terrorist
-
ఉగ్ర లింకులున్న ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
జమ్మూ: ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్లు తేలడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ముగ్గురు ఉద్యోగులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, స్కూల్ టీచర్ అష్రాఫ్ భట్, అటవీ శాఖ ఉద్యోగి నిసార్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. నిసార్ అహ్మద్ ఖాన్ 2000వ సంవత్సరంలో నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన మంత్రి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇతడికి హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధాలున్నట్లు తేలింది. అదేవిధంగా, 2005లో స్పెషల్ పోలీస్ అధికారి(ఎస్పీవో)గా నియమితుడై, 2011లో కానిస్టేబుల్గా ప్రమోషన్ పొందిన ఫిర్దౌస్కు ఉగ్రలింకులున్నట్లు తేలడంతో గతేడాది సస్పెండ్ చేశారు. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసే ఇతడు ప్రస్తుతం కొట్ భల్వాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్నాగ్ జిల్లాలో దాడులకు పథక రచన చేస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు పట్టుకున్నారు. రియాసికి చెందిన అష్రాఫ్ భట్ రెహ్బార్–ఇ–తలీం టీచర్గా 2008లో చేరాడు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహ్మద్ కాసిమ్ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని పోలీసులు 2022లో అరెస్ట్ చేశారు. -
స్వర్ణ దేవాలయంలో పేలిన తూటా... సుఖ్బీర్పై హత్యాయత్నం
అమృత్సర్/చండీగఢ్: సిక్కులకు పరమ పవిత్రమైన అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దారుణం చోటుచేసుకుంది. శిరోమణి అకాలీదళ్ సీనియర్ నాయకుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్సింగ్ బాదల్ (62)పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఉదయం 9.30 గంటలకు నారైన్ సింగ్ చౌరా అనే మాజీ ఉగ్రవాది అత్యంత సమీపానికి దూసుకొచ్చి ఆయనపై పిస్తోల్తో కాల్పులు జరిపాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకొని దూరంగా లాక్కెళ్లారు. తూటా గురి తప్పడంతో సుఖ్బీర్ సింగ్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మీడియా కెమెరాల్లో రికార్డయిన ఈ హత్యాయత్నం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2007 నుంచి 2017 దాకా పంజాబ్లో అకాలీదళ్ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మతాచారం ప్రకారం స్వర్ణదేవాలయం ప్రవేశద్వారం వద్ద సుఖ్బీర్ సింగ్ మంగళవారం కాపలాదారు (సేవాదార్)గా మారారు. బుధవారం ఆయన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. కాపలాదారు దీక్షలో ఉండగానే హత్యాయత్నం జరిగింది. కాలికి గాయమవడంతో చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్న సుఖ్బీర్ వైపు నారైన్ నెమ్మదిగా నడుస్తూ వచ్చాడు. అంతా చూస్తుండగానే జేబులోంచి పిస్తోల్ బయటకు తీసి సుఖ్బీర్పై గురిపెట్టాడు. ఆయన పక్కనే నిల్చున్న ఏఎస్సై జస్బీర్ సింగ్ వెంటనే నారైన్ చేతిని దొరకబుచ్చుకొని వెనక్కి నెట్టేశాడు. దాంతో తూటా గురి తప్పి ఆలయ ప్రవేశద్వారం గోడలోకి దూసుకెళ్లింది. ఇతర పోలీసు సిబ్బంది సుఖ్బీర్ చుట్టూ రక్షణ వలయంగా నిల్చున్నారు. భద్రతా సిబ్బందితో పాటు శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ టాస్్కఫోర్స్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. కాల్పుల సమాచారం తెలియగానే సుఖ్బీర్ భార్య, ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుఖ్బీర్కు జెడ్ ప్లస్ భద్రత ఉంది. నారైన్ను డేరాబాబా నానక్ ప్రాంతానికి చెందిన మాజీ ఉగ్రవాదిగా గుర్తించారు. అతడిని అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పిస్తోల్ స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండడం వల్లే సుఖ్బీర్సింగ్కు ప్రాణాపాయం తప్పిందని అమృత్సర్ పోలీసు కమిషనర్ గురుప్రీత్సింగ్ భుల్లార్ చెప్పారు. నిందితుడు ఒంటరిగానే స్వర్ణదేవాలయానికి వచ్చాడని తెలిపారు. హత్యాయత్నానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. నిందితుడిని చాకచక్యంగా అడ్డుకున్న ఏఎస్ఐ జస్బీర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సుఖ్బీర్పై కాల్పుల ఘటనను వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన వెనుక కారణాలు నిగ్గుతేల్చి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆఖల్ తక్త్ నిర్దేశం ప్రకారం స్వర్ణ మందిరంలో మతపరమైన సేవ అందిస్తున్న సుఖ్బీర్ను హత్య చేయాలని చూడడం చాలా బాధాకరమని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ చీఫ్ హర్జీందర్ సింగ్ ధామీ అన్నారు. ఇదిలా ఉండగా, ఖలిస్తాన్ ఉద్యమాన్ని సుఖ్బీర్ సింగ్ వ్యతిరేకిస్తున్నందుకే ఆయనను హత్య చేయాలని చౌరా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పంజాబ్పై బీజేపీ కుట్ర: కేజ్రీవాల్ సుఖ్బీర్పై హత్యాయత్నాన్ని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను, పోలీసులను అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. శాంతిభద్రతలను ఎలా కాపాడాలో పోలీసులు చూపించారని కొనియాడారు. హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆదేశించారు. పంజాబ్లో ఆప్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఆరోపించారు. ఆప్ సర్కారు అసమర్థత వల్లే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డారు. దీనికి మాన్ బదులివ్వాలని డిమాండ్ చేశారు. Amritsar : सुखबीर सिंह बादल पर जानलेवा हमला #SukhbirSinghBadal #Punjab #GoldenTemple pic.twitter.com/S5x0EegGRE— Adv Jony Ambedkarwadi 🇮🇳 (@TheJonyVerma) December 4, 2024ఎవరీ చౌరా? సుఖ్బీర్సింగ్ బాదల్పై కాల్పులు జరిపిన నారైన్ సింగ్ చౌరా (68) గతంలో కరడుగట్టిన ఉగ్రవాది అని పోలీసులు చెప్పారు. తీవ్రవాద ఘటనల్లో, ఖలిస్తానీ ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి హస్తముందని వెల్లడించారు. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ) వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల్లో చురుగ్గా పని చేశాడని తెలిపారు. అతడిపై ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణా సహా 12కుపైగా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. → గురుదాస్పూర్ జిల్లా చౌరా గ్రామంలో పుట్టిన చౌరా చిన్నప్పుడే ఖలిస్తానీ తీవ్రవాదం పట్ల ఆకర్శితుడయ్యాడు.→ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్, అకల్ ఫెడరేషన్ వంటి సంస్థల్లో పని చేశాడు. పంజాబ్ మాజీ సీఎం బియాంత్సింగ్ హత్య కేసు నిందితులతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. → బురైల్ జైలును బద్ధలు కొట్టి, ఖైదీలు తప్పించుకొని పారిపోయిన ఘటనకు చౌరాయే సూత్రధారి అని ఆరోపణలున్నాయి.→ చౌరా 1984లో పంజాబ్లో ఉగ్రవాదం ప్రాథమిక దశలో ఉన్నప్పుడు పాకిస్తాన్కు పారిపోయాడు. అక్కడి నుంచే పంజాబ్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించాడు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు అందజేశాడు. → పాకిస్తాన్లో ఉన్నప్పుడే గెరిల్లా యుద్ధరీతులపై, దేశద్రోహంపై పుస్తకాలు రాశాడు. ఖలిస్తాన్ విరుద్ధ్ సాజిష్ అనే వివాదాస్పద పుస్తకం అతడు రాసిందే. → పంజాబ్లో రాజకీయంగా ప్రాబల్యం కలిగిన బాదల్ కుటుంబం అంటే చౌరాకు మంట. మితవాదులంటే అతడికి నచ్చదు. 1980వ దశకం నుంచి బాదల్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హవారా గ్రూప్లో చౌరా కూడా సభ్యుడే. → చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. → చౌరా తొలిసారిగా 2013 ఫిబ్ర వరి 28న పంజాబ్లోని తార్న్ తరన్లో అరెస్టయ్యాడు. అప్ప ట్లో మొహాలీలోని అతడి నివా సంలో భారీ ఎత్తున ఆయుధా లు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. -
ఎట్టకేలకు సల్మాన్ దొరికాడు
ఢిల్లీ: పాక్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సల్మాన్ రెహమాన్ ఖాన్ ఎట్టకేలకు చిక్కాడు.ఉగ్రవాద కార్య కలాపాలు కొనసాగించేలా సల్మాన్ రెహమాన్ ఖాన్ తూర్పు ఆఫ్రికా దేశం రువాండా రాజధాని కిగాలీ నుంచి బెంగళూరులో ఉన్న తన సహచరులకు డబ్బు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపాడు. దీనిపై సమాచారం అందుకున్న కేంద్ర నిఘూ సంస్థలు బెంగళూరులోని తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున మారణాయుధాలు లభ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎన్ఏఐ సల్మాన్ రెహమాన్ ఖాన్ ఆచూకీ కోసం అత్యంత రహస్యంగా విచారణ చేపట్టింది.దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్ఐఏ, ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో కిగాలీలో సల్మాన్ రెహమాన్ ఖాన్ దొరికాడు. దీంతో సల్మాన్ను కిగాలీ నుంచి భారత్కు తీసుకువచ్చారు. ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు సమాచారం. -
9/11 @ 23.. ఆ రోజు ఏం జరిగింది?
వాషింగ్టన్: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రదాడి జరిగి నేటికి 23 ఏళ్లు. అల్ ఖైదా ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మూడు వేల మందికి పైగా జనం మృతి చెందారు. నాటి ఈ సంఘటన విషాదం నేటికీ అమెరికన్లను బాధపెడుతూనే ఉంది. ‘‘2001, సెప్టెంబరు 11’’.. ఇది అమెరికా చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనూ మరువలేని చీకటి దినం. ప్రాథమిక నివేదికల్లో ఈ ఘటనను విమాన ప్రమాదంగా పేర్కొన్నారు.బోస్టన్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం ఉదయం 8.46 గంటలకు న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ను ఢీకొంది. ఇదిజరిగిన 17 నిమిషాల తర్వాత, అదే భవనంలోని సౌత్ టవర్ను మరో విమానం ఢీకొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇది ఉగ్రవాద దాడి అని స్పష్టమైంది.ఆ రోజు ఆల్ ఖైదా ఉగ్రవాదులు మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేశారు. వారి లక్ష్యం న్యూయార్క్ నగరం మాత్రమే కాదు. పెంటగాన్, వైట్ హౌస్లను కూడా లక్ష్యంగా చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. అయితే వైట్హౌస్పై దాడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నం విఫలమైంది.మొత్తం మీద ఆ రోజు నాలుగు చోట్ల జరిగిన దాడుల్లో మూడు వేల మందికి పైగా జనం మృతిచెందారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కుప్పకూలిన తర్వాత, ఆ ప్రదేశాన్ని గ్రౌండ్ జీరోగా పిలుస్తున్నారు. ఈ దాడి తర్వాత అమెరికా తీవ్రవాదంపై యుద్ధం ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఇందుకు అనుగుణమైన ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ భయంకరమైన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. పెరల్ హార్బర్ తర్వాత అమెరికాపై జరిగిన అతిపెద్ద దాడిగా 9/11ను చెబుతారు.ఇది కూడా చదవండి: ఆటోమెటిక్ తలుపులు.. ఆధునిక టాయ్లెట్లు -
జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి.. భద్రతా బలగాలు అప్రమత్తం
జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో తాజాగా జరిగిన ఉగ్రదాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ ఒకరు మృతిచెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జమ్ముకశ్మీర్ పోలీసులు డూడు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ సైనికులపై దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు అందుకు ధీటుగా సమాధానమిచ్చాయి. డూడూ ప్రాంతంలోని చీల్లో ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది. #WATCH जम्मू-कश्मीर: उधमपुर के दूदू इलाके में तलाशी अभियान जारी है।आज सुबह दूदू इलाके के चील में आतंकवादियों और सुरक्षा बलों के बीच हुई गोलीबारी में CRPF के एक इंस्पेक्टर की मौत हो गई।(वीडियो वर्तमान समयानुसार नहीं है) pic.twitter.com/f44WSoYbRU— ANI_HindiNews (@AHindinews) August 19, 2024 ఈ ఎన్కౌంటర్ గురించి ఉధంపూర్ డీఐజీ రయీస్ మహ్మద్ భట్ మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ టీమ్పై జరిగిన ఉగ్రదాడిలో ఒక సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వీరమరణం పొందారని, ఈ దాడిలో మరో సీఆర్పీఎఫ్ అధికారి గాయపడ్డారని తెలిపారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. కాగా ఇటీవలి కాలంలో జమ్మూ పరిధిలోని పీర్ పంజాల్లోని దక్షిణ ప్రాంతాలలో ఉగ్ర దాడులతోపాటు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. పీర్ పంజాల్లోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. #WATCH जम्मू-कश्मीर: दूदू में आतंकवादियों के साथ मुठभेड़ में CRPF के एक इंस्पेक्टर की जान चली गई।उधमपुर के डीआईजी रईस मोहम्मद भट ने कहा, "यह बहुत दुखद है लेकिन यह हमारी ड्यूटी का हिस्सा है...यह जंगल वाला इलाका है, यहां सड़कें और नेटवर्क की समस्या है। यहां हम कई तरह की चुनौतियों… pic.twitter.com/qGkwEvM7xf— ANI_HindiNews (@AHindinews) August 19, 2024 -
ఘోరీ.. ఘోరాలెన్నో!
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల పాటు హైదరాబాద్లో దాక్కుని.. ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ అరెస్టు ఘటనతో కరుడుగట్టిన టెర్రరిస్ట్ మహ్మద్ ఫర్హతుల్లా ఘోరీ పేరు మరోసారి తెరపైకి వచి్చంది. హైదరాబాద్కే చెందిన ఘోరీ కోసం రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు వివిధ నిఘా ఏజెన్సీలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దాదాపు 26 ఏళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్న అతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయగా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వాంటెడ్ లిస్టులోనూ ఉన్నాడు.అజ్ఞాతంలోకి వెళ్లాకే విషయం బయటికి.. హైదరాబాద్లోని మాదన్నపేట సమీపంలో ఉన్న కూర్మగూడకు చెందిన ఫర్హతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్.. 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అది జరిగిన నాలుగేళ్ల తర్వాతగానీ అతడి పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ ఆలయంపై జరిగిన దాడి కేసుతో ఘోరీ వ్యవహారాలు బహిర్గతం అయ్యాయి. 2004లో హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది.అప్పట్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్కు (జేఈఎం) సానుభూతిపరుడిగా ఉన్న ఘోరీ.. ఆ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2005లో నగర కమిషనర్ టాస్్కఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులో.. 2012 నాటి బెంగళూరు ‘హుజీ కుట్ర’ కేసులోనూ ఘోరీ వాంటెడ్గా ఉన్నాడు. 2022 దసరా సమయంలో విధ్వంసాలకు కుట్రపన్ని హ్యాండ్ గ్రెనేడ్స్తో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరైన జాహెద్తో ఘోరీ సంప్రదింపులు జరిపాడు. దీనితోపాటు మరికొన్ని ఉగ్రవాద కేసుల్లోనూ ఘోరీ వాంటెడ్గా ఉన్నాడు.రిక్రూట్మెంట్తో పాటు ఫైనాన్సింగ్ ఘోరీ ప్రస్తుతం పాకిస్తాన్లోని రావలి్పండిలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు కొన్ని ఆధారాలు సేకరించాయి. దీనికి ముందు దు బాయ్ కేంద్రంగా ఉండి హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలకంగా పనిచేశాడు. గత 26 ఏళ్లుగా అనేక ఉగ్రవాద సంస్థలతో కలసి పనిచేశాడు. లష్కరేతొయిబా (ఎల్ఈటీ), హర్కతుల్ జిహీదే ఇస్లామీ (హుజీ), ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.హైదరాబాద్ సిటీలో 2007 ఆగ స్టు, 2013 ఫిబ్రవరిలో జరిగిన జంట పేలుళ్లకు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) స్థాపనలో కీలకంగా వ్యవహరించిన అమీర్ రజాఖాన్కు ఘోరీ సన్నిహితుడిగా ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్ర హోంశాఖ విదేశాల్లో ఉంటూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్న, సహకరిస్తున్న 18 మంది ఉగ్రవాదుల పేర్లతో 2020 లో మోస్ట్ వాంటెడ్ జాబితా విడుదల చేసింది. అందులో ఐఎం వ్యవస్థాపకుడు, సహ–వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్తోపాటు ఘోరీ సైతం ఉన్నాడు.ఇన్నాళ్లూ ఫొటో కూడా దొరకని రీతిలో.. ఘోరీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్పోల్ దాంతోపాటు దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి అస్పష్టమైన ఫొటోను విడుదల చేసింది. అతడి స్పష్టమైన ఫొటో సుదీర్ఘకాలం ఏ ఏజెన్సీ వద్ద కూడా లేకపోవడమే అందుకు కారణం. 2008 ఏప్రిల్లో అతడి మేనల్లుడు ఫయాఖ్ను దుబాయ్ నుంచి డీపోర్ట్ (బలవంతంగా తిప్పిపంపడం) చేయగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఫయాఖ్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఘోరీకి సంబంధించి 20 ఊహాచిత్రాలను రాష్ట్ర నిఘా వర్గాలు రూ పొందించాయి. అక్షర్ధామ్ కేసులో ఘోరీ సోదరుడు షౌకతుల్లాను 2009 ఏడాది జూలైలో అరెస్టు చేసినప్పుడు.. ఆ ఊహాచిత్రాలను చూపగా వాటిలో ఒకదానిని అతను నిర్ధారించాడు. అప్పటి నుంచి అదే ఆధారమైంది. తాజాగా రిజ్వాన్ అరెస్టుతో ఘోరీ కొత్త ఫొటో ఏజెన్సీలకు లభించింది. -
హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ టెర్రరిస్ట్ రిజ్వాన్ అలీ.. యువతను ‘ఉగ్ర’బాట పట్టించడంలో దిట్ట.. పరారీలో ఉన్న అతడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ.3 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఇన్నాళ్లూ తప్పించుకు తిరిగిన రిజ్వాన్ను.. గత శుక్రవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి ఫరీదాబాద్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించినప్పుడు బయటికొచి్చన రెండు అంశాలు కలకలం రేపుతున్నాయి.రిజ్వాన్ కొన్నాళ్లు హైదరాబాద్లో తలదాచుకున్నాడనేది ఒకటైతే.. సుదీర్ఘకాలం నుంచి పరారీలో ఉన్న గజ ఉగ్రవాది, హైదరాబాద్కే చెందిన ఫర్హాతుల్లా ఘోరీతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడనేది రెండో అంశం. రాష్ట్ర నిఘా విభాగానికి చెంప పెట్టులాంటి ఈ రెండు అంశాలు తెలిసిన వెంటనే ఇక్కడి నుంచి ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఢిల్లీ వెళ్లింది.6 నెలలు హైదరాబాద్లోనే..ఢిల్లీకి చెందిన రిజ్వాన్ అలీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015–16లో ఆన్లైన్ ద్వారా ప్రేరణ పొంది ఐసిస్ బాటపట్టాడు. జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలోని షహీన్బాగ్లో స్థిరపడిన షానవాజ్తో కలసి ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఐసిస్ మాడ్యూల్ విస్తరణతోపాటు నిధుల సమీకరణకు పనిచేశాడు. చాలా మంది యువతను ఆన్లైన్ ద్వారా ఆకర్షించి ఉగ్రవాద బాటపట్టించాడు. 2023 జూన్లో పుణే అధికారులు షానవాజ్ నేతృత్వంలోని ఈ మాడ్యూల్ గుట్టురట్టు చేసి.. పలువురిని అరెస్టు చేశారు.దీంతో రిజ్వాన్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉత్తరప్రదేశ్లోని సంభాల్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. అతడిని మోస్ట్ వాంటెడ్గా గుర్తించిన ఎన్ఐఏ.. పట్టిస్తే రూ.3 లక్షల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రిజ్వాన్ కదలికలను గుర్తించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. సంభాల్లోని ఓ స్థావరంపై దాడి చేశారు. కానీ తృటిలో తప్పించుకున్న రిజ్వాన్.. హైదరాబాద్కు మకాం మార్చాడు. మారుపేరుతో సికింద్రాబాద్ ప్రాంతంలో దాదాపు ఆరు నెలల పాటు నివసించాడు. తర్వాత కేరళ వెళ్లాడు. స్వాతంత్య్ర దిన వేడుకల నేపథ్యంలో విధ్వంసాలకు పథకం వేసి ఢిల్లీ వెళ్లాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ–ఫరీదాబాద్ సరిహద్దుల్లో స్పెషల్ సెల్ పోలీసులకు దొరికిపోయాడు. వారు అతడి నుంచి తుపాకీ, తూటాలు స్వా«దీనం చేసుకున్నారు.విచారణలో బయటపడిన కీలక అంశాలురిజ్వాన్ను విచారించిన సమయంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కీలక అంశాలను గుర్తించారు. హైదరాబాద్లోని కూర్మగూడ ప్రాంతానికి చెందిన గజ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీతో రిజ్వాన్ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరిపినట్టు తేల్చారు. ఘోరీ తాజా ఫొటోను సైతం రిజ్వాన్ ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల తయారీలో నిపుణుడైన రిజ్వాన్ దేశంలోని వివిధ నగరాలను టార్గెట్గా చేసుకున్నట్టు గుర్తించారు. ఫర్హాతుల్లా ఘోరీతో సంప్రదింపులు, హైదరాబాద్లో ఆరు నెలల పాటు ఉండటం నేపథ్యంలో.. ఘోరీ ద్వారానే ఇక్కడ ఆశ్రయం పొందినట్టు భావిస్తున్నారు. రిజ్వాన్ను విచారించేందుకు.. రిజ్వాన్ను విచారిస్తే హైదరాబాద్లో ఎవరి ద్వారా, ఎప్పుడు ఆశ్రయం పొందాడో, ఎవరెవరిని కలిశాడో తెలుస్తుందని.. ప్రస్తుతం ఘోరీ కోసం పనిచేస్తున్న వారిని గుర్తించేందుకు ఆస్కారం ఉంటుందని రాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రిజ్వాన్ను విచారించడంతోపాటు ఢిల్లీ స్పెషల్ సెల్ నుంచి సమాచారం తీసుకోవడం కోసం రాష్ట్రం నుంచి ఓ ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లింది. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు త్వరలో హైదరాబాద్ రానున్నట్లు తెలిసింది.మరికొన్ని అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. ఆరు నెలల పాటు నగరంలో తలదాచుకున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కదలికలను రాష్ట్ర నిఘా విభాగాలు కనిపెట్టలేకపోవడం వైఫల్యంగానే ఉన్నతాధికారులు పరిగణిస్తున్నట్టు తెలిసింది. ఈ అంశంపై లోతుగా అంతర్గత సమీక్ష చేపట్టినట్టు సమాచారం. -
జమ్ములో ఉగ్ర ఘటనలు.. విద్యాసంస్థల మూసివేత
జమ్ములో ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల దృష్ట్యా ఆర్మీ స్కూల్స్, సెంట్రల్ స్కూల్స్ నుండి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించారు. 27వ తేదీ వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆన్లైన్ మాధ్యమం ద్వారా విద్యార్థులకు బోధన జరగనుంది.జూన్ 9న జమ్ము డివిజన్లోని రియాసీలో శివఖోడి నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత మరిన్ని ఉగ్ర దాడులు చోటుచేసుకున్నాయి. గత బుధవారం జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో సైనికులు ఒక ఉగ్రవాదిని హతమార్చారు. అదే సమయంలో ఒక సైనికుడు గాయపడ్డాడు.అంతకుముందు జూలై 24న జమ్మూలోని పూంచ్ ప్రాంతంలోని బట్ సెక్టార్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు వీరమరణం పొందారు. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మాట్లాడుతూ జమ్ముకశ్మీర్లో ఉగ్ర ఘటనలను గుర్తించామన్నారు. సాధారణ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం తేదని, మన భద్రతా దళాలు ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులందరిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాద శిబిరాలు?
పాక్ ఉగ్రవాదులు గత కొద్దిరోజులుగా భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్నారని ఇటీవల జరిగిన ఉగ్రదాడులు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మరోవైపు ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి అందుతున్న నిధులకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం వెల్లడయ్యింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ నడుపుతున్న ఉగ్రవాద శిబిరాల జాబితా కూడా దీనిలో ఉంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ తమ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, మాజీ ఎస్ఎస్జీలు, కొందరు సైనికులతో కూడిన ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు ఇచ్చి భారతదేశానికి పంపుతోందని తెలుస్తోంది. అలాగే పాక్ ఈ ఉగ్రవాదులకు ఎం4 లాంటి ఖరీదైన ఆయుధాలు, బుల్లెట్లను అందిస్తోంది. చొరబాటు సమయంలో ఉగ్రవాదులకు సహాయం అందించే గైడ్లకు కూడా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు అందజేస్తోందని తెలుస్తోంది. అలాగే స్మార్ట్ ఫోన్లు, రేడియో సెట్లను ఉగ్రవాదులు విరివిగా వినియోగిస్తున్నారని సమాచారం.ఇదిలా ఉండగా తాజాగా భారత సైన్యం సరిహద్దుల్లోని కంచెలు, సొరంగాల తనిఖీని ముమ్మరం చేసింది. భారతదేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు ఆహారం కోసం ఐదారు వేల రూపాయలు ఖర్చు చేస్తారని తెలుస్తోంది. పాక్ ఆర్మీ సహాయంతో ఈ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తన ఉగ్రవాద శిబిరాలను తిరిగి యాక్టివేట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి శిబిరాలు సరిహద్దుల్లోని నికియాల్, జాంద్రుత్, ఖురేటా కోట్లి, సమానీ, అబ్దుల్ బిన్ మసూద్, సమన్, కోట్కోటేరాలో ఉన్నట్లు తెలుస్తోంది. -
హమాస్ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా
అర్జెంటీనా తాజాగా హమాస్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. అమెరికా, ఇజ్రాయెల్తో తమ దేశ సంబంధాలను బలోపేతం చేసేదిశగా యోచిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ ఈ విధమైన ప్రకటన చేశారు.గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని అర్జెంటీనా ఖండించింది. ఇజ్రాయెల్ 76 ఏళ్ల చరిత్రలో ఈ దాడి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఆర్జెంటీనా దేశంలోని యూదులు ఉంటున్న ప్రాంతాలపై హమాస్ ఉగ్రదాడులు చేసిందని, ఈ సంస్థకు ఇరాన్తో సన్నిహిత సంబంధాలున్నాయని అర్జెంటీనా ఆరోపించింది.ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తరచూ హమాస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గాజాలో జరిగిన ఈ దాడుల్లో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. హమాస్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇక్కడి ప్రజలను ఊచకోత కోస్తున్నది ఆరోపించారు. తూర్పు గాజా నగరంలోని వేలాది మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దళాలు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు తరిమికొట్టాయని, అయితే వారు అక్కడికి రాగానే వారిపై కాల్పులు జరిపారని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్ తౌబ్తా పేర్కొన్నారు.పాలస్తీనియన్లంతా గాజా సిటీని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని ఇటీవల ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశించింది. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంలో హెచ్చరికల కరపత్రాలను జారవిడిచాయి. అక్కడి ప్రజలంతా దక్షిణం వైపుకు వెళ్లాలని దానిలో కోరాయి. -
పోలీస్టేషన్పై ఉగ్రదాడి.. 10 మంది పోలీసులు మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. డేరా ఇస్మాయిల్ఖాన్లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రమూకలు దాడిచేశారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. "ఉదయం 3 గంటలకు, ఉగ్రవాదులు పోలీసు స్టేషన్పై దాడి చేశారు. పోలీసు భవనంలోకి ప్రవేశించి, విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు." అని పాకిస్తాన్ పోలీసు అధికారులు తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్లో గత కొద్ది రోజులుగా ఉగ్రదాడుల ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: Denver: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి! -
గోల్డీని ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ సతీందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ను కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఉగ్రవాద వ్యతిరేక ఉపా చట్టం కింద అతడిని ఉగ్రవాది ప్రకటిస్తున్నట్లు హోం శాఖ సోమవారం తెలిపింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇతడు మాస్టర్ మైండ్గా ఉన్నాడు. పాకిస్తాన్ దన్నుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఇతడికి పలు హత్య కేసులతో సంబంధం ఉందని హోం శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. పంజాబ్లోని శ్రీముక్త్సర్ సాహిబ్కు చెందిన బ్రార్ ప్రస్తుతం కెనడాలోని బ్రాంప్టన్లో ఉంటున్నాడు. ఇతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. -
Goldy Brar: ఇక ఉగ్రవాదిగా గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్
ఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలన, తీవ్రవాద కార్యకలాపాల కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గోల్డీ బ్రార్కు ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. గోల్డీ బ్రార్ నేపథ్యం.. సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పంజాబ్లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన లారెన్స్ బిష్ణోయ్తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
భారత్ పై డ్రాగన్ భారీ కుట్ర
-
గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. 33 ఏళ్ల లఖ్బీర్ ఖలిస్తానీ గ్రూప్ ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’ (బీకేఐ)కి చెందిన గ్యాంగ్స్టర్. 2021లో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్పై రాకెట్ దాడి ప్రణాళికలో భాగస్వామ్యుడు. అదే విధంగా 2022 డిసెంబరులో తరన్ తరణ్లోని సర్హాలి పోలీస్ స్టేషన్లో జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలోనూ లాండా పాత్ర ఉంది. అతను అనేక ఇతర తీవ్రవాద కార్యకలాపాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. లఖ్బీర్ స్వస్థలం పంజాబ్ కాగా గత కొన్నేళ్లుగా కెనడాలో స్థిరపడ్డాడు. భారత్కు వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో అతని హస్తం ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్లో లఖ్బీర్ సన్నిహితులతో సంబంధం ఉన్న 48 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), పంజాబ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల అనంతరం కొంత మందిని అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 21న ఒక వ్యాపారిపై ఇద్దరు దుండగులు దాడి చేయడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. తాను లాండ హరికే అని చెప్పుకుంటూ ఓవ్యక్తి తనకు ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు సదరు వ్యాపారి పోలీసులకు చెప్పడంతో వారు దాడులు చేపట్టారు చదవండి: డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్ను తప్పించబోయి చిత్తయిన లలన్ -
హఫీజ్ సయీద్ను అప్పగించండి
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలియజేశాయి. భారత్ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్ సయీద్ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. -
పాక్ ఎన్నికల్లో 26/11 సూత్రధారి స్థాపించిన పార్టీ
ఇస్లామాబాద్: 26/11 సూత్రధారి హఫీజ్ సయీద్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ పాకిస్థాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) పాకిస్థాన్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనుంది. పార్టీ తమ అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా పోటీలో ఉన్నాడు. నేషనల్ అసెంబ్లీ నియోజకవర్గం NA-127 లాహోర్ నుంచి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్. అనేక ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో దోషిగా తేలడంతో 2019 నుంచి హఫీజ్ సయీద్ జైలులో ఉన్నాడు. సయీద్పై అమెరికా 10 మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించింది. నిషేధిత జమాత్-ఉద్-దవా (JuD)లష్కరే తోయిబా (LeT)కు చెందిన సంస్థ. 2008 నాటి ముంబయి పేలుళ్లకు ఈ సంస్థే బాధ్యత వహిస్తుంది. ఈ సంస్థకు హఫీజ్ సయీద్ నాయకత్వం వహించాడు. పీఎంఎంఎల్ ఎన్నికల గుర్తు కుర్చీ. తమ పార్టీ జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని పీఎంఎంఎల్ అధ్యక్షుడు ఖలీద్ మసూద్ సింధు ఒక వీడియో సందేశంలో తెలిపారు. అవినీతి కోసం కాకుండా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయమని పేర్కొన్నారు. పాకిస్థాన్ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా మార్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాగా.. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై ఖలీద్ మసూద్ పోటీ చేయనున్నారు. ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదీ చదవండి: Year End 2023: ప్రపంచాన్ని వణికించిన భూకంపాలు ఇవే..! -
Jammu: ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న ఆర్మీ
జమ్మూ : అంతర్జాతీయ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం అడ్డుకుంది. భారీగా ఆయుధాలు ధరించిన నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం(డిసెంబర్ 22) అర్ధరాత్రి జమ్మూలోని అక్నూర్ సెక్టార్ వద్ద సరిహద్దు దాటడానికి యత్నించారు. వీరిని గుర్తించిన సైనికులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒక ఉగ్రవాది అక్కడికక్కడే మరణించాడు. మిగతా వారు వెనక్కి వెళ్లిపోయారు. అయితే చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని మిగిలిన ముగ్గురు తమ వెంటే వెనక్కి లాక్కెళ్లిపోయారని ఆర్మీ అధికారులు తెలిపారు. ‘ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాం. నలుగురిలో ఒకరిని కాల్చి చంపాం. మిగిలిన ముగ్గురు చనిపోయిన ఉగ్రవాది మృతదేహాన్ని లాక్కెళ్లడాన్ని గమనించాం’అని ఆర్మీకి చెందిన వైట్నైట్ కార్ప్స్ ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. రాజౌరీ సెక్టార్లో గురువారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఒక పక్క సైన్యం పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపడుతుండగానే మరో నలుగురు సరిహద్దు దాటి దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించడం గమనార్హం. ఇదీచదవండి..మగువలు మెచ్చిన చెప్పులు.. -
పుల్వామాలో మళ్లీ ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
కశ్మీర్: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోతున్నారు. సరిహద్దుల్లో ఉగ్రదాడికి పాల్పడటానికి ప్రయత్నించిన వారి పథకాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో పుల్వామాలో మళ్లీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. స్థానికంగా అరిహాల్ ప్రాంతంలో న్యూ కాలనీలోని తోటల్లో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రదాడిని తిప్పికొట్టారు. ఈ ఎదురుదాడిలో గుర్తు తెలియని ఓ ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: 'పన్నూ హత్య కుట్ర కేసుపై అమెరికా సీరియస్' -
జైషే మహ్మద్ ఉగ్రవాది తాజ్ మహ్మద్ కాల్చివేత!
మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది, జైషే ఉగ్రవాది తాజ్ మహమ్మద్ హతమయ్యాడు. పాకిస్థాన్లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అనేక హింసాత్మక ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న మోస్ట్ వాంటెడ్ జైష్-ఇ-మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్ రైట్ హ్యండ్, సమీపబంధువు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా జైషే ముఠాలో అత్యంత కీలక మైన ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అస్గర్. ముఖ్యంగా ఇండియాలో పఠాన్కోట్, నగ్రోటా, ఉరీ, పుల్వామా వంటి ఉగ్ర దాడుల్లో అతినిదే కీల ప్రాత. 1999లో అఫ్గానిస్థాన్లోని కాందహార్లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో రౌవూఫ్ ప్రధాన సూత్రధారి. 2001లో భారత పార్లమెంట్పై ఉగ్రదాడి, 2016లో పంజాబ్లోని పఠాన్కోట్లో భారత వాయుసేన స్థావరంపై దాడి, అలాగే 2014-2019 మధ్య భద్రతా బలగాల సిబ్బందిపై జరిగిన అనేక దాడుల్లో సూత్రధారిగా ఆరోపణలున్నాయి. 2 019లో పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్లో రౌఫ్ అస్గర్, మసూద్ అజర్ పేర్లు కూడా ఉన్నాయి. -
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని షోపియాన్లో గురువారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగాయి. కథోహలెన్ ప్రాంతంలో ఉగ్రవాదికి భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయని సైన్యం తెలిపింది. భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్ఎఫ్)తో ఉగ్రవాది అనుబంధం కలిగి ఉన్నాడని అధికారులు తెలిపారు. హతమైన ఉగ్రవాదిని మైజర్ అహ్మద్ దార్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. మరో ఘటనలో అంతర్జాతీయ సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. రామ్ఘర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాను మృతి చెందాడు. కశ్మీర్లోయలో అక్టోబర్ 30 నుంచి జరిగిన మూడు వరుస కాల్పుల ఘటనలకు పాల్పడిన ఉగ్రవాదుల జాడ తెలిపిన వారికి రూ.10 లక్షలను ఇస్తామని జమ్ముకశ్మీర్ పోలీసులు ప్రకటించారు. అక్టోబర్ 29న పోలీసు ఇన్స్పెక్టర్ మసూర్ అలీ వాని క్రికెట్ ఆడుతుండగా ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. మరుసటి రోజు యూపీ నుంచి వలసవచ్చిన కూలీ ముఖేష్ కుమార్ను దుండగులు కాల్చి చంపారు. ఆ మరుసటి రోజే హెడ్ కానిస్టేబుల్ గులామ్ మహ్మద్ని కాల్పి చంపారు. ఇదీ చదవండి: దారుణం: 150సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని భార్య.. అనుమానంతో 230 కి.మీ. వెళ్లి మరీ.. -
పాక్లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం?
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమైన అనంతరం పాకిస్తాన్లోనూ అదే తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మౌలానా జియావుర్ రెహ్మాన్ అనే మతపెద్ద కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్లోని ఒక పార్కులో పట్టపగలు హత్యకు గురయ్యాడు. రెహ్మాన్ లష్కరే కార్యకర్త. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు రెహమాన్ను కాల్చిచంపారు. రెహ్మాన్ సాయంత్రం వాకింగ్కు వెళ్లినప్పుడు ఈ హత్య జరిగింది. ఈ హత్య అతని బంధువులు, స్నేహితులు, అనుచరులను ఆందోళనకు గురిచేసింది. పాకిస్తాన్లో మతపెద్దలు.. మతపరమైన కార్యక్రమాలతో పాటు ఇతర సామాజిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్జిత్ సింగ్ పంజ్వార్ హత్య తీరులోనే లష్కర్ కార్యకర్త రెహ్మాన్ హత్య జరిగింది. ఉగ్రవాద ఆరోపణలతో భారత్ మోస్ట్ వాటెండ్గా ప్రకటించిన పంజ్వార్ను గత మే నెలలో లాహోర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. BIG BREAKING NEWS - Maulana Tariq Jameel's son Asim Jameel shot dead by UNKNOWN MEN in Talamba, Mian Chunnu of Pakistan 🔥🔥 Radical Maulana Tariq Jameel is well known for his hate speeches against Hindus and Bharat. All Terrorists in fear, ISI shocked after back to back such… pic.twitter.com/xRQ2hrhZUn — Times Algebra (@TimesAlgebraIND) October 29, 2023 పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, టెర్రర్ బాస్లు ఈ రెండు హత్యల్లోనూ సారూప్యతలను గమనించారు. ఈ నేపధ్యంలో ఐఎస్ఐ దాదాపు డజను ‘ఆస్తులను’.. ‘సేఫ్ హౌస్’లో ఉంచినట్లు ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్న నిఘా వర్గాలు తెలిపాయి. రావల్కోట్లో అబూ ఖాసిమ్ కాశ్మీరీ, నజీమాబాద్లో ఖరీ ఖుర్రామ్ షాజాద్ అనే మరో ఇద్దరు ఎల్ఈటీ కార్యకర్తల హత్యల కారణంగా బహుశా ముందుజాగ్రత్త మరింత అవసరమని ఐఎస్ఐ భావించి ఉండవచ్చునని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే హత్యకు గురైన రెహ్మాన్.. జామియా అబూ బకర్ అనే మదర్సాలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాడని సమాచారం. పాకిస్తాన్ పోలీసులు తమ ప్రెస్ నోట్లో ఈ హత్యను ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. దేశంలో ఉగ్రవాదుల పాత్రను ఇది సూచిస్తోందని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ పోలీసులు దీనిని టార్గెట్ కిల్లింగ్గా పరిగణిస్తున్నారు. రెహ్మాన్ హత్య కరాచీలో మత బోధకులపై వరుస దాడుల్లో భాగమని భావిస్తున్నారు. ఈ బోధకులంతా ఐఎస్ఐ ద్వారా ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. వీరు యువతను సమూలంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తగిన శిక్షణ అనంతరం యువతను భారత్పై దాడికి పంపిస్తారని తెలుస్తోంది. కాగా గత మార్చి 1న, ఐసీ-814 ఇండియన్ ఎయిర్లైన్స్ హైజాకర్ అయిన పైలట్ జహూర్ ఇబ్రహీంను కాల్చి చంపారు. ఈ జైషే మహ్మద్ ఉగ్రవాదిపై గుర్తుతెలియని ముష్కరులు అతి సమీపం నుంచి రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ హత్యల పరంపర పాకిస్తాన్ చట్ట అమలు సంస్థలను, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐని కలవరపరిచింది. అయితే ఈ హత్యలు ప్రత్యర్థుల కారణంగా జరిగాయని కూడా ఐఎస్ఐ పూర్తిగా విశ్వసించడం లేదు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచిచూడాలి. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్తో యుద్ధం.. హమాస్ కీలక ప్రకటన 🚨 Breaking : Sadiq, Sher Afzal, Fiyaz, Ghulam Rasool & Hafizullah, all Terπ0rists belonging to Lashkar-e-Taiba, have been abducted by #Unknown Gunmen in Neelum Valley, #PoK. News Source : Unknown (not confirmed yet)#IndianArmy #Kashmir#Pakistan #Hamas #ISIS pic.twitter.com/uhrybSj4qf — शून्य (@Shunyaa00) October 28, 2023 -
జమ్ముకశ్మీర్పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం
శ్రీనగర్: ఇజ్రాయెల్- పాలస్తీనా సంస్థ హమాస్ మధ్య యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్లో సంక్షోభం చోటు చేసుకుంది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్లో నిరసనలకు దారితీసే ముప్పును మరింతగా పెంచుతోంది. ఈ నేపధ్యంలో తాజాగా శ్రీనగర్లోని 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. భద్రతా ప్రణాళికల గురించి ఈ సమావేశంలో చర్చించామని, రాబోయే రోజుల్లో నిరసనలు తలెత్తితే, వాటిని ఎలా నిరోధించాలనే దానిపై దృష్టి పెట్టామని ఒక సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం దిశగా సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ అత్యున్నత సమావేశంలో విదేశీ ఉగ్రవాదుల పాత్రపై కూడా చర్చ జరిగింది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్లో హతమైన 46 మంది ఉగ్రవాదుల్లో 37 మంది పాకిస్తానీలేనని అధికారిక సమాచారం. 9 మంది మాత్రమే స్థానికులు ఉన్నారు. జమ్మూకశ్మీర్లోని 33 ఏళ్ల ఉగ్రవాద చరిత్రలో స్థానిక ఉగ్రవాదుల కంటే విదేశీ ఉగ్రవాదుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. కశ్మీర్ లోయలో ప్రస్తుతం దాదాపు 130 మంది ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా శ్రీనగర్లో జరిగిన ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు, ఉత్తర కమాండ్ ఆర్మీ కమాండర్ ఉపేంద్ర ద్వివేది అధ్యక్షత వహించారు. జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, చినార్ కార్ప్స్ కమాండర్,రాష్ట్ర పరిపాలన, భద్రతా సంస్థల ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎన్నికల బరిలో ‘మిజోరం’ కోటీశ్వరులు -
ఎన్ఐఏ పేరిట ఐఎస్ దుష్ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే, లవ్జిహాదీలకు ప్రేరేపించే, సోషల్ మీడియాలో ముస్లింలు పెట్టే అభ్యంతరకరమైన మెసేజ్లపై సమాచారం ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) పేరిట ఓ తప్పుడు సమాచారం సర్క్యులేట్ అవుతున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యతిరేక భావజాలం ఉన్న ముస్లింల సమాచారం ఇవ్వాలంటూ ఫేక్ ఫోన్ నంబర్లతో ఎన్ఐఏ పేరిట ప్రచారం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ వర్గాన్ని ఎన్ఐఏ టార్గెట్గా చేసుకున్నట్టు కొన్ని తప్పుడు సందేశాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రసారం అవుతున్నాయని వెల్లడించింది. నకిలీ ఫోన్ నంబర్లను జత చేసిన ఈ సందేశాలతో ఎన్ఐఏకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్ఐఏ అధికారులు దీనిపై ఆరా తీయగా..ఈ తరహా సందేశాలతో ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్) మోసపూరితంగా భారతీయ యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇలాంటి నకిలీ, తప్పుడు సందేశాలను నమ్మవద్దని, ప్రచారం చేయవద్దని లేదా ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను ఎన్ఐఏ అధికారులు కోరారు. -
ఇజ్రాయెల్ సూపర్ నోవా ఫెస్టివల్పై హమాస్ దాడి.. అసలేం వేడుకిది..?
జెరూసలెం: ఇజ్రాయెల్లో సూపర్ నోవాగా పేరుగాంచిన బహిరంగ మ్యూజికల్ ఫెస్టివల్లో హమాస్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. వందలాది మంది సాధారణ ప్రజలు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. ఆనందంగా జరగాల్సిన మ్యూజిక్ ఈవెంట్లో క్షతగాత్రుల ఆర్తనాదాలతో మరణమృదంగం వినిపించింది. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉన్న వివాదంతో హమాస్ దాడులు చేయగా.. ఇరువైపుల దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ సూపర్ నోవా ఫెస్టివల్ అంటే ఏమిటి..? ఎందుకు దాన్నే టార్కెట్గా ఉగ్రదాడులు జరిగాయి..? సూపర్ నోవాను యూనివర్సల్ పారలెల్లో ఫెస్టివల్ అని కూడా అంటారు. గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతం రీమ్లో జరిగింది. సూపర్ నోవా పండుగను యూదులు వారంపాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ 29, 2023 నుంచి అక్టెబర్ 6, 2023 వరకు జరిగే వేడుక. పంట సేకరణను ఉద్దేశించి జరుపుకునే వేడుక ఇది. పిల్లలపై దేవుడి దయకు నిదర్శనంగా సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ ఐక్యమత్యం, ప్రేమలకు గుర్తుగా మనసుకు హత్తుకునే అంశాలతో కూడుకుని ఉంటుంది. గత శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రారంభం అయింది. పండుగ సందర్భంగా వేలాది మంది యువకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాత్రిపూట గాజా సరిహద్దును దాటుకుని వందిలాది రాకెట్ దాడులు జరిగాయి. ఉగ్రవాదులు మారణాయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. గన్లతో దాదాపు 3500 మంది ఇజ్రాయెల్ యువతపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వేడుకలో చాలా మంది అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉండగా.. బైక్లపై వచ్చిన దుండగులు ఏకే-47 వంటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. భయంతో పరుగులు తీస్తున్న జనం, క్షతగాత్రుల అరుపులతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృతుల సంఖ్య 1,200 దాటింది. హమాస్ మిలిటెంట్ల దాడిలో ఇజ్రాయెల్లో 700 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడిలో గాజాలో 500 మందికిపైగా మరణించారు. ఇరువైపులా వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్లో 130 మందికిపైగా పౌరులను బందీలుగా పట్టుకున్నామని, వారంతా తమ ఆదీనంలో ఉన్నారని హమాస్ ప్రకటించింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
హర్దీప్ నిజ్జర్ హత్య వెనుక చైనా హస్తం? భారత్పై నిందకు కుట్ర?
అమెరికాలో నివసిస్తున్న చైనీస్ బ్లాగర్, జర్నలిస్ట్ జెన్నిఫర్ జెంగ్ తన సంచలన వాదన వినిపించారు. కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీసీ) హస్తం ఉందని ఆరోపించారు. ఈ విధంగా చేయడం వెనుక చైనా లక్ష్యం.. భారతదేశం- పశ్చిమ దేశాల మధ్య వైషమ్యాలను సృష్టించడమేనని ఆ బ్లాగర్ పేర్కొన్నాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేసిన వీడియోలో హర్దీప్ నిజ్జర్ను సీసీసీ ఏజెంట్లు హత్య చేశారని జెంగ్ ఆరోపించారు. 2023, జూన్ 18న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ స్థలంలో ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ను తపాకీతో కాల్చిచంపారు. కాగా జీ-20 సమ్మిట్ నుండి కెనడాకు తిరిగి వచ్చిన తరువాత, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. పలు దేశాలు భారత్కు మద్దతుగా నిలిచాయి. ఈ బ్లాగర్ తన వీడియోలో నిజ్జర్ హత్యకు ముందు సీసీసీ తన ఉన్నత అధికారులలో ఒకరిని అమెరికాలోని సీటెల్కు పంపిందని పేర్కొన్నారు. అక్కడ రహస్య సమావేశం జరిగిందన్నారు. భారతదేశం- పశ్చిమ దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే ఈ సమావేశం లక్ష్యమని పేర్కొన్నారు. కెనడాలో సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సీసీసీ ఏజెంట్లదే బాధ్యత అని బ్లాగర్ జెంగ్ పేర్కొన్నారు. జూన్ 18న సీసీసీ ఏజెంట్లు తుపాకీలతో నిజ్జర్ను వెంబడించారని బ్లాగర్ పేర్కొన్నారు. వారు అతనిని కాల్చి చంపిన తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి నిజ్జర్ కారు డాష్బోర్డ్లో అమర్చిన కెమెరాను పగలగొట్టారని అన్నారు. హంతకులు ఉద్దేశపూర్వకంగానే భారతీయ యాసతో ఇంగ్లీషులో మాట్లాడారని కూడా జెంగ్ ఆరోపించారు. సీసీసీ రహస్య ఏజెంట్లు భారతదేశాన్ని చిక్కుల్లో పడేసే ప్రణాళికలో భాగంగానే ఈ పని చేశారని బ్లాగర్ ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) ఈ వీడియోలో పోస్ట్ చేయగా, జెన్నిఫర్ జెంగ్ ఆరోపణలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా స్పందించలేదు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం మధ్య ప్రాణాంతక వ్యాధి వ్యాప్తి! Exclusive: #CCP Kills #Sikh Leader #Nijjar in #Canada To Frame #India, as Part of “#IgnitionPlan" to Disrupt Worldhttps://t.co/cZOalFxZfE#HardeepSinghNijjar, #assassination, #IndiaCanadaRelations, #ChinaIndiaRelations #IsraelPalestineWar pic.twitter.com/RD240btPbU — Inconvenient Truths by Jennifer Zeng 曾錚真言 (@jenniferzeng97) October 8, 2023 -
పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో కెనడా హిందూ ఫోరం ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్కు విజ్ఞప్తి చేసింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ అమెరికాకు చెందిన సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనేది ఈ సంస్థ ఆశయం. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కూడా పన్నూ ఇప్పటికే పలు ప్రకటనలు కూడా చేశాడు. ఈ క్రమంలో హిందువుల పట్ల ఆయన విద్వేషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పన్నూపై కెనడాలో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఇరు దేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. కెనడా, యూకే, అమెరికా సహా విదేశాల్లో ఉన్న 18 మంది ఖలిస్థానీ నాయకులను ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. ఇండియాలో వారి ఆస్తులను జప్తు చేసింది. ఈ జాబితాలో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకరు. కెనడాలో హిందువులు దేశం విడిచి వెళ్లాలని గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల వివాదాస్పద ప్రకటనలు జారీ చేశాడు. ఖలిస్థానీ మద్దతుదారులకే కెనడాలో స్థానం ఉందంటూ మాట్లాడారు. దీంతో అక్కడి హిందూ సంఘాలు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక ఐఎస్ఐ హస్తం -
ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసులో భారత దౌత్య అధికారుల హస్తం ఉందన్న విశ్వసనీయ సమాచారాన్ని ఇండియాకు తాము కొన్ని వారాల క్రితమే తెలియజేశామని అన్నారు. గత సోమవారం పార్లమెంట్లో మాట్లాడటం కంటే ముందే భారత్కు చెప్పామని స్పష్టం చేశారు. ఇండియాతో నిర్మాణాత్మకమైన సంప్రదింపులు కోరుకున్నామని చెప్పారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య అధికారుల ప్రమోయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించారు. కెనడా పౌరుని హత్యలో భారత్ జోక్యం అంటూ మండిపడ్డారు. దీనిపై భారత్ ఘాటుగా స్పందించింది. ఎలాంటి ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టింది. ఇది రాజకీయ లాభం కోసం చేస్తున్న చర్యగా అభిప్రాయపడింది. ఆ తర్వాత ఇరుదేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిఘా విభాగాలు ఎలాంటి ఆధారాలు సేకరించాయో బయటపెట్టాలని భారత్ కోరింది. కానీ కెనడా ఇప్పటివరకు ఆధారాలను వెల్లడించలేదు. ఇండియా జవాబుదారీగా ఉండాలి: అమెరికా ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా ఆరోపణలపై భారత్ జవాబుదారీగా ఉండాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. దర్యాప్తులో కెనడాకు సహకరించాలని ఇండియాకు పిలుపునిచ్చారు. ఈ అంశంలో భారత్, కెనడాతో సంప్రదింపులు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కెనడాలో సిక్కులకు ఎందుకంత ప్రాధాన్యత..? -
ఉగ్రవాద వ్యాఖ్యలు.. బీజేపీ ఎంపీకి లోక్సభ స్పీకర్ వార్నింగ్..
న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీని కించపరిచేలా పార్లమెంట్లో బీజేపీ సభ్యుడు రమేష్ బిధూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయన్ను సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. లోక్సభ స్పీకర్ సైతం బిధురి అనుచిత వ్యాఖ్యలపై అసంతృప్తి, ఆగ్రహం చేశారు. మరోసారి ఇలాంటి ప్రవర్తన పునరావృతం అయితే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చంద్రయాన్-3 మిషన్ విజయంపై చర్చ సందర్భంగా లోక్సభలో బిధురి మాట్లాడుతూ.. అమ్రోహా బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బిధూరి.. మైనార్టీ ఎంపీని ఉగ్రవాదిగా పేర్కొంటూ పదేపదే దూషణలు చేశారు. డానిష్ అలీని కించపరిచే వ్యాఖ్యలు చేస్తుండగా.. పార్టీ సహచరుడు, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ నవ్వుతూ కనిపించారు. ఇలాంటి మాటలు పడటం బాధగా ఉంది బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై డానిష్ అలీ స్పీకర్కు లేఖ రాశారు. కొత్త పార్లమెంటు భవనం సాక్షిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. మీ నాయకత్వంలో మైనారిటీ ఎంపీగా నాకు ఇలాంటి మాటలు పడడం చాలా బాధగా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. ఆయనతోపాటు అధికార పార్టీ తీరుపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిధురిపై ఎంపీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంపీ తరపున క్షమాపణలు ఈ వివాదం అదుపు తప్పుతోందని గమనించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. బీజేపీ ఎంపీ తరపున క్షమాపణలు చెప్పారు. తన మాటల వల్ల విపక్షాలు బాధపడితే చింతిస్తున్నానమని అన్నారు. మరోవైపు స్పీకర్ కూడా బీజేపీ ఎంపీని హెచ్చరించారు. తన భాష, గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు. మరోసారి ఇలా మాట్లాడితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. బిధూరి ఉపయోగించిన పదాలను తీవ్రంగా పరిగణిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? సస్పెండ్కు డిమాండ్ అయితే క్షమాపణలు సరిపోదని, బిధురిని సస్పెండ్ చేయాలని లేదా అరెస్టు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది పూర్తిగా అవమానకరమని.. రాజ్నాథ్ సింగ్ క్షమాపణలు ఆమోదయోగ్యం కాదని, ఇది పార్లమెంటును అవమానించడమేనని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం క్షమించరానిది బిధూరిపై చర్యలు తీసుకోకుండా ‘మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని అనడం సిగ్గుచేటని లోక్సభ స్పీకర్పై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రతిపక్ష ఎంపీలు చేసిన చిన్న తప్పులకే సస్పెండ్ చేస్తారని.. తమ పార్టీ ఎంపీలు తప్పు చేస్తే చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. దుర్వినియోగం చేయడం క్షమించరానిదని అన్నారు. ఇదే బీజేపీ సంస్కృతి కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ స్పందిస్తూ.. బింధూరి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి భాష ఎప్పుడూ వినలేదని, పార్లమెంట్ లోపలా, బయటా ఇది వాడకూడదని తెలిపారు. ఇది కేవలం డానిష్ అలీనే కాకుండా తామందరిని అవమానించేలా ఉన్నాయన్నారు. కొత్త పార్లమెంటుకు బిధురీమాటలతోనే నాంది జరిగిందని.. ఇది బీజేపీ ఉద్దేశాలను తెలియజేస్తోందని విమర్శించారు. కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ క్షమాపణలు చెప్పడం కంటే బింధూరిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బిధూరిపై చర్యలు తీసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ముస్లింలు, ఓబీసీలను వేధించడం బీజేపీ సంస్కృతిలో అంతర్భాగమని ఆమె ఆరోపించారు. చదవండి: ఉదయనిధి స్టాలిన్కు సుప్రీం నోటీసులు -
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు
ఒట్టావా: ఇండియా-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడ ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భారతీయ హిందువులు కెనడా విడిచి వెళ్లాలని నిషేదిత ఖలిస్థానీ గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) నాయకుడు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్గా మారింది. 'కెనడా హిందువులారా.. మీరు మా దేశ రాజ్యాంగం పట్ల విధేయతను తిరస్కరించారు. మీ గమ్యం భారతదేశం. కెనడాను వదిలి వెళ్లండి. ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాకు విధేయులుగా ఉంటారు. కెనడా రాజ్యాంగం ప్రకారం వారు నడుచుకుంటారు.' అని పేర్కొంటూ పన్నూన్ ఓ వీడియోను విడుదల చేశాడు. అక్టోబర్ 29న వాంకోవర్లో కెనడా సిక్కులు సమావేశమవ్వాలని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ బాధ్యుడని రిఫరెండంపై ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదంపై ఇండియా ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య వేత్తలను కూడా పలుమార్లు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కూడా పన్నూర్ వారం క్రితం హెచ్చరికలు జారీ చేశారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: Canada-India Dispute: ముంబయిలో ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు -
భారత్ను రెచ్చగొట్టే ఉద్దేశం లేదు: ట్రూడో
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు, భారత ప్రభుత్వ ఏజెంట్లకు మధ్య సంబంధం ఉందని ఆరోపించిన వ్యవహారంలో భారత్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. ’’భారత ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంది.. కానీ ఇండియాను రెచ్చగొట్టడం మా ఉద్దేశం కాదు. కానీ కొన్ని ప్రశ్నలకు మాకు సమాధానాలు కావాలి" ఖలిస్థానీ అంశంలో కెనడా ప్రధాని ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం భారత ప్రభుత్వం చాలా సీరియస్ కామెంట్లు చేసింది. అందుకే కెనడా ప్రధాని మళ్లీ స్పందించినట్లు స్పష్టం అవుతోంది. కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇంతేకాకుండా కెనడాలో ఉన్న ఇండియన్ దౌత్య అధికారిని బహిష్కరించారు. ఈ పరిణామాలను భారత్ సీరియస్గా తీసుకుంది. భారత్లో ఉన్న కెనడా దౌత్య అధికారిని కూడా బహిష్కరించింది. దేశం విడిచి వెళ్లాలని గడువు విధించింది. ఇదీ చదవండి: భారత్పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
డ్రోన్లతో చొరబాట్లు!
న్యూఢిల్లీ: డ్రోన్లతో ఉగ్రవాదులు ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, డబ్బులు చేరవేయడం గురించి విన్నాం. చొరబాట్లకు కూడా డ్రోన్లను ఉపయోగించుకుంటున్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కొన్ని నెలల క్రితం డ్రోన్తో పంజాబ్లో ఓ ఉగ్రవాదిని జార విడిచిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్కు 70 కిలోల వరకు బరువును మోసుకెళ్లగల సామర్థ్యం ఉందని తెలియజేశాయి. పాకిస్తాన్ భూభాగంలోని షాకర్గఢ్లో లష్కతే తోయిబా శిక్షణా కేంద్రంలో ఇలాంటి డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్న వీడియోను నిఘా వర్గాలు సేకరించాయి. డ్రోన్లు మనుషులను సునాయాసంగా మోసుకెళ్లి, నీటిలో భద్రంగా వదిలిపెడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. పంజాబ్లో డ్రోన్ సాయంతో అక్రమంగా చొరబడిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించామని అధికారులు చెప్పారు. లష్కరే తోయిబా నాయకులే డబ్బులు ఇచ్చి పంపించినట్లు అతడు అంగీకరించాడని తెలిపారు. డ్రోన్ సాయంతో పంజాబ్ వెళ్లి, అక్కడే స్థిరపడి, ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించాలంటూ లష్కరే తోయిబా నాయకత్వం నుంచి అతడికి ఆదేశాలు అందాయని వెల్లడించారు. పంజాబ్లో ఇప్పటికే మకాం వేసిన ముష్కరుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకోవాలంటూ అతడికి సూచనలిచ్చారని పేర్కొన్నారు. లష్కరే తోయిబాపై భారత్ గతంలోనే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ నుంచి భారత్లోకి ఆయుధాలను, డ్రగ్స్ను పంపించడానికి పాకిస్తాన్ ఉగ్రవాద మూకలు డ్రోన్లను వాడుకుంటున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. ప్రధానంగా జమ్మూకశీ్మర్, పంజాబ్కు ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ వచ్చి పడుతున్నాయి. ఈ వ్యవహారం వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతోపాటు ఖలిస్తాన్ అనుకూల శక్తుల హస్తం కూడా ఉండొచ్చని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ హథ్లాంగ్ ఫార్వర్డ్ ఏరియాలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సైన్యం, కశ్మీర్ పోలీసులు, నిఘా ఏజెన్సీలు ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయని, చొరబాటు యత్నాన్ని భగ్నం చేశాయన్నారు. పొరుగు దేశం నుంచి మన భూభాగంలోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను అడ్డుకొనేందుకు ప్రయతి్నంచగా, కాల్పులు జరిపారని, దాంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయని తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు మరణించారని, ఇద్దరి మృతదేహాలను స్వా«దీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు కొనసాగుతున్నాయన్నారు. హతమైన ముగ్గురు ముష్కరుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మరోవైపు, అనంత్నాగ్ జిల్లాలో ముగ్గురు భారత ఉన్నతాధికారులను బలి తీసుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఆపరేషన్ శనివారం నాలుగో రోజుకు చేరింది. -
దక్షిణాసియాపై ఉగ్ర పంజా
ఉగ్రవాద బెడద ఇంకా సజీవంగానే ఉన్నదని మన పొరుగునున్న పాకిస్తాన్లో తరచు జరిగే దాడులు నిరూపిస్తుండగా మన దేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్లలో తన కార్యకలాపాలు విస్తరించుకోవటానికి అల్ కాయిదా పథకరచన చేస్తున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అనుబంధ నివేదిక హెచ్చరిస్తోంది. ఉగ్రవాద సంస్థల తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తూ అవస రమైన ఆంక్షలను సిఫార్సు చేసే విభాగం ఈ నివేదికను రూపొందించింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో అఫ్గానిస్తాన్లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలపాటు సాగించిన పోరాటం చెప్పుకోదగ్గ ఫలితం ఇవ్వకపోగా, అన్నివిధాలా దెబ్బతిన్న అమెరికా రెండేళ్ల క్రితం అక్కడినుంచి వెనుదిరిగింది. దేశంలోని అన్ని వర్గాల మధ్యా సామరస్య సాధనకు ప్రయత్నించటం, అఫ్గాన్ సమస్యతో సంబంధంవున్న దేశాలకు శాంతిప్రక్రియలో చోటీయటం వంటివేమీ చేయకుండానే అమెరికా కాడి కింద పారేసింది. దాని ఫలితంగానే ఆ దేశంలో మహిళలను దారుణంగా అణిచేయటం, ప్రత్యర్థులను కున్నవారిని తుదముట్టించటం కొనసాగుతూనే ఉంది. ఆఖరికి తమ గడ్డపై నుంచి ఎటువంటి ఉగ్ర వాద కార్యకలాపాలనూ అనుమతించబోమని అమెరికాకు ఇచ్చిన హామీని సైతం తాలిబన్ పాల కులు తుంగలో తొక్కారు. భద్రతా మండలి తాజా నివేదిక దాన్నే ధ్రువీకరిస్తోంది. తమ భూభాగంలో అల్ కాయిదా లేనేలేదని తరచు బుకాయిస్తున్న తాలిబన్ల తీరుకు భిన్నంగా అడపా దడపా ఆ ఉగ్ర సంస్థ జాడల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో అల్ కాయిదా ముఖ్యులు దాదాపు 60 మంది వరకూ ఉండగా, ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే మరో 400 మంది ఉన్నారని భద్రతామండలి నివేదిక తెలిపింది. వీరికి మద్దతుగా నిలబడే బంధువర్గాన్నీ, సన్నిహితులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 2,000 మంది ఉంటా రని ఆ నివేదిక అంచనా వేసింది. అల్ కాయిదా నేతృత్వంలో రూపుదిద్దుకున్న మరో ఉగ్ర సంస్థ భారత ఉపఖండ అల్ కాయిదా (ఏక్యూఐఎస్)కు ప్రస్తుతం 200 మంది ఉగ్రవాదులున్నారని, ఈ సంస్థ పాకిస్తాన్లోని తెహ్రీక్–ఏ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)తో విలీనమై మన దేశంలోని జమ్మూ, కశ్మీర్తోపాటు మయన్మార్, బంగ్లాదేశ్లలో కార్యకలాపాలకు సిద్ధమవుతున్నదని భద్రతామండలి నివేదిక అంటున్నది. టీటీపీ ఆనుపానులు కనిపెట్టడంలో, ఆ సంస్థను నియంత్రించటంలో పాకిస్తాన్ పదే పదే విఫలమవుతోంది. టీటీపీతో పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నిరుడు నవంబర్లో విఫలమయ్యాక ఉగ్ర దాడులు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాది జనవరిలో ఒక మసీదుపై దాడిచేసి 95 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, తాజాగా ఆదివారం ఖైబర్ ఫక్తున్ఖ్వా రాష్ట్రంలో ఆత్మా హుతి దాడి జరిపి, 40 మంది మరణానికి కారకులయ్యారు. అయితే ఈ దాడుల వెనక తాము లేమని టీటీపీ చెబుతోంది. ఆ సంస్థకు దన్నుగా నిలుస్తున్న అఫ్గాన్ ప్రభుత్వం కూడా ఖండిస్తోంది. ఇరుగు పొరుగుకు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా ముద్రపడిన పాకిస్తాన్ చివరకు అదే ఉగ్రవాదం సాలెగూటిలో చిక్కుకుని విలవిల్లాడటం, దాడుల కారకులెవరో కూడా గుర్తుపట్టలేని నిస్సహాయ స్థితిలో పడటం వింతేమీ కాదు. దేశంలో లెక్కకు మించిన ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు సాగిస్తు న్నాయని పాక్ సైన్యం అంచనా వేస్తోంది. ఇవన్నీ అటు సైన్యం పైనా, ఇటు పౌరుల పైనా తరచు దాడులు సాగిస్తున్నాయి. ఉగ్రవాద సంఘటనలు జరిగినప్పుడు ఏ సంస్థా తన ప్రమేయం ఉన్నదని ప్రకటించటం లేదు. ఇప్పుడు టీటీపీ, అల్ కాయిదాలు విలీనం కాబోతున్న వార్త నిజమే అయిన పక్షంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతోపాటు పాకిస్తాన్కు కూడా మరింత ముప్పు ఖాయం. ఈ రెండు సంస్థలూ అఫ్గాన్లో ఇప్పటికే శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ఆ సంస్థలను అన్నివిధాలా కట్టడి చేస్తున్నామని భ్రమల్లో కూరుకుపోయిన ప్రపంచ దేశాలు ఒకసారి సమీక్షించుకోవటం మంచిది. తమ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించబోమని గతంలో ఇచ్చిన హామీకి తాలిబన్లు కట్టుబడటం లేదని ఈ పరిణామాలన్నీ నిరూపిస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలేమిటన్న అంశంపై ఐక్యరాజ్యసమితి దృష్టి పెట్టాలి. తగినన్ని నిధులు లేకుండా, ఎవరి అండదండలూ లేకుండా ఉగ్రవాద సంస్థలు వర్ధిల్లటం ఉత్తమాట. దాదాపు 20 ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో తిష్ఠ వేసి, కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి తాలిబన్ పాలకులకు తెలియదనుకోవటం భ్రమ. తమతోపాటు కలిసినడుస్తున్నట్టు కనిపిస్తున్న నేతల్లో కొందరు వేరే ఉగ్ర సంస్థలకు విధేయులుగా మసులుకుంటున్నారని, వారు వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారని తాలిబన్లకు తెలియదనుకోవటం అమాయకత్వం. ఆ సంస్థల నేత లను ఉద్దేశపూర్వకంగానే అధికారిక వ్యవస్థల్లోకి ప్రవేశపెడుతున్నారని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. పాకిస్తాన్ సైతం మొదట్లో టీటీపీకి, అల్ కాయిదాకు సహాయ సహకారాలందించిన మాట వాస్తవం. టీటీపీ నాయకత్వం తనకు ఎదురుతిరగటం మొదలయ్యాక దానిపై దాడులు సాగిస్తోంది. ఒక బ్రిగేడియర్ను కోల్పోవటంతో సహా ఎన్నో నష్టాలను చవిచూస్తోంది. అటు అమె రికాకు తప్పుడు సమాచారం అందించి తాలిబన్లను అఫ్గాన్లో పునఃప్రతిష్ఠించటంలో కీలక పాత్ర పోషించి దెబ్బతింది. ఏ విలువలకూ కట్టుబడని పాలకుల చేతుల్లో అఫ్గాన్ ఉండటం దక్షిణాసియా ప్రాంత దేశాలకు మాత్రమే కాదు... ప్రపంచానికే ముప్పు తెస్తుంది. కనుక తాజా నివేదికపై భద్రతా మండలి దృష్టి సారించాలి. ఇతరత్రా అంశాల్లో ఎలాంటి విభేదాలున్నా ఉగ్రవాదాన్ని కట్టడి చేయ టంలో అన్ని దేశాలూ ఏకాభిప్రాయానికి రావాలి. -
ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్న చైనా.. భారత్ ఆగ్రహం..
న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనా మరోసారి భారత్ కు అడ్డంకిగా నిలిచింది. 26/11 ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్ ను నిషేధిత జాబితాలో చేర్చి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి భారత్ అమెరికా సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టనీయకుండా చైనా అడ్డుకుంది. ముఖ్య సూత్రధారి.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు సాజిద్ మీర్. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ప్రధాన పాత్ర పోషించి ఆ మారణకాండలో 166 మంది మరణానికి కారణమయ్యాడు. దీంతో సాజిద్ మీర్ ను నిషేదిత వ్యక్తుల్లో చేర్చాలని భారత్ డిమాండ్ చేస్తోంది. అమెరికా అతడిపైన 5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని కూడా ప్రకటించింది. తోడుదొంగలు.. ఒక పక్క భారత్, అమెరికా సాజిద్ కోసం గాలింపు చేస్తోంటే.. పాకిస్తాన్ మాత్రం సాజిద్ చనిపోయినట్టు కట్టుకథ సృష్టించింది. అమెరికా ఆధారాలు చూపించమని కోరగా ప్లేటు ఫిరాయించి అతడికి 8 ఏళ్ళు జైలు శిక్షను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా సాజిద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చేందుకు భారత్, అమెరికా సంయుక్తంగా ఒక ప్రతిపాదనను సిద్ధం చేశాయి. కానీ ఐక్యరాజ్యసమితిలోని అల్ ఖైదా ఆంక్షల కమిటీ ముందు ఈ ప్రతిపాదన చేయనీయకుండా చైనా అడ్డుకుంది. ఉగ్రవాదుల్ని కాపాడే విషయంలో పాకిస్తాన్, చైనా రెండు దేశాలూ ఒక్కటే ధోరణితో వ్యవాహరిస్తున్నాయని, సమాజానికి ప్రమాదకరంగా పరిణమిస్తోన్న ఇటువంటి వ్యక్తులను మనం నిషేధించలేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉగ్రమూకలను అణచడం కష్టమని తెలిపారు ఐక్యరాజ్యసమితి MEA జాయింట్ సెక్రెటరీ ప్రకాష్ గుప్తా. #WATCH | "...If we cannot get established terrorists who have been proscribed across global landscapes listed under security council architecture for pure geopolitical interest, then we do not really have the genuine political will needed to sincerely fight this challenge of… pic.twitter.com/mcbw3bV13W — ANI (@ANI) June 21, 2023 ఇది కూడా చదవండి: రన్నింగ్ ట్రైన్ నుండి జారిపడ్డ యువకుడు.. వైరల్ వీడియో -
మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ ఉగ్రవాది హతం..
కెనడా: భారత మోస్ట్ వాంటెడ్ ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను సర్రేలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ వద్దనున్న గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) గతంలో ప్రకటించిన 40 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ పేరు కూడా ఉంది. పంజాబ్ నుంచి కెనడా పారిపోయి చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న నిజ్జర్ ను అప్పగించాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కెనడా ప్రభత్వాన్ని కోరుతూ ఉంది. కానీ అంతలోనే కెనడాలోని గురునానక్ సిక్కు గురుద్వారా దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతడిని కాల్చి చంపేశారు. ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్.. భారత్ దేశంలో జరిగిన అనేక హింసాత్మక కార్యకలాపాల్లో అతని ప్రమేయముంది. ప్రస్తుతం నిజ్జర్ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ గా వ్యవహరిస్తున్నాడు. కెనడాలోని భారత రాయబారి సంస్థ పైన ఇటీవల జరిగిన దాడుల్లో నిజ్జర్ ప్రమేయముందని స్వయంగా భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రాన్ని భారత్ దేశం నుండి వేరు చేయాలని డిమాండ్ చేస్తున్న సిఖ్ ఫర్ జస్టిస్(SFJ) సంస్థతో కూడా నిజ్జర్ కు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రకటించని జాతీయ దర్యాప్తు సంస్థ. జలంధర్ కు చెందిన ఒక పూజారిని హత్య చేయడానికి ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ తో కలిసి కుట్ర పన్నాడన్న ఆరోపణల మీద జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అతని కోసం కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. చివరకు కెనడా అధికారులు అతడిని అప్పగించేలోపే అనంతలోకాలకు వెళ్ళిపోయాడు నిజ్జర్. ఇది కూడా చదవండి: మెక్సికోలో పెను భూకంపం.. -
జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో శుక్రవారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అయిదుగురు విదేశీఉగ్రవాదులను జవాన్లు హతమార్చారు. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న సైన్యం, పోలీసులు గురువారం రాత్రి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించారు. ఈక్రమంలోనే పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ జరిగిందని కాశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు విదేశీ ఉగ్రవాదులు మరణించారని.. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. #KupwaraEncounterUpdate: Five (05) foreign #terrorists killed in #encounter. Search in the area is going on: ADGP Kashmir@JmuKmrPolice https://t.co/h6aOuTuSj0 — Kashmir Zone Police (@KashmirPolice) June 16, 2023 -
Hyderabad: ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఇంటిలిజెన్స్ సమాచారంతో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హిజబ్ ఉట్ తెహ్రిర్ సంస్థతో సంబంధాలున్న ఉగ్రవాద మూలాలు హైదరాబాద్లో ఉన్నట్లు తేలడంతో అధికారులు దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వారంతా పెద్ద పెద్ద నగరాలనే టార్గెట్ చేస్తూ.. మధ్యప్రదేశ్, హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో ఉగ్రదాడులకు పాల్పడే కుట్రలు జరుగతున్నట్లు అనుమానాలు రావడంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. దీనికి సంబంధించి ఇటీవలే హైదరాబాద్లో ఆరుగురు, భోపాల్లో 11 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరో ఇద్దర్ని బాబానగర్, చంద్రాయన్ గుట్టలలో అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. దీంతో అరెస్టయిన నిందితుల సంక్య 19కి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: దేశవ్యాప్తంగా ఏకకాల దాడులకు కుట్ర! పరారీలోనే సల్మాన్.. విచారణలో కీలక విషయాలు.. ) -
పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలకు పెనుముప్పు తప్పింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఓ వ్యక్తిని జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద అయిదు కేజీల పేలుడు పదార్థం(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని బుద్గామ్లోని అరిగాం నివాసి అయిన ఇష్ఫాక్ అహ్మద్ వానీగా పోలీసులు గుర్తించారు. వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడంతో ఉగ్రవాదుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర కశ్మీర్లో భద్రతా బలగాలు భద్రతను కట్టిదిట్టం చేశాయి. అదనపు భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా గత వారం జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులు అరాచానికి పాల్పడిన విషయం తెలిసిందే. కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా టెర్రరిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎన్కౌంటర్లో అయిదుగురు జవాన్లు అమరులయ్యారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత భారీస్థాయిలో పేలుడు పదార్థాలు లభించడం గమనార్హం. చదవండి: స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు.. ఆరుగురు అమ్మాయిలకు గాయాలు -
పిలిస్తే రాలేదని రెచ్చిపోయిన పోలీసు.. టెర్రరిస్టుగా మారుస్తానంటూ...
ఓ పోలీసు సహనం కోల్పోయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ప్రజల పట్ల పోలీసులు ఇలా ప్రవర్తిస్తారా? అని ముక్కుమీద వేలేసుకునేలా బెదిరింపులకు దిగాడు. ఈ షాకింగ్ ఘటన బిహార్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. బిహార్ పోలీసు ఒక టీచర్ పట్ల అత్యంత అనుచితంగా ప్రవర్తించాడు. ఒక ఉపాధ్యాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రాజధాని పాట్నాకు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమయి పోలీస్టేషన్కు వచ్చారు. అయితే ఆ టీచర్ పోలీసు పిలిపించిన సమయాని కంటే మూడు రోజులు ఆలస్యంగా వచ్చాడు. దీంతో విసిగిపోయిన సదరు పోలీసు దురుసుగా ప్రవర్తించాడు. పోలీసు రాజేష్ శరణ్ కూర్చొన్న సీటులోంచి లేచి కోపంతో ..ప్రజలను తీవ్రవాదులుగా ప్రకటించడమే మా పని.. ఒక్కసెకనులో నిన్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తా! అని బెదరింపులకు దిగాడు. కానీ ఉపాధ్యాయుడు అందుకు గల కారణాన్ని వివరించేందుకు యత్నించినా వినకుండా ఇలా అధికార మదంతో చెలరేగిపోయాడు. ఆ సమయంలో చుట్టు పక్కల ఉన్న ప్రజలెవరూ జోక్యం చేసుకోలేదు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో జమయి పోలీస్టేషన్ ఈ ఘటనపై సత్వరమే విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా) -
తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవు
-
ఖతర్నాక్ ఖలీమ్! మానవ బాంబు డాలిన్ను సిటీకి తీసుకొచ్చింది ఇతడే..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గత ఏడాది దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్ గ్రెనేడ్లతో విధ్వంసాలకు కుట్ర పన్నిన కేసులో హైదరాబాద్ సిట్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన మహ్మద్ అబ్దుల్ ఖలీమ్ సామాన్యుడు కాదని అధికారులు చెబుతున్నారు. లష్కరేతోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులు అబ్దుల్ జాహెద్, మహ్మద్ సమీయుద్దీన్, మాజ్ హసన్ ఫారూఖ్లకు సంబంధించిన కేసులోనే సిట్ ఇతడినీ కటకటాల్లోకి పంపింది. తదుపరి విచారణ నిమిత్తం ఖలీమ్ను తమ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. బిలాల్ ద్వారానే ఉగ్రబాట... ఎల్బీనగర్ సమీపంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన ఖలీమ్ అక్కడే వెల్డింగ్ దుకాణం నిర్వహిస్తుంటాడు. ముసరాంబాగ్ ప్రాంతానికి చెందిన, పాకిస్థాన్లోని కరాచీలో ఎన్కౌంటర్ అయిన ఎల్ఈటీ ఉగ్రవాది షాహెద్ అలియాస్ బిలాల్ ద్వారా ఉగ్రవాద బాట పట్టాడు. 2004లో నగరం నుంచి పారిపోయి సౌదీ అరేబియాలో తలదాచుకున్న బిలాల్ ఆదేశాల మేరకు 2005లో అతడి సోదరుడు జాహెద్తో కలిసి పని చేయడానికి అంగీకరించాడు. అప్పట్లో ఈ లష్కరేతోయిబా ఉగ్రవాదులు గ్రీన్ల్యాండ్స్లో ఉండే హైదరాబాద్ పోలీసు కమిషనర్, టాస్్కఫోర్స్ కార్యాలయాన్ని టార్గెట్ చేశారు. వరుసగా ఉగ్రవాదులను అరెస్టు చేస్తుండటంతో పోలీసులను నైతికంగా దెబ్బతీయడానికే దీన్ని ఎంచుకున్నారు. ఈ కుట్ర మొత్తం సౌదీ నుంచి బిలాల్ అమలుపరిచాడు. అప్పటి నుంచి జాహెద్తో కలిసే.. దసరా రోజు కావడంతో పెను ముప్పు తప్పగా ఓ హోంగార్డు మాత్రం అమరుడయ్యాడు. ఈ కేసులో అదే ఏడాది అక్టోబర్ 18న అరెస్టైన ఖలీమ్ 2017 వరకు జాహెద్తో కలిసి జైల్లోనే ఉన్నాడు. టాస్క్ఫోర్స్ కార్యాలయంపై మానవబాంబు దాడి కేసు వీగిపోవడంతో విడుదలయ్యాడు. అప్పటి నుంచి జాహెద్తో సన్నిహితంగానే ఉంటున్నాడు. ‘దసరా విధ్వంసాల’ కోసం పాకిస్థాన్లో ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ జాహెద్కు మొత్తం రూ.40 లక్షల వరకు పంపాడు. ఈ మొత్తం వివిధ హవాలా ఆపరేటర్లతో పాటు ఖలీమ్ ద్వారానూ ఇతడికి అందింది. రూ.10 లక్షలు అందించిన ఖలీమ్ నగరంలో రెక్కీ చేయడానికి సహకరించాడు. దసరా ఉత్సవాలు జరిగే మైదానాలే వీరి టార్గెట్లో ఉన్నాయి. ఖలీమ్ను సిట్ పోలీసులు టాస్్కఫోర్స్ అధికారుల సాయంతో గురువారం చంద్రాయణగుట్టలోని అతడి అత్తగారింటి వద్ద అరెస్టు చేశారు. ఆ సమయంలో అతడి బంధువులు, కుటుంబీకులు పోలీసులకు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన అధికారులు తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు ఇప్పటికే ఎన్ఐఏకు బదిలీ కావడంతో ఖలీమ్ విచారణ తర్వాత పూర్తి స్థాయిలో ఆ విభాగానికి అప్పగించనున్నారు. ఆ ఆపరేషన్లోనూ కీలకపాత్ర.. శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈకి, కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలకు మాత్రమే పరిమితమైన మానవ బాంబు విధానాన్ని టాస్క్ఫోర్స్ కార్యాలయంపై వాడాలని ఈ ఉగ్రవాదులు నిర్ణయించుకున్నారు. బంగ్లాదేశ్లోని ఢాకాకు చెందిన మౌథసిమ్ బిల్హా అలియాస్ డాలిన్ను మానవ బాంబుగా మార్చారు. ఇతడిని తీసుకురావడానికి అప్పట్లో ఖలీమ్ సరిహద్దులు దాటి అక్రమంగా బంగ్లాదేశ్ వెళ్లడంతో పాటు కొన్నాళ్లు ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. డాలిన్ను తీసుకుని నగరానికి చేరుకుని ఎన్టీఆర్ నగర్లోని తన ఇంట్లోనే అతడికి ఆశ్రయం ఇవ్వడం, టాస్క్ఫోర్స్ ఆఫీస్ వద్ద రెక్కీ చేయించడంలో కీలక పాత్ర పోషించాడు. నాటి బాంబు కూడా ఖలీమ్ ఇంట్లోనే తయారైంది. తనను తాను పేల్చుకోవడానికి సిద్ధమైన డాలిన్ను 2005 అక్టోబర్ 12 (దసరా రోజు) టాస్క్ఫోర్స్ కార్యాలయం వద్దకు తీసుకువెళ్లి వదిలాడు. చదవండి: అపరిచితులు ఆహారం పెట్టినా ముట్టవు.. చిటికెలో జాడ పట్టేయగలవు.. -
చొరబాటు యత్నం భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్లో పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్లో శనివారం ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా సిబ్బంది భగ్నం చేశారు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. ఇటీవల ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు పెరిగాయని, అయితే భద్రతా దళాలు విజయవంతంగా అడ్డుకుంటున్నట్లు తెలిపారు. చొరబాటుకు యత్నించి ఉగ్రవాదుల వద్ద భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముష్కరులు నియంత్రణ రేఖ వద్ద భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ముగ్గురిని అరెస్ట్ చేస్తే 100 మంది వచ్చారు.. పోలీసులకే చుక్కలు చూయించారు! -
వాంటెడ్ టెర్రరిస్ట్ హర్ప్రీత్ సింగ్ అరెస్ట్
సాక్షి న్యూఢిల్లీ: వాంటెడ్ టెర్రరిస్ట్ హర్ప్రీత్ సింగ్ను ఎన్ఐఏ శుక్రవారం అరెస్ట్ చేసింది. లూథియానా కోర్టు పేలుడు కేసులో ప్రధాన కుట్రదారుడైన హర్ప్రీత్ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన హర్ప్రీత్.. ఘటన అనంతరం మలేషియాకు చెక్కేశాడు. తాజాగా భారత్కు రాగా పక్కా సమాచారంతో కాపుగాసిన ఎన్ఐఏ ఢిల్లీ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే అతనిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. కాగా, 2021 డిసెంబర్ 23 న లూథియానా కోర్టులో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్కు చెందిన సెల్ఫ్-స్టైల్ సంస్థ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్వైఎఫ్) చీఫ్ లఖ్బీర్ సింగ్ రోడ్ సహచరుడు హర్ప్రీత్ సింగ్ లూథియానా కోర్ట్ బిల్డింగ్ పేలుడు కుట్రదారుల్లో ఒకడని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. చదవండి: మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ -
Bengaluru: షారిఖ్పై ఉగ్ర ముఠాల గురి?.. రహస్యాలన్నీ చెప్పేస్తాడని భయం
రేవు నగరిలో బాంబు విస్ఫోటం దేశమంతటా చర్చనీయాంశమైంది. ఈ పేలుడులో ప్రాణాలతో దొరికిపోయిన ఉగ్ర అనుమానితుడు షారిఖ్ వద్ద విలువైన సమాచారం పోలీసులకు లభిస్తోంది. బడా ఉగ్రవాదుల నెట్వర్క్ తాళం అతని వద్ద ఉందని ఎన్ఐఏ కూడా విచారిస్తోంది. ఇక షారిఖ్ వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదనుకున్న ఉగ్రవాద ముఠాలు అతన్ని హతమార్చాలని కుట్రలు చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. సాక్షి, బెంగళూరు(యశవంతపుర): మంగళూరు కుక్కర్ బాంబ్ పేలుడు నిందితుడు షారిఖ్ను అంతమొందించాలని ఉగ్రవాద ముఠాలు ప్లాన్ వేసినట్లు అనుమానాలు వచ్చాయి. దీంతో సోమవారం నుంచి షారిఖ్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి చుట్టూ భద్రతను మరింత పెంచారు. ఓ ఉగ్రవాద సంస్థ చేసిన పోస్ట్లో షారిఖ్ను హత్య చేయాలనేలా కొన్ని ఆధారాలు పోలీసులకు చిక్కాయి. స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులు ఈ దాడి చేసే అవకాశం ఉంది. షారిఖ్ వల్ల తమ రహస్యాలన్నీ పోలీసులకు చేరిపోతాయని, అందరూ ఇబ్బందుల్లో పడతామని, కాబట్టి అతన్ని హతమారిస్తే ఈ సమస్య ఇంతటితో అయిపోతుందని ఉగ్రవాదుల ఆలోచనగా పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఆస్పత్రి గదుల వద్ద మెటల్ డిటెక్టర్ను ఏర్పాటు చేసి వచ్చి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. షారిఖ్ కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫోన్లో బాంబుల తయారీ, ఐసిస్, అల్ఖైదా వీడియోలు నిందితుడు షారిఖ్ మొబైల్లో 12 వందల వీడియోలు బయట పడ్డాయి. ఇందులో బాంబ్ను ఎలా తయారు చేయాలనే వీడియోలతో పాటు ఐసిస్, అల్ఖైదా ఉగ్రవాదుల వీడియోలు ఉండటం పోలీసు వర్గాలను ఆందోళన కలిగిస్తోంది. ఇతడు అనేక చోట్ల భారీ మొత్తాల్లో నగదు వ్యవహారం చేశాడు. నాలుగేళ్ల నుంచి బాంబ్ తయారీ కోసం తపించేవాడని, కొన్నిసార్లు ఉన్మాదంగా ప్రవర్తించేవాడని షారిఖ్ కుటుంబసభ్యులు పోలీసులకు వివరించారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకాలోని తన స్వగ్రామంలో బాంబ్ను తయారు చేసి పేల్చిన సంగతి బయట పడింది. చిన్నవయస్సులోనే దారి తప్పి ఇలాంటి ఘటనలకు పాల్పడటంపై గ్రామస్థులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేలుడు రోజున షారిఖ్తో పాటు బ్యాగ్ తగిలించుకొని వచ్చిన యువకుడు అదృశ్యమయ్యాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నా జాడ లేదు. వలస కార్మికులపై నిఘా దక్షిణ కన్నడ జిల్లాలో పోలీసులు వలస కార్మికుల వివరాలను సేకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కారి్మకుల వివరాలను సేకరించేపనిలో ఉన్నారు. ఇసుక తరలింపు, రబ్బర్, వక్కతోటలు, సిమెంట్, టైల్స్, గ్రానైట్, హోటల్, బార్లు, ఎస్టేట్లలో పని చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కారి్మకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: స్వామీజీ తీరప్రాంతంలో అనుమానాస్పదమైన కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులపై నిఘా పెట్టాలని ఉడుపి పేజావర విశ్వప్రసన్నతీర్థ స్వామి ప్రజలను హెచ్చరించారు. అయన సోమవారం మంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. కుక్కర్ బాంబ్ పేలుడు తరువాత కరావళిలో జరుగుతున్న ఉగ్రవాదుల కార్యకలాపాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనుమానంగా కనిపించేవారి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కరావళి ప్రాంతాలలో అనేక జాతర, తిరునాళ్లు జరుగుతున్నాయి. ఇలాంటి రద్దీ ప్రదేశాలలో ఏదైనా జరిగితే పెద్ద ముప్పు ఏర్పడుతుందన్నారు. -
‘ఉగ్ర’ దేశాలపై ఆర్థిక ఆంక్షలు: అమిత్ షా
న్యూఢిల్లీ: ఉగ్రవాద మూకలకు స్వర్గధామాలుగా మారిపోయిన దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించాల్సిందేనని కేంద్రం హోంశాఖ మత్రి అమిత్ షా అన్నారు. పరోక్షంగా పాకిస్తాన్పై విరుచుకుపడ్డారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకున్నాయని ఆరోపించారు. ఆయన శనివారం ఢిల్లీలో ‘నో మనీ ఫర్ టెర్రర్’ సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ఉగ్రవాదానికి అంతర్జాతీయ సరిహద్దులుండవు. దాని నిర్మూలనకు ప్రపంచ దేశాలన్నీ కలిసి పని చేయాలి. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాలి. కొన్ని దేశాలు ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్నాయి. వారి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయి’’ అని పాకిస్తాన్ను ఉద్దేశించి విమర్శించారు. ‘‘టెర్రరిజం రాజకీయ అంశం కాదు. పౌరుల రక్షణ, ప్రజాస్వామిక హక్కులకు సంబంధించినది. లాభాపేక్ష లేని సంస్థల ముసుగులో ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేయకుండా చర్యలు తీసుకోవాలి. కౌంటర్–టెర్రర్, ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను బలోపేతం చేసుకోవాలి’’ అని అమిత్ షా తెలిపారు. -
అలా కాదు.. ఇలా ఉంటాడు.. ‘దసరా విధ్వంసం–ఉగ్ర త్రయం’లో ఇతడే కీలకం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన మహ్మద్ ఫర్హాతుల్లా ఘోరీ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్. దసరా ఉత్సవాల నేపథ్యంలో హ్యాండ్ గ్రెనేడ్లతో భారీ విధ్వంసాలకు కుట్రపన్ని చిక్కిన ఉగ్ర త్రయాన్ని పాకిస్థాన్ నుంచి హ్యాండిల్ చేసిన ముగ్గురిలో ఇతడూ ఒకడు. ఇతడిపై ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసు జారీ అయి ఉన్నా... ఇప్పటి వరకు పోలీసులతో సహా ఏ ఏజెన్సీ వద్ద స్పష్టమైన ఫొటో లేదు. కొన్నేళ్ల క్రితం రూపొందించిన ఉహాచిత్రంతోనే (స్కెచ్) నెట్టుకు వస్తున్నారు. ఉగ్ర త్రయంలో కీలక వ్యక్తి మహ్మద్ జాహెద్ విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా అధికారులు తమ వద్ద ఉన్న స్కెచ్లో అనేక మార్పులు చేస్తున్నారు. 24 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి... మాదన్నపేట సమీపంలోని కూర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇది జరిగిన నాలుగేళ్ల తర్వాత కానీ ఇతని పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కలేదు. 2002లో గుజరాత్లోని అక్షర్ధామ్ దేవాలయంపై జరిగిన దాడి కేసుతో ఇతని వ్యవహారాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. 2004లో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్ (జేఈఎం)కు సానుభూతిపరుడిగా ఉన్న ఇతను ఈ కేసులో నిందితుడిగా మారాడు. ఆపై 2005లో టాస్క్ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి తాజాగా దసరా ఉత్సవాల్లో విధ్వంసానికి కుట్ర సహా అనేక కేసుల్లో ఇతడి పేరుంది. కొన్నాళ్లు దుబాయ్, ఇప్పుడు రావల్పిండి... పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతో ఫర్హాతుల్లా ఘోరీ సుదీర్ఘ కాలం దుబాయ్లో తలదాచుకున్నాడు. అక్కడి నుంచే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరవెనుక సాయం చేయడంతో కీలక వ్యక్తిగా మారాడని నిఘా వర్గాలు గుర్తించాయి. యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాడని, దుబాయ్ మీదుగా పాక్ పంపాడని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్లోని రావల్పిండిలో ఉంటూ ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ)లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇండియన్ వుుజాహిదీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అమీర్ రజా ఖాన్కు సన్నిహితుడిగా ఉన్నాడు. ఈ తరహా నేరచరిత్రతో పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ స్పష్టమైన ఫొటో పోలీసులకు లభించలేదు. 35 ఏళ్ల క్రితం నాటి ఫొటోనే... ఇతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ విషయాన్ని తన వెబ్సైట్లోనూ పొందుపరిచింది. అయితే ప్రతి నోటీసుతోనూ ఆ వాండెట్ వ్యక్తి ఫొటోను జత చేస్తుంటుంది. అయితే ఘోరీ నోటీసుతో పాటు దాదాపు 35 ఏళ్ల క్రితం నాటి, అస్పష్టమైన ఫొటోనే ఉంచింది. అతడి స్పష్టమైన ఫొటో ఏ ఏజెన్సీ వద్దా లేకపోవడమే అందుకు కారణం. 2008 ఏప్రిల్లో ఇతని మేనల్లుడు ఫయాఖ్ను దుబాయ్ నుంచి డిపోట్ చేయగా (బలవంతంగా తిప్పిపంపడం) నగర పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో ఫయాఖ్ చెప్పిన రూపురేఖల ఆధారంగా దాదాపు ఫర్హాతుల్లా ఘోరీకి సంబంధించి దాదాపు 20 స్కెచ్స్ (ఊహాచిత్రాలు) రూపొందించారు. అక్షర్ధామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఫర్హాతుల్లా ఘోరీ సోదరుడు షౌకతుల్లాను 2009 ఏడాది జూలైలో అరెస్టు చేసినప్పుడు వీటిని చూపగా ఓ స్కెచ్ను నిర్థారించడంతో ఇప్పటి వరకు అదే ఆధారంగా ఉంది. జాహెద్కు వీడియో కాల్స్ చేయడంతో... ఉగ్ర త్రయంలో ఒకడైన జాహెద్కు రావల్పిండి నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. కొన్ని సందర్భాల్లో ఇతడితో వీడియో కాల్లో మాట్లాడాడు. జాహెద్ విచారణలో ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అతడి రూపురేఖలపై జాహెద్ను లోతుగా ప్రశ్నిస్తూ తమ వద్ద ఉన్న స్కెచ్ చూపించి మార్పు చేర్పులు చెప్పాలని కోరారు. ఘోరీ ప్రస్తుతం కాశ్మీరీ లుక్తో ఉన్నాడని జాహెద్ చెప్పాడు. గడ్డం, మీసంతో పాటు పొట్ట కూడా ఉందని, తనతో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు రెండుమూడుసార్లు సిగరెట్ కాలుస్తూ కనిపించాడని బయటపెట్టాడు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు తమ వద్ద ఉన్న స్కెచ్లో పలుమార్పులు చేయాలని నిర్ణయించారు. ఊహా చిత్రాలు తయారు చేసే నిపుణుల సాయంతో ఆ పని చేస్తున్నాడు. ఘోరీ రూపురేఖలు చెప్పిన జాహెద్ -
పాక్ టెర్రరిస్టుకు చైనా అండ.. 4 నెలల్లో ఐదోసారి మోకాలడ్డు
వాషింగ్టన్: పాకిస్థాన్కు వంతు పాడే చైనా మరోమారు తన కుటిల బుద్ధిని చూపించింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలనే భారత్-అమెరికా ప్రతిపాదను అడ్డుకుంది. పాకిస్థాన్కు చెందిన తల్హా సయీద్ను ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికా ప్రతిపాదించగా.. బీజింగ్ హోల్డ్లో పెట్టింది. లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది షాహిద్ మహమూద్ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించటాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే మరోమారు చైనా ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కుమారుడు హఫీజ్ తల్హా సయీద్ను ఇటీవలే ఉగ్రవాదిగా గుర్తించింది భారత్. చట్ట వ్యతిరేక చర్యల నియంత్రణ చట్టం 1967 కింద హఫీజ్ సయీద్ను టెర్రరిస్ట్గా ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 8న నోటిఫికేషన్ జారీ చేసింది. తల్హా సయీద్.. భారత్లో లష్కరే తోయిబా కోసం నియామకాలు చేపట్టటం, నిధులు సేకరించటం, దాడులకు ప్రణాళికలు రచించటంలో కీలకంగా వ్యవహరించినట్లుపేర్కొంది. ఐక్యరాజ్య సమితిలోని 1267 అల్ఖైదా ఆంక్షల కమిటీలో భారత్, అమెరికా ప్రతిపాదనలకు చైనా అడ్డుకోవటం ఇదేం మొదటిసారి కాదు. గడిచిన నాలుగు నెలల్లోనే చైనా ఓ ఉగ్రవాదికి మద్దతు ఇవ్వటం ఇది ఐదోసారి. ఇటీవలే లష్కరే సభ్యుడు షాహిద్ మహమూద్, సెప్టెంబర్లో సాహిద్ మిర్, జూన్లో జమాత్ ఉద్ దావా లీటర్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ, ఆగస్టులో జైషే మహమ్మద్ చీఫ్ సోదరుడు అబ్దుల్ రావూఫ్ అజార్లకు మద్దతు తెలిపింది. వారిని అంతర్జాతీయ ఉగ్రవాదులగా గుర్తించాలని ప్రతిపాదనకు అడ్డుపడింది. ఇదీ చదవండి: భారత్పై దొంగదెబ్బ తీసిన కమాండర్లకు చైనా ప్రమోషన్.. టాప్ పోస్టులతో సత్కారం! -
Army Dog Zoom: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ‘జూమ్’ మృతి
శ్రీనగర్: శత్రువులకు ఎదురొడ్డి వీరోచితంగా పోరాడిన ఇండియన్ ఆర్మీ శునకం ‘జూమ్’ మృతి చెందింది. జమ్మూకశ్మీర్లో ఇటీవల భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో జూమ్ అనే జాగిలం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అడ్వాన్స్ ఫీల్డ్ వెటర్నరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ శునకం గురువారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. ఉదయం 11:45 గంటల వరకు వైద్యానికి బాగానే సహకరించిందని, అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ఆపేసి కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా సైన్యంలో కఠిన శిక్షణ పొందిన ‘జూమ్’.. కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీ తరపున సేవలు అందిస్తుంది. అనేక సెర్చ్ ఆపరేషన్లలో పాల్గొంది. జమ్మూకశ్మీర్లో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లోనూ భాగం అయ్యింది. శత్రువులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేసింది. అసలేం జరిగిందంటే.. జమ్మూకశ్మీర్ అనంత్నాగ్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ముందుగా సైన్యం ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి జూమ్ అనే ఆర్మీ కుక్కను పంపారు. అది టెర్రరిస్టులను గుర్తించి వారిపై దాడి చేసింది. దీనిని గమనించిన ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. #UPDATE | Army dog Zoom, under treatment at 54 AFVH (Advance Field Veterinary Hospital ), passed away around 12 noon today. He was responding well till around 11:45 am when he suddenly started gasping & collapsed: Army officials He had received 2 gunshot injuries in an op in J&K pic.twitter.com/AaEdKYEhSh — ANI (@ANI) October 13, 2022 దీంతో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్లో 'జూమ్' అనే ఆర్మీ కుక్కకు రెండు తుపాకీ బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడి నెత్తురు కారుతున్నా.. జూమ్ తన పోరాటాన్ని కొనసాగించింది.. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా సంస్థకు చెందినవారుగా అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్లో పలువురు జవాన్లు సైతం గాయపడ్డారు. సెర్చ్ ఆపరేషన్ ముగిసిన వెంటనే జూమ్ను ఇక్కడి ఆర్మీ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జూమ్ మరణించింది. -
ఇండియన్ ఆర్మీపై దాడులకు పాక్ ఆర్మీ స్కెచ్
శ్రీనగర్: భారత గడ్డపై దాడులకు పాక్ సైన్యం కుటిల యత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ క్రమంలో.. భారత్లో దాడులకు సుపారీ తీసుకున్న ఓ ఉగ్రవాదిని భారత సైన్యం నిలువరించగలిగింది. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద గత రెండురోజులుగా భారత్లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీవోకే సమీపంలోని అటవీ ప్రాంతంలో భారత సైన్యం అమర్చిన ల్యాండ్ మైన్ పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. ఆగస్టు 21న నౌషేరా ప్రాంతంలోని ఝంగర్ సెక్టార్ నుంచి భారత్లోకి ఆయుధాలతో అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని గాయపరిచి అదుపులోకి తీసుకుంది భారత సైన్యం. సరిహద్దు ప్రాంతంలోని ఫెన్సింగ్ను కట్ చేసి చొరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపి.. అతన్ని గాయపరిచి పట్టుకున్నారు. గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా.. అతని నుంచి కీలక సమాచారం సేకరించింది భారత సైన్యం. అతన్ని పీవోకే కొట్లి జిల్లా సబ్జ్కోట్కు చెందిన తబరాక్ హుస్సేన్గా గుర్తించింది. పాక్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీకి చెందిన కల్నల్ యూనస్ చౌద్రీ తనను పంపించాడని, భారత ఆర్మీపై దాడులకు పాల్పడాలంటూ తనకు రూ.30వేల పాక్ రూపాయలను ఇచ్చాడని వెల్లడించాడు. ఆయుధాలతో పాటు పాక్ కరెన్సీని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది. విశేషం ఏంటంటే.. 2016లో తబరాక్ నియంత్రణ రేఖ వెంబడి తన సోదరుడితో సహా చొరబడేందుక యత్నించగా.. ఇండియన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అయితే మానవతా ధృక్పదంతో ఏడాది జైలుశిక్ష తర్వాత అతన్ని మళ్లీ వెనక్కి పంపించేసింది. అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ఈసారి ఏకంగా దాడులకే సిద్ధపడడం గమనార్హం. #WATCH | Tabarak Hussain, a fidayeen suicide attacker from PoK, captured by the Indian Army on 21 August at LOC in Jhangar sector of Naushera, Rajouri, says he was tasked by Pakistan Army's Col. Yunus to attack the Indian Army for around Rs 30,000 pic.twitter.com/UWsz5tdh2L — ANI (@ANI) August 24, 2022 ఇదీ చదవండి: మరో జలియన్ వాలాబాగ్.. 80 ఏళ్లు పూర్తి.. అయినా గుండెలపై మానని గాయం -
మహారాష్ట్రలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర
-
Maharashtra: రాయ్గఢ్లో టెర్రర్ బోట్ కలకలం.. మూడు ఏకే 47.. ఇంకా
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. రాయ్గఢ్లోని హరిహరేశ్వర్ బీచ్లో టెర్రర్ బోట్ కలకలం సృష్టిస్తోంది. ముంబైకి 190 కి.మీ దూరంలోనున్న బీచ్ వద్ద స్థానికులు బోటును గుర్తించారు. అందులో ఎలాంటి సిబ్బంది లేకపోవడంతో భద్రతా ఏజన్సీలను అప్రమత్తం చేశారు. బోట్లలో మూడు ఏకే 47, బుల్లెట్లు, అమ్మోనియం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై తరహా దాడులకు కుట్ర చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయ్గఢ్ వ్యాప్తంగా పోలీసులు భద్రతకు కట్టుదిట్టం చేశారు.హై అలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ దళం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. పడవ ఎక్కడి నుంచి వచ్చింది? అందులోని ఆయుధాలు ఎవరు పంపారు? పడవలో ఎవరైనా వచ్చారా?. నే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా అనుమానస్పద బోటు ఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు రాయ్గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే తెలిపారు. గణేష్ చవితి సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. చదవండి: కేంద్రం సీరియస్.. యూట్యూబ్ ఛానల్స్పై నిషేధం -
భగత్ సింగ్పై వివాదాస్పద వ్యాఖ్యలు
ఛండీగఢ్: భగత్ సింగ్పై వివాదాస్పద కామెంట్ చేశాడు పంజాబ్ ఎంపీ ఒకరు. సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీ స్థానానికి ఈమధ్యే ఎన్నికైన సిమ్రన్జిత్ సింగ్ మాన్(77) భగత్ సింగ్ను ఒక ఉగ్రవాదిగా అభివర్ణించారు. సిమ్రన్జిత్ సింగ్ మాన్.. శిరోమణి అకాళీ దళ్(అమృత్సర్) చీఫ్ కూడా. ‘‘భగత్ సింగ్ యువకుడైన ఓ ఇంగ్లీష్ అధికారిని చంపాడు.సిక్కు కానిస్టేబుల్ ఛన్నన్ సింగ్నూ హతమార్చాడు. జాతీయ అసెంబ్లీలో బాంబు విసిరాడు. ఇప్పుడు చెప్పండి.. భగత్ సింగ్ ఉగ్రవాదా? కాదా?’’ అంటూ కామెంట్లు చేశాడు. ఖలిస్థానీ అనుకూల వ్యాఖ్యలు చేసే క్రమంలో.. ఇలా కామెంట్లు చేశాడు ఆయన. అయితే భగత్ సింగ్పై ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయనకు కొత్తేం కాదు. స్వాతంత్ర్య సమరయోధుడు, వీరుడైన భగత్సింగ్ను ఉగ్రవాదిగా అభివర్ణించడాన్ని ఆప్ ప్రభుత్వం తప్పుబట్టింది. ఎంపీ వ్యాఖ్యలను హేయనీయమైన, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. మనోభావాలు దెబ్బతీసేలా, ఒక వీరుడ్ని అగౌరవపరిచేలా మాట్లాడినందుకు సిమ్రన్జిత్ యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే.. పంజాబ్ రాజకీయాల్లో ఈయన వివాదాలకు కేరాఫ్. తాజాగా ఎంపీగా గెలిచిన వెంటనే ఖలీస్థానీ మిలిటెంట్ జర్నైల్ సింగ్ భింద్రావాలేకు తన విజయాన్ని అంకితం చేస్తున్నానని, కశ్మీర్లో భారత ఆర్మీ అకృత్యాలను పార్లమెంట్లో వినిపిస్తానంటూ వ్యాఖ్యలు చేశాడు. గిరిజన అమాయకులను నక్సలైట్ల పేరుతో చంపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు కూడా. Shameful that some call him a terrorist. Shaheed-e-Azam Bhagat Singh is a hero, a patriot, a revolutionary and a true son of the soil. INQUILAB ZINDABAD! pic.twitter.com/7mpTalt3g1 — Raghav Chadha (@raghav_chadha) July 15, 2022 -
ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు కుట్ర
-
ప్రధాని మోదీ హత్యకు కుట్ర?.. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
పాట్నా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలో మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అంతేగాక జూలై 12న మోదీ బిహార్ పర్యటన సందర్భంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కుట్ర జరిగినట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిని జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జల్లావుద్దీన్, అథర్ పర్వేజ్గా పోలీసులు పేర్కొన్నారు. వీరికి పీఎఫ్ఐతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. అనుమానిత ఉగ్రవాదులు ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పుల్వారీ షరీఫ్లో శిక్షణ పొందినట్లు పోలీసులు కనుగొన్నారు. జూలై 6,7 తేదీల్లో మోదీ టార్గెట్గా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీంతో ఉగ్రవాదుల ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు పలు నేరారోపణ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒక దాంట్లో ‘2047 వరకు ఇండియాను ఇస్లామిక్ ఇండియాగా మార్చాలి’ అని ఉంది. వీటితోపాటు 25 పీఎఫ్ఐ కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: అన్సారీది దేశద్రోహం.. మాజీ ఉపరాష్ట్రపతిపై బీజేపీ తీవ్ర ఆరోపణలు పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాద కదిలక గురించి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సమాచారం అందింది. అనంతరం పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు జూలై 11న నయా తోలా ప్రాంతంలో దాడి చేసి అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వీరిద్దరూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, టర్కీతో సహా పలు ఇస్లామిక్ దేశాల నుంచి దేశంలో ఉంటూ దేశ వ్యతిరేక ప్రచారాలు చేసేందుకు డబ్బును పొందేవారని దర్యాప్తులో తేలింది. -
సీఎం మమత బెనర్జీపై మర్డర్ ప్లాన్!.. ఇనుప రాడుతో ఇంట్లోకి వెళ్లి..
బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఓ ఆగంతకుడు టార్గెట్ చేశాడు. మూడంచెల భద్రతను తప్పించుకుని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లోకి ప్రవేశించడం బెంగాల్లో కలకలం సృష్టించింది. మమతా ఇంటి వద్ద అతను ఏడు సార్లు రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వివరాల ప్రకారం.. కోల్కత్తాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న మమత ఇంటి వద్ద హఫీజుల్ మొల్లా అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడు. ఈ క్రమంలో మమతా బెనర్జీ కదలికపై ఫోకస్ పెట్టాడు. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన సెల్ ఫోన్ తో మమత నివాసాన్ని ఫొటోలు తీశారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ నెల 2, 3 తేదీల మధ్య రాత్రి హఫీజుల్.. సీఎం ఇంట్లోని భద్రతా సిబ్బందిని దాటి మమత ఇంట్లోకి ఇనుపరాడ్తో ప్రవేశించడాన్ని పోలీసులు గుర్తించారు. 11 సిమ్ కార్డులు కలిగి ఉన్న నిందితుడు బంగ్లాదేశ్, జార్ఖండ్, బీహార్కు చెందిన పలువురికి ఫోన్ చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడు గత ఏడాది సరైన పత్రాలు లేకుండానే బంగ్లాదేశ్కు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం సీనియర్ పోలీస్ అధికారుల పోస్టింగ్ల్లో కోల్కతా అధికార యంత్రాంగం పలు మార్పులు చేపట్టింది. మమతా బెనర్జీ ఇంటి వద్దే ఉగ్రవాది ఇలా సంచరించడంతో సీఎం సెక్యూరిటీ డైరెక్టర్ వివేక్ సహాయ్ను పదవి నుంచి తొలగించారు. ఇక, నిందితుడు బంగ్లాదేశ్కు వెళ్లిన నేపథ్యంలో అక్కడ అతడి కార్యకలాపాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్ట పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులతో హఫీజుల్కు సంబంధాలు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. Hafizul Mollah, who had intruded into #MamataBanerjee's house, had swum across the border to #Bangladesh during last year’s Durga Puja and stayed there for a few days, a senior officer of #Kolkata Police said.https://t.co/BulZ3FcQEp — The Daily Star (@dailystarnews) July 12, 2022 ఇది కూడా చదవండి: 'ఉదయ్పూర్ హత్య కేసు నిందితుడికి బీజేపీతో సంబంధాలు'.. సీఎం తీవ్ర ఆరోపణలు -
ఆ రాజధాని ఉగ్రవాద నియామకాలకు అడ్డాగా మారుతోందా?
సాక్షి, బెంగళూరు: రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే సమాచారం వెలుగు చూసింది. ఐసిస్ సంస్థ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదుల నియామకం కోసం రాజధాని బెంగళూరును వేదికగా చేసుకున్నట్లు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) అనుమానం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన చార్జ్షీట్ను ఈనెల 18న హైకోర్టు ముందు ఉంచింది. మొత్తం 28 మంది యువకులను చేర్చుకుని శిక్షణ కూడా ఇచ్చినట్లు సమాచారం ఉందని ఎన్ఐఏ పేర్కొంది. జొహైబ్, అబ్దుల్ ఖాదిర్ అనే ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో సుమారు 28 మంది యువకులను చేరదీసి మత విద్వేషాలను నూరిపోసి ఉగ్రవాదంపై బోధనలు చేసినట్లు పిటిషన్లో పేర్కొంది. సిరియా నుంచి బెంగళూరుకు వచ్చిన మహమ్మద్ నాజిద్.. ఆ యువకులను మరింత ప్రేరేపించినట్లు తెలిసింది. ఈయన బెంగళూరు నుంచి సిరియాకు తిరిగి వెళ్లే సమయంలో విమానాశ్రయం వరకు శిక్షణ పొందిన యువకులు వెంట వెళ్లినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఐసిస్ ఉగ్రవాదుల నియామకం, శిక్షణ కేసుకు సంబంధించి తిలక్నగర్కు చెందిన మహమ్మద్ తౌకిర్ మహమూద్, కామనహళ్లికి చెందిన జొహైబ్ మున్నా, భట్కళ నివాసి మహమ్మద్ సుహాబ్ను ఎన్ఐఏ అధికారులు ఈనెల 19న అరెస్ట్ చేశారు. ముగ్గురిపై చట్ట ఉల్లంఘన కింద కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: Disha Encounter Case: నివేదిక బట్టబయలు.. వెలుగులోకి సంచలన విషయాలు.. -
కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లో శాటిలైట్ ఫోన్లు
శ్రీనగర్: అఫ్గానిస్తాన్లో అమెరికా బలగాలు వదిలేసి వెళ్లిన అత్యాధునిక సామగ్రి కశ్మీర్ ఉగ్రవాదుల చేతుల్లోకి వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉగ్రవాదుల స్థావరాలపై జరిపిన దాడుల్లో ఇరిడియమ్ శాటిలైట్ ఫోన్లు, థర్మల్ ఇమేజరీ సామగ్రి దొరకడంతో ఈ మేరకు అనుమానాలు నిజమయ్యాయి. ఉత్తరకశ్మీర్ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 15వరకు శాటిలైట్ ఫోన్ సంకేతాల జాడలు కనిపించగా, తాజాగా దక్షిణ కశ్మీర్లోనూ గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఇవి ఉన్నట్లు తేలిందని అంటున్నారు. అదేవిధంగా, రాత్రి సమయాల్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగపడే వైఫై ఆధారిత థర్మల్ ఇమేజరీ సామగ్రి ఉగ్రస్థావరాల్లో లభ్యమైంది. శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా సమీపంలో ఉన్న భద్రతా సిబ్బంది ఉనికిని ఈ పరికరం గుర్తించి హెచ్చరికలు చేస్తుంది. ఉగ్రవాది దాక్కున్న ప్రాంతం వెలుపలి ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఈ పరికరాలు అఫ్గానిస్తాన్లో దశాబ్దాలపాటు తిష్టవేసిన అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు వాడినవేనని తెలిపారు. అనంతరం వీటిని తాలిబన్లు, ఇతర ఉగ్రసంస్థలు చేజిక్కించుకుని, కశ్మీర్ ఉగ్రవాదులకు అందజేసి ఉంటారని అధికారులు అంటున్నారు. అయితే, వీటిని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. శాటిలైట్ ఫోన్ జాడలను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఎన్టీఆర్వో), డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ)లు ఎప్పటికప్పుడు కనిపెట్టే పనిలోనే ఉన్నాయన్నారు. అదేవిధంగా, థర్మల్ ఇమేజరీ పరికరాలను పనిచేయకుండా ఆపేందుకు భద్రతా బలగాలు జామర్లను ఉపయోగిస్తున్నాయని అన్నారు. వీటిని వినియోగించే వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు. దేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై కేంద్రం 2012లో పూర్తి నిషేధం విధించింది. -
వారిని రప్పించండి లేదా కేసు కొట్టేయండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 2013లో జరిగిన దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది ఎజాజ్ షేక్ గత వారం ముంబై కోర్టుకెక్కాడు. తనపై ముంబై సైబర్సెల్ పోలీసులు నమోదు చేసిన మరో కేసులో దర్యాప్తు అధికారులను కోర్టుకు రప్పించాలని లేదా కేసు కొట్టేయాలని తన న్యాయవాదుల ద్వారా కోరాడు. ‘దిల్సుఖ్నగర్’కేసులో ఎజాజ్కు 2016లో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగా వివిధ నగరాల్లోనూ అతనిపై విధ్వంసం కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఎజాజ్ మహారాష్ట్రలోని ఎరవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. టెర్రర్ మెయిల్స్పై మరో కేసు: 2013–14ల్లో ఐఎంకు చెందిన అనేక మందిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న ఎజాజ్ షేక్ను మహారాష్ట్రలో పట్టుకున్నారు. ఇతర ఉగ్రవాదులతోపాటు అతన్నీ ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో విచారించారు. అదే సందర్భంలో ‘టెర్రర్ మెయిల్స్’పంపింది ఎజాజ్ షేక్ అని తేలడంతో ముంబై సైబర్సెల్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. చార్జ్షీట్ సైతం దాఖలు చేయడంతో 2017లో ఈ కేసు కోర్టు విచారణకు వచ్చింది. 58 సార్లు విచారణ వాయిదా... అప్పటి నుంచి దర్యాప్తు అధికారు లు న్యాయస్థానంలో హాజరుకావట్లేదు. ఫలితంగా వరుస వాయిదాలు పడుతూ పోయింది. ఆ ఏడా ది ఆగస్టు 14 నుంచి 2019 వరకు మొత్తం 58 సార్లు వాయిదా పడినా పోలీసులు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఎజాజ్ షేక్ తన న్యాయవాదుల సాయంతో గత వారం ముం బై కోర్టులో ‘నాన్ అప్పీరెన్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్’పై పిటిషన్ దాఖలు చేయించాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. -
కాందహార్ హైజాకర్.. ఇన్నాళ్లూ ఫర్నీచర్ షాప్ ఓనర్ ముసుగులో!
మిస్త్రీ జహూర్ ఇబ్రహీం.. ఈ పేరు వినగానే భారత్ రక్తం మరిగిపోతుంటుంది. ఎందుకంటే కాందహార్ హైజాక్లో ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814 విమానం దారిమళ్లించిన ముష్కరుల్లో ఒకడు వీడు. అంతేకాదు ఒక ప్రాణాన్ని సైతం బలిగొన్నాడు. భారత్కు పీడకలగా మిగిల్చిన ఈ హైజాకింగ్లో పాల్గొన్న మిస్త్రీ ఇప్పుడు హతమయ్యాడు. నాడు హైజాక్ కు పాల్పడిన ముష్కరుల్లో మిస్త్రీని ఎవరో హత్య చేశారు. కరాచీ అక్తర్ కాలనీలో నివసిస్తున్న మిస్త్రీ తలలో పాయింట్ బ్లాంక్ రేంజ్లో రెండు తుటాలు కాల్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మార్చి 1వ తేదీనే ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు జహూర్ అంత్యక్రియలు కరాచీలోనే నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి జైషే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజహార్ సోదరుడు, జైషే కీలకనేత అబ్దుల్ రౌఫ్ అస్ఘర్ హాజరయినట్లు సమాచారం. ఇన్నాళ్లూ తెలియలేదా? మిస్త్రీ మరణంపై అధికారిక ప్రకటన చేసిన పాక్ అధికారులు.. అతన్ని ఇంతకాలం గుర్తించకపోవడం విశేషం. జాహిద్ అఖుంద్గా పేరు మార్చుకుని అక్తర్ కాలనీలోనే ఏళ్లుగా ఉంటున్నాడు. పైగా కరాచీలోనే ఓ పెద్ద ఫర్నీచర్ షాప్ నిర్వహిస్తున్నాడు కూడా. అయినప్పటికీ పాక్ అధికారులు అతన్ని ట్రేస్ చేయకపోవడం విచిత్రం. కరాచీ నగరంలో ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి. హైజాక్ ఇలా.. 1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న IC-814 విమానాన్ని .. ఐదుగురు ఉగ్రవాదులు దారి మళ్లించి హైజాక్ చేశారు. అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్ కు చేరుకుంది. అక్కడ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. 25 ఏళ్ల ప్రయాణికుడు రూపిన్ కట్యాల్ను పొట్టనబెట్టుకున్నారు హైజాకర్లు. చివరికి డిసెంబర్ 31న.. కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ విడుదల చేయడంతో.. మిగతా ప్రయాణికులను అప్పగించారు. రూపిన్ను చంపింది మిస్త్రీనే అని అధికారులు సైతం ధృవీకరించారు అప్పట్లో. భార్యతో రూపిన్ కట్యాల్ ఇక కాందహార్ హైజాక్ ఘటన తర్వాత జహూర్ మిస్త్రీ... జాహిద్ అఖుంద్ పేరుతో పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలో స్థిరపడి ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అతడి హత్యను నిర్ధారించిన జియో టీవీ... ఓ వ్యాపారవేత్త హత్య అంటూ కథనం ప్రసారం చేయడం కొసమెరుపు. ఇదిలా ఉండగా.. మిస్త్రీ జహూర్ ఇబ్రహీంను ఎవరు లేపేసారన్నది తెలియాల్సి ఉంది. -
ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చిచంపాయి. వీరిలో జైషే మహ్మద్ టాప్ కమాండర్ జహీద్ అహ్మద్ వని అలియాస్ ఉజైర్ ఉన్నాడని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఆదివారం తెలిపారు. పుల్వామా, బుడ్గావ్ జిల్లాల్లో ఉగ్రవాదుల ఆచూకీ సమాచారం అందుకున్న భద్రతాదళాలు కూంబింగ్ నిర్వహించాయని తెలిపారు. పుల్వామాలోని నైరా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు మృతి చెందగా, బుడ్గావ్లోని చరారే షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన బిలాల్ అహ్మద్ ఖాన్ చనిపోయాడన్నారు. జహీద్ వని జైషేలో టాప్ కమాండర్గా పనిచేస్తున్నాడని, అతని సోదరుడు బాన్ప్లాజా దాడిలో నిందితుడని తెలిపారు. 2017 నుంచి జహీద్ చురుగ్గా ఉగ్రకార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని చెప్పారు. లోయలో మొత్తం జేషే కార్యకలాపాలకు ఇతనే సూత్రధారి అని, ఇతని మరణం భద్రతా దళాలు సాధించిన గొప్పవిజయమని విజయ్ కుమార్ ప్రశంసించారు. 11 ఎన్కౌంటర్లు.. 21 మంది ఉగ్రవాదులు జనవరిలో ఇంతవరకు 11 ఎన్కౌంటర్లలో 21మంది టెర్రరిస్టులు మరణించినట్లు చెప్పారు. వీరిలో 8మందికి పాక్తో సంబంధం ఉందన్నారు. పలు ఐఈడీ పేలుళ్లతో వనికి సంబంధం ఉందని ఆర్మీ అధికారి మేజర్ జనరల్ ప్రశాంత్ శ్రీవాస్తవ చెప్పారు. ఉగ్రవాదుల్లోకి యువతను రిక్రూట్ చేయడంలో కూడా ఇతని పాత్ర ఉందన్నారు. మరణించిన ఇతర ఉగ్రవాదులను కఫీల్ భారీ అలియాస్ ఛోటూ, వహీద్ అహ్మద్ రెషి, ఇనాయత్ అహ్మద్ మిర్గా గుర్తించారు. వీరిలో ఛోటూ పాక్ నివాసి. కాల్పుల్లో మరణించిన మిర్ ఉగ్రవాదులుంటున్న ఇంటి యజమాని కుమారుడని, హైబ్రిడ్ టెర్రరిజానికి ఇది ఉదాహరణఅని ప్రశాంత్ తెలిపారు. ఇలాంటి వారికి టెర్రరిస్టులుగా ఐడెంటిటీ ఉండదని, కానీ ఉగ్రవాదులకు సహాయంగా వ్యవహరిస్తుంటారని వివరించారు. పాక్, హైబ్రిడ్ టెర్రరిస్టులు భద్రతాదళాలకు అసలు సమస్యన్నారు. జమ్మూ, కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్య తొలిసారి 200 దిగువకు తెచ్చామని తెలిపారు. డ్రోన్లతో పాటు ఇతర మార్గాల్లో వీరికి ఆయుధాలు అందుతున్నాయని, ఈ ఆయుధ మార్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అధికారులు చెప్పారు. In dual encounters - 4 neutralized in Pulwama and 1 in Budgam. Among the killed in Pulwama is Zahid Wani who was actively involved in killings and recruitments. He was the district (Pulwama) commander and JeM chief of the entire Valley: Vijay Kumar, IGP Kashmir pic.twitter.com/86nkmwaRBM — ANI (@ANI) January 30, 2022 చదవండి: సీన్ రివర్స్.. కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతున్నాయ్ -
ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతం
JeM Terrorist Cop Killed And Five Injured In Encounter: జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిపిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఓ పోలీసు వీరమరణం పొందారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లతో పాటు మరో ఇద్దరు పౌరులు గాయపడ్డారని సమాచారం. కుల్గాం జిల్లాలో ఉగ్రమూకల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు తారసపడ్డారు. అయితేవారు పోలీసులపై కాల్పులకు తెగబడటంతో వారు ఎదురుకాల్పులతో ప్రతిఘటించారు. ఈ మేరకు అధికారులు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటం వల్ల సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్కౌంటర్కు దారితీసిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. (చదవండి: అఫ్ఘనిస్తాన్లో పేలుడు... తొమ్మిది మంది మృతి) -
అమాయక కూలీలపై పేలిన ఆర్మీ తూటా
కోహిమా/గువాహటి/న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్లో దారుణం జరిగింది. తీవ్రవాదుల ఏరివేత ఆపరేషన్ గురి తప్పింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. కాల్పుల్లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమయం గడుస్తున్నా ఇంటికి చేరుకోని తమవారిని వెతుకుతూ గ్రామస్థులు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక కంటిముందు కనిపించిన రక్తపాతాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. అక్కడే ఉన్న మిలటరీ వాహనాలను చుట్టుముట్టి, నిప్పు పెట్టారు. జవాన్లపై దాడికి దిగారు. అప్రమత్తమైన జవాన్లు ఆత్మరక్షణ కోసం తుపాకులకు మళ్లీ పనిచెప్పారు. ఈసారి మరో ఏడుగురు పౌరులు ప్రాణాలొదిలారు. గ్రామస్థుల దాడిలో ఒక జవాను మరణించాడు. సైనికుల కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. మోన్ జిల్లాలోని తిరూ ఏరియాలో ఓతింగ్ గ్రామం వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మరొకరి మృతి సైనికుల కాల్పులు, పేదల మరణంపై ఆదివారం నాగాలాండ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం వీధుల్లోకి వచ్చారు. సైన్యం అకృత్యానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. 17 మందిని పొట్టనపెట్టుకున్న జవాన్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోన్ జిల్లాలో కోన్యాక్ యూనియన్ ఆఫీసు, అస్సాం రైఫిల్స్ క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని పలు భాగాలను దహనం చేశారు. వారిని అడ్డుకోవడానికి భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాగాలాండ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తప్పుడు సమాచారం, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందకుండా మోన్ జిల్లాలో మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అయినప్పటికీ కార్యాలయాల విధ్వంసానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 17 మంది మృతదేహాలకు మోన్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించినట్లు చెప్పారు. ‘సిట్’ ఏర్పాటు తాజా సంఘటనపై విచారణ కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నాగాలాండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందానికి నాగాలాండ్ ఐజీ నేతృత్వం వహిస్తున్నారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నామని, రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం నీఫియూ రియో విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించరాదని కోరారు. సైనికుల కాల్పుల ఘటనపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణేకు ఉన్నతాధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. 17 మంది మరణించడం పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. వారి కుటుం బాలకు ట్విట్టర్లో సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామన్నారు. హార్న్బిల్ ఫెస్టివల్ బహిష్కరిస్తున్నాం పౌరులపై సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరపడాన్ని ఈస్ట్రర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్(ఈఎన్పీఓ) ఖండించింది. ఈ సంఘటనకు నిరసనగా హార్న్బిల్ ఫెస్టివల్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫెస్టివల్లో పాల్గొనరాదంటూ స్థానిక గిరిజన తెగలకు పిలుపునిచ్చింది. నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలపాలంది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్శించడానికి నాగాలాండ్ ప్రభుత్వం ప్రస్తుతం హార్న్బిల్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మోన్ జిల్లా పొరుగు దేశమైన మయన్మార్తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్ఎస్సీఎన్–కేలోని యుంగ్ ఆంగ్ ముఠా ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. అసలేం జరిగింది? నిషేధిత నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్–ఖప్లాంగ్(ఎన్ఎస్సీఎన్–కే) అనే తీవ్రవాద సంస్థలో ఒక భాగమైన యుంగ్ ఆంగ్ ముఠా సభ్యులు తిరూ ఏరియాలో సంచరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న సైనికులు గాలింపు చర్యలు ప్రారంభించారు. పని ముగించుకొని వాహనంలో వస్తున్న కార్మికులను ఎన్ఎస్సీఎన్–కే తీవ్రవాదులుగా భ్రమపడి, కాల్పులు జరిపారు. చిన్న పొరపాటు భారీ హింసాకాండకు దారితీసింది. రెండుసార్లు జరిగిన కాల్పుల్లో మొత్తం 17 మంది బడుగు జీవులు బలయ్యారు. ఒక జవాను సైతం ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిణామాలపై ‘కోర్టు ఆఫ్ ఎంక్వైరీ’ కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సైన్యం ప్రకటించింది. జనం దాడిలో తమ సైనికులు కొందరు తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. 17 మంది సాధారణ ప్రజలు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొంది. కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది? ‘‘నాగాలాండ్లో సైన్యం కాల్పులపై కేంద్ర ప్రభుత్వం సరైన సమాధానం చెప్పాలి. సొంత దేశంలోనే పౌరులకు, భద్రతా సిబ్బందికి రక్షణ లేని పరిస్థితి ఉంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోంది. 17 మంది పౌరుల మరణం నా హృదయాన్ని కలచివేసింది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సమగ్ర దర్యాప్తు జరపాలి ‘‘నాగాలాండ్లో సైన్యం కాల్పుల్లో పౌరుల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి -
జైలర్ దారుణం.. ఇనుప చువ్వ కాల్చి ఖైదీ వీపుపై ‘ఆత్వాది’ అని..
చండీగఢ్: పంజాబ్లోని బర్నాల జిల్లా జైలు అధికారి ఓ ఖైదీ పట్ల వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. జైలులో కనీస హక్కులకోసం ఎదురు తిరిగిన కరమ్జిత్ సింగ్ (28) అనే ఖైదీపై జైలు సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్ అమానుష చర్యకు పాల్పడ్డారు. అతని వీపుపై ‘ఆత్వాది’ (పంబాబీలో టెర్రరిస్టు) అనే అక్షరాలను ఇనుప చువ్వను కాల్చి వాతలు పెట్టి చెక్కారు. డజనుకుపైగా కేసుల్లో దోషిగా తేలిన బాలామ్ఘర్కు చెందిన కరమ్జిత్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా డ్రగ్స్ కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరిగినప్పుడు అతను తన గోడును వెళ్లబోసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ బల్బీర్ సింగ్ తనపై విచక్షణా రహితంగా దాడి చేసి.. ఒంటిపై ‘ఆత్వాది’ అని ఇనుప చువ్వతో కాల్చాడని కోర్టు దృష్టికి తేవడంతో విషయం వెలుగుచూసింది. (చదవండి: CID Show: సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు) అయితే, ఈ ఆరోపణలను జైలు సూపరింటెండెంట్ తోసిపుచ్చారు. కరమ్జిత్ తరచూ నేరాలు చేసి జైలుకొస్తాడని, సానుభూతి కోసం కట్టు కథలు చెబుతాడని అన్నారు. ఇక ఈ విషయంపై పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ రణ్ధావా విచారణకు ఆదేశించారు. ఫిరోజ్పూర్ డీఐజీ తేజింద్ సింగ్ మౌర్ను విచారణ అధికారిగా నియమించారు. మరోవైపు సిక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఘటనకు బాధ్యుడైన జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయాలని అకాలీదళ్ అధికార ప్రతినిధి మన్జిందర్ సింగ్ సిర్సా డిమాండ్ చేశారు. (చదవండి: పండుగ పూట విషాదం: కల్తీ మద్యం తాగి 10 మంది మృతి.. మరో 14 మంది..) A jail inmate in Barnala, Karamjit Singh beaten brutally by Jail Superintendent. The word “Attwadi” meaning TERRORIST engraved on his back! This is disgusting and a serious violation of human rights. We demand strict possible action against officials involved @CHARANJITCHANNI Ji https://t.co/mYKcWyPWMh pic.twitter.com/icmiIiBSit — Manjinder Singh Sirsa (@mssirsa) November 3, 2021 -
జమ్మూకశ్మీర్: పూంచ్ సెక్టార్లో ఎన్కౌంటర్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్: పూంచ్ సెక్టార్లో ఎన్కౌంటర్లో జవాన్లు ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను వేటాడేందుకు భారత సైనికులు రంగంలో దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 12 రోజులుగా ఆ ప్రాంతంలో కాల్పులు మోత మోగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇది ఒకటి. ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులు అడపాదడపా జవాన్లపై కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీ ప్రాంతానికి తిరిగి వెళ్తున్నారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం రంగంలోకి దిగింది. శనివారం జరిగిన ఉగ్రవాదులు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత ధర డబుల్ .. -
‘పాక్లో మా అమ్మ వద్దకు చేర్చండి’.. వీడియోలో ఉగ్రవాది విజ్ఞప్తి
శ్రీనగర్: తనను పాకిస్తాన్లోని అమ్మ వద్దకు చేర్చాలని లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఏరియా కమాండర్, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి పాక్ ఉగ్రవాది అలీ బాబా పాత్రా విజ్ఞప్తి చేశాడు. కశ్మీర్లోని యూరీ సెక్టార్లో జరిగిన గాలింపులో పాకిస్తాన్ ఉగ్రవాది, యువకుడు పాత్రాను సైన్యం సజీవంగా అదుపులోకి తీసుకోవడం తెల్సిందే. తనను ఇక్కడికి (భారత్) పంపినట్లే మళ్లీ పాక్కు తీసుకెళ్లాలని కోరాడు. ఈ మేరకు అతడు మాట్లాడిన ఒక వీడియో సందేశాన్ని భారత సైన్యం బుధవారం విడుదల చేసింది. అందులో.. జమ్మూకశ్మీర్లోని పరిస్థితులపై పాక్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే తోయిబా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని అతను విమర్శించాడు. ఆలీ సియాల్కోట్లోని ఒక వస్త్ర కర్మాగారంలో ఉద్యోగం చేసేవాడని, ఆ సమయంలోనే ఎల్ఇటి కోసం ప్రజలను నియమించే అనాస్ని కలిసినట్లు తెలిపాడు. తన ఆర్థిక పరిస్థితి కారణంగా ఉగ్రవాదులతో కలవాల్సి వచ్చిందని చెప్పాడు. అందుకుగాను మొదట రూ .20 వేలు ఇచ్చారని, మిగతా మరో రూ. 30,000 తర్వాత చెల్లించే హామీపై ఐఎస్ఐలో చేరినట్లు తెలిపాడు. పాకిస్తాన్ కశ్మీర్లో ప్రజల నిస్సహాయతను అక్కడి ఉగ్రవాద సంస్థలు వాళ్లకు అనుకూలంగా వాడుకుంటూ మాలాంటి వాళ్లని భారత్కి పంపుతున్నట్లు వెల్లడించాడు. One LeT terrorist Ali Babar Patra from Okhara, Punjab in Pakistan surrendered before security forces during an operation in the Uri sector of Jammu and Kashmir: Indian Army pic.twitter.com/M7URcShc9Z— ANI (@ANI) September 28, 2021 చదవండి: లంచం ఇస్తే తీసుకోండి.. బలవంతంగా వసూలు చేయొద్దు -
పట్టుబడిన పాక్ ఉగ్రవాది
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని ఉరి సెక్టార్లో గత కొన్నాళ్లుగా జరుగుతున్న చొరబాట్లను అడ్డుకునేందుకు ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ మంగళవారం ముగిసింది. ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబాకి చెందిన 18 ఏళ్ల వయసున్న ఉగ్రవాది అలీ బాబర్ పాత్రాను సైనికులు బంధించారు. సైన్యం జరిపిన కాల్పుల్లో మరో ఉగ్రవాది కారి అనాజ్ మరణించాడు. భారత్లో భీకరదాడులకు పన్నాగాలు రచించినట్టుగా బాబర్ ఆర్మీ విచారణలో చెప్పాడు. బారాముల్లాకు ఆయుధాలు తీసుకొని వెళ్లే పని తనకు అప్పగించారని తెలిపాడు. అతని దగ్గరనుంచి ఏకే–47 రైఫిల్స్, కమ్యూనికేషన్ సెట్, రెండు గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ స్వయంగా నిర్వహించిన ఉగ్రవాద శిక్షణ శిబిరంలో తాను పాల్గొన్నానని బాబర్ చెప్పాడు. సలాంబాదా నాలా నుంచి ఈ చొరబాటు యత్నాలు జరిగాయి. 2016లో ఈ మార్గం నుంచే ఉరి సెక్టార్లోకి చొరబడి ఆత్మాహుతి దాడులు నిర్వహించారు. ఇస్లాం మతం ప్రమాదంలో పడిందని, కశ్మీర్లో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని తప్పుడు ప్రచారం చేస్తూ స్వయంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఈ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి భారత్లోకి పంపుతోంది. తాను పేదరికాన్ని తట్టుకోలేకే లష్కరేలో చేరానని పట్టుబడిన ఉగ్రవాది బాబర్ చెప్పాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన తమ కుటుంబం దుర్భర దారిద్య్రంలో ఉందని, తన తల్లి అనారోగ్యాలకు చికిత్స కోసం 20 వేలు ఇవ్వడంతో తాను వారి వలలో చిక్కుకున్నానని బాబర్ తెలిపాడు. -
పాక్ 12 ఉగ్ర సంస్థలకు నిలయం
వాషింగ్టన్: అమెరికా విదేశీ ఉగ్ర సంస్థలుగా గుర్తించిన 12 గ్రూపులు పాకిస్తాన్లోనే ఊపిరి పోసుకున్నాయని అమెరికా కాంగ్రెషనల్ కమిటీ తెలిపింది. వీటిలో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి అయిదు సంస్థలు కేవలం భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ‘టెర్రరిస్ట్ అండ్ మిలిటెంట్ గ్రూప్స్ ఇన్ పాకిస్తాన్’అంశంపై స్వతంత్ర కంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్ఎస్) రూపొందించిన ఆ నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థల్లో కొన్ని 1980ల నుంచే అక్కడ ఉన్నాయని తెలిపింది. వీటిల్లో కొన్ని ప్రపంచవ్యాప్తంగా, మరికొన్ని అఫ్గానిస్తాన్ లక్ష్యంగా, ఇంకొన్ని భారత్, కశ్మీర్ లక్ష్యంగా, కొన్ని షియా వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు వివరించింది. 2008లో ముంబై దాడులకు కారణమైన లష్కరే తోయిబా 1980ల్లోనే పాకిస్తాన్లో అవతరించగా అమెరికా దీనిని విదేశీ ఉగ్రసంస్థ(ఎఫ్టీఓ)గా 2001లో గుర్తించింది. కశ్మీర్ ఉగ్రనేత మసూద్ అజార్ నేతృత్వంలో 2000లో జైషే మొహమ్మద్ ఏర్పాటైంది. భారత పార్లమెంట్పై దాడికి పాల్పడిన ఈ సంస్థను అమెరికా 2001లో ఎఫ్టీఓ గుర్తించింది. మరో సంస్థ హర్కతుల్ జిహాద్ ఇస్లామీ 1980లో ఏర్పాటై అఫ్గాన్లో సోవియెట్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడింది. 1989 నుంచి ఈ గ్రూపు భారత్, బంగ్లాదేశ్, అఫ్గాన్, పాక్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థను అమెరికా 2010లో ఎఫ్టీఓగా ప్రకటించింది. 1989లో పాక్లో ఆవిర్భవించిన హిజ్బుల్ముజాహిదీన్ను కూడా అమెరికా 2017లో ఎఫ్టీఓ ప్రకటించింది. కశ్మీర్లో కార్యకలాపాలు సాగించే అతిపెద్ద గ్రూపు ఇదే. మరో ఉగ్ర సంస్థ అల్ ఖాయిదా కూడా పాకిస్తాన్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సీఆర్ఎస్ తెలిపింది. ఈ సంస్థకు పాక్లోని అనేక గ్రూపుల నుంచి మద్దతు అందుతోందని పేర్కొంది. ఇవికాకుండా, ఇస్లామిక్ స్టేట్–ఖొరాసన్ ప్రావిన్స్(ఐఎస్కేపీ, ఐఎస్–కె), అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్వర్క్, తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ), బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, జుందల్లా, సిపాహ్ సహాబా పాకిస్తాన్, లష్కర్–ఇ–జంగ్వి వంటివి కూడా పాకిస్తాన్లో ఉన్నాయని వివరించింది. చుట్టుపక్కల దేశాలే లక్ష్యంగా పనిచేసే అనేక ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ నిలయంగా మారిందంటూ 2019లో విదేశాంగ శాఖ రూపొందించిన నివేదికను సీఆర్ఎస్ ఉటంకించింది. కాగా, సీఎస్ఆర్ నివేదిక అమెరికా కాంగ్రెస్ అధికార నివేదిక కాదు. దీనిని స్వతంత్ర నిపుణులు తయారు చేసి, చట్టసభల ప్రతినిధులకు అందజేస్తుంటారు. -
కశ్మీర్లో ‘ఉగ్ర’ ఉద్యోగులపై వేటు
శ్రీనగర్: ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం విధుల నుంచి తప్పింది. తాజాగా ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులను బుధవారం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశామని అధికారులు చెప్పారు. గత 6 నెలల కాలంలో మొత్తంగా 25 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగింనట్లు కశ్మీర్ అధికారులు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పనిచేసే హిజ్బుల్ మొజాహిదీన్ ఉగ్రసంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ఇద్దరు కుమారులనూ గతంలో ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగింది. శ్రీనగర్లో శాసన మండలి సభ్యుని ఇంట్లో ప్రభుత్వ ఆయుధాలను దొంగిలించిన కానిస్టేబుల్ షౌకత్ ఖాన్ను పక్కకు తప్పించారు. చదవండి: రాహుల్, ప్రియాంకలకు అనుభవం లేదు: అమరీందర్ -
"ఇది మా తప్పిదమే": యూఎస్
వాషిగ్టంన్: కాబూల్లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని జరిపిన డ్రోన్ దాడులు గురించి ప్రస్తావిస్తూ, ఇది మా ఇంటెలిజెన్సీ వర్గాల తప్పిదమే అని యూఎస్ జనరల్ అత్యున్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత నెలలో యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ నుంచి వైదొలగే సమయంలో జరిపిన డ్రోన్ దాడిలో చిన్న పిల్లలతో సహా 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ దాడిని అర్థం లేని దారుణమైన చర్యగా కమాండర్ జనరల్ కెనత్ మెకెంజీ అభివర్ణించారు. ఇది ఒక విషాదకరమైన దాడిగా పేర్కొన్నారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు యూఎస్ రకణ శాఖ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటన నుంచి తాము చాలా నేర్చుకున్నామని అన్నారు. తెల్లని టయోట కారు... ఈ సందర్భంగా మెకెంజీ మాట్లాడుతూ..." ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆగస్టు 29న కాబూల్ ఎయిర్పోర్ట్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్సీ గుర్తించింది. ఈ క్రమంలో ఆ ఐఎస్ఐ ఉగ్రవాద బృందం తెల్లని టయోట కారుని వాడుతున్నట్లు తెలిసి లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాం. కానీ విషాదమేమిటంటే ఆ దాడిలో చనిపోయిన వాళ్లెవ్వరికీ ఐఎస్ఐఎస్తో సంబంధం లేదు" అని అన్నారు. ఆగస్టు 26న తాలిబన్లు చేసిన ఆత్మహుతి బాంబు దాడిలో యూఎస్ సర్వీస్ సభ్యులతో సహా సుమారు 13 మంది చనిపోయిన సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు తమని తాము రక్షించుకునే ప్రయత్నంలోనే ఈ దాడులను నిర్వహించామంటూ. .కెనెత్ మెకెంజీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. -
మోదీకి నిద్రలేకుండా చేస్తాం.. ఎస్ఎఫ్జే గ్రూప్ హెచ్చరిక
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24న మోదీ అగ్రరాజ్యానికి వెళ్తున్న సందర్భంగా ఆ సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో పాటు వైట్ హౌస్ వెలుపల కూడా నిరసన కార్యక్రమాలు చేసేందుకు ఆ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే తొలిసారి ప్రత్యక్ష క్వాడ్ సమావేశంతోపాటు ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో పాల్గొనడానికి మోదీ అమెరికాకు వెళ్తున్నారు. కాగా భారత్లో రైతులపై హింసకు వ్యతిరేకంగా తాము ఈ నిరసనలు చేపట్టనున్నట్లు ఎస్ఎఫ్జే సంస్థ పేర్కొంది. ఆ గ్రూపు జనరల్ కౌన్సిల్ గుర్పత్వంత్ సింగ్ పన్నన్ మాట్లాడుతూ .. అమెరికాలో మోదీకి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తామని తెలపడం గమనార్హం. వీటితో పాటు పన్నన్.. యూకే, యూఎస్, యూరోపియన్ యూనియన్ దేశాలు తాలిబాన్లను గుర్తిస్తే, ఎస్ఎఫ్జే కూడా ఖలిస్తాన్ మద్దతు కోసం తాలిబాన్లను సంప్రదిస్తామని పేర్కొన్నాడు. లండన్లో ఆగస్ట్ 15న ఖలిస్థాన్ రెఫరెండమ్ జరుగుతుందని గతేడాది ఈ గ్రూపు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత కొవిడ్ కారణంగా అక్టోబర్కు వాయిదా వేశారు. ఎస్ఎఫ్జే సమస్యపై చర్చించడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ఇటీవల ఢిల్లీలో పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు ఉన్నత వర్గాల సమాచారం. ముఖ్యంగా ఈ నిషేధిత సంస్థ పంజాబ్ యువతను విద్రోహ కార్యకలాపాలను ప్రేరేపించడం కోసం ప్రయత్నిస్తోంది. ఎస్ఎఫ్జే గ్రూప్ తమ ప్రచారం కోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసింది. అందులో పాకిస్థాన్, ఐఎస్ఐ ఏజెంట్ల నంబర్లు కూడా ఉన్నాయి. అయితే చట్టానికి వ్యతిరేకంగా వారి కార్యకలాపాలు ఉన్నాయని భారత ప్రభుత్వం ఈ గ్రూపును జులై 10, 2019న నిషేధించిన సంగతి తెలిసిందే. చదవండి: Jeff Bezos: జెఫ్బెజోస్ దెబ్బకు దిగివచ్చిన నాసా..! -
జైల్లో ఉగ్రవాది.. ఆ వైద్యుడే కావాలంటూ హల్చల్
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడి, ప్రస్తుతం ఢిల్లీ చాణక్యపురిలోని తీహార్ జైల్లో ఉన్న ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది, ఆ సంస్థ కో–ఫౌండర్ యాసీన్ భత్కల్ జైలు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.ఇటీవల తాను అలోపతి వైద్యం చేయించుకోనని, ఆయుర్వేద డాక్టర్ కావాలంటూ పట్టుపట్టాడు. ఎట్టకేలకు జైలు అధికారుల నుంచి సోమవారం అనుమతి కూడా పొందాడు. ►కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ మగ్దూంకాలనీకి చెందిన యాసీన్ భత్కల్ అసలు పేరు మహ్మద్ అహ్మద్ జరార్ సిద్ధిబప్ప. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్ భత్కల్కు వరుసకు సోదరుడు. ►ఇంజినీరింగ్ విద్యనభ్యసించడానికి అంటూ పుణేకు వలసవెళ్లాడు. అక్కడ ఉండగానే యునానీ మెడిసిన్ ప్రాక్టీషనర్గా ఉన్న సోదరుడైన ఇక్బాల్ భత్కల్కు సన్నిహితంగా మారి ఉగ్రవాదం వైపు మళ్లాడు. ►2007 నుంచి ఐఎంలో కీలకపాత్ర పోషించిన యాసీన్ ఆ తర్వాతి ఏడాది నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 2008లో ఐఎం కో–ఫౌండర్గా బాధ్యతలు స్వీకరించిన యాసీన్ అనేక విధ్వంసాలకు వ్యూహరచన చేశాడు. ►అహ్మదాబాద్ వరుస పేలుళ్లలో ఇతడి పేరు వినిపించినా.. 2010 ఫిబ్రవరి 13న జరిగిన పుణేలోని జర్మన్ బేకరీ బ్లాస్ట్తో మోస్ట్ వాంటెడ్గా మారాడు. దిల్సుఖ్నగర్ ట్విన్ బ్లాస్ట్ సహా 2008 నుంచి 2013 వరకు అనేక పేలుళ్లకు పాల్పడ్డాడు. ►2013 ఫిబ్రవరిలో దిల్సుఖ్నగర్లో ఏ1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ వద్ద జరిగిన పేలుళ్లతో ఇతడి కోసం వేట ముమ్మరమైంది. నేపాల్లోని పోఖారాలో యునానీ వైద్యుడిగా నివసిస్తున్న యాసీన్ను 2013 ఆగస్టు 28న పట్టుకున్నారు. ►దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు విచారణ 2016 డిసెంబర్లో పూర్తయింది. ఈ కేసులో ఇతడితో సహా ఐదుగురికి కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన కేసుల విచారణ కోసం యాసీన్ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. ►అక్కడి జైలు నెం.2లో ఉంటున్న ఈ ఉగ్రవాదికి ఇటీవల కీళ్ల నొప్పులు వచ్చాయి. దీంతో జైలు ఆవరణలో ఉన్న ఆసుపత్రి డాక్టర్కు చూపించి వైద్యం చేయించాలని అధికారులు ప్రయత్నించారు. ►తాను అలోపతి వైద్యం చేయించుకోనంటూ పట్టుబట్టాడు. ఆయుర్వేద వైద్యంపై నమ్మకం ఉందని, ఆ వైద్యుడినే పిలిపించాలని హల్చల్ చేశాడు. దీంతో జైలు అధికారులు ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్కు విషయం చెప్పారు. ►స్పందించిన ఆయన యాసీన్కు ఆయుర్వేద వైద్యుడితో చికిత్స చేయించడానికి సోమవారం అంగీకరించారు. ఈ వైద్యం కోసం త్వరలో ఓ అధీకృత ఆయుర్వేద వైద్యుడిని తీహార్ జైలుకు పిలిపించనున్నారు. చదవండి: ప్రేమను ఒప్పుకోలేదని.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలతో.. -
చదువు కోసం వెళ్తారు.. ఉగ్రవాదులుగా తిరిగొస్తారు
శ్రీనగర్: కరడుగట్టిన ఉగ్రవాది షాకీర్ అల్తాఫ్ భట్ ఇటీవల జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతడు 2018లో విద్యాభ్యాసం కోసం భారత పాస్పోర్టుపై పాకిస్తాన్కు వెళ్లి, ఉగ్రవాదిగా మారి జమ్మూకశ్మీర్కు తిరిగొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇలాంటి కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. యువత అన్ని అధికారిక పత్రాలతో రాచమార్గంలో పాకిస్తాన్కు చేరుకొని, ఉగ్రవాద శిక్షణ పొంది, తిరిగొస్తుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం దేశ భద్రతకు సవాలు లాంటిదేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2015 నుంచి 2019 వరకూ జమ్మూకశ్మీర్లో జారీ చేసిన పాస్పోర్టులపై దర్యాప్తు సంస్థలు ఆరా తీశాయి. ఈ ఐదేళ్లలో పాసుపోర్టులో పొందినవారిలో 40 మంది యువత ఉన్నత విద్యాభ్యాసం పేరుతో బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్కు వెళ్లినట్లు వెల్లడయ్యింది. వీరిలో 28 మంది ఆయా దేశాల్లో ఉగ్రవాద శిక్షణలో రాటుదేలి, భారత్లోకి అక్రమంగా చొరబడినట్లు తేటతెల్లమయ్యిందని అధికార వర్గాలు శనివారం పేర్కొన్నాయి. మూడేళ్లలో మరో 100 మందికిపైగా కశ్మీరీ యువత వీసాపై పాకిస్తాన్కు వెళ్లారు. వీరిలో చాలామంది తిరిగిరాలేదు. తిరిగిగొచ్చిన కొందరు కనిపించకుండా పోయారు. వీరంతా స్లీపర్ సెల్స్గా మారి ఉంటారని అనుమానిస్తున్నారు. కొత్తగా చేరినవారికి ఆరు వారాల శిక్షణ గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ దాకా దక్షిణ కశ్మీర్లోని షోపియాన్, కుల్గాం, అనంతనాగ్ జిల్లాకు చెందిన కొందరు యువకులు సరైన ధ్రువపత్రాలతో పాకిస్తాన్కు వెళ్లారనీ, వారు ఇప్పటికీ అధికారికంగా తిరిగి రాలేదని అధికారులు చెప్పారు. నిజానికి వారంతా అక్రమంగా భారత్లోకి చొరబడి ఉంటారని వెల్లడించారు. గత మూడేళ్లలో పాకిస్తాన్కు వెళ్లి, అక్కడ వారం రోజులకుపైగా ఉండి, తిరిగి వచ్చిన యువకులను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. రాళ్లు విసిరేవారికి పాస్పోర్టు రాదు.. సర్కారీ కొలువు దక్కదు జమ్మూకశ్మీర్లో భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరేవారిపై, విధ్వంసకర కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇలాంటి వారికి ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు రావు, కనీసం పాస్పోర్టు కూడా పొందలేరు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ సీఐడీ విభాగం శనివారం ఉత్తర్వు జారీ చేసింది. పాసుపోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వరు. రాళ్లు విసిరేవారు ప్రభుత్వ పథకాల్లోనూ లబ్ధి పొందలేరు. పోలీసుల వద్ద, భద్రతా సిబ్బంది వద్ద, దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీ, ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్లను నిశితంగా పరిశీలిస్తామని.. పాస్పోర్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అందులో ఉన్నట్లు తేలితే వాటిని నిరాకరిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. -
ఇంటెలిజెన్స్కు సవాల్గా మారిన ‘మల్లేపల్లి’
-
మ్యాగజైన్ స్టోరీ 01 July 2021
-
ఉగ్రవాదులకు మూడిందే, గాల్లో తిరిగే ఏకే-47గన్స్ వచ్చేస్తున్నాయ్
విమానాలు, హెలికాప్టర్లలా గాలిలో ఎగర గలిగి, రిమోట్తో ఆపరేట్ చేసే వాహనాలే ‘మానవ రహిత విమానాలు (అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్– యూఏవీలు)’. సింపుల్గా డ్రోన్లు అంటాం. అరచేతిలో పట్టే చిన్న డ్రోన్ల నుంచి చిన్నసైజు విమానాల వంటివి, హెలికాప్టర్లలా గాల్లో నిటారు గా ఎగిరేవి, విమానాల్లా రన్వేపై ప్రయాణించి ఎగిరేవి కూడా ఉంటాయి. ఇందులో విమానాల్లా ప్రయానించే మధ్యతరహా, భారీ డ్రోన్లు కిలోలకొద్దీ బరువును మోసుకుని, పదుల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఉగ్రవాద సంస్థలు ఇలాంటి డ్రోన్లను ఆయుధాలు, బాంబులు చేరవేయడానికి చాలాకాలంగా వాడుతున్నాయి. పలుచోట్ల దాడులూ చేస్తున్నాయి. ఇప్పుడు మనదేశంలోనూ తొలిసారిగా డ్రోన్లతో ఉగ్రవాద దాడి జరిగింది. ఎదుర్కొనేది ఎలా? విమానాల తరహాలో ప్రయాణించే డ్రోన్లు గంటకు 60–70 కిలోమీటర్ల కన్నా వేగంగా కూడా దూసు కెళ్తాయి. సైనికులు తుపాకులతో అలాంటి వాటిని నేలకూల్చడం కష్టం. వాటిని కూల్చేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉండాలని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఎప్పటినుంచో ఆ వ్యవస్థలను వినియోగిస్తున్నాయి. యాంటీ డ్రోన్ వ్యవస్థలు, పరికరాలను ఇజ్రాయెల్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. ఈ వ్యవస్థలు ఆయా ప్రాంతాల్లో రాడార్, ఆప్టికల్, థర్మల్ ఇమేజింగ్ ద్వారా నిఘా పెడతాయి. ఎటువంటి డ్రోన్ ఆచూకీ కనిపించినా వెంటనే హెచ్చరిస్తాయి. వాటిని గాల్లోనే పేల్చివేయగలిగే ఏర్పాటు ఉంటుంది. చదవండి : కరోనా వ్యాక్సిన్ బదులు కుక్క కాటు టీకా 2019 సెప్టెంబర్లో యెమెన్ తిరుగుబాటుదా రులు సౌదీలోని భారీ చమురు కేంద్రాలపై పది డ్రోన్లతో బాంబు దాడి చేశారు. ఆ దెబ్బతో కొద్ది రోజులు సౌదీలో చమురు ఉత్పత్తి సగానికి పడిపో యి, భారీ నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి చాలా దేశాలు యాంటీ డ్రోన్ వ్యవస్థలు వాడుతున్నాయి. తాజాగా జమ్మూలో డ్రోన్ దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మిలటరీ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ తయారీ ‘స్మాష్ 2000 ప్లస్’ యాంటీ డ్రోన్ పరికరాలను అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏమిటీ ‘స్మాష్ 2000 ప్లస్’? సాధారణంగా తక్కువ ఎత్తులో ప్రయాణించే డ్రోన్లను రాడార్ వ్యవస్థలు గుర్తించలేవు. కాపలా ఉండేవారే డ్రోన్లను గుర్తించి నేలకూల్చాలి. ఇందుకు సాధారణ తుపాకులు, ఆయుధాలు పనికిరావు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ‘స్మాష్ 2000 ప్లస్’ పరికరాలను అభివృద్ధి చేసింది. చిన్నగా ఉండే వీటిని ఏకే–47 వంటి తుపాకులకు అమర్చి వినియోగించవచ్చు. పగలు, రాత్రి ఎప్పుడైనా సరే ఆయా ప్రాంతాల్లో ఆకాశాన్ని జల్లెడ పడుతూ.. డ్రోన్లను గుర్తించి, అప్రమత్తం చేస్తాయి. వాటికి నేరుగా గురిపెట్టి, కచ్చితంగా నేల కూల్చేందుకు తోడ్పడుతాయి. వీటిని ఆటోమేటిగ్గా పనిచేసేలా, లేదా సైనికులు ఆపరేట్ చేసేలా మార్చుకోవచ్చు. ఆటోమేటిక్ మోడ్ను వినియోగించినప్పుడు.. తుపాకీని డ్రోన్ వైపు గురిపెడితే.. లక్ష్యానికి సూటిగా రాగానే దానంతట అదే బుల్లెట్స్ను ఫైర్ చేస్తుంది. మన నావికా దళం ఇప్పటికే స్మాష్ యాంటీ డ్రోన్ వ్యవస్థలకు ఆర్డర్ ఇచ్చింది. యాంటీ మిస్సైల్ వ్యవస్థలు ఉన్నా. ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్, మరికొన్ని యాంటీ మిస్సైల్ వ్యవస్థలు కూడా డ్రోన్లను గుర్తించి సెకన్లలోనే పేల్చివేయగలుగుతాయి. కానీ అవి భారీ సైజు, విపరీతమైన ఖర్చుతో కూడినవి. అన్నిచోట్ల మోహరించడం సాధ్యం కాదు. అందువల్లే రేడియో ఫ్రీక్వెన్సీ, థర్మల్ ఇమేజింగ్ పరికరాలపై ఆధారపడక తప్పదని నిపుణులు చెప్తున్నారు. ఈ రెండు విధానాల్లో కూడా డ్రోన్లను గుర్తించి, కూల్చేసేందుకు మనుషుల ప్రమేయం అవసరం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ నుంచి తుపాకులు, బాంబులు జమ్మూ కశ్మీర్లోని ఉగ్రవాదులకు పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, బాంబులు సరఫరా చేస్తున్నారు. అలాంటి ఒక డ్రోన్ను గత ఏడాది జూన్ 20న బీఎస్ఎఫ్ గుర్తించి, నేల కూల్చింది. ఆ డ్రోన్ అమెరికా తయారీ గన్, భారీగా తూటాలు, ఏడు చైనా తయారీ గ్రనేడ్లను మోసుకొస్తున్నట్టు గుర్తించారు. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని.. కాపలా తక్కువగా ఉండే ప్రాంతాల్లో, అర్ధరాత్రి తర్వాత ఆయుధాలు చేరవేస్తున్నారని తేల్చారు. గత రెండేళ్లలో పాకిస్తాన్ వైపు నుంచి 300కుపైగా డ్రోన్లు సరిహద్దులు దాటివచ్చి చక్కర్లు కొట్టినట్టు ఆర్మీ లెక్కలు చెప్తున్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ డ్రోన్లు.. ఐదు కేటగిరీలు.. ‘డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)’ మార్గదర్శకాల ప్రకారం దేశంలో డ్రోన్లను ఐదు కేటగిరీలు. 250 గ్రాముల కంటే తక్కువ బరువు ఉండేవి నానో డ్రోన్లు. వీటి వినియోగానికి సంబంధించి పెద్దగా ఆంక్షలు ఏమీ లేవు. అయితే నిషేధిత ప్రాంతాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. 250 గ్రాముల నుంచి 2 కేజీల వరకు ఉండేవి మైక్రో కేటగిరీలోకి.. 2–25 కేజీల మధ్య ఉండేవి చిన్నతరహా.. 25–150 కిలోల మధ్య బరువుండే వి మధ్య తరహా.. 150 కిలోలకన్నా ఎక్కువ బరువున్నవి పెద్ద డ్రోన్ల కేటగిరీలోకి వస్తాయి. ► నానో, మైక్రో డ్రోన్లు హెలికాప్టర్ల తరహాలో రోటార్ బ్లేడ్లతో ఎగురుతాయి. మధ్యతరహా, భారీ డ్రోన్లలో చాలా వరకు విమానాల తరహాలో ప్రయాణించే ‘యూఏవీ’లు ఉంటాయి. చిన్నతరహా డ్రోన్లలో రెండు రకాలూ ఉంటాయి. ► ఏ డ్రోన్ అయినా 50 అడుగులకన్నా తక్కువ ఎత్తులో ఎగుర వేసేందుకు పెద్దగా ఆంక్షలు లేవు. అంతకన్నా ఎక్కువ ఎత్తు ఎగరవేయాలంటే డీజీసీఐ అనుమతి, డ్రోన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ► డీజీసీఐకి చెందిన డిజిటల్ స్కై యాప్ ద్వారా డ్రోన్ల రిజిస్ట్రేషన్, ఎగురవేసే అనుమతులు తీసుకోవచ్చు. -
కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే
-
వైరల్: ‘మిస్ యూ నాన్న.. లొంగి పో’
శ్రీనగర్: ఉద్రేకమో.. అనాలోచిత చర్యనో ఏదో తెలియదు కానీ కన్నవాళ్లని.. కట్టుకున్నదాన్ని.. తాను కన్న బిడ్డల్ని వదిలి ముష్కరులతో చేరాడు. కొద్ది రోజుల తర్వాత భద్రతా బలగాలు.. ఇతర ఉగ్రవాదులతో పాటు తనని ముట్టడించాయి. అతడు మారడానికి పోలీసులు ఓ అవకాశం ఇచ్చారు. అతడి నాలుగేళ్ల కుమారుడిని రంగంలోకి దించారు. తన కోసమైనా వెనక్కి రావాల్సిందిగా కొడుకు చేత అభ్యర్థింప చేశారు. బిడ్డను చూసి తండ్రి ప్రాణం విలవిల్లాడింది. దుష్ట చెర నుంచి బయటపడాలని భావించాడు. కానీ ముష్కరులు అందుకు అంగీకరించలేదు. దాంతో వారితో పాటు తాను ప్రాణాలు కోల్పోయాడు. లొంగిపోవాల్సిందిగా తండ్రిని అభ్యర్థిస్తున్న చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. బ్యాంక్ ఉద్యోగిగా పని చేస్తున్న రఖిబ్ అహ్మద్ మాలిక్ (25) మూడు నెలల క్రితం ఉగ్రవాదులతో చేరాడు. ఈ క్రమంలో సోమవారం జమ్ముకశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు ఈ ఉగ్రవాదులు ఉన్న ఇంటిని చుట్టు ముట్టారు. రఖిబ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయని నాడే అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారికి ఎదురుపడితే.. అతడిపై కాల్పులు జరపవద్దని.. రఖిబ్తో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. దాంతో పోలీసులు మొదట రఖిబ్ భార్య అతడిని లొంగిపోవాల్సిందిగా వేడుకుంది. ‘‘దయచేసి బయటకు వచ్చి లొంగిపో.. నీకు బయటకు రావాలని లేకపోతే.. నన్ను కాల్చేయ్.. మన ఇద్దరు పిల్లలు నాతో పాటే వస్తారు. బయటకు వచ్చి లొంగిపో’’ అంటూ వేడుకుంది. కానీ రఖిబ్ ఆమె మాట అంగీకరించలేదు. ఆ తర్వాత అతడి నాలుగేళ్ల కుమారిడిని రంగంలోకి దించారు పోలీసులు. బారికెడ్ల అవతల నిల్చున్న తండ్రిని చూసి చిన్నారి మనసు సంతోషంతో నిండిపోయింది. వెంటనే పోలీసులు ఇచ్చిన మైక్ ద్వారా ‘‘వచ్చేయ్ నాన్న.. వీరు నీకు ఎలాంటి హానీ చేయరు.. నేను నిన్ను మిస్ అవుతున్నాను’’ అంటూ బతిమిలాడాడు. బిడ్డ గొంతు విని రఖిబ్ హృదయం తల్లడిల్లింది. బయటకు రావాలని చూశాడు. కానీ తన చుట్టు ఉన్న ముష్కరులు అతడు వెళ్లడానికి అంగీకరించలేదు. ఇక సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతాదళాలు రఖిబ్తోపాటు మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘రఖిబ్ లొంగిపోవాలని భావిస్తున్నట్లు మాకు సమాచారం అందింది. దాంతో అతడికి ఓ అవకాశం ఇచ్చాము. కానీ మిగతా ఉగ్రవాదులు అతడు బయటకు లొంగిపోవడానికి అంగీకరించలేదు. దాంతో మిగతా వారితో పాటు అతడు ఎన్కౌంటర్లో మృతి చెందాడు’’ అని తెలిపారు. చదవండి: కోయి గోలి నహీ చలేగా.. -
వైరల్: ‘మిస్ యూ నాన్న
-
అంబానీ ఇంటి వద్ద కలకలం: వెలుగులోకి ఐఎం ఉగ్రవాది
ముంబై: ఆసియా కుబేరుడు, పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలపడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తుండగా.. ఈ కేసు మూలం తీహార్ జైలులో బయటపడింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపింది తామే అంటూ ఓ ఉగ్రవాద సంస్థ గతంలో ప్రకటించుకుంది. జైషే ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థ టెలిగ్రాం వేదికగా ఈ ప్రకటన చేసింది. కాగా, ఈ టెలిగ్రాం మెసేజ్ను సీరియస్గా తీసుకున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ కేసు మూలం తీహార్ జైలులో బయటపడింది. ఇక్కడ శిక్ష అనుభవిస్తోన్న ఉగ్రవాదులు కొందరు ఈ టెలిగ్రామ్ గ్రూప్ను క్రియేట్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గురువారం తీహార్ జైలు అధికారులను కలిశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా డిప్యూటి కమిషనర్ ప్రమోద్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘టెలిగ్రాం మెసేజ్ ఆధారంగా ముంబై పోలీసులు ఓ ప్రైవేట్ సైబర్ ఏజెన్సీ సాయంతో లోకేషన్ని ట్రేస్ చేయగా.. తీహార్ జైలు వెలుగులోకి వచ్చింది. దాంతో ఢిల్లీ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. స్పెషల్ సెల్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తీహార్ జైలు అధికారులు సోదాలు నిర్వహించగా.. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహిసీన్ అఖ్తర్ సహా అల్ఖైదాతో సంబంధాలున్నవారు, అండర్వరల్డ్ డాన్లు ఉంటున్న బ్యారక్లో మొబైల్ ఫోన్ ఉన్నట్లు తెలిసింది. దీన్ని ఉగ్రవాది అఖ్తర్ నుంచి స్వాధీనం చేసుకోవడంతో ప్రస్తుతం అతడినే అనుమానిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ క్రమంలో తీహార్ జైలులో కనీసం 11 మంది జైలు ఖైదీలను ప్రశ్నించినట్టు జైలు వర్గాలు పేర్కొన్నాయి. ఈ మొబైల్ నంబరు వినియోగదారు టెలిగ్రామ్ ఖాతాను సృష్టించడానికి వర్చువల్ నంబర్లను వినియోగించాడు.. అంతేకాకుండా, అనుమానితుడు నెట్లో ఐపీ అడ్రస్ను గుర్తించకుండా ఉండేందుకు టీఓఆర్ బ్రౌజర్ను ఉపయోగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముంబై పోలీసులు నియమించిన సైబర్ నిపుణులు టెలిగ్రామ్ ఛానల్ గురించి సమాచారం పొందడానికి ట్రోజన్లను ఉపయోగించారు. ఇది ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ఈ టెలిగ్రాం గ్రూప్ను క్రియేట్ చేసినట్టు కనుగొన్నారు. అంబానీ నివాసం వెలుపల వాహనాన్ని నిలిపి ఉంచిన ఘటనకు బాధ్యత వహిస్తూ ఈ ఉగ్రవాద గ్రూపు ఫిబ్రవరి 27న టెలిగ్రామ్లో మెసేజ్ పోస్ట్ చేసింది. కానీ ముంబై పోలీసులు దీన్ని ఫేక్ అంటూ కొట్టి పారేశారు. ఇక తెహిసీన్ అఖ్తర్ 2014, నరేంద్ర మోదీ ర్యాలీ సందర్భంగా పాట్నాలో సీరియల్ బ్లాస్ట్లకు ప్లాన్ చేసినందుకు గాను ఇతడిని అరెస్ట్ చేశారు. అఖ్తర్కు గతంలో హైదరాబాద్, బోధ్గయాలో జరిగిన పేలుళ్లతో కూడా సంబంధం ఉంది. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం: ‘అతడిని శిక్షించండి’ జైలు నుంచే ‘ఉగ్ర నెట్వర్క్’ -
ప్రముఖ నగల వ్యాపారి కాల్చివేత
శ్రీనగర్: నూతన సంవత్సరం తొలి రోజే శ్రీనగర్లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బిజీ మార్కెట్లో వ్యాపారి సత్పాల్ సింగ్ (62) పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. సారాయ్ బాలా వద్ద గురువారం ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఎందుకు కాల్పులకు తెగబడ్డారనే దానిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టతలేదు. సింగ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.