Sangareddy district
-
ముగ్గురు చిన్నారులకు విషం పెట్టి చంపిన తల్లి
-
అలా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన సిర్గాపూర్ మండలంలోని ఉజ్జంపాడ్ గ్రామం మాది. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మా ప్రాంతంలో అవగాహన అంతంతే. నీళ్లు, నిధులు, నియామకాల అంశంపై సాగిన తెలంగాణ (Telangana) ఉద్యమంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలపై కొంత అవగాహన వచ్చింది.. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) సాధించొచ్చనే నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆరు ఉద్యోగాలు సాధించాను. పక్కా ప్రణాళికతో చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించొచ్చు’ అని అంటున్నారు ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో మూడో ర్యాంక్ (Third Rank) సాధించిన బీర్దార్ మనోహర్రావు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం మాది వ్యవసాయ కుటుంబం. నాన్న పండరినాథ్ కీర్తనకారుడు. పండరిపూర్ విఠలేశ్వరుని కీర్తనలు, ప్రవచనాలు బోధిస్తారు. మా ఉజ్జంపహాడ్ గ్రామం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉటుంది. నా భార్య మనీష గృహిణి. కూతురు మనస్విని 3వ తరగతి, కొడుకు మహేశ్వర్ ఒకటో తరగతి చదువుతున్నారు. కుటుంబమంతా ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. నేను నిత్యం హనుమాన్చాలీసా చదువుతాను. ప్రస్తుతం మెదక్ జిల్లా కుల్చారం మండలం అంసాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేశాను. ఒక దాని తర్వాత మరోటి ఇప్పటివరకు నాకు గవర్నమెంట్ కొలువులు ఆరు వచ్చాయి. గురుకుల పాఠశాలలకు సంబంధించి పీజీటీలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు (State First Rank) వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లో రెండో ర్యాంకు, 2016 గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో చేరా. కరోనా సమయంలో అనారోగ్య సమస్యలతో ఆ ఉద్యోగం మానేశా. తిరిగి స్కూల్ అసిస్టెంట్గా విధుల్లో చేరా. జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, తాజా గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు వచ్చింది. బుధవారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమక పత్రం అందుకున్నా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్గా ఉద్యోగంలో చేరాను.డిప్యూటీ కలెక్టర్ కావాలని ఉంది రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో అత్యున్నతమైనది గ్రూప్–1. డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించడమే నా ముందున్న లక్ష్యం. గ్రూప్–1 పరీక్షలు కూడా రాశాను. 430 మార్కులు వచ్చాయి. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడితే గ్రూప్–1 ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: గ్రూప్– 2 టాపర్ హరవర్ధన్రెడ్డిసిలబస్లో లేని అంశాలు చదివితే ఫలితముండదు నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుతానంటే కష్టం. సంబంధిత సబ్జెక్టు మరిచిపోకుండా కనీసం రెండు గంటలైనా చదవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సిలబస్పై పూర్తి అవగాహన ఉండాలి. సిలబస్లో లేని అంశాలు చదివితే ఫలితం ఉండదు. పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమయం వృథా చేసుకోవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత సమయం కలిసొస్తుంది. కనీసం 8 గంటలు చదవాలి. -
‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్గా వల్లూరు క్రాంతి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా వచ్చిన వార్తలను పరిశీలించి.. వాటిని క్షుణ్ణంగా చదివి.. ఆ వార్తల ప్రాధాన్యత క్రమాన్ని ఎంపిక చేశారు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి. పాలన పరమైన విధుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్లోని సాక్షి ప్రధాన కార్యాలయంలోని సంగారెడ్డి జిల్లా ఎడిషన్కు గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, ప్రతిభ చూపుతున్న మహిళలకు సంబంధించి విలేకరులు రాసిన ప్రత్యేక కథనాలు ఆమె చదివారు. వాటి ప్రాధాన్యతను కూడా గుర్తించి సబ్ ఎడిటర్లతో చర్చించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా పేజీల డిజైన్లను పరిశీలించారు. అలాగే వివిధ మండలాలు, పట్టణాల నుంచి వచి్చన వార్తలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ ఈ కథనాలు మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కితాబిచ్చారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లేలా వారిని ప్రోత్సహిస్తూ.. స్ఫూర్తిదాయక కథనాలు మరిన్ని రావాలని ఆకాక్షించారు. దినపత్రికకు గెస్ట్ ఎడిటర్గా వ్యవహరించడం తనకు ఎంతో మంచి అనుభూతిని ఇచి్చందన్నారు. పత్రిక నిత్యం ప్రజాసమ స్యలను వెలికి తీస్తుండటంతో.. ఆ సమస్యలు అధికార యంత్రాంగం దృష్టికి వస్తాయని.. తద్వారా అధికార యంత్రాంగం వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. అధికారుల దినచర్య న్యూస్పేపర్లతోనే ప్రారంభమవుతందని చెప్పారు. పత్రిక పాఠకునికి చేరడం వెనుక ఆయా విభాగాలు ఎలా పనిచేస్తాయో తెలిసిందని అన్నారు. -
సంగారెడ్డిలో దారుణం.. కూతురితో చనువుగా ఉంటున్నాడని..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో చనువుగా ఉంటున్నాడని యువకుడిని తండ్రి హత్య చేశాడు. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న తన కూతురితో చనువుగా ఉండటంతో దశరథ్(26)పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడిని హత్య చేసి నిజాంపేట మండల శివారు అటవీప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతదేహం కోసం దశరథ్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దశరథ్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
హైదరాబాద్ మహానగరంలోని చెత్త ఇక్కడికే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ (Pyaranagar)లో ఏర్పాటు చేస్తున్న వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో ప్రతీరోజు సుమారు 7,500 టన్నుల చెత్త ఉత్పత్తి కాగా ఇందులో శేరిలింగంపల్లి, కూకట్పల్లి (Kukatpally) జోన్ల పరిధిలో నిత్యం ఉత్పత్తి అయ్యే సుమారు 1,900 టన్నుల చెత్తను ప్యారానగర్ డంప్యార్డుకు తరలించనున్నారు. ఈ భారీ డంప్యార్డుతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోరాటం చేస్తున్నారు.గుమ్మడిదల (Gummadidala) మండలం ప్యారానగర్, నల్లవల్లి, మాంబాపూర్ తదితర గ్రామాలతోపాటు, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శివంపేట, నావపేట గ్రామస్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షంగా ఏర్పడి ఈ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ యార్డు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ను తరలించడంతో స్థానికులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున మోహరించిన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.పచ్చని పంట పొలాల్లో ఈ డంప్యార్డు (Dump Yard) ఏర్పాటు చేస్తున్న ప్యారానగర్ చుట్టుపక్కల మొత్తం పచ్చని పంట పొలాలే ఉన్నాయి. వ్యవసాయమే జీవనాధారమైన మా పంట పొలాల్లో చెత్త డంప్యార్డు పెట్టొదంటూ రైతులు వాపోతున్నారు. ఈ యార్డుతో వెలువడే కాలుష్యంతో చెరువులు, కుంటలే కాదు, భూగర్భ జలాలు కూడా కలుషితమై పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.చదవండి: ‘టక్కరి దొంగ’.. ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడునాయకుల ముందస్తు అరెస్ట్ డంపింగ్యార్డ్ నిర్మాణ పనులను అడ్డుకోకుండా కొంతమంది నాయకులను పోలీసులు అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేసి కంది మండలంలోని బేగంపేట్ పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. ఇక అదేసమయంలో జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు డంపింగ్యార్డ్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారు. డంపింగ్యార్డ్ పనులతోపాటు అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులతో కలసి ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులందర్నీ అరెస్టు చేశారు. ప్యారానగర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. -
సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా మియాపూర్కు చెందిన సందీప్ (36)కు ఆరేళ్ల కిందట మంచిర్యాలకు చెందిన కీర్తి (34)తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ మియాపూర్లో ఉండేవారు. 9 నెలల కిందట అమీన్పూర్ పరిధిలోని బంధంకొమ్ము శ్రీదామ్ హిల్స్లో సొంతిల్లు కొనుగోలు చేసి కూతురు గగనహిత(3), కుమారుడు సాకేత్రామ్ (ఏడాదిన్నర)తో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. సోమవారం పాప గగనహిత పుట్టినరోజు ఉంది.వేడుక జరిపే విషయంలో 5వ తేదీ (ఆదివారం) ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సందీప్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి మియాపూర్ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఒక్కడే ఇంటికొచ్చిన సందీప్కు కీర్తి ఉరేసుకొని కనిపించింది. వెంటనే అతడి తండ్రికి ఫోన్లో కీర్తి ఉరేసుకుందని విషయం చెప్పాడు. సందీప్ తల్లిదండ్రులు అక్కడికి వచ్చేలోపు అతడు కూడా తాడుతో ఉరేసుకున్నాడు. కీర్తి తండ్రి ప్రభాకర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్పూర్ సీఐ నాగరాజుతోపాటు ఎస్ఐ సోమేశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సు‘జలం’.. సు‘ఫలం’!
ఒక ఆలోచన, సమష్టి కృషి ఆ గ్రామ రూపురేఖలను మార్చేసింది. తాగునీటి కోసం తండ్లాట, బీడువారిన పొలాలు, కరువు కాటకాలు, వలసలతో సతమతమైన ప్రాంతం.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటలతో కళకళలాడుతోంది. భూగర్భ జల మట్టాలు పెరగడంతో రైతులు ఏటా మూడు పంటలు పండిస్తున్నారు. నాడు కూలి పనులకు వలస వెళ్లినవారే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఇక్కడ అవలంబించిన నీటి సంరక్షణ పద్ధతులను రాజస్తాన్ రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారంటే.. ఈ పథకం ఎంత విజయవంతం అయిందో అర్థమవుతుంది. ఇలా కరువును జయించిన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని గొట్టిగారిపల్లి (Gotigarpally) గ్రామంపై గ్రౌండ్ రిపోర్టు ఇది.సంగారెడ్డి జోన్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో రైతులు వర్షాధారంగానే పంటలు పండించేవారు. వానలు సరిగా కురవకపోయినా, క్రమం తప్పినా పంటలు దెబ్బతిని నష్టపోయేవారు. నీళ్లులేక, పంటలు వేయలేక కూలి పనులకు వెళ్లేవారు. అయితే 2001లో చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు గ్రామ గతిని మార్చేశాయి. వాటర్ షెడ్ పథకం (watershed scheme) ఆరో దశ కింద గొట్టిగారిపల్లికి రూ.22 లక్షలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరుల నిపుణుడు టి.హనుమంతరావు తక్కువ వ్యయంతో చతుర్విద జల ప్రక్రియ పద్ధతిపై గ్రామస్తులకు అనేక సార్లు అవగాహన కల్పించారు. చైనాలోని హుబై రాష్ట్రంలో ఆ విధానంతో మంచి ఫలితాలు వచ్చాయని రైతులకు వివరించారు. వాన నీళ్లు వృథా పోకుండా ఎక్కడికక్కడ ఇంకిపోయేలా చర్యలు చేపట్టారు. సమీపంలోని గుట్టలపై నుంచి దిగువకు వచ్చే నీటిని పొలాల వైపు వచ్చేలా మట్టి కట్టలు నిర్మించారు. కందకాలు తవ్వారు, నీటి చెక్డ్యాంలు కట్టారు. ఆ నీరు చెక్ వాల్వ్లోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో కురిసిన వాన నీరు (Rain Water) ఊరు దాటడం లేదంటే ఎంత పకడ్బందీగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారో అర్థమవుతుంది. తక్కువ లోతులోనే భూగర్భ జలాలు గతంలో ఇక్కడ 500 ఫీట్ల దాకా బోరు వేసినా చుక్క నీటి జాడ కనిపించకపోయేది. ఇప్పుడు 60 నుంచి 120 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు లభిస్తోంది. గ్రామంలో 350కిపైగా బోరుబావులు, 50 వరకు బావులు ఉన్నాయి. వాటితో గ్రామంలోని సుమారు 1,600 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. పొలం గట్లు, పంటల చుట్టూ వేసిన ఫెన్సింగ్పై సైతం తీగ జాతికి చెందిన పంటలు సాగు చేస్తున్నారు. ఒక ఎకరా విస్తీర్ణంలో చుట్టూ ఫెన్సింగ్ వేసి కంది, పసుపు, ఆవాలు, కర్బూజా, మిరప, ఉల్లి, బెండకాయ, పలు ఇతర రకాల పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో మడులుగా ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. చెరుకు, మొక్కజొన్న, ఆలుగడ్డ తదితర పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఏటా మూడు పంటలు వేసి మంచి ఆదాయం పొందుతున్నారు. జాతీయ స్థాయి అవార్డువాటర్ షెడ్తో పాటు 2010– 11లో ఇందిరా జలప్రభ పథకంలో భాగంగా వ్యవసాయ బో ర్లు తవ్వించి, విద్యుత్ కనెక్షన్ సౌకర్యం కల్పించారు. రూరల్ డె వలప్మెంట్లో భాగంగా అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టడంతో.. 2010 అక్టోబర్ 2న నిర్వహించిన ఉపాధి హామీ ఉత్సవాల్లో గ్రామానికి జాతీయస్థాయిలో అవార్డు దక్కింది. పంటలు సమృద్ధిగా పండుతుండటంతో జీవన ప్రమాణాలు మారాయి. తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు.ఎంబీఏ చదివి వ్యవసాయం చేస్తున్నా.. నేను ఎంబీఏ చదివిన. మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. చెరుకుతోపాటు అన్నిరకాల కూరగాయలు సాగు చేస్తున్నా. వాటర్ షెడ్ పథకంతో పుష్కలంగా నీరు ఉండటంతో ఏడాదికి మూడు పంటలు పండిస్తూ.. ఎకరాకు రూ.లక్షన్నర వరకు సంపాదిస్తున్నా. – కనకరాజు, యువ రైతు, గొట్టిగారిపల్లివలసలు ఆగిపోయాయి.. గతంలో గ్రామంలో పనులు లేకపోవటంతో ఉపాధి కోసం దుండిగల్, గోమారాం, మద్దికుంట తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లేవాళ్లం. వాటర్ షెడ్ పథకం చేపట్టిన సమయంలో చేసిన పనులకు కూలీ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు మారి పంటలను సాగు చేసుకుంటున్నాం. వలసలు ఆగిపోయాయి. – బాలప్ప, రైతు, గొట్టిగారిపల్లిరైతులకు అవగాహన కల్పించి పనులు చేపట్టాం వాటర్ షెడ్ పథకం ప్రారంభంలో రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. అప్పటి నీటి వనరుల నిపుణుడు హనుమంతరావు గ్రామానికి వచ్చి ఆ పనులు చేయటంతో కలిగే ప్రయోజనాలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. అందరి కృషితో పథకాన్ని పూర్తి చేశాం. రెండేళ్ల తర్వాతి నుంచి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం నీటి సమస్య అనేది లేకుండా అన్ని సమయాల్లో అన్ని రకాల పంటలు సాగు చేయగలుగుతున్నాం. – రాచయ్య, మాజీ సర్పంచ్, గొట్టిగారిపల్లి -
కోహీర్ గజగజ
యెర్భల్ శ్రీనివాస్రెడ్డి / జహీరాబాద్: అక్కడ ఉదయం తొమ్మిది అయినా ఎక్కడా జనం కనిపించరు.. సాయంత్రం ఆరు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యం.. ఉదయం, రాత్రే కాదు.. మధ్యాహ్నం పూట కూడా స్వెట్టర్లు వేసుకోనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇది ఎక్కడో మంచు ప్రాంతాల్లోనో, పర్వతాలున్న చోటనో కాదు.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో పరిస్థితి ఇది. ఏటా చలికాలం వచ్చిందంటే ఇక్కడి జనం గజగజ వణికిపోతుంటారు.ఆ ప్రాంతంలోని నేలలు.. చుట్టూరా పచ్చదనం.. చెరువులు, ఇతర జల వనరులు గణనీయంగా ఉండటం వంటివి ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కోహీర్ గ్రామ శివార్లలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) ఆధ్వర్యంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ను ఏర్పాటు చేసి.. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.నల్లరేగడి నేలలు, పెద్ద సంఖ్యలో చెట్లతో..కోహీర్ గ్రామ పరిధిలో 7 వేల ఎకరాల మేర వ్యవసాయ భూములు ఉన్నాయి. అందులో 5 వేల ఎకరాల మేర నల్ల రేగడి భూములు, 500 ఎకరాలు పడావ్పడ్డ భూములున్నాయి. ఈ నేలల్లో నీటి నిల్వ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రామం చుట్టూరా పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నాయి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోటిగార్పల్లిలో 1,500 ఎకరాల్లో, బడంపేట, పర్శపల్లిలో వెయ్యి ఎకరాల చొప్పున అడవులు ఉన్నాయి. గోటిగార్పల్లికి సరిహద్దుగా ఉన్న కర్ణాటకలోని కుంచవరం, బోనస్పూర్, శివరాంపూర్ ప్రాంతాల్లో సుమారు 5 వేల ఎకరాలకుపైగా అడవి ఉంది.చుట్టూ నీటి వనరులే..కోహీర్కు ఎగువన ఐదు కిలోమీటర్ల దూరంలోని బడంపేటలో రెండు చెరువులు, పక్కనే ఉన్న గొటిగార్పల్లిలో 1,100 ఎకరాలకు నీరందించే పెద్దవాగు ప్రాజెక్టు ఉంది. 6 కిలోమీటర్ల దూరంలోని పర్శపల్లిలో తైదల, రాముని చెరువులు ఉన్నాయి. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పైడిగుమ్మల్లో మైసమ్మ చెరువు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జాపూర్లో చిన్న చెరువు ఉంది. కోహీర్లో భూగర్భ జలమట్టం 10 అడుగులలోపే. పలుచోట్ల బావుల్లో నీళ్లు బిందెలతో ముంచుకునేంత పైవరకు ఉంటాయి. కొన్ని బోర్లలో నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తుంటాయి. దీనికితోడు కోహీర్ ప్రాంతం సముద్ర మట్టానికి 629 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అంశాలన్నీ కలసి ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల కింద 6.2 డిగ్రీలకు.. కోహీర్ ప్రాంతంలో 2022 సంవత్సరంలో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి చలికాలం ప్రారంభంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల వరకు తగ్గాయి. ఈ నెల 19న 9.5 డిగ్రీలు, 20న 9.0 డిగ్రీలు, 21న 12 డిగ్రీలు, 22న 10.9 డిగ్రీలు, 23న 10.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక డిసెంబర్, జనవరిలలో ఉష్ణోగ్రతలు ఇంకెంత తగ్గుతాయోనని స్థానికులు పేర్కొంటున్నారు.ఐదింటికే ఇంటి ముఖం చలి తీవ్రత అధికంగా ఉండటంతో కోహీర్లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు వెళ్లేవారు సాయంత్రం ఐదు గంటలకే ఇళ్లకు తిరిగి వస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకే ప్రధాన కూడళ్లు, రోడ్లు జన సంచారం లేక వెలవెలబోతున్నాయి. ఉదయం 8, 9 గంటల వరకు ఎవరూ బయటికి రావడం లేదు.గ్రీనరీ, జల వనరులు కారణంకొన్నిరోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. పొగ మంచు కురుస్తోంది. కోహీర్లో నేల స్వభావం, చెట్లు అధికంగా ఉండటం, చుట్టుపక్కల అడవులు ఉండటం, జల వనరులు ఉండటం వంటివి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం. నీటి పారుదల ప్రాజెక్టులు, పెద్ద చెరువులు వంటివి ఉన్నచోట చలి తీవ్రత పెరుగుతుంది. – వెంకటరమణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీజీడీపీఎస్, హైదరాబాద్ -
అమ్మానాన్నల మాట.. సివిల్స్కు బాట
చదువుకోవాలి.. చదువుకొని తన కాళ్లపై తాను నిలబడి, ఆదర్శంగా ఉండాలని చెప్పిన అమ్మ మాట.. సమాజంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజాసేవలో ఉండాలని చూపిన నాన్న బాట.. ఇలా తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలోచనలో పడేశాయి. అప్పుడే తాను ఒక ఉన్నతాధికారిగా ప్రజాసేవ చేయాలని సంకల్పంతో 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించారు. దేశంలోనే యువ ఐఏఎస్లలో ఒకరిగా నిలిచి పాలనలో పరుగులు పెట్టిస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సక్సెస్ స్టోరీ మీకోసం..బాల్యం.. విద్యాభ్యాసంవల్లూరు క్రాంతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ని కర్నూలు పట్టణం. తండ్రి డా.రంగారెడ్డి, తల్లి డాక్టర్ లక్ష్మి. ఇద్దరూ కూడా వైద్యులే. అక్క కూడా వైద్యురాలే, అమెరికాలో స్థిరపడ్డారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కర్నూల్లోనే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నారు. బీటెక్ ఢిల్లీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలోనే..అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఓ వైపు వచ్చిన జాబ్ను వదలకుండా ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. తొలిసారిగా 2013లో సివిల్స్కు హాజరై 562 ర్యాంకు రావటంతో (ఐఆర్టీఎస్) ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఉద్యోగం వచ్చింది. అయినా నిరాశ చెందకుండా రెండోసారి 2014లో సివిల్స్ పరీక్ష రాసి 230 ర్యాంకు సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో ఉద్యోగం సాధించారు. ఐఏఎస్ కావాలని పట్టుదల, నాన్న సూచన సలహా మేరకు 2015లో జరిగిన సివిల్స్లో 65 ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపిక అయ్యారు. 24 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించి యువ ఐఏఎస్గా నిలిచారు. ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసి, 2016 బ్యాచ్ తెలంగాణ క్యాడర్కు ఎంపిక అయ్యారు.శిక్షణలో క్షేత్రస్థాయి సమస్యలుముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ తీసుకోవడం జరిగింది. శిక్షణలో భాగంగా వారం రోజుల పాటు ఓ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో నేర్పించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాను. ట్రెక్కింగ్ నేర్పించారు.కొత్త ఆశల ఉగాది అంటే ఇష్టంపండుగలలో కొత్త ఆశ ఆశయాలతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ అంటే నాకెంతో ఇష్టం. చదువుతోపాటు ఆటలు కూడా ఆడేవాళ్లం.ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టంప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందుగానే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా నిరాశ చెందకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాలి. లక్ష్యం సాధించే వరకు అదే పనిగా ఉంటూ ఆత్మస్థైర్యం, నమ్మకంతో ఉండాలి. ప్రణాళికబద్ధంగా సిలబస్ ప్రిపేర్ అవుతూ పరీక్షలకు సన్నద్ధం కావాలి. విజయం అనేది ఊరికే రాదు. ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుందనేది గుర్తు పెట్టుకోవాలి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి.అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..ఇంట్లో అందరూ సైన్స్ పై ఎక్కువగా ఇష్టం.. తనకు మాత్రం మ్యాథ్స్పై ఇష్టం ఎక్కువ. తనకు చిన్నప్పటి నుంచే లీడర్ షిప్ లక్షణాలపై ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది. ఒక ఉన్నత స్థానంలో ఉంటేనే ప్రజాసేవ చేయగలుగుతామనే ఆలోచన, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన మాట లు మ్యాథ్స్ ఉన్న ఇంట్రెస్ట్తోనే ఐఏఎస్ సాధించేలా చేశాయి. ప్రైవేటుగా ఉండి ఎంత సంపాదించినా సరైన విధంగా ప్రజాసేవ సాధ్యం కాదు. అందుకే ఉన్నతమైన ఐఏఎస్ను సాధించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ట్రైనీగా, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జోగులాంబ కలెక్టర్గా నిర్వహించి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా కొనసాగుతున్నారు.భార్యాభర్తలిద్దరూ కలెక్టర్లువల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నారు. భర్త ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్గా కొనసాగుతున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరికి పాప(ఆర్యన్) ఉంది. -
తైవాన్ పింక్.. వియత్నాం వైట్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రాగన్ ఫ్రూట్ అంటే సాధారణంగా గుర్తొచ్చేది.. పింక్, వైట్ రకాలు. కానీ ఏకంగా 32 రకాల డ్రాగన్ఫ్రూట్ వెరైటీలతో సంగారెడ్డిలో మేళా నిర్వహించారు. తైవాన్ పింక్.. వియత్నాం వైట్.. ఆస్ట్రేలియన్ ఐఎస్ఐఎస్.. అపోలో ఇజ్రాయెలీ.. వివిధ దేశాల్లో సాగయ్యే వెరైటీలతో పాటు, ఆసుంట.. బ్లడ్మేరీ.. బేబీ సెరడో.. వంటి చిన్న రకాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. పెద్ద సైజులో ఉండే జంబోరెడ్, కాన్డార్, ఓరిజోన వంటి ప్రత్యేక రకాలు.. మెక్సికో, సెంట్రల్ అమెరికా వంటి దేశాల్లో సాగయ్యే సాన్ వంటి వెరైటీని సైతం ఈ మేళాలో ప్రదర్శించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానంలో డ్రాగన్పూట్ మేళా జరిగింది. ఈ పంట పట్ల రైతుల్లో అవగాహన కలి్పంచేందుకు ఈ మేళా నిర్వహించినట్లు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రంజోల్ గ్రామానికి చెందిన యువ రైతు రమేశ్రెడ్డి వ్యవసాయక్షేత్రం, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో సాగవుతున్న ఈ రకాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. పోషక విలువలు పుష్కలం.. డ్రాగన్ఫ్రూట్తో కూడిన ప్రత్యేక ఉత్పత్తులను సైతం ఈ ప్రదర్శనలో ఉంచారు. డ్రాగన్ఫ్రూట్తో చేసిన చిప్స్, వడియాలు, కుక్కీస్ (బిస్కెట్లు), చాక్లెట్లు, డ్రైపౌడర్ వంటివాటితో పాటు, ఈ ఫ్రూట్తో చేసిన సబ్బులు, ఫేస్ప్యాక్ వంటి సౌందర్య సాధనాలు ప్రదర్శనలో సందడి చేశాయి. ఈ ఉత్పత్తులు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎడారి మొక్కగా పేరున్న డ్రాగన్ఫ్రూట్లో పోషక విలువలు మెండుగా ఉంటాయి. పీచుపదార్థాలతో కూడిన బలవర్థకమైన ఫలం కావడంతో దీన్ని నిత్యం తీసుకుంటే కేన్సర్ వంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. సమశీతోష్ణ వాతావరణానికి తట్టుకునే ఈ పంటను చౌడు నేలల్లోనూ సాగుచేసేందుకు వీలుంది. ఈ పంట ఈదురు గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని నేలలూ అనుకూలమే..ఈ పంట సాగుకు అన్ని నేలలూ అనుకూలమే. కొంత జాగ్రత్తలు తీసుకుని పంట సాగు చేస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు. కమర్షియల్ వెరైటీలతో పాటు మరో 30 వరకు వెరైటీలను పండిస్తున్నా ను. ఇతర రైతులు కూడా ఈ పంట సాగు చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం వియత్నాం నుంచి ఈ పండ్లు దిగుమతి అవుతున్నాయి. –రమేశ్రెడ్డి, డ్రాగన్ఫ్రూట్ రైతు, రంజోల్, సంగారెడ్డి జిల్లాఉద్యానవన రైతులకు ప్రోత్సాహంఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలు ఇస్తోంది. మా యూనివర్సిటీ ద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం రాష్ట్రంలో పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాము. –బి.నీరజ, వీసీ, ఉద్యానవన విశ్వవిద్యాలయం. -
చిన్నారిపై హత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష..
సంగారెడ్డి జోన్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచి్చంది. బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషికి కోర్టు మరణ శిక్ష విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఆయన గురువారం ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. బిహార్లోని సికిందర్ ప్రాంతానికి చెందిన గఫాఫర్ అలీఖాన్ (61) బీడీఎల్ పరిధిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత అక్టోబర్ 16న ఆదిత్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే భార్యాభర్తలు తమ మనవరాలిని సెక్యూరిటీ గార్డు వద్ద ఉంచి పనికివెళ్లారు. అదేరోజు వీరి పక్క రూములో ఉండే గఫాఫర్ అలీ పనికి వెళ్లకుండా మద్యం తాగి తిరుగుతున్నాడు.11 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న చిన్నారిని గమనించాడు. బాలికకు కూల్డ్రింక్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. చిన్నారికి నిందితుడు మద్యం కలిపి ఉన్న కూల్డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం అందరికీ చెబుతుందేమోనని చిన్నారిని అక్కడే హత్య చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి బీడీఎల్ భానూర్ పోలీస్స్టేషన్ ఎస్ఐ రవీందర్రెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చార్జ్షీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి జయంతి.. బాలికపై హత్యాచారం చేసిన గఫాఫర్ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. అతడి కుటుంబ సభ్యులు చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. 27 ఏళ్ల తర్వాత జిల్లాలో మరణశిక్ష: 27 ఏళ్ల తర్వాత జిల్లాలో కోర్టు మరణశిక్షను విధించినట్లు ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. కేసును త్వరితగతిన విచారించేందుకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నామని, కేవలం 11 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించిందని చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్ఐ, విచారణ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఎస్పీ అభినందించారు. -
ప్రేమ పేరుతో వేధింపులు.. బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి జిల్లా: దోమడుగు గ్రామంలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక తేజస్విని అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి నాలుగవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది.సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్.. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా కూడా బెదిరించినట్లు సమాచారం. వేధింపులు తాళలేక తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్రెడ్డి విచారణ చేపట్టారు. -
సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్లో భూసేకరణ
-
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
స్టాక్ మార్కెట్ పేరిట మోసం... రూ. కోటి పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి
పటాన్చెరు టౌన్: స్టాక్ మార్కెట్ పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా వేసి భారీగా నగదు కాజేశారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు కథనం ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్కు చెందిన బెజవాడ నాగార్జున ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన వాట్సాప్కు జులై 5న స్టాక్ మార్కెట్కు సంబంధించిన మెసేజ్ను నాడియా కామి అనే మహిళ పంపితే వివరాలను నమోదు చేశాడు. తర్వాత ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో దఫాలవారీగా ఇన్వెస్ట్ చేసిన నగదు రూ.82 లక్షలతో కలిపి మొత్తంగా వాలెట్లో రూ.కోటీ 30 లక్షలు చూపించారు. ఒక రోజు నగదు డ్రా చేసుకుంటానంటే రూ.17 లక్షలు టాక్స్ చెల్లిస్తేనే అంతా డ్రా చేసుకోవచ్చని నమ్మించారు. దీంతో బాధితుడు అప్పు చేసి, తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి రూ.17 లక్షలు చెల్లించిన తర్వాత అటు వైపు ఉన్న అపరిచిత వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు, సోమవారం అర్ధరాత్రి పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో నగదు వేసిన అకౌంట్లో ఉన్న రూ. 24 లక్షల నగదు హోల్డ్ చేసినట్లు పటాన్చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలపై 1930 నంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట.. పటాన్చెరు టౌన్: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట ప్రైవేట్ ఉద్యోగి భారీగా నగదు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఏఆర్ బృందావన్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి జూన్ 17న ట్రేడింగ్కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. లింకును ఓపెన్ చేసి తన వివరాలను నమోదు చేశారు. దీంతో అపరిచిత ట్రేడింగ్ నిర్వాహకులు ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు. ముందుగా బాధితుడు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయగా మూడు లక్షలు లాభాలు చూపించారు. పలు దఫాలుగా స్నేహితుల వద్ద నగదు తీసుకొని, బంగారం అమ్మి మొత్తం రూ.98.40 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు, వచ్చిన లాభాలు ఇవ్వాలని అడుగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం రాత్రి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు వేసిన అకౌంట్లో ఉన్న రూ. లక్షను హోల్డ్ చేశామన్నారు. -
ఇష్టంలేని వారు వెళ్లిపోండి
గురువారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2024● వైద్యులపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆగ్రహం ● సూపరింటెండెంట్, ఆర్ఎంఓ గైర్హాజరు ● పలువురు సిబ్బంది సైతం విధులకు డుమ్మా నారాయణఖేడ్: విధి నిర్వహణ పట్ల అలసత్వం వహించే వైద్యులు, సిబ్బంది పట్ల ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి హెచ్చరించారు. స్థానిక వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడం, అనుమతి లేకుండా సెలవులు వేసుకొని వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టంలేని వారు వెళ్లిపోవాలని, బాధ్యతగా పనిచేసే వారే ఉండి సేవలు అందించాలని సూచించారు. వైద్యుడిని అయిన తన నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. పేద రోగులకు సేవలందిస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది ఇలా డుమ్మాలు కొట్టడం ఏమిటని మండిపడ్డారు. సూపరింటెండెంట్, ఆర్ఎంఓ గైర్హాజరు కావడం, అనుమతి లేకుండా సెలవులు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. డెంటిస్ట్ అయిన ఆర్ఎంఓ 19న అనుమతి తీసుకున్నట్టు ఉండగా 26 వరకు అడ్వాన్స్గా సీఎల్ వేశారు. ఫార్మాసిస్ట్ భీంరావు సదాశివపేటకు డిప్యూటేషన్ వేసుకొని వెళ్లారు. అతను ఒక్కసారి కూడా నారాయణఖేడ్లో విధులకు రాకపోవడం, గతంలో ఉన్న నేతల సిఫారసులతో డిప్యూటేషన్ వేసుకొని వెళ్లిన విషయం వెల్లడి కావడంతో వెంటనే సరెండర్ చేయాలని ఆదేశించారు. మరో ఫార్మాసిస్ట్ శ్యాంరావు కూడా జోగిపేటకు డిప్యూటేషన్ వేసుకొన్నాడు. మరికొన్ని విభాగాల్లోని సిబ్బంది కూడా విధులకు డుమ్మా కొట్టడం బయట పడింది. ఈ విషయాలపై జిల్లా వైద్య విధాన పరిషత్ వైద్యులు సంగారెడ్డితో ఫోన్లో మాట్లాడి వీరిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ సిబ్బందికి డ్రెస్సింగ్, ఇతర విధులు ఎలా చెబుతారన్నారు. -
తెలంగాణలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో కలకలం రేగింది. జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి ప్రకంపనలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూ ప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాడిగి అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం సీజ్
-
కాంగ్రెస్వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
సంపద పెరగాలంటే పరిశ్రమలు రావాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయా లు ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, సంపద పెరగాలన్నా కొత్త పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు పెడితే స్థానికులకు నష్టం జరుగుతుందని కొందరు రాజకీయం కోసం వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి అపోహలకు గురికాకుండా స్థానిక నాయకులు పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రాన్స్కు చెందిన ప్రీమియం సిరప్ తయారీ కంపెనీ మొనిన్ రూ.300 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లా గుంతపల్లిలో నిర్మించతలపెట్టిన ఫ్యాక్టరీకి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతిశీల విధానాలను చూసి వివిధ దేశాలకు చెందిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. మొనిన్ కంపెనీ యాజమాన్యం దేశంలో 18 రాష్ట్రాల్లో తిరిగిందని, చివరకు తెలంగాణలో యూనిట్ను స్థాపిస్తోందని చెప్పారు. స్థానిక యువత నైపుణ్యాలు పెంచుకుంటే ఈ కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానం.. రాష్ట్రం వ్యవసాయ రంగంలో గణనీయ వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 వేల మెట్రిక్ టన్నుల నుంచి మూడున్నర లక్షల టన్నులకు చేరి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి బాటలో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, మొనిన్ సంస్థ చైర్మన్ ఓలివర్ మొనిన్ తదితరులు పాల్గొన్నారు. -
జహీరాబాద్ లో టమోటాలు చోరీ
-
గోదాములు ఫుల్.. ఇక్కడ స్థలం లేక.. బీదర్కు మన బియ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఉన్న ఎఫ్సీఐ గోదాముల్లో స్థలసమస్య తలెత్తింది. దీని ప్రభావం ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటివరకు హైదరాబాద్లోని సనత్నగర్ ఎఫ్సీఐ గోదాములకు డెలివరీ చేసేవారు. అయితే ఈ గోదాముల్లో ఇప్పుడు స్థలం లేకపోవడంతో నిల్వలన్నీ పేరుకుపోయాయి. దీంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఎఫ్సీఐ గోదాములకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ కూడా స్థల సమస్య తలెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన లారీలు అన్లోడ్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు బీదర్కు వెళ్లి అక్కడి ఎఫ్సీఐ అధికారులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 1.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బీదర్కు తరలించాలని ఎఫ్సీఐ నిర్ణయించింది. ఆ బియ్యం రవాణా అయితేనే... మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం రవాణా అయితేనే స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడే ఈ యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకునేందుకు వీలవుతుంది. కానీ ఎఫ్సీఐ గోదాముల్లో స్థలాలు లేక గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లుల్లో ఉండిపోయింది. దీంతో ఈ యాసంగి సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల వద్ద స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా, ధాన్యం తూకాలు జరగడంలేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేయలేకపోయారు. -
దొంగను కొట్టి చంపిన గ్రామస్థులు
-
బోనమెత్తి..మొక్కులు చెల్లించి
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ శివారులో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో గవర్నర్ తమిళిసై బోనమెత్తి మొక్కులు సమర్పించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నేత నందీశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం గవర్నర్కు ఇక్కడికి వచ్చారు. ముందుగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన బంగారు ఆభరణాలను గవర్నర్ అలంకరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు. ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడుకోవాలి: దత్తాత్రేయ ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
దారుణం.. బైక్ను ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరూ లారీ కింద ఇరుక్కుని..
హత్నూర(సంగారెడ్డి): బైక్ను లారీ ఢీ కొన్న ఘటనలో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఊట్ల శ్రీకాంత్, అర్చన భార్యాభర్తలు. శుక్రవారం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం స్వగ్రామమైన మెదక్ జిల్లా వెంకట్రావ్ పెట గ్రామానికి పల్సర్ బైక్ పై బయలుదేరారు. దౌల్తాబాద్ లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ ఉండటంతో శ్రీకాంత్ బైక్ను స్లో చేశాడు. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా వారి బైక్ను బలంగా ఢీ కొట్టింది. దీంతో భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు. వారిద్దరినీ లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. లారీ టైర్ల కింద ఇరుక్కుపోయిన వారిని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వారిని పోలీసు వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. -
ఎద్దు ఖరీదు రూ.1.3 లక్షలు
న్యాల్కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఉర్సే షరీఫ్ పీర్ గైబ్ సాహెబ్ దర్గా ఉత్సవాల్లో ఆదివారం భారీ పశువుల సంత నిర్వహించారు. ఝరాసంగం మండల పరిధిలోని ప్యాల వరం గ్రామానికి చెందిన రైతు తన ఎడ్ల జత ధర రూ.3 లక్షలని చెప్పగా.. అందులోని ఒక్క ఎద్దును మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామానికి చెందిన రైతు సంగమేశ్వర్ రూ.1.3 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. మరో ఎడ్ల జత రూ.1.45 లక్షలు పలికింది. సదాశివపేట మండలం కొల్కూర్కు చెందిన శివకుమార్ అనే రైతు తన ఆవు ధర రూ.6 లక్షలుగా నిర్ణయించగా.. రూ.3 లక్షలకు ఇవ్వమని రైతులు కోరినా అంగీకరించలేదు. -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
పాతపంటల జాతర షురూ
జహీరాబాద్: చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే పాత పంటల జాతర ఉత్సాహంగా ప్రారంభమైంది. శనివారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాంగార్బౌలి తండాలో జాతరను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పి.సంజనారెడ్డి జ్యోతి వెలిగించి ఎడ్లబండ్ల ఊరేగింపును మహిళా రైతులతో కలసి ప్రారంభించారు. ఊరేగింపులో మహిళా రైతులు చిరు ధాన్యాలతో ముందుకు సాగారు. ఆరు ఎడ్ల బండ్లలో చిరుధాన్యాలను తీసుకువచ్చారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) డైరెక్టర్ పీవీ సతీశ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 28 రోజుల పాటు 23 గ్రామాల్లో ఎడ్లబండ్ల ఊరేగింపు, ఉత్సవాలు జరుగుతాయి. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. జాతర సందర్భంగా జీవవైవిద్య సంరక్షకులను సత్కరించి అభినందించారు. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న చిరుధాన్యాల సాగుపై రూపొందించిన 9 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాశెట్టి చౌహాన్, డీడీఎస్ కోడైరెక్టర్ చెరుకూరి జయశ్రీ, సంస్థ సభ్యులు, మహిళా రైతులు పాల్గొన్నారు. -
ఊరూరా పాతపంటల జాతర
జహీరాబాద్: పాతపంటలకు కొత్తకళ వస్తోంది. చిరు ప్రాధాన్యం కలిగిన చిరుధాన్యం ఇప్పుడు అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో అందరూ పాతపంటలైన చిరుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో 28 రోజులపాటు 23 గ్రామాల మీదుగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో 23వ పాతపంటల జాతర సాగనుంది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాంగార్బౌలి తండా నుంచి జాతర ప్రారంభమై ఫిబ్రవరి 11న ఝరాసంగం మండలం మాచ్నూర్లో ముగియనుంది. ఎడ్లబండ్లలో చిరుధాన్యాలను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు డీడీఎస్ డైరెక్టర్ పీవీ సతీశ్ వివరించారు. సమృద్ధి పోషకాలతో కూడిన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, అవగాహన కల్పించేందుకు రైతులు, మహిళలతో ఆయా శాఖల అధికారులు, వ్యవసాయ నిపుణులు సమావేశాలు నిర్వహిస్తారు. జహీరాబాద్ మండలం పస్తాపూర్లో ఏర్పాటు చేసిన సంఘంలో ఐదువేల మంది మహిళారైతులు సజ్జ, కొర్ర, తైద, సామ, పెసర, మినుము, అవిశ తదితర 30 నుంచి సుమారు 50 రకాల చిరుధాన్యాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిరుధాన్యాల ఆవశ్యకత, సేంద్రియ విధానంలో సాగు, పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి, రాయికోడ్ మండలాల్లోని 70 గ్రామాల్లో డీడీఎస్ కొంతకాలంగా అవగాహన కల్పిస్తోంది. ఝరాసంగం మండలం మాచ్నూర్లో 50 నుంచి 60 రకాల విత్తనాలతో చిరుధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నారు. రైతులు పండించిన పంటలో నాణ్యమైనవాటిని విత్తనంగా సేకరించి నిల్వచేసి వానాకాలం, యాసంగిలో సాగు చేస్తున్నారు. పాతపంటల జాతర షెడ్యూల్ ఈ నెల 14వ తేదీన మొగుడంపల్లి మండలం జాంగార్బౌలి తండాలో పాత పంటల జాతర ప్రారంభం అవుతుంది. 16న మన్నాపూర్, 17న ఉప్పర్పల్లి తండా, 18న జాడీ మల్కాపూర్, 19న లచ్చునాయక్ తండా, 20న జీడిగడ్డ తండా, 21న అర్జున్నాయక్ తండా, మోడ్ తండా, 23న జహీరాబాద్, 24న శేఖాపూర్ తండా, జంలైతండా, 25న శేఖాపూర్, 26న కోహీర్ మండలం గొటిగార్పల్లి, 27న బిలాల్పూర్, 28న ఝరాసంగం మండలం చిల్కెపల్లి, 30న బిడకన్నె, ఫిబ్రవరి 1న ఝరాసంగం, 2న పొట్పల్లి, 3న న్యాల్కల్ మండలం రేజింతల్, 4న హూసెళ్లి, గుంజోటి, 6న శంశల్లాపూర్, 8న న్యాల్కల్లో జాతర సాగుతుంది. 11న ఝరాసంగం మండలం మాచ్నూర్లోని డీడీఎస్ పచ్చసాలెలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. -
రసాయన పరిశ్రమలో ప్రమాదం
జిన్నారం (పటాన్చెరు): మైలాన్ రసాయన పరిశ్రమ యూనిట్ – 1లో రసాయనాలను వేరు చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఆది వారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మైలాన్ పరి శ్రమ లోని లిక్వి డ్ రా మెటీరియల్స్ శాంపిల్ డిస్పెన్సింగ్ గదిలో 1.1.3.3 టెట్రా మిథైల్ డిసిలోక్సేన్ అనే రసాయన మెటీరియల్ను (దీనితో మతిస్థిమితం సరిగాలేని వ్యక్తులకు అవసరమైన మందులు తయారు చేస్తారు) సుమారు 400– 500 డిగ్రీ సెల్సియస్లో వేడి చేసి దాని నుంచి జిప్రసైడోన్ ఇంటర్మీడియెట్ రసాయనం తయారు చేస్తుంటారు. ఈ ప్లాంటులో పది మంది వరకు విధులు నిర్వహిస్తుంటారు. ఎప్పటిలాగానే రసా యనాలను వేరు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా ఒత్తిడి ఎక్కువై మెరుపులు వచ్చా యి. యాసిడ్ మాదిరి కాలే గుణం ఉన్న రసాయనాలు ఒక్కసారిగా బయటకు ఎగ జిమ్మాయి. అవి ఒంటి మీద పడటంతో చర్మం కాలి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళానికి చెందిన వేర్హౌస్ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్రావు (38), కార్మికులు వెస్ట్ బెంగాల్కు చెందిన పరితోష్ మెహతా (40), బిహార్కు చెందిన రంజిత్కుమార్ (27) అనే ముగ్గురు అక్కడికక్కడే కాలి పోయారు. మంటలు కూడా చెలరేగినప్పటికీ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శకటాలు మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..: ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను యాజమాన్యం హుటాహుటి న ఆస్పత్రికి తరలించింది. ఘటన జరిగిన గంటసేపటి తర్వాత పోలీసులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పరిశ్రమకు చేరుకున్నారు. మరోవైపు వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను యాజమాన్యం ఘటనా స్థలా నికి పంపలేదు. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు కార్మికులకు రక్షణ కల్పించేలా యాజ మాన్యం చర్యలు తీసు కోవాలని సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతు న్నామని సీఐ సురేందర్రెడ్డి తెలిపారు. పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాకర్టీస్ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
రెట్టింపు లాభం అంటూ రూ.కోట్లు కొట్టేశారు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టండి..మీ డబ్బు రెట్టింపు అవుతుందంటూ సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద ఏకంగా రూ.1.90 కోట్లు కొట్టేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో నివాసముంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కొంతమంది వ్యక్తులు పరిచయమై తమ కంపెనీ షేర్లు కొనుగోలు చేయాల్సిందిగా కోరారు. అలాచేస్తే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపారు. దీంతో సదరు ఇంజనీరు అత్యాశకు పోయి కొన్ని షేర్లు కొనుగోలు చేశాడు. అయితే సైబర్నేరగాళ్లు చెప్పినసమయానికి అనుకున్నట్లు గానే రెట్టింపు మొత్తాన్ని ఇంజనీరు ఖాతాలో జమ చేశారు. ఇలా పలుమార్లు షేర్లు కొనుగోలు చేయగా..మంచి లాభాలు వచ్చాయి. దీంతో ఏకంగా రూ.1.90 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. అయితే తిరిగి డబ్బులు రావాల్సిన గడువు ముగుస్తున్నప్పటికీ రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంగారెడ్డి జిల్లా పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాగుబోతు భర్తతో వేగలేక..
జహీరాబాద్ టౌన్: నిత్యం తాగి గొడవకు దిగుతున్న భర్త వైఖరికి మనస్తాపంతో భార్య వ్యవసాయ బావిలోకి దూకింది.. అది గమనించిన భర్త కూడా బావిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్పూర్లో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. మృతుని తల్లి పెంటమ్మ, పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ మండలం ఆనేగుంటకు చెందిన రాజగిర వెంకటి (35)కి భార్య లక్ష్మి (28), కూతుళ్లు గీతాంజలి, మల్లీశ్వరి, కుమారుడు సాయి ఉన్నారు. వెంకటి కుటుంబంతో గోవింద్పూర్లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన వెంకటి తరచూ భార్యతో గొడవ పడేవాడు. గతంలో ఒకసారి గొడవ జరిగినప్పుడు వెంకటి బావిలో దూకగా చుట్టుపక్కల వారు రక్షించారు. ఆ సమయంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం కూడా మద్యం తాగిన వెంకటి భార్యతో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య లక్ష్మి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు వెంకటి కూడా బావిలోకి దూకగా, ఇద్దరు నీట మునిగారు. ఇది గమనించిన వెంకటి తల్లి పెంటమ్మ ఇద్దరినీ కాపాడేందుకు డ్రిప్ పైపులు బావిలోకి జార విడిచినా ప్రయోజనం లేకుండా పోయింది. దంపతుల మృతితో పదేళ్ల లోపున్న ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బావిలోంచి మృతదేహలను వెలికితీసిన చిరాగ్పల్లి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు వెంకటి తల్లి పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిరాగ్పల్లి ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. అనాథలైన చిన్నారులు -
కంట్లో కారం చల్లి.. చేతులు నరికి
మునిపల్లి(అందోల్): పాత కక్షలతో ఒక వ్యక్తిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచల్మెడ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి ఆనంద్ (28), తలారి అంబయ్య చిన్నకొడుకు ప్రవీణ్ 2020 అక్టోబర్ 10వ తేదీన పేకాట ఆడారు.ఆనంద్తో పాటు ఇతరుల డబ్బును ప్రవీణ్ గెలుచుకున్నాడు. ఆ ఉక్రోషంతో అతన్ని ఆనంద్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి ఆనంద్ను జైలుకు పంపించారు.బెయిల్పై ఇటీవలే బయటకు వచ్చిన అనంద్ను ఎలాగైనా చంపాలని ప్రవీణ్ కుటుంబ సభ్యులు పథకం వేసుకు న్నారు. శుక్రవారం గ్రామంలోని చర్చి సమీపంలో ఆనంద్ కనిపించగానే.. వెంట తెచ్చుకున్న కారం పొడిని అతని కంట్లో చల్లారు. తేరుకునేలోపే ఆనంద్ మెడపై తలారి అంబయ్య, స్వరూప, ప్రభుదాస్ గొడ్డలితో నరకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బతికి ఉన్నాడనే అనుమానంతో ఆనంద్ రెండు చేతు లు నరికి మృతదేహం పక్కన పెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. సీఐ సంతోష్ కుమార్, సి బ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. -
కలుషిత ఆహారం.. 60 మంది విద్యార్థినులకు అస్వస్థత
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం అల్పాహారంగా తాలింపు అటుకులు, రవ్వతో పాయసం అందించారు. అటుకులు, పాయసంలో పురుగులు రావ డంతో వాటిని తిన్న విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతూ పాఠశాలలో కుప్పకూలారు. దాన్ని గమనించిన మిగతా విద్యార్థినులు తినడం మానేశారు. పాఠశాల ప్రత్యేక అధికారి, వార్డెన్, వంట సిబ్బంది ఆ పదార్థాలను పడేశారు. కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థినుల్లో 25 మందిని మాత్రమే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. తహసీల్దార్ మురళీధర్, ఆర్ఐ మాధవరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డిలు పాఠశాలకు చేరుకుని మిగతావారిని పోలీసు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. డీఈవో నాంపల్లి రాజేశ్ ఆస్పత్రిలో విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు. బాధ్యులైన ప్రత్యేక అధికారితో పాటు నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. -
రహదారులపై మృత్యు ఘోష.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి
జోగిపేట (అందోల్)/ధారూరు: రాష్ట్రంలో రహ దారులు నెత్తురోడాయి. గురువారం జరిగిన వే ర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా దారికనిపంచక జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. దారి కనిపించక కుటుంబం బలి జీడిమెట్లలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా షాపూర్ నుంచి హైదరాబాద్కు కారులో బయలుదేరింది. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జోగిపేట వైపు నుంచి వస్తున్న నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాంసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో స్పీడ్గా వస్తున్న బస్సు కారును ఢీకొట్టి సుమారు 200 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. కారు ముందుభాగం బస్సుకింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో జీడిమెట్ల సుభాష్నగర్కు చెందిన ఎలక్ట్రిషియన్ దిలీప్ (50), భార్య వినోద (44), కూతురు సుప్రతిక (24), మనవరాలు కాన్షీ (ఏడాదిన్నర) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరగగానే అక్కడే రోడ్డు పక్కన పనిచేస్తున్న కూలీలు కారు వద్దకు పరుగెత్తివెళ్లి చూడగా, చిన్నారితోపాటు దిలీప్, వినోద మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన సుప్రతిక కొట్టు మిట్టాడుతోంది. ఆమెను కాపాడేందుకు కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా రాలేదు. చివరకు ఆమె కూడా పది నిమిషాల్లో మృత్యు ఒడిలోకి జారుకుంది. కారు డోర్లు ఇరుక్కు పోవడంతో ఆమెను కాపాడలేకపో యామని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కళ్ల ముందే జరిగిన ఈ ఘోరమైన ఘటనను మరిచిపోలేక పోతున్నా మన్నారు. తల్లి ఒడిలోనే చిన్నారి తనువు చాలించడం అక్కడున్న వారి హృదయాలను కలిచి వేసింది. జేసీబీ, క్రేన్ సహాయంతో గంటకుపైగా శ్రమించి కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. వద్దన్నా వెళ్లాడు.. దిలీప్ కూతురు సుప్రతిక, అల్లుడు ప్రదీప్రెడ్డికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతు న్నాయి. దీంతో గత నెల 31న అడ్వొకేట్తో మాట్లాడేందుకు కుటుంబంతోసహా మహారాష్ట్ర లోని స్వగ్రామమైన షాపూర్కు వెళ్లారు. కుమా రుడు వంశీని అక్కడే ఉంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుటుంబసభ్యులంతా మృతి చెందడంతో వంశీ అనాథయ్యాడు. వంశీ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. మహారాష్ట్రలోని షాపూర్కు వెళ్లిన దిలీప్ తన స్నేహితుడైన సంజీవరెడ్డి వద్దనే ఉన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు జీడిమెట్లకు వెళ్లేందుకు సిద్ధ మయ్యారు. ఇంతపొద్దున ఎందుకు, టిఫిన్ చేసి 8 గంటలకు బయలుదేరండి అని చెప్పినా వినకుండా వెళ్లాడని సంజీవరెడ్డి జోగిపేటలో ఆవేదనతో చెప్పారు. తమ ఇంటి నుంచి బయ లుదేరిన రెండు గంటల్లోనే చనిపోయాడన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిద్రమత్తులో లారీ నడిపి.. వికారాబాద్ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెద్దేముల్ మండలం రేగొండికి చెందిన ఆటో డ్రైవర్ జమీర్ తన ఆటోలో 10 మందిని ఎక్కించుకుని వికారాబాద్కు బయలుదేరాడు. వీరిలో ఎనిమిది మంది అడ్డా కూలీలున్నారు. వీరంతా వికారాబాద్లోని ఓ క్రషర్ మిషన్లో పనిచేస్తారు. బాచారం గ్రామ సమీపంలోకి రోడ్డు మలుపు వద్ద అతివేగంతో ఎదురుగా వచ్చిన లారీ వీరి ఆటోను ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ జమీర్ (35), హేంలానాయక్ (45), రవి (40) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను తొలుత వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ నేనావత్ కిషన్(40) తుదిశ్వాస వదిలాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మిగిలిన వారిని హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ నెనావత్ వినోద్ (35) మృతి చెందాడు. ప్రస్తుతం ఆరుగురు నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ ఎం.కుమార్ (28) నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిన ట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినా పట్టనట్లు వ్యవహరించిన డ్రైవర్ కుమార్.. అదే లారీని నడుపుకొంటూ తాండూరు వరకు సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ సత్యనా రాయణ, సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ నరేందర్ ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. తండాకు చెందిన ముగ్గురు మృతిచెందడంతో మదనంతపూర్లో విషాద ఛాయలు అలుముకు న్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేదని, దీంతో క్షతగాత్రులను తరలించేందుకు పోలీసులు ఇబ్బంది పడినట్లు స్థానికులు చెప్పారు. ఆపకపోతే ప్రాణాలు దక్కేవి మదనంతాపూర్ వద్ద కూలీలను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ జమీర్.. క్రషర్లో పనిచేసే టిప్పర్ డ్రైవర్ శ్రీనివాస్ కోసం బాచారం వద్ద ఐదు నిమిషాలు ఆపాడు. అక్కడి నుంచి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఆపకపోయి ఉంటే ఆటో సురక్షితంగా బాచారం మలుపు దాటి ఉండేదని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు. -
తెలంగాణ సరిహద్దు వద్ద ప్రత్యేక చెక్పోస్ట్.. ఎందుకంటే?
జహీరాబాద్: పశువులకు వ్యాపిస్తున్న ముద్ద చర్మపు వ్యాధి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ముందు జ్రాగత్తగా అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడ్గి శివారులో రాష్ట్ర సరిహద్దు వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేశారు. కలెక్టర్ శరత్ ఉత్తర్వులతో పోలీస్, పశు సంవర్థక, రవాణా శాఖల అధికారులు చెక్పోస్టు వద్ద సంయుక్తంగా పశువుల తనిఖీ నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి పశువులతో వస్తున్న వాహనాలను పరిశీలిస్తున్నారు. వ్యాధి లేనట్లు నిర్ధారణకు వచ్చాకే పశువులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఆదివారం గేదెలు, మేకలతో ఉన్న వాహనాలు 15 వచ్చాయని, వ్యాధులు ఉన్న పశువులు ఏవీ రాలేదని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం) -
తెలంగాణలో గ్రూప్–4 నోటిఫికేషన్పై మంత్రి హరీష్రావు క్లారిటీ
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి/సదాశివపేట: వారం రోజుల్లో 28 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తా మని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు ప్రకటించారు. కొద్ది రోజుల్లోనే గ్రూప్–4 నోటిఫికేషన్ కూడా వస్తుందని తెలిపారు. గురువారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పను లకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదా రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, సదాశివపేట, కంకోల్లలో జరిగిన సమావేశాల్లో హరీశ్రావు మాట్లా డుతూ, నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలను వివరించారు. మరో పక్క బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రూ.2,016 ఆసరా పింఛన్ ఇస్తుంటే, పక్కనే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కేవలం రూ.600 ఇస్తున్నార న్నారు. పొరుగునే ఉన్న బీదర్ (కర్ణాటక) వెళ్లి ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.75 మాత్రమే పింఛన్ ఇచ్చేవారని, లబ్ధిదారులెవరైనా చనిపోతే.. వారి స్థానంలో మాత్రమే కొత్త లబ్ధిదారు లకు పింఛన్లు మంజూరయ్యేవని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదనే విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితాలు వద్దంటున్న కేంద్రం మాటలపై హరీశ్రావు స్పందిస్తూ, పేద లకు సంక్షేమ పథకాలు అమలు చేయ వద్దని చెబుతున్నారా..? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దసరా నుంచి రూ.3 లక్షలు.. ఇంటి స్థలం ఉన్న పేదవారికి ఇంటి నిర్మా ణంకోసం రూ.3 లక్షలు ఇచ్చే పథకాన్ని దసరా నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఈ కార్య క్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తదితరులు పాల్గొ న్నారు. కాగా, మంత్రి హరీశ్రావు పాల్గొన్న సదాశివపేట సభలో కోలుబావి ప్రాంతానికి చెందిన వడ్డె శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కిరోసిన్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎందుకు కిరోసిన్ పోసుకున్నావని విలేకరులు ప్రశ్నిం చగా, ఎన్కెపల్లి రోడ్డులో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎకరా ఐదు గుంటల భూమిని అధికారులు తిరిగి తీసుకున్నా రన్నారు. అందులో గోదాం నిర్మించారని, ఇన్నాళ్లూ వేచిచూసినా ఎవరూ పరిహారం గురించి పట్టించుకోకపోవడంతో ఆత్మహ త్యాయత్నం చేసినట్లు తెలిపాడు. -
కన్నపేగును తెంచుకుని..
కల్హేర్(నారాయణఖేడ్): కుటుంబానికి భారంగా మారొద్దని భావించిన అంధురాలైన ఓ తల్లి, దివ్యాంగుడైన కొడుకు బలవన్మర ణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్పల్లి చౌరస్తాలో ఆదివారం చోటుచేసుకుంది. మాసాన్పల్లికి చెందిన కమ్మరి గంగామణి(55), చంద్రయ్య దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గంగామణి అంధురాలు కాగా, కొడుకు సంగమేశ్వర్(35) శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. ఆమె కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. కొడుకుతోపాటు తన ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడంతో కుటుంబానికి భారంగా మారామని మథనపడుతోంది. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది కొడుకుతోసహా బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంది. ఇటీవల చంద్రయ్య కొత్తగా నిర్మించిన ఇంటి ఆవరణలోని సంపులోకి సంగమేశ్వర్ను తోసేసింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక ఆమె కూడా అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని కల్హేర్ ఎస్ఐ ప్రశాంత్కుమార్ తెలిపారు. -
గురుకులంలో ఫుడ్ పాయిజన్
నారాయణఖేడ్: కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం వండిన పప్పు మిగలడంతో శుక్రవారం ఉదయం వేడిచేసి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అది తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన పిల్లలకు ఓఆర్ఎస్ పాకెట్లు తాగించారు. కాగా నిత్యం అన్నం పలుకుగానే ఉంటుందని, సరిగా ఉడకడం లేదని విద్యార్థులు వాపోయారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని.. రోజూ అన్నం, పప్పు, సాంబారునే వడ్డించడంతో తినలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇదే విషయమై గురుకులం వార్డెన్ ఎల్లంను వివరణ కోరగా, గురువారం సాయంత్రం వండిన పప్పు ఉదయం బాగుందని చెబితేనే వడ్డించామన్నారు. విద్యార్థుల్లో కొందరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ్సింగ్ గురుకులాన్ని సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఆజాది కా గౌరవ్ యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం
-
నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!
తెలంగాణలో విద్యార్థులను బడులకు రప్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బతిమాలి మరీ పిల్లలను పాఠశాలలకు తీసుకువస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవో, సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా స్పందించి విద్యార్థులను బడికి రప్పించారు. నువ్వొస్తేనే నేనెళ్తా: డీఈవో జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో విద్యార్థుల చిరునామాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లారు. విద్యార్థి పాలెపు జశ్వంత్ మరికొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. ఈరోజే రావాలంటూ శర్మ అక్కడే బైఠాయించారు. చివరకు ఒప్పించి విద్యార్థిని తీసుకెళ్లి పాఠశాలలో దిగబెట్టారు. కదిలేదే లేదు: హెచ్ఎం పుల్కల్ (అందోల్): బడి మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్రావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మొండికేసిన, బడి మానేసిన పిల్లల్ని పాఠశాలకు పంపాలంటూ బుధవారం గ్రామంలో కొందరి ఇళ్ల ముందు నేలపై పడుకున్నారు. రెండు రోజుల్లో బడి మానేసిన నలుగురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. (క్లిక్: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి) -
జరిమానా వేశారని బండినే తగలబెట్టాడు
జోగిపేట (ఆందోల్): ద్విచక్ర వాహనానికి ఇన్సూరెన్స్ లేదని పోలీసులు ఫైన్ వేసినందుకు తన బైకునే తగలబెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అన్నా సాగర్ కట్టపై జరిగింది. జోగిపేట పోలీసులు అన్నాసాగర్ కట్టపై వాహనాల తనిఖీ చేపట్టారు. వాహ నాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి జరిమానా వేస్తున్నారు. జోగిపేట వైపు వెళ్తున్న బైక్ను ఆపి డాక్యుమెంట్లు తనిఖీ చేసి ఇన్సూరెన్స్ లేకపోవడంతో పోలీసులు రూ.1,100 ఫైన్ వేశారు. రశీదు తీసుకున్న వాహనదారుడు అక్కడే 2, 3 సార్లు చక్కర్లు కొట్టి కట్టపై కల్వర్టు వద్ద బైక్ (స్లె్పండర్)ను నిలిపి పెట్రోల్ పైపును బయటకు తీసి వాహనానికి నిప్పంటించాడు. అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం వాహనదారుడిని పోలీసు వాహనంలో స్టేషన్కు తరలించారు. అతన్ని చౌటకూరు మండలం శివ్వంపేట గ్రామానికి చెందిన పాండుగా గుర్తించారు. -
వంటపని చేస్తున్న గురుకుల విద్యార్థి.. సాంబారు పడి తీవ్రగాయాలు
పుల్కల్(అందోల్): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఒంటిపై సాంబారు పడటంతో తీవ్రగాయాలపాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుల్కల్ గ్రామానికి చెందిన మైసనగారి ప్రణయ్ సింగూరు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న ఉదయం క్యాంటీన్లోంచి సాంబారును డైనింగ్ హాల్లోకి తీసుకురావడానికి ప్రణయ్ సహకారాన్ని వంటమనిషి కోరాడు. సాంబరు గిన్నె తీసుకెళ్తుండగా వేడివేడి సాంబారు ప్రమాదవశాత్తు ప్రణయ్ రెండు చేతులు, కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రిన్సిపాల్ బాలస్వామి వెంటనే ప్రణయ్ కుటుంబసభ్యులకు సమాచారమందించి అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గురుకులంలో నలుగురు వంటమనుషులు ఉండాలి. కానీ, ఒక్కరే ఉండటంతో రోజూ సీనియర్ విద్యార్థులను సహాయకులుగా వాడుకుంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న సింగూరు గురుకుల ప్రిన్సిపాల్, కేర్ టేకర్పై చర్యలు తీసుకోవాలని స్వేరోస్ నాయకులు డిమాండ్ చేశారు. -
పిల్లల చేతిలో పేలిన ఎయిర్గన్
జిన్నారం(పటాన్చెరు): ఎయిర్గన్ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబంలో విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫాంహౌస్లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన నాగరాజు, సుకన్యలు వావిలాలలోని ఓ ఫాంహౌస్లో వ్యవసాయ పనులు చేసేందుకు మూడునెలల క్రితం వలస వచ్చారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె సాన్వి, రెండేళ్ల కుమారుడు ప్రేమ్కుమార్లు ఉన్నారు. ఫాంహౌస్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తుండటంతో కోతులు, పక్షులను చెదరగొట్టేందుకు ఎయిర్గన్ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పటివరకు నాగరాజు దానిని ఉపయోగించలేదు. అందులో గుండ్లు ఉన్న విషయం కూడా అతనికి తెలియదు. సాన్వి, ప్రేమ్కుమార్లు గన్తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలింది. ఎదురుగా ఉన్న సాన్వి కణతలోకి గుండు గుచ్చుకుపోయి రక్తస్రావంతో కింద పడిపోయింది. హుటాహుటిన సాన్విని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాన్వి బుధవారం ఉదయం మృతి చెందింది. వైద్యులు పోలీసులకు సమాచారాన్ని అందించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎయిర్గన్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్ గ్రామంలోనూ ప్రాక్టీస్ చేస్తుండగా ఎయిర్గన్ పేలి ఐదు నెలల క్రితం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. -
బంగారు తెలంగాణ చేసుకున్నం.. ఇక బంగారు భారతం చేద్దాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకున్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతదేశంగా మార్చుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. అమెరికా కంటే గొప్పగా మన దేశాన్ని తయారు చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘మనం అమెరికాకు వెళ్లడం కాదు, ఇతర దేశాల ప్రజలే మన దేశం వీసాలు తీసుకొని వచ్చే గొప్ప సంపద, వనరులు, యువశక్తి మనకున్నాయి. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర షోషించాలి. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఢిల్లీ వరకు కొట్లాడతా. నేను జాతీయ రాజకీయాల్లో పనిచేస్తున్నా.. పోదా మా? జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా..? ఢిల్లీ వరకు కొట్లాడుదామా..? దేశాన్ని బాగు చేసుకుందామా..?’అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నిం చారు. దీంతో ‘కొట్లాడదాం..కొట్లాడదాం’అంటూ సభికులు ప్రతిస్పందించారు. ‘ఎక్కడైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.. మతం పేరు తో ఘర్షణలు పడితే పెట్టుబడులు రావు. దీనిపై గ్రామాల్లో చర్చించాలి. అన్ని వర్గాలు, కులాలు, మతాలు బాగుండాలి..’అని సీఎం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ‘తెలంగాణలో రైతులు చనిపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా అమలు చేస్తున్నాం. ఎలాంటి లంచం ఇవ్వకుండానే రైతులకు రైతుబంధు అందుతోంది. ఠంచనుగా వారి ఖాతాల్లో పడుతోంది. రూ.రెండు వేలు పింఛన్లు ఇవ్వడంతో తెలంగాణాలోని వృద్ధులకు గౌరవం పెరిగింది. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యకు రూ.20 లక్షలు స్కాలర్షిప్లు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమతో 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. జహీరాబాద్ నిమ్జ్లో ఉద్యోగాలు రానున్నాయి..’అని కేసీఆర్ తెలిపారు. మన పథకాల కోసం మహారాష్ట్ర ప్రజల ఒత్తిడి రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మెచ్చుకున్నారని సీఎం చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రజలు ఈ పథకాలను తమకు కూడా అమలు చేయాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తున్నారని ఠాక్రే తెలిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు చీకట్లో ఉంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నది ఒక్క తెలంగాణలోనే అని చెప్పారు. రెండోసారి ప్రజలు దీవించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బహిరంగ సభలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి (నారాయణఖేడ్), చంటి క్రాంతికిరణ్ (అందోల్), మాణిక్రావు (జహీరాబాద్), మదన్రెడ్డి (నర్సాపూర్), పద్మా దేవేందర్రెడ్డి (మెదక్), గూడెం మహిపాల్రెడ్డి (పటాన్చెరు) తదితరులు పాల్గొన్నారు. చిమ్నీబాయి అనే ఓ గిరిజన మహిళను సీఎం కేసీఆర్ వేదికపైకి పిలిపించుకొని కాసేపు ముచ్చటించారు. చిమ్నీబాయిది సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండా. గతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా తాను ఆ తండాకు వెళ్లిన సందర్భంలో.. గ్రామంలోని సమస్యలను ఆమె వివరించిన విషయాన్ని మంత్రి హరీశ్ తన ప్రసంగంలో తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి తాగునీరు వస్తోందని, రోడ్డు సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. ఈ నేపథ్యంలో చిమ్నీబాయిని వేదికపైకి ఆహ్వానించిన కేసీఆర్, ఆ గ్రామం బాగోగులపై కాసేపు ముచ్చటించారు. -
సంగారెడ్డికి గోదారమ్మ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకోబోతున్నాయి. సముద్రమట్టానికి ఎత్తై న ప్రాంతంలో ఉండే నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు గోదావరి జలాలను తరలించాలనే ఇక్కడి రైతుల ఎన్నో ఏళ్ల కళ సాకారమవబోతోంది. ఈ రెండు ఎత్తిపోతల పనులకు సీఎం కేసీఆర్ సోమవారం భూమి పూజ చేయనున్నారు. తర్వాత నారాయణఖేడ్ శివారులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీలు తరలించి.. సంగమేశ్వర, బసవేశ్వర పథకాలకు రాష్ట్రం రూ.4,427 కోట్లు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. మొత్తం 397 గ్రామాలకు చెందిన రైతులు లబ్ధి పొందనున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయం నుంచి సుమారు 12 టీఎంసీల నీటిని సింగూరు జలాశయానికి తరలిస్తారు. అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా ఆయకట్టుకు మళ్లించేలా ఈ పథకాలను డిజైన్ చేశారు. రెండు ఎత్తిపోతల పథకాలకు కలిపి 5 పంప్హౌజ్లను నిర్మించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నీటి పారుదల శాఖ ఇప్పటికే టెండరు ప్రక్రియను పూర్తి చేయగా మెగా కంపెనీ పనులు దక్కించుకుంది. సంగారెడ్డి సస్యశ్యామలం: హరీశ్ నారాయణఖేడ్: సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న రెండు ఎత్తిపోతల పథకాలు సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయనిగా మారనున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం నారాయణఖేడ్లో జరగనున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలసి ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఈ ప్రాంత అభివృద్ధికోసం రూ.4,500 కోట్లతో రూ.3.89 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను మంజూరు చేశారన్నారు. ఈ ప్రాజెక్టులతో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో 406 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, సర్వే పనులు పూర్తయ్యేందుకు ఏడాది పట్టిందని తెలిపారు. -
నన్ను అంతం చేసే కుట్ర ఎమ్మెల్యే రాజాసింగ్
కల్హేర్(నారాయణఖేడ్): ధర్మం కోసం పని చేస్తున్న తనను అంతం చేసేందుకు కొన్నిశక్తులు కుట్ర చేస్తున్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గరిడెగాంలో ఆదివారంనాడు శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తన నోరు మూయించాలని చూస్తే.. వంద మంది రాజాసింగ్లు పుట్టుకొస్తారన్నారు. కొందరు విదేశాల నుంచి డబ్బు పంపి మతమార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మహారాష్ట్రలోని దెగ్లూర్కు చెందిన చంద్రశేఖర్ మహరాజ్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్రెడ్డి, గంగారం, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలె భాస్కర్ పాల్గొన్నారు. -
గొంతుకు చున్నీ బిగించి..
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి గ్రామానికి దగ్గర్లో మామిడి తోటలో సోమవారం మధ్యాహ్నం ఓ బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. గొంతుకు చున్నీ బిగించి బాలికను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హుగ్గెల్లికి చెందిన బుజ్జమ్మ భర్త 15 ఏళ్ల కిందట చనిపోయాడు. దీంతో కూలీ పనులు చేస్తూ కొడుకు సురేశ్, కుమార్తె మౌనిక (16)ను పోషిస్తోంది. మౌనిక జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం తల్లి డ్వాక్రా గ్రూపు సమావేశానికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి చేరింది. కుమార్తె మరో గదిలో పడుకొని ఉంటుందని తల్లి భావించి నిద్రపోయింది. ఉదయం కుమార్తె కనిపించకపోవడంతో గ్రామంలో విచారించింది. మధ్యాహ్నం గ్రామ శివారులో మృతదేహం ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూసి అది మౌనిక మృతదేహమేనని బోరున విలపించింది. సర్పంచ్ రాజు ఫిర్యాదు మేరకు డీఎస్పీ శంకర్రాజు, సీఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ప్రభుత్వా స్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. -
తల ఓ చోట.. మొండెం మరో చోట
పటాన్చెరు టౌన్: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి తల, మొండెంను వేర్వేరు చోట్ల పడేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. హైదరాబాద్ శివారులోని రామచంద్రాపురం వెలిమెల తండాకు చెందిన కేడావత్ రాజు నాయక్ (32) దారుణ హత్యకు గురయ్యాడు. రాయికోడ్ మండలం కుస్నూర్ శివారులోని వాగు వద్ద తల, న్యాల్కల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని మంజీరా బ్రిడ్జి పరిసరాల్లో మొం డెం గుర్తించారు. పటాన్చెరు డీఎస్పీ భీం నాయ క్ కేసును పరిశోధిస్తున్నారు. రాజునాయక్ తల, మొండెం భాగాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంద్రకరణ్ స్టేషన్ పరిధిలోనే హత్య! రాజునాయక్ను కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ పోలీస్స్టేషన్ పరిధిలోనే హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. రాజునాయక్ ఈ నెల 25న రాత్రి ఓ ఫోన్ కాల్ వస్తే ఇంటి నుంచి కారులో బయటికెళ్లాడు. అదే రాత్రి రాజునాయక్ అదృశ్యంపై అతని సోదరుడు గోపాల్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. రామచంద్రాపురం మండలం వెలిమెల తండాకు చెందిన మృతుడు కేడవత్ రాజునాయక్ (32) ఎర్ర మట్టి వ్యాపారం చేస్తుంటాడు. ఆయన టీఆర్ఎస్ మండల ఎస్టీ విభాగం అధ్యక్షునిగా కూడా పని చేస్తున్నాడు. 32 గుంటల భూమి వివాదమే రాజునాయక్ హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులో తీసుకున్నట్టు సమాచారం. నిందితుల్లో మృతుని తమ్ముడు గోపాల్ నాయక్ కూడా ఉన్నాడు. భూ వివాదానికి కారణమైన రాంసింగ్ నాయక్తో పాటు గ్రామానికి చెందిన మహేష్, బాలు, మల్లేష్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. -
ఔటర్రింగు రోడ్డుపై దుర్ఘటన.. మొక్కలకు నీరు పడుతుండగా..
జిన్నారం (పటాన్చెరు): మొక్కలకు నీరు పడుతున్న ఇద్దరు కార్మికులను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం సంగారెడ్డి జిల్లా బొల్లారం సమీపంలో ఔటర్రింగు రోడ్డుపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హత్నూర మండలం వడ్డెపల్లి గ్రామానికి చెందిన కంటిగారి సత్తయ్య (50) జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా తడ్వాయ్ గ్రామానికి చెందిన పాపల నవీన్ (19) లారీ ట్యాంకర్ క్లీనర్గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ రోజులాగే జిన్నారం మండలంలోని బొల్లారం సమీపంలో ఓఆర్ఆర్పై మొక్కలకు ట్యాంకర్లో తీసుకువచ్చిన నీళ్లు పోస్తున్నారు. అదే సమయంలో రామచంద్రాపురానికి చెందిన మహేశ్వర్రెడ్డి అనే వ్యక్తి కారులో వేగంగా వస్తూ మొక్కలకు నీళ్లు పోస్తున్న నవీన్, సత్తయ్యలను ఢీకొట్టాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి ట్యాంకర్నూ ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో మహేశ్వర్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రశాంత్ చెప్పారు. -
‘మిల్లెటు’ బండెక్కి వచ్చేత్తమూ..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆహారమే ఔషధం.. ఇది ఆయుర్వేదానికి సంబంధించిన ఒక నానుడి. ఔషధం లాంటి ఆహారాన్ని ‘ఔరా’అనిపించే విధంగా ఓ బువ్వబండి అందిస్తోంది. ‘తింటే గారెలే తినాలి..’అంటారు కదా! ఈ బువ్వబండిని చూస్తే, ‘తింటే.. చిరుధాన్యాల బువ్వే తినాలి’అని అనిపిస్తుంది. సామల అన్నం, నోరూరించే టమాటా పచ్చడి, పసందైన ఆకుకూర పప్పు, గంజి సూప్.. ఇది బువ్వబండి మెనూ. ఇది గుడ్ఫుడ్ మాత్రమేకాదు, హెల్దీ ఫుడ్ కూడా. సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే చిరుధాన్యాల ప్రాధాన్యం తెలియజేసేందుకు ప్రతిరోజూ ఉచితంగా మిల్లెట్ భోజనాన్ని వడ్డిస్తున్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్కు చెందిన కొల్లూరు సత్తయ్య, అమృతమ్మ దంపతులు. సామలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో ఆహారం అందిస్తున్నారు. ఇందుకోసం ఆయన ‘బువ్వబండి’ని తయారుచేశారు. ఈ బువ్వబండిని రోజూ ఉద యం 8.30 నుంచి 10.30 గంటల వరకు తెల్లాపూర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉంచుతారు. వందలాది మంది నిరుపేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఈ బండి వద్ద ‘చిరు’బు వ్వ తింటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. రోజూ రూ.4 వేలు.. ఐదు రకాల చిరుధాన్యాలు ఒక్కో రకం చిరుధాన్యం భోజనం ఐదు రోజుల చొప్పున వడ్డిస్తుంటారు. ఈ చిరుధాన్యాలను మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం నుంచి కొనుగోలు చేస్తున్నారు. రోజూ 25 కిలోల చిరుధాన్యంతో చేసిన భోజనం వడ్డిస్తున్నారు. ఈ మిల్లెట్ భోజనంలో రోజూ ఒక రోటి పచ్చడి కూడా ఉంటుంది. టమాటా, పుంటికూర (గోంగూర), మెంతికూర, కొత్తిమీర వంటి వాటితో రోటిపచ్చడి వడ్డిస్తున్నారు. ఈ ఆహారంలో ఆకుకూర పప్పు కూడా ఉంటుంది. ఒక్కో ఆకుకూర ఒక్కోరోజు అందిస్తున్నారు. వీటితోపాటు గంజి సూప్ ఇస్తున్నారు. ఈ బువ్వబండిని సత్తయ్య 2021 నవంబర్లో ప్రారంభించారు. సత్తయ్య కుటుంబసభ్యులు ఉదయం 5 గంటలకే లేచి ఈ బువ్వబండి పనులు మొదలుపెడుతుంటారు. బువ్వబండి నిర్వహణ కోసం ప్రతిరోజూ కనీసం రూ.4 వేల ఖర్చు అవుతోందని సత్తయ్య పేర్కొంటున్నారు. -
కోటి హోం ఐసోలేషన్ కిట్లు.. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆ శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. కోటి హోం ఐసోలేషన్ కిట్ల(ఎనిమిది రకాల మందుల)ను పీహెచ్సీల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎంతమందికైనా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రెండు కోట్ల కరోనా టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం జరిగిన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హరీశ్రావు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఫస్ట్వేవ్లో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయికి చేరడానికి 8 నెలలు పడితే, రెండో వేవ్లో నాలుగు నెలలే సమయం పట్టిందని, ఈ థర్డ్ వేవ్లో రెండు నెలల్లోనే కేసులు భారీ స్థాయికి చేరుతాయని వైద్యనిఫుణులు అంచనా వేస్తున్నారని వివరించారు. అరవై ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియను ఈ నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ ప్రకటించారు. మాతాశిశు మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దశలవారీగా సబ్సెంటర్లలో వైద్యులను నియమించి పల్లె దవాఖానాలుగా మార్చుతామన్నారు. బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ ఒక భాగమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 66 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అందులో 44మంది వ్యాక్సిన్ వేసుకోనివారేనని తెలిపారు. జగ్గారెడ్డి వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి.. రాజకీయ ప్రత్యర్థులుగా పేరున్న మంత్రి హరీశ్రా వు, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జెడ్పీ సమావేశం కొనసాగుతుండగా జగ్గారెడ్డి సమావేశం హాలులోకి రాగా.. ‘‘ఎమ్మెల్యే వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి’’అని హరీశ్రావు అన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని హరీశ్రావుకు జగ్గారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఏఎన్ఎంల పట్ల మంత్రి అసహనం.. ఉద్యోగుల కేటాయింపుల్లో తమను ఇతర జోన్లోకి మార్చారని, న్యాయం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు మంత్రి హరీశ్కు వినతిపత్రం అందజేయగా ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. వారి ముందే వినతిపత్రాన్ని చింపివేశారు. -
రాయితీలు.. ఇంకా రాలే..
►సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు గోమతి కాటన్ ఇండస్ట్రీస్ ఆరేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. పెట్టుబడి రాయితీ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా రూ.10 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయినా నేటికీ నయాపైసా విడుదల కాలేదు. ►కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన మన్నె జానకి 2017లో ఉపాధి కోసం జేసీబీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీల రాయితీలకు ఉద్దేశించిన ‘టీ ప్రైడ్’కింద రూ.6.91 లక్షలు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సబ్సిడీ ఇవ్వాలని 2018 అక్టోబర్లో కమిటీ సిఫారసు చేసింది. అయినా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. సబ్సిడీ అందకపోవడంతో అప్పులపై వడ్డీ భారం పెరుగుతోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ►సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన రేండ్లపల్లి కాంతమ్మ వాహనం కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోగా 2018లో యూనిట్ మంజూరైంది. రుణం కోసం బ్యాంకును ఆశ్రయించగా, పరిశ్రమల శాఖ నుంచి పెట్టుబడి సబ్సిడీ విడుదలైతేనే రుణం మంజూరు చేస్తామని షరతు విధించింది. అటు బ్యాంకు, ఇటు పరిశ్రమల శాఖ తీరుతో తనకు ఉపాధి లేకుండా పోయిందని కాంతమ్మ వాపోతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబ డులతో వచ్చే వారికి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు అందడం లేదు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా.. పరిశ్రమల యాజమాన్యాలు దరఖాస్తులు చేసుకుంటున్నా విడుదల కావడం లేదు. గత నవంబర్ వరకు రాష్ట్రంలో 43 వేలకుపైగా యూనిట్లకు రూ.3,389.95 కోట్లు రాయితీలు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటివరకు 72 పర్యాయాలు ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపినా ఫలితం శూన్యమే. నవంబర్ 30న జరిగిన 72వ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం 369 యూనిట్లకు సంబంధించి మరో రూ.47.67 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించింది. జనరల్ కేటగిరీలో 2016–17 నుంచి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 2018–19 నుంచి రాయితీలు పెండిం గులో ఉన్నాయి. కరోనాతో కార్యకలాపాలు దెబ్బతినడంతో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఊరటనిస్తాయ ని పారిశ్రామికవర్గాలు భావించాయి. దీనికితోడు బ్యాంకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం కూడా అమలుకాకపోవడంతో ఇటు రుణాలపై వడ్డీ, అటు ప్రోత్సాహకాలు అందక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఊరటనివ్వని ‘టీ ఐడియా’, ‘టీ ప్రైడ్’ పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం 2014–15 నుంచి ఇప్పటివరకు రూ.26.46 లక్షల కోట్ల పెట్టుబడులతో 18వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 21 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలుగట్టారు. పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం 2014లో ‘టీ ఐడియా’, ‘టీప్రైడ్’పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. జనరల్ కేటగిరీకి టీ ఐడియా ద్వారా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ‘టీ ప్రైడ్’ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. వీటికింద రాయితీ, స్టాంప్ డ్యూటీ, సేల్స్ టాక్స్, భూమి ధర, విద్యుత్ బిల్లులు, పావలావడ్డీ తదిరాలకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇదిలాఉంటే సీనియారిటీ ప్రకారం బకాయిలు విడుదల కావాల్సి ఉండగా, సిఫారసు లేఖలు తెచ్చిన 24 మెగా కంపెనీలకు గత నవంబర్లో రూ.250 కోట్లు విడుదలైనట్లు సమాచారం. బడ్జెట్లో కేటాయించినా..! రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు రూ.3,389 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను ప్రతిపాదించి, అందులో రూ.2,500 కోట్లు రాయితీలు, ప్రోత్సాహకాలకే కేటాయించినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అంతకుముందు బడ్జెట్లో రాయితీల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ఇప్పటివరకు రూ.100 కోట్లు మాత్రమే విడుదలైనట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆశలు ఆవిరై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉసూరుమంటున్నాయి. -
జహీరాబాద్లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై అదుపు తప్పి పల్టీలు కొడుతూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సహా 8నెలల చిన్నారి, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. బైక్ పైన ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, చిన్నారి అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి చెందిన బాలరాజు(28), శ్రావణి(22), అమ్ములు( 8నెలలు)గా పోలీసులు గుర్తించారు.కారులో ప్రయాణిస్తూ మృతి చెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25)గా గుర్తించారు. మృతదేహలు జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. -
ఫరీదుద్దీన్కు కన్నీటి వీడ్కోలు
జహీరాబాద్ టౌన్/ఝరాసంగం (జహీరాబాద్): అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరీదుద్దీన్కు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లాలోని ఆయన స్వగ్రామమైన హోతి(బి) శ్మశానవాటిలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూసిన ఫరీదుద్దీన్ పార్థివ దేహాన్ని రాత్రి ఆయన స్వగ్రామం హోతి (బి)కి తీసుకొచ్చారు. గ్రామస్తు ల సందర్శనార్థం గురువారం ఉదయం 10 గంట ల వరకు ఇంటివద్దనే ఉంచారు. తర్వాత ఆయన పార్థివ దేహాన్ని జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియానికి తీసుకువచ్చారు. కడసారి చూపుకోసం పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చా రు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆయన పార్థి వ దేహాన్ని ఉంచి ఊరేగింపుగా ఈద్గా మైదానం వద్దకు తీసుకెళ్లారు. పార్థనల తర్వాత హోతి(బి)లో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులు గౌరవ వందనం చేసి గాలిలో కాల్పులు జరిపారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ బీబీపాటిల్ పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు పొల్గొన్నారు. పార్టీకి తీరని లోటు: మంత్రి కేటీఆర్ మంచి మనిషి ఫరీదుద్దీన్ అకాల మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ ఆయన మరణ వార్త వినగానే సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ముఖ్యమంత్రికి స్వల్ప అనారోగ్యం వల్ల జహీరాబాద్కు రాలేకపోయారన్నారు. -
ఆధునిక యుద్ధ ట్యాంకులను పరీక్షించిన ఓడీఎఫ్
కొండాపూర్(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ చెరువులో శనివారం రెండు యుద్ధ ట్యాంకుల ట్రయల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్ పరిశ్రమ అధికారులు మాట్లాడుతూ దేశంలో ఇలాంటి ట్యాం కులను చెన్నై, మెదక్లోని ఓడీఎఫ్లో మాత్రమే తయారు చేస్తారన్నారు. ఒక్కో ట్యాంక్లో పది మంది కూర్చునేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ యుద్ధ ట్యాంక్కు కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లోనూ ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని, నీటితో పాటు బురద, నేలపై దూసుకుపోతుందని పేర్కొన్నారు. శత్రువులపై దాడి చేసే సమయంలో పెద్దపెద్ద సరస్సులను దాటేందుకు అనువుగా ఈ యుద్ధ ట్యాంకులను తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ బ్రిగేడియర్ నేవిబుట్ట, జాయింట్ కంట్రోలర్ శరవణన్, డిప్యూటీ కంట్రోలర్ బాలషణ్ముగం తదితరులు పాల్గొన్నారు. -
తనకంటే ముందే తనువు చాలించాలని..
సాక్షి, రాయికోడ్(అందోల్): తన భాగస్వామికన్నా ముందే తనువు చాలించాలనుకున్న ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవకముందే భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషాధ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంశోద్దీన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శంశోద్దీన్పూర్ సర్పంచ్ బి.నర్సింలు పెద్దనాన్న మల్లయ్యకు వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) భర్త అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేక భార్య లక్ష్మమ్మ(75)భర్త కంటే ముందే తనువు చాలించాలని గురువారం పురుగులమందు తాగింది. వెంటనే బీదర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి 9.30 గంటలకు మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు పూర్తికాగా రాత్రి 10 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న లక్ష్మమ్మ భర్త మల్లయ్య(80) మృతి చెందాడు. వృద్ధ దంపతులిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మ అంత్యక్రియలు చేసి వెళ్లిన బంధువులు శనివారం సాయంత్రం మల్లయ్య అంత్యక్రియలు జరిపారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
మరో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయం కరోనా కలకలం నుంచి తేరుకోక ముందే మరో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు లోనైన ముగ్గురిని చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 48 మంది ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిన విద్యార్థినుల్లో మంగళవారం 25 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థ తకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న వైద్యాధికారులు వారికి చికిత్స చేశారు. వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించాలని డాక్టర్లు సూచించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఓ డాక్టర్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని ఉన్నతాధికారులు చెప్పారు. కరోనా సోకిన విద్యార్థినుల ఇంటిబాట కరోనా బారిన పడిన విద్యార్థినులను గురుకులంలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే 47 మంది విద్యార్థినుల్లో కొందరిని వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. -
48 మందికి కరోనా పాజిటివ్
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్, టెన్త్ చదివే 47 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. వీరందరినీ గురుకులంలోని ‘ఎ’బ్లాక్లో ఐసోలేషన్ గది ఏర్పాటు చేసి అందులో ఉంచారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతా స్కూళ్లు, కళాశాలలు, వసతి గృహాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ముత్తంగి గురుకులంలో పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని జ్వరం బారిన పడింది. తల్లిదండ్రులు శనివారం ఆమెను తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ తేలింది. దీంతో వారు గురుకుల టీచర్లకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన సిబ్బంది గురుకులంలో 470 మంది విద్యార్థినులు ఉండగా.. ఆదివారం 261 మంది విద్యార్థినులు, సిబ్బందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు జరిపించారు. పరీక్షల్లో 37 మంది పదో తరగతి విద్యార్థినులు, ఐదుగురు ఇంటర్ విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు మొత్తం 43 మందికి పాజిటివ్ తేలింది. సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రీదేవి, ఆర్డీఓ నాగేష్, పటాన్చెరు తహసీల్దార్ మహిపాల్ గురుకులాన్ని సందర్శించి కోవిడ్ బారిన పడిన విద్యార్థినులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సోమవారం మిగిలిన 209 మంది విద్యార్థినులకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించగా, మరో ఐదుగురు ఇంటర్ విద్యార్థినులకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థినుల సంఖ్య 47కు చేరింది. -
తుక్కు కింద కుక్కి
సంగారెడ్డి అర్బన్: అనుమానం రాకుండా ఇనుప తుక్కు లోడ్ కింద రహస్యంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీని సంగారెడ్డి రూరల్, టాస్క్ఫోర్స్ పోలీసులు కలసి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కంది చౌరస్తాలో తనిఖీ చేయగా గుట్టుగా గంజాయిని తరలిస్తున్న విషయాన్ని గుర్తించారు. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి ఆరు క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధాన సూత్రదారి పరారీలో ఉన్నాడు. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా మాలెగావ్ గ్రామానికి చెందిన అనిల్ గోవింద్ చిరు వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గణేశ్ నందకిషోర్ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. వీరికి సంగారెడ్డి జిల్లాలోని ఎంకేపల్లి వాసి అనిల్రెడ్డితో పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వీరంతా ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో గంజాయిని మహారాష్ట్రలోని పండరీపూర్కి తరలిస్తే రూ.50 వేలు ఇస్తానని అనిల్రెడ్డి చెప్పడంతో మిగతా ఇద్దరు ఏపీలోని తుని వద్ద ప్లాస్టిక్ సంచుల్లో ఆరు క్వింటాళ్ల గంజాయిని ఇనుప స్క్రాప్ కింద లారీలో లోడ్ చేశారు. అక్కడినుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు లారీని పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ప్రధాన సూత్రధారి అనిల్రెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని చెప్పారు. -
వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగు.. లక్షల్లో ఆదాయం
వరి నాటేసేటప్పుడు కూలీల కొరత.. పాలుపోసుకునే దశలో చీడపీడల బెడద.. కోసేటప్పుడు హార్వెస్టర్ చార్జీల మోత.. చేతికందే సమయంలో అకాల వర్షాలు.. అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో అష్టకష్టాలు.. ఇకపై యాసంగిలో ధాన్యం కొనబోమని తేల్చి చెబుతున్న ప్రభుత్వాలు.. ఈ పరిస్థితులను అధిగమించేందుకు వరి సాగు చేస్తున్న పలువురు రైతులు ఇప్పటికే లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లడమే కాకుండా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండడంతో అమ్మడం కూడా సులభంగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో కూరగాయల పంటలతో లాభాలు ఆర్జిస్తున్న రైతుల విజయగాథపై ప్రత్యేక కథనం.. ఆలు సాగుతో ఆదర్శంగా.. ఆలుగడ్డ పంట సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సల్లోల్ల నారాయణరెడ్డి. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం కుప్పనగర్కు చెందిన ఈ రైతు తనకున్న మూడు ఎకరాలతో పాటు, మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం తొమ్మిది ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎకరానికి 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. 3నెలల్లో పంట చేతికి.. ఏటా దసరా పండగకు కాస్త అటూఇటుగా రైతులు ఆలుగడ్డ పంట వేసుకుంటారు. ప్రస్తుతం ఈ పంట పూత దశలో ఉంది. మూడు నెలల్లో ఈ పంట పూర్తిస్థాయిలో చేతికందుతుంది. కొందరు రైతులు 65 నుంచి 70 రోజుల్లోనే తవ్వుకుంటారు. మూడు నెలల వరకు ఆగితే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఏటా జనవరిలో ఆలుగడ్డ తవ్వకాలు ప్రారంభమవుతాయి. బోయిన్పల్లి మార్కెట్లో విక్రయం రైతులు ఎక్కువగా ఈ పంటను హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తారు. బోయిన్పల్లి మార్కెట్లో విక్రయిస్తుంటారు. హోల్సేల్ మార్కెట్లో ఆలుగడ్డకు క్వింటాల్కు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ధర ఉంటుంది. ప్రస్తుతం ఆలుగడ్డకు రూ.రెండు వేల వరకు ధర పలుకుతోంది. మార్కెట్లో ధర బాగుంటే సాగు వ్యయం పోగా, ఎకరానికి సగటున రూ.40 వేల వరకు చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 3,200 ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగవుతోందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా వరితో లాభంలేదని చెరకు వేసిన.. అడవిపందుల బెడదతో అదీ మానుకున్నా.. నాలుగేళ్లుగా ఆలుగడ్డ సాగుచేస్తున్నా. మార్కెట్లో రేటు బాగుంటే లాభాలు మంచిగుంటయి. గతేడాది ఆలుగడ్డ ధర కొంత తక్కువగా ఉండే. అంతకు ముందు మంచి ధర వచ్చింది. – సల్లోల్ల నారాయణరెడ్డి, ఆలుగడ్డ రైతు గెర్కిన్.. కాసుల పంట గెర్కిన్ పంట సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. దోసకాయల మాదిరిగా ఉండే ఈ పంట.. మనకు కొత్త. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఇప్పగూడెనికి చెందిన రైతు కె.యాదవరెడ్డి ఈ పంట సాగుచేస్తూ లాభాలను గడిస్తున్నారు. అంతకుముందు వరి, ఇతర పంటలు వేసిన ఆయన అప్పుల పాలై.. వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో 1.2 ఎకరాల్లో గెర్కిన్ పంట వేశారు. వ్యవసాయ శాఖ గ్లోబల్ గ్రీన్ కంపెనీ సహకారంతో గెర్కిన్ విత్తనాలను ఇప్పించింది. గెర్కిన్ కాయలు పంట కాలం 75 రోజులు. పంట కాలం ముగిసే నాటికి 23 కోతలతో కాయలను తెంచాల్సి ఉంటుంది. గ్లోబల్ గ్రీన్ కంపెనీ వారే నేరుగా రైతుల దగ్గరి నుంచి కోనుగోలుచేసి వారికి డబ్బులను బ్యాంక్ ఖాతాలో జమచేస్తున్నారు. యాదవరెడ్డి మొత్తం 1.2 ఎకరాల విస్తీర్ణంలో వేసిన గెర్కిన్ కాయలను విక్రయించగా రూ.2,33,926 వచ్చాయి. పంట ప్రారంభం నుంచి కోసే వరకు పెట్టుబడి రూ.85,500 వరకు అయ్యింది. రైతుకు ఖర్చులన్నీ పోను రూ.1,48,426 నికర ఆదాయం వచ్చింది. ఈ పంటను యాసంగిలో సాగు చేసు కోవచ్చని అధికారులు చెబుతున్నారు. గెర్కిన్ కాయలు చూసేందుకు కీరాదోసకాయల్లా ఉంటాయి. వీటిని ఇతర దేశాల్లో స్నాక్స్గా అధికంగా వినియోగిస్తుం డడంతో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మనదగ్గర ఇవి వినియోగంలో లేవు. లాభాలు కురిపిస్తున్న కూరగాయల సాగు కూరగాయల సాగు ఎప్పుడూ లాభదాయకమే. అందులోనూ ఆధునిక పద్ధతిలో సాగు చేస్తే మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మమ్మద్నగర్కు చెందిన మహిపాల్రెడ్డి, భూపాల్రెడ్డి అన్నదమ్ములు.. తమకున్న ఐదెకరాలతో పాటు మరో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని గతంలో వరి సాగుచేసే వారు. పంట చేతికొచ్చేదంతా దైవాధీనంగా మారడంతో 18 ఎకరాల్లో బీర, కాకర, టమాట పంటల సాగు ప్రారంభించారు. పదెకరాల్లో బీర సాగును పందిరి, డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో సాగుచేస్తున్నారు. పందిరి ఒకసారి ఏర్పాటుచేస్తే 20 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. అలాగే కాకర పంటను 4 ఎకరాల్లో సాగు చేశారు. మరో 4 ఎకరాలలో 15 రోజుల క్రితమే టమాట వేశారు. బీర, కాకర సాగు ఖర్చులు ►బీర సాగుకు ఎకరాకు రూ.లక్ష ఖర్చు ఉంటుంది. ►నాలుగు నెలల్లో బీర ఎకరాకు 20 నుంచి 22 టన్నుల దిగుబడి వస్తుంది. ►మార్కెట్లో హాల్సేల్ ధర కిలోకు ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 పలుకుతోంది. దీంతో ఎకరాకు రూ. 4 లక్షల ఆదాయం వస్తోంది. ►పెట్టుబడి రూ.లక్ష పోను ఎకరంలో నాలుగు నెలల కాలంలో రూ.3 లక్షల ఆదాయం మిగులుతుందని చెబుతున్నారు. ►ఇక కాకరకు ఎకరానికి పెట్టుబడి రూ. 50 వేలు ఖర్చు కాగా పెట్టుబడిపోను రూ.60వేల నుంచి 70 వేలు మిగులుతుంది. ఏడాదికి 3 పంటలు వస్తాయి. -
ఆ జైలు భలే భలే.. అడిగినప్పుడల్లా వీడియో కాల్.. కోరినప్పుడల్లా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కోరినప్పుడల్లా బిర్యానీ.. ప్రత్యేక మెనూతో భోజనాలు.. అడిగిన వెంటనే వీడియోకాల్.. బోర్ కొడితే ఆసుపత్రిలో హెల్త్ చెకప్ పేరుతో బయట షికార్లు.. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న కొందరు ఖరీదైన ఖైదీలకు అందుతున్న రాజభోగాలివి.. ఈ సౌకర్యాలు కల్పించినందుకు జైలులో కొందరు అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ముడుపుల పంపకాల్లో తేడాలు రావడంతో ఇద్దరు అధికారులు పరస్పరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వ్యవహరంపై ఇటీవల అంతర్గత విచారణ చేపట్టిన జైళ్లశాఖ డీఐజీ మురళీబాబు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఈ నివేదిక మేరకు త్వరలో సంబంధిత అధికారులపై చర్యలుండే అవకాశాలున్నట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: ఎంతటి విషాదం.. స్కూటీపై వెళుతుండగానే గుండెపోటు.. అక్కడికక్కడే ♦వరంగల్ జైలు ఎత్తివేయడం, ఇటీవల కాలంలో ఎన్డీపీఎస్ కేసులు పెరిగిపోవడంతో రాష్ట్రంలో వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో చర్లపల్లి, కూకట్పల్లి జైలు నుంచి కొందరు రిమాండ్ ఖైదీలను సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నారు. దీంతో ఈ జైలు రిమాండ్ ఖైదీలతో కిక్కిరిసిపోయింది. ♦సుమారు 300 మంది నుంచి 350 వరకు ఖైదీల సామర్థ్యం కలిగిన ఈ జైలులో ప్రస్తుతం 600 పైగా ఖైదీలున్నారు.హైదరాబాద్ పరిధిలో వివిధ కేసుల్లో రిమాండ్ తరలించిన ఖరీదైన ఖైదీల తాకిడి పెరిగింది. ♦ఇది ఇక్కడి జైలు అధికారులకు వరంగా మారింది. వారికి నిబంధనలకు విరుద్ధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ♦ఇటీవల కూకట్పల్లికి చెందిన ఓ రియల్టర్ రిమాండ్ నిమిత్తం ఈ జైలుకు తలిస్తే జైలులోకి కొందరు అధికారులు రియల్టర్ రిమాండ్ ఖైదీకి సకల సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ♦ఓ పారిశ్రామికవేత్త హత్యకేసులో నిందితులను కూడా ఈ జైలుకే రిమాండ్లో ఉంచినట్లు తెలుస్తోంది. ఖరీదైన ఈ నిందితులకు కూడా రాజభోగాలు కల్పించి పెద్ద మొత్తంలో దండుకున్నారనే విమర్శలున్నాయి. జైలు నుంచే మొరం తవ్వకాలు ♦ఈ జైలు ఆవరణ నుంచి పెద్ద మొత్తంలో మొరం అక్రమ తవ్వకాలు జరిగాయి. భద్రతా సిబ్బంది కాపలా కాసే గోడకు అత్యంత సమీపంలోని జైలు స్థలం నుంచి భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టినా ఈ జైలు ఉన్నతాధికారులు కిమ్మనలేదు. ♦ఈ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మొక్కుబడిగా స్థానిక పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ కేసు ఊసేలేదు. సంబంధిత అధికారిపై కనీస చర్యలు లేవు. అంతర్గత విచారణ ♦అక్రమాలకు నిలయంగా మారిన సంగారెడ్డి జైలులో జరుగుతున్న వ్యవహారాలపై ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ఆశాఖ డీఐజీ ఇటీవల అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ♦ఈ అంతర్గత విచారణ తూతూ మంత్రంగా సాగిందా, జైలులో జరుగుతున్న అక్రమాలపై విచారణ పకడ్బందీగా జరిగిందా అనేది ఆశాఖ తదుపరి చర్యలబట్టి స్పష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నివేదిక ఇచ్చాం సాధారణ తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జైలును ఇటీవల ఆకస్మిక తనిఖీ చేశాం. ఇద్దరు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ చేపట్టి, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. నిబంధనల మేరకు జైలు క్యాంటీన్లో బిర్యానీ ఇస్తారు. వీడియోకాల్, హెల్త్ చెకప్లు ఉంటాయి. నిబంధనలు అతిక్రమించి ఈ సౌకర్యాలు కల్పించినట్లు మా దృష్టికైతే రాలేదు. – మురళీబాబు, జైళ్లశాఖ డీఐజీ -
కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు: వైరల్ కావడంతో ఆత్మహత్యకు ప్లాన్!
Hyderabad Engineer Ramnagesh Akubathini Who Arrested For Rape Threats To Virat Kohli's Daughter సాక్షి, హైదరాబాద్: కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన సంగారెడ్డి వాసి రాంనగేష్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని కేసు దర్యాప్తు చేస్తున్న ముంబైలోని వెస్ట్ రీజియన్ సైబర్క్రైమ్ పోలీసులు గుర్తించారు. నగేష్ వ్యాఖ్యలపై కేసు నమోదైన తర్వాత అనేకమంది అతడి ట్విట్టర్ హ్యాండిల్ను వదిలివెళ్లారని చెప్తున్నారు. అప్పటివరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్లు కూడా హఠాత్తుగా తప్పుకున్నారని వివరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే శ్రీనివాస్.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిట్టర్గా పని చేస్తున్నారు. ఈయన కుమారుడైన రాంనగేష్ హైదరాబాద్ ఐఐటీ నుంచి సాఫ్ట్వేర్ విద్యనభ్యసించాడు. బెంగళూర్ కేంద్రంగా పని చేసే ఓ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఉద్యోగం చేసిన నగేష్.. ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్ హ్యాండిల్ (@criccrazyygir) ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు గత మంగళవారం రాత్రి సంగారెడ్డికి వచ్చి నగేష్ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా నగేష్ ఫోన్ను పరిశీలించిన పోలీసులు అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు గుర్తించారు. దీనికోసం గూగుల్లో వివిధ విధానాలను పరిశీలించాడు. అయితే తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ కారణంగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నాడని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ముంబై చేరుకున్న రాంనగేష్ తండ్రి అతడి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. (చదవండి: బ్యాంక్ ఉద్యోగి: భార్య వేధిస్తోంది.. చనిపోతున్నా.. ) -
ప్రారంభించకుండానే.. గృహప్రవేశాలు
జోగిపేట(అందోల్): డ్రా పద్ధతిలో డబుల్బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఎంపికలో అవకతవకలు జరిగాయని ప్రచారం. అయితే జాబితా మారుతుందన్న అనుమానంతో అనధికారికంగా కేటాయించిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్లో చోటుచేసుకుంది. డాకూరులో రూ.5.65 కోట్లతో 104 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. ఈ నెల 6న లబ్ధిదారుల సమక్షంలో డ్రా పద్ధతిలో నంబర్లుసహా ఇళ్లను కేటాయించారు. 10న మంత్రి హరీశ్ సమక్షంలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. పలు కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దయింది. అదే సమయంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అధికారుల రీ సర్వేతో జాబితా మారుతుందన్న ఆందోళనలో ఆయా లబ్ధిదారులు పెట్టె, బేడ సదరుకొని కేటాయించిన ఇళ్లలోకి పరుగులు తీశారు. 2, 3 రోజులుగా వారంతా గృహ ప్రవేశాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఇళ్లను ప్రారంచేది ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
24 లక్షల ప్యాకేజీ.. ఛీ ఇలాంటి పని చేశావ్!
చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది కదా అని ఏది బడితే అది టైప్ చేయకండి. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అవుతున్నవారు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. మారు పేర్లు, నకిలీ ఖాతాలతో విద్వేషపు రాతలు రాసేసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేసి తప్పించుకోవచ్చు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తాజాగా ఆకుబత్తిని రామ్నగేష్ అనే యువకుడు ఇలాంటి నేరంలోనే పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన 23 ఏళ్ల రామ్నగేష్ బెంగళూరు చెందిన ఓ ఫుడ్ డెలివరీ యాప్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్కశర్మతో పాటు తొమ్మిది నెలల కుమార్తె వామికానూ ఉద్దేశించి ట్విటర్లో అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణతో ముంబై పోలీసులు రామ్నగేష్ను అరెస్ట్ చేశారు. టీ–20 ప్రపంచ కప్ భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడంతో అతడు వివాదాస్పద ట్వీట్ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఢిల్లీ ఉమెన్ కమిషన్ సైతం తీవ్రంగా పరిగణించింది. ఈ ట్వీట్పై కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్ క్రైమ్ పశ్చిమ విభాగం పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్ క్వార్టర్స్లో రామ్నగేష్ పట్టుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 354(ఏ), 506, 67(బీ) కింద అభియోగాలు మోపారు. మారు పేరుతో ట్విటర్ ఖాతా... రాంనగేశ్ ఈ ఏడాది ఏప్రిల్లో కొత్తగా ట్విట్టర్ ఖాతా తెరిచాడు. అది పాకిస్థాన్కు చెందిన ఖాతాగా నమ్మించేందుకు మార్పు చేర్పులు చేశాడు. ‘గప్పిస్తాన్ రేడియో’పేరుతో ఉన్న ట్విటర్ హేండిల్ ద్వారా కోహ్లిని బెదిరిస్తూ అక్టోబర్ 24న వివాదాస్పద ట్వీట్ చేశాడు. దీంతో స్పందించిన ఢిల్లీ పోలీసులు, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం రామ్నగేశ్ పనే అని తేల్చారు. మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్ పోలీసుస్టేషన్కు వచ్చిన ముంబై పోలీసులు దీనిపై సమాచారం ఇచ్చి రామ్నగేశ్ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు ఐఐటీ- హైదరాబాద్ రెండేళ్ల క్రితం గ్రాడ్యుయేషన్ చేసిన రామ్నగేశ్ ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీతో జాబ్ చేశాడు. అమెరికా వెళ్లాలన్న ఉద్దేశంతో నెల క్రితమే ఉద్యోగం మానేశాడు. క్రికెట్ను అమితంగా ఇష్టపడే తన కుమారుడు ఇలాంటి హేయమైన వ్యాఖ్యలు చేయడం పట్ల రామ్నగేశ్ తండ్రి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని వాపోయారు. చదువులో టాపర్ అయిన రామ్నగేశ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సన్నిహితులు తెలిపారు. కావాలని చేయలేదు.. అయితే రామ్నగేశ్ ఇదంతా కావాలని చేయలేదని పొరపాటున జరిగిందని శ్రీనివాస్ స్నేహితుడు కృష్ణమూర్తి తెలిపారు. ‘భారత్ మ్యాచ్ ఓడిపోయిందన్న బాధలో రాంనగేశ్ ఈ మెసేజ్ టైప్ చేశాడు. దీన్ని ట్వీట్ చేయాలని అతడు అనుకోలేదు. అదే సమయంలో ఫోన్ అతడి చేతిలో నుంచి జారిపడిపోయింది. జరిగిన నష్టాన్ని నివారించేందుకు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే ఆ మెసేజ్ వైరల్ అయింది. ఆ రోజు నుంచి రామ్నగేశ్ భయంగా రోజులు గడిపాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే వరకు కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియదు’అని కృష్ణమూర్తి వివరించారు. నకిలీ ఖాతాలతో ట్రోలింగ్ ఫేక్ ప్రొఫైల్స్తో సోషల్ మీడియాలో తాము ఏం చేసినా ఎవరూ పట్టుకోలేరన్న భ్రమలు సరికాదని ముంబై సైబర్ క్రైమ్ విభాగం డీసీపీ డాక్టర్ రష్మి కరాండికర్ అన్నారు. ఇలాంటి వారి ఆట కట్టించేందుకు అవసరమైన సాంకేతికత తమ దగ్గర ఉందని తెలిపారు. అనేక నకిలీ ఖాతాలతో రామ్నగేశ్ ట్రోలింగ్ చేసినట్టు గుర్తించామన్నారు. క్రిక్క్రేజీగర్ల్, రమన్హీస్ట్, పెళ్లకూతురుహియర్ ట్విటర్ హేండిల్స్ ద్వారా ట్రోలింగ్కు పాల్పడినట్టు తేల్చారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
పటాన్చెరుటౌన్(హైదరాబాద్): ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఆదివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పటాన్చెరు నుంచి ఆదివారం తెల్లవారుజామున సికింద్రాబాద్కు బయల్దేరిన బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చి యూటర్న్ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్లో చెరకు అన్లోడ్ చేసి కంకోల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ వెంకటరమణ, కండక్టర్ పద్మావతితో సహా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. లారీలో చెరకు అన్లోడ్ చేసేందుకు వచ్చిన మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ్నుంచి పరారయ్యాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. -
ఒక్కసారి అధికారం ఇవ్వండి
జోగిపేట/వట్పల్లి(అందోల్): టీఆర్ఎస్తో కలిసే పార్టీ కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చేరుకున్న సందర్భంగా హనుమాన్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. జోగినాథస్వామి ఆశీస్సులతో సీఎం గడీల కోటను బద్ధలుకొట్టాలని పిలుపునిచ్చారు. ఫామ్హౌస్, ప్రగతిభవన్ తప్ప.. రాష్టంలో పాలన పడకేసిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి పట్టంకడితే.. పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయిస్తే.. కేసీఆర్ ఇప్పటికి ఇచ్చింది 12వేలేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దళితబంధుకు నిధులను ఎక్కడి నుంచి ఇస్తాడో స్పష్టం చేయాలన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పిన సీఎం.. రూ.4 లక్షల కోట్లు అప్పులు చేశాడని ఆరోపించారు. అంబేడ్కర్ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. హుజూరాబాద్లో బీజేపీ గెలుస్తుందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పవర్కట్ చేస్తామని చెప్పారు. ఢిల్లీకి పోయి వంగి, వంగి దండాలు పెట్టి వచ్చిన కేసీఆర్.. పోయి ఫౌంహౌస్లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేయడానికే సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ అన్నారు. టీఆర్ఎస్ వచ్చాక యువతకు ఉద్యోగాలు వచ్చాయా? నిరుద్యోగ భృతి వచ్చిందా? అని ప్రశ్నించారు. -
వరదలతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోరా!
జోగిపేట (అందోల్): రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదల కారణంగా ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బుధవారం ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని శివ్వంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరదలతో పంటలు నష్టపోతే రాష్ట్రంలో ఏడేళ్లలో ఏఒక్క రైతును ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్ మీద అన్ని వర్గాల ప్రజలు కోపంతో ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో పంటలు పండించి కోట్లు సంపాదిస్తుంటే 50 ఎకరాలున్న రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. రైతులను సన్నరకం వడ్లు పండించాలని చెబుతూ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్లో దొడ్డు రకం పండిస్తున్నారని ధ్వజమెత్తారు. వరదల్లో నష్టపోయిన రైతలకు పరిహారం చెల్లించాలన్నారు. యువతకు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశారని, జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తానని చెప్పి ఎక్కడా ఇవ్వలేదని అన్నారు. పండుగలకు పర్మిషన్ కావాలా? హిందువులు పండుగ చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కావాలా? అని బండి సంజయ్ ప్రశ్నిం చారు. హిందువులు పండుగలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి కావాలనడం దుర్మార్గమని మండిపడ్డారు. వినాయక చవితి పండుగకు ఆంక్ష లు పెట్టొద్దని డీజీపీని హెచ్చరించారు. డ్రగ్స్ వాడుతున్న టీఆర్ఎస్ లీడర్లు టీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నాయకులు చాలా మంది మాదక ద్రవ్యాలు వాడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలు చేయిస్తామని బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్ ప్రచారానికి అమిత్షా... శుక్రవారం వినాయక చవితి పండుగ సందర్భంగా, 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగసభ సందర్భంగా రెండురోజుల పాటు పాదయాత్రకు బండి సంజయ్ విరామం పాటించనున్నారు. అక్టోబర్ 2న బాసరలో తొలివిడత పాదయాత్రను ముగించాలని తొలుత భావించినా, ఈ నెల 17న అమిత్షా సభ నేపథ్యంలో హుజురాబాద్ వైపు దానిని మార్చాలని భావిస్తున్నారు. -
నేను చనిపోలేదు మహాప్రభో..
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: బతికుండగానే తనకు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారని సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్కు చెందిన 74 ఏళ్ల షాపురం పండరిగౌడ్ గురువారం అదనపు కలెక్టర్ రాజర్షిషాను కలసి ఫిర్యాదు చేశారు. పంచాయతీ అధికారులు తనను మనస్తాపానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్ను ప్రతినెలా తీసుకుంటున్నానని, రేషన్షాపుల్లో కూడా ప్రతినెలా నిత్యావసరాలను తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తన ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా ఈ విషయం బయటపడిందని తెలిపారు. 2010 అక్టోబర్ 11న పంచాయతీ అధికారులు తన మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్ ‘సాక్షి’తో తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో..
పటాన్చెరు టౌన్: సమయానికి డబ్బులు చేతికందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తిచెందిన ఓ మహిళ.. ఐదేళ్ల కుమార్తెతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పటాన్చెరు పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దోవుర్ గ్రామానికి చెందిన రాజు పటాన్చెరు శాంతినగర్లో ఉంటూ ఆటోడ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. రాజు సోదరి వింధ్య (30)భర్త ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకోగా, అప్పటినుంచి ఐదేళ్ల కూతురు గ్లోరితో కలసి పటాన్చెరులోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటూ ఓ మెడికల్ కళాశాలలో నర్సుగా పని చేస్తోంది. బుధవారం వింధ్య, తన భర్తకు సంబంధించిన డబ్బుల విషయంలో నారాయణఖేడ్ వెళ్దామని శాంతినగర్లో ఉండే సోదరుడు రాజు ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత డబ్బులు అప్పుడే రావడం లేదని తెలుసుకొని, సోదరుడికి చెప్పి వెళ్లిపోయింది. అలా వెళ్లిన వింధ్య.. కూతురు గ్లోరిని తీసుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని వింధ్య సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణలో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా
డబ్ల్యూడీసీడబ్ల్యూ పటాన్చెరువు అంగన్వాడీల్లో 32 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. పటాన్ చెరువు పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 32 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్–08, అంగన్వాడీ ఆయా–24. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్లు మించకుండా ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరాఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► వెబ్సైట్: https://mis.tgwdcw.in or https://wdcw.tg.nic.in యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్వాడీల్లో 57 పోస్టులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ విభాగం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 57 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్లు–08, అంగన్వాడీ ఆయాలు–45, మినీ అంగన్వాడీ టీచర్లు– 04. ► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఆలేరు–18, భువనగిరి–14, మోత్కూర్–10, రామన్నపేట–15. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై, స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: 26.08.2021 నుంచి 28.08.2021 వరకూ. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021 ► వెబ్సైట్: https://wdcw.tg.nic.in డీహెచ్ఎస్, జగిత్యాలలో 10 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన జగిత్యాల జిల్లా హెల్త్ సొసైటీ.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► పోస్టుల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్–04, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫార్మసిస్ట్–05. ► సివిల్ అసిస్టెంట్ సర్జన్: అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ► ల్యాబ్ టెక్నీషియన్: అర్హత: ఇంటర్మీడియట్తోపాటు ఫార్మసీలో డిప్లొమా/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఫార్మసిస్ట్: అర్హత: ఇంటర్మీడియట్తోపాటు డీఎంఎల్టీ/బీఎస్సీ(ల్యాబ్ టెక్నీషియన్) ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో మెరిట్ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, జగిత్యాల చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021 ► వెబ్సైట్: https://jagtial.telangana.gov.in మేనేజ్, హైదరాబాద్లో వివిధ ఖాళీలు హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► పోస్టుల వివరాలు: డైరెక్టర్(అగ్రికల్చర్ మార్కెటింగ్)–01, రీసెర్చ్ అసోసియేట్ (అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్)–01, రీసెర్చ్ అసోసియేట్(నాలెడ్జ్ మేనేజ్మెంట్)–01, జూనియర్ స్టెనోగ్రాఫర్–01, అసిస్టెంట్ క్యాషియర్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ డైరెక్టర్(అడ్మినిస్ట్రేషన్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్), రాజేంద్రనగర్, హైదరాబాద్–500030, హైదరాబాద్, తెలంగాణ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: https://www.manage.gov.in టీఎస్ పోస్టల్ సర్కిల్లో 55 స్పోర్ట్స్ కోటా పోస్టులు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ► పోస్టుల వివరాలు: పోస్టల్ అసిస్టెంట్–11, సార్టింగ్ అసిస్టెంట్–08, పోస్ట్మ్యాన్/ మెయిల్ గార్డ్–26, ఎంటీఎస్–10. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత స్థానిక భాష వచ్చి ఉండాలి. ► వయసు: పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పోస్ట్మ్యాన్/మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ► క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బేస్బాల్, బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్ తదితరాలు. ► క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ► ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాథమ్యాల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: https://tsposts.in -
పొలిటీషియన్లంటే.. గెస్ట్ ఆర్టిస్టులు అనుకుంటరు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు: ‘‘ప్రభుత్వ పథకాల అమల్లో అవాంతరాలు ఉంటాయి. కొత్త ఆలోచనతో వచ్చే పథకాల విషయంగా.. అధికారుల నుంచి అమలు చేయలేమనే సమాధానమే మొదట వస్తుంది. రాజకీయ నాయకులు గెస్ట్ ఆర్టిస్టులని వారు భావిస్తారు. వారే పర్మినెంట్ ఆర్టిస్టులుగా భావిస్తారు..’’ అని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. మార్పు కోరడం అంత సులువైనది కాదని పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, లెక్చరర్లతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సక్సెస్కు షార్ట్కట్ ఉండదు మీ రాజకీయ జీవితంలో విఫలమైన ఘటనలు ఉన్నాయా అని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు శ్రీభరత్ ప్రశ్నించగా.. జీవితంలో వైఫల్యం చెందని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరని కేటీఆర్ బదులిచ్చారు. ‘‘ఫెయిల్యూర్ను సెలబ్రేట్ చేసుకోవాలి. మార్గం ఏదైనా కష్టపడి పనిచేయడానికి మించినది ఏదీ లేదు. సక్సెస్కు షార్ట్కట్ ఉండదు. నా జీవితంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఆలస్యమైనప్పుడు కొంత బాధేసింది. ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇటీవల కేంద్ర మంత్రిని కలిసి.. హైదరాబాద్– బెంగూళూరు మధ్య డిఫెన్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరాను. కానీ యూపీలో పెట్టాలని నిర్ణయం జరిగిపోయిందని కేంద్రమంత్రి చెప్పారు. కారణం యూపీలో ఎంపీ సీట్లు ఎక్కువ, ఇక్కడ తక్కువ.’’ అని తెలిపారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరూ ఇవ్వలేరు రాష్ట్రంలో నియామకాల మాటేమిటని ఓ లెక్చరర్ ప్రశ్నించగా.. నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రైవేట్ ఎంప్లాయిమెంట్పై దృష్టి సారిస్తోందన్నారు. టీఎస్ఐపాస్తో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. పొలిటీషియన్లు తక్కువనే భావన ఉంటుంది పథకాల అమల్లో ఎదుర్కొన్న అవరోధాలేమైనా ఉన్నాయా అని ఓ విద్యార్థిని కేటీఆర్ను ప్రశ్నించింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘అధికారుల్లో అయితే తాము చాలా చదువుకున్నామని, పొలిటీషియన్లు తక్కువనే భావన ఉంటుంది. ఏదైనా కొత్త పథకాన్ని అమలు చేయాలని చెప్పగానే.. ‘అది సాధ్యం కాదు’ అనే సమాధానం ఐఏఎస్ అధికారుల నుంచి వస్తుంది. సహజంగానే ఈ రకమైన మైండ్సెట్ అందరిలోనూ ఉంటుంది. మార్పు కోరడం అంత సులువైంది కాదు. అది మానవ సహజ లక్షణం. అయితే బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులను గెస్ట్ ఆర్టిస్టులుగా భావిస్తారు. ఐదేళ్ల కాలానికి వచ్చిపోతారనే భావననే దీనికి కారణం. వారేమో పర్మనెంట్ ఆర్టిస్టులుగా భావిస్తుంటారు..’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సహా విద్యార్థులు, లెక్చరర్లు అందరూ గొల్లుమని నవ్వారు. నేను ఐఏఎస్ కావాలనుకున్నారు మరికొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. తాను ఐఏఎస్ అవ్వాలన్నది తన తండ్రి కేసీఆర్ కోరికగా ఉండేదని చెప్పారు. ఢిల్లీలో చదువుకునేందుకు వెళ్లానని, మేనమామ ఒకరు ఇచ్చిన సలహాతో వదిలేశానని తెలిపారు. తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశానని.. ఉద్యోగ రీత్యా చాలా దేశాలు తిరిగానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన తండ్రి కేసీఆర్కు చెప్పకుండానే 2008లో కార్యకర్తగా టీఆర్ఎస్లో చేరి, రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. దళితబంధుతో ఆర్థిక స్వావలంబన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధిస్తాయని కేటీఆర్ చెప్పారు. గతంలో రైతుబంధు ప్రకటించినప్పుడు విమర్శలు వచ్చాయని.. కానీ ఇప్పుడా పథకాన్ని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. కేసీఆర్ దేన్నైనా సంకల్పిస్తే సాధించి తీరుతారని.. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ సంక్షేమ పథకాలను కొనసాగించేలా రూపకల్పన చేస్తున్నారని వివరించారు. ‘మోదీ ఇచ్చే 15 లక్షలకు’ దరఖాస్తు చేసుకోండి బీజేపీపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సాక్షి, హైదరాబాద్: ‘ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణ బీజేపీ దరఖాస్తులు స్వీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నా. జన్ధన్ ఖాతాల్లోకి ధనాధన్ లబ్ధి జరిగేందుకు తెలంగాణవాసులందరూ తమ దరఖాస్తులను బీజేపీ నాయకులకు పంపాల్సిందిగా కోరుతున్నా’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన ట్వీట్కు కేటీఆర్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. -
900 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 900 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని సత్వార్ గ్రామ సమీపంలోని కోహినూర్ దాబా వద్ద బియ్యం లారీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు.. పోలీసు, విజిలెన్స్ అధికారుల సహాయంతో తనిఖీ చేయగా మూడు లారీల్లో 900 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా హైదరాబాద్ నుంచి గుజరాత్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి ఎస్డబ్ల్యూసీ గోదాముకు తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా బియ్యం లోడ్ చేసి ఉన్నందున ఓ లారీ డ్రైవర్ గుల్జార్, యజమాని ఇర్ఫాన్, మరో లారీ డ్రైవర్ అవేష్జీ, యజమాని ఇస్మాయిల్బాయ్, మరో లారీ డ్రైవర్ షకీల్ అహ్మద్, యజమాని ఇస్మాయిల్ మతకియాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు సురేశ్ కుమార్, ఎండీ షఫీ, శ్రీనివాస్, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. -
అతివేగానికి ఐదుగురు బలి
జోగిపేట (అందోల్)/ కొల్చారం(నర్సాపూర్): అతివేగం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. సంగారెడ్డి నుంచి వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పాస్టర్ లూకా (46), ఆయన భార్య దీవెన (44), అదే జిల్లా సంగాయిపేటకు చెందిన అంబదాస్ (45), ఆయన భార్య పద్మ (30), వారి కుమారుడు వివేక్ (5) అక్కడిక్కడే మృతి చెందారు. అపెండిసైటిస్తో బాధపడుతున్న వివేక్కు నాలుగు రోజుల కింద సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. శుక్రవారం డిశ్చార్జి కావడంతో పాస్టర్ లూకాకు చెందిన కారులో వారంతా తిరుగుపయనమయ్యారు. ఇంతలోనే వారిని మృత్యువు కబళించింది. కారు అతివేగంగా నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ బాలాజీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చర్చిలో ఇరు కుటుంబాలకు స్నేహం అంబదాస్ కుటుంబం ప్రతి ఆదివారం రంగంపేటలోని చర్చిలో ప్రార్థనలకు వస్తుండేది. ఈ క్రమంలో ఆ చర్చిలోని పాస్టర్ లూకా, అంబదాస్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. సంగారెడ్డి ఆసుపత్రి నుంచి తమ కుమారుడి డిశ్చార్జికి వెళ్లాలని చెప్పగా పాస్టర్ లూకా తన కారు తీసుకొచ్చాడు. రెండు కుటుంబాల్లో విషాదం అంబదాస్–పద్మ దంపతులకు వినయ్, వివేక్ ఇద్దరు కుమారులు. ప్రమాదంలో అంబదాస్, పద్మ, వివేక్ చనిపోవడంతో వినయ్ అనాథగా మిగిలాడు. పాస్టర్ లూకా–దీవెన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. తల్లిదండ్రుల మృతితో ఆ నలుగురికీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. సీటు బెల్ట్ ధరించి ఉంటే.. ముందు సీటులో కూర్చున్న పాస్టర్ దంపతులు సీటు బెల్టు ధరించలేదు. సీటు బెల్టు ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోకపోయేవారని అంటున్నారు. సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోలేదని, ఒకవేళ అవి తెరుచుకుని ఉం టే ప్రమాద తీవ్రత ఇంతగా ఉండేది కాద ని స్థానికులు చెబుతున్నారు. కాగా, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృత్యు రహదారి సంగారెడ్డి–నాందేడ్–అకోలా హైవేకు మృత్యు రహదారి అనే పేరుంది. చౌటకూరు నుంచి శివ్వంపేట వరకు ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు యాభైకి పైగా ప్రమాదాలు జరిగాయి. రహదారి విస్తరణ పనులు మొదలుకాక ముందు డబుల్ రోడ్డుగా ఉండేది. అప్పుడు తరచుగా ప్రమాదాలు జరిగేవి. ఇదీ లూకా నేపథ్యం పాస్టర్ లూకాది సంగారెడ్డి జిల్లా శివంపేట మండలం గూడూరు. 20 ఏళ్ల కింద రంగంపేటకు వచ్చి స్థిరపడ్డాడు. తొలుత చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని చర్చి ప్రారంభించాడు. ఆ తర్వాత సొంతంగా స్థలం తీసుకొని చర్చి నిర్మించాడు. చర్చికి వచ్చేవారికి దీవెనయ్యగా సుపరిచితుడు. డివైడర్లు ఉంటే.. ప్రాణాలు దక్కేవి నాందేడ్–అకోలా జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా డివైడర్ల ఏర్పాటు చేయలేదు. పనులు కూడా పూర్తికాలేదు. దీంతో అన్ని వాహనాలు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. ప్రమాదస్థలి వద్ద రోడ్డు వెడల్పుగానే ఉంది. లారీ ఎడమవైపు వస్తుండగా, కుడివైపున కారు ఢీకొంది. ఎడమవైపు వెళ్లాల్సిన కారు కుడి వైపు ఎందుకు వెళ్లిందో..? అతి వేగంగా వెళ్లడమా..? లేదా ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతే ఈ ఘటన జరిగిందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. ‘భయంగా ఉందిరా..’ అంబదాస్ ఆటోడ్రైవర్ కాగా, భార్య పద్మ కూలి పనులకు వెళ్తుంటుంది. చుట్టుపక్కల వారిని తల్లో నాలుకగా ఉంటారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో కొడుకు వినయ్కు ఫోన్చేసి తనకు భయం అవుతోందని, సంగారెడ్డికి రమ్మని చెప్పగా.. జోగిపేట వరకు వస్తానని, అక్కడ కారు దిగితే బస్సులో వెళ్దాం అని తన తండ్రితో వినయ్ చెప్పాడు. అయితే జోగిపేట రాకముందే దారుణమైన ప్రమాదం జరిగింది. -
ఏమంత కష్టమొచ్చె తల్లీ..
సంగారెడ్డి అర్బన్: పిల్లలకు నయం కాని అనారోగ్యం, ఆస్పత్రులకు అవుతున్న ఖర్చులు.. మనస్తాపంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చున్నీతో ఉరేసి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇండియన్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్న శివశంకర్ ఏడు నెలల కింద ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చి భార్య జోస్నా, ఇద్దరు కుమారులతో కలసి సంగారెడ్డి జిల్లా కేంద్రం శాంతినగర్లో నివాసం ఉంటున్నాడు. పెద్దబాబు రుద్రాక్షు (6)కు పుట్టినప్పటి నుంచి కిడ్నీల సమస్య ఉంది. చిన్నబాబు దేవాన్షు(4)కు మోషన్ (మలవిసర్జన సరిగా లేకపోవడం) సమస్యతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. డాక్టర్లు కూడా ఈ జబ్బులు నయం కావని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జోస్నా తన ఇద్దరు పిల్లలను చంపి తానూ చనిపోవాలని నిర్ణయించుకుంది. భర్త శివశంకర్ శుక్రవారం ఉదయం బ్యాంకుకు వెళ్లిన సమయం చూసి మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కుమారులను చున్నీతో ఉరేసింది. ఇంటికి తాళం వేసి పట్టణ పరిధిలోని మహబూబ్సాగర్ చెరువు వద్దకు వెళ్లి భర్తకు వాట్సాప్లో ఫొటో పెట్టి చెరువులో దూకింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఆమెను పైకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న శివశంకర్ చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా, ఇద్దరు పిల్లలు బెడ్పై విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే భార్య, పిల్లలను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు పిల్లలిద్దరూ మృతి చెందారని నిర్ధారించారు. ప్రస్తుతం జోస్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శివశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన కన్నతల్లి.. ఆపై ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా శాంతినగర్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒక తల్లి.. తన ఇద్దరు చిన్నారులను ఉరేసి చంపింది. ఆ తర్వాత తాను కూడా.. చెరువులోకి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న కొంత మంది జాలరులు మహిళను గమనించారు. వెంటనే వారు.. చెరువులో దూకి మహిళ ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు!
అతనికి చెట్లంటే ప్రాణం. పర్యావరణ ప్రేమికుడు. ఏటా వందల సంఖ్యలో మొక్కలు నాటుతాడు. అడవులను పెంచే ఉద్దేశంతో విత్తన బంతులు తయారుచేసి చెట్లు లేనిచోట విసురుతాడు. చిన్న మొక్కనూ ఎండనివ్వడు. పెద్ద చెట్లను నరకనివ్వడు. అతనే సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్తాపూర్కు చెందిన జ్ఞానేశ్వర్. ఇటీవల తన సొంత గ్రామంలో గ్రామస్తులు పెద్ద రావిచెట్టును నరికివేశారు. అది తెలుసుకుని వెంటనే జేసీబీ సాయంతో పెద్ద గుంత తవ్వి మళ్లీ ఆ చెట్టును నాటించాడు. రోజూ నీళ్లుపోస్తూ దానికి ప్రాణం పోస్తున్నాడు. ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే పర్యావరణానికి హాని జరుగుతుందని.. చెట్లను నరకొద్దని సూచిస్తున్నాడు. -
మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు
తెలంగాణ పల్లెలు మురిశాయి. పారిశుధ్యం, స్వచ్ఛత, అభివృద్ధి.. తదితర అంశాల్లో వరించిన అవార్డులతో మెరిశాయి. జాతీయ స్థాయిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్పీ)’ కింద ఏటా అందజేసే జాతీయ పంచాయతీ అవార్డులు 2021 సంవత్సరానికి.. తెలంగాణను ఏకంగా 12 వరించాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఎంపిక చేసిన అవార్డుల్లో రాష్ట్రానికి 12 ప్రకటించగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 మండల పరిషత్లు, 5 గ్రామ పంచాయతీలకే ఏడు దక్కడం విశేషం. మొత్తం అవార్డుల్లో సంగారెడ్డి జిల్లాకు ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు లభించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ధర్మారం మండలాలకు ఉత్తమ మండల పరిషత్ అవార్డులు దక్కాయి. మిగతా 9 గ్రామ పంచాయతీ అవార్డుల్లో ఐదు అవార్డులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కడం విశేషం. సిద్దిపేట జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలకు ఆయా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఆయా అవార్డుల కింద కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో పాటు నగదు మొత్తాన్ని నేరుగా ఆయా స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయనుంది. కేంద్ర పురస్కారాలను పొందిన మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ప్రత్యేకతలు.. ఏయే కేటగిరీల్లో అవార్డులు పొందాయనే వివరాలు.. మల్యాల.. మెరిసేనిలా గ్రామం: మల్యాల జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామం అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం జిల్లాకే శోభ తెచ్చే స్థాయిలో ఉంది. గ్రామం మొత్తం ఆకుపచ్చని కళను సంతరించుకుంది. ఇక, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహించే విషయంలో ఈ గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. చక్రాపూర్కు చక్కని గుర్తింపు గ్రామం: చక్రాపూర్ జిల్లా: మహబూబ్నగర్ మూసాపేట(మహబూబ్నగర్ జిల్లా): దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికైం/న చక్రాపూర్లో 286 నివాసాలు, 1,638 మంది జనాభా ఉంది. సర్పంచ్ కొండం పల్లిపల్లి శైలజ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. గ్రామంలోని ఇంటించి నుంచి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేసే విషయంలో ఈ గ్రామం ముందంజలో ఉంది. ఇప్పటికే ఇక్కడ మొదటి విడత తయారుచేసిన ఎరువును స్థానికంగా రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిట్టపల్లి.. మిలమిల గ్రామం: మిట్టపల్లి; జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం పారిశుధ్యం, పరిశుభ్రత, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇవే అంశాల్లో ఈ గ్రామం సశక్తికరణ్ అవార్డు అందుకుంది. అలాగే, ఇక్కడ స్వయం సహాయక సంఘాలు మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయి. వ్యర్థాల సేకరణ, నిర్వహణలో ఈ గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. రుయ్యాడి.. ఐక్యత దండి గ్రామం: రుయ్యాడి, జిల్లా: ఆదిలాబాద్ తలమడుగు: పారిశుధ్య పనుల సమర్థ నిర్వహణలో రుయ్యాడి గ్రామం సశక్తికిరణ్ అవార్డును దక్కించుకుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఇంటిపన్ను వంద శాతం వసూలు చేయడం, మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం, డంపిగ్యార్డులో చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువుగా మార్చడం, వానపాములను పెంచడం, ఆన్లైన్లో జనన, మరణ, వివాహాల ధ్రువీకరణపత్రాలు అందించడం, పంచాయతీకి వచ్చే నిధులు ఎలా ఖర్చు చేయాలి?, ఏ సమయంలో, ఎంత ఖర్చు చేయాలి? అనే అంశాలపై అధికారులు, సర్పంచ్ పోతారెడ్డి చేసిన కృషికి గాను జాతీయస్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఐక్యత విషయంలోనూ రుయ్యాడి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముస్లింల పండుగైన మొహర్రంను గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్వహిస్తారు. వేడుకలు ముగిసే వరకు మద్యానికి దూరంగా ఉంటారు. మొహర్రం అంటేనే రుయ్యాడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిందంటే ఇక్కడ వేడుకలు ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. ధర్మారం.. పనితీరులో బంగారం మండలం: ధర్మారం (మండల పరిషత్), జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంగా పెద్దపల్లి ఆవిర్భవించిన తర్వాత మండల పరిషత్ కేటగిరీలో ఇప్పటివరకు వరసగా కాల్వశ్రీరాంపూర్, మంథని, సుల్తానాబాద్ అవార్డులను కైవసం చేసుకోగా ఈసారి కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ రాజ్ అవార్డును ధర్మారం మండల పరిషత్ కార్యాలయం దక్కించుకుంది. మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, తదితర అంశాలలో పనితీరు మెరుగ్గా ఉండడంతో ఈ అవార్డు దక్కింది. ధర్మారం మండల పరిషత్కు రూ.25 లక్షల పారితోషికం దక్కనుంది. సుందిల్ల.. డబుల్ ధమాకా గ్రామం: సుందిల్ల, జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగిరి మండలం సుందిల్ల గ్రామ పంచాయతీ రెండు అవార్డులను పొందింది. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ) అవార్డుతోపాటు నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ (ఎన్డీఆర్జీజీఎస్పీ) అవార్డును దక్కించుకుంది. అప్పటి కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీపీఓ సుదర్శన్ సూచనల మేరకు గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామాభివృద్ధిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఆలోచనల మేరకు ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాభివృద్ధికి అనుసరించిన పద్ధతులను అప్లోడ్ చేయడంతో అవార్డులకు ఎంపికైంది. జీపీడీపీ అవార్డు కింద రూ.5లక్షలు, ఎన్డీఆర్జీజీఎస్పీ కింద రూ.10లక్షల పారితోషికాన్ని సుందిల్ల పంచాయతీ పొందనుంది. కోరుట్ల.. అభివృద్ధి నలుదిశలా.. మండలం: కోరుట్ల (మండల పరిషత్) జిల్లా: జగిత్యాల కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండల పరిషత్కు జాతీయ స్థాయి దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారం దక్కింది. మండల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్, పచ్చదనం పెంపు, ఉపాధి హామీ పనుల నిర్వహణ, కూలీల జీతభత్యాల పెంపు, మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు వంటి 52 అంశాల్లో ఉత్తమ ప్రగతిని కనబరిచిన క్రమంలో ఈ మండలానికి విశిష్ట అవార్డు దక్కింది. పిల్లల అభివృద్ధి.. వికాసం గ్రామం: మోహినికుంట, జిల్లా: రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లల అభివృద్ధి, మానసిక వికాసానికి సంబంధించిన అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు.. చిన్నారుల స్నేహపూర్వక అభివృద్ధి ప్రణాళిక విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం జాతీయ అవార్డుకు ఎంపికైంది. పై అంశాలతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో పిల్లల పార్క్, ఓపెన్ జిమ్, సమావేశాలు, స్పోకెన్ ఇంగ్లిష్, పాఠశాలలో వివిధ స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారని ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ‘సిరి’దాస్నగర్ గ్రామం: హరిదాస్నగర్ జిల్లా: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సహజ వనరులు, హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనుల నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్కు అవార్డు లభించింది. పదేళ్ల క్రితం హరిదాస్నగర్ జాతీయ స్థాయి నిర్మల్ పురస్కార్ అవార్డును అందుకుంది. పదేళ్లలో అభివృద్ధి పనులతో గ్రామం రూపురేఖలు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో ఈ గ్రామం వంద శాతం విజయవంతమైంది. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ అవలంబిస్తున్న నీటి నిల్వ పద్ధతులు పేరొందాయి. పర్లపల్లి.. కేరాఫ్ సమగ్రాభివృద్ధి గ్రామం: పర్లపల్లి, జిల్లా: కరీంనగర్ తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి ఆదర్శ గ్రామంగా మరో అరుదైన గౌరవం దక్కింది. అన్ని వర్గాలు సమగ్రంగా అభివృద్ధి చెందిన పంచాయతీగా గుర్తించి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్దయాళ్ సశక్తి కరణ్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామంలో 5 వేల జనాభా ఉండగా, ప్రజల జీవన స్థితిగతులు, సమగ్ర అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సద్వినియోగం, గ్రామ సమగ్రాభివృద్ధి అంశాలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్మశానవాటిక, నర్సరీలు, పల్లె ప్రకృతివనం నిర్మించారు. అర్హులైన గ్రామీణులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిలో గ్రామస్తులు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నట్లు కేంద్ర బృందం నిర్ధారించింది. పాలనలో భేష్.. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి (జిల్లా పరిషత్) సంగారెడ్డిఅర్బన్: అభివృద్ధి పరిపాలన విభాగం (జనరల్ కేటగిరి)లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగారెడ్జి జిల్లా పరిషత్కు దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ అవార్డు దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా పరిషత్ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా పరిషత్ సిబ్బంది ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేయడం ఇక్కడ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. -
సదాశివపేట పోలీసుల ఓవరాక్షన్
-
సంగారెడ్డి: బొలెరో డ్రైవర్పై.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో బొలెరో వాహన డ్రైవర్పై అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. బూటు కాలితో తంతు.. లాఠీలతో చితకబాదారు. లబోదిబోమని మొత్తుకుంటున్నా వినకుండా ఇష్టం ఉన్నట్లు కొట్టారు. ఇంతకు ఆ డ్రైవర్ చేసిన పాపం ఏంటో తెలుసా.. పోలీసులు వాహనం ఆపమనగానే ఆపకుండా.. కాస్తా ముందుకు వెళ్ళి ఆపడం. దానికే రెచ్చిపోయిన సదాశివపేట పోలీసులు ఆ అమాయకునిపై తమ ప్రతాపం చూపారు. ఆ వివరాలు.. సదాశివపేటకు చెందిన వాజిద్ బొలేరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా అయ్యప్ప స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన రహదారిపై సడెన్గా పోలీసులు రావడంతో వాహనాన్ని కాస్తా దూరంగా తీసుకెళ్లి ఆపాడు వాజిద్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ అతని చేతిలో ఉన్న లాఠీతో చితకబాదాడు. అక్కడితో ఆగకుండా బూటు కాలితో తంతూ.. బండ బూతులు తిట్టాడు. పోలీసుల దాడిలో వాజిద్కి గాయాలయ్యాయి. ఓవైపు రాష్ట్రంలో ప్రైండ్లీ పోలీస్ అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటే... కింది స్థాయిలో అమలు కాకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ‘డీజిల్కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’ -
తెలుంగాణపురం ఎక్కడుందో తెలుసా?
త్రిలింగ దేశం.. ఆ తర్వాత తిలింగరాజ్యం.. కొందరు మహమ్మదీయ రాజులు తిలింగ్, తెలింగ అని.. మరికొందరు విదేశీయులు ట్రిలింగాన్ అని.. వేర్వేరు సామ్రాజ్యాలు, కాలాల్లో ఇలా రకరకాల పేర్లతో సంబోధించారు. ఆ ప్రాంతమే ప్రస్తుత తెలంగాణ. మరి మొదటిసారి తెలంగాణ అన్న పదాన్ని ఎవరు, ఎప్పుడు వాడారో తెలుసా? ఇప్పుడు దానికి సంబంధించిన శాసనమే ఆసక్తి రేపుతోంది. ఆరు శతాబ్దాల క్రితం వేయించిన ఆ శాసనం ఇరుకు సందులో ఇళ్ల మధ్య బందీ అయిపోయింది. దాని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా పోయింది. కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు రికార్డు చేసినా, అది కొంతమందికే పరిమితమైంది. దేశంలో 29వ రాష్ట్రం (కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారకముందు)గా ఆవిర్భవించిన తెలంగాణ పేరును తొలిసారి లిఖితపూర్వకంగా వాడింది ఈ శాసనంలోనే. అంటే ‘తెలంగాణ’అస్తిత్వానికి తొలి నిదర్శనం అన్నమాట. - సాక్షి, హైదరాబాద్ ‘తెలుంగాణపురం’ఎక్కడుంది? ఈ ప్రశ్నకు...‘అది మన రాష్ట్రం పేరు, ఆ పేరుతో ఊరు కూడా ఉందా?’అన్న ఎదురు ప్రశ్నే సమాధానంగా వస్తుంది. కానీ ఆ పేరుతో ఓ ఊరు కూడా ఉండేది.. అది ఎక్కడో కాదు... భాగ్యనగర శివార్లలోనే. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ పురోగతికి ఇప్పుడు చిరునామాగా కనిపిస్తున్న తెల్లాపూరే... ఒకప్పటి తెలుంగాణపురం. కాలక్రమంలో తెలుంగాణపు రం కాస్తా క్రమంగా తెల్లాపూర్గా మారిపోయింది. తెలంగాణ అన్న పదం ఉన్న తొలి తెలుగు శాసనం వెలుగుచూసింది ఈ గ్రామంలోనే. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోకి వస్తుంది. 604 ఏళ్ల కిందట.. బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 1417లో విజయనగర రాజు రెండో దేవరాయల అధీనంలో ఉన్న పానగల్లు కోట మీద దాడికి బయలుదేరాడు. దారిలో కనిపించిన హిందూ సంప్రదాయ కట్టడాలను ధ్వంసం చేయటం ఆ సైన్యం పనిగా పెట్టుకుంది. ఈ క్రమంలో పలు మందిరాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో తెల్లాపూర్ కూడా ప్రణాళికాబద్ధంగా ఎదిగిన పట్టణం. తెలుంగాణ పురమన్న పేరుతో అభివృద్ధి చెందిన ప్రాంతం. కొందరు విశ్వకర్మలు ఈ ప్రాంతంలో మంచి పనిమంతులైన శిల్పులుగా పేరుపొంది ఉన్నారు. వారు నగల తయారీలోనే కాకుండా, నగర ప్రణాళికల రూపకల్పనలోనూ నేర్పు ఉన్నవారు. అందులో కొండమీది మల్లోజు, అతని కొడుకులు నాగోజు, అయ్యలోజు, వల్లబోజు తదితరులు ఇక్కడ పెద్ద మామాడి తోటను నిర్వహించేవారు. దానికి నీటి కోసం విశాలమైన దిగుడు బావి తవ్వించి ఏతాం పద్ధతిలో నీటి సాగుకు వాడేవారు. పానగల్లు కోటపై దాడి కోసం ఫిరోజ్ షా ఇదే మార్గంలో వెళ్లనున్నారని తెలిసి, వారు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఫిరోజ్ షా భార్యకు బంగారు పూదండలు దిద్దిన కంఠాభరణం, బంగారు గాజులు అందంగా తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఆ మల్లోజు వంశస్తులు ప్రశస్తి శాసనం చెక్కి దిగుడుబావి పైన ఏతాం కోసం ఏర్పాటు చేసిన రాతి స్తంభాల మధ్య ఏర్పాటు చేయించారు. అదే ఈ శాసనం. అందులో ఈ ప్రాంతాన్ని తెలుంగాణపురంగా పేర్కొన్నారు. ఆ శాసనంపై తెలుగులో24 పంక్తుల వివరాలున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా పురావస్తు శాఖలో స్తపతి ఈమని శివనాగిరెడ్డి ఈ శాసనాన్ని 2008లో పరిశీలించారు. అప్పటికే బావిని సింహభాగం పూడ్చేశారు. కొన్ని మెట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పైగా గిరక కోసం ఏర్పాటు చేసిన రెండు రాతి శిలలు పడిపోయే పరిస్థితిలో ఉండటంతో ఆయన వాటిని క్రమపద్ధతిలో పూర్వపు స్థితిలో తిరిగి ఏర్పాటు చేయించారు. ఆ శిలల దిగువన కాకతీయ శైలిలో కళాత్మకంగా చెక్కిన భారీ రాతి బేస్ ఉంది. ఆ తర్వాత మొత్తం బావిని స్థానికులు పూడ్చేశారు. ఇప్పుడు దాని చుట్టూ ఇళ్లు వెలియటంతో పూర్తి ఇరుకు స్థలంలో ఆ శాసనం బందీగా ఉండిపోయింది. అప్పట్లోనే శివనాగిరెడ్డి... నేతలను తీసుకెళ్లి దీన్ని చూపించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి ‘తెలంగాణ అన్న పేరును వాడిన తొలి శాసనానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం దక్కాలి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఇంత పెద్ద ఉద్యమంతో ఏర్పడ్డ రాష్ట్రంలో.. రాష్ట్రం పేరును తొలిసారి వాడిన శాసనంగా దానికి అందలం దక్కాల్సి ఉంది. -శివనాగిరెడ్డి, చరిత్రకారులు -
చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి
సాక్షి, సంగారెడ్డి: మొసలి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో ఈ ఘటన జరిగింది. ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు (45) మంజీరా నదిలోకి దిగి గేదెలను కడుగుతుండగా ఒక్కసారిగా మొసలి అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో ఒడ్డుపై ఉన్న మరికొంత మంది రైతులు గట్టి అరుస్తూ కర్రలతో మొసలిపై దాడి చేసే యత్నం చేయగా విఫలమయ్యారు. వారంతా చూస్తుండగానే మొసలి రాములును నీటిలోకి లాక్కెళ్లింది. కొద్దిసేపటికి నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. చదవండి: పోలీస్స్టేషన్లో షణ్ముఖ్ రచ్చరచ్చ యాంకర్గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి... -
చిన్నారికి ఉపరాష్ట్రపతి అభినందనలు
జిన్నారం (పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న అల్పన అనే విద్యార్థినిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా అభినందించారు. అందమైన చేతిరాతతో ఇతరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అల్పన రాసిన సందేశం ఉపరాష్ట్రపతిని చేరింది. స్పందించిన ఆయన ‘చక్కని చేవ్రాలుతో మంచి మాటలు, మనసును మరింత హత్తుకుంటాయని, సద్గుణాలు, మానవత్వం గురించి అల్పన తెలుగులో ఎంతో ముచ్చటగా రాసిందని, చిన్న వయస్సులోనే ఇంత చక్కని చేతిరాతను అలవాటు చేసుకున్న ఆ చిన్నారికి అభినందనలు’అని ట్వీట్ చేశారు. దీంతో చిన్నారికి చక్కటి చేతి రాతను నేర్పించిన పైసా సత్యంతో పాటు చిన్నారి అల్పనను పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. చదవండి: మనకూ బ్రాండ్ ఉండాలి.. సర్కార్ బ్రాండ్తో మార్కెటింగ్ -
మిల్లెట్స్ మెగా రైతు!
చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలంటే మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు మేలైన విత్తనాలు, సాగు మెలకువలు చెప్పే వ్యవస్థ అందుబాటులోకి రావాలి. అంతేకాదు, పండించిన తర్వాత చిరుధాన్యాలను శుద్ధి చేసుకునే యంత్రపరికరాలు పంట భూములకు వీలైనంత దగ్గరలో అందుబాటులో ఉండాలి. గిట్టుబాటు ధరకు అమ్ముకునే మార్గం ఉండాలి. అప్పుడే, చిన్న, సన్నకారు రైతులు ఇతర పంటల నుంచి చిరుధాన్యాల సాగు వైపు మళ్లడానికి ఆసక్తి చూపగలుగుతారు. ఈ సేవలన్నీ అందించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాలను శుద్ధి చేసే యంత్రాలను అద్దె పద్ధతిలో వినియోగించుకునే కేంద్రాలు (కస్టమ్ హైరింగ్ సెంటర్స్) ఉండాలి. ఇటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయటం ద్వారా వందలాది మంది రైతులను చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహిస్తూ పలు అవార్డులు అందుకున్న తెలుగు రైతు, వ్యాపారవేత్త వీర్షెట్టి బిరాదార్ ప్రశంసనీయులు. భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) డా. విలాస్ ఎ. తొనపి ప్రోత్సాహంతో ఫార్మర్స్ ఫస్ట్ ప్రోగ్రామ్ ద్వారా వీర్షెట్టి సేవలందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని గంగాపూర్ గ్రామంలో వీర్షెట్టి బిరాదార్(47) పుట్టారు. డిగ్రీ చదివారు. ఉమ్మడి కుటుంబానికి 70 ఎకరాల సాగు భూమి ఉంది. అందులో 30 ఎకరాల్లో చిరుధాన్యాలను సాగు చే స్తున్నారు. తమ గ్రామ శివారులోనే మిల్లెట్స్ ప్రాసెసింగ్ కస్టమ్ హైరింగ్ కేంద్రాన్ని నెలకొల్పి ఆ ప్రాంత రైతులను చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహిస్తున్నారు. ఉచితంగా విత్తనాలు, సాగు సలహాలు ఝరాసంగం మండలంతో పాటు పరిసర మండలాలు న్యాల్కల్, రాయికోడ్ మండలాల పరిధిలోని 8 గ్రామాల్లో వందలాది రైతులను చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహిస్తున్నామని వీర్షెట్టి తెలిపారు. ఫార్మర్ ఫస్ట్ ప్రాజెక్టు(రాజేంద్రనగర్)కు సమన్వయకర్తగా వ్యవహరిస్తూ.. రైతులకు నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలు ఉచితంగా అంది అధిక ఆదాయం వచ్చే దిశగా రైతులకు సూచనలు, సలహాలను అందిస్తూ శాస్త్రీయ సాగు పద్ధతులను వివరిస్తున్నారు. వారు పండించిన చిరుధాన్యాలను కస్టమ్ హైరింగ్ సెంటర్లో ప్రాధమిక స్థాయిలో శుద్ధి చేసి, గిట్టుబాటు ధరకు తనే కొనుగోలు చేస్తున్నారు. 400 టన్నుల చిరుధాన్యాల కొనుగోలు గ్రామాల్లో రైతులకు ఎలాంటి ఆదాయం లేకుండా ఆహార పదార్థాలను పంyì ంచేందుకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయటం. అధిక ఆదాయం వచ్చే విధంగా శాస్త్రీయ పద్ధతులు, సూచనలు, సలహాలు అందించటం. పండించిన పంటలను ఎలాంటి ఖర్చులు (రవాణా, కొనుగోలు ఏజెంట్లు, ఆలస్యం) లేకుండా నేరుగా కొనుగోలు చేయటంతో పాటు గ్రేడింగ్ చేయటం. వినియోగదారులకు మేలు రకం ఆహార పదార్థాలు అందించటమే ముఖ్య ఉద్దేశమని వీర్శెట్టి తెలిపారు. గత సంవత్సరం వివిధ గ్రామాల్లో పండించిన రైతుల నుంచి 400 టన్నుల చిరుధాన్యాలను కొనుగోలు చేశామని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. రైతులకు వ్యవసాయేతర ఆదాయం పెంపొందించేందుకు 2 వేల కోళ్ళు, 40 గొర్రెలు / మేకలను కూడా అందించానన్నారు. చిరుధాన్యాలతో నాణ్యమైన ఆహారోత్పత్తులను తయారు చేయించడంతోపాటు ఢిల్లీ, హైద్రాబాద్లలో సొంతంగా దుకాణాలను ఏర్పాటు చేసి విక్రయిస్తుండడం విశేషం. రైతులకు తోడ్పడటంతోపాటు ఏడాదికి రూ. 20 లక్షలకు పైగా ఆదాయం గడిస్తున్నట్లు వీర్షెట్టి వివరించారు. ‘నార్మ్’ 45వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో ఐసిఏఆర్ ఉత్తమ రైతు పురస్కారాన్ని వీర్షెట్టి ఇటీవల అందుకున్నారు. అదే విధంగా మిల్లెట్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, బెస్ట్ మిల్లెట్ మిషినరీ అవార్డు, బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు, ఎంవీఆర్ మెమోరియల్ అవార్డు, బెస్ట్ మిల్లెట్ ట్రైనర్ అవార్డులను కూడా ఆయన అందుకున్నారు. – బొగ్గుల రాజశేఖర్, సాక్షి, ఝరాసంగం, సంగారెడ్డి జిల్లా రైతులకు అందుబాటులో 3 యంత్రాలు రైతులు నూర్పిడి చేసి తెచ్చిన చిరుధాన్యాల్లో ఉన్న రాళ్ళు, మట్టిగడ్డలు, గడ్డి, పుల్లలను డీస్టోనర్ కం గ్రేడింగ్ మిషన్ ద్వారా వేరు చేసి శుభ్రం చేస్తారు. ఈ మిషన్ గంటకు వెయ్యి కేజీలు శుభ్రం చేస్తుంది. ఇందుకు గాను రైతుల నుంచి కేజీకి రూ.10లను చార్జిగా తీసుకుంటున్నారు. డీ హల్లర్ మిషన్ ద్వారా కొర్రలు తదితర చిరుధాన్యాలపై పొట్టు తీస్తారు. ఇందుకు గాను కేజీకి రూ.10 ఛార్జీగా తీసుకుంటున్నారు. పల్వరైజర్ మిషన్ ద్వారా పప్పుధాన్యాలను ప్రాసెస్ చేస్తారు. పొట్టు తీసిన అనంతరం పప్పు బద్దలు చేయటం, పిండి పట్టడం, రవ్వ తయారు చేసి, గ్రేడింగ్ చేస్తారు. రైతుల నుంచి కేజీకి రూ.10 చార్జీగా తీసుకుంటున్నారు. ఈ విధంగా హైరింగ్ సెంటర్ ద్వారా ధాన్యాలను గ్రేడింగ్ చేసి, తిరిగి వాటిని రైతులకు అందించటం లేదా గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోలు చేయటం జరుగుతుందని వీర్షెట్టి తెలిపారు. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకే.. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు గ్రామాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. ఉచితంగా నాణ్యమైన విత్తనాలు అందించటంతో పాటు అవలంబించాల్సిన మెరుగైన సాగు పద్ధతులు, సూచనలు, సలహాలను అందిస్తున్నాం. రైతులు పండించిన చిరుధాన్యాలను హైరింగ్ సెంటర్లో శుద్ధి చేసి, గ్రేడింగ్ చే స్తాము. అనంతరం రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. వాటితో తయారు చేసిన నాణ్యమైన ఆహార పదార్థాలను ఢిల్లీ, హైదరాబాద్లో దుకాణాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లో రైతులకూ సేవలందిస్తుండటం సంతోషాన్నిస్తోంది. – వీర్షెట్టి బిరాదార్ (77028 60613, 94905 23302), ఫస్ట్ ఫార్మర్ ప్రాజెక్టు సమన్వయకర్త, గంగాపూర్, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా -
ఒకే కుటుంబంలో 12 మందికి కరోనా
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణంలో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా సోకింది. 14 మంది ఒకే ఇంట్లో ఉండే ఈ కుటుం బం పట్టణంలోని ఆర్టీసీ కా లనీలో నివాసం ఉంటోందని అధికారులు చెప్పారు. ఇందు లో తల్లిదండ్రులు, అన్నదమ్ములతో పాటు వారి పిల్లలందరికీ కలిపి 12 మందికి వైరస్ సోకింది. ఆ కుటుంబంలో వీఆర్ఓగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి తొలుత కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు అనుమానంతో మదీనాగుడలోని ఓ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా 12 మందికి వైరస్ సోకినట్లు తేలింది. శనివారం మున్సిపల్ సిబ్బంది ఆర్టీసీ కాలనీలో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. ఇదిలా ఉండగా సాయి భగవాన్ కాలనీలో ఒకరికి, మారుతీనగర్లో మరొకరికి కూడా కరోనా సోకిందని అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. -
పల్లె ప్రగతిలో సంగారెడ్డి టాప్:హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: పల్లెప్రగతిలో సంగారెడ్డి జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్కు అభినందనలు తెలిపారు. పఠాన్ చేరు నియోజకవర్గంలో జరిగిన ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 55 గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు గ్రామాలకు సొంత నిధులతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు పంపిణీ చేయడం రాష్టం లోనే ప్రథమం అన్నారు. ప్రతి గ్రామంలో తాగునీరు, 24 గంటల విద్యుత్,మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. వచ్చే నెలరోజుల్లో జిల్లాలో వైకుంఠ ధామాలు, రైతు వేదికలు పూర్తిస్థాయిలో నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లాలో 100 పడకల కరోనా ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, భయపడకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. కరోనా బారినపడిన వారిని చులకనగా చూడొద్దని మంత్రి హరీష్రావు తెలిపారు. -
చురుగ్గా నైరుతి..
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కోమోరిన్లకు నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. రాగల 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్, నైరుతి, ఆగ్నేయ బంగాళా ఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశ మున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పుమధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో మే 31న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రాగల 48 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా రుతుపవనాలు ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రప్రాంతాల్లో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది 24 గంటల్లో వాయు గుండంగా మారి, మరింత బలపడే అవకాశముంది. దీని వల్ల శని, ఆదివారాల్లో వడగండ్లు, ఉరుములు, ఈదురుగాలులతో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. -
లాక్డౌన్తో మానసిక స్థితి కోల్పోయి..
జోగిపేట: లాక్డౌన్ కారణంగా ఉపాధి లభించకపోవడంతో మానసిక స్థితి కోల్పోయిన ఓ తండ్రి కన్న కూతురునే కడతేర్చాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్ తండాలో చోటుచేసుకుంది. సీఐ బుర్రి శ్రీనివాస్ కథనం ప్రకారం.. గొంగ్లూర్ తండాకు చెందిన రమావత్ జీవన్ దంపతులకు ముగ్గురు సంతానం. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంటి ఎదుట నిద్రించారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో రమావత్ జీవన్ మానసిక స్థితి కోల్పోయి కూతురు అవంతిక (4)ను కత్తితో గొంతు కోసి చంపాడు. ఏమి తెలియనట్లు భార్యను లేపి బిడ్డకు ఏదో అయింది చూడు అని చెప్పాడు. అప్పటికే పాప మరణించింది. కూతురును తన భర్తే హత్య చేశాడని భార్య పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. కూతురును హత్య చేసింది తానేనని, ఎందుకు ఇలా చేశానో అర్థం కావడం లేదని పోలీసుల ఎదుట వాపోయాడు. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, జీవన్ మానసిక పరిస్థితి సరిగా ఉండటం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
కరోనా.. 'నడక'యాతన!
హైదరాబాద్ టు నారాయణఖేడ్ మూటా ముల్లెతో వలస కూలీల ఇంటిబాట ఎర్రటి ఎండలో మాస్కులు ధరించి చిన్నారులు సైతం..సంగారెడ్డిలో ఆహారం అందించిన పోలీసులుప్రత్యేక వాహనంలో తరలింపు ఎర్రటి ఎండ.. నిర్మానుష్యమైన రోడ్డు.. చిన్నారులు మాస్కులు ధరించి బుడిబుడి అడుగులు వేస్తుండగా.. వెనకాల మూటా ముల్లె్ల నెత్తిన పెట్టుకొని అమ్మానాన్నలను అనుకరిస్తున్నారు. ఆకలి.. దప్పికతో అలమటిస్తూ.. అడుగు తీసి అడుగు వేయలేని దయనీయ పరిస్థితి వారిది. గమ్యం చేరడమే లక్ష్యంగా.. వందల కిలో మీటర్ల మేర నడుస్తూ నరకయాతన అనుభవించారు. ఇది కరోనా వైరస్ నేపథ్యంలో వలస కూలీలు పడుతున్న పాట్లు. ప్రభుత్వం లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తుండటంతో కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పని చేయనిదే పూట గడవని వారికి శరాఘాతంగా మారింది. దీంతో వారంతా ఇంటి బాట పడుతున్నారు. పిల్లాపాపలతో బయలుదేరుతున్నారు. రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో వందల కిలో మీటర్ల మేర కాలినడన బయలుదేరుతున్నారు. ఎర్రటి ఎండలో మాస్కులు ధరించి హైదరాబాద్ నుంచి కాలినడన వెళుతున్న నారాయణఖేడ్ చిన్నారులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, బిచ్కుంద, పెద్దశంకరంపేట, కంగ్టికి చెందిన వలస కూలీలు హైదరాబాద్ కూకట్పల్లి, మియాపూర్, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం.. మూడు రోజులుగా పనులు లేకపోవటంతో తమ సొంత ఊర్లకు కాలినడకన బయలుదేరారు. 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న తమ గ్రామాలకు ఉదయం ఏడు గంటలకు మొదలు పెట్టిన నడక.. మధ్యాహ్నం వరకు సంగారెడ్డికి చేరుకుంది. రోడ్డుపై చిన్న పిల్లలు సైతం మాస్కులు ధరించి భారమైన అడుగులు వేస్తూ నడవడం చూపరులను కలచివేసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, టౌన్ సీఐ వెంకటేశం, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ వారికి ఆహారం అందించారు. ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి సురక్షితంగా వారి ఊర్లకు పంపించారు. ఈ సందర్భంగా ఆపత్కాలంలో ఆదుకున్న పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు. – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి లాక్డౌన్తో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని కొండాపురం గ్రామస్తులు హరిద్వార్లో చిక్కుకున్నారు. తమను కాపాడాలని బాధిత కుటుంబీకులు బుధవారం చిలుకూరు పోలీస్స్టేషన్లో, కలెక్టర్కు తమ సమస్యను విన్నవించారు. ఇక్కడికి చెందిన 12 మంది ఈ నెల 15న రైలులో తీర్థయాత్రలకు వెళ్లారు. వారు ఈ నెల 22న హరిద్వార్ నుంచి కాశీకి వెళ్లాల్సి ఉండగా జనతాకర్ఫ్యూతో అక్కడే ఆగిపోయారు. ఆ తర్వాత లాక్డౌన్ ప్రకటించడంతో రవాణా స్తంభించిపోయింది. ప్రస్తుతం హరిద్వార్ గాంధీ హరిజన ఆశ్రమంలో ఉన్నట్లుగా వారు తెలిపారు. –చిలుకూరు -
బాలుడిపై వీధికుక్క దాడి
-
బాలికపై అత్యాచారయత్నం సినిమా కథే
పటాన్చెరు టౌన్: బాలికను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి అత్యచారయత్నం చేశారన్న ఘటనలో వాస్తవం లేదని తేలింది. గురువారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించగా ఆ బాలిక చెప్పింది అంతా కట్టుకథ అని తెలిసింది. శుక్రవారం అమీన్పూర్ పోలీసు స్టేషన్లో జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా గోపాలపురం గ్రామం నుంచి వచ్చిన ఓ వ్యక్తి అమీన్పూర్ పరిధిలోని వాణినగర్ కాలనీలో నివాసం ఉంటూ వాచ్మేన్గా పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితం ఊరి నుంచి అతని కూతురు (16) అమీన్పూర్కు వచ్చింది. ఆ బాలిక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లింది. అక్కడ బాలికకు సందీప్ అనే వ్యక్తితో పరిచయమైంది. వీరిద్దరూ కలసి గురువారం ఉదయం కలసి మియాపూర్లో సినిమాకు వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం బైక్పై తిరిగి వస్తుండగా.. బాలికకు తల్లి ఫోన్ చేసి, ఎక్కడున్నావ్.. అని అడగడంతో తాను సినిమాకు వెళ్లిన విషయందాచి, తనను ఎవరో నలుగురు వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి, అత్యాచారయత్నానికి పాల్పడ్డారంటూ చెప్పింది. అయితే సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ అసలు విషయం బయటపడింది. ఆ బాలిక ఫొటోలు సామాజిక మధ్యమాల్లో వైరల్ చేసినందుకు ఇంటి యజమాని, బాలికను తల్లిదండ్రులకు తెలియకుండా సినిమాకు తీసుకెళ్లిన సందీప్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
పుల్కల్ (అందోల్): ఫోన్ మాట్లాడుతూ హాస్టల్ భవనంపై నుంచి పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సూల్తాన్పూర్ జేఎన్టీయూలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుమారస్వామి కుమారుడు అఖిల్ కుమార్ సుల్తాన్పూర్ జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అఖిల్ మంగళవారం ఉదయం 8:30 గంటల సమయంలో బ్రేష్ చేసుకుంటూ హాస్టల్ భవనంపై ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడినట్లు విద్యార్థులు తెలిపారు. అయితే మంగళవారం కాలేజీకి సెలవు కావడంతో కాలేజీ వైద్య సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థులే సంగారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అఖిల్ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అఖిల్ మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్ఐ పెంటయ్య తెలిపారు. సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉండాల్సిన కాలేజీ వైద్య సిబ్బంది లేకపోవడంతో అఖిల్ మృతి చెందాడని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేíÙయా చెల్లించాలని విద్యార్థులు రిజి్రస్టార్ను కోరారు. -
చెడ్డపేరు తెస్తే విధుల నుంచి తప్పిస్తాం
సాక్షి, సంగారెడ్డి: గురుకులానికి చెడ్డపేరు తీసుకు వచ్చేలా వ్యవహరిస్తే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలతోపాటు అవసరమైతే ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేస్తామని గురుకుల పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్(ఆర్సీఓ) బాలస్వామి హెచ్చరించారు. నారాయణఖేడ్ మండలం జూకల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్ మధుసూదన్రావుతోపాటు పలు పలువురు అధ్యాపకుల తీరును నిరసిస్తూ వర్కర్లు ధర్నా చేయడం, తల్లిదండ్రుల ఆరోపణలపై ఆర్సీఓ మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రిన్సిపాల్తోపాటు కొందరు అధ్యాపకులపై ఆరోపణలు వచ్చాయని అన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్ మద్యం సేవించి వర్కర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, భోజనం బాగుండడం లేదని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సరిపడా సరుకులు ఇవ్వడం లేదని, మటన్ కాంట్రాక్టర్తో ఇబ్బందులు ఎదురవడం, కాంట్రాక్టు మార్చడం, మెనూ ప్రకారం వంటకాలు ఉండడం లేదని పలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై అంశాలవారీగా విచారణ చేసి గురుకుల పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి డా.ప్రవీణ్కుమార్కు నివేదిస్తామని అన్నారు. కొందరు లెక్చరర్లు, సిబ్బందితో కూడా సఖ్యతగా ఉండడం లేదని తెలపారు. ఈ అంశాలను విచారణ చేసి నిజం అని తేలితే శాఖాపరంగా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే ప్రిన్సిపాల్ను సస్పెండ్ కూడా చేస్తామని అన్నారు. గురుకుల పాఠశాలకు చెడ్డపేరు తీసుకువస్తే ఊరుకునేది లేదని అన్నారు. ప్రిన్సిపాల్ గతంలో సస్పెన్షన్కు గురై ఇక్కడ బాధ్యతల్లో చేరారని, ఆయన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని సూచిస్తామన్నారు. తాగుబోతు ప్రిన్సిపాల్ వద్దు.. పేరెంట్స్ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు ఆర్సీఓను కలిసి ప్రిన్సిపాల్పై ఫిర్యాదు చేశారు. బాధ్యతగా ఉండాల్సిన ప్రిన్సిపాల్, కొందరు అధ్యాపకులు తాగివచ్చి గురుకులం పేరును చెడగొడుతున్నారని, ఇలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాగుబోతు ప్రిన్సిపాల్ను విధుల నుంచి తొలగించి గురుకులాన్ని మెరుగుపర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఇదిలా ఉండగా ఆర్సీఓ విచారణ జరుపుతున్న తరుణంలోనే ప్రిన్సిపాల్ మధుసూదన్రావు తాను ప్రిన్సిపాల్గా విధులు నిర్వర్తించనని రాజీనామా లేఖను ఆర్సీఓకు అందించారు. -
రైతులను నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తా
సాక్షి, సంగారెడ్డి: రైతులకు సంబంధించిన భూముల రికార్డు పనుల్లో కాలయాపన చేసే వారిని సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం కంది మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఇయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందరర్భంగా కార్యాలయంలోని భూ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరమైన పాసు పుస్తకాలు, రికార్డులను త్వరగా అందజేసేందుకు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా తయారైన పాసు పుస్తకాలను తహసీల్దార్లే గ్రామాలకు వెళ్లి అందజేయాలన్నారు. కోర్టు కేసుల వివరాలను రిజిస్టర్లో పొందుపర్చాలని సూచించారు. వీఆర్ఓలు తమ వద్ద పట్టా పాసు పుస్తకాలను ఉంచుకోకూడన్నారు. మ్యుటేషన్లను పెండింగ్లో ఉంచొద్దని సూచించారు. అవసరమైన సరి్టఫికెట్లను 24 గంటల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శిఖం భూములు, ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే సహించేది లేదని, చట్టపరమైన కఠిన చర్యలతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు తమ పేరున ఉన్న భూములకు సంబంధించిన రికార్డులను అందజేసేందుకు వీఆర్ఓ కాలయాపన చేస్తున్నారని ఉత్తర్పల్లికి చెందిన ఓ రైతు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ రైతులను ఇబ్బంది పెడుతూ రికార్డులు అందజేయడంలో నిర్లక్ష్యం చేస్తే సస్పెండ్ చేస్తానని వీఆర్ఓ శంకరయ్యను హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, నాయబ్ తహసీల్దార్ సల్ల మల్లయ్య, ఆర్ఐ సంతో‹Ùకుమార్, వీఆర్ఓలు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పటాన్చెరు టౌన్: ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పనితీరును మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ హనుమంత రావు అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వైద్యం కోసం వచి్చన రోగులను, గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎన్ని కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారని, రికార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ప్రసవాల్లో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా మొత్తం కాన్పుల్లో 15 శాతం సాధారణమైనవి ఉంటేనే హెల్తీ ఇండెక్స్ కింద సూచిస్తుందని తెలిపారు. దాని ప్రకారంగా మన జిల్లాలో 25 శాతం వరకు ఉందన్నారు. రాష్ట్రంలో మనం బెస్ట్గా ఉన్నామని చెప్పారు. అయినప్పటికి 15 శాతానికి తీసుకురావాలన్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పని తీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీను, పటాన్చెరు తహసీల్దార్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘పరుగు’లోనే ఆగిన గుండె
రేగోడ్ (మెదక్)/సంగారెడ్డి మున్సిపాలిటీ: పోలీసు ఉద్యోగంలో చేరాలనుకున్న ఓ గిరిజన విద్యార్థి గుండెపోటుతో దుర్మరణం పాలైన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా రేగోడ్ మండలం పెద్దతండాకు చెందిన రంజానాయక్, చాందీబాయి దంపతుల రెండో కుమారుడు మహిపాల్ (20) సంగారెడ్డిలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుకుంటూ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం రెండు మార్కులతో చేజారిపోయింది. గతంలో ఆర్మీ సెలక్షన్కు సైతం వెళ్లాడు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే ఆదివారం ఉదయం సంగారెడ్డిలో ఉన్న గ్రౌండ్లో రన్నింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. 108 అంబులెన్స్ వచ్చేసరికే మహిపాల్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త వినగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పెద్దతండాకు తీసుకొచ్చారు. మహిపాల్ కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి జీవిత ఖైదు
సాక్షి, సంగారెడ్డి/ వర్గల్: కన్న కూతురిపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోర్టులో మొదటి అదనపు జడ్జి పాపిరెడ్డి తీర్పు నిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూర్ గ్రామానికి చెందిన భీమగాళ్ల బాబు (40) కూతుర్తెన 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో 2018 అక్టోబర్ 12న భర్తపై ముత్తమ్మ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో బాబుకు కోర్టు జీవితఖైదు, జరిమానా విధించింది. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసిన ఏసీపీ నారాయణ, తొగుట సీఐ రవీందర్, ఇతర పోలీసులను సిద్దిపేట సీపీ అభినందించారు. -
జైలులో కిచెన్ గార్డెనింగ్
సంగారెడ్డి జిల్లా జైలులో నూతనంగా హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ద్వారా ఆకుకూరలు పండిస్తున్నారు. ఈ పద్ధతిలో పంటలు పండించటానికి మట్టి అవసరం లేదు. ఎక్కువ స్థలం అవసరం లేదు. నీటి వినియోగం కూడా తక్కువే. మొదటగా సీడ్ ట్రాక్ లోని కొబ్బరి పీచు పొడిలో విత్తనాల్ని మొలకెత్తిస్తారు. తర్వాత పీవీసీ పైపులతో ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ సిస్టమ్లోని చిన్న జాలి తొట్టిలు, వస్తువుల్లో మొక్కల్ని పెంచుతారు. మట్టి వినియోగం ఉండదు కాబట్టి మొక్క నిలబడటానికి మట్టి రాళ్లను ఆ తొట్టిలో ఉంచుతారు. మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్, మైక్రో సొల్యూషన్ ద్రావణాలు ద్వారా అందిస్తారు. సొల్యూషన్ మోతాదులను ప్రత్యేక పరికరాల ద్వారా రోజూ పరీక్షిస్తారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సంగారెడ్డి జిల్లా జైలులో జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ఈ విధానంతో ఖైదీలకు కావాల్సిన ఆకు కూరలు పండిస్తున్నారు. ఎప్పటికప్పుడూ నూతన పద్ధతులను అనుసరిస్తూ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా జైలు ఇతర జైళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
ప్రకృతికి ఫ్రెండ్
కాలేజీకి సెలవులు వస్తే యువత విహారయాత్రలకు, బంధువుల ఇళ్లకు వెళ్తుండటం సహజమే. కానీ జ్ఞానేశ్వర్ మాత్రం తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రకృతి దగ్గరికి వెళ్లి పలకరిస్తుంటాడు! చిన్నారులతో కలిసి మొక్కలు నాటుతుంటాడు. ప్రకృతి సంరక్షణపై గ్రామస్తులకు సంగీత వాయిద్యాలతో పాటలు పాడి వినూత్నంగా అవగాహన కల్పిస్తుంటాడు. జ్ఞానేశ్వర్ది సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామం. ప్రకృతిని పరిరక్షిస్తానని ప్రతిన బూని పాదరక్షలు లేకుండా ఎనిమిదేళ్లుగా పాదయాత్రలు చేస్తున్నారు! జ్ఞానేశ్వర్ ఎంఎస్సీ జువాలజీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిద్దిపేటలో బీఈడీ చదువుతున్నారు. స్వగ్రామం మంజీరా నది పరివాహకంలో ఉండటంతో రోజూ నది అందాలు ప్రకృతి చూస్తూ పెరిగారాయన. 2017లో నది చుట్టుపక్కల ఉన్న చెట్లను నరకడంతో మంజీరా నది మొత్తం ఎండిపోయిన దృశ్యమూ చూశారు. నదిలోని మొసళ్లు గ్రామాల్లోకి వచ్చేవి. పక్షులు మృతి చెందేవి. దీంతో చలించిపోయి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టారు. అందుకు బాలల్ని తన సైన్యంగా మలుచుకున్నాడు. చిన్నారులతో కలిసి వేసవి కాలంలో సీడ్బాల్స్ (విత్తన బంతులు) తయారు చేసి మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో వాటిని విసిరారు. వర్షాలు కురిస్తే అందులోని విత్తనాలు మొల కెత్తేవి. మొదట్లో చిన్నారులను తీసుకొని వెళ్తే వారి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పేవారు. తర్వాత్తర్వాత వాళ్లూ ముందుకు వచ్చారు. మొక్కలు నాటేందుకు చిన్నారులతో కలిసి వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లేవారు జ్ఞానేశ్వర్. దీంతో గ్రామస్తుల్లోనూ చైతన్యం వచ్చింది. చెట్లను పూజించడం, తామూ మొక్కలు నాటడం ప్రారంభించారు. ఒక్కో దఫా మంజీరా తీరంలో వెయ్యి మొక్కలు నాటాలనే లక్ష్యంతో వెళ్తారు. అక్కడికే విద్యార్థులు భోజనం తెచ్చుకొని సాయంత్రం వరకు మొక్కలు నాటుతారు. జ్ఞానేశ్వర్ గత ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లా, హైదరాబాద్, బీదర్లలో సైకిల్ యాత్ర నిర్వహించారు. నిరుడు దసరా సెలవుల్లో మంజీరా నది రక్షించాలని కోరుతూ నారాయణఖేడ్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నదుల ఆవశ్యకతను తెలియజేస్తూ వాటిని ఎందుకు పరిరక్షించుకోవాలో వివరించారు. అలాగే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టంపై హైదరాబాద్లోని ధర్నాచౌక్లో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ ఏడాది దసరా సెలవుల్లోనూ సిద్దిపేట జిల్లా నుంచి నారాయణఖేడ్ వరకు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై పాదయాత్ర చేపట్టారు. – రవి ముదిరాజ్ తాటికొండ, సాక్షి, మెదక్ డెస్క్ -
రెండు గ్రామాల్లో దొంగల బీభత్సం
కల్హేర్(నారాయణఖేడ్): రెండు గ్రామాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. 11 ఇళ్ల తాళాలు పగులగొట్టి అలజడి సృష్టించారు. కల్హేర్ మండలం దేవునిపల్లి, మాసాన్పల్లిలో మంగళవారం రాత్రి నుంచి తెల్లవారు జాము వరకు చోరీలకు పాల్పడ్డారు. ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగులగొట్టారు. దేవునిపల్లిలో ఎనిమిది ఇళ్లు, మాసాన్పల్లిలో 3 ఇళ్లలోకి దొంగలు చొరబడ్డారు. రూ. 80 వేల నగదు, బంగారు ఆభరణాలు, ఒక మేకను అపహరించారు. దేవునిపల్లి గ్రామానికి చెందిన నమిళ్ల రవి, పద్మ వెంకయ్య, ఇప్పల బాలయ్య, గంగవ్వ, వడ్ల నర్సింలు, వడిశర్ల విఠల్, జగ్గారెడ్డిగారి సాయిరెడ్డి, అంజయ్యకు సంబంధించిన ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. బీరువాలు, వస్తువులు ధ్వంసం చేశారు. బట్టలు చిందరవందరగా పడేశారు. జగ్గారెడ్డిగారి సాయిరెడ్డి ఇంట్లో రూ. 20 వేల నగదు, 10 గ్రాముల బంగారం అపహరించారు. ఇప్పల బాలయ్య ఇంటి నుంచి ఒక మేకను ఎత్తుకెళ్లారు. మిగతా ఆరు ఇళ్లలో బంగారు ఆభరణాలు, నగదు దొరకలేదు. దీంతో ఇళ్లలో సామానంతా చిందరవందరగా పడేశారు. మాసాన్పల్లిలో చీటి సాయవ్వ, కొర్ల కాశిరెడ్డి, బంజ శశికల ఇంటి తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. చీటి సాయవ్వ ఇంట్లో డ్వాక్రా గ్రూపులో చెల్లించేందుకు దాచిపెట్టిన రూ. 50 వేల నగదు అపహరించారు. కొర్ల కాశిరెడ్డి ఇంట్లో రూ. 10 వేలు, శశికళ ఇంట్లో 3 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. కంగ్టి సీఐ వెంకటేశ్వర్రావు, కల్హేర్ ఎస్ఐ అనిల్గౌడ్ దేవునిపల్లి, మాసాన్పల్లి గ్రామాలను సందర్శించారు. చోరీ సంఘటనలపై విచారణ జరిపారు. దొంగలు బీభత్సం సృష్టించడంతో మిస్టరీని ఛేదించేందుకు క్లూస్ టీంను రంగంలోకి దించారు. క్లూస్ టీం అధికారులు వేలిముద్రలు సేకరించారు. దొంగలు బీభత్సం సృష్టించి చోరీలు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఏఎస్ఐ లక్ష్మణ్ తెలిపారు. -
ఆర్టీసీ కార్మికుల పోరాటం.. తీరని విషాదం
సాక్షి, నిజామాబాద్/ సంగారెడ్డి : అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన సమ్మెను విరమించినప్పటికీ ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకునేందుకు నిరాకరించడంతో తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సమస్యలు పరిష్కరించాలని సమ్మెలోకి వెళ్లినందుకు ఇప్పుడు ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు తమను విధుల్లోకి చేర్చుకోవాలని వేడుకుంటున్నారు. ఉద్యోగం కోసం కంటతడి పెడుతూ.. కార్మికులు పలుచోట్ల ప్రభుత్వాన్ని, అధికారులను ప్రాధేయపడుతున్నారు. డిపోల మందు ఆందోళన చేస్తున్నారు. వారిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న రాజేందర్ (55) గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సమ్మె విరమించినా ప్రభుత్వం తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకపోవడంతో రాజేందర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ఈ క్రమంలో ఇంటివద్ద ఉన్న ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని, గుండెపోటుతో రాజేందర్ మృతి చెందారని కార్మికులు తెలిపారు. రాజేందర్ది నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామం. నురగలు కక్కుతూ పడిపోయిన ఆర్టీసీ కార్మికుడు సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్లోనూ విషాద ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న భీమ్లా మంగళవారం ఉదయం తిరిగి విధుల్లోకి చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చాడు. అయితే, అతన్ని విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. ఈ క్రమంలో పోలీసులు భీమ్లాను అరెస్టు చేసి.. ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్కు తరలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భీమ్లా నురగలు కక్కుతూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో ఆయనను తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందని తోటి కార్మికులు తెలిపారు. మేనేజర్ కాళ్ళు మొక్కిన కార్మికులు విధుల్లో చేరేందుకు నిజామాబాద్ డిపో 1కు ఆర్టీసీ కార్మికులు మంగళవారం భారీగా తరలివచ్చారు. తమను విధుల్లో చేర్చుకోవాలని డిపో మేనేజర్కు వినతిపత్రం ఇచ్చారు. అయితే, వారిని విధుల్లోకి చేర్చుకోలేమని డిపో మేనేజర్ తేల్చి చెప్పారు. దీంతో ఆందోళన చెందిన కార్మికులు మేనేజర్ కాళ్ళు మొక్కి డ్యూటీలో చేర్చుకోవాలని వేడుకున్నారు. -
నా భర్తపై చర్యలు తీసుకోండి
సాక్షి, సంగారెడ్డి: నా భర్త ప్రతీ రోజు మద్యం సేవించి నన్ను కొడుతున్నాడు. మానసికంగా వేధిస్తున్నాడు. ఇంట్లో వస్తువులు అమ్ముకొని ఇబ్బంది పెడుతున్నాడు. పుట్టింటి నుండి అదనపు కట్నం తీసుకురమ్మని అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. నాకు న్యాయం చేయండి అని హత్నూర మండలానికి చెందిన ఓ వివాహిత ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డికి విన్నవించింది. పోలీస్ గ్రీవెన్స్ సెల్లో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదులను సోమవారం ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి స్వయంగా స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి. ‘నా భార్య అత్యాచారం, హత్యకు గురైన కేసులో ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రకారం ప్రభుత్వం రూ.8.50 లక్షలను మంజూరు చేసింది. నా మానసిక స్థితి బాగోలేకపోవడంతో మరో వ్యక్తి నా బ్యాంకు అకౌంట్ నుండి డబ్బులను తీసుకున్నాడు. నా డబ్బు నాకు వచ్చేలా చూడండి’ అని కంది మండలానికి చెందిన ఓ ఫిర్యాదుదారుడు కోరారు. ‘నాకు 2008లో వివాహం జరిగింది. నా భర్త అదనపు కట్నం కోసం వేధించడంతో కేసు నమోదు చేయించాం. కోర్టు నా భర్తకు, మామకు జైలు శిక్ష వేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం నేను భర్త ఇంట్లోనే ఉంటున్నా. కానీ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని నన్ను వేధిస్తున్నాడు. ఇంటి నుండి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు న్యాయం చేయాల’ని కంది మండలానికి చెందిన ఫిర్యాదుదారురాలు కోరారు. -
తహసీల్దార్ల బదిలీలపై స్పందించిన ప్రభుత్వం
సాక్షి, సంగారెడ్డి: తహసీల్దార్ల బదిలీపై రెవెన్యూ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం స్పందించిందని జిల్లా అధ్యక్షుడు బొమ్మరాములు తెలిపారు. 2018 అక్టోబర్ ఎన్నికలకు ముందు జిల్లాకు బదిలీ అయిన తహసీల్దార్లు అంతా పూర్వ జిల్లాలకు బదిలీ కానున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్కుమార్, ట్రెస్సా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ) ప్రతినిధులు ఆదివారం చర్చించారని చెప్పారు. తమ విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్లు స్పందించారని ఆయన చెప్పారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి షఫీయోద్దీన్, కార్యవర్గ సభ్యుడు గోపాల్, కిరణ్కుమార్, దశరథ్, కార్తీక్, వీరేశం, బాల్రాజ్, గుండేరావు, ఉమర్పాష, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్
సాక్షి, సంగారెడ్డి: అన్ని హంగులతో లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్లో 150 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, 141 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కొత్త ట్రాక్టర్లను సర్పంచ్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమరుల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయిందన్నారు. పేదల కోసం ముఖ్యమంత్రి కట్టించిన ఇళ్లల్లో పేదలు మాత్రమే నివసించాలని..వాటిని అమ్ముకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతుల కోసం రైతు బంధు బీమా, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ను ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసమే కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దేశమంతటా వర్షాలు పడి ప్రాజెక్టులు పొంగిపొర్లుతుంటే సింగూర్ లో మాత్రం చుక్క వర్షం పడటం లేదని.. భవిషత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సింగూర్ నింపుతామన్నారు. 40 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందిస్తామని పేర్కొన్నారు. అందోల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. పేదలకు అండగా ఉంటాం.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. పేదలకు ఇళ్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇళ్లు లేని పేదలకు వచ్చే ఏడాదిలోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు. -
‘ఆర్టీసీ కార్మికుల సమ్మెకు గొప్ప విశిష్టత’
సాక్షి, సంగారెడ్డి: ఆర్టీసీ కార్మికులు 25 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెను చూస్తుంటే గర్వంగా ఉందని టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంగారెడ్డి బస్టాండ్లో మంగళవారం ఆర్టీసీ కార్మికులను కలిసి సంఘీభావం తెలిపిన ఆయన సమ్మెకు టీజేఎస్ తరఫున మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకు గొప్ప విశిష్టత ఉందని అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్ సరూర్నగర్ గ్రౌండ్లో.. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే సకలజనుల భేరి సభకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమ్మెకు మద్దతిచ్చి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించకపోతే ప్రైవేట్ బస్సులను నడిపిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులను బెదిరిస్తున్నారని కోదండరాం విమర్శించారు. సమ్మె ముందు ఆర్టీసీ 25 రోజుల ఆదాయం.. సమ్మెలో ఉన్నప్పుడు 25 రోజుల ఆదాయాన్ని కేసీఆర్ గమనించాలని అన్నారు. సీఎం కేసీఆర్కు పరిపాలన ఎలా చేయాలో చెప్పాల్సిన దుస్థితి వచ్చిందని కోదండరాం మండిపడ్డారు. ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు అనంతరం చర్చలకు పోతే.. 500 మంది పోలీసులను చుట్టూ పెట్టుకొని చర్చలు జరుపుతారా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ప్రత్యేక జీత భత్యాల కోసం సమ్మె చేయడం లేదని, న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. -
‘30 రోజుల ప్రణాళికతో ప్రగతి బాగుంది’
సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు జిల్లాలో 30 రోజులు ప్రణాళికను సమగ్రంగా అమలుచేసి గ్రామాల్లో సాధించిన ప్రగతి బాగుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. కేవలం 30 రోజుల్లో కలనా? నిజమా? అనేలా గ్రామాల్లో ప్రగతి విప్లవంలా జరిగిందన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఘనత సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంత రావుకే దక్కిందని అన్నారు. తెలంగాణలోని 24 గంటలు విద్యుత్, రైతు బంధు పథకాలను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయడానికి ఆయా ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయన్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్.. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి మెచ్చుకున్నారని చెప్పారు. ఇప్పటివరకూ సంగారెడ్డి జిల్లాలో 70 ఏళ్లుగా జరగని అభివృద్ధి పనులను కేసీఆర్ ప్రభుత్వం ఆరు సంవత్సరాల్లో చేసి చూపెట్టిందన్నారు. టీఆర్ఎస్ పార్టీపై నమ్మకం ఉన్న కారణంగానే హుజూర్నగర్ ఉప ఎన్నిక గెలిచామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపని మంత్రి హరీశ్ రావు అన్నారు. -
బతుకమ్మ చీరలు మాకొద్దు
సాక్షి, మునిపల్లి(అందోల్): బతుకమ్మ చీరలు మా కొద్దు అంటూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా చౌర స్తాలో కాలనీవాసులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. రేషన్ డీలర్ను బుదేరా చౌరస్తాకు సపరేట్గా ఏర్పాటు చేయాలని నాలుగు నెలలుగా అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు అధికారుల తీరుపై మండిపడ్డారు. రేషన్ డీలర్ షాపును ఏర్పాటు చేసేంతవరకు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలు, వివిధ రకాల మొక్కలను కూడా తీసుకోబోమని నినాదాలు చేశారు. దీంతో తహసీల్దార్ సువర్ణ రాజుకు అక్కడికి చేరుకుని నిరసన కారులతో మాట్లాడి రేషన్ డీలర్ను బుదేరా చౌరస్తాకు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమం విరమించారు. అనంతరం మహిళలు బతుకమ్మ చీరలు, చెత్త బుట్టలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు. -
చెత్త వేస్తే ఫైన్లు తప్పవు
సాక్షి, సంగారెడ్డి: రోడ్లపై చెత్త వేస్తే దుకాణాల యజమానులపై ఫైన్లు వేయకతప్పదని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సంగారెడ్డి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించి పారిశుధ్య నిర్వహణపై ఆరా తీశారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కొన్ని దుకాణ సముదాయాలను ఆయన తనిఖీ చేశారు. దుకాణాల ముందున్న చెత్తను చూసి అసహనం వ్యక్తం చేశారు. పరిసరాలను అపరిశుభ్ర పరిస్తే ఎంతటివారైనా సహించేది లేదని హెచ్చరించారు. కొంతమంది దుకాణదారులకు ఫైన్లు వేశారు. ప్రతీ ఒక్క పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. హరితహారంలో భాగంగా దుకాణ సముదాయాల ముందు మొక్కలను నాటతామని, వాటిని దుకాణాల యజమానులు సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని తెలిపారు. పట్టణాన్ని జోన్లవారీగా విభజించి ప్రతి జోన్లో రెండు రోజులపాటు పర్యటించనున్నట్లు కలెక్టర్ వివరించారు. పట్టణంలో పరిశుభ్రత స్థిరంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ఉల్లి.. లొల్లి..
సాక్షి, నారాయణఖేడ్: ఉల్లి సాగు చేసే రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. ప్రతీ ఏటా కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి విత్తనాలు ఈ ఏడాదీ ఏడిపిస్తున్నాయి. ఉద్యానవన శాఖ పంపిణీ చేసే సబ్సిడీ విత్తనాలు రెండేళ్లుగా రావడమే లేదు. సబ్సిడీ విత్తనాలు అందక రైతులపై ఆర్థిక భారం తప్పడం లేదు. జిల్లాలో ఉల్లి విత్తనాలు దొరకక పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలో దాదాపుగా మూడు వేల ఎకరాల్లో సాగయ్యే ఉల్లి గురించి పట్టించుకున్న నాథుడే లేకుండాపోయాడు. ఉల్లి సాగు చేసే రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు. విత్తన సమస్య వారిని నిత్యం వేధిస్తూనే ఉంది. సమస్య ఎలా ఉన్నా ఈ రబీ సీజన్లో ఉల్లి సాగు చేసేందుకు రైతులు రెడీ అయిపోయారు. కొన్ని చోట్ల దుక్కులు దున్నుతుండగా అక్కడక్కడా ఉల్లి నారు కూడా పోశారు. ఉల్లి నారు చల్లడానికి రైతులు జిల్లాలో తీవ్ర విత్తన కొరతను ఎదుర్కొంటున్నారు. చేసిదిలేక పక్కనున్న మహారాష్ట్రలోని పండరిపూర్, సోలాపూర్ ప్రాంతాలకు వెళ్లి ఉల్లి విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఉద్యాన వనశాఖ అధికారులు సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించేవారు. కానీ రెండేళ్లుగా సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపివేయడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లిగడ్డను మార్కెట్కు తరలిస్తున్న రైతులు (ఫైల్) గతంలో శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీలో కేజీ విత్తనాలు రూ. 250 నుంచి రూ.350 వరకు ఇచ్చేవారని రైతులు తెలిపారు. దీంతో ఎంతగానో సౌకర్యవంతంగా ఉండేదని పేర్కొంటున్నారు. సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం బంద్ చేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలో కిలో విత్తనాలను రూ.1250 నుండి 1500 చొప్పున తీసుకువస్తున్నామని పేర్కొంటున్నారు.దీంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం సాగుకు రెండు కిలోల ఉల్లి విత్తనాలు అవసరం ఉంటాయని రైతులు తెలిపారు. నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తున్నారు. నారాయణఖేడ్, మనూరు, నాగల్గిద్ద, అందోల్ పరిధిలోని వట్పల్లి, రేగోడ్, జహీరాబాద్, రాయికోడ్, కోహీర్, న్యాల్కల్ ప్రాంతాల్లో ఉల్లి సాగవుతుంది. సంగారెడ్డి పరిధిలో కాస్తా తక్కువ ఉల్లిసాగు ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. పండరీపూర్ నుంచి తెచ్చుకుంటున్నాం గతంలో సబ్సిడీపై ఉల్లి విత్తనాలు ఇచ్చేవారు. దాంతో మాకు ఎంతో సౌలత్ ఉండేది. రెండుళ్లుగా సబ్సిడీ విత్తనాలు ఇస్తలేరు. అధికారులను అడిగితే సర్కారు నుండి రావడం లేదని చెప్తున్నారు. చేసేదిలేక పండరిపూర్కు వెళ్లి పంచగంగ విత్తనాలు రూ.1500 చొప్పున తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ కొనాలంటే రూ. 2 వేలకు కిలో ఇస్తున్నారు. అధికారులు, నాయకులు రైతులకు న్యాయం చేయాలి. రైతులను ఆదుకోకపోతే ఎలా? కిలోకు వెయ్యి మిగిలినా మాకు రెండు కలుపుల ఖర్చు ఎల్లుతుంది. –శివాజిరావు పాటిల్, మాయికోడ్ సబ్సిడీ అంశం మా పరిధిలోది కాదు రైతులకు సబ్సిడీపై మేం రెండేళ్ల క్రితం వరకు ఉల్లితోపాటు ఇతర కూరగాయ విత్తనాలు అందించాం. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించలేకపోతున్న మాట వాస్తవమే. సబ్సిడీపై ఉల్లి విత్తనాలు అందించాలని చాలా మంది రైతులు మాకు విన్నవిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. –సునీత, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి సబ్సిడీ విత్తనాలివ్వాలి ప్రభుత్వం ఉల్లి సాగు చేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా సాగుచేస్తున్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇస్తే మాకు కాస్త పెట్టుబడి భారం తగ్గడంతోపాటు ప్రభుత్వం అందించే విత్తనాలపై నమ్మకం ఉంటుంది. ఈ దిశగా అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. –సుభాష్రావు, రాణాపూర్ -
'అరుదైన' అవకాశానికి అవరోధం
సాక్షి, జహీరాబాద్: ఐక్యరాజ్య సమితి ఎంపిక చేసిన ‘ఈక్వేటారి’ అవార్డును అందుకునే అవకాశం దూరం కావడం పట్ల డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ మహిళా సంఘం(చిరు ధాన్యాల చెల్లెండ్ల సమాఖ్య) సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని న్యూయార్కులో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ కార్యక్రమం (యూఎన్డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇదే వేదిక నుంచి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) మహిళా సంఘం సభ్యులు అవార్డును అందుకోవాల్సి ఉంది. ఇందు కోసం ఐక్యరాజ్య సమితి నుంచి సంస్థ సభ్యులకు ఆహ్వానం సైతం లభించింది. అయినా అవార్డును అందుకునేందు కోసం వెళ్లే మహిళలు వీసా కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురి అయింది. ఇది సంఘం సభ్యులను ఎంతో నిరాశ పర్చింది. ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే పర్యావరణ వేత్తలు, వారి సంస్థలకు ఐక్యరాజ్య సమితి ఈక్వేటారి అవార్డులను ఇస్తూ వస్తోంది. 2019 సంవత్సరానికి గాను జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్లో గల డీడీఎస్ మహిళా సంఘానికి ఈ అవార్డుకు చోటు దక్కింది. గత 30 సంవత్సరాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ మహిళా సంఘాలు చేస్తున్న కృషి, పనులను గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం డీడీఎస్ మహిళా సంఘానికి అవార్డుకు ఎంపిక చేసింది. డీడీఎస్ మహిళా సంఘానికి వచ్చిన అవార్డును అందుకునేందుకు గాను పస్తాపూర్ గ్రామానికి చెందిన అనుసూయమ్మ, పొట్పల్లి గ్రామానికి చెందిన మొగులమ్మలను సంస్థ ఎంపిక చేసింది. వారికి ట్రాన్స్లేటర్లుగా జయశ్రీ, మయూరిలను ఎంపిక చేశారు. గత 17 సంవత్సరాల కాలంగా యూఎన్డీపీ ప్రతి సంవత్సరం ప్రపంచ స్థాయిలో అందజేస్తున్న అవార్డులకు గాను ఇప్పటి వరకు భారత దేశంలో 9 సంస్థలు మాత్రమే ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ సారి డీడీఎస్ మహిళా సంఘం 10వ అవార్డుకు ఎంపికైంది. గత మూడు దశబ్దాల కాలంగా అవిశ్రాంతంగా పర్యావరణ మేలు కోసం డీడీఎస్ సంఘాలు చేస్తున్న పనిలో సామాజిక అటవుల కమ్యూనిటీ నియంత్రిత పీడీఎస్ ద్వారా బీడు భూములకు పచ్చ దుప్పటి కప్పడం, గ్రామల పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి హరిత వనాలను పెంచడం, కనుమరుగవుతున్న మందు చెట్లను కాపాడి వాటిని అభయారణ్యం లాంటి స్థావరాలుగా రూపుదిద్దడం, అంతరించి పోతున్న చిరు ధాన్యాలను పరిరక్షించి విస్తరింప జేయడం, కమ్యూనిటీ విత్తనాల బ్యాంకులను స్థాపించడం లాంటి కార్యక్రమాలను డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు తీసుకుని విజయం సాధించడంలాంటి అద్భుతమైన పనులకు గుర్తింపుగా ఈక్వేటారి అవార్డు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాలకు చెందిన 847 నామినేషన్లు ఐక్యరాజ్య సమితి అవార్డుకోసం దాఖలయ్యాయి. వీటన్నింటిని పరిశీలించిన అనంతరం 20 మంది విజేతలను యూఎన్డీపీ ఎంపిక చేసింది. వీటిలో డీడీఎస్ మహిళా సంఘానికి అరుదైన చోటు దక్కింది. ఈ అవార్డును అందుకునేందుకు గాను వెళ్లేందుకు ఎంపికైన మహిళా సంఘం సభ్యులు అనుసూమ్మ, మొగులమ్మలతో పాటు ట్రాన్స్లేటర్లుగా జయశ్రీ, మయూరిలను పంపేందుకు నిర్ణయించారు. ఈ మేరకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురికావడంతో మహిళా సంఘం సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మేము చేసిన పనులు చెప్పుకోవాలనుకున్నా గత మూడు దశాబ్దాల కాలంగా డీడీఎస్ మహిళా సంఘాల సభ్యులు పర్యావరణాన్ని కాపాడేందుకు చేస్తున్న కా>ర్యక్రమాలను చెప్పుకోవాలనుకున్నా. ఇందు కోసం పూర్తిగా సిద్ధం అయ్యా. అవార్డును అందుకునేందుకు చేసుకున్న వీసా దరఖాస్తు తరస్కరణకు గురు కావడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మే ం సాధించిన విషయాలను ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పర్యావరణ పరిరక్షకులకు వినిపించి మరింత విస్తరింపజేసేలా వివరించాలనుకున్నా. వీసా రాక పోవడం ఎంతో బాధను కలిగించింది. –అనుసూయమ్మ, మహిళా సంఘం సభ్యురాలు వీసా తిరస్కరణ తీవ్ర నిరాశకు గురి చేసింది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(యూఎన్డీపీ) ప్రతిష్టాత్మక ఈక్వేటారి అవార్డు పొందేందుకు గాను నూయార్కు వెళ్లేందుకు అవసరమైన వీసా లభించక పోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. పర్యావరణ పరిరక్షణతో పాటు అంతరించి పోతున్న పాత పంటల సాగు విస్తరణ కోసం తాము చేస్తున్న కృషి ఎనలేనిది. మహిళా రైతులకు లభించిన అవకాశం వీసా తరస్కరణ రూపంలో దక్కక పోవడం తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. – మొగులమ్మ, మహిళా రైతు, చిరు ధాన్యాల చెళ్లెళ్ల సమాఖ్య అధ్యక్షురాలు, పొట్పల్లి చదవండి: ఆహ్వానం అందినా..వీసా ఇవ్వలేదు -
కిరోసిన్ ధరల మంట
సాక్షి, జోగిపేట(అందోల్): ప్రజా పంపిణీ కిరోసిన్ లీటరుపై రూ.1 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధర ఈ నెల నుంచే అమలులోకి వస్తుంది. ఈ నెలలో లీటరుకు రూ.34, అక్టోబర్లో రూ.35కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. వీలైనంత వరకు కిరోసిన్ వినియోగాన్ని తగ్గించేలా ప్రభుత్వం తరచూ ఇప్పటికే కట్ చేశారు . ప్రతి నెలా 1.26 లక్షల లీటర్ల కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. ధరలు పెంచడంతో ఆహార భద్రత కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు భారం తప్పడం లేదు. 2016లో కిరోసిన్ ధర లీటర్ రూ.19 ఉండగా, 2017లో రూ.24కు చేరింది. 2018లో రూ.29కు పెంచారు. ప్రస్తుత కోటా వచ్చే సరికి ఏకంగా రూ.34లకు చేరింది. ఈ లెక్కన మూడేళ్లలో రాయితీ కిరోసిన్పై లీటరుకు రూ.15 పెంచినట్లయ్యింది. నిరుపేదలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై కిరోసిన్ను పంపిణీ చేస్తోంది. ఇటీవల దీని వినియోగం భారీగా తగ్గింది. ప్రస్తుతం కిరోసిన్పై వంట చేసుకునే వారు చేతివేళ్లపై లెక్క పెట్టే సంఖ్యలోనే ఉన్నారు. గ్రామాల్లో స్నానానికి నీళ్లు వేడి చేసుకునేందుకు కొందరు ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ గ్యాస్ పొయ్యిలనే వినియోగిస్తున్నారు. గతంలో కార్డుకు 15 లీటర్ల చొప్పున కిరోసిన్ పంపిణీ చేసేవారు. ప్రస్తుతం లీటరుకు వచ్చింది. జిల్లాలో నెలకు 1.26 లక్షల లీటర్ల సరఫరా జిల్లాలో 3.70 లక్షల లీటర్లు కిరోసిన్ పంపిణీ చేసేవారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి కిరోసిన్ కోటాను కట్ చేయాలన్న ఉత్తర్వులు రావడంతో వారిని గుర్తించి తొలగించాం. ప్రస్తుతం ప్రతి నెలా 1.26 లక్షల లీటర్ల కిరోసిన్ను జిల్లాలో పంపిణీ చేస్తాం. సెప్టెంబర్లో రూ. 34కు, అక్టోబర్లో రూ.35కు పెంచి విక్రయించాలని ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయి. గ్యాస్ కనెక్షన్ లేని దీపం కనెక్షన్ ఉన్న 22వేల మందికి కూడా రాయితీ కిరోసిన్ సరఫరా చేస్తాం. – శ్రీకాంత్రెడ్డి,డీఎస్ఓ, సంగారెడ్డి -
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రూ.500 పారితోషికం
సాక్షి, నారాయణఖేడ్: కుష్టు, క్షయ(టీబీ) వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. గత ఏడాది పలువురిలో ఈ వ్యాధుల లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు వ్యాధులపై ఏకకాలంలో సర్వే నిర్వహించి నిర్మూలన చర్యలను చేపట్టాలని వైద్యశాఖ భావిస్తోంది. క్షయ, కుష్టు బాధితులు పెరుగుతుండడం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వ్యాధులకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించి నయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని కేంద్రం ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రారంభించింది. జిల్లా స్థాయిలో సూపర్వైజర్లు, పీహెచ్సీల స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై శిక్షణ పొందారు. వారు ఈ నెల 26న ప్రారంభించిన సర్వే సెప్టెంబర్ 12 వరకు పల్లెలు, పట్టణాల్లో కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో 2007 నుండి సర్వే కొనసాగిస్తున్నారు. తాజాగా మూడో విడత సర్వేపై వైద్యారోగ్య శాఖ సిబ్బంది దృష్టిసారించారు. కేసులు ఎక్కువగానే.. ప్రస్తుత కాలంలో కుష్టుతోపాటు క్షయ వ్యాధి రోగులు సైతం పెరుగుతున్నారు. వ్యాధి గాలిలోనే విస్తరించే అవకాశం ఉన్నందున బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధిపై నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ వ్యాధి విస్తరించడంతో కుష్టు, క్షయ వ్యాధుల రోగుల సంఖ్యను పక్కాగా లెక్కించి చికిత్సలు అందించాలని వైద్యాధికారులు భావిస్తున్నారు. పరీక్షలు ఇలా.. వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తాయి. ఆశా కార్యకర్తలు మహిళలను, స్వచ్ఛంద పురుష కార్యకర్తలు పురుషులను పరీక్షిస్తారు. ఒకవేళ కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే పీహెచ్సీకి పంపిస్తారు. క్షయవ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. సాయంత్రం సమయంలో దగ్గు, జ్వరం వస్తుంటే వారి తెమడను తీసుకొని ఒక డబ్బాలో పొందుపరిచి క్షయ నియంత్రణ విభాగానికి పరీక్షల కోసం పంపిస్తారు. సీబీనాట్ పరికరంతో వ్యాధిని నిర్దారిస్తారు. జిల్లాలో 948 బృందాలు.. జిల్లాలో 948 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 15లక్షల మంది జనాభా ఉంది. 14లక్షల జనాభాకు అంటే 90శాతం మందిని సర్వే చేయాలనే లక్ష్యంగా వైద్యాధికారులు ఉన్నారు. రోజూ లక్ష మందిని పరిశీలించనున్నారు. సర్వే చేసేందుకు 948 మంది ఆశ కార్యకర్తలు, 243సబ్సెంటర్లకు సంబంధించి 243 ఏఎన్ఎంలు, 35మంది సూపర్వైజర్లు, 35మంది వైద్యాధికారులు సర్వేలో పాల్గొంటారు. నిత్యం పట్టణ ప్రాంతాల్లో 30 నివాసాలు, గ్రామీణ ప్రాంతాల్లో 26 ఇళ్లలో సర్వే చేస్తారు. రెండేళ్ల క్రితం సర్వే నిర్వహించి 45మంది కుష్టు రోగులను గుర్తించారు. గత ఏడాది 35మందిని గుర్తించగా ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలో ఇప్పటివరకు నలుగురు కుష్టు రోగులను గుర్తించారు. వ్యాధుల బారిన పడినవారిని గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్సలు అందజేస్తారు. క్షయబారిన పడిన రోగులకు 6 నెలలు, 12నెలల కోర్సుగా ఏడాది పొడవునా ఉచితంగా మందులను అందజేయనున్నారు. క్షయ వ్యాధిబారిన పడిన రోగులు వ్యాధి నయం అయ్యే వరకు మందులు వాడుతుంటే వారికి ప్రతీ నెలా రూ.500 చొప్పున పోషకహారం తీసుకునేందుకు పారితోషికం అందజేస్తాయనున్నట్లు జిల్లా లెప్రసీ ఉపగణాంక అధికారి విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. కుష్టు లక్షణాలు ఇవీ.. చర్మ పాలిపోవడం, స్పర్శజ్ఞానం లేని మచ్చలు కాళ్లు, చేతులు, నరాల వాపు, నొప్పి, తిమ్మిర్లు ముఖంపై చెవి బయట నూనె పూసినట్లుగా ఉండడం కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతుండడం ముఖం, కాళ్లు, చేతులపై నొప్పి లేని బుడిపెలు కనురెప్పలు పూర్తిగా మూతపడకపోవడం చేతివేళ్లు స్పర్శ కోల్పోయి వంకర పోవడం క్షయ లక్షణాలు ఇవీ.. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఆకలి లేకపోవడం, పెరుగుదల లేకపోవడం మెడపై వాచి గ్రంథులు, గడ్డలు రావడం పరీక్షించి ఉచిత మందులు.. జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోంది. 14రోజులపాటు ఈ సర్వే నిర్వహిస్తాం. రోగులను గుర్తించి పూర్తిస్థాయిలో చికిత్సలు అందజేస్తాం. లక్షణాలు ఉంటే పరీక్షించి ఉచితంగా మందులను అందజేస్తాం. క్షయవ్యాధి గ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధిని వెంటనే నయం చేసుకునే వీలుంది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ వైద్యులు క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తే వారికి రూ.500 పారితోషికం అందజేస్తాం. ఆర్ఎంపీలు, విద్యావంతులు అవగాహన కల్పించి రోగులు చికిత్సలు పొందేలా చూడాలి. – డి.అరుణ, డీపీపీఎం జిల్లా కోఆర్డినేటర్ -
ప్రభుత్వ ఆస్పత్రిలో పార్కింగ్ దోపిడీ
సాక్షి, సంగారెడ్డి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నిత్యం వందలాది మంది రోగులు, వారి సహాయకులు వస్తూపోతుంటారు. వైద్యం కోసం వీరు సొంత, ప్రైవేటు, అద్దె వాహనాల్లో వస్తారు. జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం వస్తున్న వారిలో దాదాపుగా అధికశాతం పేదలే ఉంటారు. ఇక్కడ అన్ని సేవలు ఉచితంగానే అందాలి. కానీ పార్కింగ్ పేరుతో నిర్ణయించిన రేటుకంటే అధికంగా వసూలు చేస్తూ రోగులను, వారి సహాయకులను, పరామర్శించడానికి వచ్చిన వారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ తతంగమంతా నెలలకొద్దీ జరుగుతున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాలలోకి వెళ్తే.. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి జిల్లాలోని నలుమూలల నుంచి నిత్యం వందలాది మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. వారి వెంట సహాయకులు, కుటుంబసభ్యులు, పరామర్శించడానికి నిత్యం వందలాది మంది వచ్చి వెళ్తుంటారు. వీరిలో ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారితో పాటుగా రోగులను తీసుకొని వాహనాలలో కూడా వస్తుంటారు. వాస్తవానికి వీరి వాహనాలను ఉచితంగా ఆస్పత్రి లోపలికి అనుమతించాలి. కానీ పార్కింగ్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తూ దండుకుంటున్నారు. వాహనాల పార్కింగ్ నిమిత్తం టెండరును కూడా వేశారు. రెండు సంవత్సరాల క్రితం టెండరును ఖరారు చేశారు. ఈ కాలపరిమితిలో ప్రతినెలా రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వాహనానికి కేవలం రూ.5 మాత్రమే తీసుకోవాలని నిబంధన విధించారు. కాగా ఈ నిబంధనలను కాలరాస్తూ రూ.10 దండుకుంటున్నారు. వాస్తవానికి వాహనం పార్కింగ్కు ఇచ్చే రశీదుపై మాత్రం కేవలం రూ.5 మాత్రమే అని ముద్రించి ఉంటుంది. అయినప్పటికీ టెండరు కాంట్రాక్టుదారులు వాహనానికి రూ.10 వసూలు చేస్తూ రోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ తతంగం గురించి పలుమార్లు రోగులు ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో రోగులు ఫిర్యాదుచేసినా ఫలితంలేదని భావించి ఊరుకున్నారు. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో మెయింటెనెన్స్ కోసం టెండరు వేస్తున్నప్పటికీ ఒకరి పేరుమీద మరొకరు పార్కింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పార్కింగ్ వసూలు చేస్తున్నవారిని వివరణ కోరగా.. కొన్ని సార్లు చిల్లర లేనప్పుడు మాత్రమే రూ.10 తీసుకుంటున్నట్లు చెప్పడం కొసమెరుపు. ప్రతిరోజు వందల వాహనాలు.. జిల్లా ఆస్పత్రి కావడంతో రోగులు, సహాయకులు, బంధువులు నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. వాహనాలు ప్రతి రోజు సుమారుగా 200 నుంచి 300 వరకు వస్తుంటాయి. వీటిలో దిచక్రవాహనాలు, ఆటోలు, కార్లు వస్తుంటాయి. ద్విచక్రవాహనాలకు రూ.5, ఆటో, కార్లు, తదితర వాహనాలకు రూ.10 తీసుకోవాలన్న నిబంధన ఉంది. కాగా ద్విచక్ర వాహనాలకు సైతం రూ.10 వసూలు చేస్తూ దండుకుంటున్నారని రోగులు పేర్కొంటున్నారు. ఆసుపత్రి రోగులను తరలించే అంబులెన్స్లకు సైతం రూ.10 వసూలు దోపిడీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. -
టేక్మాల్ మార్కెట్లో దొంగల హల్చల్
సాక్షి, టేక్మాల్(మెదక్): టేక్మాల్ మార్కెట్లో దొంగల బెడద అధికమైంది. కాస్త ఆదమరిస్తే చాలా వస్తువులు మాయమవుతున్నాయి. ప్రతీ శనివారం నిర్వహించే వారంతపు సంతకు ఉమ్మడి మెదక్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదు. దీంతో ప్రతీవారం సంత కిక్కిరిసిపోతుంది. ఇదే అదును చేసుకుంటున్న తొంగలు రెచ్చిపోతున్నారు. అందికాడికి ఎదిదొరికితే అది ఎత్తుకుపోతున్నారు. పోలీసులకు సవాలుగా మారినా దొంగలు దొరకడంలేదు. అధికంగా సెల్ఫోన్ల చోరీ.. మార్కెట్లో కూరగాయాలకు వెళ్లే సామాన్య ప్రజల నగదను అపహరించుకుపోతున్నారు. కాస్త ఆదమరిచి వస్తువులు పెట్టినా మట్టుకున్నా మాయం చేస్తున్నారు. అంతేకాకుండా మార్కెట్ వచ్చే వారి సెల్ఫోన్లో అపహరణ అధికమైంది. ఇటీవట టేక్మాల్కు చెందినా గర్శ శ్రీనివాస్, జంగంనాగరాజు, విశ్వనాథం, వీరన్న, శంకర్, రాజు, మాదవచారిలతో పాటూ పల్వంచ గ్రామానికి చెందిన పెద్దగొల్ల రాంకిష్టయ్య, బోయిని నారాయణ, సాయిరెడ్డి, నర్సిరెడ్డి ఫోన్లు అపహరణకు గురయ్యాయి. అవుసలి రమేశ్ నగదు పోయాయని వాపోతున్నారు. ఇలా వారానికి రెండు నుంచి సెల్ఫోన్లు అపహరణకు గురవుతున్నాయి. మార్కెట్కు కాస్త అజాగ్రత్త వహించినా వస్తువులు అపహరణకు గురువుతున్నాయని వాపోతున్నారు. కొందరు మార్కెట్కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. స్టేషన్లో ఫిర్యాదులు.. వారంతపు సంతలో నగదు పోయిందని, సెల్ ఫోన్లు పోయాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులు పెరుగుతున్నా.. దొంగలు మాత్రం వారి ఆగడాలను ఆపడంలేదు. పోలీసులు సైతం వారంతపు సంతలో నజర్పెట్టి అనుమానితులను ప్రశ్నించినా ఫలితం లేకపోతుంది. దొంగల ఆచూకి పోలీసులకు అంతుచిక్కకపోవడం లేదు. నిఘాను పెంచుతూ అనుమానితులను ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోయింది. మార్కెట్లోని దొంగలతో పోలీసులకు సవాల్గా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేశా.. గత వారం మార్కెట్లోకి కూరగాయాలు తీసుకోవడానికి వెళ్లాను. పదిహేను వేల రూపాయలగల విలువైన పోన్ అపహరణ గురయింది. ఎంత వెతికినా దొరకలేదు. దొంగల బెడద అధికమయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. మార్కెట్లోని దొంగలను పట్టుకోవాలి. – గర్శ శ్రీనివాస్, టేక్మాల్ పట్టుకుంటాం.. పిర్యాదులు వచ్చిన మాట నిజమే. మార్కెట్ రోజు గస్తీలో సిబ్బందిని పెడతాం. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచుతాం. మార్కెట్కు వెళ్లెవారు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలి. అనుమానితులు కంటపడితే సమచారం ఇవ్వండి. దొంగలపై శాఖాపరమైన చర్యలు తప్పవు. – షాబొద్దీన్, ఎస్ఐ, టేక్మాల్ -
జవాన్ విగ్రహానికి రాఖీ
సాక్షి, హుస్నాబాద్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ పండుగ ఈ పండుగ రోజు తమ సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టి ఆశీర్వదిస్తారు. ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం అయితే తన సోదరుడు చనిపోయిన అతని విగ్రహానికి రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల అనుబంధం ఎంత గొప్పదో చాటి చెబుతున్నారు. ఏటా జ్ఞాపకార్థం.. అక్కన్నపేట మండలంలోని దుబ్బతండా గ్రామ పంచాయితీ పరిధిలోని రాజుతండాకు చెందిన గుగులోతు నరసింహనాయక్కు ముగ్గురు అక్కలు ఉన్నారు.అతడు సీఆర్పీఎఫ్ జవానుగా పనిచేస్తూ 2014లో నక్సల్స్ మందుపాతరలో మృతి చెందాడు.అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లింగయ్యనాయక్ సత్తవ్వ తమ వ్యవసాయ పొలంలో విగ్రహాని ఏర్పాటు చేశారు. ఒక్కగానొక్క సోదరుడు చనిపోవడంతో తాము రాఖీ ఎవరికి కట్టాలని అతని సోదరీమణులు విగ్రహంలోనే తమ తమ్ముడుని చూసుకుంటున్నారు. ఏటా రాఖీ పండుగా రోజు విగ్రహానికి రాఖీ కట్టా పండుగా జరుపుకొంటారు.అలాగే కాకుండా ప్రతి ఏటా స్వాతంత్ర,గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నరసింహ నాయక్ విగ్రహాం ఎదుట జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటి చెబుతున్నారు. -
ఉద్యమంలో కిషన్రెడ్డిది కీలకపాత్ర
సాక్షి, నర్సాపూర్: తండ్రిని ఎదిరించి టీఆర్ఎస్ జెండా పట్టి తెలంగాణ ఉద్యమంలో ముందున్న చిలుముల కిషన్రెడ్డి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం కౌడిపల్లిలో దివంగత టీఆర్ఎస్ నాయకుడు, కేంద్ర కార్మికశాఖ కనీస వేతనాల కమిటీ మాజీ చైర్మన్ చిలుముల కిషన్రెడ్డి ప్రథమ వర్ధంతిని భార్య సుహాసినిరెడ్డి, కొడుకు శేషసాయిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్, మెదక్ ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవెందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్గౌడ్, మాజీ మంత్రి సునీతారెడ్డి, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ నాయకులు రఘునందన్రావ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి సమాధివద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అతనిలేని లోటు తీరనిదని ఆత్మకు శాంతి కలగాలన్నారు. అతని కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామన్నారు. అనంతరం ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కిషన్రెడ్డి మృతి నియోజకవర్గానికి టీఆర్ఎస్కి తీరనిలోటన్నారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తన గెలుపుకోసం తమ్ముడు కిషన్రెడ్డి ఎంతగానో కృషిచేశాడని తెలిపారు. మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ కిషన్రెడ్డి తన క్లాస్మెట్ అని అందరితో కలివిడిగా ఉండి ప్రజాసేవకు పాటుపడ్డ వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ యాదవ్, నాయకులు నరేంద్రనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి గోపి, స్థానిక ఎంపీపీ రాజు, జెడ్పీటీసీ కవిత అమర్సింగ్, ఏఎంసీ చైర్మన్ హంసీబాయ్, మండల సర్పంచ్లఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు లక్ష్మీరవీందర్రెడ్డి, కృష్ణగౌడ్, దుర్గాగౌడ్, శెట్టయ్య, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. స్వగృహంలో.. నర్సాపూర్: చిలుముల కిషన్రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి మాజీ మంత్రులు హరీశ్రావు, సునీతారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్ర భాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిలుములమదన్రెడ్డి, పద్మ, టీఆర్ఎస్ నాయకులు దేవేందర్రెడ్డి, మురళీధర్యాదవ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కిషన్రెడ్డి భార్య సుహాసినిరెడ్డి, తనయుడు చిలిపిచెడ్ జెడ్పీటీసీ సభ్యుడు చిలుముల శేషసాయిరెడ్డిలను పరామర్శించారు. కాగా పలువురు స్థానిక నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. నివాళులు అర్పిస్తున్న మాజీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు -
నాకు చిన్నప్పుడు గణితం అర్థమయ్యేది కాదు: మంత్రి
సాక్షి, పటాన్చెరు: గణిత శాస్త్రం అర్థం చేసుకోవడం కష్టం అయితే అది అర్థమైయ్యిందంటే అందులోనే నూటికి నూరుశాతం మార్కులు పొందవచ్చని మంత్రి జగదీశ్రెడ్డి వివరించారు. తనకు చిన్నప్పుడు గణితశాస్త్రం అర్థమయ్యేది కాదన్నారు. తనతో పాటు చదువుకున్న 60 విద్యార్థుల్లో ఏడో తరగతి వచ్చేసరికి 27మంది మాత్రమే చదువులు కొనసాగించారని గుర్తు చేశారు. మిగతా వారంతా చదువు మానేశారన్నారు. మానవ జీవితంలో గణిత శాస్త్రం చాలా ప్రాముఖ్యమైందని ఆయన విశ్లేషించారు. శుక్రవారం పటాన్చెరు మండలం పరిధిలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ మ్యాథమటికల్ సైన్సెస్ అండ్ అప్లికేషన్స్ను మంత్రి ప్రారంభించారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్ కూడ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ మనిషి జీవితానికి, గణితానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తగినట్టుగా అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానమంతా గణిత శాస్త్రంతో ముడిపడినదేనని జగదీశ్రెడ్డి వివరించారు. ప్రాథమిక విద్యస్థాయిలో గణితంపై పట్టు సాధించకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గణితం మాస్టార్ కోసం ఆరా తీస్తున్న మంత్రి ‘తన కూతురు ఇటీవల లెక్కల్లో వెనుకబడిందని తెలిసింది. ఆమెలో లెక్కలంటే భయం లేకుండా చేయాలనేది నా ప్రయత్నం. అయితే రెండు నెలలుగా ఓ లెక్కల మాస్టార్ కోసం వెతుకుతున్నా’ అని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. చిన్నారుల్లోని నిగూడమైన సృజనాత్మక శక్తిని వెలికితీయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఆయన విశదీకరించారు. చిన్నారుల్లో అంత ఒత్తిడి అవసరమా..? ‘చిన్నప్పుడు లెక్కల్లో మంచి మార్కులు వచ్చేవి. వందకు వంద మార్కులు వచ్చేవి. ఆ తరువాత నన్ను ఫిడ్జి స్కూల్లో వేశారు. మార్కులు తగ్గాయి. తల్లిదండ్రులు నన్ను ఐఐటీ చదవాలనే ఉద్ధేశ్యంతో ఆ స్కూళ్లో వేశారు. ఐఐటీ చేయలేనని చెప్పేశాను. ఆ తరువాత అమెరికాలో ఓ యూనివర్సిటలో గణిత ప్రాధాన్యతతో కూడిన గ్రాడ్యుయేషన్ చేస్తున్నా ప్రథమ మూడు పరీక్షల్లో ఏ మాత్రం చదవకపోయినా మంచి మార్కులు వచ్చాయి. దానికి కారణం దేశంలో ప్రాథమికస్థాయిలో చదివిన ఫౌండేషన్ కోర్సులే కారణం. అయితే నాకనిపిస్తుంది పిల్లలకు ఆ స్థాయిలో డిగ్రీలో నేర్పే కోర్సులు అవసరమా అంత వత్తిడి ఎందుకు’అని గీతం అధ్యక్షుడు శ్రీభరత్ అన్నారు. గణితం అనే తర్కమని(లాజిక్), అది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమని శ్రీభరత్ అన్నారు. కాన్ఫరెన్స్కు వచ్చిన స్పందనను నిర్వాహకుడు ప్రొఫెసర్ మారుతీరావు వివరిస్తూ వంద పరిశోధన పత్రాలు సమర్పిస్తారని భావిస్తే.. తమ అంచాలకు మించి 300 పరిశోధనా పత్రాల సమర్పణకు గణితశాస్త్ర పరిశోధకుడు ఈ కాన్ఫరెన్స్కు హాజరవుతున్నారని తెలిపారు. గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇండియన్ మాథమెటికల్ సొసైటీ అధ్యక్షుడు ప్రొ.ఎస్.ఆర్ముగం, ఆంధ్రా–తెలంగాణ మాథమెటికల్ సొసైటీ అధ్యక్షుడు కేశవరెడ్డి, అమెరికా నుంచి వచ్చిన తెలుగు శాస్త్రవేత్త జెర్మయ్య కె.బిల్లా పాల్గొన్నారు. -
నేడు ఐఐటీ హైదరాబాద్ 8వ స్నాతకోత్సవం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాకు తలమానికంగా ఉన్న హైదరాబాద్ ఐఐటీ దేశంలోనే ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులను తయారుచేస్తోంది. సుమారుగా 11ఏళ్ల ప్రస్థానంలో 250 మంది విద్యార్థులను పీహెచ్డీలో గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్దింది. ఈ ఐఐటీ ప్రాంగణం 8వ స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 10వ తేదీ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు స్నాతకోత్సవం జరగనుంది. ఇందుకు ప్రత్యేకంగా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. స్నాతకోత్సవానికి సంబంధించి ప్రొఫెసర్లు, విద్యార్థులు, సిబ్బంది రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ని 2008లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంజూరైన ఈ ఐఐటీని అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్.వైఎస్.రాజశేఖర్రెడ్డి జిల్లాకు కేటాయించారు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఐఐటీలో ప్రారంభంలో కేవలం మూడు ఇంజనీరింగ్ కోర్సులను మాత్రమే ప్రవేశపెట్టారు. ప్రారంభ సంవత్సరంలో బీటెక్ సీఎస్ఈ, ఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉండేవి. వీటిలో 40 మంది విద్యార్థులకు ఒక కోర్సు చొప్పున 120 మంది విద్యార్థులకే ప్రవేశం ఉండేది. ఇంతితై.. వటుడింతై హైదరాబాద్ ఐఐటీ ప్రస్తుతం దేశంలోనే 8వ ర్యాంకులో ఉందంటే.. కేవలం దశాబ్ధ కాలంలోనే ఎంత ఎత్తుకు ఎదిగిందో ఊహించవచ్చు. దేశంలో మొత్తం 23 ఐఐటీలు ఉన్నాయి. నాడు 120 మంది విద్యార్థులు.. మూడు ఇంజనీరింగ్ కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూషన్లో ప్రస్తుతం 10 కోర్సులు (డిపార్ట్మెంట్స్)తో 2,900 మంది విద్యార్థులున్నారు. సీఎస్ఈ, ఈఈ, మెకానికల్ కోర్సులతో పాటు గా ప్రస్తుతం సివిల్, కెమికల్, మెటీరియల్ సైన్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, మాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులలో విద్యాబోధన జరుగుతున్నది. ఈ సంవత్సరం నుంచి బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఎం టెక్లో క్లైమేట్ చేంజ్ (వాతావరణ మార్పు లు) అనే కోర్సులను ప్రవేశపెడుతున్నారు. టీచింగ్తో పాటు రీసెర్చ్కు ప్రాధాన్యం హైదరాబాద్ ఐఐటీలో కేవలం విద్యాబోధనకే కాకుండా రీసెర్స్ (పరిశోధన), ఇన్నోవేషన్స్ (కొత్త విషయాలను కనుక్కోవడం)కు ప్రాధాన్యత నిస్తున్నారు. కేవలం 120 మంది విద్యార్థులు.. 3 కోర్సులతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూట్లో ఈ విద్యాసంవత్సరంలో 2,900 మంది విద్యార్థులు.. 900 మంది పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారంటే అనతికాలంలోనే ఎంత ఉన్నతస్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. టీచింగ్తో పాటు రీసెర్చ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. మరో మూడేళ్లలో 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు.. ప్రస్తుతం 2,900 మంది ఉన్న ఈ ఐఐటీలో రానున్న మూడేళ్ల కాలంలో మొత్తం 5 నుంచి 6 వేల మంది వరకు ఉండే అవకాశం ఉంది. రెండో దశ భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా రూ.90 కోట్లు కేటాయించారు. ఈ నిర్మాణాలను జపనీస్ సంస్థ ‘జైకా‘ చేపట్టింది. ఎల్అండ్టీ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తవుతాయి. దీంతో ప్రస్తుతం ఉన్న విద్యార్థులతో కలిపి 5 నుంచి 6 వేల మంది విద్యార్థులకు ఈ ప్రాంగణం విద్యతో పాటుగా ఆశ్రమం (అకామిడేషన్) కల్పించనుంది. ఒకేసారి సుమారుగా 800 మంది కూర్చోవడానికి గాను ఆడిటోరియం నిర్మిస్తున్నారు. మధ్యాహ్నం కార్యక్రమం.. హైదరాబాద్ ఐఐటీ 8వ స్నాతకోత్సవం శనివారం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ముఖ్య అతిథిగా రానున్నారు. పాస్అవుట్ విద్యార్థులతో పాటుగా ప్రతీ విద్యార్థి వెంట ఇద్దరిని అనుమతిస్తున్నారు. సుమారుగా 2వేల మంది ఈ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఈయనతో పాటుగా అతిథులుగా హైదరాబాద్ ఐఐటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ బీవీఆర్.మోహన్రెడ్డి, అఫిసియేటింగ్ (ఇంచార్జి) డైరెక్టర్ సీహెచ్.సుబ్రమణ్యన్ హాజరుకానున్నారు. మ ధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఈ స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ ఐఐటీ నుంచి 560 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ శిక్షణ పూర్తిచేసుకొని పాస్అవుట్ అవుతున్నారు. వీరిలో 68 మంది పీహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు. కొత్త ఆవిష్కరణలకు వేదిక దేశంలోని ఏ ఐఐటీకి కూడా తీసిపోని విధంగా హైదరాబాద్ ఐఐటీని కొత్త ఆవిష్కరణలకు వేదిక చేశాం. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా ఈ ఐఐటీలో ప్రవేశం పొందుతున్నారు. టీచింగ్తో పాటుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. దేశంలోని 23 ఐఐటీలలో ప్రస్తుతం 8వ ర్యాంకులో ఉంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఐఐటీని దేశంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. మరో ప్రత్యేకత ఏమిటంటే..ఈ ఇన్స్టిట్యూట్లో విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు గల విద్యార్థులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యాకల్టీకి కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. – సీహెచ్. సుబ్రహ్మణ్యన్, ఇన్చార్జి డైరెక్టర్, హైదరాబాద్ ఐఐటీ -
శ్మ'శాన' పనుంది!
సాక్షి, అందోల్: జనన మరణాలు రెండే మానవ జన్మలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్న కార్యాలు. జననం ప్రతీ ఒక్కరిలో ఆనందాన్ని కలిగించి.. మరణం మాత్రం కుటుంబాల్లో ఆత్మీయుల్లో విషాదాన్ని నింపుతుంది. జన్మనెత్తిన ప్రతీ వారు జీవిత పయనంలో ఒకనాడు కాలం చేయక తప్పదు. చివరి పయనంలో జ్ఞాపకాలన్నింటినీ ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చే స్థలమే శ్మశానం. అంత్యక్రియలు నిర్వహించే స్థలం అక్కడ కనీస సౌకర్యాలు లేకపోతే ఎంతో బాధని కలిగిస్తుంది. స్వాతంత్య్ర సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా కనీసం శ్మశానవాటికలకు స్థలం కోసం ఇంకా పాలకులకు ప్రాధేయపడాల్సి రావడం విచారకరం. ప్రజల అవస్థలు.. అందోలు మండలంలోని అనేక గ్రామాల్లో శ్మశానవాటికలు వాటిల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు గ్రామాలలోకి వచ్చిన సమయంలో శ్మశానవాటికలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని మొరపెట్టుకున్నా అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాలలో స్థలం కేటాయింపులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ స్థలాలు ఉంటే వాటి సమీపంలో ఉన్న రైతులు ఆక్రమించుకోవడం లేదా కంప చెట్లతో కనీస సౌకర్యాలు లేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చేసేదిలేక చెరువుల్లో ఖననం చేయాల్సిన దుస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందోలు మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో డాకూరు గ్రామంలోనే శ్మశాన వాటిక పనులను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. శ్మశాన వాటికలనూ వదలడం లేదు.. గ్రామాలల్లో శ్మశానవాటికలు ఉన్నప్పటికీ వాటి పక్కనే స్థలం ఉన్న వ్యక్తులు వాటిని ఆక్రమించుకుంటున్నారు. పలుసార్లు గ్రామాల ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పరిష్కారం చేయకపోవడంపై విమర్శలను ఎదుర్కొంటున్నారు. స్థలాలు లేక రోడ్ల పక్కనే ఖననం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మండలంలో 14 శ్మశానవాటికలకు నిధులు మండలం పరిధిలోని 14 గ్రామాలల్లో శ్మశానవాటికలు నిర్మించేందుకు గాను ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఒక్కొక్కదానికిగాను రూ.10 లక్షలు మంజూరు చేశారు. మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉండగా స్థలాలు అనుకూలంగా ఉన్నందుకుగాను 14 గ్రామాలకే నిధులు మంజూరు అయ్యాయి. మిగతా పది గ్రామాల్లో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదు. మండలంలో డాకూరు, నాదులాపూర్ గ్రామాలలో మాత్రమే పనులు ప్రారంభించగా అవి కూడా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కొత్త సర్పంచ్లు అనుకూలంగా ఉన్నారు శ్మశాన నిర్మాణాలకు నిధులు మంజూరైన చోట కొత్తగా గెలుపొందిన సర్పంచ్లు నిర్మించేందుకు సానుకూలంగా ఉన్నారు. ఒక్కొక్క శ్మశానవాటికకు రూ.10లక్షలు మంజూరు అయ్యాయి. అసంపూర్తిగా ఉన్న డాకూరు, నాదులాపూర్ గ్రామాల్లో కూడా తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కేవలం 14 పంచాయతీల్లో మాత్రమే నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయి. – సత్యనారాయణ, ఎంపీడీఓ, అందోలు -
కత్తిమీద సాములా మారిన సర్పంచ్ పదవి!
సాక్షి, జోగిపేట: గ్రామ సర్పంచ్తోపాటు పాలకవర్గ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం గురుతర బాధ్యతలు అప్పగించింది. వారు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే పదవికే గండం వాటిల్లేలా నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజాప్రతినిధుల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఏదో గెలిచాం. గ్రామాభివృద్ధి చూసుకుందాం అనుకున్నవారికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోకుంటే పదవికే ఎసరు వచ్చే కొత్త చిక్కు వచ్చిపడడం ఆందోళనలో పడేసింది. ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచ్లు, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు విధిగా హరితహారం, పారిశుధ్య, జల సంరక్షణ వంటి అంశాలపై అత్యంత శ్రద్ధ పెట్టాలి. నాటిన ప్రతీ మొక్కను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. గ్రామాల్లో ఇంటింటా ఇంకుడు గుంతలను విధిగా తవ్వించి వర్షపు నీటిని ఒడిసిపట్టే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత సర్పంచ్లకు అప్పగించింది. ప్రతీ గ్రామంలో శత శాతం పారిశుధ్య నిర్వహణకు చర్యలు తీసుకునేలా ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత, దోమలు, ఈగల నిర్మూలన వంటి అంశాల్లో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతీ శుక్రవారం ‘స్వచ్ఛ శుక్రవారం’ పేరిట అన్ని పంచాయతీల్లోని ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి అపరిశుభ్రతను పారదోలడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయంలోనూ గ్రామ సర్పంచ్లే క్రియాశీలకంగా వ్యవహరించాలి. అన్నీ తానై.. తానే అన్నీ అన్న చందంగా వారు పని చేయాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవి గతంకంటే భిన్నంగా.. మరింత బాధ్యతాయుతంగా ఉండనుంది. ఒకవైపు పాలనాపరమైన నిర్ణయాలతోపాటు మరోవైపు పదవిని కాపాడుకునేందుకు ఎలాగైనా ప్రభుత్వ లక్ష్యాలను విధిగా పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే సర్పంచ్ పదవీ గండం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. పారిశుధ్య నిర్వహణపై సమగ్ర కార్యాచరణ పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతీ గ్రామంలో మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాల్సిన బాధ్యత సర్పంచ్లపై ఉంది. దీంతోపాటు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వారు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. క్రమక్రమంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పడం, ప్రజలను ప్లాస్టిక్కు దూరంగా ఉంచడం, ఇంటింటికి చెత్తబుట్టల పంపిణీని సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలి. తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపు యార్డులకు సక్రమంగా తరలిస్తున్నారో లేదో పర్యవేక్షించాల్సిన బాధ్యత సర్పంచ్లపై ఉంటుంది. గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త ఉంటే దానికి ఆ గ్రామ సర్పంచ్, కార్యదర్శులే బాధ్యులవుతారని ప్రభుత్వం హెచ్చరించింది. సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్న క్రమంలో సర్పంచ్లు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మొక్క ఎండితే పదవికి ముప్పే జిల్లావ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 1.91 కోట్ల మొక్కలను నాటించాలనే సంకల్పంతో యంత్రాంగం పనులు ప్రారంభించింది. వర్షాభావ పరిస్థితులతో హరితహారం కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిర్వహించ లేదు. అక్కడక్కడా ఎవెన్యూ ప్లానిటేషన్ను ప్రారంభించారు. గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో నీటి లభ్యత లేక మొక్కలు ఎండిపోయాయి. ఈ క్రమంలో పరిస్థితి ఇలాగే ఉంటే నాటిన మొక్కల సంరక్షణ అనేది సర్పంచ్లకు కఠిన సవాలుగా మారనుంది. అధికారుల లెక్కల ప్రకారం ఉన్న మొక్కలు, నర్సరీల్లో ఉన్న మొక్కలకు చాలా వ్యత్యాసాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 647 గ్రామపంచాయతీల్లో 80 శాతం వరకు మొక్కలను సర్పంచ్లే రక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తేల్చింది. కొత్త పంచాయతీ చట్టం ప్రకారం అవినీతికి పాల్పడినా, విధులు, బాధ్యతల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహించినా ఆ సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, కార్యదర్శులను తీసివేసే అధికారం ప్రభుత్వానికి ఉండటంతో పంచాయతీ పాలకవర్గాల్లో గుబులు మొదలైంది. అంతే కాకుండా ఈ విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త చట్టంపై పునరాలోచించాలి ప్రజాస్వామ్య పద్ధతిలో సర్పంచ్గా ఎన్నికై గ్రామ ప్రథమ పౌరులుగా ఉండే వ్యక్తులను మొక్కల పెంపకం సాకుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. పారదర్శకమైన పాలన అందించకుండా, గ్రామాభివృద్ధి, గ్రామ సమస్యలపై నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేయడం వంటి విషయాలపై చర్యలు తీసుకుంటే బాగుంటుంది తప్ప వాతావరణ పరిస్థితులపై ఆధారపడే మొక్కల పెరుగుదలకు లింకు పెట్టడంపై అభ్యంతరాలున్నాయి. ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు. నాతో చాలా మంది సర్పంచ్లు ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నారు. ప్రజాప్రతినిధుల గౌరవం పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుండేది. కత్తి పట్టుకొని సర్పంచ్లతో పని చేయించే విధంగా కొత్త చట్టం ఉందనిపిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. – కలాలి పూజ, డాకూరు సర్పంచ్ -
జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సాయం!
సాక్షి, సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో మరణించిన ‘సాక్షి’ క్రైం రిపోర్టర్ బ్యాగరి నర్సింహులు కుటుంబ సభ్యులకు కలెక్టరేట్ ఆవరణలో సంగారెడ్డి వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ తరపున రూ.10 వేలు, కలెక్టర్ ఎం.హన్మంతరావు తన వంతుగా రూ.5 వేలు శుక్రవారం ఆర్థిక సాయం అందజేశారు. జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సాయినాథ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి డేవిడ్ రాజ్, సంతోష్, నాగభూషణం, రమేష్, రఘునందన్, డీపీఆర్ఓ పాల్గొన్నారు. -
పాములను ప్రేమించే శ్రీను ఇకలేడు..
సాక్షి, పటాన్చెరు: అతడు పాములను ప్రేమించేవాడు. ఎవరైనా పాము అని భయపడుతున్నారంటే వారి భయం పోగొట్టేందుకు వాటిని పట్టుకునేవాడు. వాటిని మనుషుల సంచారం లేని చోట సురక్షితంగా వదిలివేసేవాడు. ఇది అతడి వృత్తి కాదు.. ప్రవృత్తి. పాములు పట్టడం అతడికో హాబీ.. ఇంట్లోవాళ్లు వద్దన్నా వినేవాడు కాదు. అతడికి ఉద్యోగం ఉంది. అయినా పాములంటే భయపడే జనానికి ఊరట కలిగించడానికి వాటిని పట్టుకోవడం అభిరుచిగా పెట్టుకున్నాడు. చివరికి ఆ హాబీ అతడి ప్రాణం తీసిన హృదయ విదారక సంఘటన పటాన్చెరు ప్రజలను కలచివేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో, గ్రామంలో, జిల్లాలో ఇతర చోట్ల ఎక్కడైనా పాము కనిపిస్తే ముందుగా అందరికి అభిరుచిగా పాములు పట్టే వ్యక్తి శ్రీనివాస్ ముదిరాజ్ అలియాస్ ధనుష్ గుర్తుకు వచ్చేవాడు. శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థలో కొంత కాలంగా కొనసాగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రికి చెందిన రాజు, జయలక్ష్మిలు ముగ్గురు పిల్లలతో కలసి బతుకుదెరువు కోసం 30 సంవత్సరాల క్రితం పటాన్చెరు పట్టణానికి వచ్చి శాంతినగర్ కాలనీలో ఉండేవారు. రాజు, జయలక్ష్మిల పెద్ద కూతురు వివాహం కాగా, రెండో కుమారుడు శ్రీనివాస్ ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయంలో ఎవరైనా పాములు తిరుగుతున్నాయని, ఇబ్బందులు పడుతున్నామని చెపితే చాలు శ్రీనివాస్ ఉచితంగా పాములను పట్టి మనుషులు తిరగని చోట్ల వదిలే వాడు. ఇది అతడికో హాబీగా మారింది. పాములు పట్టొద్దని ఇంట్లో వారు చెప్పినా సరే వారికి చెప్పకుండా వెళ్లి అదే పని చేసేవాడు. అలాంటి శ్రీనివాస్ గురువారం వికారాబాద్ జిల్లాకు పనిపై వెళ్లగా అక్కడ మోమిన్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో మర్పల్లి మండలం కొంశెట్టిపల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి నాగుపాము వచ్చిందని ఫోన్ రావడంతో అక్కడే ఉన్న శ్రీను దాన్ని పట్టడానికి వెళ్లాడు. అయితే పామును పట్టే క్రమంలో అది రెండు సార్లు శ్రీనివాస్ను కాటు వేసింది. అయినా ఆ పామును పట్టుకొని భద్రపరిచాడు. అనంతరం సదాశివపేట ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. దీంతో చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ వార్త తెలియడంతో పటాన్చెరు పట్టణంలో విషాదం అలుముకుంది. -
గ్రామాభివృద్ధికి సహకరించాలి :జిల్లా కలెక్టర్
సాక్షి, ఝరాసంగం: గ్రామ ఆరోగ్య వేదిక కార్యక్రమం ద్వారా గ్రామాలు ఆదర్శవంతంగా మారాలని, అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని నర్సాపూర్లో గ్రామ ఆరోగ్య వేదిక ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలోని శిథిల పాఠశాలతో పాటు ప్రధాన రహదారిలోని మురికి కాల్వలు, ఇంటి ఆవరణలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో ముఖ్యంగా ఆరోగ్యం, పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. వైద్యశాఖ అధికారులు వ్యాధుల లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. కళాకారులచే కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఆయన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామం ఒక అంశంలో మాత్రమే కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో పాతటైర్లు, కొబ్బరి చిప్పలు తొలగించాలన్నారు. వర్షాలు కురిసిన సమయంలో నీటి నిల్వతో డెంగ్యూతో పాటు తదితర వ్యాధులు ప్రభలే అవకాశం ఉందన్నారు. ప్రతి శుక్రవారం పరిసరాలను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించేందుకు బుట్టలను పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. గ్రామంలో స్థలం లేనందున ఎవరైనా 10 గుంటల స్థలం ఇప్పించేందుకు ముందుకు రావాలని కోరారు. గ్రామాల్లో యువజన సంఘాలు ఏర్పాడి గ్రామాభివృద్దికి సహకరించాలన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పేర్కొన్నారు. సిద్దిపేటలోని ఇబ్రహీంపూర్, తుప్రాన్లోని మల్కాపూర్ గ్రామాల మాదిరి ఆదర్శవంతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవదాసు, సర్పంచ్ శశిరేఖశ్రీనివాస్రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ జితిష్బీ.పాటిల్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి మోజీరాంరాథోడ్, జిల్లా పశువైద్యాధికారి రామారావు రాథోడ్, ఇమ్యూనైజేషన్ అధికారిణి గాయత్రీదేవి, ఎంపీడీఓ సుజాత, మండల వైద్యాధికారి మజీద్ తదిరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొనడంతో.. అంధకారంలో 20 గ్రామాలు!
సాక్షి, పటాన్చెరు: జిన్నారం-బొంతపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని మంగళవారం గుర్తు తెలియని ఓ భారీ వాహనం ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని సుమారు 20 గ్రామాల్లో అంధకారం అలుముకుంది. మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినా మరమ్మతులు చేయడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాలు అంధకారంలో ఉండాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. -
సంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రిలో రోగి భందువులు ఆందోళన
-
మాత శిశు రక్షణ కేండ్రంలో పసిపాప అదృశ్యం
-
జోష్ నింపిన చంద్రశేఖరుడు
సాక్షి, నర్సాపూర్ రూరల్: కేసీఆర్ సభ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. జహీరాబాద్, మెదక్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అల్లాదుర్గం, నర్సాపూర్లలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. దీంతో సభ పరిసరాలు గులాబీ మయమయ్యాయి. టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డిలకు మద్దతుగా నిర్వహించిన ఈ సభల్లో గులాబీ బాస్ కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమైందని, మెజార్టీయే ప్రధానమని పేర్కొన్నారు. కళాకారుల నృత్యాలు, ఆటపాటలు కార్యకర్తలను ఉత్సాహ పరిచాయి. దీంతో సభ ప్రాంగణాలు సందడిగా మారాయి. వాతావరణం సైతం చల్లబడటంతో జనం ఉత్సాహంగా సమావేశానికి తరలివచ్చారు. నర్సాపూర్ సభ హైలైట్స్: ∙ సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్ 6:19 నర్సాపూర్ సభ వద్దకు చేరుకుంది. ∙ సీఎం కేసీఆర్ 6:42 నుంచి ప్రసంగాన్ని ప్రారంభించి 7:2గంటల వరకు మాట్లాడారు. ∙ సభ ప్రాంగణం వద్ద నీటి ప్యాకెట్ల కోసం జనం ఎగబడ్డారు. ∙ మధ్యాహ్నం నుంచి సభ ప్రాంతంలో చిరు తిండ్ల వ్యాపారం జోరుగా కొసాగింది. ∙ దిగవంత టీఆర్ఎస్ నేత చిలుముల కిషన్రెడ్డి భార్య సుహాసినిరెడ్డిని సీఎం సభ వేదికపై అసీనులయ్యే ముందు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ∙ సభలో మెదక్ లోక్సభ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి ప్రసంగం చేస్తుండగా సభ వేదికపైకి సీఎం రావడంతో మధ్యలోనే ఆపేశారు. ∙ సభ వద్దకు వచ్చే ప్రజలను, నాయకులు, కార్యకర్తలను పోలీసులు మెటల్ డిటెక్టర్తో క్షుణంగా తనిఖీ చేసి అనుమతించారు. ∙ రెండు కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేయడంతో సభ ప్రాగంణ వద్దకు వృద్ధులు, దివ్యాంగులు కాలినడకన చేరుకున్నారు. ∙ సీఎం ప్రసంగాన్ని నర్సాపూర్–వెల్దుర్తి ప్రధాన రహదారిపై నిలబడి శ్రద్ధగా విన్నారు. ∙ నర్సాపూర్ పట్టణం నుంచి సభా ప్రాంగణం వరకు వరంగల్కు చెందిన ఓగ్గు కళాకారులు డోల్ దెబ్బ విన్యాసల ప్రదర్శన కొనసాగింది వారి వెనుక నర్సాపూర్ ప్రజలు నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివెళ్లారు. ∙ గిరిజనులు నృత్యలు ఆకట్టుకున్నాయి. కళాకారుడు, గాయకుడు సాయిచంద్ ఆటపాటలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అల్లాదుర్గం సభ హైలైట్స్ ∙ అల్లాదుర్గం మండలం చిల్వెర ఐబీ చౌరస్తాలోని సభ ప్రాంగనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 5 గంటల ప్రాంతంలో హెలీకాప్టర్ చేరుకుంది. ∙ సభా వేదికపైకి సీఎం 5.15 గంటలకు చేరుకున్నారు. ∙ ముఖ్యమంత్రి కేసీఆర్ 21 నిమిషాలు ప్రసంగించారు. ∙ సీఎం ప్రసంగం ముగియగానే ప్రజలు భారీకేడ్లను తొలగించుకుని వెళ్లిపోయారు. ∙ బాజాభజంత్రీలతో ర్యాలీగా నృత్యం చేస్తూ కార్యకర్తలు సభా స్థలికి చేరుకున్నారు. ∙ అల్లాదుర్గం చౌరస్తా నుంచి చిల్వెర గ్రామం వరకు 3 కిలోమీటర్ల రోడ్డు జన ప్రవాహంతో నిండిపోయింది. ∙ టీవీ యాంకర్ మంగ్లీ, కళాకారులు ఆట పాటలతో ప్రజలను ఉత్సాహపరిచారు. ∙ వాహనాల పార్కింగ్ వాహనాలతో నిండిపోయింది ∙ సభ స్థలంలో గిరిజన నృత్యాలు అలరించాయి. ∙ ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులు సంస్కృతి ప్రతిబింబించేలా గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి సభకు వచ్చారు. ∙ నారాయణఖేడ్ను జిల్లాగా ప్రకటించాలని యువకులు ప్లకార్డులు పట్టుకున్నారు. ∙ సీఎం హెలీక్యాప్టర్ సభాస్థలి వద్ద ఒక రౌండ్ తిరగడంతో ప్రజలు దాన్ని చూసేందుకు పైకి చూశారు. ∙ సీఎం సభ ముగిసిన తర్వాత హెలీప్యాడ్ వద్ద 15 నిమిషాల పాటు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. -
‘రాఫెల్పై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు’
సాక్షి, సంగారెడ్డి : ఎన్నికలకు ముందు డ్రామాలో భాగంగానే కేసీఆర్ మోదీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని, రాఫెల్పై కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. సంగారెడ్డిలో సోమవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ మోదీని సపోర్ట్ చేస్తాడని, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని సమర్థించాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ పేదరికాన్ని అంతం చేయాలనకుంటే.. మోదీ పేదలనే అంతం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. కనీస ఆదాయానికి దిగువనున్న 5కోట్ల కుటుంబాలకు ఏడాది 3.60లక్షల సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. మోదీ ఉదయం లేచింది మొదలు 15మంది ధనవంతుల సహాయం కోసమే పనిచేస్తారని ఆరోపించారు. మోదీ పేదలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. కాంగ్రెస్ పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని తెలిపారు. చైనాలో రోజుకు 50వేల కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుంటే.. దేశంలో మాత్రం 27వేల ఉద్యోగాలు కోల్పోతున్నారని వివరించారు. పెద్దనోట్ల రద్దును ఏ ఆర్థిక వేత్తను అడిగినా పిచ్చితనమని అంటారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే.. జీడీపీలో ఆరు శాతం నిధులు విద్యారంగంపై ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు. హరిత, శ్వేత, టెలికాం విప్లవాలను తీసుకొస్తామన్నారు. పంట పొలాల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుతో రైతుల మెరుగైన ధరలు వస్తాయన్నారు. మోదీ ధనికులు, పేదలు అంటూ రెండు రకాల భారతదేశాలను ఏర్పర్చాలనుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో 15లక్షలు అన్నప్పుడే.. మోదీ అబద్దం చెబుతున్నాడని, అది అసాధ్యమని తనకు తెలుసన్నారు. -
అందోల్లో ఘర్షణ టీఆర్ఎస్ కార్యకర్తకు తీవ్ర గాయాలు
మునిపల్లి (అందోల్): ఇరువర్గాల మధ్య ఘర్షణలో ఓ టీఆర్ఎస్ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. హిమ్రాన్ పటేల్కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం సదాశివపేటలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికిరణ్ పరామర్శించారు. ఈ దాడితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. గొడవకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బంక్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు..
-
శ్రీవల్లి క్లీనిక్లో చట్టవిరుద్ధంగా అబార్షన్లు
-
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి) : వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఫైజల్,జిల్లా ఆధ్యక్షకార్యదర్శులు మల్లికార్జున్ రెడ్డి,విష్ణు ప్రసాద్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం పట్టణంలోని ఐబీలో స్థానిక జర్నలిస్టులతో కలిసి జర్నలిస్టుల గర్జన గోడ పత్రిక,కర పత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగాలలో పని చేస్తున్న జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారన్నారు. ఉద్యమ వార్తలను, ఉద్యమకారుల ఆందోళన, నిరసనను ప్రభుత్వానికి చాటి చెప్పడానికి విలేకరులు ఎంతోగానో శ్రమించారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న ఇప్పటి వరకు జర్నలిస్టుల న్యాయ పరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు. ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్యసేవలను అందించాలని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ నెల 28వ తేదీన ఉదయం 11గంటలకు హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో జర్నలిస్టుల గర్జన బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఉల్లిగడ్డల శివకుమార్, హాజీ, నరేశ్, విజయ్, నెల్లి శ్రీనివాస్, సిద్ధు, బుచ్చయ్య, నర్సిములు, లింగం, శేఖర్, శివకుమార్ గౌడ్, నగేశ్, చిరు, మహేశ్, విశ్వనాథం పాల్గొన్నారు. -
కన్నుల పండుగగా మంజీరా మహా కుంభమేళ
-
‘వల’సలే బలం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సాధారణ ఎన్నికల్లో వివిధ రాజకీయపక్షాల తరఫున పోటీకి ఆసక్తి చూపుతున్న ఔత్సాహిక నేతలు క్షేత్ర స్థాయిలో సొంత బలాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించారు. అధికార, విపక్ష పార్టీలనే తేడాలు లేకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత బలం ఉంటేనే టికెట్ వేటలో సొంత పార్టీలో పోటీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలాలు, గ్రామాల వారీగా వివిధ పార్టీల్లో చురుగ్గా ఉన్న నేతలు, కార్యకర్తలపై దృష్టి పెడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తివాదులు, అవకాశవాదులు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నారు. వీలైన చోటల్లా పార్టీ కండువాలు కప్పుతూ చేరికల పేరిట హడావుడి సృష్టిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ అసెంబ్లీ స్థానం మినహా లోక్సభ, శాసనసభా నియోజకవర్గాలు అన్నింటిలోనూ అధికార టీఆర్ఎస్ నేతలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 2019 ఎన్నికల్లో ఎంత మందికి తిరిగి అవకాశం దక్కుతుందనే అంశంపై సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, తమకు అవకాశం ఇస్తారని ఔత్సాహిక నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో దించాలని టీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలోనూ టికెట్ల కేటాయింపులో నాటకీయ పరి ణామాలు చోటు చేసుకుంటాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్కు రెండు లోక్సభ స్థానాలతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాల్లో బలహీన లేదా బహుళ నాయకత్వం ఉండడంతో ఎవరికి టికెట్ దక్కుతుందో తెలియని పరిస్థితి ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా కొత్త ముఖాలను బరిలోకి దించే ఉద్దేశంతో ఇప్పటికే వడపోత ప్రారంభించింది. టీడీపీ పూర్తి స్థాయిలో జిల్లా రాజకీయ ముఖచిత్రం నుంచి కనుమరుగు కాగా, కొత్తగా టీజేఏసీ, బీఎల్ఎఫ్ తదితర పార్టీలు, కూటములు తెరమీదకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ బహుముఖ పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సొంత బలం కోసం నేతల తంటాలు.. ఎన్నికల్లో బహుముఖ పోటీతో పాటు పార్టీల్లోనూ టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా బహుళ సంఖ్యలో ఉన్నారు. ఓ వైపు అధిష్టానం వద్ద టికెట్ కోసం లాబీయింగ్ చేస్తూనే.. క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడానికి ఔత్సాహిక నేతలు ప్రాధాన్యత ఇస్తున్నారు. సొంత పార్టీలో టికెట్ ఆశిస్తున్న ప్రత్యర్థిపై సొంత బలం ద్వారా పైచేయి సాధించాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో నర్సాపూర్, జహీరాబాద్, నారాయణఖేడ్ వంటి నియోజవకర్గాల్లో ఈ రకమైన పరిస్థితి నెలకొంది. సొంత బలాన్ని కలిగిఉంటే సిట్టింగులున్నా, వారిని కాదని టికెట్ ఇస్తారనే ఆశ సదరు నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్లో సిద్దిపేట, దుబ్బాక, మెదక్, పటాన్చెరు నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వం ఉండగా, ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు పోటాపోటీగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. వివాహాలు, విందులు, మరణాలు తదితర సందర్భాల్లో గ్రామాల్లోకి వెళ్తూ ఆర్థిక సాయం ద్వారా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ తన కేడర్తో పాటు, వివిధ పార్టీల్లో కార్యకర్తలు, నాయకుల వివరాలు సేకరిస్తోంది. చేరికల పేరిట హడావుడి.. గ్రామాల వారీగా వివిధ పార్టీల్లో చురుకైన నేతలు, కార్యకర్తల వివరాలపై ఆరా తీస్తూ వారిని అధికార, విపక్షమనే తేడా లేకుండా తమ దగ్గరకు చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామంలో పలుకుబడి ఉన్న పెద్దలు, మాజీ సర్పంచ్లు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ముందే సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆర్థిక సాయం చేస్తామంటూ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. అధికార పార్టీలో అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు, నాయకులను పార్టీలో చేర్చుకుంటూ పార్టీ కండువాలు కప్పుతున్నారు. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రం ప్రస్తుతం తమ వెంట ఉన్న కేడర్ చేజారకుండా చూసుకుంటూనే, ఇతర పార్టీల కార్యకర్తలను దరికి చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. తమ వెంట వస్తే ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్థికంగా చేయూతనందిస్తామని చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థికి కేడర్ లేకుండా చేయడం ద్వారా మానసికంగా బలహీనపర్చాలనే వ్యూహంతో సాగుతున్నారు. దీంతో గ్రామ స్థాయిలో ఒకే పార్టీలో రెండు, ఆపైన గ్రూపులు తయారు కావడంతో నేతలు కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే కాకుండా క్షేత్ర స్థాయిలోనూ రాజకీయ వలసలు మరింత ఊపందుకునేలా ఉన్నాయి. -
శ్మశానం పక్కనే కాలేజీ..చితిమంటల సాక్షిగా..
-
ముత్తుట్ ఫైన్సాన్స్ లో భారీ దోపిడీ
-
ముత్తూట్ ఫైన్సాన్స్ లో భారీ దోపిడీ
బీరంగూడ: సంగారెడ్డి జిల్లా బీరంగూడలో భారీ దోపిడీ జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి చొరబడిన ఐదుగురు దుండగులు 10 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం దోచుకెళ్లారు. సీబీఐ అధికారులమని చెప్పి లోపలికి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులను మారణాయుధాలతో బెదిరించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు నలుపు రంగు స్కార్పియో కారులో వచ్చారని, ఇద్దరు వ్యక్తుల చేతుల్లో తుపాకులు ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. తమను గుర్తుపట్టకుండా సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేట్టారు. దోపిడీదారులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలిసినవారి పనా, లేక పాత నేరస్తులు ఎవరైనా ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ సిబ్బందిని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. చోరీకి సంబంధించి ఐదుగురు వ్యక్తుల ఆనవాళ్లను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వయస్సు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని పోలీసులు తెలిపారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో ఉగ్రవాదులు చోరీ చేశారు. మధ్యప్రదేశ్ లోని తాండ్వా జైలు నుంచి తప్పించుకుని వచ్చిన ఉగ్రవాదులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. మళ్లీ ఇదే సంస్థలో ఇప్పుడు దోపిడీ జరగడంతో భయాందోళన వ్యక్తమవుతోంది. -
సంగారెడ్డి జిల్లాలో భారీ నల్ల మందు స్వాదీనం
-
20 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సంగారెడ్డి జోన్: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కందిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామని చెప్పారు. రెండు పడకల ఇళ్ల నిర్మాణం, పట్టణ సమస్యలపై నవంబర్ 7నుంచి 11 వరకు పోరాటాలు చేస్తామన్నారు. అవినీతి, ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, ముంపు నిర్వాసితుల సమస్యలపై ఉద్యమిస్తామని చెప్పారు. ఈ నెల చివరి నాటికి లేదా నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రం కరువు నిధులు రూ.729 కోట్లను ఎందుకు దారి మళ్లించారో వివరించాలన్నారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో బుధవారం నీటిలో మునిగి ఇద్దరు చనిపోయారు. తుర్కపల్లి గ్రామం పెద్దమ్మ కుంటలో ఈతకు వెళ్లిన పండరి(15) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. అలాగే, నిజాంపేట్ మదిర్యాల చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన బీటి వెంకయ్య(21) నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వీరికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. -
మమ్మల్ని ‘మెదక్’లో కలపొద్దు
జిన్నారం, గుమ్మడిదల మండలాలను సంగారెడ్డిలో కలపాలని ఆందోళన సెల్ టవర్ ఎక్కిన టీఆర్ఎస్ నాయకులు.. అఖిలపక్షం రాస్తారోకో జిన్నారం: జిన్నారంతో పాటు నూతనంగా ఏర్పాటుకానున్న గుమ్మడిదల మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కొనసాగించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. మెదక్ జిల్లాలో ఈ రెండు మండలాలను కలిపే విధంగా కొందరు నాయకులు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన నాయకులు కుమార్గౌడ్, ప్రభాకర్రెడ్డి, మౌసిన్ బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా అఖిలపక్ష నాయకులు గుమ్మడిదల ప్రధాన రహదారిపై భారీ రాస్తారోకో చేపట్టారు. నాలుగు గంటల పాటు ధర్నా కొనసాగడంతో ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. డీసీసీ అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి కూడా సెల్టవర్ ఎక్కినవారిని కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తాము కూడా రెండు మండలాలను సంగారెడ్డిలో కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ధర్నా చేస్తున్న అఖిలపక్ష నాయకులకు మద్దతు ప్రకటించారు. కాగా, నిరసనకారులు ఎంతకీ సెల్ టవర్ దిగకపోవటంతో అధికార పార్టీ నేతలు మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డికి సమాచారం అందించారు. ఆయా మండలాలను సంగారెడ్డిలో కొనసాగించేలా సీఎంతో చర్చిస్తున్నామని, ఆందోళనలు విరమించాలని నిరసనకారులకు ప్రజాప్రతినిధులు సూచించారు. దీంతో నర్సాపూర్ సీఐ తిరుపతిరాజు, ఎస్సై ప్రశాంత్.. నిరసనకారులను కిందికి దించారు. ధర్నాలో కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్లీడర్ ప్రభాకర్, ఇతర పార్టీల నాయకులు గిద్దెరాజు, చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్, నరేందర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నవీన్కుమార్, శ్రీకాంత్రెడ్డి, మద్ది వీరారెడ్డి, గోవర్ధన్గౌడ్, మంగయ్య తదితరులున్నారు. -
మంజీర
ఈ పేరుతోనే ‘సంగారెడ్డి జిల్లా’! తెరపైకి కొత్త ప్రతిపాదనలు ♦ మెదక్లో కలవడానికి ఖేడ్, అందోల్, నర్సాపూర్ నేతల ‘నో’ ♦ పరిష్కారం చూపిన మంత్రి హరీశ్ ♦ అయిష్టంగానే అంగీకరించిన ప్రజాప్రతినిధులు ♦ ప్రతి జిల్లాకు రెండేసి రెవెన్యూ డివిజన్లు ♦ తీర్మానం చేసి కేకేకు అందజేసిన జిల్లా ప్రజాప్రతినిధులు ♦ రాజధానిలో ముగిసిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం మంజీర జిల్లా.. సంగారెడ్డి, కొండాపుర్, సదాశివపేట, పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం, అందోల్, పుల్కల్, మునిపల్లి, రాయికోడ్, హత్నూర, జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం. నారాయణఖేడ్, మనూరు, కల్హేర్, కంగ్టితోపాటు కొత్త మండలాలైన కంది, అమీన్పుర్, గుమ్మడిదల, మొగుడంపల్లి (జహీరాబాద్ నియోజకవర్గం), సిర్గాపూర్, నాగల్గిద్ద(నారాయణఖేడ్), వట్పల్లి(అందోల్) మండలాలు. రెవిన్యూ డివిజన్లు: సంగారెడ్డితోపాటు జహీరాబాద్ లేదా నారాయణఖేడ్లో ఏదో ఒకటి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మరో ముందడుగు పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు ఊపందుకుంది. ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణతో కీలక ఘట్టం ముగిసింది. బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లోని ప్రాంతాల పంపకాలపై ప్రజాప్రతి నిధులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంజీర పేరిట సంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ చేసిన ప్రతిపాదనకు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో ఏకంగా మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు మెదక్ జిల్లాలో కలవడానికి ససేమిరా అనడంతో చర్చల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినట్టు విశ్వసనీయ సమాచారం. చివరకు మంత్రి జోక్యంతో సదరు ప్రజాప్రతినిధులు అయిష్టంగానే ఏకగ్రీవ తీర్మానం చేశారు. పెద్ద జిల్లాగా సంగారెడ్డి... కొత్తగా ఏర్పాటు కానున్న మూడు జిల్లాల్లో మంజీర పేరుతో సంగారెడ్డి అత్యంత పెద్ద జిల్లాగా అవతరించనుంది. మంజీర (సంగారెడ్డి)లో 26 మండలాలు, సిద్దిపేటలో 18, మెదక్ జిల్లాలో 17 మండలాల చొప్పున పంపకాలు చేస్తూ తీర్మానం చేశారు. ప్రతి జిల్లాలో రెండు చొప్పున రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ తీర్మానాన్ని రాజ్యసభ సభ్యులు, కార్యక్రమ సమన్వయకర్త కె.కేశవరావుకు అందజేశారు. ఆయన వాటిని సీఎం కేసీఆర్కు అందించనున్నారు. ప్రజాప్రతినిధుల అభ్యంతరం.. అధికారులు సీసీఎల్ఏకు పంపిన ప్రతిపాదనలకు ప్రజాప్రతినిధులు భిన్నంగా స్పందించారు. ఇప్పటివరకు అధికారులు నారాయణఖేడ్ను సంగారెడ్డి జిల్లాలో, అందోల్ను మెదక్ జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనలు పంపారు. ప్రజా ప్రతినిధుల తీర్మానం మాత్రం కొంత భిన్నంగా ఉంది. నారాయణఖేడ్, అందోల్, నర్సాపూర్ నియోజకవర్గాలను మెదక్ జిల్లాలో కలపడాన్ని సదరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఏ మాత్రం ఇష్టపడలేదు. తమ నియోజకవర్గాలను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీశ్రావు జోక్యం చేసుకొని మధ్యేమార్గంగా ఓ పరిష్కారం చూపుతూ తీర్మానం చేసినట్టు తెలిసింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం... ⇒ కొత్త తీర్మానం ప్రకారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఒక్క పెద్దశంకరంపేటను మాత్రమే మెదక్ జిల్లాలో కలుస్తుంది. ఇదే నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు కానున్న సిర్గాపూర్, నాగల్గిద్ద మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కలుపుతున్నారు. ⇒ అందోల్ నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి మండలాలను సంగారెడ్డిలోనే కలుపుతున్నారు. అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడు మండలాలను మెదక్ జిల్లాలో కలపాలని తీర్మానం చేశారు. మెదక్ జిల్లాలో కలుస్తున్న ఈ మూడు మండలాల నుంచి కొన్ని గ్రామాలను కలుపుతూ వట్పల్లి మండల కేంద్రాన్ని చేసి దాన్ని సంగారెడ్డిలోనే కలపాలని ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రతిపాదించినట్టు తెలిసింది. ⇒ నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం మినహా మిగిలిన మండలాలను మెదక్లోనే కలుపుతూ తీర్మానించారు. దీన్ని నర్సాపూర్ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినట్టు తెలిసింది. నర్సాపూర్ మండలాన్ని కూడా సంగారెడ్డిలోనే కలపాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ నాలుగు దిక్కుల్లో మూడు దిక్కులు ఫారెస్టు ఉందని, ఒక్క సంగారెడ్డి రోడ్డుకు మాత్రమే ఫారెస్టు లేదని, తమ ప్రాంతం అభివృద్ధి కేవలం అటువైపు మాత్రమే జరుగుతుందని నర్సాపూర్ ప్రజాప్రతినిధులు వెల్లడించినట్లు తెలిసింది. ఇదే మండలంలోని మూసాపేట సంగారెడ్డి పట్టణానికి కేవలం 14 కిలో మీటర్ల దూరంలో ఉంటుందని, ఇబ్రహింబాద్ 16 కిలో మీటర్లు ఉంటుందని, అదే మెదక్ జిల్లాలో కలిపితే 60 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వారి ఆందోళనను పట్టించుకోకుండానే నర్సాపూర్ మండలాన్ని మెదక్ జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.