Raj Kundra
-
అశ్లీల చిత్రాల కేసు.. శిల్పాశెట్టి భర్తకు ‘ఈడీ’ నోటీసులు
ముంబయి:వ్యాపారవేత్త,బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ రాజ్కుంద్రాకు నోటీసులిచ్చింది.కాగా,ఇటీవలే రాజ్కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం. -
అశ్లీల చిత్రాల కేసు.. రాజ్ కుంద్రా నివాసాల్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు చెందిన ఆఫీసులు, నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయి. అశ్లీల చిత్రాల నిర్మాణ, ప్రసారానికి సంబంధించిన కేసులో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాజ్ కుంద్రా అనుచరుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు.ఇకపోతే.. అశ్లీల చిత్రాలు నిర్మించి వాటిని ప్రసారం చేశారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాను 2021 అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో కుంద్రా రెండు నెలల పాటు జైలు జీవితం గడిపారు. 2021 సెప్టెంబర్లో కుంద్రాకు బెయిల్ రావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఇక, ఈ కేసులో రాజ్ కుంద్రానే కుట్రదారుడు అంటూ ముంబై పోలీసు అధికారులు ఆరోపించారు.మరోవైపు.. పోలీసుల చార్జ్ షీట్ ప్రకారం.. సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చిన యువతలతో కుంద్రా అశ్లీల చిత్రాలు నిర్మించినట్టు తెలిపారు. దీంతో, పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణ నేపథ్యంలో తాజాగా ఈడీ అధికారుల.. ముంబై సహా యూపీలోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. -
శిల్పాశెట్టి దంపతులకు భారీ ఊరట కల్పించిన కోర్టు
క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ కేసు విషయంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి , రాజ్కుంద్రా దంపతులకు కాస్త ఊరట లభించింది. మనీలాండరింగ్ మోసాలకు పాల్పడ్డారని వారి ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్తో పాటు పుణెలోని బంగ్లా, ఫామ్హౌస్ను అక్టోబర్ 13వ తేదీలోపు ఖాళీ చేయాలని ఈడీ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వాటిని సవాలు చేస్తూ.. కొద్దిరోజుల క్రితం ఈ జంట ముంబై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా వారి పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. దీంతో శిల్పాశెట్టి దంపతులకు కాస్త ఊరట లభించింది.ఈ కేసు గురించి తాజాగా శిల్పాశెట్టి దంపతుల తరఫు న్యాయవాది ఇలా వివరణ ఇచ్చారు. 2017లో జరిగిన 'గెయిన్ బిట్కాయిన్ పోంజీ స్కీమ్'తో తన క్లయింట్స్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. శిల్పాశెట్టి దంపతుల ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన తెలిపారు. అయినా ఈడీ పరిధిలో ఈ కేసు లేదని చెప్పారు. అయినప్పటికీ తమ క్లయింట్స్ ఈ కేసు విషయంలో ఈడీ అధికారులకు సహకరిస్తారని పేర్కొన్నారు.బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్కుంద్రా 285 బిట్కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ప్రస్తుతం వాటి విలువ రూ. 150 కోట్లు పైమాటేనని అంచనా ఉంది. ఈ క్రమంలోనే వారి ఆస్తులను ఈడీ జప్తు చేసేందుకు నోటీసులు జారీ చేసింది. -
గోల్డ్ స్కీమ్ పేరుతో మోసం..శిల్పా శెట్టిపై కేసు నమోదు
బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై తాజాగా కేసు నమోదు అయింది. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు బోగస్ బంగారం పథకంతో తనను మోసగించారని ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం ఫిర్యాదు ఫిర్యాదు చేశాడు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వార తాము మోసపోయినట్లు వారు పేర్కొన్నారు. శిల్పా శెట్టి దంపతులపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టుకు కూడా వెళ్లారు.శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేయాలని ముంబై అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఎన్.పి. మెహతా ఆదేశించారు. వారు స్థాపించిన సత్యుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మోసం జరిగినట్లు అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి వెళ్లడించారు. ఆ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు, ఒక ఉద్యోగి కలిసి ఈ మోసానికి పాల్పడినట్లు జడ్జి ధ్రువీకరించారు.2014లో సత్యుగ్ గోల్డ్ సంస్థ కొత్తగా గోల్డ్ స్కీమ్ను ప్రకటించింది. మేరా గోల్డ్ ప్లాన్లో నెల నెలా అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కస్టమర్లు కట్టే మొత్తానికి సంబంధించి వారి అకౌంట్లో అప్పటి బంగారం రేటును బట్టి అంత మొత్తం పసిడిని (నాలుగు దశాంశ స్థానాల దాకా) కంపెనీ జమ చేస్తుందని అప్పట్లో వారు ఊదరగొట్టారు. దానిని నమ్మిన చాలామంది అందులో చేరారు.2014లో సచిన్ జోషి అనే ఎన్నారై శిల్పా శెట్టి దంపతులకు చెందిన సత్యయుగ్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ గోల్డ్ స్కీమ్లో చేరాడు. ఐదేళ్ల సమయంలో రూ.18.58 లక్షలతో కిలో బంగారం కొన్నట్లు సచిన్ జోషి తెలిపాడు. కాలపరిమితి తర్వాత 2019లో దానిని రిడీమ్ చేసుకునేందుకు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఉన్న సత్యయుగ్ కంపెనీ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ క్లోజ్డ్ బోర్డు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కంపెనీ గురించి విచారిస్తే శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కంపెనీ డైరెక్టర్లుగా 2017లో రాజీనామా చేసినట్లు తెలుసుకున్నాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న ఆయన కోర్డు మెట్లు ఎక్కాడు. ఇప్పుడు పూర్తి ఆధారాలతో శిల్పా శెట్టిపై మోసం కేసు నమోదు అయింది. -
శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు జప్తు.. ఆ మోసం వల్లే!
క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్కు సంబంధించిన మనీలాండరింగ్ మోసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా శిల్పా శెట్టి- రాజ్ కుంద్రాకు చెందిన రూ.97 కోట్ల స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. ఇందులో శిల్పా శెట్టి పేరు మీదున్న ముంబైలోని జుహు ఫ్లాట్తో పాటు పుణెలోని బంగ్లా కూడా ఉంది. అలాగే రాజ్కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్ చేసినట్లు వెల్లడించింది. అమాయక జనాలను మోసం చేసి బిట్కాయిన్లో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని అమాయక జనాలకు ఆశ చూపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా రూ.6,600 (2017 నాటి విలువ) కోట్లను వసూలు చేశారు. తీరా డబ్బు చేతికి వచ్చాక ప్లేటు తిప్పేసి ఇన్వెస్టర్లను మోసం చేశారు. దీనిపై మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు పలుచోట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మోసం బయటపడటంతో సదరు బిట్కాయిన్ సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో సింపీ భరద్వాజ్, నితిన్ గౌర్, నిఖిల్ మహాజన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ తనవద్దే బిట్కాయిన్లు ఈ ముగ్గురూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అజయ్ భరద్వాజ్, మహేంద్ర భరద్వాజ్ మాత్రం పరారీలో ఉన్నారు. ఈ మోసం వెనక ఉన్న మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్(ఈయన 2022లోనే చనిపోయారు) గతంలో రాజ్కుంద్రాకు 285 బిట్కాయిన్లు ఇచ్చాడు. దీనితో రాజ్కుంద్రా ఉక్రెయిన్లో బిట్కాయిన్ మైనింగ్ ఫామ్ ఏర్పాటు చేయాలని భావించాడు. ఇప్పటికీ ఆ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, దాని విలువ రూ.150 కోట్లుగా ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే అతడి ఆస్తులను జప్తు చేసింది. చదవండి: కొత్తింట్లోకి బుల్లితెర జంట గృహప్రవేశం -
దుస్తులిప్పి అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు: శిల్పాశెట్టి భర్త
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా జీవితంలో నీలి చిత్రాల కేసు చెరగని మచ్చగా నిలిచిపోయింది. వ్యాపారవేత్తగా ఎంతో పేరు సంపాదించినా.. 2021లో నమోదైన నీలిచిత్రాల కేసుతో అతని జీవితం వివాదాల్లో కూరుకుపోయింది. జైలు నుంచి బయటకు వచ్చాక చాలా కాలంపాటు మీడియాకు దూరంగా ఉన్నాడు. బిజినెస్ వ్యవహారాల్లోనూ అంతగా జోక్యం చేసుకోలేదట. కానీ ఇటీవల ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. మళ్లీ బిజినెస్ పనుల్లో బిజీ అయ్యారు. మరోవైపు తన జీవితంలో జరిగిన కీలక ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న యూటీ 69 అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్లో రాజ్కుంద్రా చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జైలు జీవితం గురించి, అక్కడ పడిన ఇబ్బందుల గురించి వివరించాడు. ‘జైలులో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. జైలుకు వెళ్లిన తొలి రోజే నా దుస్తులన్ని విడిపించి..అందరి ముందు నగ్నంగా నిలబెట్టారు. ఏవైనా నిషేధిత పదార్థాలు తీసుకోచ్చావా? అంటూ వంగోబెట్టి వెనుకభాగం వైపు చెక్ చేశారు. అలాంటి ట్రీట్మెంట్ చూసిన తర్వాత బతికున్న చచ్చినట్టే అనే భావన కలిగింది. ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు, ప్రతిష్టలు మట్టిలో కలిసిపోయాయని బాధపడ్డాను. జైలులో నా పరిస్థితి అలా ఉంటే.. బయట మీడియా కూడా నా గురించి ఏవోవో తప్పుడు కథనాలు రాసి..దుస్తులు విడిపించినంత పని చేసింది. అవమాన భారంతో కుంగిపోయాను. ఒకానొక దశలో జైలులోనే చనిపోవాలనుకున్నాను. కానీ ఏదో ఒక రోజు అసలు నిజం బయటకు వస్తుందంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను’ అని రాజ్కుంద్రా చెప్పుకొచ్చారు. -
నీలిచిత్రాల కేసు.. దేశం వదిలి వెళ్లిపోదామనుకున్న శిల్పా శెట్టి!
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 2021లో నీలి చిత్రాల కేసులో కొంతకాలం పాటు జైలు శిక్ష అనుభవించిన అతడు తర్వాత డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మీడియాకు తన ముఖం చూపించడానికి కూడా ఇష్టపడలేదు. ఇటీవలే తన జీవిత కథ ఆధారంగా యూటీ 69 అనే బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించాడు. ఇందులో రాజ్ కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన జైలు జీవితం గురించి చెప్పుకొచ్చాడు. వారానికి ఒకసారి ఫోన్ కాల్.. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'జైల్లో ఉన్నప్పుడు వారానికి ఒకసారే ఫోన్ మాట్లాడనిచ్చేవాళ్లు. అది కూడా కొద్ది నిమిషాలే! అందుకే శిల్పా, నేను ఒకరికి ఒకరం ఉత్తరాలు రాసుకునేవాళ్లం. ఆమె రాసే ఉత్తరాలు చదువుకుని బయట ఏం జరుగుతుందో తెలుసుకునేవాడిని. శిల్పాకు నా గురించి బాగా తెలుసు. నేను నా బిజినెస్లో, నా జీవితంలో ఎంత నిజాయితీగా ఉండేవాడిని, ఎలాంటి విధివిధానాలు పాటిస్తానో అన్నీ తెలుసు. అందుకే, నాకెంతో సపోర్ట్ చేసింది. జైల్లో ఉన్న సమయంలో తను మొదటి సారి ఫోన్ చేసి ఏమందంటే.. రాజ్.. ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవాలి. నా మీద నమ్మకముంచు అని చెప్పింది. ఆమె మాటలు విన్నాకే జీవితాన్ని కొనసాగించాలనుకున్నాను. అవమానభారంతో కుంగిపోయా.. నిజానికి నేను కుంగిపోయి ఉన్నాను. జైలు లోపలే నా జీవితం ముగించేయాలనుకున్నాను. ఎందుకంటే అప్పటికే నా పేరుప్రతిష్టలు దెబ్బతిన్నాయి. ఎంతో అవమానంగా ఉంది. నా వల్ల మీడియా నా భార్యాపిల్లలు, తల్లిదండ్రుల వెంటపడుతూనే ఉంటుంది. అదంతా ఆలోచిస్తేనే చాలా భయమేసింది, బాధేసింది. బయట ఏం జరుగుతుందనేది నేను అంచనా వేయగలను. కానీ అంతకు మించి ఏమీ చేయలేను. జీవితంలో ఇది నాకు సంక్లిష్ట సమయం. నిజమేంటనేది నాకు తెలుసు, అది ఏదో ఒక రోజు బయటకు రాక తప్పదు అని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. దేశం వదిలేసి వెళ్లిపోదామంది నా భార్య అయితే దేశం వదిలేసి వెళ్లిపోదామంది. నువ్వు లండన్లో పుట్టి పెరిగావు. అక్కడంతా వదిలేసి నాకోసం ఇండియా వచ్చావు, ఇక్కడే సెటిలయ్యావు. విదేశాల్లో ఉండాలనుందంటే చెప్పు.. అక్కడికే వెళ్లిపోదాం అని అడిగింది. కానీ నాకు భారత్ అంటే ఇష్టమని, ఈ దేశాన్ని వదిలేయలేనని చెప్పాను. వేలకోట్ల స్కామ్లు చేసి తప్పు చేసిన వారు దేశం విడిచి వెళ్తారు. నేనే తప్పూ చేయలేదు, నేను ఎక్కడికీ వెళ్లనని చెప్పాను' అని తెలిపాడు రాజ్ కుంద్రా. చదవండి: ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. తర్వాత భిక్షగత్తెగా మారి.. -
విడిపోయామంటూ శిల్పాశెట్టి భర్త ట్వీట్.. భార్యతో విడాకులు?
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా ట్విటర్లో పెట్టిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 'మేము విడిపోయాం.. దయచేసి ఈ కష్ట సమయం నుంచి బయటపడేందుకు కొంత సమయం ఇవ్వండి' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. దీనికి గుండె ముక్కలైన ఎమోజీతో పాటు చేతులు జోడిస్తున్న గుర్తును జత చేశాడు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఈ ట్వీట్ చేశాడు. సడన్గా ఏమైంది? ఇది చూసిన జనాలు శిల్పా శెట్టి, రాజ్కుంద్రా విడాకులు తీసుకుంటున్నారా? మొన్నటివరకు బాగానే ఉన్నారుగా, ఇంతలోనే ఏమైంది? అని షాకవుతున్నారు. మరికొందరు మాత్రం ఆయన విడిపోతుంది తన భార్యతో కాదు మాస్క్తో అని అభిప్రాయపడుతున్నారు. కాగా 2021లో నీలిచిత్రాల కేసులో అరెస్టయిన రాజ్కుంద్రా కొంతకాలంపాటు జైలు జీవితం గడిపాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియాకు తన ముఖం చూపేందుకు కూడా ఇష్టపడలేదు. ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక మాస్క్తోనే కనిపించేవాడు. ప్రమోషన్ స్టంట్? ఇటీవలే అతడు తన జీవితాన్ని బయోపిక్గా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. యూటీ 69 అనే టైటిల్తో తెరకెక్కిన ఈ మూవీలో రాజ్కుంద్రాయే ప్రధాన పాత్రలో నటించాడు. కాగా చాలాకాలంగా మాస్క్ చాటున ముఖం దాచుకుంటున్న అతడు యూటీ 69 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాస్క్ తీసేసి మీడియా ముందు నిలబడ్డాడు. బహుశా మాస్క్తో ఇక సంబంధం లేదని ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. కాగా రాజ్కుంద్రా, శిల్పాశెట్టి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వియాన్, సమీషా అని ఇద్దరు సంతానం. We have separated and kindly request you to give us time during this difficult period 🙏💔 — Raj Kundra (@onlyrajkundra) October 19, 2023 చదవండి: అజిత్తో షూటింగ్ డుమ్మా కొట్టి మరీ లియో మూవీ చూసిన త్రిష.. థియేటర్లో విజయ్ అభిమాని ఎంగేజ్మెంట్ -
అలా చెప్పగానే నా భార్య నాపైకి చెప్పు విసిరింది: శిల్పా శెట్టి భర్త
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలాకాలంగా తన ముఖాన్ని జనాలకు చూపించకుండా జాగ్రత్తపడుతున్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక మాస్క్తోనే కనిపిస్తూ వస్తున్నారు. అయితే చాలాకాలం తర్వాత బుధవారం జరిగిన ఓ వేడుకలో తన మాస్క్ తీసేసి కనిపించాడు. ఇంతకీ ఆ వేడుక ఏంటనుకుంటున్నారా? తనకు సంబంధించినదే! రాజ్ కుంద్రా.. తన జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల సమాహారాన్ని సినిమాగా తీసుకువస్తున్నాడు. ఇందులో అతడే హీరోగా నటించాడు. దీనికి యూటీ 69 అనే టైటిల్ ఖరారు చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనే తన ముఖాన్ని చూపించాడు. ఈ సందర్భంగా రాజ్కుంద్రా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'నా జీవితకథను బయోపిక్గా తీయాలనుకున్నాను. ఈ విషయాన్ని నా భార్యకు చెప్పినప్పుడు తను నాకు కొంత దూరంలో నిలబడి ఉంది. సినిమా చేస్తానని చెప్పానో లేదో.. తను నా మీదకు చెప్పు విసిరింది. నేను సినిమా తీయాలన్న ఆలోచన తనకు నచ్చలేదు. మొదట్లో ఇష్టపడలేదు కానీ తర్వాత తన మనసు మార్చుకుని నాకు అండగా నిలబడింది' అని చెప్పుకొచ్చాడు. కాగా నీలిచిత్రాల కేసులో రాజ్కుంద్రాను ముంబై పోలీసులు 2021లో అరెస్ట్ చేశారు. కొంతకాలంపాటు జైలు జీవితం అనుభవించిన తర్వాత ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. తన సినిమాలో జైలు జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను కూడా చూపించనున్నాడు రాజ్ కుంద్రా. షహ్నావజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవంబర్ 3న విడుదల కానుంది. చదవండి: నామినేషన్స్.. మా రక్తం ఉడికిపోయింది.. థూ అనేంత తప్పు ఏం చేశాడంటూ భోలె చెల్లి ఫైర్ -
ఇండియాలో అమ్ముడయ్యేది ఆ రెండే.. హీరోయిన్ భర్త షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా చాలా రోజుల తర్వాత తన మొహాన్ని ప్రేక్షకులను చూపించారు. ఆయన నటించిన తాజా చిత్రం యూటీ69. తన జీవితం ఆధారంగానే ఈ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా యూటీ69 ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రాజ్ కుంద్రా మాట్లాడారు. వారికి అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముంబయిలో జరిగిన ఈవెంట్కు హాజరైన రాజ్కుంద్రా మీడియా ప్రతినిధులతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియాలో రెండు మాత్రమే ప్రధానంగా అమ్ముడవుతాయి.. అందులో ఒకటి షారుక్ ఖాన్ అయితే.. మరొకటి శృంగారం అని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొహాన్ని మీడియాకు చూపించారు. ఇన్ని రోజులు ఎక్కడ చూసినా మాస్క్ లేదా హెల్మెట్ ధరించి కనిపించారు. అంతే కాకుండా పోర్న్ కేసు తన కుటుంబంపై చాలా ప్రభావం చూపిందని తెలిపారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా రాజ్ కుంద్రా ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా తాను జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారని అన్నారు. రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'ఇది నాకు కేవలం సినిమా మాత్రమే కాదు. నా జీవితం ఎంతో అయోమయంగా మారింది. అందులోని ఒక భాగాన్ని ఈ సినిమా ద్వారా మీతో పంచుకుంటున్నా.' అని అన్నారు. ఈ చిత్రం నవంబర్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. 2021లో పోర్న్ కేసులో రాజ్ కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలపాటు జైలులో ఉన్న ఆయన ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. -
నువ్వు నా డ్రెస్ గురించి మాట్లాడతావా?.. శిల్పాశెట్టి భర్తపై బిగ్బాస్ బ్యూటీ ఫైర్!
తన విచిత్రమైన వేషధారణతో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోన్న బిగ్బాస్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. సినిమాల కంటే తన డ్రెస్సులతోనే పాపులారిటీ దక్కించుకుంది. ప్రతి రోజు ఏదో ఒక వెరైటీ దుస్తులతో వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అయితే ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ డ్రెస్సింగ్ సెన్స్పై శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అతను చేసిన కామెంట్స్పై ఉర్ఫీ జావెద్ తీవ్రస్థాయిలో మండిపడింది. తన ఇన్స్టా స్టోరీస్లో రాస్తూ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల రాజ్ కుంద్రా తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న వీడియోలో ఉర్ఫీ జావెద్ గురించి ప్రస్తావించారు. రాజ్ కుంద్రా ఏం ధరిస్తాడు.. అలాగే ఉర్ఫీ జావెద్ ఏం ధరించదు? అనే విషయాన్ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుందని కామెంట్స్ చేశారు. అయితే అతను తన డ్రెస్సింగ్పై చేసిన కామెంట్స్ ఉర్ఫీకి ఆగ్రహం తెప్పించాయి. 'ఇతరుల శరీరంతో వ్యాపారం చేసిన వ్యక్తి.. నా దుస్తులపై మాట్లాడతాడా అంటూ.. క్షమించండి పోర్న్ కింగ్' అంటూ ఘాటుగానే స్పందించింది. కాగా.. ఉర్ఫీ పంచ్ బీట్ సీజన్- 2, బడే భయ్యా కి దుల్హనియా, మేరీ దుర్గా, బేపన్నా వంటి షోలలో కనిపించింది. కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో పాల్గొంది. రాజ్కుంద్రాపై కేసు శిల్పాశెట్టి భర్త, రాజ్కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మొబైల్ యాప్ల ద్వారా అశ్లీల వీడియోలను పంపిణీ చేయడం వంటి ఆరోపణలపై వ్యాపారవేత్తను జూలై 2021లో రాజ్కుంద్రాను ముంబయి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల తర్వాత అతనికి బెయిల్ మంజూరైంది. View this post on Instagram A post shared by Raj Kundra (@onlyrajkundra) -
'భార్య నిద్రపోగానే ఆమె చెల్లితో పార్టీకి వెళ్తా, తనకు పెళ్లి కాకూడదు'
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా ఆ మధ్య పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే! అప్పటినుంచి ఆయనపై వ్యతిరేకత బీభత్సంగా పెరిగిపోయింది. అటు రాజ్కుంద్రా కూడా మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించే తిరుగుతున్నాడు. ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక కొత్తరకం మాస్కుతోనే బయట దర్శనమిస్తున్నాడు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చెల్లితో కలిసి పార్టీలకు తిరుగుతున్నానని గతంలో ఓ షోలో వెల్లడించాడు. భార్య పడుకోగానే మరదలితో పార్టీ తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది. ఈ వీడియోలో రాజ్ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు షమితా శెట్టితో కలిసి ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేవి కావు. రాత్రి 9 అవగానే నిద్రపోయేది. నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెలిని పిలిచేవాడిని. తను నో చెప్పకుండా తోడు వచ్చేది. ఆమెకు త్వరగా పెళ్లి కాకూడదు అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్లోకి ముందు షమిత పేరే వస్తుంది. అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది. అందుకే షమితాకు త్వరగా పెళ్లవాలని నేను కోరుకోను' అని చెప్పుకొచ్చాడు. కాగా శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాల నిశ్చితార్థం 2009 ఫిబ్రవరిలో జరిగింది. అదే ఏడాది నవంబర్ 22న పెళ్లి చేసుకున్నారు. శిల్పా శెట్టి వెండితెర ప్రయాణం బాజీఘర్ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన శిల్పా శెట్టి 'సాహస వీరుడు సాగర కన్య' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. వీడెవడండీ బాబు, ఆజాద్, భలేవాడివి బాసు అనే తెలుగు చిత్రాలు చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుండగా ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్లోనూ కనిపించనుంది. View this post on Instagram A post shared by Laughter Club 💠 (@laughterclubdelhi) చదవండి: పాలబుగ్గల పసివాడిని గుర్తుపట్టారా? మెగాస్టార్ వారసుడు.. దుబాయ్లో ఉద్యోగం వదిలి హీరోగా.. తెలుగులో సూపర్ క్రేజ్! -
ఆ కేసులో రాజ్కుంద్రాకు ముందస్తు బెయిల్.. వారిద్దరికీ కూడా..!
పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ఊరట లభించింది. రాజ్ కుంద్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాజ్ కుంద్రా, పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాలకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలతో వీరిపై కేసు నమోదైంది. దీంతో వారికి ఊరట లభించింది. గతంలోనూ రాజ్ కుంద్రా అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులు దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. ( ఇది చదవండి: Raj Kundra Case: ఈ కేసులో నన్ను బలి పశువుని చేశారు: కోర్టులో రాజ్కుంద్రా వాదన) ఈ కేసులో రాజ్ కుంద్రా జూలై 2021లో ఈ కేసులో అరెస్టయ్యాడు. ఏడాది తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ఆయనపై ఒక మహిళ ఆరోపణలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును ముంబై క్రైం బ్రాంచ్కు బదిలీ చేయగా.. ఎఫ్ఐఆర్లో షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండేలను సహ నిందితులుగా పేర్కొన్నారు. -
ముదిరిన బాలీవుడ్ భామల వివాదం.. రాఖీ సావంత్పై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు
బాలీవుడ్ హీరోయిన్స్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మీటు వివాదంలో బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ సాజిద్ ఖాన్పై షెర్లిన్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో రాఖీ సావంత్ సాజిద్ ఖాన్కు మద్దతుగా మాట్లాడడంతో వివాదం నడుస్తోంది. దీంతో ఒకరిపై ఒకరు పోలీసులకు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంబోలి, ఓషివారా పోలీస్ స్టేషన్లలో రాఖీపై ఫిర్యాదు చేసినట్లు షెర్లిన్ చోప్రా ట్వీట్ ద్వారా వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన షెర్లిన్ చోప్రా అనంతరం మీడియాతో మాట్లాడింది. కెమెరాల ముందు ఓ వీడియోను ప్రదర్శిస్తూ రాఖీ సావంత్పై విరుచుకుపడింది. నా గురించి కాదు బయట మాట్లాడాల్సింది.. మొదట మీ సోదరుడు రాజ్ కుంద్రా గురించి బహిర్గతం చేయి అంటూ సవాల్ విసిరింది. సాజిద్ ఖాన్పై మీటూ ఆరోపణలు చేసినవారు చెప్పిందంతా అబద్ధమేనా అంటూ రాఖీ సావంత్పై షెర్లిన్ చోప్రా ఫైరయ్యారు. రాఖీ సావంత్, ఆమె లాయర్ సైతం ఆధారాలతో సహా షెర్లిన్ చోప్రాపై కేసు పెట్టినట్లు తెలిపారు.షెర్లిన్ డబ్బు కోసం శక్తివంతమైన వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ సావంత్ ఆరోపించింది. 2018లో సాజిద్ ఖాన్పై మీటూ ఆరోపణలు రావడంతో పలువురు నటీమణులు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించారు. షెర్లిన్తో పాటు సలోని చోప్రా, అహానా కుమ్రా, మందన కరిమి సహా అతనిపై ఆరోపణలు చేశారు. नौटंकीबाज़ राखी सावंत तैयार हो जाए गिरफ़्तार होने के लिए। IPC 354 IPC 354A IPC 499 IPC 500 IPC 509 IPC 503 IT ACT 67A (Sec 4 of Indecent Representation Act 1999) P.S. कांउटर कंप्लेंट करने से अपराध कम नहीं होने वाले 😊@mieknathshinde @Dev_Fadnavis @CPMumbaiPolice @MumbaiPolice pic.twitter.com/czz9lfakyj — Sherlyn Chopra (शर्लिन चोपड़ा)🇮🇳 (@SherlynChopra) November 6, 2022 -
పోర్నోగ్రఫీ కేసులో నన్ను బలి పశువుని చేశారు: రాజ్కుంద్రా వాదన
పోర్నోగ్రఫీ కేసులో వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ఊరట లభించింది. రాజ్ కుంద్రా అరెస్టు కాకుండా సుప్రీంకోర్టు నాలుగు వారాల బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో అశ్లీల విడియోలు తీసి అప్ లోడ్ చేశానన్న నేరారోపణలో తాను బలిపశువునయ్యానని రాజ్ కుంద్రా వాపోయాడు. ఈ కేసులో ఏ ఒక్క మహిళా తనకు వ్యతిరేకంగా చెప్పలేదన్నారు. దర్యాప్తు సంస్థ కూడా ఏ ఒక్క ఆధారాన్ని సాక్ష్యాలతో నిరూపించలేకపోయిందని చెప్పాడు. తనపై మోపిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించాడు. తన న్యాయవాది ప్రశాంత్ పాటిల్ ద్వారా రాజ్కుంద్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. చదవండి: ఆ ఉసురు ఊరికే పోదు.. అనసూయ సంచలన ట్వీట్ అభియోగపత్రంలో కానీ, సప్లిమెంటరీ చార్జీషీట్లో ఏ ఒక్క మహిళ కూడా తనను కుంద్రా బెదిరించాడని, బలవంతం పెట్టడాని కానీ, వీడియో తీసినట్టు చెప్పలేదని పటిషన్లో పేర్కొన్నాడు. ఇక తాను రాహస్యంగా ఎటువంటి కంటెంట్ను సృష్టించలేదని, తాను అశ్లీల వీడియోలను ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం కానీ చేయలేదన్నాడు. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ మెటీరియల్ పంపిణీ కోసం ‘హాట్ షాట్స్’ అనే ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్టు పోలీసులు తమ చార్జీషీట్లో పేర్కొన్నారు. దీన్ని రాజ్ కుంద్రా ఖండించారు. దర్యాప్తు సంస్థ తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా సంపాదించలేకపోయిందని రాజ్కుంద్రా కోర్టుకు విన్నవించుకున్నాడు. కాగా ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు.. ఇప్పటికే రాజ్ కుంద్రా, నటి గహనా వశిష్ట్, షెర్లిన్ చోప్రా తదితరులను విచారించిన సంగతి తెలిసిందే. చదవండి: అమెజాన్లో దూసుకుపోతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ -
విడాకుల దిశగా శిల్పా శెట్టి-రాజ్కుంద్రా!, అందుకేనా ఆస్తుల పంపకాలు?
Shilpa Shetty And Raj Kundra: గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో భర్తపై కోపంతో ఉన్న శిల్పా అతడితో విడాకులు తీసుకోనుందంటూ అప్పట్లో జోరుగా వార్తలు వినిపించాయి. అయితే గతంలో విడాకుల రూమర్లను శిల్పా కొట్టిపారేయడంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఇక తాజాగా వీరి విడాకుల వ్యవహరం మరోసారి చర్చనీయాంశమైంది. చదవండి: Mahesh Babu: డైరెక్టర్ శంకర్కు మహేశ్ క్షమాపణలు, కారణమేంటో తెలుసా? రాజ్కుంద్రా తన పేరుపై ఉన్న ఆస్తులను శిల్పా పేరు మీదకు మార్చడంతో మరోసారి ఈ జంట విడాకులు వార్తల్లో నిలిచింది. కాగా రీసెంట్గా తన పేరుపై ఉన్న విలువైన ఆస్తులను రాజ్కుంద్రా, శిల్పాశెట్టి పేరు మీదకు మార్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. దీంతో సడెన్గా ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు మార్చడం వెనుక అంతర్యం ఏముందా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంతో ఈ జంట విడాకులకు సిద్ధమైందని, త్వరలోనే వారి వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. చదవండి: శిల్పాశెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చిన రాజ్కుంద్రా! పోర్నోగ్రఫి కేసు తర్వాత రాజ్కుంద్రా, శిల్పాల మధ్య తరచూ విభేదాలు వస్తుండటంతో విరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ నేపథ్యంలోనే ఈ జంట మధ్య ఆస్తుల పంపకం జరుగుతుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై శిల్పాశెట్టి దంపతులు స్పందించే వరకు వేచి చూడాలి. కాగా రాజ్కుంద్రా.. ముంబైలో జుహులోని ఉన్న తన ఇల్లు, అపార్ట్మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడట. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లను కూడా శిల్పా పేరు మీదకు బదలాయించినట్లు తెలుస్తోంది. -
శిల్పాశెట్టికి భారీగా ఆస్తులు రాసిచ్చిన రాజ్కుంద్రా!
గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని, బెయిల్పై బయటకు వచ్చిన వ్యాపారవేత్త రాజ్కుంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆస్తులను భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బదలాయించారు. ముంబైలోని జుహులో ఉన్న తన ఇల్లు, అపార్ట్మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు కాగా దీని మొత్తం విలువ రూ.38.5 కోట్లు. జనవరి 21న శిల్పాశెట్టి స్టాంప్ డ్యూటీ కింద రూ.1.9 కోట్లు చెల్లించగా ఈ లావాదేవీల వివరాలను జప్కే డాట్ కామ్ వెల్లడించింది. తన పేరిట ఉన్న ఆస్తులను రాజ్కుంద్రా భార్య శిల్పాశెట్టి పేరిట ఎందుకు మార్చారనే వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇన్స్టాలోకి రాజ్ కుంద్రా రీఎంట్రీ.. ఒక్కరిని మాత్రమే ఫాలో
Raj Kundra Reentry To Instagram Fallows Only One Account: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. జూలై 19, 2021న అరెస్టయిన రాజ్ కుంద్రా సెప్టెంబర్లో బెయిల్పై విడుదల అయ్యాడు. పోర్నో గ్రఫీ కేసులో ఇరుక్కోవడంతో తన ఇన్స్టాలోని పోస్టులను తొలగించడమే కాకుండా పూర్తిగా డిలీట్ కూడా చేశాడు. తాజాగా మళ్లీ తిరిగి సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు రాజ్ కుంద్రా. ఇన్స్టా గ్రామ్ అకౌంట్ను తిరిగి ఓపెన్ చేసి ఒకే ఒక్కరిని ఫాలో అవుతున్నాడు ఈ వ్యాపార వేత్త. ప్రస్తుతం రాజ్ కుంద్రా ఫాలో అయ్యే అకౌంట్ ఎవరిదా అనే ఆలోచనలో పడ్డారు నెటిజన్స్. రాజ్ కుంద్రా కొత్త అకౌంట్కు సుమారు 10 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. ఆ అకౌంట్కు వెరిఫైడ్ మార్క్ కూడా ఉంది. రాజ్ కుంద్రాను 10 లక్షల మంది ఫాలో అయితే అతను మాత్రం ఒకే ఒక అకౌంట్ను ఫాలో అవుతున్నాడు. ఆ అకౌంట్ అతని భార్య శిల్పా శెట్టిదో లేదా అతని కుమారుడు వియాన్ది అని అనుకుంటే పొరపడినట్లే. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా బాంద్రాలోని ఒక సీ ఫుడ్ రెస్టారెంట్ను ఫాలో అవుతున్నాడు. ఆ రెస్టారెంట్లో అతడికి భాగస్వామ్యం ఉంది. అందుకే ఆ అకౌంట్ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2021 డిసెంబర్లో తాను ఫోర్నోగ్రఫీ చిత్రాలను నిర్మించలేదని, డిస్ట్రిబ్యూట్ చేయలేదని చెప్పుకొచ్చాడు రాజ్ కుంద్రా. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదీ చదవండి: సాయిబాబా సన్నిధిలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా -
సాయిబాబాకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రార్థనలు
Shilpa Shetty Raj Kundra Visits Shirdi Temple Offers Prayers: గతేడాది పలువురు తారలకు కొంచెం కలిసి రాలేదనే చెప్పాలి. అందులో ముఖ్యంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఆ ఆరోపణల నుంచి ఉపశమనం పొందుతున్నారు. అందుకే ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే షిరిడీ పర్యటనలో ఉన్నారు శిల్పా, రాజ్ కుంద్రా. ఈసారి వీరితో పాటు శిల్పా శెట్టి సోదరుడు రాఖీ కూడా ఉన్నట్లు సమాచారం. వారు తీర్థయాత్రలో ఉన్నట్లు తన ఇన్స్టా గ్రామ్ వేదికగా తెలిపుతూ ఓ వీడియోను షేర్ చేసింది శిల్పా. ఇదీ చదవండి: నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి ఈ వీడియో క్లిప్కు 'సబ్ కా మాలిక్ ఏక్ (దేవుడు ఒక్కడే). శ్రద్ధ, పట్టుదల. ఓం సాయి రామ్' అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ వీడియోలో ఇద్దరూ చేతులు జోడించి సాయిబాబాకు ప్రార్థనలు చేస్తున్నారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా హిందూ సాంప్రదాయమైన వస్త్రాలను ధరించారు. అలాగే కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ పెట్టుకున్నారు. అశ్లీల చిత్రాల కేసులో విడుదలైన తర్వాత రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే హిందీ బిగ్బాస్ సీజన్ 15లో తన సోదరి షమితా శెట్టి గెలవాలని కోరుకుంటున్నట్లు శిల్పా శెట్టి ఇటీవల తెలిపింది. ప్రస్తుతం శిల్పా ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఈ షో జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఇదీ చదవండి: మొహాన్ని దాచుకున్న రాజ్ కుంద్రా.. నెటిజన్స్ ట్రోలింగ్ -
2021లో వివాదాల్లో చిక్కుకున్న బాలీవుడ్ తారలు వీరే..
Top 6 Bollywood Celebrities Who Landed In Trouble: 2021 సంవత్సరం ఇంకో 10 రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది బాలీవుడ్ తారలు తమ చిత్రాలతో కనులవిందు చేశారు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. కొందరైతే ఏకంగా అరెస్టయి కొన్ని రోజులు జైలులో గడపవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. వారిలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ నుంచి నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా వరకు ఉన్నారు. ఇలా ఈ ఏడు వివిధ రకాల సంఘటనలతో బీటౌన్ ఆసక్తికరంగా మారింది. 2021లో పలు వివాదాల్లో చిక్కుకుని కష్టాలు కొనితెచ్చుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరో చూద్దాం. 1. ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) కస్టడికీ వెళ్లడంతో బీటౌన్ షాక్ అయింది. క్రూయిజ్ షిప్లో జరిగిన పార్టీలో ఎన్సీబీ (NCB) డ్రగ్ రైడ్ తర్వాత ఈ స్టార్ కిడ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్టోబర్ 2న జరిగిన ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అనంతరం ఆర్యన్ను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించారు. సుమారు 20 రోజులు జైలులో గడిపిన తర్వాత ఈ స్టార్ కిడ్కు బెయిల్ మంజూరైంది. 2. రాజ్ కుంద్రా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను రూపొందించి మొబైల్ యాప్స్ ద్వారా ప్రచురించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. 'అశ్లీల చిత్రాలను రూపొందించడం, వాటిని కొన్ని యాప్లు ద్వారా ప్రచురించడంపై ఫిబ్రవరి 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో రాజ్కుంద్రా ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నందున జూలై 19, 2021న అరెస్టు చేశాము. దీనికి తగిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.' అని ముంబై క్రైమ్ బ్రాంచ్కు చెందిన సీపీ ప్రకటించారు. సుమారు రెండు నెలలపాటు పోలీసు కస్టడీలో ఉన్న రాజ్ కుంద్రాకు సెప్టెంబర్లో బెయిల్ వచ్చింది. అలాగే ఓ వ్యాపారిని మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి కూడా ఆరోపణలు ఎదుర్కొంది. 3. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ కేసులో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు వినిపించడంతో ఆమె వార్తల్లో నిలిచింది. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు సమన్లు జారీ చేసిన ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అయితే, రూ.10కోట్ల విలువైన బహుమతులు సుకేష్ నుంచి తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంది జాక్వెలిన్. సుకేష్ చంద్రశేఖర్ నుంచి పలు ఖరీదైన బహుమతులు పొందినట్లు హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. 4. అనన్య పాండే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో బాగంగా లైగర్ బ్యూటీ అనన్య పాండేకు ఎన్సీబీ (NCB) సమన్లు జారీ చేసింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్లో తన పేరు బయటకు రావడంతో అందరి దృష్టిని ఆకర్షించింది అనన్య. ఆర్యన్ ఖాన్కు, ఒక డెబ్యూ హీరోయిన్ మధ్య ఉన్న వాట్సాప్ చాట్ను కనిపెట్టినట్లు ఎన్సీబీ వారి ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సమయంలో ముందుగా ఆ పేరును ఎన్సీబీ వెల్లడించలేదు. 5. కంగనా రనౌత్ ఎప్పుడూ ఆసక్తికర, విదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది కంగనా రనౌత్. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానంతరం ఒక ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగన పర్హాన్ అక్తర్కు పరువుకు నష్టం కలిగించే రీతిలో మాట్లాడిందని పర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ కంగనా బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం తిరస్కరించింది. అలాగే కోర్టు ఫిబ్రవరిలో కంగనాను కోర్టుకు హాజరుకావలసిందిగా నోటీసు జారీ చేసింది. కంగనా చాలాసార్లు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్తో హెచ్చరించింది. 6. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఐదేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘పనామా పేపర్స్’ కేసులో బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. అనంతరం ఈడీ ఎదుట హాజరైన ఐశ్వర్యను సుమారు ఆరు గంటలపాటు పలు ప్రశ్నలు అడిగారు అధికారులు. ఈ సందర్భంగా అధికారులకు ఐశ్వర్య పలు డాక్యుమెంట్లను అందజేశారు. ఫారెన్ ఎక్సే్చంజ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఐశ్వర్య వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఈ పనామా పేపర్స్ లీక్ కేసుకు సంబంధించి బిగ్బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదీ చదవండి: ఐశ్వర్య రాయ్కు ఈడీ సమన్లు.. ఎందుకంటే ? -
అశ్లీల చిత్రాల కేసులో రాజ్కుంద్రాకు ఊరట!!
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసులో సుప్రీంకోర్టు నుంచి కాస్త ఊరట లభించింది. అంతేకాదు సుప్రీంకోర్టు రాజ్కుంద్రాకు అరెస్టు కాకుండా నాలుగు వారాల బెయిల్ని మంజూరు చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే నవంబర్ 25న బాంబే హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం రాజ్ కుంద్రా దాఖలు చేసిన పిటీషన్ను తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) ఈ క్రమంలో కుంద్రా వీడియోలు శృంగారభరితమైనవే అయినప్పటికీ, వాస్తవానికి ఎటువంటి శారీరక లేదా లైంగిక కార్యకలాపాలను చూపించలేదని హైకోర్టులో పిటిషన్లో పేర్కొన్నారు. పైగా తాను అటువంటి వీడియోల తయారీలో లేదా ప్రసారంలో పాల్గొనలేదని చెప్పడమే కాక తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని అన్నారు. అయినప్పటికీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. (చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!!) -
'మీ ముఖాన్ని దాచుకునే పనులు చేయొద్దు'.. రాజ్ కుంద్రాపై ట్రోలింగ్
Netizens Trolls Raj Kundra For Hiding His Face: ఇటీవల కాలంలో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపారవేత్త రాజ్కుంద్రా దంపతులు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సమస్యలు కొంచెం సద్దుమణిగాయి. ఇద్దరూ కలిసి ఆలయాలు సందర్శించడం, టూర్లకు వెళ్లడం, కొంత సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలో కూడా రాజ్ కుంద్రాను ట్రోలింగ్ రూపంలో దురదృష్టం వెంటాడింది. గురువారం రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ముంబై విమానాశ్రయం నుంచి ఏదో ప్రదేశానికి బయలుదేరారు. ఆ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా వేరువేరుగా తమ కార్ల నుంచి దిగి విమానాశ్రయం గేట్ల వైపు నడుచుకుంటూ వెళ్లారు. కారు నుంచి దిగిన వెంటనే రాజ్ కుంద్రా కెమెరాలకు చిక్కకుండా హడావుడిగా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లాడు. ఎయిర్పోర్ట్లో పాప్ స్టేషన్ వద్ద ఆగకుండా ఫోన్ చూస్తూ వెళ్లిపోయాడు. అలాగే తన ముఖం పూర్తిగా కనపడకుండా ఉండేలా బ్లాక్ హుడీ ధరించాడు రాజ్ కుంద్రా. ఆ వీడియోలో శిల్పా శెట్టి ప్రశాంతంగా కారు దిగి ఎయిర్పోర్ట్ గేట్ల వద్దకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. నీలం డెనిమ్, వైట్ స్నీకర్తో తెల్లటి చారల బ్లేజర్ను ధరించారు శిల్పా. ఇది గమనించిన నెటిజన్లు ఆ పోస్ట్పై అనేక రకాలుగా కామెంట్స్ పెట్టారు. రాజ్ కుంద్రా తన ముఖం కవర్ చేసుకున్నందుకు తెగ ట్రోల్ చేశారు. 'మీ ముఖాన్ని దాచుకునే పనులు చేయొద్దు' అని ఒక యూజర్ కామెంట్ పెడితే, 'మీరు కూడా చూడకూడని పనులు చేయకండి' అని రాసుకొచ్చాడు. 'అప్పుడే సిగ్గులేని వాళ్లు మొహం దాచుకోవడం చూసి నవ్వుతారు' అని ఒకరన్నారు. 'అతను కెమెరా చూసి ఎందుకు మొహం దాచుకుంటున్నాడు. కెమెరా వెనుక ఉండి డైరెక్ట్ చేసినప్పుడు రాని సిగ్గు ఇప్పుడెందుకు' అని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇది చదవండి: వివాహ వార్షికోత్సవం.. పెళ్లినాటి ఫొటోలు వైరల్ -
శిల్పా శెట్టి-రాజ్ కుంద్రాల వివాహ వార్షికోత్సవం.. పెళ్లినాటి ఫొటోలు వైరల్
Shilpa Shetty And Raj Kundra Marriage Anniversary: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఈ మధ్య ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ ఆరోపణలు, వివాదాల నడుమ వారికి నేడు సంతోషకరమైన రోజు కానుంది. నవంబర్ 22, సోమవారం శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతుల 12వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా శిల్పాశెట్టి, తన భర్తకు సోషల్ మీడియా వేదికగా విష్ చేసింది. ఆమె తన ఇన్స్టా గ్రామ్లో వారి వివాహ వేడుక చిత్రాల కొలేజ్ను పోస్ట్ చేసింది. తాళి కట్టడం, సింధూరం పెట్టడం వంటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ అందమైన ఫొటోలతో పాటు '12 ఏళ్ల క్రితం ఈ క్షణం, ఈ రోజు మేము ఒక వాగ్దానం చేశాం. దాన్ని నెరవేరుస్తూనే ఉన్నాం. కష్టసుఖాలను పంచుకుంటూ, ప్రేమను విశ్వసిస్తూ, దేవుడు మనకు మంచి మార్గం చూపిస్తాడని భావిస్తూ, ఒకరికొకరం ప్రతిరోజు నిలబడుతూ 12 సంవత్సరాలు పూర్తి చేశాం. అసలు సమయం తెలియనేలేదు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు కుకీ' అని శిల్పా శెట్టి పోస్ట్లో రాసుకొచ్చారు. ఇంకా 'ఇక్కడ మరెన్నో అనుభూతులు, నవ్వులు, మైలురాళ్లు, విలువైన ఆస్తులు మా పిల్లలు ఉన్నారు. అన్ని విధాల మాకు సహకరించిన మా శ్రేయోభిలాషుందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.' అని తెలిపారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) ఈ పోస్ట్కు అభిమానులు, స్నేహితులు, సినీ పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీలు లైక్లు, కామెంట్లతో ముంచెత్తారు. ' వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మీ ఇద్దరినీ ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు' అని నటి బిపాసా బసు కామెంట్ చేశారు. అశ్లీల వీడియోల చిత్రీకరణ కేసుకు సంబంధించిన ఆరోపణలపై రాజ్ కుంద్రాను జూలై 19న మరో 11 మందితోపాటు పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఈ దంపతులు అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఈ కేసులో ముంబై కోర్టు రూ. 50,000 పూచీకత్తుపై రాజ్కు సెప్టెంబర్ 20న బెయిల్ మంజూరు చేసింది. చదవండి: రాజ్ కుంద్రాతో చేతిలో చేయ్యేసి.. భర్తతో తొలిసారి శిల్పాశెట్టి బయటకు -
నాకు చాలా బాధను కలిగించింది.. చీటింగ్ కేసుపై నోరు విప్పిన శిల్పా శెట్టి
రాజ్ కుంద్రా దంపతులపై ఒక వ్యాపారవేత్త చేసిన చీటింగ్, ఫోర్జరీ ఆరోపణలపై నటి శిల్పా శెట్టి నోరు విప్పారు. ఆ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. 'రాజ్, నా పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదైందన్న వార్త నుంచి ఇప్పుడే తేరుకున్నాను. షాకింగ్గా ఉంది. ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ వెంచర్ నిర్వహిస్తుంది కాషిఫ్ ఖాన్. అతను దేశవ్యాప్తంగా ఎఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ జిమ్లను తెరవడానికి బ్రాండ్ ఎస్ఎఫ్ఎల్ పేరుతో హక్కులు తీసుకున్నాడు. అతను అన్ని ఒప్పందాలు కుదుర్చుకుని, బ్యాంకింగ్, రోజువారీ వ్యవహారాలలో సంతకం చేశాడు. అతని లావాదేవీల గురించి మాకు తెలియదు. అతని నుంచి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అన్ని ఫ్రాంఛైజీలన్నీ నేరుగా కాషిఫ్తోనే నిర్వహిస్తారు. పూర్తిగా కాషిఫ్ ఖాన్ ద్వారా నిర్వహించబడే కంపెనీని 2014లో మూసివేశారు.' అని శిల్పా శెట్టి ట్వీట్ చేశారు. pic.twitter.com/lu5rToq0Sg — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) November 14, 2021 'గత 28 ఏళ్లుగా నేను చాలా కష్టపడ్డాను. నా పేరు, ప్రతిష్ట దెబ్బతినడం, నన్ను ఇబ్బందుల్లోకి లాగడం చూసి నాకు చాల బాధ పడ్డాను. భారతదేశ చట్టాలను గౌరవించే పౌరురాలిగా నా హక్కులు రక్షించబడాలి. కృతజ్ఞతలతో శిల్పా శెట్టి కుంద్రా.' అని కూడా ట్విటర్లో రాసుకొచ్చారు శిల్పా శెట్టి. -
మరో వివాదంలో చిక్కుకున్న రాజ్కుంద్రా దంపతులు
FIR Registered Against Shilpa Shetty And Raj Kundra: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా మరో కేసులో చిక్కుకున్నారు.అడల్ట్ వీడియోల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన రాజ్కుంద్రాకు ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తాజాగా అతనిపై రూ. 1.51 కోట్లు మోసం చేశాడని మరో కేసు నమోదైంది. కుంద్రాతో పాటు శిల్పా శెట్టి, మరికొంత మందిపై ఓ వ్యాపార వేత్త చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపినట్లు సమాచారం. వ్యాపార వేత్త నితిన్ బరాయి ఫిర్యాదు మేరకు వారిపై ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో శనివారం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం, జులై 2014లో ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ కంపెనీ డైరెక్టర్ కాషీఫ్ ఖాన్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, ఇతరులతో కలిసి లాభం పొందడానికి ఈ ఎంటర్ప్రైజ్లో రూ. 1.51 కోట్లు పెట్టుబడి పెట్టాలని అడిగినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఎస్ఎఫ్ఎల్ ఫిట్నెస్ కంపెనీ తనకు ఫ్రాంచైజీ ఇస్తుందని, పూణెలోని హడప్సర్, కోరేగావ్లలో జిమ్, స్పాను తెరుస్తుందని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని నితిన్ బరాయి పేర్కొన్నారు. తర్వాత నితిన్ బరాయి తిరిగి తన డబ్బు అడిగితే బెదిరించినట్లు ఫిర్యాదులో ఉన్నట్లు ఓ పోలీసు అధికారి ఉటంకించారు. బాంద్రా పోలీస్ స్టేషన్లో రాజ్ కుంద్రా దంపతులపై సెక్షన్లు 420 (మోసం), 120-బి (నేరపూరిత కుట్ర), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ ఉద్దేశ్యం)తో పాటు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైందని సమాచారం. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు అధికారి తెలిపారు. -
రాజ్ కుంద్రాతో చేతిలో చేయ్యేసి.. భర్తతో తొలిసారి శిల్పాశెట్టి బయటకు
బాలీవుడ్ నటీ శిల్పా శెట్టీ, ఆమె భర్త రాజ్ కుంద్రా కలిసి జంటగా దిగిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్టయిన చాలా రోజుల తర్వాత వీరిద్దరు ఇలా చెట్టాపట్టాలు వేసుకుని తొలిసారి కనిపించారు. ఈ కపుల్ హిమాచల్ ప్రదేశ్లోని ఓ ఆలయాన్ని సందర్శించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు మ్యాచింగ్ యెల్లో ఔట్ఫిట్లో ఒకరి చేతుల్లో ఒకరు చేయి వేసుకుని గుడి ప్రాంగణంలో కనువిందు చేశారు. రాజ్ కుంద్రా పసుపు కుర్తా, తెలుపు పైజామా కాంబినేషన్లో ఉంటే.. శిల్పాశెట్టి పసుపు రంగుగల సల్వార్ కమీజ్ వేసుకున్నారు. వారు ఆలయంలో దర్శనం చేసుకోవడం, వారితోపాటు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉండటం వైరల్ అవుతోంది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా జులైలో అరెస్ట్ కాగా.. సెప్టెంబర్లో బెయిల్ మంజూరైంది. వ్యాపారవేత్త అయిన రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో కీలక నిందితుడిగా ఉన్నారు. అడల్ట్ వీడియోల నిర్మాణం, స్ట్రీమింగ్లలో పాల్గొనడం వంటి ఆరోపణలు వచ్చాయి. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అసభ్యకరమైన మహిళల ప్రాతినిధ్యం (నిషేధం) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి వారి పిల్లలు వియాన్ రాజ్ కుంద్రా, సమీషా శెట్టి కుంద్రాలతో కలిసి ధర్మశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి తమ యాత్రకు సంబంధించిన గ్లింప్స్ను శిల్పా శెట్టి పంచుకుంటున్నారు. అయితే ఈ పోస్ట్లలో రాజ్ కనిపించలేదు. మరోవైపు గత వారం, రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలను తొలగించిన సంగతి తెలిసిందే. -
రాజ్కుంద్రా సంచలన నిర్ణయం..ఆ అకౌంట్లు డిలీట్
Shilpa Shetty Husband Raj Kundra Deletes Twitter Instagram Accounts: అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటినుంచి ఆయన బయటకు రావడానికి కూడా ఎక్కువగా ఇష్టపడటం లేదట. రీసెంట్గా జరిగిన 'కర్వా చౌత్' వేడుకలోనూ రాజ్కుంద్రా కనపడలేదు.చదవండి: షారుక్ ఖాన్ బర్త్డే.. వెలిగిపోతున్న 'మన్నత్' ఇదివరకు ఆయన వరుస పోస్టులతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. అయితే పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్, అనంతరం జరుగుతున్న వివాదాలతో కుంద్రా బాగా కుంగిపోయినట్లు తెలుస్తుంది. దీంతో రాజ్కుంద్రా..తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట హాట్టాపిక్గా మారింది. కాగా నీలి చిత్రాల కేసులో దాదాపు రెండు నెలల జైలు జీవితం అనంతరం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. చదవండి: చైతూతో ఉన్న ఇంట్లోనే సమంత.. కొత్త ఫ్లాట్లోకి చై! నేను బలవంతురాలిని.. ఎప్పటికీ వదిలిపెట్టను: సమంత -
షెర్లిన్ చోప్రాపై 50 కోట్ల పరువు నష్టం దావా వేసిన శిల్పా దంపతులు
Shilpa Shetty & Raj Kundra Sent Defamation Notice to Sherlyn Chopra: అశ్లీల చిత్రాల చిత్రీకరణ విషయంలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా అరెస్టు అయిన విషయం తెలిసిందే. అనంతరం అతను బెయిల్పై విడుదలయ్యాడు. అయితే ఈ కేసు ఆరోపణల విషయమై శిల్పా దంపతులు నటి షెర్లిన్ చోప్రాపై పరువు నష్టం దావా వేశారు. తనని బెదిరించి తనపై అశ్లీల చిత్రాలను తెరకెక్కించినట్లు నటి షెర్లిన్ చోప్రా ఫోర్నోగ్రఫీకి కేసులో రాజ్కుంద్రా జైలులో ఉన్న సమయంలో ఆరోపించింది. ఇటీవల సైతం అతను లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరింది. తాజాగా ఈ కేసు విషయమై షెర్లిన్ ఆరోపణలు నిరాధారమని, వట్టి కల్పితాలంటూ కొట్టిపారేసిన శిల్పా దంపతుల తరఫు న్యాయవాదులు రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అవాంఛిత వివాదాలను సృష్టించడానికి, మీడియా దృష్టిని ఆకర్షించడానికి ఆ నటి ప్రయత్నిస్తుంది తప్ప అందులో ఎటువంటి నిజం లేదని అందులో పేర్కొన్నారు. చదవండి: కొత్త తప్పులు చేస్తానంటున్న శిల్పాశెట్టి! -
శిల్పా శెట్టి, రాజ్కుంద్రాలపై పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి శిల్పా శెట్టి ఆమె భర్త తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. డబ్బు తీసుకుని తమని మోసం చేశారంటూ పలువురు శిల్పా, ఆమె భర్తపై ఆరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇక రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచి హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఏడ్చిన ఆర్యన్.. తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తనని శిల్పా ఆమె భర్త రాజ్కుంద్రా తనని మోసం చేశాడని, మానసిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె పోలీసులకు తెలిపింది. అంతేగాక లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, మోసం చేశారంటూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని షెర్లిన్ పోలీసులను కోరినట్లు మీడియాతో పేర్కొంది. అంతేగాక ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆమె మీడియాకు చూపించింది. చదవండి: రూ. 200 కోట్ల మనిలాండరింగ్ కేసులో నోరా ఫతేహికి సమన్లు రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ డాన్తో సంబంధం ఉందని, వాళ్ళ ద్వారా తనను బెదిరించారంటూ ఈ సందర్భంగా ఆమె సంచలన ఆరోపణలు చేసింది. అదే విధంగా రాజ్ కుంద్రాపై పోర్నోగ్రఫీ కేసు నేపథ్యంలో ఆమె పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కితీసుకోవాలని, లేకపోతే జీవితం నాశనం చేస్తామంటూ బెదిరిస్తున్నారని, ఏప్రిల్ 19న రాజ్ బలవంతంగా తన ఇంట్లోకి ప్రవేశించి కేసును ఉపసంహరించుకోవాలని హెచ్చరించాడని ఆమె ఆరోపణలు చేయడం మరోసారి సంచలనంగా మారాయి. -
షెర్లిన్ వల్లే రాజ్కుంద్రాకు ఈ గతి పట్టింది: నటి సంచలన వ్యాఖ్యలు
నీలి చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాతో సంబంధాలు కలిగి ఉన్నారని నటి గెహనా వశిష్ట్ అరెస్టు అయ్యింది. 133 రోజులు కస్డడీలో ఉన్న అనంతరం ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శిల్పా దంపతులకు సపోర్టు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది గెహనా. మీడియా దృష్టిని ఆకర్షించి, నిత్యం వార్తల్లో నిలిచేందుకే షెర్లిన్ చోప్రా, శిల్పా శెట్టి దంపతుల పరువు భంగం కలిగేలా మాట్లాడుతుందని ఓ ఇంటర్వ్యూలో గెహనా విమర్శించింది. అసలు బిజినెస్మెన్ రాజ్కుంద్రాను నీలి చిత్రాల తీసేలా పురికొల్పింది షెర్లినే అని నటి ఆరోపించింది. కుంద్రా జైలు నుంచి వచ్చాక ఆమెను అందరూ మర్చిపోయారని గుర్తించి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడింది. గెహనా ఇంకా మాట్లాడుతూ.. ‘ షెర్లిన్ చోప్రా కోట్లాది రూపాయలు ఆర్జించేందుకు రాజ్ కుంద్రా ఎంతో సాయపడ్డాడు. ఆయన క్రియేట్ చేసిన ఆర్మ్స్ప్రైమ్ యాప్ ద్వారా ఈ స్థాయికి వచ్చిన ఆమె కుంద్రాకి రుణపడి ఉండాలి. ఆమె వల్లే ఆయన ఈ ఊబిలో ఇరుక్కుపోయారు. నిజానికి 2012 నుంచే షెర్లిన్ బోల్డ్ కంటెంట్ చిత్రాలు చేస్తోంది. వారిద్దరూ పరిచయమై కేవలం రెండున్నరేళ్లు మాత్రమే’ అని చెప్పింది. కాగా ఈ కేసులో అరెస్టయిన రాజ్కుంద్రాకి ఇటీవలే ముంబై కోర్టు బెయిలు మంజూరు చేసింది. చదవండి: పోర్నోగ్రఫీ కేసు.. నటి ఆవేదన -
పోర్నోగ్రఫీ కేసు.. నటి ఆవేదన
Gehana Vasisth Cries: పోర్నోగ్రఫీ వ్యవహారానికి సంబంధించిన కేసులో నటి గెహనా వశిష్ట్కు భారీ ఊరట లభించింది. బాలీవుడ్ ఫైనాన్షియర్ రాజ్కుంద్రాతో సత్సంబంధాలు కలిగి ఉండడం, అశ్లీల చిత్రాల్లో నటిస్తూ పట్టుబడడం లాంటి ఆరోపణలున్న గెహానా.. గతంలో అరెస్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె 133 రోజులుగా కస్టడీలో ఉండగా.. ఎట్టకేలకు కోర్టు బెయిల్ జారీ చేసింది. అయితే ఈ వ్యవహారంలో దర్యాప్తునకు హాజరు కావాలనే షరతు విధిస్తూ.. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్ల ధర్మాసనం బుధవారం వెల్లడించింది. చదవండి: Shilpa Shetty: నేను షూటింగ్స్తో బిజీ..ఆ యాప్స్ గురించి నాకు తెలియదు సుప్రీం కోర్టు ఇచ్చిన బెయిల్పై నటి గెహనా ఇన్స్టాగ్రామ్లో స్పందించారు. ‘సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ నాకు మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సత్యమే జయిస్తుందని మొదటి నుంచి నేను చెప్తున్నా. నన్ను నమ్మండి.. నన్ను ఎవరూ తప్పదోవ పట్టించలేదు. డబ్బుల కోసం ఎవరినీ మోసం చేయలేదు. కావాలనే నన్ను కొందరు ఈ కేసులో ఇరికించారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: శృంగారానికి, అశ్లీలానికి తేడా తెలుసా?: నటి గతంలో ఆమె బాంబే హైకోర్టులో బెయిల్కు దరఖాస్తు చేసుకోగా, కోర్టు దాన్ని తిరస్కరించింది. దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయగా, ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. పిటిషనర్ను అరెస్టు చేయరాదని, అయితే విచారణకు సహకరించాలని కోర్టు ఆమెను ఆదేశించింది. ఇక పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా కు మొన్న సోమవారం బెయిల్ లభించిన విషయం తెలిసిందే. -
'రాజ్కుంద్రా ఫోన్లో 119 నీలి చిత్రాలు.. రూ.9 కోట్లకు బేరం'
Raj Kundra Was Planning To Sell Adult Videos For Rs 9 Crores: నీలి చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా జైలు జీవితం గడిపిన ఆయన నేడు (మంగళవారం) విడుదలై బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఇంటికి వెళ్లేముందు రాజ్కుంద్రా కళ్లలో నీళ్లు తిరిగాయి. తప్పు చేశానన్న అపరాధ భావం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. చదవండి : రాజ్కుంద్రాకు బెయిల్: భర్తతో శిల్పా విడిపోతుందా? ఇదిలా ఉండగా.. రాజ్కుంద్రా గురించి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు షాకింగ్ నిజాలు బయటపెట్టారు. విచారణలో భాగంగా కుంద్రా మొభైల్, లాప్టాప్, హార్డ్ డ్రైవ్ లను పరిశీలించామని, అందులో 119 నీలి చిత్రాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వీడియోలను కుంద్రా రూ.9 కోట్లకు బేరానికి కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. కాగా ఫిబ్రవరిలో ముంబై శివారులోని ఓ బంగ్లాలో పోర్న్ మూవీ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి అక్కడున్న 11మందిని అరెస్ట్ చేశారు. ఐదు నెలల పాటు దర్యాప్తు అనంతరం పోర్న్ రాకెట్ గుట్టును రట్టు చేశారు. ఇందులో శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా హస్తం ఉందన్న ఆరోపణలతో జులై 19వ తేదీన ముంబై పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జైలు నుంచి విడుదలైన కుంద్రాతో శిల్పా వైవాహిక జీవితం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. చదవండి: వచ్చే నెలలో నిశ్చితార్థం: కారు ప్రమాదంలో నటి మృతి During the investigation (in a pornography case), police found 119 porn videos from businessman Raj Kundra's mobile, laptop, and a hardrive disk. He was planning to sell these videos for Rs 9 crores: Mumbai Police Crime Branch pic.twitter.com/ZZNL5aY3EG — ANI (@ANI) September 21, 2021 -
రాజ్కుంద్రాకు బెయిల్: భర్తతో శిల్పా విడిపోతుందా?
Shilpa Shettys Reaction After Husband Raj Kundra Gets Bail: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్కుంద్రా దాదాపు రెండు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. రూ.50వేల పూచికత్తుతో ఆయనకు ముంబై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భర్తకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో శిల్పాశెట్టి తొలిసారిగా ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. 'భీబత్సమైన తుఫాను తర్వాత కూడా అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికి ఇంద్రధనస్సు(రెయిన్బో) ఏర్పడుతుంది' అంటూ ప్రముఖ చైనీస్ అమెరికన్ అర్కిటెక్ట్ రోగర్ లీ కొటేషన్ను ఆమె పోస్ట్ చేశారు. చదవండి: 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు' కాగా 2009లో రాజ్కుంద్రాను రెండో వివాహం చేసుకున్న శిల్పాశెట్టి పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పింది. ప్రస్తుతం రియాలిటీ షోలతో అలరిస్తున్న ఆమె ఇటీవలె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అశ్లీల చిత్రాల కేసులో రాజ్కుంద్రా అరెస్ట్ అనంతరం ఆర్థికంగా నష్టపోయిన శిల్పాశెట్టి అవమానంతో కొన్ని రోజుల పాటు షూటింగ్కు గైర్హాజరు అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే తిరిగి షూటింగ్లో పాల్గొంటున్న శిల్పా కుంద్రాతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్లు బీటౌన్లో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్తో ఆ రూమర్స్ పటాపంచలైనట్లేనా లేక కుంద్రాకు విడాకులు ఇవ్వనుందా అన్నది చూడాల్సి ఉంది. చదవండి : నాని..ఇలా జరుగుతుందని ఎప్పుడైనా ఊహించావా: సమంత -
పోర్నోగ్రఫీ కేసు: శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు బెయిల్
Raj Kundra Got Bail: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50వేల రూపాయల పూచీకత్తుపై కోర్టు సోమవారం రాజ్కుంద్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుంద్రాతో పాటు ఆయన దగ్గర ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ర్యాన్ థోర్పేకి సైతం బెయిల్ మంజూరు అయ్యింది. చదవండి: 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు' కాగా అశ్లీల చిత్రాల కేసులో జులై19న రాజ్కుంద్రాను ముంబై క్రైం బ్రాం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫారమ్లో విడుదల చేసేవాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు. ఇటీవలె శిల్పాశెట్టి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత రాజ్కుంద్రాకు బెయిల్ వచ్చింది. చదవండి : దర్శనానికి గుర్రంపై వచ్చిన శిల్పాశెట్టి.. ఫోటోలు వైరల్ -
నీలిచిత్రాల కేసులో నేనే బలిపశువును: రాజ్ కుంద్రా
ముంబై: నీలిచిత్రాలు నిర్మించి యాప్స్ ద్వారా ఆన్లైన్లో వినియోగంలోకి తెచ్చారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తాజాగా ముంబైలోని కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముంబై పోలీసులు ఈ కేసులో భాగంగా తాజాగా కోర్టు అందజేసిన అనుబంధ చార్జ్షీట్లో తనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సమర్పించలేదని, బెయిల్ ఇవ్వాలని కోర్టును కుంద్రా కోరారు. ఈ కేసులో తనను బలిపశువును చేశారని మెట్రోపాలిటన్ కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాక్టికల్గా చూస్తే ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసుల దర్యాప్తు ముగిసిపోయిందని కుంద్రా తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ అభిప్రాయ పడ్డారు. హాట్షాట్స్ యాప్స్లో ఉన్న శృంగార వీడియోల రూపకల్పనలో కుంద్రా క్రియాశీల పాత్ర పోషించారనే ఏ ఒక్క ఆధారాన్నీ పోలీసులు అనుబంధ చార్జ్షీట్లో పొందు పరచలేదని న్యాయవాది వివరించారు. చదవండి: రూ. 20 కోట్ల పన్ను ఎగవేశారు వాస్తవానికి సంబంధిత నటులే ఆయా వీడియోలను యాప్స్లోకి అప్లోడ్ చేశారన్నారు. పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా కుంద్రాకు వ్యతిరేకంగా అభియోగాలకు బలంచేకూర్చే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదన్నారు. ఎఫ్ఐఆర్లో మొదట కుంద్రా పేరు లేదని, పోలీసులే తర్వాత జతచేశారని న్యాయవాది ఆరోపించారు. -
'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు'
Shilpa Shetty Says I don't know Raj Kundra Work: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో శిల్పాశెట్టిని సాక్షిగాచార్జ్షీట్లో చేర్చారు ముంబై పోలీసులు. ఈ సందర్భంగా తన భర్త ఏం చేస్తున్నాడో తనకు తెలియదని శిల్పా చార్జిషీట్లో పేర్కొంది. 'నేను షూటింగ్స్లో ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. దీంతో రాజ్కుంద్రా ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. హాట్షాట్స్, బాలీఫేమ్ యాప్స్ల గురించి కూడా నాకు తెలియదు' అంటూ శిల్పా చెప్పిన స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. కాగా ఈ కేసులో మొత్తం 1400పేజీల చార్జ్షీట్ను పోలీసులు ఫైల్ చేశారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో రాజ్కుంద్రా వ్యవహారం బయటపడిన అనంతరం హాట్షాట్స్ యాప్ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించిన తర్వాత.. బాలీఫేమ్ యాప్ దర్శనమిచ్చింది. అంతేకాకుండా పోర్న్రాకెట్ను గట్టుచప్పుడు కాకుండా నడిపించిన రాజ్కుంద్రా ఇందుకు గాను వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిసరాలను ఉపయోగించుకున్నట్లు చార్జ్షీట్లో నమోదు చేవారు. మరోవైపు గత జులై19నుంచి రాజ్కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది. చదవండి : బిగ్బాస్ :‘ శిల్పా నిన్ను చాలా మిస్ అవుతోంది’ ప్రభాస్-రాజమౌళి కాంబినేషన్లో మరో భారీ ప్రాజెక్ట్?! -
పోర్నోగ్రఫీ కేసు: నటి గెహానా వశిష్ట్కు హైకోర్టులో చుక్కెదురు
ముంబై: పోర్న్ కేసుకు సంబంధించి నటి గెహానా వశిష్ట్కు బాంబే హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిల్ నిరాకరించింది. భయపెట్టి, డబ్బు ఎర చూపించి అశ్లీల చిత్రాలలో నటించేలా చేశారని గెహానాపై అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ జారీ చేయాలని ఆమె గత నెలలో కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆ పిటిషన్ విచారణకు రాగా, జస్టిస్ ఎస్కే షిండే ఆమెకు బెయిల్ నిరాకరించారు. కొందరు యువతులను బలవంతంగా అశ్లీల చిత్రాల్లో నటింపజేసి ఆ వీడియోలను రాజ్ కుంద్రాకు చెందిన హాట్షాట్ యాప్లో గెహానా ఉంచారని అభియోగాలు ఉన్నాయి. (చదవండి: షాకింగ్.. నటిని బంధించి రూ.6 లక్షలు దోచుకెళ్లారు!) -
శిల్పాశెట్టి దంపతులపై చీటింగ్ కేసు
FIR against Raj Kundra, Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై మరో కేసు నమోదైంది. వ్యాపారంలో పెట్టుబడి పెడతానని చెప్పి తన దగ్గర రూ.41 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త విశాల్ గోయెల్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ డబ్బును అడల్ట్ మూవీస్ తీసేందుకు ఉపయోగించారని ఆరోపించాడు. స్వలాభం కోసం చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా చాలామంది దగ్గర డబ్బు తీసుకుని, వాటి ద్వారా పోర్న్ వీడియోలు తీశారని తీవ్ర ఆరోపణలు చేశాడు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో శిల్పాశెట్టి దంపతులతో పాటు నందన మిశ్రా, దర్శిత్ షా, ఎమ్కే మధ్వా, సత్యేంద్ర సరుప్రియ, ఉమేశ్ గోయాంక పేర్లున్నాయి. అయితే రోజులు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సదరు వ్యాపారవేత్త ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మన్సి మాలిక్.. పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించాడు. అనంతరం తదుపరి విచారణనను నవంబర్ 9కి వాయిదా వేశారు. -
న్యూడ్, సెమీ న్యూడ్ సీన్లు.. బోల్డ్ నటిపై గరం గరం
Boycott Radhika Apte Trend: బాయ్కాట్ రాధికా ఆప్టే.. హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఈ హాష్ట్యాగ్ ప్రస్తుతం ట్విటర్ను ట్రెండింగ్ ద్వారా కుదిపేస్తోంది. వెల్లువలా వేల కొద్దీ ట్వీట్లు ఆమెకి వ్యతిరేకంగా పోస్ట్ అవుతున్నాయి. భారత సంప్రదాయాలను కించపరిచేలా 35 ఏళ్ల రాధిక నటిస్తోందన్నది ఆ ట్వీట్లు చేసేవాళ్ల ప్రధాన అభ్యంతరం. అంతేకాదు ఇంతలా దిగజారుతున్న వాళ్లకు అవకాశాలిచ్చి మరీ ప్రొత్సహిస్తున్న బాలీవుడ్పైన గరం అవుతున్నారు ట్విటర్ యూజర్లు. రాధికా ఆప్టే బాలీవుడ్లో బోల్డ్ నటిగా పేరు సంపాదించుకుంది. హిందీ చిత్రం ‘వహ్! లైఫ్ హో తో ఐసీ!’(2005) ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రాధిక.. తెలుగులో రక్త చరిత్ర రెండు పార్ట్లు, ధోనీ, లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లోనూ నటించింది. ఇక బాలీవుడ్లో న్యూడ్, సెమీ న్యూడ్ సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది రాధిక. మరోపక్క మీటూ ఉద్యమానికి మద్ధతు తెలిపే క్రమంలో ఎన్నో సంచలన స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. అయితే కేవలం డబ్బు కోసమే రాధికా ఆప్టే నటిస్తోందని, భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా ముందుకెళ్తోందని, విలువలు విడిచిపెట్టి మరీ దిగజారిందని విమర్శలకు దిగారు కొందరు. ఇక అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వకూడదని బాలీవుడ్ను మరికొందరు కోరుతుండగా.. వాళ్ల సినిమాలు చూడడం మానేస్తే సరిపోతుందని సలహాలు ఇస్తున్నారు మరికొందరు. చదవండి: కుప్పలుగా షూటింగ్కు జనం.. సినిమా యూనిట్కు ఫైన్ బాలీవుడ్లో అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పుడు కొందరు బాలీవుడ్ తారలు ‘న్యాయం కోసం’ అంటూ ముందుకు రావడం తెలిసిందే. అయితే వ్యాపారవేత్త, బాలీవుడ్ ప్రముఖ ఫైనాన్షియర్ రాజ్కుంద్రా ‘పోర్న్ రాకెట్’ విషయంలో మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. దీంతో కొందరు నెటిజన్స్.. రాధికతో పాటు మరికొందరు తారలను తెర మీదకు తెచ్చి విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే రాధికకు సంబంధించి న్యూడ్, సెమీ న్యూడ్ సీన్ల ప్రస్తావన లేవనెత్తి ఈ #BoycottRadhikaApte ట్రెండ్ను నడిపిస్తున్నారు. When it comes to Kathua entire #Bollywood gang was with Placard Why these people silent on #RajKundra ? Habit of bollywood to defame degrad our culture #BoycottRadhikaApte pic.twitter.com/icQ3Kp1TIi#BoycottRadhikaApte — Rahul Jaiswal (@Rahul22578409) August 13, 2021 It's Time To Boycott All Actors , Who Are Against Indian Culture . #BoycottRadhikaApte — Arun Yadav (@beingarun28) August 13, 2021 -
నాతో అలాంటి వీడియోలు చేయిస్తాడనుకోలేదు: ఏడ్చేసిన నటి
Raj Kundra Case: అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం నాడు నటి షెర్లిన్ చోప్రాను ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. "ఈ విషయం గురించి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఇలాంటి కేసులో భాగమవుతానని, పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుందని అస్సలు ఊహించలేదు. రాజ్ కుంద్రాను తొలిసారి కలిసినప్పుడు నా జీవితమే మారిపోతుందనుకున్నా. కెరీర్లోనే బిగ్ బ్రేక్ వస్తుందని భావించాను" "కానీ శిల్పా శెట్టి భర్త అయిన అతడు నాతో ఇలా తప్పుడు పనులు చేయిస్తాడనుకోలేదు. ఆర్మ్స్ప్రైమ్తో ఒప్పందం కుదిరాక నాతో మొదట గ్లామర్ వీడియోలు చేయించారు. అవి తర్వాత బోల్డ్ చిత్రాలుగా మారాయి. ఆ తర్వాత అర్ధ నగ్నంగా, పూర్తి నగ్నంగా వీడియోలు చేయించారు. ఇది కూడా గ్లామర్ వీడియోల్లో భాగమేనని, తప్పేమీ కాదని నాకు నచ్చజెప్పారు. అంతేకాకుండా శిల్పాశెట్టికి నా వీడియోలు, ఫోటోలు నచ్చాయని అబద్ధాలు చెప్పారు. ఆయన మాటలు నమ్మి నేను నిండా మోసపోయాను" "శిల్పాశెట్టి లాంటి వాళ్లు మనల్ని మెచ్చుకున్నారంటే మనం చేస్తుంది తప్పో, ఒప్పో అర్థం చేసుకునే స్థితిలో ఉండము. నేను శిల్పాశెట్టికి, రాజ్కుంద్రాకు వ్యతిరేకం కాదు, కానీ ఈ పోర్నోగ్రఫీ రాకెట్కు మాత్రం బద్ధ వ్యతిరేకిని. మీరు అమ్మాయిలతో బోల్డ్ సినిమాల్లో నటించేందుకు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడే వారికి స్పష్టంగా చెప్పండి ఇవి గ్లామర్వి కావు పోర్న్ వీడియోలు అని! ఈ విషయం నేను ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇండస్ట్రీలోని వ్యక్తులు స్వార్థపరులు.. వారు డబ్బుల కోసం ఎదుటివాళ్లను ఇబ్బందుల్లోకి నెట్టేయడానికి కూడా వెనుకాడరు. భవిష్యత్తులో నా పిల్లలను ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనివ్వను' అని చెప్తూ షెర్లిన్ ఏడ్చేసింది. -
అరెస్ట్ చట్టవిరుద్ధమన్న రాజ్కుంద్రా, పిటిషన్ కొట్టివేత
ముంబై: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు కోర్టులో చుక్కెదురైంది. తన అరెస్ట్ చట్టవిరుద్ధమని, తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను శనివారం నాడు బాంబే హైకోర్టు కొట్టివేసింది. దీంతో అతడు బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇదిలా వుంటే అశ్లీల చిత్రాల కేసులో రాజ్కుంద్రాను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదల చేస్తున్నట్టుగా అతడి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్కుంద్రాను ఈ నెల 19న అదుపులోకి తీసుకున్నారు. స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ నుంచి 51 అడల్ట్ సినిమాలు, అతడి దగ్గర పని చేసే రాజ్, ర్యాన్ల ల్యాప్ట్యాప్స్లో 68 అశ్లీల చిత్రాలను పోలీసులు సేకరించారు. తన అరెస్ట్ను ముందే ఊహించిన రాజ్ కుంద్రా కొంతమేరకు సమాచారాన్ని ధ్వంసం చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక జూలై 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఆర్మ్స్ప్రైమ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దర్శకుడు సౌరభ్ కుశ్వాహ, నటి షెర్లిన్ చోప్రాను సైతం పోలీసులు విచారించారు. -
రాజ్కుంద్రా కేసు: శిల్పాశెట్టి ఇమేజ్కు పెద్ద దెబ్బ.. రూ.2 కోట్ల నష్టం
Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. సాక్ష్యాలన్నీ ఆయనను వ్యతిరేకంగా ఉండడంతో అతను జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజ్కుంద్రా అరెస్ట్తో నెటిజన్లు శిల్పాశెట్టి ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భర్త అరెస్ట్ ఎఫెక్ట్ శిల్పాశెట్టి కెరీర్పై కూడా పడింది. ఈ కేసు వల్ల ఇప్పటికే ఆమె కోట్లలో నష్టపోతుంది. ముంబై పోలీసులు ఎప్పుడైతే రాజ్కుంద్రాను అరెస్ట్ చేశారో.. అప్పటి నుంచి శిల్పా ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. ఆమె పాల్గొనాల్సిన పలు షోల షూటింగ్స్ని కూడా రద్దు చేసుకుంది. బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోకి శిల్పా జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ షో ఒక్కో ఎపిసోడ్కి శిల్పా రూ.18 నుంచి 22 లక్షల వరకు పారితోషికంగా పుచ్చుకుంటుందట. అయితే భర్త అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమె ఈ షో షూటింగ్కి వెళ్లడం లేదు. దీంతో ఇప్పటి వరకు శిల్పాశెట్టి దాదాపు రూ.2 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు షో షూటింగ్కి శిల్పా డుమ్మా కొట్టడంతో ఆమె స్థానంలో ఒక ఎపిసోడ్కి కరిష్మా కపూర్ని తీసుకొచ్చారు నిర్వాహకులు. ఆ తర్వాత జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ లను తీసుకొచ్చారు. అయితే వీరంతా ఒక్కో ఎపిసోడ్ లో కనిపించి వెళ్లిపోయారు. ఇలా గెస్ట్లతో ఈ షోని ఎక్కువ రోజులు నడిపించలేరు. మరోవైపు ఇప్పట్లో రాజ్కుంద్రా కేసు ఓ కొలిక్కి వచ్చేలా లేదు. దీంతో ఈ డ్యాన్స్ షోలో శిల్పాశెట్టిని ఉంచాలా? వద్దా? అనే విషయంపై నిర్వాహకులు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. -
సెబీ కేసులో శిల్పాశెట్టికి ఊరట
న్యూఢిల్లీ: షేర్హోల్డింగ్ వివరాల వెల్లడి నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించి సెబీ విచారణ ఎదుర్కొంటున్న నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు ఊరట లభించింది. నిర్దేశిత పరిమితులకు లోబడే షేర్హోల్డింగ్ ఉన్నందున ఈ విషయంలో వారిపై చర్యలు అవసరం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అభిప్రాయపడింది. వివరాల్లోకి వెడితే 2015 మార్చిలో 25.75 శాతం వాటా కొనుగోలుతో వియాన్ ఇండస్ట్రీస్ (గతంలో హిందుస్తాన్ సేఫ్టీ గ్లాస్ ఇండస్ట్రీస్)కి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా ప్రమోటర్లుగా మారారు. ఆ తర్వాత కంపెనీ కొన్ని షేర్లను ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ కింద కేటాయించింది. ఈ షేర్ల కేటాయింపు విషయాన్ని నిర్దిష్ట సమయంలో నిబంధనలకు అనుగుణంగా వారు వెల్లడించలేదంటూ ఆరోపణలు వచ్చాయి. 2013 సెప్టెంబర్ నుంచి 2015 డిసెంబర్ మధ్య కాలంలో వియాన్ ఇండస్ట్రీస్ షేర్ల లావాదేవీలపై సెబీ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రిఫరెన్షియల్ కేటాయింపు తర్వాత కూడా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల షేర్హోల్డింగ్ నిర్దిష్ట పరిమితికి లోబడే ఉందని, దీన్ని ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం లేదని సెబీ అభిప్రాయపడింది. తదనుగుణంగా వారిపై ప్రారంభించిన చట్టపరమైన చర్యలను పక్కన పెడుతున్నట్లు పేర్కొంది. -
మీడియా ‘దర్యాప్తు’ మాకొద్దు: శిల్పాశెట్టి
ముంబై: నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో అరెస్ట్ అయిన వ్యాపారి రాజ్కుంద్రాపై దేశంలోని ప్రసార మాధ్యమాలన్నీ కోర్టుతో పాటు సమాంతర దర్యాప్తు కొనసాగిస్తున్నాయని రాజ్కుంద్రా భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కుటుంబ గోపత్యకూ ప్రజలు గౌరవం ఇవ్వాలని, ముఖ్యంగా పిల్లలున్న కుటుంబాల ప్రైవసీకి భంగం కల్గించొద్దని ఆమె హితవు పలికారు. మీడియా సొంత ‘దర్యాప్తు’కు స్వస్తి పలకాలని, చట్టం తన పని తాను చేయనివ్వండని ఆమె మీడియాను కోరారు. నీలి చిత్రాలను నిర్మించి, వాటిని ‘హాట్ షాట్స్’ తదితర యాప్ల ద్వారా ప్రచారంలోకి తెచ్చారనే ఆరోపణలపై జూలై 19వ తేదీన ముంబై నేరవిభాగ పోలీసులు రాజ్కుంద్రాను అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బుధవారం ఆయన చేసిన బెయిల్ అభ్యర్థనను దిగువ కోర్టు కొట్టేయడం విదితమే. కుంద్రా అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అరెస్టు, అరెస్ట్కు కారణాలు, కుంద్రా చట్టవ్యతిరేక చర్యలు అంటూ పలు మాధ్యమాల్లో కథనాలు వచ్చాయని, దీంతో తన కుటుంబానికి ప్రైవసీ లేకుండా పోయిందంటూ శిల్పా శెట్టి సోమవారం ‘ఇన్స్టాగ్రామ్’లో వివరణ ఇచ్చారు. ముంబై పోలీసులపై, భారత శాసన వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. ‘ఆరోపణల నుంచి కుంద్రాను విముక్తుణ్ణి చేసేందుకు, శాసనవ్యవస్థ ద్వారా మాకున్న అన్ని సహాయ అవకాశాలను మేం అన్వేషిస్తున్నాం. నా పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తల్లిగా నేను కోరేది ఒక్కటే. అసంపూర్ణ సమాచారంతో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం ఆపండి. మా కుటుంబం ప్రైవసీకి భంగం కల్గించొద్దు. సమాంతర దర్యాప్తు చేయకండి. సత్యమేవ జయతే’ అని శిల్ప పోస్ట్ చేశారు. -
పోర్నోగ్రఫీ కేసు: మౌనం వీడిన శిల్పాశెట్టి.. తప్పుడు వార్తలంటూ ఫైర్
పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. సాక్ష్యాలన్నీ ఆయనను వ్యతిరేకంగా ఉండడంతో అతను జైలు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తన భర్త అరెస్ట్పై శిల్పాశెట్టి ఇంతవరకు స్పందించలేదు. తాజాగా ట్విటర్ వేదికగా తన భర్త అరెస్ట్పై ఒక ప్రకటన విడుదల చేసింది శిల్పా. రాజ్కుంద్రా కేసును మీడియా ట్రయల్ చేయడం సరికాదని, తన కుటుంబ వ్యక్తిగత స్వెచ్ఛను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వివాదంలోకి తనను లాగుతూ తప్పుడు ప్రచారం చేయవద్దని కోరింది. పోర్న్ రాకెట్ కేసు విచారణలో ఉందని, ముంబై పోలీసులతో పాటు న్యాయవ్యవస్ధ పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఓ కుటుంబంగా తాము న్యాయపరమైన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నామని, ఓ తల్లిగా తమ కుటుంబం, పిల్లల గోప్యతను గౌరవించి అర్ధసత్యాలు, అసత్యాలను ప్రచారం చెయ్యొద్దని శిల్పాశెట్టి విజ్ఞప్తి చేసింది. My statement. pic.twitter.com/AAHb2STNNh — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) August 2, 2021 -
'శిల్పాశెట్టి స్థానాన్ని భర్తీ చేయలేను..ఆమెలా మరొకరు చేయలేరు'
Shilpa Shetty: హీరోయిన్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా తీరుతో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటుంది. క్రికెట్ బెట్టింగ్ మొదలు ఇప్పటిదాకా రాజ్కుంద్రా చేసిన పనుల వల్ల పరోక్షంగా శిల్పాశెట్టినే ఎక్కువ నిందలు భరించింది. తాజాగా పోర్నోగ్రఫీ కేసులో భర్త అరెస్ట్ కావడం శిల్పాను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటిదాకా తలెత్తిన ఆటుపోట్లు ఒకటైతే, కుంద్రా అరెస్ట్ అంతకు మించి అన్నట్లుగా ఉంది. ఓవైపు కేసుకు సంబంధించి పోలీసుల విచారణ జరుగుతుండగానే, పలువురు హీరోయిన్లు సహా సొంత ఉద్యోగులే రాజ్కుంద్రాపై లైంగిక ఆరోపణలు చేస్తుండటం శిల్పాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఇంటి నుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రాజ్కుంద్రా వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన శిల్పా ప్రస్తుతం జడ్జిగా ఉన్న సూపర్ డ్యాన్సర్ రియాలిటీ షో నుంచి తాత్కాలికంగా వైదొలిగింది. గత మూడు సీజన్స్లోనూ జడ్జిగా ఉన్న శిల్పా ప్రెసెన్స్ షోకు మరింత కలిసొచ్చిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. షో పాపులర్ అయ్యేందుకు శిల్పా కూడా ముఖ్య పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమె తిరిగి జడ్జిగా వ్యవహరిస్తారా లేదా అన్నది సందేహమే. దీంతో శిల్పా స్థానంలో జడ్జిగా ఉండాలంటూ హీరోయిన్ రవీనా టాండన్ని షో ప్రతినిధులు సంప్రదించారని సమాచారం. అయితే ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించిన రవీనా.. శిల్పాశెట్టిలా మరొకరు చేసుకోలేరని అభిప్రాయపడిందట. అందుకే శిల్పా స్థానాన్ని తాను రీప్లేస్ చేయలేనని చెప్పేసినట్లు బీటౌన్ టాక్. -
‘అరెస్ట్ కాకుండా మీకెంత కావాలి? పోలీసులకు హీరోయిన్ ఆఫర్
ముంబై: ఈ ఏడాది ప్రారంభం నుంచి బాలీవుడ్ను పలు కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. రాజ్కుంద్రా పోర్నోగ్రఫీ రాకెట్ కేసు బాలీవుడ్ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ అగ్రనటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా అశ్లీల వెబ్సిరీస్, సినిమాలు తీశారనే ఆరోపణలతో అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులతో మరికొందరికి సంబంధాలు ఉన్నాయనే వార్తలు బాలీవుడ్ను షేక్ చేస్తోంది. అయితే ఈ రాకెట్ ఆనవాళ్లు ఈ ఏడాది ప్రారంభం నుంచే ఉన్నాయి. పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఓ హీరోయిన్ పోలీసులకు లంచం ఇవ్వజూపారనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోర్నోగ్రఫీ కేసులో హీరోయిన్ గెహన వశిష్ట్ అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు రూ.15 లక్షలు లంచంగా ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది. ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో ‘నన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మీకెంత కావాల్నో చెప్పండి’ అని పోలీసులకే ఆఫర్ ఇచ్చారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక చివరగా రూ.15 లక్షలు ఇస్తాను అని గెహన పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుందని దర్యాప్తులో తేలింది. అయితే లంచం పోలీసులే డిమాండ్ చేశారని గెహన ఆరోపిస్తోంది. ఈ కేసు విషయంలోనూ ఇద్దరితో వాట్సప్ చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వారే యశ్ ఠాకూర్ అలియాస్ అర్వింద్ కుమార్ శ్రీవాస్తవ, తన్వీర్ హష్మీ. వీరితో ఈ కేసు విషయమై చాటింగ్ చేసింది. పోలీసులు లంచం అడగడంతో వారిద్దరూ కలిపి రూ.8 లక్షల వరకు సమకూర్చగలరని ఆ చాటింగ్లో ఉంది. గెహనా నటించిన మూడు అశ్లీల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ వీడియోలతో రాజ్కుంద్రాకు చెందిన కంపెనీలో ఉన్న వ్యాపారవేత్త కాస్త నిర్మాతగా మారిన వ్యక్తికి సంబంధం ఉంది. -
రూ .3 వేల కోట్ల కుంభకోణం: రాజ్ కుంద్రాపై సంచలన ఆరోపణలు
సాక్షి, ముంబై: పోర్నోగ్రఫీ కేసులో పీకలదాకా మునిగిపోయి, పోలీసు కస్టడీలో ఉన్న రాజ్కుంద్రాపై బీజేపీ నేత రామ్ కదం ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. ఒక మోడల్ని శారీరకంగా వేధించడమేకాకుండా, ఆన్లైన్ గేమ్ పేరుతో దాదాపు 3 వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆన్లైన్ గేమ్తో లక్షలాది మంది ప్రజలను మోసగించారని, దీని ప్రమోషన్ కోసం నటి శిల్పా శెట్టిని వాడుకున్నాడంటూ ఆయన మండిపడ్డారు. ముంబైలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదం మాట్లాడుతూ, ఈఏడాది ఏప్రిల్ 14 న జుహు పోలీస్ స్టేషన్లో రాజ్కుంద్రాపై ప్రముఖ మోడల్, కమ్-నటి శారీరక వేధింపుల ఫిర్యాదు చేసిందనీ, పోలీసులు కేసు నమోదు చేయక పోగా, ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆమెపై ఒత్తిడి తెచ్చింది ఎవరు, కుంద్రాపై చర్యలు ఎందుకు తీసుకోలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్ కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ‘గేమ్ ఆఫ్ డాట్’అనే ఆన్లైన్ గేమ్ను ప్రారంభించి, సామాన్య జనంనుంచి వేల కోట్లు వసూలు చేసిందని రామ్ ఆరోపించారు. భార్య, నటి శిల్పా శెట్టి ఫోటో ద్వారా ఆన్లైన్ గేమ్ కోసం జనాన్ని ఆకర్షించాడని విమర్శించారు. ప్రభుత్వం గుర్తింపున్న ఆన్లైన్ గేమ్ అని చెప్పి వయాన్ ఇండస్ట్రీస్ రూ .2500 నుండి 3000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్నారు. ఇలా దేశవ్యాప్తంగా అనేకమంది మోసపోయారన్నారు. డిస్ట్రిబ్యూటర్లు అనేకమంది రూ. 30 లక్షలు, మరికొందరు 10 లక్షలు వరకు నష్టపోయారని పేర్కొన్నారు. దీన్ని ప్రశ్నించిన వారిపై దాడి చేశారని బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేశారని రామ్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయం కోసం తాము హోంమంత్రి, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగరాలేను కలుస్తామన్నారు. -
శిల్పాశెట్టికి హైకోర్టులో చుక్కెదురు; పబ్లిక్ లైఫ్ ఎంచుకున్నారు కదా!
Bombay High Court On Shilpa Shetty Defamation Plea: బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కేసుకు సంబంధించి వార్తా ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో రాజ్కుంద్రా అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలో శిల్ప- రాజ్కుంద్రా దంపతుల వ్యవహారం గురించి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో... తమ పరువుకు భంగం కలిగించే విధంగా మీడియా వ్యవహరిస్తోందని శిల్పాశెట్టి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పలు మీడియా సంస్థలు, ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో తమ గురించి ప్రచురితమవుతున్న కథనాలను అడ్డుకోవాలని కోరుతూ... పరువు నష్టం దావా వేసింది. శిల్పా పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా శిల్పా శెట్టి తరఫున హాజరైన న్యాయవాది బీరేన్ సరాఫ్ మాట్లాడుతూ.. ‘‘భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా మీడియాలో రాయడం సరికాదు(కుంద్రాతో కలిసి పోలీసులు ఇంటికి వచ్చినపుడు శిల్పా భావోద్వేగానికి గురికావడం, వారి మధ్య జరిగిన గొడవను ఉద్దేశించి)’’ అని వాదించారు. ఇందుకు స్పందించిన జస్టిస్ గౌతం పటేల్ ... ‘‘పోలీసులు చెప్పిన వివరాల గురించి ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదు. ఇలా ప్రతి అంశాన్ని అడ్డుకోవాలంటే అది పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శిల్పాశెట్టి భావోద్వేగానికి లోనుకావడం వంటి విషయాలు ఇతరుల(పోలీసులు) ముందే జరిగాయి. క్రైం బ్రాంచ్ వర్గాలు చెప్పిన వివరాల ఆధారంగా మీడియా రిపోర్టులు వచ్చాయి’’ అని పేర్కొన్నారు. అదే విధంగా... ‘‘మీరు(శిల్పాశెట్టిని ఉద్దేశించి) పబ్లిక్ లైఫ్ను ఎంచుకున్నారు. సెలబ్రిటీగా ఉన్నారు. కాబట్టి మీ జీవితాన్ని మైక్రోస్కోప్ నుంచి చూసినంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. ‘‘ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో.. మీరు ఏడ్చారు. మీ భర్తతో వాదులాడారు’’ అన్న అంశాలు పరువు నష్టం కిందకు రావు. మీరు కూడా ఒక మనిషి కదా అన్న భావనను మాత్రమే స్ఫురిస్తాయి’’ అని జస్టిస్ గౌతం పటేల్ అన్నారు. మీడియా స్వేచ్చను అడ్డుకునేలా తాము వ్యవహరించలేమని స్పష్టం చేశారు. అయితే పిల్లల పెంపకం విషయంలో శిల్పాశెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారన్న అంశాన్ని ప్రచురించే సమయంలో ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తూ.. సంమయనం పాటించాల్సిందని మీడియాకు హితవు పలికారు. -
మీడియాపై శిల్పాశెట్టి పరువునష్టం దావా
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మీడియా సంస్థలపై పరువునష్టం దావా వేసింది. కొన్ని మీడియా సంస్థలు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా కథనాలను ప్రచారం చేశాయంటూ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా కేసులో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారని పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియా సంస్థలతో పాటు, పలువురు జర్నలిస్టులపై పరువునష్టం దావా వేసింది. శుక్రవారం ఈ కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే అశ్లీల చిత్రాల కేసులో రాజ్కుంద్రాను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదల చేస్తున్నట్టుగా అతడి మీద ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్కుంద్రాను ఈ నెల 19న అదుపులోకి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. -
పోర్నోగ్రఫీ కేసు: ముందే ‘అలాంటి’ సీన్స్ రిహార్సల్ చేయమన్నారు
Raj Kundra Case: పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు గురించి ఇప్పటికే చాలా మంది బాలీవుడు నటీ,నటీమణులు పలు విషయాలు వెల్లడించారు తాజాగా నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ ఈ కేసు నేపథ్యంలో పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను బిగ్బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ ఇంటిమేట్ సీన్స్ చేయాలని అభ్యర్థించాడని,అంతేకాకుండా షూటింగ్కి ముందే అలాంటి సీన్స్ రిహార్సల్స్ చేసి వీడియోలు పంపమని కోరాడని ఆరోపించింది. నిజంగా ప్రొఫెషనల్గా శృంగార సన్నివేశాలు చిత్రీకరించే వాళ్లు ఎవరూ ముందుగా అలాంటి సీన్స్ చేసి చూపించమని అడగరని చెప్పింది. గతంలో సోఫియా కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో బెడ్ రూం సీన్స్లో నటించింది. అప్పుడు ఎవరూ తనని ముందుగా వచ్చి ‘రిహార్సల్స్’చేయమని అడగలేదని, అందుకే ఆ ఏజెంట్ మాటలను తాను నమ్మలేదని సోఫియా చెప్పుకొచ్చింది. బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెట్లు మోసం చేసి, అశ్లీల చిత్రాలలో నటింపజేస్తున్నారని సోఫియా ఆరోపించింది. అవకాశాల పేరుతో పోర్న్ వీడియోలు చేయిస్త్నున్నారని మండిపడింది. ఇలా అమ్మాయిలను మోసం చేసి అశ్లీల సినిమాల్లో నటించేలా చేయడం అత్యాచారంతో సమానమని, అలాంటి వారి పట్ల కోర్టులు కఠినంగా వ్యవహరించాలని సోఫియా అభిప్రాయపడింది. -
అటు పోర్నోగ్రఫీ కేసు : ఇటు వార్తల్లోకి శిల్పాశెట్టి తల్లి
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, వ్యాపార వేత్త రాజ్కుంద్రా దంపతుల పోర్నోగ్రఫీ కేసు వివాదం కొనసాగుతుండగానే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. శిల్పాశెట్టి తల్లి సునంద శెట్టి వార్తల్లో నిలిచారు. ఒక భూమి కొనుగోలు విషయంలో రూ .1.6 కోట్ల మేర మోసపోయానంటూ చీటింగ్ కేసు నమోదు చేశారు. ముంబై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిందితుడు సుధాకర్ ఘారే నకిలీ పేపర్లతో ఒక ల్యాండ్ను విక్రయించారని సునందా ఆరోపించారు. తప్పుడు పత్రాలతో మోసం చేశాడని, రూ .1.6 కోట్లకు భూమిని విక్రయించాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. రాజ్ కుంద్రా బెయిల్ మరోసారి తిరస్కరణ బెయిల్ విషయంలో కుంద్రాకు మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. తన అరెస్ట్ను, పోలీసు కస్టడీని వ్యతిరేకిస్తూ కుంద్రా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అనంతరం విచారణను శనివారానికి వాయిదా వేసింది. కాగా అశ్లీల చిత్రాలను తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై జూలై 19న పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. ఈ కేసులో కుంద్రాను కీలక కుట్రదారుడిగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు. అశ్లీల చిత్రాలను హాట్ షాట్స్ యాప్ ద్వారా రిలీజ్ చేసి, కోట్ల రూపాయలు దండుకున్నా డనేది కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసులో శిల్పా శెట్టికి క్లీన్చిట్ లభించే అవకాశాలు కూడా కనిపించడంలేదు. మరోవైపు ఈ కేసులో కుంద్రా కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు అప్రూవర్లుగా మారడంతో మరింత ఉచ్చు బిగుస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధం ఉన్న వ్యక్తుల ఖాతాల్లోని లావాదేవీలపై దర్యాప్తు జరిపేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్లను నియమించినట్లు అధికారులు తెలిపారు. -
శిల్పాశెట్టి గురించి చెప్తూ.. బలవంతంగా నన్ను ముద్దుపెట్టుకుని..
ముంబై: పోర్న్ చిత్రాల కేసులో అరెస్టయిన శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాపై బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తీవ్ర ఆరోపణలు చేసింది. బిజినెస్ డీల్ కోసం ఇంటికొచ్చిన రాజ్కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా మారిందని చెబుతూ బలవంతంగా తనకు ముద్దు పెట్టాడని ఆరోపించింది. కాగా రాజ్ కుంద్రా పోర్నోగ్నఫీ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో షెర్లిన్ చోప్రాకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్కుంద్రాపై షెర్లిన్ తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. 2019లో ఓ ప్రపోజల్ గురించి రాజ్ కుంద్రా తన బిజినెస్ మెనేజర్కు కాల్ చేసినట్లు పేర్కొంది. 2019 మార్చి 27న బిజినెస్ మీటింగ్ తరువాత రాజ్ కుంద్రా ఓ రోజు తనకు చెప్పకుండానే ఇంటికి వచ్చినట్లు తెలిపింది. మెసెజ్కు సంబంధించిన వాదనలో సరాసరీ ఇంటికే వచ్చినట్లు తెలిపింది. అయితే ఇంటికి వచ్చిన రాజ్ కుంద్రా తన మాట వినకుండా బలవంతంగా కిస్ చేశాడని ఆరోపించింది. కానీ ఒక పెళ్లైన వ్యక్తితో తను రిలేషన్షిప్ పెట్టుకోవాలని లేదని.. తన ఆనందాలను బిజినెస్తో ముడి పెట్టాలని అనుకోలేదని పేర్కొంది. అయితే తన భార్య శిల్పాశెట్టితో సంబంధం సంక్లిష్టంగా ఉందని... ఇంటి వద్ద ఎంతో ఒత్తిడి గురవుతున్నానని రాజ్ కుంద్రా తనతో అన్నాడని చెప్పింది. ఆ సమయంలో తనకు ఎంతో భయం వేయడంతో అతనిని తోసేసి వాష్ రూమ్కు పారిపోయానని తెలిపింది. ఇదిలా ఉండగా రాజ్ కుంద్రాపై షెర్లిన్ ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కుంద్రా అరెస్ట్ అయిన తరువాత అశ్లీల చిత్రాల కేసుపై షెర్లిన్ చోప్రా ఓ వీడియో స్టేట్మెంట్ను విడుదల చేసింది. -
రాజ్కుంద్రాకు షాకిచ్చిన సెబీ
సాక్షి, ముంబై: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్కుంద్రా దంపతులకు మరో షాక్ తగిలింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ శిల్పా శెట్టి, రాజ్కుంద్రా, వారి సంస్థపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈఆర్డర్ అందిన 45 రోజులలోపు 3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. శిల్పా శెట్టి, రాజ్కుంద్రాకు చెందిన సంస్థ వయాన్ ఇండస్ట్రీస్పై సెబీ 3 లక్షల జరిమానా విధించింది.సెబీ (ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధం) నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ పెనాల్టీ విధించింది. మరోవైపు వయాన్ సంస్థ ఉద్యోగులకు రాజ్కుందద్రాకు వ్యతిరేకంగా కీలక సమాచారాన్ని అందించారు. కాగా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయి రిమాండులో ఉన్న రాజ్కుంద్రా బెయిల్ను కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ మేరకు గర్యాన్ థోర్పే బెయిల్ పిటీషన్ను కూడా కోర్టు రద్దు చేసింది. పోర్న్ ఫిలిమ్స్ తయారీ, ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా గత ఏడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలో కుంద్రా రూ. 1.17 కోట్లు ఆర్జించినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 11మంది ని అరెస్ట్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. -
ఆ షార్ట్ ఫిలింస్ను పోర్న్ చిత్రాలనలేం: దర్శకుడు
నీలి చిత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్శకుడు తన్వీర్ హష్మిని మూడు గంటల పాటు విచారించారు. ఈ కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా మాట్లాడుతూ జీవితంలో ఇప్పటివరకు రాజ్ కుంద్రాను కలవనేలేదన్నాడు. తాము నగ్నచిత్రాలు తీసినప్పటికీ కుంద్రా కంపెనీతో తమకెలాంటి సంబంధం లేదన్నాడు. 'మేము 20-25 నిమిషాల నిడివి ఉండే లఘు నగ్న చిత్రాలు తీశాము. కానీ వాటిని పోర్న్ చిత్రాలు అని కాకుండా సాఫ్ట్ పోర్న్ అని పిలవచ్చు. అయినా ఇతర ప్లాట్ఫామ్స్ కూడా బోల్డ్ చిత్రాలు తీస్తున్నాయి. అలాంటివాటిని ఎందుకు ప్రశ్నించరు?' అని నిలదీశాడు. కాగా నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫారమ్లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఉన్న ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
పోర్నోగ్రఫీ కేసు: రాజ్కుంద్రా అంత సంపాదించాడా?
Raj Kundra Case: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నటనపై ఆసక్తి ఉన్నవారికి ఆఫర్ల ఆశ చూపించి, బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేశాడన్నది రాజ్కుంద్రాపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ నెల 19న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు హాట్షాట్స్ యాప్లో పోర్న్ వీడియోలు అప్లోడ్ చేసేవాడని తెలిసింది. ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఒక్క హాట్ షాట్స్ యాప్ ద్వారానే అతడు రూ.1.17 కోట్లు ఆర్జించాడని జాతీయ మీడియా పేర్కొంది. ఈ ఆదాయానికి సంబంధించి కచ్చితమైన సమాచారం రాబట్టడానికి ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ నుంచి పూర్తి వివరాలను కోరామని ముంబై పోలీసులు వెల్లడించారు. కాగా రాజ్కుంద్రా బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు కొట్టివేసింది. నిందితుడికి 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ విషయంపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామని నిందితుడి తరపు న్యాయవాది పేర్కొన్నాడు. ఇదిలా వుంటే రాజ్ కుంద్రా ఆఫీసు మీద పోలీసులు రైడ్ చేసినప్పుడు రహస్య కప్బోర్డులను గుర్తించారు. వీటిలో ఆర్థిక లావాదేవీలు, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన పత్రాలు బయటపడ్డాయి. కానీ రాజ్కుంద్రాను అరెస్ట్ చేసేనాటికే అక్కడ చాలామటుకు డిజిటల్ సమాచారాన్ని డిలీట్ చేశారని అధికారులు పేర్కొన్నారు. -
పోర్నోగ్రఫీ కేసు: నాకెలాంటి సంబంధం లేదన్న నటి
ముంబై: ‘‘నేనొక నటిని. ప్రపంచంలో ఎక్కడో ఏ మూలనో కూర్చున్న వ్యక్తులు నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు. మీరు ప్రచారం చేసే వదంతుల వల్ల నాకు వచ్చే అవకాశాలు చేజారతాయి. దయచేసి నన్ను వివాదాల్లోకి లాగకండి’’ అని నటి ఫ్లోరా షైనీ(ఆశా షైనీ) విజ్ఞప్తి చేసింది. రాజ్కుంద్రాతో గానీ, అతడి అనుచరులతో గానీ తనకు ఎటువంటి సంబంధం లేదని, తనకు ఏ పాపమూ తెలియదని స్పష్టం చేసింది. పోర్నోగ్రఫీ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ కోసం అర్థించగా.. తిరస్కరించి కోర్టు అతడికి 14 రోజులపాటు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో రాజ్కుంద్రా సన్నిహితుడు ఉమేశ్ కామత్తో ఫ్లోరా షైనీకి స్నేహం ఉందని, వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంటూ శనివారం నాటి నుంచి ఓ వాట్సాప్ చాట్ స్థానిక మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన ఫ్లోరా షైనీ.. ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేసింది. ఈ మేరకు ఇన్స్టాలో వీడియో షేర్ చేసిన ఆమె... ‘‘ రాజ్కుంద్రా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. ఆయన భార్య శిల్పాశెట్టి కూడా నటి. కాబట్టి ఆయనకు చాలా మంది నటీనటులతో స్నేహం ఉండే ఉంటుంది. కానీ, నాకైతే ఆయనతో గానీ, రూమర్లు ప్రచారం అవుతున్నట్లుగా ఉమేశ్ కామత్తో గానీ ఎలాంటి సంబంధం లేదు. వారి కాంటాక్ట్ నంబర్లు కూడా నా వద్ద లేవు. అనవసరంగా నన్ను వివాదంలోకి లాగడం సరికాదు. నన్ను సంప్రదించకుండా, ఆ చాట్స్ నిజమైనవో కాదో తెలుసుకోకుండా ఇష్టారీతిన ప్రసారాలు చేస్తే ఆ చానెల్కు వచ్చే లాభమేమిటో అర్థం కావడం లేదు. నాపై చెడు ప్రచారం జరుగుతుంది కాబట్టే.. నేరుగా స్పందించాల్సి వచ్చింది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు ఆమెకు అండగా నిలబడుతున్నారు. కాగా నరసింహా నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో, సర్దుకుపోదాం రండి తదితర తెలుగు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన ఆశా షైనీ.. కొంతకాలం సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉంది. ఆ తర్వాత తన పేరును ఫ్లోరా షైనీగా మార్చుకుని.. బాలీవుడ్కు వెళ్లింది. శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావుల స్త్రీ బేగంజాన్, లక్ష్మీ తదితర సినిమాలతో పాటు గందీ బాత్ వెబ్సిరీస్లో నటించింది. View this post on Instagram A post shared by Flora Saini (@florasaini) -
పోర్నోగ్రఫీ కేసు: మనోజ్ బాజ్పాయ్ నీచుడు, సభ్యత లేనివాడు
Sunil Pal: నీలి చిత్రాల కేసులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడంపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు చేయడమే కాక అతడిని అరెస్ట్ చేసినందుకు పోలీసులను అభినందించాడు. అయితే ఈ పోర్న్ అనేది రకరకాల రూపాల్లో విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడాడు. 'రాజ్కుంద్రాను అరెస్ట్ చేయడం సబబైనదే. ఇదిప్పుడు అవసరం కూడా! ఎందుకంటే పలుచోట్ల సెన్సార్ లేకపోవడంతో కొందరు పెద్ద తలకాయలు అడ్డగోలు వెబ్సిరీస్లు తీస్తున్నారు. అవి ఇంట్లోవాళ్లతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు మనోజ్ బాజ్పాయ్ను తీసుకుందాం. అతడు పెద్ద నటుడే కావచ్చు. కానీ అతడిలాంటి సభ్యత లేని వ్యక్తిని, నీచుడిని నేనింతవరకు చూడలేదు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అతడు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఏం చేస్తున్నాడు? అతడు నటించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో.. భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, మైనర్ బాలికకు బాయ్ఫ్రెండ్, చిన్న పిల్లాడు తన వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం అంటే ఇలాగే ఉంటుందా? ఇవా మీరు చూపించేది? ఇక పంకజ్ త్రిపాఠి నటించిన మీర్జాపూర్ పనికిరాని వెబ్సిరీస్. అందులో చేసినవాళ్లంటేనే నాకు అసహ్యం. పోర్న్పై నిషేధం విధించినట్లుగానే ఈ పనికిరాని వెబ్సిరీస్లను కూడా బ్యాన్ చేయాలి. కేవలం కళ్లకు కనిపించేదే కాదు, ఆలోచనల్ని చెడగొట్టేది కూడా పోర్న్ కిందకే వస్తుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా సునీల్ పాల్ 2005లో ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్లో విజేతగా నిలిచాడు. 2010లో 'భవ్నావో కో సమజో' అనే కామెడీ సినిమాకు దర్శకత్వం వహించాడు. -
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ.. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
ముంబై: పోర్నోగ్రఫి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ విచారణను తిరస్కరించిన కోర్టు.. అతడికి 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. రాజ్ కుంద్రా మార్చిలోనే తన అరెస్ట్ను ఊహించాడని.. ఈ క్రమంలో తన ఫోన్ను మార్చాడని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించడానికి క్రైమ్ బ్రాంచ్ అఫ్టికల్స్ స్వతంత్ర ఆడిటర్ను కూడా నియమించుకున్నట్లు సమాచారం. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫారమ్లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తూ.. వాటిని హాట్ షాట్స్ యాప్ ద్వారా రిలీజ్ చేసేవాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రెండు రోజుల క్రితం శిల్పా శెట్టిని కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్రపై దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ కేసులో వియాన్ ఇండస్ట్రీస్కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారు. అంతేకాక రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల రాకెట్టుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. జూలై 27, ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. -
రాజ్ కుంద్రా అరాచకాలు: ఐబీ అధికారి భార్య పేరు మీద యాప్
ముంబయి: రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్న పోర్నోగ్రఫీ కేసు విచారణలో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్ షాట్స్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో కుంద్రా ప్లాన్-బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్ పేరుతో మరో యాప్ను ఏర్పాటు చేసి వ్యాపారం కొనసాగించారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇందుకుగాను రాజ్ కుంద్రా ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకుర్ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో పరిచయం పెంచుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అవార్డులు గెలుచుకున్న షార్ట్ ఫిలిమ్స్ను ప్రసారం చేసేందుకు యాప్ను ఏర్పాటు చేద్దామని యష్ ఠాకూర్.. సదరు ఐబీ అధికారి వద్ద ప్రతిపాదించాడు. అందుకు అంగీకరించిన ఆ అధికారి తన భార్య పేరు మీద బాలీఫేమ్ యాప్ను రిజిస్టర్ చేశాడు. అయితే ఆ యాప్లో అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేయడంతో అతడు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. కుంద్రా అరెస్టైన మరుసటి రోజు ఆ యాప్ నుంచి పోర్న్ చిత్రాలను తొలగించమని తమకు చెప్పినట్లు ఈ కేసులో సాక్షులుగా మారిన కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు తెలిపారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో మంగళవారం విచారణకు రావాలంటూ నటి షెర్లిన్ చోప్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
రాజ్కుంద్రా కేసు: నటికి సమన్లు
-
రాజ్కుంద్రా కేసు: నటికి సమన్లు
సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన వ్యాపార వేత్త , శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అశ్లీ చిత్రాల తయారీ, పంపిణీకి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పలు సాక్ష్యాలను సేకరించగా, వియాన్ ఇండస్ట్రీస్కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులు అందించారు. తాజాగా ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కుంద్రాకు పోర్న్ వీడియోల రాకెట్ఖుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. రేపు (జూలై 27, ఉదయం 11 గంటలకు) తమ ముందు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చింది. ఈ కేసుకు సంబంధించి షెర్లిన్ చోప్రా స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సి ఉంటుందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే కుంద్రా ఉద్యోగులు సమాచారం కీలకంగా భావిస్తున్న పోలీసులు, ఈ వ్యవహారంపై మరింత కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలోనే షెర్లిన్ చోప్రా విచారణ అనంతరం పలువురికి సమన్లు జారీ చేసే అవకాశముందని అంచనా. కాగా రాజ్ కుంద్రా వ్యవహారంపై సోషల్ మీడియా ద్వారాషెర్లిన్ చోప్రా స్పందించిన విషయం తెలిసిందే. రాజ్ కుంద్రా అరెస్ట్, జూలై 23 వరకు రిమాండ్కు తరలించిన తరువాత షెర్లిన్ చోప్రా మొదటిసారి మౌనం వీడింది. ఈమేరకు ఒకవీడియోను షేర్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సైబర్ సెల్కు అధికారిక ప్రకటన ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనంటూ..పరోక్షంగా మరో వివాదాస్పద నటి పూనం పాండేపై ఎటాక్ చేసింది. అలాగే తనపై ప్రచారం జరుగు తున్నట్లుగా తాను ఎక్కడకీ పారిపోలేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
భర్తతో గొడవ, పోలీసుల ముందు ఏడ్చేసిన శిల్పా
పోర్నోగ్రఫీ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్కుంద్రాను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు కేసుకు సంబంధించి అతడి భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టిని కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్ కుంద్రాను వెంటబెట్టుకొని జుహులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కుంద్రా, శిల్పాశెట్టిలను విచారిస్తుండగా శిల్పాశెట్టి కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో తమ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందని చెబుతూ పోలీసుల ముందు శిల్పా ఎమోషనల్ అయిందట. అంతేకాకుండా ఈ కేసు వల్ల కొన్ని అగ్రిమెంట్స్ క్యాన్సిల్ అయ్యాయని, దీంతో తీవ్రంగా నష్టపోయామని శిల్పా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక విచారణ నిమిత్తం ఇంటికి వచ్చిన రాజ్కుంద్రాతో శిల్పా వాగ్వాదానికి దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే పోలీసుల విచారణలో మాత్రం భర్తను వెనకేసుకొచ్చిందని, రాజ్కుంద్రా శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని శిల్పా తన వాంగ్మూలంలో వివరించింది. ఇక హాట్షాట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాజ్ కుంద్రా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ముంబై: పోర్నోగ్రఫీ రాకెట్ కేసులో అరెస్టయిన వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వియాన్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఆయన దగ్గర పని చేసే ఉద్యోగులే కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఆదివారం వెల్లడించారు. నీలిచిత్రాలు రూపొందించడానికి సంబంధించి వీరంతా పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసుల దగ్గర వెల్లడించడంతో కుంద్రా మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే కుంద్రాపై మనీ ల్యాండరింగ్, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కేసుల్ని ఈడీ పెట్టే అవకాశాలున్నాయి. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్ఫారమ్లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. 27 వరకు పోలీసు కస్టడీలోనే ఆయన ఉంటారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు జరుపుతున్న విచారణకు ఆయన సరిగ్గా సహకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు పోర్నోగ్రఫీ కేసులోఆదివారం నాడు టెలివిజన్ నటి, మోడల్ గెహానా వశిష్ట్తో పాటుగా మరో ఇద్దరిని ముంబై పోలీసులు సమన్లు పంపినప్పటికీ వారు విచారణకు హాజరు కాలేదు. -
పోర్న్ కాదు... శృంగారమే తీస్తారు: శిల్పా శెట్టి
ముంబై: ఓటీటీలో పోర్న్ సినిమాలు ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారంలో పొడుగు కాళ్ల సుందరి తన భర్తకి అండగా నిలిచింది. తన భర్త చాలా అమాయకుడని, శృంగారభరితమైన సినిమాలు తీస్తారే తప్ప పోర్న్ (అశ్లీల / నీలి చిత్రాలు) తీయరని ముంబై పోలీసుల ఎదుట వెల్లడించింది. ఈ రెండింటికి చాలా తేడా ఉందని శిల్ప తన వాంగ్మూలంలో వివరించింది. శుక్రవారం రాత్రి దాటేదాకా ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసు బృందం శిల్పను దాదాపుగా ఆరు గంటల సేపు ప్రశ్నించింది. హాట్షాట్స్ ఓటీటీ ప్లాట్ఫారమ్లో వచ్చేవన్నీ ఎక్కువగా కుంద్రా బావగారు ప్రదీప్ భక్షి తీస్తారని ఆమె విచారణలో వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. పోర్న్ సినిమాలకు, తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని శిల్ప చెప్పినట్టు తెలిపాయి. హాట్షాట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే కంటెంట్పై తనకి ఎలాంటి అవగాహన లేదని, దాంట్లో తన ప్రమేయం ఏ మాత్రం లేదని వెల్లడించింది. ఆది నుంచీ వివాదాలే కుంద్రాకు వివాదాలు కొత్త కాదు. ఐపీఎల్ బెట్టింగ్, బిట్ కాయిన్ ట్రేడింగ్లో ఆయన ప్రమేయంపై ప్రకంపనలు రేగాయి. పంజాబ్ నుంచి బ్రిటన్కు వలస వచ్చిన కుటుంబంలో 1975 నవంబర్ 9న లండన్లో కుంద్రా జన్మించారు. నేపాల్లో తొలుత శాలువాల వ్యాపారాలు చేశారు. బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో పాల్గొన్న అనంతరం శిల్ప ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వెళ్లినప్పుడు 2007లో లండన్లో కుంద్రాను కలుసుకున్నారు. రెండేళ్లపాటు డేటింగ్ చేశాక 2009లో పెళ్లిచేసుకున్నారు. వారిద్దరూ ఐపీఎల్ రంగంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్లో పెట్టుబడి పెట్టారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకున్న కుంద్రాపై సుప్రీంకోర్టు కమిటీ జీవితకాల నిషేధం విధించింది. 2018లో రాజ్ని బిట్ కాయిన్ వ్యాపారంలో అవకతవకలపై ఈడీ విచారణ జరిపింది. -
అలా శిల్పాశెట్టిని ఇంప్రెస్ చేసిన రాజ్కుంద్రా
Raj kundra-Shilpa shetty love story: రాజ్కుంద్రా.. గత కొన్నిరోజుల నుంచి ఈ పేరు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మీడియా, వెబ్సైట్లు, సోషల్ మీడియాలోనూ కుంద్రా భాగోతంపై జోరుగా చర్చ నడుస్తుంది. లండన్కు చెందిన రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కావడంతో సినీ ఇండస్ర్టీ ఒక్కసారిగి ఉలిక్కిపడింది. ఇక భర్త అరెస్ట్ అనంతరం అఙ్ఞాతంలోకి వెళ్లిపోయిన శిల్పా తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకప్పుడు శాలువాలు అమ్మిన రాజ్కుంద్రా అప్పటి స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టిని ఎలా వల్లో వేసుకున్నారన్నదానిపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తుంది. రాజ్ కుంద్రా తండ్రి అక్కడ బస్సు కండక్టర్గా, తల్లి ఓ చిన్నషాపులో పని చేసేది. దీంతో 18 ఏళ్ల వయసులో దుబాయ్ అక్కడి నుంచి నేపాల్ వెళ్లిన కుంద్రా..మొదట శాలువాల బిజినెస్ చేశాడు. అయితే కొన్నేళ్ల తర్వాత తెలివిగా వాటిని బ్రిటన్కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు విక్రయించి కోట్లు సంపాదించాడు. ఆ తర్వాత కన్ స్ట్రక్షన్ ట్రేడింగ్లో అడుగుపెట్టి లాభాలు ఆర్జించాడు. ఆ సమయంలోనే బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్సింగ్ చేస్తూ సంజయ్ దత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లలతో పరిచయాలు ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ డీల్ విషయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా రాజ్ కుంద్రాను శిల్పా మొదటిసారి కలిసిందట. ఆమె నవ్వు, అందానికి తొలిచూపులోనే ఇంప్రెస్ అయిన కుంద్రా శిల్పాకు దగ్గరయ్యేందుకు చాలానే ప్రయత్నాలు చేసేవాడట. అప్పటినుంచి సందర్భం లేకున్నా ఆమెకు కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వడం మొదలుపెట్టాడట. ఓసారి శిల్పాకు ఇష్టమైన కలర్ ఏంటో తెలియక ఒకే బ్రాండ్ ఉన్న ఖరీదైన మూడు బ్యాగులను వేరే వేరు రంగులతో ఆమెకు బహుమతిగా పంపించాడట. ఇది చూసి శిల్పా షాక్ అయ్యిందట. అంతేకాకుండా ఆ సమయంలో లండన్లోనే బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటండంతో పెళ్లి అయితే లండన్ వెళ్లడం ఇష్టం లేక ఇలాంటివి ఆపాల్సిందిగా శిల్పా కుంద్రాను కోరింది. దీంతో ఆమెను లండన్కు తీసుకెళ్లకుండా కుంద్రానే ముంబైలో ఓ ఇల్లు తీసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా శిల్పా ఓ ఇంటర్వ్యూలోనూ రివీల్ చేసింది. అలా కుంద్రా తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ఇంప్రెస్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఇక వీరుద్దరు కొన్నాళ్లు డేటింగ్ అనంతరం 2009లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి ముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన శిల్పా.. వివాహం అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు హంగామా-2 చిత్రం ద్వారా మరోసారి కం బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే భర్త అరెస్ట్ శిల్పాకు ఊహించని షాక్ ఇచ్చింది. -
నా భర్త అమాయకుడు: శిల్పాశెట్టి
ముంబై : పోర్నోగ్రఫీ కేసులో విచారణను వేగవంతం చేశారు ముంబై పోలీసులు. ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని శుక్రవారం సాయంత్రం విచారించి, ఆమె స్టేట్ మెంట్ను రికార్డు చేశారు. విచారణ సందర్భంగా ఆమె తన భర్తను వెనకేసుకొచ్చినట్లు సమాచారం. రాజ్కుంద్రా అమాయకుడని, ‘ఎరోటికా’కు ‘పోర్న్’కు తేడా ఉందని, ‘ఎరోటికా’..‘పోర్న్’ కాదని ఆమె అన్నట్లు తెలుస్తోంది. యాప్ నిర్వహణ లండన్లో ఉన్న రాజ్కుంద్రా బావమరిది ప్రదీప్ భక్సిదని ఆమె చెప్పినట్లు సమాచారం. కాగా, ముంబై మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం రాజ్కుంద్రా కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగించింది. దాదాపు 48 టెరాబైట్(టీబీ)ల అశ్లీల ఫొటోలు, వీడియోలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుంద్రా పేర రిజిస్ట్రర్ అయిన యస్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతాల లావాదేవీలను రికార్డు చేశామని వెల్లడించారు. పోర్నోగ్రఫీ కంటెంట్ ద్వారా వచ్చిన డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్కు ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. దాదాపు 7.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. -
పోర్నోగ్రఫీ కేసులో ఏ క్షణమైనా శిల్పాశెట్టి అరెస్ట్!
ముంబై : పోర్నోగ్రఫీ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్కుంద్రా కేసు మరో మలుపు తిరిగింది. ముంబై జుహూలోని శిల్పాశెట్టి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. వారి వెంట రాజ్కుంద్రా కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించిన మరింత లోతుగా విచారించేందుకు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు శిల్పాశెట్టిని ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. శిల్పాశెట్టి..వియాన్ కంపెనీ డైరెక్టర్లలో ఒకరు. ఇటీవలె అంధేరి వెస్ట్లోని వియాన్ కార్యాలయానిపై దాడిచేసిన పోలీసులు భారీగా పోర్న్ వీడియోల డేటాను సేకరించారు. అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన కుంద్రా పోలీసు కస్టడీని ముంబై మేజిస్ట్రేట్ జూలై 27వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా కుంద్రా నోరు విప్పడం లేదని తెలుస్తుంది. దీంతో కేసు దర్యాప్తులో భాగంగా శిల్పాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబే గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఏడాదిన్నరలో వంద పోర్న్ వీడియోలు తయారు చేసినట్లు కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కుంద్రా పోర్న్ యాప్కు 20 లక్షల మంది సబ్స్రైబర్లు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. -
శిల్పాశెట్టి ఇంటికి ముంబై పోలీసులు .. ప్రశ్నించే అవకాశం!
-
పోర్నోగ్రఫీ కేసు: రాజ్కుంద్రాకు షాక్.. వెలుగులోకి సంచలన విషయాలు
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన శిల్పా బాలీవుడ్ నటి, శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాకు మరో షాక్ తగిలింది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ను ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. జూలై 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రాను కీలక నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరిచారు. జూలై 23 వరకు కోర్టు అతన్ని రిమాండ్ కు తరలించాల్సిందిగా ఆదేశించింది. శుక్రవారం మరోసారి ఆయన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టగా, బెయిల్ పిటిషన్ని తిరస్కరించడంతో పాటు, పోలీసుల విజ్ఞప్తి మేరకు 27వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. అశ్లీల చిత్రాల ద్వారా సంపాదించిన డబ్బును ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే రాజ్ కుంద్రా బ్యాంక్ ఖాతా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఆఫ్రికా ఖాతా మధ్య లావాదేవీలను విచారించాల్సిన అవసరం ఉందని ముంబై పోలీసులు కోర్టుకు విన్నవించినట్టు తెలుస్తోంది. పోర్న్ వీడియోలను భారీ మొత్తానికి అమ్మకానికి పెట్టినట్లు అతని వాట్సాప్ చాటింగ్ ద్వారా తెలుస్తుందని ముంబై పోలీసులు తెలిపారు. 121 అశ్లీల వీడియోలను దాదాపు 1.2 మిలియన్ డాలర్లకు డీల్ కుదుర్చుకున్నట్లు వాట్సాప్ చాట్లో కనుగొన్నామన్నారు. ఈ డీలింగ్ అంతర్జాతీయ స్థాయిలో జరిగిందని ముంబై పోలీసులు పేర్కొన్నారు. -
భర్త అరెస్ట్పై తొలిసారి స్పందించిన శిల్పాశెట్టి
ముంబై : అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబై పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే భర్త అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు మాట్లాడని శిల్పాశెట్టి ..తొలిసారి సోషల్ మీడియా ద్వారా స్పందించింది. 'కోపంలో వెనక్కి తిరిగి చూడకు, భయంగా ఉన్నప్పుడు భవిష్యత్తును చూడకు. పూర్తి అవగాహనతో చుట్టుపక్కల చూడు. మనల్ని బాధపెట్టిన వారి వైపు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాం. ఉద్యోగం పోతుందేమో అన్న భయంతోనో, ఏదైనా వ్యాధి బారిన పడతామనో, మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోతామనే భయంతోనో భవిష్యత్తుతను చూస్తాం. అదృష్టవశాత్తు నేను ఇంకా బతికే ఉన్నానని తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. భవిష్యత్తులో కూడా సవాళ్లను ఎదుర్కొంటా. ఏం జరిగినా నేను జీవిస్తాను. దాన్ని ఏ శక్తీ ఆపలేదు' అంటూ ప్రముఖ రచయిత జేమ్స్ థర్బర్ నవలలోని వాక్యాలను శిల్పా హైలేట్ చేస్తూ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం శిల్పా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేసిన ముంబై పోలీసులు ఈ కేసులో శిల్పాశెట్టి ప్రమేయం ఏమైనా ఉందా అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసుతో శిల్పాకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరంబే విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాగా రాజ్కుంద్రా 2009లో శిల్పాశెట్టిని రెండో వివాహం చేసుకున్నారు. అంతకుముందు బిజినెస్మెన్ కూతురు కవితను వివాహం చేసుకున్న ఆయన 2006లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఓ కుమార్తె డీలేనా ఉంది. చిన్న వయసులోనే వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగిన రాజ్కుంద్రా ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ, అటుపై బెట్టింగ్-వివాదాల వ్యహారంతో కుదేలు అయ్యాడు. వివాదాలతో రాజ్కుంద్రా పేరు మసకబారింది. ఇప్పుడు నీలి చిత్రాల వ్యవహారంతో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. భర్త వైఖరిపై తన నిర్ణయం స్పష్టంగా చెప్పకపోయినా రాజ్కుంద్రాకు శిల్పా అండగా నిలబడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. -
చేసిన పాపం ఎక్కడికిపోతుంది: రాజ్కుంద్రాపై నిర్మాత ఫైర్
సాక్షి, ముంబై: నీలిచిత్రాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటి, శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రాకు మరో భారీ షాక్ తగిలింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై న్యాయ పోరాటంలో నటుడు, నిర్మాత సచిన్ జోషి విజయం సాధించారు. ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్ వివాదంలో జోషికి సంబంధించిన బంగారాన్ని ఆయనకు అప్పగించాలని, అలాగే చట్టపరమైన చర్యలకు గాను మరో 3 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యగ్ గోల్డ్ బంగారు పథకంలో తనను మోసం చేశారని ఆరోపించిన సచిన్ జోషి ఈ ఏడాది జనవరిలో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కోర్టు జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జోషికి కిలో బంగారాన్ని అప్పగించడంతోపాటు, కోర్టు ఖర్చుల కింద మూడు లక్షలు రూపాయలు చెల్లించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. శిల్పా, రాజ్, ‘సత్యయుగ్ గోల్డ్’ కంపెనీలో అప్పటికి డైరెక్టర్లుగా ఉన్నారు. తక్కువ రేటుకే బంగారం స్కీం పేరుతో పలువురి వద్ద డబ్బులు సేకరించారు. ఇది తమకు చెల్లించలేదని ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే జోషి కేసులో తాజా తీర్పు వెలువడింది. ఈ తీర్పుపై స్పందించిన సచిన్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరేళ్లు తను కష్టపడి దాచుకున్న డబ్బును అక్రమంగా కాజేయాలని చూశారు. 18లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వటానికి కుంద్రా సంస్థ 25 లక్షలు డిమాండ్ చేసిందని మండిపడ్డారు. తనబంగారాన్ని తనకివ్వమని అడిగితే, రివర్స్లో తనపైనే బురద చల్లారంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. చేసిన పాపాలు ఎక్కడిపోతాయి...కర్మ అనుభవించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు పోర్న్ వీడియో స్కాంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన వెంటనే సచిన్ జోషి భార్య, నటి ఊర్వశి శర్మ తన ఇన్స్టా స్టోరీలో..‘చేసిన పాపంవెంటాడుతుంది’ అంటూ ఒక పోస్ట్ పెట్టడం విశేషం. మరోవైపు సోమవారం అర్థరాత్రి అరెస్ట్ చేసినరాజ్కుంద్రా రిమాండ్ను మరో మూడు రోజుల పాటు పొడిగించారు. రాజ్ అరెస్ట్ అక్రమమని బెయిల్ మంజూరుచేయాలన్న పిటిషన్ను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అనంతరం జూలై 27వరకు పోలీసు కస్టడీ విధించింది. -
రాజ్కుంద్రాపై ఆరోపణలు: చంపుతామంటూ నటికి బెదిరింపులు
Sagarika Shona Suman: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై ఆరోపణలు చేసిన మోడల్, నటి సాగరిక ఇబ్బందుల్లో పడింది. తనను అత్యాచారం చేసి, చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని వాపోయింది. ఈ మేరకు గురువారం నాడు ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "కొందరు వ్యక్తులు నాకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. అత్యాచారం చేసి చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అసలు రాజ్ కుంద్రా ఏం తప్పు చేశాడని ప్రశ్నిస్తున్నారు. మీరు పోర్న్ చిత్రాలు చూస్తారు కాబట్టే మేము వాటిని చిత్రీకరిస్తున్నామని దబాయించారు. ఈ చీకటి వ్యాపారానికి ముగింపు పడటానికి కారణం నేనేనని నిందిస్తున్నారు. వేర్వేరు నంబర్ల నుంచి ఈ ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా అనిపించడమే కాక నా జీవితం ప్రమాదంలో పడినట్లు అనిపిస్తోంది. దీనికి కారణమైనవారిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను" అని చెప్పుకొచ్చింది. కాగా రాజ్ కుంద్రా దగ్గర పనిచేసే ఉమేశ్ కావత్ నుంచి తనకు వెబ్ సిరీస్ కోసం పిలుపు వచ్చిందంటూ సాగరిక ఇంటర్వ్యూ ఒకటి వైరల్గా మారిన విషయం తెలిసిందే. అయితే వీడియో కాల్ ద్వారా ఆడిషన్ ఉంటుందని, ఈ వీడియోకాల్లో నగ్నంగా కనిపించాలని చెప్పడంతో దాన్ని తిరస్కరించానని చెప్పింది. -
భర్త అరెస్ట్తో రియాలిటీ షో నుంచి తప్పుకున్న శిల్పాశెట్టి!
Raj Kundra Arrest: పోర్నోగ్రఫీ కేసులో కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో యువతులకు గాలం వేసి.. వాళ్లతో అడల్ట్ చిత్రాలు తీస్తున్నాడని రాజ్కుంద్రాపై ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కుంద్రా అరెస్ట్తో సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత రెండు రోజులుగా దీనికి సంబంధించిన వార్తలు హెడ్లైన్స్గా మారాయి. ఈ మొత్తం వ్యవహారంతో ఆయన భార్య, ప్రముఖ నటి శిల్పా శెట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షో నుంచి తప్పుకోవాలని శిల్పా భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను సోనీ టీవీ రిలీజ్ చేసింది. ఇందులో శిల్పా శెట్టి స్థానంలో కరీష్మా కపూర్ కనిపించడం రూమర్స్కు మరింత బలం చేకూర్చాయి. అయితే కరీష్మా కేవలం ఒక్క ఎపిసోడ్కు మాత్రమే గెస్ట్గా వచ్చారని, ఆమె షో మొత్తానికి కొనసాగరని సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో శిల్పా శెట్టి స్థానంలో మరొకరు వస్తారా? లేక ఆమె తిరిగి జడ్జిగా కొనసాగుతారా అన్నది చూడాల్సి ఉంది. కొద్ది నెలల క్రితం రాజ్కుంద్రా సహా మిగతా కుటుంబసభ్యులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో శిల్పా బ్రేక్ తీసుకోగా, ఆమె స్థానంలో మలైకా అరోరా జడ్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మరో రియాలిటీ షోకు జడ్జిగా కొనసాగుతున్నారు. మరోవైపు శిల్పా శెట్టి ప్రధానపాత్రలో నటించిన 'హంగామా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శిల్పా.. ఈ చిత్రంతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని భావించింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో రాజ్కుంద్రా అరెస్ట్తో శిల్పాకు గడ్డుకాలమనే చెప్పొచ్చంటున్నారు సినీ పెద్దలు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) -
పోలీసులకు రాజ్కుంద్రా భారీ లంచం?
-
పోలీసులకు రాజ్కుంద్రా భారీ లంచం? ఎందుకంటే..
ముంబై: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా లీలలు.. అక్రమాలు ఒక్కోటి బయట పడుతున్నాయి. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన ముంబై పోలీసులకు రాజ్కుంద్రా భారీగా లంచం ఇచ్చాడని తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పోలీసులకు ఏకంగా రూ.25 లక్షలు లంచంగా ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవ అలియాస్ యశ్ ఠాకూర్ పోలీసులకు పంపిన ఓ మెయిల్లో ఆరోపించారు. హాట్ హిట్ యాప్ వేదికగా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా రాజ్ కుంద్రా మాదిరి మీరు కూడా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మార్చిలోని ఏసీబీకి పంపిన ఈమెయిల్లో తెలిపారు. తాజాగా ఈమెయిల్ను ఏసీబీ పోలీస్ కమిషనర్కు పంపింది. అయితే ఈ విషయంపై ముంబై పోలీసులు స్పందించడం లేదు. ఈ ఆరోపణలతోనే అంధేరిలోని రాజ్కుంద్రా కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అమెరికాకు చెందిన ఫ్లిజ్ మూవీస్ సంస్థకు సీఈఓగా ఉన్న అరవింద్ శ్రీవాత్సవ ఏసీబీకి ఈమెయిల్ చేశారు. ఈ సంవత్సరం మార్చిలో ఏసీబీ ముంబైలోని సంస్త కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. రూ.4.5 కోట్లు ఉన్న రెండు బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. అయితే ఇదే కేసులో అప్పట్లో రాజ్కుంద్రా అరెస్ట్ కాకుండా రూ.25 లక్షలు ఇచ్చారని, మీరు కూడా అంతే మొత్తం ఇస్తే అరెస్ట్ చేయమని ఓ పోలీస్ రాయబారం చేసినట్లు ఈమెయిల్లో అరవింద్ తెలిపారు. మరిన్ని విషయాలపై సుదీర్ఘ లేఖ ఈమెయిల్ ద్వారా పంపారు. వాటి వివరాలు బయటకు రాలేదు. -
రాజ్ కుంద్రా ఒక్కరోజు ఆదాయం రూ. 9 లక్షలు!
Raj Kundra Arrest: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హాట్ హిట్ యాప్ ద్వారా రాజ్ కుంద్రా రోజుకు లక్షల్లో ఆర్జించేవాడని.. ఒక్కోసారి గరిష్టంగా రోజుకు 8-9 లక్షల రూపాయల వరకు సంపాదించేవాడని తెలిసింది. ఓ సారి ఏకంగా రాజ్ కుంద్రా అకౌంట్లోకి 9.65 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినట్లు వెల్లడయ్యింది. హాట్ హిట్ యాప్ వేదికగా రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్లే స్టోర్లో ఈ యాప్ గురించి సర్చ్ చేస్తే.. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ‘‘బెస్ట్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్ ఈ యాప్లో ఉంటాయి. ఈ యాప్లో వీడియోలు చూడాలంటే నెలకు 198 రూపాయలు, 45 రోజులకు 249 రూపాయలతో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ హెచ్డీ వీడియోలను చూడొచ్చు’’ అని వెల్లడించారు. ఎబౌట్ అస్లో ‘‘హాట్ హిట్ అనేది ఒక ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్. ఇక్కడ మీరు వందల కొద్ది అడల్ట్ సినిమాలు, హిందీ వెబ్సిరీస్ ఎంజాయ్ చేయవచ్చు. హాట్హిట్ ఒరిజనల్స్ అడల్ట్ కంటెంట్ని ప్రసారం చేస్తుంది’’ అని డైరెక్ట్గా ప్రకటించుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అశ్లీల చిత్రాల కోసం నగ్న సన్నివేశాలను చిత్రీకరించాలని ఔత్సాహిక నటీమణులను బలవంతం చేసినందుకు గాను ముంబై పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వీరి విచారణ సందర్భంగా రాజ్కుంద్రా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇలా చిత్రీకరించిన అశ్లీల చిత్రాలను పెయిడ్ వెబ్సైట్లు, యాప్లలో ప్రసారం చేస్తారు. రాజ్ కుంద్రా మొబైల్ రికార్డుల పరిశీలనలో హాట్ హిట్ నుంచి క్రమం తప్పకుండా డబ్బులు వస్తున్నట్లు చూపించింది. ఫిబ్రవరిలో ఈ పోర్న్ రాకెట్ వెలుగు చూడటానికి కొన్ని రోజుల ముందే రాజ్ కుంద్రాకు ఫిబ్రవరి 3 న హాట్ హిట్ నుంచి రూ. 2.7 లక్షలు బదిలీ అయినట్లు తెలిసింది. అదేవిధంగా జనవరి 23 న రూ. 95,000, జనవరి 20 న రూ. 1 లక్ష, జనవరి 13 న రూ. 2 లక్షలు, జనవరి 10 న రూ. 3 లక్షలు రాజ్ కుంద్రా అకౌంట్కు మనీ ట్రాన్ఫ్ఫర్ జరిగినట్లు వెల్లడయ్యింది. అంతకుముందు, ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే మాట్లాడుతూ, రాజ్ కుంద్రా, అతని బావ ప్రదీప్ బక్షికి చెందిన రెండు కంపెనీలకు కెన్రిన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన 'హాట్షాట్స్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్' అనే మొబైల్ యాప్ ఉందని తెలిపారు. ఈ హాట్షాట్ యాప్ వివాదానికి కేంద్రంగాఉంది. ఈ యాప్ ద్వారా అశ్లీల చిత్రాలను పంపిణీ చేయడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపణలున్నాయి. -
రాజ్కుంద్రా అరెస్ట్; వైరల్ అవుతున్న రహానే పాత ట్వీట్
ముంబై: ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఫోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులో అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానేను రాజ్ కుంద్రా వ్యవహారం చిక్కుల్లో పడేలా చేసింది. విషయంలోకి వెళితే.. 9 ఏళ్ల కిత్రం 2012లో రహానే రాజస్తాన్ రాయల్స్ ఆటగాడిగా ఉన్నప్పుడు రాజ్ కుంద్రాను మెచ్చుకుంటూ చేసిన ఒక పాత ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ''రాజ్ కుంద్రా మీరు చాలా గ్రేట్ జాబ్ చేస్తున్నారు.. ఇలాగే కొనసాగించండి.'' అంటూ పేర్కొన్నాడు. అప్పటికి రాజస్తాన్ రాయల్స్ సహ యజమానిగా ఉన్న కుంద్రా రహానే ట్వీట్కు బదులిచ్చాడు. '' థ్యాంక్యూ సో మచ్ రహానే.. నేను చేసే పనిని నువ్వు కచ్చితంగా లైవ్లో చూడాలి'' అంటూ సమాధానం ఇచ్చాడు. దానికి రహానే కూడా.. '' తప్పకుండా వస్తాను సార్'' అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం అభిమానులు రహానే, రాజ్ కుంద్రాల మధ్య జరిగిన ట్వీట్ సంభాషణలను మరోసారి పోస్ట్ చేశారు. అయితే ఒక క్రికెటర్గా ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు ఎదుర్కోని రహానేకు రాజ్ కుంద్రాకు చేసిన ట్వీట్లు చిక్కుల్లో పడేశాయి. అయితే రహానే, రాజ్కుంద్రాల మధ్య జరిగిన సంభాషణ గురించి సరైన సమాచారం లేకపోయినా.. ఫోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ కావడంతో బహుశా వీరి మధ్య ఇలాంటి చర్చ జరిగినట్లు నెటిజన్లు కామెంట్స్ చేశారు. రహానే అలాంటివి చేయడని.. వేరే విషయంపై రాజ్ కుంద్రాను అభినందించినట్లు మరికొందరు కామెంట్ చేశారు. కాగా 2013లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కుంద్రా 2015లో రాజస్తాన్ రాయల్స్తో పాటు క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. కాగా రహానే ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్ను టార్గెట్గా చేసుకుని వారిని పోర్న్ వీడియోలలో నటించమని బలవంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను కొన్ని యాప్లలో అప్లోడ్ చేశారని నిర్ధారిస్తూ ఈ మేరకు ఆధారాలు కూడా సంపాదించారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేయడంతోపాటు 7.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ నెల 23 వరకు రాజ్ కుంద్రాను పోలీస్ కస్టడీలో ఉంచనున్నారు. @TheRajKundra Sir you are doing a Great job.. — Ajinkya Rahane (@ajinkyarahane88) October 19, 2012 @TheRajKundra yeah I wil for sure sir:) — Ajinkya Rahane (@ajinkyarahane88) October 19, 2012 -
పోర్నోగ్రఫీ కేసు: వాట్సాప్ చాటింగ్తో బయటపడ్డ నీలి వ్యవహారం
Raj Kundra Arrest: అశ్లీల చిత్రాల కేసులో ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్రిటన్లో తన బంధువులతో కలిసి రాజ్ కుంద్రా నీలి చిత్రాల దందా చేసినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. వాట్సాప్ చాటింగ్, ఈ మెయిల్ ద్వారా ఈ చీకటి వ్యవహారం గుట్టును బయటపెట్టారు. బాలీవుడ్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మోడల్స్ను టార్గెట్గా చేసుకుని వారిని పోర్న్ వీడియోలలో నటించమని బలవంతం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలను కొన్ని యాప్లలో అప్లోడ్ చేశారని నిర్ధారిస్తూ ఈ మేరకు ఆధారాలు కూడా సంపాదించారు. ఇప్పటివరకు ఈ కేసులో రాజ్కుంద్రాతో కలిపి 11 మందిని అరెస్టు చేయడంతోపాటు 7.5 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ నెల 23 వరకు రాజ్ కుంద్రాను పోలీస్ కస్టడీలో ఉంచనున్నారు.ఈ వ్యవహారంలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసునమోదైందని ముంబై పోలీసు కమిషనర్హేమంత్ నాగ్రాలే ఒక ప్రకటనలో తెలిపారు. -
పోర్న్ వర్సెస్ ప్రాస్టిట్యూషన్: అది ఎందుకు లీగల్ కాదు?
Raj Kundra Old Tweets Viral: పోర్న్ వీడియోల కేసులో అడ్డంగా బుక్కైన వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా గతంలో చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్గా మారాయి. తొమ్మిదేళ్ల క్రితమే ఆయన పోర్నోగ్రఫీ గురించి సోషల్ మీడియా వేదికగా ప్రస్తావించాడు. పోర్న్ చూడటం తప్పేం కాదని అభిప్రాయపడ్డాడు. "పోర్న్ వర్సెస్ వ్యభిచారం.. కెమెరా ముందు డబ్బులిచ్చి చేయించేది చట్టబద్ధం అయినప్పుడు మిగతాది మాత్రం ఎందుకు లీగల్ కాదు?" అని ప్రశ్నించాడు. 2012 మార్చి 29న ఈ ట్వీట్ చేశాడు. అదే ఏడాది మేలో "యాక్టర్లు క్రికెట్ ఆడతారు, క్రికెటర్లు రాజకీయాలు చేస్తారు. రాజకీయ నాయకులు అశ్లీల చిత్రాలు చూస్తారు. పోర్న్ స్టార్లు యాక్టర్లుగా మారుతారు.." అంటూ మరో ట్వీట్ చేశాడు. పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా నెటిజన్లు అతడిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బహుశా అతడి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికినట్లుందంటున్నారు. ఇక ఈ పోర్నోగ్రఫీ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో రాజ్ కుంద్రాతో పాటు అతడి సమీప బంధువు ర్యాన్ తోర్పే కూడా ఉన్నాడు. #RajKundra to Mumbai police now: pic.twitter.com/oph2TB4xNV — Prince Pandey🍁🦜 (@princepandey_) July 19, 2021 Porn sites gets banned in india#RajKundra :- pic.twitter.com/FuikgUsmLw — Mad king (@GJhamtani) July 19, 2021 #RajKundra Right choices ? 👀 pic.twitter.com/ordfLdGQbl — Ayushi Jain (@iyuc_jain) July 19, 2021 Shilpa Shetty's husband #RajKundra arrested in pornography case. Meanwhile shilpa shetty : pic.twitter.com/3IBccvmXOM — Lalla (@LallaUPse) July 19, 2021