Andre Russell
-
'ఐరెన్ లెగ్' ఆండ్రీ రసెల్.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ భస్మం..!
విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ (Andre Russell) ఫ్రాంచైజీ క్రికెట్లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. రాత్రి ఓ లీగ్ ఆడితే, ఉదయం మరో లీగ్లో పాల్గొంటున్నాడు. మొన్న రసెల్ గంటల వ్యవధిలో (15 గంటలు) దేశాలు దాటి రెండు వేర్వేరు లీగ్ల్లో పాల్గొన్న వైనం సోషల్మీడియాలో వైరలయ్యింది. ఇదే సమయంలో రసెల్ ఓ అపవాదును కూడా మూటగట్టుకున్నాడు. నిద్ర లేకుండా జర్నీ చేసి రెండు వేర్వేరు లీగ్ల్లో పాల్గొంటే రెండు చోట్ల రసెల్ జట్లు లీగ్ల నుంచి నిష్క్రమించాయి. దీంతో నెటిజన్లు రసెల్ను ఐరెన్ లెగ్ అని అంటున్నారు. రసెల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ ఆ జట్టు భస్మం అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు రసెల్పై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి అతని పేలవ ఫామ్ కూడా ఓ కారణం. రసెల్ ఇటీవలికాలంలో ఏ లీగ్లోనూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. ఇంకా చెప్పాలంటే అన్ని చోట్లా దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్లో మెరుపులు లేవు, బౌలింగ్లో వికెట్లు లేవు. దీంతో అభిమానులు చిరెత్తిపోయి రసెల్పై దుష్ప్రచారం మొదలుపెట్టారు. వయసు మీద పడింది, ఇక తప్పుకో అని కొందరంటుంటే.. మరికొందరేమో, పోయి జాతీయ జట్టుకు ఆడుకోమని సలహాలు ఇస్తున్నారు. ఇంకొందరేమో డబ్బు కోసం రెస్ట్ లేకుండా ఇన్ని ఊర్లు తిరగాలా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రసెల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించకుండా ప్రైవేట్ లీగ్ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.రసెల్ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో (ILT20) అబుదాబీ నైట్రైడర్స్ తరఫున ఆడి తొలి బంతికే డకౌటయ్యాడు. ఆ మ్యాచ్లో ఓటమితో ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అబుదాబీ నైట్రైడర్స్ కథ ముగిసింది (నిష్క్రమించింది). ILT20లో తన జట్టు ఓడిన వెంటనే రసెల్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బంగ్లాదేశ్కు పయనమయ్యాడు. ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నాడు. ఈ లీగ్లో ఖుల్నా టైగర్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహించిన రసెల్ 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో ఓ ఓవర్ బౌలింగ్ కూడా చేసిన రసెల్ వికెట్ లేకుండా 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్లో రంగ్పూర్ రైడర్స్ ఓటమికి రసెల్ ప్రధాన కారణం కానప్పటికీ.. అతని జట్టు మాత్రం లీగ్ నుంచి నిష్క్రమించింది.ఇదిలా ఉంటే, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లు చివరి దశకు చేరాయి. బీపీఎల్లో ఫార్చూన్ బారిషల్ ఫైనల్కు చేరగా.. రేపు రెండో క్వాలిఫయర్ జరుగనుంది. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లీగ్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. డెజర్ట్ వైపర్స్, దుబాయ్ క్యాపిటల్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ తదుపరి దశకు క్వాలిఫై అయ్యాయి. -
ILT20 2025: చరిత్ర సృష్టించిన ఆండ్రీ రసెల్.. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా..!
విండీస్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ (Andre Russell) పొట్టి క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో (ILT20 2025) ఆడుతున్న రసెల్ (అబుదాబీ నైట్రైడర్స్).. నిన్న (ఫిబ్రవరి 1) గల్ఫ్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. నిన్నటి మ్యాచ్లో టామ్ కర్రన్ బౌలింగ్లో బౌండరీ బాదడంతో రసెల్ పొట్టి క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20ల్లో ఈ ఘనత సాధించిన 25వ ఆటగాడిగా నిలిచాడు. ఇక్కడ రికార్డు ఏంటంటే.. రసెల్ ఈ ఘనతను ప్రపంచంలో ఏ ఆటగాడు సాధించనంత వేగంగా (బంతుల పరంగా) సాధించాడు. రసెల్.. 9000 పరుగుల మార్కును కేవలం 5321 బంతుల్లో చేరుకున్నాడు. పొట్టి క్రికెట్లో అత్యంత వేగంగా 9000 పరుగులు పూర్తి చేసిన రికార్డు రసెల్ కంటే ముందు ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్వెల్ పేరిట ఉండేది. మ్యాక్సీ టీ20ల్లో 9000 పరుగులను 5915 బంతుల్లో పూర్తి చేశాడు. టీ20ల్లో 9000 పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో రసెల్, మ్యాక్సీ తర్వాత ఏబీ డివిలియర్స్ (5985), కీరన్ పోలార్డ్ (5988), క్రిస్ గేల్ ఉన్నారు.టీ20ల్లో రసెల్ ఇప్పటివరకు 536 మ్యాచ్లు ఆడి 26.79 సగటున, 169.15 స్ట్రయిక్రేట్తో 9004 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పొట్టి క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత రసెల్ మాజీ సహచరుడు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ 463 మ్యాచ్ల్లో 144.75 స్ట్రయిక్రేట్తో 14562 పరుగులు చేశాడు. ఇందులో 22 శతకాలు, 88 అర్ద శతకాలు ఉన్నాయి.టీ20ల్లో రసెల్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అదిరిపోయే రికార్డు కలిగి ఉన్నాడు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ వేసే రసెల్.. పొట్టి ఫార్మాట్లో 25.55 సగటున, 8.71 ఎకానమీతో 466 వికెట్లు పడగొట్టాడు.36 ఏళ్ల రసెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇంకా రిటైర్ కానప్పటికీ ఎక్కువగా ఫ్రాంచైజీ క్రికెట్లోనే ఆడుతున్నాడు.రసెల్ ప్రస్తుత ILT20 ఎడిషన్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ సీజన్లో అతను 9 ఇన్నింగ్స్ల్లో 158.53 స్ట్రయిక్రేట్తో కేవలం 130 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే.. రసెల్ ఈ సీజన్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇందులో అతని ఎకానమీ 11.42గా ఉంది.రసెల్ విషయాన్ని పక్కన పెడితే ఈ సీజన్లో అతని జట్టు అబుదాబీ నైట్రైడర్స్ చెత్త ప్రదర్శనలు చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మొదటిస్థానంలో ఉంది. ఈ సీజన్లో నైట్రైడర్స్ నిన్నటి మ్యాచ్తో కలుపుకుని 9 మ్యాచ్లు ఆడి ఆరింట ఓడిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే కానీ నైట్రైడర్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరలేదు. ఇప్పటికే డెజర్ట్ వైపర్స్, ఎంఐ ఎమిరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్లు ఖరారు చేసుకున్నాయి.నిన్నటి మ్యాచ్లో నైట్రైడర్స్ గల్ఫ్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో 9000 పరుగులు పూర్తి చేసిన రసెల్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో డేవిడ్ విల్లే (41) టాప్ స్కోరర్గా నిలిచాడు. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్.. గెర్హార్డ్ ఎరాస్మస్ (47), టామ్ కర్రన్ (38 నాటౌట్), హెట్మైర్ (20 నాటౌట్) రాణించడంతో 17.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. -
WI vs Eng: డూ ఆర్ డై.. సిరీస్ మొత్తానికి విధ్వంసకర వీరుడు దూరం
ఇంగ్లండ్తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ తమ జట్టును ప్రకటించింది. తమ టీమ్లో మూడు కీలక మార్పులు చేసినట్లు బుధవారం వెల్లడించింది. యువ పేసర్ షమార్ స్ప్రింగర్ పునరాగమనం చేయనుండగా.. మరో ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ సైతం రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది.వన్డే సిరీస్ విండీస్దేఅదే విధంగా.. విధ్వంసకర ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఇంగ్లండ్తో మిగిలిన టీ20లకు దూరమైనట్లు విండీస్ బోర్డు పేర్కొంది. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. వన్డే సిరీస్ను ఆతిథ్య విండీస్ 2-1తో గెలుచుకోగా.. మొదటి రెండు టీ20లలో గెలిచి ఇంగ్లండ్ 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.17 బంతుల్లో 30 పరుగులుఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం మూడో టీ20 మొదలుకానుంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు మిగిలిన సిరీస్కు తమ జట్టును ప్రకటించింది. కాగా బట్లర్ బృందంతో తొలి టీ20లో పాల్గొన్న రసెల్.. 17 బంతుల్లో నాలుగు సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. అయితే, వికెట్లు మాత్రం తీయలేకపోయాడు.ఈ మ్యాచ్ సందర్భంగా మడమ నొప్పితో బాధపడ్డ ఆండ్రీ రసెల్.. రెండో టీ20కి దూరంగా ఉన్నాడు. అయితే, గాయం తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో అతడిని మిగిలిన మూడు టీ20 మ్యాచ్లకు ఎంపిక చేయలేదు. మరోవైపు.. గత నెలలో శ్రీలంకతో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టిన షమార్ స్ప్రింగర్ రీఎంట్రీ ఇచ్చాడు.డూ ఆర్ డై మ్యాచ్అదే విధంగా.. మూడో వన్డే సందర్భంగా కెప్టెన్ షాయీ హోప్తో అనుచితంగా ప్రవర్తించినందుకు నిషేధం ఎదుర్కొన్న అల్జారీ జోసెఫ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. కాగా రసెల్ దూరం కావడం విండీస్కు పెద్ద ఎదురుదెబ్బలాంటిది. ఇక సెయింట్ లూసియా వేదికగా మూడో టీ20లో గెలిస్తేనే వెస్టిండీస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్లో విండీస్ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా తొలి టీ20లో ఎనిమిది వికెట్లు, రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి ఇంగ్లండ్ విండీస్పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.ఇంగ్లండ్తో మిగిలిన మూడు టీ20లకు వెస్టిండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయిర్, టెర్రాన్ హిండ్స్, షాయీ హోప్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రొమారియో షెపర్డ్, షమార్ స్ప్రింగర్.చదవండి: సౌతాఫ్రికాతో మూడో టీ20.. కీలక మార్పు సూచించిన భారత మాజీ స్టార్ -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు
స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకున్న వెస్టిండీస్.. ఇప్పుడు అదే జట్టుతో టీ20 సిరీస్కు సిద్దమైంది. ఇంగ్లీష్ జట్టుతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో విండీస్ తలపడనుంది. బార్బోడస్ వేదికగా నవంబర్ 9 (శనివారం) నుంచి జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ సిరీస్లో మొదటి రెండు టీ20లకు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్,షిమ్రాన్ హెట్మెయర్లు తిరిగి జట్టులో చేరారు. వీరు ముగ్గురు గత నెలలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యారు.మరోవైపు ఫాబియన్ అలెన్, అలిక్ అథానాజ్, ఆండ్రీ ఫ్లెచర్, షమర్ స్ప్రింగర్లు ఈ జట్టులో చోటు దక్కించలేకపోయారు. అదేవిధంగా స్టార్ పేసర్ జోషఫ్పై నిషేధం పడడటంతో తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు.ఇంగ్లండ్తో తొలి రెండు టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, టెరెన్స్ హిండ్స్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఎవిన్ లూయిస్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రోథర్ఫోర్డ్,వెస్టిండీస్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టుజోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ -
నేను హార్డ్ హిట్టర్ని.. వచ్చే వరల్డ్కప్లోనూ ఆడతా!
మరో రెండేళ్ల పాటు తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వెస్టిండీస్ వెటరన్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ అన్నాడు. మునుపటి కంటే ఇప్పుడే మరింత ఫిట్గా ఉన్నానని.. టీ20 ప్రపంచకప్-2026లోనూ తనను చూస్తారని పేర్కొన్నాడు. తమ కోచ్ డారెన్ సామీ తనను మరికొన్నాళ్లపాటు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాల్సిందిగా కోరాడని.. అలాంటపుడు తానెలా జట్టుకు దూరమవుతానని ప్రశ్నించాడు.హార్డ్ హిట్టర్కాగా 2010లో వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేసిన రసెల్.. టీ20 స్పెషలిస్టుగా గుర్తింపు పొందాడు. జాతీయ జట్టుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పొట్టిలీగ్లలో భాగమవుతూ హార్డ్ హిట్టర్గా పేరొందాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 82 టీ20లు ఆడిన ఈ బౌలింగ్ ఆల్రౌండర్.. 60 వికెట్లు తీయడంతో పాటు 1033 పరుగులు చేశాడు.విధ్వంసకర వీరుడుఇక ఐపీఎల్లో అయితే తనబ్యాటింగ్ తీరుతో విధ్వంసకర వీరుడిగా పేరొందిన ఆండ్రీ రసెల్ 126 మ్యాచ్లలో.. 2484 పరుగులు చేశాడు. ఇందులో 170 ఫోర్లు, 209 సిక్సర్లు ఉన్నాయి. ఇక మొత్తంగా 115 వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ ఫాస్ట్బౌలర్.ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడుఇక.. వెస్టిండీస్ తరఫున టీ20 ప్రపంచకప్-2012, 2016 ట్రోఫీలు గెలిచిన జట్లలో సభ్యుడైన రసెల్.. చివరగా టీ20 వరల్డ్కప్-2024 సందర్భంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఐసీసీ టోర్నీలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో ఆఖరిగా ఆడాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2024తో బిజీగా ఉన్న రసెల్.. ట్రింబాగో నైట్ రైడర్స్కు ఆడుతున్నాడు.ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లలో 207కు పైగా స్ట్రైక్రేటుతో 56 పరుగులు రాబట్టిన రసెల్.. కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ త్వరలోనే శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్కు తాను అందుబాటులో ఉంటానని 36 ఏళ్ల రసెల్ స్పష్టం చేశాడు.బంతిని బాదగల సత్తా నాకు ఉందిఇండియా టు డేతో మాట్లాడుతూ.. ‘‘2026 వరల్డ్కప్లో నేను కచ్చితంగా ఆడతాను. ఎందుకంటే నాలో క్రికెట్ ఆడగల సత్తా ఇంకా మిగిలే ఉందని మీకు కూడా తెలుసు. నేను ఇప్పటికే అంతర్జాతీయక్రికెట్ నుంచి తప్పుకొని ఉండవచ్చు. అలా చేస్తే యువ ఆల్రౌండర్లకు అవకాశాలు రావచ్చు.అయితే, నేను ఇప్పటికీ బంతిని అనుకున్న చోటకు బాదగలను. అద్భుతమైన పేస్తో బౌలింగ్ చేయగలను. ఇంకా ఫిట్గానే ఉన్నాను. కాబట్టి ఇక్కడితో ఎందుకు ఆగిపోవాలి’’ అంటూ రసెల్ ఆత్మవిశ్వాసం ప్రదర్శించాడు. తమ కోచ్ ఈ విషయం గురించి తనతో చర్చించాడని.. మరికొన్నాళ్లపాటు విండీస్కు ఆడతానని తెలిపాడు.చదవండి: వీవీఎస్ లక్ష్మణ్ క్యాచ్ డ్రాప్ చేశా.. నా కెరీర్ అంతటితో ఖతం! -
ఆండ్రీ రసెల్ విధ్వంసం.. నైట్ రైడర్స్ ఖాతాలో మరో విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో ట్రిన్బాగో నైట్ రైడర్స్ మరో విజయం సాధించింది. గయానా అమెజాన్ వారియర్స్తో ఇవాళ (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. నైట్ రైడర్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.రసెల్ విధ్వంసం149 పరుగుల లక్ష్య ఛేదనలో నైట్ రైడర్స్ 89 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆండ్రీ రసెల్ (36).. టిమ్ డేవిడ్తో (31) కలిసి నైట్ రైడర్స్ను గెలిపించాడు. రసెల్ 15 బంతుల్లో బౌండరీ, నాలుగు సిక్సర్ల సాయంతో విధ్వంసం సృష్టించాడు. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్లో సునీల్ నరైన్ (11), పూరన్ (10), పోలార్డ్ (8) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.షెపర్డ్ మెరుపు హాఫ్ సెంచరీఅంతకుముందు రొమారియో షెపర్డ్ మెరుపు హాఫ్ సెంచరీతో (24 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో వారియర్స్ ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. టిమ్ రాబిన్సన్ (34), ప్రిటోరియస్ (21 నాటౌట్), మొయిన్ అలీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. నైట్ రైడర్స్ బౌలర్లలో నరైన్, వకార్ సలాంఖీల్ తలో రెండు, బ్రావో, అకీల్ హొసేన్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ సీజన్లో నైట్ రైడర్స్ ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆరు మ్యాచ్ల్లో ఐదు విజయాలు సాధించిన బార్బడోస్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్ చివరి నుంచి రెండు స్థానాల్లో ఉన్నాయి.చదవండి: IND VS BAN 1st Test: నిరాశపరిచిన రోహిత్ -
వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు దూరం
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్కు స్టార్ ఆటగాళ్లు ఆండ్రీ రస్సెల్, జాసన్ హోల్డర్, అల్జారీ జోషఫ్, కైల్ మైర్స్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ జట్టుకు రోవ్మాన్ పావెల్ మరోసారి సారథ్యం వహించనున్నాడు. అతడి డిప్యూటీగా స్టార్ ఆల్రౌండర్ రోస్టన్ చేజ్ వ్యవరించారు. ఇక ఈ జట్టులో వెటరన్ ఆల్రౌండర్ ఫాబియన్ అలెన్, పేసర్ మాథ్యూ ఫోర్డ్, యంగ్ బ్యాటర్ అలిక్ అథనాజ్లకు చోటు దక్కింది. ఇక ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్లు మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి. ఆగస్టు 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్లు కూడా ట్రినిడాడ్ వేదికగానే జరగనున్నాయి. కాగా ఇప్పటికే ప్రోటీస్ జట్టు విండీస్ టెస్టు సిరీస్ను 0-1తో సొంతం చేసుకుంది.దక్షిణాఫ్రికాతో టీ20లకు విండీస్ జట్టురోవ్మన్ పావెల్ (కెప్టెన్), రోస్టన్ చేజ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, ఫాబియన్ అలెన్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్. -
ట్రవిస్ హెడ్ బ్యాట్ను రెండు ముక్కలు చేసిన రసెల్
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడం జట్ల మధ్య ఇవాళ (జులై 15) జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నైట్రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రసెల్ బౌలింగ్లో వాషింగ్టన్ ఆటగాడు ట్రవిడ్ హెడ్ పుల్ షాట్ ఆడబోగా బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ ఘటన వాషింగ్టన్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.Russell broke Travis head's bat with a Fierce bowlMajor league cricket #Russell#travishead#mlc#majorleaguecricket #Cricket #smith#head#funnyincident pic.twitter.com/0cFLoYDB1Y— जंबारू (@jambr123356) July 14, 2024ఈ మ్యాచ్లో నైట్రైడర్స్పై వాషింగ్టన్ ఫ్రీడం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్.. వాషింగ్టన్ బౌలర్లు నేత్రావల్కర్ (3.4-0-35-4), మ్యాక్స్వెల్ (4-0-15-3), లోకీ ఫెర్గూసన్ (4-0-31-2), రచిన్ రవీంద్ర (2-0-7-1) చెలరేగడంతో 18.4 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో సైఫ్ బదార్ అత్యధికంగా 35 పరుగులు చేయగా.. స్టార్ ఆటగాళ్లు జేసన్ రాయ్ (12), సునీల్ నరైన్ (0), ఉన్ముక్త్ చంద్ (1), షకీబ్ (0), మిల్లర్ (1) దారుణంగా విఫలమయ్యారు. ఆఖర్లో రసెల్ (20), వాన్ స్కాల్విక్ (12 నాటౌట్), స్పెన్సర్ జాన్సన్ (16), అలీ ఖాన్ (11) బ్యాట్ ఝులిపించడంతో నైట్రైడర్స్ 100 పరుగుల మార్కు దాటగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన వాషింగ్టన్.. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (2 బంతుల్లో 54; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 16 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 11 పరుగులు చేసి ఔట్ కాగా.. స్మిత్తో పాటు ఆండ్రియస్ గౌస్ (15) అజేయంగా నిలిచాడు. నైట్రైడర్స్ బౌలర్లలో స్పెన్సర్ జాన్సన్, వాన్ స్కాల్విక్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, మేజర్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ జులై 5న మొదలైన విషయం తెలిసిందే. ఈ ఎడిషన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వాషింగ్టన్ ఫ్రీడం (4 మ్యాచ్ల్లో 3 విజయాలు) టాప్లో ఉండగా.. టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్, సీయాటిల్ ఓర్కాస్ వరుస స్థానాల్లో ఉన్నాయి. లీగ్లో భాగంగా రేపు (రాత్రి ఒంటి గంటకు) జరుగబోయే మ్యాచ్లో సీయాటిల్ ఓర్కాస్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్ తలపడనున్నాయి. -
పీఎన్జీ బ్యాటర్ల అద్బుత పోరాటం.. విండీస్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియా, వెస్టిండీస్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా పర్వాలేదన్పించింది. పటిష్టమైన కరేబియన్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కొన్న న్యూ గునియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు ఆదుకున్నారు. వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. -
అవికా గోర్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్
ప్రపంచ క్రికెట్లో ఆండ్రూ రస్సెల్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. విధ్వంసకర బ్యాటర్లలో తరచుగా వినిపించే పేర్లలో ఆయన టాప్లో ఉంటారు. వెస్టిండీస్కు చెందిన ఈ ఆల్రౌండర్ ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ తరపున రాణిస్తున్నాడు.తాజాగా ఆండ్రూ రస్సెల్ సరికొత్త అవతారం ఎత్తాడు. ఏకంగా హిందీ పాటతో బాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. 'లడ్ కీ తూ కమాల్ కీ' అంటూ తన గాత్రంతో మెప్పించాడు. ఉయ్యాలా జంపాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్తో కలసి రస్సెల్ స్టెప్పులేశాడు. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ పాట ట్రెండ్ అవుతుంది. ఇందులో వారిద్దరి డ్యాన్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. -
హీరోయిన్తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
-
IPL 2024: ధోని ఫ్యాన్స్తో అట్లుంది మరి.. భరించలేకపోయిన రసెల్
క్రికెట్ సర్కిల్స్లో ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ అన్న తేడా లేకుండా ధోని ఎక్కడ కనిపించినా అభిమానులు కేరింతలు పెడతారు. ధోని హోం గ్రౌండ్ (ఐపీఎల్) చెపాక్ స్టేడియంలో అయితే క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. ధోని స్క్రీన్పై కనిపిస్తే చాలు స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. ధోని నామస్మరణతో వచ్చే సౌండ్లకు చెవులు చిల్లులు పడతాయి. నిన్న సీఎస్కే, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో ధోని బ్యాటింగ్కు దిగుతుండగా అభిమానులు చేసిన రచ్చ నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఉంది. ఆ సమయంలో ధోని ఫ్యాన్స్ చేసిన సౌండ్లకు మైదానంలో ఉన్నవారి కర్ణభేరులు పగిలిపోయుంటాయి. ధోని బరిలోకి దిగుతున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కేకేఆర్ ఆటగాడు రసెల్ అయితే ఫ్యాన్స్ చేసిన శబ్దాలు తట్టుకోలేక చెవులు మూసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు అట్లుంటది ధోని ఫ్యాన్స్తోని అంటూ కామెంట్లు చేస్తున్నారు. Russell's reaction is Gold. 😄👌 - The Craze for Dhoni....!!!!!pic.twitter.com/r7iePy96Op — Johns. (@CricCrazyJohns) April 8, 2024 కాగా, నిన్నటి మ్యాచ్లో కేకేఆర్పై సీఎస్కే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ (4-0-18-3) చేసి సీఎస్కేను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జడ్డూ ధాటికి 137 పరుగులకే పరిమితం కాగా.. ఛేదనలో రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ (67 నాటౌట్) ఆడి సీఎస్కేను విజయతీరాలకు చేర్చాడు. The Goosebumps entry in IPL history. - MS Dhoni, the face of IPL. 🦁pic.twitter.com/7nxy7Kdhpn — Johns. (@CricCrazyJohns) April 8, 2024 తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రవీంద్ర జడేజా (4-0-18-3), తుషార్ దేశ్పాండే (4-0-33-3), ముస్తాఫిజుర్ (4-0-22-2), తీక్షణ (4-0-28-1) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. విధ్వంసకర వీరులున్న కేకేఆర్ ఈ మ్యాచ్లో తేలిపోయింది. సాల్ట్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రింకూ సింగ్ (9), రసెల్ (10) తస్సుమనిపించారు. నరైన్ (27), రఘువంశీ (24), శ్రేయస్ అయ్యర్ (34) నామమాత్రపు స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సీఎస్కేను రుతురాజ్ (67 నాటౌట్) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి గెలిపించాడు. రచిన్ రవీంద్ర 15, డారిల్ మిచెల్ 25, శివమ్ దూబే 28 పరుగులు (18 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లు) చేసి ఔట్ కాగా.. ధోని ఒక్క పరుగు చేసి నాటౌట్గా మిగిలాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా 2 వికెట్లు పడగొట్టగా.. నరైన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సీఎస్కే మరో రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. సీజన్ తొలి ఓటమిని మూటగట్టుకున్న కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. -
IPL 2024 DC VS KKR: రసెల్ రికార్డును సమం చేసిన నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో నిన్న (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి కేకేఆర్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఫలితంగా అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నరైన్ కేకేఆర్ తరఫున ఈ అవార్డు అందుకోవడం ఇది 14వసారి. కేకేఆర్ తరఫున అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు ఆండ్రీ రసెల్ (14) పేరిట ఉండగా.. నిన్నటి మ్యాచ్తో నరైన్ రసెల్ రికార్డును సమం చేశాడు. రసెల్, నరైన్ ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో 10, 11 స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడి ఢిల్లీ డేర్డెవిల్స్, ఆర్సీబీ తరఫున 25 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఏబీడీ తర్వాత క్రిస్ గేల్ (22), రోహిత్ శర్మ (19), డేవిడ్ వార్నర్ (18), ఎంఎస్ ధోని (17), విరాట్ కోహ్లి (17), షేన్ వాట్సన్ (16), యూసఫ్ పఠాన్ (16) అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. రసెల్, నరైన్తో సమానంగా సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్ కూడా 14 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. కాగా, ఢిల్లీతో మ్యాచ్లో నరైన్తో పాటు యువ ఆటగాడు రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. 273 పరుగుల భారీ లక్ష్యాన్నిఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. 17.2 ఓవర్లలో 166 పరుగులకే చాపచుట్టేసి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రిషబ్ పంత్ (55), ట్రిస్టన్ స్టబ్స్ (54) ఓటమి ఖరారైన దశలో బ్యాట్ను ఝులిపించారు. వీరిద్దరు మినహా ఢిల్లీ ఆటగాళ్లంతా చేతులెత్తేశారు. వార్నర్ (18), పృథ్వీ షా (10) రెండంకెంల స్కోర్లు చేయగా.. మార్ష్, పోరెల్, అక్షర్ డకౌట్లయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌల్ చేసి చెరి 3 వికెట్లు పడగొట్టారు. స్టార్క్ 2, రసెల్, నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో కేకేఆర్ హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. ఢిల్లీ తాజా ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024 : విశాఖలో కోల్కతా బ్యాటర్ల విధ్వంసం (ఫొటోలు)
-
కళ్లు చెదిరే యార్కర్.. అభినందించకుండా ఉండలేకపోయిన బ్యాటర్
ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ కళ్లు చెదిరే యార్కర్ను సంధించాడు. కేకేఆర్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్లో ఇషాంత్ సూపర్ డెలివరీని బౌల్ చేశాడు. ఇషాంత్ యార్కర్ దెబ్బకు బ్యాటర్ ఆండ్రీ రసెల్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. సెకెన్ల వ్యవధిలో బంతి వికెట్లను గిరాటు వేయడంతో రసెల్ నిర్ఘాంతపోయాడు. ఇషాంత్ యార్కర్కు సమాధానం చెప్పలేని రసెల్ బంతిని అడ్డుకునే క్రమంలో బొక్కబోర్లా పడ్డాడు. ఈ బంతిని సంధించినందుకుగాను రసెల్ ఇషాంత్ను అభినందించకుండా ఉండలేకపోయాడు. కిందపడి లేవగానే చప్పట్లతో అభినందించాడు. ఇషాంత్ సూపర్ యార్కర్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ISHANT SHARMA WITH A BALL OF IPL 2024...!!! 🤯 pic.twitter.com/9O015ZzlwZ — Mufaddal Vohra (@mufaddal_vohra) April 3, 2024 ఇషాంత్ రసెల్ను ఔట్ చేసిన సందర్భం కూడా చాలా కీలకమైంది. ఆఖరి ఓవర్ తొలి బంతికి.. అప్పటికే రసెల్ (19 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఇషాంత్ అద్భుతమైన యార్కర్తో రసెల్ను బోల్తా కొట్టించాడు. ఆ బంతికి రసెల్ ఔట్ కాకపోయి ఉండివుంటే, కేకేఆర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ స్కోర్ నమోదు చేసి ఉండేది. లేటు వయసులో ఇషాంత్ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మ్యాచ్లో అతను ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సునీల్ నరైన్ (39 బంతుల్లో 85; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), రఘువంశీ (27 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్, శ్రేయస్ అయ్యర్ (11 బంతుల్లో 18; 2 సిక్సర్లు), రింకూ సింగ్ (8 బంతుల్లో 26; ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగుల చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్పై సన్రైజర్స్ చేసిన స్కోర్ (277/3) ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్గా ఉంది. ఓ సీజన్లో 250పైగా స్కోర్లు రెండు సార్లు నమోదు కావడం 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. -
విధ్వంసం సృష్టించిన కేకేఆర్ యువ బ్యాటర్.. శుభ్మన్ గిల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 3) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా కేకేఆర్ తరఫున శుభ్మన్ గిల్ తర్వాత అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. శుభ్మన్ 18 ఏళ్ల 237 రోజుల వయసులో (2018 సీజన్) సీఎస్కేపై హాఫ్ సెంచరీ చేయగా.. రఘువంశీ 18 ఏళ్ల 303 రోజుల వయసులో ఢిల్లీ క్యాపిటల్స్పై అర్దసెంచరీ సాధించాడు. రఘువంశీకి ఐపీఎల్లో ఇది తొలి ఇన్నింగ్స్ కావడం విశేషం. Innovative! Maiden IPL Fifty for Angkrish Raghuvanshi ✨ Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #DCvKKR pic.twitter.com/72oQQZIDbd — IndianPremierLeague (@IPL) April 3, 2024 ఈ ఇన్నింగ్స్కు ముందు అతను ఓ మ్యాచ్ ఆడినా అందులో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కేకేఆర్ తరఫున అరంగేట్రం ఇన్నింగ్స్లో ఆరో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రఘువంశీ రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 27 బంతులు ఎదుర్కొన్న రఘువంశీ 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ మ్యాచ్లో రఘువంశీతో పాటు సునీల్ నరైన్ సైతం విధ్వంసం సృష్టించాడు. నరైన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. వీరిద్దరి ఊచకోత ధాటికి ఢిల్లీ బౌలర్లు వణికిపోయారు. వీరిద్దరు ఔటయ్యాక రసెల్ భారీ షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. రసెల్ 15 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 38 పరుగులు చేసి క్రీజ్లో కొనసాగుతున్నాడు. అతనికి జతగా శ్రేయస్ అయ్యర్ (12) ఉన్నాడు. నరైన్, రఘువంశీ, రసెల్ ధాటికి కేకేఆర్ 16వ ఓవర్లోనే 200 పరుగుల మార్కును దాటింది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో వేగవంతమై 200. 17 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 224/3గా ఉంది. ఈ మ్యాచ్లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదో ఓవర్లో ఫిలిప్ సాల్ట్ (18) ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్కు క్యాచ్ ఇచ్చి సాల్ట్ పెవిలియన్కు చేరాడు. కాగా, ప్రస్తుత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కేకేఆర్ మరో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అండర్-19 వరల్డ్కప్ హీరో.. 18 ఏళ్ల రఘువంశీ భారత అండర్-19 జట్టు వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. 2022 వరల్డ్కప్ ఎడిషన్లో రఘువంశీ భారత్ తరఫున లీడింగ్ రన్స్కోరర్గా ఉన్నాడు. -
విధ్వంసకర వీరుడు.. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఆల్రౌండర్గా!
వెస్టిండీస్ ఆల్రౌండర్, కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆండ్రీ రసెల్ చరిత్ర సృష్టించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో రసెల్ రెండు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసిన ఈ పేస్ ఆల్రౌండర్.. 40 పరుగులు ఇచ్చి.. కామెరాన్ గ్రీన్(33), రజత్ పాటిదార్(3) వికెట్లు దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ఈ హార్డ్ హిట్టర్కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాకుండా చేశారు కేకేఆర్ బ్యాటర్లు. ధనాధన్ ఇన్నింగ్స్తో 16.5 ఓవర్లలోనే టార్గెట్ను పూర్తి చేసి ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీపై కోల్కతా విజయానికి కారణమయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్లో రెండు వికెట్లు తీసిన ఆండ్రీ రసెల్ ఐపీఎల్లో సరికొత్త ఫీట్ నమోదు చేశాడు. 𝐃𝐊 🤝𝐕𝐊 The @RCBTweets batters flourish with high octane maximums💥 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/CJLmcs7aNa #TATAIPL | #RCBvKKR pic.twitter.com/t112XqH29R — IndianPremierLeague (@IPL) March 29, 2024 లీగ్ చరిత్రలో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు కనీసం వంద వికెట్లు తీసిన రెండో ఆల్రౌండర్గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్ ఆల్రౌండర్, టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా మొదటి స్థానంలో ఉన్నాడు. జడ్డూ ఇప్పటి వరకు 228 ఐపీఎల్ మ్యాచ్లలో కలిపి 2724 పరుగులు సాధించడంతో పాటు.. 152 వికెట్లు తీశాడు. ఇక రైటార్మ్ పేస్ బౌలర్ అయిన రసెల్ 114 మ్యాచ్లలో 2326 రన్స్ పూర్తి చేసుకుని 100 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా 2012లో ఢిల్లీ డేర్డెవిల్స్(ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున రసెల్ క్యాష్ రిచ్ లీగ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రెండేళ్లకు కేకేఆర్ శిబిరంలో చేరిన అతడు పదేళ్లుగా అదే ఫ్రాంఛైజీతో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్-2024లో కేకేఆర్ ఆరంభ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో రసెల్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 64 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్లో రసెల్ రెండు వికెట్లు తీశాడు కూడా! నరైన్ @ 500 వెస్టిండీస్ ఆఫ్స్పిన్నర్ సునీల్ నరైన్ టి20 క్రికెట్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్తో అతను ఈ ఫార్మాట్లో అతను 500 మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా అతను నిలిచాడు. నరైన్కు ముందు పొలార్డ్ (660), డ్వేన్ బ్రేవో (573), షోయబ్ మలిక్ (542) అతనికంటే ముందు 500 మ్యాచ్లు ఆడారు. 35 ఏళ్ల నరైన్ ఈ సుదీర్ఘ కెరీర్లో ఏకంగా 17 టి20 జట్లకు ప్రాతినిధ్యం వహించి 537 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ సహా మొత్తం 10 టైటిల్స్ విజయాల్లో అతను భాగంగా ఉన్నాడు. ఐపీఎల్లో 2012నుంచి వరుసగా 13 సీజన్లుగా కోల్కతా నైట్రైడర్స్ తరఫున 164 మ్యాచ్లు ఆడాడు. బ్యాటింగ్లో కూడా ఓపెనర్గా, పించ్ హిట్టర్గా బరిలోకి దిగి కేకేఆర్ పలు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడు. చదవండి: వాళ్లిద్దరికి ఆస్కార్ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్ కామెంట్ -
#KKR: ఆర్సీబీపై మా విజయానికి కారణం అదే: అయ్యర్
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించిన కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునిల్ నరైన్పై ఆ జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్గా వచ్చి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడని కొనియాడాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టు గొప్ప ఆరంభం అందించాడని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా కేకేఆర్ శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది. అయితే, ఆరంభంలో బౌలర్లకు కాస్త అనుకూలించిన బెంగళూరు పిచ్పై.. సెకండాఫ్లో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఆర్సీబీ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(20 బంతుల్లో 30) మెరుగ్గా రాణించగా.. మరో ఓపెనర్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సునిల్ నరైన్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టాడు. 22 బంతులు ఎదుర్కొన్న ఈ బౌలింగ్ ఆల్రౌండర్ 2 ఫోర్లు, 5 సిక్స్ల సాయంతో 47 పరుగులు చేశాడు. A quick-fire 47 off just 22 deliveries 💥💥 An entertaining opening act from Sunil Narine comes to an end 👏👏 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/s0dNMzrL80 — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వన్డౌన్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 30 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆఖర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 39, రింకూ సింగ్ 5 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు. 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కేకేఆర్ ఆర్సీబీపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా పదిహేడో ఎడిషన్లో వరుసగా రెండో గెలుపు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు ఆట తీరుపై హర్షం వ్యక్తం చేశాడు. వికెట్ బౌలర్లకు పెద్దగా అనుకూలించడం లేదని ఆండ్రీ రసెల్ చెప్పాడని.. పిచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తమకు సూచనలు ఇచ్చాడని తెలిపాడు. ఈ క్రమంలో సునిల్ నరైన్ను ఓపెనర్గా పంపాలా వద్దా అన్న అంశంపై చర్చలు జరిపామని.. ఆఖరికి ఓపెనర్గానే బరిలోకి దించామని పేర్కొన్నాడు. జట్టులో తన పాత్ర ఏమిటో నరైన్కు స్పష్టంగా తెలుసని అయ్యర్ పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీతో మ్యాచ్లో రసెల్ నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. మరోవైపు నరైన్ 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. Venkatesh F-IYER 🔥🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvKKR pic.twitter.com/2EeUvGTR8J — IndianPremierLeague (@IPL) March 29, 2024 ఇక వరుసగా రెండో గెలుపుపై స్పందిస్తూ.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. టోర్నీలో మున్ముందు ఇంకెన్నో సాధించాల్సి ఉందని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. కాగా కేకేఆర్ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. విశాఖపట్నంలో బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. చదవండి: #Kohli: పాపం.. కోహ్లి ఒక్కడు ఏం చేయగలడు? -
IPL 2024: రసెల్ సిక్సర్ల సునామీ.. గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్ 2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ ఓ భారీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో సిక్సర్ల సునామీ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించిన రసెల్.. ఐపీఎల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లను (1322 బంతుల్లో) పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు ఈ రికార్డు క్రిస్ గేల్ (1811 బంతుల్లో) పేరిట ఉండేది. రసెల్, గేల్ తర్వాత అత్యంత వేగంగా 200 సిక్సర్లు పూర్తి చేసిన ఘనత కీరన్ పోలార్డ్కు (2055) దక్కింది. ఈ జాబితాలో టాప్-3 ఆటగాళ్లు విండీస్ వీరులే కావడం విశేషం. ఈ మ్యాచ్తో సిక్సర్ల సంఖ్యను 202కు పెంచుకున్న రసెల్.. క్యాష్ రిచ్ లీగ్లో 200 సిక్సర్ల మైలురాయిని తాకిన తొమ్మిదో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. రసెల్కు ముందు గేల్ (357), రోహిత్ శర్మ (257), ఏబీ డివిలియర్స్ (251), ధోని (239), విరాట్ కోహ్లి (235), వార్నర్ (228), పోలార్డ్ (223), రైనా (203) ఈ మార్కును తాకిన వారిలో ఉన్నారు. కాగా, సన్రైజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రసెల్ బ్యాటింగ్ విన్యాసాలకు హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్ (4-0-33-3) తోడు కావడంతో కేకేఆర్ చిరస్మరణీయ విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో సన్రైజర్స్కు చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే కీలకమైన క్లాసెన్ వికెట్తో పాటు షాబాజ్ అహ్మద్ వికెట్లు పడగొట్టి కేకేఆర్ను గెలిపించాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54), రసెల్ (64) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్రైజర్స్ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
KKR Vs SRH: రస్సెల్ ఊచకోత.. వణికిపోయిన ఎస్ఆర్హెచ్ బౌలర్లు! 25 బంతుల్లోనే
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్తో సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ విధ్వంసం సృష్టించాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన రస్సెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బౌలర్తో సంబంధం లేకుండా ఊచకోత కోశాడు. ఈ క్రమంలో కేవలం 20 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 25 బంతులు ఎదుర్కొన్న రస్సెల్ 3 ఫోర్లు, 7 సిక్స్లతో 64 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. రస్సెల్ ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ఎస్ఆర్హెచ్పై రస్సెల్కే ఇదే తొలి ఫిప్టీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో రస్సెల్తో పాటు ఫిల్ సాల్ట్(54) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో నటరాజన్ 3 వికెట్లు పడగొట్టగా.. మయాంక్ మార్కండే రెండు, కమ్మిన్స్ ఒక్క వికెట్ సాధించారు. Russell's Muscles 💪 Andre Russell is hitting it out of park with ease 😮 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱 Match Updates ▶️ https://t.co/xjNjyPa8V4 #TATAIPL | #KKRvSRH | @KKRiders pic.twitter.com/Od84aM2rMr — IndianPremierLeague (@IPL) March 23, 2024 -
ఆండ్రీ రసెల్ ఊచకోత.. 12 బంతుల్లోనే.. 358.33 స్ట్రయిక్రేట్తో..!
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. రంగ్పూర్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రసెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 358.33 స్ట్రయిక్రేట్తో అజేయమైన 43 పరుగులు చేసి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. అంతకుముందు రసెల్ బౌలింగ్లో చెలరేగిపోయాడు. 2.5 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రైడర్స్.. రసెల్, ముస్ఫిక్ హసన్ (3/18), మథ్యూ ఫోర్డ్ (2/32), తన్వీర్ ఇస్లాం (1/12) ధాటికి 19.5 ఓవర్లలో 150 పరుగులకు కుప్పకూలింది. రైడర్స్ ఇన్నింగ్స్లో నీషమ్ ఒక్కడే అజేయమైన అర్దసెంచరీతో (69 నాటౌట్) రాణించాడు. నీషమ్తో పాటు రోనీ తాలుక్దార్ (14), షకీబ్ అల్ హసన్ (24) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం ఛేదనకు దిగిన విక్టోరియన్స్.. రసెల్ శివాలెత్తడంతో 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది (4 వికెట్లు కోల్పోయి). విక్టోరియన్స్ ఇన్నింగ్స్లో రసెల్తో పాటు లిటన్ దాస్ (43), మహిదుల్ ఇస్లాం (39) కూడా రాణించారు. ఓపెనర్గా బరిలోకి దిగిన సునీల్ నరైన్ 15 పరుగులు మాత్రమే చేసి ఔట్ కాగా.. మొయిన్ అలీ (6 నాటౌట్) రసెల్తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. రైడర్స్ బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హైదర్ రోని ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన రసెల్, రూథర్ఫోర్డ్ జోడీ
పొట్టి క్రికెట్లో ఆండ్రీ రసెల్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ జోడీ (వెస్టిండీస్ క్రికెటర్లు) చరిత్ర సృష్టించింది. ఈ జోడీ ఆరో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా రికార్డుల్లోకెక్కింది. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన మ్యాచ్లో రసెల్, రూథర్ఫర్డ్ జోడీ ఆరో వికెట్కు 139 పరుగులు జోడించి గత రికార్డును బద్దలుకొట్టింది. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు పపువా న్యూ గినియా జోడీ (టోనీ ఉరా-నార్మన్ వనువా) పేరిట ఉండింది. 2022లో జరిగిన ఓ మ్యాచ్లో పపువా జోడీ ఆరో వికెట్కు అత్యధికంగా 115 పరుగులు జోడించింది. దీనికి ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియన్ జోడీ (మైక్ హస్సీ-కెమరూన్ వైట్) పేరిట ఉండింది. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హస్సీ-వైట్ కాంబో ఆరో వికెట్కు అజేయమైన 101 పరుగులు జోడించింది. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో పర్యాటక విండీస్ జట్టు 37 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలు సాధించి విండీస్ను గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రసెల్, రూథర్ఫోర్డ్తో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలుత విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్కు ఓటమి తప్పలేదు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్లో విండీస్ విజయం సాధించింది. -
రఫ్ఫాడించిన రసెల్.. వార్నర్ మెరుపులు వృధా
ఆస్ట్రేలియా పర్యటనను విండీస్ గెలుపుతో ముగించింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పర్యాటక జట్టు చివరి మ్యాచ్లో విజయం సాధించింది. ఇవాళ (ఫిబ్రవరి 13) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్ ఆటగాళ్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీశారు. ఫలితంగా 37 పరుగుల తేడాతో విజయం సాధించి, క్లీన్ స్వీప్ పరాభవాన్ని తప్పించుకున్నారు. రఫ్ఫాడించిన రసెల్.. రెచ్చిపోయిన రూథర్ఫోర్డ్ తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ రసెల్ (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రూథర్ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రఫ్ఫాడించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. వీరిద్దరితో పాటు రోస్టన్ ఛేజ్ (37), రోవ్మన్ పావెల్ (21) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడారు. వార్నర్ మెరుపులు వృధా భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. వార్నర్ (49 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో విజయం దిశగా సాగింది. అయితే వార్నీ ఔట్ అయిన వెంటనే ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఆఖర్లో టిమ్ డేవిడ్ (19 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రెచ్చిపోయినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నిర్ణీత ఓవర్లలో ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్లో గత మ్యాచ్ సెంచరీ హీరో మ్యాక్స్వెల్ (12) సహా, హిట్టర్లు మిచ్ మార్ష్ (17), ఆరోన్ హార్డీ (16) విఫలమయ్యారు. ఈ సిరీస్లో తొలి రెండు టీ20లు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్లో విండీస్ విజయం సాధించింది. టీ20 సిరీస్కు ముందు ఇరు జట్ల మధ్య టెస్ట్, వన్డే సిరీస్లు జరిగాయి. టెస్ట్ సిరీస్ 1-1తో డ్రా కాగా.. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. -
ఓ పక్క రసెల్ ఊచకోత.. మరో పక్క విల్ జాక్స్ శతక్కొట్టుడు
పొట్టి ఫార్మాట్లో ఇవాళ (ఫిబ్రవరి 13) రెండు ధమాకా ఇన్నింగ్స్లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేశాయి. వీటితో పాటు మరో రెండు మెరుపు ఇన్నింగ్స్లు ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో వెస్టిండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ సుడిగాలి అర్ధశతకంతో (29 బంతుల్లో 71; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) రచ్చ చేయగా.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో కొమిల్లా విక్టోరియన్స్కు ఆడుతున్న ఇంగ్లండ్ మెరుపు వీరుడు విల్ జాక్స్ (53 బంతుల్లో 108 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించి శతక్కొట్టాడు. వీరిద్దరికి సహచరులు షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (40 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మొయిన్ అలీ (24 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) తోడవ్వడంతో వారివారి జట్లు భారీ స్కోర్లు నమోదు చేశాయి. ఆసీస్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. రసెల్, రూథర్పోర్డ్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగా.. చట్టోగ్రామ్ ఛాలెంజర్స్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కొమిల్లా విక్టోరియన్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 239 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ రెండు మ్యాచ్ల్లో సెకెండ్ ఇన్నింగ్స్లె కొనసాగుతున్నాయి. -
WI Vs AUS 3rd T20I : రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. 29 బంతుల్లోనే!
Australia vs West Indies, 3rd T20I: ఆస్ట్రేలియాతో మూడో టీ20లో వెస్టిండీస్ వెటరన్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు. పెర్త్ మ్యాచ్లో కంగారూ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 29 బంతుల్లోనే ఏకంగా 244కు పైగా స్ట్రైక్రేటుతో 71 రన్స్ సాధించాడు. ఆసీస్ బౌలింగ్ను చితక్కొడుతూ నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో ఈ మేరకు ఆండ్రీ రసెల్ పరుగుల సునామీ సృష్టించాడు. హిట్టర్ అన్న బిరుదును మరోసారి సార్థకం చేసుకున్నాడు. Bang! Andre Russell is seeing them nicely at Perth Stadium. Tune in on Fox Cricket or Kayo #AUSvWI pic.twitter.com/DoUaQghJiZ — cricket.com.au (@cricketcomau) February 13, 2024 కాగా మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టీ20లలో ఓడిన విండీస్.. ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పెర్త్ స్టేడియంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రూథర్ఫర్డ్, రసెల్ దంచికొట్టారు టాపార్డర్ మొత్తం కలిపి కనీసం 20 పరుగులు కూడా చేయకుండానే నిష్క్రమించడంతో భారమంతా మిడిలార్డర్పై పడింది. ఈ క్రమంలో నాలుగు.. వరుసగా ఆ తర్వాతి స్థానాలో దిగిన రోస్టన్ చేజ్(20 బంతుల్లో 37), కెప్టెన్ రోవ్మన్ పావెల్(14 బంతుల్లో 21) రాణించగా.. షెర్ఫానే రూథర్ఫర్డ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 40 బంతులు ఎదుర్కొన్న రూథర్ఫర్డ్ 67 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఇక రూథర్ఫర్డ్కు జతైన 35 ఏళ్ల ఆండ్రీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో రసెల్.. స్పెన్సర్ జాన్సెన్ బౌలింగ్లో మాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ను 1-1తో డ్రా చేసుకున్న కరేబియన్ జట్టు.. వన్డే సిరీస్లో 3-0తో వైట్వాష్కు గురైంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో మాత్రం ఆ ఫలితం పునరావృతం కాకూడదని ప్రయత్నం చేస్తోంది. చదవండి: IPL 2024- SRH: సన్రైజర్స్ కెప్టెన్గా అతడే! -
రెచ్చిపోయిన రసెల్.. 17 బంతుల్లో 6 సిక్సర్లు, అయినా ఓడిన నైట్రైడర్స్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో అబుదాబీ నైట్రైడర్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు కొట్టి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో రెచ్చిపోయినా ఈ మ్యాచ్లో నైట్రైడర్స్ ఓటమిపాలైంది. రసెల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రసెల్తో పాటు జో క్లార్క్ (21), మైఖేల్ పెప్పర్ (38), అలీషాన్ షరాఫు (37), సామ్ హెయిన్ (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 3 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఎంఐ ఎమిరేట్స్ మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ముహమ్మద్ వసీం (61 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఎమిరేట్స్ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం విరుచుకుపడ్డాడు. పూరన్ కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ముహమ్మద్ వసీం.. టిమ్ డేవిడ్ (10) సాయంతో ఎమిరేట్స్ను గెలిపించాడు. నైట్రైడర్స్ బౌలర్లలో డేవిడ్ విల్లే, అలీ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో డెజర్ట్ వైపర్స్పై షార్జా వారియర్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వైపర్స్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్లో ఆ జట్టు కెప్టెన్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (68) టాప్ స్కోరర్గా నిలువగా.. వైపర్స్ ఇన్నింగ్స్లో అలెక్స్ హేల్స్ (61) అర్దసెంచరీతో రాణించాడు. వారియర్స్ బౌలర్లు క్రిస్ వోక్స్ (2/26), డేనియల్ సామ్స్ (2/29) వైపర్స్ పతనాన్ని శాశించాడు. -
రీఎంట్రీలో రసెల్ బ్యాటింగ్ విధ్వంసం.. విండీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు
West Indies vs England, 1st T20I: వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రసెల్ జాతీయ జట్టులో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఇంగ్లండ్తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలుత బంతితో చెలరేగిన ఈ ఆల్రౌండర్.. అనంతరం లక్ష్య ఛేదనలో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్ బౌలర్ల ఎత్తులను చిత్తు చేస్తూ ధనాధన్ బ్యాటింగ్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి రీఎంట్రీ అదుర్స్ అనిపించాడు. కాగా మూడు వన్డే, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. మూడు వికెట్లు పడగొట్టిన రసెల్ ఈ క్రమంలో వన్డే సిరీస్ను 2-1తో గెలిచి ఇంగ్లిష్ జట్టుకు షాకిచ్చిన వెస్టిండీస్.. టీ20 సిరీస్ను విజయంతో ఆరంభించి సత్తా చాటింది. బార్బడోస్ వేదికగా బుధవారం తెల్లవారుజామున జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ 20 బంతుల్లో 40, జోస్ బట్లర్ 31 బంతుల్లో 39 పరుగులతో శుభారంభం అందించగా.. మిగతా వాళ్లలో లియామ్ లివింగ్ స్టోన్(27) ఒక్కడే ఇరవై పరుగుల పైచిలుకు స్కోరు రాబట్టాడు. కరేబియన్ బౌలర్ల ధాటికి మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో పేస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్, మరో ఫాస్ట్బౌలర్ అల్జారీ జోసెఫ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మిగిలిన వాళ్లలో పేసర్లు జేసన్ హోల్డర్ ఒకటి, రొమారియో షెఫర్డ్ రెండు వికెట్లు కూల్చారు. ఇక స్పిన్నర్ అకీల్ హొసేన్కు ఒక వికెట్ దక్కింది. Unstoppable Russell Mania! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/VjbBCJMMIV — FanCode (@FanCode) December 13, 2023 పావెల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్(22), కైలీ మేయర్స్(35) మంచి ఆరంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 36 పరుగులతో రాణించాడు. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన నికోలస్ పూరన్ 13, షిమ్రన్ హెట్మెయిర్ ఒక్క పరుగుకే పరిమితమయ్యారు. అయితే, ఆరో నంబర్ బ్యాటర్, కెప్టెన్ రోవ్మన్ పావెల్, ఎనిమిదో స్థానంలో వచ్చిన ఆండ్రీ రసెల్ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగారు. పావెల్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 206.67 స్ట్రైక్రేటుతో 31 పరుగులు రాబట్టి అజేయంగా నిలిచాడు. సునామీ ఇన్నింగ్స్తో రసెల్ విధ్వంసం మరోవైపు రసెల్ కూడా 14 బంతులు ఎదుర్కొని 207కు పైగా స్ట్రైక్రేటుతో 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా రసెల్ దాదాపు రెండేళ్ల తర్వాత వెస్టిండీస్ తరఫున బరిలోకి దిగడం ఇదే తొలిసారి. Russell roars back! . .#WIvENG #WIvENGonFanCode pic.twitter.com/zdlJBWJdWA — FanCode (@FanCode) December 13, 2023 ఈ నేపథ్యంలో ఇంగ్లండ్పై టీ20 సిరీస్లో వెస్టిండీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో జోస్ బట్లర్ బృందానికి మరోసారి నిరాశే మిగిలింది. ఇరు జట్ల మధ్య గురువారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: Ind vs SA: అందుకే ఓడిపోయాం.. మాకు ఇదొక గుణపాఠం: సూర్యకుమార్ -
వెస్టిండీస్ టీ20 జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాడు రీ ఎంట్రీ
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును తమ జట్టును క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరమైన స్టార్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్కు ఇంగ్లండ్ సిరీస్ కోసం విండీస్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. రస్సెల్ చివరగా వెస్టిండీస్ తరపున 2021లో ఆస్ట్రేలియాపై టీ20 మ్యాచ్ ఆడాడు. ఇటీవల కాలంలో రస్సెస్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండంతో మళ్లీ సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకున్నారు. అదే విధంగా ఇంగ్లండ్తో వన్డేలకు దూరమైన స్టార్ ఆటగాళ్లు జాసన్ హోల్డర్, నికోలస్ పూరన్ లు టీ20 జట్టులో మాత్రం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు రోవ్మన్ పావెల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. షాయ్ హోప్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. డిసెంబర్ 12న బార్బోడేస్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే ఇంగ్లండ్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1తో వెస్టిండీస్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్తో టీ20లకు విండీస్ జట్టు: రోవ్మన్ పావెల్ (కెప్టెన్), షాయ్ హోప్ (వైస్ కెప్టెన్), రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రొమారియో షెపర్డ్. చదవండి: ENG vs WI: ఇంగ్లండ్ను చిత్తు చేసిన వెస్టిండీస్.. 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి -
అతడి బ్యాటింగ్ కోసమే భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్లు చూస్తున్నాను: రస్సెల్
టీమిండియా నయా బ్యాటింగ్ సంచలనం రింకూ సింగ్పై వెస్టిండీస్ స్టార్ ఆండ్రీ రస్సెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. రింకూ అద్భుతమైన ఆటగాడని, అతడి సత్తా ఎంటో తనకు బాగా తెలుసు అని రస్సెల్ అన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో ఇప్పటివరకు ఆడిన మూడు ఇన్నింగ్స్లోనూ రింకూ దుమ్మురేపాడు. ఆసీస్తో జరిగిన తొలి టీ20లో 14 బంతుల్లో 22 పరుగులు చేసిన రింకూ.. రెండో టీ20లో అయితే కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో టీ20లో 46 పరుగులతో అద్బుత ఇన్నింగ్స్ ఈ నేపథ్యంలో రస్సెల్ హిందూస్తాన్ టైమ్స్తో రస్సెల్ మాట్లాడూతూ.. "నేను ఆస్ట్రేలియా-భారత్ టీ20 మ్యాచ్లను చూస్తున్నాను. ఒకవేళ ఏ మ్యాచ్ అయినా మిస్ అయితే హైలెట్స్ కచ్చితంగా చూస్తాను. ఎందుకంటే రింకూ సింగ జట్టులో ఉన్నాడు. అతడి బ్యాటింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సిరీస్లో రింకూ బ్యాటింగ్ నన్ను ఏమి ఆశ్చర్యపరచడం లేదు. అతడు కొన్నేళ్ల క్రితం కేకేఆర్తో జతకట్టాడు. అతడు ప్రాక్టీస్ గేమ్లలో లేదా నెట్స్లో భారీ షాట్లు ఆడేవాడు. అప్పుడే అతడు టాలెంట్ ఎంటో మాకు అర్ధమైపోయింది. అతడొక టీమ్ మ్యాన్. ఆట పట్ల అతడికి చాల మక్కువ ఎక్కువ. జాతీయ జట్టు అద్బుతంగా రాణిస్తుండడంతో అతడు చాలా సంతోషంగా ఉంటాడు. అతడు భవిష్యత్తులో మరింత మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో గత కొన్ని సీజన్ల నుంచి కేకేఆర్ తరపున ఆడుతున్నారు. చదవండి: IND vs SA: గొప్ప నాయకుడు.. అప్పటిదాకా అతడే టీమిండియా కెప్టెన్గా ఉండాలి: గంగూలీ -
బీసీసీఐ అలా చేస్తే.. అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు: రసెల్
తమ అభిప్రాయాలు నిక్కచ్చిగా చెప్పడంలో కరేబియన్ క్రికెటర్లు ముందు వరుసలో ఉంటారు. ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల అంతర్జాతీయ టీ20 భవితవ్యం గురించి అతడు ఇచ్చిన సమాధానం ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. కాగా టీ20 ప్రపంచకప్-2022 తర్వాత విరాహిత్ ద్వయం టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్-2023 తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ టీ20లకు పూర్తిగా దూరం కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబరులో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా ఈ విషయంపై పూర్తి స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో హిందుస్తాన్ టైమ్స్తో సంభాషించిన ఆండ్రీ రసెల్కు రోహిత్, కోహ్లిల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. "అసలు రోహిత్, కోహ్లిల విషయంలో ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆటగాళ్ల నైపుణ్యాల గురించి చర్చలు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. రోహిత్ అనుభవజ్ఞుడైన ఆటగాడు.. ఇక విరాట్ విరాట్(బిగ్) ప్లేయర్ అని ప్రత్యేకంగా చెప్పేదేముంది? వీళ్లిద్దరిని గనుక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేయకపోతే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటం అత్యంత ముఖ్యం. యుద్ధ క్షేత్రానికి 11 మంది యువ సైనికులను పంపలేరు కదా! సీనియర్లకే కచ్చితంగా పెద్దపీట వేయాల్సి ఉంటుంది" అంటూ ఈ విండిస్ వీరుడు కుండబద్దలు కొట్టాడు. యువ ఆటగాళ్లు ఇలాంటి మేజర్ టోర్నీల్లో ఒత్తిడిని జయించలేక చిత్తవుతారు కాబట్టి.. అనుభవం ఉన్న ఆటగాళ్లను బరిలోకి దింపడం ముఖ్యమని రసెల్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్లో ఈ బౌలింగ్ ఆల్రౌండర్ కోల్కతా నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్గా కేఎల్ రాహుల్!? -
మున్రో మెరుపు ఇన్నింగ్స్ వృధా.. తుక్కు రేగ్గొట్టిన రసెల్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్తో ఇవాళ (సెప్టెంబర్ 11) జరిగిన మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్.. ఓపెనర్ కొలిన్ మున్రో (51 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన అజేయ అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. మార్క్ దెయాల్ (45 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో, ఆఖర్లో ఆండ్రీ రసెల్ (13 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడటంతో నైట్రైడర్స్ మరో 7 బంతులు మిగిలుండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. మున్రో మెరుపు ఇన్నింగ్స్ వృధా.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్ను మున్రో బాధ్యతాయుతమైన అజేయ అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. అతను చివరి వరకు క్రీజ్లో ఉండటంతో లూసియా కింగ్స్ ఈ మాత్రం స్కోరైనా (167/3) చేయగలిగింది. మున్రోకు రోస్టన్ ఛేజ్ (31 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్), సీన్ విలియమ్స్ (17 బంతుల్లో 34 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) సహకరించగా.. జాన్సన్ చార్లెస్ (13), సికందర్ రజా (8) విఫలమయ్యారు. నైట్రైడర్స్ బౌలర్లలో జేడన్ సీల్స్, సునీల్ నరైన్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. రాణించిన మార్క్ దెయాల్, రఫ్ఫాడించిన రసెల్ 168 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్ ఓపెనర్ మార్క్ దెయాల్, ఆఖర్లో ఆండ్రీ రసెల్ మెరుపు ఇన్నింగ్స్తో విజృంభించడంతో 18.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో మార్టిన్ గప్తిల్ (16), నికోలస్ పూరన్ (15) విఫలం కాగా.. దెయాల్, రసెల్తో పాటు లోర్కాన్ టక్కర్ (38 నాటౌట్) రాణించాడు. లూసియా బౌలర్లలో అల్జరీ జోసఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
సిక్సర్ల సునామీ.. విధ్వంసం సృష్టించిన విండీస్ వీరులు
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా నిన్న జరిగిన రెండు మ్యాచ్ల్లో సిక్సర్ల మోత మోగింది. పలువురు విండీస్ జాతీయ జట్టు ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరి సిక్సర్ల సునామీలో మైదానాలు కొట్టుకుపోయాయి. వీరి బాదుడు అభిమానులకు అసలుసిసలు టీ20 క్రికెట్ మజాను అందించింది. బంతి పడటమే ఆలస్యం అన్నట్లుగా బౌలర్లను ఊచకోత కోశారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదవ్వడంతో పాటు పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. హెట్మైర్, కీమో పాల్ ఊచకోత జమైకా తల్లావాస్-గయానా అమెజాన్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా.. షిమ్రోన్ హెట్మైర్ (45 బంతుల్లో 60; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కీమో పాల్ (29 బంతుల్లో 57; ఫోర్, 7 సిక్సర్లు) సుడిగాలి అర్ధశతకాలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కీమో పాల్ ఆకాశమే హద్దుగా చెలరేగి దాదాపుగా ప్రతి బంతిని సిక్సర్గా మలిచాడు. THE CHAMPION! What a way to mark your 100th CPL match by taking a wicket in your first ball 🙌 @DJBravo47 strikes again! #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/aRoSZv9J2B — CPL T20 (@CPL) August 28, 2023 వీరికి షాయ్ హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) జతకావడంతో గయానా టీమ్ 200 పరుగుల మార్కును దాటింది. జమైకా బౌలర్లలో మహ్మద్ ఆమిర్ 3 వికెట్లు పడగొట్టగా.. క్రిస్ గ్రీన్ 2, సల్మాన్ ఇర్షాద్, రీఫర్ తలో వికెట్ దక్కించుకున్నారు. సరిపోని ఇమాద్ వసీం, ఫేబియన్ అలెన్ మెరుపులు 211 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇమాద్ వసీం (36 బంతుల్లో 63; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఫేబియన్ అలెన్ (25 బంతుల్లో 47; 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడినా జమైకా విజయతీరాలకు చేరలేకపోయింది. వీరు మినహా మిగతావారెవ్వరూ రాణించడకపోవడంతో జమైకా ఇన్నింగ్స్ 18.4 ఓవర్లలోనే ముగిసింది. ఆ జట్టు 176 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఫలితంగా గయానా 34 పరుగుల తేడాతో గెలుపొందింది. రొమారియో షెపర్డ్ (3-1-7-3) అద్భుతమైన ప్రదర్శనతో జమైకా పతనాన్ని శాసించగా.. ప్రిటోరియస్ (2/35), సింక్లెయిర్ (2/17) రాణించారు. Rutherford Relishes Responsibility💪 Captain's knock from Sherfane👏#CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #Skyfair pic.twitter.com/lSvN2Kehfi — CPL T20 (@CPL) August 28, 2023 రూథర్పోర్డ్ ప్రయాస వృధా.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో ట్రిన్బాగో నైట్రైడర్స్ బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. ఫలితంగా వారి జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ కిట్స్.. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (38 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆండ్రీ ఫ్లెచర్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోర్బిన్ బాష్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. నైట్రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3 వికెట్లతో రాణించగా.. బ్రావో 2 వికెట్లు పడగొట్టాడు. Nicky P with an entertaining innings 🙌!#CPL23 #SKNPVTKR #CricketPlayedLouder #BiggestPartylnSport #Skyfair pic.twitter.com/WAcooLRBgu — CPL T20 (@CPL) August 28, 2023 Wowza 🤩 @KieronPollard55 SMASHES 4 💯 meter sixes in a row 🔥 #CPL23 #SKNPvTKR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/qVpn0fRKA1 — CPL T20 (@CPL) August 28, 2023 విధ్వంసం సృష్టించిన పూరన్, పోలార్డ్, రసెల్ 179 పరుగుల లక్ష్యాఛేదనలో నికోలస్ పూరన్ (32 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 37 నాటౌట్; 5 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (8 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోవడంతో నైట్రైడర్స్ 17.1 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెయింట్ కిట్స్ బౌలర్లలో బోష్ 3, ముజరబానీ ఓ వికెట్ పడగొట్టారు. SUPER SALMAN takes 4 🤩 #CPL23 #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/jSr1RT24G4 — CPL T20 (@CPL) August 28, 2023 -
రెచ్చిపోయిన రసెల్, రూథర్ఫోర్డ్.. కెనడా టీ20 లీగ్ విజేత మాంట్రియాల్ టైగర్స్
కెనడా టీ20 లీగ్ 2023 ఎడిషన్ (మూడో ఎడిషన్.. 2018, 2019, 2023) విజేతగా మాంట్రియాల్ టైగర్స్ నిలిచింది. సర్రే జాగ్వార్స్తో నిన్న (ఆగస్ట్ 6) జరిగిన ఫైనల్లో మాంట్రియాల్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రసవత్తరంగా సాగిన ఈ లో స్కోరింగ్ గేమ్లో షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (29 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కడ దాకా నిలిచి మాంట్రియాల్ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (6 బంతుల్లో 20 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో విజృంభించి మాంట్రియాల్ను గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జాగ్వార్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఓపెనర్ జతిందర్ సింగ్ (57 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు) అజేయమైన అర్ధసెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ మహ్మద్ హరీస్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), అయాన్ ఖాన్ (15 బంతుల్లో 26; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంట్రియాల్ బౌలర్లలో అయాన్ అఫ్జల్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. కార్లోస్ బ్రాత్వైట్, అబ్బాస్ అఫ్రిది, ఆండ్రీ రసెల్ తలో వికెట్ దక్కించుకున్నారు. Montreal Tigers - Champions of GT20 Canada Season 3 🙌 The Montreal Tigers unleashed a loud Roar and clinched the Title 🏆#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/paLAtYBa1U — GT20 Canada (@GT20Canada) August 6, 2023 అనంతరం అతి సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మాంట్రియాల్ సున్నా పరుగులకే వికెట్ కోల్పోయి డిఫెన్స్లో పడింది. అయితే కెప్టెన్ క్రిస్ లిన్ (35 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. స్రిమంత (15 బంతుల్లో 12; 2 ఫోర్లు), దిల్ప్రీత్ సింగ్ (15 బంతుల్లో 14; 2 ఫోర్లు) సాయంతో స్కోర్ బోర్డును నెమ్మదిగా కదిలించాడు. 60 పరుగుల వద్ద పరుగు వ్యవధిలో మాంట్రియాల్ 2 వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. The Moment, the Feels, and the Celebrations ❤️#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals pic.twitter.com/ONOQtgOKSK — GT20 Canada (@GT20Canada) August 7, 2023 ఈ దశలో వచ్చిన షెర్ఫాన్ రూథర్ఫోర్డ్.. దీపేంద్ర సింగ్ (16 రిటైర్డ్), ఆండ్రీ రసెల్ల సాయంతో మాంట్రియాల్ను విజయతీరాలకు చేర్చాడు. జాగ్వార్స్ బౌలర్లలో కెప్టెన్ ఇఫ్తికార్ అహ్మద్ (4-0-8-2) అద్భుతంగా బౌల్ చేయగా.. స్పెన్సర్ జాన్సన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్తో పాటు సిరీస్ ఆధ్యాంతం రాణించిన రూథర్ఫోర్డ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. It was a busy presentation ceremony for Sherfane Rutherford and deservingly so 🫶 Dean Jones - Most Valuable Player ✅ Finals Man of the Match ✅ Moment of the Match ✅#GT20Canada #GT20Season3 #GlobalT20 #CricketsNorth #GT20Finals #SJvMT pic.twitter.com/OCHQxU4IlT — GT20 Canada (@GT20Canada) August 7, 2023 -
తీరు మార్చుకోని నైట్రైడర్స్.. కొనసాగుతున్న పేలవ ప్రదర్శన.. ఐపీఎల్లో కాస్త నయం..!
ఫ్రాంచైజీ క్రికెట్లో కోల్కతా నైట్రైడర్స్ అనుబంధ జట్ల పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. గతేడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్లో (సీపీఎల్) మొదలైన నైట్రైడర్స్ వైఫల్యాల పరంపర.. అమెరికా వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్లోనూ (ఎంఎల్సీ) కంటిన్యూ అవుతుంది. 2022 సీపీఎల్ను ఆఖరి స్థానంతో ముగించిన ట్రిన్బాగో నైట్రైడర్స్.. ఆతర్వాత జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్లోనూ (ఐఎల్టీ20) చివరాఖరి స్థానంలోనే (అబుదాబీ నైట్రైడర్స్) నిలిచింది. అనంతరం జరిగిన ఐపీఎల్-2023లో కాస్త పర్వాలేదనిపించిన కోల్కతా నైట్రైడర్స్ (7వ స్థానం).. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్సీలో మరోసారి తమకెంతో అచ్చొచ్చిన ఆఖరి స్థానంలో (లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్) నిలిచి, లీగ్ దశలోనే పోటీ నుంచి నిష్క్రమించింది. సునీల్ నరైన్ సారధ్యంలో ఎంఎల్సీలో మొత్తం 5 మ్యాచ్లు ఆడిన నైట్రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమిపాలై, టేబుల్ టాపర్ సియాటిల్ ఆర్కాస్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కూడా నైట్రైడర్స్ అతికష్టం మీద నెగ్గింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నైట్రైడర్స్ ఈ మ్యాచ్లో గెలవగలిగింది. 6 జట్లు పాల్గొన్న ఎంఎల్సీ-2023 సీజన్ను ఆఖరి స్థానంతో ముగించింది. కాగా, నైట్రైడర్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రాంచైజెస్ను బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నటి జూహి చావ్లా, వ్యాపారవేత్త జై మెహతా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే, అయినా..! లీగ్ క్రికెట్లో నైట్రైడర్స్ ఫ్రాంచైజీల ప్రస్తానాన్ని గమనిస్తే, అన్ని జట్లలో ప్రపంచంలోని విధ్వంసకర ఆటగాళ్లు మెజారిటీ శాతం ఉన్నారు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ దగ్గర నుంచి ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ వరకు అన్ని నైట్రైడర్స్ ఫ్రాంచైజీల్లో భారీ హిట్టర్లు ఉన్నారు. సీపీఎల్లో ట్రిన్బాగో నైట్రైడర్స్లో కీరన్ పోలార్డ్, మార్టిన్ గప్తిల్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్, డ్వేన్ బ్రేవో, రిలీ రొస్సో, ఆండ్రీ రసెల్ ఉండగా.. ఐపీఎల్లో నితీశ్ రాణా, రింకూ సింగ్, జేసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, రహ్మానుల్లా గుర్భాజ్, జాన్సన్ చార్లెస్, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఉన్నారు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ విషయానికొస్తే.. ఈ జట్టులో సునీల్ నరైన్, కొలిన్ ఇంగ్రామ్, బ్రాండన్ కింగ్, ఆండ్రీ రసెల్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉండగా.. మేజర్ లీగ్ క్రికెట్లో జేసన్ రాయ్, రిలీ రొస్సో, మార్టిన్ గప్తిల్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తదితరులు నైట్రైడర్స్ జట్టులో ఉన్నారు. ప్రతి నైట్రైడర్స్ ఫ్రాంచైజీలో ఈ స్థాయిలో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ ఈ ఫ్రాంచైజీ ఏ లీగ్లోనూ ఛాంపియన్ కాలేకపోతుంది. కనీసం టాప్ జట్లలో ఒకటిగా కూడా నిలువలేకపోతుంది. ఐపీఎల్లో రెండుసార్లు విజేతగా నిలిచిన నైట్రైడర్స్ ఆ తర్వాత ఏ లీగ్లోనూ ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. దీంతో నైట్రైడర్స్ ఫ్యాన్స్ తెగ హర్టై పోతున్నారు. మరో పక్క ఇదే ఫ్రాంచైజీ క్రికెట్లో సూపర్ కింగ్స్ జట్లు మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ లీగ్లో అయినా ఆ జట్టు మినిమం గ్యారెంటీగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ఎంఎల్సీలోనూ ఆ జట్టు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. -
శివాలెత్తిన రొస్సో.. నైట్ రైడర్స్ ఖాతాలో తొలి విజయం
మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ తొలి విజయం నమోదు చేసింది. నిన్న (జులై 23) సీయాటిల్ ఆర్కాస్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. రిలీ రొస్సో (38 బంతుల్లో 78 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అజేయమైన మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడి నైట్ రైడర్స్ను విజయతీరాలకు చేర్చాడు. రొస్సోకు ఆండ్రీ రసెల్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకరించాడు. ఫలితంగా నైట్ రైడర్స్.. ఆర్కాస్ నిర్ధేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 8 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది. One of the innings of the tournament 👏 Rilee Rossouw wins the Player of the Match award for his impressive 7️⃣8️⃣* (3️⃣8️⃣)#MLC2023 pic.twitter.com/WQhNFWn3UH — Major League Cricket (@MLCricket) July 23, 2023 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్కాస్.. షెహన్ జయసూర్య (45 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ డికాక్ (10) విఫలం కాగా.. నౌమన్ అన్వర్ (32; 5 ఫోర్లు), క్లాసెన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. నైట్ రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 2 వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్ జాన్సన్, ఆండ్రీ రసెల్, వాన్ షాల్విక్, కెప్టెన్ సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్కు మంచి ఆరంభం లభించనప్పటికీ.. రొస్సో, రసెల్ ఆ జట్టును గెలిపించారు. 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రొస్సో ఆఖరి వరకు క్రీజ్లో నిలబడి నైట్ రైడర్స్కు సీజన్ తొలి విజయాన్ని అందించాడు. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్లో జేసన్ రాయ్ (2), జస్కరన్ మల్హోత్రా (2), గజానంద్ సింగ్ (3),సునీల్ నరైన్ (8) విఫలం కాగా.. సైఫ్ దర్బార్ (10), వాన్ షాల్విక్ (12), ఆడమ్ జంపా (12) రెండంకెల స్కోర్లు చేశారు. ఆర్కాస్ బౌలర్లలో కెమరాన్ గానన్ 3 వికెట్లతో రాణించగా.. ఆండ్రూ టై 2, ఇమాద్ వసీం, కెప్టెన్ వేన్ పార్నెల్, హర్మీత్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. -
'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి'
మేజర్ క్రికెట్ లీగ్(MLC 2023)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ ఇప్పటివరకు భోణీ చేయలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ పరాజయాలే చవిచూసిన నైట్రైడర్స్ జట్టు ఎప్పుడు గెలుపు బాట పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో లాస్ ఏంజిల్స్ నైట్రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది. అయితే మ్యాచ్లో ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ మాత్రం సక్సెస్ అయ్యాడు. 37 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 70 పరుగులు నాటౌట్గా నిలిచాడు. తాను విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన బౌలింగ్ వైఫల్యంతో నైట్రైడర్స్ ఓటమి పాలైంది. ఈ సంగతి పక్కనబెడితే రసెల్ కొట్టిన సిక్సర్లలో ఒక బంతి పిల్లాడిని గాయపరిచింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో అకీల్ హొసెన్ వేసిన రెండో బంతిని రసెల్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. స్టాండ్సలోకి వెళ్లిన బంతి నేరుగా పిల్లాడి తలకు తాకింది. దీంతో పిల్లాడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత పిల్లాడి తండ్రి ఐస్ప్యాక్తో తలకు మర్దన చేస్తూ స్టేడియంలోకి వచ్చాడు. ఇది గమనించిన రసెల్ పిల్లాడి దగ్గరకు వచ్చి ఒక హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అతనికి సిగ్నేచర్ చేసిన బ్యాట్తో పాటు టోపీలు గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ సందర్భంగా పిల్లాడికి రసెల్ ఒక సలహా కూడా ఇచ్చాడు.. చూడు చిన్న.. రసెల్ బ్యాటింగ్లో ఉన్నాడంటే బంతిపై కూడా ఒక కన్నేసి ఉంచు.. ఓకేనా అని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్ 70 నాటౌట్, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, నెత్రావల్కర్, అకిల్ హొసెన్లు చెరొక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్(43 పరుగులు), ఆండ్రీస్ గౌస్(40 పరుగులు) చేయగా.. గ్లెన్ పిలిప్స్ 29, ఒబెస్ పియనర్ 26 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. Dre Russ made sure to check on the kid who took a blow to his head from one of his sixes in Morrisville 💜 We’re glad the impact wasn’t too bad, and the li’l champ left with a smile and some mementos for a lifetime.#LAKR #LosAngeles #WeAreLAKR #MLC23 #AndreRussell @Russell12A… pic.twitter.com/EtLO5z2avx — Los Angeles Knight Riders (@LA_KnightRiders) July 22, 2023 చదవండి: IND vs WI: అశ్విన్తో అట్లుంటది మరి.. విండీస్ కెప్టెన్ ఫ్యూజ్లు ఔట్! వీడియో వైరల్ -
ప్రత్యర్థిని చితక్కొట్టినా తప్పని ఓటమి.. వరుసగా నాలుగోది
మేజర్ లీగ్ క్రికెట్(MLC 2023)లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. లీగ్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లోనూ ఓటమి చవిచూసిన నైట్ రైడర్స్ ఖాతా తెరవలేకపోతుంది. తాజాగా వాషింగ్టన్ ఫ్రీడమ్తో జరిగిన మ్యాచ్లో నైట్రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. నైట్రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్(37 బంతుల్లో 70 నాటౌట్, 6 ఫోర్లు, ఆరు సిక్సర్లు ) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లాస్ ఏంజిల్స్ నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్ 70 నాటౌట్, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్ రెండు, నెత్రావల్కర్, అకిల్ హొసెన్లు చెరొక వికెట్ తీశారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. వాషింగ్టన్ ఇన్నింగ్స్లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్(43 పరుగులు), ఆండ్రీస్ గౌస్(40 పరుగులు) చేయగా.. గ్లెన్ పిలిప్స్ 29, ఒబెస్ పియనర్ 26 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించాడు. నైట్రైడర్స్ బౌలర్లలో సునీల్ నరైన్, అలీ ఖాన్, స్పెన్సర్ జాన్సన్, ఆడమ్ జంపాలు తలా ఒక వికెట్ తీశారు. కాగా వాషింగ్టన్ ఫ్రీడమ్ ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. నైట్రైడర్స్ నాలుగు పరాజయాలతో ఆఖరి స్థానంలో ఉంది. THE DRE RUSS SHOW!🌟 What a WAY to bring up his FIFTY AND BEYOND!📈 1⃣4⃣5⃣/4⃣ (17.0) pic.twitter.com/EBPLKpQ13u — Major League Cricket (@MLCricket) July 20, 2023 And that closes the first game in Morrisville 😁 The Washington Freedom 🔵 🔴 score 2️⃣ points, ending the tournament for the LA Knight Riders who drop to 0-4 😔 #MLC2023 pic.twitter.com/sOKjJHdmkA — Major League Cricket (@MLCricket) July 21, 2023 A disappointing season for LAKR, but one man has shined bright ✨ throughout. Andre Russell picks up today's Player of the Match for his 7️⃣0️⃣* (3️⃣7️⃣)#MLC2023 pic.twitter.com/BU3ZCxbfdh — Major League Cricket (@MLCricket) July 21, 2023 చదవండి: దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు! Indian Football Team: ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు -
మాథ్యూ వేడ్ వీరవిహారం.. రసెల్, నరైన్ మెరుపులు వృధా
మేజర్ లీగ్ క్రికెట్-2023 సీజన్లో భాగంగా లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్లో శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యునికార్న్స్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ మాథ్యూ వేడ్ (41 బంతుల్లో 78; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) బౌండరీలు, సిక్సర్లతో వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ 2 సిక్సర్లు, బౌండరీతో 20 పరుగులు, స్టోయినిస్ 37 (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కోరె ఆండర్సన్ 39 పరుగులు (20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశారు. కెప్టెన్ ఫించ్ 12 పరుగులతో (10 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నైట్రైడర్స్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లు పడగొట్టగా.. అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్రైడర్స్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. ఆరంభంలో జేసన్ రాయ్ (21 బంతుల్లో 45; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), నితీశ్ కుమార్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్).. ఆఖర్లో ఆండ్రీ రసెల్ (26 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 28 నాటౌట్; 3 సిక్సర్లు) రాణించినప్పటికీ నైట్రైడర్స్ విజయతీరాలకు చేరలేకపోయింది. నైట్ రైడర్స్ ఇన్నింగ్స్లో రిలీ రొస్సో (8) నిరాశపరిచాడు. యునికార్న్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్, బిష్ణోయ్, ఆండర్సన్ తలో వికెట్ చేజిక్కించుకున్నారు. ఈ ఓటమితో నైట్రైడర్స్ లీగ్లో హ్యాట్రిక్ ఓటములను నమోదు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ అనుబంధ ఫ్రాంచైజీ అయిన లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్ మేజర్ లీగ్ క్రికెట్ సీజన్ 2023లో ఇంకా బోణీ కొట్టాల్సి ఉంది. -
టీమిండియాతో టీ20 సిరీస్.. వెస్టిండీస్కు గుడ్ న్యూస్! విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ అండ్రీ రస్సెల్ గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. విండీస్ క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగానే రస్సెల్ జట్టుకు దూరంగా ఉంటున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. రస్సెల్ చివరగా యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2021లో విండీస్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి కరేబియన్ జట్టుకు కూడా కేవలం ఫ్రాంచైజీ లీగ్ల్లోనే ఆడుతూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం రస్సెల్ తన నిర్ణయం మార్చుకున్నాడు. మళ్లీ వెస్టిండీస్ జెర్సీని ధరించాలని అనుకుంటున్నట్లు రస్సెల్ తాజాగా ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటుంది. వన్డే ప్రపంచకప్-2023 క్వాలిఫయర్స్లో నెదర్లాండ్, స్కాట్లాండ్ వంటి పసికూనల చేతిలో ఓటమి పాలైన విండీస్.. భారత్ వేదికగా జరగనున్న ప్రాధాన టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ఈ క్రమంలో రస్సెల్ వంటి ఆటగాళ్లు సేవలు కచ్చితంగా విండీస్ అవసరం. "నేను ఇకపై విండీస్ క్రికెట్కు అందుబాటులో ఉండనున్నాను. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్లో భాగం కావడమే నా లక్ష్యం. జట్టులోకి తిరిగి రావడానికి అన్ని విధాల సిద్దంగా ఉన్నాను. ప్రపంచకప్కు కంటే ముందు వైట్బాల్ సిరీస్లలో కూడా ఆడాలి అనుకుంటున్నాను. త్వరలో టీమిండియాతో జరగనున్న సిరీస్కు నాకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నాను. అయితే విండీస్ తరపున నేను ఆడాలంటే రెండు ఫాంచైజీ లీగ్లకు దూరం కావాలి. నేను అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రపంచకప్ వంటి ఈవెంట్లో అద్భుతంగా రాణించి నా జట్టుకు మరో టైటిల్ను అందించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తాను. నేను మా వైట్ బాల్ కోచ్ డారెన్ సామీతో టచ్లో ఉన్నాను. అతడు కూడా నా పట్ల పాజిటివ్ మైండ్తో ఉన్నాడని" జమైకా అబ్జర్వర్తో రస్సెల్ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో విండీస్ తలపడనుంది. ట్రినిడాడ్ వేదికగా ఆగస్టు 3 నుంచి జరగనున్న తొలి మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో రస్సెల్ విండీస్ తరపున రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. చదవండి: #Ishan Kishan: ఇషాన్ కిషన్ గర్ల్ఫ్రెండ్ను చూశారా? ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా? ఎంత అందంగా ఉందో -
మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. రసెల్ పోరాటం వృధా.. బోణీ కొట్టిన సూపర్ కింగ్స్
అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) తొలి సీజన్ నిన్నటి (జులై 13) నుంచి ప్రారంభమైంది. సీజన్ ఆరంభ మ్యాచ్లో టెక్సాస్ సూపర్ కింగ్స్.. లాస్ ఏంజెలెస్ నైట్ రైడర్స్పై విజయఢంకా మోగించింది. భారతకాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ప్రారంభమైన మ్యాచ్లో సూపర్ కింగ్స్ 69 పరుగుల తేడాతో గెలుపొంది, ఎంఎల్సీ-2023లో బోణీ విజయం దక్కించుకుంది. మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్.. కాన్వే సూపర్ ఫిఫ్టి.. బ్రేవో మెరుపులు ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. కాన్వే (37 బంతుల్లో 55; 7 ఫోర్లు, సిక్స్), డేవిడ్ మిల్లర్ (42 బంతుల్లో 61; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఆఖర్లో మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21; 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తానెదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. నైట్రైడర్స్ బౌలరల్లో అలీ ఖాన్, లోకీ ఫెర్గూసన్ తలో 2 వికెట్లు.. సునీల్ నరైన్, ఆడమ్ జంపా చెరో వికెట్ దక్కించుకున్నారు. రసెల్ పోరాటం వృధా.. 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. సూపర్ కింగ్స్ బౌలర్ల ధాటికి 14 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సూపర్ కింగ్స్ స్పిన్నర్ మొహమ్మద్ మొహిసిన్ (4/8) నైట్రైడర్స్ పతనాన్ని శాశించగా.. గెరాల్డ్ కొయెట్జీ, రస్టీ థెరన్ తలో 2 వికెట్లు, కాల్విన్ సావేజ్, డ్వేన్ బ్రేవో చెరో వికెట్ పడగొట్టారు. నైట్రైడర్స్ ఇన్నింగ్స్లో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కడుతుంటే విండీస్ విధ్వంసర వీరుడు ఆండ్రీ రసెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. జస్కరన్ మల్హోత్రా (22), సునీల్ నరైన్ (15) రెండంకెల స్కోర్లు చేయగా.. మిగతావారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్తిల్ (0), ఉన్ముక్త్ చంద్ (4), రిలీ రొస్సో (4), జంపా (3), ఫెర్గూసన్ (1) నిరాశపరిచారు. కాగా, ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే ఎంఎల్సీ జట్లను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. టెక్సాస్ సూపర్ కింగ్స్ను, కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యం.. లాస్ ఏంజెలెస్ నైట్రైడర్స్ను సొంతం చేసుకున్నాయి. లీగ్లో భాగంగా రేపు (భారతకాలమానం ప్రకారం) సీటిల్ ఓర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడం జట్లు.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ జట్లు తలపడతాయి. -
'రింకూ లాంటి ఫినిషర్ ఉండగా.. టెన్షన్ ఎందుకు దండగ'
ఐపీఎల్ 16వ సీజన్లో సోమవారం కేకేఆర్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మరో థ్రిల్లర్ను తలపించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో కేకేఆర్ ఆఖరి బంతికి విజయాన్ని అందుకొని ప్లేఆఫ్ చాన్స్ను మరింత పటిష్టం చేసుకుంది. అయితే కేకేఆర్ గెలుపులో ముఖ్య పాత్ర ఆండ్రీ రసెల్. కానీ ఆఖరి ఓవర్ ఐదో బంతికి రసెల్ రనౌట్ అవ్వడం కేకేఆర్కు బిగ్షాక్. కానీ చివరి బంతిని రింకూ సింగ్ బౌండరీ బాది జట్టును గెలిపించాడు. అయితే రసెల్ తాను రనౌట్ అవ్వడంపై బాధపడలేదంట. కేకేఆర్విజయంపై కాన్ఫిడెంట్గా ఉన్నట్లు మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. అందుకు కారణం క్రీజులో ఉన్నది రింకూ సింగ్ అని పేర్కొన్నాడు. ''రింకూ సింగ్ స్థానంలో ఏ బ్యాటర్ ఉన్నా నేను చాన్స్ ఇచ్చేవాడిని కాదు.. కానీ రింకూపై నాకున్న నమ్మకం.. నేను రనౌట్ అయినప్పటికి పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే రింకూ మ్యాచ్ను గెలిపిస్తాడని అప్పటికే ఊహించా. విన్నింగ్ షాట్ కొట్టే చాన్స్ అతనికే రావాలని అనుకున్నా. ఈ సీజన్లో రింకూ సింగ్ లాంటి ఫినిషర్ ఉండగా కేకేఆర్ భయపడనసరం లేదు. ఆఖరి ఓవర్కు ముందు రింకూ నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ''ఒకవేళ బంతి నీకు పడితే పరుగు తీసేందుకు సిద్ధంగా ఉంటావా'' అని అడిగాడు. దానికి ''నేను కచ్చితంగా'' అని సమాధానం ఇచ్చాను. వాస్తవానికి నేను మ్యాచ్ను ఫినిష్ చేద్దామనుకున్నా. కానీ రింకూ లాంటి ఫినిషర్ ఉన్నప్పుడు అతనికే చాన్స్ ఇవ్వాలి. రనౌట్ అయిన ఒక్క క్షణం బాధపడ్డా.. నమ్మకం ఉన్నా ఆఖరి బంతికి రింకూ సింగ్ ఏం చేస్తాడోనని టెన్షన్కు లోనయ్యా. కానీ నా నమ్మకాన్ని రింకూ నిలబెట్టాడు'' అని నవ్వుతూ పేర్కొన్నాడు. చదవండి: అతడు అద్బుతంగా రాణిస్తున్నాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా! Happiness is mutual, 𝙍𝙪𝙨𝙨𝙚𝙡𝙡 𝙙𝙖 🤗#KKRvPBKS | #AmiKKR | #TATAIPL | @Russell12A pic.twitter.com/bqflnzcw7e— KolkataKnightRiders (@KKRiders) May 9, 2023 Just Rinku doing Rinku things & his happy captain interviewing the best finisher in the side 💜🤗 Presenting Rana & Rinku from the Eden Gardens as they sum up @KKRiders' riveting chase 🔥🔥 - By @28anand Full Interview 🎥🔽 #TATAIPL | #KKRvPBKS https://t.co/hsTzGeCY4b pic.twitter.com/c304XQnylR — IndianPremierLeague (@IPL) May 9, 2023 -
PBKS VS KKR: మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్
ఐపీఎల్ 2023లో మరో మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. పంజాబ్ కింగ్స్తో నిన్న (మే 8) జరిగిన మ్యాచ్లో కేకేఆర్ చివరి బంతికి విజయం సాధించి, ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ సీజన్లో ఆఖరి బంతివరకు సాగిన మ్యాచ్ల్లో (6) ఇది వరుసగా రెండవది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. కెప్టెన్ శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు,సిక్స్), ఆఖర్లో షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ (8 బంతుల్లో 12), లివింగ్స్టోన్ (9 బంతుల్లో 15), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21), రిషి ధవన్ (11 బంతుల్లో 19), హర్ప్రీత్ బ్రార్ (9 బంతుల్లో 17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. భానుక రాజపక్ష (0), సామ్ కర్రన్ (9 బంతుల్లో 4) విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, హర్షిత్ రాణా 2, సుయాశ్ శర్మ, నితీశ్ రాణా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు), నితీశ్ రాణా (38 బంతుల్లో 51; ఫోర్, సిక్స్), ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ 10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రహ్మానుల్లా గుర్భాజ్ (15), వెంకటేశ్ అయ్యర్ (11) రెండంకెల స్కోర్ చేశారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, నాథన్ ఇల్లిస్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు. మొన్న ఫిలిప్స్.. నిన్న రసెల్. ఛేదనలో కేకేఆర్ ఆరంభంలో దూకుడుగానే ఆడినప్పటికీ మధ్యలో స్కోర్ కాస్త నెమ్మదించడంతో మ్యాచ్ ఆఖరి బంతి వరకు సాగింది. మొన్న రాజస్థాన్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్లు ఏ పాత్ర అయితే పోషించారో.. నిన్నటి మ్యాచ్లో కేకేఆర్ ప్లేయర్స్ రసెల్, రింకూ సింగ్ కూడా అదే పాత్ర పోషించారు. క్లిష్ట సమయంలో ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ (7 బంతుల్లో 25; ఫోర్, 3 సిక్సర్లు) ఆడి గెలుపుపై ఆశలు లేని ఎస్ఆర్హెచ్ను గేమ్లోకి తేగా.. ఆఖరి బంతికి అబ్దుల్ సమద్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) సిక్సర్ బాది గెలిపించాడు. ఇంచుమించు అలాగే పంజాబ్తో మ్యాచ్లో రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్తో కేకేఆర్ను గెలుపు ట్రాక్లో పెడితే, రింకూ సింగ్ ఆఖరి బంతికి బౌండరీ బాది మ్యాచ్ను లాంఛనంగా ముగించాడు. రాజస్థాన్తో మ్యాచ్లో ఫిలిప్స్ తరహాలోనే నిన్నటి మ్యాచ్లో రసెల్ కూడా 19వ ఓవర్లో శివాలెత్తిపోయాడు. ఆ మ్యాచ్లో ఫిలిప్స్.. కుల్దీప్ బౌలింగ్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదితే.. నిన్నటి మ్యాచ్లో సామ్ కర్రన్ బౌలింగ్లో రసెల్ 3 సిక్సర్లతో విరుచుకుపడి, మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఫిలిప్స్, రసెల్ సుడిగాలి ఇన్నింగ్స్లు ఆడకపోయుంటే రెండు మ్యాచ్ల్లో ప్రత్యర్ధులు గెలిచేవారు. అలాగే సన్రైజర్స్, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించేవి. చదవండి: ఐపీఎల్లో ధావన్ అరుదైన రికార్డు.. కోహ్లి, వార్నర్ సరసన -
IPL 2023: రసెల్ ధమాకా...
కోల్కతా: ఆండ్రీ రసెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అడుగంటిన కోల్కతా ఆశలకు సిక్సర్లతో జీవం పోశాడు. మళ్లీ ఆఖరి ఓవర్ డ్రామా కనిపించినా... నైట్రైడర్స్ 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ధావన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి గెలిచింది. నితీశ్ రాణా (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. ధావన్ ఫిఫ్టీతో... కోల్కతా పవర్ప్లేలోనే ఓపెనర్ ప్రభ్సిమ్రన్ (12), రాజపక్స (0) వికెట్లను కోల్పోయింది. వీరిద్దరిని హర్షిత్ రాణా పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో మిగతా జట్టు సభ్యుల నుంచి సహకారం కరువైనా... శిఖర్ ధావన్ జట్టును నడిపించాడు. లివింగ్స్టోన్ (9 బంతుల్లో 15; 3 ఫోర్లు), జితేశ్ శర్మ (18 బంతుల్లో 21; 2 సిక్సర్లు) తక్కువే చేసినా... ధావన్ (41 బంతుల్లో) ఫిఫ్టీతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. జితేశ్, ధావన్ నాలుగో వికెట్కు 53 పరుగులు జోడించారు. పరుగుల వేగం పెరగాల్సిన దశలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్కు పంజాబ్ డీలా పడింది. 106/3 స్కోరు వద్ద పటిష్టంగా కనిపించిన జట్టు స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయింది. స్యామ్ కరన్ (4), రిషి ధావన్ (11 బంతుల్లో 19; 3 ఫోర్లు, 1 సిక్స్) పెద్దగా ఆకట్టుకోలేదు. ఇలాంటిస్థితిలో షారుఖ్ (8 బంతుల్లో 21 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్స్), హర్ప్రీత్ బ్రార్ ( 9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటితో ఆఖరి 16 బంతుల్లో 40 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ ఇన్నింగ్స్... జేసన్ రాయ్ (24 బంతుల్లో 38; 8 ఫోర్లు) బౌండరీలతో కోల్కతా ఇన్నింగ్స్ వేగంగా సాగింది. అయితే గుర్బాజ్ (12 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్) వికెట్ పారేసుకోగా... కోల్కతా ఇన్నింగ్స్ కూడా కెప్టెన్ నితీశ్ రాణా అర్ధసెంచరీతోనే నడించింది. రాయ్ దూకుడుకు హర్ప్రీత్ బ్రేకులేయగా, నితీశ్... వెంకటేశ్ (11)తో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటింది. మధ్యలో పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్తో పరుగుల వేగం తగ్గింది. 16వ ఓవర్లో రాణా అవుటయ్యాక ఒత్తిడి పెరిగింది. 12 బంతుల్లో 26 పరుగుల సమీకరణం ఇరు జట్లకూ అవకాశమిచ్చింది. కానీ స్యామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో రసెల్ 3 భారీ సిక్సర్లతో 20 పరుగులొచ్చాయి. దీంతో 6 బంతుల్లో 6 పరుగుల సమీకరణం కోల్కతావైపే మొగ్గింది. అయితే 2 పరుగుల దూరంలో ఐదో బంతికి రసెల్ రనౌట్ కావడంతో కాస్త ఉత్కంఠ రేకెత్తించినా... అర్‡్ష దీప్ వేసిన చివరి బంతిని రింకూ సింగ్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) బౌండరీకి తరలించి గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రాన్ (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 12; ధావన్ (సి) వైభవ్ (బి) నితీశ్ రాణా 57; రాజపక్స (సి) గుర్బాజ్ (బి) హర్షిత్ 0; లివింగ్స్టోన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 15; జితేశ్ (సి) గుర్బాజ్ (బి) వరుణ్ 21; స్యామ్ కరన్ (సి) గుర్బాజ్ (బి) సుయశ్ 4; రిషి ధావన్ (బి) వరుణ్ 19; షారుఖ్ (నాటౌట్) 21; హర్ప్రీత్ బ్రార్ (నాటౌట్) 17; ఎక్స్ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 179. వికెట్ల పతనం: 1–21, 2–29, 3–53, 4–106, 5–119, 6–139, 7–139. బౌలింగ్: వైభవ్ 3–0–32–0, హర్షిత్ 3–0–33–2, రసెల్ 1–0–19–0, వరుణ్ 4–0–26–3, సుయశ్ 4–0–26–1, నరైన్ 4–0–29–0, నితీశ్ రాణా 1–0–7–1. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) షారుఖ్ (బి) హర్ప్రీత్ 38; గుర్బాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 15; నితీశ్ రాణా (సి) లివింగ్స్టోన్ (బి) చహర్ 51; వెంకటేశ్ (సి) లివింగ్స్టోన్ (బి) చహర్ 11; రసెల్ (రనౌట్) 42; రింకూ సింగ్ (నాటౌట్) 21; శార్దుల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–38, 2–64, 3–115, 4–124, 5–178. బౌలింగ్: రిషి ధావన్ 2–0–15–0, అర్‡్షదీప్ సింగ్ 4–0–39–0, ఎలిస్ 4–0–29–1, స్యామ్ కరన్ 3–0–44–0, లివింగ్స్టోన్ 2–0–27–0, హర్ప్రీత్ 1–0–4–1, రాహుల్ చహర్ 4–0–23–2. -
ఉత్తమ కెప్టెన్గా రోహిత్.. కోహ్లి, బుమ్రాలకు అవార్డులు, ధోనికి మొండిచెయ్యి
తొట్ట తొలి ఐపీఎల్ వేలం (2008 ఫిబ్రవరి 20) జరిగి 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ సంస్థ.. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో భాగస్వామ్యంలో ఐపీఎల్ ఇన్క్రెడిబుల్ అవార్డులను అనౌన్స్ చేసింది. మొత్తం ఆరు విభాగాల్లో విజేతలను ప్రకటించిన స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో.. ఐపీఎల్ చరిత్రలో ఉత్తమ కెప్టెన్గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను ఎంపిక చేసింది. రోహిత్ 2013-22 మధ్యలో ముంబై ఇండియన్స్ను 5 సార్లు ఛాంపియన్గా నిలిపినందున అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు స్టార్ స్పోర్ట్స్-ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో సంయుక్త ప్రకటన చేశాయి. కెప్టెన్గా రోహిత్ 143 మ్యాచ్ల్లో 56.64 విన్నింగ్ పర్సంటేజ్తో 79 సార్లు ముంబై ఇండియన్స్ను విజేతగా నిలిపాడు. ఈ విభాగంలో గౌతమ్ గంభీర్, ఎంఎస్ ధోని, లేట్ షేన్ వార్న్ నామినేట్ అయినప్పటికీ హిట్మ్యాన్నే అవార్డు వరించింది. ఉత్తమ బ్యాటర్ కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేశ్ రైనా నామినేట్ కాగా.. ఏబీడీని అవార్డు వరించింది. మిప్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్.. 2008-21 మధ్యకాలంలో 184 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 39.71 సగటున 5162 పరుగులు చేశాడు. ఏబీడీ.. 2016 సీజన్లో ఆర్సీబీ తరఫున 168.97 స్ట్రయిక్ రేట్తో 687 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఓ సీజన్లో ఉత్తమ బ్యాటింగ్ కేటగిరిలో విరాట్ కోహ్లి, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ పోటీ పడగా.. కోహ్లి విజేతగా నిలిచాడు. కోహ్లి.. 2016 సీజన్లో ఆస్సీబీ తరఫున 152.03 స్ట్రయిక్ రేట్తో 973 పరుగులు సాధించాడు. ఐపీఎల్ మొత్తంలో ప్రభావవంతమైన క్రికెటర్ కేటగిరిలో సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, షేన్ వాట్సన్, రషీద్ ఖాన్ నామినేట్ కాగా.. ఈ అవార్డు ఆండ్రీ రసెల్ను వరించింది. ఉత్తమ బౌలర్ కేటగిరిలో రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్ నామినేట్ కాగా.. బుమ్రా విజేతగా నిలిచాడు. ఐపీఎల్ సీజన్లో ఉత్తమ ప్రదర్శన కేటగిరి విషయానికొస్తే.. ఈ విభాగంలో సునీల్ నరైన్ (2012), రషీద్ ఖాన్ (2018), జోఫ్రా ఆర్చర్ (2020), యుజ్వేంద్ర చహల్ (2022) నామినేట్ కాగా.. చహల్ను ఈ అవార్డు వరించింది. -
హ్యాట్రిక్ వృధా.. అర డజన్ సిక్సర్లు కొట్టి గెలిపించిన రసెల్
బిగ్బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా మెల్బోర్న్ రెనగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్లు ఇవాళ (డిసెంబర్ 21) తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. టామ్ రోజర్స్ (4/23), అకీల్ హొసేన్ (3/26) ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/18) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్లో మ్యాట్ రెన్షా (29), సామ్ బిల్లింగ్స్ (25), పీయర్సన్ (45) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం 139 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ టీమ్ను ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నెసర్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి (4/32) భయపెట్టాడు. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టిన నెసర్.. అదే ఓవర్ ఆఖరి బంతికి మరో వికెట్ను, ఆతర్వాత మూడో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. నెసర్ ధాటికి మెల్బోర్న్ 2.2 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. Just admiring this shot 😍 pic.twitter.com/G6ljSi7q2J — Melbourne Renegades (@RenegadesBBL) December 21, 2022 అయితే ఆరో స్థానంలో బరిలోకి దిగిన విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఆరోన్ ఫించ్ (43 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), అకీల్ హొసేన్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అర డజన్ సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్ ప్రత్యర్ధి చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకుని మెల్బోర్న్ రెనెగేడ్స్ను 4 వికెట్ల తేడాతో గెలిపించాడు. రసెల్ మెరుపు ఇన్నింగ్స్ హవాలో నెసర్ హ్యాట్రిక్ వృధా అయిపోయింది. బ్రిస్బేన్ బౌలర్లలో నెసర్తో పాటు మార్క్ స్టీకీట్ (2/23) వికెట్లు దక్కించుకున్నాడు. జేమ్స్ బాజ్లే బౌలింగ్లో రసెల్ కొట్టిన 103 మీటర్ల సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. కాగా, బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ రెనగేడ్స్ జట్టు 1400 రోజుల తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో గెలుపొందడం విశేషం. -
'నీకేం పోయే కాలం'.. రసెల్పై అభిమానుల ఆగ్రహం
వెస్టిండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంటిపై దుస్తులు లేకుండా ఫోటో దిగిన రసెల్ దానిని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఆగ్రహాం తెప్పించింది. ప్రైవేట్ లీగ్స్ మోజులో పడి దేశానికి ఆడడం మానేసిన రసెల్పై.. ''నీకేం పోయే కాలం.. ఈ సోకులకేం తక్కువ లేదు.. ఇలాంటి వాటిలో కాదు ఆటలో చూపించు నీ ప్రతాపం'' అంటూ మండిపడ్డారు. కాగా భారత అభిమానులు మాత్రం రసెల్ను దారుణంగా ట్రోల్ చేశారు. రసెల్ దిగిన న్యూడ్ ఫోటోనూ చాలామంది రణ్వీర్ సింగ్ ఫోటోతో పోలుస్తున్నారు కొన్ని నెలల క్రితం బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ ఒక మ్యాగ్జైన్ కోసం ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోటోషూడ్ ఇచ్చాడు. అప్పట్లో రణ్వీర్ ఫోటోషూట్పై పెద్ద వివాదామే నడిచింది. తాజాగా రసెల్ను కూడా రణ్వీర్తో పోలుస్తూ కామెంట్స్ చేశారు. ఇక రసెల్ విండీస్ తరపున ఆడి చాలా కాలమైపోయింది. విండీస్ క్రికెట్ బోర్డు సీఈవోతో గొడవ రసెల్ను జాతీయ జట్టుకు దూరం చేసింది. గతేడాది టి20 ప్రపంచకప్లో చివరి మ్యాచ్ ఆడిన రసెల్ మళ్లీ జాతీయ జట్టు గడప తొక్కలేదు. ఇక ఈ ఏడాది టి20 ప్రపంచకప్లో వెస్టిండీస్ ఘోర ప్రదర్శన కనబరిచింది. కనీసం క్వాలిఫయర్ దశ కూడా దాటలేయపోయిన విండీస్ అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఇక రసెల్ విండీస్ తరపున 56 వన్డేలు, 67 టి20మ్యాచ్లు ఆడాడు. ఇక ఇటీవలే ఐపీఎల్లో కేకేఆర్ ఆండ్రీ రసెల్ను రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 మినీవేలంకు ముందు కేకేఆర్ 11 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. అదే విధంగా 16 మందిని వేలంలోకి విడిచిపెట్టింది. ప్రస్తుతం కోల్కతా పర్స్లో రూ. 7.5 కోట్లు ఉన్నాయి. కేకేఆర్ రిటైన్ లిస్ట్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రింకూ సింగ్ కేకేఆర్ రిలీజ్ లిస్ట్: పాట్ కమిన్స్, సామ్ బిల్లింగ్స్, అమన్ ఖాన్, శివమ్ మావి, మహ్మద్ నబీ, చమికా కరుణరత్నే, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, అభిజీత్ తోమర్, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్, ప్రథమ్ సింగ్, రమేష్ కుమార్, రసిఖ్ సలామ్, షెల్డన్ జాక్సన్ pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 pic.twitter.com/TXsXnEC0Zy — Out Of Context Cricket (@GemsOfCricket) November 18, 2022 wtf?! 😭😭😭 — fahad. (@abeeyaaar) November 18, 2022 చదవండి: సెలెక్టర్ల కథ ముగించారు.. రోహిత్ శర్మను ఎప్పుడు? -
T20 WC 2022: అందుకే రసెల్ను ఎంపిక చేయలేదు: విండీస్ చీఫ్ సెలక్టర్
T20 World Cup 2022 - West Indies Squad: టీ20 ప్రపంచకప్-2022 జట్టులో ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్కు చోటు దక్కకపోవడంపై వెస్టిండీస్ చీఫ్ సెలక్టర్ డెస్మాండ్ హేన్స్ స్పందించాడు. పొట్టి ఫార్మాట్లో రసెల్ ప్రదర్శన గొప్పగా లేదని.. అందుకే అతడిని పక్కనపెట్టినట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్కప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విండీస్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. ఇందులో రసెల్కు చోటు దక్కలేదు. వెటరన్ పవర్ హిట్టర్ ఎవిన్ లూయిస్ మాత్రం చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు. అందుకే అతడిని సెలక్ట్ చేయలేదు! ఈ నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ డెస్మాండ్ హైన్స్ మాట్లాడుతూ.. రసెల్ను పక్కనపెట్టడానికి గల కారణాలు వెల్లడించాడు. ‘‘ఈ ఏడాది ఆరంభంలో మేము ఆండ్రీ రసెల్తో సమావేశమయ్యాం. అతడి ఆట తీరు బాగా లేదు. గత కొన్నాళ్లుగా చూస్తున్నాం. రసెల్ ప్రదర్శనతో మేము సంతృప్తి చెందలేదు. కాబట్టి రసెల్ను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నాం. అతడి స్థానంలో ఫామ్లో ఉన్న ఆటగాడిని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో బాగా ఆడుతున్న క్రికెటర్ను ఎంపిక చేయాలని భావించాం’’ అని డెస్మాండ్ పేర్కొన్నాడు. అలాంటి వాళ్లకు అవకాశం! ఇక ఎవిన్ లూయిస్ గురించి చెబుతూ.. ‘‘విండీస్ అత్యుత్తమ వన్డే క్రికెటర్ ఎవిన్ లూయిస్ వంటి ఆటగాడి అవసరం జట్టుకు ఉంది. జట్టు కోసం తాను కష్టపడతానని అతడు మాతో చెప్పాడు. అందుకే ఒక అవకాశం ఇవ్వాలని భావించాం. అతడు మాతో మాట్లాడిన తీరు.. జట్టులో తన అవసరం ఏమిటో వివరించిన విధానం నచ్చింది.. ఇలా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించే ఆటగాళ్లకు తప్పక అవకాశం ఇస్తాం’’ అని డెస్మాండ్ పేర్కొన్నాడు. కాగా గతేడాది టీ20 వరల్డ్కప్ తర్వాత రసెల్ ఇంత వరకు విండీస్ తరఫున ఆడలేదు. రసెల్ విఫలం! ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022లో ట్రింబాగో నైట్ రైడర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రసెల్.. తన స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతున్నాడు. సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమవుతున్నాడు. చెప్పుకోదగ్గ స్థాయిలో వికెట్లు కూడా పడగొట్టలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే.. విండీస్ క్రికెట్ హెడ్కోచ్ ఫిల్ సిమ్మన్స్.. డబ్బుపై మోజుతో కొందరు కేవలం ప్రైవేట్ లీగ్లలోనే ఎక్కువగా ఆడుతున్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన రసెల్.. కొంతమంది తనను కావాలనే బలిపశువును చేయాలని చూస్తున్నారని పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు చీఫ్ సెలక్టర్ సైతం రసెల్ను ఉద్దేశించి అతడి ప్రదర్శన బాగా లేదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా విండీస్ జట్టు టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12కు క్వాలిఫై కాలేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాలిఫైయింగ్ దశలో స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్లతో నికోలస్ పూరన్ బృందం తలపడాల్సి ఉంది. చదవండి: T20 WC 2022: ‘ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు’! ప్రారంభానికి ముందే టి20 ప్రపంచకప్ 2022 కొత్త చరిత్ర -
విధ్వంసం సృష్టించిన రస్సెల్.. ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు! వీడియో వైరల్
వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కరిబీయన్ దేశీవాళీ టోర్నీ 'సిక్స్టీ' టీ10 లీగ్లో ట్రిన్బాగో నైట్ రైడర్స్కు రస్సెల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్లోభాగంగా శనివారం సెయింట్ కిట్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్లు వార్నర్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో రస్సెల్ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. రస్సెల్ కేవలం 24 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్లతో 72 పరుగులు సాధించాడు. కాగా ఇదే మ్యాచ్లో రస్సెల్ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు బాది సునామీ సృష్టించాడు. ఈ టోర్నీ రూల్స్ ప్రకారం.. ఏ బ్యాటర్ అయితే ఓవర్ ఆఖరి బంతికి స్ట్రైక్లో ఉంటాడో తరువాతి ఓవర్ తొలి బంతిని ఆ బ్యాటరే ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన డొమానిక్ డ్రేక్స్ బౌలింగ్లో అఖరి నాలుగు బంతులకు నాలుగు సిక్స్లు బాదిన రస్సెల్.. తర్వాతి ఓవర్ వేసిన జోన్-రస్ జగ్గేసర్ బౌలింగ్లో తొలి రెండు బంతులను రస్సెల్ సిక్సర్లగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రస్సెల్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా నైట్ రైడర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో సెయింట్ కిట్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగల్గింది. తద్వారా నైట్ రైడర్స్ చేతిలో సెయింట్ కిట్స్ మూడు పరుగుల తేడాతో పరాజాయం పాలైంది. చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్తో తొలి మ్యాచ్.. దినేష్ కార్తీక్కు నో ఛాన్స్! Andre Russell SIX SIXES off consecutive SIX balls in the SIXTY tournament. 8 SIXES and 5 FOURS.@TKRiders pic.twitter.com/jBKyzqwPOj — 𝗔𝗱𝗶𝘁𝘆𝗮⎊ (@StarkAditya_) August 28, 2022 -
'బలిపశువులా బస్సు కిందకు తోయాలనుకుంటున్నారు!'
వెస్టిండీస్ సీనియర్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్, విండీస్ క్రికెట్ హెడ్కోచ్ ఫిల్ సిమ్మన్స్ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంతమంది విండీస్ క్రికెటర్లు డబ్బుపై మోజుతో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే ప్రైవేట్ లీగ్ల్లోనే ఎక్కువగా ఆడుతున్నారంటూ ఫిల్ సిమ్మన్స్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ''ఇలా జరుగుతుందని ముందే ఊహించాను.. కానీ ఇప్పుడు సైలెంట్గా ఉండడమే బెటర్'' అని సిమ్మన్స్ వ్యాఖ్యలపై ఇన్స్టాగ్రామ్ వేదికగా రసెల్ ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. ఆ తర్వాత రసెల్ ఆ పోస్టును డిలీట్ చేశాడు. తాజాగా తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నట్లు రసెల్ మరోసారి కుండబద్దలు కొట్టాడు. ప్రస్తుతం ది హండ్రెడ్ టోర్నమెంట్లో పాల్గొంటున్న రసెల్ను.. బుధవారం విండీస్ మాజీ ఆల్రౌండర్ డారెన్ సామీ ఇంటర్య్వూ చేశాడు. ఈ సందర్భంగా రసెల్ మాట్లాడుతూ.. '' ఈ విషయంలో నిశబ్దంగా ఉండాలని అనుకుంటున్నా. ఇంతకముందు జరిగిన చర్చల్లో ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. అందుకే నన్ను చెడ్డవాడిగా సృష్టించి.. బలిపశువులా బస్సు కిందకు తోసేయాలని కొంతమంది కంకణం కట్టుకున్నారు. అందుకే నన్ను రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడో ఊహించాను కాబట్టే సైలెంట్గా ఉండదలచుకున్నా. అయితే విండీస్ జట్టు నుంచి దూరమవ్వాలని నేనెప్పుడు భావించలేదు. ఏ క్రికెటర్ అయినా సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కోరకుంటాడు. నాకు అవకాశం వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకున్నా. ఇప్పటికిప్పుడు విండీస్ జట్టుతో ఆడి రెండు ప్రపంచకప్లు గెలవాలని ఉంది. కానీ ఆ అవకాశం వస్తుందా అంటే చెప్పలేను. నిజాయితీగా చెప్పాలంటే.. ప్రైవేట్ లీగ్స్లో ఆడేటప్పుడే రెండు సెంచరీలు సాధించాను. కానీ అవి విండీస్ జట్టుకు చేస్తే బాగుండు అని చాలాసార్లు అనిపించింది. ఒకవేళ ఆ రెండు సెంచరీలు విండీస్ తరపున చేసి ఉంటే జట్టులో ప్రత్యేక స్థానం ఉండేది. అయితే కొన్ని షరతులు అంగీకరించలేకుండా ఉన్నాయి. అందుకే ప్రైవేట్ లీగ్స్ ఆడాల్సి వస్తోంది. ఇప్పుడు నా వయసు 34 సంవత్సరాలు. మహా అయితే మరో నాలుగేళ్లు క్రికెట్ ఆడుతానేమో. మాకు కుటుంబాలు ఉన్నాయి. వారి బాగోగులు చూసుకోవడానికి కెరీర్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అవకాశం వస్తే ఇప్పటికి విండీస్కు ప్రపంచకప్ అందించాలని భావిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆండ్రీ రసెల్ వెస్టిండీస్ తరపున 56 టి20ల్లో 1034 పరుగులు, 70 వికెట్లు.. 67 టి20ల్లో 741 పరుగులు, 39 వికెట్లు తీశాడు. ఇక తన చివరి వన్డేను విండీస్ తరపున 2019లో ఆడాడు. రసెల్ ఆఖరిసారిగా వెస్టిండీస్ తరపున టి20 ప్రపంచకప్ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. చదవండి: 'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్ కోచ్; రసెల్ స్ట్రాంగ్ కౌంటర్ Jonny Bairstow: కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మరోసారి నిరూపితం -
కేకేఆర్ ఫ్యామిలీలోకి ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రెండుసార్లు చాంపియన్గా నిలిచిన కేకేఆర్ యూఈఏ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20లో అబుదాబి నైట్రైడర్స్ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 14 మందితో కూడిన అబుదాబి నైట్రైడర్స్(ఏడీకేఆర్)జట్టును కేకేఆర్ యాజమాన్యం మంగళవారం తమ ట్విటర్లో ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్కు ఆడుతున్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్లు యూఏఈ టి20లీగ్లోనూ అబుదాబి నైట్రైడర్స్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరితో పాటు ఇంగ్లండ్ స్టార్ జానీ బెయిర్ స్టో, ఐర్లాండ్ విధ్వంసకర ఆటగాడు పాల్ స్టిర్లింగ్, లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారాలు ఉన్నారు.. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్లు కూడా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. ''క్రికెట్లో ప్రపంచవ్యాప్తంగా మా అడుగులు పడడం గొప్ప అచీవ్మెంట్ అన్ని చెప్పొచ్చు. ఐపీఎల్లో కేకేఆర్.. కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో టీకేఆర్.. తాజాగా ఐఎల్టి20లో ఏడీకేఆర్. కేకేఆర్ జట్టులో ఉన్న ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్లు ఏడీకేఆర్లో ఉండడం మాకు సానుకూలాంశం. ఇక కేకేఆర్ ఫ్యామిలీలోకి బెయిర్ స్టోకు స్వాగతం. ఐఎల్టి20లో ఏడీకేఆర్ తరపున బెయిర్ స్టో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాలని కోరుకుంటున్నాం. అలాగే లంక క్రికెటర్లు చరిత్ అసలంక, లాహిరు కుమారా.. ఐర్లాండ్ స్టార్ పాల్ స్టిర్లింగ్లకు కూడా గ్రాండ్ వెల్కమ్. కొలిన్ ఇంగ్రామ్, అకిల్ హొసేన్, రవి రాంపాల్ సహా ఇతర క్రికెటర్లకు కూడా స్వాగతం. ఐఎల్టి20 ద్వారా మేం గ్లోబల్ క్రికెట్లో విజయవంతమయ్యే ప్రయత్నంలో ఉన్నాం. ఆల్ ది బెస్ట్ అబుదాబి నైట్రైడర్స్ టీం(ఏడీకేఆర్)'' అంటూ ముగించాడు. యూఏఈ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు జరగనుంది. ఐఎల్టి 20 కోసం అబుదాబి నైట్ రైడర్స్ జట్టు: సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, జానీ బెయిర్స్టో, పాల్ స్టిర్లింగ్, లహిరు కుమార, చరిత్ అసలంక, కోలిన్ ఇంగ్రామ్, అకేల్ హోసేన్,రేమాన్ రీఫర్, ఎస్ ప్రసన్న, రవి రాంపాల్, కెన్నార్ లూయిస్,అలీ ఖాన్, బ్రాండన్ గ్లోవర్ Welcome to the family, Knights 💜 https://t.co/mFNyF7a94T — KolkataKnightRiders (@KKRiders) August 16, 2022 చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్పై కన్నేశారు -
'ఆడమని ఎవరిని అడుక్కోం'.. విండీస్ కోచ్; రసెల్ స్ట్రాంగ్ కౌంటర్
వెస్టిండీస్ క్రికెటర్లు తమ దేశానికంటే బయటి దేశాలు నిర్వహించే లీగ్స్లోనే ఎక్కువగా కనబడుతుంటారు. కారణం డబ్బు. విండీస్కు ఆడితే వచ్చే డబ్బుతో పోలిస్తే.. ప్రైవేట్ లీగ్స్లో ఆ డబ్బు రెండింతల కంటే ఎక్కువుంటుంది. అందుకే క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, కీరన్ పొలార్డ్ , ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ క్రికెట్ లీగ్స్ అందరికంటే ఎక్కువగా కనబడేది కరేబియన్ క్రికెటర్లే. మన ఐపీఎల్తోనూ వారికి విడదీయరాని బంధం ఉంది. డబ్బులు ఎక్కువొస్తాయంటే అవసరమైతే జాతీయ జట్టుకు ఆడే విషయాన్ని పక్కకుబెట్టడం విండీస్ ఆటగాళ్ల నైజం. అందుకే టి20 ఫార్మాట్లో రెండుసార్లు చాంపియన్ అయినప్పటికి ఆ జట్టులో ఎప్పుడు నిలకడ ఉండదు. ఈ మధ్య కాలంలో అది మరోసారి నిరూపితమైంది. ఇటీవలే భారత్తో జరిగిన టి20 సిరీస్లో 4-1 తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే విండీస్ జట్టు కోచ్ ఫిల్ సిమ్మన్స్ రెండు రోజుల క్రితం దేశానికంటే విదేశీ లీగ్స్కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్న కొందరు క్రికెటర్లపై వ్యంగ్యంగా స్పందించాడు. ''వెస్టిండీస్ కోసం కాస్త ఆడండయ్యా అంటూ మేము ప్లేయర్లను అడుక్కోవాలని అనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్లు ఆడుతున్న ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ తదితర స్టార్లు.. జాతీయ జట్టుకు ముఖం చాటేస్తున్నారు. అక్టోబర్లో జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ ప్లేయర్లను బరిలోకి దించడానికి బోర్డు తీవ్రంగా కష్టపడుతున్నప్పటికీ.. చాలా మంది క్రికెటర్లు డబ్బు కోసం ఫ్రాంచైజీ లీగ్కే మొగ్గు చూపుతున్నారు. ఇంకొంతమంది గాయాలతో జట్టుకు అందుబాటులో ఉండట్లేదంటూ అబద్దాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. దీంతో మాకు వేరే మార్గం లేకుండా పోయింది.. ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు. స్టార్ ప్లేయర్లు తన జాతీయ జట్టు కోసం ఆడాలని తాపత్రాయపడితే మార్పు వస్తుందని నమ్ముతున్నా. అందుకు తగ్గట్లు వాళ్లు కొన్ని లీగ్లను వదులుకుంటే తప్పితే మేము ఏం చేయలేని పరిస్థితి'' అని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా విండీస కోచ్ ఫిల్ సిమ్మన్స్ చేసిన వ్యాఖ్యలపై విండీస్ సీనియర్ ప్లేయర్ ఆండ్రీ రసెల్ కాస్త ఘూటుగానే స్పందించాడు. ఫిల్ సిమ్మన్స్ ఆర్టికల్ను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. ''ఇలాంటిది వస్తుందని నాకు ముందే తెలుసు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సైలెంట్గా ఉండడమే ఉత్తమం..'' అంటూ క్యాప్షన్ జత చేసి కోపంతో ఉన్న ఎమోజీలను షేర్ చేశాడు. రసెల్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రసెల్ వెస్టిండీస్ తరపున 67 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆఖరిసారిగా వెస్టిండీస్ తరపున టి20 ప్రపంచకప్ 2021లో పాల్గొన్నాడు. అయితే యూఏఈ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్లో వెస్టిండీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. రసెల్ మాత్రమే కాదు సునీల్ నరైన్ కూడా 2019 నుంచి జాతీయ జట్టుకు రెగ్యులర్గా అందుబాటులో ఉండడం లేదు. గాయాల సాకు చెప్పి డబ్బులు బాగా వచ్చే ఐపీఎల్, బిగ్బాష్ లీగ్, కరేబియన్ లీగ్ల్లో ఆడుతూ బిజీగా గడుపుతున్నారు. View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) చదవండి: MI Emirates: 'పొలార్డ్ నుంచి బౌల్ట్ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్పై కన్నేశారు Dwayne Bravo: 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్గా -
ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్ హిట్టర్.. వీడియో వైరల్!
IPL 2022- Andre Russell: ‘‘పెద్ద పెద్ద కలలు కనాలి! అయితే, కఠిన శ్రమతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే వాటిని నిజం చేసుకోగలం. ఆ దేవుడు మంచివాడు! అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను’’ అంటూ వెస్టిండీస్ హిట్టర్, కోల్కతా నైట్రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ తాను కారు కొన్న విషయాన్ని వెల్లడించాడు. తన పట్టుదల, కృషితో కలలను సాకారం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 నేపథ్యంలో కేకేఆర్ రసెల్ను 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్లో అతడు 12 ఇన్నింగ్స్లో 335 పరుగులు(అత్యధిక స్కోరు 70 నాటౌట్) చేసి ఆకట్టుకున్నాడు. ఇక 13 ఇన్నింగ్స్లో కలిపి 17 వికెట్లు పడగొట్టి తనకు వెచ్చించిన ధరకు న్యాయం చేశాడు ఈ ఆల్రౌండర్. ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ ముగింపు నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న రసెల్ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఏమ్జీ(Mercedes-Benz AMG) కారును కొన్నాడు. కారులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆనందం పంచుకున్నాడు. ఇందుకు స్పందించిన క్రిస్ గేల్, డారెన్ సమీ, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఈ ఆల్రౌండర్కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రసెల్ కొన్న ఈ స్టైలిష్ కారు విలువ సుమారు 2 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్-2021 తర్వాత జాతీయ జట్టుకు దూరమైన ఆండ్రీ రసెల్.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన విండీస్ జట్టులో లేకపోవడం గమనార్హం. చదవండి: Mohsin Khan: ‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్ ఆల్రౌండర్గా తీర్చిదిద్దుతా’ View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) -
IPL 2022: సన్రైజర్స్ ఢమాల్
పుణే: సీజన్ తొలి రెండు మ్యాచ్లలో ఓటమి...ఆ తర్వాత కోలుకొని చక్కటి ప్రదర్శనతో వరుసగా ఐదు విజయాలు...ఇక ప్లే ఆఫ్స్ దారి సులువే అనుకుంటున్న తరుణంలో మళ్లీ పరాజయాల బాట...విజయాలలాగే వరుసగా ఐదో ఓటమితో అవకాశాలు సంక్లిష్టం! ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇది. శనివారం జరిగిన కీలక పోరులో హైదరాబాద్ 54 పరుగుల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓడింది. తొలుత నైట్రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రసెల్ (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. తర్వాత సన్రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులకే పరిమితమైంది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (25 బంతుల్లో 32; 3 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. రసెల్ మెరుపులు... ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (7) త్వరగానే అవుటైనా... నితీశ్ రాణా (16 బంతుల్లో 26; 1 ఫోర్, 3 సిక్సర్లు), అజింక్య రహానే (24 బంతుల్లో 28; 3 సిక్సర్లు) కోల్కతా ఇన్నింగ్స్ను దారిలో పెట్టారు. దీంతో పవర్ప్లేలో జట్టు 55/1 స్కోరు చేసింది. అయితే తన తొలి ఓవర్లోనే నితీశ్, రహానేలను పెవిలియన్ చేర్చిన ఉమ్రాన్ తన తర్వాతి ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (15)ను అవుట్ చేశాడు. రింకూ సింగ్ (5) ఎల్బీగా నిష్క్రమించగా, బిల్లింగ్స్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) ఆటలో దూకుడు కనిపించలేదు. 19వ ఓవర్లో చక్కటి బౌలింగ్తో భువనేశ్వర్ 6 పరుగులే ఇచ్చినా... వాషింగ్టన్ సుందర్ వేసిన చివరి ఓవర్లో రసెల్ రెచ్చిపోయాడు. అతను 3 సిక్సర్లతో చెలరేగడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. పేలవ బ్యాటింగ్... ముందంజ వేసే అవకాశాలు మెరుగుపడాలంటే తప్పని సరిగా గెలవాల్సిన మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. అభిషేక్, మార్క్రమ్ మినహా అంతా విఫలమయ్యారు. చెత్త షాట్లతో రైజర్స్ ఆశల్ని ముంచేశారు. విలియమ్సన్ (9), రాహుల్ త్రిపాఠి (9)లతో పాటు మిడిలార్డర్లో పూరన్ (2), సుందర్ (4), శశాంక్ సింగ్ (11) ప్రభావం చూపలేకపోయారు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: వెంకటేశ్ (బి) జాన్సెన్ 7; రహానె (సి) శశాంక్ (బి) ఉమ్రాన్ 28; నితీశ్ (సి) శశాంక్ (బి) ఉమ్రాన్ 26; శ్రేయస్ (సి) త్రిపాఠి (బి) ఉమ్రాన్ 15; బిల్లింగ్స్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ 34; రింకూ సింగ్ (ఎల్బీ) (బి) నటరాజన్ 5; రసెల్ నాటౌట్ 49; నరైన్ 1; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–17, 2–65, 3–72, 4–83, 5–94, 6–157. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–1, జాన్సెన్ 4–0–30–1, నటరాజన్ 4–0–43–1, సుందర్ 4–0–40–0, ఉమ్రాన్ మలిక్ 4–0–33–3. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) బిల్లింగ్స్ (బి) వరుణ్ 43; విలియమ్సన్ (బి) రసెల్ 9; త్రిపాఠి (సి) అండ్ (బి) సౌతీ 9; మార్క్రమ్ (బి) ఉమేశ్ 32; పూరన్ (సి) అండ్ (బి) నరైన్ 2; సుందర్ (సి) వెంకటేశ్ (బి) రసెల్ 4; శశాంక్ (సి) శ్రేయస్ (బి) సౌతీ 11; జాన్సెన్ (సి) బిల్లింగ్స్ (బి) రసెల్ 1; భువనేశ్వర్ నాటౌట్ 6; ఉమ్రాన్ నాటౌట్ 3; ఎక్స్ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–30, 2–54, 3–72, 4–76, 5–99, 6–107, 7–113, 8–113. బౌలింగ్: ఉమేశ్ 4–0–19–1, సౌతీ 4–0–23–2, నరైన్ 4–0–34–1, రసెల్ 4–0–22–3, వరుణ్ 4–0–25–1. ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ X గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జెయింట్స్ X రాజస్తాన్ రాయల్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం..
ఐపీఎల్ 2022 సీజన్లో గతేడాది రన్నరప్ కోల్కతా నైట్ రైడర్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. కేకేఆర్ ప్రదర్శన గత ఐదు మ్యాచ్ల్లో మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు చివరిగా ఆడిన ఐదు మ్యాచ్ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ ఆవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుత సీజన్లో ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. A special message for the fans from Big Dre! 💜#AndreRussell • #KnightsInAction presented by @glancescreen | #KKRHaiTaiyaar #KKRvRR #IPL2022 pic.twitter.com/IaZheaz4th — KolkataKnightRiders (@KKRiders) May 2, 2022 ఈ నేపథ్యంలో ఇవాళ (మే 2) రాజస్థాన్ రాయల్స్తో జరుగబోయే కీలక మ్యాచ్కు ముందు కేకేఆర్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కేకేఆర్ స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ ఫ్యాన్స్కు సందేశమిచ్చాడు. ప్రస్తుత సీజన్లో తాము ఆడాల్సిన చివరి ఐదు మ్యాచ్లను ఐదు ఫైనల్స్గా భావిస్తామని, ఈ మ్యాచ్ల్లో తమ తడాఖా ఏంటో ప్రత్యర్ధులకు చూపిస్తామని శపథం చేశాడు. తాము ఫ్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాల ఇంకా సజీవంగానే ఉన్నాయని, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేందుకు చివరివరకు తమ పోరాటం సాగిస్తామని పేర్కొన్నాడు. క్లిష్ట సమయాల్లో తమను ఉత్సాహపరుస్తూ అండగా నిలిచిన అభిమానులకు రసెల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే.. వారు ఆడబోయే తదుపరి ఐదు మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సి ఉంది. శ్రేయస్ సేన తమ తర్వాతి మ్యాచ్ల్లో కఠినమైన ప్రత్యర్థులను ఢీకొట్టాల్సి ఉంది. ఇవాళ (మే 2) రాజస్థాన్ రాయల్స్, ఆతర్వాత పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్ (రెండు మ్యాచ్లు), సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లతో కేకేఆర్ తలపడాల్సి ఉంది. చదవండి: రాజస్థాన్పై కేకేఆర్ ప్రతీకారం తీర్చుకునేనా..? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..? -
రస్సెల్ భారీ సిక్సర్.. దెబ్బకు కుర్చీ బద్దలైంది..వీడియో వైరల్!
ఐపీఎల్-2022లో కోల్కతా నైట్ రైడర్స్ తమ తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం(ఏప్రిల్ 28) తలపడనుంది. ఈ క్రమంలో కేకేఆర్ విధ్వంసకర ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ నెట్స్తో తీవ్రంగా శ్రమిస్తోన్నాడు. అయితే రస్సెల్ నెట్స్లో తన పవర్ ఫుల్ బ్యాటింగ్తో కుర్చీను విరగ్గొట్టాడు. రస్సెల్ కొట్టిన భారీ షాట్కు కుర్చీ బద్దలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియాను కేకేఆర్ ఇనస్ట్రాగామ్లో షేర్ చేసింది. "రస్సెల్ విధ్వంసకర ఇన్నింగ్స్ కోసం వేచి ఉండండి" అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడిన రస్సెల్ 227 పరుగులు సాధించాడు. దీంట్లో 12 ఫోర్లు, 22 సిక్స్లు ఉన్నాయి. అదే విధంగా అతడు బౌలింగ్లో అద్భుతంగా రాణిస్తోన్నాడు. ఇప్పటి వరుకు 10 వికెట్లు పడగొట్టాడు.ఇక కేకేఆర్ విషయానికి వస్తే.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన కేకేఆర్.. కేవలం 3 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2022: ఈ ఏడాది ఎమర్జింగ్ ప్లేయర్ అతడే: టీమిండియా మాజీ క్రికెటర్ View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
KKR vs GT: రసెల్ చెలరేగినా... ఓటమి తప్పలేదు
ముంబై: బౌలింగ్లో వేసింది ఒకే ఓవర్.. అదీ ఇన్నింగ్స్లో చివరిది... చక్కటి నియంత్రణతో బౌలింగ్ చేస్తూ 5 పరుగులే ఇచ్చిన అతను ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు... బ్యాటింగ్లో 25 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు... ఆండ్రీ రసెల్ ఆల్రౌండ్ ప్రదర్శన ఇది! అయితే ఇది కూడా కోల్కతా నైట్రైడర్స్ను గెలిపించేందుకు సరిపోలేదు. శనివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 8 పరుగుల తేడాతో నైట్రైడర్స్పై విజయం సాధించింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (49 బంతుల్లో 67; 4 ఫోర్లు, 2 సిక్స్లు) వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. ఆండ్రీ రసెల్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కోల్కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులే చేయగలిగింది. ఆండ్రీ రసెల్ టాప్ స్కోరర్గా నిలవగా, రింకూ సింగ్ (28 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ (2/22) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో ఇది 35వ మ్యాచ్ కాగా...టాస్ గెలిచిన కెప్టెన్ తొలిసారి బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం. గత 34 మ్యాచ్లలో టాస్ గెలవగానే అన్ని జట్లు ఫీల్డింగ్నే తీసుకున్నాయి. గిల్ (7) మళ్లీ విఫలం కాగా, సాహా (25 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు. ఈ స్థితిలో కెప్టెన్ ఇన్నింగ్స్తోనే గుజరాత్ కోలుకుంది. 36 బంతుల్లో హార్దిక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మిల్లర్ (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్లు) అతనికి సహకరించాడు. అయితే 18 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయిన టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. చివరి ఓవర్ వేసిన రసెల్... అభినవ్ మనోహర్, ఫెర్గూసన్, తెవాటియా, యష్ దయాళ్ వికెట్లు తీశాడు. ఛేదనలో కోల్కతా పూర్తిగా తడబడింది. 6.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయిన జట్టు కోలుకోవడం కష్టంగా మారింది. బిల్లింగ్స్ (4), నరైన్ (5), రాణా (2), శ్రేయస్ (12) విఫలమయ్యారు. 47 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో క్రీజ్లోకి వచ్చిన రసెల్ వరుస సిక్సర్లతో చెలరేగి కోల్కతా విజయావకాశాలు పెంచాడు. అల్జారి చివరి ఓవర్లో 18 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతినే అతను సిక్సర్గా మలచడంతో కేకేఆర్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే తర్వాతి బంతికే మరో భారీ షాట్కు ప్రయత్నించి రసెల్ అవుటయ్యాడు. -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆండ్రీ రస్సెల్.. తొలి బౌలర్గా!
ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఓవర్ లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా రస్సెల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో అఖరి ఓవర్ వేసిన రస్సెల్.. 5 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్లో రస్సెల్ కేవలం ఒకే ఒక ఓవర్ మాత్రమే వేశాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనతను రస్సెల్ సాధించాడు. గతంలో కేకేఆర్ బౌలర్ లక్ష్మీ రతన్ శుక్లా కేవలం ఐదు బంతులు మాత్రమే వేసి మూడు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 2019లో రాజస్తాన్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ ఒక ఓవర్ వేసి మూడు వికెట్లు సాధించాడు. చదవండి: IPL 2022: నో బాల్ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ ఎమన్నాడంటే..? Brilliant catch by Rinku Singh in his first match. Andre Russell at his best! pic.twitter.com/Xp0n3aIg7v — Vaishnavi Sawant (@VaishnaviS45) April 23, 2022 -
'రసెల్తో బ్యాటింగ్ అంటే నాకు ప్రాణ సంకటం'
కేకేఆర్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ శుక్రవారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో తన విశ్వరూపం చూపెట్టాడు. కష్టాల్లో పడిన జట్టును ఒంటిచేత్తో విజయతీరాలకు చేర్చాడు. 31 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 70 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ను తలపించాడు. అతని దాటికి కేకేఆర్ 138 పరుగుల లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే చేధించింది. ఓడియన్ స్మిత్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో రసెల్ విశ్వరూపాన్నే చూపించాడు. మూడు సిక్సర్లు, ఒక ఫోర్, నోబాల్ సహా మొత్తం 24 పరుగులు పిండుకోగా.. అదే ఓవర్ ఆఖరి బంతిని సామ్ బిల్లింగ్స్ సిక్సర్ సంధించడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. కాగా మ్యాచ్లో రసెల్ విధ్వంసాన్ని కళ్లారా ఆస్వాధించిన సామ్ బిల్లింగ్స్ 24 పరుగులు నాటౌట్గా నిలిచి అతనికి సహకరించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సామ్ బిల్లింగ్స్ రసెల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''రసెల్ విధ్వంసాన్ని దగ్గరుండి చేశాను. ఒక విధ్వంసకర ఆటగాడు ఫామ్లో ఉంటే మనం సపోర్ట్ చేయడం తప్ప ఇంకేం చేయలేము. పవర్ హిట్టింగ్లో అతన్ని మించినవారు లేరని మరోసారి నిరూపించాడు. కొన్నిసార్లు రసెల్ విధ్వంసం చూసి.. అతనితో కలిసి ఆడాలంటే నాకు ప్రాణ సంకటంగా అనిపించేది. కానీ నాన్స్ట్రైక్ ఎండ్లో నుంచి రసెల్ ఇన్నింగ్స్ను ఆస్వాధించాను. వాస్తవానికి 51 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయినప్పుడు.. రసెల్ ఒక మాట చెప్పాడు. వికెట్లు పోయాయని కంగారుపడొద్దు.. పోరాడుదాం.. ఫలితం మనకు అనుకూలంగా వస్తుంది. మా హెడ్కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కూడా రసెల్కు ఇదే విషయాన్ని చెప్పి పంపాడు.'' అంటూ తెలిపాడు. చదవండి: IPL 2022: పంజాబ్ బౌలర్కు చుక్కలు చూపించిన రసెల్ IPL 2022: పగ తీర్చుకున్న కేకేఆర్ బౌలర్.. వీడియో వైరల్ -
IPL 2022: వయసై పోతోందన్నాడు... కానీ..
IPL 2022- KKR Vs PBKS: కోల్కతా నైట్రైడర్స్ పేసర్ ఉమేశ్ యాదవ్పై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. అతడిలో కష్టపడే తత్వం ఎక్కువని, అలాంటి వ్యక్తితో కలిసి ఆడటం తనకు గర్వకారణమని కొనియాడాడు. కాగా ముంబైలోని వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఘన విజయం సాధించిన తెలిసిందే. ఆరు వికెట్ల తేడాతో పంజాబ్ను మట్టికరిపించి.. ఈ సీజన్లో తమ రెండో గెలుపును నమోదు చేసింది. 34 ఏళ్ల ఉమేశ్ యాదవ్ అద్భుత బౌలింగ్కు తోడు 33 ఏళ్ల ఆండ్రీ రసెల్ అదిరిపోయే ఇన్నింగ్స్తో ఈ విజయం సాధ్యమైంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ ఉమేశ్ యాదవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘తనకు వయసై పోతుందని ఉమేశ్ నాతో అన్నాడు. కానీ నేను మాత్రం నువ్వు రోజురోజుకు ఫిట్గా తయారవుతున్నావని చెప్పాను. జిమ్కు ఎప్పుడు వెళ్లినా ఉమేశ్ కసరత్తులు చేస్తూ కనిపిస్తాడు. అతడిది కష్టపడే తత్వం. తను నా సహచర ఆటగాడిగా ఉండటం గొప్ప విషయం’’ అని శ్రేయస్ అయ్యర్ వ్యాఖ్యానించాడు. కోల్కతా నైట్రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ స్కోర్లు: పంజాబ్ కింగ్స్- 137 (18.2) కేకేఆర్- 141/4 (14.3). చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్కు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
IPL 2022: అతడి సహకారం వల్లే ఇదంతా సాధ్యమైంది: రసెల్
IPL 2022: 31 బంతుల్లో 70 పరుగులు.. రెండు ఫోర్లు.. ఎనిమిది సిక్సర్లు.. స్ట్రైక్ రేటు 225.81. ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్తో.. భారీ షాట్లతో ఐపీఎల్ అభిమానులకు అమితమైన వినోదాన్ని పంచాడు కోల్కతా నైట్రైడర్స్ స్టార్ హిట్టర్ ఆండ్రీ రసెల్. విధ్వంసకర ఆట తీరుతో పంజాబ్ కింగ్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. డెబ్బై పరుగులతో అజేయంగా నిలిచి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి తన ప్రదర్శనతో పొట్టి ఫార్మాట్ ప్రేమికులకు రసెల్ అసలైన మజాను అందించాడు. కేకేఆర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నాంటూ సామ్ బిల్లింగ్స్ సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన రసెల్.. తానేం చేయగలనో తనకు తెలుసనని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘ఈ ఫీలింగ్ అద్బుతంగా ఉంది. ఇలాంటి అనుభూతుల కోసమే కదా క్రికెట్ ఆడేది! జట్టు అలాంటి పరిస్థితుల్లో ఉన్నపుడు నేనేం చేయాలో.. నేనేం చేయగలనో నాకు తెలుసు. సామ్ బిల్లింగ్స్ వంటి ఆటగాడు సహకారం అందిస్తూ.. స్ట్రైక్ రొటేట్ చేయడం కలిసి వచ్చింది. నా శక్తిసామర్థ్యాలేమిటో నాకు తెలుసు. క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును బయటపడేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నోఆ. జట్టు ప్రయోజనాల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. బ్యాట్తోనే కాదు బంతితోనూ రెడీగా ఉంటా’’ అని రసెల్ పేర్కొన్నాడు. కాగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో బ్యాట్ ఝులిపించడంతో పాటు రసెల్ బంతితోనూ మెరిసిన విషయం తెలిసిందే. కగిసో రబడ వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో బౌలర్ ఉమేశ్ యాదవ్ విజృంభణ, రసెల్ మెరుపు బ్యాటింగ్తో కేకేఆర్ పంజాబ్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చదవండి: IPL 2022: రసెల్ విధ్వంసం A thumping win for @KKRiders 💪 💪 The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏 Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ — IndianPremierLeague (@IPL) April 1, 2022 -
పంజాబ్ బౌలర్కు చుక్కలు చూపించిన రసెల్
ఐపీఎల్ 2022లో ఆండ్రీ రసెల్ తన విధ్వంసం ఎలా ఉంటుందో రుచి చూపించాడు. ఫామ్లోకి వస్తే ఎంతటి డేంజర్ బ్యాట్స్మన్ అనేది చెప్పకనే చెప్పాడు. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. ఆరంభంలో కాస్త నిధానంగా కనిపించిన రసెల్ ఇన్నింగ్స్ 10వ ఓవర్లో గేర్ మార్చాడు. హర్ప్రీత్ బార్ వేసిన పదో ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన రసెల్ మొత్తంగా 17 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత ఓడియన్ స్మిత్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. స్మిత్ వేసిన ఆ ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్, నో బాల్ సహా మొత్తం 24 పరుగులు రసెల్ పిండుకోగా.. చివరి బంతిని సామ్ బిల్లింగ్స్ సిక్సర్ సంధించడంతో మొత్తంగా ఆ ఓవర్లో 30 పరుగులు వచ్చాయి. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావడంతో పాటు స్మిత్కు రసెల్ చుక్కలు చూపించాడు. ఆండ్రీ రసెల్ విధ్వంసం కోసం క్లిక్ చేయండి చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్ అంటే ఉమేశ్ యాదవ్కు ఎందుకంత ఇష్టం! PERSISTENCE. RESILIENCE. DOMINANCE. 💜#KKRHaiTaiyaar #KKRvPBKS #IPL2022 pic.twitter.com/axcYImDqkg — KolkataKnightRiders (@KKRiders) April 1, 2022 -
IPL 2022: బెంగ తీర్చిన హసరంగ
129 పరుగుల విజయ లక్ష్యం అంటే పెద్ద కష్టమేమీ కాదు... ఆడుతూ, పాడుతూ ఛేదించవచ్చని అనిపిస్తుంది. కానీ దీనిని అందుకునేందుకు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తీవ్రంగా శ్రమించింది. 7 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్ రెండో బంతికి గానీ లక్ష్యం చేరలేదు... ఆఖర్లో తడబడ్డా అదృష్టం ఆ జట్టు పక్షాన నిలిచింది. అంతకుముందు కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) సాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. హసరంగ తన లెగ్ స్పిన్తో నైట్రైడర్స్ను కట్టి పడేయగా, హర్షల్ పటేల్ కూడా పొదుపైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ముంబై: తొలి మ్యాచ్లో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మలి పోరులో విజయం దక్కింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన కేకేఆర్ 18.5 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ (18 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్లు)దే అత్యధిక స్కోరు. వనిందు హసరంగ (4/20) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా, ఆకాశ్దీప్ 3, హర్షల్ 2 వికెట్లు తీశారు. అనంతరం బెంగళూరు 19.2 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరు గులు చేసి గెలిచింది. రూథర్ఫర్డ్ (40 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. టపటపా... గత మ్యాచ్లో చక్కటి విజయం సాధించిన కోల్కతా తర్వాతి మ్యాచ్కే పేలవ ప్రదర్శన కనబర్చింది. ఏ దశలోనూ జట్టు ఇన్నింగ్స్ నిలకడగా సాగలేదు. పవర్ప్లే ముగిసేసరికే వెంకటేశ్ అయ్యర్ (10), రహానే (9), నితీశ్ రాణా (10) పెవిలియన్ చేరగా, తర్వాతి ఓవర్లోనే శ్రేయస్ అయ్యర్ (13) వెనుదిరిగాడు. తన తొలి ఓవర్లోనే శ్రేయస్ను అవుట్ చేసిన హసరంగ, తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో నరైన్ (12), షెల్డన్ జాక్సన్ (0) పని పట్టాడు. రసెల్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా, బిల్లింగ్స్ (14) కూడా విఫలం కావడం కేకేఆర్ను దెబ్బ తీసింది. చివర్లో ఉమేశ్ యాదవ్ (18) కొన్ని పరుగులు జోడించడంతో కనీస స్కోరు నమోదైంది. తన 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసిన పేసర్ హర్షల్ పటేల్... ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా (సిరాజ్ తర్వాత– 2020లో కోల్కతాపైనే) నిలవడం విశేషం. తడబడుతూనే... ఛేదనలో బెంగళూరు ఇన్నింగ్స్ కూడా గొప్పగా సాగలేదు. తొలి మూడు ఓవర్లలో వరుసగా రావత్ (0), డుప్లెసిస్ (5), కోహ్లి (12) వెనుదిరిగారు. విల్లీ (18) కూడా ప్రభావం చూపలేకపోయాడు. రూథర్ఫర్డ్ బాగా నెమ్మదిగా ఆడగా... షహబాజ్ అహ్మద్ (20 బంతుల్లో 27; 3 సిక్స్లు) ఇన్నింగ్స్ బెంగళూరుకు కాస్త ఊపు తెచ్చింది. చివర్లో 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ పెరిగినా... దినేశ్ కార్తీక్ (14 నాటౌట్), హర్షల్ పటేల్ (10 నాటౌట్) జాగ్రత్తగా ఆడి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా మ్యాచ్ను ముగించారు. స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: రహానే (సి) షహబాజ్ (బి) సిరాజ్ 9; వెంకటేశ్ (సి అండ్ బి) ఆకాశ్దీప్ 10; శ్రేయస్ (సి) డుప్లెసిస్ (బి) హసరంగ 13; రాణా (సి) విల్లీ (బి) ఆకాశ్దీప్ 10; నరైన్ (సి) ఆకాశ్దీప్ (బి) హసరంగ 12; బిల్లింగ్స్ (సి) కోహ్లి (బి) హర్షల్ 14; జాక్సన్ (బి) హసరంగ 0; రసెల్ (సి) కార్తీక్ (బి) హర్షల్ 25; సౌతీ (సి) డుప్లెసిస్ (బి) హసరంగ 1; ఉమేశ్ (బి) ఆకాశ్దీప్ 18; వరుణ్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 6; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 128. వికెట్ల పతనం: 1–14, 2–32, 3–44, 4–46, 5–67, 6–67, 7–83, 8–99, 9–101, 10–128. బౌలింగ్: విల్లీ 2–0–7–0, సిరాజ్ 4–0–25–1, ఆకాశ్దీప్ 3.5–0–45–3, హసరంగ 4–0–20–4, హర్షల్ 4–2–11–2, షహబాజ్ 1–0–16–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: డుప్లెసిస్ (సి) రహానే (బి) సౌతీ 5; రావత్ (సి) జాక్సన్ (బి) ఉమేశ్ 0; కోహ్లి (సి) జాక్సన్ (బి) ఉమేశ్ 12; విల్లీ (సి) రాణా (బి) నరైన్ 18; రూథర్ఫర్డ్ (సి) జాక్సన్ (బి) సౌతీ 28; షహబాజ్ (స్టంప్డ్) జాక్సన్ (బి) వరుణ్ 27; దినేశ్ కార్తీక్ (నాటౌట్) 14; హసరంగ (సి) రసెల్ (బి) సౌతీ 4; హర్షల్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 14; మొత్తం (19.2 ఓవర్లలో 7 వికెట్లకు) 132. వికెట్ల పతనం: 1–1, 2–17, 3–17, 4–62, 5–101, 6–107, 7–111. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 4–0–16–2, సౌతీ 4–0–20–3, రసెల్ 2.2–0–36–0, నరైన్ 4–0–12–1, వరుణ్ 4–0–33–1, వెంకటేశ్ 1–0–10–0. ఐపీఎల్లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ X లక్నో సూపర్ జెయింట్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం That's that from Match 6 of #TATAIPL. A nail-biter and @RCBTweets win by 3 wickets. Scorecard - https://t.co/BVieVfFKPu #RCBvKKR #TATAIPL pic.twitter.com/2PzouDTzsN — IndianPremierLeague (@IPL) March 30, 2022 -
ప్రాక్టీస్ సమయంలో వింత అనుభవం.. మళ్లీ బుక్కైన రసెల్
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022) ఏ ముహూర్తానా మొదలైందో కానీ.. చిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతవారం రసెల్ను విధి ఆడుకున్న తీరు అంత తొందరగా ఎవరు మరిచిపోలేరు. ఎవరూ ఊహించని రీతిలో రనౌట్ అయిన ఆండ్రీ రసెల్ మరోసారి బుక్కయ్యాడు. ఈసారి రనౌట్ మాత్రం కాదులెండి..హెలికాప్టర్ రూపంలో రసెల్ను భయపెట్టింది.బీపీఎల్లో భాగంగా చిట్టోగ్రామ్లోని ఎంఏ ఆజీజ్ స్టేడియంలో రసెల్ సహా తమీమ్ ఇక్బాల్, మోర్తజా, మహ్మద్ షెహజాద్లు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. చదవండి: Andre Rusell: రసెల్తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం ఇదే సమయంలో స్డేడియంలో ఒక హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో రసెల్ సహా మిగిలిన ఆటగాళ్లు ఏం జరిగిందోనని భయపడిపోయారు. విషయం ఏంటని ఆరా తీయగా.. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే దీనికి ముందు ఎయిర్వేస్ అధికారులు జిల్లా కమిషనర్తో పాటు స్పోర్ట్స్ అసోసియేషన్తో మాట్లాడారు. వీరి చొరవతో..చట్టోగ్రామ్ స్టేడియం అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారని తెలిసింది. ఆ తర్వాత అంబులెన్స్లో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయం ఆటగాళ్లకు తెలియక కాస్త కంగారుపడ్డారు. అయితే ఈ విషయాన్ని బీపీఎల్ తన ట్విటర్లో షేర్ చేయగా..''పాపం రసెల్ను నిజంగా ఏదో వెంటాడుతుంది.. మళ్లీ బుక్కైన రసెల్.. బీపీఎల్లో ఈ ఏడాది ఏది కలిసిరావడం లేదు..'' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: BBL 2021-22: రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో ఊచకోత..! Helicopter lands suddenly in Chattogram when Andre Russell, Tamim Iqbal were practicing 😲#BPL2022 #AndreRussell #TamimIqbal #Cricket pic.twitter.com/9TpwavCTQ5 — SportsTiger (@sportstigerapp) February 1, 2022 -
రసెల్తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం
క్రికెట్లో రనౌట్లు జరగడం సహజం. అందులో కొన్ని విచిత్ర రనౌట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రనౌట్ మాత్రం అంతకుమించినది. అసలు ఎవరు ఊహించని రీతిలో ఆండ్రీ రసెల్ రనౌటవ్వడం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇది చోటుచేసుకుంది. ఢాకా ప్లాటూన్, కుల్నా టైగర్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. చదవండి: BBL 2021-22: స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది ఆండ్రీ రసెల్, మహ్మదుల్లా నిలకడైన బ్యాటింగ్తో ఢాకా ప్లాటూన్ ఇన్నింగ్స్ సజావుగా సాగుతుంది. ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం కూడా ఏర్పడింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఐదో బంతిని రసెల్ భారీ సిక్స్ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఉంచుకోవాలని భావించి థర్డ్మన్ దిశగా ఆడాడు. మెహదీ హసన్ బంతిని అందుకొని స్ట్రైకింగ్ వైపు విసిరాడు. బంతి వికెట్లకు తాకినప్పటికి.. అప్పటికే మహ్మదుల్లా క్రీజులోకి చేరుకున్నాడు. అవతలి వైపు రసెల్ కూడా ఇక భయం లేదనుకొని కాస్త స్లో అయ్యాడు. ఇక్కడే రసెల్ను దురదృష్టం వెంటాడింది. మెహదీ హసన్ వేసిన త్రో స్ట్రైకింగ్ ఎండ్ వద్ద ఉన్న వికెట్లను తాకి.. మళ్లీ అక్కడినుంచి నాన్స్ట్రైకింగ్ ఎండ్వైపు వెళ్లింది. రసెల్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. బిగ్స్క్రీన్పై రసెల్ క్లియర్ రనౌట్ అని తేలింది. పాపం తాను ఇలా ఔటవుతానని రసెల్ అసలు ఊహించి ఉండడు. తాను ఔటైన తీరుపై నవ్వాలో.. ఏడ్వాలో తెలియక ఆకాశం వైపు చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు.'' విధి అతన్ని ఈ రకంగా వక్రీకరించింది... ఎంత ఘోరం జరిగిపోయింది..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రసెల్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND Vs SA: అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది Rajinikant fielding? 😲😲😲pic.twitter.com/aWGwKMJYyG — Rohit Sankar (@imRohit_SN) January 21, 2022 -
ఆండ్రీ రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో విధ్వంసం
Andre Russell: విండీస్ విధ్వంసకర ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ బిగ్ బాష్ లీగ్ 2021-22లో సునామీ ఇన్నింగ్స్తో ప్రళయంలా విరుచుకుపడ్డాడు. ప్రస్తుత సీజన్లో మెల్బోర్న్ స్టార్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కరీబియన్ యోధుడు.. సిడ్నీ థండర్తో జరిగిన మ్యాచ్లో సిక్సర్ల మోత మోగించాడు. 6 బంతుల్లో 5 సిక్సర్లు, ఓ ఫోర్తో 34 పరుగులు పిండుకుని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెల్బోర్న్ జట్టు 12 ఓవర్లలో 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రసెల్.. 21 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్తో 5 సిక్సర్లు, ఫోర్తో అజేయమైన 42 పరుగులు సాధించి మరో 17 బంతులు మిగిలుండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన రసెల్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, రసెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు ఈ లీగ్లో(3 మ్యాచ్ల్లో) ఇది రెండో విజయం చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు -
BBL 2021-22: బిగ్ బాష్ లీగ్లో విధ్వంసం సృష్టించనున్న రస్సెల్..
Melbourne Stars sign Andre Russell for Big Bash league 2021: వెస్టిండీస్ విద్వంసకర ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ తిరిగి బిగ్ బాష్ లీగ్లో అడుగు పెట్టనునన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న11వ ఎడిషన్ కోసం మెల్బోర్న్ స్టార్స్తో ఒప్పందం రస్సెల్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని మెల్బోర్న్ స్టార్స్ కోచ్ డేవిడ్ హస్సీ సృష్టం చేశాడు. రస్సెల్ లాంటి స్టార్ ఆటగాడు మాతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషకరమని హస్సీ తెలిపాడు. రస్సెల్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని హస్సీ చెప్పాడు. డిసెంబర్10న సిడ్నీ థండర్స్తో జరిగే మ్యాచ్లో రస్సెల్ ఆడనున్నాడని హస్సీ పేర్కొన్నాడు. కాగా రస్సెల్కు బిగ్ బాష్ లీగ్లో ఆడడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు రస్సెల్ ఈ లీగ్లో 2014 నుంచి 2017 వరకు సిడ్నీ థండర్స్ తరుపున ఆడాడు. కాగా ఐపీఎల్-14 సీజన్లో రస్సెల్ పేలవ ప్రదర్శన కనబర్చాడు. కానీ ఇటీవల ముగిసిన అబుదాబి టీ10 లీగ్లో రస్సెల్ అద్బుతంగా రాణించి తిరిగి ఫామ్లోకి వచ్చాడు. మరి ఈ ఆస్ట్రేలియాన్ లీగ్లో ఎలా రాణిస్తాడో వేచి చూడాలి. కాగా బిగ్ బాష్ లీగ్ డిసెంబర్ 5న ప్రారంభంమైన సంగతి తెలిసిందే. చదవండి: Ashes Series: ఇంగ్లండ్ చెత్త ఆట.. క్వీన్స్లాండ్ పోలీస్ విచారణ -
బౌలర్లను ఊచకోత కోసిన రస్సెల్.. 7 సిక్సర్లు, 9 ఫోర్లుతో..
Andre Russell helps Deccan Gladiators crowned champions of Abu Dhabi T10 Season 5: ఆండ్రీ రస్సెల్ విద్వంసం సృష్టించడంతో తొలిసారిగా అబుదాబి టీ10 టైటిల్ను డెక్కన్ గ్లాడియేటర్స్ ముద్దాడింది. డిసెంబర్ 4న జరిగిన ఫైనల్లో ఢిల్లీ బుల్స్పై 56 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడిబ్యాటింగ్ దిగిన డెక్కన్ గ్లాడియేటర్స్ ఓపెనర్లు రస్సెల్, కోహ్లర్-కాడ్మోర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి 159 పరుగల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో నీర్ణీత 10 ఓవరల్లో వికెట్ నష్టపోకుండా గ్లాడియేటర్స్ 159 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆండ్రీ రస్సెల్ కేవలం 32 బంతుల్లో 9 ఫోర్లు , 7 సిక్సర్లతో 90 పరుగులు సాధించాడు. అదే విధంగా కోహ్లర్-కాడ్మోర్ 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. 160 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ బుల్స్ నీర్ణీత 10 ఓవరల్లో 7 వికెట్లు కోల్పోయి 103 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బుల్స్ బ్యాటరల్లో చంద్రపాల్ హేమ్రాజ్ 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. డెక్కన్ గ్లాడియేటర్స్ బౌలరల్లో ఒడియన్ స్మిత్, వనిందు హసరంగా, టైమల్ మిల్స్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా ఆండ్రీ రస్సెల్ ఎంపికకగా, ప్లేయర్ ఆఫ్ది సిరీస్ను వనిందు హసరంగా దక్కించుకున్నాడు. చదవండి: IND Vs NZ: వహ్వా అజాజ్! ఏమా బౌలింగ్.. ధనాధన్గా ‘టెన్’ రికార్డు -
T20 WC 2021: అతి పెద్ద సిక్స్ కొట్టిన రసెల్.. వీడియో వైరల్
Andre Russell Hits Biggest Six T20 WC 2021.. వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండీ రసెల్ టి20 ప్రపంచకప్ 2021లో అత్యంత భారీ సిక్స్తో మెరిశాడు. అది కూడా మిచెల్ స్టార్క్ లాంటి టాప్క్లాస్ పేసర్ బౌలింగ్లో ఇన్నింగ్స్ చివరి బంతికి రసెల్ సిక్స్ బాదాడు. రసెల్ కొట్టిన సిక్స్ మీటర్ రీడింగ్లో 111 మీటర్ల దూరంగా నమోదైంది. ఈ ప్రపంచకప్లో నమోదైన సిక్సర్లలో రసెల్ కొట్టిందే అతి పెద్దది కావడం విశేషం. ప్రస్తుతం రసెల్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: T20 World Cup 2021: ఆసీస్ చేతిలో విండీస్ కచ్చితంగా గెలవాలి.. లేదంటే..! View this post on Instagram A post shared by ICC (@icc) -
BAN Vs WI: రసెల్ డైమండ్ డక్.. వెంటాడిన దురదృష్టం
Russell Diamond Duck.. టి20 ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ మ్యాచ్లో ఆండ్రీ రసెల్ను దురదృష్టం వెంటాడింది. ఒక్క బంతి ఎదుర్కోకుండానే రనౌట్గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ నాలుగో బంతిని తస్కిన్ అహ్మద్ రోస్టన్ చేజ్కు విసిరాడు. అతను స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న తస్కిన్ అహ్మద్ కాలితో బంతిని టచ్ చేయడం.. అది వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేయడం జరిగిపోయింది. అప్పటికే క్రీజు బయటికి వచ్చేసిన రసెల్ ఎవరు ఊహించని విధంగా రనౌట్(డైమండ్ డక్)అయ్యాడు. చదవండి: IND Vs NZ: కోహ్లి రెండుసార్లు ఓడిపోయావు.. మరి ఈసారైనా! ఇక టి20 ప్రపంచకప్ల్లో డైమండ్ డక్(ఒక్క బంతి ఎదుర్కోకకుండా ఔటవ్వడం) అయిన ఆటగాళ్ల జాబితాలో రసెల్ తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు డానియల్ వెటోరి(న్యూజిలాండ్), మొహమ్మద్ అమీర్(పాకిస్తాన్), మైకెల్ యార్డి(ఇంగ్లండ్), మిస్బా-ఉల్-హక్(పాకిస్తాన్), టి దిల్షాన్(శ్రీలంక), మహేళ జయవర్ధనే(శ్రీలంక), డేవిడ్ విల్లీ(ఇంగ్లండ్), ముస్తాఫిజుర్ రెహమాన్(బంగ్లాదేశ్) ఉన్నారు. చదవండి: T20 World Cup 2021: టాస్ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే Russell is run out by Taskin Ahmed for zero via @t20worldcup https://t.co/oTxgZEv65E — varun seggari (@SeggariVarun) October 29, 2021 -
WI VS SA: రసెల్ స్టన్నింగ్ త్రో.. దాదాపు 100 కిమీ వేగంతో
Andre Russel Bullet Throw.. టి20 ప్రపంచకప్ 2021లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్లో ఆండీ రసెల్ సూపర్ త్రోతో మెరిశాడు. దాదాపు 100 కిమీ వేగంతో విసిరిన డైరెక్ట్ త్రోకు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా రనౌట్గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఇది చోటుచేసుకోవడం విశేషం. చదవండి: T20 WC 2021: ఫోకస్గా లేవు.. న్యూజిలాండ్తో మ్యాచ్కు పక్కనపెడుతున్నా తొలి ఓవర్ను ఎకిల్ హొస్సేన్ వేయగా.. చివరి బంతిని బవుమా మిడాన్ దిశగా ప్లిక్ చేశాడు. ఫీల్డర్ దూరంగా ఉండడంతో ఈజీ సింగిల్ అనుకున్నారు.. కానీ రసెల్ ఇక్కడే మ్యాజిక్ చేశాడు. వేగంగా ముందుకు పరిగెత్తుకు వచ్చిన రసెల్ బంతిని అందుకొని వేగంగా త్రో విసిరాడు. దీంతో బంతి డైరెక్టుగా వికెట్లను గిరాటేయడం.. బవుమా రనౌట్ కావడం చకచకా జరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. చదవండి: T20 WC 2021 SA Vs WI: విండీస్ బ్యాటర్ చెత్త రికార్డు.. 35 బంతుల్లో..! A bullet of a throw from Russell gets the wicket of Bavuma via @t20worldcup https://t.co/87kxjf0Ysb — varun seggari (@SeggariVarun) October 26, 2021 -
IPL 2021 Final: ‘కెప్టెన్’ డ్రాప్ అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు!
Don’t be surprised if Morgan drops himself: మరికొన్ని గంటల్లో ఐపీఎల్-2021 ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. మాజీ చాంపియన్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ తుదిపోరుకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కేకేఆర్ జట్టు కూర్పు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ జట్టుతో చేరే అవకాశాలున్న వాన్... షకీబ్ అల్ హసన్ స్థానాన్ని అతడు భర్తీ చేసే ఛాన్స్ ఉందన్నాడు. ఒకవేళ అది కుదరకపోతే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. రస్సెల్ కోసం తనను తాను తుదిజట్టు నుంచి డ్రాప్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. కాగా ఐపీఎల్-2021 రెండో అంచెలో అద్భుతమైన కెప్టెన్సీతో ఆకట్టుకున్న మోర్గాన్... బ్యాటర్గా మాత్రం పూర్తిగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 129 రన్స్ మాత్రమే చేసిన అతడు... కీలకమైన క్వాలిఫైయర్-2లో పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ క్రిక్బజ్తో మాట్లాడుతూ... ‘‘షార్జాలో వాళ్లు బాగా ఆడారు. అక్కడి పిచ్పై పూర్తి అవగాహన ఉంది. అయితే, దుబాయ్లో పిచ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆండ్రీ రస్సెల్తో నాలుగు ఓవర్లు వేయిస్తే బాగుంటుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం లేదనుకుంటే... షకీబ్ స్థానంలో అతడు జట్టులోకి రావొచ్చు. ఇక మోర్గాన్ విషయానికొస్తే... జట్టు ప్రయోజనాల కోసం తను ఎంతటి తాగ్యానికైనా సిద్ధపడతాడు. తనను తాను తుది జట్టు నుంచి తప్పించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తన పట్టుదల గురించి నాకు తెలుసు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: MS Dhoni: హెలికాప్టర్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్న ధోని.. వీడియో వైరల్ -
KKR vs RCB: కోల్కతా ధనాధన్ షో.. రసెల్ పడేశాడు, వరుణ్ తిప్పేశాడు
భారత్లో చక్కగా సాగిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యూఏఈలో మాత్రం పేలవంగా ఆరంభించింది. కోహ్లి, డివిలియర్స్, మ్యాక్స్వెల్లాంటి సూపర్ హిట్టర్లున్న జట్టు కనీసం వంద పరుగులైనా చేయలేకపోయింది. మరోవైపు కోల్కతా నైట్రైడర్స్ జట్టు మాత్రం ధనాధన్ షోతో మ్యాచ్ను ముగించింది. మొదట స్పిన్–పేస్ బౌలింగ్ కలయికతో ప్రత్యర్థి ఆటకట్టించిన నైట్రైడర్స్ లక్ష్యాన్ని మెరుపువేగంతో ఛేదించింది. అబుదాబి: ఐపీఎల్–14 సీజన్ రెండో అంచెలో కోల్కతా నైట్రైడర్స్ బెబ్బులిలా పంజా విసిరింది. కోహ్లి సేనకు ఊహించని షాక్ ఇచ్చింది. బౌలింగ్లో వందలోపే కట్టడి చేసిన మోర్గాన్ బృందం బ్యాటింగ్లో 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఉఫ్మని ఊదేసింది. దీంతో 20–20 ఓవర్ల ఆట కాస్తా 29 ఓవర్లలోనే ముగిసింది. సోమవారం ముందుగా బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19 ఓవర్లలో 92 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ చేసిన 22 (20 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులే వారి ఇన్నింగ్స్లో టాప్ స్కోర్. రసెల్ (3/9)) నిప్పులు చెరిగే స్పెల్తో... వరుణ్ చక్రవర్తి (3/13) తిప్పేసే మ్యాజిక్తో కోహ్లి సేన చేష్టలుడిగింది. తర్వాత కోల్కతా 10 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 94 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్లు శుబ్మన్ గిల్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. వరుణ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కోహ్లి 5, డివిలియర్స్ 0 బెంగళూరు దళానికి బ్యాటింగే బలం. అందులోనూ కోహ్లి, డివిలియర్స్ల బ్యాట్ల నుంచి జాలువారే పరుగులు, సిక్సర్లు అభిమానులకు కనువిందు. కానీ... సోమవారం కోల్కతా కసి ముందు ఎవరి ఆటలు సాగలేదు. మ్యాక్స్వెల్ రూపంలో జట్టుకు మరో మెరుపు వీరుడు జతయినప్పటికీ నైట్రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్కు మొత్తం బెంగళూరు ఇన్నింగ్సే చెల్లాచెదురైంది. రెండో ఓవర్లోనే కోహ్లి (5) ఔటయ్యాడు. పవర్ప్లేలో పడిక్కల్ పెవిలియన్ చేరాడు. 6 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 41/2 స్కోరుతో బాగానే కనిపించింది. 9వ ఓవర్ వేసేందుకు రసెల్ వచ్చాక, స్పిన్నర్ వరుణ్ మ్యాజిక్ మొదలయ్యాక బెంగళూరు ఒక్కసారిగా కుదేలైంది. రసెల్ తన తొలి ఓవర్లోనే భరత్ (16), డివిలియర్స్ (0)ను ఔట్ చేశాడు. వరుణ్ కూడా తన సహచరుడినే ఫాలో అయ్యాడు. మ్యాక్స్వెల్ (10), హసరంగ (0)ను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. ఇలా 8 వికెట్లను 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఓపెనర్లే చితగ్గొట్టారు... అవతలివైపు ఆపసోపాలు పడి చేసిన పరుగుల్ని ఇవతలివైపు ఇద్దరంటే ఇద్దరే బాదేశారు. కోల్కతా ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్మన్ గిల్ పోటీపడి మరీ బౌండరీలు బాదేశారు. దీంతో బెంగళూరు బౌలర్లు అలసిపోకుండా సగం కోటా (ఐదుగురు తలా 2 ఓవర్లు వేశారు)లోనే లక్ష్యం పూర్తయ్యింది. పదో ఓవర్లో గిల్ ఔటైనా... కావాల్సిన 11 పరుగుల్ని మూడు బౌండరీలతో వెంకటేశ్ అదే ఓవర్లో పూర్తి చేయడంతో రసెల్కు బంతిని ఎదుర్కొనే అవకాశమే చిక్కలేదు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బీ) (బి) ప్రసిధ్ కృష్ణ 5; పడిక్కల్ (సి) దినేశ్ కార్తీక్ (బి) ఫెర్గూసన్ 22; శ్రీకర్ భరత్ (సి) గిల్ (బి) రసెల్ 16; మ్యాక్స్వెల్ (బి) వరుణ్ 10; డివిలియర్స్ (బి) రసెల్ 0; సచిన్ బేబీ (సి) నితీశ్ (బి) వరుణ్ 7; హసరంగ (ఎల్బీ) (బి) వరుణ్ 0; జేమీసన్ (రనౌట్) 4; హర్షల్ పటేల్ (బి) ఫెర్గూసన్ 12; సిరాజ్ (సి) వరుణ్ (బి) రసెల్ 8; చహల్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1–10, 2–41, 3–51, 4–52, 5–63, 6–63, 7–66, 8–76, 9–83, 10–92. బౌలింగ్: వరుణ్ చక్రవర్తి 4–0–13–3, ప్రసిధ్ కృష్ణ 4–0–24–1, ఫెర్గూసన్ 4–0–24–2, నరైన్ 4–0–20–0, రసెల్ 3–0– 9–3. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: గిల్ (సి) సిరాజ్ (బి) చహల్ 48; వెంకటేశ్ (నాటౌట్) 41; రసెల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (10 ఓవర్లలో వికెట్ నష్టానికి) 94. వికెట్ పతనం: 1–82. బౌలింగ్: సిరాజ్ 2–0–12–0, జేమీసన్ 2–0–26–0, హసరంగ 2–0–20–0, చహల్ 2–0–23–1, హర్షల్ పటేల్ 2–0–13–0. -
రసెల్ ఆల్రౌండ్ మెరుపులు.. సెమీస్ ఆశలు సజీవం
జమైకా: కరీబియన్ ప్రీమియర్ లీగ్( సీపీఎల్ 2021)లో భాగంగా గురువారం జమైకా తలైవాస్, సెంట్ లూసియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జమైకా తలైవాస్ ఘన విజయాన్ని అందుకుంది. రసెల్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబరచడంతో జమైకా తలైవాస్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.. ఇక సెంట్ లూసియా వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. చదవండి: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా తలైవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ కెన్నర్ లూయిస్ 56 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. చివర్లో పొలార్డ్(31,15 బంతులు; 4 సిక్సర్లు), ఇమాద్ వసీమ్(27, 10 బంతులు; 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. సెంట్ లూసియా బౌలింగ్లో జెవర్ రాయల్, కదీమ్ అలీన్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్ లూసియా 156 పరుగులకే ఆలౌట్ అయింది. మార్క్ డేయల్ 33, ఆండ్రీ ఫ్లెచర్ 30 పరుగులు చేశారు. ఇమాద్ వసీమ్ 3, రసెల్ 2, కార్లోస్ బ్రాత్వైట్ 2 వికెట్లతో రాణించారు. ఈ విజయంతో తలైవాస్ 8 మ్యాచ్ల్లో 4 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉండగా.. సెంట్ లూసియా కూడా 8 మ్యాచ్ల్లో 4 విజయాలు.. 4ఓటములతోనే ఉంది. అయితే నెట్ రన్రేట్ విషయంలో మైనస్లో ఉండడంతో నాలుగో స్థానంలో ఉంది. చదవండి: ఇదేం ఫీల్డింగ్రా బాబు.. ఒట్టి పుణ్యానికి నాలుగు పరుగులు MVP!!! An all round performance with bat and ball sees Imad Wasim pick up the @Dream11 MVP for match 24. #CPL21 #SLKvJT #CricketPlayedLouder #Dream11 pic.twitter.com/tFBWoJvGRu — CPL T20 (@CPL) September 10, 2021 -
శివాలెత్తిన రసెల్.. అతి భారీ స్కోర్ నమోదు చేసిన జమైకా తలైవాస్
సెయింట్ కిట్స్: కరీబియన్ ప్రిమియర్ లీగ్(సీపీఎల్) 2021 సీజన్లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్(14 బంతులో 50; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను చితక్కొటి సీపీఎల్ చరిత్రలో తన జట్టు రెండో అతి భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రసెల్ విధ్వంసానికి తోడు చాడ్విక్ వాల్టన్(29 బంతులో 47; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), కెన్నార్ లూయిస్(21 బంతులో 48; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), హైదర్ అలీ(32 బంతులో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోమన్ పావెల్(26 బంతులో 38; 3 ఫోర్లు, సిక్సర్లు) చెలరేగి ఆడటంతో జమైకా తైలవాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జమైకా తైలవాస్ టాపార్డర్ ధాటికి ప్రత్యర్ధి బౌలర్లు వణిపోయారు. సెయింట్ లూసియా కింగ్స్ బౌలర్లలో ఓబెద్ మెక్ కాయ్ 3 వికెట్లు పడగొట్టగా, రోస్టన్ ఛేజ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెయింట్ లూసియా జట్టు ఆరంభంలోనే తడబడింది. జమైకా బౌలర్ ప్రిటోరియస్(3/25) సెయింట్ లూసియా జట్టును దారుణంగా దెబ్బకొట్టాడు. అతనికి క్రిస్ గ్రీన్(1/22), ఆండ్రీ రసెల్(1/9) తోడవ్వడంతో 5 ఓవర్ల తర్వాత సెయింట్ లూసియా స్కోర్ 56/5. ఆ జట్టు గెలవాలంటే 90 బంతుల్లో 200 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: నీకంత సీన్ లేదంటూ ఆ ఇద్దరు ఆంటీలు నన్ను రెచ్చగొట్టేవారు.. -
హెల్మెట్కు తాకిన బంతి.. స్ట్రెచర్పై వెళ్లిన రసెల్
అబుదాబి: విండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్.. తన పవర్ హిట్టింగ్తో ఎంతోమంది బౌలర్లకు చుక్కలు చూపించాడు. బంతిని బలంగా బాదే రసెల్కు షార్ట్బాల్ ఆడడంలో కాస్త వీక్నెస్ ఉంది. తాజాగా అదే షార్ట్బాల్ అతని హెల్మెట్కు బలంగా తాకడం.. స్ట్రెచర్పై మైదానం వీడేలా చేసింది. వివరాలు.. శుక్రవారం క్వెటా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. అప్పటికే రెండు సిక్సర్లతో దూకుడు మీద కనిపించిన రసెల్కు ఇన్నింగ్స్ 14వ ఓవర్లో మహ్మద్ ముసా షార్ట్బాల్ వేశాడు. బంతి బౌన్స్ అయి రసెల్ హెల్మెట్కు బలంగా తాకింది. దాంతో తన హెల్మెట్ తీసిన రసెల్ గాయం తీవ్రతను చూసుకున్నాడు. ఫిజియో వచ్చి పరీక్షించి ఏం కాలేదు అన్నట్లుగా చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే తరహాలో వేసిన షార్ట్బాల్ను ఆడే షాట్ ఆడే ప్రయత్నంలో మహ్మద్ వసీమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ దశలో తల పట్టేయడంతో రసెల్ అలానే కింద కూర్చుండిపోయాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్ తీసుకొచ్చి రసెల్ను దానిపై పడుకోబెట్టి తీసుకెళ్లారు. కాగా రసెల్ గాయం తీవ్రత గురించి ఎక్స్రే తర్వాతే తెలియనుంది. దీనికి సంబంధించిన వీడియోనూ పీఎస్ఎల్ తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారాయి. అయితే రసెల్ గాయంపై అభిమానులు వినూత్నంగా స్పందించారు.'' రసెల్ ఇది ఐపీఎల్ కాదు.. పీఎస్ఎల్.. నువ్వు ఇంకా ఆ మాయలోనే ఉన్నట్లున్నావు..'' అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. గ్లాడియేటర్స్ బ్యాటింగ్లో వెదర్లాండ్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా..అజమ్ ఖాన్ 26 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 10 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించి 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కొలిన్ మున్రో (36 బంతుల్లోనే 90 పరుగులు; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. ఉస్మాన్ ఖవాజా 41 పరుగులతో అతనికి సహకరించాడు.ఈ విజయంతో ఇస్లామాబాద్ యునైటెడ్ 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా.. వరుసగా నాలుగో పరాజయంతో క్వెటా ఆఖరి స్థానంలో నిలిచింది. లాహోర్ ఖలాండర్స్ 10 పాయింట్లతో టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. చదవండి: అవసరమా.. ఇలాంటి ప్లేయర్స్ మనకు! 'బయోబబుల్ నా మెంటల్హెల్త్ను దెబ్బతీస్తుంది' One must always witness a Dre Russ show. This time cut short by @iMusaKhan 🪄 #MatchDikhao l #HBLPSL6 l #QGvIU pic.twitter.com/pemprmMbCj — PakistanSuperLeague (@thePSLt20) June 11, 2021 -
'బయోబబుల్ నా మెంటల్హెల్త్ను దెబ్బతీస్తుంది'
దుబాయ్: కరోనా మహమ్మారి వల్ల పదేపదే బయోబబూల్ సెక్యూర్లో ఉండడం వల్ల తన మెంటల్ హెల్త్ దెబ్బతింటుందని వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ పేర్కొన్నాడు. తాజాగా పీఎస్ఎల్లో ఆడేందుకు దుబాయ్కు చేరుకున్న రసెల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''నేను చేసిన ఈ వ్యాఖ్యలు నాకు మాత్రమే పరిమితం. బయోబబూల్ ఒక నరకంలా కనిపిస్తుంది.. అది నా మెంటల్హెల్త్ను దెబ్బతీస్తుంది. రెండేళ్లుగా బయోబబుల్ అనే పదం ఎక్కువగా వినాల్సి వస్తుంది.ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా భారత్లో అడుగపెట్టిన నేను బయోబబూల్లో ఉండాల్సి వచ్చింది. అలా ఒక బయోబబూల్ నుంచి మరోచోటికి వెళ్లిన నాకు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం, నచ్చిన ప్రదేశం.. కనీసం బయట నడిచేందుకు కూడా ఉండేది కాదు. ఇది నిజంగా నాకు కొంచెం వింతగా అనిపిస్తుంది. అయినా ఇవన్నీ తట్టుకోవడానికి ఒకటే కారణం. బయోబబూల్లో ఉంటున్నా నాకు ఇష్టమైన క్రికెట్ను ఆడుతున్నా.. ఇది గొప్ప విషయంగా భావిస్తున్నా.. నా జాబ్ నేను నిర్వహిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రసెల్ పీఎస్ఎల్లో క్వెటా గ్లాడియేటర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నవంబర్లో కరోనా మహమ్మారితో వాయిదా పడిన పీఎస్ఎల్ను నిర్వహించేందుకు పీసీబీ సమాయత్తమవుతుంది. జూన్ 9 నుంచి 24 వరకు యూఏఈ వేదికగా పీఎస్ఎల్ జరగనుంది. చదవండి: పాపం మంచి షాట్ ఆడాడు కానీ గెలిపించలేకపోయాడు చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న రసెల్ -
చీకటి రోజుల్ని గుర్తుచేసుకున్న రసెల్
అహ్మదాబాద్: తన కెరీర్ మంచి పీక్లో ఉన్నప్పుడు తగిలిన ఎదురుదెబ్బలను వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రసెల్ గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుత ఐపీఎల్లో కేకేఆర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న రసెల్.. చీకటి రోజుల్ని మరొకసారి నెమరవేసుకున్నాడు. తనను ప్రజలు డ్రగ్స్ తీసుకున్నానని ప్రశ్నించడం ఎప్పటికీ చేదు జ్ఞాపకమేనన్నాడు. తన కెరీర్ మంచి స్టేజ్లో ఉన్న 2017లో డ్రగ్స్ ఆరోపణలు రావడంతో నిషేధానికి గురైన విషయాన్ని తలచుకున్నాడు. కేకేఆర్ అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలో గత జ్ఞాపకాలను పంచుకున్నాడు. ‘నా కెరీర్లో 2017 ఒక చెత్త ఏడాది. నేను క్రికెట్లో టాప్ గేర్లో ఉన్నప్పుడు నిషేధానికి గురయ్యా. నేను బంతిని హిట్ చేస్తే అది క్లీన్హిట్ అయ్యేది. ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు. నేను ఏదీ దాచాలను కోవడం లేదు. నేను టెస్టులు చేయించుకున్న తర్వాత క్రికెట్ ఆడేవాడిని. నేను 100 మీటర్ల దాటి సిక్స్ కొట్టగలను. షార్ట్ రన్ తీసుకునే 140 కి.మీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను. అటువంటిది నేను డ్రగ్స్ తీసుకున్నాని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడ నేను చూపించుకోవడానికి ఏమీ లేదు. కానీ ఎలా బయటపడాలో తెలుసు. రెండేళ్ల పాటు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగాయి. ఆ సమయంలో నన్ను గట్టిగా కొట్టారు. ఇది నన్ను బాధించింది. ఇది దుష్ట ప్రపంచం. మనల్ని ఏదో రకంగా నాశనం చేయాలనే చూస్తారు. అప్పుడు ఎవరో ఒకరు తీసుకొచ్చిన బైబిల్పై ప్రమాణం చేసి చెప్పాను.. నేను ఏ తప్పు చేయలేదని బైబిల్పై ప్రమాణం చేశా. మహిళలు కానీ పురుషులు కానీ ఎవరూ కూడా బైబిల్పై ప్రమాణం చేసి అబద్ధం చెప్పరు. నాకు బైబిల్ అంటే చాలా గౌరవం’ అని రసెల్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక్కడ చదవండి: వార్నర్కు ఇంత అవమానమా.. ఇదేం బాలేదు మ్యాక్స్వెల్ ఇలా జరిగిందేంటి? -
క్రిస్ గేల్ డైవ్కు రసెల్ నవ్వులే నవ్వులు
అహ్మదాబాద్: క్రికెట్లో కొంతమంది బ్యాటింగ్ వరకే పరిమితమైతే, మరికొంతమంది బౌలింగ్ వరకే ఉంటారు. మరి బ్యాటింగ్కే పరిమితమయ్యే బ్యాటర్స్ కానీ బౌలింగ్కే పరిమితమయ్యే బౌలర్లు కానీ ఫీల్డింగ్లో అసాధారణ విన్యాసాలు కాకుండా సాధారణ విన్యాసాలు చేసినా విపరీతమైన నవ్వు రావడం ఖాయం. అందుకు నిన్న పంజాబ్ కింగ్స్- కేకేఆర్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచే ఉదాహరణ. సాధారణంగా ఫీల్డింగ్లో పెద్దగా ఆకట్టుకోని గేల్.. ఈ మ్యాచ్లో డైవ్ కొట్టి అందరిలో నవ్వులు పూయించాడు. ఫీల్డింగ్ విన్యాసాలు పెద్దగా చేయని గేల్.. ఏకంగా జాంటీ రోడ్స్ తరహాలో డైవ్ కొట్టి మరీ బంతిని ఆపేశాడు. కోల్కతా నైట్రైడర్స్ ఛేజింగ్ చేసే సమయంలో జోర్డాన్ వేసిన ఓ ఫుల్లర్ డెలివరీని స్ట్రైకింగ్లో ఉన్న రాహుల్ త్రిపాఠి మిడ్ వికెట్వైపు ఆడాడు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న గేల్ డైవ్ కొట్టి మరీ బంతిని ఆపేశాడు. దీనికి డగౌట్లో ఉన్న ఆండ్రీ రసెల్ తెగ నవ్వుకున్నాడు. అప్పటివరకూ సీరియస్గా ఉన్న రసెల్.. గేల్ డైవ్తో అసలు నవ్వును ఆపులేకపోయాడు. చేతిని అడ్డం పెట్టుకుని మరీ నవ్వుకున్నాడు. కామెంటేటర్లు కూడా రోడ్స్ డైవ్లా ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్కు రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే. గేల్ డైవ్, రసెల్ నవ్వులు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ విజయాన్ని నమోదు చేసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత మరో విజయాన్ని కేకేఆర్ సాధించింది.. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ 47 పరుగులు నాటౌట్గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. త్రిపాఠి 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక్కడ చదవండి: అక్కడ ఆడటానికి వెళ్లని మీరు.. ఐపీఎల్కు ఎలా వచ్చారు? Gayle diving like Jonty Rhodes and see the epic reaction of Russell 😂😂 pic.twitter.com/FjdbzGJ4ts — msc media (@mscmedia2) April 27, 2021 -
వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లాలి: రసెల్
ముంబై: సీఎస్కే-కేకేఆర్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ఈ సీజన్ హైవోల్టేజ్ మ్యాచ్ల్లో ఒకటి. ఇందులో సీఎస్కే నమోదు చేసిన 220 భారీ స్కోరు ఒకటైతే, ఆపై కేకేఆర్ 202 పరుగులకు వచ్చి ఇంకా ఐదు బంతులు ఉండగా ఆలౌట్ కావడం మరొకటి. కాగా, రసెల్(54;22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు), ఆడుతున్నంతసేపు మ్యాచ్ కేకేఆర్ వైపే ఉందనే అనిపించింది. కాగా, దినేశ్ కార్తీక్తో కలిసి 83 పరుగులు జత చేసిన తర్వాత రసెల్ ఆరో వికెట్గా ఔటయ్యాడు. రసెల్ను ఔట్ చేయకపోతే మ్యాచ్ చేజారిపోయే స్థితిలో అతను బౌల్ట్ అయ్యాడు. సామ్ కరాన్ వేసిన 12 ఓవర్ రెండో బంతి రసెల్ లెగ్ స్టంప్ను పట్టుకుపోవడంతో ఒక్కసారిగా కేకేఆర్ శిబిరంలో ఆందోళన నెలకొంది. రసెల్ ఆరో వికెట్గా ఔటైన తర్వాత అతను డగౌట్లోని మెట్లపైనే కూర్చుండిపోయాడు. గ్లౌజ్లు, ప్యాడ్లు, హెల్మెట్ తీయకుండా అలానే మ్యాచ్ చూస్తూ ఉండిపోయాడు. అనవసరంగా ఔట్ అయ్యాననే బాధ రసెల్లో స్పష్టంగా కనబడింది.. కీలక సమయంలో అయిపోయినందకు రసెల్లో పశ్చాత్తాపం కనిపించింది. మ్యాచ్ ముగిసి పోయిన తర్వాత రసెల్ అలా మెట్లపై కూర్చొండిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై తాజాగా వివరణ ఇచ్చిన రసెల్.. ‘అవును.. ఔటైన తర్వాత ఛేంజింగ్ రూమ్కు వెళ్లలేకపోయా. రూమ్కి ఎలా వెళ్లాలో తెలియక మెట్లపై కూర్చొండిపోయా. మా జట్టు సభ్యుల వద్దకు వెళ్లే ధైర్యం చేయలేకపోయా. వారి వద్దకు ఏ ముఖం పెట్టుకుని వెళతాం అనిపించింది. నేను వదిలేసాననుకున్న బంతి వికెట్లను పట్టుకుపోయింది. అది నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఎక్కువగా ఎమోషనల్ అవుతూ ఉంటా. అవే నన్ను మరింత రాటుదేలేలా చేస్తాయి. నా జాబ్ ఇంకా కంప్లీట్ కాలేదు. మా జట్టును గాడిలో పెట్టడమే నా ముందున్న కర్తవ్యం’ అని రసెల్ తన ఫ్రాంచైజీ అయిన కేకేఆర్ డాట్ ఇన్ తెలిపాడు. -
'ఎడమకాలుతో దాటుతా.. బ్యాట్ను నాలుగుసార్లు తిప్పుతా'
ముంబై: ప్రతి మనిషికి మూడ నమ్మకాలు ఉండడం సహజం.. ఏదైనా పని ప్రారంభించే ముందు తమకు ఇష్టమైన దేవుడిని తలుచుకోవడమో లేక ఇంకా ఏదైనా పని చేస్తుంటారు. అలా చూసుకుంటే ఒక క్రికెటర్కు కూడా మూడ నమ్మకాలు ఉంటాయి. ఉదాహరణకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చేముందు ప్రతీసారి ఆకాశంలోకి చూస్తూ దండం పెడుతాడు. సచిన్ ఒక్కడే కాదు.. ఎవరైనా సరే ఆటను ప్రారంభించేముందు నమ్మకంగా అనిపించే పని చేసిన తర్వాత బరిలోకి దిగుతారు. అలాంటి మూడ నమ్మకాలు నాకు ఉన్నాయని కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రసెల్ పేర్కొన్నాడు. కేకేఆర్ యాజమాన్యం నైట్క్లబ్ సిరీస్ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది. ఆ కార్యక్రమానికి రసెల్తో పాటు శివమ్ మావి అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా వారు నిర్వహించిన ఇంటర్య్వూలో రసెల్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు.''ప్రతీ ఆటగాడికి కొన్ని మూడ నమ్మకాలు ఉంటాయి. కొందరు వాటిని ఎక్కువ నమ్మితే.. మరికొందరు ఆచరిస్తారు. నేను రెండో కోవకు చెందినవాడిని. మైదానంలో అడుగుపెట్టే ముందు ప్రతీసారి నా ఎడమకాలుతో బౌండరీ రోప్ను దాటడం చేస్తుంటాను. ఆ తర్వాత బౌలర్ వేసే మొదటి బంతిని ఎదుర్కోవడానికి ముందు బ్యాట్ను నాలుగు.. అంతకంటే ఎక్కువసార్లు తిప్పుతాను. అలా చేయకపోతే.. నాకు ఆరోజు మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో మంచి ప్రదర్శన చేయలేనని నమ్మకం.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో బుధవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో రసెల్ విధ్వంసం అంత తొందరగా మరిచిపోలేం. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన కేకేఆర్ను కార్తిక్ సాయంతో రసెల్ ఇన్నింగ్స్ నడిపిన తీరు అద్బుతం. 22 బంతుల్లో 54 పరుగులు చేసిన రసెల్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. రసెల్ ఔటైన తర్వాత కమిన్స్ (34 బంతుల్లో 66 నాటౌట్, 4 ఫోర్లు, 6 సిక్సర్లతో) విధ్వంసం సృష్టించాడు. 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఒక దశలో గెలుపుకు దగ్గరైనా చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 18 పరుగుల తేడాతో ఓడి వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక కేకేఆర్ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 24న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్తో ఆడనుంది. చదవండి: రసెల్.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..! ఎవరో ఎందుకని వాళ్లను వాళ్లే ట్రోల్ చేసుకున్నారు.. రసెల్ ఔట్ ప్లాన్లో భాగమా?.. ధోని రిప్లై అదిరింది Tap, tap, tap, tap, 𝗕𝗢𝗢𝗠 💥 Even #MuscleRussell himself has his superstitions, and they happen to be totally opposite to those of @ShivamMavi23 😅@Russell12A #KKRHaiTaiyaar #IPL2021 pic.twitter.com/9xrlDz2mc8 — KolkataKnightRiders (@KKRiders) April 23, 2021