఎం చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు పోటీచేసిన ఇద్దరు నాయకులను తన చాంబర్కు పిలిపించుకున్నారు. ఈ చర్చల్లో స్వయానా ముఖ్యమంత్రే.. వెంకటరామిరెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీనికి వెంకటరామిరెడ్డి ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటానని, తన నిర్ణయంలో మార్పు ఉండబోదని కుండబద్దలు కొట్టేశారు. తన మాట వినలేదన్న ఉక్రోషంతో కొంతమంది మంత్రుల్ని సీఎం రంగంలోకి దించి ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసి వెంకటరామిరెడ్డిని ఓడించేలా చక్రం తిప్పారు. ఈ వ్యవహారం తెలుసుకున్న ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. ఒక ముఖ్యమంత్రి పాలనా వ్యవహారాలు వదిలేసి, సచివాలయ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదని, ఇంటెలిజెన్స్ చీఫ్కు ఈ ఎన్నికలతో ఏం పని ఉందని వారు మండిపడ్డారు. ఆ తర్వాత వెంకరామిరెడ్డిని అకారణంగా సస్పెండ్ చేసిన విషయమూ తెలిసిందే. ఇంకా ఏబీవీకే రిపోర్ట్ చేస్తున్నారు హైకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ ఇంటెలిజెన్స్ డీజీ పోస్టు నుంచి ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా.. ఇంటెలిజెన్స్ అధికారులు, ఇతర పోలీసులు ఆయనకే రిపోర్ట్ చేస్తున్నారని, అలా చేయకుండా ఆ అధికారుల్ని నిరోధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవట్లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు ఏబీకే రిపోర్ట్ చేస్తుండటం వల్ల ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగే అవకాశం ఉండబోదని, అందువల్ల అతనికి రిపోర్ట్ చేయకుండా చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో ఏరకంగానూ జోక్యం చేసుకోకుండా ఏబీని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. క్షేత్రస్థాయిలోనూ ఎలాంటి సమాచారాన్ని, నివేదికను ఏబీకి సమర్పించకుండా, ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు వచ్చిన నివేదికలను ఉపయోగించకుండా అతన్ని నిరోధించాలని కోరారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, ఎన్నికల సంఘం కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. అలాగే ఏబీ వెంకటేశ్వరరావును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు. అధికార దుర్వినియోగమే: ఏబీతోపాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలు అధికార టీడీపీ కోసం పనిచేస్తున్న నేపథ్యంలో వారిపై వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని, దాని ఆధారంగా ఆ ముగ్గురిని తప్పిస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చిందని నాగిరెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఎన్నికలు, రాజకీయపార్టీలకు సంబంధించి సేకరించిన సమాచారమంతటినీ ఏబీవీకి తెలియచేయాలని పోలీసు అధికారులందరికీ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారని, దీంతో వారంతా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని ఏబీవీకి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని వివరించారు. వాస్తవానికి ఇంటెలిజెన్స్ బాస్గా మరో అధికారి నియమితులయ్యారని, అయినప్పటికీ ఏబీ కే రిపోర్ట్ చేయాలనడం అధికార దుర్వినియోగమేనన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని నాగిరెడ్డి కోర్టును అభ్యర్థించారు. -
సమాజాభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర కీలకం
సాక్షి, హైదరాబాద్: సమాజాభివృద్ధిలో ఎన్జీవోల పాత్ర చాలా కీలకమైందని, మహిళల హక్కులు, అత్యాచారాలు లాంటి పలు అంశాలపై ఎన్జీవోలు పోరాడుతున్నారని బీజేపీ మహిళా జాతీయ మోర్చా అధ్యక్షురాలు విజయ రహత్కర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ‘ఎన్జీవోస్ మీట్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగ్రమూకలకు మోదీ వాళ్ల భాషలోనే సరైన సమాధానం చెప్పారన్నారు. ఎన్జీవోలు ఇచ్చే సలహాలను మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మోదీ తప్ప దేశానికి మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. మహిళల అభివృ ద్ధి, సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక పథకాలను చేపట్టి సమర్థంగా అమలు చేస్తున్నారని చెప్పారు. మహిళా పక్షపాతి మోదీ జాతీయవాద ఆలోచనలున్న వారందరూ బీజేపీలోకి రావాలని, ఎన్జీవోస్ నిస్వార్థంగా సేవ చేస్తూనే రాజకీయంగా రాణించాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. మోదీ మహిళా పక్షపాతి అని, రక్షణ శాఖ మంత్రి సహా పలు కీలక పదవులు మహిళలకు కేటాయించడమే ఇందుకు నిదర్శనమని కొనియాడారు. ఎన్జీవోలు చాలా మంచి పనులు చేస్తాయన్నారు. దేశం మొత్తం మీద కమలం వికసిస్తోందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. పాక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నా మన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ లు, మెరుపు దాడులను చేస్తూ ఉగ్రవాదులను తుదముట్టించే విధంగా మోదీ ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. సమాజ మార్పునకు ఎన్జీవోలు ప్రభుత్వంతో పాటు ఎన్జీవోలు సమాజ మార్పునకు కృషి చేస్తున్నారని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. కమర్షియల్గా కాకుండా పనిచేసే ఎన్జీవోలకు మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. అందరమూ కలసి మరోసారి మోదీని ప్రధాని చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఎమ్మెల్సీ రాంచందర్రావు, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యకురాలు ఆకుల విజయ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలి: లక్ష్మణ్ భారత వైమానిక దళం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడాన్ని దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ ఇకనైనా మానుకోవాలని పేర్కొన్నారు. ఇది ఒక దేశంపైనో, ప్రాంతంపైనో దాడి కాదని, దీనిని ప్రతీకార చర్యగా కాకుండా ఉగ్రవాదాన్ని అణిచివేసే చర్యగానే చూడాలని తెలిపారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి భారత సేనలు జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని వెల్లడించారు. -
సీపీఎస్ ఉచ్చులో ఉద్యోగులు విలవిల
‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు అంశం రాష్ట్రం చేతిలో లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సాధ్యమవుతుంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం తప్ప ఏమీ చేయలేను’–తిరుపతి ఎన్జీఓల మహాసభ సంద ర్భంగా సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలివి. ‘సీపీఎస్ రద్దు అంశం ఉద్యోగుల ప్రాథమిక హక్కు. ఆర్థిక భారమే అయినా ఉద్యోగులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. సీపీఎస్ కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాం’ ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి భరోసా. సీపీఎస్.. ప్రస్తుతం రాష్ట్రంలోని 1.60 లక్షల మంది ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది ప్రైవేటు సంస్థలకు కాసులు కురిపించే కార్పొరేట్ పెన్షన్ స్కీమ్ అంటూ ఉద్యోగులు దుయ్యబడుతున్నారు. ఈ సీపీఎస్ మాకొద్దంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ‘చలో పోరాడుదాం సమష్టిగా’ అంటూ సీపీఎస్కు కొత్త భాష్యం చెబుతున్నారు. పీఎఫ్ఆర్డీఏ, ఎన్ఎస్డీఎల్, సీఆర్ఏ అనే మూడు సంస్థల అధీనంలో సీపీఎస్ అమలవుతోంది. ప్రైవేటు కార్పొరేట్ శక్తుల అధీనంలో నడిచే ఈ మూడింటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీ లేదు. వీటి నిర్వహణా ఖర్చు కూడా ఉద్యోగుల ఖాతాల నుంచే వినియోగిస్తారు. నష్టాలు వస్తే ఉద్యోగులే బలికావడం, లాభాలు వస్తే ప్రభుత్వాలు బాగుపడటం తప్ప సగటు ఉద్యోగికి ఏ రకంగానూ లాభదాయకం కాదు. అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి మొదటినెల జీతం రావాలంటే విధిగా పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (పీఆర్ఏఎన్–ప్రాన్) పత్రాలపై సంతకాలు చేయాలనే షరతుతో సీపీఎస్లో నిర్బంధంగా చేర్పించారు. ఇదిలాఉంటే 2015 నుంచే సీపీఎస్పై వ్యతిరేకత పెల్లుబికింది. అనంతపురం జిల్లా గుమ్మఘట్టకు చెందిన కె.కన్నప్పరావు గ్రామరెవెన్యూ అధికారిగా 2016లో ఉద్యోగ విరమణ పొందారు. ఎనిమిదేళ్ల సర్వీసుకు అతనికి నెలకు కేవలం రూ. 668 మాత్రమే పింఛను జమయ్యింది. ప్రకాశం జిల్లా కొనకనమిట్లకు చెందిన టి. వెంకటాద్రి వీఆర్ఓగా పనిచేస్తూ 2011లో రిటైరయ్యారు. అతనికి ఎలాంటి పింఛనూ అందలేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 460 ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలు సీపీఎస్ బాధితులుగా మారాయి. దీంతో ఉద్యో గులు ఉద్యమబాట పట్టారు. ఇదిలా ఉండగా సీపీఎస్ రద్దులో జాప్యానికి ఉద్యోగ సంఘాల పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి. 2015లో సీపీఎస్ రద్దు అనే ఏకైక డిమాండ్తో ఏర్పడిన ఏపీసీపీఎస్ఈఏ తప్ప అన్ని సంఘాల నేతలు ప్రభుత్వానికి భజన చేస్తున్నారని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి బాజీ పటాన్ తప్పుబడుతున్నారు. తమిళనాడు, కర్ణాటకల్లో సంఘాలన్నీ ఏకమై సీపీఎస్ రద్దుకు సమ్మె చేస్తుంటే, ఇక్కడి నాయకులు మాత్రం నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్తో ఇవీ నష్టాలు 1. స్థిరమైన నెలరాబడి లేకపోవడం: పాత పెన్షన్ విధానంలో రిటైర్మెంట్ సమయంలో జీత భత్యాలలో 50 శాతం నెల ఆదాయం పొందేవాడు. వేతన సవరణ జరిగిన, కరువు భత్యం పెరిగిన సందర్భంలో అవి విశ్రాంత ఉద్యోగులకు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు వర్తిస్తాయి. సీపీఎస్లో ఇవేమీ వర్తించవు. 2. చందా పెన్షన్: పాత పెన్షన్ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ చేసినా, మరణించినా ఉద్యోగానికి అన ర్హుడిగా ప్రకటించినా, సస్పెండ్కు గురైనా ఏడు రకాల పెన్షన్లు అతని కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయి. కానీ సీపీఎస్లో పే/డీఏలలో 10 శాతం చందా తప్పనిసరిగా చెల్లిస్తేనే షేర్మార్కెట్ ఆధారిత పెన్షన్ సమకూరుతుంది. కానీ, షేర్మార్కెట్ తలకిందులైతే పెన్షన్ సొమ్ము గల్లంతే. అది కూడా 70 ఏళ్లవరకే వస్తుంది. పాత విధానంలో ఉద్యోగి చందా చెల్లింపు పద్ధతి లేదు. 3. గ్రాట్యుటీ: 2004 వరకు ఉద్యోగి పదవీ విరమణ పొందినా, మరణించినా నాలుగేళ్ల 240 రోజులు ఉద్యో గం చేసి ఉంటే 1972 యాక్ట్ ప్రకారం అతనికి గ్రాట్యుటీ వర్తిస్తుంది. ఉద్యోగి సర్వీసు కాలానికి అనుగుణంగా గరిష్టంగా 12 లక్షల వరకు గ్రాట్యుటీని చెల్లించే వీలుంది. సీపీఎస్లో ఇలాంటి సౌకర్యం లేదు. వీటితోపాటు పన్ను మినహాయింపుల్లోనూ నష్టపోయే ప్రమాదముంది. సీపీఎస్ జీఓలు 653, 654, 655 రద్దు చేయకుండా కేవలం అసెంబ్లీలో తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటుంది. సీపీఎస్ రద్దు కావాలంటే పీఎఫ్ఆర్డీఏని కేంద్రమే రద్దు చేయాలంటూ చెప్పుకొస్తోంది. దీనిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సీపీఎస్ రద్దు పెద్ద పనేం కాదు. దాదాపు 1.60లక్షల మంది ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయానికి సంకల్పించకుంటే మరిన్ని కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముంది. విచిత్రమేమిటంటే 2018 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చిన ఇదే తెలుగుదేశం పెద్దలు ఏపీలో అధికారంలో ఉండి మరీ కేంద్రంపై నెపం వేయడం హాస్యాస్పదమని వారు అంటున్నారు. (నేడు సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ ఏపీ ఉద్యోగుల ‘చలో అసెంబ్లీ’ ముట్టడి సందర్భంగా) -తిరుమల శ్రీనివాస్ కరుకోల హైదరాబాద్ ‘ మొబైల్ : 81438 14131 -
ఆరోగ్యానికి ‘టెన్’షన్
శాస్త్ర సాంకేతికత, విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయ్. మొండిరోగాలకు చికిత్స అందుబాటులోకి వస్తున్నా.. ప్రాణాంతక రోగాలూ పెరిగిపోతున్నాయ్. ఈ నేపథ్యంలో మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నడుం బిగించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 300కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ కోసం ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించింది. సార్వత్రిక ఆరోగ్య పథకాల కింద 100 కోట్ల మంది లబ్ధి పొందేలా ఈ ప్రణాళికను రచించింది. అత్యవసర చికిత్సలందించడం ద్వారా మరో 100 కోట్ల మందిని కాపాడటం, ఇంకో 100 కోట్ల మంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా చేయడమే ఈ ప్రణాళిక లక్ష్యం. 2019 సంవత్సరంలో డబ్ల్యూహెచ్వోతోపాటుగా ఎన్జీవోలు దృష్టి సారించాల్సిన పది ముప్పులను గుర్తించడం జరిగింది. 1 వాయు కాలుష్యం,వాతావరణ మార్పు వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారు. మరో వంద కోట్లమందికి పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గాలి కాలుష్యానికి సంబంధించి సురక్షిత స్థాయి అంటూ లేదు. కాలుష్యం ఏమాత్రం ఉన్నా అది ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. అందుకే.. వాయు కాలుష్యం ‘సరికొత్త పొగాక’ంటూ డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ట్రెడాస్ అధన్మన్ అభివర్ణించారు. 2 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లేమి భారతదేశంలో చాలా చోట్ల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఇండియా స్పెండ్ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యంగా ఉండడమన్నది కేవలం రోగాలు రాకుండా ఉండేందుకు మాత్రమే కాదు. కనీస వైద్య సదుపాయం ప్రజల హక్కు 40 ఏళ్ల క్రితమే 1978 నాటి ‘అల్మా–అటా డిక్లరేషన్’ ప్రకటించింది. 2018 అక్టోబర్ 26న ఈ డిక్లరేషన్ను పునరుద్ఘాటిస్తూ 197 దేశాలు సంతకాలు చేశాయి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించేందుకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను పటిష్టం చేస్తామని ఆ దేశాలు ప్రతినబూనాయి. 3 ఇన్ఫ్లూయెంజా (ఫ్లూ వైరస్) ఈ వైరస్ ఎవరిపై ఎప్పుడు విజృంభిస్తుందో అంచనాకు చిక్కడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వర్ధమాన దేశాల్లో ఈ వ్యాధి వైరస్ నిర్మూలనకు డబ్ల్యూహెచ్వో వివిధ దేశాలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టింది. 4 ఆరోగ్య సదుపాయాల లేమి ప్రపంచ జనాభాలో 22% మంది సరైన వైద్యసదుపాయాలు అందని ప్రాంతాల్లో ఉన్నారు. వీరికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కూడా అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దుర్భిక్షం, కరువు, అంతర్గత ఘర్షణల కారణంగా వీరు కనీస ఆరోగ్య సంరక్షణ పొందలేకపోతున్నారని, ఫలితంగా వివిధ వ్యాధులబారిన పడుతున్నారని తెలిపింది. 5 యాంటీబయోటిక్లు పనిచేయకపోవడం రోగాల నివారణ కోసం అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ను వాడటం వల్ల కొంత కాలానికి రోగ కారక క్రిములు వాటిని తట్టుకునే శక్తిని సంపాదించుకుంటాయి. ప్రపంచంలో యాంటీబయోటిక్లను దుర్వినియోగం చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. 2000–2015 మధ్య కాలంలో భారత్లో యాంటీబయోటిక్ల వినియోగం 103% పెరిగిందని ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ (పీఎన్ఏఎస్) నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో వివిధ ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా విస్తరిస్తోందని ఆ నివేదిక వెల్లడించింది. 6 ఎబోలా వంటి ప్రాణాంతక వ్యాధులు 2018 నవంబర్లో కాంగోలో ఎబోలా వ్యాధి ప్రబలి 426 మంది చనిపోయారు. కాంగోకు ఎబోలా ముప్పు పొంచి ఉందని 2018 మేలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసే ఎబోలా వంటి వ్యాధులను డబ్ల్యూహెచ్వో ముందే గుర్తించి హెచ్చరిస్తోంది. 7 అంటువ్యాధులు కానివి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈరకమైన వ్యాధులకు గురవుతున్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏ వయసులోనైనా ఈ వ్యాధులు రావచ్చునని డబ్ల్యూహెచ్వో ఓ నివేదికలో పేర్కొంది. గుండె జబ్బులు, కేన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక అనారోగ్యం వంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటివల్ల ఏటా 4.1 కోట్ల మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే మరణాల్లో 71% వాటా ఈ వ్యాధులదేనని ఆ నివేదిక తెలిపింది. మద్యం, పొగాకు వినియోగాన్ని మానేయడం, శారీక శ్రమ/వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 8 డెంగ్యూ ప్రపంచ జనాభాలో సగానికిపైగా డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏటా 5 నుంచి 10 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నట్లు వెల్లడించింది. 2020 నాటికి డెంగ్యూ మరణాలను 50% తగ్గించేందుకు డబ్ల్యూహెచ్వో ఓ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. 9 హెచ్ఐవీ ఎయిడ్స్గా పిలిచే మహమ్మారి హెచ్ఐవీ నివారణకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2030 నాటికి ఎయిడ్స్ రహిత ప్రపంచంగా అన్ని దేశాలు కృషిచేస్తున్నాయని యునిసెఫ్ గతేడాది నివేదికలో పేర్కొంది. 2018–2030 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 3.6 లక్షల మంది ఎయిడ్స్తో మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. తగిన నివారణ చర్యలు తీసుకుంటే ఏటా 20 లక్షల మందిని ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడొచ్చని పేర్కొంది. 10 టీకాలంటే భయం వివిధ వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకాలు వేయడం సాధారణం. అయితే.. చాలా మంది అపోహలు, భయాల వల్ల టీకాలు వేయించుకోవడానికి వెనకాడుతున్నారని డబ్ల్యూహెచ్వో తెలిపింది. టీకాల ద్వారా ఏటా 20–30 లక్షల మరణాలను నివారించవచ్చని పేర్కొంది. 2019లో హెచ్పీవీ వ్యాక్సిన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెర్వికల్ కేన్సర్ను రూపుమాపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రణాళికలు వేస్తోంది. -
అన్నార్తులకు అండగా..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పెద్దహోటళ్లలో మిగిలిపోతున్న ఆహార పదార్థాలు రోజుకు దాదాపు 400 టన్నులు. వీటితో సహా చిన్న హోటళ్లు.. మెస్లు ఇతరత్రా ప్రాంతాల్లో వెరసి రోజుకు సగటున 1000 టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. వాటిని చెత్త కుప్పల్లో వేయడమో, బల్క్గార్బేజిలో కలిపి పంపడమో చేస్తున్నారు. మిగిలిపోతున్న ఈ ఆహారాన్ని పరిశుభ్రంగా ఉంచితే..పాడవకముందే తగిన జాగ్రత్తలతో ఫ్రిజ్లలో నిల్వచేస్తే ఆకలితో ఉన్నవారికిఆలోచించిన ఓ ఎన్జీఓ సంస్థ ఇలాంటి ఆహారాన్ని భద్రపరిచేందుకు పది పెద్ద (530 లీటర్ల సామర్ధ్యం) ఫ్రిజ్లు కొనుగోలు చేయాలని భావించింది. జీహెచ్ఎంసీ సహకరిస్తే పది ప్రాంతాల్లో వాటిని ఉంచుతామని, ఫ్రిజ్ల రక్షణకు అవసరమైన షెల్టర్లను తాము నిర్మిస్తామని, ఫ్రిజ్ల నిర్వహణకు అవసరమైన స్థలమిచ్చి, విద్యుత్ చార్జీలు మాత్రం జీహెచ్ఎంసీ చెల్లించాల్సిందిగా కోరింది. హోటళ్ల వారే కాక పెళ్లిళ్లు, ఇతరత్రా ఫంక్షన్ల విందు సందర్భంగా మిగిలిపోయే ఆహార పదార్థాలు సైతం ఈ ఫ్రిజ్లలో ఉంచవచ్చు. తద్వారా ఎంతో ఆహారం వృథా కాకుండా ఉండటమే కాకుండా అన్నార్తుల ఆకలి తీరుస్తుందని భావించిన జీహెచ్ఎంసీ వెస్ట్జోన్ కమిషనర్ హరిచందన ఈ ప్రతిపాదనను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ముందుంచారు. అందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు సంబంధించి ముందుకొచ్చిన ఎన్జీఓ సంస్థ ‘యాపిల్హోమ్’, జీహెచ్ఎంసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. ప్రస్తుతానికి పెద్దహోటళ్లున్న ప్రాంతాలను, ఆకలిగొన్నవారు ఎక్కువగా ఉండే పది ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసినట్లు హరిచందన తెలిపారు. ఎంపిక చేసిన పది ప్రాంతాలు.. 1. శిల్పారామం (ఎయిర్పోర్ట్ బస్టాండ్ ఎదుట) 2. ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి 3. చిరంజీవి బ్లడ్బ్యాంక్, జూబ్లీహిల్స్ 4. ట్రైడెంట్ (బిర్యానీస్ ఎదుట) 5.రత్నదీప్, మాదాపూర్ 6 ఈఎస్ఐ హాస్పిటల్ 7. నిలోఫర్ హాస్పిటల్ 8. చందానగర్ మెట్రోస్టేషన్ 9. ఇండో –అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 10. గచ్చిబౌలి సిగ్నల్ బిర్యానీస్ ఎవరైనా తినవచ్చు: హరిచందన,జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ ‘ఫీడ్ ది నీడ్’ పథకం పేరిట ఏర్పాటయ్యే ఈ కేంద్రాల్లోని ఆహారాన్ని యాచకులు, బీదలే కాక ఆకలితోఉన్న ఎవరైనా తినవవచ్చు. ఇంట్లో ఫ్రిజ్లోని ఆహారాన్ని ఎలా తీసుకుంటారో కావాల్సిన వారు అలా వెళ్లి తీసుకోవచ్చు. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నాక, యోగ్యమైన ఆహారమని గుర్తించాకే ఫ్రిజ్లో ఉంచుతాం. జీహెచ్ఎంసీ వైద్యాధికారులు ఆడపాదడపా ఆహారపదార్థాల్ని పరీక్షిస్తారు. వీటిని ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ‘యాపిల్ హోమ్’, జీహెచ్ఎంసీ లోగోలుంటాయి. క్రమేపీ మొబైల్ వాహనాలు కూడా అందుబాటులోకి తెచ్చి..ఎక్కడైనా ఎక్కువ ఆహార పదార్థాలున్నట్లు సమాచారమందిస్తే ఈ వాహనాలను అక్కడకు పంపి ఆహారం సేకరిస్తాం. సమాచారమిచ్చేవారి కోసం ఏదైనా ప్రత్యేక ఫోన్ నెంబర్ కానీ..జీహెచ్ఎంసీ కాల్సెంటర్ నెంబర్ను కానీ వినియోగించుకుంటాం. వాల్ ఆఫ్ కైండ్నెస్..లూ కేఫ్ల తరహాలో? ఆశయం, ఔదార్యం బాగానే ఉన్నప్పటికీ ఇది ఎంతమేరకు విజయవంతమవుతుంది.. దీని వెనుక మరో ఆలోచన లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీహెచ్ఎంసీ ఏడాది కిందట ‘వాల్ ఆఫ్ కైండ్నెస్’పేరిట ఎవరైనా తమ ఇంట్లోని తాము వాడని వస్తువులను వాల్ ఆఫ్ కైండ్నెస్ గోడల వద్ద వదిలి వెళ్లవచ్చునని పేర్కొంటూ అన్ని సర్కిళ్లలో పెయింటింగ్లు వేయించింది. ఇది కొంత విఫలమైంది. ఈ ప్రాంతాల్లోనే ఇప్పుడు ‘ఫుడ్ కోర్టులు’ ఏర్పాటు చేస్తారు. ఇక లగ్జరీ టాయ్లెట్లపేరిట లూకేఫ్ అనే ఏజెన్సీ ఏర్పాటు చేసిన పథకం కూడా విఫలమైందనే చెప్పొచ్చు. ఇప్పుడు ‘ఫీడ్ ది నీడ్ ’ ఏమవుతుందో వేచి చూడాలి. -
వివాదాస్పదంగా మారిన అశోక్ బాబు వీఆర్ఎస్
సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవో స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) వివాదాస్సందంగా మారింది. నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ల వ్యవహారంలో అశోక్ బాబుకు విచారణాధికారి క్లీన్ ఎక్విడిక్ట్ ఇవ్వడంపై ఎన్జీవో నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్లీన్ ఎక్విడిక్ట్ను అడ్డుపెట్టుకొని అశోక్బాబు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని కమర్షియల్ టాక్స్ ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మేరకు కమర్షియల్ టాక్స కమిషనర్కు ఎన్జీవో నేతలు ఫిర్యాదు చేశారు. అశోక్ బాబుపై పలు కేసులు పెడింగ్లో ఉన్నాయని డీసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెన్షన్ రూల్ 44 ప్రకారం అశోక్కు వీఆర్ఎస్ ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. -
ఈ మహిళ బిల్ గేట్స్ చేత కన్నీరు పెట్టించింది..
నిశబ్దంగా ఉన్న ఆ గదిలో ఓ విదేశీ జంటకు ఎదురుగా కొందరు మహిళలు కింద కూర్చున్నారు. వారిలో ఓ మహిళ మాట్లాడటం ప్రారంభించింది. ‘ఒంటరిదాన్ని.. నాకో కూతురు. తనను పోషించాలి. తనకు మంచి జీవితం ఇవ్వాలి.. గొప్ప చదువులు చదివించాలి. వీటన్నింటిని ఎలా నెరవేర్చాలి.. నాకు చదువు లేదు.. పది ఇళ్లలో పాచి పని చేస్తే.. నాకు వచ్చే మొత్తం చాలా తక్కువ. దొంగతనాలు, దోపిడీలు నాకు చేతకావు. కానీ కళ్ల ముందు నా కూతురి ఉజ్వల భవిష్యత్ నాకు కనిపిస్తోంది. అది నిజమవ్వాలంటే నాకు డబ్బు కావాలి. అలాంటి పరిస్థితుల్లో నేనేం చేయాలి.. ఓ మార్గం కనిపించింది. తప్పని తెలుసు.. కానీ తప్పదు. నాకు బురదంటుకున్న పర్వాలేదు.. నా కూతురి జీవితం వికసించాలి. అంతే.. ఆ ముళ్ల బాటలోనే నడవడం ప్రారంభించాను. నా కూతురి కోసం నా శరీరాన్ని అమ్ముకుంటున్నాను’. ‘కానీ మనసులో ఓ భయం. ఈ విషయం నా కూతురికి తెలిసిన రోజు నా పరిస్థితి ఎలా ఉంటుంది. ఈ ఊహ కూడా నాకు చాలా భయంకరంగా తోచేది. అలా భయపడుతూనే.. నా కూతురికి తెలియకుండా జాగ్రత్త పడుతూనే.. ఈ వృత్తిలో కొనసాగాను. కానీ ఈ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచలేపోయాను. నా కూతురి స్నేహితులకు నేను చేసే పని గురించి తెలిసింది. దాంతో వారు తనను సూటిపోటి మాటాలతో వేధించడం ప్రారంభించారు. హైస్కూల్ చదువులు చదువుతున్న నా చిట్టితల్లి.. ఈ పాడు తల్లి మూలంగా ఎదరవుతోన్న అవమానాల్ని తట్టుకోలేకపోయింది. చివరకూ ఓ రోజు ఇంట్లో తన శవాన్ని చూడాల్సి వచ్చింది. నా బంగారు తల్లి ఉన్నతంగా ఎదగాలని ఈ రొంపిలోకి దిగాను. కానీ నేడు నా చిట్టి తల్లి ఎవరికి అందనంత దూరం వెళ్లింది. నాకు ఈ జన్మకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇందుకు నేను ఎవరిని నిందించాలి’ అంటూ విలపిస్తుంది. ఆ మహిళ కష్టం అక్కడ ఉన్న వారితో కూడా కంటతడి పెట్టించింది. అలా ఏడ్చిన వారిలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స కూడా ఉన్నారంటున్నారు అశోక్ అలెగ్జాండర్. సదరు మహిళల ముందు కూర్చున్న విదేశీ జంట మరేవరో కాదు ప్రపంచ కుబేరుడు బిల్ - మిలిందా గేట్స్ దంపతులు. గేట్స్ ఫౌండేషన్ ‘హెచ్ఐవీ / ఎయిడ్స్’ ప్రివెన్షన్ కోసం ప్రారంభించిన ‘అవహాన్’ ప్రోగ్రాం హెడ్గా పదేళ్లుగా పని చేస్తున్నారు అశోక్. ఈ 10 ఏళ్లలో తాను చూసిన సెక్స్ వర్కర్ల గురించి, వారి నేపథ్యాలు, జీవన విధానాల గురించి తెలుపుతూ ‘ఏ స్ట్రేంజ్ ట్రూత్ : లెసన్స్ ఇన్ లవ్.. లీడర్షిప్ అండ్ కరేజ్ ఫ్రమ్ ఇండియన్ సెక్స్ వర్కర్స్’ అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు అశోక్. అంతేకాక ఈ ఎయిడ్స్ మహమ్మారి నివారణ విషయంలో భారత్ ఎలా విజయాన్ని సాధించిందో తెలపడమే కాక బాధితుల జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు గురించి కూడా అశోక్ ఈ పుస్తకంలో వివరించారు. ఈ బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఇందులోని పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో బిల్ గేట్స్ చేత కంటతడి పెట్టించిన మహిళ దీన గాధను కూడా ఈ పుస్తకంలో పొందు పరిచినట్లు తెలిపారు అశోక్. ఆ నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ.. సదరు మహిళ చెప్పినదాన్ని విన్న తర్వాత మిలిందా గేట్ అక్కడ ఉన్న మిగతా మహిళలను ఒక ప్రశ్న అడిగింది. ‘ఇందులో ఎంత మంది జీవితాల్లో ఇలాంటి కష్టాలు ఉన్నాయ’ని ప్రశ్నించింది. దానికి వారు ‘మా అందరివి ఇలాంటి గాధలేనని’ తెలిపారు. అప్పుడు పక్కనే ఉన్న బిల్గేట్స్ తల కిందకు దించుకుని కన్నీరు పెట్టడం తాను చూశానని అశోక్ తెలిపారు. 2000 సంవత్సరంలో బిల్ - మిలిందా గేట్స్ దంపతులు ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు జరిగింది ఈ సంఘటన. ఇక అశోక్ గురించి వస్తే ఉన్నత ఉద్యోగాన్ని వదులుకుని ‘అవహాన్’తో పనిచేయడానికి ముందుకు వచ్చారు. గత పదేళ్లగా దీనికి హెడ్గా పనిచేస్తున్నారు. తన పూర్తి జీవితాన్ని వీరి కోసమే కేటాయించాడు. ఈ సమస్య గురించి అశోక్ ‘ఇది జీవితాలను పిండి చేసే ప్రదేశం.. ఇక్కడ మహిళలు రూ. 50 కోసం తమను తాము అమ్ముకుంటారు.. ఇక్కడ 14 ఏళ్ల వారికి డ్రగ్స్ ఇంజక్షన్లు ఇచ్చి బలి పశువులుగా మారుస్తారు. ఇదో చీకటి ప్రపంచం. ఇక్కడ ట్రాన్స్జెండర్లుగా పుట్టడంం.. గేల మధ్య ప్రేమ మహా పాపం. మర్చిపోయిన రహదారుల వెంట ప్రయాణం చేసే ట్రక్కుల వింత ప్రపంచం ఇది. ఇవే కాక గౌరవప్రదమైన జీవితం కోసం నిత్యం యుద్దం జరిగే ప్రదేశం. వారందరికిదే జీవనం.. జీవితం. శరీరం పావుగా మారే వేళ ఇక్కడ ఆత్మ పవిత్రత కోసం పరితపిస్తింటుంది’ అంటూ సెక్స్ వర్కర్ల దయనీయ జీవితాల గురించి ఈ పుస్తకంలో చెప్పుకొచ్చారు అశోక్. -
ఇచ్చి... పుచ్చుకుంటే సంతృప్తి!
అందరిలోనూ లేకపోవచ్చు కానీ... సామాజిక సేవ చేయాలని, ఇతరులకు తమ వంతు తోడ్పాటునివ్వాలన్న ఆలోచన, ఆసక్తి ఉన్న వారు కూడా మన మధ్య చాలామంది ఉన్నారు. మనసులో కోరిక ఉన్నా... సమయాభావం, దూరాభారాలు, వ్యక్తిగత బాధ్యతలు తదితర అంశాలు చాలా మందిని దాతృత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నాయన్నది కాదనలేం. ఈ సమాజం నుంచి ఆర్జించిన దానిలో కొంత మొత్తాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా కొంతయినా రుణం తీర్చుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ‘‘సమాజం మనకు ఏమిచ్చిందన్నది కాదు... మనం సమాజానికి ఏమిచ్చాం?’’ అన్నదే ముఖ్యమన్న డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఎవరికి తోచినంత వారు విరాళంగా ఇవ్వొచ్చు. కష్టపడి మీరు సంపాదించినది ఇతరుల జీవితాలను నిలబెడుతుందంటే అందులో ఉన్న సంతృప్తే వేరు కదా! ఇలా దాతృత్వ కార్యక్రమాల కోసం చేసే విరాళాల వల్ల పన్ను పరిధిలోకి వచ్చే వారికి ప్రత్యేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఎవరికి...? ఎన్నో సామాజిక కార్యక్రమాల కోసం ఏర్పాటైనవే స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు). ఇవి ప్రజల నుంచి విరాళాలు సమీకరిస్తుంటాయి. ఈ తరహా ఎన్జీవోల గురించి తెలిసి ఉంటే, వాటికి నేరుగా విరాళాలు అందించొచ్చు. కాకపోతే ఇచ్చే ముందు ఆయా సంస్థల చరిత్రను, చేస్తున్న కార్యక్రమాల వివరాలను ఒకటి రెండు సార్లు పరిశీలించడం మర్చిపోవద్దు. మీరు ఎంచుకున్న ఎన్జీవోలకు చేసే విరాళాలపై ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80జీ ప్రయోజనానికి అర్హత ఉందా? సదరు ఎన్జీవో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద అనుమతి పొందిందా? అన్నది చూడాలని నిపుణుల సూచన. ఎన్జీవోల ట్రస్టీలు ఎవరు, గత కాలం పనితీరుపై మీడియా కథనాలు కూడా పరిశీలించాలి. ఎన్జీవోలు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు హాజరుకావడం ద్వారానూ కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఓ స్వచ్ఛంద సంస్థ పనితీరు, ఇతర వ్యవహారాల వివరాలు తెలుసుకోలేకపోతే, తగినంత సమయం లేకపోతే, ఎవరికి విరాళం ఇవ్వాలన్నదానిపై స్పష్టత రాకపోతే... ఎడెల్గివ్ ఫౌండేషన్, గివ్ ఇండియా వంటి మధ్యవర్తిత్వ స్వచ్ఛంద సంస్థలను పరిశీలించొచ్చు. మీరు ఈ సంస్థలకు విరాళం అందిస్తే... అవి అర్హత కలిగిన ఎన్జీవోలకు నిధులను అందిస్తాయి. ‘‘ఎన్జీవోలకు నిధులు అందిస్తుంటాం. ఎన్జీవోల కార్యక్రమాలకు చేయూతనిస్తాం. అంతేకాదు దాతలను ఎన్జీవోలతో మా వేదిక ద్వారా అనుసంధానించి విరాళాలు ఇచ్చే అవకాశం కల్పిస్తాం’’ అని ఎడెల్గివ్ ఫౌండేషన్ సీవోవో నగ్మాముల్లా తెలిపారు. కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేది ఒకానొక స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ప్రిన్సిపాళ్లు, టీచర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా నాణ్యమైన విద్య కోసం కృషి చేస్తోంది. ఇందుకోసం అవసరమైన నిధుల సాయాన్ని ఎడెల్గివ్ ఫౌండేషన్ ద్వారా విరాళాల రూపంలో పొందుతోంది. విరాళాలను కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు ఇవ్వడంతోనే సరిపుచ్చకుండా, టీచర్ల శిక్షణ కోసం అవసరమైన వనరులను కూడా ఎడెల్గివ్ సమకూర్చింది. అలాగే, దాతృత్వ సంస్థ ‘దస్రా’ కూడా భిన్న రకాల స్వచ్ఛంద సంస్థలకు సహకారం అందిస్తోంది. పారిశుద్ధ్యం, విద్య, పరిపాలన, జీవనోపాధి మెరుగుదల వంటి కార్యక్రమాల కోసం సహకారం అందిస్తోంది. విరాళాలు ఇచ్చే వారు ఇందులో దేనికోసం వినియోగించాలో చెప్పి మరీ అందించే అవకాశం కూడా ఉంది. ఇవీ అనుకూలతలు... ఎడెల్గివ్, దస్రా వంటి సంస్థలకు విరాళాలిచ్చే ముందు... ఈ స్వచ్ఛంద సంస్థల నిధుల వినియోగం తీరు, ప్రాజెక్టుల కాల వ్యవధి తదితర అంశాలను పరిశీలించుకునే అవకాశం అయితే ఉంది. విరాళాలు అందించే దాతలకు చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు అవి చేపడుతున్న పలు కార్యక్రమాలపై తాజా సమాచారాన్ని ఈ మెయిల్స్, పోస్ట్ ద్వారా అందిస్తుంటాయి. తాము ఇస్తున్న డబ్బులను ఎందుకోసం, ఏ విధంగా ఖర్చు చేస్తున్నాయో తెలుసుకునేందుకు నేరుగా క్షేత్ర స్థాయిలో సందర్శించి చూసుకునే అవకాశం కూడా కల్పిస్తుండడం గమనార్హం. దీనివల్ల తమ కష్టార్జితం విరాళంగా ఇవ్వడం వల్ల అవి మంచి పనులకు ఏ విధంగా వినియోగమవుతున్నాయో చూసి సంతృప్తి పొందే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఆత్మ సంతృప్తికి తోడు ఆదాయపన్ను చట్టం కింద మినహాయింపులు కూడా సొంతం చేసుకోవచ్చు. సెక్షన్ 80జీ ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ఏ సంస్థకు విరాళం ఇచ్చారన్న దానిపై ఈ మొత్తం ఆధారపడి ఉంటుంది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి, జాతీయ క్రీడా నిధి, జాతీయ సాంస్కృతిక నిధి, నేషనల్ డిఫెన్స్ ఫండ్లకు చేసే విరాళాలపై గరిష్ట పరిమితి లేకుండా పూర్తి మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్, ప్రధానమంత్రి కరువు సాయ నిధికి చేసే విరాళంలో 50 శాతానికి పన్ను మినహాయింపు ఉంది. ఇలా 100 శాతం, 50 శాతం పన్ను మినహాయింపులు లభించే ఇతర విరాళాలు కూడా ఉన్నాయి. కాకపోతే విరాళం ఇచ్చే వారి వార్షిక స్థూల ఆదాయంలో 10 శాతానికి సమానంగా పన్ను మినహాయింపు పొందొచ్చు. పన్ను మినహాయింపు పొందాలనుకునే వారు ఎన్జీవోలకు ఇచ్చే విరాళాలకు రసీదులు తీసుకోవడం మర్చిపోరాదు. రసీదులో సంస్థ పేరు, చిరునామా, పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్తోపాటు విరాళం ఇచ్చిన వారి పేరు, ఎంత మొత్తం అనే వివరాలు తప్పకుండా ఉండాలి. -
మద్యం తాగి చిందేసిన ఎన్జీఓ నేతలు
పోలవరం రూరల్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం గ్రామంలో ఏపీ ఎన్జీఓ నాయకులు శనివారం రాత్రి మద్యం తాగి చిందులు వేశారు. శనివారం ఉదయం పోలవరం పనులను పరిశీలించడంతో పాటు ప్రాజెక్ట్ ప్రాంతంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఏపీలోని 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక రెస్ట్హౌస్లో వారంతా మద్యం తాగి, సినిమా పాటలకు చిందులు వేశారు. ఆదర్శంగా ఉండాల్సిన ఉద్యోగులు బహిరంగంగా మద్యం సేవించి కిక్కులో మునిగితేలడం విమర్శలకు తావిస్తోంది. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు కూడా పాల్గొన్నారు. ఆదివారం ఉదయం వీరంతా టూరిజం బోట్లలో పేరంటాలపల్లి, పాపికొండలు తదితర ప్రాంతాల్లో పర్యటించి గోదావరి అందాలను ఆస్వాదించారు. -
బ్యాంక్ ఖాతాలు తెరవండి
న్యూఢిల్లీ: విదేశీ విరాళాలు స్వీకరించే ఎన్జీవోలు, వ్యాపార సంస్థలు, వ్యక్తులు నెలలోగా ప్రభుత్వం నిర్దేశించిన 32 బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. పారదర్శకత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఖాతాలను ప్రజా ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (పీఎఫ్ఎంఎస్)తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) 2010 ప్రకారం విదేశీ విరాళాలను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు వాడకూడదని తెలిపింది. కేంద్రం నిర్దేశించిన బ్యాంకుల్లో ఎస్బీఐ, విజయ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐడీబీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 10వేల ఎఫ్ఆర్సీఏ గుర్తింపు పొందిన ఎన్జీవోలు ఉన్నాయి. -
ఎన్జీవోలు లెక్కలు చెప్పాల్సిందే
విశ్లేషణ ఎన్జీవో గానీ లేదా రాజకీయ పార్టీ గానీ పాన్ కార్డును, ఐటీ నివేదికలను దాచుకోవడం సరికాదు. ఈ వివరాలు ఇవ్వడం వల్ల ఎన్జీవోల విశ్వసనీయత పెరుగుతుంది. వాటిని దాచడం అనుమానాలను రేకెత్తిస్తుంది. జమ్మూకశ్మీర్లోని ఒక ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) రాజీవ్ గాంధీ జాతీయ బాలల పోషక పథకం కింద కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు నుంచి సాయం పొందుతున్నదనీ, ఆ సంస్థ వివరాలు కావాలని అశోక్ కుమార్ ఆర్టీఐ కింద కోరారు. ఆ ఎన్జీవో రిజిస్ట్రేషన్ ప్రతి, పాన్ (ఆదాయపు పన్నుకు సంబంధించిన గుర్తింపు) కార్డు, ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 12ఎ ఎ, రిజిస్ట్రేషన్, 80జి రిజిస్ట్రేషన్, మేనేజింగ్ కమిటీ సభ్యుల పేర్లు, వారి ఆదాయవ్యయాల వార్షిక నివేదికలు, ఆదాయం పన్ను అంచనా వివరాలను అడిగారు. ఈ సమాచారం మూడో వ్యక్తికి చెందినదంటూ డిప్యుటీ డైరెక్టర్ అందుకు నిరాకరించారు. ఆ రాష్ట్రంలో ఎన్నో ఎన్జీవోలు ఆదాయం పన్ను రిటర్న్లను దాఖలుచేయడం లేదనీ, వాటి ఆదాయం పన్ను మదింపు ఎలా జరుగుతున్నదో తెలియడం లేదని, ఆదాయం పన్ను చట్టం సవరణ తరువాత సంస్థలు రూ. 2,000 కన్నా ఎక్కువ డబ్బును నగదు రూపంలో విరాళంగా తీసుకోవడానికి వీల్లేదు. వారు తీసుకున్న విరాళాల వివరాలను ఇవ్వాలని దరఖాస్తుదారు కోరారు. ఆయన అడిగిన సమాచారం మూడో వ్యక్తి సమాచారం ఎందుకయిందో, అది వ్యక్తిగత సమాచారమే అయినా అందులో ప్రజాప్రయోజనం ఉందో లేదో విచారించారా? అనే అంశాలపై∙ప్రజా సమాచార అధికారి ఏ వివరణా ఇవ్వలేదు. ఆర్టీఐ కింద అడిగిన సమాచారాన్ని నిరాకరించడానికి «థర్డ్ పార్టీ అనే సాకును ప్రభుత్వ విభాగాలు విరివిగా వాడుకుంటూ ఎడా పెడా పీఐఓలను నిరాకరిస్తున్నారు. ఐటీ రిటర్న్లు తప్ప అశోక్ కుమార్ అడిగిన ఏ సమాచారమూ ప్రైవేటుది కాదు. ప్రజాప్రయోజనం ఉంటే ఐటీ రిటర్న్లను కూడా వెల్ల డించాలని ఆదాయం పన్ను చట్టం సెక్షన్ 138 (1)(బి) వివరిస్తున్నది. అదే విధంగా ఆర్టీఐ చట్టం కూడా సెక్షన్ 8(1)(జె)లో మినహాయింపు కూడా వివరిస్తున్నది. ప్రజాప్రయోజనం ఏదైనా ఉందా లేదా అనేదాన్ని పరిశీలించాల్సిన బాధ్యతను ఆదాయం పన్ను అధికారిపైన, ఆర్టీఐకింద పనిచేసే ప్రజాసంబంధ అధికారిపైన ఉందని ఈ రెండు చట్టాలు నిర్దేశిస్తున్నాయి. విదేశీ ఎన్జీవోల కార్యకలాపాలు దేశ ఆర్థిక ప్రగతిపై ప్రతికూల ప్రభావాన్ని నెరపుతున్నాయని ఇటీవల పలు ఇంటెలిజెన్సు బ్యూరో నివేదికలు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 2016లో ఒక కేసు విచారణ సందర్భంగా ఎన్జీవోల జవాబుదారీని శాసించే చట్టమేదీ లేదని, వాటిని నియంత్రించే చట్టాన్ని చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదని అన్నారు. 30 లక్షల ఎన్జీవోల ఆదాయవ్యయాల లెక్కలను కనీసం మార్చి 31, 2017 వరకైనా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ కేహర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఎన్జీవోల నియంత్రణకు మార్గదర్శకాలనైనా కనీసం రూపొందించాలని ఇటీవల సూచిం చింది. ఈ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూత్రాలను తయారుచేసింది. నీతి ఆయోగ్ అంతర్జాల వేదికలో, ఎన్జీవో దర్పణ్ అనే పోర్టల్ రిజిస్టర్ చేసిన ఎన్జీవోలకు మాత్రమే విదేశీ దాతలనుంచి విరాళాలను సేకరించే అనుమతి లభిస్తుంది. ఎన్జీవోల ముఖ్యపదాధికారుల ఆధార్ కార్డు నంబర్లు, పాన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచాలి. ఈ మార్గదర్శకాలను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. కాని ఈ నియమాలు సరిపోవని అది అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్జీవోలకు అందే ప్రజాధనానికి సంబంధించి అన్ని లెక్కలు చెప్పవలసిన బాధ్యతను చట్టపరంగా నిర్దేశించడానికి పార్లమెంటు ఒక శాసనం చేయాలని భావిస్తున్నది. ఒకవేళ ఎన్జీవోను ఆదాయపు పన్ను చట్టం కింద రిజిస్టర్ చేస్తే ప్రజలకు అది తమ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పి తీరాలి. అదే విధంగా మినహాయిం పులు ప్రయోజనాలు పొందడానికి సెక్షన్ 80జి, 12ఎ ఎ వంటి నియమాల కింద రిజిస్ట్రేషన్ చేస్తే ఆ వివరాలు కూడా అందించాల్సిందే. ఎన్జీవో గానీ లేదా రాజకీయ పార్టీ గానీ పాన్ కార్డును, ఐటీ నివేదికలను దాచుకోవడం సరికాదు. ఈ వివరాలు ఇవ్వడం వల్ల ఎన్జీవోల విశ్వసనీయత పెరుగుతుంది. వాటిని దాచడం అనుమానాలను రేకెత్తిస్తుంది. ఎన్జీవోకు పాన్ కార్డు ఉందా, వారి ఐటీæ వార్షిక నివేదికలు ఏమిటి అని విచారించవలసిన బాధ్యత కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిపై ఉంది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలు, సంస్థలు తమ పాన్ కార్డు వివరాలు, ఆదాయంపన్ను రిటర్న్లు వెల్లడించాలని సీఐసీ ఇదివరకు ఒక కేసులో నిర్దేశించింది. ఎన్జీవోల ఆదాయం పన్ను నివేదికలను వ్యక్తిగత విషయాలుగా పరిగణించడం న్యాయం కాదు. మూడో వ్యక్తి సమాచారం అనడం సరికాదు. సెక్షన్ 4(1)(బి) కింద ఇవ్వవలసి ఉంది. (సీఐసీ, సీఎస్ డబ్ల్యూబీ ఓ, ఎ, 2017, 109115 అశోక్ కుమార్ వర్సెస్ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ కేసులో 17.5.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా). - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఎన్జీవోలకు హోం శాఖ షోకాజ్
ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి సాక్షి, న్యూఢిల్లీ: ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ 5,922 ఎన్జీవోలకు కేంద్ర హోం శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్వచ్ఛంద సంస్థలు విదేశాల నుంచి నిధులు, విరాళాలు పొందాలంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) కింద నమోదు చేయించుకోవాలి. అనంతరం రిటర్నులను ప్రతి ఏడాదీ సమర్పించాలి. 18,523 స్వచ్ఛంద సంస్థలు 2010–11 నుంచి 2014–15 మధ్య రిటర్నులు దాఖలు చేయలేదు. ప్రభుత్వం ఆయా సంస్థలకు జూలై 8న షోకాజ్ నోటీసులిస్తూ, రిజిస్ట్రేషన్ను ఎందు కు రద్దు చేయకూడదో జూలై 23లోపు చెప్పాలంది. లేకపోతే రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న సంస్థల్లో నెహ్రూ స్మారక మ్యూజియం–గ్రంథాలయం, ఇందిరా గాంధీ కళాక్షేత్రం, ఇగ్నో, ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీరామకృష్ణ సేవాశ్రమం వంటివి ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని స్వర్ణ భారత్ ట్రస్టు, సుజనా చారిటబుల్ ట్రస్టు, శ్రీ సత్యసాయి మెడికల్ ట్రస్టు వంటి పేరున్న స్వచ్ఛంద సంస్థలకూ నోటీసులు వెళ్లాయి.