Padi Kaushik Reddy
-
బీఆర్ ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డితో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు.. రేపు సుప్రీం కోర్టులో విచారణ
ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.ఇంతకు ముందు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లో చర్యలు తీసుకోవాలని గతంలోనే తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.కేటీఆర్ రిట్ దాఖలుఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో.. ఈ రెండు పిటిషన్లను కలిపి 10వ తేదీన విచారణ చేస్తామని ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్,అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి , సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. వీళ్లపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు.మరో పిటిషన్లో.. ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సహా పలువురు స్పెషల్ లీవ్ పిటిషన్(SLP) వేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్ను శుక్రవారం(జనవరి 31న) విచారణ జరిపింది. ఎమ్మెల్యేలపై నాలుగు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని కిందటి ఏడాది మార్చి తెలంగాణ హైకోర్టు ఆదేశించిందని, అయితే కోర్టు ఆదేశాలను తెలంగాణ స్పీకర్ ధిక్కరించారని, కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని పాడి కౌశిక్రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. సంబంధిత ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని అసెంబ్లీ సెక్రటరీ, తెలంగాణ స్పీకర్ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఫిరాయింపుల వ్యవహారాల్లో స్పీకర్ తొందరపాటు నిర్ణయాలు సరికాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పడాన్ని ఆయన బెంచ్ ముందు ప్రస్తావించారు. కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి తగు సమయం కావాలని ఆయన కోరారు.అయితే.. ఇంకెంత కాలం ఎదురుచూస్తారని, మహారాష్ట్రలో లాగా ఎమ్మెల్యేల పదవికాలం అయ్యేదాకా ఎదురు చూస్తారా? అని సుప్రీం కోర్టు తెలంగాణ స్పీకర్పై అసహనం వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్ అడిగి చెప్తానని లాయర్ రోహత్గి చెప్పడంతో విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. రేపు (ఫిబ్రవరి 10న) కౌశిక్ రెడ్డి ఎస్ఎల్పీ, కేటీఆర్ రిట్ పిటిషన్లను కలిపి సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు?
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో.. తెలంగాణ స్పీకర్పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. చర్యలకు అసెంబ్లీ స్పీకర్కు ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు ఆయన.. తగిన సమయం రావాలని అన్నారు. దీంతో.. ‘‘ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?. రీజనబుల్ టైం అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ?..’’ అని తెలంగాణ స్పీకర్ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయమై స్పీకర్ను సంప్రదించి చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానం ఇచ్చారు. దీంతో విచారణను వచ్చేవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్పై గెలిచి.. ఈ ముగ్గురితో సహా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనవరి 16వ తేదీన SLP దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని హరీష్రావు మరో పిటిషన్ వేశారు.మహారాష్ట్ర కేసులో..రాజ్యాంగంలోని పదో షెడ్యూల్.. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన(ఫిరాయించిన) నేతలపై అనర్హత వేటు వేయడం గురించి ప్రత్యేక చట్టంతో చర్చించింది. అయితే దానికి ఓ నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకపోవడంతో.. ఇలాంటి కేసుల్లో చర్యలకు ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే గతంలో మహారాష్ట్రలో ఫిరాయింపుల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. 2022 జనవరిలో పార్టీ ఫిరాయించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, వాళ్ల పదవీకాలం ముగిసేదాకా ఆగాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది.రాజ్యాంగపరంగా ఎలాంటి సంక్షోభాలు తలెత్తకుండా, చట్ట సభలు సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం ఆ సమయంలో వ్యాఖ్యానించింది. అంతేకాదు.. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఫిరాయింపుల కేసుల్లో పారదర్శకత కోసం నిర్దిష్ట మార్గదర్శకాల ఆవశ్యకతను తెలియజేసింది. -
రేవంత్ను నమ్మారా.. నమ్మితే నట్టేట మునిగినట్లే : పాడి
సాక్షి,తెలంగాణ భవన్ : సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌశిక్రెడ్డి మాట్లాడారు. ఎవ్వరి సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి. ఈ పత్రాలు చూసి ఇళ్ళు కట్టుకుంటే ప్రజలు మోసపోతారు ..తస్మాత్ జాగ్రత్త. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మోసపోవద్దు ..ఇండ్లు కట్టుకున్న తర్వాత రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వరు. స్థలం లేని వారికి ఇండ్ల కేటాయింపులో స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి ఓ పెద్ద జోకర్లా మారారు. తుగ్లక్లా పాలిస్తున్నారు. ఓ మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారు.కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది ఆయన తీరు. టకీ టకీ అని రైతు భరోసా డబ్బులు పడతాయని రేవంత్ అన్నారు.ఒక్క రోజు డబ్బులు వేసి ఆపేశారు. అధికారులు వచ్చి నామమాత్రపు పత్రాలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి?ఈ పత్రాలు చూసి తొందరపడి ఇల్లు కట్టుకుంటే మోసపోతారు.. తస్మాత్ జాగ్రత్త.- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/RRNCkW8D6L— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 30, 2025ఆరునెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసాను ఆపే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఎవరి పాలన బాగుంది అంటే కేసీఆర్ పాలన బాగుంది అని 70 శాతం నెటిజన్లు సమాధానమిచ్చారు. దాదాపు 90 వేల మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించారు.మరో ఛానల్ నిర్వహించిన సర్వేలో కూడా 80 శాతం మంది కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. అన్ని పథకాలు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. -
కమలాపూర్లో ఉద్రిక్తత.. కౌశిక్రెడ్డిపై టమాటాలతో దాడి!
సాక్షి, కరీంనగర్: కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(kaushik Reddy)పై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కరీంనగర్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనే విధంగా మరోసారి దాడి జరిగింది. నేడు కమలాపూర్లో గ్రామసభ జరుగుతున్న సమయంలో అక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చారు. సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపైకి టమాటాలు విసిరారు. దీంతో..కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల వద్ద వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. అనంతరం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ సంఖ్యలో పోలీసులు గ్రామసభ వద్దకు చేరుకున్నారు. -
కేసులకు భయపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
-
రేవంత్.. ముందు నీ భాష మార్చుకో: కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది తాను కాదు.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయనను పోలీసులు విచారించారు.ఇక, విచారణ అనంతరం పీఎస్ బయట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నన్ను గంట పాటు విచారించారు. విచారణలో భాగంగా 32 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నే అడిగారు మళ్లీ అడిగారు. నేను అన్నింటికీ సమాధానం ఇచ్చాను నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. డిసెంబర్ నాలుగో తేదీన ఫిర్యాదు చేయడానికి నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకొని అక్కడిని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపైనే కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది నేను కాదు.. రేవంత్ మార్చుకోవాలి అని హితవు పలికారు. -
పోలీస్ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అరగంటకుపైగా ఆయన్ని విచారణ జరిపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్(Banjara Hills) పోలీస్ స్టేషన్కు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ ఆయన ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో.. సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. నా తప్పేమీ లేదు: కౌశిక్రెడ్డిమాసబ్ ట్యాంక్ పీఎస్ లోపలికి వెళ్లే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసిన తప్పేమీ లేదు. విచారణకు పూర్థిస్తాయిలో సహకరిస్తా’’ అన్నారు. అయితే తన అడ్వొకేట్(Advocate)తో కలిసి ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. ఆపై ఆయన విజ్ఞప్తితో ఉన్నతాధికారులను సంప్రదించి.. అనంతరం వాళ్లను లోపలికి వెళ్లనిచ్చారు. -
కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి వేధిస్తున్నారు: పాడి కౌశిక్ రెడ్డి
-
రేవంత్.. నువ్వు జైలుకెళ్లావని మాపై కక్ష సాధింపా?: కౌశిక్రెడ్డి
సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth Reddy) జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy). ప్రపంచం మొత్తం చూసి వచ్చిన వ్యక్తి కేటీఆర్(KTR). ఇదంతా రేవంత్కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ కారు రేసు కేసు అనే లొట్టపీసు కేసు అంటూ విమర్శించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులను రేవంత్ వేధింపులకు చేస్తున్నాడు. గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఒక్క రూపాయి రైతుభరోసా ఇవ్వలేదని అడిగినందుకు కేసులు పెడుతున్నారా?. రుణమాఫీ గురించి అడిగితే పెడుతున్నారా?. తులం బంగారం ఏమైందన్నందుకా కేసులు?. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు.కారు రేసు అనేది ఓ లొట్టపీసు కేసు. ఈ రేసు కోసం రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీలో తెలంగాణకు తీసుకొస్తే.. దాన్ని కూడా రేవంత్ రద్దు చేశాడు. తెలంగాణకు రూ. 700 కోట్లు లాభం వచ్చినట్టు నెల్సన్ సర్వేనే చెప్పింది. టెస్లా కంపెనీని తీసుకురావాలనేది కేటీఆర్ లక్ష్యం. ఆ కంపెనీని తీసుకురావడానికే కేటీఆర్ కారు రేసు తీసుకొచ్చారు. దాన్ని రేవంత్ అడ్డుకున్నాడు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ పంపించాలని అనుకుంటున్నాడు.కేటీఆర్ ప్రపంచం చూసి వచ్చిన వ్యక్తి. కేటీఆర్కు, రేవంత్ రెడ్డికి అదే డిఫరెన్స్. అవినీతే లేనప్పుడు ఏసీబీ ఎందుకు?. అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు?. ప్రొసీజర్ ల్యాప్స్ కేటీఆర్ తప్పు ఎందుకు అవుతుంది?. పాలసీ డిసీషన్ మాత్రమే కేటీఆర్ తీసుకుంటారు తప్ప ప్రొసీజర్తో ఆయనకేం సంబంధం?. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పోతే.. 60 లక్షల మంది కేసీఆర్లు తయారు అవుతారు. కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ను అంటే ఊరుకోవాలా?. కేసీఆర్ బొమ్మ లేకుండా సంజయ్ కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేడు.ఆర్డీవో మీద నేను ఒక్క మాటైనా మాట్లాడానా?. ఒక్కడితో నేను మాట్లాడితే ఆరుగురితో కేసులు పెట్టిస్తారా?. డీకే అరుణపై నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కేసు పెట్టలేదే?. నాడు జూపల్లిపై ఇష్టారాజ్యంగా చేస్తే కేసీఆర్ కేసులు పెట్టలేదు కదా?. నీకో న్యాయం మాకో న్యాయమా?. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో దాడి చేయిస్తారా? ఖమ్మంలో హరీష్ రావుపై దాడి జరిగింది ఇదేం సంస్కృతి? అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
సంజయ్ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ డీఆర్సీ మీటింగ్లో బట్టలు విప్పుతా అని ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగోట్టేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. బుధవారం(జనవరి15) కౌశిక్రెడ్డి తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడారు.‘మొదట సంజయ్ నాపై దాడి చేశారు. శ్రీధర్ బాబు నన్ను వేలు చూపుతూ బెదిరించారు. కాంగ్రెస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీలుగా తయారయ్యారు. రైతు భరోసా కోసం ప్రశ్నించా. రైతు రుణ మాఫీ 50 శాతం అయ్యింది పూర్తి చేయండని రైతుల పక్షాన అడిగాను అందులో తప్పేముంది. సంజయ్ ఏ పార్టీ నుంచి ఏ గుర్తుతో గెలిచిండు. సంజయ్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడు. కేసీఆర్ బొమ్మతో సంజయ్ గెలిచిండు. డబ్బులకు అమ్ముడుపోయిన సంజయ్ సిగ్గు లేకుండా స్పీకర్ నాపై ఫిర్యాదు చేసాడు. స్పీకర్కు సంజయ్ పై ఫిర్యాదు చేస్తా. మంత్రుల సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన సంజయ్ డిస్ క్వాలిఫై చేయాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టిస్తా అని రేవంత్ రెడ్డే అన్నారు. నేను రాళ్లతో కొట్టలేదు కదా..ప్రశ్నిస్తే నా పై కేసులా’అని కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన -
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఆదివారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన త్రీటౌన్ పోలీస్టేషన్లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.వాదనలు ఇలా..రెండో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ప్రేమ లత ముందు కరీంనగర్ పోలీసులు కౌశిక్ను హాజరు పర్చారు. కౌశిక్రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్ మంజూరు చేశారు. ఇకముందు అలాంటి దూకుడు ప్రదర్శించొద్దని కౌశిక్ను హెచ్చరించిన మెజిస్ట్రేట్.. కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం కరీంనగర్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దనీ ఆదేశించారు.రేపు మాట్లాడతా: కౌశిక్ రెడ్డితెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి ఊరట
సాక్షి, కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి (Padi Kaushik Reddy) అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా నెలకొంది. కౌశిక్ను రాత్రంతా త్రీ టౌన్ పీఎస్లోనే పోలీసులు ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాట్లు చేశారు. రాత్రి ఒంటిగంటకు.. అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్(BRS) లీగల్ టీమ్కు పోలీసులు వెల్లడించారు. నిన్న)రాత్రి (సోమవారం) త్రీ టౌన్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. ఈ రోజు ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చారు.ప్రశ్నిస్తూనే ఉంటా: కౌశిక్ రెడ్డి తన అరెస్టు ప్రజాస్వామికం, అనైతికం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలతో కేసులు పెట్టి నన్ను అరెస్టు చేశారు. పండుగ పూట ఇబ్బందుల గురిచేయాలని చూస్తున్నారు’’ అంటూ కౌశిక్రెడ్డి మండిపడ్డారు.కేటీఆర్, హరీష్రావు హౌస్ అరెస్ట్కౌశిక్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హుజూర్నగర్లో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్లు చేశారు. గచ్చిబౌలిలో కేటీఆర్, కోకాపేటలో హరీష్రావులను హౌస్ అరెస్ట్ చేశారు.వన్ టౌన్లో మూడు, త్రీ టౌన్లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చూపించారు. మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన పిటిషన్ల మేరకు నమోదు చేసిన కేసుల్లో కౌశిక్ను అరెస్ట్ చేశారు. నిన్నంతా కొనసాగిన బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. కరీంనగర్లో నెలకొన్న హైడ్రామాతో సంక్రాంతి పండుగ పూట టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఓ టీవీ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది.కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్తో పాడి కౌశిక్రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: సర్కారు నిధుల వేట!దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్ పోలీసుస్టేషన్కు తరలించారు.కౌశిక్రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్కు తరలించారు. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్ట్
సాక్షి హైదరాబాద్/సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ క్రైం: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఓ టీవీ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. మూడు కేసులు నమోదు.. కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్తో పాడి కౌశిక్రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్ పోలీసుస్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ నేతల ఆందోళన.. హైడ్రామా.. కౌశిక్రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్కు తరలించారు. సమాధానం చెప్పలేకే అణచివేత: కేటీఆర్ రైతు రుణమాఫీని ఎగవేసి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశి్నస్తే.. సమాధానం చెప్పలేక సీఎం అణచివేత చర్యలకు దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అరెస్టు అక్రమం, అత్యంత దుర్మార్గమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘పూటకో అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారింది. సీఎం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన సీఎంపై చర్య తీసుకోవాల్సిందిపోయి, ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్రెడ్డిపై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. వెంటనే విడుదల చేయాలి: హరీశ్రావు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశి్నస్తున్న ప్రజా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. అణచివేతలు, నిర్బంధాలు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ బెదరదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ దురుసుగా మాట్లాడారు: గంగుల కరీంనగర్: సమీక్షా సమావేశంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటికి లాక్కెళ్లారని.. ఆయనే గొడవకు కారణమంటూ అక్రమ కేసులు పెట్టడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్లోని తన నివాసంలో సోమవారం గంగుల మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారిక సమావేశానికి ఆహ్వనిస్తేనే నేను, కౌశిక్రెడ్డి వెళ్లాం. సమావేశం ప్రారంభంలోనే ఎమ్మెల్యే సంజయ్ తన పక్కనే కూర్చున్న కౌశిక్రెడ్డిని మాటలతో అసహనానికి గురిచేశారు. దీనితో ఆగ్రహించిన కౌశిక్రెడ్డి ముందు నీది ఏ పార్టీనో చెప్పి ప్రసంగించాలని నిలదీశారు.ఈ సమయంలో కౌశిక్రెడ్డిపైనే సంజయ్ దురుసుగా ప్రవర్తించారు’’ అని తెలిపారు. అక్కడే ఉన్న మంత్రులు దీనిని అడ్డుకోకపోగా.. క్షణాల్లో వచ్చిన పోలీసులు కౌశిక్రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లి బయటకు నెట్టేశారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే నేనూ చేస్తా..: ఎమ్మెల్యే సంజయ్ గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్, కేటీఆర్లు తమ పదవులకు రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దాడి చేశారంటూ నమోదైన కేసుకు సంబంధించి ఆయన కరీంనగర్ వన్టౌన్ పోలీస్స్టేషన్కు వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. కౌశిక్రెడ్డి తన హక్కులకు భంగం కలి్పంచారని, చేతిపై కొట్టారని, అవమానించారని పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి కౌశిక్రెడ్డి ఒక్కడి పనేనా, ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? అనేది తెలియాలన్నారు.కౌశిక్రెడ్డిపై స్పీకర్కు ఫిర్యాదు కరీంనగర్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అనుమతి మేరకు తాను మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అడ్డుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తనను తోసివేశారని, దాడికి యత్నించారని పేర్కొన్నారు. కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
BRS ఎమ్మెల్యే కౌశిక్డ్డిపై స్పీకర్కు జగిత్యాల MLA సంజయ్ ఫిర్యాదు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
సాక్షి, కరీంనగర్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో, కరీంనగర్లో రాజకీయం మరోసారి హీటెక్కింది. కౌశిక్ రెడ్డి సవాల్తో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిగ్ షాక్ తగలింది. ఆయనపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్పై దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు ఫైల్ చేశారు పోలీసులు.ఇదిలా ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల అమలులో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పందించారు. ‘నీది ఏ పార్టీ అంటే నీది ఏ పార్టీ..’అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. దూషణల పర్వం..ఈ సందర్బంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి కలబడి చేతులతో తోసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పాడి కౌశిక్ను అడ్డుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలపాటు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పరుగున వెళ్లి వారిద్దరినీ వారించే యత్నం చేశారు. పాడిని బలవంతంగా పోలీసులు బయటకు తరలించారు. కేసీఆర్ ఫొటో పెట్టుకొని గెలిచిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేనూ ఇలాగే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ బదులిస్తూ.. ముందు పార్టీ ఫిరాయింపులను గతంలో ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ముందు రాజీనామా చేయాలని, తాను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తానని, త్వరలో పార్టీలో చేరతానని మీడియాకు తెలిపారు.నేను రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా? శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని.. దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలంతా తన సవాల్ను స్వీకరించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని, ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్పై గెలవాలన్నారు. -
పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
వీడియో: పాడి కౌశిక్రెడ్డి హౌస్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామునే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్(KTR) విచారణ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఈరోజు ఉదయం 5:30కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు ఉదయం 5:30 కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది. @BRSparty pic.twitter.com/bFtbUFGYt0— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 6, 2025ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race) కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్(BRS Party) ఎమ్మెల్యే కేటీఆర్ ఈకేసులో నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరుకున్నారు. దీంతో, కేటీఆర్ విచారణకు వెళ్తారా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కేటీఆర్ విచారణకు వెళ్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పోలీసులను అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. -
నాపై కేసును కొట్టేయండి..
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ టాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024, డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషకు వెళ్లారు. ఆ సమయంలో బంజారాహిల్స్ సీఐ బయటకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సీఐని అడ్డగించి తమ ఫిర్యాదులో తీసుకోవాలని బలవంతం చేశారు.ఈ ఘటనపై బంజారాహిల్స్ సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్పై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అయితే కౌశిక్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న మాసబ్ ట్యాంక్ పోలీసులు బుధవారం (డిసెంబర్ 25) కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 27వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. -
అల్లు అర్జున్ రిలీజ్ ఆలస్యమెందుకు?.. అదే జరిగితే స్టేట్ అగ్నిగుండమే: కౌశిక్ రెడ్డి
సాక్షి, కరీంనగర్: అల్లు అర్జున్ అరెస్ట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో జైలు సూపరింటెండెంట్కు బెయిల్ పేపర్స్ అందిన తర్వాత కూడా ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నించారు.అల్లు అర్జున్ అరెస్ట్పై తాజాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ అరెస్ట్ను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్ అయినా, నేనైనా, ఎవరైనా సరే.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్లు చేయిస్తున్నాడు. బెయిల్ పేపర్స్ నిన్ననే జైలు సూపరింటెండెంట్కు అందిన తర్వాత రిలీజ్ ఎందుకు చేయలేదో చెప్పాలి.సోషల్ మీడియాలో కేటీఆర్ అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలు వింటున్నా. అదే జరిగితే తెలంగాణా అగ్నిగుండం అవుతుంది. ఫార్ములా ఈ-రేసు కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఓ విజన్ లేక, ఏం చేయాలో తెలియక, దాన్ని తీసుకొచ్చిన కేటీఆర్ ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. ఫార్మూలా ఈ-రేసు తీసుకొచ్చి దాని ద్వారా హైదరాబాద్కు టెస్లా తీసుకొద్దామన్న ఆలోచన కేటీఆర్కు ఉండేది. ఈ విషయం వీళ్లకు తెలుసా అని ప్రశ్నించారు. -
పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
-
బంజారాహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
-
కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నేతల అరెస్ట్తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్పై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన గొడవ పడే విధంగా వ్యవహారించాడు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకపోయే సరికి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు పట్టించుకోని వారిని కూడా ఇప్పుడు బయటకు తీసుకువస్తున్నారు.కేసీఆర్ను కేటీఆర్ ఫామ్హౌస్కే పరిమితం చేశారు. కేసీఆర్ ఫామ్హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిజంగా రాజీనామా చేశారు. మంత్రి వెంకట్రెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి ఒకరు అగౌరవంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరినా మాట్లాడినా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎవరైనా సరే.. చూస్తూ ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ అధికారాన్ని ఉపయోగించుకోలేదు.. మేము ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే ఉత్సవాలు చేసుకుంటున్నాం.ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. సలహాలు, సూచనలు చేయండి అంతే కానీ అర్ధం పర్థం లేని విమర్శలు ఎందుకు. మా నాయకుల మీద చిలువలు పలువలుగా మాట్లాడితే ఊరుకోము. మీ లాగా మేము అక్రమ అరెస్ట్ చేయదలుచుకుంటే ఒక్కరూ కూడా మిగలరు. ఫోన్ ట్యాపింగ్లో మీ హస్తం లేకపోతే అధికారులను దేశాలు ఎందుకు దాటిస్తున్నారు. మీరు చేసేది మంచి అయితే విదేశాల నుండి యూ ట్యూబ్లు ఎందుకు నడిపిస్తున్నారు.గతంలో ఉన్నట్లు ఇప్పుడు రాజకీయ సంస్కృతి లేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పని చెప్పండి అంతే కానీ లేని పోనీ విమర్శలు చేయకండి. ప్రతిపక్షాలు అంటే జనాలు ఆహ్వానించాలి కానీ జనాలు కేటీఆర్ను దగ్గరికి రానివ్వడం లేదు. మేము మళ్ళీ అధికారం లోకి వస్తాము. సంవత్సర కాలం ఓర్చుకున్నాము ఇక ఓర్చుకోము. ఏది పడితే అది మాట్లాడితే క్షమించము. మా పాలన చూసి వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారు. అధికారులు అధికార పార్టీకి తగ్గట్టుగా పని చేస్తారు. ఇప్పటి వరకు యూ ట్యూబ్ల విషయంలో చేసిన తప్పులు ఇక చేయము. గతంలో తెలంగాణ తల్లి బొమ్మని దొరసాని లాగా సృష్టించారు. గతంలో కవిత ఫేస్ లాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. మేము మన తెలంగాణ ప్రజల ఆత్మని ఆవిష్కరిస్తున్నాము’ అని కామెంట్స్ చేశారు. -
మాజీ మంత్రి హరీష్రావు, కౌశిక్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఇదే సమయంలో కౌశిక్రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతారు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు?. ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం?. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా?. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం’ అంటూ విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా?ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు.ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.ఈ దుర్మార్గాన్ని… pic.twitter.com/aXvinFpkqY— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024 -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 20 మంది అనుచరులపై కూడా కేసు నమోదైంది. విధులను అడ్డగించడంతో పాటు బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కౌశిక్రెడ్డి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే, తాను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోవడం పట్ల కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బంజారాహిల్స్ ఏసీపీ నన్ను మూడు గంటలకు ఫిర్యాదు తీసుకోవడానికి రమ్మన్నారు. నేను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోయారు. సీఐ మా ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు’’ అంటూ మండిపడ్డారు.‘‘నా ఫోన్ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చాను. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేస్తే హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న నేను ఫిర్యాదు చేస్తే రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి పాపాలకు భూకంపం వస్తుంది. బంజారాహిల్స్ ఏసీపీ, సీఐ ప్రవర్తన తీరు సరిగ్గా లేదు. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నారు...పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కాంగ్రెస్ మానకొండూరు ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వం అధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తుంది. కరీంనగర్ సీపీ ఫోన్ ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ నేతల అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవిత, సంతోష్ రావు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని కౌశిక్రెడ్డి హెచ్చరించారు. -
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
-
నిర్ణయం స్పీకర్దే
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనని హైకోర్టు స్పష్టం చేసింది. ‘రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్గా ఇచ్చిన అధికారాల మేరకు విధులు నిర్వహించాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని అనర్హత పిటిషన్లపై తగిన సమయంలో (రీజనబుల్ టైమ్) తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి..’ అని స్పష్టం చేసింది. ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది.పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తద్వారా స్పీకర్ ముందు పిటిషన్లు పెండింగ్లో ఉండగా కోర్టులు జోక్యం చేసుకోలేవని తేలి్చచెప్పింది. స్టేషన్ఘన్పూర్ నుంచి కడియం శ్రీహరి, కొత్తగూడెం నుంచి తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఖైరతాబాద్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పిటిషన్లు దాఖలు వేశారు.అలాగే దానంను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అనర్హత పిటిషన్ల విచారణకు నాలుగు వారాల్లో షెడ్యూల్ ఖరారు చేయాలని సెపె్టంబర్ 9న తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్రావు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలు ఇలా.. ‘స్పీకర్ తన ముందున్న పిటిషన్లపై నిర్ణయం వెలువరించిన తర్వాత కోర్టులు న్యాయ సమీక్ష జరపొచ్చు. అయితే అది కూడా చాలా స్వల్పమే. కానీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోక ముందు కోర్టులు ఆయనపై ఒత్తిడి తేలేవు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం రాజ్యాంగ అధిపతి అయిన స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అతి స్వల్పం. తన ముందున్న అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం, స్వేచ్ఛ ఆయనకు ఉంటుంది.స్పీకర్ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని గతంలో ఎర్రబెల్లి దయాకర్ పిటిషన్లో ఇదే హైకోర్టు స్పష్టం చేసింది..’అని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి తరఫున రవీంద్ర శ్రీవాస్తవ, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్రెడ్డి, జంధ్యాల రవిశంకర్ వాదించారు. అయితే ‘పదవ షెడ్యూల్ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందున్న అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి.సాధారణంగా లోక్సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. కాబట్టి ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంచకుండా నిరీ్ణత సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక్కడ 8 నెలలైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింగిల్ జడ్జి ఇచి్చన తీర్పుపై అప్పీళ్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదు..’అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్రావు, బీజేపీ Ôనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తరఫు న్యాయవాది జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు.పలు తీర్పులు ప్రస్తావించిన ధర్మాసనం సెపె్టంబర్ 30న అప్పీళ్లు దాఖలైన నాటి నుంచి ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విన్న సీజే ధర్మాసనం ఈ నెల 12న తీర్పు రిజర్వు చేసింది. ఎర్రబెల్లి దయాకర్రావు వర్సెస్ తలసాని శ్రీనివాస్యాదవ్, ఎస్ఏ సంపత్కుమార్ వర్సెస్ కాలే యాదయ్య, కీష మ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్, మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాజేంద్రసింగ్ రాణా, కిహోటో హో లోహన్ సహా పలు కేసుల్లో తీర్పులను శుక్రవారం తీర్పు వెల్లడి సందర్భంగా సీజే ధర్మాసనం ప్రస్తావించింది. సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సందర్భంగా స్పీకర్ తగిన(రీజనబుల్) సమయంలో నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్న విషయాన్ని నొక్కి చెప్పింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి తగిన అధికారం స్పీకర్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొంది. -
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడి.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై దాడిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ‘‘ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు దాడి చేశారు. ప్రశ్నిస్తే దాడి చేయడం ఇందిరమ్మ రాజ్యమా?.’’ అంటూ ఆయన మండిపడ్డారు.పెద్దల మెప్పు కోసం పోలీసులు ఓవరాక్షన్ చేస్తే మేం వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కౌశిక్రెడ్డి అంటే రేవంత్కు భయం పట్టుకుందని.. తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడదు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి చేపట్టిన ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ క్రమంలో కౌశిక్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. -
కౌశిక్రెడ్డికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కరీంనగర్,సాక్షి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధర్నా చేపట్టారు. కౌశిక్రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కౌశిక్రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండోవిడత దళితబంధు ఇవ్వాలంటూ దరఖాస్తుదారులతో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ధర్నాకు దిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో హుజూరాబాద్ అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా ఉద్రిక్తంగా మారింది. -
సీఎం రేవంత్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి సవాల్
-
డ్రగ్ టెస్ట్కు మేం రెడీ.. సీఎం రేవంత్కు పాడి కౌశిక్ సవాల్
సాక్షి,హైదరాబాద్: తన పంచాయతీ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కాదని, సీఎం రేవంత్రెడ్డితో అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నా పంచాయతీ అనిల్ కుమార్ యాదవ్తో కాదు. రేవంత్ రెడ్డితో నాకు పంచాయతీ. డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. మేం కౌశిక్ రెడ్డిని ట్రాప్ చేయలేదని ఇంటిలిజెన్స్ చీఫ్ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్ టెస్ట్ కు రావాలి. మేం యూరిన్ డబ్బా పట్టుకుని రెడీగా ఉన్నాం. మా ఎమ్మెల్యేలు అందరు ఎదురు చేస్తున్నారు ఇప్పటి వరకు మమ్మల్ని పిలవలేదు.ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి డ్రగ్స్ గురించి మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడాలి. నన్ను ట్రాప్ చేసినట్లు రాజ్ పాకాల కుటుంబాన్ని ఇరికించాలని చూశారు. కేసీఆర్ పేరు తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మీటింగ్ జరిగిందా .రేవంత్ రెడ్డి చెరిపేస్తే చెరిగిపోయేది కాదు, కేసీఆర్ పేరు. రేవంత్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు’’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి అన్నారు. -
డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్ర.. కేటీఆరే అసలు టార్గెట్!
-
యాదాద్రిలో రీల్స్.. స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఇటీవల చేసిన ఫొటోషూట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్రెడ్డి స్పందించారు. ఈ విషయమై శుక్రవారం(అక్టోబర్ 25) కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడారు. గుడి లోపల తాను ఫోటోషూట్ చేయలేదని చెప్పారు. యాదాద్రి దేవాలయ అద్భుత నిర్మాణం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిందుకే తాను ఫొటో షూట్ చేశానన్నారు. తాను లక్ష్మీనరసింహస్వామికి పెద్ద భక్తుడినని, ఆలయ ఈవో, పోలీసుల అనుమతి తీసుకునే ఫొటోషూట్ చేశానని కౌశిక్రెడ్డి వివరణ ఇచ్చారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి తన భార్య,కూతురితో కలిసి యాదాద్రి గుడిలో రీల్స్ షూట్ చేశారు. ఈ వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారడంతో వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆలయ ఈవో కౌశిక్రెడ్డిపై యాదాద్రి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే తాను ఈవో అనుమతితోనే వీడియోలు షూట్ చేశానని కౌశిక్రెడ్డి చెబుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత.. హైకోర్టులో కేఏ పాల్ వాదనలు -
మరో వివాదంలో కౌశిక్రెడ్డి.. యాదాద్రి గుడిలో రీల్స్
యాదాద్రిభువనగిరిజిల్లా,సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్రెడ్డి రీల్స్ చిత్రీకరించారు. ఆలయంలో సెల్ ఫోన్లు,కెమెరాలు నిషేదం ఉండగా కౌశిక్రెడ్డి ఏకంగా రీల్స్ చేయడం దుమారానికి కారణమైంది.భాస్కర్ రావు ఆలయ ఈవోగా వచ్చాక రాజకీయ నాయకులను చూసి చూడమట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఏకంగా లడ్డూ కౌంటర్లోపలికి ఓ ఎమ్మెల్యే అనుచరులు ప్రవేశించారన్న ఆరోపణలున్నాయి.ఈ వ్యవహారంలో తూతూ మంత్రంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.అంతకు ముందు కొండపైనున్న బాత్ రూముల్లోనే ఏకంగా తాగిపడేసిన మందుబాటిల్స్,గుట్కా ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. కాగా, హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్రెడ్డి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే అరికెపూడిగాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైర్లు -
అలా చెప్పి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేది!
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన కూడదంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అధికారం కోల్పోయామన్న అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ... బీఆర్ఎస్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించడం కూడా ఎంత వరకూ సబబో ఆయన ఆలోచించుకోవాలి. పీఏసీ పదవి విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య వివాదం ముదిరిన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన అరికెపూడి గాంధీకి పీఏసీ అధ్యక్ష పదవి కట్టబెట్టడం దీనిపై బీఆర్ఎస్ విమర్శలకు దిగడం.. పరిస్థితి మరింత ముదిరి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్), గాంధీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు అరికెపూడి గాంధీ వైపునే ఉన్నప్పటికీ సీఎం ఆయన్ను వెనకేసుకుని వచ్చినట్లుగా అనిపిస్తుంది.సెప్టెంబరు 12 కౌశిక్, గాంధీల మధ్య జరిగిన ఘటనల్లో పోలీసులతోపాటు ప్రభుత్వ వైఫల్యమూ స్పష్టంగా కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధంలో పెట్టిన పోలీసులు గాంధీపై మాత్రం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. దీన్నే సాకుగా తీసుకున్నారో ఏమో కానీ.. గాంధీ తన అనుచరులతో కౌశిక్ ఇంటిపై దాడికి దిగారు. కౌశిక్ ఇంటి ముందు కూర్చుని ‘‘మీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటకు రా’’ అంటూ రెచ్చగొట్టే, సినిమా డైలాగులు, ఇతర పరుష పదజాలం ఉపయోగించారు. గాంధీ అనుచరులు మరింత రెచ్చిపోయి కౌశిక్ ఇంటి అద్దాలు పగులగొట్టడమే కాకుండా.. టమోటాలు, కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. తప్పు ఎవరిదన్నది అందరికీ స్పష్టంగా తెలుస్తున్నా పోలీసులు గాంధీని ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచలేదో స్పష్టం చేయలేదు.ముఖ్యమంత్రి బీఆర్ఎస్పై చేసే ఆరోపణ రాజకీయం అనుకోవచ్చు కానీ.. గురువారం నాటి ఘటనలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది. కాంగ్రెస్లో చేరిన గాంధీ అనుచరులే. అంతా అయిపోయిన తరువాత పోలీసులు గాంధీపై నామమాత్రంగా కేసులు పెట్టారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో నెలకొంది. బీఆర్ఎస్ నేత ఎవరైనా కాంగ్రెస్ నేత ఇంటిపై దాడి చేసి ఉంటే కూడా ఇలాగే వ్యవహరించే వారా? లేక... దాడులకు ఎవరు పాల్పడ్డా కఠినంగా వ్యవహరించాని సీఎం చెప్పేవారా? ఇలా చెప్పి ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరిగి ఉండేది.ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నాడని సీఎం స్వయంగా చెప్పడం ఇంకో ఎత్తు. గతంలో పీఏసీ పదవిని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్కు ఎలా ఇచ్చారని రేవంత్ రెడ్డే ప్రశ్నించారు. మరి ఇప్పుడు అదే తీరులో గాంధీకి పదవి కట్టబెట్టడం ఎంత వరకూ సబబు అవుతుంది?. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, త్వరలో ఆ పార్టీ ఖాళీ అవుతుందని రేవంత్ స్వయంగా విమర్శించారు కదా? అలాగైతే ఆయన ధైర్యంగా వీరందరితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు సిద్ధమై ఉండాల్సింది. ఇలా చేసి ఉంటే ఆయనపై గౌరవం మరింత పెరిగేది. ఇలా చేయలేదు సరికదా.. పార్టీ మారిన దానం నాగేందర్ను ఏకంగా లోక్సభ ఎన్నికల బరిలో నిలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా మాట్లాడుతూంటే రేవంత్ వాటినే ప్రోత్సహించడం, పైగా గాంధీ బీఆర్ఎస్ వాడేనని వ్యాఖ్యానించడం, దబాయించడం ఏమంత సముచితంగా అనిపించదు.సెప్టెంబరు 12 నాటి ఘటనకు ముందు కౌశిక్ రెడ్డి చేసిన కొన్ని పనులు, వ్యాఖ్యలు కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారేందుకు కారణమైందన్నది స్పష్టం. ఎందుకంటే.. గాంధీతోపాటు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి గాజులు, చీర ప్రదర్శించడం రెచ్చకొట్టడమే అవుతుంది. అంతేకాదు.. ఈ చర్య మహిళలను కించపరచడం కూడా. రేవంత్ రెడ్డి కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది... ఇదే అంశంపై గాంధీ, కౌశిక్ రెడ్డిలు పరస్పర ఘాటు విమర్శలకూ దిగారు. అయితే ఒకరింటికి ఒకరు వెళతామని సవాళ్లు విసురుకోవడమే రచ్చగా మారింది. అప్పటికిగానీ ఇది శాంతి భద్రత సమస్య అని గుర్తించలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి స్థానికుడు కాదని బతకడానికి వచ్చిన వాడు వ్యాఖ్యానించడం కూడా సరైంది కాదు. తెలంగాణ వచ్చి పదేళ్ల తర్వాత కూడా ఈ రకమైన వాదన చేయడం బీఆర్ఎస్కు నష్టం చేసేదని ఆ పార్టీ నేతలు గుర్తించాలి.హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ స్వీప్ చేయడంలో ఆంధ్రా నుంచి స్థిరపడిన వారి ఓట్లు, ఇతర రాష్ట్రాల వారు ఉన్నారని రేవంత్ స్వయంగా చెప్పిన విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో కౌశిక్ వ్యాఖ్యలను ప్రస్తావించి ముఖ్యమంత్రి కూడా అదే పదం వాడడం అభ్యంతరకరం. బతకడానికి వచ్చిన వారి ఓట్లు కావాలి గానీ, వాళ్లు వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ అనడం ద్వారా ఆయన కూడా కౌశిక్ లాగానే మాట్లాడారనే భావన కలుగుతుంది. ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా వుంటే మళ్లీ ప్రజల మధ్య అనవసరమైన వివాదాలు రాకుండా వుంటాయని చెప్పాలి.ఫిరాయింపులపై హైకోర్ట్ తీర్పు మీద రేవంత్ వ్యాఖ్యానిస్తూ బీఆర్ఎస్ నేతలు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోందని కాంగ్రెస్ ప్రచారం చేయడం కూడా అలాంటి సైకలాజిక్ గేమే కదా?. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. ఆ ఆరోపణ నిజం కాకపోతే వారు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి లేదని కోర్టుల నుంచి ఆర్డర్ తీసుకు రావాలని విపక్షాలకు సలహా ఇవ్వడం విడ్డూరంగా ఉంది.ఏ ఎమ్మెల్యే అయినా అటూ ఇటూ దిక్కులు చూస్తే అనర్హత వేటు పడుతుందంటే తన ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. ఒక పక్క పదిమందిని చేర్చుకొని వారిపై వేటు వేయని రేవంత్ తమాషాగా మాట్లాడుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ , బీజేపీలు కలిసినా రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి లేదు. అలాంటి అవకాశముంటే ఎన్నికలైన వెంటనే అక్రమమైనా ఒక పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలనైనా లాగి ఉండేవారు. ఆ పని చేసే అవకాశం లేదు కాబట్టే రేవంత్ ప్రభుత్వం సేఫ్గా వుంది. ఇప్పుడేమో ఆయన పదిమందిని లాగడమే కాకుండా, ఏదో కుట్ర జరుగుతోందని వైరి పక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు.ఏది ఏమైనా ఫిరాయింపుల విషయంలో రేవంత్ తన గురువైన చంద్రబాబునాయుడిని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అనుసరిస్తున్నట్టే వుంది. కొసమెరుపు ఏమంటే కేసీఆర్ లక్కీ నెంబర్ తమ దగ్గర వుందంటూ రేవంత్ రెడ్డి తమకు 66 మంది సభ్యులు వున్నారని గుర్తు చేయడం. కేసీఆర్ లక్కీ నెంబర్ 6గా చెప్పుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్కు 66 మంది ఎమ్మెల్యేలున్నారు. కాబట్టి రెండు 6 సంఖ్యతో వున్నాయి కాబట్టి అలా అని వుండవచ్చుగానీ నిజానికి ఇలాంటి నమ్మకాలున్నవారు అన్ని అంకెల్ని కలిపి ఫైనల్ గా వచ్చిన సింగిల్ డిజిట్ నే లక్కీ నెంబర్ గా చూస్తారు. ఐతే రేవంత్ లక్కీ నెంబర్ తొమ్మిది!!!. :::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత ఇదీ చదవండి: నా ప్రాణాలకు హాని జరిగితే రేవంత్దే బాధ్యత!! -
గాంధీకి స్టేషన్ బెయిల్.. బీఆర్ఎస్ నేతలు అందుకే అరెస్ట్: సీపీ అవినాష్ మహంతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిష్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఘర్షణ ఎపిసోడ్ రాజకీయంగా చర్చకు దారి తీసింది. వాదనలు, ఘర్షణల సందర్భంగా ఇరు వర్గాల నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక, అరెస్ట్లపై తాజాగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి కేసులో అరికెపూడి గాంధీని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగానే హరీష్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నాం. హరీష్రావుకు అరెస్ట్ చేసిన నోటీసు ఇచ్చి పంపించివేశాం. పోలీసుల విధులకు కౌశిక్రెడ్డి ఆటంకం కలిగించారని మరో కేసు నమోదైంది. కౌశిక్, గాంధీలపై మూడు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.ఇదిలా ఉండగా.. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని, గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.అయితే, పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కౌశిక్రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కౌశిక్ వ్యాఖ్యలపై కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి కోమటి రెడ్డి -
నేను మాట్లాడింది తప్పే..: అరికెపూడి
హైదరాబాద్, సాక్షి: కౌశిక్ రెడ్డికి, తనకు మధ్య జరిగిన సంవాదం ద్వారా ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరిగాయని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తాజా పరిణామాల అనంతరం.. శుక్రవారం తన నివాసంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ప్రాంతీయ విబేధాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కౌశిక్రెడ్డిని ఎవరు ప్రొత్సహించారు?. నన్ను నాలుగైదుసార్లు రెచ్చగొట్టేలా మాట్లాడాడు. అసలు ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాలి... నేను మాట్లాడింది తప్పే.. కానీ రెచ్చగొట్టడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చింది. మహిళలను కూడా కించపరిచేలా మాట్లాడారు. హరీష్ నన్ను భాష మార్చుకోవాలని సూచించారు. కానీ, ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్లపై హరీష్ ఎలాంటి భాష వాడారో మనం చూడలేదా? అని అరికెపూడి గాంధీ ప్రశ్నించారు.ఇదీ చదవండి: తెలంగాణ కోసం చావడానికి సిద్ధం! -
తెలంగాణ ఉద్యమంలోనూ ఇంతటి నిర్బంధాలు లేవు: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే చేస్తారు అంటూ రేవంత్పై తీవ్ర విమర్శలు చేశారు.కోకాపేటలో హౌస్ అరెస్ట్లో ఉన్న హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో లా అండ్ ఆర్ఢర్ ఉందా?. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకున్నారా?. దాడికి పాల్పడిన వారిపై ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదు. సీఎం రెచ్చగొట్టేలా మాట్లాడితే ఆ పార్టీ కార్యకర్తలు కూడా అలాగే చేస్తారు. గొడవలకు సీఎం, డీజీపీదే బాధ్యత. మమ్మల్ని ఇవాళ హౌస్ అరెస్ట్ చేయించారు. నిన్న అరికెపూడి గాంధీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయించలేదు.నిన్న గాంధీని హౌస్ అరెస్ట్ చేయిస్తే కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి జరిగేది కాదు కదా?. ఇది గాంధీ చేసిన దాడి కాదు.. రేవంత్ రెడ్డి చేయించిన దాడి. ఇది స్పష్టంగా రేవంత్ రెడ్డి అజెండా అని అర్థమవుతోంది. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టు మొట్టికాయలు వేసింది. రేవంత్వి డైవర్షన్ పాలిటిక్స్. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే ఏదో ఒక డ్రామాకు తెరలేపుతారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి నిర్భందాలు చూడలేదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి -
తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం: ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫిరాయింపుదారులను 4 వారాల్లో డిస్క్వాలిఫై చేయాలన్నారు. 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని అన్నారు. అరికెపూడి గాంధీ తన సంగతి చూస్తామంటున్నారని.. తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధమని తెలిపారు. పోలీసులను అడ్డం పెట్టుకొని ఇబ్బందులు పెడుతున్నారన్న కౌశిక్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారన్నారు కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్దామని తాను,ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు బయలుదేరగా.. హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. తన ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటిపై దాడి చేయాలని చెప్పారని ఆరోపించారు.తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి.. తానుచేసిన తప్పు ఏంటని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..అరికెపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి.స్వయంగా అరికెపూడి గాంధీ నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు.అరికేపూడి గాంధీ భాషను సమాజం అంగీకరిస్తుందా?నేను ఉండేడే విల్లాలో మొత్తం 69 కుటుంబాలు ఉంటాయి.అదే విల్లాలో ఏపీ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు ఉంటారు.నేను వ్యక్తిగతంగా అరికెపూడి గాంధీని అన్నాను.ఆంధ్రా వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది.చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా,తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారు.హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారు.రేవంత్ రెడ్డి కుట్రతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నారు.రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారురేవంత్ రెడ్డికి ఇక నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అవసరం లేదుకౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు.బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కొట్లాడుతాను.కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా?కేసీఆర్,తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా?రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు బంద్ చేయాలి.మీ రౌడీయిజాన్ని ప్రజలు చూశారు.నిన్న హరీష్ రావును అరెస్టు చేసి షాద్ నగర్కు తీసుకువెళ్లారు.బిఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది.పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు.ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు.నాకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తలకు ధన్యవాదాలు.హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు.పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా.కేసీఆర్ పెట్టిన భిక్షతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు.ఇప్పటికైనా సిగ్గు, శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి.నేను అడిగిన ప్రశ్నలకు అరికేపూడి గాంధీకి ఎందుకు భయంపీఏసీ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పేరును ఇచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకునేందుకు మేము దాడులు చేయడం లేదు.దానం నాగేందర్కు గోకుడు ఎక్కువ ఉంది.దానం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు.నేను ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు గాంధీకి వ్యక్తిగతం మాత్రమే.కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్ ను మంచిగా చూసుకున్నారు.ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్స్ బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు.సెటిలర్స్ను మా నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.కాగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శంభీపూర్ రాజు నివాసం నుంచి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరిన ఇద్దరిని అడ్డుకున్నారు. వారిద్దరిని గృహనిర్భంధంలో ఉంచారు. ఈ సందర్భంగా పోలీసులతో కౌశిక్రెడ్డి వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ వాళ్లకు ఓ చట్టం.. తమకో చట్టమా అని నిలదీశారు. గాంధీ ఇంటికి పోతామంటే ఎందుకు ఆపుతున్నారని అడిగారు.మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. దానం నాగేందర్కు అనుమతించి తమను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, కంచెల పాలన అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు శంభీపూర్ రాజు ఇంట్లో గృహనిర్భందం చేశారు. కాగా శుక్రవారం సాయంత్రం వరకు కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్టు చేస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పారు. -
భారీ ఎత్తున ఆందోళనకు సిద్ధమైన కౌశిక్ రెడ్డి
-
మీడియా కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు: బొంతు రామ్మోహన్
సాక్షి,హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ ఇంట్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీ పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. శుక్రవారం(సెప్టెంబర్13) ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించేందుకు సిద్ధమైన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్ అరెస్టులు చేశారు. ఎమ్మెల్యేలు తలసాని, కౌశిక్ రెడ్డి, మాగంటి గోపినాథ్, వివేకానంద, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను ఆయా ప్రాంతాల్లో వారి ఇళ్లలోనుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి మద్ధతు పలకడానికి అయన నివాసానికి వచ్చిన బొంతు రామ్మోహన్మీడియాలో వార్తల కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడు: బొంతు రామ్మోహన్ సీనియర్ నేత గాంధీ పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తుంది.హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవటమే బీఆర్ఎస్ లక్ష్యం.సెటిలర్ల పట్ల కౌశిక్ రెడ్డి కామెంట్స్ సరైనవి కావు.సీనియర్ నేత గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది.రాజా సింగ్, బీజేపీ ఎమ్మెల్యేమాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోవడంతో మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటందని మంచి సూచన చేశారు.దాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.పనిపాట లేక కేంద్రంపై ఏదో ఒక ఆరోపణ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ పైన మంచిగా ఫైట్ చేస్తున్నారు..కేటీఆర్తోపాటు వారి ఎమ్మెల్యేలు మంచిగా ఫైట్ చేస్తున్నారు ఆ దారిలో వెళ్లండి.కానీ మధ్యలో మంచి పనులపై ఇలాంటి కామెంట్స్ చేస్తే పిచివాళ్లని జనాలు అంటారు..నేను చేసిన తప్పు ఏంటి?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారు.ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్దామని నేను, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు బయలుదేరాము.మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు.నాపై ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు.స్వయంగా రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయండని చెప్పారు.నాపై హత్యాయత్నం చేశారు.తెలంగాణలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఎట్లానేను చేసిన తప్పు ఏంటి.?అరికేపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి.స్వయంగా అరికేపూడి గాంధీ నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు.అరికేపూడి గాంధీ భాషను సమాజం అంగీకరిస్తుందా?నేను వుండే విల్లాలో మొత్తం 69 కుటుంబాలు ఉంటాయి.అదే విల్లాలో ఏపీ మంత్రి నారాయణ,ఎమ్మెల్యేలు ఉంటారు.నేను వ్యక్తిగతంగా అరికేపూడి గాంధీని అన్నాను.ఆంధ్రా వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది.చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారు.హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారు.రేవంత్ రెడ్డి కుట్రతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నారు.రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారుకాంగ్రెస్ మంత్రులు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారురేవంత్ రెడ్డికి ఇక నుంచి కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు అవసరం లేదుకౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు.బిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కొట్లాడుతాను.కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా...?కేసీఆర్,తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా...?రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు బంద్ చేయాలి మీ రౌడీయిజాన్ని ప్రజలు చూశారునిన్న హరీష్ రావును అరెస్టు చేసి షాద్ నగర్ కు తీసుకువెళ్లారుబీఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది.పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు.ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదునాకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తలకు ధన్యవాదాలుహైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు.పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా.కేసీఆర్ పెట్టిన భిక్షతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు.ఇప్పటికైనా సిగ్గు,శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి.నేను అడిగిన ప్రశ్నలకు అరికేపూడి గాంధీకి ఎందుకు భయం?పీఏసీ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పేరును ఇచ్చింది.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు మేము దాడులు చేయడం లేదు.దానం నాగేందర్కు గోకుడు ఎక్కువ ఉందిదానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు.నేను ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు గాంధీకి వ్యక్తిగతం మాత్రమే.కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్ ను మంచిగా చూసుకున్నారు.ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్స్ బిఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు.సెటిలర్స్ ను మా నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అల్లర్లు సృష్టించాలని కుట్ర చేస్తున్నారు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంసీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక హై డ్రామా చేస్తున్నారు.కౌశి క్ రెడ్డి అనే షికండిని పెట్టి హరీష్ రావు డ్రామా అడుతున్నాడు.కౌశిక్ రెడ్డికి మహిళల పట్ల గౌరవం లేదు.మహిళ గౌర్నర్ ని కూడా అవమానించాడు.కరీంనగర్ జెడ్పీ మీటింగ్లో మహిళా కలెక్టర్ పై కూడా అమర్యాదగా మాట్లాడారు.రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కుట్ర చేస్తున్నారు.ఈ కుట్రలను పసిగట్టాలని డిజిపికి విజ్ఞప్తి.కేసీఆర్ పామ్ హౌస్ లో పడుకున్నాడు.కేటీఆర్ విదేశాల్లో ఉండి కుట్రలకు తెర లేపారు.గ్యాప్ను ఉపయోగించుకోవాలని హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు.కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి.లేదంటే తెలంగాణ ప్రజలు కౌశిక్ రెడ్డిని తిరగనియ్యరు.ఏఐజీ ఆస్పత్రిలో హరీశ్రావుకు వైద్య పరీక్షలుకుడి భుజానికి చికిత్స తీసుకునేందుకు హరీశ్రావుకు అనుమతిచ్చిన పోలీసులుగురువారం గొడవల్లో హరీశ్రావు భుజానికి గాయంతొలుత హౌస్ అరెస్టు కారణంగా ఇంట్లోనుంచి బయటికి రావడానికి అనుమతించని పోలీసులు తర్వాత అనుమతిచ్చి ఏఐజీ ఆస్పత్రికి హరీశ్రావు వెంట వచ్చిన పోలీసులుఆస్పత్రిలో హరీశ్రావును ఎవరితో కలవనివ్వని పోలీసులుహరీశ్రావును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్ కవిత అరెస్టుకౌశిక్రెడ్డి, శంభీపూర్ రాజు హౌస్ అరెస్టుపీఏసీ చైర్మన్ గా ఎమ్మెల్యే గాంధీ ఎన్నికైనందునే శాలువా కప్పడానికి వెళ్తామంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.గాంధే స్వయంగా రమ్మని ఆహ్వానించినా పోలీసులు అడ్డుకుంటున్నారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ అరికెపూడి గాంధీ ఇంటికి ఎలా వెళ్లారు వారికి ఎలా పర్మిషన్ ఇస్తారు. ఎమ్మెల్యే గాంధీ ఇంటికి బయల్దేరిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ శంభీపూర్ రాజులను పోలీసులు బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి హౌస్ అరెస్టు చేశారు. హరీశ్రావు అంటే గౌరవం.. ఆయన స్థాయి తగ్గించుకుంటున్నారు: దానం నాగేందర్ కౌశిక్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. కౌశిక్ రెడ్డికి మహిళలంటే లెక్కలేదు.ఆయన ఒక బచ్చా. మహిళల ప్రతాపం అతనికి పూర్తిస్థాయిలో తెలియదు.మా ఎమ్మెల్యే గాంధీ టిఫిన్కి పిలిచాడు. అందుకోసమే గాంధీ ఇంటికి వచ్చాను.హారతులిచ్చి స్వాగతం పలుకుతామంటేనే గాంధీ, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు.ప్రాంతీయ విభేదాలను కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం సరికాదు.హరీష్ రావు అంటే నాకు గౌరవం. ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారుమాజీ మంత్రి హరీశ్రావు హౌజ్ అరెస్ట్.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో భేటీ అవుతామని మేడ్చల్ జిల్లా నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు ఇంటి వద్ద భారీగా మోహరించారు. కోకాపేటలోని ఇంట్లోనే హరీశ్రావును హౌస్ అరెస్ట్ చేశారు. హరీశ్రావు ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు హరీశ్రావు బయటికి వెళ్లకుండా అటు ఇంట్లోకి ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్ కవితను హరీశ్రావు నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గురువారం నిరసనలు, పోలీసుల అరెస్టు సందర్భంగా హరీశ్రావు చేతి గాయమైంది. ఈ గాయానికి చికిత్స తీసకోవడానికి ఆస్పత్రికి వెళ్తానని చెప్పినా తొలుత అనుమతించని పోలీసులు తర్వాత అనుమతిచ్చి ఆయన వెంట ఆస్పత్రికి వెళ్లారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కౌశిక్రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ వివాదంలో సైబరాబాద్ కమిషనరేట్ ముందు ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిపి నిరసన తెలిపిన హరీశ్రావును పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రి 11 గంటలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హరీశ్రావు చేతికి గాయమైంది. బీఆర్ఎస్తో యుద్ధం కాదు.. కౌశిక్రెడ్డితోనే యుద్ధం: ఎమ్మెల్యే గాంధీ ఇది బీఆర్ఎస్,గాంధీకి యుద్ధం కాదని, కౌశిక్రెడ్డికి తనకు మధ్య యుద్ధమని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్13) ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. గురువారం ఉదయం నా ఇంటికి వస్తానని కౌశిక్రెడ్డి అన్నారు.ఆయన రానందున వాళ్ల ఇంటికి నేనే వెళ్లా. ఇది బీఆర్ఎస్, గాంధీకి యుద్ధం కాదు.కౌశిక్రెడ్డితో యుద్ధం. కౌశిక్ బీఆర్ఎస్లోకి వచ్చి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు.ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. పార్టీలో ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు.ఇలాంటి వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయే ప్రమాదముంది.ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలి. బీఆర్ఎస్, కేసీఆర్ అంటే నాకు గౌరవం.వ్యక్తిగతంగా మాత్రమే కౌశిక్రెడ్డితోనే నాకు యుద్ధం. సమఉజ్జీ కూడా కాని కౌశిక్రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నాగాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు.. గాంధీ ఇంట్లో భేటీకి బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి గాంధీ నివాసానికి ఎవరు వచ్చినా అడ్డుకుంటున్నారు. శుక్రవారం ఉదయం గాంధీ ఇంటికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి ఇప్పటికే అక్కడినుంచి తరలించారు. కౌశిక్రెడ్డి డౌన్డౌన్ నినాదాలు.. గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తతఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో ముగిసిన కార్యకర్తల సమావేశం.కౌశిక్ రెడ్డిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం.కౌశిక్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు ఎవరు గాంధీ వచ్చినా సానుకూలంగా స్వాగతిస్తాం.ఒకవేళ దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని గాంధీ అనుచరులు స్పష్టం చేశారు.కౌశిక్రెడ్డి డౌన్డౌన్ నినాదాలతో గాంధీ నివాసప్రాంగణం మార్మోగుతోంది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మేడ్చల్ బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు..మరోవైపు గాంధీ ఇంట్లో భేటీకి సిద్ధమవుతున్న పలువురు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ఉదయం నుంచే అరెస్టు చేస్తున్నారు. పలువురిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. భేటీ కోసం బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళితే ఉద్రిక్తతలకు దారి తీస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మా ఎమ్మెల్యే ఇంటికి మేం వెళితే తప్పేంటి: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ చీఫ్ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే గాంధీ ఇంట్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీకి పిలుపునిచ్చిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధినేత శంభీపూర్రాజు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై రాజు స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి తాము వెళితే తప్పేంటి అని రాజు ప్రశ్నించారు. ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పిన మాటలను ఈ సందర్భంగా రాజు గుర్తు చేశారు. ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి రావాలని రాజు ఆహ్వానించారు. మరోపక్క గాంధీ ఇంటికి బయలుదేరిన మేడ్చల్ బీఆర్ఎస్ నేతలను, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గులాబీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు.. కేసు నమోదు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఫిర్యాదుతో కౌశిక్రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి పట్ల చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగిన హరీశ్రావు, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర తదితర బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అక్కడినుంచి తరలించి కేశంపేట పోలీస్స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సివచ్చింది. అనంతరం రాత్రి 11 గంటలకు హరీశ్రావు సహా ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు కేశంపేట పోలీస్స్టేషన్ నుంచి విడుదల చేశారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్లోనే గాంధీ.. ప్రతిపక్షానికే పీఏసీ: సీఎం రేవంత్ -
కౌశిక్ ఇంటిపై దాడి.. సీపీ ఆఫీసుకు హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసంపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాందీ, ఆయన అనుచరులు దాడికి దిగారు. గాంధీ స్వయంగా కౌశిక్రెడ్డి నివాసంవైపు దూసుకురాగా.. అనుచరులు ఇంట్లోకి వెళ్లి అద్దాలు, పూల కుండీలు పగలకొట్టడంతోపాటు రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు, కుర్చీలు విసురుతూ విధ్వంసానికి పాల్పడ్డారు. పాడి కౌశిక్రెడ్డి, ఆయన భార్య, కూతురు, కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే.. సుమారు గంట పాటు వీరంగం సృష్టించారు. అరికెపూడి ఈ సమయంలో కౌశిక్రెడ్డి ఇంటి ముందే కుర్చీ వేసుకుని ‘నీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటికి రా..నా కొడకా’ అంటూ తీవ్ర పదజాలంలో సవాల్ చేశారు. దీనితో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయారు. ఇది తెలిసి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు కౌశిక్ నివాసానికి చేరుకోవడంతో.. పోలీసులు ఎమ్మె ల్యే గాం«దీని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. గాందీపై, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేయడానికి కౌశిక్రెడ్డి, హరీశ్, ఇతర నేతలు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్కు వెళ్లగా.. హరీశ్రావును, ఇతర ఎమ్మెల్యేలను లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, హరీశ్రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. మరోవైపు ఇటీవలే అనారోగ్యానికి గురై కోలుకుంటున్న కౌశిక్రెడ్డి మామ కృష్ణారెడ్డి.. ఈ దాడితో ఆందోళన చెంది, అస్వస్థతకు లోనయ్యారు. అసలు ఎలా మొదలైంది? అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీని నియమించడంతో వివాదం రేగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఆయనకు పీఏసీ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని బుధవారం అరికెపూడి గాంధీ చెప్పడం.. ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న పక్షంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఇంటికి వెళ్లి గులాబీ కండువా కప్పి, ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రకటించడం.. అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే హైదరాబాద్ కొండాపూర్లోని కౌశిక్రెడ్డి నివాసం ఉన్న ‘కొల్లూరు లక్సూరియా’ నివాస సముదాయం వద్ద పోలీసులు మోహరించారు. గాంధీ ఇంటికి వెళ్లేందుకంటూ బయటికి వచ్చిన కౌశిక్రెడ్డిని అడ్డుకున్నారు. ఆయనను అరెస్టు చేసేందుకు వాహనం కూడా సిద్ధం చేశారు. ఈ సమయంలో కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్న పక్షంలో ఆయనను శుక్రవారం కేసీఆర్ వద్దకు తీసుకెళ్తానని ప్రకటించారు. మరోవైపు కౌశిక్రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన అరికెపూడి.. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తానే కౌశిక్ ఇంటికి వెళతానని ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే గాంధీ తన ఇంటికి వస్తే పార్టీ కండువా, మంగళ హారతులతో స్వాగతం పలుకుతానని కౌశిక్ ప్రకటించారు. బీఆర్ఎస్ మహిళా విభాగం నేత పావని గౌడ్, మరికొందరు మహిళలు మంగళహారతులతో సిద్ధమయ్యారు. భారీగా అనుచరులను వెంటబెట్టుకుని వచ్చి.. ఇక ఎమ్మెల్యే గాంధీ నివాసానికి వస్తానని కౌశిక్రెడ్డి చేసిన ప్రకటనతో గురువారం ఉదయం నుంచే కూకట్పల్లి వివేకానందనగర్ కాలనీలోని గాంధీ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచే పలువురు కార్పొరేటర్లు, అనుచరులు గాంధీ నివాసానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలలోపు కౌశిక్రెడ్డి తన రాకపోతే.. తానే కౌశిక్ నివాసానికి వెళ్తానని అరికెపూడి గాంధీ ప్రకటించారు. 12 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో అనుచరులతో భారీ కాన్వాయ్గా కౌశిక్ నివాసానికి బయలుదేరారు. పోలీసులు కౌశిక్రెడ్డి ఉంటున్న నివాస సముదాయం గేట్లు మూసేసినా.. గాంధీ అనుచరులు పైనుంచి లోనికి దూకారు. గేట్లు తెరుచుకుని కౌశిక్ ఇంటివైపు దూసుకెళ్లారు. అప్పటికే కౌశిక్రెడ్డి అనుచరులు కూడా అక్కడ ఉండటంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో గాంధీ అనుచరులు విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కౌశిక్ నివాసానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాడి విషయం తెలిసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో కౌశిక్ నివాసానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బిగాల గణేశ్గుప్తా, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజీవ్ సాగర్, కొలన్ బాల్రెడ్డి తదితరులు కౌశిక్రెడ్డిని పరామర్శించారు. కౌశిక్ నివాసంలో భేటీ అయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్తో ఫోన్లో మాట్లాడి ఘటన తీరును వివరించారు. కౌశిక్ కుటుంబ సభ్యులను కేసీఆర్ ఫోన్లో పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను. ఎక్కడి నుంచో వచ్చి మా గడ్డమీద కూర్చొని నువ్వు సవాల్ చేస్తే భయపడతామనుకున్నవా.. బిడ్డా! నన్ను హత్య చేసే ప్రయత్నం జరిగింది. రేపు ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావాలి. నీకు 65 ఏండ్లు, నాకు 35 ఏళ్లు.. నా ఇంటిపై దాడి చేయిస్తవా. సరే చూసుకుందాం. రేపు నా తడాఖా ఏంటో చూపిస్తా. గాంధీ చర్యకు ప్రతి చర్య ఉండటం ఖాయం. – హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పార్టీని భ్రషు్టపట్టించిన బ్రోకర్ నా కొడుకు కౌశిక్రెడ్డి. చీటర్, బ్రోకర్, కోవర్టు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను గౌరవిస్తా. కౌశిక్ లాంటివారే కేసీఆర్ చుట్టూ చేరి పార్టీకి తీవ్ర నష్టం చేశారు. ఇలాంటి బ్రోకర్లను దూరం పెట్టినపుడే బీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తారు. కౌశిక్ నా ఇంటికి వస్తానని చెప్పి దాక్కున్నాడు. కొడకా నీ ఇంటికి వచ్చా.. దమ్ముంటే బయటకు రా.. – శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ -
కమిషనర్ కు బీఆర్ఎస్ రెండు డిమాండ్లు
-
సీపీ ఆఫీసు వద్ద టెన్షన్.. పోలీసులకు కౌశిక్ రెడ్డి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల ఎపిసోడ్ రాజకీయంగా ఘర్షణలకు దారి తీసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ ఆఫీసు వద్ద కౌశిక్ రెడ్డి, పోలీసులకు మధ్య వాదన జరిగింది.సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కొండాపూర్లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హరీష్ రావుతో కలిసి కౌశిక్ రెడ్డి.. సీపీ ఆఫీస్కు వెళ్లారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సీపీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పోలీసులు, కౌశిక్ రెడ్డి మధ్య వాదనలు జరిగాయి. పాడి కౌశిరెడ్డి.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి వెలెత్తి చూపిస్తూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వెంటనే కలుగుజేసుకున్న హరీశ్ రావు.. పాడి కౌశిక్ రెడ్డికి సముదాయించి పక్కకు పంపించారు. అనంతరం ఆయన పోలీసులతో మాట్లాడారు. దీంతో సీపీ ఆఫీసు వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, సీపీ ఆఫీసు వద్ద హరీష్ రావు మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటాం. అరికెపూడి గాంధీ అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలి. దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుంటే కోర్టుకు వెళ్తాం. ఈ ఘటనపై డీజీపీ ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి వద్ద ధర్నా చేస్తాం. నార్సింగి పీఎస్లో గూండాలకు బిర్యానీలు పెడుతున్నారు. సీఎం డైరెక్షన్లోనే పోలీసులు పనిచేస్తున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సీపీ ఆఫీసు వద్ద ఆందోళనలు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: త్వరలో మరిన్ని చేరికలు.. టీపీసీసీ చీఫ్ కామెంట్స్ -
అప్పుడు ఎంఐఎంకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపులపై ఏ ఆదేశాలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికి మంచిదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని చెప్పారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్యను ప్రకటించిందని, 38 మంది అని ప్రకటించినప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే ఎంఐఎంకు పీఏసీ పదవి ఎలా ఇచ్చారని నిలదీశారు 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ పీఏసీ చైర్మన్గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ‘బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ, వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా? అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి మాటలపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కౌశిక్ చేసిన వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే మంచిదేనని, కోర్టుల తీర్పులు తమకే మేలు చేస్తాయని చెప్పారు. చదవండి: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్ నేతల నిరసన -
తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్ నేతల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు తెలంగాణ భవన్ వద్దకు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీపీసీసీ మహిళా నేతలు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే ఫోటోలు దగ్దం చేశారు. మహిళలపై కౌశిక్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడాడడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ లాంటి వల్లనే వదల్లేదని, కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్ వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.కాగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్గా ప్రకటించినప్పటి నుంచి విమర్శల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వెళ్లారు.అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోగా.. గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో గేటు దూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో ఇంటి అద్దాలను పగులగొట్టారు.చదవండి: పక్కా ప్రణాళికతోనే కౌశిక్రెడ్డిపై దాడి: హరీష్రావు -
నా వెంట్రుక కూడా పీకలేరు.. గాంధీకి నేనేంటో చూపిస్తా..
-
ఇది కచ్చితంగా రేవంత్ చేయించిన దాడే: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కు చేరుకుంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మద్దతుదారులు.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.కాగా, అరికెపూడి అనుచరుల దాడి ఘటనపై కేటీఆర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం?. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భందంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా?.ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా?. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదిరేది లేదు. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదు’ అంటూ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: కౌశిక్రెడ్డి ఇంటిపై దాడి.. అరికెపూడి అరెస్ట్ -
పక్కా ప్రణాళికతోనే కౌశిక్రెడ్డిపై దాడి, ప్రభుత్వానిదే బాధ్యత: హరీష్రావు
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆయన అనుచరుల దాడిని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. పక్కా ప్రణాళికతోనే కౌశిక్రెడ్డిపై దాడి జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జరిగిన దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హరీష్ రావు మాట్లాడుతూ.. ఇదేం ప్రజాస్వామ్యం, ఇదే ప్రజా పాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడమే కాకుండా.. వారిని ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ విద్రోహా, వికృత, అప్రజాస్వామిక వైఖరిని ఖండిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. వెంటనే కౌశిక్ రెడ్డికి సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో కౌశిక్పై గాంధీ అనుచరుల దాడి హేయమని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు.కాంగ్రెస్ గుండాలు మా ఎమ్మెల్యేపై దాడి చేశారు.వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తే దాడి చేశారుఎమ్మెల్యే అరికెపైడి గాంధీ వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.ప్రశ్నిస్తే మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేశారు.సీఎం రేవంత్ ప్రోద్భలంతోనే మా ఎమ్మెల్యేపై దాడి చేశారుఏసీపీ, సీఐలను వెంటనే సస్పెండ్ చేయాలిహైదరాబాద్లో పట్టపగలే ఎమ్మెల్యేకు రక్షణ లేదుఎమ్మెల్యేకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఏం ఉంటుందిఇది రేవంత్ ప్రభుత్వ వైఫల్యంమీరు ఒకటి చేస్తే.. మేము రెండు చేయగలుగుతాంఅధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదుమా సహనాన్ని అసమర్థతగా భావించొద్దురేవంత్ బాధ్యత లేని మనిషిశాసన సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాద్యత స్పీకర్దికౌశిక్పై దాడి చేసిన వారిని జైలుకు పంపేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందిపార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాహుల్ రాజీనామా చేయించాలికాంగ్రెస్ మోసాలను దేశం మొత్తం గమనిస్తోంది’ అని హరీష్ రావు పేర్కొన్నారు.కాగా పీఏసీ కమిటీ చైర్మన్గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో మొదలైన విమర్శల పర్వం.. ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పరస్పర సవాల్-ప్రతిసవాల్ ఎపిసోడ్లో అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లనివ్వకుండా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటికే అరికెపూడి వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అరికెపూడి వర్గీయులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. ఈ క్రమంలో.. అరికెపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి వర్గీయులు ప్రతిఘటనకు దిగడంతో.. ఇరువర్గాలు కుర్చీలతో బాహాబాహీకి దిగాయి. అక్కడితో ఆగకుండా అరికెపూడి వర్గీయులు రాళ్లు, టమాటాలను కౌశిక్రెడ్డి ఇంటిపైకి విసిరారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి.ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్పరిస్థితి చేజారుతున్న క్రమంలో.. ఎమ్మెల్యే అరికెపూడిని, నలుగురు కార్పొరేటర్ల పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి పీఎస్కు తరలించారు. -
ఆరెకపూడి గాంధీ నా ఇంటికి వస్తే..
-
‘అలాంటి పార్టీలో ఎవరైనా ఉంటారా?’.. అరికెపూడి తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ పార్టీపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను పీఏసీ చైర్మన్గా నియమించింది. ఈ నియామకంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది.ఇది చిలికి చిలికి గాలివానగా మారి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేసేదాకా వెళ్లింది. గాంధీ ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలతోనే కౌశిక్రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్కు రావాలి. ఆయన ఇంటికి వెళ్లి మా పార్టీ కండువా కప్పుతా’’ అంటూ కౌశిక్రెడ్డి సవాల్ చేశారు. ఈ క్రమంలో తాజాగా అరికెపూడి గాంధీ కౌంటర్ గా తీవ్ర పదజాలమే ఉపయోగించారు.‘‘కౌశిక్ రెడ్డి ఊరు మీద పడ్డ ఆంబోతు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో నాకు ఎలాంటి విబేధాలు లేవు. అయినా కూడా ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లేది లేదు. ఆ పార్టీలో బ్రోకర్లు ఉన్నారు. బ్రోకర్లతో సంసారం చేయగలుగుతామా?’’ అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.అంతకు ముందు.. కౌశిక్ రెడ్డికి కౌంటర్గా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. నా ఇంటికి పోలీసుల బందోబస్తు అవసరం లేదు. ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’’ అంటూ ప్రతిసవాల్ విసిరారు. చదవండి: సవాళ్ల పర్వం.. కౌశిక్రెడ్డి, అరికెపూడి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు -
ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లపర్వం
-
సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్
హైదరాబాద్, సాక్షి: పీఏసీ కమిటీ చైర్మన్గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో మొదలైన విమర్శల పర్వం.. ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పరస్పర సవాల్-ప్రతిసవాల్ ఎపిసోడ్లో అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లనివ్వకుండా పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటికే అరికెపూడి వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అరికెపూడి వర్గీయులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. ఈ క్రమంలో.. అరికెపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్ రెడ్డి వర్గీయులు ప్రతిఘటనకు దిగడంతో.. ఇరువర్గాలు కుర్చీలతో బాహాబాహీకి దిగాయి. అక్కడితో ఆగకుండా అరికెపూడి వర్గీయులు రాళ్లు, టమాటాలను కౌశిక్రెడ్డి ఇంటిపైకి విసిరారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి.సైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతసైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్ట్హరీష్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులురెండు గంటలుగా సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతఅరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో కేసు నమోదు19 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులుRS ప్రవీణ్ కుమార్తోపాటు హరీష్ రావుకు ఎఫ్ఐఆర్ కాపీ చూపించిన పోలీసులుసైబరాబాద్ సీపీ ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని కోరిన పోలీసులుహత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడంపై అభ్యంతరంసీపీ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న బీఆర్ఎస్ నేతల ఆందోళనఒక వీధి రౌడీలాగి ఇంటికి వస్తా అని రెచ్చగొట్టాడు: అరికెపూడి గాంధీవిద్వేషా రెచ్చగొట్టిన బీఆర్ఎస్ పార్టీ.. ఆ సభ్యుడిని తక్షణమే సస్పెండ్ చేయాలిప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టిన కౌశిక్రెడ్డిని సస్పెండ్ చేయాలి పదేళ్లలో ఇలాంటి ఘటనలు జరగలేదు: హరీష్ రావుత్వరలో రాహుల్ గాంధీ నివాసం వద్ద ధర్నా చేస్తాంగాంధీతోపాటు కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలిఅరెస్ట్ చేయకుంటే కోర్టుకు వెళ్తాంఘటన పై వెంటనే డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష వేయాలి సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తతబీఆర్ఎస్ నేతలను ఆఫీస్లోకి అనుమంతించని పోలీసులుపోలీసులతో బీఆర్ఎస్ నేతల వాగ్వాదంకౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేదాకా సీపీ ఆఫీస్లోనే ఉంటామన్న బీఆర్ఎస్ నేతలుసీపీ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నేతల ఆందోళనకౌశిక్పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలుముగ్గురు ఎమ్మెల్యేలకు అనుమతిసీపీ లేకపోవడంతో జాయింట్ సీపీ జోయెల్ డెవిస్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలి: హరీష్ రావుఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతాం: హరీష్ రావుకౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులుఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యేను కోరిన పోలీసులుదాడి చేయడానికి వచ్చిన వాళ్లను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిడీసీపీ, ఏసీపీలను సస్పెండ్ చేసిన తరువాతే ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే వెల్లడిపట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? కేటీఆర్శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మద్దతుదారులు.. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం?. ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భందంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా?ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదిరేది లేదు. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని.. సిద్దిపేట నుండి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్పరిస్థితి చేజారుతున్న క్రమంలో.. ఎమ్మెల్యే అరికెపూడిని, నలుగురు కార్పొరేటర్ల పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి పీఎస్కు తరలించారు. సాక్షితో మాదాపూర్ డీసీపీకొండాపూర్లోని కౌశిక్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తతఅరికెపూడి గాంధీ వర్గం రాకతో వేడెక్కిన పరిస్థితికౌశిక్ రెడ్డి ఇంటిపైకి రాళ్లు విసిరిన దుండగలుఅరికెపూడిని, ఇరువర్గాల అనుచరుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులుప్రస్తుతం పరిస్థితి కంట్రోల్ అయ్యింది: మాదాపూర్ డీసీపీచట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం: మాదాపూర్ డీసీపీగాంధీ ఆయన అనుచరులపై చర్యలుంటాయి: మాదాపూర్ డీసీపీనేరం చేశారు కాబట్టే చర్యలు తీసుకుంటాం: మాదాపూర్ డీసీపీనా ఇంటికి వస్తానని కౌశిక్ రెడ్డి రాలేదు: అరికెపూడి గాంధీ అందుకే నేనేచ్చా: అరికెపూడి గాంధీనాకు దమ్ముంది ఉంది కాబట్టే వచ్చా: అరికెపూడి గాంధీకౌశిక్ రెడ్డికి దమ్ముంటే బయటకు రావాలి: అరికెపూడి గాంధీనన్ను హత్య చేయాలని చూశారు: పాడి కౌశిక్ రెడ్డిగుండాలు వచ్చి దాడి చేయడం కరెక్టేనా: పాడి కౌశిక్ రెడ్డిముందస్తు ప్లాన్తో వచ్చి దాడి చేశారు: పాడి కౌశిక్ రెడ్డితెలంగాణ లా అండ్ ఆర్డర్ ఉందా? లేదా?: పాడి కౌశిక్ రెడ్డిఒక ఎమ్మెల్యేకే రక్షణ ఇవ్వలేకపోతే ఎలా?: పాడి కౌశిక్ రెడ్డిపోలీసులు ఏం చేస్తున్నారు?: పాడి కౌశిక్ రెడ్డిదాడికి ప్రతిదాడి ఉంటుంది: పాడి కౌశిక్ రెడ్డి భారీ కాన్వాయ్తో కౌశిక్రెడ్డి నివాసానికి అరికెపూడికొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న అరికెపూడి గాంధీకౌశిక్రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు అరికెపూడి అనుచరుల యత్నం అరికెపూడి రాకపై పాడి కౌశిక్ రెడ్డిఅరికెపూడి గాంధీని నా ఇంటికి ఆహ్వానిస్తున్నకండువా కప్పి భోజనం పెట్టి తెలంగాణ భవన్ కి తీసుకెళ్తాసాయంత్రం కెసిఆర్ దగ్గరికి తీసుకెళ్తాపోలీసులు నా ఇంటి గేట్ వద్ద ఆపితే .. స్వయంగా గేట్ వద్దకి వెళ్లి పోలీసులకు చెప్పి మరి లోపలికి తీసుకెళ్తా కౌశిక్ రెడ్డి ఇంటికి బయల్దేరిన అరికెపూడి గాంధీనేడు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానేను స్థానికుడిని కాదని చెప్పడానికి కౌశిక్ ఎవడు?ఎవరు అడ్డుకున్నా కౌశిక్ ఇంటికి వెళ్తా!నియోజకవర్గం కోసమే సీఎం రేవంత్ను కలిశా మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతే తప్పేంటి?: పాడి కౌశిక్ రెడ్డి11గం. గాంధీగారి ఇంటికి వెళ్తానని చెప్పాఉదయం నుంచే నా ఇంటి ముందు కంచెలేసి పోలీసులు మోహరించారునన్ను వెళ్లకుండా ప్రివెంటివ్ అరెస్ట్ చేశారుకాంగ్రెస్లో చేరలేదని మీరే(అరికెపూడి) అన్నారు కదా!అప్పుడు నేను మీ ఇంటికి వస్తా అంటే ఎందుకు భయం? ఎందుకంత ఉలిక్కిపాటు?తన్నుకుందాం అని నేను అనలేదు కదా?ఎవరు బ్రోకర్?గాంధీలాగా.. పూటకో పార్టీ మారేటోడు బ్రోకరా?. ఒక బీఫామ్ మీద గెలిచిన పార్టీ అండగా ఉండేటోడు బ్రోకరా?గాంధీ.. నేను వయసులో ఉన్నా.. నేను రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూస్కోరేపు బీఆర్ఎస్ ఉనన్న కార్యకర్తలంతా గాంధీ ఇంటికి వెళ్దాంఅక్కడే బ్రేక్ఫాస్ట్ తిందా.. లంచ్ చేస్తాంగాంధీగారిని తీసుకుని తెలంగాణ భవన్కు తీసుకెళ్తాంఅక్కడి నుంచి కేసీఆర్ దగ్గరకు వెళ్తాంగ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నాఆయన బీఆర్ఎస్లో ఉంటే కేసీఆర్ దగ్గరకు వెళ్లడానికి ఎందుకు భయంబీఆర్ఎస్ కాదట.. పంచాయితీ నాతోనేనట!భూతగాదాలు, అన్నదమ్ముల పంచాయితీ ఉందా?నీ స్వార్థం కోసమే పార్టీ మారారుయావత్ తెలంగాణ సమాజం ఇదంతా చూస్తోంది.దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికకు వెళ్లురేపు కచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్లి తీరతాంగాంధీ మా ఇంటికి వస్తానంటే వెల్కమ్.. సాదరణంగా కండువా కప్పి ఇంట్లోకి తీసుకెళ్తాహుజురాబాద్లో ఈటలలాంటివాడిని ఓడించి గెలిచన వాడిని నేనుఅలాంటి నాపై కోవర్టు అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంరేపు వస్తాం.. కలిసి తెలంగాణ భవన్, కేసీఆర్ దగ్గరకు పోదాంగాంధీగారికి ఇదే ఆహ్వానంలేదు తన్నుకుందాం అంటే ఐ యామ్ రెడీతన్నుకోవడం ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదుఆయనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు వస్తే మాకూ సంతోషమే కదా! కౌశిక్రెడ్డికి సినిమా చూపిస్తా: అరికెపూడినా ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నా.పది నిమిషాల్లో రాకపోతే నేనే కౌశిక్ ఇంటికి వెళ్తా.కౌశిక్ రెడ్డి ఓ బ్రోకర్.. నాపై సవాల్ చేస్తా. నా దగ్గరకు వస్తాడని ఎదురు చూస్తా. ఆయన రాకపోతే నేనే ఆయన ఇంటికి వెళ్తాఓ దుర్మార్గుడు నా ఇంటి మీద జెండా ఎగరేస్తానంటే ఊరుకుంటానా?12 గం. నేనే కౌశిక్ ఇంటికి వెళ్తాకౌశిక్ రెడ్డి లాంటి దుర్మార్గుడ్ని కేసీఆర్ పదేళ్లపాటు పక్కన పెట్టుకున్నారుగతంలో కౌశిక్రెడ్డి కోవర్టుగా పని చేశాడుకౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కు దూరం అవుతున్నారుఇజ్జత్ లేనివాళ్ల సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదునేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని అని అసెంబ్లీలో స్పీకర్ ప్రకటించారుకౌశిక్ లాంటోడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదుకేసీఆర్కే నా సమాధానం చెబుతాఅంతకు ముందు ఉదయం కూడా ఆయన మాట్లాడుతూ.. ‘‘నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. నా ఇంటికి పోలీసుల బందోబస్తు అవసరం లేదు. ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్ విసిరారు. మరోవైపు.. అరికెపూడి ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పుతానన్న పాడి కౌశిక్ రెడ్డి కామెంట్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కౌశిక్డ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. పీఏసీ కమిటీ చైర్మన్గా అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై కౌశిక్రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్కు రావాలని కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పాలి. గురువారం అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా. ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నాడు కాబట్టి రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా.. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగరేసి, BRS భవన్ లో ప్రెస్ మీట్ పెడదాం’’ అని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే దీనికి అరికెపూడి గాంధీ అంతేతీవ్రంగా ప్రతిస్పందించారు. ఇదీ చదవండి: చీర, గాజులు వర్సెస్ చెప్పులు!! -
చీరలు, గాజులు.. చెప్పులతో కౌంటర్
-
10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్..
-
కాంగ్రెస్ నేషనల్ పార్టీలా వ్యవహరించడంలేదు: కౌశిక్ రెడ్డి
-
హైకోర్టు తీర్పు.. పది స్థానాల్లో ఉప ఎన్నిక ఖాయం: పాడి కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్.. రాష్ట్రానికో నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదని ఎద్దేవా చేశారు. ఇక, అసెంబ్లీ స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని సూచించారు.కాగా, తాజాగా పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘నేను, ఎమ్మెల్యే వివేకానంద వేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ మారి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని హైకోర్టు స్పీకర్కు సూచించింది. స్పీకర్ హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలి. కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రానికి ఒక నీతి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. హిమాచల్లో బీజేపీకి మద్దతు పలికిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.కాంగ్రెస్ జాతీయ పార్టీలా లేదు.. కాంగ్రెస్ జాతీయ పార్టీలా వ్యవహరించడం లేదు. ఉప ప్రాంతీయ పార్టీలా వ్యవహరిస్తోంది. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణ ఫిరాయింపులపై ఎందుకు స్పందించడం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యారెక్టర్ లేదు. రాహుల్ గాంధీ అయినా తాను ఫిరాయింపులపై చెప్పిన మాటలను గౌరవించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారు. ఇపుడు హైకోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ గౌరవించాలి.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించిన పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం. దానం నాగేందర్ను హైదరాబాద్ రోడ్లపై మేమే ఉరికిస్తాం.రేవంత్ రెడ్డి అవినీతి సొమ్ముతో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలా పది కోట్లు ఇచ్చి కొన్నారు. అన్ని వ్యవస్థలు పరస్పరం సహకరించుకుని పని చేయాలి. హైకోర్టు చెప్పింది శాసన సభాపతి పాటించాలని కామెంట్స్ చేశారు.హైకోర్టు తీర్పు చారిత్రాత్మకం..మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ..‘హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ సాధించిన తొలి విజయం. మళ్ళీ కోర్టు జోక్యం చేసుకోకముందే అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. స్పీకర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి. సీఎం ఆయనపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దు. కాంగ్రెస్ ఫిరాయింపులపై ద్వంద్వ ప్రమాణాలు వీడాలి. స్పీకర్ అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమైంది. అన్ని అసెంబ్లీలకు ఈ తీర్పు ప్రామాణికం కానుంది. సీఎం రేవంత్ తీరుతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలి వెళ్తున్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘మూసీ కంటే రేవంత్ నోరే కంపు’.. బీఆర్ఎస్ నేతల కౌంటర్
సాక్షి,హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరాలో జరిగిన రైతు రుణమాఫీ సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ‘సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీవీ ముందు కూర్చున్న రాష్ట్ర ప్రజలు కూడా తలదించుకులే ఉంది. హరీష్ రావు గురించి కూడా ఏదేదో మాట్లాడారు. రుణమాఫీపై హరీష్ రావు ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఇప్పుడు రెండు లక్షల రుణం మాఫీ కాలేదు.. కాబట్టి రేవంత్ రెడ్డి వచ్చి ముక్కు నేలకు రాయాలి. మీరిచ్చిన హామీలపై నిలదీస్తూనే ఉంటాం. హరీష్ రావు పైన కూడా వాడకూడని భాషతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేరు తీయకుండా రేవంత్రెడ్డికి నిద్ర పట్టదు.సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలే.. భద్రాద్రి రాముడి సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ‘బహిరంగ సభలో పచ్చి భూతులు మాట్లాడారు.. కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. 30 వేల ఉద్యోగాలు కాదు.. 30 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ప్రాజెక్ట్ కట్టింది మేమే అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉంది. ఒక మంత్రి నీళ్ళు జల్లుకోవడం, మరో మంత్రి పూలు జల్లడం. ఇదంతా కేసిఆర్ ప్రాజెక్ట్ నిర్మించటం వల్లే. కష్టపడి నీళ్ళు తెచ్చామని చెప్పుకోవడానికి వారికి సిగ్గుండాలి. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ కాగితాలకే పరిమితం చేసింది మీరు కాదా?. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు’ అని ధ్వజమెత్తారు.ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి..సీఎం రేవంత్రెడ్డి ఏమాత్రం సిగ్గు లేకుండా హరీష్ రావుపై అసభ్య విమర్శలు చేశాని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ‘దేవుళ్ళను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి. సూటిగా చెప్పు రూ. 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా లేదా?. కేవలం రూ. 17 వేల కోట్లు మాత్రమే అకౌంట్లలో వేశావ్. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలి. 2018లో రేవంత్ను కొడంగల్లో హరీష్ రావు చిత్తు చిత్తుగా ఓడించారు. హరీష్ రావును విమర్శలు చేసే స్థాయి రేవంత్కు లేదు. మూసి కంటే కంపు రేవంత్ నోరు. ముందు రేవంత్ నోరును ప్రక్షాళన చేయాలి’అని మండిపడ్డారు. -
‘దానం’ దమ్ముంటే రా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియాహాల్లో కౌశిక్రెడ్డి శనివారం(ఆగస్టు3) మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయన్నారు. సభలో రూల్స్కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడారన్నారు.‘దానం నాగేందర్ నేను హైదరాబాద్లోనే ఉన్నా. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడో స్పాట్ చెప్పు రావడానికి నేను రెడీ. దానం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు.గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరువకు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చింది. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్కు టీషర్ట్, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు’అని కౌశిక్రెడ్డి దానంపై విరుచుకుపడ్డారు. -
రేవంత్.. యూఎస్ వెళ్లాక సీఎం కుర్చీకి ఎసరే: పాడి కౌశిక్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సీఎం అమెరికా వెళ్లి వచ్చే వరకు ఆయన సభ్యత్వం ఉంటుందో లేదో చూసుకోవాలి. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పాయింట్ వద్ద కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి బెదిరిస్తే బయటపడే వాళ్ళు లేరు. సబితా ఇంద్రారెడ్డిని అవమానించినందుకు చేసిన సీఎం క్షమాపణ చెప్పాలి. అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో ముఖ్యమంత్రి రేవంత్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ.. మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉంది. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారు.హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలి. హుజురాబాద్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదు. నా జీతం నుంచి నాలుగు లక్షలు వారికి ఇచ్చాను. హుజురాబాద్లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు మీడియా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సోం డిస్టిలరీ నుంచి కాంగ్రెస్కు రూ.1.8 కోట్ల ఫండ్
సాక్షి, హైదరాబాద్: సోం డిస్టిలరీకి..కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, కానీ ఆ సంస్థ నుంచి కాంగ్రెస్కు రూ.1.80 కోట్ల ఫండ్ అందినట్టు కౌశిక్రెడ్డి ఆరోపించారు. సోమవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. మధ్యలో కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు.ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ, ఇక తెలంగాణలో తమ బ్రాండ్ల సరఫరాకు అనుమతి వచ్చినట్టు సోం బ్రేవరేజెస్ ప్రకటించిందని, కానీ ప్రభుత్వం మాత్రం తాము అనుమతి ఇవ్వలేదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అయితే దీనిని క్యాన్సిల్ చేసినట్లు మంత్రి తెలిపారని, కానీ ఆ అనుమతి రద్దు చేయలేదని సెబీ నుంచి సమాధానం వచ్చినట్టు తెలిపారు. మధ్యప్రదేశ్లోని మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రావడంతో సంబంధిత మంత్రికి తెలియకుండా ఇదంతా జరిగినట్టు తెలిపారు. ఆఫ్లైన్లో సంస్థకు ఆర్టీసీ టెండర్ ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ను ఆన్లైన్ టెండర్ వేయకుండా ఆఫ్లైన్ టెండర్ ద్వారా చలో మొబిలిటీ సంస్థకు అప్పగించారని కౌశిక్రెడ్డి తెలిపారు. టెండర్ పిలిచి రద్దు చేసినట్టు ప్రకటించిన ఆర్టీసీ.. ఆ తర్వాత మళ్లీ ఎలా ఆ సంస్థకు కట్టబెట్టిందని ప్రశ్నించారు. ఇక ఫెయిర్ కలెక్షన్పై తమ బృందం బిహార్, అస్సాం, ఇండోర్, జబల్పూర్కు స్టడీ టూర్కు వెళ్లినట్టు తెలిపిందన్నారు.అయితే టూర్ ఆదేశాలకు, టెండర్ ఇవ్వడానికి మధ్య మూడు రోజులే గ్యాప్ ఉందని, ఈ మూడు రోజుల్లోనే నాలుగు రాష్ట్రాలు ఎలా తిరిగి వస్తారని ప్రశ్నించారు.ఆర్టీసీకి సంబంధించి చలో మొబిలిటీ సంస్థపై, ఎక్సైజ్ శాఖకు సంబంధించి సోం డిస్టిలరీ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని, వీటిపై విజిలెన్స్, సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 10 వేల పరిహారం ఇవ్వాలని కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను కౌశిక్రెడ్డి రెచ్చ గొడుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వాలా వద్దా బీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ మంత్రి సీతక్కకు నాలెడ్జ్ లేదని ఆరోపించారు. దీనిపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తంచేస్తూ, తనకు దురహంకార నాలెడ్జ్ లేదని, ఓట్ల కోసం చస్తా అన్న నాలెడ్జ్ లేదన్నారు. -
సీతక్కపై పాడి కౌశిక్రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం
సాక్షి,హైదరాబాద్: మహిళలకు ఉచిత బస్సు స్కీమ్పై తెలంగాణ అసెంబ్లీలో సోమవారం(జులై 29) దుమారం రేగింది. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఈ క్రమంలో మంత్రి సీతక్కకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు, ఆర్టీసీ కార్మికులకు ఏం చేసిందో నాలెడ్జ్ లేకపోవచ్చని కౌశిక్రెడ్డి అన్నారు. నాలెడ్జ్ లేదు అన్న మాటలపై కాంగ్రెస్ సీరియస్ అయింది. నాలెడ్జ్ లేదు అన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్కకు క్షమాపణ చెప్పాలి లేదా ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్పీకర్ కలుగజేసుకోవడంతో సీతక్కపై మాట్లాడిన మాటలను కౌశిక్రెడ్డి వెనక్కి తీసుకున్నారు. -
స్పీకర్కు కోర్టులు ఆదేశాలివ్వలేవు
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై స్పీకర్కు కోర్టులు ఆదేశాలు జారీ చేయలేవని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు. ఫిర్యాదులపై నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ రాజ్యాంగం స్పీకర్కు కల్పించిందన్నారు. రిట్ పిటిషన్లు దాఖలు చేయడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది తొందరపాటు చర్య అని పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 11కు వాయిదా వేసింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావును అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన కడియం, తెల్లం ఆ తర్వాత తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లో చేరారని పిటిషనర్ కోర్టు దష్టికి తెచ్చారు. అందుకే వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరారు. స్పీకర్ను కలవాలని ప్రయతి్నంచినా సమయం ఇవ్వట్లేదని.. ఈ–మెయిల్ ద్వారా పంపిన పిటిషన్పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకొనేలా స్పీకర్ను ఆదేశించాలని వివేకానంద విజ్ఞప్తి చేశారు.ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్లోకి ఫిరాయించారని.. ఆయన్ను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. దీనిపై ఏజీ వాదిస్తూ పిటిషన్లు సమరి్పంచిన వెంటనే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవట్లేదని పిటిషనర్లు పేర్కొనడం సరికాదన్నారు.ఫిర్యాదు చేసిన 10 రోజుల్లోనే త్వరగా నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని చెప్పారు. ఈ సందర్భంగా తన వద్ద పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టులు స్పీకర్కు ఆదేశాలు ఇవ్వలేవంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను వివరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపించారు. -
MLAల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ
-
ప్రజాపాలనంటే అక్రమ కేసులు బనాయించడమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులు భయపడేది లేదన్నారు.కాగా, కేటీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి బెదిరింపులకు మేము భయపడేది లేదు. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారు.ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేనా?. ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా?. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలతో పాటు తరగతి గదులలో పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పనపైన మండల విద్యాధికారితో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించటం తప్పా?’ అని ప్రశ్నలు సంధించారు. -
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
-
కలెక్టర్ కి అడ్డుపడి ధర్నాకు కూర్చున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
-
‘బ్లాక్ బుక్’లో మంత్రి పొన్నం పేరు: పాడి కౌశిక్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ఫిలింనగర్లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి బుధవారం(జూన్ 26) ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతికి పాల్పడలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి తనతో పాటు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ‘మంత్రి పొన్నం ప్రభాకర్ను ఫిలింనగర్లోని వేంకటేశ్వర ఆలయంలో ప్రమాణం చేయాలని డిమాండ్ చేశా. ఫ్లైయాష్ స్కామ్ చేయలేదని ప్రమాణం చేయాలని కోరాను. నువ్వు నీతి మంతుడివి అయితే ఎందుకు రాలేదు. నాపై తప్పుడు ఆరోపణలు చేశారు పొన్నం. తడి బట్టలతో హుజురాబాద్లో హనుమాన్ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేశాను.నీ నిజాయితీ ఎందుకు నిరూపించుకోవడం లేదు పొన్నం ప్రభాకర్. వే బ్రిడ్జిలో కొలతలు తక్కువ వచ్చాయి. దీనికి ప్రూఫ్ ఉంది. వే బిల్ సరిగా లేదు. రవాణా శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా? రోడ్లు నాశనం చేస్తున్నారు. ఫ్లైయాష్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల శవాల మీద పైసలు ఏరుకుంటున్నాడు’అని కౌశిక్రెడ్డి మండిపడ్డారు. ప్రమాణం సందర్భంగా బ్లాక్ బుక్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును కౌశిక్రెడ్డి రాశారు. తాము అధికారంలోకి వచ్చాక పొన్నంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రమాణం చేసేందుకుగాను బుధవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు చేరుకున్న కౌశిక్రెడ్డి అక్కడి నుంచి వెంకటేశ్వరస్వామి గుడికి బయలుదేరారు. -
ఫిరాయింపులపై సుప్రీంకు!
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్న భారత్ రాష్ట్ర సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానుంది. ఒకవేళ దానంను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.కేవలం దానం నాగేందర్పైనే కాకుండా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే లు అందరిపైనా వేటు వేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలయ్యే అనర్హత పిటిషన్పై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పులోని పేరా నంబరు 30, 33 ప్రకారం హైకోర్టు తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ పార్టీ వాదిస్తోంది. దానంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్పూర్), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), సంజయ్ (జగిత్యాల)కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. అధినేత అప్రమత్తం: పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు అప్రమత్తమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు కొందరు సీనియర్ నేతలు రెండు రోజులు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాటం చేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఇందుకు సంబంధించి న్యాయ నిపుణులతోనూ కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. ఇంకోవైపు కేటీఆర్, హరీశ్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిరంతరం మాట్లాడుతున్నారు. కేసీఆర్ కూడా వారితో టచ్లోకి వెళ్లినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీలో కొనసాగితే మంచి భవిష్యత్తు: పార్టీలో కొనసాగితే భవిష్యత్తులో మంచి ప్రాధాన్యత ఉంటుందని కేసీఆర్ భరోసా ఇస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిన తీరు, తర్వాతి కాలంలో వారు రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయిన వైనాన్ని కేసీఆర్ వారికి వివరిస్తున్నట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్సీలను కూడా పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలియడంతో వారితోనూ బీఆర్ఎస్ అధినేత మాట్లాడుతున్నట్లు తెలిసింది. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల్లో భరోసా నింపేందుకు మూడు నాలుగు రోజుల్లో ప్రత్యేక భేటీ నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. -
కరీంనగర్లో పొన్నం ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: రామగుండం ఎన్టీపీసీ విద్యు త్ కేంద్రం నుంచి ఫ్లైయాష్ (బూడిద) తరలింపులో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. కరీంనగర్లో రేవంత్, పొన్నం ట్యాక్స్ అమలవుతున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, డాక్టర్ సంజయ్తో కలిసి తెలంగాణభవన్లో కౌశిక్రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. 32 టన్నుల బూడిద తరలించాల్సిన లారీలో 72 టన్నులు తరలిస్తున్నారని, వే బిల్లుల్లో ఎన్ని టన్నులు తరలిస్తున్నారనే విషయం పేర్కొనడం లేదని చెప్పారు.బూడిద అక్రమరవాణా ద్వారా మంత్రి పొన్నం రోజూ రూ.50 లక్షలు సంపాదిస్తుండగా, ఆయన అన్న కుమారుడు అనూప్ ఈ వసూ ళ్లు చేస్తున్నారన్నారు. ఓవర్లోడ్తో వెళుతున్న 13 లారీలను ఇటీవల తాను స్వయంగా పట్టుకొని అధికారులకు అప్పగించినా, రెండు లారీ లు సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీలను తాను పట్టుకోవడంతో రూటు మార్చి హుస్నా బాద్ మీదుగా దందా కొనసాగిస్తున్నారని కౌశిక్రెడ్డి చెప్పారు. ఇకపై ఏ మార్గంలో ఫ్లైయాష్ తరలించినా బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకుంటారని హెచ్చరించారు. ఓవర్లోడ్తో వెళుతు న్న ఫ్లైయాష్ లారీల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థి అఖిల్ మరణించాడన్నారు. ఎన్టీపీసీ వివరాలు దాచిపెడుతోంది ఫ్లైయాష్ అక్రమ రవాణా జరుగుతున్నా, ఎన్టీపీసీ అధికారులు వివరాలు దాచిపెడుతూ చోద్యం చూ స్తున్నారని కౌశిక్రెడ్డి అన్నారు. అధికారుల తీరుపై ఢిల్లీలో ఆ సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా మని చెప్పారు. ఓవర్లోడ్ దందాపై బీఆర్ఎస్ కేడ ర్ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందన్నారు. తప్పు లు చేస్తున్న అధికారుల వివరాలు రెడ్బుక్లో నమో దు చేసి అధికారంలోకి వచి్చన తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు. హరీశ్రావుపై ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ అనవసర విమర్శలు చేస్తున్నారని, ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చే స్తారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. -
పొన్నం ప్రభాకర్పై సంచలన ఆరోపణలు
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అతిపెద్ద స్కాం చేశాడని బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అండగదండలతో రామగుండంలో ఫ్లై యాష్ బూడిదను ఉచితంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీపీసీలో నుంచి వస్తున్న యాష్ను లోడ్ రికార్డు లేకుండానే బయటకు పంపిస్తున్నారని అన్నారు. అయితే లారీ లోడు ఖాళీగా చూపిస్తూ వే బ్రిడ్జి ఇస్తున్నారని విమర్శించారు. .కలెక్షన్ బాయ్గా పొన్నం ప్రభాకర్ అన్న కొడుకు అనూప్ ఈ వ్యవహారాలు చూస్తున్నాడని కౌశిక్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. స్థానికంగా దీనిపై వార్తలు రాస్తున్న రిపోర్టర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ క్రమంలో రెండు లారీలను సీజ్ చేసి, మిగితా 13 లారీలను వదిలిపెట్టారని తెలిపారు.ఇంత పెద్ద స్కాంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ పొన్నం ప్రభాకర్ను ప్రశ్నించారు. తమ ఆరోపణలపై దమ్ముంటే మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. `నా దిష్టి బొమ్మ తగలబెట్టడం కాదు. ఈ స్కాం పై మీరు మాట్లాడాలి. ఆధారాలతో సహా మేము బయట పెడుతున్నాం. రేపటి నుంచి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే మేము బాధ్యులం కాదు. పేద పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.` అంటూ మండిపడ్డారు.కాగా రెండు రోజుల క్రితం ఓవర్ లోడ్తో రామగుండం నుంచి ఖమ్మం వెళ్తున్న బూడిద లారీలను హుజురాబాద్ వద్ద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. వే బిల్లు లేకుండా ప్లై యాష్ బూడిద తరలించడాన్ని గుర్తించి సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సకాలంలో స్పందించకపోవడంతో ఆందోళనకు దిగి అధికారుల తీరు, మంత్రి పొన్నం వైఖరిపై మండిపడ్డారు.రవాణా శాఖ మంత్రి అండదండలతోనే అక్రమ దందా సాగుతుందని ఆరోపించారు. అధికారులకు పిర్యాదు చేసిన మంత్రి ప్రోద్బలంతో పట్టించుకోవడం లేదని విమర్శించారు. అక్రమ దందాకు చేస్తున్న మంత్రి పొన్నం ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. -
‘దానం’పై వేటు వేయకుంటే కోర్టుకు వెళతాం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్కు పిటిషన్ ఇచ్చి 12 రోజులు కావస్తున్నా స్పందన లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. దానం అనర్హత పిటిషన్పై స్పీక ర్ చర్య తీసుకోని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపా ల్, బండారి లక్ష్మారెడ్డితో కలిసి శనివారం తెలంగాణ భవన్లో కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనర్హత వేటుకు సంబంధించి అదనపు అఫిడవిట్ సమరి్పంచేందుకు శనివారం సభాపతిని కలిసేందు కు వెళ్లినా అసెంబ్లీలో ఎవరూ అందుబాటులో లేరన్నారు. కార్యదర్శి కూడా అందుబాటులో లేకపోవడంపై ఆయనపై ఒత్తిళ్లు ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోందన్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం అభ్యరి్థగా దానంను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించినా స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేస్తే దేశమంతా హర్షిస్తుందని కౌశిక్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లినా కనీసం తమ వినతిపత్రం కూడా తీసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక పార్టీ లో గెలిచి మరో పారీ్టలోకి వెళ్లడం సిగ్గుచేటని, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారడం నమ్మించి గొంతు కోయడమే అని పేర్కొన్నారు. -
‘సీఎం రేవంత్రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ కలవలేదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చిమరీ కలవకపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అపాయిట్మెంట్ ఇవ్వడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ వెళ్లారు. ఇంట్లో స్పీకర్ లేకపోవడంతో ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రెండున్నర గంటల పాటు స్పీకర్ నివాసం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరీక్షించి అయినప్పటికీ ఆయన రాకపోవటంతో వెనుదిరిగారు. తమను స్పీకర్ కలవకపోవటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఒత్తిడితోనే అసెంబ్లీ స్పీకర్ తమను కలవలేదని మండిపడ్డారు. రేపు మరోసారి స్పీకర్కు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారాయన. -
బస్సులో బల్మూరి.. ఆటోలో కౌశిక్
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు వినూత్న రీతిలో అసెంబ్లీకి రావడం ఆసక్తిని కలిగించింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశాన్నే ఈ ఇద్దరు ఎంచుకోవడం విశేషం. ఇటీవలే ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన బల్మూరి వెంకట్ నాంపల్లిలో ఆర్టీసీ బస్ ఎక్కి అసెంబ్లీ గేట్ వరకు వచ్చారు. ఈ సందర్బంగా బస్లో మహిళా ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఉచిత ప్రయాణం అనుభవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోలో అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందంటూ ఆయన ఆటోలో అసెంబ్లీ గేటు వద్దకు వచ్చారు. అయితే ఆటోకు పాస్ లేకపోవడంతో పోలీసు అధికారులు ఆటోను అసెంబ్లీలోకి అనుమతించలేదు. దీంతో ఆయన ఆటో దిగి కాలినడకన అసెంబ్లీలోకి వచ్చారు. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ తగ్గి ఇప్పటివరకు 21 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, సుమారు ఆరు లక్షల ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కౌశిక్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
పాడి కౌశిక్ రెడ్డిపై గవర్నర్ సీరియస్
-
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సీరియస్
-
ఓటు వేయకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. తమిళిసై సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కౌశిక్ రెడ్డి ప్రచారంలో ఓట్లు అడిగిన విధానంపై తాజాగా తమిళిసై స్పందించారు. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈరోజు హైదరాబాద్లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..‘ఓటు వేయడం మన హక్కు. స్టేట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు మధ్య వారధిగా ఉండటం నా బాధ్యత. జనరల్ ఎన్నికలను విజయవంతంగా జరిపినందుకు శుభాకాంక్షలు. మొదటిసారి ఇంటి నుంచే ఓటు వేయడం అనేది మంచి పరిణామం. ఓటింగ్ రోజు సెలవు అనేది సరదా కోసం కాదని యువత గుర్తుంచుకోవాలి. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్టు అనుకోవాలి. ఓటు వేసిన మార్క్ చూసి గర్వంగా ఫీలవ్వాలి. నేను నోటాకు వ్యతిరేకం. ఎన్నికల బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలన్నారు. పాడి కౌశిక్ రెడ్డిపై ఫైర్.. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ఓ అభ్యర్థి ఓట్లు అడిగిన అంశాన్ని తమిళిసై ప్రస్తావించారు. ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారు. ఎన్నికల కమిషన్ అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి. కాగా, సదరు అభ్యర్థి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిగా తెలుస్తోంది. ఓటర్లను ఎవరూ బెదిరించకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన. ఓటు అనేది మోస్ట్ పవర్ ఫుల్ ఆయుధం. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు వేయాలి. మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుంది. ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలి’ అని కామెంట్స్ చేశారు. అనంతరం, 18 ఏళ్లు పూర్తి చేసుకొని కొత్తగా ఓటును పొందిన మనీషా అనే యువతికి గవర్నర్ తమిళిసై ఓటర్ ఐడీని అందించారు. అలాగే, జనరల్ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ , ఐపీఎస్, వలంటీర్లకు గవర్నర్ సర్టిఫికేట్ అందించారు. -
రేవంత్ ప్రసంగానికి అడ్డు తగిలిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. రేవంత్రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తుండటంతో రెండుసార్లు మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశిస్తూ ‘సిగ్గుతో తలదించుకోవలసిందే’నని రేవంత్ వ్యాఖ్యానించగా హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాగంటి గోపీనాథ్, పల్లా రాజేశ్వర్రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. మీకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ప్రసాద్కుమార్ తెలపడంతో సీట్లలో కూర్చున్నారు. ► రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ను, కేసీఆర్ను విమర్శిస్తున్నప్పుడు సభ్యులు పాడి కౌశిక్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అరుస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ► రేవంత్ మాటలకు కౌశిక్రెడ్డి అడ్డు తగులుతుంటే స్పీకర్ ప్రసాద్కుమార్ జోక్యం చేసుకుంటూ ‘కౌశిక్రెడ్డి.. కొత్త సభ్యుడివి. సభ నాయకుడు మాట్లాడుతుంటే వినాల్సిందే’అని స్పష్టం చేశారు. ► డ్రగ్స్ మాఫియా గురించి రేవంత్ మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేసేందుకు మనసు రాలేదా అని ప్రశ్నించగా, ‘వుయ్ సపోర్ట్ యూ’అని పాడి కౌశిక్రెడ్డి అరిచారు. దానికి రేవంత్ స్పందిస్తూ ‘ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన కష్టాలు ఆయనకుంటాయి’అని వ్యాఖ్యానించారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్ కట్టడికి సీవీ ఆనంద్ నేతృత్వంలో చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ► రేవంత్ మాటలకు కౌశిక్రెడ్డి అడ్డు తగిలిన సమయంలో ‘గట్టిగా అరుస్తున్న ఆయన కూడా మేనేజ్మెంట్ కోటానే’అని వ్యాఖ్యానించారు.