Periods
-
శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం
పీరియడ్స్ లేదా ఋతుచక్రం అనేది మహిళలకు, ముఖ్యంగా చదువుకునే వయసులో ఆడపిల్లలకు ఎంత బాధాకరమో చాలా కొద్దిమందికే తెలుసు. ఆ నాలుగు రోజులు అనుభవించే శారీరక బాధలు కంటే.. సామాజికంగా అనుభించే క్షోభే దుర్భరమైంది. ఉత్తర ప్రదేశ్లో జరిగిన దారుణం ఈ విషయాన్నే మరోసారి గుర్తు చేసింది. 11 ఏళ్ల బాలికపట్ల అమానవీయంగా వ్యవహరించిన ఘటన విమర్శలకు దారితీసింది.ఉత్తరప్రదేశ్లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఎంతో ఉత్కంఠతో పరీక్ష రాయడానికి వచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే ఆమెకు పీరియడ్స్ స్టార్ట్ అయింది. (చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి సమస్య ఎదురౌతుంది. పరీక్ల ఒత్తిడి వల్ల రావాల్సిన సమయం కంటే ముందే మెన్సస్ సైకిల్ మొదలువుతుంది. ఈ సమయంలో వారు పడే కష్టాలువేదన వర్ణనాతీతం) టైం కంటే ముందే రావడంతో ప్రిపేర్డ్గాలేని బాలిక శానిటరీ ప్యాడ్కోసం ప్రిన్సిపాల్ను అడిగింది. సానుభూతి చూపించి సహాయం చేయడానికి బదులుగా ఆమేదో పెద్ద నేరంచేసినట్టు వ్యవహరించారు. దాదాపు గంటపాటు క్లాస్ రూం వెలుపల నిలబెట్టేశారు. శనివారం చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.ఒక పక్క పీరియడ్స్..కాళ్లు, నడుము నొప్పితోపాటు రక్త స్రావం పెరుగుతూ ఉంటుంది. ఈ బాధలకంటే. దుస్తులకు ఎక్కడ రక్తపు మరకలు అంటు కుంటాయో అన్న బెంగ, భయం. ఇవన్నీ ఇలా ఉంటే.. గంటసేపు బయటనిలబెట్టడంతో అవమాన భారంతో ఆ బాలిక ఎంత వేదన పడి ఉంటుందో అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.మరోవైపు బాలిక తండ్రి ఫిర్యాదుతో సంఘటనపై అధికారిక విచారణ జరుగుతోంది.జిల్లా మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (DIOS), రాష్ట్ర మహిళా కమిషన్ , మహిళా సంక్షేమ శాఖకు అధికారికంగా ఆయన ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. విచారణ జరుగుతోందని జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దేవ్కీ నందన్ ధృవీకరించారు. విచారణ అనంతరం, వాస్తవాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగాచాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..! -
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మీనన్(Nitya Menen ) తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలా మందికి సుపరిచితమే. ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో నిత్యామీనన్ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బట్టడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన స్నేహితుడు, దర్శకుడు–నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ నిత్య చెప్పుకొచ్చారు.నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రసిద్ది చెందిన నిత్య... సినిమా షూటింగ్లో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.అయితే ఆమె 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్లోనే తనకు పీరియడ్స్ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని కూడా నిత్య తెలిపింది. నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే.. ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. ఆమె డియర్ ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. -
నెలసరి బాధలకు చెక్పెట్టే ఔషధం
చాలామంది మహిళలు ఎండోమెట్రియాసిస్ సమస్య కారణంగా నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు ఎండోమెట్రియాసిస్తో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మహిళలు తీవ్రమైన రక్తహీనతకు లోనవుతారు. ఎండోమెట్రియాసిస్ సమస్యను శాశ్వతంగా నయం చేసే చికిత్స పద్ధతులేవీ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. అయితే, ఎండోమెట్రియాసిస్ వల్ల తలెత్తే నొప్పులను, అధిక రక్తస్రావాన్ని అరికట్టే ఔషధం ఇంగ్లండ్లో అందబాటులోకి వచ్చింది. ‘ఇవాన్–500ఎంజీ’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ మాత్రలను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా కొనుక్కోవచ్చు. ఈ మాత్రలలో ఉండే ‘ట్రానెక్సిమిక్ యాసిడ్’ నెలసరి బాధలకు చాలా వరకు చెక్ పెడుతుంది. ఇప్పటికే ఈ మాత్రలు వాడిన మహిళలు ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు.(చదవండి: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం వారికే ఎక్కువ..! నిపుణుల వార్నింగ్) -
‘నెలసరి’ సెలవులకూ వేతనం: గళమెత్తిన ప్రియదర్శిని
నెలసరి లేదా పీరియడ్, ఈ సమయంలో మహాళలు అనుభవించే బాధ, వేదన వారికే మాత్రమే తెలుసు. ఇన్ని రోజులూ అదేదో పాపంలాగా, దేవుడిచ్చిన శాపంలాగా అనుకుంటూ ఆడవాళ్లు పంటి బిగువున ఆ బాధనంతా భరిస్తూ వచ్చారు. కానీ ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు, సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ల నుంచో ఉంది. ఇందులో భాగంగా వచ్చిందే పీరియడ్ పెయిడ్ లీవ. దీనిపై ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని (Ranjeeta Priyadarshini) ఐక్యరాజ్యసమితి (UN) సమావేశంలో గళమెత్తారు. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు. దీంతో జీతంలో కోత పడుతుందనే సంకోచం, భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు.రంజీతా ప్రియదర్శిని, న్యూయార్క్లోని 79వ యుఎన్జిఎలో జరిగిన ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో మహిళలకు చెల్లింపు రుతుస్రావ సెలవుల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. పెయిడ్ పీరియడ్ లీవ్ల కోసం ఆమె పోరాడుతున్నారు. తాను పని చేస్తున్నపుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్టు ప్రియదర్శిని తెలిపారు. ఈ సందర్బంగా తన అనుభవాన్ని పంచుకున్నారు. పీరియడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినపుడు తనపై అధికారినుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసారు. ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం, మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది.. మార్పునకు పునాది పడింది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళలను అర్థం చేసుకునేందుకు, అవగాహన పెంచేందుక బాటలు వేసింది. మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్లో ఐశ్వర్య కిల్లింగ్ లుక్స్, తొలిసారి అలియా అదుర్స్ -
ఆరునెలలుగా పీరియడ్స్ రావట్లేదు.. ఇదేమైనా సమస్యా?
నాకు 38 ఏళ్లు. ఆరునెలలుగా పీరియడ్స్ రావట్లేదు. ఇంతకుముందేమో హెవీ సైకిల్స్ ఉండేవి. ఒకరకంగా చెప్పాలంటే పీరియడ్స్ రాకపోవడం రిలీఫ్గానే ఉంది. కానీ మా ఫ్రెండ్సేమో ఇంత చిన్న వయసులో అలా పీరియడ్స్ ఆగిపోవడం కరెక్ట్ కాదు, డాక్టర్ని కన్సల్ట్ అవమని చెప్తున్నారు. ఇంతముందుగా మెనోపాజ్ వస్తుందా? – కె. పల్లవి, హైదరాబాద్ఎర్లీ లేదా ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే 40–45 ఏళ్ల మధ్య నెలసరి పూర్తిగా ఆగిపోవడం. వీళ్లకి మెనోపాజ్ సింప్టమ్స్ అయిన హాట్ ఫ్లషెస్, చెమటలు పట్టడం, మూడ్ స్వింగ్స్ వంటివీ ఉంటాయి. కానీ కొంతమందికి హఠాత్తుగా కొన్ని నెలలపాటు పీరియడ్స్ ఆగిపోతాయి. భవిష్యత్లో మళ్లీ స్టార్ట్ అవచ్చు. ఇలాంటి పరిస్థితి సాధారణంగా 40 ఏళ్లలోపు కనపడుతుంది.దీనిని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఇన్సఫిషన్సీ అంటారు. అంటే అండాశయాల నుంచి అండాలు విడుదల కాకుండా, బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవుతాయి. దీనికి సరైన కారణమేంటో తెలీదు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్, డయాబెటిస్తో బాధపడుతున్న వారిలోనూ కనిపిస్తుంది. జన్యుపరమైన కారణమూ ఉండొచ్చు. కొంతమందికి మంప్స్, టీబీ, మలేరియా తరువాత ఇలా పీరియడ్స్ ఆగిపోవడం జరుగుతుంది.మెనోపాజల్ సింప్టమ్స్తోపాటు జుట్టు ఊడిపోవడం, ఎముకలు బలహీనపడటం, బోన్ లాస్ వంటివీ ఉంటాయి. ఆస్ట్రియో పొరాసిస్ రిస్క్ పెరుగుతుంది. ఇవన్నీ బాడీలో ఈస్ట్రజన్ హార్మోన్స్ తగ్గటం వలన తలెత్తుతాయి. ఎప్పుడైనా వరుసగా మూడునెలలు పీరియడ్స్ మిస్ అయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కారణమేంటో త్వరగా కనుక్కొని వెంటనే చికిత్సను అందిస్తారు. ఒత్తిడి, డైట్లో మార్పులు, ఎక్సర్సైజ్ హాబిట్స్ వల్ల కూడా కొంత పీరియడ్ సైకిల్లో మార్పులు వస్తాయి.థైరాయిడ్, ఎఫ్ఎస్హెచ్ టెస్ట్లు, బోన్ స్కాన్ చేస్తారు. దేహానికి హార్మోన్స్ అవసరం చాలా ఉంటుంది. అలాంటిది చిన్న వయసులోనే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతే రిస్క్ ఎక్కువవుతుంది. కాబట్టి కొంతమంది పేషంట్స్కి డాక్టర్ పర్యవేక్షణలో హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ ఇస్తారు. 51 ఏళ్లకి సహజంగానే మెనోపాజ్ వస్తుంది కాబట్టి ఆ సమయం వరకు జాగ్రత్తగా చెకప్ చేయించుకుంటూండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి. విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
పీరియడ్స్లో భరించలేని నొప్పా? ఇవిగో చిట్కాలు
మహిళలు, యువతులు నెలసరి లేదా పీరియడ్ సమయంలో విపరీతమైన నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ నాలుగు రోజులు వారికి నరకం కింద లెక్కే. రక్తస్రావంకూడా ఎక్కువగానే ఉంటుంది. నొప్పి భరించలేక, ఏమీ తినలేక, నానాయాతన పడుతుంటారు. మరి కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే పీరియడ్కి ముందు కొన్ని వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో ఈ పెయిన్నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దామా.నెలసరి సమయంలో వచ్చే నొప్పి, అసౌకర్యాన్ని నివారించేందుకు కొన్ని సాధారణ మందులతో పాటు, కొన్ని హోం రెమిడీస్ కూడా బాగా పనిచేస్తాయి. అలాగే గైనకాలజిస్ట్ సలహా మేరకు కొన్ని నొప్పి నివారణ మందులు కూడా తీసుకోవచ్చు.అల్లం: పీరియడ్ క్రాంప్స్కు అల్లం బెస్ట్ ఆప్షన్. అల్లంలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఇబ్బందిని తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటిలో అల్లం రసం, కొద్దిగా తేనె కలుపుకుని ఉదయాన్నే తాగొచ్చు.పసుపు: పసుపులో ఉండే కర్కుమిన్ అనే సహజ రసాయనం ఈ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్కు 7 రోజుల ముందు ,3 రోజుల తర్వాత ఒక కర్కుమిన్ క్యాప్సూల్ను తీసుకోవడం మంచిదని ఒక అధ్యయనంలో తేలింది. మహిళల్లో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి కర్కుమిన్ సహాయపడుతుంది. సోంపు: కాసిన్ని సోంపు గింజల్ని తిన్నా, లేదా వాటిని నీటిలో మరిగించి, ఆ నీటిని తాగొచ్చు. మొత్తం ఆహారాన్ని మానివేయడం కాకుండా, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహరం తీసుకోవాలి.పండ్లు, ఆకుకూరల తోపాటు ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే నట్స్, బీన్స్ వంటివి ఎక్కువగా తినాలి. ఉప్పు, కారం, షుగర్, మద్యం, కార్బోనేటేడ్ పానీయాలు, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది.ఉపశమనంపొత్తికడుపుమీద వేడినీటితో లేదా హీటింగ్ ప్యాడ్తో కాపడం పెట్టుకుంటే కండరాలు వదులై నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మసాజ్ థెరపీ కూడా బాగా పనిచేస్తుంది. అలాగే కొన్ని రకాల యోగాసనాలను అలవాటు చేసుకుంటే ఫలితముంటుంది. -
Menstrual Leave: ఉద్యోగినులకు నెలసరి సెలవు?
ఉద్యోగినులకు నెలసరి సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఇటీవల ఎక్కువైంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయమూ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాలతో, ఉపాధి సంస్థలతో చర్చించి కేంద్రం తీసుకోవాల్సిన పాలసీ నిర్ణయం అని తెలిపింది. నెలసరి సెలవును తప్పనిసరి చేస్తే సంస్థలు స్త్రీలను ఉద్యోగాల్లోకి తీసుకోకపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరి మహిళలు ఏమంటున్నారు?సుజన సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఉదయం నుంచి పొత్తి కడుపులో నొప్పి, కూర్చోవడానికి వీలుకానంతగా నడుం నొప్పి. ప్రతి నెలా ఉండే సమస్యే ఇది. ఈ నెల మరీ ఎక్కువగా బాధిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు సెలవు పెట్టడానికి వీలు లేదని ఆఫీసులో ముందే హెచ్చరించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధను పంటి బిగువున భరిస్తూనే ఆఫీసుకు బయల్దేరింది.మేరీ ప్రైమరీ స్కూల్ టీచర్. పిల్లలతో కలిసిపోతూ రోజంతా యాక్టివ్గా ఉండాలి. నెలసరి సమయం దగ్గర పడుతుందంటేనే లోలోపల భయపడుతూ ఉంటుంది. తీవ్రమైన నొప్పితో పాటు, అధిక రక్తస్రావం సమస్యతో ప్రతీసారీ ఇబ్బందే.కరుణ బట్టల షోరూమ్లో పనిచేస్తోంది. రోజంతా షాప్లో నిల్చొనే ఉండాలి. సేల్ సీజన్ కావడంతో సెలవులు పెట్టడానికి వీల్లేదని మేనేజర్ ముందే చెప్పారు. సెలవు అడిగితే ఉద్యోగం పోతుందేమో అని భయం. కానీ, నెలసరి సమయంలో విశ్రాంతి లేకుండా పని చేయడం అంటే మరింత అలసట కమ్ముకొచ్చేస్తుంది. నెలసరివేళ ఇబ్బందిపడే ఉద్యోగినులకు రుతుస్రావ సెలవులపై మోడల్ పాలసీని రూపొందించాలని ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన విధానానికి రూపకల్పన చేయాలని కూడా ఆదేశించింది. నెలసరి సెలవులు తీసుకుంటే ఉద్యోగినుల ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందా? అసౌకర్యం వేళ సెలవు దొరుకుతుందని భావిస్తే ఎక్కువ మంది ఉద్యోగాలు చేయడానికి మొగ్గు చూపుతారా? నెలసరి అవసరం గురించి మహిళలు స్పందన.అవసరం ఉన్నవారికే!దాదాపు తొంభై శాతం మందిలో ఒకేలాంటి సమస్య ఉండదు. కాబట్టి అందరికీ సెలవు అవసరం లేదు. నెలసరి సమయంలోనూ సమస్యలేమీ లేకపోతే సెలవు ఎందుకు తీసుకోవాలి? పైగా పని పట్ల ఇష్టం ఉన్న నాకు లీవ్ తీసుకొని ఇంటి వద్ద ఉండటం బోర్ అనిపిస్తుంది. అందుకే సమస్య ఉన్నవారు, మెడికేషన్లో ఉన్నవారు డాక్టర్ ప్రిస్కిప్షన్తో లీవ్ తీసుకోవచ్చు. స్కూల్ టైమ్లో నెలసరి వస్తే ఇంటికి వెళ్లే వీలు ఉండదు. çస్కూల్లోనే కొంత సమయం విశ్రాంతి తీసుకుంటాం. సమస్య తీవ్రతను బట్టి అవసరం ఉన్నవారు లీవ్ తీసుకుంటే సరిపోతుంది. – మృణాళిని, టీచర్ఉపయోగకరమైనదే! మహిళ ఇంటిని, ఆఫీస్ పనినీ బ్యాలెన్స్ చేసుకుంటూ తనని తాను నిరూపించుకుంటోంది. అయితే, పీరియడ్ సమయంలో అందరికీ అన్ని వేళలా ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ఎవరికైతే అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, మైగ్రెయిన్, వాంతులు... వంటి సమస్యలు ఉంటాయో వారికి విశ్రాంతి అవసరం అవుతుంది. భరించలేనంత నొప్పి ఉన్నప్పుడు ఎలాగూ పని మీద దృష్టి పెట్టలేరు. సమస్య ఉన్నవారికి సెలవు ఇవ్వడం మంచిదే. ఎందుకంటే నెలసరి నొప్పి భరించలేక ఉద్యోగాలు మానేసినవారూ ఉన్నారు. కొందరు ఉద్యోగినులు హెల్త్ చెకప్కి లీవ్ దొరకడం లేదని చెబుతుంటారు. అలాంటి వారికి ఈ లీవ్ అవకాశం ఉపయోగపడుతుంది. – డాక్టర్ శిరీషారెడ్డి, గైనకాలజిస్ట్విశ్రాంతి అవసరమే!మహిళలు కూర్చుని చేసే ఉద్యోగాల్లో సాధారణంగా నడుం నొప్పి ఉంటుంది. నెలసరి సమయంలో ఆ తీవ్రత ఇంకాస్త పెరుగుతుంది. కానీ, మాకు కేటాయించిన పనిని మరొకరికి అప్పగించలేం. సెలవు పెడితే పనిభారం పెరుగుతుందని భయం. అదీ సమస్యే. పిరియడ్ లీవ్ తప్పనిసరి చేస్తేæ వర్క్లోడ్ పెరగడం, ప్రమోషన్స్పై ప్రభావం చూపడం జరగవచ్చు. మా ఆఫీసులో వాష్రూమ్లలో ΄్యాడ్స్, విశ్రాంతి తీసుకోవడానికి ప్లేస్ ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు ఈ తరహా అవకాశాలు ఉపయోగించుకొని, పనులను యధావిధిగా చేస్తుంటాం. పిరియడ్ లీవ్ అనేది అందరికీ అవసరం కాదు. సమస్య ఉన్నవారు యాజమాన్యం అనుమతితో సెలవు తీసుకోవచ్చు. – ఎస్.కె.బాజి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్– నిర్మలా రెడ్డి -
రొటీన్ చెకప్ స్కాన్లో రెండు ఓవరీస్లో సిస్ట్స్ ఉన్నాయి... ఏం చేయాలి?
నాకు 45 ఏళ్లు. రొటీన్ చెకప్ స్కాన్లో రెండు ఓవరీస్లో 3 సెం.మీ, 5 సెం.మీ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? క్యాన్సర్ రిస్క్ ఏమైనా ఉందా అని భయంగా ఉంది. – రుబీనా, గాజులరామారంఆ వయసులో చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల ఓవరీస్లో సిస్ట్స్ ఫామ్ కావచ్చు. ఆ ఏజ్లో అంటే మెనోపాజ్కి ముందు క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ. సింపుల్ సిస్ట్స్ అయితే అసలు ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. ఒకవేళ ఆ సిస్ట్స్ 5 సెం.మీ కన్నా ఎక్కువుంటే చిన్న కీహోల్ సర్జరీ ద్వారా సిస్ట్ని మాత్రమే తీసేసి టెస్టింగ్కి పంపిస్తారు. ఓవరీస్ నుంచి 2– 3 సెం.మీ సైజులో ప్రతినెలా అండాలు విడుదలవుతాయి. కొన్నిసార్లు ఇంకాస్త పెద్ద సైజులో కూడా ఉండొచ్చు. భయపడాల్సిన అవసరం లేదు.3 సెం.మీ కంటే ఎక్కువ ఉంటేనే సిస్ట్ అంటాము. ఫ్లూయిడ్ ఫిల్ అయి ఉంటాయి. అవి సింపుల్ సిస్ట్స్. కొంతమందికి బ్లడ్ ఫిల్ అయిన సిస్ట్స్ ఉంటాయి. వాటిని ఎండోమెట్రియాటిక్ సిస్ట్స్ అంటారు. డెర్మాయిడ్ సిస్ట్లో ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. మీరు ఇంటర్నల్ పెల్విస్ స్కాన్ చేయించుకోండి. అందులో సిస్ట్ సైజ్, దాని తీరు స్పష్టంగా తెలుస్తాయి. ఏ సింప్టమ్ లేకుండా ఈ సిస్ట్స్ చాలామందిలో స్కానింగ్లోనే తెలుస్తాయి. అప్పుడు వాటి నేచర్ని బట్టి సైజ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. పదిలో ఒకరికి మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది.కొంతమందికి కింది పొట్టలో నొప్పి, లైంగికంగా కలసినప్పుడు నొప్పి, యూరినరీ ప్రాబ్లమ్స్, మోషన్ డిఫికల్టీస్ ఉండవచ్చు. అలాంటి వారికి వెంటనే కొన్ని రక్తపరీక్షలు చెయ్యాలి. ఫ్యామిలీ హిస్టరీని కూడా డీటేయిల్డ్గా తీసుకుంటారు. సిస్ట్ వల్ల సమస్య ఉందని తేలితే క్లోజ్ ఫాలో అప్లో డాక్టర్ మీకు విషయాన్ని వివరిస్తారు. చాలా సిస్ట్లకు వెయిట్ అండ్ వాచ్ పాలసీయే సూచిస్తారు. మీకున్న సింప్టమ్స్, బ్లడ్ రిపోర్ట్స్, సైజ్ని బట్టి ఎంత తరచుగా స్కాన్స్ ద్వారా రీచెక్ చెయ్యాలో చెప్తారు. సిస్ట్ సైజ్ 5–7 సెం.మీ ఉన్నప్పుడు ఏడాదికి ఫాలో అప్ ఉంటుంది. ఏడాదికి మళ్లీ స్కాన్ చేయించుకోమని సూచిస్తారు. 7 సెం.మీ కన్నా ఎక్కువ ఉంటే ఎమ్మారై స్కాన్ చేయించుకోమంటారు. ఈ దశలో సర్జరీని సజెస్ట్ చేస్తారు.మీ వయసుకి ఓవరీస్ని పూర్తిగా తీసేయడం మంచిది కాదు. 50–52 ఏళ్ల వరకు ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ చాలా అవసరం. అందుకే లాపరోస్కోపీ ద్వారా కేవలం సిస్ట్ని మాత్రమే తీసేస్తారు. ఒకవేళ ఆ సిస్ట్ మెలికపడి పక్కనున్న బవెల్, బ్లాడర్ మీదికి స్ప్రెడ్ అయిన కొన్ని అరుదైన కేసెస్లో ఓవరీస్ని కూడా తీసేయాల్సి ఉంటుంది. మీరొకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. ఇంటర్నల్ స్కాన్ చేసి డీటేయిల్డ్గా చూస్తారు.ఇవి చదవండి: స్కాన్లో ఓవరీస్లో చాకొలేట్ సిస్ట్స్తో ఏమైనా ప్రమాదమా? -
స్కాన్లో ఓవరీస్లో చాకొలేట్ సిస్ట్స్తో ఏమైనా ప్రమాదమా?
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ పెయిన్ సివియర్గా ఉంటోంది. స్కాన్లో ఓవరీస్లో చాకొలేట్ సిస్ట్స్ ఉన్నాయని చెప్పారు. వీటివల్ల ప్రమాదమేమైనా ఉంటుందా? – కునాలిక, వైజాగ్ఇవి కొన్నిసార్లు గర్భసంచి పొరలోని టిష్యూ పెల్విస్లో ట్యూబ్స్, ఓవరీస్, వెజైనా మీద పెరుగుతాయి. పీరియడ్స్ టైమ్లో గర్భసంచిలో బ్లీడింగ్ అయినట్టే వేరేచోట కూడా బ్లీడ్ అయ్యి సిస్ట్స్ పెయిన్ వేస్తాయి. పీరియడ్స్లో పొట్టలో నొప్పి, యూరిన్లో, మోషన్లో లోయర్ బాడీ అంతా నొప్పి ఉండొచ్చు. ఇవి ఎందుకు వస్తాయి అనేదానికి స్పష్టమైన కారణమేమీ లేదు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్స్కి సంబంధించిన కారణాలు ఉంటాయి.ఇవి పదిమందిలో ఒకరికి ఉంటాయి. ఎమ్మారై స్కాన్లో కన్ఫర్మ్గా ఇది ఎండోమెట్రియాసిస్ అని చెప్పవచ్చు. క్రమం తప్పకుండా పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ని వాడాల్సి వస్తుంది. పారాసిటమాల్, ట్రామడాల్ లాంటివి బాగా పనిచేస్తాయి. మీ ఏజ్ గ్రూప్ వారికి హార్మోన్ పిల్స్ బాగా పెయిన్ రిలీఫ్ని ఇస్తాయి. ఇవి ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ లేదా చాకొలేట్ సిస్ట్స్ని కుంచించుకుపోయేలా చేస్తాయి. నొప్పిని తగ్గిస్తాయి. కంబైన్డ్ ఓరల్ కంట్రాసెప్టివ్ పిల్స్ని క్రమం తప్పకుండా నెలంతా వేసుకోవాలి.ఈ మాత్రలతో వికారం, తలనొప్పి వంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కానీ రెండు నెలల్లో అంతా సర్దుకుంటుంది. 3 నుంచి 6 నెలల్లో మినిమమ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చాకొలేట్ సిస్ట్స్ సైజ్ 5 సెం.మీ కన్నా ఎక్కువున్నా, హార్మోన్స్ పనిచేయకపోయినా లాపరోస్కోపీ సర్జరీ సూచిస్తారు. ఈ సిస్ట్స్ని తీసేసిన తరువాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెరుగవుతుంది. కానీ రికరెన్స్ అంటే మళ్లీ వచ్చే రిస్క్ కూడా ఎక్కువే. క్లోజ్ ఫాలో అప్ స్కాన్స్ చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి ఫాలో కావాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.కొంతమందికి GnRH analogue ఇంజెక్షన్స్ ఇస్తారు. సర్జరీ తరువాత కూడా కొందరికి వీటిని సజెస్ట్ చేస్తారు. లాపరోస్కోపీ సర్జరీలో సిస్ట్స్ని తొలగించి.. ఏమైనా ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ ఉంటే వాటిని కూడా fulgurate చేస్తే పెల్విక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఎండోమెట్రియాసిస్ సిస్ట్స్ ఉన్నాయని తెలిసినప్పుడు క్లోజ్ ఫాలో అప్లో ఉండాలి.ఇవి చదవండి: ఏదో మిస్ అవుతున్నానబ్బా అని.. పదే పదే ఈ సందేహమా? -
ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ముస్లీంలకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. మక్కాలో చంద్రుని దర్శనం ఆధారంగా రంజాన్ మాసం భారత్లో ఎప్పుడూ ప్రారంభమవుతుందనేది నిర్ణయిస్తారు ముస్లీం మత పెద్దలు. నెలవంక ఆకారంలో ఉండే చంద్రుడు ఈసారి సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన ఆదివారం సాయంత్రం దర్శనం ఇచ్చింది. కాబట్టి మార్చి 11వ తేదీ సోమవారం నుంచి అక్కడ చంద్రుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అయితే భారతదేశం, పాకిస్థాన్తో పాటు మరికొన్ని దేశాల్లో మరుసటిరోజున చంద్రుడు దర్శనమిస్తాడు. అందుకే సౌదీ తర్వాతి రోజు నుంచి మన దేశంలో ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. అంటే ఈ ఏడాది మన దేశంలో ఇవాళ(మార్చి 12వ తేదీ (మంగళవారం)) నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఎలా జరుపుకుంటారంటే.. ఇస్లాంలో అత్యంత పవిత్రమైన మాసం ఈ రంజాన్ మాసం. ఈ నెలల్లో ముస్లీంలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు. ఉపవాసకాలంలో వారు రెండు సార్లు ఆహారాన్ని స్వీకరిస్తారు. వాటిని సుహూర్, ఇఫ్తార్గా పిలుస్తారు. ఇఫ్తార్ అనేది సూర్యాస్తమయం తర్వాత తీసుకునే ఆహారం. సుహూర్ అంటే తెల్లవారుజామున తీసుకోవడం జరుగుతుంది. ఈ ఉపవాస దీక్ష విరమించుకునే రోజు సాయంత్రం తమ కుటుంబం\ సభ్యులను బంధువులను పిలచుకుని ఇఫ్తార్ విందు ఆరగిస్తారు. అంతేగాదు ఈ మాసంలో దాన ధర్మాలు, పేదలకు ఆహారం అందించడం వంటవి చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉపవాస సమయాల్లో వ్యత్యాసం.. ఈ ఉపవాస సమయాలు ప్రపంచవ్యాప్తంగా మారుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో వాటి ఉపవాస సమయం వ్యవధి చాలా విభిన్నంగా ఉంటుంది. దక్షిణార్థ గోళంలో సూర్యని వంపు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటంలో ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ సమయం ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి నార్వేలోని ఓస్లోలో ముస్లింలు దాదాపు 15 గంటల 15 నిమిషాల పాటు ఉపవాసం ఉండాల్సి ఉంటుంది. అదే లండన్లో దాదాపు 14 గంటల 11 నిమిషాల పాటు ఉపవాసం ఉంటారని స్టాటిస్లా నివేదిక పేర్కొంది. ఇక జకర్తాలో ఉపవాసం నిడివి సుమారు 13 గంటల నుంచి 13 నిమిషాలు ఉంటుందని స్టాటిస్లా నివేదిక అంచనా వేసింది. #Ramadan starts on Sunday evening, with the first day of fasting on Monday, March 11 this year. While the number of days of Ramadan are equal for all Muslims observing it around the world, the length of the daily fast is not. — Statista (@StatistaCharts) March 8, 2024 (చదవండి: నేటి నుంచే రంజాన్ మాసం ప్రారంభం!) -
‘నెలసరి విషయం వారికి ఎందుకు తెలియాలి?’
ఢిల్లీ: నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ అని.. అదేం వైకల్యం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్లో మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నెలసరి సమయంలో ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడంతో పలువురు మహిళా నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇక ఈ విషయంలో ఆమె తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇదే విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్మృతి ఇరానీ మాట్లాడారు. మహిళలకు సంబంధించిన సున్నితమైన నెలసరి విషయం ఉద్యోగం చేసే చోటు సదరు సంస్థల యాజమనులకు ఎందుకు తెలియాలి? అని అన్నారు. ఇది మహిళలకు కొంత అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవుపై ఒక తప్పనిసరి విధానం తీసుకురాలేదని వెల్లడించారు. ఒకవేళ ఒంటరి మహిళగా ఉన్న ఉద్యోగిని తాను ఆ సమయంలో సెలవు తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోతే.. తాను వేధింపులను ఎదుర్కొవల్సి వస్తుందని తెలిపారు. అధికారికంగా పెయిడ్ లీవ్ మంజూరు చేస్తే.. ఈ విషయాన్ని సంస్థల్లో హెచ్ఆర్, అకౌంట్స్ వాళ్లకు తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. అలా పలు సంస్థల్లో పని చేసే చోట తెలియకుండానే మహిళలపై ఒక వివక్షను పెంచినవాళ్లము అవుతుమని తెలిపారు. అయితే తాను పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం సంబంధించి ప్రశ్న మరోకటిని వెల్లడించారు. ఆ రోజు ఎంపీ మనోజ్ ఝా LGBTQIA+ కోసం ప్రభుత్వం వద్ద ఏదైనా పీరియడ్ సెలవు విధానం ఉందా? అని అడిగారని తెలిపారు. గార్భాశయం లేని ఏ స్వలింగ సంపర్కుడికి రుత చక్రం ఉంటుంది? అని తాను చెసిన వ్యాఖ్యలపై మరోవిధంగా వ్యాప్తి చెంది వివాదం రేగిందని చెప్పారు. మరోవైపు మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించిన విషయం తెలిసిందే. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. చదవండి: ధన్ఖడ్పై ఖర్గే విమర్శలు.. నేను అలా అనుకోవాలా? -
పీరియడ్ నొప్పిని భరించలేక ఆ మాత్రలు వేసుకుంది! అంతే..
మహిళలకు రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి సహజంగానే వస్తుంది. కొందరికీ మరీ ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటుంది. కొద్దిమందిలో మొదటి రెండు రోజులు తట్టుకోలేని నొప్పి ఉంటుంది. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. ఆ టైంలో పెయిన్ తట్టుకోలేకపోతే వైద్యుల సూచించిన లేదా నొప్పి ఉపశమించే మందులను వాడుతుంటారు మహిళలు. అలానే ఇక్కడొక అమ్మాయి కూడా మాత్రలు వేసుకుని ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన యూకేలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని లైలా అనే అమ్మాయి పిరియడ్ నొప్పి భరించలేక అల్లాడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు ఆ నొప్పి తగ్గాలంటే గర్భనిరోధక మాత్రలు వేసుకోవాలని సూచించారు. లైలా వారి చెప్పినట్లే నవంబర్ 25 నుంచి ఆ టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించింది. అంతే ఆ ట్యాబ్లెట్లు వాడిన మూడు వారాల తర్వాత నుంచి ఆమెకు తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమేణ పరిస్థితి సీరియస్గా మారిపోయింది. డిసెంబర్ 5 నుంచి తీవ్రమైన వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. ఇక క్రమక్రమంగా పరిస్థితి విషమించడం మొదలైంది. ఆమె కడుపు నొప్పిని తాళ్లలేక పోవడంతో కుటుంబ సభ్యలు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు కడుపులో ఏదైనా గడ్డ ఉందేమోనని అనుమానించారు. కానీ సీటీ స్కాన్లో వైద్యులకే దిమ్మతిరిగేలా అసలు విషయం బయటపడింది. కడుపు నొప్పి ..అంటే కడుపులో సమస్య అనుకుంటే అసలు సమస్య బ్రెయిన్లోనే ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరచడమే గాక కలవరపరిచింది. ఆమె మెదడులో వేగంగా రక్తం గడ్డకడుతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో వారు వెంటనే డిసెంబర్ 13న ఆ అమ్మాయికి ఆపరేషన్ చేశారు. అయితే ప్రయోజనం లేకుండాపోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు వైద్యులు మాట్లాడుతూ..దయచేసి ఎవ్వరూ కూడా ఇలా ఆ మాత్రలు వేసుకుంటే త్గగుతుంది అనంగానే ఆమెలా అనాలోచితంగా వేసుకోవద్దు. ఒక వేళ అలా వేసుకోవాలనుకున్నా ముందు మీ పెద్దవాళ్లకు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరి శరీరం విభిన్నంగా ఉంటుంది. మాత్రలు అందరీకి ఒకేలా రియాక్షన్ ఇవ్వవు. దీన్ని కూడా గుర్తించుకోవాలి. మన శరీర ఆరోగ్య పరిస్థితి, మనకున్న ఆహారపు అలవాట్లు అన్నింటిని పరిగణించి వైద్యులు మాత్రలు ఇస్తారు. ఒక్కొసారి డాక్టర్లు ఇచ్చినవే మనకు ఇబ్బందిగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇలా తెలిసిన మాత్రలో లేక ఎవరో చెప్పారనో ఎలాంటి మందులు తీసుకోవద్దు. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుని కుటుంబసభ్యులకు తీరని ఆవేదనను మిగల్చకండి అని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: తొమ్మిది పదుల వయసులో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన బామ్మ!) -
హాట్టాపిక్గా 'పీరియడ్ లీవ్'! 'మాకొద్దు' అని వ్యతిరేకించటానికి రీజన్!
ప్రస్తుతం దేశంలో 'పీరియడ్ లీవ్' గురించే ప్రముఖులు, సెలబ్రెటీలు చర్చిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇది ఒక హాట్టాపిక్గా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పైగా అందరూ ముక్తకంఠంతో పీరియడ్ లీవ్ని వ్యతిరేకించడమే ఆసక్తికరంగా మారింది. దీనికి సెలబ్రెటీలు, ప్రముఖులు మద్దతు ప్రకటించడం మరింత ఆసక్తిని రేకెత్తించే అంశం. ఎందుకిలా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ "పీరియడ్ లీవ్" అవసరమా? లేదా ఎందుకు వద్దు..? తదితరాల గురించే ఈ కథనం!. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, సంస్థలు నెలసరి సెలవులు(menstrual leave) ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ పీరియడ్ సెలవు అంశమై నివేదిక కూడా పెట్టారు. ఈ విషయంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను ఆమె గట్టిగా వ్యతిరేకించారు. మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. స్త్రీ జీవితంలో జరిగే సహజ ప్రక్రియ. అందుల్ల ఈ నెలసరి సెలవులు (menstrual leave ).. పని ప్రదేశంలో వివక్షకు దారితీసే ప్రమాదం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. WCD Minister @smritiirani sums it up perfectly - "Menstruation is not a handicap!" Menstrual leave demand by pseudo-feminists will infact put females at a disadvantage as compared to a males. As a woman, I personally don't expect any special treatment. Gender equality, please! pic.twitter.com/14NYcwZFMs — Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) December 14, 2023 ఈ అంశంపై సోమవారం పార్లమెంట్లో నివేదక కూడా పెట్టారు. దీంతో బుధవారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు మనోజ్ ఝా ఎగువ సభలో రుతుక్రమ పరిశుభ్రత విధానంపై, సెలవులపై ప్రశ్నలు లేవనెత్తడంతో స్మృతి ఈ విధంగా స్పందించారు. ఐతే ఇప్పటి వరకు పిరియడ్ సెలవులు తప్పనసరి చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. స్మతీ ఇరానీ మాత్రం ఈ సెలవులను వ్యతిరేకిస్తున్నారు. దీని కోసం పోరాడి కష్టపడి సంపాదించకున్న సమానత్వాన్ని విలువ ఉండదని అన్నారు. అంతేగాదు దీన్ని ప్రత్యేక నిబంధనలు అవసరమయ్యే వికలాంగులు కోణంలో పరిగణించకూడదని చెప్పారు. ఐతే కొద్దిమంది మహిళలు మాత్రమే ఈ టైంలో డిస్మెనోరియా వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని, వీటిని చాలా వరకు మందుల ద్వారా నయంచేసుకోవచ్చని అన్నారు. అలాగే నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు కూడా చెప్పారు. దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ప్రకటించారు. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమని నొక్కి చెప్పారు. ఇదే క్రమంలో, 10 నుంచి 19 ఏళ్లలోపు యుక్తవయస్సులో ఉన్న బాలికల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న 'ప్రమోషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ (MHM)' పథకం గురించి కూడా ప్రస్తావించారు. అందరూ ఈ పీరియడ్స్ని సాధారణ దృక్పథంతో చూస్తే చాలు అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు మంజూరు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. స్మృతి అభిప్రాయంతో పలువురు సెలబ్రెటీ మహిళలు ఏకీభవించి మద్దతు పలకడం విశేషం. కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చాలా వరకు ఇలాంటి సమస్యలను మందుల ద్వారా నయంచేసుకోవచ్చ We have fought for centuries for equal opportunities & women's rights and now, fighting for period leave might set back the hard-earned equality. Imagine employers factoring in 12-24 fewer working days for female candidates. A better solution? Supporting work from home for… — Ghazal Alagh (@GhazalAlagh) December 14, 2023 మహిళ చేయలేనిది ఏదీ లేదు..! ప్రముఖ బ్యూటీ బ్రాండ్ మామా ఎర్త్ సహ వ్యవస్థాపకుడు గజల్ అలగ్ మాట్లాడుతూ..స్మృతి పీరియడ్ లీవ్కి బదులుగా మెరుగైన పరిష్కారం సూచించారని ప్రసంసించారు. మహిళలు తాము ఏ పనై అయినా చేయగలమని నిరూపించారు. ఈ ఒక్క కారణంతో వారి సమానాత్వపు హక్కులను కాలరాయకూడదన్న ఆలోచన బాగుందని అన్నారు. అలాగే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం స్మృతికి మద్దతు తెలిపారు. మానవజాతి చరిత్రలో ఒక్క పని కూడా చేయని మహిళ లేదు. పిల్లలను పెంచడం దగ్గర నుంచి వ్యవసాయం వరకు అన్నిపనులు చేస్తూనే ఉన్నారు. ఈ పీరియడ్స్ అనేది జస్ట్ శరీరంలో వచ్చే ఓ నిర్దిష్ట వైద్య పరిస్థితే తప్ప అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు అవసరం లేదంటూ స్మృతి అభిప్రాయంతో ఏకీభవించారు కంగనా. సరికొత్త మార్పు.. ఇదంతా చూస్తుంటే మహిళా సాధికారతకు అసైలన అర్థం ఏంటో చెప్పారు. మాకు దయాదాక్షిణ్యాలతో పనిలేదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటే చాలు. సాటి మనుషులుగా ఒకరి బాధను అర్థం చేసుకుంటే చాలు తప్ప మాకదంతా అవసరంలేదని మహిళ ఆత్మివిశ్వాసాన్ని, ఔన్యత్యాన్ని చాటి చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే పురిటినిప్పిని పంటి కింద భరించగలిగే శక్తి ఉన్న స్త్రీకి ఇది ఒక లెక్క కాదు అని తేల్చి చెప్పింది. విమన్ పవర్ ఏంటో? వారి పంచ్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు కదా. ద టీజ్ విమెన్ అని మరోసారి బల్లగుద్ది చెప్పారు. ఈ పేరుతో మా అవకాశాలను లాక్కొవద్దని, తాము ఎందులోనూ తక్కువ కాదు జస్ట్ ప్రకృతి సిద్ధంగా వచ్చే చిన్న ప్రక్రియ అని అందరూ తెలుసుకోండి తామెంటో చూపిస్తామని సగర్వంగా చెబుతున్నారు మహిళామణులు. -
కలబందతో శానిటరీ న్యాప్కిన్స్ తయారీ..ఆ సమస్యలకు చెక్
పీరియడ్స్.. అందరు అమ్మాయిల జీవితంలో సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ ఇప్పటికీ ఎందుకో ఈ విషయంపై చర్చించడానికి పెద్దగా ఇష్టపడరు. అదేదో మాట్లాడకూడని సబ్జెక్ట్ అన్నట్లు చూస్తారు. దీని ఆధారంగా బాలీవుడ్లో ప్యాడ్మ్యాన్ పేరుతో ఓ సినిమాను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రుతస్రావం, నాప్కీన్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పీరియడ్స్ సాధారణమే అయినా ఆ సమయంలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొందరు ఆ నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఆ సమయంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు పెట్టే వాళ్లూ లేకపోలేదు. అందుకే కొన్ని కంపెనీల్లో ప్రత్యేకంగా పీరియడ్ లీవ్స్ని కూడా ప్రవేశ పెట్టారు. పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆ సమయంలో హైజీన్ మరింత అవసరం. మంచి నాణ్యత కలిగిన ప్యాడ్ మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ఎంత వరకు ఈ ప్రమాణాలు పాటిస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకమే. కొందరు శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేటప్పుడు వాటిని ఫైబర్ క్లోరిన్తో బ్లీచ్ చేస్తారు. దీనివల్ల డయాక్సైన్, ప్రమాదకరమైన కలుషితాలు విడుదలవుతాయి. వీటి కారణంగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యలు, హార్మోన్ల సమస్యలు, ఎండోమెట్రియోసిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మంచి శానీటరీ న్యాప్కిన్స్ను వాడాలి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ మనూ ప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని బృందం తాజాగా తక్కువ ధరకే ప్యాడ్స్ను అందిస్తోంది. సాధారణంగా ప్యాడ్స్ తయారీకి ఎక్కువ మొత్తంలో కాటన్ అవసరం ఉంటుంది. కానీ వీళ్లు కాటన్ అవసరం లేకుండానే సిసల్(కలబంద)మొక్కను ఉపయోగించి తక్కువ ధరకు ప్యాడ్స్ను తయారు చేస్తున్నారు. ఇది సాధారణ ప్యాడ్స్ మాదిరిగానే చాలా సాఫ్ట్గా ఉంటాయని, అంతేకాకుండా వీటిని సులభంగా రీసైకిల్ చేయొచ్చని వివరించారు. -
నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి.. సిస్ట్స్ ఉంటే?
నాకు 45 ఏళ్లు. నెలసరి రెగ్యులర్గానే వస్తోంది. రొటీన్ స్కాన్లో కుడివైపు ఓవరీలో 4 సెం.మీ సిస్ట్ ఉందని తేలింది. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? – సీహెచ్. కాత్యాయిని, విజయవాడ ఒవేరియన్ సిస్ట్లు అనేవి ప్రీమెనోపాజ్ ఏజ్లో సర్వసాధారణం. రక్తపు అవశేషాలు లేకుండా ఫ్లూయిడ్తో నిండి ఉన్న సింపుల్ సిస్ట్స్ ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటికి ఎలాంటి చికిత్సా అవసరం ఉందు. అండాశయంలో సాధారణంగా అండాలు రెండు నుంచి మూడు సెం.మీ. ఉంటాయి. సిస్ట్ అంటే 3 సెం.మీ. కన్నా ఎక్కువ సైజులో ఉండడం. కాంప్లెక్స్ సిస్ట్ అంటే బ్లడ్, సాలిడ్ కూడా ఉంటాయి. వీటిని ఎండోమెట్రియోమా, డెర్మోయిడ్ సిస్ట్ అంటారు. నెలసరి క్రమం తప్పడం.. పీరియడ్స్ టైమ్లో విపరీతమైన కడుపు నొప్పి, యూరిన్లోనూ నొప్పి ఉంటాయి. ఇలాంటి సిస్ట్స్కి చికిత్స అవసరం. అందుకే మీరు ఒకసారి డీటెయిల్డ్ హై రిజల్యుషన్ అల్ట్రాసౌండ్ లేదా సీటీ పెల్విక్ స్కాన్ చేయించండి. సిస్ట్ నేచర్ను బట్టి తర్వాత చికిత్స ఉంటుంది. సింపుల్ సిస్ట్స్కి అయితే ఆరునెలలకు ఒకసారి ఫాలో అప్ స్కాన్స్ చేస్తాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
''పీరియడ్స్ ప్రాబ్లమ్..పిల్లలు పుట్టే అవకాశం ఉందా?''
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్గా రావు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా సమస్య వల్ల రేపు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? – పి.రజిత, మామిడిపల్లి నెలసరి రెగ్యులర్గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో గర్భందాల్చే అవకాశాలు కూడా తగ్గవు. ఇరవై ఏళ్ల వయసులో టీనేజ్లోలా కాకుండా శరీరంలోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇర్రెగ్యులర్గా రెండు మూడు నెలలకోసారి రావడం లేదా మందులు వాడితేనే గాని రాకపోవడం కనుక ఉంటే, వెంటనే డీటెయిల్డ్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. కొందరిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, గడ్డంపైన, పైపెదవిపైన వెంట్రుకలు రావడం, తలమీద జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటాం. కొందరికి షుగర్, బీపీ కూడా ఉండవచ్చు. అధిక బరువు ఉంటే శరీరంలో కొవ్వులు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి తగిన మందులు వాడితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గకుండా ఉంటాయి. దీనికి మొదటి చికిత్స ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అనే చెబుతాం. థైరాయిడ్ సమస్య ఏదైనా ఉందా అని పరీక్షలు చేస్తాం. అలాగే టీబీ వంటి ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా పరీక్షిస్తాం. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, యోగా, నడక, డాన్సింగ్, సైక్లింగ్ వంటివి కచ్చితంగా చేయాలి. డైట్ కౌన్సెలర్ను సంప్రదించి, ఆహార విషయంలో వారి సలహాలను పాటించాలి. రక్తపరీక్షల రిపోర్ట్స్ బట్టి హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా లేదా నాన్హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా అని గైనకాలజిస్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఈ సమస్యకు మూడు నుంచి ఆరునెలల ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
మా అమ్మాయికి పదమూడేళ్లు... పీరియడ్స్ రావడం లేదు కారణం?
మా అమ్మాయికి పదమూడేళ్లు. పెద్దమనిషి అయినప్పటి నుంచీ పీరియడ్స్ రెగ్యులర్గా రావడంలేదు. కారణం ఏంటంటారు? – వి. భావన, ఖమ్మం రజస్వల అయిన 11– 19 ఏళ్ల మధ్య ఆడపిల్లల్లో చాలామందిలో నెలసరి క్రమం తప్పడం చూస్తుంటాం. ఈ టైమ్లో చాలామందికి బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటుంది. అధి బీఎమ్ఐ .. అంటే అధిక బరువు ఉండి.. 30 దాటినప్పుడు.. థైరాయిడ్, ఫిట్స్, అనీమియా వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు.. ఫైబ్రాయిడ్స్.. సిస్ట్లు వంటి గైనిక్ సమస్యలు ఉన్నప్పుడు నెలసరి క్రమం తప్పుతుంది. ఒక్కోసారి నెలలో రెండుసార్లు రావడం.. లేదంటే రెండు నెలలకు ఒకసారి రావడం.. విపరీతమైన నొప్పి.. స్పాటింగ్.. రక్తస్రావం తక్కువగా అవడం.. లేదంటే ఎక్కువగా అవడం.. వంటి సమస్యలను చూస్తాం. పీరియడ్ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది. స్కల్, కాలేజీలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మొదట పారాసిటవల్, డ్రాటిన్ వంటి పెయిన్ రిలీఫ్ మాత్రలను సచిస్తాం. అధిక రక్తస్రావంతో కూడిన ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఒకసారి స్కాన్ చేసి సిస్ట్స్ ఏమైనా ఉన్నా అని చెక్ చేస్తాం. రెండు .. మూడు నెలలు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తే చాలామందిలో ఈ ప్రాబ్లం తగ్గుతుంది. కొన్నిసార్లు యూరిన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇర్రెగ్యులర్ స్పాటింగ్ కావచ్చు. దీనికి ఒకసారి యూరిన్ .. థైరాయిడ్ టెస్ట్స్ చేస్తాం. నెలసరి 21 – 35 రోజుల వరకు రెండుసార్లు వస్తే స్కాన్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చూస్తాం. చాలామందిలో పీసీఓస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒవేరియన్ హార్మోన్స్ స్టడీ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యామం.. పౌష్టికాహారంతో పీసీఓస్ని మేనేజ్ చెయ్యవచ్చు. 20 ఏళ్లలోపు అమ్మాయిలకు అంతగా మందులు అవసరం లేదు. చిన్న వయసులో హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ముందు సమస్య ఏంటో కనిపెట్టి.. ఆ తర్వాత చికిత్స మొదలుపెట్టడం మంచిది. నాకిప్పుడు 55 ఏళ్లు. హాట్ ఫ్లషెస్ విపరీతంగా ఉంటున్నాయి. హార్మోన్స్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేశారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వద్దనుకుంటున్నాను. మీరు ఆల్టర్నేట్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? – గీత కురువెళ్లి, బెంగళూరు మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. సాధారణంగా దీన్ని 50 నుంచి 60 ఏళ్ల మధ్య చూస్తాం. ఈ సమయంలో హార్మోన్స్ స్థాయిల్లో సమతుల్యం లోపించడం వల్ల రకరకాల సింప్టమ్స్, ఇబ్బందులు ఉంటాయి. హెచ్ఆర్టీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని.. అసమతుల్యంగా ఉన్న హార్మోన్స్ని మాత్రల రపంలో ఇస్తారు. కానీ ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తగ్గినందువల్ల స్కిన్ చెంజెస్, వెజైనల్ డ్రైనెస్, యూరినరీ ఇన్ఫెక్షన్, హార్ట్ ఇష్యస్ వంటివాటిని 50 ఏళ్లు పైబడిన వాళ్లలో చూస్తాం. ఈ హార్మోన్లను బయట నుంచి సప్లిమెంట్స్గా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే చాలామంది నాన్హార్మోనల్ ట్రీట్మెంట్నే కోరుకుంటారు. దీనివల్ల మెనోపాజ్ సింప్టమ్స్ తగ్గడమే కాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా కనిపించవు. ఖీఐఆౖఔౖNఉ అనేది అందులో ఒకరకం. దీనిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ , ఆండ్రోజెన్ ఉంటాయి. అలసట, నీరసం, లో మూడ్, రాకు వంటి సైకలాజికల్ సింప్టమ్స్ ఈ ఖీఐఆౖఔౖNఉతో చాలా తగ్గుతాయి. చాలామందిని మెనోపాజ్ తర్వాత ఒకటి రెండేళ్ల వరకు హాట్ ఫ్లషెస్.. చలి చెమటలు తీవ్రంగా బాధిస్తాయి. వీటిని ట్రీట్మెంట్తో తగ్గించవచ్చు. మీకు ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్స్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేసి .. తర్వాత కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ని సూస్తాము. సాధారణంగా మూడు నెలల నుంచి ఆరు నెలల కోర్స్తో సింప్టమ్స్ తగ్గి.. పరిస్థితి మెరుగుపడుతుంది. -
ప్రెగ్నెన్సీ మూడో నెలలో అబార్షన్..మళ్లీ గర్భం వచ్చే ఛాన్స్ ఉందా?
అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా? – మమత గ్రేస్, సామర్లకోట ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది. కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి. ఇందుకు ఒకసారి మీరు డాక్టర్ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. -
ఎల్లో మీడియా రాతలు ఊహాజనితం
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల్లో కాలం చెల్లుతున్న మందులే గతి అంటూ ఎల్లో మీడియాలో ప్రచురించిన కథనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఖండించింది. ఈ కథనం పూర్తిగా ఊహాజనితమని ఏపీ వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ మురళీధర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణ చేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే దురుద్దేశంతో కథనం రాశారని అన్నారు. నెల క్రితం ఒంగోలు జీజీహెచ్కు 2 నెలల కాల వ్యవధి ఉన్న మందులను పంపి, వాటిని తీసుకోవాలని సిబ్బందిపై ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు.డబ్ల్యూహెచ్వో, గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలున్న మందులను మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్ (సీడీఎస్)లకు సరఫరా చేస్తున్నామన్నారు. 6 నెలల కాలవ్యవధి ఉన్న మందులను సంబంధిత కంపెనీలకు సమాచారమిచ్చి, వాటి స్థానంలో అంతే పరిమాణంలో కొత్త స్టాక్ పొందుతున్నట్టు తెలిపారు. ఏదైనా కంపెనీ కొత్త స్టాక్ ఇవ్వకపోతే వారికి చెల్లించే బిల్లుల నుంచి రికవరీ చేస్తామన్నారు. అంతేకాకుండా 3 నెలల కాల వ్యవధి ఉన్న మందులను ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు ఈ–ఔషధి పోర్టల్ అనుమతించదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 207 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 5 శాతం కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 483 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేస్తే 0.85 శాతం మందులు మాత్రమే కాలం చెల్లినవి ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయీ పేదలకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
పీరియడ్స్ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
పూర్వం 15 ఏళ్ల వయసుకే ఆడపిల్లలకు పెళ్లి చేసేవాళ్లు కాబట్టి రజస్వల అయిన వెంటనే పెళ్లి చేయాలని ఆ సమయంలో నేతితో తయారు చేసిన స్వీట్లు ఎక్కువగా తినిపించేవాళ్లు. నిజానికి రజస్వల అయినప్పుడే కాదు, ఏ వయసు పిల్లలకయినా స్వీట్లు, నేతి పదార్థాలు ఎక్కువగా పెట్టకూడదు. పైగా రజస్వల అయిన పిల్లలను కొద్దికాలం పాటు ఇంటికే పరిమితం చేస్తారు కాబట్టి పిల్లలు ఆ కొద్దిరోజుల్లో విపరీతంగా బరువు పెరగటంతో పాటు ఆ ఆహార శైలికి అలవాటు పడి అలాగే కొనసాగుతారు. అధిక బరువు వల్ల హర్మోన్లలో అవకతవకలు మొదలవుతాయి. ఇది ప్రమాదకరం.రజస్వల సమయంలో హార్మోన్ల స్రావాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. రక్తస్రావం ఎక్కువగా ఉండి ఐరన్ లోపం ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఆకుకూరలు, గుడ్లు ఎక్కువగా ఇవ్వాలి. క్యాల్షియం, విటమిన్ డి లోపాలు రాకుండా పాలు ఇవ్వడంతో పాటు వేరుసెనగ పప్పు, బెల్లం, ఖర్జూరాలు, పప్పులు, అటుకులు, రాగులు, నువ్వులతో తయారుచేసిన చిరుతిళ్లు తినిపించాలి. -
పీరియడ్ లీవ్స్ కొరకు పిల్.. తిరస్కరణ
ఢిల్లీ: విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో ఋతుస్రావ సమయంలో.. సెలవులు మంజూరుచేసేలా అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను విధివిధానాలను రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిల్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇది తమ పరిధిలోని అంశం కాదంటూనే.. పిటిషనర్కు కీలక సూచన చేసింది ధర్మాసనం. ఇది మా పరిధిలోని అంశం కాదు. విధివిధానాల రూపకల్పనకు సంబంధించింది. కాబట్టి, పిటిషనర్ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖను సంప్రదించడం సముచితంగా ఉంటుంది అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి నెలా మహిళా ఉద్యోగులకు ఋతు నొప్పి సెలవులు(పీరియడ్స్ లీవ్) మంజూరు చేయాలని కంపెనీలు/యజమానులపై ఒత్తిడి చేస్తే.. అది ఉద్యోగ నియామకాల్లో తీవ్ర ప్రభావం చూపెడుతుందని పిల్ను వ్యతిరేకించిన న్యాయవాది(లా స్టూడెంట్ ఒకరు) బెంచ్ ముందు వాదించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. పిల్ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. అయితే.. ఈ ప్రజాప్రయోజన వాజ్యం ద్వారా పిటిషనర్ కొన్ని కీలకాంశాలను లేవనెత్తారని.. కాకపోతే ఇది విధానాల రూపకల్పనకు సంబంధించి కావడంతో.. పిల్పై విచారణ ముందుకు సాగించలేమని స్పష్టం చేసింది ధర్మాసనం. ఢిల్లీకి చెందిన శైలేంద్ర మణి త్రిపాఠి.. లాయర్ విశాల్ తివారీ ద్వారా ఈ పిల్ పిటిషన్ దాఖలు చేశారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961లోని సెక్షన్ 14ను అన్ని రాష్ట్రాలు పాటించేలా కేంద్రం ద్వారా ఆదేశాలు ఇప్పించాలని పిటిషనర్ కోరారు. జపాన్, తైవాన్, ఇండోనేషియా, సౌత్ కొరియా, స్పెయిన్(మూడు రోజులు.. వీలును బట్టి ఐదు రోజులకు కూడా పొడిగించొచ్చు), జాంబియా.. ఇలా చాలా దేశాల్లో పీరియడ్స్ లీవ్లను మంజూర చేస్తున్నారు. అలాగే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 1961 ప్రకారం.. మహిళలు ఎదుర్కొనే ఎలాంటి సమస్యలకైనా పెయిడ్ లీవ్ పొందే ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకించి గర్భం దాల్చిన సమయంలో. అందునా.. ఆ నిబంధనల పర్యవేక్షణ కోసం సెక్షన్ 14 ప్రకారం ఒక ఇన్స్పెక్టర్ నియమించాల్సి ఉంటుంది కూడా. అయితే.. కేంద్ర ప్రభుత్వం అలాంటి పర్యవేక్షకులను ఇంతదాకా నియమించలేదు అని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అంతేకాదు దేశంలో బీహార్ రాష్ట్రం మాత్రమే 1992 నుంచి రుతుస్రావ సమయంలో ప్రత్యేక సెలవులను రెండురోజులపాటు మంజూరు చేస్తూ వస్తోందని సదరు పిటిషనర్ బెంచ్కు తెలిపారు. అలాగే జొమాటో, బైజూస్, స్విగ్గీ కూడా పెయిడ్ లీవ్స్ను మంజూరు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే వికిపీడియా సమాచారం ప్రకారం.. కేరళ ప్రాంతంలో 1912 సంవత్సరంలో ఓ బాలికల పాఠశాలకు పీరియడ్స్ లీవ్స్ మంజూరు చేసినట్లు రికార్డుల్లో ఉంది. అంతేకాదు.. తాజాగా ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు మంజూరు ఇవ్వనున్నట్లు కేరళ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కూడా. -
కరోనాతో ముందస్తు రజస్వల
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ముందస్తు రజస్వల అవడానికి కూడా దారి తీస్తోందన్న దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా బయట పడింది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాలికల్లో ఈ కేసులు పెరుగుతున్నట్లు సర్వేల్లో తేలింది. సాధారణంగా బాలికలు 13 నుంచి 16 ఏళ్ల వయసులో రజస్వల అవుతుంటారు. కానీ, 8 ఏళ్ల బాలికలు సైతం ఉదంతాలు బయటపడ్డాయి. ‘‘ఒకమ్మాయి నా దగ్గరికొచ్చింది. ఆమె వయసు ఎనిమిదేళ్ల తొమ్మిది నెలలు. అప్పుడే íపీరియడ్స్ మొదలయ్యాయి’’ అని ఢిల్లీలోని ప్రముఖ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మన్ప్రీత్ సేథీ చెప్పారు. కరోనాకు ముందు ఎర్లీ ప్యూబర్టీ కేసులు నెలకు 10 వరకూ వచ్చేవని, ఇప్పుడు 30 దాటుతున్నాయని వెల్లడించారు. ఇటలీ, టర్కీ, అమెరికాల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. కారణమేమిటి?: ముందస్తు రజస్వలకు ప్రధాన కారణం కోవిడ్–19 వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆ సమయంలో జనమంతా ఇళ్లకే పరిమితయ్యారు. విద్యార్థులకు ఆటపాటలు కూడా లేవు. నెలల తరబడి ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఫలితంగా వారిలో జీవక్రియలు(మెటబాలిజం) ప్రభావితమయ్యాయి. మన మెదడు మన శరీరం ఎత్తును పరిగణనలోకి తీసుకోదు. బరువును మాత్రం పరిగణనలోకి తీసుకుంటుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే అన్ని హార్మోన్ల స్థాయిలను పిట్యూటరీ గ్రంథి పర్యవేక్షిస్తూ ఉంటుంది. శరీరం ఒక స్థాయి బరువుకు చేరుకోగానే ఈ గ్రంథి ప్యూబర్టీని ప్రేరేపిస్తుంది. ఫలితంగా బాలికల్లో పిరియడ్స్ ప్రారంభమవుతాయి. ఇందులో హార్మోన్ల స్థాయి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంటే బరువును నియంత్రణలో ఉంచుకుంటే ముందుస్తు రజస్వలను అరికట్టవచ్చని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. -
మన గడ్డపై 2,300 ఏళ్లనాటి టెర్రకోట బొమ్మ!
సాక్షి, హైదరాబాద్: సుమారు తొమ్మిది అంగుళాలున్న ఈ టెర్రకోట బొమ్మ.. ఈ మధ్యే దాన్ని తయారు చేసినట్టుగా ఎరుపురంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. కానీ, ఆ బొమ్మ వయసు దాదాపు 2,300 ఏళ్లపైనే. మౌర్యుల అనంతర కాలంలో, శాతవాహనుల కంటే ముందు రూపొందించినట్టుగా భావిస్తున్న ఈ బొమ్మ తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ శివారులోని పాటిగడ్డలో లభించింది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దికి చెందిన ఈ బొమ్మను బుద్ధుడి కథల్లో ప్రాధాన్య మున్న బౌద్ధ హారీతి విగ్రహంగా భావిస్తున్నట్టు చరిత్ర పరిశోధకులు వెల్లడించారు. అన్నింటికన్నా ప్రాచీనమైనది తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో శాతవాహన కాలానికి చెందిన వస్తువులు అరుదుగా వెలుగు చూస్తుంటాయి. కానీ, అంతకన్నా ముందునాటి.. అంటే క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం కంటే పాతవి బయటపడటం, అవి పాడైపోకుండా ఉండటం అత్యంత అరుదు. ఇప్పుడలాంటి బొమ్మ ఒకటి లభించింది. చేర్యాల పట్టణం శతాబ్దాల క్రితం మరోచోట విలసిల్లింది. ఆ ఊరు కాలగర్భంలో కలిసిపోయి పాటిగడ్డ దిబ్బగా మారింది. ఇప్పుడా దిబ్బగర్భంలో అలనాటి వస్తువులు బయటపడు తున్నాయి. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు శ్రీనివాస్ సేకరించిన కొన్ని వస్తువుల్లో ఈ టెర్రకోట బొమ్మ కూడా లభించింది. బొమ్మ తల భాగంలో జుట్టును అలంకరించిన తీరు ఆధారంగా ఇది మౌర్యుల కాలం ముగిసిన సమయంలో క్రీ.పూ.2వ శతాబ్దానికి చెందిందిగా చరిత్ర పరిశో ధకుడు ఈమని శివనాగిరెడ్డి సహకారంతో గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగో పాల్ పేర్కొ న్నారు. తలపై ప్రత్యేక అలంకారం, చెవులకు పెద్ద కుండలాలు, దండరెట్టలకు అలంకారాలు, నడు మున మేఖలతో ఉన్న ఈ శిల్పం అమ్మదేవతగా భావించే బౌద్ధ హారీతిదై ఉంటుందని చెప్పారు. గతంలో కొండాపూర్, పెద్దబొంకూరు, కోటలింగాలలో లభించిన కంచు, టెర్రకోట బొమ్మలతో ఇది పోలిఉందన్నారు. మేలురకం బంకమట్టితో బొమ్మచేసి కొలిమిలో కాల్చిన తర్వాత దానికి ఎరుపురంగు అద్దినట్టుందని, శతాబ్దాల పాటు మట్టిలో కూరుకుపోయి ఉండటంతో ఏమాత్రం ధ్వంసం కాకుండా, ఇప్పటికీ కొత్తదానిలా ఉందని వివరించారు. దారం వడికే మట్టికుదురు, మట్టితో చేసి, మంటల్లో కాల్చి రూపొందించిన టెర్రకోట పూసలు దారం వడికే మట్టికదురు.. టెర్రకోట బొమ్మతోపాటు శాతవాహన కాలానికి చెందిన, ఉన్ని దారం వడికే మట్టి కదురు బిళ్ల కూడా లభించింది. బిళ్లకు రెండువైపులా ఉబ్బెత్తుగా ఉండి, మధ్యలో రంధ్రం ఉందని, ఆ రంధ్రం గుండా పొడవాటి కర్ర పుల్లను ఉంచి ఉన్ని దారం వడికేందుకు వినియోగించేవారని హరగోపాల్ తెలిపారు. బంగారం, వెండి, రాగి లోహాలు కరిగించే మూస, సాంబ్రాణి, అగరుధూపం వేసే మట్టిపాత్ర, మట్టి కంచుడు, టెర్రకోట పూసలు, చనుముక్కు గొట్టం, ఆకుల డిజైన్ ఉన్న పెంకులు లభించాయన్నారు. (చదవండి: ‘కృత్రిమ మేధస్సు’.. గుంతల రోడ్లకు తేజస్సు!) -
పీరియడ్ ప్రొడక్టులు ఫ్రీగా అందిస్తున్న తొలి దేశం
పీరియడ్ పావర్టీ.. చాలా దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. ఆర్థికంతో ముడిపడిన విషయం కావడంతో.. చాలామంది పీరియడ్స్ ప్రొడక్టులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడిదాకా ఎందుకు.. అసలు వాటి గురించి అవగాహన, మాట్లాడేందుకు మొహమాటం ప్రదర్శించే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మహిళలకు నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించకపోతే.. ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురవుతాయి. అంతేకాదు దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకే రుతుక్రమ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి.. పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తున్న తొలి ప్రపంచ దేశంగా నిలిచింది స్కాట్లాండ్. ఎడిన్బర్గ్: అవును.. యూరోపియన్ దేశం స్కాట్లాండ్ ఇవాళ్టి(ఆగష్టు 15వ తేదీ) నుంచి దేశం మొత్తం పీరియడ్ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే ఈ చర్యకు ఉపక్రమించిన తొలి దేశంగా నిలిచింది. ఈ మేరకు ముందస్తుగా ఆదివారమే ఓ ప్రకటన చేసింది స్కాట్లాండ్ ప్రభుత్వం. స్కాట్లాండ్ ఉచిత పీరియడ్ ప్రొడక్ట్స్ చట్టం 2020లోనే తెర మీదకు వచ్చింది. శానిటరీ ఉత్పత్తులతో పాటు టాంపన్స్, శానిటరీ ప్యాడ్స్ను సైతం బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్ 2020లో స్కాటిష్ పార్లమెంట్ ఏకగ్రీవంగా చట్టానికి ఆమోదం కూడా వేసింది. అయితే.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు రుసుము లేకుండా శానిటరీ ఉత్పత్తులు ఇప్పటికే అందించబడ్డాయి, అయితే ఇప్పుడు బిల్లు.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత మంత్రులకు ఇచ్చింది. తద్వారా దేశంలో శానిటరీ ఉత్పత్తులు ఇకపై అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. అయితే ఈ చట్టం అంత ఈజీగా ఆచరణలోకి రాలేదు. చాలా పోరాటాలే జరిగాయి. ఉచిత పీరియడ్ ఉత్పత్తులకు ప్రాప్యతను అందించడం సమానత్వం, గౌరవానికి సంబంధించింది. వాటిని మహిళలు అంగీకరించడం ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది అని సామాజిక న్యాయ కార్యదర్శి షోనా రాబిసన్ చెప్తున్నారు. జీవన వ్యయ సంక్షోభం కారణంగా ప్రజలు కష్టతరమైన ఎంపికలు చేస్తున్న సమయంలో.. ఇది(ఈ సమస్య) గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా పీరియడ్ ఉత్పత్తులకు ఎవరూ దూరంగా ఉండకూడదనే తమ ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. ఇదీ చదవండి: బుజ్జి బుల్లిపిట్ట.. కానీ, నిలువెల్లా విషమే! -
Health: అయిదేళ్లుగా తీవ్ర వేదన.. హెవీ పీరియడ్స్.. పరిష్కారం?
Gynaecology Counselling: నాకు 40 సంవత్సరాలు. అయిదేళ్లుగా హెవీ పీరియడ్స్ అవుతున్నాయి. చాలా మందులు వాడాను. యుటెరస్లో ఏ ప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఈ మధ్యే ఒక సీనియర్ డాక్టర్ Mirena Coil సజెస్ట్ చేశారు. ఇది సురక్షితమైనదేనా? వేయించుకోవచ్చా? గర్భసంచి తీయించుకోవడమొక్కటే బెస్ట్ ట్రీట్మెంట్ అని కొంతమంది చెప్పారు. నా సమస్యను అర్థం చేసుకొని సలహా ఇవ్వగలరు. – కె. నీలిమ, మిర్యాలగూడ Mirena అనేది లూప్ లాంటిది. ఈ మధ్య చాలామందికి వేస్తున్నాం. హెవీ పీరియడ్స్కి బాగా పనిచేస్తుంది. ఇది కాపర్టీ డివైస్ లాంటిది. కాకపోతే దీనిలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ పూత ఉంటుంది. అది రోజూ కొంచెం కొంచెంగా హార్మోన్ను విడుదల చేసి గర్భసంచి పొరను పల్చగా ఉంచుతుంది. దీంతో అధిక రక్తస్రావం తగ్గుతుంది. ఈ Mirena వేసిన 3–6 నెలల తర్వాత నెలసరి పెయిన్, రక్తస్రావం చాలా వరకు తగ్గుతాయి. దీన్ని గర్భసంచిలో అమర్చిన తర్వాత అయిదేళ్ల వరకు పనిచేస్తుంది. ఇది మీకు సరిపడుతుంతో లేదో అనేది వెజైనల్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్ధారిస్తారు. ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. అయిదేళ్ల తర్వాత తీసేసి.. మళ్లీ కొత్తది వేస్తారు. మామూలు గైనిక్ అవుట్ పేషంట్ వార్డ్లోనే ఈ ప్రొసీజర్ చేస్తారు. దీనికి మత్తు అవసరం లేదు. అల్ట్రాసౌండ్లో గర్భసంచి ఎలా ఉందో చెక్ చేసి.. నెలసరి అయిపోయిన మొదటివారంలో వేస్తారు. దీనితో ఇంకో ఉపయోగం కూడా ఉంది. ఇది కాంట్రాసెప్టివ్లా కూడా పనిచేస్తుంది. ఇంటర్కోర్స్లో ఏ ఇబ్బందీ కలిగించదు. హార్మోన్స్ లోపం వల్ల హెవీ పీరియడ్స్ అవుతుంటే ఈ Mirena చాలా బాగా పనిచేస్తుంది. 35 – 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఇది మంచి ఆప్షన్. గర్భసంచి తీసేయడాన్ని నివారించొచ్చు. హిస్టెరెక్టమీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ను, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ను ఈ Mirena మూలంగా తప్పించవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ చదవండి: Pregnancy Tips: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి? -
Health Tips: మెనుస్ట్రువల్ క్రాంప్స్.. ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ వల్ల..
What Is Menstrual Cramps: యువతులకు నెలసరి ఎంతోకొంత ఇబ్బందికరమైనదే. ఒకవేళ దాంతోపాటు మెనుస్ట్రువల్ క్రాంప్స్ గనక తోడైతే మరెంతో బాధకారం. ఉన్న ఇబ్బందికి తోడు, బాధ, వీపు, పొత్తికడుపు భాగాల్లో కండరాలు బిగుసుకుపోయి తీవ్రమైన నొప్పితో చెప్పుకోలేని విధంగా వేదనకు గురవుతుంటారు. ఇటీవలే చైనాకు చెందిన ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ జెంగ్ క్విన్వెన్, న్యూజీలాండ్కు చెందిన గోల్ఫ్ ప్లేయర్ లైడియా కో వంటి క్రీడాకారిణులు ఈ సమస్యతో బాగా ఇబ్బంది పడ్డారు. జెంగ్ క్విన్వెన్ అయితే... ‘‘నేనో యువకుణ్ణయితే బాగుండేదేమో’’ అని కూడా వ్యాఖ్యానించింది. చాలామంది యువతులను బాధపెట్టే ఈ ‘మెనుస్ట్రువల్ క్రాంప్స్’పై అవగాహన కోసం ఈ కథనం. ఓ బాలిక యుక్తవయస్కురాలయ్యాక దాదాపు మొదటి ఏడాదీ, రెండేళ్లు లేదా ఒక్కోసారి మొదటిబిడ్డ పుట్టే వరకు ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. వైద్యపరిభాషలో డిస్మెనూరియా అని పిలిచే ఈ సమస్య వల్ల... నొప్పితో పాటు పొత్తికడుపు, వీపు కింది భాగం కండరాలు కదలనివ్వనంతగా బిగుసుకుపోయి ఇబ్బంది పెడతాయి. ఈ ఇబ్బంది ఎంతగా ఉంటుందంటే... ఆ రోజుల్లో వారి జీవననాణ్యత పూర్తిగా దెబ్బతినడంతో... ప్రతినెలా వారి అమూల్యమైన రోజుల్లో కొన్ని ఈ బాధల వల్లనే పూర్తిగా వృథా అవుతాయి. ఎందుకిలా జరుగుతుంది...? ఇలా ఎందుకు జరుగుతుందన్న విషయం తెలుసుకోవాలంటే... ముందుగా నెలసరి ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. మహిళల్లో ప్రతినెలా ఒక అండం విడుదలవుతుంది. ఒకవేళ అది ఫలదీకరణ చెందితే... దాని ఎదుగుదలకు తోడ్పడేందుకు గర్భసంచిలో ఎండోమెట్రియమ్ అనే పొర మందంగా మారుతుంది. ఒకవేళ అండం ఫలదీకరణ చెంది పిండంగా మారితే... మందంగా మారిన ఈ ఎండోమెట్రియమ్ పొరలోనే అది ఎదుగుతుంది. ఫలదీకరణం జరగనప్పుడు... ఈ పొర రాలిపోతుంది. అలా ఇది ఊడి బయటకు వచ్చే సమయంలో రక్తస్రావం జరుగుతుంది. కొందరిలో ఈ పొర ఊడిపోయేందుకు వీలుగా బిగుసుకుపోయేందుకు ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ లాంటి జీవరసాయనం కారణమవుతుంది. ఇదే యువతుల్లో తీవ్రమైన నొప్పి, బాధతో పాటు కొన్నిసార్లు ఇన్ఫ్లమేషన్ పుట్టేలా (ట్రిగర్) చేస్తుంది. ఫలితంగా చుట్టుపక్కల కండరాలూ బిగుసుకుపోయి తీవ్రమైన బాధకు గురిచేస్తాయి. అందుకే రుతుస్రావం సమయంలో ఈ బాధ, నొప్పి, కండరాల బిగుతు అన్నమాట. పై సమస్యతో మాత్రమే కాకుండా మెనుస్ట్రువల్ క్రాంప్స్కు మరికొన్ని కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు... ►ఎండోమెట్రియాసిస్ : ఎండోమెట్రియమ్ అనే పొరకు కలిగే ఇన్ఫ్లమేషన్ వల్ల. ►యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ : యుటెరస్లో పుట్టే కొన్ని క్యాన్సర్ రకానికి చెందని (నాన్క్యాన్సరస్) గడ్డల వంటి వాటి వల్ల. ►అడెనోమయోసిస్ : యుటెరస్ చుట్టూ న్న పొర పొరుగున ఉన్న ఇతర కండరాల్లోకి చొచ్చుకుపోవడం వల్ల. ►పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ : ఏవైనా కారణాల వల్ల మహిళల్లో పునరుత్పత్తికి చెందిన అవయవాలకు హానికరమైన బ్యాక్టీరియా సోకడం వల్ల వచ్చే జబ్బుల కారణంగా. ►సర్వైకల్ స్టెనోసిస్ : కొంతమంది మహిళల్లో వారి గర్భాశయ ముఖద్వారం ఎంత సన్నగా ఉంటుందంటే... అది రుతుస్రావాలను, రక్తస్రావాలను సాఫీగా పోనివ్వదు. దాంతో వ్యర్థాలు అక్కడ పేరుకుపోవడం వల్ల తీవ్రమైన నొప్పి రావచ్చు. ఎప్పుడు సాధారణం... ఎప్పుడెప్పుడు హానికరం... ►సాధారణంగా మెనుస్ట్రువల్ క్రాంప్స్ వల్ల ఆరోగ్యానికీ లేదా ఇతరత్రా ఎలాంటి హానీ, ముప్పూ ఉండవు. తీవ్రమైన బాధ మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వీటిపై సీరియస్గా దృష్టిసారించాల్సి ఉంటుంది. అదెప్పుడంటే... ►30 ఏళ్లు పైబడ్డాకా ఈ సమస్య వస్తుంటే. ►పదకొండు లేదా అంతకంటే చిన్న వయసులోనే యుక్తవయస్కురాలైతే. ∙ïపీరియడ్స్ సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటే (మెనొరేజియా) ►రక్తస్రావం/రుతుస్రావం ఒక క్రమపద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా అవుతుంటే (మెట్రోరేజియా) ∙కుటుంబంలో మెనుస్ట్రువల్ క్రాంప్స్ (డిస్మెనూరియా) ఆరోగ్య చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ఉంటే. ఏదైనా ప్రమాదమా : ఈ నొప్పి వల్ల ఎలాంటి పనులూ చేయలేకపోవడం, యుక్తవయసులోని పిల్లలు స్కూల్/కాలేజీకి వెళ్లలేకపోవడం, యువతులు ఆఫీసుకు వెళ్లడం కష్టమై... వారి పనులకు అంతరాయం కలగడం వంటి సాధారణ సమస్యలే తప్ప ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ►అయితే కొన్ని సందర్భాల్లో అంటే... అధికరక్తస్రావం లేదా సంతానలేమి వంటి సమస్యలతో పాటు ఈ కండిషన్ కూడా ఉన్నప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ►ఉదాహరణకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ కారణంగా ఫెలోపియన్ ట్యూబ్స్ దెబ్బతినడం, ఫలదీకరణం చెందిన అండం గర్భసంచి (యుటెరస్)లో చక్కగా ఒదగలేకపోవడం వంటి సమస్యలు రావచ్చు. అవి మినహా మరే రకమైన ఇబ్బందీ ఉండదు. చాలా సందర్భాల్లో వయసు పెరగుతుండటంతోనూ, బిడ్డ పుట్టిన తర్వాతనో ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంది. ఇవీ లక్షణాలు ►నెలసరి సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, బాధ. ►పొత్తికడుపులో ఎంతో ఒత్తిడి ఉన్న ఫీలింగ్. ►వీపు వెనక, నడుము, తొడ భాగంలో తీవ్రమైన నొప్పి (పొత్తికడుపు నుంచి బయలుదేరే ఇదే నొప్పి రేడియేటింగ్ పెయిన్ రూపంలో ఈ భాగాలకు విస్తరిస్తుంటుంది. ►కడుపులో వికారంగా ఉండటం. ఒక్కోసారి వాంతులు కావడం. ►కొంతమందిలో నీళ్లవిరేచనాలు, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. చికిత్స : అయితే చికిత్సలోనూ నేరుగా మందులు వాడకుండా కొన్ని ప్రత్యామ్నాయ ప్రక్రియలు అవలంబిస్తారు. ఉదాహరణకు తొలుత... ►వ్యాయామం (ఎక్సర్సైజ్) హీట్ థెరపీ వార్మ్ బాత్ మసాజ్ కంటినిండా తగినంత నిద్ర ద్యానం, యోగా వంటి ప్రక్రియలతో చాలావరకు ఉపశమనం ఉంటుంది. వీటితోనూ తగినంత ఫలితం లేనప్పుడు కొన్ని నొప్పి నివారణ మందులు, హార్మోన్ ట్యాబ్లెట్లు, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్ వాడటం వంటివి. ►ఒకవేళ ఈ సమస్యతో పాటు ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్, ఎడినోమయోసిస్ (గర్భసంచి పొర దాని తాలుకు కండరాల్లోకి లోపలికి పెరగడం) వంటి సమస్యలు ఉంటే నొప్పికి వాడే మందులతో పాటు అరుదుగా ఆపరేషన్ కూడా అవసరం పడవచ్చు. పరీక్షలు : సాధారణ నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి, క్రాంప్స్ సమస్యకు ఉపశమనం దొరకకపోతే అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్స్ పరీక్ష అవసరం కావచ్చు. ఈ సమస్యకు అరుదుగా లాపరోస్కోపీ అవసరం కావచ్చు. సూచన... నిర్దిష్టంగా నివారణ పూర్తిగా సాధ్యం కాకపోయినప్పటికీ... యువతులు రుతుస్రావం సమయంలో తాము కోల్పోయే ఐరన్ భర్తీ అయ్యేందుకు ఐరన్ పుష్కలంగా ఉండే ముదురాకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, ఖర్జూరాలు, పల్టీపట్టి (చిక్కీ) వంటి తినే పదార్థాలు తింటూ, ఖనిజలవణాలు భర్తీ అయ్యేందుకు ఆరోగ్యకరమైన ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం చాలావరకు మేలు చేస్తుంది. -డాక్టర్ శిరీష ప్రమథ, సీనియర్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
Period Leave: లోలోపల మెలిపెట్టే బాధ.. సెలవు బలహీనతేనా.. కానేకాదు!
శరీరమంతా ఒక చోటే గడ్డకట్టినప్పుడు ఒక వైయక్తిక పర్వతం విస్ఫోటం చెందినప్పుడు నేను బాధని అరచేతిలో పట్టుకోవడానికి విఫల ప్రయత్నాలు చేస్తుంటాను అంటూ కె. గీత అనే కవయిత్రి మహిళల రుతుక్రమ బాధను వర్ణించారు. స్త్రీలకు మాత్రమే అర్థమయ్యే ఈ బాధ, ఇబ్బందికి కాస్త విశ్రాంతితో ఎంతోకొంత ఉపశమనం పొందవచ్చు. గృహిణులకు కొంచెం ఆ వెసులుబాటు ఉండొచ్చేమో కానీ కుటుంబం కోసం ఆర్థిక బాధ్యతలనూ పంచుకుంటున్న మహిళలకు ఆ విశ్రాంతి ఎలా దొరకుతుంది? సెలవు పెట్టాలంటే జీతం (ఆ రోజులకు) నష్టపోవాలి. పోనీ దానికీ సిద్ధపడి.. ‘నెలసరి వచ్చింది.. సెలవు కావాలి’ అని అడగడానికి ఏదో జంకు.. బిడియం.. భయం.. అర్థం చేసుకుంటారా? వెకిలిగా చూస్తే? కామెంట్ విసిరితే? ఇన్ని సంకోచాల మధ్య సెలవు అడిగే బదులు ఎలాగోలా కొలువుకు రావడమే నయమనే నిస్సహాయ సర్దుబాటు. సగటు మహిళా ఉద్యోగి ప్రతినెలా ఎదుర్కొనే సున్నితమైన సమస్య ఇది. ఇలాంటి స్థితిలో ఆఫీస్ యాజమాన్యాలే అర్థం చేసుకొని నెలసరిలో విశ్రాంతి తీసుకోమని అధికారికంగా ఒక రూల్ పాస్ చేస్తే ఎంత హ్యాపీ! బహిష్టు సమయంలో మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులపై ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటోంది సమాజం. ఆ క్రమంలోనే పీరియడ్ లీవును మంజూరు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు.. సిక్ లీవ్, మెటర్నిటీ లీవ్ తరహాలో! అయితే ఈ సెలవు మహిళల అవకాశాలను గండికొట్టడానికే తప్ప ఆమె సామర్థ్యానికి విలువనిచ్చేది కాదు అనే వాదన.. దీని వల్ల మహిళలు తాము శారీరకంగా బలహీనుమలని ఒప్పుకుంటున్నట్టే అనే అసంతృప్తి ఓ చర్చగా మారింది సర్వత్రా! ఆ చర్చనీయాంశాన్ని ఫన్డే కవర్ స్టొరీగా మీముందుకు తెచ్చాం! జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, కాలు బెణికింది, బ్యాక్ పెయిన్ ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు లేదనకుండా లీవ్ ఇస్తారు. ఇంట్లో పెద్దలు, పిల్లల అనారోగ్యాలు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పిక్నిక్లు, వ్రతాలు, యాత్రలు ఇలా సెలవు ఇవ్వడానికి అన్నీ సకారణాలే. కానీ పీరియడ్స్ను మాత్రం ‘సెలవు తీసుకోవడానికి ఓ వంకలా వాడుకుంటున్నారు మహిళలు’ అన్నట్టుగా చూస్తారు.. ‘అదేమైనా రోగమా రొష్టా సెలవు తీసుకోవడానికి’ అనీ అనుకుంటారు కొందరు మగబాసులు. దీనికి ప్రధాన కారణం శారీరకంగా స్త్రీ, పురుషుల్లో భేదమే. ఇది ప్రతి నెల స్త్రీలకి తప్పనిసరి వ్యవహారం. సృష్టికి ప్రతిసృష్టిని అందించే అమ్మతనానికి ఇదే మూలం. ఒకప్పుడు నెలసరి వచ్చిందంటే అమ్మాయిలు ఓ మూల కూర్చోవాలి. ఎవరినీ ముట్టుకోకూడదు. ఎటూ తిరగకూడదు. నలుగురిలో కలవకూడదు. గుళ్లు, గోపురాలకు వెళ్లకూడదు. ప్రకృతి సహజంగా స్త్రీకి వచ్చే శారీరక మార్పులకు ఇన్ని ఆంక్షలు విధించడం కచ్చితంగా ఆమెపై చూపించే వివక్షే. కానీ అందులో అంతర్లీనంగా బహిష్టు సమయంలో మహిళ శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, అందుకే ఈ సంప్రదాయాలు వచ్చాయని వాదించే వారు ఉన్నారు. రోజూ ఇంట్లో గొడ్డు చాకిరి చేసే మహిళకి ఆ మూడు రోజులే విశ్రాంతి దొరికేది. అలా ఎవరికీ కనిపించకుండా మూల కూర్చొనే స్థాయి నుంచి మహిళలు మగవారితో దీటుగా పనిచేయగల సమర్థతను సాధించడం వెనుక ఎంతో పోరాటం ఉంది. మహిళల పట్ల సానుభూతితో కాకుండా ఆ సమయంలో వారిలో కలిగే నొప్పిని, బాధను, మానసికంగా పడే ఆవేదనను కొందరైనా అర్థం చేసుకుంటున్నారు. అయినా మన దేశంలో కేవలం 15 కంపెనీలు మాత్రమే పీరియడ్ లీవ్ మంజూరు చేస్తున్నాయి. ఆ బాధ వర్ణనాతీతం కౌమరంలోకి అడుగు పెట్టి రజస్వల అనే దశను మొదలు కొని అయిదు పదుల వయసులో ఏర్పడే మెనోపాజ్ వరకూ ప్రతి అమ్మాయి, ప్రతి మహిళా నెల నెల క్రమం తప్పకుండా ఎదుర్కోవలసిన స్థితి నెలసరి. కొంత మంది మహిళల్లో నెలసరి అనేది వారి శరీర తత్వాన్ని బట్టి ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా గడిచిపోతుంది. కానీ ఎక్కువ మంది మహిళల్లో పొత్తి కడుపులో తెరలు తెరలుగా నొప్పి వస్తుంది. మరికొందరిలో అధిక రక్తస్రావం జరుగుతుంది. కొందరిలో నరాల్లో రక్తమంతా ఆవిరైపోతున్నట్టు శరీరం వశం తప్పుతూ ఉంటుంది. కాళ్లల్లో సత్తువ ఉండదు. నిల్చోలేరు. కూర్చోలేరు. పడుకోలేరు. ఏమీ తినాలనిపించదు, తాగాలనిపించదు. ఆలోచనలు కుదురుగా ఉండవు. మూడ్ స్వింగ్స్ అసాధారణంగా ఉంటాయి. లోలోపల మెలిపెట్టే బాధని దాచుకునే పరిస్థితులతో అసహనం కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది. చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం, మూడీగా ఉండడం చూస్తుంటాం. ఆ సమయంలో ఆఫీసుకి వెళ్లాలంటే ప్రాణం పోతున్నంత పని అవుతుంది. అధిక రక్త స్రావంతో మరకలు అంటుకుంటే ఎలాగన్న భయం, పదే పదే శానిటరీ ప్యాడ్ మార్చుకోవడానికి వాష్ రూమ్కు పరిగెత్తాలంటే ఓ జంకు, నొప్పులు వేధిస్తున్నా పని మీద దృష్టి నిలపలేని నిస్సహాయత ఇవన్నీ మహిళల్ని కుంగదీస్తున్నాయి. దీనికీ వెస్టే ఫస్ట్ పీరియడ్స్ టైమ్లో మహిళలకు సెలవు ఇవ్వాలన్న ఆలోచన పాశ్చాత్య దేశాల్లోనే ముందు మొదలైంది. సంప్రదాయాలకు, హిందూ జీవన విధానాలకు నెలవైన మన దేశంలో ఇలాంటి ఆలోచన చేయడం ఆలస్యంగా మొదలైంది. వందేళ్ల క్రితం 1920–30ల్లో మొట్టమొదటిసారి సోవియట్ రష్యా మహిళల్లో పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడడం కోసం ఈ సెలవు ఇవ్వాలన్న ఆలోచన చేసింది. మహిళలకు బహిష్టు సెలవు ఇవ్వాలని కార్మిక సంస్థలకు సిఫారసు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్.. మహిళల పీరియడ్ లీవ్కి ప్రాచుర్యాన్ని కల్పించింది. 1947లో దీనిపై చట్టం చేసింది. దక్షిణ కొరియా 1953లో ఒక్క రోజు పీరియడ్ లీవ్ ఇస్తూ చట్టం చేసింది. ఇండోనేసియాలో రెండు రోజులు, జాంబియాలో ఒక్క రోజు, తైవాన్లో ఏడాదికి మూడు రోజుల సెలవుతోపాటు ఆ సమయంలో అధికంగా మరో అరగంట బ్రేక్ ఇస్తోంది. ఇటీవల స్పెయిన్ కూడా మూడు రోజుల పాటు సెలవు ఇవ్వడానికి ఆమోదించింది. భారత్లో ఇలా.. మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రం బిహార్. కానీ మహిళల అంశంలో పాశ్చాత్య దేశాలతో పోటీ పడింది. మహిళలకి ప్రతినెల రెండు రోజుల పీరియడ్ లీవ్ మంజూరు చేస్తూ 1992లోనే చట్టం చేసింది. కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. అయితే అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ లోక్సభ సభ్యుడు నినోంగ్ ఎరింగ్ మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వాలంటూ 2017 నవంబర్లో ఒక ప్రైవేటు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. స్కూలు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు, ఆఫీసుల్లో పని చేసే మహిళలకు టాయిలెట్ సౌకర్యాలు సరిగా లేవని, అవసరమైతే కాసేపు విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదని, అందుకే వారికి సెలవు మంజూరు చేస్తూ ఒక చట్టం చేయాలని ఆ బిల్లులో కోరారు. అయిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఆ బిల్లుపై కనీసం చర్చ కూడా జరగలేదు. సెలవు తీసుకుంటే వెనుకబడిపోతారా ? సమానత్వం కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్న మహిళలు ఇప్పుడిప్పుడే ఆర్థికవృద్ధిలోనూ తమ వాటా ఉందని నినదిస్తున్నారు. మన దేశంలో దాదాపుగా 43.2 కోట్ల మంది స్త్రీలు ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో పని చేస్తూ ఆర్థిక వ్యవస్థకి వెనుదన్నుగా నిలుస్తున్నారు. దేశ జీడీపీలో 18% వాటాను మహిళలే అందిస్తున్నారు. మగవారితో సమానంగా మహిళలకూ అవకాశాలు లభిస్తే 2025 నాటికి దేశ జీడీపీలో 58 లక్షల కోట్ల రూపాయలు మహిళల వాటాయే అవుతుందని మెకిన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. ఇలా మహిళలు ఎదుగుతున్న వేళ పీరియడ్స్లో మహిళలు విశ్రాంతి కోరుకొని సెలవు తీసుకున్నా ఇంట్లో విశ్రాంతి లభిస్తుందన్న గ్యారంటీ లేదు. ఇంటి పనుల భారం, బాధ్యత మహిళలే తీసుకోవాలి కాబట్టి అక్కడ పని చేయడం ఎలాగూ తప్పదు. ఇప్పటికే రకరకాల కారణాలతో ఆఫీసుల్లోకి మహిళా ఉద్యోగుల్ని తీసుకోవడం లేదు. తీసుకున్నా ఆడవారిపై వివక్ష కొనసాగు తూనే ఉంది. ఈ మధ్య విడుదలైన జాతీయ కుటుంబ సర్వే ప్రకారం గత అయిదేళ్లలోనే రెండు కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు వదులుకున్నారు. ఇప్పుడు పీరియడ్ లీవ్ ఇస్తే కంపెనీలు మహిళా ఉద్యోగులను వద్దనుకోవడానికి ఇదీ ఓ కారణం అవుతుందని వాదించేవారూ ఉన్నారు. ఆ వాతావరణమే లేదు 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాం. ఇంకా మహిళలు స్వేచ్ఛగా ఈ అంశంపై మాట్లాడే వాతావరణమే మన దగ్గర లేదు. ఇదే అంశంపై ప్రజాభిప్రాయం కోరినప్పుడు సామాన్య మహిళలే కాదు, చదువుకుని ఉద్యోగాలు చేసే మహిళలు కూడా మాట్లాడేందుకు కాస్త తటపటాయించడం, మొహమాటపడటం ఆశ్చర్యం కలిగించే అంశం. ప్రతినెల అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్ కొనుగోలు చేసినప్పుడు ఎవరికీ కనిపించకుండా నల్ల క్యారీబ్యాగ్లలో ఇస్తూ అదేదో ఎవ్వరికీ తెలియకూడని బ్రహ్మపదార్థంలా దాచేస్తున్నారు. స్త్రీలు తమ శరీరంలో సహజసిద్ధంగా జరిగే మార్పులపై చర్చించడం, మనసు విప్పి మాట్లాడ్డంలో తప్పులేదు. ఇది స్త్రీ ఆరోగ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి దీనిని బలాలు, బలహీనతలు, సమర్థత, అసమర్థత అన్న కోణంలోంచి చూడలేం. మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మగౌరవంతో ఉంటేనే సమాజ పురోగతి సాధ్యమవుతుంది లేదంటే అభివృద్ధి గతి తప్పుతుంది. అమ్మ బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మహిళ బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇది అక్షర సత్యం. నెలసరి సమయాల్లో మహిళలకి విశ్రాంతి కల్పించడానికి ఇంటా, బయటా వారి చుట్టూ ఉండే మగవాళ్లు సహకారం అందివ్వాలి. ఇలా చేయడం మహిళలకి చేసే అదనపు సాయం కానేకాదు. ఇది అందరి బాగుకోసమే అన్న అవగాహన పెరగాలి. మహిళలు బహిరంగంగా డిమాండ్ చేసినా చేయకపోయినా పీరియడ్ లీవ్ ఇస్తే లాభమే తప్ప నష్టం లేదు. ఆఫీసుకు వచ్చి కూడా సిగరెట్ బ్రేక్ అని, కాఫీ బ్రేక్ అని, ఇతరులతో పిచ్చాపాటి పేరు చెప్పుకొని మగవారు పని గంటల్ని వృథా చేస్తూనే ఉంటారు. వారు చేసే వృథాతో పోల్చి చూస్తే మహిళలకు ఇచ్చే సెలవు ఏమంత విషయం కాదు. బాధ్యత కలిగిన ప్రజా నాయకులందరూ ఈ దిశగా ఆలోచించాలి. ఎన్నో దేశాలు పీరియడ్ లీవ్ ఇస్తూ ఉంటే మన దేశంలో అది ప్రైవేటు బిల్లు స్థాయిలోనే ఉండడం, దానిపై చర్చ జరగకుండా డర్టీ థింగ్ అంటూ కొందరు పురుష ఎంపీలు అడ్డుతగలడం అత్యంత విషాదం. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగినప్పుడే వారి సమస్యలను అర్థం చేసుకుని తదనుగుణంగా చట్టాలు రూపొందించుకోగలుగుతాం. ఇక పీరియడ్ సెలవు వినియోగించుకోవాలా, వద్దా అనేది పూర్తిగా ఆమె ఇష్టం. ఆ స్వేచ్ఛ ఆమెకి అవసరం. మహిళల పడే రుతుక్రమం బాధలపై తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, తోడబుట్టిన సోదరుడు కావొచ్చు. కన్న కొడుకే కావచ్చు.. ఆ మహిళతో కలిసి జీవన ప్రయాణం సాగించే ప్రతీ మగవాడు అర్థం చేసుకొని, వారికి అండగా ఉన్నప్పుడే మనందరం కలలు కనే జెండర్ సెన్సిటివిటీ సాకారం కావడానికి ఒక అడుగైనా ముందుకు పడుతుంది. ఎందుకీ నొప్పి వస్తుంది ? డిస్మెనోరియా అంటే తీవ్రమైన నొప్పితో కూడిన రుతుక్రమం. మనలో 30 శాతం మంది మహిళలను సాధారణ స్థాయి నుంచి తీవ్రమైన నొప్పి వేధిస్తూనే ఉంటుంది. 10 నుంచి 15 శాతం మందిని అధిక రక్తస్రావం బాధిస్తుంది. చాలామంది మహిళలు రుతుక్రమానికి ముందు శారీరక, మానసిక రుగ్మతలతో బాధపడుతుంటారు. 5 నుంచి 10 శాతం మందిలో కుంగుబాటు, మూడ్ స్వింగ్స్, కడుపులో సూదులతో గుచ్చుతున్నట్టుగా, కండరాలు మెలిపెడుతున్నట్లు విపరీతమైన నొప్పితో బాధపడుతుంటారు. వీటిలో కొన్ని వంశపారంపర్యంగా వచ్చేవి, ఇంకొన్ని జీవన శైలిలో మార్పుల కారణంగా వచ్చేవి. మరికొన్ని పర్యావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలు. అధిక బరువు (ఒబేసిటీ) కారణంగా హార్మోన్ల అసమతుల్యత, హైపో థైరాయిడిజం, అనీమియా (రక్త హీనత), తీవ్రమైన ఒత్తిడి కారణంగా పీరియడ్స్లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. పై లక్షణాలన్నింటికీ ఫలానా కారణమని చెప్పలేం. కొందరికే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయన్నదానికీ సమాధానం దొరకదు. వారి వారి శారీరక ధర్మాలను అనుసరించి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మన శరీరంలో ఉండే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల అసమతుల్యత కూడా రుతుక్రమంలో నొప్పికి కారణం కావచ్చు. చాలా మంది మహిళల్లో తొలి ప్రసవం తర్వాత ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి. ఎండోమెట్రియాసిస్ లేదా ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా బహిష్టు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుతుంది. అధిక రక్త స్రావంతో బాధపడేవారు, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (నెలసరికి ముందు వచ్చే ఇబ్బందులు)తో బాధ పడేవారు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. ఆధునిక జీవన శైలిలో భాగమైన రాత్రివేళ ఎక్కువ సమయాలు మేల్కొని ఉండటం, చదువు వల్ల ఒత్తిడి, ఆఫీస్ పని భారం వంటి సమస్యలు నెలసరిలో ఇబ్బందులకి కారణాలుగా చెప్పవచ్చు. – డాక్టర్ వాణి చెరుకూరి, గైనకాలజిస్ట్, ఇవా వుమెన్ కేర్ క్లినిక్ పీరియడ్స్తో యుద్ధం కవరేజీ : బర్ఖాదత్ 2020లో జొమాటో సంస్థ పీరియడ్ లీవ్ ప్రకటించినప్పుడు ప్రముఖ మహిళా జర్నలిస్టు బర్ఖాదత్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సంస్థ సదుద్దేశంతో ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ మహిళలు శారీరకంగా బలహీనులనే వాదనకు బలం చేకూరుతందని ఆమె అభిప్రాయడ్డారు. సైన్యంలో చేరాలని, కదనరంగం కవరేజీ ఇవ్వాలని, యుద్ధ విమానాలు నడపాలని, అంతరిక్షంలోకి వెళ్లాలని అనుకుంటూ ఇంకోవైపు పీరియడ్ లీవ్ అడగడం ఎంతవరకు సమర్థనీయమని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు తాను కార్గిల్ యుద్ధం కవరేజీకి వెళ్లినప్పుడు పీరియడ్స్లో ఉన్నానని , నొప్పికి మాత్రలు వేసుకుంటూ, శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో లేకపోతే టాయిలెట్ పేపర్లు వాడుతూ యుద్ధ వార్తల్ని ప్రపంచానికి వెల్లడించానన్నారు. బర్ఖా అప్పట్లో చేసిన ట్వీట్ హాట్ టాపిక్గా మారింది. కానీ సామాజిక మాధ్యమాల్లో ఆమెకు మద్దతు పలికిన వారి కంటే వ్యతిరేకించినవారే అధికంగా ఉన్నారు. ఆడవాళ్లకే ఆ బాధ తెలుస్తుంది ఉరుకుల పరుగుల జీవితంలో మగవారితో సమానంగా పోటీపడి పనిచేస్తున్న మహిళలకు సహజసిద్ధమైన ప్రకృతి నియమం పీరియడ్స్. వృత్తి రీత్యా మహిళా కానిస్టేబుల్స్, కండక్టర్లు మొదలు ఇలా ఎక్కువ సమయం విధుల్లో గడిపేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ ఆ సమయంలో కూడా వారికి పని చేయక తప్పనిసరి పరిస్థితి ఇంటా బయటా ఉంటుంది. మెటర్నటీ లీవ్ ఎలా ఇస్తారో అదే విధంగా మహిళలకు పీరియడ్ లీవ్ ఇవ్వడంలో తప్పులేదు. అందరిలోనూ ఈ బాధ ఒకే రకంగా ఉండదు కాబట్టి ప్రతినెల కాకుండా, ఏడాదికి కొన్ని రోజులు సెలవు కేటాయించడం మంచి పని. ఇక ఆ సెలవు తీసుకోవాలా, వద్దా అన్నది మహిళల చాయిస్. – సుమతి, తెలంగాణ డీఐజీ ఆహ్వానించాల్సిన అంశం నెలసరి వచ్చినప్పుడు చాలా మంది బాధపడుతుంటారు. ఆ సమయంలో విశ్రాంతి అవసరం. ఎన్నో ఆఫీసుల్లో స్త్రీల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు లేవు. కొన్ని స్కూళ్లల్లో టాయిలెట్స్ లేక శానటరీ ప్యాడ్స్ మార్చుకునే వీలు ఉండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడో దూరంగా బాత్రూమ్స్ ఉంటాయి. తలుపులు కూడా సరిగా ఉండవు. అలాంటి చోట్ల మహిళలు చాలా ఇబ్బంది పడాలి. అందుకే పీరియడ్ లీవ్ ఇవ్వాలన్న ఆలోచన ఆహ్వానించాల్సిన అంశం. ఆ సమయంలో సెలవు తీసుకున్నంత మాత్రానా మహిళలు శారీరకంగా బలహీనులమని అంగీకరించినట్లన్న వాదన అర్థరహితం. – కొండవీటి సత్యవతి, సామాజిక కార్యకర్త ఇప్పటికీ చాలెంజే! ఇప్పుడంటే ఆఫీసులు.. వాటిల్లో టాయ్లెట్స్.. కారవాన్స్ వచ్చాయి కానీ నేను యాంకరింగ్కు వచ్చిన కొత్తల్లో అంటే 1991 ఆ టైమ్లో ఊళ్లకు వెళ్లి షూటింగ్స్ చేయాల్సి వచ్చినప్పడు టాయ్లెట్కైనా పీరియడ్స్ టైమ్లో ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలన్నాæ.. చెట్టు.. పుట్ట.. గట్టే గతి. వాటి చాటుకు వెళ్లి చేంజ్ చేసుకోవడమే. కానీ గంటలు గంటలు నిలబడి చేసే ప్రీరిలీజ్ ఫంక్షన్స్ ఇప్పటికీ చాలెంజే పీరియడ్స్ టైమ్లో. ప్యాడ్స్ చేంజ్ చేసుకునే వీలే ఉండదు. కాస్ట్యూమ్స్ కూడా నా సౌకర్యం కోసం డార్క్ కలర్స్లో ఇవ్వమని అడగడానికి ఉండదు. ఒక్కోసారి లైట్ కలర్స్లో ఇస్తారు. అట్లాంటప్పుడు నేను తీసుకునే జాగ్రత్త ఒక్కటే ఎవ్రీ థింగ్ ఈజ్ ఇన్ ప్రాపర్ ప్లేస్ ఉండేట్టు చూసుకోవడమే. పాడ్ మీద పాడ్ .. పాడ్ మీద పాడ్ పెట్టుకుని వెళ్లిన సందర్భాలు, క్లాట్స్, క్రాంప్స్తో విలవిల్లాడిన సందర్భాలూ ఉన్నాయి. – యాంకర్ సుమ ఒక ఇంటర్వ్యూలో బలహీనతగానే పరిగణించాలి పురుషులతో సమానంగా పోటీపడుతున్నప్పుడు మహిళలు పీరియడ్ లీవ్ తీసుకుంటే వారి బలహీనతగానే పరిగణించాలి. ఈ ఆధునిక ప్రపంచంలో నెలసరి బాధల నుంచి బయట పడేందుకు ఎన్నో మార్గాలున్నాయి. మందులు, ప్రాణాయామం, యోగాసనాలు వంటి వాటితో ఈ బాధను అధిగమించే ప్రయత్నం చేయాలి. సెలవు కోసం చట్టం చేయడానికి ముందుకొస్తే అందరితోనూ చర్చించి చేయాలి – సంగీత వర్మ, విద్యావేత్త ఎన్నటికీ బలహీన పరచదు ఈ లీవ్ మహిళల్ని ఎన్నటికీ బలహీన పరచదు. మగవారి కంటే మహిళలే అన్ని పనులు బాధ్యతతో చేస్తారు. ఆ సమయంలో విశ్రాంతి దొరికితే ఆ మర్నాడు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారు. – కవిత రాజేశ్, ఎంట్రప్రెన్యూర్ స్వాగతించాలి తప్ప.. నెలసరి సమయంలో మహిళలకు ఎన్నో ఇబ్బందులుంటాయి. అందరిలోనూ ఒకేలా ఉండవు. ప్రభుత్వం వాటిని గుర్తించి సెలవు మంజూరు చేస్తే స్వాగతించాలి. అంతే తప్ప అది మహిళల అసమర్థతగా చూడకూడదు. అయితే ఈ పీరియడ్ లీవ్ను ఐచ్ఛిక సెలవుగా ప్రకటించాలి. – పి. సౌదామిని, డైరెక్టర్, సీఓడబ్ల్యూఈ, ఇండియా స్విగ్గీ నుంచి ఫ్లిప్కార్ట్ వరకు ►ఆన్లైన్ ఫుడ్ డెలవరీ సంస్థ స్విగ్గీ తమ సంస్థలోని డెలివరీ గర్ల్స్కి నెలకి రెండు రోజులు పీరియడ్ లీవ్ ఇస్తోంది. మహిళల హైజీన్ కోసం ఉత్పత్తుల్ని తయారు చేసే వెట్ అండ్ డ్రై కంపెనీ తమ కంపెనీలో పని చేసే మహిళలకు రెండు రోజులు అదనంగా సెలవు ఇస్తోంది. ►హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇండస్ట్రీ ఆర్క్ తమ సెలవుల్లో పీరియడ్ లీవ్ను కూడా చేర్చింది. ఒకటి, లేదా రెండు రోజులు ఆఫ్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ►మలయాళంలో మాతృభూమి పత్రిక నెలకి ఒక రోజు సెలవు ఇస్తోంది. ►చెన్నైకి చెందిన డిజిటల్ మ్యాగజైన్ మ్యాగ్టర్ నెలకి ఒక రోజు లీవ్ ప్రకటించింది. ►జొమాటో సంస్థ అమ్మాయిలకు ఏడాదికి అదనంగా 10 రోజుల సెలవు కల్పించింది. అవసరమైన వారు ఆ సెలవు వినియోగించుకుంటారని అలా ఇచ్చింది. ►ముంబైకి చెందిన డిజిటల్ మీడియా కంపెనీ కల్చర్ మిషన్ తమ సంస్థలో మహిళా ఉద్యోగులు వేతనంతో కూడిన ఒక్క రోజు సెలవు తీసుకోవడానికి అనుమతించింది. ►బెంగుళూరుకు చెందిన స్టార్టప్ హార్సెస్ స్టేబుల్ న్యూస్ ఉద్యోగుల్లో 60 శాతం మహిళలే. ఈ సంస్థ నెలకు రెండు రోజులు పీరియడ్ లీవ్ మంజూరు చేసింది. ► ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ తమ కంపెనీలోని మహిళా ఉద్యోగుల కోసం నెలకు ఒక్క రోజు పీరియడ్ లీవ్ ఇచ్చింది. ►కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడంతో ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు మహిళలకు నెలసరి సమయంలో ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి. చదవండి: Russia- Ukraine: మూడో ముప్పు.. అసలు భయం అదే.. భారీ జనహనన ఆయుధాల వల్ల! -
పీరియడ్స్లో వేతన సెలవులివ్వాల్సిందే
సంబాల్పూర్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళలకు పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒడిశాలోని సంబాల్పూర్ పట్టణ యువతులు ఆన్లైన్ ఉద్యమం ప్రారంభించారు. ఈ విషయంలో తగిన మార్గదర్శకాలుజారీ చేయాలని ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఒడిశా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుశాంత్ సింగ్కు వినతి పత్రం సమర్పించారు. పీరియడ్స్ సమయంలో మహిళలు మానసికంగా, శారీరకంగా ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటారని, వారికి తగిన విశ్రాంతి అవసరమని అన్నారు. అందుకే వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కోరారు. కనీసం ఒక్క రోజైనా సెలవు ఇవ్వాలని చెప్పారు. ఎందుకంటే 99 శాతం మంది మహిళలు గరిష్టంగా 24 గంటలపాటు నొప్పితో బాధపడుతూ ఉంటారని గుర్తుచేశారు. భారత్లో ప్రస్తుతం 12 కంపెనీలు మహిళలకు రుతుస్రావం సమయంలో పెయిడ్ లీవులు మంజూరు చేస్తున్నాయి. తమ ఉద్యమానికి మహిళల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోందని, ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదని రంజితా ప్రియదర్శిని స్పష్టం చేశారు. -
PCOD And PCOS రెండూ ఒకటేనా? ట్రీట్మెంట్
-
రోజుకో నువ్వుల ఉండ, బియ్యం కడిగిన నీళ్లు..
-
పీరియడ్లో భయంకరమైన నొప్పా? ఇలా చేయండి!
మన ఇంటి అమ్మాయికి తొలిసారి నెలసరి రాగానే పదిమందినీ పిలిచి వేడుక చేసుకున్నంత ఈజీ కాదు పీరియడ్స్ అంటే. దాదాపు ప్రతీ ఆడబిడ్డకు ప్రతీ నెల అదొక చెప్పలేనంత ఇబ్బంది. దీనికి అధిక రక్త స్రావం, భరించలేని కడుపునొప్పి లాంటివి తోడైతే ఇక నరకమే. అసలు పీరియడ్స్ లేదా బహిష్టు సమయంలో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? వీటికి పరిష్కారా లేంటి అనే విషయాలపై ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. కవిత సాక్షి. కామ్తో వివరాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆహార నియమాలు, కొద్ది పాటి వ్యాయామం చేయాలని ఆమె సూచించారు. చాలామంది మహిళల్లో ఋతుక్రమం సమయంలో గర్భాశయ కండరాల్లో సంకోచం కారణంగా కడుపునొప్పి వస్తుంది. ఈ సంకోచాలు ఎంత బలంగా ఉంటే అంత తీవ్రంగా కడుపు నొప్పి వేధిస్తుంది. ఈ కారణంగా రక్త నాళాలపై ఒత్తిడి ఏర్పడి గర్భాశయానికి ఆక్సిజన్ తగ్గుతుంది. ఇలా ఆక్సిజన్ సరఫరా తగ్గి, మరింత నొప్పి, ఒక్కోసారి తిమ్మిరి వస్తుంది. ఈ సమయంలో హీట్ ప్యాడ్ చాలా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. కాళ్లను పొట్ట దగ్గరగా వచ్చేలా ముడుచుకొని హీట్ ప్యాడ్ను పొట్టపై పెట్టుకోవాలి. దీంతో కండరాల సంకోచాలు నియంత్రణలోకి వస్తాయి. నొప్పి మరీ భరించలేనంతగా ఉన్నపుడు మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ ద్రవపదార్థాలను సేవిస్తూ ఒత్తిడికి దూరంగా ఉంటూ తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. తక్కువ కొవ్వు, అధిక పీచు కలిగిన ఆహారం మేలు. తృణధాన్యాలు, కాయధాన్యాలు, బీన్స్, ముదురు ఆకు పచ్చఆకు కూరలు, ఇతర కూరగాయలు శ్రేయస్కరం. విటమిన్, ఈ, బీ1,బీ6, మెగ్నీషియం, జింక్ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు లాంటి పోషకాలు పీరియడ్ బాధలనుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రోజుకు ఒక నువ్వులు, బెల్లం కలిపిన ఉండ తీసుకుంటే గర్భాశయ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే మరో మూడు నాలుగు రోజుల్లో పీరియడ్ వస్తుందనగా, లావెండర్, నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో పొట్టపై సున్నితంగా 5 నుంచి 10 నిమిషాలు పాటు మాసాజ్ చేసుకోవాలి. ఫలితంగా గర్భాశయంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. చాలామంది టీనేజర్లలో మెన్స్ట్రువల్ సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవర్ బ్లీడింగ్, లేదంటే భరించలేని కడుపునొప్పితో మెలికలు తిరిగి పోతూ ఉంటారు. ఒక్కోసారి రెండు సమస్యలు వేధిస్తుంటాయి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణమని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ వల్ల చాలా ప్రమాదమని సాధ్యమైనంత వరకు మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిదని సూచిస్తున్నారు. సాంప్రదాయ బద్ధ ఆహారాన్ని తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు డా. కవిత సూచించారు. ప్రతీ నిత్యం యోగ, సూర్య నమస్కారాలు చేయడం వలన మహిళల్లో పీరియడ్ సమస్యలే కాదు, హార్మోనల్ ఇంబేలన్స్ అనేది లేకుండా చూసుకోవచ్చన్నారు. . వీటన్నింటికి తోడు ఇంట్లోని వారందరూ పీరియడ్ టైంలో ఆడవాళ్ల సమస్యల్ని,బాధల్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి. పీరియడ్ అనగానే అదేదో అంటు ముట్టు సమస్యగానో, లేదంటే అపవిత్రమైన విషయంగానో చూడటాన్ని మానేయాలి. పీరియడ్ సమయంలో ఉన్న మహిళలకు మరింత సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పీరియడ్లో బ్లీడింగ్ ఆగిపోయి, ప్యాడ్లు, కప్లు ఇలాంటి బాదర బందీ లేకుండా.. హాయిగా ఉండొచ్చు అని నిర్ధారించు కున్నపుడు వచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేం. ఇది ఈ ప్రపంచంలో ప్రతీ అమ్మాయికీ, మహిళకు అనుభవమే -
Health Tips: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా..
Health Benefits Of Galijeru Aaku: పల్లెల్లో దానిని అటుక మామిడి అనీ, గలిజేరనీ, ఎర్రగలిజేరనీ అంటారు. ఆయుర్వేదంలో దీనిపేరు పునర్నవ. పునర్ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. ప్రతి కణానికి ఆరోగ్యాన్నిచ్చి పునరుజ్జీవింప చేయగలదు కాబట్టే ‘పునర్నవ’ అయ్యింది. ►తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరనీ, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరనీ పిలుస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్ధ రూపాయి పరిమాణంలో ఉంటాయి. ఔషధ గుణాలు ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు. వీటిలో ఏది దొరికితే దానిని కూరగా.. పచ్చడిగా, పులుసుకూరగా వండుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. గలిజేరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ►పునర్నవలో ఆకు, కాండం, వేరు... ఇలా ప్రతీదీ పనికి వస్తుంది. ఈ ఆకులను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రేచీకటి, మూత్రనాళ దోషాలు, కఫ సమస్య, లివర్ వాపు, అధిక బరువు, కామెర్లు, మధుమేహం, వరిబీజం, యూరియా లెవల్స్ సరిచేయటానికి ఉపయోగపడుతుంది. ►వాతం, శ్వాస సంబంధ వ్యాధులు, రక్త శుద్ధి, కీళ్ళ నొప్పులు, బహిష్టు సమస్యలు దరిచేరవు. జ్వరాలు రావు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వ్యాధులకు ఇది మందుగా పనిచేస్తుంది. ►కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు దీనిని పప్పుతో వండుకుని తింటే చాలా త్వరగా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం దీనికి ఉంటుంది. ►యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్ సి, డి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడతాయి. ►క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం ఇది. ►మనకి సామాన్యంగా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరే. ఈ ఆకులను పప్పులో కలిపి వండుకుంటారు, ఉప్పు మిరప కాయలు వేసి రుబ్బిన మినప్పిండిలో గుమ్మడి బదులు సమూలంగా తరిగిన గలిజేరు మొక్కను కలిపి వడియాలు గా చేసి ఎండబెట్టి నిల్వ చేసుకుంటారు. ►ఆకులతో కషాయం చేసి తాగుతారు. ఈ కషాయంలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే నెలరోజుల్లో శరీరం ఉబ్బు తగ్గుతుంది. ►ఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ధి చెందుతుంది. ►గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానంగా నువ్వులనూనెని కలిపి నూనె మిగిలేదాకా సన్నటి సెగన కాచి, నొప్పులున్న చోట మర్దనా చేస్తే త్వరగా తగ్గుతాయి. ►నడకరాని పిల్లలకు ఇదే తైలంతో మర్దన చేసి తర్వాత స్నానం చేయిస్తే నడక వస్తుందని మూలికా వైద్యులు చెబుతారు. ►గలిజేరు ఆకు రసం తీసి దానిలో సగం బరువు పటికబెల్లం పొడి కలిపి తీగ పాకం పట్టి చల్లార్చి నిల్వ చేసుకోవాలి. ►రోజు ఒక చెంచా పాకం గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగుతుంటే గుండె దడ, బలహీనత తగ్గుతాయి. అయితే పాలిచ్చే తల్లులు, గర్భిణులు ఈ ఆకును తినకపోవడమే మంచిది. చదవండి: Anjeer Health Benefits: అంజీర తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
ఇంకా రజస్వల కాలేదు... ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
Gynecologist Venati Sobha Counselling Suggestions Irregular Periods: మా అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. ఇంకా రజస్వల కాలేదు. పరీక్షలు జరిపిన డాక్టర్లు ‘టర్నర్ సిండ్రోమ్’ అని చెబుతున్నారు. దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో దయచేసి వివరించగలరు. – సుగుణ, మధిర ఆడపిల్లల్లో 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్స్. వీటిలో 22 జతల ఆటోసోమ్స్, ఒక జత ‘ఎక్స్ఎక్స్’ క్రోమోజోమ్స్ ఉంటాయి. దానిని 46 ఎక్స్ఎక్స్గా పరిగణించడం జరుగుతుంది. ఈ ‘ఎక్స్ఎక్స్’ క్రోమోజోమ్స్ జతలో ఒక ‘ఎక్స్’ తల్లి నుంచి, ఒక ‘ఎక్స్’ తండ్రి నుంచి పిండం ఏర్పడినప్పుడే బిడ్డకు సంక్రమించి, ఆడపిల్లగా పుట్టడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల వల్ల ఒక ‘ఎక్స్’ క్రోమోజోమ్ మాత్రమే బిడ్డకు సంక్రమిస్తుంది. దీనినే ‘45ఎక్స్జీరో’ అంటారు. దీనినే ‘టర్నర్స్ సిండ్రోమ్’ అంటారు. ఇలా పుట్టిన పిల్లలు పొట్టిగా ఉండటం, వారిలో మానసిక ఎదుగుదల కొద్దిగా తక్కువగా ఉండటం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, రజస్వల కాకపోవడం, రొమ్ములు సరిగా పెరగకపోవడం, అండాశయాలు చాలా చిన్నగా ఉండి, అవి పనిచేయకపోవడం వల్ల పీరియడ్స్ రాకపోవడం, ఎముకల సమస్యలు వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కొందరిలో అండాశయాలు కొన్నిరోజులు హార్మోన్లు విడుదల చేసి, తర్వాత అవి చిన్నగా అయిపోయి అండాలు తగ్గిపోవడం వల్ల కొంతకాలం పీరియడ్స్ వచ్చి తొందరగా ఆగిపోతాయి. ఇది జన్యుపరంగా ఏర్పడింది కాబట్టి, మీరు చెయ్యగలిగింది ఏమీ లేదు. మీరు ఎండోక్రైనాలజిస్టును సంప్రదిస్తే, అవసరమైన పరీక్షలు చేయించి, స్కానింగ్లో గర్భాశయం, అండాశయాల పరిమాణం బట్టి, పీరియడ్స్ కోసం ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కొంతకాలం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇతర సమస్యలను బట్టి చికిత్స సూచించడం జరుగుతుంది. నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 48 కిలోలు. రెండేళ్లుగా నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. ఒక్కోసారి పదిహేను రోజులకే అయిపోతే, ఒక్కోసారి నెల్లాళ్లు గడిచాక అవుతోంది. పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పితో పాటు విపరీతమైన తలనొప్పి ఉంటోంది. ఆ సమయంలో ఏ పనీ చేయలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – రమ్య, తగరపువలస మీ ఎత్తుకి మీరు కనీసం 54 కిలోల బరువు ఉండాలి. కాని, 48 కిలోలే ఉన్నారు. కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల, థైరాయిడ్, పీసీఓడీ వంటి అనేక సమస్యల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. పీరియడ్స్ సమయంలో కొందరిలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్లు ఎక్కువగా విడుదలవడం వల్ల పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి ఉండే అవకాశాలు ఉంటాయి. కొందరిలో రక్తహీనత వల్ల, మానసిక ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి రావచ్చు. ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సీబీపీ, ఎస్ఆర్. టీఎస్హెచ్, అల్ట్రాసౌండ్ పెల్విస్ వంటి పరీక్షలు చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు, పాలు, పెరుగుతో కూడిన మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, నడక, యోగా, ధ్యానం వంటివి కూడా చెయ్యడం వల్ల చాలావరకు హార్మోన్ల అసమతుల్యత తగ్గే అవకాశాలు ఉంటాయి. సమస్య ఏమీ లేకున్నా, పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటే, డాక్టర్ సలహా మేరకు రెండురోజులు నొప్పి నివారణ మాత్రలు వాడుకోవచ్చు. ∙నా వయసు 46 ఏళ్లు. నాకు రుతుక్రమం రెండు మూడు నెలలకోసారి వస్తోంది. వచ్చినప్పుడు కూడా రుతుస్రావం రెండు రోజులే ఉంటోంది. ఇటీవల పరీక్షలు జరిపిస్తే, గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ పెరిగినట్లు రిపోర్టు వచ్చింది. ఈ పరిస్థితిలో గర్భసంచి తీసేస్తేనే మంచిదని డాక్టర్లు అంటున్నారు. నాకైతే ఆపరేషన్ అంటే భయంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయ చికిత్స ఏమైనా ఉందా? – లక్ష్మి, రేణిగుంట మీకు 46 ఏళ్లు. పీరియడ్స్ రెండు మూడు నెలలకోసారి వచ్చి, బ్లీడింగ్ రెండురోజులే ఉంటుంది. అంటే మీకు ఫైబ్రాయిడ్స్ కారణంగా ప్రస్తుతానికి పెద్దగా లక్షణాలేమీ లేనట్లే! సాధారణంగా ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో పెరిగే కంతులు. ఇవి 99.9 శాతం క్యాన్సర్ గడ్డలు కావు. వాటి పరిమాణం, గర్భాశయంలో ఎక్కడ ఉన్నాయి అనేదాని బట్టి లక్షణాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ గర్భాశయం లోపలి పొరలో (సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్) ఉంటే, బ్లీడింగ్ ఎక్కువ కావడం, మధ్య మధ్యలో స్పాటింగ్ కనిపించడం వంటివి ఉంటాయి. మయోమెట్రియమ్ పొరలో (ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్) ఉంటే, వాటి పరిమాణం బట్టి బ్లీడింగ్ ఎక్కువ కావడం, చిన్నగా ఉంటే కొందరిలో ఏ సమస్యా లేకపోవడం జరగవచ్చు. గర్భాశయం బయటి పొరలో (సబ్ సిరీస్ ఫైబ్రాయిడ్స్) ఉంటే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. మరీ పెద్దగా ఉంటే చుట్టు పక్కల అవయవాల మీద ఒత్తిడి పడటం వల్ల నడుంనొప్పి, మూత్ర సమస్యలు, జీర్ణ సమస్యలు ఉండవచ్చు. మీరు చెప్పినదాని బట్టి చూస్తే, ప్రస్తుతానికి ఫైబ్రాయిడ్స్ వల్ల మీకు ఎటువంటి లక్షణాలూ కనిపించడం లేదు. బ్లీడింగ్ కూడా రెండు మూడు నెలలకోసారి రెండురోజులే అవుతుంది కాబట్టి మీకు త్వరలోనే పీరియడ్స్ ఆగిపోయి మెనోపాజ్ దశ రావచ్చు. పీరియడ్స్ ఆగిపోతే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం అంతగా ఉండదు కాబట్టి ఫైబ్రాయిడ్స్ ఇంకా పెరగకుండా ఉంటాయి. అంతేకాకుండా, వాటి పరిమాణం మెల్లగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు లక్షణాలు లేనంత వరకు ఫైబ్రాయిడ్స్ గురించి కంగారు పడకుండా కొంతకాలం ఆగి చూడవచ్చు. ఆరునెలలకోసారి స్కానింగ్ చేయించుకుంటూ, వాటి పరిమాణం పెరుగుతోందా లేదా తెలుసుకోవచ్చు. వాటి పరిమాణం మరీ పెద్దగా అవుతూ, మీకు లక్షణాలు కనిపిస్తున్నట్లయితే, అప్పుడు ఆపరేషన్ గురించి నిర్ణయం తీసుకోవచ్చు. ఆపరేషన్ బదులు ఫైబ్రాయిడ్స్ పరిమాణం తగ్గడానికి యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్, ఎంఆర్ఐ గైడెడ్ హైఫ్రీక్వెన్సీ అల్ట్రాసౌండ్ వేవ్స్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించవచ్చు. డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
ఆ మధ్యలో... అలా అవుతోంది...
ప్రశ్న: నా వయసు 33 సంవత్సరాలు. ఎత్తు 5.2 అడుగులు, బరువు 55 కిలోలు. గత ఏడాది రెండో కాన్పు తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ తర్వాత పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపిస్తోంది. తరచుగా మూత్రం రావడమే కాకుండా, మూత్రం సమయంలో మంటగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – సువర్ణ, నిర్మల్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ కనిపించడానికి అనేక కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, కంతులు, ఎండోమెట్రియల్ పాలిప్స్(కండపట్టడం), ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం, గర్భాశయంలో వాపు అండాశయంలో నీటిబుడగలు, నీటి గడ్డలు, సిస్ట్లు, కంతులు, గర్భాశయ ముఖ ద్వారంలో పుండ్లు, హార్మోన్ల అసమతుల్యత, కొందరిలో పీరియడ్స్ మధ్యలో అండం విడుదలయ్యే సమయంలో బ్లీడింగ్ కనిపించవచ్చు. గైనకాలజిస్ట్కు సంప్రదించి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, స్పెక్యులమ్ పరీక్ష, ప్యాప్స్మియర్, వెజైనల్ పెల్విన్ అల్ట్రాసౌండ్, ఎస్ఆర్ టీఎస్హెచ్, సీబీపీ వంటి అవసరమైన రక్తపరీక్షలు వంటివి చేయించుకుని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. మూత్రంలో ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం తరచుగా రావడం, మంటగా ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి సంబంధించి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్షలు చేయించుకుని దానిని బట్టి సరైన యాంటీ బయాటిక్ కోర్స్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది. పీరియడ్స్ మధ్యలో అయ్యే బ్లీడింగ్కు పాలిప్, ఎండోమెట్రియమ్ పొర మందంగా ఉండటం వంటివి కారణం అయితే దానికి గర్భాశయంలో హిస్టెరోస్కోపీ ద్వారా చూస్తూ డీ అండ్ సీ చేయడం ద్వారా పొరను తొలగించి బయాప్సీకి పంపించడం, హార్మోన్స్ అసమతుల్యత చిన్న సిస్ట్లు ఉంటే హార్మోన్స్ ద్వారా చికిత్స చేయడం, పెద్ద సిస్ట్లు, ఫైబ్రాయిడ్స్ వంటి ఇతర కారణాలు ఉంటే ల్యాపరోస్కోపీ ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించడం వంటి చికిత్స విధానాలను గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో చేయించుకోవలసి ఉంటుంది. ప్రశ్న: మా అమ్మాయి వయసు 16 సంవత్సరాలు. ఎత్తు 5.4, బరువు 38 కిలోలు. ఇంకా మెచ్యూర్ కాలేదు. బరువు తక్కువగా ఉండటం వల్ల కొందరిలో ఆలస్యమవుతుందని విన్నాను. దీనికి ఇతర సమస్యలేవైనా కారణం కావచ్చా? పరిష్కారం వివరించగలరు. – అమ్మాజీ, యలమంచిలి మీ అమ్మాయి 5.4 ఎత్తుకి కనీసం బరువు 50 కేజీలు అయినా ఉండాలి. సాధారణంగా అమ్మాయి 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపల మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ కావడానికి హార్మోన్స్ సక్రమంగా పనిచెయ్యాలి అంటే శరీరంలో కనీసం 20 శాతం అయినా కొవ్వు ఉండాలి. మీ అమ్మాయి మరీ సన్నగా ఉంది కాబట్టి రజస్వల కాకపోవడానికి అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. కొందరిలో పుట్టుకలోనే గర్భాశయం, అండాశయాలు లేకపోవడం, లేదా వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యుపరమైన సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక కారణాల వల్ల 16 ఏళ్లైనా మెచ్యూర్ కాకపోవచ్చు. మీ అమ్మాయికి 16 ఏళ్లు కాబట్టి.. మెచ్యూర్ కాకపోవడానికి వేరే కారణాలు ఇంకేమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించి అల్ట్రాసౌండ్ పెల్విస్, సీబీపీ, ఎస్ఆర్. టీఎస్హెచ్, ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవాలి. ఈ లోపల మీ అమ్మాయికి పాలు, పెరుగు, ఆకుకూరలు, పండ్లు వంటి పౌష్టికాహారం ఇవ్వండి. కారణాన్ని బట్టి హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటే ఎండొక్రైనాలజిస్ట్ను కూడా సంప్రదించవలసి ఉంటుంది. డాక్టర్ వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
ఆ సమస్యతో బాధపడేవారిలో గుండె జబ్బులు రెండింతలు ఎక్కువ!
రెగ్యులర్ పీరియడ్స్ మంచి ఆరోగ్యానికి సంకేతమని తెలుసా? అవును.. హార్మోన్ల సమతౌల్యం, అసమతౌల్యం, సంతానోత్పత్తికి, మానసిక ఆరోగ్య స్థితికి కూడా ఇది ముందస్తు సూచనగా వ్యవహరిస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్గా రానివారిలో పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య తలెత్తుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా యుక్తవయసు బాలికల్లో, మహిళల్లో సాధారణంగా కనిపించే రుగ్మత. బెంగళూరులోని లా ఫెమ్ హాస్పిటల్ డైరెక్టర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ రాజ్పాల్ సింగ్ ఏం చెబుతున్నారంటే.. పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లక్షణాలు మెటబాలిక్ సిండ్రోమ్లో పీసీఓఎస్ ఒక భాగం. ఇది ఇన్సులిన్ విడుదలను నిరోధించడం, మేల్ ఆండ్రొజెన్ హార్మోన్ స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది మరీ అంతప్రమాదమా అంటే ప్రమాదమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడేవారిలో రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం, జుట్టు రాలడం, సంతాన సమస్యలు, బరువు పెరగడం, మధుమేహం.. వంటి లక్షణాలు ప్రాథమికంగా కనిపిస్తాయి. కదలకుండా ఒకే చోట కూర్చుని పనిచేసే జీవనశైలి, డిప్రెషన్, అధిక రక్తపోటు ఉండేవారిలో సాధారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. మన దేశంలో సగటున 20 నుంచి 30 శాతం మంది మహిళలు పిల్లల్నికనే వయసులో పీసీఓఎస్ బారిన పడుతున్నారు. మహిళల్లో సంతానవైఫల్యానికి ఇది కూడా ఒక కారణమే! గుండె సంబంధిత సమస్యలు రెండింతలు ఎక్కువ.. అసహజ జీవక్రియ కలిగిన మహిళల్లో హృదయసంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం రెండింతలు ఎక్కువ. ఏదిఏమైనప్పటికీ పీసీఓఎస్పై అవగాహన కలిగి ఉండటం మాత్రం అవసరమనే చెప్పాలి. మెట్ఫార్మిన్, ఎసిఇ/ఎఆర్బి ఇన్హీబిటర్స్, ఆస్పిరిన్ వంటి మందులు వాడే రోగుల్లో గుండె సంబంధిత సమస్యలు ముడిపడి ఉన్నాయని డా. రాజ్పాల్ వెల్లడించారు. సమస్య తగ్గాలంటే.. ఈ సమస్యతో బాధపడే వారు బరువు తగ్గడం, ఆహార భద్రతలు, శారీరక వ్యాయామం, పొగతాగడానికి దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా గైనకాలజీ చెక్అప్లు చేయించుకోవడం.. వంటి కొద్దిపాటి మార్పులు జీవనశైలిలో భాగంగా పాటించాలి. అంతేకాకుండా గుండె, న్యూరోలాజికల్ సంబంధమైన లక్షణాలు బయటపడినప్పుడు ఆలస్యం చేయకుండా అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టును సంప్రదించడం మరచిపోకూడదని డా. రాజ్పాల్ సూచించారు. చదవండి: ఈ చెట్లు ఒయ్యారంగా సాల్సా డాన్స్ చేస్తాయట.. ఆశ్యర్యం!! -
14 ఏళ్లకు మెచ్యూర్ అయ్యాను, పీరియడ్ వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పి.. తగ్గేదెలా?
నా వయసు 22 సంవత్సరాలు. నేను 14 ఏళ్ల వయసులో మెచ్యూర్ అయ్యాను. నాకు రెగ్యులర్గా 45 రోజులకు పీరియడ్స్ వస్తాయి. వచ్చినప్పుడల్లా మొదటి రోజు విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది. పీరియడ్స్లో కడుపు నొప్పి సాధారణమే అయినా, ఇలా విలవిలలాడేంతగా ఉండదని, ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? – శ్రుతి, విజయవాడ పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయ కండరాలు బాగా కుదించుకున్నట్లయి, అది పట్టి వదిలేస్తూ బ్లీడింగ్ బయటకు వస్తుంది. ఇది కొందరిలో పొత్తికడుపు నొప్పిగా అనిపిస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ప్రోస్టాగ్లాండిన్స్ విడుదలవ్వచ్చు. అవి విడుదలయ్యే మోతాదును బట్టి వాటి ప్రభావం వల్ల పీరియడ్స్లో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కొందరిలో నొప్పి కొద్దిగా ఉంటుంది. కొందరిలో నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీని ప్రభావం వల్ల గర్భాశయం లోపలి ఎండోమెట్రియమ్ పొరకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కుంచించుకుపోయి, ఎండోమెట్రియమ్ పొర ఊడిపోయి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల కూడా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండే అవకాశాలు ఉంటాయి. పైన చెప్పిన కారణాల వల్ల వచ్చే పీరియడ్స్ నొప్పి వల్ల ఇబ్బందులేమీ ఉండవు. కాకపోతే నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అలాగే ఆ సమయంలో పొత్తికడుపు మీద వేడి కాపడం పెట్టవచ్చు. యోగా, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా ఉపశమనం దొరుకుతుంది. కాకపోతే కొందరిలో గర్భాశయంలో కంతులు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, ఇన్ఫెక్షన్స్, చాక్లెట్ సిస్ట్స్, అండాశయంలో సిస్ట్లు వంటి అనేక కారణాల వల్ల పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో విపరీతమైన నొప్పి, నడుం నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, పెల్విక్ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్య ఏదైనా ఉందా లేదా తెలుసుకోవడం మంచిది. సమస్య ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు. సమస్య ఏమీ కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. నా వయసు 28 ఏళ్లు. నాకు పీసీఓడీ సమస్య ఉంది. పెళ్లయి ఆరేళ్ళయినా ఇంతవరకు పిల్లలు లేరు. డాక్టర్ను సంప్రదిస్తే ఫోలిక్ యాసిడ్ మాత్రలు, ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు రాసిచ్చారు. నాలుగు నెలలు వాడినా ఫలితం ఏమీ కనిపించలేదు. నా సమస్యకు ఎలాంటి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది? – సౌజన్య, గుత్తి గర్భాశయం రెండువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అనేక చిన్న చిన్న అండాలు ఉండే ఫాలికిల్స్ పెరగకుండా నీటిబుడగల్లా ఏర్పడతాయి. వీటినే పీసీఓడీ (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇందులో మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ వంటి ఆండ్రోజన్ హార్మోన్లు ఆడవారిలో విడుదలవుతాయి. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడి, దాని వల్ల పిల్లలు కలగడానికి ఇబ్బంది అవుతుంది. ఇందులో చికిత్సలో భాగంగా హార్మోన్ల అసమతుల్యత ఇంకా పెరగకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి వాడే సమయంలో గర్భం రాదు. అవి కొన్ని నెలలు వాడిన తర్వాతే అండం పెరగడానికి మందులు వాడుతూ గర్భం కోసం ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో కాంట్రాసెప్టివ్ మందులతో పాటు వాకింగ్, వ్యాయామాలు చేస్తూ, మితమైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం వల్ల కూడా అవి ఆపేసిన కొన్ని నెలల తర్వాత హార్మోన్ల అసమతుల్యత తగ్గి, గర్భం అదే నిలుస్తుంది. ఒకవేళ ఆలస్యం అవుతుంటే అప్పుడు అండం పెరగడానికి, గర్భం నిలవడానికి మందులతో చికిత్స తీసుకోవచ్చు. బిడ్డలో కొన్ని అవయవ లోపాలు రాకుండా ఉండటానికి ఫోలిక్యాసిడ్ మాత్రలను గర్భం కోసం ప్రయత్నం చేసే మూడు నాలుగు నెలల ముందు నుంచే వాడమని సలహా ఇవ్వడం జరుగుతుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీ రూమర్లకు చెక్ పెట్టిన హీరోయిన్!
Sonam Kapoor On Pregnancy Rumours: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఏడాది తర్వాత లండన్ నుంచి భారత్కు తిరిగొచ్చింది. ఇటీవలే ముంబై ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన ఆమె ఈ సందర్భంగా వదులైన జాకెట్ను ధరించింది. ఫ్యాషన్ ఐకాన్గా చెప్పుకునే సోనమ్ అలా లూజ్ డ్రెస్ వేయడంతో ఆమె గర్భవతంటూ నెటిజన్లు డౌటు పడ్డారు. కొంతమందైతే ఆమె ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేస్తూ విషెస్ కూడా తెలియజేశారు. దీంతో ఎట్టకేలకు సోనమ్ ఈ పుకార్లపై స్పందించింది. బుధవారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనకు పీరియడ్స్ వచ్చినట్లు స్పష్టం చేసింది. 'పీరియడ్స్ మొదటి రోజున వేడి నీళ్లు, అల్లం టీ తాగుతున్నాను' అని క్లారిటీ ఇవ్వడంతో రూమర్లకు చెక్ పెట్టినట్లైంది. ఇటీవల ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనమ్ మాట్లాడుతూ.. 'లండన్లో లభించే స్వేచ్ఛ నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను ఉండే చోటును నేనే శుభ్రం చేసుకుంటాను, నాకవసరమైనవి నేనే కొని తెచ్చుకుంటాను, నాకేది కావాలో అది వండుకుని తింటాను. నాకిక్కడ ఉండటం చాలా ఇష్టం, కానీ ఫైనల్గా నాకు ఇండియా అంటేనే ప్రాణం' అని చెప్పుకొచ్చింది. -
Period Time: ఐదు రోజుల నరకం.. వరిగడ్డిని చుట్టచుట్టి!
మహారాష్ట్రలోని ఆ ప్రాంత స్త్రీలు నెలకు ఐదు రోజులు నరకం చూస్తారు. ఎందుకంటే బహిష్టు సమయంలో ఊరికి దూరంగా ఉండే బహిష్టు గదుల్లో గడపాలి కాబట్టి. ఈ మూఢాచారాన్ని రూపుమాపడం అక్కడ కష్టంగా మారింది. కనీసం కరెంటు, టాయిలెట్, తలుపులు లేని ఆ దారుణమైన బహిష్టు గదుల నుంచి వారిని బయటపడేయడానికి అక్కడ కొత్త బహిష్టు గదుల నిర్మాణం జరుగుతోంది. దీని వల్ల మార్పు మెల్లగా వస్తుందని భావిస్తున్నారు. 21 ఏళ్ల శీతల్ నరోటేకి నిద్ర పట్టడం లేదు. చీకటి గది అది. ఎత్తు తక్కువ ఉంది. గడప లేదు. దోమలు. చలి. దానికి తోడు మరో ఇద్దరు పెద్దగా పరిచయం లేని స్త్రీలు. ఆమె ఆ చీకటి గదిలో మరో నాలుగు రాత్రులు గడపాలి... క్షేమంగా ఈ రాత్రి తెల్లారితే. ఎందుకంటే శీతల్ బహిష్టులో ఉంది. ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు మహిళ లు కూడా బహిష్టులో ఉన్నారు. ఆ ఊళ్లో బహిష్టు అయిన ఆడవాళ్లు ఇళ్లల్లో ఉండటానికి వీలు లేదు. అలా ఉంటే దేవతల ఆగ్రహానికి గురవుతారని ఊరి నమ్మకం. అందుకే ఇలాంటి ‘బహిష్టు గదు’ల్లో ఉంటారు. ఆ గదుల్లో ఎటువంటి సౌకర్యాలు ఉండవు. అసలు వాటిని గది అనడానికి కూడా లేదు. అయినప్పటికీ అక్కడే ఉండాలి. శీతల్ ఇల్లు ఆ గది నుంచి 100 మీటర్ల దూరం ఉంటుంది. రాత్రి వెళ్లి ఆ ఇంటి వరండాలో పడుకుందామన్నా ఒప్పుకోరు. శీతల్ పడుతున్న బాధ ఆ ప్రాంతంలో ప్రతి స్త్రీ తరాలుగా పడుతోంది. మహరాష్ట్ర గడ్చిరౌలీలో... నాగ్పూర్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గడ్చిరౌలీ గిరిజన ప్రాంతం. ఇక్కడ గోండులు, మడియాలు ఎక్కువగా జీవిస్తుంటారు. గ్రామాల్లోని స్త్రీలు బహిష్టు అయితే వారు అపవిత్రం అవుతారని తరాలుగా వీరు నమ్ముతారు. వీరు ఇళ్లల్లో ఉండకూడదు. ఊళ్లోని ‘బహిష్టు గదు’ల్లో ఉండాలి. వీరు వంట చేయడానికి, నీళ్లు చేదడానికి కూడా అర్హులు కారు. కుటుంబీకులలోని స్త్రీలు ఎవరైనా వీరికి ఆహారం, నీరు ఇవ్వాలి. బహిష్టులో ఉన్న స్త్రీలను మగవారు పొరపాటున తాకితే వెంటనే వారు తలస్నానం చేయాలి. ఈ గిరిజనులలో ఈ ఆచారం చాలా తీవ్రంగా నాటుకు పోయి ఉంది. ‘దీనిని మానేస్తే దేవతలు మా ఊరి మీద ఇళ్ల మీద ఆగ్రహిస్తారని మాకు భయం’ అని వారు అంటారు. మగవారు, గిరిజన పెద్దలు దీనికి పొరపాటున అంగీకరించరు. ఫలితం... స్త్రీలకు కలిగే తీవ్రమైన అసౌకర్యం. శిథిల గుడిసెల్లో గ్రామాల్లో శిథిల గుడిసెలను బహిష్టు గదులుగా గ్రామపెద్దలు కేటాయిస్తారు. వీటికి తలుపులు ఉండవు. కరెంటు ఉండదు. నీటి సౌకర్యం ఉండదు. బహిష్టు అయిన స్త్రీ ఇందులో ఉండాల్సిందే. ఎండ, వాన, చలి నుంచి ఏ రక్షణా ఉండదు లోపల. ‘దీనికి తోడు ఈ స్త్రీలు గుడ్డను కాని, శానిటరీ నాప్కిన్ని కూడా వాడరు (వాటి అందుబాటు ఉండదు). వరిగడ్డిని చుట్టచుట్టి పెట్టుకుంటారు. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి’ అని అక్కడ పని చేసే కార్యకర్తలు అంటారు. రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఒక మహిళ దోమల నుంచి కాపాడుకోవడానికి బహిష్టు గదిలో ఒక మూల మంట వేసింది. ఆ పొగకు ఊపిరాడక మరణించింది. పాములు కాటేసిన ఘటనలు... అక్కడ ఉండటం వల్ల అనారోగ్యం వచ్చిన ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. ఈ అనాచారం నుంచి వీరిని బయటపడేసే బదులు ముందు ఈ ఆచారాన్ని గౌరవించి ఈ స్త్రీలకు సాయం చేద్దాం అని ముంబైకి చెందిన ‘ఖేర్వాడీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్’ భావించింది. ఈ గిరిజన గ్రామాల్లో సౌకర్యవంతమైన బహిష్టు గదులను నిర్మించాలని తలపెట్టింది. ఈ గదులు ఆ ప్రాంత స్త్రీల కళ్లలో ఆనందబాష్పాలు తెస్తున్నాయి. సేఫ్ రెస్టింగ్ హోమ్ లేదా పిరియడ్ హోమ్ బహిష్టు గదులను ఈ ప్రాంతంలో ‘కుర్మా’ అంటారు. ఈ కుర్మాలను మెరుగైన వసతుల ‘సేఫ్ రెస్టింగ్ హోమ్’, లేదా ‘పిరియడ్ హోమ్’ పేరుతో ఖేర్వాడి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్మించ తలపెట్టింది. గాలి వెలుతురు ఉండే విధంగా హోమ్ను నిర్మించి, విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, నీటి వసతి, అటాచ్డ్ బాత్రూమ్లు కల్పించి, మంచాలు ఏర్పాటు చేసి స్త్రీలకు ఆ ఐదు రోజులు ఇబ్బంది లేకుండా గడిచే ఏర్పాటు చేస్తోంది. ‘మాకు ఈ హోమ్లలో నచ్చిన విషయం తలుపు ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఉండటం’ అని స్త్రీలు సంతోషపడుతున్నారు. టీనేజ్ అమ్మాయిలకు కష్టం ‘12 లేదా 13 సంవత్సరాలకు పెద్దవారైన ఆడపిల్లలు కూడా హటాత్తుగా ఇంటిని విడిచి ఐదురోజుల పాటు బహిష్టు గదుల్లో ఉండాలి. భయానకంగా ఉండే ఊరి పాత బహిష్టు గదుల్లో ఉండి వారు తీవ్రమైన వొత్తిడికి లోనవుతున్నారు. అసలు బహిష్టు సమయంలో స్త్రీలకు భౌతికంగా మానసికంగా చాలా ఓదార్పు కావాలి. అది వారికి ఇంటి నుంచే లభిస్తుంది. బహిష్టు అయినందుకు నింద భరించడం ఒకమాటైతే ఇలా ఇంటికి దూరం కావడం మరోమాట. దూరమైన ఆ ఐదు రోజులు వారికి సౌకర్యవంతమైన గది ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత’ అంటారు అక్కడ పని చేస్తున్న సామాజిక కార్యకర్తలు. మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశంలోనే కాదు దక్షిణ భారతదేశంలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని వర్గాలలో బహిష్టుకు సంబంధించిన కట్టుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ స్త్రీలను అగౌరవపరిచేవే. వీటన్నింటిని సమాజం తక్షణం వదిలించుకోవాలి. – సాక్షి ఫ్యామిలీ చదవండి: Shradha Sharma: మీ కథే.. ఆమె కథ.. -
ఆ సమయంలో విపరీతమైన నొప్పి.. ఎందుకిలా?
మా అమ్మాయి వయసు 13 ఏళ్లు. ఏడాది కిందట రజస్వల అయింది. నెలసరి వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పితో బాధపడుతోంది. చదువు మీద దృష్టి పెట్టలేకపోతోంది. దయచేసి పరిష్కారం సూచించగలరు.– రత్నమాల, పెదపాడు సాధారణంగా పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ తగ్గిపోయి, ఆ నెలలో అప్పటి వరకు పెరిగిన ఎండోమెట్రియమ్ పొరకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. దానివల్ల ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం నుంచి విడిపోయి, నొప్పితో పాటు బ్లీడింగ్ రూపంలో బయటకు రావడం జరుగుతుంది. అలాగే ఈ సమయంలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఈ హార్మోన్స్ వల్ల గర్భాశయాన్ని కుంచించుకుని, బ్లీడింగ్ బయటకు రావడం జరుగుతుంది. దాని వల్ల కూడా నొప్పి ఉండవచ్చు. కొందరిలో నొప్పి ఒకరోజు ఉంటుంది. కొందరిలో బ్లీడింగ్ అయినన్ని రోజులూ నొప్పి ఉండవచ్చు. ప్రోస్టాగ్లాండిన్స్ విడుదలయ్యే మోతాదును బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కొందరిలో అసలు ఎలాంటి నొప్పీ ఉండదు. కొందరిలో తక్కువ నొప్పి, కొందరిలో ఎక్కువ నొప్పి ఉండవచ్చు. ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్లు వేరే అవయవాల మీద కూడా ప్రభావం చూపడం వల్ల కొందరిలో పొత్తికడుపులో నొప్పితో పాటు నడుంనొప్పి, వాంతులు, మోషన్స్, తలనొప్పి వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు. ఈ కారణాల వల్ల వచ్చే నొప్పి వల్ల అసౌకర్యం, ఇబ్బంది తప్ప వేరే ప్రమాదమేమీ ఉండదు. కాబట్టి ఈ సమయంలో నొప్పి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతుంటే, నొప్పి ఉన్నన్ని రోజులు రోజుకు రెండుసార్లు నొప్పి నివారిణి మాత్రలు వేసుకోవచ్చు. అలాగే పొత్తికడుపు మీద వేడినీటితో కాపడం పెట్టుకోవచ్చు. ప్రాణాయామం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం మంచిది. ఈ వయసులో అరుదుగా గర్భాశయ నిర్మాణంలో తేడాల వల్ల బ్లీడింగ్ గర్భాశయంలోకి వెలువడినట్లే పొత్తికడుపులోకి వెళ్లవచ్చు. అలా కొందరిలో ఎండోమెట్రియమ్ పొర పొత్తికడుపులో పాతుకుని, ఎండోమెట్రియాసిస్ అనే సమస్య మొదలు కావచ్చు. దీనివల్ల కూడా నొప్పి తీవ్రత పెరగవచ్చు. ఏది ఏమైనా పైన చెప్పిన సలహాలను పాటిస్తూ, ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి వారి సలహాలను పాటించడం మంచిది. నా వయసు 23 ఏళ్లు. ఎత్తు 5.1, బరువు 78 కిలోలు. పెళ్లి కాలేదు. నేను హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటున్నాను. ఏడు నెలలుగా నాకు నెలసరి రావడం లేదు. ఇదివరకు బాగానే వచ్చేది. ఇలా ఎందుకు జరుగుతోంది. నాకు భయంగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు. –నాగజ్యోతి, విశాఖపట్నం మీ ఎత్తుకి 47 కిలోల నుంచి 55 కిలోల వరకు బరువు ఉండవచ్చు. మీ బరువు 78 కిలోలు– అంటే, ఉండాల్సిన దాని కంటే దాదాపు ఇరవై కిలోలకు పైగానే బరువు ఉన్నారు. అధిక బరువు వల్ల హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలు ఏర్పడి పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. అలాగే అధిక బరువు వల్ల చిన్న వయసులోనే బీపీ, సుగర్, ఆయాసం, నడుంనొప్పి, మోకాళ్ల నొప్పులు వంటివి రావచ్చు. కాబట్టి నువ్వు మొదట బరువు తగ్గడానికి ఆహార నియమాలను పాటిస్తూ, యోగా, వాకింగ్ లేదా ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఏడునెలల నుంచి పీరియడ్స్ రాలేదు కాబట్టి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి సీబీపీ, ఆర్బీఎస్, ఎస్ఆర్టీఎస్హెచ్ వంటి రక్తపరీక్షలు, పెల్విక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని, సమస్యను బట్టి బరువు తగ్గడంతో పాటు ఇతర చికిత్సలు తీసుకోవడం మంచిది. -డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
25 ఏళ్ల తర్వాత ఆమెకి ‘తాను’ మగాడినని తెలిసింది
బీజింగ్: టెక్నాలజీ పరంగానేగాక, సైన్స్ పరంగానూ విచిత్రాలెన్నింటినో చైనాలో తరచూ చూస్తుంటాం. తాజాగా చైనాకు చెందిన ఓ అమ్మాయి... తను అమ్మాయి కాదు అబ్బాయినన్న విషయాన్ని పాతికేళ్ల తరువాత తెలుసుకుని నోరెళ్ల బెట్టింది. పింగ్పింగ్(పేరుమార్చారు) అనే 25 ఏళ్ల వివాహిత సంతానం కోసం ఒక సంవత్సరం కాలంగా ఎదురుచూస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పిల్లలు పుట్టకపోవడంతో ఆమె డాక్టర్లను సంప్రదించింది. పింగ్ను పరీక్షించిన డాక్టర్లు పింగ్ బయోలాజికల్ మ్యాన్గా పుట్టిందని నిర్ధారించారు. స్త్రీ జననేంద్రియ అవయవాలు ఉన్నప్పటికీ ఆమెలో ‘వై’ క్రోమోజోమ్ ఉండడం వల్ల ఆమె బయోలాజికల్ మ్యాన్గా జన్మించిందనడానికి తార్కాణమని డాక్టర్లు చెప్పారు. అరుదుగా కనిపించే ఇటువంటి వారిని ‘ఇంటర్సెక్స్’ గా పిలుస్తారు. అయితే గత పాతికేళ్లుగా అందరి అమ్మాయిల్లానే పింగ్ తన జీవితాన్ని గడిపింది. పింగ్ చిన్నవయసులో ఉన్నప్పుడు ఒకసారి అమె కాలి మడమకు గాయం అవ్వడంతో డాక్టర్లు ఎక్స్రే తీశారు. దానిలో ఎముకల ఎదుగుదల సరిగ్గా లేనట్లు గుర్తించారు. అయితే కొంతమందిలో నెమ్మదిగా ఎదుగుతాయని డాక్టర్లు చెప్పడంతో పింగ్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. మరోసారి పిరియడ్స్ కూడా సరిగ్గా రావడం లేదని గైనకాలజిస్టుకు చెప్పినప్పటికీ కొందరికి రుతుక్రమం ఆలస్యం అవుతుందని చెప్పడంతో అప్పుడు కూడా ఆమె దానిని పెద్ద సమస్యగా తీసుకోలేదు. అయితే పురుషులలో సాధారణంగా కనిపించే ‘46 ఎక్స్, వై’ క్రోమోజోములు పింగ్లో ఉండడం వల్ల ఆమెలో ఉన్న జననేంద్రియాలు పురుషుడివా, స్త్రీవా అనేది స్పష్టంగా గుర్తించలేమని డాక్టర్లు చెప్పారు. పింగ్కు అందరి అమ్మాయిల్లా జననేంద్రియాలు ఉండడంతో ఎప్పుడూ ఆమెకు సందేహం రాలేదు. పింగ్ శరీరంలో గర్భాశయం కానీ అండాశయాలు ఏవీ లేవు. అందుకే పిరియడ్స్ కూడా రాలేదని ఎండోక్రైనాలజిస్టులు స్పష్టం చేశారు. ఇది ఒప్పుకోలేని నిజమే అయినప్పటికీ ఇన్నేళ్ల తరువాత పింగ్ ఒక ఇంటర్సెక్స్ అని తెలియడం బాధాకరం. చదవండి: అమ్మాయిలుగా మారిన ఐడెంటికల్ ట్విన్స్ -
తన నవ్వుకే పడి చచ్చిపోతాను: నటుడు
ముంబై: నేటికీ మన దేశంలో రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సందేహించే అమ్మాయిలు ఎక్కువగానే ఉన్నారు. నెలసరి సమయంలో ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారే తప్ప ఆ బాధను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. పీరియడ్స్లో అటు గృహిణులకు, ఇటు ఉద్యోగినులకు గానీ ప్రత్యేకంగా సెలవులేమీ దొరకవు. నొప్పి భరిస్తూనే ఇంట్లో పనులు చక్కదిద్దుకోవాలి, ఆఫీసులో వర్క్ చేస్తూనే ఉండాలి. చాలా మంది మగవాళ్లు సైతం.. నెలసరి సమయంలో ఇంట్లోని ఆడవాళ్లు కష్టపడుతూ పనిచేసుకుంటుంటే చూస్తారే తప్ప సాయం చేయడానికి ముందుకురారు. ఇది చాలా తప్పు అంటున్నాడు హిందీ బుల్లితెర నటుడు షోయబ్ ఇబ్రహీం. లాక్డౌన్ కాలంలో షూటింగ్ లేకపోవడంతో ఇంటికే పరిమితం కావడం వల్ల చాలా మంది సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్ చానెళ్లు మొదలుపెట్టి, వ్లోగ్స్ చేయడం ఆరంభించారు. వారిలో ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్ జంట దీపికా కక్కర్- షోయబ్ కూడా ఉన్నారు. కలిసి నటిస్తున్న సమయంలో స్నేహితులుగా మారిన వీరు 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో కపుల్ గోల్స్ సెట్ చేస్తూ గతంలో అనేకసార్లు అభిమానుల మనసు దోచుకున్నారు. ఇక తాజాగా తన వ్లోగ్లో పీరియడ్స్ గురించి ప్రస్తావించి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు షోయబ్.(చదవండి: పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక) నెలసరిలో ఉన్న భార్య దీపిక కోసం వంట చేసి, ఆమెకు వడ్డించిన అతడు.. తన అభిమానులు కూడా ఇలాగే రుతుక్రమ సమయంలో ఇంట్లో వాళ్లకు సాయం చేయాలని అభ్యర్థించాడు. అలాగే పీరియడ్స్ గురించి మాట్లాడితే తప్పేమీ కాదన్నాడు. శరీరంలో సహజసిద్ధంగా కలిగే మార్పుల గురించి, తద్వారా కలిగే ఇబ్బందుల గురించి చర్చిస్తేనే విశ్రాంతి తీసుకునే వెసలుబాటు ఉంటుందని లేడీ ఫ్యాన్స్కు సైతం సలహా ఇచ్చాడు. ఇక ఆస్క్ మీ ఎనీథింగ్ క్వశ్చన్ అవర్లో భాగంగా.. తన భార్య నవ్వు నకిలీది అంటూ కామెంట్ చేసిన నెటిజన్కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు షోయబ్. ‘‘నా దీపిక నవ్వుకు నువ్వు దిష్టిపెట్టకు. ఎందుకంటే తన స్మైల్కే నేను పడిచచ్చిపోతాను. మా గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు. ఏది పడితే అది మాట్లాడకు సరేనా!’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. -
నెలసరి దాచిపెట్టిందని విడాకులు
వడోదర: రుతుక్రమం ఆడవాళ్లకు శాపం కాదని, అది వారి శరీరధర్మంలో ఓ భాగమని మహిళా సంఘాలు చెప్తున్నాయి. కానీ ఓ వివాహిత మహిళకు మాత్రం రుతుక్రమం శాపంగా మారింది. గుజరాత్లోని వడోదరలో తన దగ్గర నెలసరి విషయాన్ని దాచిపెట్టిందని భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడో భర్త. అలాగే తన గొంతెమ్మ కోర్కెలు తీర్చడం తన వల్ల కాదంటూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి, టీచర్గా పని చేస్తున్న ఓ మహిళ ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో సదరు మహిళకు నెలసరి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని భర్తకు చెప్పలేదు. తీరా పెళ్లయ్యాక గుడికి వెళ్తుంటే తను లోపలకు రాలేనని అసలు విషయాన్ని చెప్పింది. (చదవండి: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య) అలా వాళ్ల మధ్య వాగ్వాదం జరగ్గా ఈ విషయంలో ఆమె మీద నమ్మకం పోయిందని విడాకుల పిటిషన్లో పేర్కొన్నాడు. ఇంట్లోవాళ్లకు పైసా కూడా ఇవ్వొద్దని పోరు పెట్టేదన్నాడు. కేవలం ఆమె చేతి ఖర్చుల కోసమే ప్రతి నెలా రూ.5 వేలు ఇవ్వాలని, ఇంట్లో ఒక ఏసీ పెట్టించాలని హింసించేదని తెలిపాడు. తన దగ్గర అంత డబ్బు లేదని, ఆమె చెప్పిన కోరికలను తీర్చడం తన వల్ల కాదని చెప్పడంతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయేదని పిటిషన్లో వివరించాడు. చాలాసార్లు భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రతి చిన్నదానికి పుట్టింటికి వెళ్లి సతాయించేందని వాపోయాడు. తను అడిగినవి చేయకపోతే.. నీచంగా బెదిరించేదన్నాడు. ఆమె మాటలను పట్టించుకోకుండా కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ గొడవలు మాత్రం ఆగడం లేదన్నాడు. ఒక రోజైతే టెర్రస్ మీద నుంచి దూకి చనిపోతానని భయపెట్టిందని చెప్పాడు. భార్యతో వేగలేనని ఎలాగైనా విడాకులు ఇప్పించమని కోరాడు. (చదవండి: ప్రాణం మీదికి తెచ్చిన ఫేస్బుక్ ప్రేమ) -
పెయిన్ఫుల్ పీరియడ్స్
రుతుస్రావం సమయంలో నొప్పి రావడం కొత్తగా యుక్తవయసులోకి వచ్చిన ఎందరో అమ్మాయిలకు వచ్చే అతి సాధారణ సమస్య. చెప్పుకోడానికి ఇది చాలా సాధారణమే అయినా నొప్పి మాత్రం అసాధారణం. ఆ సమయంలో వారు నరకం చూస్తుంటారు. సాధారణంగా చాలామందిలో తమ 25 ఏటికి వచ్చేనాటికి దానంతట అదే తగ్గిపోయే ఈ నొప్పి కొంతకాలం పాటు వారినీ, వారి భావోద్వేగాలనూ, కుటుంబ సభ్యులతో వారి సంబంధాలను సైతం ప్రభావితం చేసేంత తీవ్రంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ పెయిన్ గురించి అవగాహన కోసం ఈ కథనం. సాధారణంగానే ఆడపిల్లలు తమ బాల్యం నుంచి యవ్వనావస్థలోకి వచ్చే సమయంలో చాలా ఎక్కువ ఆందోళనకు గురవుతుంటారు. దానికి కారణాలు చాలానే ఉంటాయి. ప్రకృతిసహజంగా ఆ సమయంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కొత్త హార్మోన్లతో వచ్చే ఎన్నెన్నో మార్పులు... అంతకుముందు వారు అనుభవించిన హాయి జీవితం నుంచి... అకస్మాత్తుగా వారిని అయోమయంలోకి నెట్టేస్తాయి. దీనికి తోడు వారిలో కొత్తగా మొదలయ్యే రుతుస్రావం ఒక చికాకు అయితే... కొందరిలో ఆ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి వస్తూ వారి టీన్స్ జీవితాన్ని మరింత దుర్భరం చేస్తుంది. పైగా మన సమాజంలో ఆ సమయంలో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇంకా ఇబ్బందులకు లోనవుతారు. అందుకే చాలామంది అమ్మాయిలు పీరియడ్స్ విషయంలో చాలా చికాకు పడతారు. పీరియడ్స్ అంటే తమకు ఎంతో ‘కోపం’ అని కోపంగా చెప్తారు. వారి సమస్యను గుర్తించే ఇటీవల కొన్ని ప్రభుత్వాలు వారికి ఆ సమయంలో సెలవులు సైతం మంజూరు చేస్తున్నాయి. పీరియడ్స్లో నొప్పి ఎందరిలో సహజమంటే... కొత్తగా రజస్వల అయిన దాదాపు 50 శాతం టీనేజర్లు పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపులో నొప్పి, ఇతరత్రా ఇబ్బందుల గురించి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. వీళ్లలో దాదాపు 5 నుంచి 10 శాతం వరకు... తమకు వచ్చే అత్యంత తీవ్రమైన కడుపునొప్పి కారణంగా వారు స్కూల్/కాలేజీలకు హాజరు కాలేరు. పీరియడ్స్ సమయంలో వచ్చేనొప్పి సాధారణంగా 15వ ఏట ప్రారంభమై, 25 – 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి తగ్గిపోతుంది. కొందరికి... పెళ్లయ్యి, పిల్లలు పుట్టాక తగ్గిపోతుంది. అందువల్ల ఆ నొప్పి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. కాకపోతే నొప్పి వచ్చిన సమయంలో కొన్ని మందులు వాడితే సరిపోతుంది. కొన్ని కుటుంబాలలో తల్లి, పిల్లలు కూడా ఈ నొప్పితో బాధపడుతుంటారు. లక్షణాలు పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ కడుపులోనొప్పి... ముందుగా పొత్తికడుపులో మొదలయ్యి, కొన్ని గంటల పాటు బాధిస్తుంది. ఒక్కోసారి అది ఆ మర్నాడే తగ్గుతుంది. ఈ నొప్పి పొత్తికడుపు, పెల్విస్, నడుము భాగాలలో అధికంగా ఉంటుంది. ఒక్కోసారి ఈ నొప్పి కాళ్లవర కూ వ్యాపిస్తుంది. నొప్పి నెమ్మదిగా ప్రారంభం అయ్యి, క్రమేపీ పెరుగుతుంది. కొందరిలో తలతిరిగిన ట్టు ఉంటుంది. మరికొందరిలో వాంతులు అవుతాయి. ఇంకొందరు బాగా నీరసపడి, ఒక్కోసారి స్పృహకోల్పోతారు కూడా. అరుదుగా కొందరిలో... ఈ నొప్పి ప్రారంభమయ్యి, నాలుగు రోజుల వరకూ బాధిస్తూనే ఉంటుంది. కారణాలు ఈ నొప్పికి కారణాల విషయానికి వస్తే... యుటెరస్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాలలో ఒక రకమైన రసాయనం విడుదల కావడం వల్ల, రక్తనాళాలు హఠాత్తుగా బిగుసుకుపోతాయి. అందువల్ల ఆయా భాగాలకు రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతాయి. ఈ సమయంలో... యూటెరస్, పెల్విక్ మజిల్స్ తాలూకు జీవక్రియల్లోనూ మార్పులు వస్తాయి. అక్కడి మెటబాలిజమ్ (జీవక్రియల్లో)లో వెలువడే వ్యర్థపదార్థాలయిన... కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ వంటివి ఈ కడుపునొప్పికీ, అసౌకర్యానికీ కారణమవుతాయి. ఉపశమనం ఇలా... వేడినీటితో కాపడం పెడితే కొంతవరకు ఉపశమనం ఉంటుంది. ఒకవేళ అప్పుడు కూడా ఉపశమనం లభించకపోతే, నొప్పి నివారణ మందులు వేసుకోవాలి. అయితే ఈ మందులను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద తీసుకుంటే మంచిది. పారాసిటమాల్, ఆస్పిరిన్, మెఫ్తాల్ వంటి మందులు నొప్పిని చాలావరకు తగ్గిస్తాయి. యాంటీ స్పాస్మోడిక్స్ ప్రయత్నించవచ్చు. ఇవి యూటెరస్ కండరాలను రిలాక్స్ చేస్తాయి. తరచూ ఈ నొప్పితో బాధపడేవారు డాక్టర్ సలహా మేరకు తగిన మందులు దగ్గర ఉంచుకుంటే మంచిది. అయితే ఇక్కడ పేర్కొన్న సూచనలు పాటించాక కూడా నొప్పి వస్తూనే ఉంటే మీ గైనకాలజిస్ట్ను / ఫ్యామిలీ ఫిజీషియన్ను సంప్రదించాలి. మేనేజ్మెంట్ / చికిత్స ♦ చికిత్స కంటే ముందుగా... వారిలో ఈ నొప్పి రావడానికి గల కారణాలు, చికిత్సల గురించి అర్థమయ్యేలా వివరించాలి. ఉపశమనానికి కొన్ని సులువైన మార్గాలను ఎంచుకోమని సూచించాలి. ♦ తగినంత వ్యాయామం అవసరం..ఏమాత్రం శారీరక కదలికలు లేకుండా ఒకేచోట కూర్చోవటం వల్ల క్రాంప్స్ రావడానికి అవకాశాలెక్కువ. అందుకే శరీరానికి తగినంత వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఆరుబయట ఆడటం కూడా మంచిదే. ♦ పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. వీలైనంతవరకు జంక్ఫుడ్ తినకూడదు. అన్ని రకాల పోషకాలూ,తగినంత పీచు ఉండే ఆహారం తీసుకోకపోతే, మలబద్దకం, పీరియడ్స్ సమయంలో క్రాంప్స్ రావడానికి అవకాశం ఎక్కువ. ♦ అధికబరువు కూడా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పికి ఒక కారణం. ♦ వీలైనంతగా విశ్రాంతి తీసుకోండి. రాత్రి కంటినిండా నిద్రపొండి. దాంతో జీవక్రియలు సవ్యంగా జరుగుతాయి. నిరంతరం పాజిటివ్గా ఉండాలి. అందువల్ల కొంతవరకు ఈ నొప్పి బారి నుంచి బయటపడవచ్చు. అనవసరమైన ఆలోచనలు, ఒత్తిడి వల్ల ఎక్కువ బాధపడవలసి వస్తుంది. -
మహిళల్లో మెనోపాజ్ సమస్యలు
మారుతున్న జీవన శైలితో నగర మహిళలు విభిన్న రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదే క్రమంలో చిన్న వయసులోనే మెనోపాజ్ బారిన పడేలా చేస్తోంది. కరోనా, లాక్డౌన్ వంటి అనూహ్య పరిస్థితులు మహిళల్ని ముఖ్యంగా ఉద్యోగినులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ అనారోగ్య సమస్యల్ని సృష్టిస్తున్నాయి. అలాగే ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అవకాశాలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో మెనోపాజ్పై తగినంత అవగాహన అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నేడు వరల్డ్ మెనోపాజ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో : పన్నెండు నెలల పాటు పూర్తిగా పీరియడ్స్ రాకుండా ఉండడాన్నే మెనోపాజ్ అంటారు. మన దేశంలో 46 ఏళ్ల నుంచి 52 ఏళ్ల వరకు ఈ దశ ఉంటుంది. 40 ఏళ్ల కన్నా ముందే పీరియడ్స్ రావడం ఆగిపోతే అది ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అంటారు. ఇది సహజంగా ఉండొచ్చు లేదంటే సర్జరీ ద్వారా అంటే యుట్రస్, ఓవరీస్ తీసేసినవారిలో ఈ సమస్య తలెత్తవచ్చు. ఎందుకిలా..? ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే వరుసగా నాలుగు నెలల పాటు పీరియడ్స్ రాకుండా ఉండటం. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఆటో ఇమ్యూన్ డిసీజ్లు అంటే థైరాయిడ్, జన్యుపరమైనవి, క్రోమోజోమ్లలో అపసవ్యత ఉన్నా ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ వస్తుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ ఉన్నవారికి పీరియడ్స్ ఆగిపోతే వారికి వైద్యుల కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. కుటుంబ మద్ధతు అవసరం. మెనోపాజ్ లక్షణాలు.. ఒంట్లో నుంచి వేడి సెగలు రావడం, గుండె దడగా అనిపించడం, రాత్రి పూట చమటలు పట్టడం, ఎక్కువసార్లు యూరిన్కెళ్లడం, మూత్రనాళం ఇన్ఫెక్షన్, ఎముకలు పట్టేయడం లేదా బలహీనం కావడం అవుతుంటాయి. మానసిక సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, లైంగిక సమస్యలు, ఆత్మన్యూనతా భావం వంటివి తలెత్తుంటాయి. సమస్యలు రాకుండా ఉండాలంటే.. జీవనశైలి మార్చుకోవాలి. రోజూ గంటసేపు తప్పనిసరి వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. పొగతాగడం అలవాటు ఉన్నవారు దీన్ని మానేయాలి. క్యాల్షియం, విటమిన్- డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఆహారం ద్వారా తీసుకున్నా మేలు కలుగుతుంది. సరైన ఎండ కూడా మేనుకి తగిలేలా చూసుకోవాలి. వదులు దుస్తులు వేసుకోవాలి. చల్లటి వాతావరణంలో ఉండటం, మసాలా వంటకాలు తగ్గించాలి. మెనోపాజ్ వయసులో ఎముకల పటుత్వం పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. వీరికి ఎముక భాగంలో, తుంటి భాగంలో ప్రాక్చరర్స్ ఎక్కువ అవుతుంటాయి. రిస్క్ తగ్గించుకోవాలంటే హార్మోన్ థెరపీ అవసరమవుతుంది. మెనోపాజ్లో హ్యాపీగా.. డిప్రెషన్ వంటి ఛాయలు ఈ దశలో సాధారణంగా ఎదుర్కోవాల్సిఉంటుంది. అందుకని కుటుంబంతో ఆనందంగా గడపాలి. స్నేహితులతో ఉల్లాసపు క్షణాలను వెతుక్కోవాలి. నచ్చిన హాబీని కొనసాగించాలి. ఒంటరిగా ఉండకుండా ఎవరికి వాళ్లు తీరకలేని వ్యాపకాన్ని ఎంచుకోవాలి. తోటపని చేయడం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకోవడం వంటివీ చేయొచ్చు. మానసిక ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవడానికి అవకాశం ఉందో వాటన్నిటి మీదా దృష్టి పెట్టాలి. మెనోపాజ్ దశలో ఉన్నవాళ్లు ప్రతి ఏడాది వైద్యుల సలహా తీసుకుంటే రాబోయే సమస్యలను ముందే నివారించవచ్చు. -డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, ముషీరాబాద్ -
అరచేతి సిందూరం
రక్తం ఆడపిల్లల్ని భయపెట్టదు. రక్తంతో సహజీవనం వాళ్లది!! మగపిల్లలే.. రక్తమంటే కళ్లు మూసుకుంటారు. పడి, దెబ్బలు తగిలినప్పుడే.. ఈ ధీశాలురు రక్తాన్ని చూడటం. ఇక పీరియడ్ బ్లడ్ అయితే.. అదొక ‘స్త్రీ గ్రూప్’ బ్లడ్ వీళ్లకు. ‘‘ఛుక్ చుక్ రైలు వస్తోంది.. దూరం దూరం జరగండి..’’ మెన్ కూడా బాయ్సే ఈ స్టేషన్లో! ఎలా వీళ్లతో కలిసి ప్రయాణించడం? ‘అరచేతి సిందూరం’తో గోప్యాల చీకట్లను పోగొట్టడమే. తెలియనివాళ్లకు తెలియజెప్పడం దేనికి? మొదట వచ్చే ప్రశ్న! నిజమే కదా.. పూర్తిగా వ్యక్తిగత విషయం అయినప్పుడు.. ‘నేను పీరియడ్స్లో ఉన్నాను’ అని అరిచేతిలో ఎర్రచుక్క పెట్టుకోవడం దేనికి.. గుసగుసల్ని రేపడానికి కాకపోతే?! అయితే గుసగుసలు లేకుండా చెయ్యడానికే ‘యూనిసెఫ్’.. రెడ్ డాట్ ఛాలెంజ్ని ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’ కి సరిగ్గా రెండు నెలల ముందు ఈ ఏడాది మార్చినెలలో మొదలుపెట్టింది. రెడ్ డాట్ చాలెంజ్ అంటే నెలసరి రోజుల్లో అరిచేతిలో ఎర్ర చుక్కపెట్టుకోవడం. మహిళలంతా దీన్నొక నియమంగా పాటిస్తే కొన్నాళ్లకు, లేదా కొన్నేళ్లకు అదొక మామూలు సంగతైపోయి, మెన్సెస్ చుట్టూ పురుషులలో, మగపిల్లల్లో, కొందరు మహిళల్లో కూడా ఉండే అపరిశుభ్రమనే భావనలు తొలగిపోతాయని! యూనిసెఫ్ ఇచ్చిన ఈ ఛాలెంజ్ని మొదట నేహా దుపియా, దియా మీర్జా స్వీకరించారు. తర్వాత డయానా పెంటీ, ఖుబ్రా సయాత్, మానుషీ చిల్లర్, అనితా ష్రాఫ్, అతిదీరావ్ హైద్రీ ఫాలో అయ్యారు. సెలబ్రిటీలు కాకుండా యూత్లో చాలామంది అమ్మాయిలు ఈ చాలెంజ్ని తీసుకుంటున్నారు. కొందరు ఆ చాలెంజ్ని నేరుగా తీసుకోనప్పటికీ తమ ‘తొలిసరి’ అనుభవాలను, ఇబ్బందులను షేర్ చేసుకుంటున్నారు. పెద్ద సెక్సెస్.. ఈ రెడ్ డాట్ చాలెంజ్! మే 28 న మెన్స్ట్రువల్ హైజీన్ డే రోజు సోషల్ మీడియాలోని అన్ని వేదికల మీదా అరచేతి సిందూరాలు గోరింటలా పూచాయి. మూడు రోజుల క్రితం శ్రద్ధా శ్రీనాథ్ తన రెడ్ డాట్ డే గురించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకున్నారు. శ్రద్ధ ఫెమినిస్టు. మగవాళ్లలో స్త్రీల సమస్యల పట్ల సహానుభూతిని (సానుభూతి కాదు) కలిగించే అనేక విషయాలను సోషల్ మీడియాలో ఆమె వివరంగా మాట్లాడుతుంటారు. శ్రద్ధ కశ్మీరీ అమ్మాయి. సినీ నటి. నాలుగు దక్షిణాది భాషా చిత్రాలలో నటించారు. తెలుగులో జెర్సీ, జోడీ íసినిమాల్లో ఉన్నారు. తను నటిస్తున్న మరో ఆరు సినిమాలు లాక్డౌన్ సడలింపులతో మళ్లీ షూటింగ్కి రెడీ అవుతున్నాయి. ఇన్ని సినిమాల్లో నటిస్తున్నా.. ఫెమినిస్టుగానే శ్రద్ధకు సోషల్ మీడియాలోనే గుర్తింపు. అసలు తనను తన ఫస్ట్ పీరియడే ఫెమినిస్టుగా మార్చిందని అంటారు శ్రద్ధ. ‘‘అప్పుడు నాకు 14 ఏళ్లు. ఇంట్లో పూజ జరుగుతోంది. పూజలో నేను కూడా కూర్చొని ఉన్నాను. అప్పుడు నా ఫస్ట్ పీరియడ్ వచ్చింది. పక్కన అమ్మ లేదు. శానిటరీ ప్యాడ్స్ లేవు. పూజలో ఉన్న పిన్నిని మోచేత్తో పొడిచి విషయం చెప్పాను. చెబుతున్నప్పుడు పిన్ని పక్కనే ఉన్న బంధువులావిడ విని, నా వైపు చూసి నవ్వింది. ‘పర్వాలేదు చిన్నా, దేవుడు క్షమిస్తాడు’ అని అభయం ఇచ్చింది! ఆమె ఉద్దేశం.. పూజలో ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినందుకు దేవుడు కోపగించుకోడని, క్షమిస్తాడని. అప్పుడే నేను ఫెమినిస్టుగా మారాను. నాన్–బిలీవర్గా కూడా’’ అని తన ఇన్స్టాగ్రామ్లో రాశారు శ్రద్ధ. ఇంట్లో చేసి పెడుతుంటే.. బాగున్నాయి అనో, బాగోలేదనో అనడం మాత్రమే మనకు తెలిసింది. ఆ చేసిపెట్టేవాళ్లకు ఒంట్లో ఎలా ఉందోనన్న ఆలోచన మరో స్త్రీకి మాత్రమే వస్తుంది. ఆఫీస్లలో, ఇంకా కలిసి పని చేసే అనేక చోట్ల కూడా అంతే. ఏ రోజైనా పని సరిగా చేయలేక పోతుంటేనో, అసలే చెయ్యలేక పోతుంటేనో అంతవరకే కనిపిస్తుంది. అందుకు కారణం పైకి తెలిసేది కాదు, చెప్పుకునేదీ కాదు. అయితే ఈ గోప్యనీయత వల్ల ప్రయోజనం ఉండదు అంటుంది యూనిసెఫ్. ‘నేను పీరియడ్స్ లో ఉన్నాను’ అని సంకేత పరచకపోవడంవల్లే కావచ్చు.. మహిళల పని సామర్థ్యంపై అపోహలు, పీరియడ్స్ చుట్టూ ఇన్ని అస్పృశ్య ఆలోచనలు! వీటిని పోగొట్టడానికి రెడ్ డాట్ ఛాలెంజ్లు, శ్రద్ధ వంటì æవారి సొంత అనుభవాల పోస్టింగ్లు తప్పకుండా తోడ్పడతాయి. -
మందులు వాడినప్పుడే పీరియడ్స్... గర్భం వస్తుందా?
నా వయసు 32 ఏళ్లు. పెళ్లయి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇంకా పిల్లలు లేరు. మందులు వాడినప్పుడు మాత్రమే నాకు పీరియడ్స్ వస్తోంది. లేడీడాక్టర్ కొన్ని పరీక్షలు చేయించారు. నా ఎఫ్ఎస్హెచ్ పాళ్లు 50 ఐయూ/ఎమ్ఎల్ అన్నారు. అలాగే నాలో ఏఎమ్హెచ్ కూడా చాలా తక్కువగా ఉందట. నా అండాశయ సామర్థ్యం (ఒవేరియన్ కెపాసిటీ) చాలా తక్కువగా ఉందన్నారు. నా భర్త స్పెర్మ్కౌంట్ నార్మల్గానే ఉంది. నాకు గర్భం వచ్చే అవకాశం ఉందా? మా దంపతులకు తగిన సలహా ఇవ్వగలరు.– ఓ సోదరి, శ్రీకాకుళం మీ కండిషన్ను ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. సాధారణంగా ఇది శాశ్వతమైన సమస్య. అయితే కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా గర్భం రావచ్చు కూడా. ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్కు కారణాలూ పెద్దగా తెలియదు. కొన్నిసార్లు క్రోమోజోముల్లోని లోపాలు, తమ వ్యాధి నిరోధక శక్తి తమనే దెబ్బతీసే ఆటో ఇమ్యూన్ సమస్యలు, గాలాక్టోసీమియా వంటివి కారణమవుతాయి. ఫ్యామిలీ హిస్టరీగా ఈ కండిషన్ ఉన్నవారి కుటుంబాలలో ఇది తరచూ కనిపిస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారికి ఆటో ఇమ్యూన్ పరీక్షలూ, ఫ్రాజైల్ ఎక్స్ క్రోమోజోమ్ పరీక్షలూ, డెక్సాస్కాన్ వంటివి అవసరమవుతాయి. సాధారణంగా ఈ కండిషన్ ఉన్నవారిలో గర్భధారణ అవకాశాలు తక్కువ కాబట్టి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) చేయించుకోవాల్సిందిగా సలహా ఇస్తుంటాం. ఉన్న కొద్దిపాటి అండాలను సేకరించడం కష్టమైతే, అప్పుడు దాతల నుంచి సేకరించి, వాటితో మీ భర్త శుక్రకణాలతో ఫలదీకరణ చేయించి, పిండాన్ని రూపొందించి, దాన్ని మీ గర్భసంచిలోకి ప్రవేశపెట్టవచ్చు. ఈ సమస్య ఉన్నవారు చాలా జాగ్రత్తగా తమ ఆరోగ్యాన్నీ కాపాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్యాల్షియమ్, విటమిన్–డి ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం అవసరం. మీకు ప్రిమెచ్యుర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఉన్నందుకు మీ డాక్టర్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని సూచిస్తారు. ఆ హార్మోన్లను సుమారు యాభై, యాభైఒక్క ఏళ్లు వరకు వాడాల్సి ఉంటుంది. వేర్వేరు వైద్యవిభాగాలకు చెందిన మల్టీడిసిప్లనరీ టీమ్తో మీరు సత్ఫలితాలను పొందవచ్చు. ఎక్టోపిక్ప్రెగ్నెన్సీలోబిడ్డ గుండెచప్పుడు వినిపిస్తుందా? నా భార్యకు గర్భం వచ్చాక ఇటీవల ఏడో వారంలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిందనీ, అది గర్భసంచిలో కాకుండా... కుడివైపున ట్యూబ్లో పెరుగుతోందని డాక్టర్ చెప్పారు. అయితే గుండెచప్పుళ్ళు వినిపిస్తున్నాయని అన్నారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలోనూ గుండెస్పందనల శబ్దాలు వినిపిస్తాయా? ఇప్పుడు శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగించాలని డాక్టర్లు చెబుతున్నారు. మందులతో తగ్గే అవకాశం లేదా? గతంలోనూ ఆమెకోసారి గర్భం వచ్చినప్పుడు ఎడమవైపు ఇలాగే జరిగి, ఆ వైపు ఉన్న ట్యూబును తొలగించారు. ఇప్పుడు ఇలాగే జరిగితే భవిష్యత్తులో గర్భధారణ జరిగే అవకాశాలు ఎలా ఉంటాయి? – ఎస్బీఆర్., కాకినాడ గర్భసంచిలో కాకుండా ట్యూబ్లోనే గర్భం ఉండే పరిస్థితిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కండిషన్లోనూ గుండెచప్పుళ్లు వినిపిస్తుంటాయి. ఈ పరిస్థితిని ఒక దశ వరకు మందులతో తగ్గించవచ్చు. అయితే పిండంలో హార్ట్బీట్ మొదలయ్యాక మాత్రం మందులతో తగ్గించలేం.ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి అది అకస్మాత్తుగా కడుపులో రక్తస్రావానికి (ఇంటర్నల్ బ్లీడింగ్కు) దారితీయవచ్చు. అందుకే పరిస్థితిని సమర్థంగా ఎదుర్కోడానికి శస్త్రచికిత్సను డాక్టర్లు సూచిస్తుంటారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని తొలగించడానికి లాపరోస్కోపిక్ సర్జరీ అనేది మంచి ప్రత్యామ్నాయం. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ట్యూబ్ ఉంచాలా లేదా అనే నిర్ణయాన్ని అప్పటి పరిస్థితిని బట్టి డాకర్లు తీసుకుంటారు. ఇక ఆమెకు అకస్మాత్తుగా రక్తస్రావం అయితే మాత్రం ఓపెన్ సర్జరీ నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ భార్య రక్తం గ్రూప్ నెగెటివ్ అయితే ఆమెకు ‘యాంటీ–డీ’ అనే ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమెకు రెండు ట్యూబులు తొలగించినా మీరు ఆందోళన చెందకండి. ఆమె సురక్షితంగా ఉండే ఆ తర్వాత టెస్ట్ట్యూబ్ బేబీ అని పిలిచే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) మార్గాన్ని అనుసరించవచ్చు.డాక్టర్ రత్న దూర్వాసులసీనియర్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్,బర్త్రైట్ బై రెయిన్బో,హైదరాబాద్ -
ఆ సమయంలో నొప్పి రాకుండా ఉండాలంటే...
పీరియడ్స్ టైమ్లో నొప్పి రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాల గురించి తెలియజేయగలరు. ప్రైమరీ డిస్మెనోరియా అంటే ఏమిటి? –పీఎల్, ఒంగోలు పరీక్షలు ఏమి చేసినా, కారణాలేవీ లేకుండా, సమస్య ఏమీ లేకుండా పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి రావడాన్ని ప్రైమరీ డిస్మెనోరియా అంటారు. పీరియడ్ సమయంలో ప్రోస్టోగ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల రక్తనాళాలు కుంచించుకుని, గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొరకి రక్తప్రసరణ తగ్గిపోయి బ్లీడింగ్ రూపంలో ఈ పొర ఊడిపోయి బయటకు వస్తుంది. అలాగే గర్భాశయం కుంచించుకుంటూ బ్లీడింగ్ను బయటకు పంపుతుంది. ఈ ప్రోస్టోగ్లాండిన్స్ విడుదలయ్యే మోతాదును బట్టి కొందరిలో ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కొద్దిగా ఉంటుంది. కొందరిలో అసలే నొప్పీ ఉండదు. కొందరిలో గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్ వంటి ఎన్నో కారణాల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటుంది. దీనిని సెకండరీ డిస్మెనోరియా అంటారు. కారణాన్ని బట్టి పీరియడ్స్ నొప్పికి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. నొప్పి అసలు రాకుండా ఉండటానికి జాగ్రత్తలు ఏమీ ఉండవు. కాకపోతే నొప్పి తెలియకుండా ఉండటానికి వాకింగ్, యోగా, ధ్యానం, వ్యాయామాలు వంటివి చేస్తూ మితమైన పోషకాహారం తీసుకుంటూ ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవడం మంచిది. పీరియడ్స్ సమయంలో రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగడం, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, క్యాల్షియం, విటమిన్–బి, మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం, అల్లం, పసుపు, సోంపు, కొద్దిగా చెక్క వంటివి తీసుకోవడం, పొత్తికడుపుపై మసాజ్, వేడి కాపడం పెట్టడం, వేడినీళ్ల స్నానం చేయడం వంటి చిట్కాలను పాటించడం ద్వారా కూడా నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. నేను బ్యాంకు ఉద్యోగిని. సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. అక్కడక్కడా గర్భిణి స్త్రీలను చూసినప్పుడు.... తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే అనుమానం వస్తుంటుంది. ప్రెగ్నెంట్గా ఉండి కూడా కూలీ పనులకు వెళుతున్న, ఎండలో బట్టలు ఉతుకుతున్న గర్భిణులను చూసినప్పుడు... నేనే చొరవ తీసుకొని వారి దగ్గరకు వెళ్లి ‘ఇలా చేయకూడదమ్మా’ అని చెబుతుంటాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన పది ప్రధాన జాగ్రత్తల గురించి చెబితే... నేను వాటిని నిరక్షరాస్యులైన గర్భిణి స్త్రీలకు తెలియజేస్తాను. – ఆర్.శైలజరాణి, మంగపేట ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్ను సంప్రదించి, వారి సలహాలను పాటించడం. 2. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పలచని మజ్జిగ, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం. 3. ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం మాత్రలను తొమ్మిదినెలల పాటు తీసుకోవడం. దీని వల్ల రక్తహీనత లేకుండా తల్లి, బిడ్డ ఎముకలు గట్టిగా ఉండటానికి దోహదడుతుంది. 4. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చెకప్లు, రక్తపరీక్షలు చెయ్యడం, మందులు ఇవ్వడం, గుడ్లు పాలు ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. ఏవైనా సమస్యలు ఉన్నా, వాటికి చికిత్స తీసుకోవచ్చు. 5. బ్లడ్ గ్రూప్, హీమోగ్లోబిన్, సుగర్, సీయూఈ, హెచ్ఐవీ, హెపటైటిస్, వీడీఆర్ఎల్ వంటి రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవడం వల్ల ముందుగానే రక్తహీనత, ఇన్ఫెక్షన్లు వంటివి ఉంటే చికిత్స తీసుకోవచ్చు. 6. డాక్టర్ దగ్గరికి సక్రమంగా చెకప్లకు వెళ్లి బరువు, బీపీ వంటివి చూపించుకోవడం. 7. బిడ్డలో అవయవ లోపాలు, ఆరోగ్యం తెలుసుకోవడానికి కనీసం ఐదవ నెలలో ఒకసారి, తొమ్మిదవ నెలలో ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం. 8. నెలలు నిండే కొద్దీ మధ్యాహ్నం ఒక గంట, రాత్రి ఎనిమిది గంటలు నిద్ర తప్పనిసరి. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల బిడ్డకి, తల్లికి కూడా రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది,. 9. నెలలు పెరిగే కొద్దీ బిడ్డ కదలికలు గమనించుకుంటూ, కదలికలు తెలియకపోయినా, యోని భాగం నుంచి నీరులా కారిపోవడం, బ్లీడింగ్ అవడం, కడుపులో నొప్పి, కాళ్లు బాగా వాచడం వంటి లక్షణాలు కనిపిస్తే, తొందరగా ఆస్పత్రికి వెళ్లడం. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, ఆయాసం లేనంత వరకు పనులు చేసుకుంటూ ఉండటం వల్ల కాన్పు సులభంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. 10. కాన్పు ఇంట్లో కాకుండా ఆస్పత్రిలో అయ్యేలా చూసుకోవడం మంచిది. దీనివల్ల తల్లికి, బిడ్డకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటమే కాకుండా, తల్లిలో అధిక రక్తస్రావం, హైబీపీ వంటి కాంప్లికేషన్లకు తగిన చికిత్స వెంటనే తీసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల తల్లీబిడ్డల మరణాల రేటును తగ్గుతుంది. తల్లీబిడ్డా క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. నేను ప్రెగ్నెంట్. ఈమధ్య ఒక ఆర్టికల్లో preeclampisa డిసీజ్ గురించి చూశాను. ఇది తల్లి, బిడ్డలకు ఎందుకు వస్తుంది? మన దేశంలో కూడా ఈ సమస్య ఉందా? ఇది రాకుండా ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోవాలి? – కె.మమత, విశాఖపట్టణం గర్భిణి సమయంలో కొందరిలో బీపీ పెరిగి, అది కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది. దాని వల్ల మూత్రంలో ఆల్బుమిన్ ప్రొటీన్ ఎక్కువగా పోవడం జరుగుతుంది. ఈ సమస్యనే ‘ప్రీ ఎక్లామ్సియా’ అంటారు. ఇది ఎవరికి ఎందుకు వస్తుందనేది ముందుగా కచ్చితంగా చెప్పడం కష్టం. సాధారణంగా ఎక్కువ బరువు ఉన్నవారిలో, మరీ చిన్న వయసులో గర్భం దాల్చినా, లేటు వయసులో గర్భం దాల్చినా, కుటుంబంలో ఎవరికైనా బీపీ ఉన్నా, కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల, తల్లిలో రక్తనాళాలు సన్నబడటం వల్ల తల్లిలో బీపీ పెరగడం, అలాగే బిడ్డకు రక్తప్రసరణ తగ్గడం జరుగుతుంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే బీపీ బాగా పెరిగి, కిడ్నీ, లివర్, మెదడు వంటి ఇతర అవయవాలపై ప్రభావం చూపడం వల్ల తల్లిలో పీఐహెచ్, ప్రీ ఎక్లామ్సియా, తర్వాత ఎక్లామ్సియా (గుర్రపువాతం) అంటే ఫిట్స్ వంటి ప్రాణాపాయకరమైన కాంప్లికేషన్స్ ఏర్పడతాయి. ఇందులో బిడ్డ బరువు పెరగకపోవడం, బిడ్డ కడుపులోనే చనిపోవడం వంటివి జరగవచ్చు. ఒక్కోసారి నెలలు నిండకుండానే కాన్పు చేయాల్సి రావచ్చు. భారతదేశంలో 8–10 శాతం గర్భిణులకు ప్రీఎక్లామ్సియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇది రాకుండా జాగ్రత్త పడలేము కాని, సక్రమంగా డాక్టర్ దగ్గర బీపీ, బరువు చెకప్ చేయించుకుంటూ, బీపీ పెరుగుతుంటే దానికి సరిగా మందులు తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే, కాంప్లికేషన్స్ పెరుగుతూ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం, అలాగే కాన్పు ముందుగానే చెయ్యడం వల్ల తల్లికి ప్రాణాపాయం తప్పుతుంది. అధిక బరువు ఉన్నవాళ్లు ప్రెగ్నెన్సీ రాకముందే బరువు తగ్గడం, ప్రెగ్నెన్సీలో అధిక బరువు పెరగకుండా ఉండటం, కుటుంబంలో బీపీ చరిత్ర బాగా స్ట్రాంగ్గా ఉన్నా, ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి ఎకోస్పిరిన్ మాత్రలను డాక్టర్ సూచించడం జరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు సంకోచించకుండా తల్లికి, బిడ్డకు సక్రమంగా రక్తప్రసరణ జరిగి, ప్రీఎక్లామ్సియా కాంప్లికేషన్స్ మరీ ఎక్కువ కాకుండా బయటపడే అవకాశం ఉంటుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బోహైదర్నగర్ హైదరాబాద్ -
ఇలా ఉంటే ఆరోగ్యమేనా?
నా వయసు 29 సంవత్సరాలు. వ్యాయామాలు ఎక్కువగా చేసి సన్నబడ్డాను. ‘ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు’ అని కొందరు అంటుంటే, ‘హార్మోన్ల పనితీరు బాగుండడానికి కొవ్వు కూడా ఉండాలి’ అని మరికొందరు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలియజేయగలరు. – బి.గాయత్రి, మంచిర్యాల శరీరం పనితీరు, రసాయన ప్రక్రియలు, శరీరంలో జరిగే రోజువారీ పనులు సక్రమంగా సజావుగా జరగాలంటే కార్బోహైడ్రేట్స్, ప్రోట్రీన్స్, విటమిన్స్, మినరల్స్తో పాటు కొవ్వు కూడా సరైన నిష్పత్తిలో ఉండాలి. ఆడవారిలో ముఖ్యంగా విడుదలయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజ్రెస్టిరాన్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్లు తయారవ్వడానికి శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం. కొలెస్ట్రాల్ అనేది ఈ హార్మోన్లు తయారవడానికి ఒక ముడి పదార్థంలాంటిది. రజస్వల అవ్వడానికి శరీరంలో కనిసం 17 శాతం ఫ్యాట్ అవసరం. పీరియడ్స్ సక్రమంగా రావడానికి కనీసం 22 శాతం కొవ్వు ఉండాలి. కాబట్టి మరీ డైటింగ్ చేసి బాగా సన్నబడితే, శరీరంలో బాగా కొవ్వు తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పడం, శరీరం యాక్టివ్గా లేకపోవడం, డల్గా ఉండటం, నీరసం, ఒళ్ళునొప్పులు వంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్స్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల లైంగిక కోరికలు సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఆరోగ్యకరంగా ఉండడం అంటే బాగా సన్నబడిపోవడం కాదు. పొడువుకు తగ్గ బరువు ఉండటం, అధిక బరువు, ఎక్కువ కొవ్వు లేకుండా చూసుకోవడం...అంతేగానీ అసలు కొవ్వే లేకుండా ఉండటం కాదు. శరీరంలో అన్ని ప్రక్రియలూ సజావుగా జరగాలంటే శరీరంలో 25 శాతం కొవ్వు ఉండాలి. కాబట్టి మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ, క్రమంగా వ్యాయామాలు చేసుకుంటూ, పొడవుకు తగ్గ బరువు అంటే బి.యం.ఐ(బాడీ మాస్ ఇండెక్స్) ఉండేటట్లు చూసుకోవడం వల్ల ఆరోగ్యం అన్ని రకాలుగా బాగుంటుంది. ఆహారంలో కొద్దిగా అన్నం లేదా చపాతి ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కొద్దిగా డ్రైఫ్రూట్స్ వంటివి ఉండేటట్లు చూసుకోవడం మంచిది. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నాం. అయితే సరిౖయెన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల గర్భం దాల్చాను. ఇప్పుడు అబార్షన్ చేసుకోవచ్చా? ఇలా చేయడం వల్ల మున్ముందు ఏమైనా సమస్యలు ఎదురవుతాయా? – ఎన్.కీర్తన, గుంటూరు ఇప్పుడు గర్భం ఎన్ని నెలలు అని రాయలేదు. సాధారణంగా రెండు నెలల లోపల గర్భం అయితే అబార్షన్ అవ్వడానికి మందులు వాడవచ్చు. రెండు నెలలు దాటితే అంటే 8 వారాలు దాటితే మందుల ద్వారా పూర్తిగా అబార్షన్ అవ్వకపోవచ్చు. దానికి డి అండ్ సి అనే చిన్న ఆపరేషన్ ద్వారా యోని ద్వారం నుంచి గర్భాశయంలోని గర్భాన్ని తోలగించడం జరుగుతుంది. మందుల ద్వారా అబార్షన్కి ప్రయత్నం చేసినప్పుడు, నూటికి నూరుశాతం ఒకొక్కరి శరీరతత్వాన్నిబట్టి గర్భం సైజ్ని బట్టి, కొందరిలో కొన్ని ముక్కలు ఉండిపోవచ్చు. కొందరిలో బాగా నొప్పితో బాగా బ్లీడింగ్ అవ్వడం, బాగా నీరసపడటం, రక్తహీనత ఏర్పడటం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అబార్షన్ చేయించుకునే ముందు స్కానింగ్ చేయించుకొని గర్భం, గర్భాశయంలో ఉందా, ఉంటే ఎన్ని వారాలు ఉంది అని చూసుకోవాలి. మందులతో అబార్షన్ తర్వాత కూడా స్కానింగ్ చేయించుకోవాలి. అందులో గర్భం పూర్తిగా తొలిగిపోయిందా లేక ఇంకా ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అనేది నిర్ధారణ చేసుకోవాలి. లేదంటే లోపల ముక్కలు ఉండిపోయి నిర్లక్ష్యం చేస్తే, మధ్యమధ్యలో బ్లీడింగ్ అవుతూ ఉండడం, ఇన్ఫెక్షన్ సోకడం, పొత్తికడుపులో నొప్పి, ట్యూబ్స్ మూసుకుపోయే అవకాశాలు, మళ్లీ గర్భం దాల్చడానికి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఒకవేళ ముక్కలు ఉండిపోయి, మందుల ద్వారా పూర్తిగా అబార్షన్ కాకపోతే, డి అండ్ సి పద్ధతి ద్వారా నొప్పి తెలియకుండా మత్తు తీసుకొని అబార్షన్ చెయ్యించుకోవలసి ఉంటుంది. డి అండ్ సి పద్ధతి ద్వారా 1–2 శాతం మందిలో ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ గర్భం రావటానికి ఇబ్బంది కావచ్చు. కాకపోతే అబార్షన్ చెయ్యించుకున్నæ అందరిలోనూ మళ్ళీ గర్భం రావటానికి ఇబ్బంది ఉండాలని ఏమీ లేదు. కొందరిలో సాధారణంగా వచ్చిన గర్భాన్ని తొలగించుకుని, మళ్లీ కావాలనుకున్నప్పుడు వారి శరీరంలో మార్పులు, హార్మోన్లలో మార్పులు వంటి వేరే కారణాల వల్ల ఆలస్యం అయితే, అప్పుడు అనవసరంగా వచ్చిన గర్భాన్ని తీయించుకున్నాము అని పశ్చాత్తాప పడటం జరగుతుంటుంది. కాబట్టి అబార్షన్ చేయించుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. నా వయసు 43 సంవత్సరాలు. గత నాలుగైదు నెలలుగా నెలసరి రావడం లేదు. ఇది ప్రమాదకర సంకేతమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయగలరు.– టీఆర్. ఆముదాలవలస మీకు ఇంతకుముందు నెలనెల క్రమంగా వచ్చేవా? మీ వయసు 43 సంవత్సరాలు. ఈ వయసులో పీరియడ్స్ క్రమం తప్పడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ వయసులో కొద్దిమందిలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు మెల్లగా ఉత్పత్తి తగ్గిపోవడం మొదలయ్యి తర్వాత 5–6 సంవత్సరాలకు పూర్తిగా తగ్గిపోయి పీరియడ్స్ ఆగిపోతాయి. ఇలా ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ రాకపోతే దానినే మెనోపాజ్ దశ అంటారు.ఈ దశకి చేరేముందు కొందరిలో పీరియడ్స్ ఆలస్యంగా రావటం, బ్లీడింగ్ ఎక్కువ లేదా తక్కువగా అవ్వటం వంటి అనేక రకాల లక్షణాలు ఉంటాయి. ఇవే కాకుండా కొందరిలో అండాశయాలలో నీటికంతులు, గడ్డలు వంటి ఇతర కారణాల వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యంగా రావచ్చు. కాబట్టి మీరు కంగారు పడకుండా గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే, వారు రక్తపరీక్షలు, స్కానింగ్ అవి చేసి కారణాన్ని బట్టి చికిత్స చేస్తారు.అవి మెనోపాజ్ ముందు వచ్చే మార్పులు అయితే దానికి చెయ్యగలిగింది ఏమి లేదు. కాకపోతే వయసు 43 కాబట్టి ఆహారంలో ఎక్కువ కాల్షియం, ఐసోఫ్లావోన్స్ ఉండే పదార్థాలు అయిన ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, సోయాబీన్స్, పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
కర్సింగ్ రైటింగ్
రాత్రి పన్నెండింటికి మెలకువొచ్చింది అర్జున్కి. గబగబా లేచి గ్లాసెడు నీళ్ళు తాగి, మరో గ్లాసెడు నీళ్ళు మొహాన కొట్టుకుని పుస్తకం తెరిచాడు. అదొక ఫోర్ రూల్ బుక్.ప్రతి పేజీలోని పై వరుసల్లో ఇంగ్లీష్ నీతి వాక్యాలున్నాయి. ఉదయానికల్లా దాన్ని నింపేయాలి. పీరియడ్ మొదలవ్వడానికి ముందే.. పెద్దాయనకి చూపించాలి.వాళ్ల అమ్మ మెల్లగా లేచి దగ్గరికి వచ్చి ’నిద్రని ఆపుకోలేవు.. ఉండు.. కాస్త బూస్టు కలిపి తెస్తాను..’ అని వంటగదిలోకి వెళ్ళింది.అర్జున్కి ఆవిడ మాటలేవీ వినపడలేదు. పెన్సిలు కళ్లద్దానికి దగ్గరగా పెట్టుకుని ముల్లు పదును పరిశీలించాడు. తల అడ్డంగా ఊపుతూ షార్పెనర్ల గుట్ట వైపు చూశాడు.రెండు మూడు షార్పెనర్లను పట్టుకుని తేరిపార చూస్తూ, చివరికి ఎర్రరంగుది ఎంచుకుని పెన్సిలు చెక్కుకున్నాడు. పని పూర్తవ్వగానే తృప్తినిచ్చే నవ్వు కళ్లలోంచి బయటపడి మూతి మీదకు చేరింది.ఇది హోమ్వర్కు కాదు.రాత్రి పన్నెండింటికి మేలుకుని మరీ చేస్తున్నాడంటే.. దాని అర్థం పనిష్మెంట్ అని! ఈ మాత్రం విషయానికి ఆశ్చర్యం రాకపోవచ్చు. కానీ..అర్జున్ వయసు నలభై రెండేళ్లు.. ఈ మాట చెప్పగానే ఆశ్చర్యపోకుండా కాసేపాగి.. మతి చలించినవాడేమోలే.. అనుకోవచ్చు. కానీ.. అర్జున్ ఈజ్ ఏన్ అసిస్టెంట్ ప్రొఫెసర్.. క్రియేటివ్ రూల్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇప్పుడు సందిగ్ధంలో పడి ఉంటారు.ఏంటీ ఇతని మేటర్ అని.అమ్మ ఇచ్చిన బూస్టు తాగి శ్రద్ధగా రాయడం మొదలు పెట్టాడు. దేర్ ఈజ్ నో క్రియేటివిటీ వితవుట్ ఫెయిల్యూర్...’ నాలుగో పదం దగ్గర పెన్సిల్లో స్వేచ్ఛ ఆవిరైపోయింది.సన్నగా వొణికింది. ‘‘సి కీ ఆర్ కీ కర్సిప్ లింక్ సరిగా చేయట్లేదు..’’ వాయిస్ గుండె బ్యాక్గ్రౌండ్లోంచి గుంభనంగా వినపడింది.. వాయిస్ మాత్రమే కాదది. బెదిరింపు.. హింస. పైశాచిక ఆనందం.అది కాలేజీ స్థాపించిన పెద్దాయనది. కళ్ల నుంచి నీళ్లు ఉబికాయి. రెప్పాడిస్తే కన్నీటిబొట్టు పుస్తకం మీద పడుతుందని, పుస్తకం దూరంగా నెట్టేశాడు. అమ్మ చూడకుండా తమాయించుకున్నాడు.భుజంమీది టవల్ తో మొహం తుడుచుకున్నాడు. ఆందోళనతో కూడిన ఆ ఏడుపాగట్లేదు. ఓ కొత్త రేజర్ అందుకుని, దాని అంచుతో తప్పు అనిపిస్తున్న పదాన్ని తుడిచాడు.. ఒకసారి.. రెండుసార్లు.. మూడుసార్లు... సరిగ్గా రాశాడో లేదో తనకే అర్థం కావట్లేదు. పుస్తకం నింపేశాడు.కాలేజీ క్యాంటిన్లో ఎప్పట్లా సేమ్యా ఉప్మా పెట్టుకుని కూర్చున్నాడు అర్జున్. ఉప్మాలో సేమ్యా పుడకలు కలగాపులగంగా ఉన్న ఇంగ్లీష్ అక్షరాల్లాగ కనిపిస్తున్నాయి. వాటివంక కూడా కలవరంగా చూశాడు. ఫోర్కుతో అటూ ఇటూ కదిపాడు.. ఫోర్ రూల్ బుక్కులాగ గీతలు పడ్డాయి. అసహ్యపడి.. చప్పున దూరంగా తోసేశాడు.‘‘నేను మా పెద్దమ్మాయితో రాయించాను. బాగానే రాసింది.చూడాలి.. వాడేమంటాడో..’’ ఆనందంగా చెప్పాడు పక్కనే కూర్చున్న ప్రసాదరావు. అర్జున్ ‘అదృష్టవంతుడివి’ అన్నట్లుగా చిన్న నవ్వు నవ్విఊరుకున్నాడు.ఈలోగా అటెండరు పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘మీటింగ్ హాల్ కి అర్జెంటుగా రావాలంట..’’ అని చెప్పి లైబ్రరీ వైపు కూడా కేకెయ్యడానికి దారితీశాడు.అర్జున్తో పాటు అక్కడున్న మరికొంతమంది ఉన్నపళంగా ఫోర్ రూల్ బుక్కులతో పరుగులు తీశారు.అప్పటికే అక్కడ కూర్చున్నాడాయన.ఆయన పేరు అప్రస్తుతం. కార్పొరేట్ వ్యవస్థను కరెన్సీతో కొలిచి కొనుక్కుని పెట్టిన కాలేజీ శాఖలను తన సామంత రాజ్యాలుగా భావిస్తాడు. తాను చట్టాలను చేయగల మేధావిగా.. సమర్థుడిగా.. నియంతగా.. వ్యవహరిస్తుంటాడు.స్టూడెంట్లు ప్రతిరోజూ హాజరవ్వాలి. యూనిఫామ్ వేయాలి. మొబైల్ నాట్ అలవ్డ్. లీవు కోసం పేరెంట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. ప్రాపర్ కాజ్ సర్టిఫై చేసి చూపాలి.వాహ్.. మంచి కాలేజ్. ఈ తరం పిల్లలకు ఇలాంటిదే కరెక్టు.. అనుకుని చాలామంది జాయిన్ అయ్యారు. ఓరోజు సడెన్గా కర్సివ్ రైటింగ్ బుక్సు తెచ్చి మనిషికి ఓ పదేసి కాపీలు ఇచ్చారు. స్టాఫ్కి కూడా. డబ్బులు కట్టించుకుని మరీ.. ఇంజనీరింగ్ పిల్లలు ఎందుకు రాస్తారు? రాయలేదు. వాళ్ల వాళ్ల ఇళ్లల్లో ఈ పెద్దాయనకి మెంటల్ అని చెప్పారు. వాళ్లల్లో పేరున్నవాళ్లు వచ్చి తిట్టారు. వార్త వైరల్ అయిపోయింది. పెద్దాయన ఇగో దెబ్బతింది. రెండ్రోజుల్లో స్టాఫ్ అందరికీ సర్క్యులర్ వచ్చింది. కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన బుక్సు చూపించాలని. ఇంక్రిమెంట్లు వేసే టైమ్.. ప్రమోషన్లు ఇచ్చే టైమ్...మధ్యతరగతి మెట్లమీద నడిచే మాస్టార్లు.. ఏంచేస్తారు? రాత్రికి రాత్రి రాశారు. రాయించారు. ఉద్యోగం కోసం.. ఉన్నతిని దిగజార్చుకున్నారు. ఆ బుక్సు దిద్దుతున్నప్పుడే మరో ఆజ్ఞ జారీ చేశాడు పెద్దాయన. ‘రేపు ఎస్సే రైటింగ్ ఎగ్జామ్. ప్రిపేర్ అయ్యి రండి..’ అని.అతని మొహంలో నవ్వు ఉంది. వీళ్లందర్నీ ఆటాడిస్తున్నానన్న అహం.. వీళ్లంతా సఫర్ అవుతూ కూడా నా ముందు వంగి వంగి ఉండాల్సిందే అన్న పైశాచిక ఆనందం.ఇంగ్లీష్ సార్ హాస్పిటల్లో ఉంటే.. ఆయనకు బుక్స్ వీపీపీలో పంపాడు. ’చిన్న విషయం’ అనుకునే స్థాయి దాటిన భావం అందరిలోనూ మొదలైంది అప్పుడే.మేథ్స్ లెక్చరర్, వెళ్లిపోతానన్నారు. రిజైన్ లెటర్ ఇచ్చినప్పటి నుంచి ఆయన్ను ఒరిజినల్ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేందుకు మూడు నెలలుగా తిప్పుతున్నారు. అప్పుల్లో పడి ఆయన కుమిలిపోవడం.. ఈమధ్యనే ఆత్మహత్యాప్రయత్నం చేయడం.. అందరిలోనూ భయాన్ని రేపింది.పెద్దాయన పక్కనే ఓ టేబుల్ మీద పుస్తకాలన్నీ పెట్టారు. అటెండరు కృష్ణ అందివ్వడానికి వచ్చాడు. పైన రీనా మేడమ్ బుక్కు ఉంది. దానికి కలర్ పేపర్ అట్ట, లేబుల్, పువ్వుల అంచు డిజైన్ ఉంది.దాన్నిఅందించాడు కృష్ణ.అందుకుని.. దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి.. తెరిచాడు. ఒక రెండు నిమిషాల తర్వాత దాన్ని మూసేసి.. ‘‘రీనామేడమ్.. మీరు మరో నాలుగు పుస్తకాలు తీసుకోండి. రేపు సెలవు కదా.. ఎల్లుండి చూపించండి..’’ అన్నాడు. మళ్లీ అందరి వైపు చూస్తూ.. ఇలాంటి అట్టలు వేసి నన్ను మాయ చేయలేరు.. అంటూ నవ్వాడు.నెక్స్›్ట అంటూ పుస్తకం అందుకుని.. తెరిచీ తెరవగానే.. దాన్ని విసిరేశాడు. ‘టెన్ బుక్స్ రాసి పట్రా.. వరస్ట్ రైటింగ్..’ అన్నాడు.. అదెవరిదా అనుకుంటుండగా.. ప్రసాదరావు పరుగెత్తుకుంటూ ఆ పుస్తకం పడ్డ మూల వైపు వెళ్లాడు.అందరివీ విసిరేస్తున్నాడు..మనోజ్.. పుస్తకంలో మాత్రం మొహం పెట్టి అయిదు నిమిషాలు ఉన్నాడు. బైటికి వచ్చి. ’గుడ్.. నువ్వు ఎక్స్ట్రా బుక్ రాయక్కర్లేదు. లెవెల్ టూ బుక్ తీస్కో.. అని అభినందించాడు. లెవెల్ టూనా.. అంటూడీలా పడ్డాడతను. తర్వాత అర్జున్ పేరు చదివాడు. ‘‘నీ పిల్లలది ఎల్ కేజీ యూకేజీ అయిపోయిందా’’ అన్నాడు నవ్వుతూ. ‘‘పెళ్ళి కాలేదండీ..’’ అన్నాడు పెద్దాయన వ్యంగ్యంగా అడిగాడని తెలిసి కూడా. ‘‘మరి ఇదెవరు రాశారు?’’ గద్దించాడాయన. ‘నేనే సార్..’’ అన్నాడు పెద్దాయనకి జవాబు తెలిసే అడిగాడని తెలిసినా. ‘‘అచ్ఛా.. తమరు మంచి ఆర్టిస్టులా ఉన్నారే.. ఓ పదిహేను పెయింటింగ్స్ గీసి తీస్కురండి..’’ అన్నాడు కాళ్లూపుతూ.. మరింత వెటకారంగా.మర్నాడు లీవు కావాలని అడగాలన్న మాట గొంతు దాటలేదు. అమ్మను హాస్పిటల్కి తీసు కెళ్లాలి. తతంగం పూర్తయ్యాక ధైర్యంచేసి వెనకాలే వెళ్లాడు అర్జున్.. ‘‘సార్.. రేపు లీవు..’’...‘‘మొన్న తీసుకున్నావ్ కదా.. నీకు రెండు వారాలకే నెల పూర్తవుతుందా? ఏమనుకున్నావ్? కాలేజీలో వర్క్షాప్ ఉంది. ఎట్లా పోతావ్? నెలకి ఒకటే సీఎల్... అర్థం కాదా మీకు.. సెలవు పెట్టి ఏదో వేరే ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారు.. గ్రూప్ వన్నా టూనా..? నాకు తెలీదా..’’‘‘అది కాదు సార్.. అమ్మకి బాలేదు.. హాస్పిటల్కి..’’ ‘‘మా అమ్మకీ బాలేదు.. నేను వస్తున్నా కదా.. సాకులు.. సాకులు... వరస్ట్ మెంటాలిటీస్..’’ఆయన ఆగకుండా.. నడుస్తూనే ఉన్నాడు. కార్ డోర్ తెరిచే ఉంచారు.లోపల కూర్చుని రయ్యిమని వెళ్లిపోయాడు.దుఃఖం ముంచుకొచ్చింది అర్జున్కి. ఎటెండరు కృష్ణ పక్కకి వచ్చి సముదాయింపుగా తల ఊపాడు.‘సాయంకాలాలూ రాత్రిళ్లూ ఈయనిచ్చిన ఫోర్ రూల్ పుస్తకాలు నింపేసరికే అయిపోతుంది.. అమ్మ సంగతి..? అటు ఉద్యోగం ఊడిపోతే.. ఉన్నపళంగా ఏదీ తోచని బ్రతుకు..’’ గొంతు తడారిపోయింది అర్జున్కి..రీనా మేడమ్, పక్కనే ప్రసాదరావు.. మరికొందరు స్టాఫ్... అర్జున్ మాటలు వింటూ నిల్చుండిపోయారు.‘‘ఇద్దరు పిల్లల ఒంటరి రీనా మేడమ్.. లక్షల్లో అప్పులు తీర్చలేక నెట్టుకొస్తున్నరు ప్రసాద్ సార్.. తొంభై అయిదు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్న వెంకట్ బాబుసార్.. ఒకరికి కాదు.. అందరికీ.. అందరికీ.. టార్చర్ పెడుతున్నాడు. ఏమీ చేయలేరని.. వాడికేమీ చేయలేరా సార్..? కూర్చుని ఏడుస్తరు.. మా నాయనమ్మ ఓ కత చెప్పింది.. పిల్లి మెడలో గంట కట్టడానికి ఎలకలన్నీ మీటింగు పెట్కున్నయంట. తర్వాత ఏం జరిగిందో అనవసరం. మీరు మీటింగన్నా పెట్కోలే..? అంతకన్నా హీనమా? ‘ కృష్ణ చీదరింపు ఇది ఎన్నోసారో తెలీదు.‘‘ఎవరి బతుకులు వారివి.. ఏం చేస్తాంరా కృష్ణా..’’ నిరాశగా మాట్లాడాడు ప్రసాద్సార్. ‘‘కనీసం గట్టిగా మాట్లాడండి సార్..’’ ‘‘నీకేమన్నా పిచ్చా..?’’ ‘‘ఈ మాట.. ఇదే మాట.. వాడి ఎదురుగా అనండి.. నిజంగా..’’ ‘‘మెంటల్ నా కొడుకు.. కేసు పెడితే.. మా ఉద్యోగాలు ఏమవుతాయ్? మళ్లీ ఎక్కడ వెతుక్కుంటాం..’’‘‘ఉద్యోగం పోతే మళ్లీ వెతుక్కోలేం.. అన్నది ఎంత చేతకాని మాట సార్? పీజీలూ పీహెచ్డీలూ చేసి ఇంత దేభ్యం బతుకు ఎందుకుసార్? సిగ్గుండాలి.. ఛత్.. జైల్లో ఖైదీల్లెక్క ఉన్నారు. ఇదా ఉద్యోగం? కాపీరైటింగు కర్సివ్ రైటింగులేంది? పిచ్చకాకపోతే? ఒకసారి సరే.. వారం వారం.. ఆదివారాలు మింగేస్తన్నాడు. సోమవారాలు ఏడుపుమొహాలతో.. సిగ్గుండాలి.. లాస్ ఆఫ్ పే సెలవు కూడాఇవ్వడా..? హలో.. బ్రిటీషోళ్లు వెళ్లిపోయి చాలాకాలం అయింది సారూ..’’‘‘అయితే ఇప్పుడేం చేయమంటావ్ రా..?’’ ‘‘ఎవడికి కాలితే వాడు.. నిలదీయాలి సార్‘ ‘‘ఎవరు చేస్తారు చెప్పు.. ఎవ్వరూ ముందుకు రారు..’’ రీనా మేడమ్ గొంతు తగ్గిస్తూ అంది.‘‘ఎవరో ఒకరు చెయ్యాలి.. ఇంతమందికి మేలు జరుగుతుందంటే.. చెయ్యరా?.. ప్రపంచం చాలా విశాలమైనది. కుటుంబాల్ని కూలి పనిచేసుకుని అయినా పోషించుకోవచ్చు ప్రసాద్ సార్! చాలామంది టైలరింగులు లాంటి పనులు చేస్తూ పిల్లల్ని చదివిస్తున్నారు రీనా మేడమ్!! తట్టలు మోసేవాళ్లకు కూడా తల్లిని చూడాల్సిన బాధ్యత ఉంది అర్జున్ సార్!!! వీడేమన్నా హిట్లరా? తుపాకీ ఉందా? చంపేస్తాడా? నోరెందుకు పెగలదు? ఒక్కసారి ఎదురునిల్చి మాట్లాడండి సార్.. తలదించుకుని కాదు.. వాడి కళ్లలోకి చూస్తూ.. తెలుసుగా.. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలో మళ్లీ మీరే చెప్తారు అందరికీ.. ఈ ఒక్క పనితో మీకు చాలా సమస్యలు తీరుతాయి. ఈ సాయంత్రం సమస్య మీది. మీకోసం మీరే నిలబడాలి. పోరాడాలి. ఎవరో వస్తారని ఎదురు చూడకండి.మీరొకరికి స్ఫూర్తి అవుతారు. జీవితం రేపటినుంచే కొత్తగా ఉంటుంది. నమ్మండి. నేను వెళ్లి ఏదో మాట్లాడొచ్చు.. కానీ.. ఎవరి ఆట వాళ్లు ఆడాలికదా.. నాకు కాలినప్పుడు నేను లేస్తా.. ఇక మీ ఇష్టం..’’ కృష్ణ తన తల కుడివైపుకి కాస్త వాల్చి తూటాల్లా మాటలు విసురుతుంటే.. యమస్పీడులో కర్సివ్ రైటింగ్ రాస్తున్నట్లుంది..‘‘నాకు కాల్తంది...’’ నింపాదిగానే అన్నాడు అర్జున్.‘‘ఇదేమన్నా స్వతంత్ర పోరాటమా? విశాఖ ఉక్కు ఆంధ్రులహక్కు అన్నట్లు తిరగాలా.. ఉన్న ఉద్యోగం ఉంటే చాలు..’’ ప్రసాదరావు తప్పుకుని వెళ్లిపోయాడు. మిగతావాళ్లు ’ఏంచేస్తాంలే.. మన లైఫ్లు ఇంతే..’ అనుకుంటూ నీరుగారిపోయారు...అర్జున్ ఒక్క నిమిషం పాటు కదల్లేదు. బిగుసుకున్న దవడల మధ్య అతని నిర్ణయం స్పష్టంగా ధ్వనించింది.‘‘ఛీ.. దీనమ్మా జీవితం.. ఒరే కృష్ణా.. ఏదైతే అదైంది.. కర్రీ పాయింటు పెట్టుకున్నా చాలు.. బతికేస్తా.. సగం జీవితం అయిపోయింది.. బాగా చెప్పావురా.. జీవితాంతం నిన్ను గుర్తు పెట్టుకుంటా..’’ పరుగులాంటి నడకతో ఇంటికి బయల్దేరాడు అర్జున్. .అర్జున్ ఆరేడడుగులు వేశాడో లేదో.. వెనకాల్నించి కృష్ణ ‘‘సార్.. మీ నడకలోనే కర్సివ్ రైటింగ్ కనిపిస్తంది. సూపర్..’’ అన్నాడు. అర్జున్ వెనక్కి తిరిగి ఓ కామా పెట్టినట్లు నవ్వి బయల్దేరాడు.అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. ఆ రాత్రి తనే వంట చేసి ఆమెకు వడ్డించాడు. ఆమె కొడుకు చూపించే ప్రేమకు తృప్తిపడింది. అర్జున్కి ఆ తృప్తి మరికొంత ధైర్యాన్నిచ్చింది. భోజనాలు అయ్యాక రీడింగ్ టేబుల్ దగ్గర ఫోర్ రూల్ బుక్ తెరిచి రాయడం మొదలు పెట్టాడు. అదీ రెడ్ ఇంక్ పెన్తో! గంట సేపు ఏకధాటిగా రాస్తున్నంతసేపూ మొహాన చిరునవ్వు చెరగలేదు.‘‘సార్.. మన కాలేజీ చీడ మిగతా కాలేజీలకు కూడా పాకేసింది. ‘స్నేక్మూవ్స్’ కాలేజీవాళ్లు కూడా ఫోర్ రూల్ బుక్కులు పెట్టారంట తెల్సా..‘ కొత్త ప్రొఫెసర్ ఒక్కొక్కరి చెవుల్లో గుసగుసలాడాడు.‘‘మంచి మూడు అడుగులు వేసేలోపు.. పైత్యం పది కిలోమీటర్లు పోతాది మరి...’’ అన్నాడు అర్జున్. అందరూ నిర్వేదంగా నవ్వేరు.ఈలోగా మీటింగ్ హాల్ కి రమ్మని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇన్స్పెక్షన్ కి పై అధికారులు కూడా అక్కడే ఉన్నారని మరొకాయన అన్నాడు.అందరూ పుస్తకాలను పట్టుకుని బయల్దేరారు. దొంతులు పెట్టి ఎదురుగా కూర్చున్నారు. అందరికంటే చివరగా పుస్తకాల మీద అర్జున్ పుస్తకం పెట్టాడు.పెద్దాయన పొట్ట మీద గోక్కుంటూ విలాసంగా నవ్వుతూ అధికారులకు తన నియమాలను చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘మొన్న ఎస్సే రైటింగ్ పెట్టాం. అందరూ మొబైల్లో కాపీ కొట్టి రాశారు.. నాకు తెలిసింది.. ఏంచేయాలా అని ఆలోచిస్తున్నా.. వాళ్లు రాసింది హండ్రెడ్ టైమ్స్ ఇంపొజిషన్ రాయిస్తా..’’ అంటూ వాళ్లను నవ్వించాననుకున్నాడు.‘‘బై ద వే.. ఇవి మావాళ్ల ఇంప్రూవ్ మెంట్ వర్క్’’ అంటూ అర్జున్ పుస్తకం తీసి ఒకాయనకి అందించాడు.అందుకున్నాయన అది తీసి, ఒక నిమిషం చదివి ఒకటే నవ్వు! పక్కాయనకి అందించాడు.. ఆయన కూడా శ్రుతి కలిపాడు.మూడో ఆయన బైటికే చదివాడు.. ‘‘డియర్ సర్.. యూ హావ్ ఏ సీరియస్ డిజార్డర్ సమ్ థింగ్ లైక్ డీలూజన్ సిమ్టమ్స్. బెటర్ టు కన్సల్ట్ ఇమ్మీడియట్లీ. వి ఆర్ ఆల్ యువర్ వెల్ విషర్స్. వి ప్రే ఫర్ యూ.. వి లవ్ యూ.. ప్లీజ్ చెక్ యువర్ మైండ్.. ఆల్ నెర్వ్స్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఫోర్ రూల్!.. వాటీజ్ దిస్ నాన్సెన్స్? లెటజ్ మూవ్ టు సేవ్ యూ..’’పెద్దాయన మొహాన నెత్తురు చుక్కలేదు. ‘‘ఏంటి సార్.. ఇదంతా?’’ అడిగారా అధికారి. అందరి మొహాలూ స్విచ్చులు వేసిన ట్యూబ్ లైట్లలా ఉన్నాయి. వెలగలేదింకా...! అర్జున్ లేచాడు..‘‘ఇదంతా మా బతుకు సార్.. బాధలు సార్.. ఎక్కడా చెప్పుకోలేని ఛండాలమైన టార్చర్ సార్..’’ అంటూ గుక్కతిప్పకుండా గంట సేపు మాట్లాడాడు.లైట్లన్నీ వెలిగాయి.ప్రసాదరావు.. రీనామేడమ్.. శరత్ కుమార్.. అందరూ ఒక్కో మాటా.. కర్సివ్ రైటింగ్లాగ ఎక్కడా తెగనీకుండా తేడా రాకుండా.. బాధలన్నీ చెప్పుకొచ్చారు.అధికార్ల ముందు పెద్దాయన కుక్కచెవులొచ్చిన పిల్లాడి నోట్సులా ఉండిపోయాడు. ‘క్రమశిక్షణ కోసమని రాయిస్తున్నా..‘ అని ఏదో చెప్పబోతుంటే.. ‘‘నువ్వొక పేజీ రాయవయ్యా చూస్తాం..’’అన్నాడొక అధికారి.‘‘క్రమశిక్షణ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచు. ఇష్టానుసారం పిచ్చిపనులు చెయ్యడం కాదు..’’ ముక్తాయింపునిచ్చాడు మరొకాయన.పెద్దాయన ముఖంలో ఓ తెల్లకాగితంలాంటి పశ్చాత్తాపం తలదించుకుంది. ఇప్పుడు నిలబడి ఉన్న అర్జున్, ఫోర్ రూల్ బుక్కులో ఇంగ్లీష్ మూడోబడి క్యాపిటల్ అక్షరంలా ఠీవిగా కనిపిస్తున్నాడు. - ఎస్.ఎస్.దేవసింధు -
నెలసరికి స్వీట్స్కి సంబంధమేంటి?
నాకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు. అయితే ఈమధ్య నెలసరి రావడం లేదు. నాకు స్వీట్లు ఎక్కవగా తినే అలవాటు ఉంది. దీనివల్లే సమస్య వస్తుందని మా అమ్మ చెబుతోంది. ఇది ఎంత వరకు నిజం? ఏ కారణాల వల్ల నెలసరి సరిగ్గా రాదు? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – పీఆర్, కరీంనగర్ నెలసరి సరిగా రావాలంటే, మెదడు నుంచి, అండాశయాల నుంచి విడుదలయ్యే హార్మోన్స్fsh, lh, tsh, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్. సక్రమంగా విడుదల అవ్వాలి. అలాగే గర్భాశయం లోపలి పొర సరిగా ఏర్పడాలి. మెదడులో లోపాలు, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి, అండాశయాలలో నీటి బుడగలు, తిత్తులు, సిస్ట్లు, గర్భాశయంలో టీబీ, అధికబరువులాంటి అనేక కారణాల వల్ల హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి నెలసరులు సరిగ్గా రాకపోవచ్చు. కేవలం ఎక్కువగా స్వీట్లు తీనడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పవు. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ బరువు పెరుగుతారు కాబట్టి అధిక బరువు వల్ల హార్మోన్లలో తేడా ఏర్పడి పీరియడ్స్ క్రమం తప్పవచ్చు. నీ బరువు గురించి రాయలేదు. నువ్వు ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించి పీరియడ్స్ ఎందుకు రావట్లేదు అని తెలుసుకోవడానికి, థైరాయిడ్, పెల్విక్ అల్ట్రాసౌండ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకొని కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవచ్చు. పీరియడ్స్ సక్రమంగా రావాలంటే సరైన వ్యాయామాలు చేయడం, బరువు మితంగా ఉండేట్లు చూసుకోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా లేకుండా ఉండటం, ఆహారాలలో అన్నం (కార్బోహైడ్రేట్స్) తక్కువ తిని, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు ఎక్కువ పెరగకుండా ఉంటారు. ∙కడుపులో బిడ్డ లోపాలను గుర్తించే సాంకేతికజ్ఞానం మనకు అందుబాటులో ఉందా? గర్భస్థ శిశువుల లోపాలను సవరించే వీలుంటుందా? తెలియజేయగలరు. – జి.సుధ, కర్నూలు తల్లి గర్భంలో అండం, శుక్రకణం అనే రెండు కణాల కలయికతో పిండం ఏర్పడడం మొదలయ్యి తొమ్మిది నెలలపాటు అనేక రూపాంతరాలు చెందుతూ శిశువు పెరుగుతుంది. ఈ సమయంలో తెలియని అనేక కారణాల వల్ల, శిశువులో జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు, అవయవాల పనితీరులో లోపాలు ఏర్పడవచ్చు.గర్భంలో బిడ్డలోని అన్ని లోపాలను నూటికి నూరుశాతం గుర్తించలేము. 90 శాతం మటుకే అల్ట్రా స్కానింగ్ వల్ల గుర్తించవచ్చు. వీటిని గుర్తించడానికి నిపుణులైన డాక్టర్లు, మంచి స్కానింగ్ మెషిన్ అవసరం. ఇప్పుడు మనకు ఉన్న సాంకేతికజ్ఞానంతో 90 శాతం లోపాలను తెలుసుకోవచ్చు.తల్లి అధిక బరువు ఉన్నా, పొట్టలో కొవ్వు ఉన్నా, బిడ్డ పొజీషన్ సరిగ్గా లేకపోయినా, ఉమ్మనీరు తక్కువ ఉన్నా, ఇంకా కొన్ని పరిస్థితుల్లో కొన్ని లోపాలు సరిగ్గా కనిపించకపోవచ్చు. గుండెకు సంబంధించిన రంధ్రాలు వంటి కొన్ని అవయవ లోపాలు సరిగ్గా తెలియకపోవచ్చు..మూడోనెలలో చేసే ఎన్టీ స్కాన్, ఐదోనెలలో టీఫా స్కాన్లలో 90శాతం అవయవ లోపాలను గుర్తించవచ్చు.సందేహాలు ఉన్నప్పుడు తల్లికి యంఆర్ స్కాన్ ద్వారా కూడా కొన్నిలోపాలను నిర్ధారణ చేయడం జరుగుతుంది. డౌన్స్సిండ్రోమ్ వంటి జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలను కనిపెట్టడానికి ఇప్పుడు తల్లికి మూడో నెలలో డబుల్ మార్కర్ టెస్ట్, అయిదవ నెలలో క్వాడ్రుపుల్ టెస్ట్ మొదలైనవి అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిస్తే అవి నిర్ధారణ చేసుకోవడానికి కొరియాన్ విల్లస్ బయాప్సీ, అమ్నియోసెంటిసిస్ అని బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీరును కొంచెం తీసి కారియోటైపింగ్ పరీక్షకు పంపి నిర్ధారణ చేయడం జరుగుతుంది. వీటిలో కూడా అన్నీ జన్యుపరమైన సమస్యలు తెలియవు. మూగ, చెవుడు, మెదడు పనితీరు, అవయవాల పనితీరువంటివి ఎటువంటి పరీక్షలలోను ముందుగా తెలియవు. బిడ్డ పుట్టిన తరువాతే బయటపడతాయి.ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీటల్ స్పెషాలిటీతో కొన్ని అవయవలోపాలకు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడే, అవి సరిచేయడానికి కొన్ని రకాల ఆపరేషన్లు కొంతమంది అనుభవం ఉన్న డాక్టర్లు చేయడం జరుగుతుంది. నేను ప్రెగ్నెంట్. ఇటీవల ఒక మ్యాగజిన్లో "bump bounce" అనే పదం చదివాను. ఇది తగ్గడానికి ప్రత్యేకమైన వర్కవుట్లు ఉన్నట్లు చదివాను. దీని గురించి సవివరంగా తెలియజేయగలరు. – బి.వందన, ఆలమూరు గర్భంతో ఉన్నప్పుడు కడుపు పెరుగుతూ, ఎత్తుగా ముందుకు ఏర్పడుతుంది. దీనినే ‘ప్రెగ్నెన్సీబంప్’ అంటారు. కడుపు పెరిగే కొలది బరువు నడుం మీద, పెల్విక్ కండరాలు, ఎముకల మీద పడుతుంది.దీనివల్ల నెలలు నిండే కొద్ది నడవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.నడుం నొప్పులు, కాళ్లనొప్పులు... అటు ఇటు తిరగడానికి ఇబ్బంది పడుతుంటారు. నడిచేటప్పుడు కడుపు అటు ఇటు ఊగుతుంటుంది. దీనినే ‘బంప్ బౌన్స్’ అంటారు. దీని నుంచి పూర్తిగా ఉపశమనం దొరకడం కష్టం. కాకపోతే కొన్ని వ్యాయామాలు, కొంత విశ్రాంతి వంటి జాగ్రత్తలు తీసుకుంటూ చాలావరకు ఇబ్బందుల నుండి ఉపశమనం దొరుకుతుంది.పొట్టకు సపోర్ట్గా ఉండే బట్టలు వేసుకోవడం, రోజు అరగంట నడక, చిన్న చిన్న వ్యాయామాలు, యోగావంటివి చేయడం వల్ల ఎముకలు, కండరాలు, జాయింట్లు రిలాక్స్ అవుతాయి. నొప్పి, ఇబ్బందుల నుంచి ఊరట కలుగుతుంది. మితమైన పౌష్టికాహారం తీసుకుంటూ అధికబరువు పెరగకుండా చూసుకోవాలి. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్,హైదరాబాద్ -
ఓవరీలో సిస్ట్ ఉన్నవాళ్లకి సంతాన అవకాశం ఉండదా?
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్స్ నా వయసు 33 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇంతవరకు పిల్లలు లేరు. కొన్నాళ్ల క్రితం స్కానింగ్ తీయిచాం. నా ఓవరీలలో సిస్ట్ ఉందని ఆ పరీక్షలో తేలింది. ఆ సిస్ట్ భవిష్యత్తులో క్యాన్సర్గా మారే అవకాశం ఉందని కొందరు అంటుంటే నాకు ఆందోళనగా ఉంది. అలాగే సిస్ట్ ఉన్నవారికి సంతానం పొందే అవకాశాలు ఎలా ఉంటాయి. ఈ విషయాలపై నాకు సలహా ఇవ్వండి. – శ్రీలత, కందుకూరు ఓవేరియన్ సిస్ట్ (అండాశయాల్లో నీటితిత్తులు) చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇది చాలా సాధారణ సమస్య. ఈ నీటితిత్తులు క్యాన్సర్ కణాలుగా మారవు. మీ వయసులో ఉన్న వాళ్లలో చాలామందిలో అవి కొద్దికాలం తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీలా ఒవేరియన్ సిస్ట్స్ ఉన్న మహిళలు డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఏ తరహాకు చెందినవో గుర్తించేందుకు వారు ప్రయత్నిస్తారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా వాటి పరిమాణం, సంఖ్య, వాటిలోకి జరిగే రక్తసరఫరా వంటి అంశాలను తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇతర పరీక్షలనూ చేయించాల్సి వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకొని అలా వాళ్ల కుటుంబ చరిత్రలో క్యాన్సర్లు వచ్చి ఉంటే వారికి మరికొన్ని అదనపు పరీక్షలు సైతం చేయించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒవేరియన్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే వాటి పరిమాణం పెరుగుపోతున్నా లేదా ట్విస్ట్ అవుతున్నా, అవి చీరుకుపోయి రక్తస్రావం అవుతున్నా, వాటి వల్ల నొప్పి కలుగుతుంటే మాత్రం వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సైతం లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా చాలా మందికి సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా సిస్ట్లు రావడం అన్నది ఎండోమెట్రియాసిస్ కారణంగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు రుతుస్రావం, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకిగా ఉంటుంది. ఇక మీరు అడిగినట్లుగా మీ గర్భధారణ అవకాశాల విషయానికి వస్తే మీకు ఇంకా గర్భధారణ జరగకపోవడానికి ఏయే అంశాలు కారణమో పూర్తిగా తెలుసుకోవాలి. దాంతోపాటు మీలో వచ్చే సిస్ట్లు ఏ తరహాకు చెందినవి అని తెలుసుకోవడం కూడా అవసరం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు వీలైనంత త్వరగా వైద్య నిపుణులను కలవండి. ఎండో మెట్రియాసిస్ వస్తే పిల్లలు పుట్టే అవకాశాలుఉన్నాయా? నా వయసు 36 ఏళ్లు. ఉద్యోగం చేస్తున్నాను. పెళ్లయి ఎమినిదేళ్లు అవుతోంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఇటీవలే డాక్టర్ను కలిశాను. డాక్టర్గారు నాకు ‘ఎండోమెట్రియాసిస్’ ఉందని నిర్ధారణ చేసి, లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా? అలాగే నాకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉన్నాయా? – ఒక సోదరి, హైదరాబాద్ ఎండోమెట్రియాసిస్ చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇది రావడం అన్నది చాలామంది మహిళల్లో చాలా సందర్భాల్లో కనిపించేదే. కొంతమందిలో ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత ఈ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. ఇక కొంతమందిలో మళ్లీ రావచ్చు. నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే లైఫ్స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా... అంటే... తేలికపాటి వ్యాయామాలు చేయడం, యోగా వంటి రిలాక్సేషన్ ప్రక్రియలతో పాటు చాలా తక్కువ మోతాదుల్లో నొప్పినివారణమాత్రలు వాడుతుండటం వంటి చర్యలతో నొప్పిని చాలావరకు నియంత్రణలో ఉంచవచ్చు. కానీ కొందరిలో నొప్పి తీవ్రత చాల ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిలో మళ్లీ గర్భధారణను కోరుకోని వారికి హార్మోన్లలో మార్పులు తీసుకువచ్చే మందులను డాక్టర్లు సూచిస్తారు. అయితే నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దాదాపు 60 శాతం నుంచి 80 శాతం మందిలో మళ్లీ గర్భధారణ వచ్చేలాగే శస్త్రచికిత్స చేసి, నొప్పిని నియంత్రించవచ్చు. మీ లేఖలో మీరు రాసినదాన్ని బట్టి మీరు గర్భధారణను కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు గర్భధారణను కోరుకుంటుంటే మాత్రం ‘ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్’ (అంటే గర్భధారణకు గల అవకాశాలను పరీక్షించే కొన్ని రకాల పరీక్షలు) చేయించాల్సి ఉంటుంది. మీరు రాసినదాన్ని బట్టి మీకు మినిమల్/మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉండటం వల్ల లాపరోస్కోపిక్ చికిత్స జరిగినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రకాల మందులతో మీలో అండం విడుదల అయ్యేలా (ఒవ్యులేషన్)/ ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) వంటి ప్రక్రియలతో గర్భధారణకు తగిన అవకాశాలే ఉంటాయని చెప్పవచ్చు. కాకపోతే తీవ్రమైన ఎండోమెట్రియాసిస్ (సివియర్ ఎండోమెట్రియాసిస్) కేసుల్లో మాత్రం ఐవీఎఫ్ వంటి ఆధునిక ప్రక్రియలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజుల్లో సంతానసఫల్యానికి తగిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. çమీరొకసారి ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి. స్పెర్మ్ కౌంట్ జీరో అయితే పిల్లలు పుట్టే అవకాశాలే ఉండవా? నా వయసు 33 ఏళ్లు. నాకు పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. పిల్లలకోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల నేను వీర్య పరీక్ష చేయించుకుంటే అందులో శుక్రకణాలు లేవని తెలిసింది. ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వడండి. – ఎమ్. సురేశ్బాబు, కోదాడ పురుషుల వీర్యంలో శుక్రకణాలు లేని కండిషన్ను అజూస్పెర్మియా అంటారు. దీనికి శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా లేకపోవడం లేదా ఉత్పత్తి అయిన శుక్రకణాలు ప్రయాణం చేసే దారిలో ఏదైనా అడ్డంకి ఉండటం కారణాలు కావచ్చు. అయితే మీలాంటి కేసుల్లో మారుమారు ఇదే పరీక్షను నిర్వహించాలి. ఆ తర్వాత మీరు కొన్ని వైద్య పరీక్షలు... అంటే హార్మోనల్ అల్ట్రాసౌండ్, క్యారియోటైపింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. మీ కండిషన్కు తగిన కారణాన్ని నిర్ధారణ చేసుకోవాలి. హార్మోనల్ సప్లిమెంట్స్ ద్వారా శుక్రకణాలు సంఖ్య పెంచవచ్చు. అప్పటికీ సాధ్యంకాకపోతే ఐవీఎఫ్ (టెస్ట్ట్యూబ్) విత్ టెస్టిక్యులార్ స్పెర్మ్ యాస్పిరేషన్తో చికిత్స చేయవచ్చు. అంటే ఈ ప్రొసిజర్లో నేరుగా టెస్టిస్ నుంచి శుక్రకణాలు సేకరిస్తారు. అయితే అన్ని కేసుల్లో ఇలా శుక్రకణాల సేకరణ సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ మరికొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. వాటి పూర్తి వివరాల కోసం మీరు ఒకసారి ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి. డాక్టర్ రత్న దూర్వాసుల, సీనియర్ ఇన్ఫెర్టిలిటీ కన్సల్టెంట్, బర్త్ రైట్ బై రెయిన్బో, హైదరాబాద్ -
అఆ ట్యాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడొచ్చు
నా వయసు 23. బరువు 55కిలోలు, నాకు సిజేరియన్ ద్వారా ఒక బాబు పుట్టాడు. పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించు కోలేదు. లూప్ వేయించుకున్నాను కానీ కొన్ని రోజులకు దురద రావడంతో దాన్ని తీయించేసుకున్నాను. మావారు కండోమ్స్ వాడుతున్నారు. ఒకసారి కండోమ్స్ వాడనందు వల్ల అనుకోకుండా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. డాక్టర్ను కలిసి నాకు అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు అని చెబితే, ఏవో మందులు ఇచ్చారు. అవి వేసుకున్న తర్వాత ఎనిమిది రోజుల వరకు నాకు బ్లీడింగ్ అయింది. ఆ ట్యాబ్లెట్స్ నేను ఎన్ని సంవత్సరాల వరకు వాడవచ్చు? దీని వల్ల నాకు ఏమైనా ప్రమాదం ఉందా? – సుకన్య, చౌటుప్పల్ మొదటి బాబు తర్వాత అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటున్నారు కాబట్టి గర్భం రాకుండా ఉండటానికి తాత్కాలిక పద్ధతులను అనుసరించాలి. అసలింక పిల్లలు వద్దనుకుంటే.... కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. అంటే మీకైతే ట్యూబెక్టమీ ఆపరేషన్, మీవారికైతే వేసెక్టమీ ఆపరేషన్. తాత్కాలిక పద్ధతులు అంటే.. ఇవి వాడినంత కాలమే గర్భం రాదు, ఆపిన తర్వాత గర్భం వస్తుంది. వీటిలో లూప్, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, కండోమ్స్, హార్మోన్ ఇంజెక్షన్స్ వంటివి ఎన్నో ఉంటాయి. ఇవి ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, కొందరికి సెట్ అవుతాయి. మరికొందరికి సెట్ అవ్వవు. ఇవి ఫెయిలై గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మీకు డాక్టర్ ఇచ్చినవి అనుకోని పరిస్థితుల్లో గర్భం వచ్చి, గర్భం వద్దనుకుంటే ఎప్పుడో ఒకసారి అదీ గర్భం రెండునెలల లోపు ఉంటే వాడటానికి మాత్రమే. అంతేకానీ గర్భం వచ్చినప్పుడల్లా అబార్షన్ అవ్వడానికి కాదు. వీటి వల్ల 100 శాతం అబార్షన్ అవుతుందని చెప్పలేం. బ్లీడింగ్ అయినప్పటికీ 10–15 శాతం మందిలో ముక్కలు ఉండిపోవడం, వాటివల్ల అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు వచ్చి.. అప్పటికీ డాక్టర్ను సంప్రదించకపోతే ప్రాణాపాయం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో బ్లీడింగ్ అయినా గర్భం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ గర్భాన్ని అలాగే ఉంచుకుంటే పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలు, మానసిక, శారీరక లోపాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇవి ఏదో ఒకసారి పని చేసిందని, ప్రతిసారీ పని చేస్తుందనే నమ్మకం లేదు. ఇవి వాడేముందు ఒకసారి స్కానింగ్ చేయించుకొని గర్భాశయంలో గర్భం ఉందా లేదా.. ఉంటే ఎంత సైజు, ఎన్ని వారాలు ఉందో చూసుకొని డాక్టర్ పర్యవేక్షణలోనే వాడాలి. వాడిన 10–15 రోజుల తర్వాత కూడా మరోసారి స్కానింగ్ చేయించుకొని, మొత్తంగా అబార్షన్ అయిందా లేదా, ఇంకా ఏమైనా ముక్కలు ఉన్నాయా అనేది తెలుసుకోవడం తప్పనిసరి. గర్భం 7–8 వారాలు ఉన్నప్పుడే వీటిని వాడటం మంచిది. కొంతమందిలో గర్భం ట్యూబ్లో ఉన్నప్పుడు స్కానింగ్ చేయించుకోకుండా, అబార్షన్కు మందులు వాడితే ట్యూబ్ పగిలి, కడుపులో అధిక రక్తస్రావమై ప్రాణానికి ముప్పుగా మారొచ్చు. కాబట్టి మీరు ఈ కిట్ను గర్భం వచ్చినప్పుడల్లా వాడాలనుకునే ఆలోచనను మానేయండి. ఇంక పిల్లలు వద్దనుకుంటే మీరు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు లేదా మీవారు సింపుల్గా అయిపోయే వేసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చు. నా వయసు 45. రెండేళ్ల క్రితమే పీరియడ్స్ ఆగిపోయాయి. కానీ నెల క్రితం మూడు రోజుల పాటు బ్లీడింగ్ కనిపించింది. ఈ నెల కూడా దాదాపు ఆ తేదీలోనే బ్లీడింగ్ కనిపించింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. నా గర్భసంచికి ఏదైనా సమస్య వచ్చిందా లేదా ఇంకేమైనా సమస్య ఉందా, దయచేసి చెప్పగలరు. – సత్యవేణి, గాజువాక ఆడవారిలో పీరియడ్స్ ఆగిపోయిన సంవత్సరం తర్వాత కాలాన్ని మెనోపాజ్ దశ అంటారు. ఈ సమయంలో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయిన సంవత్సరం తర్వాత బ్లీడింగ్ అవ్వడాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. గర్భాశయం లోపల పొరలో ఎండోమెట్రియల్ పాలిప్ ఏర్పడటం వల్ల గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, పుండ్లు, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్, ఈస్ట్రోజన్ మాత్రలు వాడటం వల్ల ఎండోమెట్రియల్ పొర పెరగడం వల్ల, అండాశయాలలో గడ్డలు వంటి అనేక కారణాల వల్ల పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అవ్వవచ్చు. దీనిని అశ్రద్ధ చెయ్యడం అంత మంచిది కాదు. ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించి, స్పెక్యులమ్ పరీక్ష, స్కానింగ్, పాప్ స్మియర్ వంటి పరీక్షలు చేయించుకోండి. అవసరమైతే ‘డి అండ్ సి’ పరీక్ష చేసి ముక్కని ఎండోమెట్రియల్ బయాప్సీ, సెర్వికల్ బయాప్సీకి పంపించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత పరీక్షలో వచ్చే రిపోర్ట్ను బట్టి చికిత్స సరిపోతుందా? లేక గర్భాశయాన్ని తొలగించవలసి వస్తుందా అనే నిర్ణయానికి రావొచ్చు. మా అత్తగారి వయసు 48. షుగర్, బీపీ లేవు. కానీ కొన్నాళ్లుగా పొత్తి కడుపులో కుడిపక్క నొప్పి వస్తోంది. అది కిడ్నీ వరకూ వచ్చింది. కిందికి వంగినప్పుడల్లా నొప్పి వస్తోందని అనడంతో యూరాలజిస్టుకు చూపించాం. స్కాన్ చేసి ఏ సమస్యా లేదన్నారు. ఏవో మందులిస్తే వాడినా తగ్గలేదు. ఆకలి లేదు. రాత్రిళ్లు ఐదారుసార్లు యూరిన్కి వెళ్లాల్సి వస్తోంది. అండాశయ క్యాన్సర్ ఉన్నవాళ్లకి ఈ లక్షణాలుంటాయని తెలిసింది. అది నిజమేనా? – స్వర్ణలత, తాడేపల్లిగూడెం అండాశయ క్యాన్సర్ ఉంటే పొట్టలో ఇబ్బంది, ఏదో తెలియని నొప్పి, పొట్ట ఉబ్బడం, అలసిపోవడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, బద్ధకం, మందులు వాడినా తగ్గకపోవడం వంటి లక్షణాలుంటాయి. అయితే ఏ గ్యాస్వల్లో, ఎసిడిటీ వల్లో అలా ఉంటోందని అనుకుని చాలామంది ఏవో మందులు వాడేసి సమయం వృథా చేస్తుంటారు. అండాశయ క్యాన్సర్ని ఆరంభ దశలో కనుక్కోవడం చాలా కష్టం. మెల్లగా పెరిగేకొద్దీ స్కానింగ్లో చిన్న గడ్డలాగా లేదా కాంప్లెక్స్ సిస్ట్లాగా కనిపిస్తుంది. అలా అన్నీ క్యాన్సర్ గడ్డలే కానక్కర్లేదు. నిర్ధారణ కోసం ఇ్చ125, ఇఉఅ, అఊ్క వంటి ట్యూమర్ మార్కర్స్ రక్తపరీక్షలు చేయించు కోవాల్సి ఉంటుంది. అవసరమైతే సీటీ, ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకుంటే వ్యాధి ఎంతవరకూ పాకిందో తెలుస్తుంది. వ్యాధి ముదిరిన తర్వాత స్కాన్ చేస్తే అండాశయంలో పెద్ద పెద్ద ట్యూమర్లు, పొట్టలో నీరు చేరడం వంటివి కనిపిస్తాయి. మొదటి స్టేజిలోనే ఉంటే అబ్డామినల్ స్కానింగ్లో అంతగా ఏమీ కనిపించదు. ట్రాన్స్ వెజైనల్ పెల్విక్ స్కాన్ చేయించుకుంటే అండాశయాల్లో ఏవైనా చిన్న చిన్న గడ్డలు లేదా ఏవైనా అనుమానాస్పద మార్పులు ఉంటే తెలుస్తుంది. కొందరికి కనిపించకుండా మిస్సయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ వ్యాధి కనుక నిర్ధారణ అయితే... స్టేజిని బట్టి ఆపరేషన్ ద్వారా ట్యూమర్ తొలగించి, చుట్టుపక్కల ఏమైనా పాకిందా లేదా అనేది గమనించి, పక్కన ఉన్న టిష్యూస్ని కూడా బయాప్సీకి పంపించడం జరుగుతుంది. బయాప్సీ రిపోర్ట్ని బట్టి తర్వాత అవసరాన్ని బట్టి కీమోథెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పిన అన్ని లక్షణాలకీ క్యాన్సరే కారణం అవ్వాలని లేదు. కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పేగుల్లో టీబీ ఉన్నా కూడా ఈ లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి మీరోసారి డాక్టర్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకుని, తద్వారా చికిత్స తీసుకోండి. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ అంటే..?
పల్మునాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 17 ఏళ్లు. అతడు ఎప్పుడూ పొడి దగ్గుతో బాధపడుతున్నాడు. శ్వాస అందడం లేదు. అప్పుడప్పుడూ కొద్దిగా జ్వరం కూడా వస్తోంది. మా డాక్టర్ను సంప్రదిస్తే వాడిది ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ అని చెప్పారు. అంటే ఏమిటి? – ఆర్. సురేశ్, ఆదిలాబాద్ కాఫ్ వేరియెంట్ ఆస్తమా అనేది ఆస్తమాలోనే ఒకరకం. దీనిలో బాధితుడికి ఎప్పుడూ పొడిదగ్గు వస్తూ ఉంటుంది. అంటే తెమడ పడదన్నమాట. వీళ్లకు పిల్లికూతలు లాంటి సంప్రదాయ ఆస్తమా లక్షణాలు కనపడవు. దీన్నే కొన్నిసార్లు ‘క్రానిక్ కాఫ్’ (దీర్ఘకాలం వచ్చే దగ్గు) అని కూడా అంటారు. అంటే ఇది ఆరు నుంచి ఎనిమిది వారాల పైగానే కొనసాగుతుంది. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా దగ్గు వస్తూనే ఉంటుంది. రాత్రివేళ ఎడతెరపి లేని దగ్గు వల్ల నిద్రపట్టదు. ఇలాంటి రోగుల్లో వాళ్లకు సరిపడని దానికి ఎక్స్పోజ్ అయితే అది ఆస్తమాను ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు ఘాటైన వాసనలు, దుమ్ము, చల్లగాలి వంటివి. ఈ కాఫ్ వేరియెంట్ ఆస్తమా ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఇది ఎక్కువ. ఇది ఆ తర్వాత సాధారణ ఆస్తమాకు దారితీస్తుంది. అంటే శ్వాస అందకపోవడం, పిల్లికూతలు తర్వాతి దశలో వస్తాయన్నమాట. సాధారణ ఆస్తమా లాగే కాఫ్ వేరియెంట్ ఆస్తమాకు కూడా కారణాలు అంతగా తెలియవు. కాకపోతే సరిపడని వస్తువులు, చల్లగాలి దీనికి కారణాలుగా భావిస్తుంటారు. కొందరిలో అధిక రక్తపోటు, గుండెజబ్బులు, హార్ట్ఫెయిల్యూర్, మైగ్రేన్, గుండెదడ (పాల్పిటేషన్స్) వంటి జబ్బులకు వాడే మందులైన బీటా–బ్లాకర్స్ తీసుకున్న తర్వాత ‘కాఫ్ వేరియెంట్ ఆస్తమా’ మొదలైన దాఖలాలు కొన్ని ఉన్నాయి. అలాగే గ్లకోమా వంటి కంటిజబ్బులకు వాడే చుక్కల మందులోనూ బీటా బ్లాకర్స్ ఉండి, అవి ఆస్తమాను ప్రేరేపిస్తాయని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరిలో ఆస్పిరిన్ సరిపడకపోవడం వల్ల కూడా దగ్గుతో కూడిన ఆస్తమా రావచ్చు. కాఫ్ వేరియెంట్ ఆస్తమాలో కేవలం దగ్గు తప్ప ఇతర లక్షణాలేమీ కనిపించకపోవడం వల్ల దీని నిర్ధారణ ఒకింత కష్టమే. ఎందుకంటే కాఫ్ వేరియెంట్ ఆస్తమా విషయంలో సాధారణ పరీక్షలైన ఛాతీఎక్స్రే, స్పైరోమెట్రీ వంటి పరీక్షలూ నార్మల్గానే ఉంటాయి. కాబట్టి మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న ఛాతీ నిపుణుడిని కలవండి. ఆ డాక్టర్ మీ కుమారుడిని అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకొని, మీ కుటుంబ వ్యాధుల చరిత్రను అధ్యయనం చేసి, శ్వాసించే తీరును విని వ్యాధి నిర్ధారణా, తగిన చికిత్సా చేస్తారు. పీరియడ్స్ సమయంలో శ్వాస అందడం లేదు..? నా వయసు 35 ఏళ్లు. గృహిణిని. నాకు పీరియడ్స్ సమయంలో సరిగా శ్వాస అందడం లేదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. దీనికి కారణాలు ఏమిటి? పరిష్కారం చెప్పండి. – ఎల్. దీపిక, కాకినాడ రుతుక్రమం వచ్చే సమయం మహిళల్లో ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మహిళల భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. దాంతో కొన్నిసార్లు అటు శారీరక, ఇటు మానసిక సమస్యలు కనిపించవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఉన్న సమస్యను కెటామెనియల్ ఆస్తమాగా చెప్పవచ్చు. కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను ప్రేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్ను కలవండి. ఆక్సిజన్ థెరపీ అంటే ఏమిటి? నా వయసు 49 ఏళ్లు. నేను కొద్దికాలంగా సీవోపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్)తో బాధపడుతున్నాను. దీనికి ఆక్సిజన్ థెరపీతో మంచి ఉపశమనం ఉంటుందని విన్నాను. – ఎన్. శంకర్రావు, గుంటూరు మీరు చెప్పినట్లు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ)తో బాధపడుతూ ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గినవారికి ఆక్సిజన్ థెరపీతో మంచి ప్రయోజనం ఉంటుంది. మీ శ్వాస తీసుకోవడంలో అవరోధాలు ఉన్నాయి కాబట్టి, మీరు హాయిగా ఫీలయ్యేందుకు, మీ రోజువారీ వ్యవహారాలకు అవసరమైనంతగా మీ శరీరానికి ఆక్సిజన్ అవసరం. మీరు పీల్చుకోగలిగే ఆక్సిజన్ తక్కువ కాబట్టి ఈ అదనపు ఆక్సిజన్ వల్ల మీ ఊపిరితిత్తుల కార్యకలాపాలు మెరుగుపడతాయి. దాంతో మీరు పనిచేసే సామర్థ్యం, చురుగ్గా వ్యవహరించగల శక్తి మీకు చేకూరతాయి. ఆక్సిజన్ థెరపీ వల్ల మీ నిద్ర నాణ్యత కూడా గణనీయంగా మెరుగుపడటంతో పాటు మీ మానసిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇలా దీర్ఘకాలం పాటు ఆక్సిజన్ చికిత్స చేయడం మరో విధంగా కూడా ఉపయోగపడుతుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అంటే ఆక్సిజన్ చికిత్స సీవోపీడీ కండిషన్ను మెరుగుపరచడంతో పాటు హార్ట్ఫెయిల్యూర్ను నివారిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఆక్సిజన్ థెరపీ తీసుకోవడం మూడు రకాలుగా జరుగుతుంది. అవి... 1) కంప్రెస్డ్ ఆక్సిజన్ను తీసుకోవడం లేదా ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్ను కొనుగోలు చేసి ఈ చికిత్సను ఇంటివద్దనే తీసుకోవచ్చు. ఈ ఆక్సిజన్ను స్టీల్ లేదా అల్యూమినియమ్ ట్యాంకుల్లో భద్రపరుస్తారు. సైజ్లో పెద్దవిగా ఉండేవాటిని ఇంటిదగ్గర వాడుకోవచ్చు. 2) మీతో పట్టుకెళ్లగలిగేవి కూడా లభిస్తాయి. వాటిని మీరు బయటకు వెళ్లినప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాడవచ్చు. ద్రవరూపంలో ఉన్న ఆక్సిజన్ను నిల్వ చేయడానికి చిన్న కంటెయినర్లు సరిపోతాయి. పైగా ఒకచోట నుంచి మరోచోటికి తేలిగ్గా తరలించవచ్చు. అయితే వీటిని చాలాకాలం పాటు నిల్వ చేసి ఉంచకూడదు. ఎందుకంటే అందులోని ఆక్సిజన్ ఆవిరైపోతుంది. 3) ఆక్సిజన్ థెరపీ తీసుకునేవారిలో చాలామంది ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అనే మెషిన్ను వాడతారు. ఇది వాతావరణంలో ఉన్న ఆక్సిజన్నే సంగ్రహించి మీకు అందిస్తుంది. ఇది చవకైనదీ, పైగా దీన్ని మళ్లీ భర్తీ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఉపయోగించడమూ తేలికే. అయితే ఆ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఒకింత పెద్ద సైజులో ఉంటాయి. పైగా ఎక్కువ శబ్దం చేస్తుంటాయి. పైగా ఇది నడవాలంటే దీనికి విద్యుత్ సరఫరా కూడా అవసరం. దాంతో విద్యుత్ బిల్లు భారమూ అదనం. దీని నుంచి వేడి కూడా వెలువడుతుంది కాబట్టి వేసవిలో దీన్ని ఉపయోగించడం ఇబ్బందికరం. ఒకవేళ కరెంటుపోతే మెషిన్ ఆగిపోకుండా ప్రత్యామ్నాయం అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, మీ డాక్టర్ను సంప్రదించి మీకు అన్నివిధాలా సరిపోయే ప్రత్నామ్నాయాన్ని ఎంచుకోండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
కేరళ కుట్టికి అత్యున్నత పురస్కారం
‘ఇది ప్రతి స్త్రీ జీవితంలో అనుభవమయ్యే పునరుత్పత్తి పునాది ప్రక్రియ. కానీ ఏ దేశంలోనైనా చర్చించేందుకు ససేమిరా ఇష్టపడని విషయం కూడా ఇదే. రక్తస్రావమనే అత్యంత సహజ ప్రక్రియకి స్త్రీలంతా శిక్షకు గురవుతున్నారు’ అంటూ పట్టుమని 18 ఏళ్లు కూడా లేని కేరళ కుట్టి అమికా జార్జ్ బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ‘ఫ్రీ పీరియడ్స్’ ఉద్యమం ఆమెకు గోల్కీపర్స్ గ్లోబల్ అవార్డు దక్కేలా చేసింది. సామాజిక అభివృద్ధి రంగంలో ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతిని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా బిల్, మెలిండా ఫౌండేషన్ 2017లో గోల్కీపర్స్ అనే సామాజిక చైతన్య ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్ల అమికా జార్జ్ పేద బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్కిన్స్ కోసం బ్రిటన్ వీధుల్లో పూరించిన శంఖారావం ఆమెకు ఈ అవార్డు దక్కేలా చేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం చివరకు బ్రిటన్ వీధుల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా సాగింది. దాదాపు 2 వేల మంది యువతీయువకులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమ అవసరాలను తీర్చేందుకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలియన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అభివృద్ధి చెందిన బ్రిటన్లాంటి దేశాల్లోనే ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు శానిటరీ ప్యాడ్స్ని కొనుగోలు చేయలేని పేదరికంలో మగ్గుతున్నారని ప్లాన్ ఇంటర్నేషనల్ సర్వేలో చదివిన అమికా జార్జ్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమ క్రమంలో బ్రిటన్ పేద బాలికలు శానిటరీ న్యాప్కిన్స్ కొనుక్కోలేని స్థితిలో ఆ అవసరానికి కాగితాలనూ, పాత న్యూస్ పేపర్స్నీ, సాక్స్నూ వాడుతుండటం తన హృదయాన్ని కలిచివేసిందంటోంది అమికా జార్జ్. ఇదే ఆమె చేపట్టిన ‘ఫ్రీ పీరియడ్’ ఉద్యమానికి పునాది అంటోంది. కేంబ్రిడ్జి వర్సిటీలో చదువుకు నేందుకు వెళ్లిన అమికా ఈ ఉద్యమంతో చరిత్రే సృష్టించింది. 2017 డిసెంబర్లో జరిగిన ఈ ఉద్యమం ఫలితంగా అక్కడి పేద బాలికలకు దక్కిన ఫలితాన్ని గుర్తించిన గోల్కీపర్స్ సోషల్ ప్రోగ్రెస్ ఆస్కార్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు మహిళలను ఈ అవార్డుకి ఎంపిక చేశారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, మహిళల పిల్లల హక్కుల కార్యకర్త గ్రేస్ తదితర ప్రముఖులు అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. న్యూయార్క్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇరాక్కు చెందిన 24 ఏళ్ల నదియా మురద్, కెన్యాకు చెందిన 28 ఏళ్ల డిస్మస్ కిసీలు ఈ అవార్డులు అందుకున్నారు. -
ఆ టైమ్లో ఎలాంటి ఆహారం తినాలి?
నా వయసు 22. నేను ఫుడ్ లవర్ని. చిరుతిండ్లు కూడా ఎక్కువగానే తింటాను. పీరియడ్స్ సమయంలో కూడా నాకు బాగానే ఆకలేస్తుంది. అయితే పీరియడ్స్ వచ్చినప్పుడు ఏది పడితే అది తినకూడదని ఫ్రెండ్స్ హెచ్చరించారు. అసలు పీరియడ్స్ టైమ్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి అనేది తెలియజేయగలరు. – టిఆర్, రావులపాలెం పీరియడ్స్ సమయంలో ఆహారంలో ఇది తినకూడదు, అది తినకూడదు అని ఏ నియమాలు లేవు. ఉండవు. కానీ ఆ సమయంలో బ్లీడింగ్ అవ్వడం వల్ల కొంతమందిలో నీరసం, రక్తహీనత ఎక్కువగా ఉంటాయి. దాంతో బలహీనంగా ఉంటారు. కాబట్టి తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పండ్లరసాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవటం మంచిది. వీటిలో ఉండే ఐరన్, విటమిన్స్ వంటి పోషకాలు.. బలహీనంగా లేకుండా శక్తిని ఇస్తాయి. జంక్ఫుడ్స్ పీరియడ్స్ సమయంలోనే కాకుండా మామూలు సమయంలో కూడా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. జంక్ఫుడ్ తీసుకోవటం వల్ల, బరువు పెరగడం, హార్మోన్లలో మార్పులు, దానివల్ల పీరియడ్స్ క్రమం తప్పటం వంటి అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కావున జంక్ఫుడ్కి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. రొమ్ము క్యాన్సర్ రోగులు సోయా ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే మంచిదని విన్నాను. సోయా ఉత్పత్తులతో పాటు ఇంకా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? ఈస్ట్రోజన్ హార్మోన్ గురించి తెలియజేయగలరు. ఇది అధికమైతే ప్రమాదమని విన్నాను. దీన్ని ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో చెప్పగలరు. – జానకి, వరంగల్ సహజంగా దొరికే సోయా ఉత్పత్తులు అంటే సోయా బీన్స్, సోయా పాలు వంటి వాటిలో ప్రొటీన్స్, ఫైబర్, ఫైటోఈస్ట్రోజన్ వంటి ఎన్నో పోషకపదార్ధాలు ఉంటాయి. ఇవి మితంగా తీసుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్ రోగులకు, క్యాన్సర్ ఇంకా పెరగకుండా, మళ్లీ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. వాటితో పాటు ఆకుకూరలు, తాజాకూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు వంటివి తీసుకోవాలి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఆడవారిలో ఎన్నో రసాయనక్రియలకు, ఎముకల బలానికి, అవయవాల పనితీరుకు, చురుకుదనానికి, పీరియడ్స్ సక్రమంగా రావటానికి అవసరం. ఇది చాలావరకు అండాశయాల నుంచి విడుదల అవుతుంది. కొద్దిశాతం మాత్రమే కొవ్వు నుంచి తయారవుతుంది. ఈస్ట్రోజన్ సరైన మోతాదులో విడుదల అయినప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందిలో అధిక బరువు వల్ల, లేదా పీసిఓడి సమస్య వల్ల హార్మోన్ చికిత్సలో భాగంగా ఈస్ట్రోజన్ మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల కంతులు, ఇంకా ఇతర కారణాల వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా రక్తంలో ఉన్నప్పుడు, ఒక్కొక్క శరీరతత్వాన్ని బట్టి రొమ్ము కాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రక్తం గడ్డ కట్టడం, దాని వల్ల గుండె జబ్బులు, బీపి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ హార్మోన్ ఎందుకు ఎక్కువగా ఉందనే దానినిబట్టే నియంత్రించడానికి మార్గాలు చెప్పవచ్చు. అధిక బరువు ఉంటే వ్యాయామాలు, ఆహారనియమాలను పాటించి తగ్గటం, డాక్టర్ పర్యవేక్షణలో కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవటం మంచిది. మా బంధువుల అమ్మాయికి రీసెంట్గా పెళ్లైంది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అట. అయితే తను tokophobia సమస్యతో బాధ పడుతున్నారని విన్నాను. దీని గురించి వినడం ఇదే మొదటిసారి. ఇది గర్భిణి స్త్రీలకు మాత్రమే వస్తుందా? అసలు ఎందుకు వస్తుంది? నివారణ చర్యలు ఏమిటో తెలియజేయగలరు. – కె.అశ్విని, పొద్దుటూరు కొంతమంది ఆడవారిలో గర్భం దాల్చడమన్నా, కాన్పు నొప్పులన్నా చచ్చేంత ఆందోళన, డిప్రెషన్ వంటి వాటికి గురవుతారు. దానినే టోకోఫోబియా అంటారు. ఇది ప్రైమరీ, సెకండరీ టోకోఫోబియా అని రెండు రకాలుగా విభజించబడుతుంది. ప్రైమరీ టోకోఫోబియా అంటే... అసలు అప్పటిదాకా కాన్పుకానివారిలో ఉంటుంది. వీరిలో కొందరిలో లైంగిక వేధింపులకు గురైనవారు, కొందరి క్లిష్టమైన కాన్పు గురించి విన్నవారు, లేదా చూసినవారు ఉంటారు. దాని వల్ల భయపడి, కాన్పు అంటే ఇష్టంలేకుండా వారికి కూడా అలానే ఉంటుందేమోనని భయపడుతుంటారు. సెకండరీ టోకోఫోబియా అంటే మరలా కాన్పు అంటే భయపడుతుంటారు. టోకోఫోబియా ఉన్నవారిలో కొంతమంది గర్భం కోసం ప్రయత్నించరు. గర్భం రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది కలయికకి కూడా దూరంగా ఉంటారు. గర్భం దాల్చిన తర్వాత ఆందోళన, టెన్షన్కు గురవ్వటం, నిద్రపట్టకపోవడం, డిప్రెషన్లోకి వెళ్లడం, సాధారణ కాన్పుకి ఇష్టపడకపోవడం, సిజేరియన్ ఆపరేషన్ చేయించుకోవటం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వారికి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరం. వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, డాక్టర్ దగ్గర కాన్పు గురించి ముందుగానే తెలియజెప్పడం ఎంతో అవసరం. అలాగే యోగా, మెడిటేషన్ వంటివి చెయ్యడం వల్ల కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బోహైదర్నగర్ హైదరాబాద్ -
ఆ టైమ్లో గర్భం వస్తుందా?
నా వయసు 18. నేనింత వరకూ మెచ్యూర్ కాలేదు. డాక్టర్లకు చూపించే స్తోమత లేక అమ్మానాన్నలు నన్నిలా వదిలేశారు. ఒకవేళ నేను వైద్యం చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? నాకు కూడా అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని సుఖపడాలని అనిపిస్తోంది. అందరు అమ్మాయిల్లాగా పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండే అవకాశం నాకు లేనే లేదా? రజస్వల కావాలంటే నేను ఏం చేయాలి? – మృణాళిని, ఖమ్మం మీరు మీ ఎత్తు, బరువు రాయలేదు. సాధారణంగా అమ్మాయిలు పదకొండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల లోపు... వారి వారి బరువు, హార్మోన్ల నిష్పత్తిని బట్టి రజస్వల అవుతారు. పద్దెనిమిదేళ్లు దాటినా మీరు రజస్వల కాలేదు అంటే కచ్చితంగా ఏదో సమస్య ఉండి ఉండవచ్చు. థైరాయిడ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ప్రోలాక్టిన్ వంటి పలు హార్మోన్లలో లోపం... గర్భాశయం, అండాశయాలు లేకపోవడం లేదంటే వాటి పరిమాణం చిన్నగా ఉండటం, జన్యు పరమైన సమస్యలు, మరీ సన్నగా లేక లావుగా ఉండటం, గర్భాశయ టీబీ, యోనిభాగం మూసుకుపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల ఇలా పదహారేళ్లు దాటిన తర్వాత కూడా మెచ్యూర్ కాకపోవడం జరుగుతుంది. మీకు పరిష్కారం చెప్పాలంటే ముందు మీలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకోవాలి. దాన్నిబట్టి తగిన చికిత్స చేస్తే మీరు తప్పకుండా మెచ్యూర్ అవుతారు. అందరు అమ్మాయిల్లాగే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. మీకు ఖర్చుపెట్టే స్తోమత లేకపోయినా ఫర్వాలేదు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉన్నాయి. అక్కడి గైనకాలజిస్టును సంప్రదిస్తే స్కానింగ్, రక్తపరీక్షల వంటివి ఉచితంగా చేస్తారు. కారణాన్ని బట్టి తగిన చికిత్స అందిస్తారు. నాకు వైట్డిశ్చార్జి అవుతోంది. బ్లడ్ వస్తోంది. క్యాన్సర్ అని భయంగా ఉంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కావచ్చు అనే అనుమానం ఉంది. ఇది ఏ వయసు వాళ్లకు వస్తుంది? మీ సలహా కోరుతున్నాను. – వీఎన్, రాజోలు. వైట్ డిశ్చార్జి అవ్వడానికి సాధారణంగా ఇన్ఫెక్షన్స్, గర్భాశయ ముఖద్వారంలో పుండు, హార్మోన్లలో మార్పులు వంటివి ఇంకా ఇతర కారణాలు ఉండవచ్చు. అరుదుగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ఉండే అవకాశాలు ఉంటాయి. నీకు వైట్ డిశ్చార్జితో పాటు బ్లీడింగ్ అవుతుంది అంటున్నావు. దీనికి, గర్భాశయ ముఖద్వార పుండు, పాలిప్స్, గర్భాశయంలో కణితులు, సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, ఇన్ఫెక్షన్స్, చాలా అరుదుగా గర్భాశయ క్యాన్సర్ కావొచ్చు. కాబట్టి నువ్వు డాక్టర్ను సంప్రదించి స్పెక్యులమ్ పరీక్ష, ప్యాప్స్మియర్ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్యను బట్టి చికిత్స తీసుకోవాలి. కానీ నీకు నువ్వే క్యాన్సర్ ఏమో అని ఊహించుకుని భయపడుతూ ఇంట్లోనే ఉంటే ఎలా? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, రోగ నిరోధక శక్తిని బట్టి, వ్యక్తిగత పరిశుభ్రతను బట్టి, ఇంకా అనేక అంశాలను బట్టి సెక్స్లో పాల్గొనే వారిలో ఎవరికైనా రావచ్చు. ఎందుకంటే ఇది 80 శాతం వరకు సెక్స్ ద్వారా, హ్యూమన్ ప్యాపిలోమా అనే వైరస్ ఎక్కువ రోజులు గర్భాశయ ముఖద్వారంలో చేరడం ద్వారా సంక్రమిస్తుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కచ్చితంగా ఈ వయసు వారికే రావాలని ఏమీ లేదు. 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరికైనా రావచ్చు. ఈ వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ని చాలావరకు అరికట్టడానికి ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఈ క్యాన్సర్ వచ్చే 5–10 సంవత్సరాల ముందే మార్పులను ప్యాప్స్మియర్ అనే పరీక్ష ద్వారా తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు. పీరియడ్స్ టైమ్లో సెక్స్లో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశం ఉందా? గర్భం దాల్చడానికి సురక్షితమైన సమయం ఏది? వివరంగా తెలియజేయగలరు. – ఎన్ఆర్, తాడిపత్రి, అనంతపురం. పీరియడ్స్ నెలనెలా సక్రమంగా వచ్చేవారికి బ్లీడింగ్ మొదలైన రోజును మొదటిరోజు కింద లెక్కపెడితే, 11వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కలవడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీర్యకణాలు 48 నుంచి 72 గంటల వరకు ఉత్తేజంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల కొంతమందిలో కొన్నిసార్లు అండం ఆలస్యంగా 16 రోజుల తర్వాత కూడా ఎప్పుడైనా విడుదల కావొచ్చు. పీరియడ్స్ సక్రమంగా రాని వారిలో అండం ఎప్పుడు విడుదల అవుతుంది, అసలు అవుతుందా లేదా అని చెప్పడం కష్టం. కాబట్టి పీరియడ్స్ సమయంలో కలవడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఉండవు. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బోహైదర్నగర్ హైదరాబాద్ -
మంట ఎక్కువగా ఉంటోంది
నా వయసు 29. ఈ మధ్య మూత్రానికి వెళుతున్నప్పుడు బాగా మంటగా ఉంటోంది. దీని గురించి ఒక స్నేహితురాలికి చెబితే... ‘సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్’ కావచ్చు అంటోంది. ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? – జీఆర్, ధర్మవరం మూత్రాశయంలో ఇన్ఫెక్షన్, మూత్రంలో ఇన్ఫెక్షన్, యోని భాగంలో ఇన్ఫెక్షన్ వంటి ఎన్నో కారణాల వల్ల మూత్రంకి వెళ్లినప్పుడు మంట రావటం జరుగుతుంది. ఇది నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల, కిడ్నీల్లో రాళ్లు ఉండి, మూత్రం వచ్చే దారిలో అవి అడ్డుపడి మూత్రం ఎక్కువ సేపు నిల్వ ఉండడం వల్ల, వ్యక్తిగత శారీరక శుభ్రత సరిగా పాటించకపోవడం, మూత్రవ్యవస్థలో లోపాలు, వంటి ఎన్నో కారణాల వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి, మూత్రానికి వెళ్లినప్పుడు మంటగా ఉంటుంది. కొందరిలో మలద్వారం నుంచి కూడా రోగక్రిములు మూత్రాశయంలోకి చేరి మూత్రంలో ఇన్ఫెక్షన్ రావటానికి కారణం అవుతాయి. కొన్ని సార్లు సెక్స్ ద్వారా, పార్టనర్స్ ఇరువురిలో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉన్నా ఇంకొకరికి అది సోకడం వల్ల యోనిలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్నే ‘సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్’ అంటారు. వీటిలో గనేరియా, హర్పిస్, ట్రైకోమోనియాసిస్, హెచ్ఐవి వంటి కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో తెల్లబట్ట ఎక్కువగా అవుతూ నురగలా, పచ్చగా కనిపించడం, మరి కొందరిలో పెరుగులా రావడం, యోనిలో మంట, దురద, వాసన, మూత్రానికి వెళ్లినప్పుడు మంట, కొందరిలో యోని దగ్గర కురుపులు వంటివి ఏర్పడవచ్చు. ఆడవారిలో మూత్రానికి ద్వారం, యోని ద్వారం, మల ద్వారం దగ్గరదగ్గరగా ఉండటం వల్ల, ఈ ఇన్ఫెక్షన్లు ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి తొందరగా వ్యాప్తి చెందుతాయి. ఫస్ట్టైమ్ పీరియడ్ గుర్తుంచుకోవాలని, భవిష్యత్లో ఎదుర్కోబోయే సమస్యలకు ఇది కీలకం అవుతుందని చదివాను. ఇది నిజమేనా? పీరియడ్ భయాల గురించి ఎదిగే పిల్లలను మానసికంగా ఎలా సంసిద్ధులు చేయాలి? – యం. సుగుణ, వేములవాడ ఫస్ట్టైమ్ పీరియడ్ అంటే రజస్వల అవ్వటం. రజస్వల అయిన తర్వాత కొందరిలో పీరియడ్స్ రెండు సంవత్సరాల వరకూ సక్రమంగా ఉండవు. తర్వాత పీరియడ్స్ సమయంలో ఏదైనా సమస్యలు వచ్చి డాక్టర్ని సంప్రదించినప్పుడు.. వారు మొదటæ అడిగే ప్రశ్న ‘పీరియడ్స్ ఎప్పుడు మొదలయ్యాయి’ అని. దానిబట్టి ఫస్ట్టైమ్ పీరియడ్ గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. పీరియడ్స్ మరీ తొందరగా మొదలైనా.. కొందరిలో ఎక్కువగా ఈస్ట్రోజన్ హార్మోన్కు గురికావడం వల్ల భవిష్యత్తులో వారి ఫ్యామిలీ హిస్టరీని బట్టి, బరువుని బట్టి బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎదిగే పిల్లలకు పీరియడ్స్ గురించి, ఆ సమయంలో వచ్చే శారీరక మార్పుల గురించి మెల్లగా చెప్పాలి. అది సహజసిద్ధమేనని, అందరి ఆడపిల్లలోనూ వయసు వచ్చిన తర్వాత జరిగేదేనని వారిని మానసికంగా సంసిద్ధం చెయ్యాలి. పీరియడ్స్ వస్తే, న్యాప్కిన్స్ వాడకం గురించి, వ్యక్తిగత శుభ్రత గురించి, ఆ సమయంలో వచ్చే నొప్పి, ఇతర ఇబ్బందుల గురించి కూడా ఓపికగా చెప్పడం మంచిది. వీలైతే కొన్ని వీడియోలు చూపించవచ్చు. దీనివల్ల ఆడపిల్లలు పీరియడ్ మొదలైనా, ముందుగా మానసికంగా సంసిద్ధులు అయి ఉంటారు కాబట్టి, ఆందోళన చెందకుండా, వాళ్లకు వాళ్లే అన్నీ చక్కగా సర్దుకుంటారు. గర్భిణీలకు ‘హార్ట్ ఎటాక్ రిస్క్’ ఎక్కువ అవుతుందని ఈమధ్య చదివాను. ప్రెగ్నెన్సీ సమయంలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ముందస్తు నివారణ మార్గాల గురించి తెలియజేయగలరు. – బి.నందిత, సామర్లకోట ప్రెగ్నెన్సీ సమయంలో గర్భం పెరిగే కొద్దీ గుండె మీద ఒత్తిడి పడడం, గుండె పనితీరులో మార్పులు వంటివి జరుగుతాయి. కొంతమంది గర్భిణీల్లో అధిక బరువు ఉన్నవాళ్లు, గుండె సమస్యలు ఉన్నవాళ్లు, బీపి, షుగర్ సమస్యలు, ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీలో జరిగే మార్పులకు గుండె మీద ఒత్తిడి పెరగడం వల్ల హర్ట్ఎటాక్, కార్డియాక్ ఫెయిల్యూర్ వంటి కొన్ని గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి ఎవరికి, ఎప్పుడు వస్తాయనేది ముందుగా చెప్పడం కష్టం. నివారించడానికి మార్గాలంటే.. ప్రెగ్నెన్సీ రాకముందే అధికబరువు ఉన్నవాళ్లు బరువు తగ్గడం, గుండె సమస్యలు, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్ను సంప్రదించి జాగ్రత్తలు పాటించడం, సరైన మందులు వాడటం మంచిది. గర్భం వచ్చిన తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో సరిగా చెకప్లకు వెళ్లడం, మందులు వాడటం, అవసరమైన పరీక్షలు సక్రమంగా చేయించుకోవడం, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్ను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు లేకుండా బయటపడవచ్చు. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
బైకార్నేట్ యుటెరస్ అంటే?
నా వయసు 27 ఏళ్లు. పెళ్లైన రెండో నెలలో నాకు పీరియడ్ మిస్సయింది. టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కానీ రెండో నెల చివర్లో కాస్తంత బ్లీడింగ్ కనిపించింది. వెంటనే హాస్పిటల్కి వెళ్లి స్కానింగ్ చేయించుకుంటే నాకు ‘బైకార్నేట్ యుటెరస్’ ఉందని చెప్పారు. పదిహేను రోజుల తర్వాత పూర్తిగా అబార్షన్ అయింది. ఈ బైకార్నేట్ యుటెరస్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. నాకు మళ్లీ ఇలా జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – స్రవంతి, మెయిల్ గర్భాశయం అనేది తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పడుతుంది. ఈ గర్భాశయం సాధారణంగా రెండు భాగాలుగా దగ్గరకు వచ్చి అతుక్కుంటాయి. ఆపైన మధ్యభాగంలో ఉన్న గోడ కరిగిపోతుంది. అలా గర్భాశయం మొత్తం ఒక్కటిగా ఏర్పడుతుంది. రెండు భాగాలు దగ్గరకు వచ్చే ప్రక్రియలో, అలాగే కరిగిపోయే ప్రక్రియలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మధ్యలో ఉన్న పొర అలాగే ఉండిపోయి బైకార్నేట్ యుటెరస్గా ఏర్పడుతుంది. అది గుండె ఆకారంలో ఉంటుంది. ఇందులో గర్భాశయం పై భాగం మధ్యలో చీలినట్లు లోపలికి ఉంటుంది. దీనివల్ల కొందరిలో గర్భాశయం మామూలు గర్భాశయంలాగా శిశువు పెరిగేకొద్దీ విచ్చుకోలేదు, ఎక్కువగా సాగలేదు కాబట్టి పిండం బరువు ఎక్కువగా పెరగకపోవడం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం, బిడ్డ పొజిషన్ సరిగా లేకుండా ఎదురుకాళ్లతో ఉండటం లాంటివి జరుగుతాయి. దీనివల్ల నెలలు నిండకుండానే కాన్పు చేయాల్సిరావడం, అందులోనూ ఆపరేషన్ ద్వారానే కాన్పు చేయాల్సి రావడం వంటి సమస్యలు రావచ్చు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం లూజుగా ఉండటం వల్ల అయిదో నెల, ఆరో నెలలోనే కాన్పు అవ్వవచ్చు. కొందరిలో బైకార్నేట్ యుటెరస్లోని మధ్య పొర పైన గర్భం పాతుకోవడం వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. బైకార్నేట్ యుటెరస్ వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండేందుకు మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే ఇలాంటి వాళ్లు జాగ్రత్తగా చెకప్లు, తరచూ స్కానింగ్లు చేయించుకోవాలి. అవసరమైతే అయిదో నెలలో గర్భాశయానికి కుట్లు వేయించుకోవడం, ప్రొజెస్టరాన్ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడటం జరుగుతుంది. పౌష్టికాహారం తీసుకుంటూ జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అవయవ లోపం లేని మహిళలతో పోల్చితే... ఆ లోపం ఉన్న మహిళలు గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చదివాను. ఇది ఎంత వరకు నిజం? తల్లి శారీరక అవయవ లోపం, పుట్టబోయే బిడ్డ మీద ఏ మేరకు ఉంటుంది? – ఎం.జయ, విజయనగరం పిల్లల్లో అవయవ లోపాలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తల్లిలో కానీ, తండ్రిలో కానీ జన్యుపరమైన సమస్యలు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని రకాల ముందులు వాడటం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకడం, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల పుట్టబోయే పిల్లల్లో అవయవ లోపాలు ఏర్పడవచ్చు. అవయవ లోపాలు ఉన్న మహిళలకు... ఏ అవయవాలలో లోపం ఉందన్న దాన్నిబట్టి వారు గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. తల్లిలో అవయవ లోపాలు ఉన్నప్పటికీ తండ్రిలో ఎటువంటి సమస్య లేనప్పుడు కొందరి పిల్లల్లో ఆ లోపాలు లేకుండా ఉండవచ్చు. కొందరి పిల్లల్లో మాత్రం తల్లిలో ఉన్న అవయవ లోపం కొంతమేరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనేది ముందే చెప్పడం కష్టం. అవి వారి జన్యువులను బట్టి, ఇంకా ఇతర కారణాలను బట్టి అవయవ లోపం ఏ శాతం మేరకు రావచ్చు అనే ఒక అంచనా వేయడం జరుగుతుంది. దీనిని జెనెటిక్ కౌన్సెలింగ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. నా వయసు 24 ఏళ్లు. పెళ్లై ఏడాది కావస్తోంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ మధ్య నాకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ‘జెస్టేషనల్ ఏజ్’ అనే మాట వినబడుతోంది. అదేంటో తెలుసుకోవాలని ఉంది. దయచేసి దీని గురించి తెలియజేయగలరు. – జె.కవిత, మదనపల్లి గర్భం దాల్చిన తర్వాత గర్భం ఎన్ని వారాలు, ఎన్ని నెలలు ఉందని తెలియడానికి జెస్టేషనల్ ఏజ్ అనే పదాన్ని వాడటం జరుగుతుంది. గర్భం నిర్ధారణ అయిన తర్వాత, ఆఖరుగా వచ్చిన పీరియడ్ మొదటి రోజు నుంచి జెస్టేషనల్ ఏజ్ని లెక్కపెడతారు. ప్రెగ్నెన్సీ పూర్తిగా తొమ్మిది నెలలు నిండి వారం దాటిన తర్వాత.. దాన్ని నలభై వారాల జెస్టేషనల్ ఏజ్ అంటారు. పీరియడ్స్ సక్రమంగా వచ్చే వాళ్లలో అయితే ఆఖరు పీరియడ్ వచ్చిన మొదటి రోజు నుంచి ప్రతివారం లెక్కకట్టి, రెండు నెలలకు అయితే ఎనిమిది వారాల జెస్టేషనల్ ఏజ్ అని, మూడు నెలలు అయితే పన్నెండు వారాల జెస్టేషనల్ ఏజ్ అని చెబుతారు. రెండోసారి గర్భం దాల్చినప్పుడు.. మొదటిసారి గర్భంలో ఏమైనా సమస్యలు ఉండి ఉంటే, అవి ఏ జెస్టేషనల్ ఏజ్లో వచ్చాయని చెప్పడానికి, ఆ సమస్యలు ఈ గర్భంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఈ జెస్టేషనల్ ఏజ్ అనే పదాన్ని వాడటం జరుగుతుంది. నేను బ్యూటీ ప్రొడక్ట్స్ను కాస్త ఎక్కువగానే వాడతాను. అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడకూడదంటున్నారు. వాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? బొటాక్స్ చేయించుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం ఉంటుందని విన్నాను. ఇది నిజమేనా? – పి.గాయత్రి, మంచిర్యాల కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్లో వాడే ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, లెడ్ వంటి మెటల్స్, ఇంకా కొన్ని పదార్థాలు తల్లి చర్మం నుంచి రక్తం ద్వారా బిడ్డకు 40–60 శాతం చేరే అవకాశాలు ఉంటాయి. ఈ పదార్థాలు తరచూ వాడటం వల్ల కొందరి పిల్లల్లో కొన్ని రకాల అవయవ లోపాలు, కొన్ని చర్మ సమస్యలు ఇంకా కొన్ని తెలియని సమస్యలు వచ్చే అవకాశాలు 5–10 శాతం ఉంటాయి. బొటాక్స్ అనేది కళ్ల కింద ముడతలు, ముఖం మీద ముడతలు రాకుండా ఇచ్చే టాక్సాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం, కొందరిలో ఇది ముఖం మీద కనిపించే కండరాలకు ఇవ్వడం వల్ల, కండరాలు ముడుచుకోకుండా ఉండి, ముడతలు లేకుండా ఉంటాయి. ఇవి కొద్ది డోస్లో కేవలం కొందరికే ఇస్తారు కాబట్టి చాలావరకు ఇది రక్తంలోకి చేరి బిడ్డకు చేరే అవకాశాలు తక్కువ. అయినా కానీ నూటికి నూరు శాతం సురక్షితం అని చెప్పలేం. డోస్ ఎక్కువై రక్తం ద్వారా శిశువుకి చేరితే, అబార్షన్లు, శిశువుకు అవయవ లోపాలు వచ్చే అవకాశాలు 0.5 శాతం ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో వాటిని తీసుకోకపోవడం మంచిది. సౌందర్య సాధనాలు కూడా వీలైనంత వరకు ప్రకృతి సహజమైన ఉత్పత్తులు, ఆర్గానిక్ ఉత్పత్తులు వాడుకోవడం మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
నేనొక భయానికి లోనవుతున్నాను
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ని. ఇప్పుడు నేనొక భయానికి లోనవుతున్నాను. మనశ్శాంతి కోల్పోతున్నాను. మా బంధువుల్లో ఒకరికి గర్భంలోనే బిడ్డ చనిపోయింది. నాకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనే భయానికి గురవుతున్నాను. ‘స్టిల్బర్త్’కు ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ముందస్తు నివారణ మార్గాలు ఉంటే దయచేసి చెప్పండి. – బి. సంగీత, జగిత్యాల ఏడోనెల వచ్చిన తర్వాత నుంచి కడుపులోని బిడ్డ చనిపోవడాన్ని లేదా కాన్పు సమయంలో చనిపోవడాన్ని స్టిల్ బర్త్ అంటారు. స్టిల్బర్త్కి... కొన్ని తెలిసిన, ఎన్నో తెలియని కారణాలు ఉంటాయి. తల్లిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్స్, జ్వరం, తీవ్ర రక్తహీనత, షుగర్, బీపీ ఎక్కువగా ఉండటం, కిడ్నీ, లివర్, గుండె సంబంధిత దీర్ఘకాలిక సమస్యలు, అదుపులో లేని థైరాయిడ్, రక్తం గూడుకట్టడంలో సమస్యలు, తల్లి నుంచి బిడ్డకి రక్త సరఫరాలో సమస్యలు వంటి ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల స్టిల్బర్త్ అవ్వవచ్చు. అలాగే బిడ్డలో జన్యుపరమైన సమస్యలు, అవయవాల్లో లోపాలు, బిడ్డ సరిగా పెరగకపోవడం, బిడ్డలో తీవ్రమైన ఇన్ఫెక్షన్స్, గర్భంలో మాయ విడిపడిపోవడం (Abruption), కార్డ్ ప్రొలాప్స్ (బిడ్డ కంటే ముందు బొడ్డుతాడు బయటికి రావడం), బొడ్డుతాడు ముడిపడటం, మెడ చుట్టూ బిగుసుకుపోవడం, ఉమ్మనీరు బాగా తగ్గిపోయి బిడ్డకు ఊపిరాడకపోవడం, కాన్పు సమయంలో బిడ్డపై ఒత్తిడి, ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల స్టిల్ బర్త్ జరుగుతుంది. తల్లిలో అధిక బరువు, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి లక్షణాలు ఉంటే కూడా స్టిల్బర్త్ జరగవచ్చు. కొందరిలో అంతా బాగుండి కూడా.. తెలియని కారణాల వల్ల ఉన్నట్లుండి బిడ్డ కడుపులోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. గర్భం దాల్చినప్పటి నుంచి డాక్టర్ దగ్గర సక్రమంగా చెకప్లు చేయించుకోవడం, అవసరమైన రక్త పరీక్షలు, బీపీ, స్కానింగ్లు చేయించుకుంటూ డాక్టర్ రాసిన మందులు వేసుకుంటూ వారి సలహాలను పాటించడం మంచిది. గర్భిణీ స్త్రీలు ఎడమవైపుకి తిరిగి పడుకోవడం మంచిది. దీనివల్ల బిడ్డకు రక్తసరఫరా బాగా ఉంటుంది. ఏడోనెల తర్వాత బిడ్డ కదలికలు గమనించుకుంటూ ఉండాలి. అవి బాగా తగ్గినట్లు అనిపిస్తే డాక్టర్ని సంప్రదించడం మంచిది. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి ఇతర సమస్యలు ఉన్నప్పుడు దానికి తగ్గ చికిత్స, సూచనలు తప్పకుండా పాటించడం మంచిది. ఒక్కొక్కసారి ఎన్ని జాగ్రత్తలు, సూచనలు, చెకప్లు చేయించుకున్నా కొందరిలో ఉన్నట్లుండి స్టిల్బర్త్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటికి ముందస్తు పరీక్షలు ఏమీ ఉండవు. దీనికోసం భయపడి ఆందోళన చెందడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. గర్భంతో ఉన్నప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా, సంతోషంగా గడపడం ముఖ్యం. Menstrual Hygiene అనే మాట చాలాసార్లు విన్నాను. దీని గురించి కాస్త వివరంగా తెలియజేయగలరు. న్యాప్కిన్స్ అవసరం లేకుండా పీరియడ్స్ను మేనేజ్ చేయడానికి పంజాబ్లో అండర్వేర్లు వచ్చాయని చదివాను. వీటివల్ల నిజంగానే ఉపయోగం ఉంటుందా? – డి.శైలు, టెక్కలి పీరియడ్స్ సమయంలో శారీరక శుభ్రత, జననేంద్రియాల శుభ్రత చాలా ముఖ్యం. దీన్నే Menstrual Hygiene అంటారు. పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ బయటకు వచ్చి చాలాసేపు జననేంద్రియాల దగ్గర ఉన్నప్పుడు, ఆ చెమ్మలో బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా ఇన్ఫెక్షన్ గర్భాశయానికి పాకే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి న్యాప్కిన్స్ తరచూ మార్చుకుంటూ ఉండాలి. రోజూ స్నానం చేయాలి. జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవాలి. న్యాప్కిన్స్ కాకుండా శుభ్రంగా లేని బట్టలు లేదా ఇంకా ఇతర పద్ధతులు పాటించడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. న్యాప్కిన్స్ మార్చిన ప్రతిసారి, అలాగే మలవిసర్జన, మూత్ర విసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ సమయంలో కొద్దిగా నీరసంగా ఉంటుంది కాబట్టి పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో న్యాప్కిన్స్ వాడే అవసరం లేకుండా డైరెక్ట్గా పీరియడ్ అండర్వేర్స్ అని మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇందులో అండర్వేర్లకి కింది భాగంలో వెదురు నుంచి తయారు చేసిన బట్టను చాలా పొరలుగా దళసరిగా కుట్టడం జరుగుతుంది. ఇది బ్లీడింగ్ను పీల్చుకుంటుంది. వివిధ రకాల సైజుల్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఆన్లైన్లోనూ దొరుకుతున్నాయి. పీరియడ్స్ అండర్వేర్స్ కూడా పీల్చుకునే చెమ్మనుబట్టి సైజుల వారీగా దొరుకుతాయి. వీటిని మంచినీటిలో సోపుతో బాగా శుభ్రపరిచి, గాలికి ఆరవేసి, మళ్లీ వాడుకోవచ్చు. ఇవి వందశాతం సురక్షితం అని చెప్పలేము, కాకపోతే మనం వాటిని జాగ్రత్తగా శుభ్రపరిచే విధానాన్నిబట్టి ఉంటుంది. పీరియడ్స్ ఎప్పుడు సరిగా మొదలవుతుందో తెలియక ఆందోళన పడుతున్నవారికి, ప్రతిరోజు అవసరం లేకుండా న్యాప్కిన్ పెట్టుకొని పనికి వెళ్లేవారికి ఆ రోజుల్లో వాడటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఉన్నట్లుండి బ్లీడింగ్ మొదలైనా కూడా టెన్షన్, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ∙చైల్డ్హుడ్ క్యాన్సర్ సర్వైవర్లు భవిష్యత్లో గర్భం దాల్చినప్పుడు... గుండెకు సంబంధించిన రుగ్మతలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నా ఫ్రెండ్ ఎక్కడో చదివి చెప్పింది. ఇది ఎంత వరకు నిజం? దీని గురించి వివరంగా తెలియజేయగలరు.– కె.ప్రభ, హైదరాబాద్ చిన్నప్పుడు క్యాన్సర్ వచ్చి చికిత్స తీసుకున్న వాళ్లు భవిష్యత్లో గర్భం దాల్చినప్పుడు క్యాన్సర్ ఏ అవయవానికి వచ్చిందనే దాన్నిబట్టి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్కి ఇచ్చే రేడియోథెరపీ వల్ల కొందరిలో గర్భాశయ కండరాలకు రక్త ప్రసరణ తగ్గడం జరుగుతుంది. దాని వల్ల అబార్షన్లు, బిడ్డ ఎక్కువ బరువు పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పులు జరగటం, సాధారణ కాన్పు అవ్వడానికి ఇబ్బందులు ఉండవచ్చు. క్యాన్సర్కి కీమోథెరపీ ఇవ్వడంవల్ల రక్తహీనత, నడుము నొప్పి వంటి సమస్యలు ఏర్పడవచ్చు. కిడ్నీ క్యాన్సర్కి చికిత్స తీసుకున్నవాళ్లు గర్భం దాల్చిన తర్వాత బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. పాంక్రియాస్ క్యాన్సర్కి చికిత్స తీసుకున్న వారికి గర్భం దాల్చిన తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కీమోథెరపీలో వాడే మందులవల్ల గుండెలోని కండరాలు దెబ్బతిని బలహీనపడతాయి. దానివల్ల గర్భం దాల్చిన తర్వాత బలహీనబడిన గుండెపైన భారంపడి, గుండె పనితీరులో లోపాలు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఛాతీ, పొట్ట క్యాన్సర్లకు ఇచ్చే రేడియోథెరపీ వల్ల కూడా గర్భం దాల్చిన తర్వాత గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ ,హైదరాబాద్ -
ప్రెగ్నెంట్ని... కానీ...
నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. అయితే ఈ మధ్య నా ఎడమ చేయి బెణికింది. పెయిన్ కిల్లర్స్ వాడొద్దని చెబుతున్నారు. ఒకవేళ చేయికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే గర్భిణులు సర్జరీ చేయించుకోవచ్చా? – జి.శోభన, ములుగు గర్భిణీ స్త్రీలు సర్జరీ చేయించుకోవచ్చు. కాకపోతే సర్జరీకి సంబంధించి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఎన్ని నెలల గర్భిణీ? మత్తు ఎలా ఇవ్వాలి? సర్జరీ తప్పనిసరిగా వెంటనే చేయాలా లేదా కొద్ది రోజుల తర్వాత చేయించుకోవచ్చా? అనే రకరకాల అంశాలను విశ్లేషించి, ఎంతవరకు రిస్క్ అనేది అంచనా వేయడం జరుగుతుంది. మొదటి మూడు నెలల్లో పిండం పెరిగి అవయవాలు ఏర్పడటం జరుగుతుంది. ఈ సమయంలో మత్తు ఎలా ఇస్తున్నారనేది కూడా చాలా ముఖ్యం. కేవలం చేతి వరకే మత్తు ఇవ్వడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. పూర్తిగా మత్తు ఇవ్వడం జరిగితే, మత్తుకి ఇచ్చే కొన్ని రకాల మందుల వల్ల, వాటి మోతాదునుబట్టి కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు కొద్దిగా ఉండొచ్చు. చేతికి ఆపరేషన్ కాబట్టి పెద్దగా సమస్య కాకపోవచ్చు. నాలుగో నెల తర్వాత ఆపరేషన్ అయితే చాలావరకు సమస్య ఉండదు. కాకపోతే నొప్పికి నొప్పి నివారణ మాత్రలు వాడటం మంచిది కాదు. నొప్పి ఎక్కువగా ఉంటే, కొద్దిగా వేడినీళ్ల కాపడం లేదా ఐస్క్యూబ్స్ పెట్టుకోవచ్చు. అయితే పారాసెటమాల్ మాత్రలు వేసుకోవచ్చు. మీ చెయ్యి బెణికింది అంటున్నారు కాబట్టి కట్టు కట్టించుకుంటే సరిపోవచ్చు. ‘12 వీక్ ప్రెగ్నెన్సీ రూల్’ గురించి విన్నాను. అంటే ఏంటో తెలుసుకోవాలని ఉంది. గర్భిణులకు ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందో దయచేసి వివరంగా తెలియజేయగలరు.– కె.రజిని, ఏలూరు గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా ముఖ్యం. ఈ సమయంలో పిండం ఏర్పడి గర్భాశయంలో మెల్లగా పెరుగుతూ శిశువుగా మారుతుంది. ఈ సమయంలో వందలో పదిహేను శాతం మందికి అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇందులో అరవై శాతం వరకు జన్యుపరమైన సమస్యల వల్ల అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. మిగతావి హార్మోన్ల లోపాలు, ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల మొదటి మూడు నెలల్లో అబార్షన్లు అవుతుంటాయి. పన్నెండు వారాలకు పిండం పెరుగుతూ చిన్న కాళ్లు, చేతులు, తల, శరీరం ఏర్పడి శిశువుగా రూపాంతరం చెందుతుంది. కొన్ని రకాల పెద్ద అవయవ లోపాలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు డబుల్ మార్కర్ పరీక్ష ద్వారా పన్నెండు వారాలకు కొంతమందిలో బయటపడతాయి. అందుకే చాలామంది గర్భం దాల్చినా కానీ మొదటి మూడు నెలల వరకు బయటకు చెప్పకుండా ఆగుతారు. దీన్నే 12 వీక్ ప్రెగ్నెన్సీ రూల్ అంటారు. మూడు నెలలు దాటిన తర్వాత పిండం ఎదుగుదల కొద్దిగా త్వరగా జరుగుతుంది. అంతా బాగుందని నిర్ధారణ అయిన తర్వాతే చాలామంది, గర్భం దాల్చిన విషయాన్ని అందరికీ చెబుతుంటారు. ‘పీరియడ్ పావర్టీ’, ‘పీరియడ్ సెక్స్’ అనే మాటల గురించి ఈ మధ్య విన్నాను. వీటి గురించి తెలియజేయగలరు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. చేపల కూర తినడం అంటే చాలా ఇష్టం. అవి తినేటప్పుడు ఒకవేళ ముళ్లు పొరపాటున కడుపులోకి వెళితే బిడ్డకు ప్రమాదం అని అందరూ చెబుతున్నారు. నాకేమో తినాలని ఉంది. ఇప్పుడు నేను చేపల కూరతో భోజనం చేయవచ్చా? – శ్రీలక్ష్మీ, ఐనాపురం ప్రపంచంలో చాలామంది ఆడపిల్లలు, మహిళలకు పీరియడ్ సమయంలో ప్రతి నెలా నాప్కిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడం వల్ల వచ్చే పరిస్థితిని పీరియడ్ పావర్టీ అంటారు. నాప్కిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక కొందరు వాడేసిన బట్టలు, సరిగా ఉతకని బట్టలు వాడటం జరుగుతుంది. దీనివల్ల వాళ్లకి అనవసరమైన ఇన్ఫెక్షన్స్, ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది ఆ సమయంలో తినడానికి ఖర్చు చేసే డబ్బును, తిండి సరిగా తినకుండా నాప్కిన్స్ కొనడానికి వాడుతుంటారు.పీరియడ్ సమయంలో సెక్స్ చేయడాన్ని పీరియడ్ సెక్స్ అంటారు. దీనివల్ల కొన్ని లాభాలు, కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్స్ అనే పదార్థాల వల్ల పీరియడ్ నొప్పి ఎక్కువగా ఉండేవాళ్లకి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కొందరిలో గర్భాశయ ద్వారం కొద్దిగా తెరుచుకుని బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో కలవడం వల్ల ఇన్ఫెక్షన్స్ మొదటగా గర్భాశయం తద్వారా పొత్తికడుపులోకి పాకే అవకాశాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు చేపలు తినేటప్పుడు పొరపాటున ముల్లును మింగడం వల్ల గొంతులో ఇరుక్కుంటే తల్లికి ఇబ్బంది ఉంటుంది. గొంతులో ఇరుక్కోకుండా కడుపులోకి వెళ్తే, అక్కడి నుంచి పేగులోకి వెళ్లి, అది చిన్న ముక్కలుగా మారి మలం ద్వారా వెళ్లిపోతుంది. దీనివల్ల కడుపులో (గర్భాశయంలో)ని బిడ్డకు ఎటువంటి హాని ఉండదు. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బోహైదర్నగర్ హైదరాబాద్98853 46146,91009 49319 -
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
నా వయసు 24. నాకు ఫాస్ట్ఫుడ్ అంటే బాగా ఇష్టం. రోజూ తింటుంటాను. ఫాస్ట్ఫుడ్కు అలవాటు పడిన వాళ్లు గర్భం దాల్చడానికి ఆలస్యం అవుతుందని మా బంధువులలో ఒకరంటే, ‘భయపెట్టడానికి అలా అంటుంది’ అనుకున్నాను. కానీ మొన్న ఒక వార్త చదివిన తరువాత ఆమె చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. మాకు పెళ్లై రెండేళ్లు అవుతోంది. ఇంకా ప్రెగ్నెంట్ని కాలేదు. నా ఫాస్ట్ఫుడ్ అలవాటే దానికి కారణమా? అలాగే ప్రెగ్నెంట్ అయ్యాక ఫాస్ట్ఫుడ్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్లాంటివి ఏమైనా ఉంటాయా? – రంజని, గుంటూరు ఫాస్ట్ఫుడ్లో కార్బోహైడ్రేట్లు, నూనె, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు ఎక్కువగా పెరగటం జరుగుతుంది. బరువు పెరగటం వల్ల ఆడవారిలో హార్మన్లలో మార్పులు ఏర్పడటం, దానివల్ల పీరియడ్స్ క్రమం తప్పటం, అండం సరిగా విడుదల కాకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే అధిక బరువు వల్ల థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్లలో మార్పులు, కొందరిలో శరీర తత్వాన్నిబట్టి అండాశయాల్లో నీటి బుడగలు ఏర్పడటం వంటి ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. ఫాస్ట్ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భిణీలలో అజీర్తి, ఎసిడిటీ, బరువు ఎక్కువగా పెరగటం వల్ల షుగర్ శాతం పెరిగి జెస్టేషనల్ డయాబెటిస్, బీపీ పెరగటం, ఆయాసం.. కొందరిలో బిడ్డ ఎక్కువ బరువు పెరగవచ్చు, మరికొందరిలో బిడ్డ తక్కువ బరువు పెరగే అవకాశాలు ఉంటాయి. కాన్పు సమయంలో ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నా వయసు 28 సంవత్సరాలు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. నాకు ఆస్తమా ఉంది. దాంతో చాలామంది ప్రీటర్మ్ డెలివరీ, లో బర్త్ వెయిట్.. మొదలైన సమస్యలు వస్తాయంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. ఇది ఎంత వరకు నిజం? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? ప్రస్తుతం నేను ఆస్తమా గురించి వాడుతున్న మందుల వల్ల బిడ్డకేమైనా ప్రమాదం ఉంటుందా? దయచేసి తెలియజేయగలరు. – జి.అంజలి, శ్రీకాకుళం ఆస్తమా ఉండి గర్భం దాల్చినప్పుడు 30 శాతం మందిలో ఆస్తమా తగ్గుతుంది. అలాగే 35 శాతం మందిలో ఆస్తమా తీవ్రత పెరుగుతుంది. మరో 35 శాతం మందిలో ఆస్తమా తీవ్రత అంతే ఉంటుంది. ప్రెగ్నెన్సీలో జరిగే హార్మోన్ల మార్పులు, శరీరంలో మార్పుల వల్ల ఆస్తమా తీవ్రత ఉంటుంది. ఆస్తమాలో ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు, శ్వాస నాళాలు వాయడం వల్ల కొద్దిగా మూసుకుపోతాయి. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మిగతా అవయవాలకు అలాగే కడుపులోని శిశువుకు ఆక్సిజన్ సరఫరా తగ్గడం జరుగుతుంది. గర్భిణీ సమయంలో ఎక్కువసార్లు ఆస్తమా రావడం వల్ల కడుపులోని బిడ్డ ఎక్కువ బరువు పెరగలేకపోవడం, నెలలు నిండకుండానే కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తమాకి వాడే కొన్ని రకాల మందులు, వాటి మోతాదునిబట్టి కూడా శిశువుపై దుష్ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆస్తమా ఉన్నవాళ్లు గర్భం దాల్చకముందే డాక్టర్ని సంప్రదించి జాగ్రత్తలు పాటించాలి. గర్భం దాల్చిన తర్వాత, ఆస్తమాని ప్రేరేపించే వస్తువులకు, తిండి పదార్థాలకు, చల్లని ప్రదేశాలకు, దుమ్ముధూళి వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఆస్తమాకు ఇన్హెలర్స్ వాడొచ్చు. వాటిలో వాడే మందులు డాక్టర్ పర్యవేక్షణలో వీలైనంత తక్కువ మోతాదులో శిశువుకు ఇబ్బంది లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. నా వయసు 26. సంవత్సరం క్రితం నాకు పెళ్లయింది. తర్వాత ఐదు నెలలకు నా కడుపులో గడ్డ ఉందని తెలిసింది. ఆపరేషన్ చేసి దాన్ని తీసేశారు. అయితే ఆపరేషన్కి ముందు ఒకసారి నా జననాంగం వద్ద చిన్న చిన్న పింపుల్స్లాగా వచ్చాయి. తర్వాత వాటంతటవే తగ్గిపోయాయి. కానీ గత రెండు నెలలుగా పీరియడ్కి ముందు అలాంటి పింపుల్సే వస్తున్నాయి. పీరియడ్ అయిపోయాక తగ్గిపోతున్నాయి. ఎందుకిలా అవుతోంది? వివరంగా తెలియజేయగలరు. – ప్రగతి, కూకట్పల్లి కొంతమంది ఆడవారిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జననాంగం వద్ద చిన్న చిన్న గుల్లల్లాగా రావచ్చు, లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల చిన్న నీటి గుల్లల్లాగానూ రావచ్చు. ఇవి రక్తహీనత, వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్నా మాటిమాటికీ రావచ్చు. పీరియడ్స్ ముందు శరీరంలోని హార్మోన్స్లో మార్పుల వల్ల కొందరిలో ఆ సమయంలో జననాంగం వద్ద ఇన్ఫెక్షన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొందరిలో కలయిక వల్ల భర్తలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, అది భార్యకు సోకే అవకాశం ఉంది. జననాంగాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, అక్కడ ఉన్న వెంట్రుకలు రెగ్యులర్గా తొలగించుకోకపోవడం వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. - డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
చింతల చిరునవ్వులు
ఇప్పటి వరకు స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలు మాట్లాడకుండానే శతాబ్దాలు గడిచిపోయాయి. అలా మాట్లాడకుండా, చర్చించకుండా గుట్టుగా, రహస్యంగా ఉండిపోయిన విషయాల్లో స్త్రీలకు నడివయస్సుతోపాటే నడిచొచ్చే మెనోపాజ్ దశ కూడా ఒకటి. తెల్లవారగానే కుండీల్లో బీర పాదుకి పూచిన పూలను లెక్కేయడం, అరటి చెట్టు మొదళ్లలో పిలకలను ప్రతిరోజూ కొత్తగా తడిమి చూడటం, కిటికీ పక్కన పెద్దకుండీలో మల్లెతీగకి వేసిన చిన్ని మొగ్గలను చూసి కూడా చిన్నపిల్లలా గంతులేయడం, నేను చూడాలనుకుని పెట్టుకున్న ఇంగ్లిష్ సినిమాని ఓ చేత్తో గరిట తిప్పుతూనే, నాతోపాటు హాల్లోకొచ్చి ఏ సీన్నీ మిస్ అవకుండా ఆసాంతం చూసిందాకా వదలకపోవడం.. అమ్మను చూసినప్పుడల్లా చిన్నపిల్ల తనా? నేనా? అనే అనుమానం కలిగేది. ఓ రోజు అడిగాను! అమ్మ ప్రతి ఆనందాన్ని ఆస్వాదిస్తూ పెరిగిన నేను ఇప్పుడు హఠాత్తుగా ఆమెలో కనిపిస్తున్న మార్పుని జీర్ణించుకోలేకపోతున్నాను. రెహ్మాన్ సంగీతం, చలం పుస్తకం, బ్లాక్ అండ్ వైట్ సినిమా ఏదీ ఆమె దృష్టిని కట్టిపడేయలేకపోతోంది. ఏదో తెలియని చిరాకు, ఉన్నట్టుండి ఒళ్లంతా మంటలు అంటుంది, అమ్మ మొహం పైన చిరుచెమటని కూడా చూసి ఎరుగను నేను. అలాంటిది శీతాకాలంలో సైతం తను నిలువెల్లా చెమటతో తడిసిపోవడం నాకాశ్చర్యంగా అనిపించింది. నిద్రలేని రాత్రులతో కళ్ల కింద చారలు అమ్మలో జీవకళనే మాయం చేశాయి. ఓ రోజు మెల్లిగా అడిగాను అమ్మని! అలా చిరాగ్గా ఉంటున్నావేంటమ్మా అని. ఆఫీసులో ఏదైనా ఇబ్బందా? అని కూడా అడిగాను. తల అడ్డంగా ఊపింది అమ్మ. చూసి చూసి ఓ రోజు కాలేజీ నుంచి రాగానే డాక్టరు దగ్గరికెళదామని ఒత్తిడి చేశాను. నా గోల భరించలేక ఆసుపత్రికి వచ్చింది. అప్పుడు బయటపడింది.. అమ్మ ఆందోళనకి మెడికల్ నేమ్ ‘మెనోపాజ్’!! అంత సింపులేం కాదు అదంత పట్టించుకోవాల్సిందేమీ కాదనీ, 45 ఏళ్లు దాటిన అమ్మ ప్రస్తుతం మోనోపాజ్ దశలో ఉందనీ, పీరియడ్స్ ఆగిపోయే దశలో శరీరంలో వచ్చే ఈ మార్పులనే మోనోపాజ్ అంటారనీ డాక్టర్గారు చాలా సింపుల్గా తేల్చేశారు. కానీ అసలు సమస్య అది కాదు. ఇప్పటి వరకు స్త్రీలకు సంబంధించిన అనేక విషయాలు మాట్లాడకుండానే శతాబ్దాలు గడిచిపోయాయి. అలా మాట్లాడకుండా, చర్చించకుండా గుట్టుగా, రహస్యంగా ఉండిపోయిన విషయాల్లో స్త్రీలకు నడివయస్సుతోపాటే నడిచొచ్చే మెనోపాజ్ దశ ఒకటి. నిజానికి అది కొంత శారీరక సమస్యే అయినప్పటికీ అంతకన్నా ఎక్కువగా మనస్సుకి సంబంధించిన విషయం. అది ఒక్కొక్కరిలో ఒక్కోరకమైన శారీరక మార్పులకు కారణం అవుతుంది. ఎంతో మానసిక అశాంతికీ గురిచేస్తుంది. అయితే ఎవరికి వారు దీన్ని చర్చకు అనర్హమైన విషయంగా భావించడం బాధాకరమైన విషయం అని అంటున్నారు రేచల్ వియస్. ‘డెత్ కేఫ్’లా మెనోపాజ్ కేఫ్ మెనోపాజ్పై ఇటీవల కొంత చర్చ జరుగుతున్నా యేడాది క్రితం మొదటిసారి బ్రిటన్లో స్త్రీల మెనోపాజ్ని అర్థం చేసుకొనేందుకు సరికొత్త విధానాన్ని అవలంబించారు. ఒంటరిగా కాకుండా సామూహికంగా ఎదుర్కొనేందుకు ఓ వేదికను ఏర్పాటు చేశారు. అదే మెనోపాజ్ కేఫ్. ఒక్కొక్కరుగా కాక, తనలాంటి ఎంతో మందితో కలిసి ఒక సమూహంగా సమస్యని అధిగమించాలనుకున్నారు. అందులో భాగంగానే 2017లో స్కాట్లాండ్లోని పెర్త్ అనే ప్రాంతంలో రేచెల్ వియస్ అనే మహిళ ఈ మెనోపాజ్ కేఫ్ని ప్రారంభించారు. డెత్ కేఫ్ (మరణాన్ని గురించి నిర్భయంగా మాట్లాడుకునే కేఫ్) మోడల్ క్రిస్టీవార్క్స్ తీసిన ‘మెనోపాజ్ అండ్ మి’ అనే బీబీసీ డాక్యుమెంటరీతో స్ఫూర్తి పొందిన రేచల్తో పాటు గెయిల్ జాక్, లోర్నా ఫాథరింఘమ్ తదితరులు స్కాట్లాండ్లోని పెర్త్లో తొలిసారిగా మెనోపాజ్ కేఫ్ని ఏర్పాటు చేశారు. సాయంసంధ్యలో సెలబ్రేషన్ ఓ మంచి కాఫీని సిప్ చేస్తూనో, ఇష్టమైన చాక్లెట్ కేక్ని తింటూనో నడివయస్సులో కలిగే ఈ మార్పులను గురించి మెనోపాజ్ కేఫ్లో చర్చించొచ్చు. అక్కడికొచ్చేవాళ్లంతా ఆ విషయాన్ని గురించే మాట్లాడ్డానికి వస్తారు. మధ్య వయస్సులో వచ్చే మతిమరుపుకి కూడా కారణమయ్యే ఈ మెనోపాజ్ ఎన్నెన్ని రకాలో, వాటి పర్యవసానాలేమిటో, వాటిని ఎట్లా అధిగమించవచ్చో అక్కడ చర్చిస్తారు. కానీ ఈ కేఫ్కి వచ్చేవాళ్లంతా ఒక్క నిబంధన మాత్రం తప్పనిసరిగా పాటించాలి. అదే... వ్యక్తిగత సమాచార గోప్యత. ఆ గోప్యతని పాటిస్తూనే తమ సమస్యని బహిరంగంగా చర్చించి అధిగమిస్తోన్న యూకే స్త్రీలంతా ఇప్పుడు మేం ఒంటరి వాళ్లం కాదని సగర్వంగా ప్రకటించుకొంటున్నారు. శనివారం సాయంసంధ్యని మెనోపాజ్పై లెక్చర్లతో ఫ్లష్ ఫెస్ట్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. – అత్తలూరి అరుణ -
పీరియడ్స్ టైమ్లో ఎందుకీ సమస్య?
నా వయసు 37 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆయాసంగా ఉంటుంది. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? నా సమస్య ఏమిటన్నది దయచేసి వివరంగా చెప్పండి. – కె. పారిజాత, పాయకరావుపేట మీకు ఉన్న సమస్యను కెటామెనియల్ ఆస్తమా అని చెప్పవచ్చు. కెటామెనియల్ ఆస్తమా అనే దాన్ని రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం కొంతమంది మహిళల్లో కనిపించిన దాఖలాలు ఉన్నాయి. పీరియడ్స్కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. అయితే అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్కు ముందు ఇవేపాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. దాంతో ఆస్తమా పెచ్చరిల్లుతుంది. రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమా కండిషన్ను ప్రేరేపిస్తాయి. అందుకే... రుతుక్రమానికి ముందుగా వచ్చే ఆస్తమా విషయంలో దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. చాలామంది రోగులు ల్యూటియల్ దశగా పేర్కొనే అండం ఆవిర్భవించే దశ నుంచి అది ఫలదీకరణ చెందనందువల్ల రుతుసమయంలో పడిపోయే సమయంలో వచ్చే ఆస్తమాకు గాను, మామూలుగా ఆస్తమాకు వాడే మందులనే అత్యధిక మోతాదుల్లో ఇస్తే ఉపశమనం పొందుతారు. ఇక మిగతావారిలో కండలోకి ప్రోజెస్టెరాన్ ఇంజెక్షన్ ఇస్తే... కాస్త మెరుగవుతారు. కాబట్టి మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికే చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకని మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్ను కలవండి. ఇది ఏ రకం టీబీ? పల్మునాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారికి మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉన్నాయి. మొదట్లో ఆయనకు పల్మునరీ ట్యూబర్క్యులోసిస్ అనే జబ్బు వచ్చింది. అయితే ఆయన చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్డీఆర్ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. మాకు తగిన సలహా ఇవ్వగలరు. – సోమేశ్, కందుకూరు ఎమ్డీఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అర్థం. అంటే తొలిదశ మందులకు లొంగని రకానికి చెందిన టీబీ అని చెప్పవచ్చు. మొదట మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్ బాసిల్లస్) ప్రవేశించినప్పుడు కొన్ని శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిన్ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అంతేగాని ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా, లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి. దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి. ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యింది. ఈ పరీక్షల్లో మాలెక్యులార్ బేస్డ్ అనీ, కల్చర్ బేస్డ్ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్ బెస్డ్ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా ఒక టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) వాడటం మందుపెట్టాలి. ఇందులో నాలుగు లేదా అంతకుమంచి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్ల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 – 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చుకూడా. ఈ రెండేశ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండేశ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
ఆ సమస్యతో గర్భస్రావమా?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ని. నాకు రక్తహీనత సమస్య ఉంది. రక్తహీనత సమస్య ఉన్నవాళ్లకు గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విన్నాను. ఇది ఎంత వరకు నిజం? – బి.ఎల్, నర్సరావుపేట రక్తహీనత అంటే రక్తంలో హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తక్కువ ఉండటం. మనం తినే ఆహారం జీర్ణమై, దాని నుంచి విడుదలయ్యే పదార్థాలను, ఆక్సిజన్ను ఈ హిమోగ్లోబిన్, రక్తంలోని అన్ని కణాలకు, అవయవాలకు చేరవేస్తుంది. దాని వల్ల శరీరంలో జరిగే అన్ని జీవక్రియలు సరిగా జరుగుతాయి. గర్భిణీలలో తల్లి నుంచి కడుపులోని శిశువుకు రక్తం ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా అవుతాయి. గర్భిణీలలో రక్తహీనత ఉన్నప్పుడు బిడ్డకు ఆక్సిజన్, పోషక పదార్థాల సరఫరా తగ్గే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల తల్లిలో ఇన్ఫెక్షన్స్, నెలలు నిండకుండా కాన్పులు, కాన్పు తర్వాత కూడా సమస్యలు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ సమస్యలు రక్తహీనత తీవ్రతనుబట్టి ఉంటాయి. రక్తహీనత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు పైన చెప్పిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కేవలం రక్తహీనత వల్ల అబార్షన్లు అవ్వవు. రక్తహీనత బాగా తీవ్రంగా ఉన్నవారిలో ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్ వంటి బయటికి కనిపించని ఇతర సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కలిసినప్పుడు వీరిలో కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత కొద్దిగా ఉండేవాళ్లు దాని తీవ్రతను బట్టి ఐరన్ ట్యాబ్లెట్స్, పౌష్టికాహారంతో పాటు అవసరమైన పరీక్షలు చేయించుకొని, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో వేసవి కాలంలో తీసుకోవాల్సిన స్కిన్ కేర్ టిప్స్ తెలియజేయగలరు. మా బంధువుల అమ్మాయి ఒకరికి అనీమియా సమస్య ఉందని విన్నాను. ఇది గర్భిణీలకు ఎందుకు వస్తుంది? – పి. రేఖ, రామన్నపేట వేసవి కాలం ప్రెగ్నెన్సీ సమయంలో.. ఎండల వల్ల శరీరంలో నీరు తగ్గడం, ఎక్కువగా చెమట పట్టడం, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో శరీరంలో చెమ్మ తగ్గి చెమట పొక్కులు, దురద, మంట, చిరాకు వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. ఈ సమయంలో మంచి నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ, రాగి జావ వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో తేమ తగ్గకుండా ఉంటుంది. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలాగే గొడుగును తీసుకెళ్లడం కూడా మంచిది. గర్భిణీలలో రక్తంలో నీటి శాతం పెరగడం, పెరిగే బిడ్డ అవసరాలకు, తల్లి శరీరంలో మార్పులకు సంబంధించి హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. దీనివల్ల గర్భిణీలలో అనీమియా ఎక్కువగా కనిపిస్తుంది. గర్భంలో శిశువు పెరుగుదలకు, తల్లి రక్తం నుంచి బిడ్డ ఆహారం, ఐరన్ వంటివి తీసుకోవడం వల్ల, తల్లిలో రక్తం తగ్గుతుంది. గర్భిణీలలో తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోవడం, ఆహారంలో ఉన్న ఐరన్, విటమిన్స్, మినరల్స్ సరిగా రక్తంలోకి చేరకపోవడం వల్ల కూడా వీరిలో అనీమియా వస్తుంది. గతంలో నాకు చక్కగా నిద్ర పట్టేది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మాత్రం నిద్ర పట్టడం చాలా కష్టం అవుతోంది. మా ఫ్రెండ్ ఒకరు ‘ప్రెగ్నెన్సీ ఇన్సోమ్నియా’ కావచ్చు అన్నారు. ఇది నిజమేనా? దీని గురించి తెలియజేయగలరు. ‘ప్రెగ్నెన్సీ ఇన్సోమ్నియా’ నివారణకు ఏమైనా మందులు ఉన్నాయా? చెప్పగలరు. – యస్. లావణ్య, కొత్తగూడెం గర్భిణీ సమయంలో అనేక కారణాల వల్ల నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి ఇబ్బంది ఎదురవుతుంది. దీన్నే ప్రెగ్నెన్సీ ఇన్సోమ్నియా అంటారు. గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. వీటిలో హార్మోన్ల మార్పులు, నడుమునొప్పి, అసిడిటీ, అజీర్తి వంటివి వస్తాయి. పొట్ట పెరిగే కొద్దీ ఇబ్బంది, ఆందోళన, భయం, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లవలసి రావడం, కాళ్లనొప్పులు వంటి అనేక కారణాల వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర సరిగా పట్టకపోవడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలు నిద్ర పట్టడానికి మందులు వాడటం మంచిది కాదు. వీరు నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలు పాటించడం శ్రేయస్కరం. రాత్రిపూట తొందరగా భోజనం చేసి, కొంతసేపు అటూఇటూ నడవాలి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగాలి. నీళ్లు ఎక్కువగా పగటి పూట తీసుకొని, రాత్రి తక్కువగా తీసుకోవడం వల్ల రాత్రిపూట మూత్రం కోసం నిద్ర లేవడం తగ్గుతుంది. కాళ్ల కింద, నడుము కింద, పొట్ట కింద, మోకాళ్ల మధ్యలో దిండు పెట్టుకొని పడుకోవడం, మంచి మ్యూజిక్ వినడం, మంచి పుస్తకాలు చదవడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొందరికి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. పీరియడ్ బ్లడ్ కలర్తో ఆరోగ్య లక్షణాల గురించి తెలుసుకోవచ్చని ఎక్కడో చదివాను. ఏ రంగు ఏ లక్షణాన్ని సూచిస్తుందో తెలియజేయగలరు. – రజిత, హైదరాబాద్ పీరియడ్స్ సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అలాగే వారిలోని హార్మోన్ల అసమతుల్యతని బట్టి వారి రక్తస్రావంలో రక్తంలోని రంగు ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్న వారిలో మొదటి రెండు మూడు రోజులు ముదురు ఎరుపులో, కొందరిలో చిన్న ముక్కలుగా ఉంటుంది. తర్వాత రెండు రోజులు బ్లీడింగ్ తగ్గేకొద్దీ రక్తం గడ్డకట్టి కొద్దిగా బ్రౌన్ రంగులో, ఎండోమెట్రియం పొర ఊడిపోతుంది. కొందరిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రక్తం బ్రౌన్ రంగులోకి మారి, వాసనతో ఉంటుంది. రక్తస్రావంలో బ్లీడింగ్ రంగు రోజురోజుకి మారుతుంది. మొదట నీళ్లలాగా ఎర్రగా రావచ్చు. తర్వాత రోజు ముక్కలు ముక్కలుగా రావచ్చు. ఆ తర్వాత బ్రౌన్ కలర్లో వస్తూ కొద్దికొద్దిగా తగ్గిపోవచ్చు. రక్తానికి ఎక్కువ గాలి తగలడం వల్ల అది రంగు మారుతుంది. ఎక్కువసేపు ఉన్నప్పుడు అది నల్లగానూ మారవచ్చు. బ్లీడింగ్ మరీ ఎక్కువగా అవుతూ, గడ్డలు గడ్డలుగా పోతున్నప్పుడు గర్భాశయం, అండాశయాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం డాక్టర్ని సంప్రదించడం మంచిది. రక్తం రంగు కంటే బ్లీడింగ్ ఎంత, ఎన్ని రోజులు అవుతుందనేదే ముఖ్యం. ఇది కూడా కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
అదేమైనా సమస్యా?
‘హెవీ పీరియడ్స్’ అనే మాటను ఇటీవల ఎక్కడో చదివాను. అదేమైనా సీరియస్ సమస్యనా? అది రావడానికి గల కారణాలను తెలియజేయగలరు? – పీఆర్, సూర్యాపేట సాధారణంగా పీరియడ్స్ సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి మూడు నుంచి అయిదు రోజుల వరకు బ్లీడింగ్ అవ్వడం సాధారణం. వారికి ఆ సమయంలో 10 ఎమ్ఎల్ నుంచి 35 ఎమ్ఎల్ వరకు రక్తం పోవడం జరుగుతుంది. కొందరిలో రెండు నుంచి ఏడు రోజుల వరకు మామూలుగా బ్లీడింగ్ అవ్వొచ్చు. మరికొందరిలో బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతుంది. ఇది ఏడు రోజులకంటే ఎక్కువగా హెవీ బ్లీడింగ్ అవ్వడం, బ్లీడింగ్లో 80 ఎమ్ఎల్ వరకు రక్తం పోవడాన్ని, అలాగే అయిదు రోజులు అయినా సరే అదే 80 ఎమ్ఎల్ రక్తం పోవడాన్ని ‘హెవీ పీరియడ్స్’ అంటారు. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. గర్భాశయంలో ఇన్ఫెక్షన్స్, అండాశయాల్లో గడ్డలు, సిస్ట్లు, థైరాయిడ్, హార్మోన్ అసమతుల్యత, ఇతర హార్మోన్లలో మార్పులు, కాపర్ టీ వల్ల, రక్తం గూడుకట్టే గుణంలో సమస్యలు, అరుదుగా గర్భాశయ, అండాశయ క్యాన్సర్ వంటి ఎన్నో కారణాల వల్ల హెవీ పీరియడ్స్ రావొచ్చు. ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో ఎక్కువగా బ్లీడింగై రక్తం పోవడంవల్ల రక్తహీనత ఏర్పడటం, తద్వారా బలహీనత, నీరసం, ఆయాసం, ఒళ్లు నొప్పులు, ఇన్ఫెక్షన్స్ వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత మరీ ఎక్కువగా ఉండి, అశ్రద్ధ చేస్తే అది ప్రాణాపాయస్థితికి దారి తీసే అపాయం ఉంది. కాబట్టి హెవీ పీరియడ్స్ని నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించండి. హెవీ బ్లీడింగ్కు గల కారణాలను తెలుసుకోవడానికి సీబీపీ, ప్లేట్లెట్ కౌంట్, సీటీ, బీటీ, స్కానింగ్, ప్యాప్ స్మియర్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాత సమస్యనుబట్టి చికిత్స తీసుకోవడం మంచిది. రక్తహీనత ఉంటే పౌష్టికాహారంతో పాటు ఐరన్ మాత్రలు కూడా వేసుకోవాలి. ఎండాకాలమైనా సరే వేడినీళ్లతో స్నానం చేయడం నాకు అలవాటు. ప్రెగ్నెన్సీ సమయంలో వేడినీళ్లతో స్నానం చేయడం మంచిదేనా? ‘హీట్ స్ట్రెస్’ అంటే ఏమిటి? – లహరి, కాకినాడ ప్రెగ్నెన్సీ సమయంలో వేడి నీళ్లతో స్నానం చెయ్యడంకన్నా గోరువెచ్చని నీళ్లతో చేయడం మంచిది. ఎండాకాలంలో మరీ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కొంత సమయం పాటు చెమటలు పట్టి అలసటగా అనిపిస్తుంది. దానివల్ల కడుపులో బిడ్డకు ఎటువంటి హానీ ఉండదు. ఎండలో ఎక్కువసేపు ఉండటం, పని చెయ్యడం, ఊపిరాడకుండా చేసేటటువంటి బిగుతుగా ఉండే బట్టలు ఎక్కువసేపు వేసుకొని ఉండటం, ఎక్కువగా విరామం లేకుండా శారీరక శ్రమ వంటి ఇతర పనుల వల్ల, ఒంట్లో ఉష్ణోగ్రత కంటే బయటి ఉష్టోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల కలిగే లక్షణాలను, ఇబ్బందులను ‘హీట్ స్ట్రెస్’ అంటారు. ఇందులో డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, కళ్లు తిరగటం, చెమటలు పట్టడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. నా వయసు 29 సంవత్సరాలు. మాకు ఒక బాబు. వాడికి ఒకటిన్నర ఏళ్లు. నా మొదటి కాన్పు సిజేరియన్ ద్వారా జరిగింది. అప్పట్లో కోలుకోవడానికి కాస్త టైమ్ పట్టింది. ఇప్పుడు రెండో కాన్పుకు వెళ్లాలనుకుంటున్నాం. కాన్పుకూ కాన్పుకూ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? – ఆర్. వందన, ఖమ్మం తొమ్మిది నెలల పాటు గర్భంలో పెరిగే బిడ్డ, తల్లి నుంచి పోషకాలు తీసుకోవడం వల్ల... కాన్పు తర్వాత తల్లిలో అలసట, కండరాల బలహీనత, నడుము నొప్పి, రక్తహీనత, క్యాల్షియం లోపం వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ. కాన్పు తర్వాత బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఈ ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ఈ బలహీనత నుంచి తల్లి పూర్తిగా కోలుకొని మామూలుగా అవ్వడానికి కనీసం రెండు సంవత్సరాలైనా పడుతుంది. ఇంకా పూర్తిగా కోలుకోకుండానే మళ్లీ గర్భం దాలిస్తే, బలహీనత ఇంకా ఎక్కువగా ఉండి, నడుము నొప్పులు, నీరసం, రక్తహీనత వంటి సమస్యలతో ఇబ్బందిపడాల్సి వస్తుంది. అంతేకాకుండా కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎక్కువ బరువు పెరగక పోవడం, నెలలు నిండకుండా కాన్పులు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి కాన్పు సిజేరియన్ ద్వారా జరిగితే, గర్భాశయానికి వేసే కుట్లు మాని, మళ్లీ సాధారణస్థితికి రావడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. ఇంకా తొందరగా గర్భం దాల్చితే బిడ్డ పెరిగే కొద్దీ గర్భాశయం సాగటం జరుగుతుంది. అలాగే ముందు వేసిన కుట్లు పల్చబడి, కుట్ల దగ్గర నొప్పి ఎక్కువగా రావటం, కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తే కుట్లు తెరుచుకొని గర్భాశయం పగిలి, బిడ్డకి, తల్లికి ప్రాణాపాయం ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఆపరేషన్ అయినవాళ్లకు కాన్పుకి, కాన్పుకి మధ్య మూడు సంవత్సరాలు గ్యాప్ ఉంటే తల్లికి, బిడ్డకి మంచిది. లేదంటే కనీసం రెండు సంవత్సరాలైనా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. - డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ హైదరాబాద్ -
పీసీఓడీ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా భార్య వయసు 32 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – భద్రారెడ్డి, చిత్తూరు గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో నీటిబుడగల వంటివి ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే ఈ పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వమైన అనేక అండాలు నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోతాయి. చూడటానికి ఇవి ముత్యాల్లా కనిపిస్తుంటాయి. ఇలా రెండువైపులా కనిపిస్తుంటే దీన్ని వైద్యపరిభాషలో ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగి భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. చికిత్స: హోమియోలో సరైన కాన్స్టిట్యూషన్ సిమిలియం విధానంలో హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ హైపోథైరాయిడిజమ్కు చికిత్స ఉందా? నా వయసు 36 ఏళ్లు. ఈ మధ్య నేను బరువు పెరుగుతున్నాను. పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా? – ఒక సోదరి, మిర్యాలగూడ మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హోమియో విధానంలో హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే చాలా రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్ర విసర్జన సమయంలో మంట! నా వయసు 30 ఏళ్లు. ఇటీవల మూత్రం వెంటవెంటనే వస్తోంది. అంతేకాదు విసర్జన సమయంలో చాలా మంటగానూ ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి. – కె. లలిత, కాకినాడ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. ఇవి మహిళల్లో చాలా ఎక్కువే. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. ∙అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. ∙లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లోని దాదాపు 90 శాతం కేసుల్లో ఈ సమస్యకు ప్రధానంగా కారణం ఈ–కొలై అనే బ్యాక్టీరియా. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స: హోమియోలో వ్యా«ధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి మందులను సూచిస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
నుదుటి కేక
వీడు తగిలాడు. వీడు అనే సంస్కారం కాదు తనది. కాని వీడు అనదగ్గవాడే వాడు. అసలే తన టెన్షన్లో తాను ఉంది. పిరియడ్స్ వచ్చేలా ఉన్నాయి. వస్తే ఏం చేయాలి అనేది టెన్షన్. వచ్చాయని చెప్పాలా? చెప్తే... మొన్నొక రోజు ఆ ఇంటి పెద్దకూతురు మూడురోజుల పాటు బాత్రూమ్ పక్కన ఉన్న స్థలంలో కూర్చున్నట్టు తనూ కూచోవాలా. అక్కడే తినాలా? అక్కడే నిద్రపోవాలా? పోనీ చెప్పకుండా దాచేస్తే? అది మోసం కదూ. దాచామే పో. ప్యాడ్స్ను ఎక్కడ పారేయాలి? స్నానానికి వెళ్లినప్పుడు విప్పిన బట్టల్లో దాచి, తెచ్చి, బ్యాగ్లో పెట్టుకొని బయటకు వెళ్లి పారేయాలి. ఛీ. వాసన. తన ఇంట్లో అయితే ఇలాంటి సమస్య ఉండేది కాదు. పిరియడ్స్ వచ్చినా రాకపోయినా ఒకేలాగ తిరుగుతారు. ఏసునాథా... పిరియడ్స్ రాకుండా చూడు తండ్రీ. నవ్వొచ్చింది. ఏసునాథుడు ఎందుకు చూడాలి?ఇక్కడకు వచ్చేటప్పుడు లాకెట్లోని ఏసునాథుణ్ణి తీసి ఉత్త లాకెట్ వేసుకొని వస్తుంది. ఇక్కడకు వచ్చేటప్పుడు ఎర్రటి బొట్టుబిళ్లలు పెట్టుకొని వస్తుంది. ఇక్కడకు వచ్చేటప్పుడు ‘అండీ’ ‘ఔనండీ’ ‘చాలా బాగా చెప్పారండీ’ వంటి మాటలు మూతికి తగిలించుకుని వస్తుంది. స్నేహితురాలు అలా అలవాటు చేసింది. ఆ అమ్మాయి మంచిది. తనంటే ఇష్టం. ప్రాణం. కులం ఏమిటి మతం ఏమిటి కడగొట్టుజాతి వాళ్లా కిరస్తానీలా పట్టించుకోలేదు. ఇష్టంవోయ్ నువ్వంటే అనేది. ఇంటికి తీసుకెళ్లేది– బొట్టు పెట్టాకే అనుకోండి. వాళ్ల అమ్మానాన్నలు సంప్రదాయం కలిగినవారు. పూజ, మడి, ఆచారం కలిగినవారు. అయితే ఏమిటి? ఇంతమంచి ముక్కూ ముచ్చట ఉన్న అమ్మాయి అచ్చు మనమ్మాయిలానే ఉంది అని అనేవారు.తను కూడా అలా ఉండేది.స్నేహితురాలి సమక్షంలో ఆ స్నేహితురాలే తనకు పూనినట్టుగా ఉండేది. ఆ సమయంలో రిక్షా వేసే తండ్రి చిరాగ్గా కనిపించేవాడు. తల దువ్వుకోక మాసిన చీర కట్టుకుని ఉండే అమ్మ చిరాగ్గా కనిపించేది. రోజు విడిచి రోజు నీసుకూర తెస్తే తప్ప ముద్ద దిగని తమ్ముడు, చిటికెలో మునుసును జుర్రి మూలిగని నోట్లో వేసుకునే తమ్ముడు చిరాగ్గా కనిపించేవాడు. సువార్తవాణి– అనే పేరులో సువార్తను కత్తిరించి అవతల పారేసింది. పద్యం ఇష్టం అనేది. గద్యం ప్రాణం అనేది. పెద్దనను పెదనాన్నగా గుర్తించేది. ఫ్రెండ్స్ అందరి మధ్యా– మా ఇంట్లోనా మా ఇంట్లో నీసూ గీసూ అస్తమానం వండరమ్మా... మా అమ్మ ఎంచక్కా కొబ్బరీ శనగపప్పు వంటి కూరలే చేస్తుంది తెలుసా– అని చెప్పేది. మేము చర్చికి వెళితే వెళతాం లేకపోతే లేదు అనేది. ఇంకా ఏమిటి? అసలు చర్చే ఎగ్గొట్టేది.తనకు తెలుసు. స్నేహితురాలి ఇంట్లో తను ఎంతో తానూ అంతే.కాని– ఆరోజు– అక్క బారసాలలో ఆ స్నేహితురాలు అందరు ముత్తయిదువుల కాళ్లకు పసుపు రాస్తూ ‘చీ... నీకు పసుపు రాయకూడదే. నేను నీ పాదాలు ముట్టుకోకూడదు’ అని అన్నప్పుడు ఒక్కక్షణం వెనుకంజ వేసింది. వాళ్లవీ పాదాలే. తనవీ పాదాలే. మధ్యలో మైల ఎక్కణ్ణుంచి వచ్చింది?గట్టి స్నేహం ఇద్దరిదీ.తను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయింది. తాను లెక్చరర్ అయ్యి స్పాట్ వాల్యుయేషన్ పని ఉంటే హైదరాబాద్ వచ్చి, వాళ్ల అమ్మానాన్నలు అక్కడే సెటిల్ అయి ఉన్నారు కనుక, ఆ మాత్రం స్వతంత్రం లేదా నాకు అనుకుని దిగింది. పెద్దకూతురు, అల్లుడు కూడా వాళ్లతోనే ఉంటున్నారు. ఆమె తనకు అక్క. కనుక అతడు బావ. బావా బావా అని గౌరవంగా పిలిచేది. కాని ఇప్పుడు ఇలా తగిలాడు. బజారులో. కాఫీ కోసం హొటల్కు తీసుకెళ్లి ఏమిటేమిటో మాట్లాడుతున్నారు.‘మాదేముందండీ బతుకు బుగ్గి జీవితం మట్టి. అదే మీ వాళ్లలో అయితే లైఫ్ పైలాపచ్చీసుగా వెళ్లిపోతుంది. మా ఆడపిల్లలకు ఎంతసేపటికి సంగీతం అనీ సంప్రదాయం అనీ పద్ధతి పాడూ అనీ... మీలా ఫ్రీగా ఉంటారా వాళ్లు. ఫ్రీగా మూవ్ అవుతారా?అందుకేగా పల్లెల్లో పైకులాల వాళ్లు మీతో వామి చాటుకు వెళుతుంటారు. అసలు మీ డ్రస్సులూ, మీ ఫాస్ట్నెస్, అబ్బాయిలతో రాసుకుపూసుకు తిరిగే పద్ధతి... ఇవన్నీ నాకు పిచ్చండి. అలా ఉండాలి అమ్మాయిలు. మా ముండలూ ఉన్నారు. ఎందుకు? తగలెట్టుకోనా? అయినా ఈ మధ్య పల్లెల్లో రిస్క్ అవుతోందని విన్నాను. ఈ హైదరాబాద్లో అయితే ఎవరు పట్టించుకుంటారు లేండి. అంతదాకా వస్తే సైన్సు చాలా ఇంప్రూవ్ అయ్యిందిగా. ప్రివెన్షన్ మెథడ్స్ ఉన్నప్పుడు అక్కడిదాకా ఎందుకొస్తుందనేది నా ప్రశ్న. ఉండండి ఇక్కడ. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండండి. నేనుంటాను. నాకు మీరుంటారు’...చాలా దుఃఖం కలిగింది ఆ రాత్రి. నిద్ర పట్టలేదు. ఎంత మాటన్నాడు. ఆ మాటనే ధైర్యం ఎవరిచ్చారు? తెల్లారి గోలగోలగా ఉంటే నిద్ర లేచింది. స్నేహితురాలి తండ్రి భార్యను తిడుతూ ఉన్నాడు.‘దరిద్రపు ముఖమా అంటే దరిద్రపు ముఖమానీ. కార్పెంటర్తో సరిగ్గా పని చేయించవే అంటే చేయించలేదు. అన్నీ నేను చూసుకు చావాలా? నీ కళ్లు కాకలెత్తుకెళ్లాయా?’వింటూ ఉంది.‘ఏం దాపురించావే నాకు. ఏం దాపురించావూ అని. అసలు అగ్రహారం పుటకేనా నీది?’వింటూ ఉంది.‘ఇలాక్కాదు నిన్ను. నడ్డి మీద తన్ని ఏ మాలవాడకో మాదిగవాడకో తరమాలి. అప్పుడు తప్ప నీకు బుద్ధిరాదు. వాళ్లలో అయితే బాగా కలిసిపోతావు’ఎవర్ని తిడుతున్నాడీయన. ఆమెనా? తననా? స్త్రీజాతినా? దళిత బతుకునా? ఈ దేశంలో రెంటికీ తేడా అంటూ ఒకటి ఏడ్చిందా?నుదురు మీద ఏదో పెద్ద బరువు ఉన్నట్టు అనిపించింది. బొట్టు. తీసేసింది. తల్లి గుర్తుకొచ్చింది. తన తల్లి. తండ్రి గుర్తుకొచ్చాడు. తన తండ్రి. భాష గుర్తుకొచ్చింది. తన భాష. కూర గుర్తుకొచ్చింది. తన కూర. నుదురు గుర్తుకొచ్చింది. తన నుదురు. అవును. ఇదే తన నుదురు.కాసేపటికి బ్యాగు సర్దుకొని వెళుతూ వెళుతూ వాళ్ల ముందు నిలుచునింది. ‘వెళతానండీ’ ‘సరే’కదులుతుంటే ఆమె అంది– ‘బొట్టు మర్చిపోయినట్టున్నావ్ అమ్మాయ్’ఆగి స్థిమితంగా జవాబు చెప్పింది– ‘మర్చిపోలేదండీ. నుదురు ఇలాగే ఉండాలి. నేను వాడ అమ్మాయిని. కిరస్తానీ పిల్లని’. ఆమె ముందే పర్స్లోని జీసస్ను తీసి చైన్లో వేసుకుంది కూడా.కథ ముగిసింది. వినోదిని రాసిన ‘తప్పిపోయిన కుమార్తె’ కథ ఇది. పేపర్లలో వార్తలు వస్తుంటాయి. దళిత ఆయాలు వండిన అన్నం మేం తినం అని పిల్లలు ధర్నా చేస్తుంటారు. ఏ వయసు నుంచి మనం విషం నూరిపోస్తున్నాం. సినిమాల్లో గమనించారా? బికినీలలో ఉన్నవ్యాంప్ల పేర్లు మేగీ, రోజీ అని ఉంటాయి. పాపులర్ కల్చర్ ద్వారా ఏ భావజాలాన్ని పాదుకునేలా చేస్తున్నాం? పల్లెల్లో సామెతలు, జాతీయాలు, అశ్లీల భాష ఏ స్త్రీలను చులకన చేస్తున్నాయి? స్త్రీలే అణచబడ్డ వర్గం అంటే మళ్లీ ఆ వర్గంలో ఇంకా అణచబడ్డ స్త్రీ వర్గం. శతృవును పట్టుకోవాలంటే ఆ కన్నూ ఈ కన్నూ కలవాలి. ఇటు కదిలారు. ఓహ్.. అటు కూడా. పునః కథనం: ఖదీర్ -వినోదిని -
ఆ టైమ్లో చాక్లెట్స్ తినాలనిపిస్తోంది!
నాకు పీరియడ్ టైమ్లో చాక్లెట్లు, తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. దీని వల్ల ఏమైనా సమస్యలు ఏర్పడతాయా? పీరియడ్ టైమ్లో తీసుకునే ప్రత్యేక ఆహారం అంటూ ఏదైనా ఉందా? – శ్రీ, పీలేరు పీరియడ్స్ సమయంలో జరిగే అనేక హార్మోన్ల మార్పుల వల్ల, ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి అనేక మార్పులు, లక్షణాలు ఏర్పడతాయి. ఎక్కువ ఆకలి, కొన్ని రకాల పదార్థాలపై కోరిక కలుగుతుంది. ఆ సమయంలో మీకు చాక్లెట్లు, స్వీట్లు తినాలనిపిస్తే కొద్దిగా తీసుకోవచ్చు. దీనివల్ల సమస్య ఏమీ లేదు. కాకపోతే మరీ ఎక్కువగా తింటే, మెల్లిగా బరువు పెరిగే అవకాశముంటుంది. కాబట్టి జాగ్రత్త. ఈ సమయంలో బ్లీడింగ్ అవ్వడం వల్ల నీరసం, చిరాకు, అలసట వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆహారంలో తాజా పచ్చని ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పాలు, తాజా పండ్లు, కొద్దిగా మాంసాహారం తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్.. పీరియడ్ నొప్పిని, వాపులను తగ్గిస్తాయి. ఐరన్, మినరల్స్ లాంటివి హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ ఈ సమయంలో ఉండే గ్యాస్, యసిడిటీ, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. గర్భిణీ స్త్రీలకు తినకూడని పదార్థాల జాబితా ఏమైనా ఉందా? ఉంటే వివరంగా తెలియజేయగలరు. ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్లకు కూల్డ్రింక్స్ తాగే అలవాటు ఉంటే ప్రమాదమా? అనేది తెలియజేయగలరు. – సుధ, నిర్మల్ ప్రెగ్నెన్సీ సమయంలో తాజాగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం. బాగా ఉడకబెట్టిన ఆహారం, వీటిలో ముఖ్యంగా గుడ్లు, చేపలు, మాంసాహారం చాలా కీలకం. ఇది సరిగా ఉడకబెట్టకుండా, కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే తీసుకుంటే వీటిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనై వాంతులు, విరేచనాలు, బిడ్డకు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జంక్ఫుడ్, బయట దొరికే ఆహారం, వేపుళ్లు, మసాలా, నూనె వస్తువులు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కాఫీ, టీ, కూల్డ్రింక్స్ తీసుకోకపోవడమే మేలు. మరీ మానలేకపోతే ఎంత వీలైతే అంత తగ్గించి తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే కెఫిన్, టానిన్ వంటి పదార్థాలు తల్లి జీర్ణవ్యవస్థలో ఇబ్బందులను తేవచ్చు. తినే ఆహారంలో నుంచి ఐరన్, ఇంకా ఇతర పోషకాలను రక్తంలోకి ఎక్కువగా చేరనివ్వకుండా చేస్తుంది. బిడ్డ బరువు ఎక్కువ పెరగకపోవడం, నెలలు నిండకుండా కాన్పులు వంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారైతే ప్రెగ్నెన్సీ టైమ్లో మానెయ్యడం మంచిది. అన్నిరకాల పండ్లనూ మితంగా తీసుకోవచ్చు. సూపర్ మార్కెట్లో దొరికేవి కాకుండా, ఇంట్లోనే తాజాగా తయారు చేసుకున్న పండ్లరసాలను తాగడం మంచిది. గర్భిణీ స్త్రీలకుprenatal విటమిన్స్, ఫోలిక్ యాసిడ్ ‘స్టాండర్డ్ డైట్’ అని చెబుతుంటారు. వీటి గురించి వివరంగా తెలియజేయగలరు. – ఏఆర్, విజయవాడ గర్భిణీ స్త్రీలకు, వారిలో జరిగే మార్పులకు, అలాగే కడుపులో పెరిగే శిశువు అవసరాలకు ఎన్నో పోషక పదార్థాలు అవసరం పడతాయి. వీటిలో ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ఫోలిక్ యాసిడ్ ముఖ్యం. ఇది శిశువులోని మెదడు, వెన్నుపూస లోపాలను చాలావరకు నివారిస్తుంది. అలాగే విటమిన్–డి, బి–కాంప్లెక్స్ విటమిన్లు, క్యాల్షియం వంటివి చిన్న మోతాదులో శిశువు పెరుగుదలకు దోహదపడతాయి. వీటినే ప్రినేటల్ విటమిన్స్ అంటారు. రోజూవారి తీసుకునే ఆహారంలో అన్నిరకాల విటమిన్స్, మినరల్స్ లభ్యం కాకపోవచ్చు. పౌష్టికాహారం తీసుకున్నా.. ఒక్కొక్కరి శరీరతత్వాన్నిబట్టి తిన్న ఆహారంలోని పోషకాలు, రక్తంలోకి సరైన మోతాదులో చేరలేకపోవచ్చు. కాబట్టి గర్భంతో ఉన్నప్పుడు ఎంత పౌష్టికాహారం తీసుకున్నా కూడా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ మొదటి మూడు నెలల్లో, తర్వాత నెలల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం సప్లిమెంట్స్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుంది. అలా అని ఈ ప్రినేటల్ విటమిన్స్ తీసుకుంటూ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారంలో తాజా కూరగాయలు, పప్పులు, పాలు, పెరుగు. పండ్లు, మాంసాహారులయితే గుడ్లు, చేపలు, చికెన్, మటన్ వంటివి బాగా ఉడకబెట్టుకుని తీసుకోవాలి. డా‘‘ వేనాటి శోభ బర్త్రైట్ బై రెయిన్బో హైదర్నగర్ ,హైదరాబాద్ -
చేంజ్ పీరియడ్
‘క్లాస్లో అన్ని సబ్జెక్టులకూ ఒక్కో పీరియడ్ ఉంటుంది. మన మైండ్సెట్ చేంజ్ చేసుకోవడానికి ఒక పీరియడ్ ఉండాలి. ఆ పీరియడ్లో అమ్మాయిలకు పీరియడ్స్ గురించి ధైర్యంగా మాట్లాడే భరోసానివ్వాలి’. కేరళలో మొదలైన ‘స్టెయిన్.. ది స్టిగ్మా’ ఉద్యమ లక్ష్యం ఇది! దేశంలోనే అత్యధిక అక్షరాస్యత శాతం ఉన్న కేరళలో కూడా ఇప్పటికీ రుతుక్రమం గురించి గోప్యత పాటించే పరిస్థితులే ఉన్నాయి. రుతుక్రమంపై అనేక అపోహలున్నాయి. ఆ అపోహలను పోగొట్టి, గోప్యతను ఛేదించడానికి జరిగిన ప్రయత్నమే ‘స్టెయిన్.. ది స్టిగ్మా’ క్యాంపెయిన్. జోసెఫ్ అన్నంకుట్టి... కేరళలోని రేడియో మిర్చిలో రేడియోజాకీ. అతడికి ఓ రోజు ఎర్నాకుళంలోని థెరిస్సా కాలేజ్ నుంచి ఫోన్కాల్ వచ్చింది. తమ కాలేజ్లో ముఖ్యమైన కార్యక్రమానికి అతిథిగా వచ్చి మెన్స్ట్రువల్ హైజీన్ (రుతుక్రమంలో పాటించాల్సిన పరిశుభ్రత) గురించి ప్రసంగించాల్సిందిగా కోరారు నిర్వాహకులు. తానేమి వింటున్నాడో అర్థం కాలేదు జోసెఫ్కి. ‘సారీ, మీరు చెప్పింది అర్థం కాలేదు, మళ్లీ చెప్పండి’ అని అడిగాడు. అప్పటికే ఆ కాలేజ్లో జరిగిన ఇతర కార్యక్రమాలలో రెండుసార్లు అతిథిగా పాల్గొని ప్రసంగించాడు అతడు. అయితే ఈసారి వాళ్లు ఆహ్వానించిన సందర్భం పూర్తిగా వేరే. అందుకే అతడు మొదట కంగారు పడ్డాడు. అయితే థెరిస్సా కాలేజ్ నిర్వాహకుల ఉద్దేశం వేరు. మెన్స్ట్రువల్ పీరియడ్ టాపిక్ ఆడవాళ్ల మధ్య మాత్రమే ఉండాల్సిన విషయం కాదు, అవసరమైతే ఎటువంటి బిడియం లేకుండా మగవారితో కూడా మాట్లాడాల్సిందేనని తెలియ చెప్పడానికే ఈ అవేర్నెస్ స్పీచ్ మగవారి చేత ఇప్పించదలచుకున్నారు. జోసెఫ్ కేరళలో అమ్మాయిలు ఎక్కువగా ఆసక్తి చూపే రేడియో జాకీ కావడంతో అతడిని ఆహ్వానించారు. ఇంకా అపోహలున్నాయా?! చదువుకుంటున్న కాలేజ్ అమ్మాయిల్లో కూడా మెన్స్ట్రువల్ సైకిల్ను ఎలా అర్థం చేసుకోవాలనే అవగాహన తక్కువ. అందుకు ఓ ఉదాహరణ రితిక (పేరు మార్చాం). రితిక క్రమం తప్పకుండా స్కూల్కి వచ్చేది. ఎనిమిదవ తరగతి వరకు హాజరు పట్టీలో ఆబ్సెంట్లు మూడు నెలలకొకటి కూడా ఉండేవి కాదు. అలాంటిది తొమ్మిదో తరగతి నుంచి సెలవులు ఎక్కువయ్యాయి. స్కూల్ నుంచి ఎప్పుడు మాయమవుతుందో తెలియదు. ఆటల్లో కూడా రితిక చురుకైనదే. కానీ ఒక్కోసారి ఉదయం అన్ని క్లాసులకూ హాజరయ్యి, గేమ్స్ పీరియడ్కు మాత్రం మిస్ అయ్యేది. క్లాస్లకు సరిగ్గా రావడం లేదంటూ టీచర్లు మరింత జాగ్రత్తగా హాజరుపట్టీ పరిశీంచారు. అప్పుడు ఆ అమ్మాయి వరుసగా కొద్ది నెలల నుంచి 22 నుంచి 25వ తేదీల్లో గేమ్స్ పీరియడ్లో మాయమవుతోందని తెలిసింది. రితిక క్లాస్కు ఎందుకు మిస్సయిందో టీచర్లకు తెలియనంత కాలం, అలా మాయమైనందుకు మర్నాడు టీచర్లు కోప్పడేవారు. అయితే ఎంతగా మందలించినా ఆమె నోరు విప్పేది కాదు. కళ్లనీళ్లు తుడుచుకుంటూ వెళ్లిపోయేది. ఈ సంగతి తెలిసిన థెరిస్సా కాలేజ్ నిర్వాహకులు (అందులోనే స్కూలు కూడా), ఇలాంటి రితికలు ఇంకా ఎంతమంది ఉన్నారోనని నిశితంగా అధ్యయనం చేసి ఆశ్చర్యపోయారు. రుతుక్రమం సమయంలో స్కూలుకు వచ్చిన అమ్మాయికి తగలకుండా మిగతా ఆడపిల్లలు కూర్చోవడం వంటి అపోహలు కూడా ఇంకా కొనసాగుతున్నాయని తెలిసి విస్మయానికి లోనయ్యారు. ఈ సోషల్ స్టిగ్మా (సామాజిక అపసవ్యత) నుంచి సమాజాన్ని బయటపడేయాలంటే అమ్మాయిలను చైతన్యవంతం చేయాలి. అందుకు ఓ తొలి అడుగు పడాలి. అది తమ కాలేజ్ నుంచే మొదలవ్వాలి అనుకున్నారు. అప్పుడే ‘స్టెయిన్ ది స్టిగ్మా’ క్యాంపెయిన్ మొదలైంది. ఇదిప్పుడు దేశంలోని మిగతా ప్రాంతాలకూ విస్తరించవలసిన అవసరం ఉంది. – మను -
లేజీ లక్షణాలు వస్తాయా?
l severe pregnancy sickness అనే మాట విన్నాను. దీని గురించి తెలియజేయగలరు. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. అయితే నేను పరిమితికి మించి ఎక్కువగా నిద్రపోతాను. ఇలా నిద్ర పోవడం ఆరోగ్యానికి మంచిదని కొందరు, పుట్టబోయే బిడ్డకు లేజీ లక్షణాలు వస్తాయని కొందరు అంటున్నారు. వాస్తవం ఏమిటి అనేది వివరించగలరు. – ఆర్.సంధ్య, గూడూరు severe pregnancy sickness అంటే కొంతమంది గర్భిణులలో ఆ సమయంలో జరిగే హార్మోన్లలో మార్పుల వల్ల కలిగే ఇబ్బందులు, లక్షణాలు. ఇందులో కొందరిలో నీరసం, నిద్ర ఎక్కువగా రావటం, కొందరిలో నిద్ర పట్టకపోవడం, వాంతి వచ్చినట్లు ఉండటం, కొన్ని వాసనలు పడకపోవడం, వాంతులు కావడం, ఆకలి లేకపోవడం, తినలేక పోవడం వంటి అనేక రకాల లక్షణాలు రక్తంలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి , శరీరతత్వాన్నిబట్టి వాటి తీవ్రత ఉంటుంది. ఈ లక్షణాలు ఎక్కువగా మొదటి మూడు నెలలు ఉంటాయి. తర్వాత మెల్లగా తగ్గిపోతాయి. ఎక్కువగా నిద్ర పోవడం వల్ల బేబీకి లేజీ లక్షణాలు రావడం అంటూ ఏమీ ఉండదు. కాకపోతే ఎక్కువగా నిద్రపోతూ, సమయానికి ఆహారం తీసుకోకపోతే, నీరసం, ఎసిడిటీలాంటివి ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. నిద్ర పోయినా సమయానికి కొంచెం కొంచెంగా ఆహారం తీసుకోవడం మంచిది. ∙పీరియడ్స్ టైమ్లో బయటికి వెళ్లకుండా వీలైనంత విశ్రాంతి తీసుకోవాలంటారు. కానీ ఇది ఉద్యోగం చేసే వారికి కష్టం కదా! ఒకవేళ సెలవు పెట్టాల్సి వస్తే ఎన్నిరోజులు పెడితే మంచిదో తెలియజేయగలరు. ‘పీరియడ్ మిత్స్’లో ముఖ్యమైన వాటి గురించి తెలియజేయగలరు. – డీఎన్, చిత్తూరు పీరియడ్స్ టైమ్లో తప్పనిసరిగా బయటకు వెళ్లకూడదు అనే ఆంక్షలు ఏమీ లేవు. కాకపోతే చాలామందికి ఆ సమయంలో అసౌకర్యంగా ఉండటం, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వటం, కొద్దిగా నడుము నొప్పి, కడుపులో నొప్పి, వికారం, నీరసం వంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, విశ్రాంతి తీసుకుంటే కొద్దిగా ఉపశమనం దొరుకుతుంది. అంతేకాని అందరూ విశ్రాంతి తీసుకోవాలనికాని, ఉద్యోగం చేసేవారు సెలవు పెట్టి మరీ విశ్రాంతి తీసుకోవాలని తప్పనిసరి ఏమీ లేదు.పీరియడ్స్లో అసౌకర్యం ఏమీ లేకపోతే మాములు రోజులాగే ఉండవచ్చు. అసౌకర్యం ఎక్కువగా, నొప్పి ఎక్కువగా, బ్లీడింగ్ మరీ అధికంగా అవుతూ ఉండి, ఆఫీసుకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంటే లక్షణాల తీవ్రతను బట్టి ఒకటి లేదా రెండు రోజులు కుదిరితే సెలవు పెట్టుకోవచ్చు.ఈ ఆధునిక కాలంలో కూడా పీరియడ్స్ మీద అనేక రకాల అపోహలు ఉంటున్నాయి. ఈ సమయంలో స్నానం చేయకూడదు అని, ఆ సమయంలో ఎవరినీ ముట్టుకోకూడదని, ఈ సమయంలో పెరుగు తినకూడదని, వాకింగ్, ఎక్సర్సైజ్లాంటివి చేయకూడదు అని... ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. ఇవి కేవలం అపోహలు మాత్రమే.ఈ సమయంలో రోజూ స్నానం చేయడం మంచిది. దాని వల్ల బ్లీడింగ్ వల్ల జననాంగాల వద్ద చెమ్మ తగ్గి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. మిగతా రోజులలాగానే ఈరోజులలో కూడా ఆహారంలో అన్నీ తీసుకోవచ్చు. వాకింగ్, ఎక్సర్సైజ్లు అలవాటు ఉన్నవారు, ఈ సమయంలో ఎక్కువ బ్లీడింగ్, నొప్పివంటి అసౌకర్యాలు లేకపోతే చిన్నగా వాకింగ్, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ∙ప్రెగ్నెన్సీ సమయంలో చేసే ప్రత్యేకమైన ధ్యానం ఏదైనా ఉందా? నేను కొంత కాలంగా మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్నాను. మార్నింగ్ సిక్నెస్ పోవడానికి anti-nausea medication ఒక పరిష్కారం మార్గం అని చదివాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు.– పీఆర్వీ, విజయనగరం ప్రెగ్నెన్సీ సమయంలో చేసే ప్రత్యేక ధ్యానం అంటూ ఏదీ లేదు. ఈ సమయంలో ధ్యానం చేసేటప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని, చెడు ఆలోచనలు రానివ్వకుండా, పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవడం తల్లీబిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి మంచిది.ధ్యానంతో పాటు ప్రాణాయామం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం ఇంకా మంచిది. గర్భం దాల్చిన మొదటి మూడు నెలలలో చాలామందికి తల తిప్పడం, వికారం, వాంతి వచ్చినట్లు ఉండటం, కొన్ని వాసనలు పడకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ప్రొద్దున్న ఉంటాయి. వీటిని మార్నింగ్ సిక్నెస్ అంటారు. గర్భం దాల్చిన తరువాత పిండం నుంచి విడుదలయ్యే జిఛిజ హార్మోన్ ప్రభావం వల్ల ఈ లక్షణాలు ఏర్పడతాయి. జిఛిజ విడుదలయ్యే మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, లక్షణాలను తగ్గించడానికి వాడే మందులను anti-nausea medication అంటారు. వీటిని వాడక ముందు, చిన్న చిన్న చిట్కాలను పాటించిన తరువాత కూడా లక్షణాలు తగ్గకపోతే అప్పుడు మందులు వాడటం మంచిది. ఆహారం కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడం, మసాలా, నూనె, వేపుళ్లు, కారం తగ్గించి సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. ఎక్కువగా మజ్జిగ, కొబ్బరినీళ్లు, పండ్లు, పండ్లరసాలు తీసుకోవడం మంచిది. రాత్రి తొందరగా భోజనం చేసి, పడుకునే ముందు వేడిగా ఒక గ్లాసు పాలు లేదా పండు తీసుకోవడం మంచిది. ప్రొద్దున కూడా లేచిన వెంటనే మరీ ఎక్కువ ఆలస్యం లేకుండా వేరే పనుల మీద ధ్యాస పెట్టడం మంచిది. అయినా ఇబ్బందిగా ఉంటే విటమిన్ బి12, పైరిడాక్సిన్, డాక్సిలమైన్ కలిసిన మందులు లేదా రానిటిడిన్ లేదా ఓన్డన్సెట్రాన్ (వాంతులు అవుతుంటే) మందులు తినే అరగంట ముందు లేదా పరగడుపున వేసుకోవచ్చు. వీటివల్ల కడుపులోని బిడ్డపైన దుష్ప్రభావాలు పెద్దగా ఏమీ ఉండవు. -
బయాలజీ పీరియడ్
కరకు సమాజం! రుతుచక్రం అనే చట్రంలో అమ్మాయిల్ని బిగించి కదలకుండా చేస్తోంది. నెలనెలా కష్టం. ఆ కష్టాన్ని దాచలేకపోతే పరువు నష్టం! అదొక బాధ.. ఇదొక బాధ. ఇంట్లో అమ్మ ఉంటుంది. కసరకుండా చెప్పొచ్చు కదా. స్కూల్లో బయాలజీ పీరియడ్ ఉంటుంది. ‘పీరియడ్స్ బయాలజీ’ ఏంటో.. టీచరమ్మ చెప్పొచ్చుకదా! కాన్ట్ వియ్ సెన్సిటైజ్ ది సొసైటీ? కరకు సమాజాన్ని సున్నితంగా మార్చలేమా? ‘మరక మామూలే’ అనే ఫీలింగ్ని ఆడపిల్లల్లో కలిగించలేమా?! స్వేచ్ఛగా వాళ్లను ఎదగనివ్వలేమా? ‘‘అలేఖ్యా ... అలేఖ్యా... ఏమైంది నాన్నా.. ఒక్కసారి తలుపు తెరువమ్మా...’’ గాబరా, కంగారుగా కూతురి గది తలుపు తడుతోంది శ్రీవల్లి. టైమ్ కాని టైమ్లో స్కూల్ నుంచి వచ్చి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి తలుపేసుకుంది పిల్ల. ఉలుకులేదు పలుకులేదు.. అలికిడి అసలే లేదు. ఏమైందో తెలియదు. అరగంట నుంచి గది తలుపు కొడుతూనే ఉంది. లోపలి నుంచి ఎలాంటి స్పందనా లేదు. చివరిసారిగా ఒకసారి ప్రయత్నించి తలుపు తెరవకపోతే భర్తకు ఫోన్ చేద్దామని నిర్ణయించుకొని తలుపు కొట్టింది శ్రీవల్లి. తలుపు తెరిచి ‘మమ్మీ’ అంటూ తల్లిని చుట్టేసుకొని ఏడ్వసాగింది అలేఖ్య.బిడ్డ ప్రవర్తన అయోమయంలో పడేసింది శ్రీవల్లిని. అమ్మాయిని అలాగే పొదివి పట్టుకొని మంచం మీద కూర్చోబెడుతూ.. ‘‘ ఏమైందమ్మా.. చెప్పూ..’’ లాలనగా అడిగింది తల్లి. ఆ ఆర్తికి కరిగిపోయిన అలేఖ్య.. తల్లిని మరింత గట్టిగా వాటేసుకొని ఇంకొంత లోతుగా ఏడ్వడం మొదలుపెట్టింది. ‘‘ఎందుకేడుస్తున్నావ్? స్కూల్లో ఎవరేమైనా అన్నారా? ఫ్రెండ్స్తో గొడవ అయిందా?’’ అనునయిస్తూ అడిగింది శ్రీవల్లి.అమ్మను అలాగే పట్టుకొని కాదన్నట్టుగా అడ్డంగా తలూపింది. ‘‘మరి ఏమైంది తల్లీ...’’ అని కాసేపు ఆగి ‘‘టీచర్స్ ఏమైనా అన్నారా?... కంప్లయింట్ చేశారా?’’ అడిగింది. ఆ మాటతో తల్లి నుంచి వేరుపడి కళ్లు తుడుచుకుంది. అర్థమైంది తల్లికి.. పిల్ల ఏదో చేసుంటది.. టీచర్స్ చీవాట్లు పెట్టుంటారు అని. ‘‘మమ్మీ...’’ అంటూ బేలగా తల్లి వంక చూసింది.‘‘ఊ...చెప్పు’’ అంటూ మొహం మీదకు వచ్చిన బిడ్డ జుత్తును ఆప్యాయంగా వెనక్కి తోస్తూ అంది శ్రీవల్లి.మరక మంచిది కాదు‘‘నిన్న ఈవినింగ్ మనింట్లో అన్నయ్యవాళ్ల ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్తో కలిసి ఆడుకుంటుంటే.. నేను చూసుకోలేదు.. ’’ అంటూ ఆగిపోయింది అలేఖ్య.‘‘నీ స్కర్ట్ చూసి నానమ్మ కేకలేసింది అందరి ముందు. ‘ఈడొచ్చిన పిల్లవి.. అంత అజాగ్రత్త అయితే ఎలా? చూసుకోవద్దూ.. అయినా మగపిల్లలతో ఆ యికయికలు పకపకలు ఏంటి? ఒళ్లు తెలియనిఆ చేష్టలేంటి? అని చీవాట్లేసింది.. కదా..’ అని కూతురు చెప్పబోయేదాన్ని పూర్తి చేసింది శ్రీవల్లి.మౌనంగా తల్లి వంకే చూస్తూ అంతలోకే ఏదో చెప్పబోతుంటే... కూతురిని ఆగమన్నట్లు కుడి అరచేయి పైకెత్తి.. తను కొనసాగించింది శ్రీవల్లి.. ‘‘నానమ్మ చెప్పింది నీకు తప్పనిపించి ఉండొచ్చు.. నువ్వు బాధపడుండొచ్చు. కాని.. నాన్నమ్మ నీ మంచికే చెప్పింది. వయసొచ్చిన ఆడపిల్ల పొందిగ్గా ఉండాలి. ఆ టైమ్లో మరీ. ఇంకొకరితో చెప్పించుకునేలా ఉండకూడదు. ఎంత సిగ్గు? నీ స్కర్ట్ మీద మరక పడిందన్న విషయం కూడా గ్రహించకుండా అంతమంది మగపిల్లల మధ్య ఆడుతూనే ఉన్నావ్. అసలు మా చిన్నప్పుడైతే బయటకే వెళ్లనిచ్చేవాళ్లు కాదు. దూరంగా కూర్చోబెట్టేవారు. ఇప్పుడు నీకు ఆ బాధ లేదు. జాగ్రత్తగా మసలు కోవాలన్న కనీస జ్ఞానమన్నా ఉండాలి కదా!’’ అంది కాస్త గట్టిగానే. నిస్సహాయంగా తల్లివంకే చూస్తూ ఉండిపోయింది అలేఖ్య. స్కూల్లో జరిగిన విషయం చెప్పీ వేస్ట్ అనుకుంది. ఆ పిల్ల మెదడు సరిగ్గా ఈ మాటను స్థిరపర్చుకుంటుండగానే అడిగింది తల్లి.. ‘‘ఇంతకీ స్కూల్లో ఏం జరిగింది?ఎందుకలా మధ్యలోనే వచ్చేశావ్?’’ అసలు విషయం గుర్తొచ్చినట్టు అడిగేసింది శ్రీవల్లి. ఏమీ కాలేదన్నట్టు తలూపింది అలేఖ్య.‘‘ఏం కాకపోతే ఎందుకొచ్చేశావ్? ఏదో జరిగి ఉంటుంది.. చెప్పు’’ తీవ్రంగా వినిపించింది శ్రీవల్లి స్వరం. చెబితే ఊరట కన్నా చీవాట్లు తథ్యమన్న నిశ్చయాన్ని ఇచ్చింది ఆ తీవ్రత. అందుకే మౌనం వహించింది అలేఖ్య. కూతురు అలా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం చిరాకు తెప్పించింది శ్రీవల్లికి. ‘‘నువ్ చెప్పకపోతే స్కూల్కి కాల్ చేసి కనుక్కుంటా’’ బెదిరించింది కూతురిని. ‘‘మమ్మీ..’’ భయంతో అలేఖ్య. ‘‘ఊ.. చెప్పు.. నువ్వంతలా బాధపడుతున్న విషయమేంటో నాకు తెలియాలిగా..’’ గట్టిగానే అంది అమ్మ. చెప్పక తప్పదని తెలుసుకుంది కూతురు. ‘‘నిన్నటిలాగే ఈ రోజూ స్కర్ట్కి.... ’’ అని ఆగింది. తల్లి మొహంలో భావాలు గమనించకూడదని తల దించుకుంది. ‘‘నేను చూసుకోలేదు మమ్మీ.. సోషల్ టీచర్ పిలిచి క్లాస్లో అందరి ముందూ ఇన్సల్టింగ్గా మాట్లాడింది. నిన్న నానమ్మ మాట్లాడినట్టుగానే. నిజంగా నాకు తెలియలేదు మమ్మీ.. తెలిస్తే ఎందుకు చూసుకోను? అదేదో నా మిస్టేక్ అయినట్టు.. చాలా ఘోరం చేసినట్టు... తిట్టింది. ‘మీ మమ్మీ ఏం నేర్పలేదా? ఇలాగేనా ఆడపిల్లల్ని స్కూల్కి పంపేది? ఇంత స్పృహ తెలియకుండా ఎలా పెరిగావ్? మగపిల్లల మధ్య ఎలా ఉండాలి? నైన్త్క్లాస్కొచ్చావ్.. ఇలాంటివి బయటపెట్టుకోకుండా.. గుంభనంగా ఎలా ఉండాలో తెలియదా? ఎందుకు ఏళ్లొచ్చి?ఛీ.. ఛీ. నీట్గా ఉండడం చేతకాకపోతే ఆ మూడు రోజులూ స్కూల్కి రాకు. సెలవు తీసుకో. అంతేకాని వచ్చి ఇలా ఆడవాళ్ల పరువు తీయకు అంటూ’ ఇంకా ఏవేవో అన్నది మమ్మీ. అందులో కొన్ని మాటలు నాకసలు అర్థం కాలేదు!’’ అంటూ చేతుల్లో ముఖం దాచుకొని మళ్లీ ఏడ్వసాగింది.అలేఖ్య అనుకున్నట్టుగానే.. భయపడినట్టుగానే శ్రీవల్లి మొహం రంగు మారింది, ఎర్రబడింది. అత్తయ్య చెప్పినట్టే చేసింది.. సోయిలేని పిల్ల బయటకు వెళ్లి పరువు తీసింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. బిడ్డ చెంప చెళ్లుమనిపించింది శ్రీవల్లి.దెబ్బకు బిత్తర పోయింది అలేఖ్య. ‘‘సారీ.. మమ్మీ.. ఇంకోసారి ఎప్పుడూ ఇలా జరగదు. ఆ స్కర్ట్ నేనే ఉతుక్కుంటా. లోపలే ఆరేస్తా. అండర్ వేర్స్ కూడా’’ అమాయకంగా సంజాయిషీ ఇవ్వసాగింది.‘‘చెప్తూనే ఉన్నాం ఇంట్లో.. జాగ్రత్త జాగ్రత్త అని. పరువు తీశావ్ కదే! మగపిల్లల మధ్య చదువుకుంటున్నావ్.. రేపు ఆ పిల్లల మధ్యకు ఏ మొహం పెట్టుకుని వెళ్తావ్? నీతోటి అమ్మాయిలంతా ఇలాగే ఉంటున్నారా? చెప్తే వినవు... కనీసం చూసి తెలుసుకోవాలన్న ఇంగితం కూడా లేదా? నీతోపాటు నన్నూ ఇన్సల్ట్ చేశావ్’’ అంటూ కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయింది శ్రీవల్లి. చచ్చిపోతే సమస్యేలేదు తన తప్పేంటో.. ఇంట్లో, స్కూల్లో ఎందుకు ఈ పెద్దాళ్లు.. తనను దోషిగా చూస్తున్నారో.. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. బయటపడి తనను ఎందుకు చివాట్లు పెట్టిస్తోందో.. అర్థంకాలేదు అలేఖ్యకు. నానమ్మ, టీచర్, అమ్మ.. మాటలకు చచ్చిపోవాలనిపిస్తోంది ఆ పిల్లకు. కుమిలి కుమిలి ఏడుస్తోంది.‘‘మగపిల్లల మధ్య చదువుకుంటున్నావ్.. రేపు ఆ పిల్లల మధ్యకు ఏ మొహం పెట్టుకొని వెళ్తావ్?’’ అన్న తల్లి మాటలు పదేపదే జ్ఞప్తికొస్తున్నాయ్. ‘‘అవును.. ఏ మొహం పెట్టుకొని వెళ్తుంది. అందుకే చచ్చిపోతే వెళ్లాల్సిన అవసరం ఉండదు. మమ్మీని ఇన్సల్ట్ చేసే పరిస్థితీ రాదు.. తను చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది’’ మనసులో నిర్ణయం తీసుకుంది. తల పంకించి లేచి వెళ్లి మళ్లీ గది తలుపేసుకుంది అలేఖ్య. టీచర్ అవమానపరిచిందని.. ఈ యేడు ఆగస్ట్ నెలలో తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని ఓ ఊళ్లో ఏడో తరగతి చదువుతున్న ఒక అమ్మాయి 25 అడుగుల ఎత్తున్న భవంతి మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు.. రుతు సమయంలో ఉన్న తనను దానికి సంబంధించి టీచర్ అందరిముందు అవమానపరచడమే కాక టార్చర్ పెట్టిందని.. ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ పెట్టి మరీ చనిపోయింది ఆ అమ్మాయి. ఈ వార్త దేశంలో సంచలనం రేపింది. రుతుచక్రం, దాని సమస్యల విషయంలో మనం ఎంత అజ్ఞానంలో, ఇంకెంత అంధవిశ్వాసాల్లో కూరుకుపోయామో అన్న నిజానికి ఈ సంఘటనే నిదర్శనం. ఇదొక్కటే కాదు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇలాంటి దారుణాలు ఎన్నో. అజ్ఞానంలోంచి దేశాన్ని చైతన్యపరిచి ముందుకు తీసుకెళ్లాల్సిన నేతలు కూడా ‘రుతుచక్రం స్త్రీల శరీరాలను మలినపరుస్తుంది’ అని పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తూ ప్రజలను మరింత మూఢత్వంలోకి నెట్టుతున్నారు. కేరళకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత పై కామెంట్ చేసి తన మూర్ఖత్వాన్ని చాటుకున్నారు. అవమానం కాదు.. ఆరోగ్యకరం రుతుచక్రం.. ప్రతి ఆడపిల్ల జీవితంలో సంభవించే ఆరోగ్యకరమైన ప్రక్రియ. ఈ ప్రకృతి ధర్మాన్ని అవమానకర విషయంగా, దాన్ని దాచి ఉంచాలనే ధోరణిలో పిల్లలకు చెప్పడం తప్పు. అలాగని అదే పనిగా దాని గురించి పబ్లిక్గా మాట్లాడాలని కాదు. అదొక రిప్రొడక్టివ్ ఇష్యూ అని, ఆ సమయంలో ఎలా ఉండాలి? శుభ్రత ఎలా పాటించాలో నేర్పాలి. అవగాహన కల్పించాలి. అంతేకాని సిగ్గుపడాల్సిన విషయంగా పిల్లలను అనవసర భయాందోళనల్లోకి నెట్టకూడదు. సైన్స్, ఆరోగ్యానికి సంబంధించిన అంశంగా వివరించాలి. ఆడపిల్లలకే కాదు... మగపిల్లలకూ ఈ విషయం అవగతమయ్యేలా చెప్పాలి. పైన కేస్ స్టడీలో అలేఖ్యకు ఎదురైనట్టు స్కూల్లో కాని, బయటకు వెళ్లినప్పుడు కాని లేదా ఇంట్లో అయినా సరే ఏ ఆడపిల్లకైనా ఎదురైతే తిట్టడం, నవ్వడం, గుసగులాడ్డం లాంటివి చేయకూడదు. పెద్దవాళ్లుగా మనం.. ఇది చాలా సహజం.. ఏం పర్లేదు అని చెప్పాలి. అవమానిస్తే సున్నితమైన మనసున్న అమ్మాయిలు ఆత్మహత్యల దాకా వెళ్తారు. కాబట్టి మన ప్రవర్తన సహజంగా ఉండాలి. పిల్లల్నీ సహజంగానే పెంచాలి. – డాక్టర్ పద్మ పాల్వాయి చైల్డ్ సైకియాట్రిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ – శరాది -
చిన్నారికి ఎంత కష్టం..
న్యూ సౌత్ వేల్స్ : ఐదేళ్ల ప్రాయంలోనే జీవిత కాలంలో అనుభవించే కష్టాలన్ని అనుభవిస్తోంది ఓ చిన్నారి. 4 ఏళ్ల చిరు ప్రాయంలోనే చిన్నారికి పీరియడ్స్ రావడం ప్రారంభమైంది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్కు చెందిన ఎమిలీ డోవర్స్ అనే ఐదేళ్ల బాలిక ఆడిసన్స్ వ్యాధి బారిన పడింది. దీంతో హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేస్తే 5 ఏళ్లకే మోనో పాజ్ దశకి చేరుకోనుంది. అడ్రినల్ గ్రంథికి వచ్చే చాలా అరుదైన వ్యాధి ఇది. రెండు హార్మోన్లు కార్టిసోల్, ఆల్డోస్టిరాన్ల లోపంతో చిన్నారి ఇబ్బంది పడుతోంది. సాధారణంగా ముప్పై ఏళ్లుపైబడిన వారిలోనే చాలా అరుదుగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. పుట్టినప్పుడు అందరి పిల్లల్లానే ఎమిలీ డోవర్స్ మామూలుగా, సంతోషంగానే ఉండేది. అయితే రెండు వారాలు గడవగానే చిన్నారి పెరుగుదల అసాధారణంగా మారింది. నాలుగు నెలలకే ఏడాది చిన్నారిలా కనిపించేది. ఎమిలీ రెండేళ్ల వయస్సులోనే రొమ్ముల పెరుగుదల, శరీరం నుంచి వాసన రావడం, చర్మంపైన దద్దుర్లు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత అవాంచిత రోమాలు, మొటిమలు రావడం కూడా ప్రారంభమయ్యాయి. అడిసన్స్ వ్యాధితో పాటూ పుట్టుకతో వచ్చిన అడ్రినల్ హైపర్ ప్లాసియా, సెంట్రల్ ప్రికాసియస్ పబర్టీ, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెన్సరి ప్రోసెసింగ్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నట్టు వైద్యుల పరీక్షల్లో తేలింది. మిగతా పిల్లలకన్నా తాను భిన్నంగా ఉన్న విషయం ఎమిలీకి తెలుసని తల్లి టామ్ డోవర్ పేర్కొన్నారు. నిరంతర నొప్పి, చురుకుదనం లోపించడంతో ఫిజియోథెరపీ సెషన్లలో వారాంతాల్లో పాల్గొనాల్సి ఉంది. హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేస్తే మోనోపాజ్ దశకు చేరుకోనుంది. అంటే దాదాపు 50 ఏళ్ల మహిళలకు ఎదురయ్యే దుష్ప్రభావాలు మోనోపాజ్తో చిన్నారికి వచ్చే అవకాశం ఉంది. చిన్నతనంలో అనుభవించాల్సిన బాల్యాన్ని ఎమిలీ కోల్పోయిందని తల్లి టామ్ డోవర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే రుతుస్రావ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఎమినీ వైద్య సాయానికి భారీగా డబ్బు కావల్సి రావడంతో 'గోఫండ్మీ'లో విరాళాల కోసం ఓ పేజీని క్రియేట్ చేశారు. -
సందేహం: ఆ ప్రభావం బిడ్డపై ఉంటుందా ?
1. నా వయసు 20 సంవత్సరాలు. నెలసరి సమయంలో నాకు నొప్పి వచ్చి జ్వరం వచ్చినట్లు అవుతుంది. రక్తస్రావం అవుతుంది. చాలా నీరసంగా ఉంటుంది. ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుంది? పరీక్షలు ఏమైనా చేయించుకోవాలా? –కె.కె., నంద్యాల జవాబు: పీరియడ్స్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల ఆ సమయంలో ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అనేక రకాల లక్షణాలు రకరకాల తీవ్రతలో కనిపిస్తుంటాయి. ఆ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతాయి. అవి విడుదలయ్యే మోతాదును బట్టి లక్షణాల తీవ్రత ఉంటుంది. కొంతమందిలో ఆ సమయంలో పొత్తికడుపు నొప్పి, వికారం, వాంతులు, నడుంనొప్పి, తలనొప్పి వంటి అనేక లక్షణాలు ఉండవచ్చు. సక్రమంగా వాకింగ్, వ్యాయామాలు, యోగ, మెడిటేషన్ వంటివి చెయ్యడం వల్ల చాలామటుకు పైన చెప్పిన లక్షణాల తీవ్రత తక్కువగా అనిపిస్తుంది. లేకపోతే ఆ రెండు మూడు రోజులకు ప్రతి నెలా నొప్పి నివారణ మాత్రలు, వాంతులకు మాత్రలు వాడి చూడవచ్చు. కొందరిలో గర్భాశయంలో కంతులు, వాపు, ఇన్ఫెక్షన్, ఇతర సమస్యలు వంటివి ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి, బ్లీడింగ్, ఎక్కువ కావడం వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. వీటి నిర్ధారణకు పెల్విక్ స్కానింగ్ చెయ్యించుకుని, సమస్య ఏమన్నా ఉంటే దానికి తగ్గ చికిత్స తీసుకొని చూడవచ్చు. బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఒంట్లో రక్తం తగ్గి రక్తహీనత ఏర్పడి తొందరగా నీరసపడటం, అలసిపోవటం ఉంటుంది. ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) పరీక్ష చెయ్యించుకుని, రక్తహీనత ఉంటే, ఐరన్ మాత్రలు, విటమిన్ మాత్రలు వాడటం వల్ల నీరసం తగ్గుతుంది. 2. నా వయసు 24 సంవత్సరాలు. నాకు పెళ్లై ఆరు సంవత్సరాలవుతుంది. మూడో తరం మేనరికం మాది. మాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. వైజాగ్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐయూఐ టెస్ట్ చేసి నాకు ఓకే అన్నారు. మా ఆయనకి కూడా స్పెర్మ్ కౌంట్ సరిపోయింది అన్నారు. అయినప్పటికీ ఇంకా మాకు పిల్లలు పుట్టడం లేదు. దీనికి కారణం మేకరికమేనా? లేదా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యామ్నాయ పరిష్కారం ఏదైనా ఉందా? దయచేసి తెలియజేయగలరు. –లక్ష్మీ, శ్రీకాకుళం జవాబు: గర్భం నిలబడాలంటే అండం విడుదల, స్పెర్మ్ కౌంట్ సరిగా ఉండటంతో పాటు, హార్మోన్ల సమతుల్యత, గర్భాశయం సరిగా ఉండటం వంటి ఎన్నో అంశాలు సరిగా ఉండాలి. మీకు అన్నీ పరీక్షలు సరిగా ఉన్నా, గర్భం నిలబడట్లేదు. కొందరిలో ఐయూఐ టెస్ట్లో శుక్ర కణాలను నేరుగా గర్భాశయం లోపలి పొరలోకి చిన్న ప్లాస్టిక్ సిరెంజ్ ద్వారా ప్రవేశపెట్టడం... ఇలా చేసినా కూడా శుక్రకణాలు, ట్యూబ్లోకి ప్రవేశించి, వాటంతట అవే అండంలోకి ప్రవేశించి, ఫలదీకరణ జరపవలసి ఉంటుంది. తద్వారా పిండం ఏర్పడుతుంది. కొందరిలో ఈ ఫలదీకరణ ప్రక్రియ, అండం లేక శుక్ర కణం నాణ్యత సరిగా లేకపోవడం వంటివి; ఇంకా తెలియని కారణాల వల్ల జరగకపోవచ్చు. అలాంటప్పుడు కూడా గర్భం రాకపోవచ్చు. ఒకవేళ ఫలదీకరణ జరిగి పిండం ఏర్పడినా, పిండాన్ని గర్భాశయం స్వీకరించకపోవచ్చు. అలాంటప్పుడు పిండం పెరగలేక నశించిపోయి పీరియడ్ వచ్చేస్తుంది. ఈ సమస్య ఎందువల్ల వచ్చింది అని తెలుసుకోవటానికి పరిశోధనలు ఎన్ని పరీక్షలు చేసినా, కారణం, దాని చికిత్సను పూర్తిగా, సరిగా కనుగొనలేకపోయారు. ఈ రకం సమస్యను అధిగమించడానికి డాక్టర్లు రకరకాల చికిత్స విధానాల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటిలో భాగంగా ఐయూఐ ఒక్కసారిగా ఆపకుండా కనీసం మూడుసార్ల వరకు ప్రయత్నం చేసి చూడవచ్చు. అప్పటికి కూడా గర్భం రాకపోతే, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మరలా ఒకసారి విశ్లేషించుకుని, దానికి తగ్గట్లు చికిత్సలో మార్పుచేసి, అవసరమైతే ల్యాపరోస్కోపి చేసుకుని, మరొక మూడుసార్లు ఐయూఐ ద్వారా ప్రయత్నం చేయవచ్చు. దీని ద్వారా 20 నుంచి 30 శాతం గర్భం రావచ్చు. తర్వాత కూడా గర్భం అందకపోతే ఐయూఎఫ్ (టెస్ట్ ట్యూబ్ బేబి) పద్ధతిని అనుసరించవచ్చు. ఐయూఎఫ్లో కూడా 40% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. మేనరికం వల్ల కొందరిలో అబార్షన్లు అవ్వడం, పిల్లలలో అవయవ లోపాలు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అంతేకాని మేనరికం వల్ల గర్భం దాల్చటంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. 3. గతంలో నేను మా ఆయనతో పాటు ఆల్కహాల్ తీసుకునేదాన్ని. అయితే ఆల్కహాల్ తీసుకోవడం మానేసి సంవత్సరం దాటింది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. ఒకప్పటి బ్యాడ్ హ్యాబిట్ ప్రభావం కడుపులో బిడ్డపై ఉంటుందా? అలా ఉండకుండా ఉండాలంటే ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. –ఎన్.యస్, సికింద్రాబాద్ జవాబు: సాధారణంగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసేటప్పుడు, గర్భంతో ఉన్నప్పుడు, ఆల్కహాల్ తీసుకోవటం వల్ల, అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే, బిడ్డలో అవయవ లోపాలు, మానసిక శారీరక ఎదుగుదలలో లోపాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఆల్కహాల్ తీసుకోవటం మానేసి సంవత్సరం దాటింది. కాబట్టి ముందు తీసుకున్న ఆల్కహాల్ వల్ల, బిడ్డపై ప్రభావం ఏమి ఉండదు. -
హైపోథైరాయిడిజమ్ను పూర్తిగా నయం చేయవచ్చు
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. నేను ఈ మధ్య బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో మందులు ఉన్నాయా? – మనస్విని, హైదరాబాద్ మానవ జీవక్రియలకు సంబంధించి థైరాయిడ్ గ్రంథి చాలా ప్రధానమైనది. ఇది అనేక కార్యకలాపాలలో తనదైన ముఖ్య భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ కండిషన్లో బరువు పెరుగుతుంది. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ను ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు : ∙బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స : హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
నాకు ఎందుకంత నీరసం..?
గైనిక్ స్పెషల్ ప్రస్తుతం నేను ఐదో నెల గర్భిణిని. గత కొంతకాలంగా ఏ చిన్న పనిచేసినా ఎక్కువగా అలసిపోతున్నాను. ఎప్పుడూ నిస్సత్తువ, నీరసం. కాళ్లవాపులు కూడా కనిపిస్తున్నాయి. గర్భవతిని కాకముందు పీరియడ్స్ సమయంలో చాలా ఎక్కువగా రక్తస్రావం అయ్యేది. ఇలా ఎందుకు ఉంటోంది? ఈ అలసట తగ్గడానికి ఏం చేయాలి? – వినీత, నల్లగొండ మీరు చెప్పిన లక్షణాలతో పాటు మీరు గర్భవతి కాకముందు రుతుసమయంలో చాలా ఎక్కువ రక్తస్రావం జరిగేదన్న హిస్టరీ ఆధారంగా మీకు రక్తహీనత (అనీమియా) ఉండవచ్చని తెలుస్తోంది. రక్తహీనత అన్నది గర్భవతుల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇది ప్రధానంగా పోషకాహార లోపం వల్ల మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మీరు చెప్పినట్లుగా తొందరగా అలసిపోవడం, నీరసంగా, నిస్సత్తువగా ఉండటం, తలతిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పూర్తిస్థాయి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్–సీబీపీ) చేయించాలి. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా రక్తహీనత ఎంత తీవ్రంగా ఉందో తెలియడంతో పాటు అది ఎందువల్ల ఉందో కూడా కొంతమేరకు తెలుస్తుంది. సీబీపీని ఆధారంగా తీసుకుని తర్వాతి పరీక్షలను నిర్ణయిస్తారు. ఇక చికిత్స విషయానికి వస్తే రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం జరుగుతుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచబారడం అన్నది చాలా సాధారణమైన అంశం. కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 12 లేదా 14వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్ టాబ్లెట్లను సూచిస్తుంటాం. వాస్తవానికి వీటిని పరగడుపున తీసుకుంటే బాగా రక్తం పడుతుంది. అయితే చాలామందికి ఇలా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మొదట కాస్త టిఫిన్ తిన్నాక... గంటసేపటి తర్వాత ఐరన్ టాబ్లెట్ తీసుకుని, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తుంటాం. దీంతో రక్తం బాగాపడుతుంది. ఇక మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ డాక్టర్ను సంప్రదించి, ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష చేయించుకుని, రక్తహీనతకు కారణాన్ని తెలుసుకొని దాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోండి. అలాగే మీ బీపీ ఎంత ఉందో కూడా పరీక్ష చేయించుకోండి. ఇక గర్భవతులందరూ రక్తహీనతను నివారించుకోవడం కోసం మంచి బలవర్ధకమైన ఆహారం అంటే... మాంసాహారం తినేవారైతే మాంసం, కాలేయం, చేపలు... శాకాహారం తినేవారైతే ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల హిమోగ్లోబిన్ను పొందగలరు. రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఆమెకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం జరుగుతుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచబారడం అన్నది చాలా సాధారణమైన అంశం కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 12 లేదా 14వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్ టాబ్లెట్లను సూచిస్తుంటాం. వైట్డిశ్చార్జ్ అవుతోంది... ఆందోళనగా ఉంది నా వయసు 22 ఏళ్లు. పెళ్లికాలేదు. నాకు ప్రతిరోజూ యోని నుంచి వైట్డిశ్చార్జ్ వెలువడుతోంది. కేవలం పీరియడ్స్ ముందు మాత్రమే కొంచెం అలా అవుతుంటుందని, మామూలు వేళల్లో ఇలా రావడం మంచి సూచన కాదని తెలిసినవాళ్లు అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. వీలైతే పరిష్కారం సూచించండి. – ఒక సోదరి, హైదరాబాద్ మీ వయసులో ఉన్న ఆడపిల్లలు, పెళ్లికాని అమ్మాయిల్లో తెల్లబట్ట అవడానికి ఎన్నో కారణాలుంటాయి. సాధారణంగా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), యోనిభాగంలో మ్యూకస్ గ్రంథులు ఉంటాయి. హార్మోన్ల ప్రభావం వల్ల వాటి నుంచి నీరులాంటి, వాసనలేని స్రావాలు వెలువడుతుంటాయి. అవి నెలసరికి ముందు, నెలసరి మధ్యలో అంటే అండం విడుదలయ్యే సమయంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీనివల్ల వాసన, దురద ఉండదు. ఈ స్రావాలు ఏమాత్రం హానికరం కాదు. అయితే కొందరిలో మాత్రం ఫంగల్, బ్యాక్టీరియల్, ట్రైకోమొనియాసిస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వైట్ డిశ్చార్జి అవుతుంది. ఇది కాస్త పేరుకుపోయినట్లుగానూ, పాలు విరిగినట్లుగానూ, నురగలా, కొంచెం పచ్చగా ఉండి, దురద, మంట, వాసనలు కలిగి ఉంటుంది. ఇలాంటి దాన్ని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. కొంతమందిలో నులిపురుగులున్నా, వైట్డిశ్చార్జ్ అవుతుంది. కొంతమందిలో రక్తహీనత వల్ల రోగనిరోధకశక్తి తగ్గి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్) లోపించడం వల్ల కూడా ఇదే సమస్య రావచ్చు. బిగుతైన దుస్తులు ధరించేవారిలో మహిళల ప్రైవేట్ పార్ట్స్ ప్రాంతంలో చెమట ఎక్కువగా పట్టి ఇన్ఫెక్షన్స్కు దారితీయవచ్చు. జననాంగాల వద్ద ఇన్ఫెక్షన్లను తగ్గించుకునేందుకు కొందరు యాంటీసెప్టిక్ లోషన్స్తో ఆ ప్రాంతాల్లో శుభ్రం చేసుకుంటుంటారు. అలా చేయడం సరికాదు. దానివల్ల యోనిభాగంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా (లాక్టోబాసిలై) నశిస్తాయి. ఇవి యోనిలో స్రావాలు సరైన ‘పీహెచ్’ పాళ్లలో ఉండేలా చూసి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంటాయి. మీరు అక్కడ శుభ్రం చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే లాక్టోబాసిలైతో కూడిన ‘ఫెమినైన్ వాష్’లను వాడుకోవచ్చు. ఆహారంలో తీసుకునే పెరుగులో కూడా లాక్టోబాసిలై ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పెరుగు, మజ్జిగ లాంటివి ఎక్కువగా వాడటం కూడా మంచిదే. లోదుస్తులుగా కాటన్ ప్యాంటీస్ వాడటం వల్ల, వాటికి చెమటను పీల్చుకునే గుణం ఉంటుంది. అందువల్ల ఇన్ఫెక్షన్ అవకాశాలు తగ్గుతాయి. పుష్కలంగా మంచినీళ్లు తాగడం, తాజాపండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా మీ ప్రైవేట్పార్ట్స్ ఆరోగ్యంతో పాటు మీ సాధారణ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరింత నిర్దిష్టమైన చికిత్స కోసం మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్ను సంప్రదించడం మేలు. పుష్కలంగా మంచినీళ్లు తాగడం, తాజాపండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. దాంతో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఫలితంగా మీ ప్రైవేట్పార్ట్స్ ఆరోగ్యంతో పాటు మీ సాధారణ ఆరోగ్యం కూడా బాగుంటుంది. డాక్టర్ భార్గవి కాటంరెడ్డి కన్సల్టెంట్– అబ్స్టెట్రిషియన్ అండ్గైనకాలజిస్ట్, బర్త్ రైట్ బై రెయిన్బో,బంజారాహిల్స్, హైదరాబాద్ -
చాకొలెట్ సిస్టులు అంటే..?
పీరియడ్స్ సమయంలో నొప్పి వస్తుంది. ఈ సమస్య గురించి మా బంధువు ఒకరితో చెబితే...‘చాకొలెట్ సిస్టులు ఉండొచ్చు’ అన్నారు. అసలు ‘చాకొలెట్ సిస్టులు’ అంటే ఏమిటి? అవి ఎందుకు వస్తాయి? మందులతో తగ్గిపోతాయా? – డి.పరమేశ్వరి, డోర్నకల్ పీరియడ్స్ సమయంలో గర్భాశయంలోని ఎండోమెట్రియమ్ పొర చిన్న చిన్న ముక్కలుగా బ్లీడింగ్ ద్వారా యోని నుంచి బయటకు వచ్చేస్తుంది. కొందరిలో ఎండోమెట్రియమ్ పొర గర్భాశయంలో నుంచి, ఫెలోపియన్ ట్యూబ్స్ ద్వారా పొత్తికడుపులోకి చేరుతుంది. కొందరిలో మెల్లగా అదే కరిగిపోతుంది. కాని కొందరిలో వారి శరీర తత్వాన్ని బట్టి, అనేక రకాల తెలియని కారణాల వల్ల ఎండోమెట్రియమ్ పొర ముక్కలు కరిగిపోకుండా హార్మోన్ల ప్రభావం వల్ల ప్రేరేపితమై, ప్రతి నెలా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులోని ఎండోమెట్రియమ్ పొరలో కూడా కొద్ది కొద్దిగా బ్లీడింగ్ అయ్యి, అక్కడ రక్తం గూడు కట్టడం జరుగుతుంది. దీనినే ఎండోమెట్రియేసిస్ అంటారు. ఈ పొర పొత్తికడుపులో గర్భాశయం వెనుక భాగం పైన, ప్రేగుల పైన, మూత్రాశయం పైన, అండాశయాల పైన... ఇంకా ఇతర భాగాలపైన అతుక్కుని పెరిగే అవకాశాలు ఉన్నాయి. అండాశయం పైన అతుక్కున్న ఎండోమెట్రియల్ పొరలో నెలనెలా బ్లీడింగ్ అయ్యి అందులో రక్తం కొద్దికొద్దిగా చేరి గూడు కడుతూ, రక్తం, చాక్లెట్ రంగులో మారి గడ్డలాగా మారుతుంది. దీనినే చాక్లెట్ సిస్ట్ అంటారు. ఈ సిస్ట్లు ఒకటి రెండు సెంటీమీటర్లు మొదలుకొని 10 సెంటీమీటర్ల పైన పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి రాకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు లేవు. అవి ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్ల ప్రభావాన్ని బట్టి, గర్భాశయం లోని కొన్ని రకాల లోపాల వల్ల రావచ్చు. వీటి వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి, పరిమాణం బట్టి సంతానం కలగడంలో ఇబ్బంది వంటి ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. ఇవి 3 సెం.మీ. కంటే సైజు తక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల హార్మోన్ల మాత్రలు, ఇంజెక్షన్ల ద్వారా కొందరిలో తగ్గే అవకాశాలు ఉంటాయి. లేకపోతే పరిమాణం పెద్దగా ఉండి, ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఆపరేషన్ ద్వారా తొలగించవలసి ఉంటుంది. కొందరిలో ఆపరేషన్ చేసి తొలగించినా, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి మరలా చాక్లెట్ సిస్ట్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. నేను చాలా సన్నగా ఉంటాను. ప్రెగ్నెంట్ని. ‘ఇప్పుడు కూడా ఇలా ఉంటే ఎలా? బాగా తినాలి. నీతో పాటు... కడుపులో ఉన్న నీ బిడ్డ కోసం కూడా తినాలి. నువ్వు ఎంత ఎక్కువ తింటే కడుపులో ఉన్న బిడ్డకు అంత ఆరోగ్యం’ అని చెబుతున్నారు. నాకేమో పరిమితికి మించి తినే అలవాటు లేదు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ తినాలి అనే దాంట్లో ఎంత వాస్తవం ఉంది? నిజానికి గర్భిణులు ఎలాంటి పోషకాహరం తీసుకోవాలి? చెప్పగలరు. – జి.కవిత, విజయవాడ గర్భం దాల్చినంత మాత్రాన, ఎంత ఎక్కువ అంటే అంత తినాలని ఏమీ లేదు. 9 నెలలపాటు గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరగడానికి, మామూలుగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారంలో ఎక్కువగా పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగుతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. అంతేగాని, రెండింతలు తీసుకోవాలని లేదు. మాంసాహారులు అయితే గుడ్లు, మితంగా మాంసాహారం, చేపలు వంటివి తీసుకోవచ్చు. నువ్వు సన్నగా ఉన్నావు కాబట్టి పైన చెప్పిన పౌష్టికాహారంతో పాటు, రోజూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. ఒకేసారి ఎక్కువగా తినడం ఇబ్బంది కాబట్టి, కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు అంటే రెండు మూడు గంటలకొకసారి ఆహారం తీసుకుంటూ ఉండవచ్చు. సాధారణ బరువు ఉండి, గర్భవతులైనవారు మామూలు పౌష్టికాహారం తీసుకొని 9 నెలల్లో 8 నుంచి 11 కేజీల వరకు బరువు పెరగవచ్చు. అధిక బరువు ఉన్నవారు 5 నుంచి 8 కేజీలు బరువు పెరిగితే సరిపోతుంది. ఈ సమయంలో అధిక బరువు పెరగడం వల్ల బీపీ, షుగర్, ఆయాసం వంటి సమస్యలు, కాన్పు సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ‘గర్భిణులు వాడే మాత్రలతో శిశువులకు ముప్పు’ అనే వార్తను ఈమధ్య ఎక్కడో చదివాను. అయితే అందులో... ‘గుండెలో మంట సమస్యకు వేసుకునే మాత్రల వల్ల శిశువుకు ఆస్థమా వచ్చే అవకాశం ఉంది’ అని ఒకటీ అరా వివరాలు మాత్రమే ఉన్నాయి. మాత్రలంటే ఏ రకమైన మాత్రలు అనే వివరాలు లేవు. గర్భిణిగా ఉన్నవారు జలుబు, తలనొప్పి మాత్రలు... ఇలాంటివి వేసుకుంటే శిశువు మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? – బి.స్వప్న, అనంతపురం గర్భిణిలకు మొదటి మూడు నెలల సమయంలో శిశువులో దాదాపుగా అన్ని అవయవాలు ఏర్పడతాయి. ఈ సమయంలో కొన్ని రకాల మందులు వాడటం వలన శిశువు మీద ప్రభావం పడి, అవయవాలు సరిగా ఏర్పడకపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు. ప్రెగ్నెన్సీలో వాడే మందులు వాటి దుష్ప్రభావాలను బట్టి ఎ, బి, సి, ఎక్స్ అనే కేటగిరీలుగా విభజించబడటం జరిగింది. ఎ, బి కేటగిరీకి చెందిన మందులను ప్రెగ్నెన్సీలో అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. సి కేటగిరీ మందులను, అవి వాడకపోవడం వల్ల వచ్చే దుష్ఫలితం, వాడటం వల్ల వచ్చే రిస్క్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాడుకోవచ్చు. ఎక్స్ కేటగిరీ మందులు ఎట్టి పరిస్థితుల్లోను వాడకూడదు. జ్వరానికి, తలనొప్పి వంటి నొప్పులకు పారసెటమాల్ మాత్ర వాడుకోవచ్చు. జలుబు, దగ్గుకి మిగతా సమస్యలకు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుకోవాలి. సొంతగా మందుల షాపులో తీసుకుని వాడరాదు. నొప్పి నివారణ మాత్రలు అంటే డైక్లోఫినాక్, వొవెరాన్ వంటివి గర్భిణీలు వాడటం వల్ల శిశువు, కిడ్నీలు దెబ్బతినటం, ఉమ్మనీరు తగ్గిపోవటం వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసిడిటీకి మందులు డాక్టర్ పర్యవేక్షణలో అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. వీటివల్ల శిశువులో సమస్యలు ఏర్పడినట్లు పరిశోధనలలో ఎక్కువగా తేలలేదు. డా‘‘ వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ని. గతంలో ఒకసారి ‘ముత్యాల గర్భం’ అనే దాని గురించి విని ఉన్నాను. అయితే వివరాలేవీ సరిగా గుర్తులేవు. ఇంతకీ ‘ముత్యాల గర్భం’ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? నాలాంటి వాళ్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? – రమ్య, కరీంనగర్ గర్భం దాల్చినప్పుడు గర్భాశయంలో పిండంతో పాటు దానికి తల్లి నుంచి రక్తం సరఫరా అందించేందుకు మాయ ఏర్పడుతుంది. కొందరిలో సరిగా తెలియని అనేక రకాల కారణాల వల్ల పిండం పెరగకుండా, మాయ మాత్రమే గర్భాశయంలో ముత్యాల్లాంటి నీటి బుగ్గలుగా మారి, అది పెరిగిపోతూ ఉంటుంది. దీనినే ముత్యాల గర్భం అంటారు. పిండం నిర్మాణంలో లోపం, ఒక అండంలోకి రెండు శుక్రకణాలు వెళ్లి ఫలదీకరణ చెందినప్పుడు, నిర్వీర్యమైన అండంలోకి ఒక శుక్రకణం వెళ్లి, ఫలదీకరణ చెంది, అది విభజన జరిగినప్పుడు హార్మోన్ల అసమతుల్యత, వ్యాధి నిరోధక వ్యవస్థలో మార్పులు, విటమిన్ ఎ లోపం వంటి ఎన్నో కారణాల వల్ల ముత్యాల గర్భం ఏర్పడుతుంది. నెలలు పెరిగే కొద్దీ ముత్యాల నీటి బుగ్గలు రెట్టింపు అవుతూ, గర్భాశయం పెద్దగా పెరుగుతూ ఉండి, మధ్యమధ్యలో నీరు, రక్తం కలిసి కొద్దికొద్దిగా బ్లీడింగ్, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. లేకపోతే అది గర్భాశయంలోని అన్ని పొరలలోకి పాకి, లోపలే బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి, మనిషి పాలిపోయినట్లుండి, బాగా ఆయాసపడిపోతూ, షాక్లోకి వెళ్లిపోవచ్చు. కొందరిలో ఉన్నట్లుండి రక్తస్రావం అధికంగా అయ్యి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లవచ్చు. దీనికి చికిత్స... ముత్యాల గర్భాన్ని డి మరియు సి లేదా సక్షన్ ఎవాక్యుయేషన్ ద్వారా తీసివేయడం. ముత్యాల గర్భం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మన చేతిలో ఏమీ లేదు. కాకపోతే రెండు, మూడు నెలలలో స్కానింగ్ చేయించుకోవడం వల్ల ముందుగానే ఈ సమస్యను గుర్తించి కాంప్లికేషన్స్లోకి వెళ్లకముందే దానిని తొలగించవచ్చు. మా బంధువుల్లో ఒకరికి చాలాకాలం నుంచి పిల్లలు లేరు. ‘డి అండ్ సీ ఆపరేషన్’ ద్వారా మహిళలకు పిల్లలు కలిగేలా చేస్తారని చదివాను. ‘డి అండ్ సీ ఆపరేషన్’ అంటే ఏమిటి? ఈ ఆపరేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ‘కొందరు మాత్రమే ఈ ఆపరేషన్కు అర్హులు’ (శారీరక పరిస్థితులను బట్టి)లాంటివి ఏమైనా ఉన్నాయా? తెలియజేయగలరు? – డి.జానకి, విజయనగరం డి అండ్ సీ ఆపరేషన్ అంటే డైలటేషన్ అండ్ క్యూరెటాజ్. గర్భసంచి ద్వారమైన సర్విక్స్ను డైలేట్ చేసి అంటే కొద్దిగా తెరవడానికి వెడల్పు చేసి గర్భాశయంలోని పొరను క్యూరెట్ అనే పరికరం ద్వారా శుభ్రం చేయడం (గీకటం). కేవలం డి అండ్ సీ చెయ్యడం వల్లనే గర్భం దాల్చరు. అండం విడుదల అవ్వడం, సరిగా ఉండి, ట్యూబ్స్ తెరుచుకుని ఉండి, మగవారిలో వీర్య కణాలు సరిగా ఉన్నా, మిగతా హార్మోన్లలలో అసమతుల్యత వంటి ఇతర సమస్యలు ఏమీ లేకుండా ఉండి, గర్భాశయ ద్వారం చాలా సన్నగా ఉన్నప్పుడు డి అండ్ సీ ద్వారా, ఆ ద్వారాన్ని వెడల్పు చెయ్యడం వల్ల వీర్య కణాలు తేలికగా గర్భాశయంలోకి ప్రవేశించడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతే కాని, డి అండ్ సీ ద్వారా గర్భం కచ్చితంగా వస్తుందని చెప్పలేం. అలాగే గర్భాశయంలోని పొరను శుభ్రం చేయటం, అలానే దానిని గీకటం వల్ల కొందరిలో మళ్లీ పొర ఆరోగ్యంగా ఏర్పడి పిండం గర్భాశయంలో (అతుక్కోవడానికి) నిలబడడానికి (ఇంప్లాన్టేషన్) దోహద పడుతుంది. ఆధునిక చికిత్స లేని పాతకాలంలో పిల్లలు కలగనివారికి దాదాపుగా అందరికి డి అండ్ సీ చేసేవాళ్లు. దాంతో మిగతా ఇబ్బందులు లేనప్పుడు, చాలామందికి గర్భం రావడం జరిగేది. దీనినే వాడుక భాషలో కడుపు కడగటం, గర్భ సంచిని కడగటం అంటారు. ఈ ఆపరేషన్ ఎవరైనా చేయించుకోవచ్చు. నొప్పి తెలియకుండా మత్తు ఇచ్చి, యోని భాగంలో నుంచి డి అండ్ సీ చేస్తారు. శుభ్రత పాటించని హాస్పిటల్స్లో చెయ్యించుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతకంటే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. గర్భాశయంలో శుభ్రం చేసిన పొరను బయాప్సీకి పంపిస్తే, దానిలో ఏవైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి. నాకు కొత్తగా పెళ్లయింది. అయితే నా భర్త నాకు దూరంగా ఉంటున్నారు. ‘ఆమె దగ్గర విపరీతమైన దుర్వాసన వస్తుంది’ అని నా గురించి ఎవరితోనో చెప్పారట. నిజానికి శుభ్రత విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. ‘అతి శుభ్రత పాటిస్తావు’ అని కూడా వెక్కిరించేవాళ్లు. అలాంటి నా దగ్గర దుర్వాసన రావడం ఏమిటో అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి ఏదైనా చెబుతారని ఆశిస్తున్నాను. – డి.కె, నిర్మల్ మీ వారి దృష్టిలో దుర్వాసన అంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తున్నారో. కొంతమందిలో నోటి నుంచి కూడా దుర్వాసన రావచ్చు. కొందరిలో యోనిలో ఇన్ఫెక్షన్స్ వల్ల దుర్వాసన రావచ్చు. కొంతమంది మగవారు మనసులో ఏదో పెట్టుకుని, కారణం ఏదో ఒకటి చెబుతుంటారు. నిజంగా ఆయనకి ఏదైనా నీవల్ల ఇబ్బంది అనిపిస్తే అది నీతో మాట్లాడి, సమస్యకు మార్గం ఏమిటో, డాక్టర్కు చూపించటమో ఏదో చెయ్యాలి కాని, బయటవాళ్లకి నీమీద చెప్పటం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు కదా! ఒకసారి నువ్వే ఆయనతో నీ వల్ల ఆయనకు ఏమి ఇబ్బందిగా ఉందో మాట్లాడి, సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి. నిజంగా ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్కి చూపించి చికిత్స తీసుకోవచ్చు. లేకపోతే ఈ దూరం పెరిగిపోయి, మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉంటాయి. -
పిల్స్ అంటేనే భయం...
నాకు కొత్తగా పెళ్లయింది. పిల్లలు అప్పుడే వద్దనుకుంటున్నాం. పిల్స్ ఎక్కువగా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఎక్కడో చదివాను. అప్పటి నుంచి పిల్స్ అంటేనే భయం పట్టుకుంది. అసలు మాత్రలు వాడడం మంచిదేనా, ఏ మేరకు వాడొచ్చు అనేది చెప్పగలరు. పురుషుల కోసం కుటుంబ నియంత్రణ సాధనాలు కొత్తగా ఏమైనా వచ్చాయా తెలియజేయగలరు. – రాగిణి, చిత్తూరు తాత్కాలికంగా పిల్లలు వద్దనుకున్నప్పుడు, అనేక మార్గాలలో గర్భ నిరోధక మాత్రలు వాడటం ఒక మార్గం. ఈ మాత్రలలో ఈస్ట్రోజన్, ప్రొజస్టరాన్ హార్మోన్లు వివిధ రకాల మోతాదులో ఉంటాయి. వీటి ప్రభావం వల్ల, అండం తయారు కాకపోవడం లేదా గర్భాశయ ముఖద్వారంలోని ద్రవాలను చిక్కగా మార్చడం, వీర్య కణాలు గర్భాశయం లోపలకు వెళ్లకుండా అడ్డుకోవడం, తద్వారా గర్భం రాకుండా ఆపుతాయి. వీటిలోని హార్మోన్ల వల్ల, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి కొందరిలో వికారం, వాంతులు, కళ్లు తిరిగినట్లు ఉండి మెల్లగా అలవాటు పడతారు. కొందరిలో తర్వాత కూడా ఈ లక్షణాలు తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు మాత్రల వాడకం ఆపివేయవలసి ఉంటుంది. మాత్రలలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ మోతాదును బట్టి లక్షణాలు ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు, మైగ్రేన్ ఉన్నవారు, లివర్ సమస్యలు ఉన్నవారు, రక్తం త్వరగా గూడు కట్టే గుణం ఉన్నవాళ్లు ఇవి వాడకపోవటం మంచిది. ఇప్పుడు మూడు అతి తక్కువ మోతాదులో దొరికే లో డోస్ పిల్స్ రెండు, మూడు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. ఇవి డాక్టర్ను సంప్రదించి వారి సలహా మేరకు వాడటం మంచిది. మగవారు కుటుంబ నియంత్రణ కోసం వాడటానికి మందులు, ఇంజక్షన్లు ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. వారు వాడుకోవటానికి కేవలం కండోమ్స్ మాత్రమే ఉన్నాయి. కాని జాగ్రత్తగా వాడకపోతే ఫెయిల్ అయ్యి గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డాక్టరు గారు... నా వయసు 26 సంవత్సరాలు. మా ఆయన వయసు 28 సంవత్సరాలు. పెళ్లై సంవత్సరం దాటింది. మాకు సంతానం కలగలేదు. నాకు పిరియడ్స్ సక్రమంగానే వస్తుంది. వైద్య పరీక్షల్లో ఏ సమస్య లేదని చెప్పారు. మాకు పిల్లలు కలగాలంటే ఏ సమయాల్లో కలుసుకుంటే బాగుంటుంది తెలియజేయగలరు. – వి.బిందు, పాడేరు సాధారణంగా భార్య, భర్తల్లో ఏ సమస్య లేనప్పుడు, 80 శాతం మంది పెళ్లయిన సంవత్సరం లోపల గర్భం దాల్చుతారు. 15 శాతం మంది రెండు సంవత్సరాల లోపల గర్భం దాల్చుతారు. మిగతా 5 శాతం మందికి మాత్రమే, చికిత్స అవసరమవుతుంది. మీకు పెళ్లై సంవత్సరమే అయ్యింది. వైద్య పరీక్షలలో సమస్యలు ఏమీ లేవు కాబట్టి, ఇంకొక సంవత్సరం పాటు సాధారణ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. వైద్య పరీక్షలు నీకు మాత్రమే చేశారా లేక మీ వారికి కూడా వీర్య పరీక్ష చేశారా అనే విషయం సరిగా తెలుపలేదు. మీ వారికి కూడా వీర్య పరీక్ష చేసి, వీర్య కణాల సంఖ్య, కదలిక సరిగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ చెయ్యకపోతే, చేయించి చూడండి. అన్నీ బాగుంటే నీకు నెలనెలా పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయి కాబట్టి, బ్లీడింగ్ మొదలైన రోజు మొదటి రోజుగా లెక్కపెట్టి, 9వ రోజు నుంచి 16వ రోజు లోపల కలవడం వల్ల గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. నేను చాలా బలహీనంగా ఉంటాను. బరువు కూడా చాలా తక్కువ. వైట్ డిశ్చార్జి సమస్య ఉంది. మరోవైపు మా వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకున్న సమస్య వల్ల పెళ్లి చేసుకోవడం సరైనదేనా? పెళ్లి వల్ల సమస్యలేమైనా వస్తాయేమోనని భయంగా ఉంది. మీ సలహా కావాలి. – డి.కె, మార్టూర్ సన్నగా, బలహీనంగా ఉన్నప్పుడు, ఎందుకు అలా ఉన్నానని విశ్లేషించుకోవాలి. ఆకలి లేకపోవటం, ఆహారం సరిగా తీసుకోకపోవటం, మానసిక, శారీరక ఒత్తిడి, హార్మోన్ల లోపం, ఆరోగ్య సమస్యలు వంటివి ఎన్నో కారణాలు కావచ్చు. రక్తహీనత వల్ల కూడా నీరసంగా ఉండటం, ఇన్ఫెక్షన్స్ ఏర్పడటం, కడుపులో నులిపురుగులు వంటి కారణాల వల్ల వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుండవచ్చు. నీ వయస్సు ఎంతో రాయలేదు. సన్నగా, బలహీనంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కూడా నీరసంగా ఉండటం, త్వరగా అలసిపోవటం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్తో కూడినది. అయితే, పెళ్లి తర్వాత ఇంకా ఎక్కువ అయ్యి దురద, వాసన, పొత్తి కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మొదట పాలు, పప్పులు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం, గుడ్లు వంటి పౌష్టికాహారం రోజూ తీసుకుని, కొద్దిగా బరువు పెరిగి, బలహీనతను పోగొట్టవచ్చు. అలా చేసినా ఉపయోగం లేనప్పుడు, డాక్టర్ని సంప్రదించి, సమస్య ఎక్కడ ఉందో పరీక్షలు చేయించుకుని దానిని బట్టి చికిత్స తీసుకోవచ్చు. -
హైపోథైరాయిడిజమ్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 34 ఏళ్లు.ఈ మధ్య నేను బరువు పెరుగుతున్నాను. నా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల టీఎస్హెచ్ పరీక్ష చేశారు. హైపోథైరాయిడిజమ్ ఉందని తెలిసింది. నేను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? హోమియోలో శాశ్వతంగా తగ్గించే మందులు ఏమైనా ఉన్నాయా? – కుసుమ, భువనగిరి మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. శరీరంలోని వివిధ రకాల జన్యుక్రియల సమతౌల్యతకు టీ3, టీ4, టీఎస్హెచ్ హార్మోన్లు ఉపయోగపడతాయి. హైపోథైరాయిడ్ బరువు పెరిగే సమస్య. హైపోథైరాయిడిజమ్ అనేది మానవ శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల వస్తుంది. ఈ ఆధునిక కాలంలో సుమారు మూడు శాతం మంది హైపోథైరాయిడిజమ్తో బాధపడుతున్నారు. ఆకస్మికంగా బరువు పెరగడం ఈ సమస్యను సూచిస్తుంది. హైపోథైరాయిడిజమ్ ఏ వయసులోని వారికైనా రావచ్చు. స్త్రీలలో, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. శిశువుల్లో క్రెటినిజం అనే ఒక రకమైన హైపోథైరాయిడిజమ్ వస్తుంది. థైరాయిడిజమ్ నుంచి తగినంత మోతాదులో హార్మోన్ టీ3, టీ4 ఉత్పన్నం కావడానికి మన శరీరంలో చాలినంత అయోడిన్, టీఎస్హెచ్ (మెదడులోని పిట్యుటరీ గ్రంథి నుంచి ఉత్పన్నమయ్యే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) అవసరం. అయోడిన్ లోపించడం వల్ల హైపోథైరాయిడిజమ్ సమస్య వస్తుంది. లక్షణాలు: ∙ బరువు పెరగడం, కాళ్లు చేతుల్లో నీరు చేరడం ∙జుట్టు రాలడం, చర్మం పొడిబారినట్లు ఉండటం, మలబద్దకం ∙గొంతు బొంగురుపోవడం, తొందరగా అలసిపోవడం, కండరాల నొప్పి, ∙కోపం, అలసట, నిరాశ, కీళ్లనొప్పి ∙రుచి, వాసన, స్పర్శ తగ్గడం ∙సంతానలేమి, నీరసం, డిప్రెషన్ నిర్ధారణ పరీక్షలు: రక్తపరీక్షలు, థైరాయిడ్ యాంటీబాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్. చికిత్స: హైపోథైరాయిడిజమ్ సమస్యను అదుపు చేసే ఔషధాలు మందులు హోమియో విధానంలో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. హోమియోపతిలో సాధారణంగా కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్, అయోడమ్, థైరాడినమ్, స్పాంజియా వంటి మందులను రోగుల లక్షణాలను బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడటం వల్ల హైపోథైరాయిడిజమ్ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ తరచూ మూత్రంలో మంట.. ఎందుకిలా? నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట ఉంటోంది. ఇలా మాటిమాటికీ జ్వరం, మంట రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? – నీరజ, కాకినాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి. నాకు 34 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? – ప్రవీణ్కుమార్, పాలకొండ మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ ఇబ్బంది (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ý కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. నా వయసు 28 ఏళ్లు. నాకు ఏ విధమైన ఇబ్బందులూ లేవు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్కు చూపించుకుంటే బీపీ 170 / 120 అని చెప్పి, మందులు వాడాలన్నారు. మందులు వాడకపోతే భవిష్యత్తులో కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉందా? – మనోహర్, కోదాడ ఈ వయసులో ఏ కారణం లేకుండా బీపీ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు బాగా తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, మీ ఎత్తుకు తగినట్లుగా దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయాలి. నా వయసు 62 ఏళ్లు. షుగర్వల్ల రెండు కిడ్నీలూ పనిచేయడం లేదు. రెండేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. ఫిస్టులా ఆపరేషన్ కూడా అయ్యింది. డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో చలి, వణుకు వస్తున్నాయి. డయాలసిస్ కాకుండా ఇంకేమైనా పద్ధతులున్నాయా? – భూమయ్య, కరీంనగర్ ఇప్పుడు వాడుతున్న క్యాథెటర్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుంది. మొదట ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి తగ్గడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మ్ క్యాథ్ ద్వారా డయాలసిస్ చేయించుకోవడం మంచిది. ఇలా ఫిస్టులా సమస్య ఉన్నప్పుడు హోమ్ డయాలసిస్ (కంటిన్యువస్ ఆంబుల్యేటరీ పెరిటోనియల్ డయాలసిస్–సీఏపీడీ) చేయించుకోవడం మేలు. సీఏపీడీ వల్ల ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఇంట్లోనే ఉండి, ఈ డయాలసిస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ వృత్తినిర్వహణకూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. హోమ్ డయాలసిస్కు అయ్యే ఖర్చు హాస్పిటల్స్ డయాలసిస్ కంటే తక్కువ. కాబట్టి ఒకసారి మీ నెఫ్రాలజిస్ట్ను సంప్రదించి ఈ వివరాలు తెలుసుకోండి. డాక్టర్ విక్రాంత్రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ స్టెమ్సెల్ థెరపీ అందుబాటులోకి వచ్చిందా? న్యూరో కౌన్సెలింగ్ నేను గత 15 ఏళ్లుగా పక్షవాతం (పెరాలసిస్) వ్యాధితో బాధపడుతున్నాను. అయితే పెరాలసిస్కు మూలకణ చికిత్స (స్టెమ్సెల్ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు వార్తాపత్రికల్లో చదివాను. ఈ చికిత్స ప్రస్తుతం ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలు ఎంత మెరుగ్గా ఉంటాయన్న విషయాలను వివరంగా తెలియజేయగలరు. – శివకుమార్ రావు, కాళహస్తి ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా మెదడుకు గాయం కావడం వల్ల చనిపోయినా మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరుజ్జీవించలేవు. ఇలాంటి సమయంలో గతంలో మనం నేర్చుకున్న అవశాలను తిరిగి పొందడానికి దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. దాంతో మనం పోగొట్టుకున్న అంశం మళ్లీ మనకు దక్కుతుంది. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు. సాధారణంగా 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది. ఇక మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియ విషయంలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలుగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలుగను రూపొందించడం అన్నమాట. ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలాకాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి వచ్చిన ఫలితాలు అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధనదశలోనే ఉంది. ఇంకా చికిత్స వరకూ రాలేదు. డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరాలజిస్ట్ సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12 బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఎందుకిలా జరుగుతోంది?
నా వయసు 32. ఎత్తు 5.2 అడుగులు. బరువు 59 కిలోలు. ఆరేళ్ల కిందట పెళ్లయింది. నాలుగుసార్లు గర్భం దాల్చినా నిలవలేదు. నెల్లాళ్ల కిందటే నాలుగో అబార్షన్ జరిగింది. డాక్టర్ల సూచనలను పాటిస్తూనే ఉన్నాను. అయినా ఇలా ఎందుకు జరుగుతోంది? దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? – రామలక్ష్మి, హోసూరు నాలుగుసార్లు అబార్షన్లు అయ్యాయి అని రాశారు. అవి ఎన్ని నెలలకు అయ్యాయి? గర్భం దాల్చిన తర్వాత స్కానింగ్ చేశారా లేదా, పిండం ఏర్పడలేదన్నారా లేదా పిండం గుండె కొట్టుకోవట్లేదన్నారా, రక్త పరీక్షలు చేశారా అనే విషయాలను తెలిపి ఉంటే బాగుండేది. ఈ విషయాల మీద, కొంతమందిలో అబార్షన్లకు గల కారణాలను అంచనా వేసుకుని, దానిని బట్టి, మరలా గర్భం దాల్చిన ముందు నుంచే చికిత్స తీసుకుని తర్వాత గర్భం కోసం ప్రయత్నిస్తే, చాలావరకు అబార్షన్లు అయ్యే అవకాశం తగ్గుతుంది. కొంతమందిలో థైరాయిడ్, ప్రొజెస్టిరాన్ వంటి హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయంలో పొరలు, ఫైబ్రాయిడ్స్ అండాశయాలలో నీటి బుడగలు, జన్యుపరమైన సమస్యలు, మధుమేహ వ్యాధి, తల్లిలో శిశువుకి వ్యతిరేకంగా యాంటి ఫాస్పొలిపిడ్∙యాంటీ బాడీలు వంటి అనేక కారణాల వల్ల అబార్షన్లు మళ్లీ మళ్లీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానినే హ్యాబిట్యువల్ అబార్షన్స్ అంటారు. (భార్య, భర్త ఇద్దరూ రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స తీసుకుని, మరలా ప్రయత్నించండి) భార్యభర్తల్లో జన్యు పరమైన సమస్యలు ఉంటే పిండం సరిగా ఏర్పడకుండా అబార్షన్లు అవ్వవచ్చు. అలాంటప్పుడు భార్య, భర్త ఇద్దరూ జన్యుపరమైన పరీక్షలు కోసం కారియో టైపింగ్ చేయించుకుని సమస్య ఎక్కడుందో తెలుసుకోవటం మంచిది. నా వయసు 42. బరువు 70 కిలోలు, ఎత్తు 5.2 అడుగులు. నాకు మూడేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఆలస్యంగా పెళ్లి కావడం వల్ల గర్భందాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. సంతానం కోసం రెండుసార్లు ఐవీఎఫ్ ద్వారా చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. మరోసారి ప్రయత్నించవచ్చా? ఒకవేళ ప్రయత్నిస్తే ఎన్నాళ్లు ఆగాల్సి ఉంటుంది? ఐవీఎఫ్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? – జగదాంబ, కర్నూలు మీరు గమనించవలసిన విషయాలు. ఒకటి వయసు 42 సం., మీ ఎత్తుకి 70 కిలోలు అంటే అధిక బరువు. సాధారణంగా ఆడవారిలో 35 సం.లు దాటేకొద్దీ అండాల సంఖ్య, అలాగే వాటి నాణ్యత తగ్గటం మొదలవుతాయి. అవి 40 దాటితే నాణ్యత ఇంకా క్షీణిస్తుంది. అండం నాణ్యత సరిగా లేనప్పుడు, పిండం ఏర్పడటంలో లోపాలు, పిండాన్ని గర్భాశయం స్వీకరించకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల మీకు ఐవీఎఫ్ చేసినా ఫలితం దక్కకపోయి ఉండవచ్చు. వయసు తక్కువగా ఉండి ఉంటే మూడోసారి కూడా ప్రయత్నించి ఉండవచ్చు. మీకు ఇంకా చూడాలను కుంటే ఐవీఎఫ్ తర్వాత 6 నెలలు లేదా సంవత్సరం ఆగి ప్రయత్నించ వచ్చు. కాని మళ్లీ వయసు పెరుగుతోంది కదా. కాబట్టి మీరు ఈసారికి డోనార్ నుంచి (దాత నుంచి) స్వీకరించిన అండంతో, ఐవీఎఫ్ ప్రయత్నించ వచ్చు. దీనివల్ల, అండం నాణ్యత బాగా ఉన్నప్పుడు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. అలా చేసినా గర్భం నిలవకపోతే, మీ గర్భాశయం, పిండాన్ని స్వీకరించట్లేదు కాబట్టి, మీ ఆరోగ్య పరిస్థితి తెలిసిన చికిత్స ఇస్తున్న డాక్టర్ అభిప్రాయం మేరకు సరోగసీకి ప్రయత్నం చేయవచ్చు. ఈ లోపల మీరు పది కేజీల అధిక బరువు ఉన్నారు. బరువు తగ్గి చికిత్స మొదలుపెట్టడం మంచిది. లేదంటే గర్భం ఆగడానికి ఇబ్బందులు, ఒకవేళ గర్భంవచ్చిన తర్వాత 42 వయసుతో పాటు, బరువు వల్ల బీపీ, షుగర్ వంటి అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాకు ఇటీవలే పెళ్లి జరిగింది. నా వయసు 21. ఎత్తు 5.4, బరువు 47 కిలోలు. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్నాను. గత నెలలో ఊరికి వెళ్లినప్పుడు మూడు రోజులు పిల్స్ వేసుకోవడం కుదరలేదు. దీనివల్ల ఏవైనా సమస్యలు ఉంటాయా? – సుప్రియ, ఏలూరు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడేటప్పుడు, అవి తప్పకుండా రోజు ఒకే సమయానికి మర్చిపోకుండా వేసుకుంటేనే అవి సరిగా పనిచేసి, గర్భం రాకుండా ఆపుతాయి. వీటిని సాధారణంగా పీరియడ్ మొదలైన మూడవ రోజు నుంచి మొదలుపెట్టి, మొత్తం ప్యాకెట్ అయిపోయేవరకు వేసుకోవాలి. కొన్ని పిల్స్ ప్యాకెట్లో హార్మోన్ల మోతాదును బట్టి, కొన్నింటిలో 21 మాత్రలు, కొన్నింటిలో 24 మాత్రలు, కొన్నింటిలో 28 మాత్రలు. వాటిలో 21 హార్మోన్ మాత్రలు తెల్ల రంగులో, మిగతా 7 ఐరన్ మాత్రలు నల్ల రంగులో ఉంటాయి. హార్మోన్ల మాత్రలను నెలలో ఒకసారి కంటే ఎక్కువ మర్చిపోతే గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. నువ్వు 3 రోజులు ఏ రోజుల్లో ఎప్పుడు వేసుకోలేదో రాయలేదు. వీటిని ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, వారికి రెగ్యులర్ పీరియడ్స్ కాదా అనేదాని బట్టి, ఒకవేళ ఆఖరు రోజుల్లో మర్చిపోతే , గర్భం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ప్యాకెట్ మధ్యలోనే మాత్రలు వేసుకోకపోతే గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా, ట్యాబ్లెట్స్ సరిగా వేసుకోకుండా మర్చిపోవడం వల్ల, బ్లీడింగ్ తొందరగా మొదలవటం లేదా కొద్దికొద్దిగా కనిపించటం, ఆ నెలంతా బ్లీడింగ్లో అవకతవకలు కనిపించవచ్చు. డా‘‘ వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్