Assembly Special sessions
-
మన్మోహన్ సింగ్కు తెలంగాణ అసెంబ్లీ నివాళి
హైదరాబాద్, సాక్షి: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. ఏడు రోజుల సంతాప దినాల నిర్వహణలో భాగంగా.. ఇవాళ(డిసెంబర్ 30) ప్రత్యేక సెషన్ నిర్వహించింది. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఆ తీర్మానానికి మద్దతు ప్రకటించారు. అలాగే మన్మోహన్కు దేశఅత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే తీర్మానానికి సైతం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రజలకు మన్మోహన్కు రుణపడి ఉంటారు. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారం ఆయనను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ అంటే మన్మోహన్కు ప్రత్యేక అభిమానం ఉండేదని ఆయన సతీమణి తెలిపారు. ఆయన కుటుంబం చాలా నిరాడంబరంగా ఉంటుంది. గొప్ప విలువలతో తన కుటుంబాన్ని నడిపించారు. మన్మోహన్ పరిపాలనతోనే మనం గొప్ప ఆర్థిక శక్తిగా నిలబడగలిగాం. మన్మోహన్తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరవలేం. ప్రజలంతా గుర్తు పెట్టుకునే విధంగా మన్మోహన్ విగ్రహం ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే సంస్కరణల్లో ఆయన వెనకడుగు వేయలేదు. భూసేకరణ చట్ట సవరణ ద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూర్చారు. భూసేకరణ చట్టం-2013 ద్వారా చేతి వృత్తులు, కుల వృత్తుల వారు లబ్దిపొందారు. మన్మోహన్ చేసిన కృషిని అందరూ గుర్తుంచుకోవాలి. పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వగలుగుతున్నామంటే అది ఆయన చలువే. అంబేద్కర్ స్పూర్తితో పరిపాలన చేశారు. మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త, తత్వవేత్త, మానవతావాది. ఐటీ రంగాన్ని శాసించగలుగుతున్నామంటూ ఆయన సంస్కరణలే కారణం అని చెప్పుకొచ్చారు.ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. పనే ధ్యాసగా పనిచేశారు. బ్యూరోక్రాట్గా వివిధ దశల్లో పనిచేసి మన్మోహన్ దేశ ప్రధాని అయ్యారు. నీతి, నిజాయితీతో మన్మోహన్తో పోటీ పడేవారు లేరు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. తన పనే లక్ష్యంగా మన్మోహన్ ముందుకు సాగారు. మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలి. 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందించారు. మన్మోహన్ సంస్కరణలతో అనేక కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. సమాచార హక్కు చట్టాన్ని 2005లో తీసుకువచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం దేశ గతినే మార్చేసింది. ఆర్థిక మాంద్యం బారినపడకుండా ఉపాధి హామీ పథకం కాపాడింది. దేశ సామాజిక పరిస్థితులను అవగాహన చేసుకుని చట్టాలు చేశారు. ప్రతీ ఒక్కరి కోసం ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చారు. దశాబ్దాలుగా కొట్లాడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు. విపక్షాలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేలా చేశారు. మన్మోహన్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. అసామాన్యమైన మహా మనిషి మన్మోహన్. దేశం కోసం ఆయన కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టారు. మన్మోహన్ భారత్లో పుట్టినందుకు గర్వపడుతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. 👉 కేటీఆర్ కామెంట్స్..మన్మోహన్ సింగ్ నిబద్ధతతోనే తెలంగాణ ఏర్పడింది. సీఎం రేవంత్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం. మన్మోహన్ తెలివితేటలను గుర్తించింది మన తెలంగాణ బిడ్డ పీవీనే. ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఎన్ని రకాలుగా ఆయన్ని అవమానించినా మౌనంగా భరించారు. అయినా అవన్నీ పంటి కింద బిగబట్టి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి. పీవీ నర్సింహారావు తెలంగాణ బిడ్డ. ఢిల్లీలో మెమోరియల్ లేదు. అక్కడ మెమోరియల్ ఏర్పాటు చేయాలని శాసన సభ తీర్మానం చేయాలి.రాజకీయాలతో సంబంధం లేని ఆర్థిక వేత్తగా ఉన్న మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచం అంతా దేశం వైపు చూసే విధంగా మన్మోహన్ సింగ్ ఆర్థిక నిర్ణయాలు ఉన్నాయి. లాయల్టీకి నిలువుటద్దంగా నిలిచిన గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్. కేసీఆర్కు షిప్పింగ్ పోర్టుపోలియో ఇస్తే డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగానే కేసీఆర్ తెలంగాణ కోసం అది త్యాగం చేశారు. తెలంగాణ ఏర్పాటు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జరిగింది. తెలంగాణ డెలిగేషన్ తీసుకొని మన్మోహన్ సింగ్ను కలిశాం. 5 నిమిషాలు కాదు, ఎక్కువ సమయం కావాలని అడిగాం. సమస్య తీవ్రత తెలుసుకొని గంటన్నర సమయం ఇచ్చారు. ఓబీసీ అంశాలపై బలహీన వర్గాల డెలిగేషన్ ఢిల్లీ వెళ్లి కలిసింది.మన్మోహన్ సింగ్కు జరిగిన గౌరవ వీడ్కోలు.. మన పీవీ నరసింహారావుకు దక్కలేదు. ఢిల్లీలో అందరి ప్రధాన మంత్రులకు ఘాట్స్ ఉన్నాయి. పీవీకి తప్ప. పీవీకి ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేసేలా సభలో తీర్మానం పెట్టాలని కోరుతున్నాం. మన్మోహన్ సింగ్ విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేసినా మేమంతా వస్తాం.👉మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..దేశాభివృద్ధికి మన్మోహన్ సింగ్ అనేక గొప్ప విధానాలు తెచ్చారు. సాధారణ స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగారు. మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా పీవీ నరసింహారావు ఎంపిక చేశారు. గ్రామీణ పేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకం తెచ్చారు. బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..పీవీ నరసింహారావు గురించి సభలో గుర్తు చేస్తున్నారు.పీవీని పదేళ్లు పట్టించుకోకపోతే.. బీజేపీ పీవీకి భారతరత్న ఇచ్చింది.పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పీవీకి భారత రత్న ఇవ్వలేదు.మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే..రాహుల్ గాంధీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నాం వెళ్లారట!రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్కు సంతాపం ప్రకటించాలి.మన్మోహన్కు దక్కిన గౌరవంతో పాటు అవమానం గుర్తు చేస్తున్నాం.సంతాప సభలో రాజకీయాలు ఎందుకు?. సభలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..సంతాప తీర్మానం రోజు దాని గురించే మాట్లాడాలి.నిజంగా ఆర్ఎస్ఎస్ నేతలు కూడా మహేశ్వర్ రెడ్డి లాగా మాట్లాడరు.మధ్యలో వెళ్లిన మహేష్ రెడ్డి చించుకుంటూ మాట్లాడుతున్నారు.రాహుల్ గాంధీ ఎటు వెళ్లారు అన్నది ఇక్కడ చర్చ కాదు.సంతాప తీర్మానం గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుందిఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్ పార్టీ ఎందుకు మధ్యలో కలగజేసుకుంటుంది.దేశం అంతా మన్మోహన్ సింగ్ గురించి వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేసి జరుపుతుంటే..రాహుల్ గాంధీ వేడుకల కోసం వియత్నం వెళ్లలేదా?కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ను అవమానించినట్లు కాదా ?మన్మోహన్ సింగ్ విగ్రహం గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ.. పీవీకి కూడా విగ్రహం పెడితే బాగుండు.కూనంనేని కామెంట్స్..దేశ గతి, గమనాన్ని మన్మోహన్ మార్చారు. మన్మోహన్కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదు.సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదునివాళి కార్యక్రమంలో ఇలా చేయడం వల్ల మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందినివాళి కార్యక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలినిజాయతీ, నిబంద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్. హరీష్ రావు కౌంటర్..కేసీఆర్ గురించి మాట్లాడుకోవాలంటే ఆయనకు సభ ఏం గౌరవం ఇచ్చింది.సభ సభ లాగా జరగడం లేదుపీఏసీ చైర్మన్ మీకు నచ్చినట్లు ఇచ్చుకున్నారు.కేసీఆర్ను అడిగి పీఏసీ చైర్మన్ ఇచ్చారా?తెలంగాణ కోసం కేసీఆర్ రెండున్నర ఏళ్ల పాటు ఉన్న కేంద్ర పదవిని వదిలేశారు.శాసనసభ్యుల అనర్హత పై మీరు నిర్ణయం తీసుకున్నారా?ఆ లెక్కన వస్తే మేము చాలా మాట్లాడగలుగుతాం.కానీ ఇప్పుడు మన్మోహన్కు మాత్రమే పరిమితమవుతున్నాం. స్పీకర్ కామెంట్స్..కేసీఆర్ ప్రస్తావన రాగానే కలగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ప్రత్యేక సమావేశాల కోసం కేసీఆర్కు స్వయంగా నేనే కాల్ చేశాను.అసెంబ్లీ సమావేశానికి రావాలని కేసీఆర్ను స్వయంగా ఆహ్వానించాను.కానీ, ఆయన రాలేదుహరీష్ రావు కామెంట్స్..మన్మోహన్ సింగ్ పెద్దల సభలో 33 ఏళ్లు ఉన్నారుఈరోజు శాసనసభతో పాటు పెద్దల సభ, మండలి కూడా సమావేశమై నివాళి అర్పిస్తే బాగుండేది.శాసన మండలిలో మన్మోహన్కు నివాళి అర్పిస్తే మరింత గౌరవంగా ఉండేదిశాసన మండలి సభ్యులు సైతం సంతాపం తెలిపేందుకు అడుగుతున్నారు.నెక్లెస్ రోడ్డుకు పీవీ పేరు పెట్టాం. పీవీ ఘాట్ ఏర్పాటు చేశాం.స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ పేరు పెట్టాలి.మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలి.దేశం ఆర్థికంగా బలోపేతం కావాడానికి మన్మోహన్, పీవీ కృషి ఎంతో ఉంది.కేసీఆర్ నాయకత్వంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఇదే అసెంబ్లీలో తీర్మానం చేశాం.కేంద్రం కూడా స్పందించి పీవీకి భారతరత్న ఇచ్చింది.మన్మోహన్ను మౌన ముని అని అంటారుమన్మోహన్పై చిన్న అవినీతి మరక కూడా లేదు.ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా చెరగని ముద్ర వేశారు.ఏఐసీసీ మీటింగ్లో మన్మోహన్ కంట తడి పెట్టారు.కాంగ్రెస్ ఓటమికి సంస్కరణలే కారణమని ఏఐసీసీలో చర్చించినా మన్మోహన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ను రాహుల్ చించేసినా ప్రధానిగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేసీఆర్కు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోన్..👉నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని సభకు రావాలని కేసీఆర్కు తెలిపిన స్పీకర్. మరోవైపు.. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి దూరంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. -
రేపు అసెంబ్లీ ప్రత్యేక భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దేశాన్ని ఆర్థిక చిక్కుల నుంచి బయటపడేసి, అభివృద్ధి పథంలో పయనించేలా మార్గనిర్దేశం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్కు నివాళులు అర్పించనుంది. దేశానికి మార్గం చూపిన ఆయనకు భారత రత్న ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల అనంతరం ఈ నెల 21న సభ నిరవధికంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే.అయితే సభను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంతో.. ఈ నెల 30న సోమవారం ప్రత్యేక భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభించనున్నట్టు శాసనసభ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు శనివారం లేఖ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశం ఒక్కరోజుకే పరిమితం చేయనున్నారు. మన్మోహన్ను కొనియాడుతూ తీర్మానం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 3వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి. ఈ క్రమంలో మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ఆయన కృషిని కొనియాడుతూ తీర్మానం చేయడం ద్వారా నివాళి అర్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆధునిక భారత దేశ ఆర్థిక సంస్కర్తగా పేరుగాంచిన మన్మోహన్కు ‘భారతరత్న’ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేత కేసీఆర్మాజీ ప్రధాని మన్మోహన్కు నివాళి అర్పించేందుకు సోమవారం నిర్వహిస్తున్న అసెంబ్లీ ప్రత్యేక భేటీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మన్మోహన్ నేతృత్వంలోని కేబినెట్లో కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్.. పలు సందర్భాల్లో ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సహకారాన్ని రికార్డుల్లో చేర్చాలని కోరుతూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు కూడా. ఈ నేపథ్యంలో మన్మోహన్ కృషిని కొనియాడుతూ, నివాళి అర్పించే అసెంబ్లీ ప్రత్యేక భేటీకి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. -
బీజేపీ ఆపరేషన్ కమలం విఫలం.. అందుకే విశ్వాస తీర్మానం: సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య రాజకీయ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం ఢిల్లీ అసెంబ్లీ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంపైనే సీఎం కేజ్రీవాల్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. అయితే ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకే ఆప్ విశ్వాస తీర్మానం పెట్టిందని సభలో బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. అసెంబ్లీలో ఆప్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సభ్యలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించారు. చదవండి: రాజీనామా తర్వాత తొలిసారి మీడియాతో ఆజాద్.. అందుకే కాంగ్రెస్ను వీడానంటూ.. విశ్వాస తీర్మాణాన్ని ప్రవేశ పెట్టిన సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఖండించారు. బీజేపీ ఎమ్మెల్యేలు విషయాలు చర్చకు రాకుండా.. రచ్చ చేయాలనే ఉద్దేశంతోనే సభకు వస్తున్నారని ఆరోపించారు. ఆప్ను వీడి బీజేపీలో చేరితో ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు నిజాయితీ పరులని, ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్ కమలం విఫలమైందని రుజువు చేసేందుకే సభలో విశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ పడగొట్టిందని.. ఢిల్లీలోని అలాంటి ప్రయత్రాలు చేసిందని విమర్శించారు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. -
Delhi Assembly: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం రణరంగాన్ని తలపించింది. ఆపరేషన్ లోటస్, లిక్కర్ కుంభకోణంపై సభలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ సభ్యుల పరస్పర నిందారోపణలు, నినాదాలతో మారుమోగింది. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ఆరోపణలపై చర్చించేందుకు, తాము సాధించిన విజయాలను వివరించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చింది. అయితే, బీజేపీ తమ వారిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని పేర్కొంటూ ఆప్ సభ్యులు డబ్బు–డబ్బు(ఖోకా–ఖోకా) అంటూ నినాదాలు ప్రారంభించారు. పోటీగా బీజేపీ సభ్యులు కేజ్రీవాల్ సర్కార్ లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపిస్తూ మోసం–మోసం (ధోఖా–ధోఖా) అంటూ ప్రతినినాదాలకు దిగారు. దీంతో డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా వారిని సముదాయించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సభా కార్యక్రమాలను సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్నారంటూ అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంలో తన ప్రశ్నకు జవాబివ్వకుండా, కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ బీజేపీకి చెందిన మొత్తం 8 మందినీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా మార్షల్స్తో బయటకు గెంటించి వేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీజీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అభద్రతాభావంలో ప్రధాని మోదీ ఆప్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం కేజ్రీవాల్, మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లలేదని నిరూపించేందుకు ఈ నెల 29న అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ బురద జల్లుడుగా మారిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ సీరియల్ కిల్లర్ మాదిరిగా కాచుక్కూర్చుందన్నారు. ప్రధాని మోదీలో అభద్రతాభావం పెరిగిపోయిందని డిప్యూటీ సీఎం సిసోడియా పేర్కొన్నారు. -
‘మహా’ స్పీకర్గా నర్వేకర్.. అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు!
ముంబై: మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభాపతి ఎన్నిక నిర్వహించారు. నూతన స్పీకర్గా బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్(45) ఎన్నికయ్యారు. ఆయనకు 164 ఓట్లు రాగా, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి. దేశంలో ఇప్పటిదాకా అత్యంత పిన్నవయస్కుడైన అసెంబ్లీ స్పీకర్గా రాహుల్ నర్వేకర్ రికార్డుకెక్కారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. రాహుల్ మామ, ఎన్సీపీ నేత రామ్రాజే నాయక్ మహారాష్ట్ర శాసనమండలి చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. కొత్త స్పీకర్ వెంటనే రంగంలోకి దిగారు. శివసేన శాసనసభాపక్ష నేతగా అజయ్ చౌదరిని తొలగించారు. ఆ స్థానంలో సీఎం షిండేను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తిరుగుబాటుకు ముందు షిండేనే ఎల్పీ నేతగా ఉన్న విషయం తెలిసిందే. 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. శివసేన సభ్యుడు రమేశ్ లాట్కే మరణంతో ఖాళీ ఏర్పడింది. డిప్యూటీ స్పీకర్, ఎన్సీపీ నేత నరహరి జిర్వాల్ ఓటు వేయలేదు. కొందరు శివసేన ఎమ్మెల్యేలు పార్టీ విప్ను ధిక్కరించి, ప్రత్యర్థికి ఓటు వేశారని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని నరహరి జిర్వాల్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 287 మంది ఎమ్మెల్యేలకు గాను 271 మంది ఓటు వేశారు. వివిధ కారణాలతో పలువురు గైర్హాజరయ్యారు. పూర్తి పారదర్శకంగా స్పీకర్ ఎన్నిక జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలాసాహెబ్ థోరట్ ఒక ప్రకటనలో ప్రశంసించారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పటిష్టమైన భద్రత మధ్య సమీపంలోని హోటల్ నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. మహారాష్ట్ర నూతన సర్కారు బలపరీక్ష సోమవారం అసెంబ్లీలో జరుగనుంది. శివసేన ఎమ్మెల్యేలకు రెండు విప్లు శివసేన రెండు వర్గాలు విడిపోయింది. స్పీకర్ ఎన్నికలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు పార్టీ ఎమ్మెల్యేలకు వేర్వేరు విప్ జారీ చేశాయి. షిండే వర్గం బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్గా అనుకూలంగా, ఠాక్రే వర్గం శివసేన అభ్యర్థి రాజన్ సాల్వీకి అనుకూలంగా ఓటు వేశాయి. పార్టీ విప్ను కొందరు సభ్యులు ఉల్లంఘించారని ఆరోపిస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు(ఠాక్రే వర్గం) డిప్యూటీ స్పీకర్కు ఓ లేఖ అందజేశారు. పార్టీ ఆదేశాలను 39 మంది ఎమ్మెల్యేలు ధిక్కరించారని సభలో సునీల్ ప్రభు చెప్పారు. తమ వర్గంలో లేని 16 మందికి కూడా విప్ జారీ చేశామని షిండే వర్గం ఎమ్మెల్యే దీపక్ చెప్పారు. సేన శాసనసభాపక్ష కార్యాలయానికి సీల్ విధాన భవన్లో శివసేన శాసనసభాపక్ష కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గంఆదివారం మూసివేసింది. తలుపులు బిగించి, తెల్లకాగితం అతికించి, దానిపై టేప్ వేశారు. శివసేన శాసనసభా పక్షం ఆదేశాల మేరకు ఆఫీసును మూసివేస్తున్నట్లు రాశారు. కసబ్కు కూడా ఇంత సెక్యూరిటీ లేదు: ఆదిత్య రెబల్ ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం పట్ల శివసేన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాది కసబ్కు కూడా ఇంత సెక్యూరిటీ లేదని అన్నారు. ఇలాంటి పరిస్థితి ముంబైలో ఎప్పుడూ చూడలేదన్నారు. ‘‘ప్రభుత్వానికి భయమెందుకు? ఎవరైనా జారుకుంటారని భయపడుతున్నారా?’’ అని ఎద్దేవా చేశారు. -
Maharashtra political crisis: ముంబైకి రెబల్ ఎమ్మెల్యేలు
ముంబై: మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ ఎన్నిక, సభలో ప్రభుత్వ బలనిరూపణకు రంగం సిద్ధమయ్యింది. రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఆదివారం, సోమవారాల్లో రెండు రోజులపాటు జరుగనున్నాయి. గోవాలో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు శనివారం సాయంత్రం చార్టర్డ్ విమానంలో ముంబైకి చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఉదయమే గోవాకు వెళ్లి, రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ముంబైకి తిరిగివచ్చారు. వారు ముంబైలోని ఓ హోటల్లో బస చేస్తున్నట్లు సమాచారం. ఆదివారం వారంతా హోటల్ నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరుతారు. ఉద్ధవ్ లేఖను సవాలు చేస్తాం: రెబల్ వర్గం ‘శివసేన నేత’ పదవి నుంచి షిండేను తొలగిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జారీ చేసిన లేఖను సవాలు చేస్తూ సరైన వేదికను ఆశ్రయిస్తామని రెబల్ వర్గం ఎమ్మెల్యే దీపక్ కేసార్కర్ శనివారం చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణాలతో షిండేను శివసేన నేత పదవి నుంచి తప్పిస్తూ ఉద్ధవ్ ఠాక్రే జూన్ 30 తేదీతో లేఖ విడుదల చేశారు. షిండే అదేరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ లేఖ మహారాష్ట్ర ప్రజలను అవమానించేలా ఉందని దీపక్ కేసార్కర్ విమర్శించారు. తిరుగుబాటు వర్గం ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా షిండేను ఎన్నుకున్నారని గుర్తుచేశారు. -
కేంద్రం ముందుకు మండలి రద్దు తీర్మానం..
-
శాసన మండలి రద్దుపై మరో ముందడుగు
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. తొలుత శాసనసభ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ తీర్మానాన్ని పంపారు. అనంతరం తీర్మానాన్ని పరిశీలించిన సీఎస్.. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం హోంశాఖ అధికారులకు పంపారు. దీంతో మండలి రద్దు విషయంలో ప్రభుత్వం మరో ముందడుగేసినట్లయింది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభ్యులు రోజంతా సుదీర్ఘంగా చర్చించి.. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. -
మండలి రద్దుకు తీర్మానం
-
ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక
సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు చంద్రబాబు ముఖం చాటేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మండలిలో రెండు బిల్లుల్ని ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపిన తీరుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడం, మండలి రద్దుపై గతంలో చెప్పిన మాటలకు, ఇప్పుటి వాదనకు పొంతన లేకపోవడంతో.. కావాలనే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 22న మండలిలో వ్యవహరించిన తీరు, బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపిన విధానం, గ్యాలరీలో చంద్రబాబు చేసిన హడావుడిపై అసెంబ్లీలో నిలదీస్తారనే అనుమానంతో ఆ మరుసటి రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. తాజాగా మండలి రద్దు తీర్మానం కోసం నిర్వహించిన సమావేశానికీ గైర్హాజరయ్యారు. తాము చేసిన తప్పులపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే వ్యూహాత్మకంగా సభకు రాకుండా తప్పించుకున్నారనే వాదన వినిపిస్తోంది. 40 సంవత్సరాల అనుభవం, దేశ రాజకీయాల్లోనే సీనియర్ నేతగా చెప్పుకుంటూ.. కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే హాజరుకాకుండా డుమ్మా కొట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మండలిపై చర్చించకూడదంటూ కొత్త పల్లవి సోమవారం జరిగిన చర్చకు హాజరుకాకుండా మీడియా సమావేశం పెట్టి తన వాదన వినిపించడానికి చంద్రబాబు పరిమితమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అధినేత బాటలో తమ అభిప్రాయాలతో టీవీ ఛానళ్లలో హోరెత్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. శాసన మండలి ఉండాలా? వద్దా? అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని ముఖ్యమంత్రి నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. అయితే మండలిలో జరిగిన వ్యవహారాలపై అసెంబ్లీలో చర్చించకూడదంటూ చంద్రబాబు తమ నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. 2004లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం మండలి పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, 2007లో మండలి పునరుద్ధరించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తున్నప్పుడు కూడా అదే విధంగా.. మండలి రద్దు చేసే అధికారం సీఎంకు లేదని, అసెంబ్లీకి తీర్మానం చేసే అధికారం లేదని కొత్త పల్లవి అందుకోవడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకే అంశంపై పరస్పర విరుద్ధంగా మాట్లాడడం ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల్ని తేటతెల్లం చేసిందని అంటున్నారు. ఏం చెప్పాలో తెలియకే: టీడీపీలో చర్చ అసెంబ్లీకి హాజరైతే ఈ ద్వంద్వ నీతిపై అధికార పక్షం నిలదీస్తుందనే జంకుతో సాకులు చూపి డుమ్మా కొట్టారని చెబుతున్నారు. రెండు వైఖరులపై నిలదీస్తే ఏం చెప్పాలో తెలియకే తాము అసెంబ్లీకి వెళ్లలేదని టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం లేకపోవడం వల్లే చంద్రబాబు వెళ్లలేదనే చర్చ టీడీపీలో జరిగిందని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. మండలి రద్దయితే నష్టం వైఎస్సార్సీపీకేనని చెబుతున్నా.. తన కుమారుడు రాజకీయ నిరుద్యోగి మారిపోతాడనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారని, ఆ కారణంగానే మండలి రద్దును వ్యతిరేకిస్తున్నారనే టీడీపీ సీనియర్ల మధ్య చర్చ సాగినట్లు తెలిసింది. -
మండలితో ఎలాంటి లాభం లేదు
సాక్షి, అమరావతి: శాసనమండలి ఉండాల్సిందేనని ఇప్పుడు చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, 2004లో మండలి వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని స్పష్టంగా చెప్పారు. శాసనాలు ఆలస్యం అవుతాయని పేర్కొన్నారు. 2004 శాసనమండలి పునరుద్ధరణ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అప్పుడు ఏమన్నారో సోమవారం అసెంబ్లీలో ప్రదర్శించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘శాసనమండలి పునరుద్ధరించాలనే నిర్ణయం వల్ల వీళ్లల్లో (కాంగ్రెస్) కొంతమందికి రాజకీయ పునరావాసం కల్పిస్తారేమో గానీ.. దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏం లాభం లేదు. బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనేది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందనేది వాస్తవం కాదు. చరిత్రను చూసినా ఇది అవసరం లేదు. ఒకప్పుడు అక్షరాస్యత ఎక్కువ ఉండేది కాదు. చదువుకునే వాళ్లు అసెంబ్లీకి ఎక్కువ వచ్చేవాళ్లు కాదు. అందుకే శాసనమండలికి మేధావులను తీసుకొచ్చి చర్చించాలన్న ఉద్దేశం ఉండేది. ఈ రోజు శాసనసభలో 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది. చదువుకున్న వాళ్లు, బాగా అనుభవం ఉండేవాళ్లు వచ్చారు. 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో రాష్ట్రాలు రెండో సభ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ, దీనివల్ల ఏం లాభం ఉండదని, అప్పట్లో కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. 1934 అక్టోబర్ 26న బాబూ రాజేంద్రప్రసాద్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని, నష్టం ఉంటుందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, శాసనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. 1950 నుంచి చూస్తే... 8 రాష్ట్రాల్లో మాత్రం రెండు సభలొచ్చాయి. కాలక్రమేణా మూడు రాష్ట్రాల్లో రద్దయ్యి ఐదు రాష్ట్రాల్లో మాత్రం మండలి ఉంది. మండలి వల్ల రూ.20 కోట్లు ఆర్థిక భారం పడుతుంది. బిల్లుల ఆమోదంలో కాలయాపన జరుగుతుంది. అసెంబ్లీ నుంచి ఒక బిల్లు పంపిస్తే అక్కడికి పోవడం, తిరిగొస్తే మళ్లీ చర్చించడంతో కాలయాపన అవుతుంది. ఆర్థిక సంబంధమైన బిల్లుల విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలు లేవు. ఈ బిల్లులన్నీ శాసనసభే ఆమోదిస్తుంది. ఏదైనా బిల్లును చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే చట్టమవుతుంది. ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే అసెంబ్లీ తప్ప మండలికి ఏమాత్రం ప్రమేయం లేదు. ఆఖరుకు రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ మండలి సభ్యులకు ఓటింగ్ హక్కు లేదు. పరిమిత అధికారాలు తప్ప ఏమీ మండలికి ఉండవు. అందులో కూడా పెద్ద మేధావులు వస్తారని లేదు.ఎవరిని పెడతారో తెలుసు. ప్రజాధనం దుర్వినియోగం చేసే మండలి బిల్లు వల్ల లాభం కాదు నష్టమొస్తుంది. ప్రజలకు భారమవుతుంది. దీని వల్ల ఏ ప్రయోజనం లేదని వ్యతిరేకిస్తున్నాను..’’ మండలి వద్దని అప్పుడు చెప్పా..: చంద్రబాబు మండలిని రద్దు చేస్తూ సోమవారం అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఏమన్నారంటే... ‘‘శాసనమండలి రద్దు విచారకరం. కౌన్సిల్ను రద్దు చేసే అధికారం శాసనసభకు లేదు. గతంలో మండలి వద్దని నేను చెప్పాను. కానీ ఇప్పుడు రద్దు సమంజసం కాదు. పరిస్థితుల ఆధారంగా సిద్ధాంతాలు మారుతుంటాయి. శాసనమండలి రద్దు చేయాలని అప్పట్లో ఎన్టీ రామారావు నిర్ణయించారు. అది టీడీపీ సిద్ధాంతం. దాన్ని సమర్థించాం. కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు మండలి ప్రాధాన్యత ప్రజల నుంచి తెలుసుకున్నాను. మండలి ఉంటే బడుగు బలహీనవర్గాలకు అవకాశం వస్తుంది. కౌన్సిల్ స్వతంత్ర ప్రత్తిపత్తి కలిగినది. 10 రాష్ట్రాలు మండలి కావాలంటున్నాయి. టీచర్లు, మేధావులు మండలికొస్తారు. ఆర్థిక భారం అని చెప్పడం ఓ సాకే. ఎందుకంటే ఏడాదికి 40 రోజులకు మించి సభ ఎప్పుడూ జరగదు. కౌన్సిల్కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు..’’ -
ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని అధికార పక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ఓడిపోయిన నేతలకు శాసనమండలి పునరావాస కేంద్రంగా మారిందన్నారు. రాజకీయాల కోసం చట్టాలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, దాడిశెట్టి రాజా, మంత్రి పేర్ని నాని, అధికార పక్ష ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, మేరుగ నాగార్జున, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, కొలుసు పార్థసారథి తదితరులు మాట్లాడారు.ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. ప్రజలు ఆమోదించిన,ప్రభుత్వ నిర్ణయాలను మండలిలో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. అధికార పక్ష సభ్యులు ఏమన్నారంటే... సాక్షి, అమరావతి: శాసనసభ తీసుకున్న ప్రజోపయోగ నిర్ణయాలను మండలి అడ్డుకుంటోందని.. అసలు అలాంటి సభ మనకు అవసరమా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ అప్రజాస్వామికంగా, అభివృద్ధి నిరోధకంగా వ్యవహరిస్తున్న టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు శాసనమండలిని రద్దు చేయొద్దని చెప్పే అధికారం లేదని అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ధర్మాన ప్రసంగించారు. గతంలో శాసనమండలిని రద్దు చేసినప్పుడు ధర్మవాక్యాలు వల్లించిన చంద్రబాబు ఈవేళ సభకు జవాబు చెప్పలేక పారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో పలువురు ప్రముఖులు ఎగువ సభ రద్దు అవసరాన్ని నొక్కిచెప్పిన విషయాల్ని ఆయన తన ప్రసంగంలో వివరించారు. ధర్మాన ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రజోపయోగ నిర్ణయాల్ని అడ్డుకుంటారా? ప్రపంచంలో 178 దేశాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అమలులో ఉంటే కేవలం 68 దేశాల్లో మాత్రమే మండలి వంటి ఎగువ సభలు ఉన్నాయి. చాలా దేశాలు రద్దు చేస్తున్నాయే తప్ప కొత్తగా తీసుకొస్తున్నవి లేవు. బ్రిటీష్ వాళ్లు.. వారి అవసరాల కోసం ప్రజల ఆకాంక్షలను పక్కనబెట్టి వీటిని ఏర్పాటు చేశారు. అందుకే మహాత్మాగాంధీ మొదలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, గోపాలస్వామి అయ్యర్, ఎన్జీ రంగా లాంటి మహనీయులు వ్యతిరేకించారు. కొందర్ని మేనేజ్ చేయడానికి ఈ పెద్దల సభలు ఉపయోగపడతాయని ఆనాడే గాంధీ పసిగట్టారు. ప్రస్తుతం ఆ విషయం మనకు కరెక్ట్గా సరిపోయే సందర్భం. ఎన్నికల్లో గెలవలేక పరాజయం పొందినవారికి మండలి పునరావాస కేంద్రంగా మారింది. ఖజానాపై భారం పడుతుంది. ప్రజలచే తిరస్కరణకు గురైన వ్యక్తులు గ్యాలరీలలో కూర్చొని ప్రభావితం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే శాసనసభ ఔన్నత్యాన్ని పడగొట్టాలని ఎత్తుగడలు వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? సెలెక్ట్ కమిటీని పద్ధతి ప్రకారం వేయలేదు. ఆ సభలో ఉండే చైర్మన్ రూల్స్ వక్రీకరించి నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ బిల్లును ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో టీడీపీ వాళ్లకు తెలియదా? మండలి అవసరం లేదని చంద్రబాబే చెప్పాడు అమరావతి ప్రాంత ప్రజలే చంద్రబాబు కుమారుడు లోకేష్ను ఓడిస్తే తిరిగి దొడ్డిదారిన తెచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టి మంత్రిని చేశారు. ఆయన మండలిలో కూర్చొని ఇది తప్పు..అది తప్పని చెబుతున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేసినట్టవుతుందా? కాదా? శాసనమండళ్లనే కాదు రాజ్యాంగపరమైన రాజ్యసభ రద్దుకు కూడా 1971, 72, 1975లలో ప్రయత్నాలు జరిగాయి. దేశ, ప్రజాక్షేమానికి భిన్నంగా వ్యవహరించినప్పుడు ఎవరో ఒక దేశ భక్తుడు ఈ ప్రయత్నం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ అవసరం వచ్చింది. మండలి అవసరం లేదని చంద్రబాబే అన్నాడు. అంతకుముందే మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేడ్కర్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు కాబట్టి..గాంధీజీ చెప్పిన మార్గంలోనే నడుద్దాం. సీఎం జగన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నా’ అని ధర్మాన పేర్కొన్నారు. మండలి రద్దు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రజా శ్రేయస్సు కోసం సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే శాసనమండలి అడుగడుగునా అడ్డు తగులుతోంది. మండలిలో టీడీపీ సభ్యులు స్వార్థ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించి ఉమ్మడి రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోవడానికి చంద్రబాబు కారణమయ్యారు. సోనియాతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా వద్దంటూ ప్రత్యేక ప్యాకేజీ కోసం తాపత్రయపడ్డారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనపెట్టి తన స్వార్థం కోసం అమరావతిని రాజధాని చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలను, పోలవరం ప్రాజెక్ట్ను మర్చిపోయారు. భవనాలు కట్టడమే అభివృద్ధి కాదు. దీనికి భిన్నంగా మా నాయకుడు వైఎస్ జగన్ 6 నెలల్లో అనేక కార్యక్రమాలు చేపట్టి పాలనను ప్రజల చెంతకు చేరుస్తుంటే సహించలేకపోతున్నారు. అమరావతిలో 4,500 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే పరమావధిగా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. 151 మంది ఎమ్మెల్యేలున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టిన ప్రతి బిల్లునూ తిప్పిపంపడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారు. శాసనమండలిని రద్దు చేయాలన్నది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. మండలి రద్దు చాలా సమంజసం. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే మండలి రద్దే మంచిది. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పూర్తిగా సమర్థిస్తున్నా. – ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని),ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటికల్ క్రిమినల్ పొలిటికల్ క్రిమినల్ ఎవరని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు చంద్రబాబే అని. చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టేలా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా ఆయన దొంగ రాజకీయాలు చేస్తున్నారు. గాయం చేసిన బాధ తెలిసిన వాడే సాయం చేయగలడన్నట్లు సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల గాయాలను తెలుసుకుని వారు కోరుకున్న విధంగా చట్టాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డు తగులుతున్నారు. ప్రజలు ఛీకొట్టిన నాయకుడు గ్యాలరీలో కూర్చుని ఆదేశిస్తే శాసనసభ ఆమోదించిన బిల్లును అవమానిస్తారా. తన దగుల్బాజీ రాజకీయాన్ని నిలదీస్తామనే చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారు. పెద్దల సభకు వైఎస్ జగన్ అనుభవజ్ఞులైన నాయకులను పంపితే చంద్రబాబు తన ఇంట్లోని దద్దమ్మను పంపారు. అఖిల భారత మేధావుల సంఘానికి అధ్యక్షుడినని తనకు తానే స్వయంగా ప్రకటించుకున్న యనమలకు సింగపూర్ వెళ్లి జ్ఞానదంతం పీకించుకున్నా జ్ఞానం రాలేదు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ముందు నోటీసు ఇవ్వాలని ఈ మేధావికి తెలియదా. ప్రజాభిప్రాయానికి, ప్రజాతీర్పుకు విలువ ఇవ్వని మండలి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకు శుభం కార్డు వేయాలి. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ప్రజాస్వామ్య ‘స్పిరిట్’తో మండలి తెస్తే టీడీపీ ఆల్కహాల్గా మార్చేసింది ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనం కోసం శాసనమండలిని చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయం చేయాలనుకుంటే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టేవారు. రాజకీయాలు ఫెయిర్గా ఉండాలనేది ముఖ్యమంత్రి అభిమతం. సీఎం వైఎస్ జగన్ అనుకుంటే ఆర్డినెన్స్ ద్వారా అయినా చట్టం తెచ్చేవారు కాదా? ప్రజాస్వామ్య బద్ధంగా ముందుకు వెళ్తుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. మండలి రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలి. ఇలాంటి మండలిని ఇంకా ఉండాలా? అని ఆలోచించాలి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే స్పిరిట్తో ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మండలిని తీసుకొస్తే.. చంద్రబాబు ఆ మండలిని ఆల్కహాల్గా మార్చేశారు. దేవాలయం లాంటి పెద్దల సభను దెయ్యాల కొంపగా మార్చారు. – చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ప్రభుత్వ విప్ ప్రజాస్వామ్యవాదుల్ని ఆశ్చర్యపరిచింది శాసనమండలిలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా సాగిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్య వాదుల్ని ఆశ్యర్యానికి గురి చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలన్నీ ఆయన ప్రయోజనాల కోసమే. శాసనమండలిలో చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఎండగట్టాల్సిందే. ఆయన పాలనలో దాడులు, అసమానతలు, ప్రాంతాలు, కులాల మధ్య వైషమ్యాలు చూశాం. రాష్ట్ర విభజనకు ఆయన లేఖ ఇచ్చారు. హోదా విషయంలో అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ బిల్లు తెస్తే.. మండలిలో టీడీపీ సభ్యులు ఎలా ప్రవర్తించారో అందరికీ తెలుసు. మండలి రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే ప్రజాభిమతాన్ని అడ్డుకోవడమేనా? చంద్రబాబు లాంటి వ్యక్తులకు రాజకీయ క్రీడగా మారిన శాసనమండలి, ప్రజా ప్రభుత్వం చేసిన చట్టాలను అడ్డుకోవడానికే పరిమితమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను మండలి అడ్డుకోవడం వెనుక చంద్రబాబు కుతంత్రాలున్నాయి. వ్యవస్థలన్నీ ఆధిపత్య వర్గం చేతిలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ పాలనను వికేంద్రీకరించి, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకు తెచ్చారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు పేదలను బానిసలను చేశాయి. విద్యుత్ సంస్కరణల పేరుతో చంద్రబాబు ఆ రంగాన్ని దోచుకుతిన్నారు. గ్రీన్ జోన్ పేరుతో అమరావతి రైతులను దగా చేసి, సింగపూర్ కంపెనీలకు మేలు చేకూర్చే ఒప్పందాలు చేసుకోవడమా చంద్రబాబు చేసిన రాజధాని అభివృద్ధి?. రైతులకు చేసిన పాపమే చంద్రబాబుకు శాపమైంది. అందుకే ఆయనకు 23 సీట్లు వచ్చాయి. కౌన్సిల్లో ఏదో జరిగిపోయిందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే వైఎస్ జగన్ మాదిరిగా 51 శాతం ఓట్లతో గెలిచిన నాయకుడు లేడు. ఎన్టీఆర్కు 1983లో 43 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 51 శాతం ఓట్లతో 151 సీట్లు సాధించిన ఏకైక మగాడు వైఎస్ జగన్. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేసిన చరిత్ర యనమలది మండలిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన బినామీలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి తెగబడ్డారు. మండలిలో టీడీపీ సభ్యులు సైంధవుల్లా వ్యవహరిస్తున్నారు. యనమల రామకృష్ణుడు వేసుకునే సూటు, బూటు కూడా ప్రభుత్వ సొమ్మే. ప్రభుత్వ సొమ్మును ఇంటి అద్దెలకు వాడుకున్న చరిత్ర యనమలది. ఇందుకు సంబంధించి జీవోలు ఉన్నాయి. రూ.లక్షల ప్రజాధనంతో దంత చికిత్సకు సింగపూర్ వెళ్లిన ఘనుడు యనమల. తన 39 ఏళ్ల రాజకీయ చరిత్రలో దుర్మార్గం తప్ప సొంత జిల్లాకు, తన నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఎన్టీఆర్కు పొడిచినట్లే ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. శాసనసభ్యులను ఆబోతులతో పోల్చిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. – దాడిశెట్టి రాజా, ప్రభుత్వ విప్ చంద్రబాబు అంటే వెన్నుపోటే గుర్తొస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చూస్తే ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి లాంటి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. చంద్రబాబును చూస్తే వెన్నుపోటు కళ్లముందు కదలాడుతుంది. చంద్రబాబు దొడ్డిదారి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మేనిఫెస్టోను వందకు వంద శాతం నెరవేర్చేలా సీఎం వైఎస్ జగన్ పనిచేస్తున్నారు. ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. ఒక్క ముస్లిం, మైనారిటీకి కూడా చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. మండలిపై కూడా చంద్రబాబు రెండు నాలుకల సిద్ధాంతాన్ని చూపించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అత్యంత జవాబుదారీతనంతో వ్యవహరిస్తోంది. – విడదల రజని, ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్ని గాయపరిచింది శాసనమండలిలో టీడీపీ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజల మనసును గాయపరిచింది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రకు ఒక గుర్తింపు వస్తున్న తరుణంలో టీడీపీ నేతలు దానిని చెడగొట్టే ప్రయత్నం చేశారు. మండలి రద్దుపై శాసన సభలో ఎలా చర్చిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తునారు. సభలో చర్చించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చర్చించాలా?. పెద్దల సభలో పెద్దలు లేరు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తులు, అవినీతి పరులు, ఆర్థిక నేరస్తులు, కొబ్బరి చిప్పలు అమ్ముకునేవారే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వికేంద్రీకరణ బిల్లుతో ఉత్తరాంధ్రకు ఎంతో మేలు జరుగుతుంది. దానిని అడ్డుకుని చంద్రబాబు మూడు గ్రామాలకు హీరో కావొచ్చు. కానీ.. 13 జిల్లాలకు విలన్ అయ్యారు. – గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎమ్మెల్యే చంద్రబాబుది నక్షత్రకుడి పాత్ర రాయలసీమది ఘనమైన చరిత్ర. రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని చిత్రీకరించి టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచే దుష్ప్రచారం మొదలు పెట్టింది. శ్రీమహావిష్ణువు స్వయంభువుగా వెలసిన తిరుపతి రాయలసీమలోనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యులు, వేమన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి వారు రాయలసీమ వారు కాదా? ఎన్టీఆర్తో అద్భుతమైన హిట్ చిత్రాలు నిర్మించిన కేవీ రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి వారు రాయలసీమ వారు కాదా?. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్మనీ సెక్స్ రాకెట్ నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ఆయన తాత రాజారెడ్డి గురించి ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావిస్తున్నారు. ‘రాజారెడ్డి లాంటి ఉత్తమోత్తమమైన వ్యక్తి చాలా అరుదుగా రాజకీయాల్లో ఉంటారు. ఆయనతో 23 ఏళ్లు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా చెబుతున్నాను. కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ పాత్రికేయుడు, గొప్ప దార్శనికుడు గజ్జెల మల్లారెడ్డికి అత్యంత ప్రాణసఖుడు రాజారెడ్డి. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి నీచంగా మాట్లాడటం చంద్రబాబుకే చెల్లింది. – భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే జగన్ వల్ల నాకు శాప విముక్తి పొలిటికల్ ట్రాప్లో పడి ఎన్టీఆర్ అంతటి గొప్ప వ్యక్తికి వెన్నుపోటు పొడిచానని, అందుకు 15 సంవత్సరాలు రాజకీయంగా తెరమరుగయ్యానని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్ల తనకు శాపవిముక్తి జరిగిందన్నారు. గొప్ప వ్యక్తుల వల్లే శాప విముక్తి జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్కు వెన్నుపోటు అంశాన్ని ప్రస్తావించగా స్పీకర్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. విస్తృత చర్చ జరగాలి..: ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ మాట్లాడుతూ సభాపతులు అనుసరించాల్సిన నిబంధనలు మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన స్పీకర్ల సమావేశాల్లో ఫిరాయింపుల నిరోధక చట్టాలపై మంచి చర్చలు జరిగాయన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి తమ పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాల్సిందేనని తమ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కచ్చితంగా చెబుతున్నారని తాను చాలా స్పీకర్ల సమావేశాల్లో చెప్పానని తెలిపారు. దీనిపై రాజ్యాంగ సమీక్ష జరగాలనే అభిప్రాయం వ్యక్తమైందన్నారు. బోస్ ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, దానిపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరముందని స్పీకర్ అన్నారు. అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి? భావితరాల భవిష్యత్ కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసే చట్టాలను అడ్డుకోవడానికే శాసనమండలిని చంద్రబాబు లాంటి వాళ్లు వాడుకుంటున్నారు. మహా యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లుగా జగన్ ప్రజా శ్రేయస్సు కోసం చేసే ప్రతి పనినీ చంద్రబాబు అడ్డుకుంటున్నారు. శాసనసభలో ఆమోదించిన చట్టానికి సూచనలు చేయాల్సిన బాధ్యత గల మండలి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయాల్సిందే. ఇంగ్లిష్ మీడియం విద్య బిల్లు, ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్ ఏర్పాటు చేసే చట్టాలను అసెంబ్లీ ఆమోదిస్తే కౌన్సిల్ అడ్డుకోవడం ఏమిటి. శాసనసభలో తాటకి మాదిరిగా చంద్రబాబు, కౌన్సిల్లో సుబాహు మాదిరిగా ఆయన కుమారుడు అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు. కుట్రలు, కుతంత్రాలుతో నిండిన చంద్రబాబు నాయకత్వంలో ఉన్న టీడీపీ దుర్మార్గాలకు తెర తీస్తోంది. శాసన మండలి రద్దు గురించి చంద్రబాబు చెప్పే సుద్దులు విడ్డూరంగా ఉన్నాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీ 2004లో మండలి పునరుద్ధరణపై వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను అందరూ గమనించాలి (అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడిన వీడియో ప్రదర్శించారు). రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన మండలి రాష్ట్రానికి ఆర్థిక భారమన్న చంద్రబాబు ఇప్పుడు కావాలనడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనం. చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలమని లేఖ ఇచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టిన తరువాత మీరెవరు విడగొట్టేందుకు అని బస్సులో బయల్దేరారు. వాజ్పేయి ప్రభుత్వాన్ని మతతత్వ పార్టీ అని, తాను మద్దతు ఇవ్వనని చెప్పిన చంద్రబాబు తరువాత ఆ పార్టీతోనే జత కట్టారు. ప్రధాని మోదీ కాళ్లకు దండం పెట్టి బీజేపీతో అంటకాగారు. పత్రికారంగంలో దుర్మార్గ పోకడలు హేయం. – పేర్ని నాని, రవాణా, సమాచార శాఖ మంత్రి -
ప్రజా ప్రయోజనాల కోసమే..
చంద్రబాబులా బాహుబలి లాంటి గ్రాఫిక్స్ సినిమాలు చూపించకుండా మనకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని ఆశ పడితే అది తప్పా? ప్రజలకు మంచి చేసే నిర్ణయాల్లో ఆలస్యం జరగకూడదు. కుట్రలతో మంచి పనులు ఆగిపోవడం నాకిష్టం లేదు. అందుకే మండలి రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని ప్రజలంతా అర్థం చేసుకుని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. ‘ద టైమ్ ఈజ్ ఆల్వేస్ రైట్ టు డూ.. వాట్ ఈజ్ రైట్..’ (మంచి చేయాలనుకున్నప్పుడు ఏ సమయమైనా మంచిదే) అని చెప్పిన అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ సూక్తిని ఈ సందర్భంగా అంతా గుర్తు చేసుకోవాలి. -సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ప్రజలకు మేలు జరగకుండా అడ్డుకునే రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో నడుస్తున్నందు వల్లే శాసన మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మండలి రద్దు తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ దీనికి కారణాలను సోదాహరణంగా వివరించారు. అసలు శాసనమండలి ఏర్పాటు ఉద్దేశం ఏమిటి? దీన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? గతంలో దీన్ని సమర్థించిన పత్రికలు, టీడీపీ ఇప్పుడు ఎలా యూటర్న్ తీసుకున్నాయి? అనే అంశాలను వివరించారు. నాడు రామోజీరావు కోసం శాసనమండలిని రద్దు చేయాలని ఎన్టీఆర్ ప్రభుత్వం తీర్మానం చేస్తే అద్భుత నిర్ణయమని ప్రశంసిస్తూ సంపాదకీయాలు రాసిన ఈనాడుకు ఇవాళ ప్రజా ప్రయోజనాల కోసం తాము తీసుకున్న నిర్ణయం తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. ఇదేనా మీ ద్వంద్వనీతి? అని ప్రశ్నించారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా.. వద్దా? ‘‘అధ్యక్షా.. ముఖ్యమైన నిర్ణయం కోసం ఈరోజు శాసనసభ సమావేశమవుతున్న సంగతి మనతోపాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మనందరి ముందు ఉన్న ప్రశ్న కేవలం మండలి భవిష్యత్తుకు సంబంధించింది కాదు. ప్రజాస్వామ్యాన్ని మనమంతా బతికించుకోవాలా.. వద్దా? అన్న ప్రశ్న మనముందు ఉంది. ప్రజా ప్రభుత్వాలు సజావుగా పని చేయలా.. వద్దా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (2) ప్రకారం సీఎం నేతృత్వంలోని క్యాబినెట్ నేరుగా శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే ఇది నేరుగా ప్రజలు ఎన్నుకున్న సభ కాబట్టి. భరించలేక వద్దనుకున్నాయి.. ఇప్పుడు శాసనమండలి దేశంలో 28 రాష్ట్రాలకు గాను కేవలం ఆరు చోట్ల మాత్రమే ఉంది. (కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర). మండలిని భరించలేక ఈ వ్యవస్థ వద్దని పశ్చిమ బెంగాల్, అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ఉపసంహరించుకున్నాయి. నాడు మాకు బలమున్నా కొనుగోలు చేసి గెలిచారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరులో మాకు బలమున్నా అతి నీచంగా కొనుగోలు చేసి గెలిచారు. అప్పుడూ ఈ ఎల్లో మీడియా చంద్రబాబును ఒక్కరోజైనా ప్రశ్నించలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను లాక్కుని చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కకుండా చేసే అవకాశం ఉన్నా అలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు నేను పూర్తిగా దూరం. ఇదే విషయాన్ని తొలిరోజే సభలో చెప్పా. ఇప్పటికీ ఆ మాటకే కట్టుబడి ఉన్నా అని చెప్పడానికి గర్వపడుతున్నా. రాజకీయాలను మార్చడానికి ఈ చట్టసభలో అడుగుపెట్టామే తప్ప రాజకీయాలు చేయడానికి కాదు. మండలి తప్పనిసరి కాదు రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీ శాసన మండలి తప్పనిసరి అనుకుని ఉంటే ప్రతి రాష్ట్రంలోనూ రద్దు చేయడానికి వీలులేని విధంగా మండలిని ఏర్పాటు చేసి ఉండేది. రెండో సభను ఆప్షనల్గా రాష్ట్ర శాసనసభ నిర్ణయానికే వదిలేసి మండలి రద్దు అధికారాన్ని కూడా ఆర్టికల్ 169 ప్రకారం అసెంబ్లీకే అప్పగించారు. దేశంలో చదువుకున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్న రోజుల్లో.. మేధావులు, విజ్ఞులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా మండలి ఏర్పాటు చేసుకునే వీలు రాష్ట్రాలకు కల్పించారు. నేటి శాసనసభలో అలాంటి దుస్థితి లేదు. ఇదే శాసనసభలో ముగ్గురు పీహెచ్డీ చేసినవారు, 38 మంది పీజీ చేసినవారు, 13 మంది డాక్టర్లు, 14 మంది ఇంజనీర్లు, 68 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు సివిల్ సర్వీసెస్ అధికారులు, ఇద్దరు గ్రూప్ – 1 అధికారులు, 1 ప్రొఫెసర్, 1 జర్నలిస్టు, ఇద్దరు ఉపాధ్యాయులు, రైతులు కూడా ఉన్నారు. వీరంతా ప్రజలు నేరుగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. ఇలాంటప్పుడు మండలి అవసరం ఏముంది? సోమవారం శాసన మండలి రద్దు తీర్మానంపై చర్చిస్తున్న అసెంబ్లీ కాలయాపనకే కౌన్సిల్.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయ కోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్న మండళ్లను ఏమనాలి? కాలయాపన, ప్రజా ప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించడం లేదు. ప్రజా ప్రయోజనం లేని మండలిపై డబ్బులు ఖర్చు చేయడం శుద్ధ దండగ. ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేందుకు ఈ మండలికి అర్హత లేదు. ఇటువంటి మండలికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా? అని అంతా ఆలోచించాలి. మండలికి శాసనసభ జవాబుదారీ కాదు. పేదలు రూపాయి కూడా ఖర్చు చేయకుండా వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం బిల్లు తెచ్చినా, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం తెచ్చిన ప్రత్యేక కమిషన్ బిల్లు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకున్న మండలి కారణంగా ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలుగుతోంది. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ఎలా హాని చేయాలి? బిల్లులను ఎలా అడ్డుకోవాలి? కత్తిరించాలి? అనే దిక్కుమాలిన ఆలోచనలు చేసే అలాంటి సభ మనకు అవసరమా? అన్నది ఆలోచన చేయాలి. నాడు ఈనాడు సమర్థించలేదా..? మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శాసనమండలిని రద్దు చేసినప్పుడు టీడీపీ పాంప్లేట్ పేపర్ ఈనాడు దాన్ని సమర్థిస్తూ సంపాదకీయాలు రాసింది. అప్పుడు ఈనాడు ఏమేం రాసిందంటే... (క్లిప్పింగ్లను సీఎం చదివారు) అనుభవంలో వాటి (మండళ్ల) నిష్ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్ని రాష్ట్రాలు తర్వాత ఆ బురదను కడుక్కున్నాయి. అందుకు పార్లమెంట్ కూడా ఆమోదముద్ర వేసింది. అందుచేత ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం లెజిస్లేటివ్ కౌన్సిల్ను రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి రాజకీయ దురుద్దేశాలు ఆపాదించి రభస చేయనవసరం లేదు. నిరర్ధకమే కాక గుదిబండలా కూడా తయారైన కౌన్సిల్ రద్దు గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దు వల్ల ఏదో జరగరాని ప్రమాదం జరిగినట్లు గుండెలు బాదుకోవాల్సిన అవసరమూ లేదు. ప్రజలు అఖండమైన మెజార్టీతో గెలిపించిన ప్రజాప్రతినిధులు చేసిన నిర్ణయాన్ని అంగీకరించకుండా అడ్డుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యానికి పంగనామం పెట్టడమే అవుతుంది.రాజకీయంగా సంభవించిన పరాజయాన్ని మరో మార్గంలో విజయంగా మార్చుకోవటానికి పన్నే వ్యూహాలు ఏ పార్టీకైనా మంచిపేరు తీసుకురాలేవు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షం గుర్తించి సవ్యమైన పద్ధతిలో కృషి చేసినప్పుడే మళ్లీ పుంజుకునే అవకాశం లభించవచ్చు. అంత ఓర్పు లేక అడ్డదారులు తొక్కితే పరిస్థితి మరింత దుస్థితిగా పరిణమిస్తుంది. ఇలా ఎంత చక్కగా రాశారు అధ్యక్షా అప్పట్లో! రామోజీ కోసం రద్దు చేశారు.. ఆనాడు మండలిని ఒక మనిషి కోసం రద్దు చేశారు అధ్యక్షా. ఆ మనిషి సాక్షాత్తూ ఈనాడు అధినేత రామోజీరావు. ఆనాటి రాజకీయాల గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్నవారందరికీ ఈ విషయం తెలుసు. ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా మండలినే రద్దు చేసిన పరిస్థితి. అటువంటి మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప సంపాదకీయాలు రాశారు. ఈరోజు కోట్లాది మంది ప్రజల ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు రాజకీయ కోణంతో అడ్డుతగులుతున్నారు. అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలి రద్దు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. మండలిని కొనసాగిస్తే వచ్చే ఏడాది మా పార్టీకి మెజారిటీ వస్తుందని తెలిసినా ప్రజల అవసరాలు, ప్రభుత్వ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని మండలి రద్దు కోసం తీర్మానం చేస్తున్నాం. ఆకర్ష్ అంటూ సిగ్గుమాలిన రాతలు.. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ చంద్రబాబు పత్రికలు సిగ్గుమాలిన రాతలు రాస్తున్నాయి. ఇంత దిగజారిన రాతలు చంద్రబాబు పత్రికల్లో చూస్తున్నాం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వీళ్లంతా చంద్రబాబు హయాంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే ఏ రోజైనా కనీసం నోరెత్తారా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోతే ఎల్లో మీడియా కనీసం నోరెత్తలేదు. మా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు 23 మంది మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిస్తే ఈనాడు, ‘చంద్ర’జ్యోతి, టీవీ 5 ఎందుకు ప్రశ్నించలేదు? నోరెత్తకపోగా చంద్రబాబు గొప్ప రాజనీతి చాణక్యుడని, ఆయన పరిపాలన చూసి ముగ్దులై ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటూ దిక్కుమాలిన కథనాలు రాశాయి. చర్చ జరగాలనే మూడు రోజులు టైం మండలి రద్దు గురించే సభ పెడుతున్నామని గురువారం నాడే చెప్పాం. ప్రజలు చర్చించుకోవాలని సమయమిచ్చినా ఎమ్మెల్సీలను రూ. 5 కోట్లకు కొంటున్నామని టీడీపీ అనుకూల పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. మేం సమయం ఇవ్వకుంటే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపణలు చేసేవారు. విలువలు, విశ్వసనీయత లేని వారు ఎవరో, అవసరానికి తగ్గట్టు మాటలు మార్చే నైజం ఎవరిదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ప్రత్యేక హోదా విషయంలో, మోదీ విషయంలో, కాంగ్రెస్ పార్టీ విషయంలో, బీజేపీ విషయంలో, మండలి విషయంలో చంద్రబాబు ఎన్నెన్ని యూటర్న్లు తీసుకున్నాడో గత ఐదేళ్లలో చాలా చూశాం. నిజంగా మాటలు ఎవరు మార్చారో ఒక్కసారి వీటిని చూస్తే తెలుస్తుంది (బాబు వివిధ సందర్భాల్లో చేసిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యల క్లిప్పింగ్లను ప్రదర్శించారు). అవసరం తీరిన తరువాత ఎవరినైనా వెన్నుపోటు పొడవటానికి ఏమాత్రం వెనుకాడని వ్యక్తి బాబు. చంద్రబాబు యూటర్నులు కాంగ్రెస్ పార్టీ గురించి ముందు.. - కాంగ్రెస్ పార్టీ ఓ పార్టీనా? చెత్త పార్టీ. ఇది సోనియాగాంధీ సామ్రాజ్యం కాదు. ఇది ఇటలీ కాదు ఇది ఇండియా - కాంగ్రెస్కు సహకరిస్తే వారిని ఏమనాలి...? ఆ పార్టీనే శాశ్వతంగా బాయ్కాట్ చేయాలి. అప్పుడు కూడా కసి తీరదు - సోనియా, రాహుల్ ఇంతవరకు ఒక్క మాట అయినా విభజన గురించి మాట్లాడారా? మీకు చేతకాదా? మీరు నాయకులా? ఏమనుకుంటున్నారు మీ గురించి అని అడుగుతున్నా. - ఆ మహాతల్లి (సోనియా)కి ఎక్కడ లేని డబ్బు పిచ్చి. డబ్బులు లేకపోతే ఆవిడకు నిద్ర పట్టదు. సోనియా ఇటలీ నుంచి వచ్చింది. మన కష్టాలు తెలిసిన వ్యక్తా? కాదు. - కాంగ్రెస్ను ఎండగడతాం. ఈ దేశంలో కాంగ్రెస్ను దోషిగా నిలబెడతా. కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీదకు వెళ్లిపోయింది. ఆ వెంటిలేటర్ ఎప్పుడు తీసేస్తే అప్పుడు చనిపోతుంది. - కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ఆలోచన చేస్తోంది. నీచమైన రాజకీయాలు చేస్తోంది. æ సోనియాగాంధీ ఈ దేశానికి వచ్చి, ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఈ రోజు అభద్రతాభావంతో బతికే పరిస్థితి తీసుకువచ్చిందంటే చాలా దుర్మార్గం - తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీతో రాజీ పడలేదు. కాంగ్రెస్ పార్టీతో పోరాడాం. కాంగ్రెస్తో లాలూచీ పడే పరిస్థితి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉండదు. ఉండబోదు తరువాత - కాంగ్రెస్, మేమూ కలసి పనిచేస్తున్నాం. మా మధ్య సమస్య ఉండదు. మేము కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. - పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్పార్టీ. 90 శాతం డబ్బులు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. - మోదీ ఎన్నికల్లో ఓడిపోతున్నారు. కొత్త ప్రధాని వస్తారు. - మేము కూర్చొని మాట్లాడుతున్నాం. రాహుల్ను కూడా ఆయన పార్టీలో చర్చించమని కోరా. మేం ఓ ఉమ్మడి వేదిక మీదకు వస్తాం. కలసి ఎలా పనిచేయాలన్నది నిర్ణయిస్తాం. నరేంద్ర మోదీ గురించి ముందు.. - మోదీ సమర్థుడు. ఆయన ప్రధాని కాబోతున్నారు. ఎవరూ అడ్డుకోలేరు. నాదీ నరేంద్రమోదీదీ విన్విన్ కాంబినేషన్. - అభివృద్ధి కోసం మోదీతో కలసి పనిచేయాలని భావిస్తున్నాను. - స్వాతంత్య్రం వచ్చిన తరువాత చాలామంది ప్రధానమంత్రులు వచ్చారు. కానీ భారతదేశం ప్రతిష్టను ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్రమోదీ. - సమర్థుడైన మోదీ నాయకత్వంలో భారతదేశం త్వరలోనే సూపర్వపర్గా తయారవుతుంది. - మోదీ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యారు. తరువాత... - గురువుకు నామాలు పెట్టింది నరేంద్ర మోదీ. తల్లిని చూడలేదు. తల్లికి బిచ్చం పెట్టనివాడు దేశాన్ని ఉద్దరిస్తాడంట. - నరేంద్రమోదీ కంటే మిగతా నాయకులంతా మెరుగైన వారే. - నరేంద్రమోదీ కరుడుగట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. - నరేంద్ర మోదీకి ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. - హుందాతనం ఏమైంది. పోలవరం ఈయన ఇచ్చాడంటాడు... ఈయన ఇచ్చేదేంటి పోలవరం. మన రాజధాని శంకుస్థాపనకు ఆయన్ని పిలిచాను. ఏం ఇచ్చారు...మట్టీ, నీళ్లు మన ముఖాన కొట్టాడు. - మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ ప్రత్యేక హోదా గురించి ముందు .. - ప్రత్యేక హోదా ఇవ్వాలి ఐదేళ్లు ఇచ్చారు. నరేంద్రమోదీని కోరుతున్నా 15 ఏళ్లు ఇవ్వండి. ఐదేళ్లలో పరిశ్రమలు రావాలంటే రెండుమూడేళ్లవుతుంది. అది ప్రారంభమయ్యేలోగా ప్రత్యేక హోదా పోతే మళ్లీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకే కనీసం 15ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నా. తరువాత - కావాలని కొందరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తే అదేదో సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ప్రత్యేక హోదా వస్తే ఏమవుతుందండి? రెండే వస్తాయి. ఒకటి ఈఏపీ... రెండు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీములు తగ్గించేశారు. 62 శాతం నుంచి 52శాతానికి వచ్చింది. ఇక ఈఏపీ ఏంటీ... కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు ఇస్తే ...మళ్లా వాళ్లు మంత్రిమండలిలో ఆమోదించాలి. - నేను మొదట అడిగింది ప్రత్యేక హోదానే. కాదు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారన్నారనుకో. నేను కాదనను కదా. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? - ప్రత్యేక హోదాతోనే మొత్తం అయిపోతుంది. స్వర్గం అయిపోతుందని చెబుతున్నారు. పదేళ్లు , పదిహేనేళ్లు ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదేం... - ఈ రోజు కేంద్రం ఇచ్చిందానికి అభినందిస్తూనే...వాళ్లు ఎంతిచ్చినా తీసుకోవడం...ముందుకు పోవడం తప్పా మనకు మరో మార్గం లేదు. మళ్లీ : ప్రత్యేక హోదా మినహా మనకు మరో మార్గం లేదు. చంద్రబాబూ ఈ ప్రశ్నలకు బదులేది? - ఎస్సీ ఎస్టీలకు గతంలో ఒకటే కమిషన్ ఉండేది. వారి క్షేమాన్ని కాంక్షించి ఇప్పుడు వేర్వేరుగా కమిషన్లు తెచ్చాం. దీన్ని అడ్డుకోవడం చంద్రబాబు చేసిన తప్పు కాదా? - రూపాయి ఖర్చు లేకుండా పేద పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియం చదువులు తేవడం న్యాయమా.. అన్యాయమా? - ఏ అన్యాయం జరిగిందని ఆయన అమరావతి రైతులతో ఉద్యమాలు చేయిస్తున్నారు? రైతులకు కౌలు (యాన్యుటి) 15 ఏళ్లకు పెంచడం అన్యాయమా? - రాజధానిలో భూమి లేని నిరుపేదలకు జీవనభృతి రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచడం అన్యాయమా? - అసైన్డు రైతులకు కూడా మామూలు రైతులతో సమానంగా ప్లాట్లు ఇవ్వడం మేం చేసిన తప్పా? - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగితే నేరమా? - వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మార్చాలనుకోవడం నేరమా? - స్వాతంత్య్రానికి పూర్వం 1937నాటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలనుకోవడం తప్పా? -
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
-
మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన శాసనమండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన 133 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. అనంతరం తీర్మానం ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ తెలిపారు. మండలిని రద్దు చేయాలని సోమవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా పెద్దల సభను రద్దు చేయాలని తీర్మానించి.. దానిని సీఎం జగన్ శాసనసభ ముందు ఉంచారు. దీనిపై రోజంతా సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మండలిని రద్దు చేస్తున్నట్లు సభ్యులంతా తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. (మండలి రద్దుకు గర్వపడుతున్నాం: సీఎం జగన్) చర్చలో భాగంగా మండలి రద్దు తీర్మానంపై ప్రసంగించిన సీఎం జగన్.. దీనికి ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. అనంతరం సభలో ఓటింగ్కు పెడుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ సీతారాం ప్రకటించారు. ముందుగా సభలో సభ్యులు కాని మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోష్లను పక్కన కూర్చోవాలని సూచించారు. అనంతరం సభలో ఓటింగ్ చేపట్టి.. ఆమోదం పొందినట్లు ప్రకటించారు. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి పంపనుంది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన అనంతరం సభ పూర్తిగా రద్దు కానుంది. కాగా ఏపీలో శాసనమండలి రద్దు కావడం ఇది రెండోసారి. తొలిసారి మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్ రద్దు చేసిన విషయం తెలిసిందే. -
చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారు
-
మండలి రద్దు తీర్మానంకు మద్దతు : రాపాక
సాక్షి, అమరావతి : శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో టీడీపీ అడ్డుతగలడం దారుణమన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగత్తిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి సందర్భంలోనూ టీడీపీ అడ్డుపడటం దురదృష్టకరమన్నారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ భాగంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు. అసెంబ్లీలో మేధావులు, డాక్టర్లు, ఐపీఎస్ అధికారులు ఉండగా.. ఇక పెద్దల సభ ఎందుకంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో తాను కూడా ఏకీభవిస్తున్నా అని అన్నారు. ఇంతమంది రాజకీయ ప్రముఖులు ఉన్నాక.. మళ్లీ మండలి అవసరం లేదని రాపాక స్పష్టం చేశారు. శాసనసభలో రాపాక మాట్లాడుతూ.. ‘154 మంది శాసన సభ్యలు ఆమోదం తెలిపిన బిల్లును మండలి తిరస్కరించడం దురదృష్టకరం. ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా మండలిలో టీడీపీ అడ్డుకుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఆయన స్థాయికి దిగజారి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా మండలి చైర్మన్ షరీఫ్ను కూడా ఆయన ప్రభావితం చేశారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతున్నాను అని చెప్పడానికి చైర్మన్ ఎంతో ఇబ్బంది పడ్డారు. ఈ విధంగా చేయడం చంద్రబాబుకు సరికాదు. అన్నాతమ్ముడిలా.. కలిసి జీవించే మాల, మాదిగలను రెండుగా చీల్చిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. బ్రిటీష్ సాంప్రదాయాలను పాటిస్తూ విభజించి పాలించే అనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. గడిచిన ఆరు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సీఎం జగన్ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధి కొరకు సీఎం జగన్ చేపడుతున్న చర్యలు అభినందనీయం. అన్ని వర్గాలు, ప్రాంతాలను అయన సమానంగా చూస్తున్నారు’ అని తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
శాసన మండలిపై టీడీపీ దొంగాట!
సాక్షి, అమరావతి: ‘‘నేను అధికారంలో ఉన్నా ప్రజలకే రిస్కు.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకే రిస్కు.. ఏదేమైనా నాకు అనుకూలంగా ఉన్నంతవరకే.. నా వరకు రానంతవరకే.. నా పార్టీ గనుక మునిగిపోయే పరిస్థితి వస్తే.. ఎందాకైనా వెళ్లడానికి నేను రెడీ అన్నట్లుగా ఉంది’’ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి అంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు... ఊసరవెల్లి మాదిరిగా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తారంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తారన్న విషయం తెలిసిందే. ఏ విషయాన్ని అయినా తనకు అనుకూలంగా మార్చుకుంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆయన తీరుపై విమర్శలు గుప్పిస్తారు. ఇక తాజాగా శాసన మండలి రద్దు విషయంలోనూ ఆయన అనుసరిస్తున్న విధానంపై అదే రీతిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు కీలక బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్న విషయం విదితమే. అసెంబ్లీలో చర్చించి, ఆమోదించిన బిల్లులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన కర్తవ్యాన్ని మరచి.. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం మండలిని వాడుకుంటుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) ఈ నేపథ్యంలో శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసన సభలో ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సభకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మండలి అంశంలో గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. 2004లో శాసన సభలో చంద్రబాబు మాట్లాడిన మాటలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జూలై 8, 2004లో అసెంబ్లీలో మండలి ఏర్పాటుపై చంద్రబాబు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. పదవులు అధికారం కోసం కాంగ్రెస్ వాళ్లు ఆత్రంగా ఉన్నారంటూ ఆనాడు ఆయన వ్యాఖ్యలు చేశారు.(అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన) ఆనాడు చంద్రబాబు ఏమన్నారంటే.. ‘‘అధికారపక్షం ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారు. కేవలం పదవుల కోసమే మండలిని పునరుద్ధరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు మండలి వల్ల ఎలాంటి లాభం లేదు. ఒకప్పుడు అక్షరాస్యతా శాతం తక్కువగా ఉండేది. కాబట్టి పెద్దలు అవసరం. ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మంచి క్వాలిటీ ఉంది. అనుభవం ఉంది. మండలి వస్తే, శాసనాలు పాస్ కావడంలో ఆలస్యం అవుతుంది. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అవుతుందని మన్స్ఫర్డ్ కమిటీ కూడా చెప్పింది. 1930 రౌండ్ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్పార్టీ కూడా మండలిని వ్యతిరేకించింది. అక్టోబరు 26, 1934న అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో కూడా బాబు రాజేంద్రప్రసాద్ మండలిని వ్యతిరేకించారు. మండలి వల్ల లాభం ఉండదని రాజేంద్రప్రసాద్ అన్నారు. 1950 నుంచి కేవలం 8 రాష్ట్రాల్లోనే శాసన మండలి ఏర్పాటైంది. వాటిలో 3 చోట్ల రద్దయింది మండలి వల్ల ఏటా రూ. 20 కోట్ల ఆర్థిక భారం. ఒక బిల్లు మండలికి వెళ్లి అక్కడ పాస్ అయినా లేదా తిప్పి పంపితే మళ్లీ కాలాయాపన. ఏ బిల్లునైనా ఆపే అధికారం మండలికి కేవలం 4 నెలలే ఉంటుంది. కనీసం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే హక్కు కూడా మండలి సభ్యులకు లేదు.(‘చంద్రబాబు కోరుకున్నదే.. మేము అమలు చేస్తున్నాం’) ఇక ఆర్థికేతర విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలంటూ ఏమీ లేవు. ఆర్థిక బిల్లులన్నీ శాసన సభే ఆమోదించే పరిస్థితి వస్తుంది. రాజ్యాంగ సవరణలు వచ్చినా శాసన సభకు తప్ప మండలికి ప్రమేయం ఉండదు. పరిమిత అధికారాలు తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. మేధావులు కూడా మండలికి వస్తారనుకోవడం లేదు. 1958లో నీలం సంజీవరెడ్డి నేతృత్వంలో మండలి ఏర్పాటేతే అది ఒక పునరావాస కేంద్రంగా మారింది. 1978లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో వ్యతిరేకించిన ప్రతిపక్ష నేతలను కలుపుకోవడానికి మండలిని వాడుకున్నారు. ప్రజలపైన ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో మే 31, 1985న నాటి సీఎం ఎన్టీఆర్ రద్దు చేశారు. జనవరి 23, 1990న మండలి కావాలని చెన్నారెడ్డి తీర్మానం చేస్తే నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తిరస్కరించింది. మండలి పెట్టాలంటే రెఫరెండం పెట్టాలి. చాలా రాష్ట్రాలు మండలి కావాలని అడిగినా కేంద్రం ఒప్పుకోలేదు. అనేక కారణాల వల్ల మండలి కావాలన్న బిల్లు లోక్సభలో లేదా రాజ్యసభలో తిరస్కరిస్తున్నారు’’ అని చంద్రబాబు మండలిపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే ఇప్పుడు తన రాజకీయ ప్రయోజనాలకు భంగం కలుగుతుందనే కారణంతో శాసన సభ.. మండలిని రద్దు చేసే తీర్మానంలో చర్చపై కనీసం పాల్గొనలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. -
అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం జగన్
-
మండలి రద్దుకు తీర్మానం ప్రతిపాదించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంచలన నిర్ణయానికి వేదికగా మారింది. రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానం శాసనసభ ముందుకొచ్చింది. సోమవారం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండలిని రద్దు చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చ చేపట్టింది. (ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం) మండలి రద్దు తీర్మానంపై డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చర్చను ఆరంభించారు. ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని, మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో భూముల కొనుక్కున్న టీడీపీ నేతలే కావాలని రచ్చ చేస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను నివారించేందుకే మూడు రాజధానులు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం శాసన మండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. మంత్రివర్గం నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)ని సమావేశపరిచారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరుకాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు శాసనసభ ప్రారంభం కాగానే మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులతో పాటు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు వంటి కీలకమైన బిల్లులను మండలి తిరిస్కరించిన విషయం తెలిసిందే. (‘సీఎం జగన్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం’) -
రాజకీయ దురుద్దేశంతో బిల్లులను అడ్డుకున్నారు
-
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు..!
-
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన పలు కీలక బిల్లులకు అడ్డు తగులుతున్న శాసన మండలి రద్దే సరైందని మంత్రివర్గం భావించింది. ఈ మేరకు మండలి రద్దుకు సంబంధించి శాసన సభలో సోమవారం ప్రవేశపెట్టే తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు కేబినెట్ భేటీలో భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించినట్టు తెలిసింది. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం కానుంది. శాసన మండలి రద్దు తీర్మానాన్ని ప్రభుత్వం కేంద్రం ఆమోదానికి పంపనుంది. (చదవండి : ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా?) ⇒ ఏపీలో మండలి రద్దు కావడం ఇది రెండోసారి ⇒ శాసన మండలిని మే 31, 1985న రద్దు చేసిన నాటి సీఎం ఎన్టీఆర్ ⇒ మార్చి 30, 2007న తిరిగి మండలి పునరుద్దరణ ⇒ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి విడిగా శాసన మండలి ⇒ మండలి రద్దుపై తీర్మానం చేయనున్న శాసన సభ ⇒ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం ⇒ ఆర్టికల్ 169 ద్వారా ఏ రాష్ట్ర మండలినైనా రద్దు చేసే అధికారం ⇒ పార్లమెంట్ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో రద్దు కానున్న మండలి ⇒ ఇప్పటికే చాలాచోట్ల మండలిని పక్కనపెట్టిన రాష్ట్రాలు ⇒ దేశవ్యాప్తంగా కేవలం 6 రాష్ట్రాల్లోనే శాసన మండలి ⇒ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, యూపీలోనే పెద్దల సభ ⇒ మండలిని పునరుద్దరించాలంటూ 5 రాష్ట్రాల్లో వినతులు ⇒ అసోం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, బెంగాల్లో మండలి కోసం వినతులు ⇒ మండలి పునరుద్దరించాలన్న ఐదు రాష్ట్రాల వినతుల పట్ల కేంద్రం విముఖత ⇒ మండలి వల్ల ఆర్థికంగా రాష్ట్రంపై భారీగా భారమన్న భావనలో కేంద్రం -
ప్రారంభమైన ఏపీ మంత్రివర్గ సమావేశం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. శాసనమండలి రద్దుపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ నిర్ణయం తర్వాత అసెంబ్లీ చర్చించి, ఆ తర్వాత తీర్మానం చేయనుంది. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం పోర్టులపై మంత్రివర్గం చర్చించనుంది. (శాసనమండలిపై నేడే నిర్ణయం) కాగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. అలాగే అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు.(టీడీపీ తప్పుడు ప్రచారం.. వెలుగులోకి అసలు నిజం..!) -
శాసనమండలిపై నేడే నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలి విషయంలో ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో చర్చించి, ఆమోదించిన బిల్లులపై సలహాలు, సూచనలు ఇవ్వడం శాసన మండలి ప్రధాన కర్తవ్యం. కానీ, ప్రతిపక్షం రాజకీయ కారణాలతో కీలక బిల్లులకు అడ్డుపడుతుండడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లులను సైతం మండలిలో టీడీపీ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో మండలిపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. రద్దుకు అనుకూలంగానే నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లెజిస్లేటివ్ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్ రాజధాని, జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మండలిని రద్దు చేయాలని ఎమ్మెల్యేల సూచన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు ఆమోదించిన బిల్లులను మండలిలో నిలిపివేయడంపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటున్న మండలి అవసరమా? అనేదానిపై సోమవారం విస్తృతంగా చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. -
జనవరి 27న ఏపీ కేబినెట్ భేటీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి జనవరి 27న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. కాగా, రాజకీయ అజెండాతో నడుపుతున్న శాసనమండలిని కొనసాగించాలా.. వద్దా అనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం వైఎస్ జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు అంగీకరించిన స్పీకర్ సోమవారం ఆ అంశాన్ని శాసనసభలో చర్చించేందుకు అనుమతించారు. -
ప్రజాభీష్టం పట్టదా..?
-
‘మండలిని రద్దు చేయండి’
సాక్షి, అమరావతి : శాసన మండలి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిందని డిప్యూటీ సీఎం, మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అసహనం వ్యక్తం చేశారు. మండలిని రద్దు చేయాలని ఒక సభ్యునిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపాదిస్తున్నానని అన్నారు. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై గురువారం శాసనసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. చట్టాలు చేసే సభలో సభాపతులు వ్యవహరించిన తీరుపై చర్చించడం దారుణమన్నారు. బుధవారం మండలిలో జరిగిన చర్చలో మంత్రుల సలహాలను చైర్మన్ పట్టించుకోలేదని ఆరోపించారు. కావాలనే బిల్లులను అడ్డుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్ను ప్రభావితం చేశారని ఆరోపించారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే పెద్దల ఉందన్నారు. చట్టాలను సక్రమంగా అమలు చేసే సభాధిపతులే.. చట్టాలను అతిక్రమిస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. ‘మంచి ఆలోచనలతో రాజ్యాంగ నిర్మాతలు పెద్దల సభ పెట్టారు. శాసన సభకు విద్యావంతులు రాకపోవడం, ధన బలం ఉన్నవాళ్లు ఎన్నికవ్వడం జరగవచ్చు. అలాంటి సమయంలో వారికి ఇష్టం వచ్చిన చట్టాలు తెచ్చి ప్రజలను ఇబ్బంది కలిగిస్తారనే భయంతో పెద్దల సభ ఏర్పాటు చేశారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే ఈ సభ ఏర్పాటైంది. కానీ నేడు అది రాజకీయాలకు కేంద్ర బిందువైంది. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యానికే మచ్చగా మారాయి. టీడీపీ నేతలు నేరుగా చైర్మన్ దగ్గరకు వచ్చి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపమని సలహాలు ఇచ్చారు. చైర్మన్ తప్పు చేశానంటునే విచక్షణాధికారంతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. తప్పు చేసిన వారికి విచక్షణాధికారం ఎలా ఉంటుంది? రూల్ 71 ఎప్పుడు ఉపయోగించాలో తెలియకుండా చర్చించారు. సభాపతే చట్టాలను ఉల్లంఘిస్తే మేం ఎవరికి చెప్పుకోవాలి? ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు మండలి గ్యాలరీలో కూర్చోని చైర్మన్ను ప్రభావితం చేశారు. టీడీపీ సభ్యుల సలహా మేరకు చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. దీనికంటే ఆయన రాజీనామా చేసి బయటకు వస్తే గౌరవంగా ఉండేది. మండలి సభ్యునిగా ముఖ్యమంత్రి, స్పీకర్కు ప్రతిపాదిసున్నా.. సభను వెంటనే రద్దు చేయండి. రాజకీయాలకు ఉపయోగపడే సభ నిష్ర్పయోజనం. రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే ప్రజాస్వామ్యం కొనసాగుతుంది’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. -
పెద్దల సభపై నమ్మకం పోయింది..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెద్దల సభపై నమ్మకం పోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శాసన మండలిలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణమన్నారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో శాసన మండళ్లు ఉన్నాయని.. ఏపీలో మండలి తీరు బట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా శాసన మండలిని రద్దు చేసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అధ్యక్షుడు కూడా శాసనమండలి కి వచ్చి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదన్నారు. శాసన మండలి చైర్మన్ దైవభక్తి, నిజాయితీ గల వ్యక్తి అని.. కానీ చంద్రబాబు ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ముఖ కవళికల్లో కనిపించిందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశం శాసన మండలిలో చర్చకు రాకుండా పక్కకు పెట్టడం అత్యంత నిబంధనలకు విరుద్ధం అని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలు ముందుగా సభ్యులకు తెలియజేయాలన్నారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం అని చెప్పడం కూడా రూల్స్కు విరుద్ధమేనన్నారు. చైర్మన్కు నేరుగా రూలింగ్ ఇచ్చే అధికారం లేదని.. కమిటీకి పంపించాలా లేదా అనే అంశాన్ని సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పారు. సభ్యులు ఓటింగ్ కోరితే సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపిన విషయం పై ఓటింగ్ కూడా నిర్వహించాల్సిన బాధ్యత చైర్మన్ కు వుందని వివరించారు. మండలి లో నిన్న జరిగిన తీరు అప్రజాస్వామికం అని వీరభద్రరావు పేర్కొన్నారు. (చదవండి: బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...) -
ఇలాంటి మండలిని కొనసాగించాలా?
సాక్షి, అమరావతి : రాజకీయ ఎజెండాతో నడుస్తూ.. ప్రజలకు మేలు చేసే విధంగా లేని శాసనమండలిని కొనసాగించాలా లేదా అన్నదానిపై సీరియస్గా ఆలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాడానికే శాసనమండలి ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తే.. మండలిలోని సభ్యులు మాత్రం మేలు జరగకూడదని చూస్తున్నారని మండిపడ్డారు. మండలిలో నిన్న జరిగిన పరిణామాలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి కోసం ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదని.. రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా పాలన సాగించవచ్చని తెలిపారు. శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ప్రజల మాటే వేదంగా తాము శాసనసభలో అడుగుపెట్టాం. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం తమ ప్రభుత్వం ఏర్పడింది. ఏడున్నర నెలలుగా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం. చట్టాలు చేయడానికే శాసనసభ ఉంది. అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మా అధికారం ఉపయోగించాం. మేము పాలకులం కాదని సేవకులమని చెబుతున్నాం.. ఈ రోజుకు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేశారు.. చట్టసభల్లో భాగమైనా మండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని నమ్మాం.. కానీ నిన్న జరిగిన పరిణామాలు దానిని ఒమ్ము చేశాయి. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదు.. గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు.. అదికాకపోతే సవరణలు కోరుతూ తిప్పి పంపవచ్చు . చట్టం కూడా ఇదే చెబుతోంది.. కానీ వాటిని లెక్కచేయకుండా విచక్షణ అధికారం అంటూ కౌన్సిల్ చైర్మన్ నిన్న బిల్లును సెలక్ట్ కమిటీకి పంపారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ నిర్ణయం తీసుకుని.. ప్రజాస్వామ్యానికి విలువ కూడా లేకుండా చేశార’ని అన్నారు. అలాగే మండలిలో చైర్మన్ మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ నిబంధనల ప్రకారం బిల్లును సెలక్ట్ కమిటీకి పంపే అధికారం తనకు లేదని చైర్మన్ చెప్పారు. బిల్లు పెట్టిన 12 గంటల్లోపే సవరణలు ఇవ్వాలని కూడా తెలిపారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే .. బిల్లు పెట్టినప్పుడే ప్రతిపాదనలు చేయాలని కూడా చైర్మన్ చెప్పారు. మళ్లీ ఆయనే రూల్స్ను అతిక్రమించి బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపకూడదనే మంత్రుల వాదనతో బీజేపీ, పీడీఎఫ్, వామపక్ష సభ్యులు ఏకీభవించారు. కానీ సెలక్ట్ కమిటీకి పంపే అధికారం లేకున్నా.. తనుకున్న విచక్షణ అధికారంతో నిర్ణయం తీసుకున్నాని చైర్మన్ అన్నారు. చట్టాన్ని ఉల్లఘించేందుకే విచక్షణ అధికారాన్ని వాడానని చైర్మన్ స్వయంగా అంగీకరించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని ఇచ్చిన ఆదేశాలను చైర్మన్ పాటించారు. 6 రాష్ట్రాలకు మాత్రమే మండలిలు ఉన్నాయి.. మండలి ప్రజల కోసం నడుస్తోందా.. రాజకీయ నిరుద్యోగల కోసం నడుస్తోందా అన్న ఆలోచన చేయాలి. చైర్మన్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. విడిపోయిన ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అన్న ఆలోచన జరగాలి. మండలి కోసం ఏడాదికి రూ. 60 కోట్ల ఖర్చు పెడుతున్నాం. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే.. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండలిలు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో మండలిలు లేనే లేవు. ఓవైపు చంద్రబాబు తప్పు జరిగిందని చెబతున్నారు.. మరోవైపు చంద్రబాబు పూల దండలు వేయించుకుంటున్నారు. దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదు. అభివృద్ది కోసం వికేంద్రీకరణ చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా పాలన సాగించవచ్చు. దివంగత జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారు. ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడి నుంచి అయినా చట్టాలు చేయొచ్చు. మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. కానీ అక్కడ సలహాలు, సూచనలు పక్కనబెట్టి ప్రజలకు మేలు జరిగే బిల్లులను ఎలా ఆలస్యం చేయాలో ఆలోచిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం బిల్లును అడ్డుకుంటారు. ఇంగ్లిష్ మీడియం బిల్లును అడ్డుకున్నవాళ్ల పిల్లలందరు ఇంగ్లిష్లోనే చదువుతున్నాదు. ఇలాంటి మండలిని కొనసాంగించాలా? వద్దా? అనేదానిపై సీరియస్గా చర్చ జరగాలి’ అని అన్నారు. ఈ అంశంపై సోమవారం చర్చించుదామని స్పీకర్ను కోరారు. శాసనసభ సోమవారానికి వాయిదా.. సీఎం వైఎస్ జగన్ ప్రసంగం అనంతరం మాట్లాడిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. శాసనమండలికి సంబంధించి సోమవారం సభలో చర్చించడానికి అనుమతిచ్చారు. అలాగే శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు. -
బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...
సాక్షి, అమరావతి : వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలని ప్రతిపక్ష టీడీపీ తొలి నుంచి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విమర్శించారు. బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే మండలికి పంపామని అన్నారు. మండలిలో బిజినెస్ రూల్స్ ప్రకారం వెళ్లకుండా బిల్లును అడ్డుకోవాలని కొత్తగా రూల్ 71ని తెచ్చారని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీలో చర్చలో భాగంగా అంజాద్ బాషా ప్రసంగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రాధాన్యత ఇవ్వాలని చైర్మన్ను తాము కోరామని, కానీ ఆయనకు దానికి విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. రూల్ ప్రకారం వెళ్లాలని సభలో బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు సూచించినా, ఆయన కనీస మర్యాద పాటించలేదని అంజాద్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారితనంలా సభా కార్యక్రమాలు ఉండాలని, కానీ చైర్మన్ సభను టీడీపీ వ్యవహారంలా నడిపారని విమర్శించారు.ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజల సమస్యలపక్ష కనీస చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మండలిలో బలం ఉందని టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో తీసుకున్న ప్రతి కీలక నిర్ణయాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో శాసనమండలి జరుగుతోందని, ఈ పరిస్థితుల్లో మండలి ఉండాలా? లేదా? అనే చర్చ జరగాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీడీఆర్ఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి నివేదించిన అంశంపై ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబునాయుడు మండలి గ్యాలరీలో కూర్చోవాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. ‘శాసనమండలి గ్యాలరీలో చంద్రబాబు ఉన్నారని తెలిసి.. నేను కూడా ఆసక్తిగా వెళ్లాను. నిబంధనల ప్రకారం మండలిలో బిల్లులపై ఓటింగ్ జరుగుతుందని భావించా. కానీ చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం ఆశ్చర్యంగా అనిపించింది. సెలెక్ట్ కమిటీకి పంపాలంటే సవరణలు ప్రవేశపెట్టాలి కానీ, వాటిని ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఓటింగ్ జరుగుతుందని భావించాం. కానీ, నిబంధనలకు విరుద్ధంగా చివర్లో చైర్మన్ విచాక్షణాధికారం అంటూ సెలెక్ట్ కమిటీకి పంపించారు. వికేంద్రీకరణ బిల్లు ఇప్పుడప్పుడే చట్టం కాకూడదనే కుట్రతోనే సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీకి నివేదించడం వల్ల రెండు, మూడు నెలల జాప్యం జరుగుతుంది. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఎంతకాలం ఆపగలరు’ అని అంబటి ప్రశ్నించారు. రైతులను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. శాసనసభ అమరావతిలో జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. అమరావతి రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. వ్యవస్థలను దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట అని, చంద్రబాబు ప్లాన్లో భాగంగా అభివృద్ధి నిరోధకంగా శాసనమండలి మారుతున్నప్పుడు దాని కొనసాగింపుపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. -
ఎప్పుడు ఇలా జరగలేదు..
సాక్షి, అమరావతి : రాష్ట్ర భవిష్యత్ను దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వికేంద్రీకరణ బిల్లు తీసువచ్చారని మంత్రి మోపిదేవి వెంకటరమణ స్పష్టం చేశారు. రూల్ 71పై గురువారం చర్చలో భాగంగా అసెంబ్లీలో మోపిదేవి మాట్లాడారు. శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లును శాసనమండలి చర్చించి, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. సాంప్రదాయాన్ని పక్కనపెట్టి అప్పటికప్పుడు కుట్రపూరితంగా రూల్ 71ను తెచ్చి రోజంతా మండలిని స్తంభింపజేశారని మండిపడ్డారు. చర్చ ముగిసే సమయంలో దురుద్దేశపూర్వకంగానే సెలెక్ట్ కమిటీ అంశాన్ని ప్రస్తావించారని అసహనం వ్యక్తం చేశారు. (విచక్షణాధికారం ఉందని సభను రద్దు చేస్తారా?) బుధవారం మండలిలో జరిగిన సంఘటనలు చాలా బాధాకరమని మోపిదేవి అన్నారు. టీడీపీ సభ్యులు మండలిని వారి పార్టీ కార్యాలయంగా ఉపయోగించుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎప్పుడు జరగలేదని టీడీపీ సభ్యులు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి మండలి, అసెంబ్లీ ఆమోదించిన ప్రధాన బిల్లును మండలి అడ్డుకోవడం అనేది చాలా ప్రమాదకరమైన హెచ్చరికలాంటిదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు సీఎం వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా స్వాగతిస్తామని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. -
సీఎం జగన్ దెబ్బతో.. బాబు గ్యాలరీ ఎక్కారు
సాక్షి, అమరావతి : పెద్దల సభ అంటే సలహాలు, సూచనలు ఇచ్చి బిల్లును ఆమోదించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. శాసనసభలో చేసిన బిల్లుపై చర్చించాలే తప్ప తిరస్కరించవద్దన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దెబ్బకు.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనమండలి గ్యాలరీ ఎక్కారని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే సీఎం వైఎస్ జగన్ ఆయనను శాసనసభ గ్యాలరీ కూడా ఎక్కిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. బుధవారం శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై నేడు శాసనసభలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిన్న అశోక్బాబు మండలి చైర్మన్ షరీఫ్ వద్దకు వెళ్లాడనేది అవాస్తమని చెప్పారు. రూల్స్ పాటిస్తానని చెప్పిన మండలి చైర్మన్.. తన మాటకు కట్టుబడలేదని అన్నారు. శాసనమండలి లేకపోతే చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. 1983లో ఉన్నటువంటి బ్యాచే మళ్లీ మండలిలో చేరిందని విమర్శించారు. అందుకే అప్పట్లో ఎన్టీఆర్ మండలిని రద్దుచేశారని గుర్తుచేశారు. అయితే మంచి సలహాలు ఇస్తారనే ఉద్దేశంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనమండలిని పునరుద్ధరించారని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవలేని లోకేశ్కు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మండలిని తీసేయాలనే అంశాన్ని కచ్చితంగా ఆలోచించాలని కోరారు. తమకు వ్యక్తిగతంగా ఎవరిపై కోపం లేదని స్పష్టం చేశారు. మండలిలో ఇంగ్లిష్ మీడియం, ఎస్సీ, ఎస్టీ బిల్లులను ఆపేశారని.. ఇప్పుడు ఏకంగా వికేంద్రీకరణ బిల్లుకే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మండలి చైర్మన్కు డైరెక్షన్స్ ఇచ్చారని.. ఇలాంటి పనులు చేయడానికి ఆయనకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు తాగి వచ్చారో.. ఇంకెవరు తాగొచ్చారో తెలియదని.. యనమల రామకృష్ణుడుతో సహా టీడీపీ నేతలకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలని అన్నారు. యనమల పేరెత్తితే వెన్నుపోటు గుర్తుస్తోందన్నారు. అలాంటి వ్యక్తి తమకు సలహాలు ఇవ్వడం ఏమిటని నిలదీశారు. మండలిలో టీచర్, పట్టభద్ర ఎమ్మెల్సీల్లో చాలా మంచివారున్నారని తెలిపారు. వారితోపాటు.. బీజేపీ ఎమ్మెల్సీలు కూడా వికేంద్రీకరణ బిల్లు ఆపొద్దని విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. -
‘మండలి అవసరమా..? చర్చ జరగాలి’
సాక్షి, అమరావతి : గతంలో వ్యవస్థలను మెనేజ్ చేసినట్లుగా బుధవారం చంద్రబాబు నాయుడు శాసన మండలిని ప్రభావితం చేసి బిల్లులను అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని పాటించకపోతే ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతారని ఆవేద వ్యక్తం చేశారు. గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..ప్రభుత్వ నిర్ణయాలను మండలి ఆపలేదన్నారు. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చేసే ఆస్కారం ఉన్న శాసన మండలి అవసరమా లేదా అన్నది ప్రజాస్వామ్యవాదులంతా ఆలోలించాలని కోరారు. (చదవండి : నిబంధనలు పాటించడమే చైర్మన్ బాధ్యత: కన్నబాబు) మండలి అనేది అవసరమే లేదని ఎన్జీ రంగా నాడే చెప్పారని గుర్తు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన నిర్ణయాలను అడ్డుకుంటే.. అది ప్రజలను అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య లక్ష్యాన్ని దెబ్బతీసేవిధంగా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. నిన్న మండలిలో జరిగిన పరిణామాలు సమయాన్ని వృధా చేయాలన్నట్లుగానే ఉన్నాయన్నారు. బిల్లులను అడ్డుకొని చంద్రబాబు నాయుడు నాలుగు నెలల కాలాన్ని మింగేస్తాడేమో కానీ అంతకు మించి ఏమి చేయలేరన్నారు. శాసన మండలి అవసరమా లేదా అనే దానిపై చర్చ జరగాలని, దీని కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి, స్పీకర్ను కోరారు. -
విచక్షణాధికారం ఉందని సభను రద్దు చేస్తారా?
సాక్షి, అమరావతి : అభివృద్ధిని అడ్డుకోవడమే లక్క్ష్యంగా చేసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు రాష్ట్రంలో ఉండటం ప్రజల దురదృష్టమని మంత్రి కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రాంతాల అభివృద్ధి గురించి కనీసం ఆలోచన చేయకుండా తాను, తన ఎదుగుదల మాత్రమే ఆయనకు ముఖ్యమని విమర్శించారు. సాంప్రదాయాలను తుంగలో తొక్కడం, ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయడంలో బాబుని మించిన వ్యక్తి మరొకరు లేరని మండిపడ్డారు. రూల్ 71పై గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా కన్నబాబు మాట్లాడారు. అవసరం లేకపోయినా రూల్ 71 కోసం రోజంతా మండలిని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. కనీస నిబంధనలు పాటించకుండా విచక్షణాధికారాన్ని మండలి చైర్మన్ ఎలా ఉపయోగిస్తారని మంత్రి ప్రశ్నించారు. సభలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘చైర్మన్ను ప్రభావితం చేయడానికే చంద్రబాబు గ్యాలరీలో కూర్చున్నారు. రూల్స్ ఒప్పుకోకపోయినా విక్షణాధికారాన్ని ఉపయోగిస్తున్నానని చైర్మన్ చెప్పారు. నిబంధనలు పాటించకుండా ఎలా ఉపయోగిస్తారు?. నిబంధనలు పాటించడమే చైర్మన్ బాధ్యత. విచక్షణాధికారం ఉందని సభను కూడా రద్దు చేస్తారా?. మండలి లోపల సెల్ఫోన్తో నారా లోకేష్ వీడియోలు తీశారు. ఇది సరైనది కాదు. గ్యాలరీలో చంద్రబాబు, సభలో లోకేష్, వీరిద్దరికి తోడు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవటంలో సహకరించిన యనమల రామకృష్ణుడు అందరూ కలిసి వ్యవస్థను భ్రష్టుపట్టించారు. (మండలి చైర్మన్కు ఆ విచక్షణాధికారం లేదు) మంత్రులు తాగి వచ్చారని యనమల అంటుంటే.. మరో టీడీపీ బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీడియా చర్చల్లో శాసనసభ్యులను కించపరిచే విధంగా మాట్లాడిని వ్యక్తులపై ప్రివిలేజ్ మోషన్ పెట్టాలి. వంగవీటి రంగా వ్యవహారంలోనే చంద్రబాబు రౌడీయిజాన్ని చూశాం. అమరావతిలో పోటీచేసిన రెండు చోట్లా టీడీపీ ఓడిపోయింది. మంగళగిరిలో లోకేష్ కూడా ఓటమిచెందారు. ఇంతకంటే రెఫరెండం ఏం ఉంటుంది. శాసనమండలిని కించపరచడం మా ఉద్దేశం కాదు. పెద్దల సభకు లోకేష్ లాంటి సభ్యలు దొడ్డిదాని వస్తుంటారు. చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని, కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యారు.’ అని అన్నారు. -
‘చంద్రబాబు ఒక అరాచక శక్తి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు అనర్హుడని.. అందుకే ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అన్నారు. ఈ నెపంతో రాష్ట్ర ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే దురుద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అశాంతిని పెంచాలనే కుట్రతో 40 రోజులుగా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తోన్న చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే.. వేల కోట్లు ఖర్చు పెట్టి శాశ్వత భవనాలు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాశ్వత హైకోర్టు, శాసనసభ, సచివాలయాలు లేవని.. తాత్కాలిక భవనాలతో వేల కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో చంద్రబాబు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు వేల ఎకరాలను దోచేశారని ధ్వజమెత్తారు. 13 జిల్లాల అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును తెచ్చారని.. టీడీపీ దీనిని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి అంటే అమరావతి అభివృద్ధి మాత్రమే కాదని..13 జిల్లాల అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే శాసనమండలిలో ఎమ్మెల్సీలు అరాచకం సృష్టించారని తెలిపారు. చంద్రబాబు, చైర్మన్లు కలిసి శాసనమండలి ఔన్నత్యాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు 29 గ్రామాలకు ప్రతిపక్ష నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతారని ఎద్దేవా చేశారు. అభివృద్ధిని అడ్డుకుని..చంద్రబాబు పైశాచిక ఆనందం.. నిన్నటి రోజు చరిత్రలో బ్లాక్డే గా మిగిలిపోతుందని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాధగాని గురునాథం అన్నారు. చంద్రబాబు మంది బలంతో చట్టాలను చుట్టంగా చేసుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల బలం ఉందని పేర్కొన్నారు. 13 జిల్లాల అభివృద్ధిని అడ్డుకుని చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. 40 సంవత్సరాల అనుభవంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు,యనమల రామకృష్ణుడు చేసిన కుటిల రాజకీయాలు మండలి సాక్షిగా బహిర్గతమయ్యాయన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి.. రాయలసీమ వాసులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర నేత రాజ్కుమార్ మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు మండలిలో ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఐదు కోట్ల ప్రజల అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. రాయలసీమ రాజధాని కోసం తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధమని రాజ్కుమార్ స్పష్టం చేశారు. -
దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరలేపింది
సాక్షి, అమరావతి: శాసనమండలిని అభివృద్ధి నిరోధకంగా మార్చాలని టీడీపీ యత్నిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం అని... ఆయన నిర్ణయాన్ని మేధావులంతా తప్పుబడుతున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ అంశంపై ఆలోచించాలని కోరారు. రాజ్యాంగ విలువలను టీడీపీ అపహాస్యం చేసిందన్నారు. ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అవసరం లేదన్నారు. ఇది చంద్రబాబు ప్రభావం వల్లే జరిగిందన్నారు. చైర్మన్ను రూల్ ప్రకారం వ్యవహరించాలని కోరామని తెలిపారు. మండలిలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని ఆందోళన కలిగిస్తున్నాయని అంబటి పేర్కొన్నారు. చాలా రాష్ట్రంలో మండలి లేదని.. మన రాష్ట్రంలోనే ఉందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి రెండు సభలు దోహదపడాలని.. లేదంటే ఏమైనా ప్రభుత్వం చిన్న చిన్న పొరపాట్లు చేస్తే సవరణలు చేయాలని సూచించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వ బిల్లులను టీడీపీ అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. మండలిలో మెజార్టీ ఉంటే తిరిగి పంపొచ్చని.. అలా కాకుండా బిల్లును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి నిరోధక శక్తిగా టీడీపీ మారిందని.. ఇటువంటి సమయంలో శాసన మండలి అవసరమా అనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మండలిలో టీడీపీ తీరుపై ప్రజలంతా ఆలోచించాలన్నారు. సభలో దుష్ట సంప్రదాయానికి టీడీపీ తెరలేపిందన్నారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పుతానని చెప్పే చంద్రబాబు గ్యాలరీలో ఎందుకు చైర్మన్ ఎదురుగా కూర్చున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తీరును ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు. పెద్దల సభను పిల్లల సభలాగా మార్చుతున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభావంతోనే మండలి చైర్మన్.. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపారన్నారు. బిల్లులను తాత్కాలికంగా మాత్రమే అడ్డుకోగలరని.. శాశ్వతంగా అడ్డుకోలేరన్నారు. తాము స్వాగతిస్తే టీడీపీ ఎమ్మెల్సీలు వైఎస్సార్సీపీలోకి క్యూ కడతారని.. కానీ అది తమ విధానం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం.. రాజధాని విషయంలో జోక్యం చేసుకోదన్నారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం పవన్కల్యాణ్, చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన వారిపై విచారణ జరుగుతుందని.. ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు. తప్పుచేసిన వారికి శిక్ష తప్పదని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. (చదవండి: మండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం) -
కొందరు టీడీపీ సభ్యులు కూడా ఇదే చెప్పారు..!
సాక్షి, అమరావతి: శాసనమండలి చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికం అని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. శాసనమండలి చరిత్రలో నిన్నటి సంఘటన దురుద్దినం అని పేర్కొన్నారు. మండలి చైర్మన్ చంద్రబాబు చెప్పినట్టు నడుచుకున్నారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అధికారం ఇచ్చారని.. శాసనసభలో ఆమోదించిన బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు కూడా నిబంధనలు ప్రకారం నడుచుకోవాలని సూచించారని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబుకు ఉన్న 40 ఏళ్ల అనుభవం ఇదేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఉన్నది చట్టాలు చేయడానికి.. చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. నారా లోకేష్ నేరుగా తనపైకి దూసుకువచ్చారని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఉన్నది చట్టాలు చేయడానికే అని.. తిరస్కరించడానికి కాదని చెప్పారు. సంఖ్యాబలం ఉంటే మీ ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తారా అని నిప్పులు చెరిగారు. టీడీపీ చర్యలు వల్ల కొంత జాప్యం మాత్రమే జరుగుతుందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించారో అందరికి తెలుసునని ఆయన పేర్కొన్నారు. లోకేష్ నీ స్థాయి ఏమిటో తెలుసుకో.. చైర్మన్తో మాట్లాడేందుకు వెళ్తుంటే లోకేష్ తనపై దౌర్జన్యం చేశారని మంత్రి బొత్స అన్నారు. లోకేష్ స్థాయి ఏమిటో ముందు తెలుసుకోవాలని సూచించారు. కొన్ని పత్రికలు తమ పై తప్పుడు కథనాలు ప్రచురించాయని మండిపడ్డారు.డివిజన్ చేయకుండా బిల్లు సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతారని ప్రశ్నించారు. అన్ని పక్షాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పాయన్నారు. కొంత మంది టీడీపీ సభ్యులు కూడా ఇదే విషయం చెప్పారన్నారు. ఈ విషయాన్ని స్వయంగా చైర్మనే తెలిపారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుకు ఆమోదం
సాక్షి, అమరావతి: పేదవాడికి మంచి జరగాలని బిల్లు ప్రవేశపెడితే టీడీపీ సభ్యులు ప్రతీసారి అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన బిల్లును మండలిలో తిరస్కరించారని గుర్తు చేశారు. ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటారని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని రూపొందించిన (ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ) బిల్లుకు శాసన సభ గురువారం ఆమోదం తెలిపింది. అదే విధంగా ఈ బిల్లుకు మండలి చేసిన సవరణలను తిరస్కరించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకతను సభలో వివరించారు.(ప్రతీ పిల్లాడికి ఒక కిట్: సీఎం జగన్) ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో పేదలకు ఇంగ్లీష్ విద్య అవసరం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తున్నాం. ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీషులో చదువుకుంటే.. పై చదువులకు వెళ్లేసరికి మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రైవేటు పాఠశాలల్లో 95 శాతానికి పైగా ఇంగ్లీషు మీడియంలోనే బోధన జరుగుతోంది. కంప్యూటర్ భాష కూడా ఇంగ్లీషులోనే ఉంటుంది. ఇంగ్లీషు స్పష్టంగా మాట్లాడగలిగితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ఉంది. పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గత సమావేశాల్లో బిల్లు తీసుకువస్తే టీడీపీ మండలిలో అడ్డుకుంది. పేదవాడికి మంచి జరుగుతుంటే ఆలస్యం చేయాలని వారు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎవరు ఎన్ని విధాలుగా అడ్డుపడినా పేద పిల్లలకు జగన్ మామ తోడుగా ఉంటాడు. మధ్యాహ్న భోజన పథకంలో గోరుముద్ద పేరుతో మెనూ తీసుకువచ్చాం. దాదాపు 36 లక్షల మంది విద్యార్థులకు జూన్లో విద్యా కానుక కిట్ అందిస్తాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా పేద విద్యార్థులకు మేలు చేకూర్చే విధంగా రూపొందించిన ఈ బిల్లును గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం విదితమే. అయితే శాసనమండలి ఈ బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి అసెంబ్లీకి పంపగా.. వాటిని తిరస్కరిస్తూ శాసన సభ ఈరోజు ఆమోదించింది. -
నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ సందర్భంగా శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరుతారని పేర్కొంటూ.. ఓ సినిమా డైలాగును ఆమె ఉటంకించారు. ‘నువ్వు అనుకుంటే అవ్వుద్ది స్వామి.. నీ నవ్వు వరం.. నీ కోపం శాపం.. నీ మాట శాసనం’ అంటూ ఆమె పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలుగులు నింపుతున్నారని అన్నారు. ఇంగ్లిష్ మీడియంలో చదివినంతమాత్రాన తెలుగు రాదనడం సరికాదన్నారు. చంద్రబాబుకు అమరావతి తప్ప మరేమీ కనిపించడం లేదని, ఆయన డ్రామాలు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ అసలు ఏ మీడియంలో చదువుకున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు తెలుగు, ఇంగ్లిష్.. రెండూ రావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యపై గగ్గోలు పెడుతున్న నాయకులు తమ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని అడిగారు. చంద్రబాబు మనవడు ఏ స్కూల్లో చదువుతున్నాడని ప్రశ్నించారు. ప్రైవేటు స్కూళ్లలో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తున్నారని తెలిపారు. విద్యారంగంలో సంస్కరణల వల్ల ఎన్నో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఉషాచరణ్ మాట్లాడుతూ.. ప్రపంచంతో పోటీపడాలంటే ఇంగ్లిష్ తప్పనిసరి అని అన్నారు. మన అనుకుంటేనే ప్రజలకు ఏదైనా చేయగలమని, అలా అనుకున్నారు కాబట్టే సీఎం జగన్ ఎన్నో ప్రజాసంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. -
పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే..
సాక్షి, అమరావతి: పేద, బడుగు వర్గాల పిల్లలకు ఇంగ్లిష్ విద్యను అందించేందుకు ఉద్దేశించిన ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లు చరిత్రాత్మకమైనదని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో తప్పనిసరిగా విద్యాబోధన జరగాలంటూ ఈ బిల్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి.. శాసనమండలికి పంపించిందని, మండలిలోని పెద్దలు ఈ బిల్లును మరింత కూలకశంగా చర్చించి.. సూచనలు, సలహాలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా బిల్లు మీద నాలుగు సవరణలు ప్రతిపాదిస్తూ మండలి తిరిగి శాసనసభకు పంపిందని తెలిపారు. ఇంగ్లిష్ మీడియాన్ని ఎత్తివేయాలని, లేదా తెలుగు మీడియం తీసుకోవాలా? ఇంగ్లిష్ మీడియమా? అన్న నిర్ణయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వదిలేయాలని సవరణలు పంపారని, శాసనమండలిలో తనకు మెజారిటీ ఉండటంతో చంద్రబాబు ఈ విధంగా దురుద్దేశంతో ఈ బిల్లును తిప్పి పంపారని ఆర్కే పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. విద్య ప్రాథమిక హక్కు అని, పిల్లలందరికీ కచ్చితంగా విద్యను ఉచితంగా అందించాలని రాజ్యాంగం నిర్దేశించిందని గుర్తు చేశారు. శ్రీచైతన్య, నారాయణ వంటి ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియంలో అసలు బోధన జరగడం లేదని, నిర్బంధంగా ఇంగ్లిష్ మీడియంలోనే వాళ్లు బోధిస్తున్నారని తెలిపారు. తన బినామీలు, తన మనుషులు చేసే ఇలాంటి చర్యలు సమర్థించే చంద్రబాబు.. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేద పిల్లలు, అగ్రకులాల పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. పేదలెవరూ ఇంగ్లిష్ మీడియం చదువుకోకూడదన్న దుర్బుద్ధితో చంద్రబాబు ఈ బిల్లుకు అడ్డుపడుతున్నారని, మండలిలో బలముందని ఇలా బిల్లులను చంద్రబాబు దురుద్దేశంతో అడ్డుకోవడం సరికాదని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తీసుకొస్తున్న బిల్లులను తన కుట్రల ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, పేదల జీవితాలు బాగుపడకూడదనే కుట్రతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆర్కే ధ్వజమెత్తారు. -
సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై ఏవిధంగా ముందుకు సాగాలనే అంశంపై వారితో చర్చించనున్నారు. సీఎం ఛాంబర్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు సహా ప్రసాద్ రావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. చదవండి: రూల్ ప్రకారం జరగలేదు... అయినా సెలెక్ట్ కమిటీకి పంపుతున్నాం కాగా ప్రాంతీయ సమానాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపించేలా టీడీపీ వ్యూహరచన చేసిన విషయం తెలిసిందే. ‘ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడం నిబంధనలకు విరుద్ధం.. టీడీపీ ఇచ్చిన నోటీసు నిబంధనల మేరకు లేదు..’ అని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ స్వయంగా చెబుతూనే ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ రూలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలిలో జరిగిన పరిణామాలపై ఈనాటి భేటీలో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఇక ఈ బిల్లులు శాసన సభలో ఆమోదం పొందిన విషయం విదితమే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం దుర్మార్గం -
ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి హర్షణీయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగోరోజు గురువారం ప్రారంభమయ్యాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై చర్చ జరుగుతోంది. ఈ చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక అసమానతల వల్ల కొంతమంది వెనకబడ్డారని, సమాజంలోని ఈ అసమానతలు తగ్గాలంటే విద్య చాలా అవసరమని తెలిపారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లిష్ విద్య అవసరమని తెలిపారు. ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి అంటూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో కీలకమైనదని, హర్షించదగిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకంతో విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన మెనూతో విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుందని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం వల్ల వారి సామర్థ్యం పెరుగుతుందన్నారు. నాడు-నేడు కార్యక్రమంతో పాఠశాలల్లో వసతులు మెరుగవుతున్నాయని, ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల్లలో డ్రాపౌట్స్ తగ్గుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య మీద ఎంతో శ్రద్ధ పెట్టి.. ప్రాధాన్యమిస్తున్నారని, ఆయన తీసుకొస్తున్న పథకాలు ప్రజల తరతరాల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని అన్నారు. నిరక్షరాస్యత రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం.. సభ్యుడు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో ఇంగ్లిష్ విద్య ఒక ఆస్తి. ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే ఇంగ్లిష్ చాలా అవసరం. సమాజంలోని నిరక్షరాస్యత రూపుమాపడమే మా ప్రభుత్వ లక్ష్యం. పేద విద్యార్థులకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నాం. సమాజంలోని అసమానతలు విద్య వల్ల తగ్గుతాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ దేశ నిండుభారతిని అన్న కవి భావాలను నిజం చేయాలంటే అందుకు ఇంగ్లిష్ విద్య కూడా అవసరం. ప్రపంచ భాష అయిన ఇంగ్లిష్ రాకపోతే మన ఔన్నత్యాన్ని అందరికీ చాటిచెప్పలేం’ అని పేర్కొన్నారు. రైతు కొడుకు ఇంజినీర్ కావాలని.. సభ్యుడు కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘పేదలు తమ పిల్లల్ని చదివించడానికి ఎంతో కష్టపడుతున్నారు. అప్పులు చేసి ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. చాలామంది ఊళ్లను నుంచి పిల్లలను పట్టణాలకు పంపించి.. అక్కడ చదివిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. పదో తరగతికి వచ్చేవరకు ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రైవేటు స్కూళ్లలోనే విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకొని నిలబడే విధంగా శిక్షణ పొందుతున్నారు. జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకునేవిధంగా తయారవుతున్నారు. చాలచోట్ల ప్రైవేటు పాఠశాలలు ఏమాత్రం వసతులు లేకుండా పశువుల కొట్టాంలా ఉన్నాయి. కానీ పెద్దమొత్తంలో ఫీజలను ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చాలా అవసరం. రైతు కొడుకు ఇంజినీర్ కావాలని, రిక్షావాడి కొడుకు కూడా డాక్టర్ కావాలని, పేద విద్యార్థులు కూడా పెద్ద పెద్ద చదువులు చదవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అంబేద్కర్ కలల సమాజాన్ని సీఎం జగన్ సాకారం చేస్తున్నారు’ అని అన్నారు. సభ్యుడు గొల్లబాబురావు మాట్లాడుతూ.. విద్యారంగంలో సంస్కరణలతో భావితరాలకు మేలు జరుగుతుందని అన్నారు. విద్య అనేది అభివృద్ధికి పునాది అని, అందుకే విద్యలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణల వల్ల సమాజంలో ఎన్నో మంచి మార్పులు వస్తాయని తెలిపారు. పేదవర్గాల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. ఇంగ్లిష్ విద్య పేదలకు వరం లాంటిదని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేయడాన్ని స్వాగతించారు. సభ్యుడు తిప్పేస్వామి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి ఇంగ్లిష్ చదువు రావాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బిల్లును తీసుకొచ్చిందన్నారు. బిల్లు ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. ప్రాథమిక విద్యలో తెలుగు మీడియంలో ఉండి, ఉన్నత విద్య ఇంగ్లిష్ మీడియంలో ఉండటం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయని, అందువల్ల ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగించాల్సి ఉందని, అందుకు వీలుగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని వివరించారు. సభ్యుడు బుడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతకాలంలో ఇంగ్లిష్ విద్య తప్పనిసరి అయిందని, ఇంగ్లిష్ విద్య పేద విద్యార్థులకు ఓ వరమని కొనియాడారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మండలి చైర్మన్ షరీఫ్ బుధవారం అర్ధంతరంగా సెలెక్ట్ కమిటీకి నివేదించి.. మండలి సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మాత్రమే నేడు కొనసాగనున్నాయి. -
రోజా పక్కన దిష్టి బొమ్మ?: వర్మ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణతో ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్ఫీ దిగారు. దీంతో ప్రస్తుతం రోజా-బాలకృష్ణల సెల్ఫీలు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాయి. అయితే ఈ ఫోటోలపై వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించాడు. ఆ ఫోటోలను తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేస్తూ వరుస కామెంట్లు చేశాడు. ‘సెల్ఫీలో రోజాగారు హీరోలా కనిపిస్తున్నారు. కానీ ఆమె కుడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా(యాక్)గా ఉన్నారు. ఈ ఫ్రేమ్లో అతను రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నారు. ఒకవేళ అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు’ అని వర్మ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత ‘అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా?’ అని కోరుతూ వర్మ మరో ట్వీట్ చేశాడు. ఇక దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో బుధవారం చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మండలి సమావేశాలను అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నాయకులు వీఐపీ గ్యాలరీల్లో నుంచి వీక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణను ఆర్కే రోజా మర్యాదపూర్వకంగా పలకరించి, కాసేపు ముచ్చటించారు. అనంతరం రోజాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు బాలయ్యతో సెల్ఫీలు దిగారు. Can someone tell me who’s this guy spoiling the photo by sitting next to the pretty Roja ? pic.twitter.com/0oJJHAuuEV — Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2020 Wowww Roja Garu looks like a HERO and some guy who I don’t know on her right looks like yuckk..He’s spoiling her beauty by spoiling the frame with his face ...Or maybe he is her Dishti Bomma pic.twitter.com/4uO19G6rZL — Ram Gopal Varma (@RGVzoomin) January 22, 2020 చదవండి: బాలయ్య న్యూలుక్ అదిరింది!! ఆ సంఘటన నన్ను కలచివేసింది: వర్మ ఏపీ రాజధానిపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ -
సీఎం జగన్పై ‘టీడీపీ’ అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: సీఎంపై బుధవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, సభ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యకలాపాల్ని అడ్డుకోవడంపై ఒక దశలో సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రౌడీల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు బిల్లులపై బుధవారం విపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ నిరాకరిస్తూ చర్చకు అనుమతించారు. అదే సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. టీడీపీ సభ్యుల వైఖరిపై ఒకదశలో స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నిర్వహణకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేసినా వినకుండా ఆందోళనను కొనసాగించారు. కఠిన చర్యలు తీసుకోవాలి: వైఎస్సార్సీపీ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనను చూస్తుంటే రక్తం మరిగిపోతోందని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వెలిబుచ్చారు. సీఎం వైఎస్ జగన్పై కేసులకు టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు కారణం కాదా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు పంది కొక్కుల్లా దోచుకున్న టీడీపీ సభ్యులకు తమ నేతను విమర్శించే అర్హత లేదని.. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్య తీసుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. సభలో అనైతికంగా వ్యవహరించే వాళ్లకు చంద్రబాబు మార్కులేస్తున్నారని మరో ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్కు అవమానం జరిగితే సభ ఊరుకోదనే సంకేతాలు పంపాలని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు స్పీకర్ను కోరారు. సభా నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ సభ్యులపై చర్య తీసుకోవాలని మరో సభ్యుడు అప్పలరాజు స్పీకర్కు విన్నవించారు. సభా విలువలు తెలియని గూండాలు అసెంబ్లీలోకి అడుగుపెట్టారని కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రపై టీడీపీ విషం కక్కుతోందని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేయగా.. సభలో వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంటే బయట వీళ్ళెలా ఉంటారో ప్రజలు అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే వెంకట అప్పలనాయుడు అన్నారు. టీడీపీ తీరు మారకపోతే ఆ పార్టీకి నామరూపాలు ఉండవని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన స్పీకర్ను అవమానించడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ అన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు చెల్లుబోయిన వేణు, ఆర్కే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సభలో టీడీపీ సభ్యుల వైఖరిని తీవ్రంగా దుయ్యబడుతూ.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు: కొడాలి నాని రైతు భరోసా కేంద్రాలపై చర్చను అడ్డుకోవడంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వ్యవసాయం దండగన్న వ్యక్తికి రైతు సమస్యలపై మాట్లాడే గొప్ప మనసు ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రైతు భరోసాతో పాటు, సాగునీటి ప్రాజెక్టులకూ ప్రాధాన్యత ఇస్తోందని, ఇది రైతుల పట్ల తమకున్న చిత్తశుద్ధి అని పేర్కొన్నారు. జోలె పట్టుకోవడం చంద్రబాబుకు అలవాటైందని, సభలో గందరగోళం సృష్టించి వాయిదా వేయించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ రైతు పక్షపాతని, ఆయన తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు రైతన్నకు అండగా ఉంటాయని వైఎస్సార్సీపీ సభ్యుడు అబ్బయ్య చౌదరి అన్నారు. రైతుల సంక్షేమం కోసం జరుగుతున్న చర్చను టీడీపీ సభ్యులు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. టీడీపీ సభ్యుల కన్నా వీధి రౌడీలే నయం: సీఎం ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యుల వైఖరిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ‘ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ స్థానాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. వాళ్లు పదిమంది కూడా లేరు.. మా వాళ్లు 151 మంది ఓపికతో ఉన్నారు. అయితే పోడియంను చుట్టుముట్టడం.. స్పీకర్ను అగౌరవపర్చడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం చేస్తున్నారు. ఇలా చేస్తే ఇటు కూర్చున్న వాళ్ళు రెచ్చిపోరా? సంస్కారం లేని ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇక్కడున్నారు? ప్రజా సమస్యలపై చర్చ జరిగేప్పుడు వీలైతే సలహాలివ్వాలి. లేకపోతే సభకు రాకుండా ఉండాలి’ అంటూ టీడీపీ సభ్యుల తీరును సీఎం తప్పుపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మా వాళ్లు ఆగ్రహంతో స్పందిస్తే దాన్ని వాళ్ల మీడియాలో వక్రీకరించే ప్రయత్నం చేస్తారని తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. ‘దీన్ని కట్టడి చేయాలి. సభాపతి స్థానం వద్ద మెట్లుదాటి ముందుకొస్తే వారిని మార్షల్స్ అటు నుంచి అటే ఎత్తుకుని బయటకు తీసుకుపోయే ఏర్పాటు చేయాలి. లేకపోతే సభలో ప్రజా సమస్యలకు విలువనిచ్చే పరిస్థితి ఉండదు. రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. వీళ్లకన్నా వీధి రౌడీలే నయం. వీధి రౌడీలు కన్పిస్తే ఏరిపారేస్తే తప్ప వ్యవస్థ బాగుపడదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికీ టీడీపీ సభ్యులు వెనక్కి వెళ్లకపోవడంతో.. మార్షల్స్ సాయంతో టీడీపీ సభ్యులను స్పీకర్ వారి స్థానాలకు పంపారు. -
రైతు శ్రేయస్సే లక్ష్యం
రైతులకు ఏమైనా సందేహాలు కలిగిన వెంటనే ఈ భరోసా కేంద్రాలకు వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. అందుకోసం అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ను కూర్చోబెడుతున్నాం. డైరెక్ట్ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి.. రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేస్తాం. డైరెక్ట్గా వీడియో స్క్రీనింగ్ వసతి కూడా కల్పిస్తున్నాం. తద్వారా నిపుణులతో సూచనలు, సలహాలు ఇప్పిస్తాం. ఆ విధంగా ప్రతి రైతుకూ ప్రతి అంశంలో తోడుగా ఉంటాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక ఏ ఒక్క రైతూ నష్టపోయే అవకాశమే లేకుండా అన్ని విధాలా అండగా ఉండేందుకు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు అవసరమైన సాయాన్ని ఈ కేంద్రాల ద్వారా తమ ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయంతో పాటు వ్యవసాయ సూచనలు, పండిన పంట కొనుగోలు చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రతి రైతు సమస్యకూ అక్కడే పరిష్కారం రెండు వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు నెలకొల్పామని, వీటి పక్కనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యకు ఈ రైతు భరోసా కేంద్రాలలో పరిష్కారమవుతుంది. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా పక్కనే లైవ్ వర్క్షాప్ కూడా ఉంటుంది. వ్యవసాయంలో బెస్ట్ ప్రాక్టీసులు ఏమిటన్నవి చూపి, వాటిని నేర్పించే కార్యక్రమం చేస్తారు. నేచురల్ ఫార్మింగ్పై అవగాహన కల్పిస్తారు. ఇంటరాక్టివ్ సూచనలు, సలహాలు కూడా ఇస్తారు. రైతు భరోసా కేంద్రాలలో క్వాలిటీతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తారు. నాణ్యత లేని విత్తనాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొనుగోలు చేసి రైతులు నష్టపోయే పరిస్థితిని పూర్తిగా మారుస్తాం. క్వాలిటీ స్టాంప్ వేసి అమ్ముతారు. రైతు అనేవాడు ఎక్కడా కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదు. ఈ కేంద్రాల ద్వారా ఫిష్, ఆక్వా సాగు చేసే ప్రాంతాలలో.. వాటికి సంబంధించిన క్వాలిటీతో కూడిన ఫీడ్, బెస్ట్ ప్రాక్టీసెస్పై అవగాహన కల్పిస్తారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తూ.. రైతులకు అవసరమయ్యే అన్ని సేవలను ఆయా గ్రామాల్లోని ఈ కేంద్రాలు అందిస్తాయి. భూసార పరీక్షలు గ్రామంలో రైతులకు మేలు చేసేందుకు భూసార పరీక్ష (సాయిల్ టెస్ట్) కూడా చేస్తారు. విత్తనాల నాణ్యతను పరీక్షించే (సీడ్ టెస్టింగ్) సౌకర్యాలు కూడా అక్కడే ఉంటాయి. ఏ రైతు అయినా ఇక్కడ కొనుగోలు చేసిన విత్తనాలే కాకుండా, వేరే చోట కొనుగోలు చేసిన విత్తనాల నాణ్యత తెలుసుకునేందుకు ఈ సీడ్ టెస్టింగ్ సదుపాయం ఉపయోగపడుతుంది. ధాన్యంలో తేమ శాతం (మాయిశ్చర్ టెస్టింగ్) తెలుసుకునే మీటర్లు కూడా రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులోకి తీసుకువస్తాం. గిట్టుబాటు ధరలు, పంటల కొనుగోలు రాబోయే రోజుల్లో రైతులు తాము అమ్ముకునే పంటలకు సంబంధించి.. రైతు పంట వేసేటప్పుడే ఫలానా పంటకు కనీస గిట్టుబాటు ధర ఇదీ అని ప్రకటిస్తాం. ఇంతకన్నా తక్కువ ధరకు ఏ రైతూ పంటను తెగనమ్ముకోవాల్సిన పని లేదు. ఇంతకన్నా తక్కువ రేటుకు ఎవరైనా కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే వివరంగా ఒక ప్రకటన కూడా ఇచ్చాము. (ప్రకటన కాపీని చూపించారు) ఏ పంటకు కనీస గిట్టుబాటు ధర ఎంత? ఆ పంట ఎప్పుడు ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఎప్పుడు సేకరిస్తాము అన్నది కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నాం. ఈ రైతు భరోసా కేంద్రాలు వచ్చే ఖరీఫ్ నుంచి రైతుల నుంచి పంటలను కొనుగోలు చేస్తాయి. రైతు తాను పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి? దళారుల దగ్గరకు పోయి తక్కువ ధరకు తెగనమ్ముకునే పరిస్థితి రాకుండా రైతు భరోసా కేంద్రాలు జోక్యం చేసుకుంటాయి. ఇదీ.. ఈ పంట కనీస గిట్టుబాటు ధర. అంత కంటే తక్కువ ధరకు ఎవరూ అమ్ముకోవాల్సిన పని లేదు. ఇంతకన్నా ఎక్కువ ధర వస్తే మీరు బంగారం మాదిరిగా అమ్ముకోండి. కానీ ఇంత కన్నా తక్కువ ధర వస్తే మాత్రం ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసే విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు పని చేస్తాయి. రాబోయే రోజుల్లో విత్తనాల పంపిణీని కూడా రైతు భరోసా కేంద్రాలు చేపడతాయి. ఇన్ని సమస్యలున్నా వెనుకడుగు వేయలేదు.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా వారికి తోడుగా, అండగా ఉంటోంది. ఆర్థిక పరిస్థితులు అన్యాయంగా ఉన్నా, చంద్రబాబునాయుడు ప్రభుత్వం పోతూ పోతూ విపరీతంగా బకాయిలు పెట్టినా భయపడలేదు. ఇన్ని సమస్యలున్నందున మేము ఇచ్చిన మాట నుంచి వెనుకడుగు వేస్తున్నామని ఏనాడూ చెప్పలేదు. దేవుడు సహకరించి, ప్రజలు దీవించడంతో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. ఏడాది ముందుగానే వైఎస్సార్ రైతు భరోసా ‘రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తామని మేము ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చే సరికి జూన్ వచ్చింది. నాలుగేళ్ల పాటు, ఏటా రూ.12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని మాత్రమే ఎన్నికల ప్రణాళికలో చెప్పాము. కానీ రైతులకు మంచి చేయాలన్న ఆరాటం, తపన, తాపత్రయంతో గత ఏడాది అక్టోబర్లోనే ఇచ్చాము. ఖరీఫ్ సీజన్లో కాకుండా రబీలోనే వెంటనే అమలు చేశాం. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పిన మొత్తాన్ని ఏటా రూ.13,500 చొప్పున 5 ఏళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా దాదాపు 46 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు రూ.13,500 చొప్పున ఇచ్చామని ఈ వేదిక నుంచి గర్వంగా చెబుతున్నాం. పంట రుణాలపై ప్రభుత్వమే వడ్డీ కడుతుంది.. మేము అధికారంలోకి రాగానే జూన్లో మరో గొప్ప పథకం.. రైతులకు వడ్డీ లేని రుణాలు అమలు చేశాం. అంతకు ముందు రైతులకు ఆ రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇవాళ ‘వైఎస్సార్ వడ్డీ లేని రుణాలు’ అని చెప్పి ప్రవేశపెట్టామని గర్వంగా చెబుతున్నాం. ఖరీఫ్, రబీలో పంట రుణాలు తీసుకున్న రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని కూడా గర్వంగా చెబుతున్నాం. రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఏ రైతు కూడా తమ పంటలను తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి రాకుండా చేస్తామని మరోసారి భరోసా ఇస్తున్నాం. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశాం. పగలే 9 గంటల విద్యుత్ ప్రతి రైతుకు పగటి పూటే 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలన్న తపన, తాపత్రయంలో అడుగులు ముందుకు వేశాము. రాష్టంలో 6,663 వ్యవసాయ ఫీడర్లు ఉంటే, వాటిలో దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటల విద్యుత్ ఇచ్చే సామర్థ్యం లేదని అధికారులు చెప్పారు. అందువల్ల ఆ ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు రూ.1,700 కోట్లు విడుదల చేశాం. ఇప్పటికే 60 శాతం ఫీడర్ల నుంచి పగలు 9 గంటల విద్యుత్ సరఫరా అవుతోంది. వచ్చే జూలై నుంచి 100 శాతం ఫీడర్లు పని చేస్తాయి. వ్యవసాయ మిషన్తో ముందడుగు రైతులకు మరింతగా మేలు చేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం. దీనికి నేనే చైర్మన్గా ఉన్నా. ఈ అగ్రి మిషన్లో రైతులు, స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్ వంటి నిపుణులు ఉన్నారు. ప్రతి నెలా ఒకసారి కలిసి, వారందరి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. తర్వాత వాటన్నింటినీ అమలు చేస్తూ ఒక మిషన్ మోడ్లో పోతున్నాం. ఈ విధంగా ప్రతి అడుగు రైతుల మేలు కోసం వేస్తున్నాం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా భవిష్యత్తులో వారికి మరింత మేలు చేసే అవకాశం రావాలని ఆశిస్తున్నాం’ అని సీఎం స్పష్టం చేశారు. అంతకు ముందు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటును అభినందిస్తూ ఎమ్మెల్యేలు డి.శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, బోళ్ల బ్రహ్మనాయుడు, రాపాక వరప్రసాద్, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, చెల్లుబోయిన వేణుగోపాల్, కందుల నాగార్జున రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, అప్పల నాయుడు, నాగేశ్వరరావు, రాజన్నదొర, కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రసంగించారు. ‘ఈ క్రాప్’ పై అవగాహన కల్పిస్తూ.. అది అమలయ్యేలా చూస్తాయి. జిల్లా, మండలం, చివరకు ఊరును ఒక్కో యూనిట్గా పరిగణించి, ఈ ఊళ్లో మీరు ఈ పంట వేస్తే మంచి రేట్లు వస్తాయని చెబుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట పరిస్థితి ఇదీ.. ఈ పంట కొరత ఉంది.. ఈ పంట ఇప్పటికే ఎక్కువగా సాగు చేసినందున మీరు అమ్ముకోలేక నష్టపోతారు.. కాబట్టి ఈ పంట వేయండి అని రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చే బాధ్యతను తీసుకుంటాయి. పశువులకు కూడా మొట్ట మొదటిసారిగా హెల్త్ కార్డులు ఇవ్వబోతున్నాం. క్రాప్ ఇన్సూరెన్స్, పశువుల బీమాతో పాటు, వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ఈ కేంద్రాలలో రైతులకు అవగాహన కల్పిస్తారు. రైతులకు ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నాం. నిజానికి ఇంతకు ముందు రైతులు బీమా ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. మేము అధికారంలోకి వచ్చాక రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నాం. మిగతా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. ఇందుకు రూ.2,100 కోట్లు రైతుల తరఫున ప్రభుత్వం భరిస్తోంది. -
బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు : బుగ్గన
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజు బ్లాక్ డే కంటే ఘోరమైన రోజు అని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలపై గౌరవం లేకుండా టీడీపీ వ్యవహరించిందని మండిపడ్డారు. బిల్లులను ఓటింగ్కు పెట్టకుండా.. టీడీపీ సభ్యులు ఛైర్మన్పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటే ముందుగానే మోషన్ మూవ్ చేయాలని, కానీ ఛైర్మన్ అలా చేయకుండా డైరెక్ట్గా సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఛైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు. నిబంధన ప్రకారం సెలక్ట్ కమిటీకి పంపొద్దని చెబుతూనే విచక్షణాధికారంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం సిగ్గు చేటన్నారు. అందరికీ నీతి నియమాలు చెప్పే యనమల రామకృష్ణుడు.. వికేంద్రీకరణ బిల్లుపై నిబంధనలు పాటించలేదన్నారు. మండలిలో తమకు ఉన్న సంఖ్యా బలాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోకాలొడ్డిందని విమర్శించారు. బిల్లులను అడ్డుకొని చంద్రబాబు ఏం సాధించారు? విచక్షణాధికారంతో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించానని ఛైర్మన్ ప్రకటించడం దారుణమని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీకి ఈ రోజు బ్లాక్ డే అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రెండు బిల్లులను శాసన సభలో ఆమోదించుకొని మండలికి వస్తే.. చర్చ జరపకుండా సెలెక్ట్ కమిటీకి పంపడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఛైర్మన్ వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు సిగ్గులేకపోతే.. ఛైర్మన్ అయినా ఆలోచించరా అంటూ అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు పార్టీలకతీతంగా వ్యవహరించాలని హితవు పలికారు. చంద్రబాబుకు తన స్వార్థం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదన్నారు. ఈ బిల్లులను అడ్డుకుని చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబు, ఛైర్మన్ షరీఫ్ చరిత్రహీనులుగా మిగిలిపోతారని మంత్రి బొత్స పేర్కొన్నారు. చదవండి: సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు -
సెలెక్ట్ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి ఛైర్మన్ షరీఫ్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం పంపకూడదని, తన విచక్షణాధికారాల మేరకే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నామని ఛైర్మన్ ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి బిల్లులపై మండలిలో చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదిస్తున్నట్లు టీడీపీ నోటీసు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సెలెక్ట్ కమిటీకి పంపవద్దని ఛైర్మన్కు మంత్రులు సూచించారు. సుదీర్ఘంగా దీనిపై చర్చ జరిగింది. మండలిలో తమకు ఉన్న సంఖ్యా బలాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోకాలొడ్డింది. మొదటి నుంచి వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తున్న టీడీపీ.. మరోసారి అదే ధోరణిని ప్రదర్శించి బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపేలా ఛైర్మన్పై ఒత్తిడి తెచ్చింది. కాగా, బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని వైఎస్సార్సీపీ సభ్యులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఛైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు. -
‘విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది’
సాక్షి, అమరావతి : ఇంగ్లిష్ మీడియం విద్య ద్వారా విద్యార్థుల్లో అభద్రతా భావం పోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఇంగ్లిష్ మీడియంపై చర్చ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. ఇంగ్లిష్ మీడియం విద్యతో రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల తలరాత మారుతుందని చెప్పారు. విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే సీఎం వైఎస్ జగన్ జనాల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారని చంద్రబాబు భయపడిపోతున్నారని తెలిపారు. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతుంటే.. గుంటనక్కలాగా శాసనమండలి గ్యాలరీలోకి వెళ్లి టీడీపీ సభ్యులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్ను పిల్లలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని అన్నారు. ఏపీ దేశానికే ఆదర్శం కాబోతుంది : హఫీజ్ ఖాన్ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని తెలుగు మీడియం విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కాలంటే ఇంగ్లిష్ మీడియం అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంగ్లిష్ రాకపోతే విదేశాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు. ఇంగ్లిష్ అర్థంకాక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని.. ఇప్పుడు ఆ సమస్య ఉండదన్నారు. ఇంగ్లిష్ మీడియంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శం కాబోతుందని తెలిపారు. చంద్రబాబు వైఖరి ఎంటో ఎవరికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోందన్నారు. అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ చదువుల బడిలాగా మారుతుందన్నారు. -
ఎలాంటి మోషన్ మూవ్ కాలేదు: మండలి చైర్మన్
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ బిల్లును చర్చకు తీసుకున్న సమయంలో ఎలాంటి మోషన్ మూవ్ కాలేదని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. సాంకేతికంగా మోషన్ మూవ్ అయితేనే ఏదైనా నిర్ణయం తీసుకోగలమని స్పష్టం చేశారు. ‘బిల్లు మూవ్ చేసిన తర్వాత యనమల మాట్లాడారు. అప్పుడు అశోక్బాబు నోటీసులు ఇచ్చారు’ అని పేర్కొన్నారు. కాగా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ టీడీపీ సభ్యులు మండలిలో గందరగోళం సృష్టించారు. మంత్రులవైపు దూసుకువెళ్లారు. ఇక బిల్లును చర్చకు తీసుకున్నప్పుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి.. నిబంధనల ప్రకారం దానిని సెలెక్ట్ కమిటీకి పంపకూడదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. ‘కొంచెం ఉంటే కొట్టేవాడు..’ : చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్సీలు సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు: బుగ్గన -
సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు: బుగ్గన
సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారం చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపకూడదని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 13 జిల్లాల అభివృద్ధి కోసం ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్లో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జ్యూడిషియల్ క్యాపిటల్, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుంది. అమరావతిలో శాసన సభ, శాసన మండలి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఇక చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు యనుమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. మంత్రులు సభలో ఉండకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై స్పందించిన బుగ్గన చైర్ను మీరెలా డిక్టేట్ చేస్తారని ప్రశ్నించారు. అదే విధంగా బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న టీడీపీ సభ్యులకు సమాధామనిస్తూ... బిల్లును చర్చకు తీసుకున్నపుడు ఎలాంటి మోషన్ మూవ్ చేయలేదు కాబట్టి... ఇప్పుడు సెలెక్ట్ కమిటీ అంటూ కొత్త వాదనలను తెరమీదకు తీసుకురావడం సరికాదని హితవు పలికారు. ఈ క్రమంలో శాసన మండలిని 15 నిమిషాల పాటు చైర్మన్ వాయిదా వేశారు. చదవండి: మండలిలో లోకేష్కు సవాల్ విసిరిన మంత్రి బుగ్గన -
‘కొంచెం ఉంటే కొట్టేవాడు..’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకునేలా టీడీపీ చేస్తున్న కుయుక్తులపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరక్షన్లో.. టీడీపీ ఎమ్మెల్సీలు ఎలా యాక్షన్ చేశారో తెలిపే వీడియో ఒకటి బయటికొచ్చింది. మండలిలో తాము ఏ విధంగా రౌడీయిజం ప్రదర్శించామో టీడీపీ సభ్యులే స్వయంగా చంద్రబాబుకు వివరించారు. వారు అలా చెబుతుంటే చంద్రబాబు చాలా బాగా చేశారని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు.. టీడీపీ సభ్యులు బెజవాడ రౌడీయిజం అని ఓ ప్రాంతాన్ని అవమానించేలా మాట్లాడినా కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు విస్తుపోతున్నారు. హుందాగా ఉండాల్సిన పెద్దల సభలో టీడీపీ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎమ్మెల్సీలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘మీరు లోపల కూర్చున్నారు. నేను టీవీ దగ్గర కూర్చున్నా.. చాలా బాగా చేశారు. నేను ఒకటి.. రెండు సార్లు వచ్చి చూశాను. మిగతావి స్క్రోలింగ్ చూస్తున్నా.. ఎప్పుడూ మాట్లాడినా గొడవ పడ్డారు. వాళ్ల మంత్రులు రావటం.. మనవాళ్లు రావడం అంతా చూశాన’ని చెప్పారు. దీనికి బదులిచ్చిన తమ్ముళ్లు.. ‘అశోక్ బాబులో రౌడీని చూశామని.. మంత్రులు వచ్చినప్పుడు ఆయన ఏయ్.. ఏయ్ అని బాగా అరిచారు. కొంచెం ఉంటే కొట్టేవాడు. బెజవాడ రౌడీయిజం చూపెట్టాడ’ని చెప్పారు. టీడీపీ సభ్యులు అలా చెబుతుంటే చంద్రబాబు వారిని ఉత్సాహపరిచేలా కనిపించారు. -
టీడీపీ సభ్యులపై మండలి చైర్మన్ ఆగ్రహం..
సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్ శాసనమండలి సమావేశాలను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం సభలో అనవసర రాద్ధాంతం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మండలి చైర్మన్ షరీఫ్ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీ ప్రసారాలు రావడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీలు బుధవారం మండలి వ్యవహారాలకు ఆటంకం కలిగించారు. టీవీ ప్రసారాలకు సాంకేతిక సమస్య తలెత్తిందని.. దానిని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పినా కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు. మంత్రి సమాధానంతో ఏకీభవించిన మండలి చైర్మన్ షరీఫ్.. టీడీపీ సభ్యులు ఆందోళన విరమించాలని ఆదేశించారు. అయితే టీడీపీ సభ్యులు మాత్రం చైర్మన్ చెప్పిన కూడా వినిపించికోకుండా.. టీవీ లైవ్ల కోసం ఆందోళన కొనసాగించారు. పదే పదే టీవీ ప్రసారాల పేరుతో టీడీపీ సభ్యులు మండలి సమావేశాలను అడ్డుకోవడంపై చైర్మన్ అసహనం చెందారు. టీవీ ప్రసారాలు తప్ప మరే అంశం లేదా అంటూ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ముఖ్య విషయాలను దాచిపెట్టారు: ఇక్బాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. శాసన మండలిలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లుల(అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లు)ను స్వాగతిస్తున్నామని తెలిపారు. పాలన వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి ఫలాలు పేదవారికి అందుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సహజ వనరులు ఉన్నాయని.. వాటిని అందిపుచ్చుకోవాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. ముఖ్య విషయాలను దాచిపెట్టారు.. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ఐకానిక్ బిల్డింగులు అవసరమని గత ప్రభుత్వం ఆలోచించ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ విమర్శించారు. రాజధాని అంశంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా చంద్రబాబు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ‘అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆహారలోటు ఏర్పడుతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. కానీ.. టీడీపీ శివరామకృష్ణన్ కమిటీలో ఉన్న ముఖ్యమైన విషయాలను దాచిపెట్టింది’ అని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని.. అందుకోసం రెండు బిల్లులను స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు ఓకే
సాక్షి, ఏపీ అసెంబ్లీ : అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర దర్యాప్తుకు బుధవారం శాసనసభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత సభలో చదివి వినిపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. 4,070 ఎకరాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా జరిగిందో అన్ని రకాల ఆధారాలతో సభలో చర్చించిన విషయాన్ని గుర్తుచేశారు. స్పీకర్ కూడా విచారణ జరిపించమని ఆదేశించారని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కంచె చేను మేసే విధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. కావాల్సిన వాళ్లకు చంద్రబాబు భూములు దోచిపెట్టారని తెలిపారు. రాజధాని ప్రకటన గురించి ముందే తెలుసుకుని.. అక్కడ తక్కువ ధరలకు భూములకు కొనుగోలు చేసి.. తర్వాత ఎక్కువ రేటుకు అమ్ముకుందామని చూశారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన దోచుకోవాలనే చూస్తారని మండిపడ్డారు. ఇంతకన్నా ఘోరం ఎక్కడా కనపడదని చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతం నూజివీడు అని కొందరు.. మరో ప్రాంతమని మరికొందరు లీకులు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు, ఆయన అనుచరులు మాత్రం అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. ఒక సీఎంకు కొట్టే బుద్ధి ఉంటే.. మరొక సీఎంకు పెట్టే బుద్ధి ఉంటుందని వ్యాఖ్యానించారు. బాబు దోచుకునే, దాచుకునే విధానానికి అలవాటు పడ్డారని మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్ విచారణ జరిపాలని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. రాజధాని భూ సేకరణను విధ్వంసం సృష్టించే విధంగా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఒక లీకు వీరుడు అని విమర్శించారు. సొంత మనుషులకు మేలు చేసేలా నిబంధనలు తుంగలో తొక్కారని అన్నారు. అనంతరం ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. చదవండి: 'తండ్రి జపాన్,సింగపూర్.. కొడుకేమో అమెరికా అంటున్నాడు' -
వ్యవసాయంలో కీలక సంస్కరణలు : సీఎం జగన్
సాక్షి, అమరావతి : గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని రైతుల సమస్యలను ఈ భరోసా కేంద్రాల్లోనే పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం అన్నారు. బుధవారం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. రాబోయే ఖరీఫ్ నాటికి 11, 158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయంలో నూతన విధానాలను ఆవిష్కరించేందుకు వర్క్షాపుల ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం చుడతామని చెప్పారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. రైతుల భరోసా పథకంను చెప్పిన దానికంటే ముందగానే అమలుచేశామని సీఎం స్పష్టం చేశారు. సభలో సీఎం జగన్ మాట్లాడుతూ... ‘వ్యవసాయంలో కీలక సంస్కరణలు తీసుకువస్తాం. దీనిలో భాగంగానే రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. పశువులకు హెల్త్ కార్డులు, పంట భీమా కార్డులు ఇస్తాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, ఈ క్రాఫ్పై అవగాహన కల్పించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తాం. అలాగే విత్తన పరీక్షలు కూడా చేసుకోవచ్చు. పంటలు వేయడానికి ముందే కనీస మద్దతు ధరలు ప్రకటిస్తాం. రైతు భరోసాను రూ.12500 నుంచి 13500కు పెంచాం. నాలుగేళ్లకు బదులు ఐదేళ్లకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. రైతుల ఇన్సురెన్స్ ప్రీమియం కింద రూ.2100 కోట్లను ప్రభుత్వం అదనంగా భరిస్తోంది. రైతుల కోసం వైఎస్సార్ వడ్డీలేని రుణాలను అందిస్తున్నాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకువచ్చాం. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రూ. 1700 కోట్లతో ఫీడర్లను ఆధునీకరించాం. రూ. 2వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశాం.’ అని అన్నారు. -
అందుకే టీడీపీ అల్లరి చేస్తోంది: రాపాక
సాక్షి, అమరావతి: రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగుతున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగని ప్రకటించిన తర్వాత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా అదే బాటలో నడుస్తూ రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. వారి సంక్షేమం కోసం సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అయితే టీడీపీ మాత్రం రైతులకు మేలు చేకూర్చే రైతు భరోసా కేంద్రాలు తదితర కీలక అంశాలపై చర్చ జరుగుతుంటే అల్లరి చేస్తోందని విమర్శించారు. స్పీకర్ పట్ల టీడీపీ సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉందని... చేతులు ఊపుకుంటూ స్పీకర్ను కొడతామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాపాక మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచి.. సభను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతుల రక్తం పీల్చిన జలగ చంద్రబాబు... రైతులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చిన చరిత్ర చంద్రబాబుదని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. రైతుల రక్తం పీల్చిన జలగ చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘చంద్రబాబు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చన్నారు. ఉచిత విద్యుత్ అమలు చేసి చూపించిన ఘనత వైఎస్సార్ది. ప్రస్తుతం సీఎం జగన్ అడగకుండానే అన్నీ ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు మేలు చేస్తున్నారు. ఈ కేంద్రాలు రైతుల పాలిట వరాలు’ అని పేర్కొన్నారు. ‘అధికారం, అవినీతి లేకపోతే బాబుకు నిద్రపట్టదు’ బుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారు: కొడాలి నాని ‘బాబు ఉన్నంతసేపు సీమలో కరువు తాండవించింది’ -
వారికి చెప్పి చెప్పి విసిగెత్తిపోయాను : స్పీకర్
సాక్షి, అమరావతి : శాసన సభలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముందస్తు ఆలోచనతోనే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా వారు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారని తెలిపారు. అందుకనే టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు. సత్వర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీని స్పీకర్ ఆదేశించారు. సభా మర్యాదలు ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. చట్ట సభలో హుందాగా, మర్యాదగా ప్రవర్తించాలని టీడీపీ సభ్యులకు స్పీకర్ హితవు పలికారు. (చదవండి : టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం) ‘శాసనసభలో ఈరోజు జరిగిన ఉదంతం చాలా దురదృష్ణకరం. ప్రతి సభ్యుడు నియామాలకు కట్టుబడి ఉండాలి. సభా హక్కులను హరించే అధికారం ప్రభుత్వానికిగానీ, ప్రతిపక్షానికిగానీ లేదు. ప్రతి సభ్యుడు సభా గౌరవాన్ని కాపాడాలి. ముందస్తు ఆలోచనతోనే టీడీపీ సభ్యులు మితిమీరి ప్రవర్తించారు. ప్రభుత్వంపై భిన్నాభిప్రాయాలు ఉంటే చెప్పొచ్చు. మాట్లాడేందుకు అవకాశమిస్తానని పదే పదే చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. సస్పెండ్ చేస్తే సభ నుంచి వెళ్లిపోతామంటున్నారు. టీడీపీ సభ్యులకు చెప్పి చెప్పి విసుగెత్తిపోయాను. రెండు గంటలపాటు నిరసనలు చేసి వెళ్లిపోయారు’ అని స్పీకర్ తెలిపారు. (చదవండి : టీడీపీది దిక్కుమాలిన వైఖరి) (చదవండి : ఐయామ్ సారీ..!) -
‘బాబు ఉన్నంతసేపు సీమలో కరువు’
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి విమర్శించారు. రెయిన్గన్ల పేరుతో రూ. 450 కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ... రైతులపై చంద్రబాబుకు ప్రేమే లేదని.. ఆయన అధికారంలో ఉన్నంతసేపు రాయలసీమలో కరువు తాండవించిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు రైతు ద్రోహి అని మండిపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని.. ఆయన అధికారంలోకి రాగానే సీమలో వర్షాలు కురిశాయని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ రైతు పక్షపాతి అని.. రైతులకు ఆయన అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా తరఫున సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.(రింగ్ దాటితే చర్యలు తీసుకోండి: సీఎం జగన్) గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం: చెవిరెడ్డి రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఎంతగానో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ఈ కేంద్రాల్లో రైతులకు కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్ స్వయంగా రైతుల సమస్యలను తెలుసుకున్నారని... అందుకే వారికోసం వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నా మైక్ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వైఖరిపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తన గురించి రూల్స్బుక్లో స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యుల్లాగా తామెప్పుడూ ప్రవర్తించలేదన్నారు. పోడియం వద్దకు వచ్చి ఎందుకు ఆందోళన చేస్తున్నారో టీడీపీ సభ్యులకే అర్థం కావటం లేదని మండిపడ్డారు. గతంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీర్మానం చేస్తే తాము బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక సోనియా, చంద్రబాబు కుమ్మక్కై వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. అయితే 23 కేసుల్లో స్టే తెచ్చుకున్న వ్యక్తిగా చంద్రబాబును పేర్కొన్నారు. ప్రజలు 151 స్థానాలు ఇచ్చి వైఎస్ జగన్కు పట్టం కట్టారని తెలిపారు. కాగా గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతకు ఎంత సమయం ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నా మైక్ ఇవ్వలేదని విమర్శించారు. కానీ నేడు ప్రతిపక్ష నేతలకు ఎంత అవకాశం కల్పిస్తున్నారో గమనించాలని ఆర్కే సూచించారు. చదవండి: నిరూపిస్తే రాజీనామా చేసి.. క్షమాపణ కోరుతా : ఆర్కే పోలీసులపై టీడీపీ నేతల రౌడీయిజం -
‘అధికారం, అవినీతి లేకపోతే బాబుకు నిద్రపట్టదు’
సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కాదని.. పార్టీని లాక్కుని వచ్చిన వ్యక్తని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి విమర్శించారు. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై మండిపడ్డారు. ఎంతమంది అరుస్తున్నారో అంత మందికి చంద్రబాబు మార్కులు వేస్తున్నారని చురకలు అంటించారు. హైదరాబాద్ లాంటి పరిస్థితి రాకూడదనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం నిర్ణయాలు తీసకుంటున్నారని ప్రశంసించారు. చంద్రబాబు తన బినామీల కోసమే ఓకే రాజధాని అంటున్నారని ఆరోపించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్రపై విషం కక్కుతున్నారు వైఎస్ జగన్ నాయకత్వాన్ని చూసి.. వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తారనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని ఆ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజలకు సింహం ఎవరో.. కుక్క ఎవరో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ సభ్యుల తిట్లు భరించలేకుండా ఉన్నామన్నారు. స్పీకర్ స్థానంలో తమ్మినేని సీతారాంను కూర్చొపెట్టేందుకు చంద్రబాబు ముందుకు రాలేదని గుర్తుచేశారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ 151 మంది ఎమ్మెల్యేలను గొర్రెలన్నారని ఆరోపించారు. సభాసాంప్రదాయాలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను గుడివాడ అమర్నాథ్ కోరారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. బలహీనవర్గానికి చెందిన సభాపతిపై టీడీపీ కావాలనే దురుసుగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. సభా నాయకుడిని కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రతిపక్షంలో ఉండి సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్దిచెప్పినా టీడీపీ సభ్యుల్లో మార్పురాలేదని వేణుగోపాలకృష్ణ దుయ్యబట్టారు. ఇక అధికారం, అవినీతి లేకపోతే చంద్రబాబకు నిద్ర పట్టదని మరో ఎమ్మెల్యే బాబురావు విమర్శించారు. సీఎం, స్పీకర్ వ్యవస్థలను టీడీపీ సభ్యులు అవమానించారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని బాబురావు జోస్యం చెప్పారు. చదవండి: అమ్మఒడి ఓ చరిత్రాత్మక పథకం మండలిలో టీడీపీ సైంధవ పాత్ర థ్యాంక్యూ.. సీఎం సార్ ‘రియల్ ఎస్టేట్పైనే చంద్రబాబుకు ప్రేమ’ -
బాబుకు చిల్లర రాజకీయాలు అలవాటే: నాని
సాక్షి, అమరావతి: ప్యాకేజీలకు అలవాటు పడి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విశాఖను మోసం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు చిల్లర రాజకీయాలు అలవాటేనని.. విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా.. సభలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ‘రైతు భరోసా’ కేంద్రాలపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి అని పునరుద్ఘాటించారు. సభలో టీడీపీ సభ్యులు మాత్రం కీలక అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో బుద్ధిలేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సభ వాయిదా పడితే చంద్రబాబు జోలె పట్టుకుని అడుక్కోవాలని చూస్తున్నారని.. ఎన్నికల్లో ఓడినా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు అని నాని గుర్తుచేశారు. వెలగపూడి రామకృష్ణ బుద్ధి, ఙ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.(టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం) చర్యలు తీసుకోవాల్సిందే: సుధాకర్ బాబు శాసన సభ స్పీకర్ పట్ల టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా వైఎస్ జగన్ను చూసే ప్రజలు తమకు ఓట్లు వేశారని.. ముఖ్యమంత్రిని అవమానిస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. స్పీకర్, సీఎంకు అవమానం జరిగితే చట్టసభలకు విలువ ఉండదని.. టీడీపీ సభ్యుల తీరుపై చర్యలు తీసుకోవాల్సిందేనని విఙ్ఞప్తి చేశారు.(ప్రజాస్యామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోంది: సీఎం జగన్) ఇక చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. టీడీపీ సభా సంప్రదాయాలు మరచిపోయిందని విమర్శించారు. సభలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అదే విధంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చిన్నవెంకట అప్పలనాయుడు సైతం టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండాలంటే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘రియల్ ఎస్టేట్పైనే చంద్రబాబుకు ప్రేమ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు రసాభాసగా సాగుతున్నాయి. బుధవారం సభలో ‘రైతు భరోసా’ కేంద్రాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చర్చను ప్రారంభించారు. అయితే సమావేశం ప్రారంభం నుంచే టీడీపీ సభ్యులు చర్చను అడ్డుకుంటున్నారు. సభ సజావుగా సాగేందుకు కృషి చేయాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు పట్టించుకోకుండా నినాదాలు చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులపై మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గత మూడు రోజులుగా స్పీకర్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అవమానపరుస్తున్నారు. స్పీకర్ వైపు వేలు చూపిస్తూ బెదిరిస్తున్నారు. టీడీపీ సభ్యులకు బెదిరించడం ప్రతీ రోజు అలవాటైంది. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు ఎంతో భరోసానిచ్చే ‘రైతు భరోసా’పై జరుగుతున్న చర్చను అడ్డుకోవడం దారుణం. దీని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు అండ్ టీంకు రైతులపై ప్రేమేలేదు. టీడీపీ సభ్యులకు రైతులు, సంక్షేమ పథకాలు వద్దు. వారికి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే కావాలి. చంద్రబాబుకు రియల్ ఎస్టేట్పైనే ప్రేమ ఉంది. రైతులపై, రాష్ట్ర అభివృద్ది పై కాదు’ అంటూ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: రాజధానులిక అందరివీ.. థ్యాంక్యూ.. సీఎం సార్ ఐయామ్ సారీ..! -
రింగ్ దాటితే చర్యలు తీసుకోండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ సభ్యులు సభలో వీధిరౌడీలు మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై సీఎం అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్...టీడీపీ సభ్యుల వైఖరిని ఎండగట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని టీడీపీ అపహాస్యం చేస్తోంది. మా 151మంది ఎమ్మెల్యేలు ఓపిగ్గా ఉంటే..10మంది టీడీపీ సభ్యులు పోడియం మీదికి వస్తున్నారు. స్పీకర్ చుట్టూ గుమిగూడారు. టీడీపీ సభ్యులు స్పీకర్ను అగౌరపరుస్తున్నారు. అంతేకాకుండా అక్కడ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. (చదవండి: ఐయామ్ సారీ..!) టీడీపీ ఎమ్మెల్యేలు సంస్కారం లేని వ్యక్తులు. ప్రజా సమస్యలను చర్చించడం వారికి ఇష్టం లేదు. అసలు వీళ్లు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో తెలియదు. సలహాలు ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తున్నారు. అనవసరమైన కామెంట్లు చేస్తున్నారు. అక్కడికి వచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే ఎలా? మళ్లీ తమపై దాడి చేస్తున్నారని అనుకూల మీడియాలో దిక్కుమాలిన వార్తలు రాస్తారు. టీడీపీ దిక్కుమాలిన పార్టీ. పోడియం రింగ్ దాటి అక్కడికి వస్తే ఎవరైనా సరే మార్సల్స్ ఎత్తుకెళ్లే విధంగా చర్యలు తీసుకోండి. వెంటనే మార్సల్స్ను పిలిచి రింగ్ ఏర్పాటు చేయండి. వీధి రౌడీలు మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. వీధి రౌడీలను ఏరివేయాల్సిన అవసరం ఉంది.’ అని స్పష్టం చేశారు. (చదవండి: ఇదేమైనా మీ ఇల్లనుకుంటున్నారా; స్పీకర్ ఆగ్రహం) -
ఇదేమైనా మీ ఇల్లనుకుంటున్నారా?
సాక్షి, అమరావతి: సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్న టీడీపీ శాసనసభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభం కాగానే, రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభమైంది. అయితే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ, స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు. వెల్లోకి వచ్చి ఆందోళన చేయవద్దని, సంయనమనం పాటించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా, టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. (చదవండి : ఐయామ్ సారీ..!) దీంతో స్పీకర్ తన స్థానం నుంచి లేచి నుంచొని ‘వాటీజ్ దిస్’ అంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పీకర్పై దాడికి యత్నించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర మనస్తాపం చెందారు. సభలో ఎవరు దౌర్జ్యంగా ప్రవర్తిస్తునానరో జనం గమనిస్తున్నారని అన్నారు. ఇది మీ ఇళ్లా.. లేక అసెంబ్లీనా అని స్పీకర్ తమ్మినేని టీడీపీ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే ఎటువంటి చర్యలకైనా సిద్ధమని హెచ్చరించారు. (చదవండి : బిల్లులపై మండలిలో రగడ) (చదవండి : టీడీపీది దిక్కుమాలిన వైఖరి) -
రైతాంగంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు: అబ్బయ్య చౌదరి
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి రైతు భరోసా కేంద్రాలపై చర్చ ప్రారంభించారు. రైతులపై చర్చ జరుగుతుండగా అడ్డుపడిన టీడీపీ సభ్యుల వైఖరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ రైతుల ద్రోహి అని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. చెప్పినదానికంటే అధికంగా రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పారు. సహకార సంఘాలను నిర్వీర్యం చేసిన చరిత్ర టీడీపీదని దుయ్యబట్టారు. (చదవండి : ఐయామ్ సారీ..!) రైతులను కాల్చిచంపిన బషీర్బాగ్ ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. చంద్రబాబు తీరును శివరామకృష్ణన్ కమిటీ కూడా తప్పు పట్టిందని గుర్తు చేశారు. రైతులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. పామాయిల్ రైతులకు రూ.84 కోట్లు ఇచ్చిన ఘనత, రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని అన్నారు. రైతాంగంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని అన్నారు. పార్టీకలతీతంగా నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 96 వేల 662 మంది మత్స్యకారులకు పెన్షన్ ఇస్తున్నామని వెల్లడించారు. ఉభయ గోదావరి జిల్లాలకు టీడీపీ చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. (చదవండి : అమ్మఒడి ఓ చరిత్రాత్మక పథకం) -
మూడోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా కేంద్రాలపై శాసనసభలో చర్చ ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టీడీపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై చర్చ జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఇదిలాఉండగా.. ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్షణరావు పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించారు. దీంతో పాటు సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుపై కూడా నేడు మండలిలో చర్చ జరుగనుంది. బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ మండలిలో మంగళవారం ఆయా బిల్లులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. (చదవండి) ఐయామ్ సారీ..! బిల్లులపై మండలిలో రగడ ఎస్సీ ఎస్టీ బిల్లుకూ అడ్డుపడతారా? -
ఎస్సీ కమిషన్ బిల్లు యథాతథంగా ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ బిల్లును శాసనసభ మంగళవారం ఆమోదించింది. గతంలో అసెంబ్లీలో ఆమోదించి పంపిన ఈ బిల్లును శాసన మండలి సవరణలు సిఫార్సు చేసి వెనక్కి పంపిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా శాసనసభలో మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టింది. శాసనమండలి చేసిన సవరణ సిఫార్సులు ఆమోద యోగ్యం కావని, అందువల్ల బిల్లును యథాతథంగా ఆమోదించాలని, ఎలాంటి సవరణలు అవసరం లేదని మంత్రి పినిపె విశ్వరూప్ పేర్కొన్నారు. ఈ బిల్లు చరిత్రాత్మకం అని ప్రశంసిస్తూ పలువురు వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడగా, ప్రతిపక్ష టీడీపీ సభ్యులు మాత్రం పోడియంలోకి వెళ్లి నిరసనకు దిగారు. బిల్లును ఆమోదించినందుకు ఎస్సీ, ఎస్టీ మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు సభలో సీఎం వైఎస్ జగన్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ఈ బిల్లుపై సభ్యులు మాట్లాడారు. ఎస్టీ, ఎస్టీలపై చంద్రబాబు వివక్ష ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటు కోసం తీసుకొచ్చిన బిల్లు చరిత్రాత్మకమని మంత్రి పినిపె విశ్వరూప్ అన్నారు. ఈ బిల్లును శాసన మండలిలో ఆమోదించకపోవడం సరికాదని చెప్పారు. తద్వారా ఆయా వర్గాల పట్ల చంద్రబాబు తన వివక్షను చాటుకున్నారని విమర్శించారు. ‘ఎస్సీల సంక్షేమంపై మా నేత వైఎస్ జగన్ చిత్తశుద్ధి ఎంత? మీ నేత చంద్రబాబు చిత్తశుద్ధి ఎంత? చర్చకు రండి’ అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు జగన్మోహన్రావు, జోగులు, బాలరాజు బిల్లును సమర్థిస్తూ మాట్లాడారు. సభను టీడీపీ అడ్డుకోవడం దారుణం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును సమర్థించాల్సిన టీడీపీ దీనికి విరుద్ధంగా సభను అడ్డుకోవాలని ప్రయత్నించడం దారుణమని ఎమ్మెల్యే సుధాకర్ బాబు మండిపడ్డారు. గతంలో దిశ, బీసీ కమిషన్ బిల్లుల సమయంలోనూ టీడీపీ ఇలాగే రాద్ధాంత చేసిందని ధ్వజమెత్తారు. దళితుల పట్ల టీడీపీ వివక్ష చూపుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు జగన్ సర్కారు పెట్టిన బిల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన (స్వగ్రామం ఉన్న) చంద్రగిరిలో దళితులను 40 ఏళ్లుగా ఓట్లు వేయనీయడం లేదని విప్ కొరుముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. -
ఐయామ్ సారీ..!
సాక్షి, అమరావతి: శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల తీరుపై సభాపతి తమ్మినేని సీతారాం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఎంత సహనం పాటించినా దారికి రాని విపక్షం తీరుతో విసిగిపోయిన ఆయన సభా స్థానం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. మంగళవారం అసెంబ్లీ కొలువుదీరాక.. తొలుత మాజీ ఎమ్మెల్యే కోటా రామారావు మృతికి సంతాపం ప్రకటించింది. అనంతరం స్పీకర్ తమ్మినేని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై చర్చకు అనుమతించారు. ఈ దశలో టీడీపీ సభ్యులు మూకుమ్మడిగా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ‘ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అదే అమరావతి’ అని రాసిన ప్లకార్డులు పట్టుకుని సభా కార్యక్రమాలకు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ‘మాట్లాడే అవకాశం ఇస్తాను. సీట్లలో కూర్చోండి’ అని సభాపతి పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా వినిపించుకోని ప్రతిపక్ష సభ్యులు ‘సేవ్ అమరావతి’ అంటూ అధికార పక్ష సభ్యులు మాట్లాడేది వినిపించకుండా నినాదాలు చేశారు. దాదాపు గంటన్నర పాటు ఇదేవిధంగా వ్యవహరించారు. కొంతమంది విపక్ష సభ్యులు ఏకంగా కాగితాలు చింపి స్పీకర్ పోడియం వద్ద విసిరేస్తూ, సభాపతి పట్ల అనుచితంగా మాట్లాడటం కన్పించింది. ఒక దశలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ తీరుపై తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గంటన్నర తర్వాత కూడా విపక్ష సభ్యులు మాట వినకపోవడంతో స్పీకర్ ఆగ్రహానికి గురయ్యారు. అప్పటికీ దారికి రాకపోవడంతో విసిగిపోయిన ఆయన తీవ్ర భావోద్వేగంతో ‘ప్లీజ్.. ఐ యామ్ సారీ.. ఐ యామ్ ప్రొటెస్టింగ్ ది ఆటిట్యూడ్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్.. నిజంగా మనస్తాపానికి గురవుతున్నా’ అంటూ సభా స్థానం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభ అర్ధంతరంగా వాయిదా పడింది. -
అమ్మఒడి ఓ చరిత్రాత్మక పథకం
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి పథకం విద్యావ్యవస్థలో ఓ పెద్ద సంస్కరణగా పలువురు మంత్రులు, శాసనసభ్యులు అభివర్ణించారు. రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాకుండా అక్షరాస్యతలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. లక్షలాది మంది తల్లులు తమ పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అమ్మఒడి పథకానికి రూపకల్పన చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనీయుడని కొనియాడారు. అమ్మఒడి పథకం– లక్ష్యాలపై రాష్ట్ర మంత్రి కె.కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో స్పల్పకాలిక చర్చను ప్రారంభించారు. అమ్మ ఒడితో సంక్రాంతి కంటే ముందుగానే పండుగ వచ్చిందని తల్లులు సంతోష పడ్డారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన దేశంలో ఎక్కడా లేదని మంత్రి కన్నబాబు అన్నారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, సీఎం స్వయంగా రూపొందించిన మధ్యాహ్న భోజన మెనూ ఈరోజు నుంచే అన్ని పాఠశాలల్లో అమలవుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ వేతనాన్ని రూ. వేయి నుంచి రూ.3 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దే అని చెప్పారు. పాఠశాలలు నాడు–నేడు కార్యక్రమంతో వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయని కన్నబాబు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సీఎంను అభినందించాలి జగనన్న అమ్మఒడి పథకం కేవలం సంక్షేమ పథకం కాదు.. ఓ సంస్కరణ పథకం అని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొనియాడారు. సమాజ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని రూపొందించారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు కేవలం ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు పసుపు కుంకుమ, పండుగలకు పప్పు బెల్లాలు పంచారని, కానీ సీఎం వైఎస్ జగన్ పేదలు, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత స్థానాలను చేర్చేందుకు అమ్మఒడి పథకంతో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ముఖ్యమంత్రిని అభినందించాలని పేర్కొన్నారు. ఈ పథకంతో పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలుతున్నానని చెప్పారు. ఇటువంటి మంచి పథకంపై జరుగుతున్న చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్న వ్యక్తిగా తాను ‘అమ్మ ఒడి’ పథకానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. జగన్ అంటే ఒక బ్రాండ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే పేరు కాదని, అదో బ్రాండ్ అని, చెప్పాడంటే చేస్తాడంతే– అనేది ట్యాగ్లైన్ అని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అభివర్ణించారు. చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చెప్పేవారని, ఇప్పుడు ఏ ఫర్ అమ్మఒడి అని చెప్పే విధంగా ఈ పథకం ఉందన్నారు. అ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని అక్షరాలు దిద్దేలా నిలిచిపోయే చారిత్రకమైన పథకం అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద బిడ్డకు సంక్రాంతి పండుగకు మేనమామ మాదిరిగా జగన్ అమ్మఒడి కానుకను తెచ్చారన్నారు. చరిత్రను తిరగరాసిన రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చిన జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు బడుగు, బలహీన వర్గాల పాలిట పెద్ద వరమని ఎమ్మెల్యే సీహెచ్ అప్పలరాజు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంటు పథకంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడు వైఎస్ జగన్ మరో రెండడుగులు ముందుకు వేసి విద్యను ఉద్యమ రూపంలో సంస్కరించేందుకు నడుంకట్టారన్నారు. అమ్మఒడి సంక్షేమ పథకం కాదని, అదో విప్లవాత్మక సంస్కరణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన స్వానుభవాలు, చంద్రబాబుపై సెటైర్లు సభికులను ఆకట్టుకున్నాయి. అమ్మఒడిని ప్రారంభించిన జనవరి 9 ఏపీ చరిత్ర తిరగరాసిన రోజు అన్నారు. మంచి చెప్పినా టీడీపీలో వినే పరిస్థితి లేదు మంచి చెప్పినా తెలుగుదేశం పార్టీలో వినే పరిస్థితి లేదని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు అన్నారు. అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతతో సహా ఆ పార్టీ సభ్యులు సభలో లేకపోవడం పేద పిల్లల చదువుపట్ల వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. జగనన్న అమ్మఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు వంటి పథకాలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో సీఎం వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పారు. అమ్మఒడి పథకం పట్ల బడుగు, బలహీన వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. కూల్చడానికి సినిమా సెట్టింగులు కాదు ఢిల్లీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఓ నాయకుడు ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. కూల్చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ సినిమా సెట్టింగులు కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే కొన్ని కోట్ల కుటుంబాల సమూహం అన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆ సినీ హీరో పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్ను జైల్లో నిర్బంధిస్తా అన్న కాంగ్రెస్, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న మరో నాయకుడు మూడు రాజధానులను అడ్డుకునేందుకు రాజకీయ భిక్షగాడి పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. మనసుతో చూసినప్పుడే ఇది సాధ్యం ప్రజల కష్టాలను మనసుతో చూడడం వల్లే అమ్మఒడి లాంటి అద్భుత పథకాలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టగలిగారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ అన్నారు. జగన్ అంటే నిజం, నిజమంటే జగన్ అనేది రుజువైందని, తన కలను జగన్ సాకారం చేశారని చెప్పారు. పేదల గుండెల్లో జగన్కు గుడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ యతిప్రాసలతో, కవితలతో చేసిన ప్రసంగం సభను ఆకట్టుకుంది. ’జనవరి నైన్త్– జనానికి స్ట్రెంగ్త్’ అన్నారు. ’పేదవాళ్లకు ఉండదు తడి (డబ్బు అనే అర్థంలో), వారి గుండెల్లో కట్టుకున్నారు జగనన్నకు గుడి.. అదే జగనన్న అమ్మఒడి, ఇదే చదువుల బడి’ అంటూ ఆయన ఆసు కవితను చదివినప్పుడు సభికుల నుంచి అభినందనలు వచ్చాయి. -
ఎస్సీ ఎస్టీ బిల్లుకూ అడ్డుపడతారా?
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు బిల్లుపై చర్చ జరగకుండా ప్రతిపక్ష టీడీపీ అడుగడుగునా అడ్డుపడటం మంగళవారం శాసనసభలో తీవ్ర వాగ్యుద్ధానికి దారి తీసింది. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలతో సభను అడ్డుకునేందుకు ప్రయత్నించగా దళితుల హక్కులను కాలరాసేలా వ్యవహరించడంపై వైఎస్సార్ సీపీ సభ్యులు మండిపడ్డారు. స్పీకర్ అనుమతితో మంత్రి విశ్వరూప్ ఈ బిల్లును సభ ముందుంచారు. దీనిపై మాట్లాడేందుకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్కు అవకాశం ఇచ్చారు. చంద్రబాబు దళిత ద్వేషి: వరప్రసాద్ బిల్లుపై చర్చను అడ్డుకుంటూ టీడీపీ ఆందోళనకు దిగడంపై ఎమ్మెల్యే వరప్రసాద్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అని చులకనగా మాట్లాడిన వ్యక్తి రాజకీయాల్లో కొనసాగేందుకు అర్హుడేనా అని ప్రశ్నించారు. నవరత్నాలు పేదలకు ఎలా ఉపయోగపడుతున్నాయో టీడీపీ నేతలు ఆలోచన చేయాలన్నారు. పేదలు ఉన్నత చదువులు చదవకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. పసుపు కుంకుమ పేరుతో టీడీపీ ఖజానాను ఖాళీ చేసిందని మంత్రి అనిల్ అన్నారు. ఎస్సీలను తొలగించిన చరిత్ర బాబుది: పుష్ప శ్రీవాణి దళితులంటే టీడీపీకి ఎంత వ్యతిరేకత ఉందో బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా తెలుస్తోందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చెప్పారు. మంత్రివర్గం నుంచి ఎస్సీలను తొలగించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో సగం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని, ఎస్టీల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నారు. కాగా, దళితుల సంక్షేమం టీడీపీకి పట్టదని ఎమ్మెల్యే నాగార్జున విమర్శించారు. మహిళా మంత్రులను అవమానిస్తున్నారు: రోజా ఎస్సీ ఎస్టీ బిల్లుపై మాట్లాడుతున్న మహిళా మంత్రిని అడ్డుకోవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో చంద్రబాబు ఎందుకు శాశ్వత కట్టడాలు చేపట్టలేదని ప్రశ్నించారు. తనను కేసీఆర్ పొగిడినట్లు చంద్రబాబు చెబుతున్నారని అయితే నిజానికి చంద్రబాబు లాంటి డర్టీ పొలిటీషియన్ లేరని ఆయన అన్నారని తెలిపారు. మహిళా మంత్రులు మాట్లాడుతుంటే టీడీపీ నేతలు అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలు బతికే దాన్ని సామాజిక రాజధాని అంటారని, సామాజిక వర్గానికి ఒక రాజధాని కావాలని వీళ్లు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులు భూములు కొన్నారని, నక్కా ఆనంద్బాబు ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. అనంతపురం నుంచి వచ్చి పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని, కానీ యామినిబాల ఎందుకు కొనుగోలు చేయలేదని నిలదీశారు. బిల్లుకు అడ్డుపడుతున్న టీడీపీ తీరుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.కన్నబాబు, సుధాకర్బాబు, గొల్ల బాబూరావు, జోగారావు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. -
విద్యా విప్లవానికి శ్రీకారం
పిల్లలకు రోజూ ఒకే రకమైన భోజనం పెట్టకుండా మార్పులు తీసుకొస్తూ మెనూ రూపొందించాం. ఇందులో నేను బాగా ఇన్వాల్వ్ కావడం నాకే ఆశ్చర్యం అనిపించింది. పిల్లలు బడుల్లో ఎలాంటి భోజనం తింటున్నారని ఏ ముఖ్యమంత్రీ ఇంతగా ఆలోచించి ఉండరు. ఈ మాత్రం శ్రద్ధ తీసుకోకపోతే మార్పు రాదు. – సీఎం వైఎస్ జగన్ ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి వరల్డ్ వైడ్ బెస్ట్ కరిక్యులమ్ను రూపొందించడంలో భాగంగా సింగపూర్, చికాగో, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్.. తదితర వర్సిటీల విద్యా విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. బెస్ట్ ప్రాక్టీషనర్స్, స్టడీ మెటీరియల్, గ్లోబల్ స్టాండర్డ్స్, చైల్డ్ ఫ్రెండ్లీ బుక్స్, టెక్ట్స్ బుక్స్, హ్యాండ్ బుక్స్, పేరెంట్స్ హ్యాండ్ బుక్స్, గైడెన్స్ బుక్స్, యాక్టివిటీ గైడెన్స్ను రూపొందించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి, అమరావతి: పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదువేనని, అందుకే పేద పిల్లలకు మెరుగైన విద్య అందించేలా విద్యా రంగంలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అమ్మఒడి, మధ్యాహ్న భోజనం, నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, ఫీజు రీయింబర్స్మెంట్ను అర్హులందరికీ ఇవ్వడంతో పాటు ఏటా పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థికి విద్యా కానుక కింద ఒక కిట్ అందజేస్తామన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంత వరకు దేశంలో ఎక్కడా జరగని విధంగా ఓ గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతోందన్నారు. ఇంతటి ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, వారి పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభలో ఉండి ఉంటే బావుండేదన్నారు. ఇలాంటి మంచి చర్చలో పాల్గొనక పోవడం ధర్మం కాదన్నారు. వాళ్ల పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు గడ్డి పెడుతూ బుద్ధి వచ్చేలా మాట్లాడారన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. క్వాలిటీ ఎడ్యుకేషన్ దిశగా అడుగులు ‘కాసేపటి క్రితం గౌరవ సభ్యులు మాట్లాడుతూ అక్షరాస్యతకు సంబంధించిన లెక్కలు చెప్పారు. రాష్ట్రంలో చదువురాని వారు 33 శాతం ఉన్నారు. దేశం యావరేజ్ చూస్తే 27 శాతం మాత్రమే. ఈ లెక్కన రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంటర్ తర్వాత ఎంత మంది పిల్లలు పై చదువుల కోసం ఎన్రోల్ అవుతున్నారన్నది పరిశీలిస్తే చాలా తక్కువ శాతం కనిపిస్తోంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) ప్రకారం దేశంలో 23 శాతం మంది మాత్రమే పై చదువులు చదువుతున్నారు. అంటే 77 శాతం మంది మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. పిల్లలకు మనం ఇవ్వాల్సిన ఏకైక ఆస్తి చదువే. నాణ్యతతో కూడిన విద్య అందిస్తేనే వాళ్ల జీవితాలు బాగుపడతాయి. అందుకే విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తూ నాలుగు అడుగులు ముందుకేస్తున్నాం. ఇందులో తొలి అడుగు అమ్మ ఒడి. రాష్ట్రంలో 82 లక్షల మంది పిల్లల భవిష్యత్ మార్చడం కోసం తల్లులకు తోడుగా నిలబడే కార్యక్రమం ఇది. అక్షరాలా 42,33,098 మంది తల్లులకు ఈ కార్యక్రమం వల్ల మేలు జరుగుతోంది. జనవరి 9న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. యాదృచ్ఛికంగా గత ఏడాది అదే రోజు నా పాదయాత్ర ముగిసిన రోజు. ఏడాది తర్వాత సరిగ్గా అదే రోజు ఇంత గొప్ప కార్యక్రమం ప్రారంభించినందుకు దేవుడికి, ప్రజలకు రుణ పడి ఉంటాను. దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమం అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించాక కేవలం నాలుగైదు రోజుల వ్యవధిలోనే 40,19,323 మంది తల్లుల అకౌంట్లలో రూ. 6,028 కోట్లు జమ చేశాం. ఇంత గొప్ప కార్యక్రమం రాష్ట్ర, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. వివిధ సాంకేతిక కారణాల వల్ల మిగిలిపోయిన 2.12 లక్షల అకౌంట్లకు సంబంధించి ఆధార్, బ్యాంక్ అకౌంట్లను వెరిఫై చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు లక్షా 28 వేల 259 మంది తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ అయింది. పేమెంట్ ఫెయిల్ అయిన 48 వేల ఖాతాలు, బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్.. 38 వేల ఖాతాలకు సంబంధించి లోటుపాట్లు సరిచేసి మరో వారంలో ఆ తల్లులకు కూడా మంచి చేస్తాం. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించినప్పుడే విద్యా వ్యవస్థలో మార్పులొస్తాయి. నాణ్యమైన భోజనం పెట్టడమే లక్ష్యం మేము అధికారంలోకి రాగానే చిన్నపాటి ఎన్నికలు నిర్వహించి స్కూల్లో పేరెంట్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇందులోంచి ముగ్గురు సభ్యులతో సబ్ కమిటీ వేస్తున్నాం. ఈ సబ్కమిటీ మధ్యాహ్న భోజనం నాణ్యతను పర్యవేక్షిస్తుంది. రేషన్, క్వాలిటీ, మెనూను ఈ కమిటీ సభ్యులు రోజూ చెక్ చేస్తారు. గ్రామ సచివాలయంలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ రోజు మార్చి రోజు క్వాలిటీ చెక్ చేయాలి. ప్రధానోపాధ్యాయుడు రెగ్యులర్గా రిపోర్టులు పంపిస్తారు. ఆయా ప్రాంతాల్లోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు కూడా తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తూ నాణ్యతను పరిశీలిస్తాయి. ఈ నాలుగంచెల క్వాలిటీ తనిఖీలను మానిటర్ చేసేందుకు ఆర్డీవో స్థాయి అధికారిని కూడా నియమిస్తాం. అవినీతిని నిర్మూలించి, పారదర్శకత పాటిస్తూ గుడ్ల సరఫరాకు సంబంధించి రివర్స్ టెండరింగ్కు శ్రీకారం చుడుతున్నాం. పౌల్ట్రీ ఫామ్స్ ఫార్మర్స్ మాత్రమే టెండర్లలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి స్కూల్లో ఇంగ్లిష్ ల్యాబ్ ఇంగ్లిష్ మీడియంలో బోధనను విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. ఇందులో ఇంగ్లిష్ మూవీస్ను ప్రదర్శించడం, రైమ్స్, ఆడియో బుక్స్, స్టోరీ బుక్స్తో లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మానిటర్ చేసేందుకు ప్రత్యేకించి జాయింట్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారిని నియమించాం. గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజనం విద్యా సంస్కరణల్లో భాగంగా ఈ రోజు (మంగళవారం) నుంచి మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తీసుకొస్తూ రెండవ అడుగు వేస్తున్నాం. ప్రతి రోజూ మెనూలో ఏం పెడుతున్నామో స్పష్టంగా చెబుతున్నాం. సోమవారం: అన్నం, పప్పు చారు, ఎగ్ కర్రీ, చిక్కీ మంగళవారం: పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు బుధవారం: వెజిటబుల్ రైస్ (కూరగాయలతో కూడిన అన్నం), ఆలూ కూర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డు శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం : అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్ ఈ కార్యక్రమానికి గోరుముద్ద అని (జగనన్న గోరుముద్ద అని సభ్యుల నినాదాలు) నామకరణం చేస్తున్నాం. మొన్నటి దాకా ఆయాలకు రూ.వెయ్యి కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. సరుకుల బిల్లులు కూడా 6 నుంచి 8 నెలలుగా ఇవ్వని పరిస్థితిని నా పాదయాత్రలో చూశా. సరుకుల బిల్లు నెల నెలా ఇవ్వకపోతే, క్వాలిటీ ఫుడ్ ఉండదు. మానిటర్ చేసే పద్ధతి కూడా లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆయాలకు ఇస్తున్న రూ.వెయ్యిని రూ.3 వేలకు పెంచి వారిని సంతోష పెట్టాం. నాణ్యతలో రాజీ పడకుండా చేశాం. ఇందువల్ల రూ.344 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది. అయినా పిల్లల కోసం ఖర్చు పెట్టే ఈ మొత్తం ఎక్కువ కాదని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. స్కూళ్ల ప్రారంభానికి ముందే విద్యా కానుక జూన్ 12వ తేదీన స్కూలు మొదలయ్యే నాటికి ప్రతి విద్యార్థికి కిట్ అందించడానికి చర్యలు తీసుకుంటూ.. ఇంకో గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 36 లక్షల 10 వేల మంది పిల్లలకు విద్యా కానుక కింద రూ.1,355 విలువ చేసే కిట్ను అందిస్తాం. ఈ కిట్లో స్కూల్ బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫాం (ఓన్లీ క్లాత్ ఇస్తాం.. కుట్టించుకోడానికి తల్లులకు డబ్బులిస్తాం), బూట్లు, రెండు జతల సాక్స్లు, బెల్ట్ ఉంటాయి. ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద పేద విద్యార్థుల ఉన్నత చదువులకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రేపు ఫిబ్రవరి నెలలో లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గ్రాడ్యుయేషన్లో ఉన్న పిల్లలకు మెస్ చార్టీలు, బోర్డింగ్ చార్జీల కోసం ఏటా తల్లికి రూ.20 వేలు ఇస్తాం. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా.. జూలై–ఆగస్టులో ఒకసారి, జనవరి–ఫిబ్రవరిలో మరోసారి ఇస్తాం. దీంతో పాటు విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాం. తద్వారా జీఈఆర్ రేషియోలో 77 శాతం ఎన్రోల్ కాని పరిస్థితిని రివర్స్ చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాం. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో మరిన్ని గొప్ప పనులు జరగాలని ఆశిస్తున్నాం. ఇంగ్లిష్ మీడియంతో పేదల బతుకుల్లో మార్పు మూడో అడుగుగా ఇంగ్లిష్ మీడియం బిల్లు తీసుకొచ్చాం. రైట్ టు ఎడ్యుకేషన్ కాదు.. రైట్ టు ఇంగ్లిష్ మీడియం ఎడ్యుకేషన్ అనే నినాదం తీసుకొచ్చాం. ఇలాగైతేనే పిల్లల జీవితాలు బాగుపడతాయి. పిల్లలు ప్రపంచంతో పోటీపడగల పరిస్థితి ఉంటుంది. పెద్ద వయసు వచ్చే సరికి ఫ్లో ఆఫ్ లాంగ్వేజ్ మెరుగు పడుతుంది. అప్పుడే ఉద్యోగాలు సాధిస్తారు. ఇందుకోసం వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తాం. ఆ తర్వాతి సంవత్సరం 7వ తరగతి, ఆ తర్వాత ఏడాది 8, ఆ తర్వాత 9, ఆ తర్వాత 10వ తరగతికి విస్తరింప చేస్తాం. రాబోయే చాలెంజెస్ను పరిగణనలోకి తీసుకుని కరిక్యులమ్లో కూడా మార్పులు చేస్తున్నాం. టీచర్లకు శిక్షణ, నాలుగు, ఐదు తరగతుల పిల్లలకు బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తాం. కరిక్యులమ్కు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ కాన్బెర్రా, సింగపూర్ గవర్నమెంట్తో, యూనివర్సిటీ ఆఫ్ చికాగోతో విద్యా శాఖ అధికారులు చర్చిస్తున్నారు. స్కూళ్లు తెరిచే లోగా టీచర్లకు శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాకు 20 మంది చొప్పున 260 మంది స్టేట్ రిసోర్స్పర్సన్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వీరు ప్రతి మండలంలో నలుగురికి శిక్షణ ఇస్తారు. ఏప్రిల్, మే నాటికి సబ్జెక్ట్ స్పెసిఫిక్ ట్రైనింగ్ పూర్తవుతుంది. మంత్లీ ఓరియెంటేషన్, స్కూల్ కాంప్లెక్స్, సెల్ఫ్ లెర్నింగ్ కోసం ప్రత్యేక యాప్స్ను పెడతాం. డ్యాష్ బోర్డ్ ద్వారా పరిశీలిస్తాం. నాడు–నేడుతో సమూల మార్పులు రాష్ట్రంలోని 45 వేల స్కూళ్లు.. కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, హాస్టళ్లలో మార్పులు జరగాలి. లేదంటే పరిస్థితి దారుణం. పాదయాత్రలో చాలా చోట్ల అధ్వాన్న పరిస్థితిలో ఉన్న స్కూళ్లను చూశాను. ఆ పరిస్థితిని మార్చడానికి 9 రకాల మౌలిక వసతులు కల్పించేలా నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా టాయిలెట్లు, ఫ్యాన్లు, డ్రింకింగ్ వాటర్, విద్యార్థులు.. సిబ్బంది ఫర్నిచర్, స్కూల్ పెయింటింగ్, బ్లాక్ బోర్డులు, మరమ్మతులు, ల్యాబ్స్, కాంపౌండ్ వాల్పై దృష్టి సారిస్తాం. ఈ కార్యక్రమం కింద ఈ ఏడాది 15,715 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించాం. ఈ నెల 18వ తేదీ నాటికి 12,368 స్కూళ్లలో పనులు మొదలయ్యాయి. క్వాలిటీ కోసం సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ కింద ఫర్నిచర్ కొనుగోలుకు వారం లోగా చర్యలు తీసుకుంటాం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. -
మండలిలో టీడీపీకి షాక్
సాక్షి, అమరావతి : ఏపీ శాసన మండలిలో రూల్ 71పై ఓటింగ్ సందర్భంగా టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు గట్టి షాక్ ఇచ్చారు. ఓటింగ్లో సొంత పార్టీకే వ్యతిరేకంగా ఓటు వేశారు. టీడీపీ ప్రవేశపెట్టిన రూల్ 71కి వ్యతిరేకంగా ఆ పార్టీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్రెడ్డి ఓటేశారు. రూల్ 71కి అనుకూలంగా 27మంది, వ్యతిరేకంగా 11మంది ఓటు వేయగా.. 9 మంది తటస్థంగా ఉన్నారు. శాసన మండలిలో టీడీపీ సభ్యులు 32మంది ఉండగా.. ఇద్దరు సొంతపార్టీకే వ్యతిరేకంగా నడుచుకున్నారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు శత్రుచర్ల, శమంతకమణి సభకు గైర్హాజరయ్యారు. ఓటింగ్ అనంతరం మండలిని రేపటికి వాయిదా వేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులపై రేపు మండలిలో చర్చ జరగనుంది. కాగా మంగళవారం ఉదయం నుంచి 71రూల్పై చర్చించాలని టీడీపీ పట్టుపట్టింది. ప్రభుత్వ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టకుండా గందరగోళం సృష్టించింది. టీడీపీ సభ్యుల తీరును అధికారం పక్షంతో పాటు బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. ఈ గందరగోళ పరిస్థితిలో ఛైర్మన్ రూల్ 71పై చర్చకు అనుమతించారు. ఓటింగ్ అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. -
‘దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదు’
సాక్షి, అమరావతి : రైతు భరోసా కేంద్రాలతో చాలా ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురుసాల కన్నబాబు తెలిపారు. రైతును కాపాడుకుంటే రాష్ట్రాన్ని కాపాడుకున్నట్లేనని అన్నారు. రైతుబంధు పథకంపై కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో చర్చను ప్రారంభించారు. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధునాతన వ్యవసాయ పద్ధతులను.. వర్క్షాప్లో అందించే కార్యక్రమం చేస్తామన్నారు. టెక్నాలజీని అనుసంధానం చేసి రైతులకు మెరుగైన సాయం చేస్తామని పేర్కొన్నారు. రైతుకు అవసరమైన విద్యను అందించేలా లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతి జిల్లాలో 5 హబ్స్ పెడతామని.. మొత్తం మెటీరియల్ను ఉంచుతామని తెలిపారు. రైతు పంటకు సంబంధించిన ఆర్డర్ ఇచ్చిన వెంటన.. డెలివరీ చేసే బాధ్యత రైతు భరోసా కేంద్రం తీసుకుంటుందన్నారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంతకు ముందు రైతుకు గిట్టుబాట ధర వస్తుందో లేదో తెలియకపోయేదని.. కానీ ఇప్పుడు రైతు పంట వేసే ముందే ప్రభుత్వం గిట్టుబాట ధర ప్రకటిస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. గత చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీని కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు. ఈ-క్రాప్ బుకింగ్ను తప్పనిసరి చేశామని.. దీంతో రైతు ఏ పంట వేశాడో తెలుస్తుందని కన్నబాబు చెప్పారు. రైతుబంధు ద్వారా నేరుగా రైతులకు సాయం చేశామన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. ఏ పథకమైనా సరే పకడ్బంధీగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ అన్నారని తెలిపారు. రైతుకు ఏ సమస్య వచ్చినా.. ఆన్లైన్లో శాస్త్రవేత్తలతో సూచనలు ఇప్పిస్తామని తెలిపారు. కన్నబాబు మాట్లాడిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభను రేపటికి వాయిదా వేశారు. ఈ అంశంపై బుధవారం చర్చ జరుగుతుందన్నారు. -
మండలి ముందుకు వికేంద్రీకరణ బిల్లు
సాక్షి, అమరావతి : పదినిమిషాల విరామం తర్వాత ఏపీ శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను పరిణగలోకి తీసుకుంటున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. బిల్లుతో పాటు రూల్ 71పై కూడా చర్చిందామని సూచించారు. ఇప్పటికే చాలా సమయం వృధా అయిందని అసహనం వ్యక్తం చేశారు. రూల్ 71పై చర్చిద్దామంటే సభ ఆర్డర్లో ఉండట్లేదని అందుకే బిల్లులను పరిగణలోకి తీసుకుంటున్నాని చైర్మన్ వెల్లడించారు. దీంతో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులు మండలి ముందుకు వచ్చాయి. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. కాగా ఈ రెండు బిల్లులకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. మూడు రాజధానులు ఏర్పాటు అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. చదవండి : మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ ‘మండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది’ -
‘మండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది’
సాక్షి, విశాఖపట్నం : శాసనమండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉందని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు తెలిపారు. శాసన మండలిలో టీడీపీ అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందన్నారు. ఆ ప్రసంగం చూడని వ్యక్తులు.. ఒక్కసారైనా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాలకు అభివృద్దిని వికేంద్రీకరణ చేస్తూ సీఎం వైఎస్ జగన్ చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. మండలి చైర్మన్కు ఒక బిల్లును అడ్మిట్ చేయాలా, వద్దా అనే అధికారం లేదన్నారు. ఏ బిల్లునైనా యథాతథంగా ప్రవేశపెట్టాలని చెప్పారు. మండలిలో చర్చ జరిగిన తర్వాత దానిని మద్దతు తెలుపాలా వద్దా అన్న అంశాన్ని సభ్యులు నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీకి మెజారిటీ ఉంటే మండలిలో సవరణలు కోరవచ్చన్నారు. కౌన్సిల్లో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ ప్రతిష్టంభన వెనక టీడీపీ ఉద్దేశమేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రతిష్టంభన తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత బాధ్యతను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీని ఉప ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు 29 గ్రామాలకే పరిమితం అవుతారా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అవసరం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమరావతి ఉంటే చాలు ఇతర ప్రాంతాలు వద్దంటున్నారని.. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ రాజకీయాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. చదవండి : మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ -
మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ
సాక్షి, అమరావతి : నాలుగు గంటల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఏపీ శాసన మండలి కొద్దిసేపటికే మరో సారి వాయిదా పడింది. మండలిని 10నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోంది. టీడీపీ సభ్యుల తీరును అధికారం పక్షంతో పాటు బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. సభలో ముందు బిల్లులపై చర్చ జరగాలని, ఆతర్వాతే రూల్ 71పై చర్చ జరపాలని చైర్మన్ను పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం కోరారు. చర్చ నిర్వహించే ముందు.. నిబంధనల ప్రకారం ముందు బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని చైర్మన్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిగణలోకి తీసుకున్నాక చర్చకు తాము అంగీకరిస్తామని తెలిపారు. రూల్ 71పైచర్చ జరిగాకనే బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పట్టుబడుతున్నారు. కాగా, ప్రతిపక్ష నేతలు ఇచ్చిన 71 నోటీసు అసలు వర్తించదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం జీవో కాకుండా పాలసీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ నోటీసు వర్తించదు కానీ చైర్మన్ మాట మీద గౌరవంతో ముందు బిల్లును పరిగణలోకి తీసుకొని తరువాత చర్చ చేపట్టాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ ప్రభుత్వ బిల్లులను సభలో ప్రవేశపెట్టకుండా చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. చైర్మన్ అన్ని పార్టీలను సమానంగా చూడాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. సమయాన్ని వృధా చేయడం మంచి కాదు ప్రభుత్వ బిల్లులను పరిగణలోకి తీసుకొని చర్చ జరపాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విజ్ఞప్తి చేశారు. మండలి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు. బిల్లును పరిగణలోకి తీసుకున్న తర్వాత రూల్ 71పై చర్చ జరగాలని కోరారు. సభలో ఎప్పుడులేని పరిస్థితి ఈ సారి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు. -
ప్రతీ పిల్లాడికి ఒక కిట్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదువేనని.. అందుకే విద్యారంగంలో గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని కార్యక్రమం అమ్మ ఒడి అని పేర్కొన్నారు. 82 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మార్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. జనవరి 9న తన పాదయాత్ర ముగిసిన రోజున ఈ గొప్ప కార్యక్రమం ప్రారంభించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా ఒకేసారి తల్లుల అకౌంట్లలోకి రూ. 6028 కోట్ల రూపాయలు పంపించామని వెల్లడించారు. అర్హులై.. సాంకేతిక కారణాలతో లబ్ది పొందని మిగతా తల్లులకు వెంటనే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా మధ్యాహ్న భోజన పథకంలో కూడా మార్పులు తీసుకువచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘పిల్లలకు ప్రతీ రోజు ఒకేరకమైన భోజనం కాకుండా రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ప్రతీ సోమవారం సోమవారం- అన్నం, పప్పుచారు, ఎగ్ కర్రీ, స్వీటు, చిక్కీ.. మంగళవారం- పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన గుడ్డు... బుధవారం- వెజిటబుల్ రైస్, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, స్వీట్, చిక్కీ... గురువారం కిచిడీ, టొమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు.. శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, స్వీట్, చిక్కీ... శనివారం- అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్ ఉండేలా మెనూ రూపొందించాం. గోరుముద్ద పేరిట విద్యార్థులకు భోజనం అందజేస్తాం. అదే విధంగా పథకం సాఫీగా అమలు జరిగేలా... ఆయాల జీతం రూ. 1000 నుంచి రూ. 3 వేలకు పెంచాం. దీని వల్ల దాదాపు రూ. 344 కోట్ల భారం పడుతుంది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.(ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకోండి: సీఎం జగన్) నాలుగంచెల వ్యవస్థ ఇక మధ్యాహ్న భోజన పథకం పనితీరును పర్యవేక్షించేందుకు నాలుగు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ’’పేరెంట్స్ కమిటీ నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తాం. ఇండిపెండెంట్ ఆడిట్ను కూడా రెగ్యులర్గా పరిశీలిస్తాం. ఎక్కడా అవినీతి ఉండకూడదనే ఉద్దేశంతో కోడిగుడ్లలో కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా ప్రపంచంతో పిల్లలు పోటీ పడేలా రైట్ టు ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చామని తెలిపారు. ‘‘ఇంగ్లీషు మీడియంతో పిల్లల చదువులు మారతాయి. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రారంభిస్తున్నాం. ఇంగ్లీషు మీడియంపై విద్యార్థులు, టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం. జనవరి 31లోగానే పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తిచేస్తాం. పాఠశాలలు తెరిచేనాటికి విద్యార్థులుకు అందుబాటులో ఉంచుతాం. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచుతాం’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతీ పిల్లాడికి ఒక కిట్.. పాఠశాల విద్యార్థులకు మేలు చేసే విధంగా... నాడు-నేడు కార్యక్రమాన్ని తీసుకువచ్చామని సీఎం జగన్ అన్నారు. ‘‘45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, స్కూళ్లలో మార్పులు తేవాలి. అక్కడ మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాం. వాటి రూపురేఖలు మార్చివేస్తున్నాం’’ అని తెలిపారు. అదే విధంగా విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రతీ విద్యార్థికి ఓ కిట్ అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ‘‘జూన్ 1న 36 లక్షల మందికి పిల్లలకు కిట్ అందిస్తాం. దీని ధర రూ. 1350. స్కూలు బ్యాగు.. మూడు జతల యూనిఫాంలు(బట్ట ఇచ్చి.. కుట్టుకూలీ కూడా ఇస్తాం).. పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టుతో కూడిన కిట్ను విద్యా కానుక పేరిట అందజేస్తాం’’ అని పేర్కొన్నారు. అదే విధంగా ఫిబ్రవరి నెలలో వసతి దీవెన కింద.. హాస్టల్లో ఉండే పిల్లల తల్లికి రెండు దఫాల్లో రూ. 20 వేలు అందిస్తామని తెలిపారు. -
‘ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత సీఎం జగన్’
సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వాఖ్యలపై పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఘాటుగా స్పందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని పవన్ చేసిన వ్యాఖ్యలకు పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కూల్చేయడానికి, పీకేయడానికి ఇది సినిమా సెట్టింగ్ కాదని పవన్ తెలుసుకోవాలన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీని కూల్చేస్తామని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని జైల్లో నిర్బంధిస్తామని అన్న కాంగ్రెస్, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయని అన్నారు. ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్ వెంట ఉన్నారని చెప్పారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా సీఎం జగన్ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. అమ్మ ఒడి పథకం పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని రమేష్ అన్నారు ఒక మంచి ఆలోచనతో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని.. ఆయన నిర్ణయాన్ని ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు అమరావతిలో అడ్రస్ ఉందా నిలదీశారు. తమ నాయకుడు సీఎం వైఎస్ జగన్కు అమరావతిలో నివాసం ఉందని అన్నారు. చంద్రబాబుకు అమరావతి, అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం పథకాలను విమర్శించే నైతిక హక్కు లేదని విమర్శించారు. అమరావతిని ఎక్కడికైనా తరలించారా అని చంద్రబాబును, టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. అమ్మ ఒడి మిగతా రాష్ట్రాలకు ఆదర్శం : వేణుగోపాల్ అమ్మ ఒడి పథకంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేదల జీవితాలకు వెలుగు తెచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థుల చదువుకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని గుర్తుచేశారు. అమ్మ ఒడి పథకం మిగతా రాష్ట్రాలకు ఆదర్శనీయమని చెప్పారు. పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు. విద్యార్థులు, రైతులకు సత్వర ఫలితాలు ఇచ్చేలా.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. రీజినల్ ఎకానమిక్ బోర్డులను పటిష్టం చేయాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. -
‘చంద్రబాబు లేకపోవడం దురదృష్టకరం’
సాక్షి, అమరావతి : ‘అమ్మఒడి’ ఒక గొప్ప సంస్కరణ పథకమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. పేదల భవిష్యత్ మార్చేందుకు అమ్మ ఒడి పథకం ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజలు, రైతులు కూలీలు మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని, అలాంటి వారికి ‘అమ్మఒడి’ భరోసా ఇచ్చిందన్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అమ్మఒడి పథకంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చి ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇటువంటి మంచి పథకంపై జరుగుతున్న చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. పేద పిల్లల భవిష్యత్ను మార్చే పథకానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్న వ్యక్తిగా తాను ‘అమ్మ ఒడి’ పథకానికి మద్దతు ఇస్తున్నానని, ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చిన సీఎం జగన్ను అభినందిస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ను అభినందించాలన్నారు. ఇటువంటి పథకాలను మరిన్ని తీసుకురావాలని సీఎం జగన్ను కోరారు. అమ్మఒడి పథకం పవిత్రమైంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ‘ అమ్మఒడి’ పథకం పవిత్రమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. ఈ పథకం పట్ల బడుగు, బలహీన వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఇటువంటి గొప్ప పథకాన్ని వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించడం బాధాకరం అన్నారు. ‘అమ్మ ఒడి’ లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినందకు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. -
ఎల్లో మీడియాది తప్పుడు ప్రచారం : శ్రీదేవి
సాక్షి, అమరావతి : అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గుర్తుచేశారు. వైఎస్సార్సీసీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రయోజనాలు కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని ఉపయోగించాలని సూచించారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి చేరువయ్యేలా చూడాలని కోరారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగానే చూశాయని.. కానీ సీఎం వైఎస్ జగన్ మాత్రం తలెత్తుకునేలా చేశారని అన్నారు. గతంలో ఎందరో ముఖ్యమంత్రుల వచ్చారు.. వెళ్లారు.. కానీ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం చరిత్రలో నిలిచిపోయారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ప్రీ కరెంట్ వంటి పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అదే బాటలో ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తృతం చేయడమే కాకుండా.. చికిత్స తర్వాత కూడా విశ్రాంతి తీసుకుంటున్నవారికి భృతి కల్పిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చాడానికి సంకల్పించారని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టడం చారిత్రక నిర్ణయమని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు నాణ్యమైన మధ్యాహ్నా భోజనం అందుతుదని పేర్కొన్నారు. ప్రజలకు నిజమైన సంక్రాంతి వచ్చింది.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడితో నిజమైన రాష్ట్ర ప్రజలకు ముందుగానే సంక్రాంతి పండగ వచ్చిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మ ఒడి పథకంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. సీఎం వైఎస్ జగన్ విద్యా దీవెన, విద్యా వసతితో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు పేదలకు వరంగా మారాయని చెప్పారు. భావితరాలకు అమ్మ ఒడి పథకం ఎంతో మేలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: చంద్రబాబుకు ఎమ్మెల్యే రజనీ చురకలు ‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’ హీనమైన చరిత్ర టీడీపీది: సీఎం జగన్ టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా -
చంద్రబాబుకు ఎమ్మెల్యే రజనీ చురకలు
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి పథకంతో రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని, ఈ పథకం రాష్ట్ర చరిత్రను మార్చేయబోతోందని ఎమ్మెల్యే విడదల రజనీ అన్నారు. అమ్మ ఒడి పథకంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో చదువుల విప్లవం వచ్చిందని వ్యాఖ్యానించారు. విద్య వల్లే మనిషికి గుర్తింపు వస్తుందని మహాత్మ గాంధీ చెప్పిన మాటలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. అమ్మఒడి నూతన ఒరవడి అని, ఈ పథకంతో పేద కుటుంబాల రూపురేఖలు మారతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. నిమ్నవర్గాలు సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి అమ్మఒడి పథకం దోహదం చేస్తుందన్నారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పాలకుడు అంటే ఎలా ఉండాలి, పాలన అంటే ఉండాలో సీఎం జగన్ను చూసి నేర్చుకోవాలని చంద్రబాబుకు సూచించారు. నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయన్నారు. విద్యార్థులను నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు సీఎం జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని కితాబిచ్చారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర విద్యా చరిత్రలో కొత్త శకం ప్రారంభం కాబోతోందని ఎమ్మెల్యే విడదల రజనీ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: ‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’ హీనమైన చరిత్ర టీడీపీది: సీఎం జగన్ టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా యనమలకు మంత్రి బొత్స సవాల్ ‘సీఎం జగన్కు గిరిజనుల పక్షాన ధన్యవాదాలు’ -
‘అమ్మఒడి అనేది పథకం కాదు.. విద్యా విప్లవం’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం ఓ విద్యా విప్లవమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు కొనియాడారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సందర్భంగా మంగళవారం అమ్మ ఒడి పథకంపై మాట్లాడుతూ.. అదొక విద్యా విప్లవంగా అభివర్ణించారు. విద్యారంగం సంస్కరణల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారు. అదే సమయంలో మధ్యాహ్న భోజన పథక మెనూను స్వయంగా జగన్ రూపొందించడం నిజంగా అభినందనీయమన్నారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిన ఘనత కూడా జగన్దేనన్నారు. దేశ చరిత్రలో అలాంటి సంస్కరణలో ఏ రాష్ట్రంలోనూ చేయలేదన్నారు. తన పాదయాత్రలో పేదల కష్టాలను జగన్ చూశారని ఈ సందర్భంగా అప్పలరాజు మరోసారి గుర్తు చేసుకున్నారు. ఇక ఫీజు రియింబర్స్మెంట్ అనేది పేద విద్యార్థులకు వరం అని అప్పలరాజు పేర్కొన్నారు. ఇక డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. అమ్మఒడి పథకం పేదలకు ఒక భరోసా అన్ని అన్నారు. అంటే అమ్మ అని, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. -
టీడీపీది హీనమైన చరిత్ర : సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది ఒక చరిత్రాత్మక నిర్ణయమని, కానీ ఆ బిల్లును శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని, ఇది విపక్షనేత చంద్రబాబుతో పాటు, ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కుమాలిన వైఖరి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అందుకే సభలో మంగళవారం మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని, అందుకే మంత్రి పదవుల్లో ఆరుగురిని నియమించామని, అయిదుగురు ఉప ముఖ్యమంత్రులలో ఇద్దరు ఆ వర్గాలకు చెందిన వారున్నారని తెలిపారు. అంతే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలను విడదీసి లబ్ధి పొందాలని చూశారని సీఎం ఆక్షేపించారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం మరోసారి సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పలువురు సభ్యుల మాట్లాడిన అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. టీడీపీది దిక్కుమాలిన చరిత్ర ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేసే చరిత్రాత్మక బిల్లును గతంలో శాసన మండలిలో ఆమోదం పొందకుండా చేసిన దిక్కుమాలిన చరిత్ర తెలుగు దేశం పార్టీది అని, ఇదీ ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు, పార్టీ ఎమ్మెల్యేల వైఖరి అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. దీంతో మరోసారి శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టామని, ఈసారి మండలిలో అడ్డుకోవడం సాధ్యం కాదు కాబట్టి, సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆ విధంగా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా విపక్షం వ్యవహరిస్తోందని తెలిపారు. మూడు కార్పొరేషన్లు రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. మాల, మాదిగతో పాటు, రెల్లి ఇతర కులాలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ అదే ఎస్సీలను విడదీసి రాజకీయ ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు కుట్ర చేశారని, వారిని విభజించి పాలించాలని దుర్భుధ్ధితో వ్యవహరించారని ఆక్షేపించారు. దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలు కలిసి ఉంటే, వారి డిమాండ్కు తలొగ్గాల్సి వస్తుందన్న దుర్భుద్ధితో వారిని విడగొట్టాలని చంద్రబాబు అడుగులు వేశారని ఆరోపించారు. దాన్ని సరిచేస్తూ, ఎస్సీలంతా ఒక్కటై ఉండాలన్న లక్ష్యంతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మరింత మేలు చేసేలా.. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేంగా వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేసి వారి జీవితాలు బాగు చేయాలని ప్రయత్నిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ప్రస్తావించిన ఆయన, వాటిలో రెండు మినహా అన్నింటినీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెల్చుకుందని గుర్తు చేశారు. టీడీపీ నుంచి ఒకరు, జనసేన నుంచి మరొకరు గెలిచారని తెలిపారు. కాగా, జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే, తాము చేస్తున్న మంచి పనులు చూసి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తమకు ఉన్న ఏకైక సభ్యుడిని ముందు పెడుతున్న టీడీపీ, రాజకీయం చేస్తోందని, ఆయన వైఖరి చూస్తుంటే ఎందుకు గెలిపించామని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారని సీఎం పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్య పోస్టులు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు 6 మంత్రి పదవులు ఇచ్చామన్న సీఎం వైఎస్ జగన్, వారిలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉన్నారని చెప్పారు. ఇంకా కీలకమైన విద్యా మంత్రి, హోం మంత్రి కూడా ఎస్సీలని, దీన్ని గర్వంగా చెప్పగలమని అన్నారు. ఇదే కాకుండా ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని తెలిపారు. ఆ విధంగా ఎస్సీలను ముఖ్యమైన పదవుల్లో నియమించామని వివరించారు. ఇప్పుడైనా మద్దతు ఇవ్వండి వీటన్నింటితో పాటు, ఎస్సీ, ఎస్టీలకు ఇంకా మేలు చేయడం కోసం వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే, గతంలో ఆ బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకుందని, కాబట్టి శాసనసభలో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం కాబట్టి అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. చదవండి: ‘సీఎం జగన్కు గిరిజనుల తరుపున ధన్యవాదాలు’ ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సంక్షేమ పథకాలు వదిలేద్దామా! రాజధానులిక అందరివీ.. -
‘సీఎం జగన్కు గిరిజనుల పక్షాన ధన్యవాదాలు’
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు రాద్దాంతం చేయడం విచారకరమని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేక బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. ఈ బిల్లుపై చర్చ సజావుగా జరగకుండా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేపట్టారు. ఈక్రమంలో స్పీకర్ వారికి ఎంత నచ్చచెప్పినా వినలేదు. టీడీపీ నేతలు నినాదాలు చేస్తుండగానే మంత్రి పుష్పశ్రీవాణి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. దళితులకు టీడీపీ ఎంత వ్యతిరేకమో వారి నినాదాలతోనే అర్థమవుతుందన్నారు. ‘ప్రతిష్టాత్మకమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుపై టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు. వీరికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. ఎస్సీ, ఎస్టీలకు మరింత మేలు చేసేందుకే ఈ బిల్లు ఉపయోగపడుతుంది. ఈ నిర్ణయంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి యావత్ గిరిజనుల తరపున ధన్యవాదాలు. ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకోవాలనే కౌన్సిల్లో టీడీపీ ఎస్సీ వర్గీకరణ తెరమీదకు తీసుకొచ్చింది. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరగకూడదనే టీడీపీ ముఖ్య ఉద్దేశం. గతంలో ఎస్సీలుగా ఎవరైన పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్న విషయాన్ని ఓ సారి గుర్తుచేస్తున్నా. అంతేకాకుండా ఆ రోజు తన మంత్రి వర్గంలో ఎస్సీ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. కానీ ఈ రోజు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్ వర్కుల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. తన కేబినెట్లో ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన ఏకైక సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు’ అని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. చదవండి: టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మనస్తాపం ‘డర్టీ పొలిటీషియన్ అని అదే కేసీఆర్ అనలేదా’ -
రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాలను టీడీపీ ఓటు బ్యాంక్గా చూస్తోందని ధ్వజమెత్తారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను వాడుకుని.. కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని.. భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఉద్యమం పేరుతో చంద్రబాబు.. రాజధాని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బినామీ భూములు పోతాయని చంద్రబాబుకు భయం పట్టుకుందని..అందుకే దొంగ ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు. అమరావతి ప్రజలను ఆయన అన్ని రకాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు.రాజధాని ముసుగులో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందన్నారు.అన్ని ప్రాంతాలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలను అవమానపర్చడమే చంద్రబాబు నైజం.. ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నిప్పులు చెరిగారు. దళితులను, గిరిజనులను అవమానపర్చడమే ఆయన నైజమని మండిపడ్డారు. సభను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత చట్టాలను అడ్డుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు ఆలోచన అంతా ఆస్తులను, పార్టీ ఉనికి కాపాడుకోవడానికేనని దుయ్యబట్టారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును రాష్ట్ర ప్రజలంతా గమనించారని.. దళితుల పట్ల చంద్రబాబు,టీడీపీ వైఖరి బయటపడిందని పేర్కొన్నారు. -
టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. అదేవిధంగా తన రాజీనామా లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో భవిష్యత్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకూడదని నిశ్చయించుకున్నట్లు డొక్కొ ఆ లేఖలో పేర్కొన్నారు. మంగళవానం శాసనమండలి సమావేశానికి డొక్కా గైర్హాజర్ కావడంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. కీలక బిల్లు నేపథ్యంలో మండలికి హాజరుకావాలని చంద్రబాబు ఫోన్ చేసినా డొక్కా స్పందించలేదని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. కాగా, ఈ రోజు మండలి సమావేశానికి డొక్కా మాణిక్యవరప్రసాద్తో పాటు శమంతకమణి, నామినేటెడ్ ఎమ్మెల్సీ రత్నబాబు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ మనస్తాపం ‘డర్టీ పొలిటీషియన్ అని అదే కేసీఆర్ అనలేదా’ సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం -
సారీ.. తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా: స్పీకర్
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుతో శాసన సభాపతి తమ్మినేని సీతారాం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ సభ్యుల వైఖరికి విసిగిపోయి.. సభను నడపలేనంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం సైతం ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుతగిలారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేయడంతో పాటు.. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచారు. దీంతో వారికి సర్దిచెప్పేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో టీడీపీ సభ్యుల తీరుతో విసిగెత్తిపోయిన తమ్మినేని సీతారాం.. ‘‘ప్లీజ్... ఐ యామ్ సారీ.. ఐ యామ్ ప్రొటెస్టింగ్ ది ఆటిట్యూట్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్.. నిజంగా మనస్తాపానికి గురవుతున్నా’’అంటూ సభ నుంచి వెళ్లిపోయారు. ‘రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడు’ సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? -
దోచుకోవడం తప్ప.. ఆయన చేసిందేమీ లేదు..
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు ‘పసుపు- కుంకుమ’ పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి.. ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష సభ్యులపై మంత్రి అనిల్కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దోచుకోవడం తప్ప.. చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. పొత్తులు లేకుండా టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదని.. ఏ పార్టీతో కలుద్దామా అని టీడీపీ ఆలోచిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. అంబేద్కర్ అంటే టీడీపీకి గౌరవం లేదు.. టీడీపీకి అంబేద్కర్ అంటే గౌరవం, ప్రేమ లేదని.. దళితులను హేళన చేయడం చంద్రబాబుకు అలవాటని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. టీడీపీ దళిత ద్రోహి అని విమర్శించారు. టీడీపీ సభ్యులు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని.. దళిత చట్టాలను టీడీపీ వ్యతిరేకించడం దారుణమన్నారు. చంద్రబాబు మొదట నుంచి దళితులను మోసం చేస్తూనే ఉన్నారని మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. -
‘డర్టీ పొలిటీషియన్ అని అదే కేసీఆర్ అనలేదా’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండవ రోజు సమావేశాల్ని కూడా ప్రతిపక్ష టీడీపీ పదే పదే అడ్డుకోవడంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు సమావేశాల్లో ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును ప్రవేశపెడితే.. దానికి టీడీపీ అడ్డుపడటం దారుణమన్నారు. ప్రతీ విషయంపై టీడీపీ గొడవ చేస్తోందని రోజా అన్నారు. మహిళలపై టీడీపీ సభ్యులు గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, అసలు వారికి జ్ఞానం ఉందా అని రోజా ప్రశ్నించారు. ఇక చంద్రబాబు తన ప్రసంగంలో ఒక్కసారి కూడా సీమ గురించి మాట్లాడలేదని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొగిడినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. అయితే అదే చంద్రబాబును డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ విమర్శించిన సంగతి మరచిపోయారా అని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్ దేశ చరిత్రలోనే లేడని కేసీఆర్ అన్న సంగతిని గుర్తు చేశారు. వికేంద్రీకరణ జరగకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని నిలదీశారు. అమరావతి గురించి నానా హంగామా చేస్తున్న చంద్రబాబు ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా ఎందుకు కట్టలేకపోయారని అడిగారు. తండ్రీ, కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు అమరావతిపై హడావుడి చేస్తున్నారన్నారన రోజా మండిపడ్డారు. చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం అమరావతి రైతులకు వరాలు వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం -
ముందు బిల్లుపై చర్చ జరగాలి: బుగ్గన
సాక్షి, అమరావతి: అభివృద్ధి, వికేంద్రీకరణ బిల్లును ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ నోటీసు ఇచ్చింది. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి బిల్లులను ప్రవేశపెట్టకుండా ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. రూల్ 71 ప్రకారం ముందు ప్రభుత్వ పాలసీపై ఇచ్చిన మోషన్పై చర్చ జరగాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో యనమల వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన మంత్రి బుగ్గన.. శాసనసభలో ఆమోదించిన బిల్లులపై ముందు చర్చ జరగాలన్నారు. ‘‘శాసనసభ చేసిన చట్టానికి మండలిలో ప్రాధాన్యం ఇస్తారా..? లేక పాలసీపై మోషన్కు ప్రాధాన్యం ఇస్తారా...? సభలకు విలువ లేకపోతే చట్టాలు ఎలా చేస్తారు. ముందు వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరగాలి’’ అని పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందే అని స్పష్టం చేశారు. కాగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం విదితమే. మూడు రాజధానులు ఏర్పాటు అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? వికేంద్రీకరణ వద్దు.. అమరావతే ముద్దు: చంద్రబాబు -
యనమలకు మంత్రి బొత్స సవాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగుతున్నాయి. మంగళవారం శాసనమండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యలు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లుకు మద్దతివ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలకు బొత్స ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేశారని యనమల ఆరోపించారు. అయితే యనమల తీరుపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దమ్ముంటే ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశామో నిరూపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా బిల్లుకు సమయం కావాలని యనమల ఆడగడంపై మంత్రి బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని, బిల్లు పెట్టి గంటలో చర్చ చేపట్టిన సందర్భాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా టీడీపీకి ఇష్టం వచ్చినట్లు సభా నడపాలా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలో రాజధాని అంశంపై బొత్స మాట్లాడినట్లుగా వచ్చిన వార్తలను యనమల చదివి వినిపించారు. అయితే టీడీపీ పార్టీ పాంప్లెట్గా పనిచేసే పత్రికలను సభలో ఎలా చదువుతారని మంత్రి బొత్స తప్పుపట్టారు. చదవండి: ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం -
‘రాజకీయాలకు చంద్రబాబు అనర్హుడు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సమావేశాలు సందర్భంగా ముందుగా మాజీ ఎమ్మెల్యే కోట రామారావు మృతికి అసెంబ్లీ సంతాపం తెలియజేసింది. అనంతరం ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లును మంత్రి విశ్వరూప్ సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిపై చర్చలో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ.. దళితులని అవమానించిన చరిత్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఆరోపించారు. తాను ఎన్నో అవమానాలు పడిన వ్యక్తిగా ఒక్కటి చెప్పదల్చుకున్నానని.. చంద్రబాబుకు చేతనయితే ఎస్సీ, ఎస్టీల్లో అసమానతాలను తగ్గించే యత్నం చేయాలన్నారు. చంద్రబాబు పరిపాలనలో ఎస్సీ, ఎస్టీలకు చేసేందేమీ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలు తరతరాలుగా పేదవారిగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతులు జోడించి విపక్షాన్ని అడుతున్నాని.. టీడీపీ ఎమ్మెల్యేలు మానవతా దృష్టితో ఆలోచించాలని హితవు పలికారు. ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లుకు అడ్డుపడవద్దని వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని కూడా టీడీపీ వ్యతిరేకించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసిన వరప్రసాద్.. రాజకీయాల్లో ఉండటానికి చంద్రబాబు అర్హుడు కాదన్నారు. పేదవాళ్లు బాగు పడొద్దనేది చంద్రబాబు ఉద్దేశమని వరప్రసాద్ తెలిపారు. దళితులకు ఉన్నత విద్యను అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుదన్నారు. చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి? -
చంద్రబాబుకు నమస్కరిస్తున్నా: చెవిరెడ్డి
సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతీ పల్లెను సీఎం తన సొంత గ్రామంగా భావిస్తారని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం తన బినామీల కోసం ఆరాటపడుతున్నారు తప్ప.. ప్రజల ప్రయోజనాలు ఆయనకు పట్టవని విమర్శించారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అభివృద్ధి వికేంద్రీకరణపై టీడీపీ, చంద్రబాబు అనుసరిస్తున్న తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సొంత జిల్లా అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. (ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?) చంద్రబాబుకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా ‘‘చంద్రబాబు సామాజిక వర్గ ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తున్నారు. కానీ సీఎం జగన్ అలాంటివారు కాదు. రాష్ట్రంలో ప్రతి పల్లెను, అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఆయనను అన్నికులాలు ఆదరిస్తున్నాయి. అందుకే 151 సీట్లు ప్రజలు కట్టబెట్టారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆయనలో చాలా అద్భుతమైన నటుడు ఉన్నారు. జగ్గయ్య, ప్రకాశ్రాజ్ కంటే అద్భుతంగా చంద్రబాబు నటిస్తున్నారు. నిన్న అసెంబ్లీలో ఈ విషయం బయటపడింది. చంద్రబాబుకు ఆర్ధిక ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని అభివృద్ధికి సహకరించాల్సిందిగా చంద్రబాబుకు నేను నమస్కరిస్తున్నా. ఆర్థిక ప్రయోజనాలు పొందిన వ్యక్తులు ఎక్కడ తిరగబడతారో అని బాబు ఆందోళనతో దిగాలు చెందుతున్నారు. చంద్రబాబులోని గొప్ప నటుడు 70 ఏళ్లలో బయటకు వచ్చాడు. 40 ఏళ్లలోనే ఇది జరిగి ఉంటే కచ్చితంగా ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ వచ్చి ఉండేది’’ అని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఎద్దేవా చేశారు. -
చంద్రబాబుకు ఎందుకంత ఆక్రోశం..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తుంటే.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎందుకంత ఆక్రోశం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు దేనికోసం చేస్తోందని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువ సమయం ప్రతిపక్షానికే ఇచ్చామని.. అయినా సీఎం మాట్లాడుతున్న సమయంలో అడుగడుగునా అడ్డు తగిలారని ధ్వజమెత్తారు. నిన్న అసెంబ్లీలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరు సిగ్గుచేటు అని.. వారు వ్యవహరిస్తోన్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షం అంటే హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రాంతీయ విద్వేషాలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రాజధాని పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ఆమోదం కావడం చాలా సంతోషంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఉత్తరాంద్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబాటు పై ప్రతి కమిటీలోనూ స్పష్టం గా చెప్పారన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో చినుకు కోసం రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారన్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక చదువుతుంటే తమ కంట కన్నీరు వచ్చిందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు హైకోర్టు కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. శ్రీకాకుళం లో ఉద్దానం కిడ్నీ బాధితులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలుస్తున్నారన్నారు. రాయలసీమ వాసులకు చెరువులు ద్వారా సాగునీరు అందించాలని ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు. (చదవండి: ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?) (చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం) -
అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరాయి. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై శాసనమండలిలో నేడు చర్చ జరగనుంది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీ శ్రేణులు పోలీసులపై రాళ్ల దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో సమావేశాల్లో రెండో రోజు భాగంగా అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. గరుడా కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని గామాల్లో బంద్కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రత్తమయ్యారు. రాజధాని గ్రామాల్లో తలదాచుకున్న అరాచకశక్తులకోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించవద్దని రాజధాని ప్రాంత వాసులకు పోలీసులు సూచించారు. నిరసనలు ఎవరి గ్రామాల్లో వారు శాంతియుతంగా నిర్వహించుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?
సాక్షి, అమరావతి: ఐదారు వేల కోట్లతో అమరావతిని అభివృద్ధి చేసినా.. ఐదారేళ్లలో ఎలాంటి అభివృద్ధి సాధించలేమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. లక్ష కోట్లు అవసరమైన అమరావతిలో చేయడానికి మనకి శక్తి సరిపోదని.. అదే సమయంలో విశాఖలో చేయకపోతే అభివృద్ధి జరగదని చెప్పారు. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోతామని.. అలాంటప్పుడు మనకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకోకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. అలా చేస్తే అభివృద్ధి సాధ్యమేనా..? ఈ 8 కిలోమీటర్ల పరిధిలోని అమరావతి అభివృద్ధి చేయాలని అనుకుంటే.. రూ. లక్ష కోట్లు అవసరం ఉన్న చోట్ల మనం ఎంత ఖర్చు పెట్టగలం. అయిదేళ్లలో అయిదారు వేల కోట్ల రూపాయలు పెట్టగలుగుతాం. అయిదేళ్ల తర్వాత ఒకసారి మనమంతా ఇదే చట్టసభలో కూర్చుని రాష్ట్రంలో మన పిల్లల ఉద్యోగాల పరిస్థితి ఏంటి? మన రాజధాని పరిస్థితి ఏంటి? అని చర్చిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరుతున్నా. ఒకవైపు లక్ష కోట్లు అవసరమైన చోట్ల డబ్బుల్లేక కేవలం అయిదారు వేల కోట్లు మాత్రమే పెట్టే పరిస్థితి. ఈ అయిదారు వేల కోట్లు మాత్రమే ఖర్చుపెడితే అది సముద్రంలో ఒక నీటి బొట్టులా కనిపించను కూడా కనిపించదు. అలా చేస్తే అయిదేళ్ల తర్వాత ఎలా ఉంటామంటే మళ్లీ ఇలాగే ఉంటాం. విశాఖపట్నం పరిస్థితి చూస్తే అక్కడేమో మనం పెట్టని పరిస్థితి. ఇక్కడ (అమరావతిలో) చేయడానికి మనకు శక్తి సరిపోదు. అక్కడ (విశాఖలో) చేయకపోతే అభివృద్ధి జరగదు. సచివాలయం కదల్చకూడదు. హైకోర్టును మార్చకూడదనుకుంటే మళ్లీ అయిదేళ్ల తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచించుకోవాల్సి వస్తుంది. విశాఖలో చేయాలంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని వెనుకడుగు వేస్తే అయిదేళ్ల తర్వాత కూడా మన పిల్లలు ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిన పరిస్థితే ఉంటుంది. రాజధాని ఎక్కడంటే మళ్లీ ఇక్కడే ఈ గ్రామాల మధ్య కూర్చుని ఇదే మన రాజధాని అనుకోవాల్సిందే. మేనిఫెస్టోలో బీజేపీ ఏం చెప్పిందో చూడండి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు మోదీ వచ్చారు, అది చెప్పారు.. ఇది చెప్పారు అని మోదీ మీద కూడా అభాండాలు వేసేశారు. ఒకసారి ఇదే బీజేపీ 2019 ఎన్నికల మేనిఫెస్టో చూద్దాం...ఆంధ్రప్రదేశ్కు సంబంధించి బీజేపీ మ్యానిఫెస్టోలో మోదీ ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఏపీ హైకోర్టును శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పింది. ‘అమరావతి నిర్మాణం ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వెంచర్లా సాగుతోంది. ఏడాదికి మూడు పంటలు పండే విలువైన వ్యవసాయ భూముల్ని టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. బీజేపీ అధికారంలోకి రాగానే తమ భూములు కావాలని అడిగే రైతులకు వారి భూములు వెనక్కి ఇచ్చేస్తుంది. అమరావతిలో దళితులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది వారికి న్యాయం చేస్తాం’ అని సాక్షాత్తూ బీజేపీ వాళ్లు 2019 మ్యానిఫెస్టోలో చెప్పినదాన్ని చంద్రబాబు వక్రీకరిస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరి తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో వారికే తెలియాలి. ఇలాంటి వాళ్లను తన్ని పార్టీ నుంచి బయటకు పంపించమని నేను బీజేపీ వాళ్లను కోరుతున్నా. 2021, జూన్కు పోలవరం పూర్తి చేస్తాం పోలవరం ప్రాజెక్టు గురించి కూడా చంద్రబాబు రకరకాలుగా వక్రీకరిస్తూ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గురించి నేను ఒక్క మాట చెబుతా. పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండరింగ్ చేశాం. దాదాపు రూ.830 కోట్లు ఆదా చేశాం. ఆదా చేయడమే కాకుండా ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాం. వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ప్రాజెక్టు 2021, జూన్ నాటికి పూర్తి చేస్తాం. నీళ్లు ఇస్తామని కూడా కచ్చితంగా చెబుతున్నా. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతోంది. చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం సంక్షేమ పథకాలు వదిలేద్దామా! ప్రతిపక్ష నేతవా.. సంఘ విద్రోహ శక్తివా? -
వికేంద్రీకరణ వద్దు.. అమరావతే ముద్దు
సాక్షి, అమరావతి: పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ చేయవద్దని, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో చర్చకు పెట్టిన మూడు రాజధానులు, ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డుల బిల్లుపై చర్చలో గంటన్నరసేపు మాట్లాడిన టీడీపీ అధినేత అమరావతిని సమర్థించుకునేందుకు అధిక ప్రాధాన్యమిచ్చారు. డబ్బుల్లేవనే నెపంతో అమరావతి నిర్మాణాన్ని నిలుపుదల చేయవద్దని, అది స్వయం ఆర్థిక ప్రాజెక్టు అని, దాన్ని పూర్తిచేస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు, సంక్షేమానికి డబ్బులు వస్తాయని, అమరావతి కల్పతరువు, కామధేనువుగా ఉంటుందన్నారు. తాను చేపట్టిన ప్రాజెక్టులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కొనసాగించారని, దీంతో వైఎస్సార్తోపాటు తనకు పేరొచ్చిందని చెప్పారు. వైఎస్సార్ తనయుడుగా ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని జగన్ అమరావతిని పూర్తి చేయాలని, చిన్నవాడైనా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. అమరావతిలో అన్ని అవసరాలకు పోనూ 10వేల ఎకరాలు మిగులుతుందని, ఆ భూముల్ని విక్రయించి అన్ని నిర్మాణాలూ చేయవచ్చన్నారు. రియల్ ఎస్టేట్ వల్లే భూముల ధరలు పెరుగుతాయి.. మూడు రాజధానులు ఎక్కడా విజయవంతం కాలేదని చంద్రబాబు అన్నారు. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రియల్ ఎస్టేట్ వల్లే భూముల ధరలు పెరుగుతాయని, తద్వారా ఆదాయం వస్తుందని చెప్పారు. అమరావతి బాండ్లకు వెళితే రూ.2 వేల కోట్లు వచ్చాయన్నారు. రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని, విశాఖలో రాజధాని పెట్టడంవల్ల రాయలసీమ జిల్లాలకు దూరమవుతుందని, ఆ జిల్లాల ప్రజలు 1,100 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాజధానులు, ప్రభుత్వ కార్యాలయాల వల్ల అభివృద్ధి జరగదని, ప్రజలు కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అమరావతి అనువైందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది.. శివరామకృష్ణన్ కమిటీ నివేదికలను చంద్రబాబు వక్రీకరిస్తూ.. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్య అమరావతే రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతమని సూచించిందన్నారు. అమరావతి నేల పటుత్వం విషయంలోనూ సమర్థించుకునేందుకు ఆయన ప్రయత్నించారు. అమరావతి నేల నిర్మాణాలకు మంచిదని ఐఐటీ చెన్నై నివేదిక ఇచ్చిందన్నారు. డబ్బుల్లేవని ఇక్కడ ఉండబోమనడం సరికాదని, ఇప్పటికే అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఉన్నాయని, ఇవి టెంపరరీ కాదని అన్నారు. ఈ భవనాల్లోనే ఉంటూ డబ్బులు వచ్చినప్పుడు మిగతా భవనాలు కట్టుకోవచ్చన్నారు. దీనిపై మంత్రి బొత్స జోక్యం చేసుకుంటూ ఇవి టెంపరరీ కాకపోతే మరో రూ.14 వేల కోట్ల అంచనా వ్యయంతో సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు టెండర్లు ఎందుకు ఆహ్వానించారని ప్రశ్నించారు. దీనికి బదులివ్వని చంద్రబాబు అమరావతిని ప్రధాని మోదీతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ సమర్థించారన్నారు. భూముల విలువ పెరిగితేనే ఆదాయం వస్తుందని, అమరావతిని అలాగే చేశామని పేర్కొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్తోపాటు ప్రభుత్వ సంస్థలకు ఎక్కువ ధరలకు భూములివ్వడం, ప్రైవేట్ సంస్థలకు తక్కువ ధరకు ఇవ్వడంపై మాట్లాడకపోవడం గమనార్హం. చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం అమరావతి రైతులకు వరాలు వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం -
సంక్షేమ పథకాలు వదిలేద్దామా!
స్కూళ్లు, ఆసుపత్రుల పరిస్థితి బాగోలేదు. బాత్రూములు, కాంపౌండ్ వాల్స్ లేవు. బిల్డింగ్లు కూలిపోతున్నాయి. ఆసుపత్రులలో జనరేటర్లు లేక సెల్ఫోన్ లైట్ల వెలుగులో ఆపరేషన్లు చేస్తున్నారన్న వార్తలు చూశాం. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న ఆసుపత్రులలో, స్కూళ్లలో మార్పు చేయాలని తలపెట్టిన నాడు–నేడు కార్యక్రమాన్ని కొనసాగిద్దామా? వద్దా? దాదాపు 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. దాదాపుగా 46 లక్షల మందికి రైతు భరోసా కార్యక్రమంతో తోడుగా ఉన్నాం. దాదాపు 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఒక్కొక్కరికి ఏటా రూ.15 వేలు ఇస్తూ పిల్లలను బడిబాట పట్టించేలా చేశాం. భవిష్యత్లో ఇవన్నీ కొనసాగించాలా? వద్దా? సాక్షి, అమరావతి: రాష్ట్రం ఏర్పడిన 2014 వరకు ఉన్న రూ.96 వేల కోట్ల అప్పు.. బాబుగారి దోపిడీ పుణ్యమా అని 2019 నాటికి మరో లక్షా 50 వేల కోట్లకు పైగా పెరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ లెక్కన 2 లక్షల 57 వేల కోట్ల రూపాయల అప్పుతో తమ చేతికి పాలన వచ్చిందని చెప్పారు. ఇవి కాక కార్పొరేషన్ల పేరుతో ఆయన చేసిన అప్పులు మరో 57 వేల కోట్లున్నాయని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.39,423 కోట్లున్నాయని చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుపై చర్చలో మాట్లాడారు. 2014 మార్చి నాటికి విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.2,893 కోట్లు ఉంటే, 2019 మార్చి నాటికి విద్యుత్ డిస్కమ్లు చెల్లించాల్సిన బకాయిలు రూ.21,540 కోట్లున్నా, తామే భరిస్తూ ప్రజలను సంతోష పెడుతున్నామని చెప్పారు. ‘కిందా మీద పడి రాజధాని కోసం లక్ష కోట్లు తెచ్చినా మనం దేన్ని పణంగా పెట్టాలని ఆలోచించుకోవాలి. కృష్ణా నది పరిస్థితి చూస్తున్నాం. అక్కడ నానాటికీ దయనీయమైన స్థితి. 40 ఏళ్ల సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం శ్రీశైలంలోకి వచ్చే నీళ్లు 1200 టీఎంసీలు, గత పదేళ్లుగా అది 600 టీఎంసీలకు పడిపోయింది. గత ఐదేళ్లలో అయితే 400 టీఎంసీలకు తగ్గాయి. కృష్ణా మీద 8 జిల్లాల సాగు, తాగు నీరు కోసం ఆధారపడ్డాయి. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది. వీటిని కృష్ణాలోకి తీసుకొస్తేనే నీరు అందించగలం. గోదావరి నుంచి బనకచర్ల వరకు నీరు తేవాలంటే ఇంజనీర్లు అంచనాలు తయారు చేయమంటే, రూ.68 వేల కోట్లు కావాలని లెక్కతేల్చారు. దీన్ని ఎలా తగ్గించాలని తెలంగాణ వాళ్ళతో కూడా మాట్లాడాం. ప్రతీ పైసా మిగిల్చాలని కిందా మీద పడుతున్న పరిస్థితి ఉంది. ఇంత భారీ ప్రాజెక్టును చేద్దామా? వద్దా అని నేను ఈ సభలో అడుగుతున్నాను’ అని సీఎం అన్నారు. ఇంకా ఏమన్నారంటే.. సాగు నీటి ప్రాజెక్టుల సంగతేంటి? వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఊపిరి పోసే ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. పోలవరం ఎడమ కాల్వ నుంచి నీటిని తరలించే ఈ ప్రాజెక్టుకు రూ.16 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇది వస్తే ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం పోయి రైతులకు నీళ్లు వస్తాయి. ఈ ప్రాజెక్టు చేద్దామా? వద్దా? రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రాజెక్టుల పరిస్థితి మీరే చూస్తున్నారు. సమృద్ధిగా నీళ్లు వచ్చినా ప్రాజెక్టులు నింపుకోలేని పరిస్థితి. ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీలు ఇవ్వని స్థితి. కరవు నివారణ కోసం కాల్వల సామర్థ్యం పెంచేందుకు రూ. 25 వేల కోట్లు ఖర్చవుతుంది. ఇది చెయ్యడం సాధ్యం కాదని చెప్పే మనసు ఎలా ఉంటుంది? జలయజ్ఞం ద్వారా రైతాంగానికి మేలు చెయ్యాలని నాన్నగారు తలంచారు. చంద్రబాబు జమానా కూడా అయిపోయింది. వాటిని పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుందని ఇంజనీర్లను అడిగితే.. రూ.30 వేల కోట్లు అవుతుందని చెప్పారు. 62 శాతం ప్రజలు వ్యవసాయంపై బతుకుతున్నారు. రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే ట్రాన్స్కోకు ప్రభుత్వం ఎంతివ్వాలని లెక్కలేస్తే.. ఏటా రూ.8 వేల కోట్లు ఇవ్వాలి. గతంలో చంద్రబాబు ఏనాడూ కూడా రూ.1200 కోట్లు...రూ.1500 కోట్లు మించి ఇవ్వలేదు. దీంతో ఆ సంస్థలు బయట నుంచి అప్పులు తెచ్చాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి తర్వాత ప్రభుత్వాలు చేతులెత్తే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రాకూడదని, రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తే 10 వేల మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలనే సలహా వచ్చింది. దీని కోసం రూ.36 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. ఇది ఖర్చు పెడితే ఏడాదికి ట్రాన్స్కోకు ఇచ్చే రూ.8 వేల కోట్లు సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవచ్చనే ఆశ. అన్ని జిల్లాల్లోనూ మౌలిక వసతులు కల్పించాలి.. గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి, నూజివీడు, నందిగామ, మైలవరం, చివరకు నా ఇల్లున్న తాడేపల్లి ఇవన్నీ ఒక్కోదానికి రూ.500 కోట్లు ఇస్తే చాలు అభివృద్ధి సాధిస్తాయి. తాడేపల్లి, మంగళగిరి మోడల్ మున్సిపాల్టీలుగా చేయాలని అంచనాలు వేయిస్తే కేవలం రూ.1100 కోట్లు పెడితే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించి మోడల్ సిటీలుగా మారతాయి. కృష్ణకు వరదలు వస్తే విజయవాడలోని కృష్ణలంక ముంపునకు గురవుతుంది. రిటైనింగ్ వాల్ కట్టాలి. కానీ అయిదేళ్లు చంద్రబాబు సీఎంగా ఉన్నా కట్టలేదు. నాకంతట నాకే బాధ అనిపించింది. వెంటేనే రిటైన్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం. పల్నాడుకు తాగు, సాగునీరు లేదు. వాటిని కల్పించడానికి, మెడికల్ ఆసుపత్రిని, మచిలీపట్నంలో పోర్టు మెడికల్ కాలేజీ, ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు బ్యారేజీలు, ఎగువన వైకుంఠాపురంలో మరో బ్యారేజీ కట్టాల్సిన అవసరం కూడా ఉంది. సముద్రంలోకి నీరు వృధాగా పోకుండా వీటి ద్వారా స్టోరేజీ కెపాసిటీ పెరగడమే కాకుండా మచిలీపట్నం పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు కూడా తాగు, సాగునీరు అందుతుంది. ప్రతి జిల్లాలోనూ ఇలాంటివి ఉన్నాయి. విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీ లేదు. గిరిజన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, ట్రైబల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రతి చోటా కనీస అవసరాలు తీర్చే కార్యక్రమాలు చేపట్టాలంటే మనదగ్గరున్న వనరులు, డబ్బులు ఏ మేరకు ఉన్నాయి? పాఠశాలల సంగతేంటి? ► పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని రూ.12 వేల కోట్లు, ఆసుపత్రులను బాగు చేయడానికి అక్షరాలా రూ.14 వేల కోట్ల అంచనాలతో పనులు చేపట్టనున్నాం. ఈ రెండు కార్యక్రమాలకు రూ.26 వేల కోట్లు ఖర్చు చేద్దామా వద్దా? ► వాటర్ గ్రిడ్లో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళంలోని పలాస ప్రాంతం, పల్నాడు ప్రాంతం, ప్రకాశం జిల్లాలోని కిడ్నీ ప్రభావిత ప్రాంతాలకు రిజర్వాయర్ల దగ్గరనే వాటర్ను ఫిల్టర్చేసి పైపుల ద్వారా గ్రామాలకు మంచినీటిని అందిస్తాం. ఈ జిల్లాలకు రూ.12 వేల కోట్లతో మంచినీటిని అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమమే చేయాలంటే అక్షరాలా రూ.45 వేల కోట్లు అంచనా అవుతుంది. ఇలాంటివి చేయాలా? వద్దా? ► భావనపాడు, మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం.. పోర్టులను కట్టడానికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేద్దామా.. వద్దా? ► ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాలు శాచ్యురేషన్ పద్ధతిలో ఇస్తాం. నాలుగేళ్లలో ఏటా 6 లక్షల ఇళ్లు చొప్పున వారికి కట్టించి ఇవ్వాలంటే దాదాపుగా ఏడాదికి రూ.10 వేల కోట్లు.. నాలుగేళ్లకు రూ.40 వేల కోట్లు పేద వారి కోసం ఖర్చు చేద్దామా? వద్దా? ► రాష్ట్ర జనాభాలో 90 శాతం మందికి ఆరోగ్యశ్రీ, లక్షలాది కుటుంబాలలో ఉన్నత చదువులు చదువుకొంటున్న వారికి ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన, వడ్డీలేని రుణాలు, ఉచిత పంట బీమా, ధరల స్థిరీకరణ నిధి, ఉపద్రవాల సమయంలో ఆదుకొనేందుకు నిధి, పేదలకు నాణ్యమైన బియ్యం, రైతులకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్తు ఇంకా ఇటువంటివి చాలా చాలా చేస్తున్నాం. ఇన్ని చేస్తూ.. కేవలం రాజధాని పేరుతో 53 వేల ఎకరాలను డెవలప్ చేయడానికి మరో లక్ష కోట్లను పెట్టడమన్నది సాధ్యమేనా? చదవండి: సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం అమరావతి రైతులకు వరాలు వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం -
అసెంబ్లీ ముట్టడి విఫలం
సాక్షి, అమరావతి/సాక్షి, గుంటూరు/తుళ్లూరు/తుళ్లూరు రూరల్: అసెంబ్లీ ముట్టడికి టీడీపీ శ్రేణులు చేసిన యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం శాసనసభ సమావేశాల నేపథ్యంలో టీడీపీ, వామపక్షాలు, అమరావతి జేఏసీ చేపట్టిన ఛలో అసెంబ్లీ, అసెంబ్లీ ముట్టడికి పోలీసులు అనుమతించకపోవడంతో నిరసనకారులు రాళ్లతో దాడికి దిగారు. రాళ్ల దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు, పలువురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం పొలాల్లో నుంచి సచివాలయం వైపు చొచ్చుకుని వచ్చేందుకు చేసిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా విధుల్లో ఉన్న పోలీసులను మహిళలు తీవ్ర దుర్భాషలాడారు. ఎర్రబాలెంలో స్పృహ కోల్పోయిన మల్లీశ్వరి అనే మహిళకు మంచినీరు అందించి పోలీసులు సేవలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేశారు. రెచ్చగొట్టేలా టీడీపీ మెసేజ్లు అసెంబ్లీ ముట్టడికి ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో టీడీపీ నేతలు వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్ ద్వారా ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ‘కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలు ఏమైపోయారు? 5 లక్షల మందితో అసెంబ్లీని ముట్టడించాలి. లేదంటే రాష్ట్రంలో బతకడమే దండగ’ అంటూ టీడీపీ నేతలు రెచ్చగొడుతూ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టారు. గుంటూరులో హోంమంత్రి మేకతోటి సుచరిత ఇంటి ముందు నిరసనకు దిగిన టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. రాళ్లు తగిలి కింద పడిపోతున్న పోలీసు సహనంతో పోలీస్ వ్యూహం బయటి ప్రాంతాల నుంచి అమరావతి చేరుకున్న వ్యక్తులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆదివారం రాత్రి ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందించటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో చెక్పోస్టులు, మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ పరిసరాలను బాంబ్స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టారు. పోలీసు బలగాలు శాంతి, సహనంతో వ్యవహరించి అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేశాయి. గల్లా జయదేవ్పై కేసు రాజధాని ప్రాంతంలో 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగి రైతులు, ఆందోళనకారుల ముసుగులో పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. అసెంబ్లీ పరిసరాల్లో ముట్టడికి యత్నించిన ఎంపీ గల్లా జయదేవ్పై 143, 332, 188, 353, 323, 324, రెడ్/149 సెక్షన్ల కింద తుళ్లూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జయదేవ్ను పోలీసులు అరెస్టు చేయడంతో టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఐజీ బ్రిజ్లాల్ను కాపాడే యత్నంలో ఆక్టోపస్ ఎస్సై ఒకరు గాయపడ్డారు. పలు చోట్ల రాళ్ల దాడుల్లో గాయపడ్డ పోలీస్ సిబ్బంది వి.నగేష్, గొట్టె లింగా, హరీశ్, పి.వేణుగోపాలరావు, బి.చక్రధర్, పి.ఏసురాజును ఆస్పత్రికి తరలించారు. అసెంబ్లీ వెనుక పొలాల్లో నుంచి సుమారు 600 మంది ఆందోళనకారులు పోలీసులపై ఒక్కసారిగా రాళ్లతో దాడిచేశారని గుంటూరు రూరల్ ఎస్పీ విజయారావు తుళ్లూరులో మీడియాతో పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై 353, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. -
రాజధాని సామాజిక వర్గాల కొట్లాట కాదు
సాక్షి, అమరావతి: విశాఖకు రాజధాని వెళ్తే కమ్మవాళ్లు ఎవరూ ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోరని, ఆ సామాజిక వర్గం వ్యాపారాలు చేసుకునేందుకు అమరావతితో పాటు మరో రాజధాని వచ్చినట్టవుతుందని మంత్రి కొడాలి నాని చెప్పారు. ‘అక్కడున్న వ్యాపారాల్లో 50 శాతం (80 శాతం వరకు ఉన్నట్లు కొందరు సభ్యులు చెప్పారు) మావాళ్లవే’ అని నాని పేర్కొన్నారు. విశాఖలో విద్య, వాణిజ్యం, హోటళ్లు, వైద్యం, ట్రాన్స్పోర్ట్ రంగాలలో కమ్మ సామాజిక వర్గం వారే అధికంగా ఉన్నారని వివరించారు. కమ్మ సామాజిక వర్గాన్ని రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలను ఖండించారు. కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనుకుంటే విశాఖకు రాజధాని ఎందుకు తరలిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్కు ఆ ఉద్దేశమే ఉంటే రాజధాని కడపకో, కర్నూలో, నెల్లూరో, ఒంగోలో, దొనకొండకో వెళ్లేదన్నారు. నిజానికి రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కమ్మ కులాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండాలని భావిస్తే 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ మూడు రాజధానులపై చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎవర్నైనా ఆదరిస్తారని, కమ్మ సోదరులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నారా లోకేష్ తోడల్లుడికి చెందిన గీతం యూనివర్సిటీ విశాఖలోనే ఉందని నాని చెప్పారు. నాని ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ... మూడుసార్లు మారితే కృష్ణా, గుంటూరు అభివృద్ధి ఆగిందా? - చంద్రబాబు విజన్ 2020 చివరికి 420గా మారి తన కుమారుడిని కూడా గెలిపించుకోలేక 20 సీట్లకే పరిమితమైంది. - మూడు రాజధానులపై చంద్రబాబు, ఆయన బాకా మీడియా సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తోంది. - రాజధాని ఢిల్లీ దేశానికి మధ్యలో ఉందా? స్కేలుతో కొలిచి రాజధానిని నిర్ణయిస్తారా? - అమరావతి అనేది ఒక మోసం. సచివాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి పుణ్యక్షేత్రాన్ని ఎండబెట్టారు. - సెక్రటేరియట్, హైకోర్టు తరలిస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి ఆగిపోతుందని చంద్రబాబు చెబుతున్నారు. మరి గతంలో మూడు సార్లు రాజధాని మారితే కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధి ఆగిపోయిందా? - రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ సీఎం జగన్ను బెదిరించాల్సిందిగా గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకు చంద్రబాబు చెబుతున్నారు. అయితే ఆయన (వైఎస్ జగన్) బెదిరిస్తే బెదిరే రకం కాదు. - రెచ్చగొడితేనో, జోలె పట్టి అమరావతిలో అడుక్కుంటేనో సానుభూతి రాదు. పాపాలభైరవుడు అడుక్కుంటే ప్రజలు ఆనందపడతారే తప్ప వీడికేం ఖర్మ అంటూ ఎవరూ జాలి చూపించరు. - చంద్రబాబు అమరావతి కోసం తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలే కానీ 151 సీట్లున్న వైఎస్ జగన్ కాదు. - అమరావతి ప్రాంత అక్క చెల్లెమ్మలు, రైతులు అనుమానాల నివృత్తి కోసం ప్రభుత్వంతో చర్చించేందుకు ముందుకు రావాలి. - బందరు పోర్టుతో పాటు కృష్ణా జిల్లాలో ఇతర ప్రాజెక్టులకు, గుడివాడ నియోజకవర్గానికి ప్రభుత్వం ఉదారంగా నిధులివ్వాలని కోరుతున్నా. వైఎస్ లాంటి మరణాన్ని కోరుకుంటా.. దేవుడు తనకు ఎలాంటి మరణం కావాలని అడిగితే రాజశేఖరరెడ్డి లాంటి మరణం కావాలని కోరుకుంటానని కొడాలి నాని ఉద్వేగభరితంగా చెప్పారు. ‘ఈ రాష్ట్రాన్ని చాలా మంది పాలించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఆయన పేరుతో పార్టీ పెట్టి కడప, పులివెందులలో పోటీ చేస్తే అప్పటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలకు డిపాజిట్లు రాలేదు. పార్టీ స్థాపించిన మొదటి ఎన్నికల్లో 67 మంది ఎమ్మెల్యేలు, తరువాత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచారు. ఇదంతా వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కార్యక్రమాల వల్ల కాదా?’ అని నాని పేర్కొన్నారు. 70 ఏళ్ల వయసు వచ్చింది.. బలమైన పార్టీని లాక్కున్నారు.. కొడుకును కూడా గెలిపించుకోలేని బతుకు కంటే చావడం వెయ్యి రెట్లు మేలని పరోక్షంగా చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. -
మూడు రాజధానులతో రాష్ట్ర భవితకు పునాది
సాక్షి, అమరావతి : పాలన, అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని.. ఇందుకు సంబంధించిన బిల్లుకు గుంటూరు వాసిగా మద్దతు తెలుపుతున్నానని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శాసనసభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ బిల్లు ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు చక్కటి పునాది ఏర్పడుతుంది. ప్రభుత్వ సంస్కరణలు, నిర్ణయాలను విమర్శకులు కూడా స్వాగతిస్తున్నారు. వర్గం, కులం, పార్టీలు చూడకుండా.. వివక్ష చూపకుండా ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచించడం గొప్ప విషయం. భవిష్యత్తులో గొప్ప అభివృద్ధి సాధించాలంటే మొదట ప్రాంతీయ అసమానతలు లేకుండా చూడాలి. అలా జరగాలంటే అన్ని ప్రాంతాల ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవించాలి. గొప్ప నిర్ణయాన్ని అమలుచేస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న వికేంద్రీకరణ నిర్ణయం చరిత్రలో మేలిమలుపు అవుతుంది. మా ప్రభుత్వం ఏడు నెలల కాలంలోనే 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా మేలు చేసింది.. 46 లక్షల మంది రైతు సోదరులకు రైతు భరోసా అందించింది.. ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, చేనేతలు.. ఇలా అందరినీ ఆదుకుంది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించింది ఈ ప్రభుత్వమే. ఇది చాలా గొప్ప విషయం. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ఎక్కడా రైతులకు, రైతు కూలీలకు కష్టం, నష్టం జరగకుండా చూస్తున్నాం’’ అని సుచరిత చెప్పారు. -
అమరావతి రైతులకు వరాలు
సాక్షి, అమరావతి బ్యూరో: అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించింది. అన్నదాతల సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అసెంబ్లీలో సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ(ఏఎంఆర్డీఏ) బిల్లును సభ ముందుంచారు. అమరావతి ప్రాంత ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలన్నీ స్పష్టం చేశారు. అసైన్డ్ రైతులకూ ప్లాట్లు అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పరిహార భృతిని(పెన్షన్) రూ.2,500 నుంచి ఏకంగా రూ.5 వేలకు ప్రభుత్వం పెంచింది. దీనివల్ల అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో 20,100 మంది భూమి లేని కూలీలకు లబ్ధి చేకూరనుంది. ఈ పెన్షన్ పెంపువల్ల ప్రభుత్వ ఖజానాపై అదనంగా నెలకు రూ.5.2 కోట్లు, ఏడాదికి రూ.60.30 కోట్ల భారం పడనుంది. 29 గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు పదేళ్ల పాటు కౌలు ఇవ్వనున్నట్లు సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్నారు. జరీబు భూమి ఏకరానికి రూ.50 వేలు, మెట్ట భూమి ఎకరానికి రూ.30 వేల చొప్పున కౌలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతిఏటా జరీబు భూములకు రూ.5 వేలు, మెట్ట భూములకు రూ.3 వేల చొప్పున కౌలు పెంచనున్నారు. ఈ కౌలు వ్యవధిని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల తరువాత జరీబు భూమికి ఎకరాకు రూ.లక్ష, మెట్ట భూమికి ఎకరాకు రూ.60 వేల చొప్పున ఇవ్వనున్నారు. 29 గ్రామాల్లో 28,586 మంది రైతులు 34,385.275 ఎకరాల భూమిని ఇచ్చారు. వీరంతా పదేళ్ల తర్వాత కూడా లబ్ధి పొందనున్నారు. పట్టా భూములు ఇచ్చిన రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి కూడా ప్రభుత్వం ప్లాట్లు కేటాయించనుంది. ముఖ్యమంత్రి జగన్కు రుణపడి ఉంటాం ‘‘గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములకు తక్కువ ప్యాకేజీ, పట్టా భూములకు ఎక్కువ ప్యాకేజీ ఇచ్చి దళిత రైతుల పట్ల వివక్ష చూపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరావతి అసైన్డ్ రైతులకు కూడా పట్టా భూముల రైతులతో సమానంగా ప్యాకేజీ ఇవ్వడం చరిత్రాత్మక నిర్ణయం. సీఎం జగన్కు రుణపడి ఉంటాం’’ – సలివేంద్రం జార్జి, అసైన్డ్ రైతు, వెలగపూడి రైతు కూలీల జీవితాల్లో వెలుగులు ‘‘అమరావతిని రాజధానిగా ప్రకటించాక ఇక్కడ పొలాలు లేకపోవడంతో మాకు పనులు దొరకలేదు. భూములు లేని నిరుపేద రైతు కూలీలకు గత టీడీపీ ప్రభుత్వం రూ.2500 చొప్పున మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ భృతిని రూ.5 వేలకు పెంచడం సంతోషంగా ఉంది. రైతు కూలీల జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపుతున్నారు’’ – రాయపూడి చెంచు, నిరుపేద రైతు కూలీ, వెలగపూడి -
మూడు రోజుల పాటు అసెంబ్లీ
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మూడు రోజులు, శాసనమండలి సమావేశాలు రెండు రోజులు నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయం తీసుకుంది. సోమవారం అసెంబ్లీ కార్యాలయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు శాసనసభ నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతో పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అధికారపార్టీ పేర్కొనగా, వాటిని వ్యతిరేకిస్తామని తెలుగుదేశం పార్టీ తెలిపింది. మండలి చైర్మన్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో మంగళవారం, బుధవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో అధికారపార్టీ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్చంద్రబోస్ పాల్గొనగా ప్రతిపక్ష పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో అధికారపార్టీ ప్రతిపాదించిన ధరల స్థిరీకరణ నిధి, ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన రాజధాని ఉద్యమం అంశాలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. -
రాజధాని పేరుతో.. అంతర్జాతీయ స్థాయి కుంభకోణం
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆధారాలు, పేర్లతో సహా అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు. అమరావతిని భ్రమరావతిగా మార్చి రియల్ ఎస్టేట్ రాజధానిగా మార్చారని దుయ్యబట్టారు. గుంటూరు, నూజివీడు అంటూ మొదట్లో రాజధానిపై లీకులు ఇచ్చి.. ప్రజలు అక్కడ భూములు కొనుగోలు చేసి నష్టపోయేలా చేసిన చంద్రబాబు అండ్ కో మాత్రం ఎక్కడ రాజధాని వస్తుందో అక్కడే కారుచౌకగా భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ రహస్యాలను ఎవరికీ చెప్పబోనంటూ చేసిన ప్రమాణాన్ని (అధికార రహస్యాల చట్టాన్ని) చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు. రాష్ట్ర విభజన తేదీ 2014 జూన్ నుంచి రాజధాని ప్రకటన తేదీ 2014 డిసెంబరు నెలాఖరు వరకూ ఆరు నెలల కాలంలో ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు, ఆయన అనుచరులు సొంత పేర్లు, బినామీ పేర్లతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 4,070 ఎకరాల భూమిని కారుచౌకగా కొనుగోలు చేశారని మంత్రి వివరించారు. చంద్రబాబు చెప్పినట్లుగా ఎకరా రూ.10 కోట్ల ప్రకారం లెక్కిస్తే 4,070 ఎకరాల విలువ రూ.40,700 కోట్లని, ఇది ఇప్పటి వరకూ తేలిన లెక్కని, విచారణలో ఇంకా ఎంత బయటకు వస్తుందో భవిష్యత్తులో తేలుతుందన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.2 ఎకరాలను చంద్రబాబు నాయుడు తన సొంత సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ పేరుతో కొనుగోలు చేశారని కూడా సభ దృష్టికి తీసుకువచ్చారు. అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వివరాలను కూడా ఆయన సభలో వెల్లడించారు. అక్కడ నుంచి ఇక్కడకు వచ్చి.. ఎక్కడో కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్లు ఇక్కడ విజయవాడకు 20–30 కిలోమీటర్ల దూరంలోని మందడం, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం గ్రామాలకు వచ్చి ఎందుకు భూములు కొంటారు. ఇక్కడ రాజధాని వస్తుందని పక్కాగా తెలిసినందునే వారు రాజధాని ప్రకటనకు ముందే ఇక్కడ భూములు కొన్నారు. దీనిని బట్టే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని తేటతెల్లమవుతోంది. ఇంతకంటే ఏమి ఆధారాలు కావాలి. బినామీ పేర్లతో కొనుగోళ్లు.. - టీడీపీ నేతలు సొంతంగానూ, బంధువుల పేర్లతోనే కాకుండా బినామీల పేర్లతో కూడా రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారు. ఇలా భూములు కొనుగోలు చేసిన వారిలో అప్పటి మంత్రి నారాయణ ప్రధానంగా కనిపిస్తున్నారు. ఆయనకు ఆవుల మునిశంకర్, రాపూరి సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తవు వర్మకుమార్ బినామీలు. - వేమూరి రవికుమార్, నారా లోకేశ్కు చెందిన బినామీలు వందల ఎకరాల భూములు కొన్నారు. మురళీమోహన్, యార్లగడ్డ రవికిరణ్, యార్లగడ్డ గీతాంజలి, యార్లగడ్డ నిఖిల్ ఆదిత్య, జయభేరి ప్రాపర్టీస్ పేర్లతో భూములు కొనుగోలు చేశారు. బుచ్చయ్య చౌదరి గోరంట్ల ఝాన్సీలక్ష్మీ పేరు మీద కొనుగోలు చేశారు. సరిహద్దులు మార్చి.. చంద్రబాబు అండ్ కో ఇన్సైడర్ ట్రేడింగ్తో సరిపెట్టుకోలేదు. లంక, పోరంబోకు, ప్రభుత్వ భూములనూ వదల్లేదు. సీఆర్డీఏ సరిహద్దులు మార్చారు. కోర్ రాజధానిని జూలై 2015లో 395 చ.కి.మీలకు ప్లాన్ చేశారు. కానీ, 2016లో దానిని 217 చ.కి.మీ.కు తగ్గించారు. దీని వెనక.. తమ భూమిని ల్యాండ్పూలింగ్కు ఇవ్వకుండా మొత్తం భూమిని ఉంచుకుని అధిక విలువ పొందడమే లక్ష్యం. రింగ్ రోడ్డును కూడా వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు. లేని భూములు ఇచ్చి.. అనంతవరంలో వీరి బాగోతం ఇంకో రూపంలో సాగింది. లేని ప్రభుత్వ భూమి, పొరంబోకు భూములిచ్చి ప్లాట్లు తీసుకున్నారు. ఐనవోలులో 2.98 ఎకరాలు, బోరుపాలెం, కేఆర్ పాలెంలో 6.47 ఎకరాలు లేని భూమిని ఇచ్చినట్లుగా చూపి ప్లాట్లు తీసుకున్నారు. లింగాయపాలెంలో మొత్తం 158 ఎకరాల ప్రభుత్వ భూమి.. నేలపాడు, పిచ్చుకలపాలెంలో 9 ఎకరాలు, శాఖమూరులో 3 ఎకరాలు, వెలగపూడి 3 ఎకరాలు తీసుకున్నారు. చట్ట విరుద్ధంగా అసైన్డు భూములను కైవసం చేసుకున్నారు. శివాయ్ జమీందార్ పేరుతో జీఓలు ఇచ్చి దాదాపు 289 ఎకరాలను బదలాయించుకున్నారు. చెరువుల భూములూ ఇలాగే చేశారు. 28వేల మంది రైతులు 34 వేల ఎకరాలను రాజధాని కోసం ఇస్తే అందులో 14వేల మంది రైతులు ఇప్పటికే భూములు అమ్ముకున్నారు. ప్లాట్లు ఇస్తే.. 8వేల లావాదేవీలు జరిగాయి. దీనిని రాజధాని నిర్మాణం అంటారా.. లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటారా? టీడీపీ వారే చెప్పాలి’’.. అని బుగ్గన ప్రశ్నించారు. - పయ్యావుల విక్రమసింహ (పయ్యావుల కేశవ్ కొడుకు), ధూళిపాళ్ల వీరవైష్ణవి (ధూళిపాళ్ల నరేంద్ర కూతురు).. - కంభంపాటి స్వాతి (కంభంపాటి రామ్మోహన్రావు కుటుంబీకురాలు) నంబూరులో, పుట్టా మహేష్ యాదవ్ (మంత్రి యనమల వియ్యంకుడి తనయుడు) - దమ్మాలపాటి శ్రీధర్ పిచ్చుకలపాలెం, నేలపాడులో, పల్లె రఘునాథరెడ్డి ఉద్దండరాయపాలెం, మందడంలో.. - దివంగత కోడెల శివప్రసాద్ శశిఇన్ఫ్రా పేరున 17 ఎకరాలు.. - మాజీమంత్రి పరిటాల సునీత పీఆర్ ఇన్ఫ్రా పేరుతో కొనుగోలు చేశారు. - పీఆర్ ఇన్ఫ్రాలో పరిటాల సునీత కొడుకు, అల్లుడు డైరెక్టర్లుగా ఉన్నారు. ఇష్టారాజ్యంగా భూ కేటాయింపులు అప్పటి పాలకులు రాజధాని అమరావతిని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చుకున్నారనడానికి అడ్డగోలుగా భూ కేటాయింపులూ నిదర్శనాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆరోపించారు. అమరావతిలో మాదిరిగా ఓ విధానం, ప్రాతిపదిక లేకుండా దేశంలో మరెక్కడా భూకేటాయింపులు జరగలేదని ఆయన అసెంబ్లీ సాక్షిగా వివరాలతో వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు సరసమైన ధరలకు భూకేటాయింపులు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలని చూస్తారని.. కానీ, బాబు సర్కారు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించిందని ఆయన దుయ్యబట్టారు. ‘కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఎవరైనా ఎకరా రూ.4 కోట్లకు భూమి కేటాయించి ప్రైవేటు సంస్థలకు రూ.50 లక్షలకే ఇస్తారా?’ అని బుగ్గన సభా సాక్షిగా నిలదీశారు. భూకేటాయింపులపై మంత్రి బుగ్గన అసెంబ్లీలో వివరించిన అంశాలు ఆయన మాటల్లోనే.. 125 సంస్థలకు 1,648 ఎకరాలు రాజధాని ప్రాంతంలో అప్పటి బాబు సర్కారు 125 సంస్థలకు 1,648 ఎకరాలను కేటాయించింది. ఏడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 68 ఎకరాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు 180 ఎకరాలు.. ప్రైవేటు సంస్థలకు 1,366 ఎకరాలు కేటాయించింది. వీటితోపాటు మరికొన్నింటికి కూడా కేటాయించింది. అయితే, ఇందుకు ఒక విధానం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. నాలుగు ఏపీ ప్రభుత్వ సంస్థలకు ఏడెకరాలు, పబ్లిక్ అండర్ టేకింగ్ సంస్థలకు 87ఎకరాలు కేటాయించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్కు ఎకరాకు రూ.కోటి చొప్పన 60 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు. అలాగే, ప్రైవేటు సంస్థలైన విట్ ఏపీకి 200 ఎకరాలు, ఎస్ఆర్ఎంకు 200 ఎకరాలు, అమృతా యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఇండో–యూకే యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ 150 ఎకరాలు, మెడిసిటీ హెల్త్ 100 ఎకరాలు, బీఆర్ఎస్ మెడిసిటీ.. ఇలా ప్రైవేటు సంస్థలకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారు. వరుణ్ హాస్పిటాలిటీకి నాలుగు ఎకరాలు, మహాలక్ష్మి ఇన్ఫ్రా వెంచర్స్కు నాలుగు ఎకరాలు రూ.కోటిన్నరతో ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయం చంద్రబాబు లాగా ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్లో పట్టుబడటం దేనికి సంకేతం? ప్రతిపక్ష నేత మొదట్లో రాజధాని నిర్మాణానికి రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లు అవసరమవుతుందని చెప్పారు. హడ్కో, వరల్డ్బ్యాంకు నుంచి రుణాలు తెస్తామని చంద్రబాబు అన్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. మరోవైపు.. రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్షంలో ఉంది. వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో డొక్కల కరువు.. ముష్టికరువు అని పేర్లు కూడా పెట్టారు. గతంలో నెహ్రూ కూడా ఇక్కడకు వచ్చి కన్నీరు కార్చారు. ఈ నేపథ్యంలో భారీ రాజధాని నిర్మాణం కంటే.. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మన ముందున్న కర్తవ్యం. -
నువ్వు ఏ అధికారంతో అడుగుతావు?
సాక్షి, అమరావతి : అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఉద్దేశించి సోమవారం శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సభాపతిని ఏకవచనంతో సంభోదిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. చంద్రబాబు తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు వైఎస్సార్సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. అమరావతి ప్రాంతంలో టీడీపీ ప్రభుత్వంలో సాగిన భూకుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సూచించారు. ఇంతలో చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులు లేచి అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రబాబు స్పీకర్ను ఉద్దేశిస్తూ ‘నువ్వు ఏ అధికారంతో విచారణ జరపాలని అడుగుతావు’అని గద్దిస్తున్నట్లు ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు ఏ అంశంపై అయినా విచారణ జరిపించాలని అడిగే అధికారం స్పీకర్కు ఉందని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ సభ్యులు గట్టిగా అరుస్తూ సభలో గందరగోళం సృష్టించేందుకు యత్నించారు. స్పీకర్ మాట్లాడుతూ సభాపతి స్థానాన్నే బెదిరిస్తారా? ఇదేనా ఇన్నాళ్ల మీ అనుభవం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి భూములపై విచారణ జరపాలనంటే చంద్రబాబుకు ఎందుకంత ఉలికిపాటు? ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయంటే మీకెందుకంత ఉక్రోషం అని స్పీకర్ ప్రశ్నించారు. టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి విచారణ జరిపించాలని ఇంతకుముందే డిమాండ్ చేశారు కదా? మరి ఇప్పుడు ఎందుకు అడ్డుతగులుతున్నారని నిలదీశారు. ఇలాంటి విపక్షనేత ఉండడం సిగ్గుచేటు: మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు, టీడీపీ సభ్యులు అదే పనిగా స్పీకర్ను కించపరుస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుతగలడంపై మంత్రి బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. సభాపతిని ఉద్దేశించి ప్రతిపక్ష నేత ఏకవచనంతో మాట్లాడమేంటని బొత్స ప్రశ్నించారు. శాసనసభ అన్నా.. సభాపతి అన్నా చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదని, స్పీకర్కు చంద్రబాబు తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి విపక్ష నేత ఉండటం సిగ్గుచేటని, రాష్ట్రం చేసుకున్న ఖర్మని ఆవేదన వ్యక్తం చేశారు. సభాపతి స్థానాన్ని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా తప్పేనని స్పీకర్ సీతారాం అన్నారు. ప్రతిపక్ష నేతే అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక విజ్ఞత ఎక్కడుందని.. సభాపతి స్థానాన్ని , శాసనసభను అందరూ గౌరవించాల్సిందేనని చెప్పారు. -
రాజధానులిక అందరివీ..
రాష్ట్ర శాసనసభ సరికొత్త చరిత్రకు వేదికైంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను సోమవారం సభ ఆమోదించింది. అభివృద్ధి అన్నది ఒకే చోట కేంద్రీకృతం కారాదని.. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు సమానంగా విస్తరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సంపూర్ణంగా సమర్థించింది. అమరావతి ప్రాంతాన్ని కీలకమైన శాసన రాజధానిగా నిర్ణయించింది. ఇక సహజ వనరులతో సహజ సిద్ధంగా అభివృద్ధి చెందిన తీర ప్రాంత నగరం విశాఖపట్నం పరిపాలన రాజధానిగా, వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఆమోదించింది. తద్వారా మూడు కీలక వ్యవస్థలను రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నెలకొల్పుతూ ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర పురోభివృద్ధికి అడుగులు ముందుకు వేసింది. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలపై పలు వరాలు కురిపించడం ద్వారా తాను మనసున్న ముఖ్యమంత్రినని వైఎస్ జగన్ మరోమారు నిరూపించుకున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా మేలి మలుపు.. ప్రాంతీయ వివక్షకు చరమగీతం.. సమానాభివృద్ధికి తెరతీస్తూ నూతన అధ్యాయం..ఇటు పాలన, అటు అభివృద్ధి వికేంద్రీకరణకు శాసనసభ ఆమోద ముద్ర వేసింది. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు.. ఇలా మూడు ప్రాంతాల ప్రజల కలను సాకారం చేసే దిశగా రాష్ట్రం పెద్ద ముందడుగు వేసింది. తద్వారా రాష్ట్ర ప్రజల 67 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది. పరిపాలన వ్యవస్థలోనూ తద్వారా అభివృద్ధిలోనూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ సరికొత్త ప్రగతి చరిత్రకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాకు అన్ని ప్రాంతాలూ సమానమే. ఇదే కృష్ణా జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. స్వయానా మా మేనత్తను ఇదే జిల్లాకు ఇచ్చాం. ఇక్కడి (విజయవాడ) రాజ్, యువరాజ్ థియేటర్ల ద్వారా నాలుగు దశాబ్దాలుగా అనుబంధం కలిగి ఉన్నాం. శాసన రాజధానిలో.. ఏఎంఆర్డీఏ పరిధిలోని శాసనపరమైన రాజధాని అమరావతిలో శాసనసభ, శాసన మండలి ఉంటాయి. పరిపాలనా రాజధానిలో.. పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో రాజ్భవన్, సచివాలయం, ప్రభుత్వ శాఖల శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి. జ్యుడీషియల్ రాజధానిలో.. హైకోర్టు ప్రధాన కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర న్యాయ సంబంధమైన సంస్థలు కర్నూలులోనే ఉంటాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేందుకు వీలుగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాలనాపరమైన మూడు రాజధానుల ఏర్పాటుతోపాటు ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు నెలకొల్పేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాంతంగా పిలువబడే అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాంతంగా పిలువబడే విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలు పట్టణాభివృద్ధి ప్రాంతంగా పిలువబడే కర్నూలును న్యాయపరమైన రాజధానిగా ఏర్పాటు చేసేందుకు, అలాగే ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరైన మంత్రులు, అధికారులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏపీసీఆర్డీఏ)ను రద్దు చేస్తూ.. దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన మరో ముసాయిదా బిల్లుకు సైతం ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. శివరామకృష్ణన్ కమిటీతోపాటు, ఇటీవల జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికపై కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపారు. అమరావతి ప్రాంత రైతు కూలీలు, రైతులకు దన్ను.. అమరావతి రాజధానిలో భూములిచ్చిన రైతులకు కౌలును, రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ కాల వ్యవధిని అదనంగా ఐదేళ్లపాటు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీసీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఏఎంఆర్డీఏను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఇందుకు వీలు కల్పిస్తున్నది. రైతు కూలీలకిచ్చే నెల పెన్షన్ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచేందుకు, అలాగే పెన్షన్ను గత ప్రభుత్వం పదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయించగా.. ఇప్పుడు అదనంగా మరో ఐదేళ్లపాటు ఇవ్వాలని ఈ బిల్లులో స్పష్టం చేశారు. రైతులకిచ్చే కౌలును గత ప్రభుత్వం పదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయిస్తే ఇప్పుడు అదనంగా మరో ఐదేళ్లపాటు ఇవ్వాలని నిర్ణయించారు. 11,159 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు - రైతులకు వ్యవసాయంలో అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలు అందించేందుకు, అలాగే నాణ్యమైన ఎరువులు, విత్తనాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు గ్రామ సచివాలయాల వద్దే రూ.199.44 కోట్ల వ్యయంతో 11,159 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో పనిచేయాలని నిర్దేశించింది. - పులివెందుల డెవలప్మెంట్ అథారిటీకి పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నివేదికలోని అంశాలివీ.. - విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ వేర్వేరు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, అభివృద్ధి ప్రమాణాలను కలిగి ఉన్నాయి. - ప్రాంతీయ అసమానతలు, సమానాభివృద్ధి లేకపోవడం రాష్ట్రంలో అశాంతికి దారితీశాయి. రాష్ట్రంలోని వివిధ వర్గాల మధ్య సమాన అభివృద్ధిని కోల్పోయామన్న తీవ్ర భావనను కలిగించాయి. - వివిధ ప్రాంతాల్లోని ప్రజలు సామాజిక, ఆర్థిక, ప్రగతి ఫలాలను సమానంగా అనుభవించేలా చూడటానికిగాను అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై శ్రద్ధ వహించాల్సిన అవసరముంది. - రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఆకాంక్షలను గౌరవిస్తూ.. చరిత్రాత్మక నిబద్ధతలు, ప్రాంతీయ ఆకాంక్షలను సమతుల్యం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. - పరిమిత ఆర్థిక వనరులు, ద్రవ్యసాధనాలను దృష్టిలో ఉంచుకుని 217 చదరపు కిలోమీటర్ల ఒక చిన్న ప్రాంతానికి అన్ని వనరుల్ని ఉపయోగించడం వాంఛనీయం కాదు. ఇది వెనుకబడిన ప్రాంతాల వారికి ఏమాత్రం అభిలషణీయమూ కాదు. అభివృద్ధితోపాటు వికేంద్రీకరణ సిద్ధాంతానికి ఇది అసలు పొసగదు. -
సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం
అందరికీ మంచి చేయాలి. ఇదే నా విధానం. ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందాలి. ఇందుకోసం అన్నింటా సంస్కరణలు కొనసాగిస్తాం. గ్రామ సచివాలయాల నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయాల నిర్మాణం వరకూ భావితరాల, మన ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేం నిర్ణయాలు తీసుకుంటాం. దీని కోసమే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం. – వైఎస్ జగన్ రాజధానికి వెళ్లే మార్గంలో ఒక కారు ఎదురుగా వస్తే మరో కారు రోడ్డు దిగి వెళ్లాల్సిన పరిస్థితి. వరద ముప్పు ఉన్న ప్రాంతమిది. ఇలాంటి ప్రాంతంలో రాజధాని నిర్మించాలని ఎవరికైనా అన్పిస్తుందా? అసలు చంద్రబాబుకు ఈ గ్రామాలు ఎప్పుడైనా తెలుసా? ఎప్పుడైనా తిరిగాడా? ఇక్కడ భూములు కొనుగోలు చేశాక, రాజధాని ఇక్కడ పెట్టాలని తెలిశాకే ఈ గ్రామాల పేర్లు తెలుసు. సింగపూర్ కంపెనీ వెనక్కు వెళ్లడానికి అక్కడ కట్టలేని పరిస్థితి. చట్టం అనుమతించదు. నదీ, అటవీ భూములన్నీ తీసేస్తే మిగిలే భూమి 5,020 ఎకరాలు మాత్రమే. దీన్ని అమ్మితే లక్ష కోట్లు రావాలంటే ఎకరం రూ.20 కోట్లకు అమ్మాలి. నిజంగా ఆ పరిస్థితి ఉందా? 20 ఏళ్ల తర్వాత ఎకరం రూ.90 కోట్లకు అమ్మే పరిస్థితి వస్తేనే సెల్ప్ ఫైనాన్స్ మోడల్ అవుతుంది. అంత వరకూ భారీ పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా? సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, వెనుకబాటుతనాన్ని అధిగమించాలని, అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలన్నదే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా పాలన, అభివృద్ధి వికేంద్రీకరించాలన్న వివిధ కమిటీల సూచనల మేరకు ముందడుగు వేయాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలందరి కోరిక మేరకు శాసన రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే.. విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయడానికి ఉపక్రమించామని చెప్పారు. తనకు అన్ని కులాల వారు, మతాల వారు సమానమేనని వివరించారు. చంద్రబాబు చెబుతున్నట్లు అన్నీ ఒకేచోట కేంద్రీకృతం చేస్తూ ఆయన కలల రాజధానిని నిర్మించే ఆర్థిక స్తోమత లేదని, అందువల్లే పాలన, అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఐదేళ్లలో అమరావతి ప్రాంతంలో సాగిన భూదందా గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. బాబు వైఫల్యాలను ఎండగట్టారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. నిజాలు చెబుతున్నా.. ‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమైన రోజు.. అనుమానాలు, ఆవేశాలను మంచి ఆలోచనలతో అధిగమిస్తున్న రోజు. వెలగపూడిలో చంద్రబాబునాయుడు తాత్కాలిక సచివాయం, తాత్కాలిక అసెంబ్లీ కట్టారు. ఇందుకు ఇంటెరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇస్తూ 2016 ఫిబ్రవరి 11న టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులే(జీవో ఎంఎస్ నెంబర్32) నిదర్శనం. కానీ.. చంద్రబాబు మాత్రం తాను నిర్మించింది తాత్కాలిక సచివాలయం.. అసెంబ్లీ కాదంటూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నారు. నిజాల్ని నిజాలుగా రాష్ట్ర ప్రజలకు చెబుతున్నా. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిన నాటి నుంచి.. 2014 జూన్లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటయ్యే వరకు, ఆతర్వాత జరిగిన పరిణామాల వరకు గమనిస్తే రకరకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి. మూడు నగరాలను కోల్పోయాం.. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా అవతరించినప్పుడు మద్రాసును పోగొట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రం కోసం కర్నూలును త్యాగం చేశాం. 58 ఏళ్ల తర్వాత 2014లో హైదరాబాద్ను కోల్పోయాం. అభివృద్ధి, ఉద్యోగాలకు కేంద్రంగా ఉన్న మూడు నగరాలను కోల్పోయిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. పదేళ్ల ఉమ్మడి రాజధానిని కూడా ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడి ఇక్కడున్న ఒక మనిషి చేసిన తప్పిదం వల్ల కోల్పోయాం. ఏ జాతికి అయినా చరిత్ర అనేక పాఠాలు చెబుతుంది. వాటి నుంచి ఎవరైనా గుణపాఠం నేర్చుకుంటేనే భవిష్యత్ ఉంటుంది. ఇప్పుడు గతంలో జరిగిన పొరపాట్లను మా ప్రభుత్వం దిద్దుబాటు చేస్తోంది అనడం కరెక్ట్. ఒక కారు ఎదురుగా వస్తే రోడ్డు దిగాల్సిందే.. టెంపరరీ అసెంబ్లీ తీసుకుంటే.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దాటితే, ఎదురుగా వాహనం వస్తే ప్రయాణించలేని విధంగా కరకట్ట ఉంది. ఇదీ రాజధానికి పోయే రాజమార్గం. ఎకనామిక్ సూపర్ పవర్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండరాదన్న శివరామకృష్ణన్ నివేదికను నీరు గార్చేందుకు నారాయణతో సొంత కమిటీ వేశాడు. ఇందులో ఉన్నదెవరు? సుజనా చౌదరి, గల్లా జయదేవ్. వీళ్లంతా ఏ రంగంలో నిపుణులు? శివరామకృష్ణన్ నివేదిక రాకముందే తన సొంత మనుషులతో కమిటీ వేసుకున్నాడు. సెక్రటేరియట్, అసెంబ్లీ మాత్రమే కాకుండా నైన్ ఇన్ వన్ అని ఒక సినిమా చూపించాడు. లీగల్, ఎడ్యుకేషన్, ఐటీ, టూరిజం, మాన్యుఫ్యాక్చరింగ్.. అన్నీ ఇక్కడే పెడుతున్నామంటూ చెప్పాడు. ఇంత వరకూ ఒక్కదానికి కూడా అంగుళం పనికూడా జరగలేదు. కానీ సినిమా మాత్రం గొప్పగా చూపించాడు. అనేక జిల్లాలు అత్యంత వెనుకబాటులో ఉన్నాయని, అటు శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీతో పాటు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చెప్పినా.. ఇందుకు సంబంధించిన డేటాతో నిరూపించినా.. రైతన్నకు అందించాల్సిన నీటి కోసం ఈయన తాపత్రయపడలేదు. తన బినామీల భూముల రేట్ల కోసం తాపత్రయ పడ్డాడు. సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ కానే కాదు.. చంద్రబాబు గ్రాఫిక్స్లో చూపించిన ఐకానిక్ బ్రిడ్జ్ చూసి అమరావతిలో అడుగు పెట్టిన వారికి ద్వారంలో టెంపరరీ అసెంబ్లీకి వచ్చే బ్రిడ్జి కన్పిస్తుంది. అదే ఆయన అక్రమ నివాసానికి దారి కూడా. అదే ఒక కారు వెళ్తుంటే మరో కారు ఆగిపోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిపై చంద్రబాబు మానస పుత్రికలు ఈనాడు, చంద్రజ్యోతి ఏనాడైనా ఒక్క ఫొటో వేస్తే సంతోషించి ఉండేవాళ్ల. (కరకట్ట వాస్తవ చిత్రాలను చూపించారు). మౌలిక వసతుల కోసం లక్షా 9 వేల కోట్లకు డీపీఆర్ ఇచ్చిన చంద్రబాబు ప్లేటు మార్చి సెల్ప్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటున్నాడు. నిజాన్ని దాచేసి ఈ మాటలు చెబుతున్నాడు. పేద పిల్లలకు ఇంగ్లిష్ నేర్పించకూడదని, రివర్స్ టెండర్కు వ్యతిరేకంగా, అధిక ధరలకు చేసుకున్న పీపీఏలను కత్తిరిస్తుంటే కూడా ఉద్యమాలు చేశాడీయన. ఈయనకు బాకా ఊదుతున్న ఎల్లో మీడియా ఇప్పటికిప్పుడు అమరావతి భూములు అçమ్మితే లక్ష కోట్ల వస్తాయని, సెల్ప్ ఫైనాన్స్ మోడల్ అని చెబుతున్నారు. ఈ వాదన ఎంత వరకు కరెక్ట్ అని పరిశీలించాం. అందులో తేలిన నిజాలు ఏంటంటే.. గ్రీన్ ట్రిబ్యునల్, రిజర్వు కన్జర్వేషన్ ప్రాంతాలు.. ఇవన్నీ కృష్ణా నదీ ప్రవాహ ప్రాంతాలని తేలింది. సెల్ప్ ఫైనాన్స్ మోడల్ కాదని స్పష్టమైంది. ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.5,674 కోట్లు మాత్రమే ఇంత భారీ ప్రాజెక్టును మేం అడ్డుకుంటున్నామని చంద్రబాబు అరుస్తున్నారు. మౌలిక సదుపాయాలకే లక్షా 9 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పిన వ్యక్తి.. రాజధాని కోసం ఏదో చేస్తున్నానని బాహుబలి సినిమా చూపించిన వ్యక్తి.. ఐదేళ్లలో ఈయన పెట్టిన ఖర్చు రూ.5,674 కోట్లు మాత్రమే. బకాయిలు కట్టకుండా రూ.2,297 కోట్లు వదిలేశారు. ఏ ప్రభుత్వమైన ఐదేళ్లల్లో రూ.5 వేల కోట్ల నుంచి ఆరువేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుందని అర్థమవుతోంది. ఈ లెక్కన సంవత్సరానికి వెయ్యి కోట్ల నుంచి 1200 కోట్లు రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తూ.. అమరావతి పూర్తి చేయాలంటే లక్ష కోట్లు కావాలి. ఇలాగైతే ఎన్నేళ్లు పడుతుందో? బాబు ఎంతో స్పీడ్తో కట్టానని బిల్డప్ ఇస్తున్న స్పీడ్తో కట్టినా వందేళ్లు పడుతుంది. అది కూడా ఖర్చు పెరగకుండా ఉంటే. గేర్ మార్చి అన్ని అభివృద్ధి పనులు ఆపేసి ఐదు రెట్ల వేగంతో రాజధాని పూర్తి చేస్తామని చెప్పినా కనీసం 20 ఏళ్లు పడుతుంది. ఈ 20 ఏళ్లల్లో అసలు, మీద వడ్డీ కలిపితే, అది 10 శాతం వడ్డీ వేసినా, లక్ష కాస్తా 3 లక్షల 12 వేల 148 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 30 ఏళ్లలో అయితే రూ.5 లక్షల 97 వేల కోట్లు అవుతుంది. మారుమూల గ్రామాల్లో ఎందుకు కొన్నారు? రాజధాని కోసం 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఎక్కడ పెట్టుబడి పెడతారు? విజయవాడకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలోనో.. గుంటూరుకు రెండు మూడు కిలో మీటర్ల దూరంలోనో పెడతారు. ఎప్పుడైనా పెరుగుతుందనుకుంటారు. కానీ ఇక్కడ జరిగిందేంటి? పచ్చగా మూడు పంటలు పండే పొలాల్లో ఉన్న గ్రామాలివి. ఇవి విజయవాడ – గుంటూరుకు ఎంతో దూరంలో ఉన్నాయో తెలుసా? నిర్మాణాలకు అనువుకాని, పోవడానికి రోడ్లు కూడా లేని గ్రామాలివి. ఒకవైపు కారు అటునుంచి వస్తుంటే ఇంకో కారు వెళ్లలేని గ్రామాలివి. అప్పరాజు పాలెం విజయవాడ నుంచి 30 కి.మీ, గుంటూరు నుంచి 38 కిలోమీటర్లు. శాఖమూరు గ్రామం విజయవాడ నుంచి 29, గంటూరు నుంచి 30 కిలోమీటర్లు. పయ్యావుల కేశవ్ కొడుకు భూములు కొనుగోలు చేసిన ఐనవోలు గ్రామం విజయవాడ నుంచి 27, గుంటూరు నుంచి 34 కిలోమీటర్లు. నేలపాడు నుంచి విజయవాడ 26.3 కిలోమీటర్లు. గుంటూరు నుంచి 34.41 కిలోమీటర్లు. వెలగపూడి గ్రామం గుంటూరు నుంచి 40, విజయవాడ నుంచి 20 కిలోమీటర్లు. ఇంతింత దూరంలో భూములు కొనాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పడానికి ఇది చాలదా? ఈ కొనుగోలు చేసిన భూములన్నీ ఎప్పుడు? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. ఆ తర్వాత నోటిఫికేషన్ రాకమునుపు. రాజధాని గ్రామాల నోటిఫికేషన్ డిసెంబర్ 30, 2014న వచ్చింది. ఈయన సీఎం అయింది జూన్లో. ఈ గ్రామాల్లో రాజధాని వస్తుందని ప్రజలెవ్వరికీ తెలియదు. కానీ వీళ్లకు మాత్రమే తెలుసు. ఎడాపెడా కొనేశారు. తక్కువ ధరకు కొని రైతులను కూడా తీవ్రంగా మోసం చేశారు. మేం తేల్చిన లెక్కల ప్రకారం ఇలా కొనుగోలు చేసింది 4070 ఎకరాలు. ఇందులో చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ కూడా ఉంది. నాడు ఒక మాట.. ఇవాళ మరో మాట.. విజయవాడ, గుంటూరుకు దూరంగా అమరావతి పేరుతో ఓ భ్రమరావతి సృష్టించాడు చంద్రబాబు. ఇది వర్జిన్ ల్యాండ్. ఇక్కడ వ్యవసాయం తప్ప ఏమీలేదు కాబట్టి రోడ్లు, నీరు, కరెంట్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున 53 వేల ఎకరాలకు లక్షా 9 వేల కోట్లు అవసరమని చంద్రబాబు నాయుడే అంచనా వేశారు. చంద్రబాబు మానస పుత్రిక ఈనాడులో 2018 డిసెంబర్ 26న రాజధాని అంచనా గురించి కూడా వేశారు. 53 వేల ఎకరాలంటే 8 కిలోమీటర్ల పరిధి. కనీస సదుపాయాలకు లక్షా 9 వేల కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు రిపోర్టులో చెప్పారు. అప్పుడు అమరావతిలో చంద్రబాబు అన్న మాటలు చూద్దాం. (చంద్రబాబు అప్పుడు, ఇప్పుడు అన్న మాటల వీడియో ప్రదర్శించారు). ఆనాడు నాలుగైదు లక్షల కోట్లు అవుతుందని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇవాళ ప్లేట్ ఎలా మార్చాడో చూశాం. అన్ని భవనాలు టెంపరరీ అని నామకరణం చేసిన ఈయన చివరకు తాను సీఎంగా ఉండి రూ.14 వేల కోట్లకు టెండర్లు కూడా పిలిచాడు. ఏ రకంగా సూట్ అయితే ఆ రకంగా మాట్లాడటం చంద్రబాబుకు అలవాటే. ప్రత్యేక హోదా గురించి ఎలాంటి కుప్పిగంతులు వేశారో ఈ సభలోనే చూశాం. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్గా మార్చింది ఎవరు? చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రాంతంలో వేల ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా తాను, తన బినామీలతో కొనుగోలు చేయించారు. అందరికీ ఒకవైపు నూజీవీడు అన్నారు. నాగార్జున యూనివర్సిటీ అంటూ ఈనాడు, చంద్రజ్యోతి వార్తలు రాశాయి. ఆ రాతలన్నీ కూడా వీళ్ల లీకులతోనే వచ్చాయి. ఇదే తెలుగుదేశం నాయకులు నూజీవీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి నష్టపోలేదు. జీవో 254ను 2014 డిసెంబర్ 30న విడుదల చేశారు. ఆ రోజు పబ్లిక్ డోమైన్లోకి రాజధాని ఏర్పాటు చేసే ఊర్ల పేర్లు వచ్చాయి. ఇవాళ ఆ భూములు పోతాయని వీళ్లు బాధపడుతున్నారు. పచ్చటి పొలాలకు సరిహద్దులు నిర్ణయించి.. స్టేట్ను రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు. రాజధాని కోసం భూములా? లేక తాను, తన బినామీల కోసం రాజధానా? అని ఇదే సభ నుంచి చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను రెచ్చగొట్టారు. మరి కొందరిని ప్రలోభపెట్టారు. కొందరిని బెదిరించారు. 144 సెక్షన్ అన్నది ఇదే ప్రాంతంలోని మచిలీపట్నంలో నాలుగేళ్లుగా నిరంతరాయంగా కొనసాగించారు. మా ప్రభుత్వం వచ్చేదాకా 144 సెక్షన్ విధించారు. దీనిని యాగీ చేయడంలో వీళ్లకు ఉన్న పలుకుబడి చూసి అశ్చర్యం అనిపించింది. వికేంద్రీకరణే మేలన్న కమిటీలు.. శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగానే 1953లో కర్నూలును రాజధానిగా చేశారు.1956 దాకా అదే రాజధానిగా కొనసాగింది. 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలపై అధ్యయనం చేసిన జస్టిస్ శ్రీకృష్ట కమిటీ అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుందో ఎత్తిచూపింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ప్రాంతం ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే చెప్పింది. విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు వక్రీకరించారు. గంటన్నర పాటు చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. చంద్రబాబుకు ఇష్టమైన పాంప్లెట్ చానల్ ఈటీవీలోనే శివరామకృష్ణన్ కమిటీ ఏమి చెప్పిందో చూద్దాం.(వీడియో క్లిప్పింగ్లను ప్రదర్శించారు). శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వక ముందే.. అదే ప్రాంతంలో రాజధాని పెట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అందుకే సలహాలు మాత్రమే ఇవ్వగలమని శివరామకృష్ణన్ నివేదికలో నిస్పృహను వ్యక్తం చేశారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా.. ప్రాంతాల పరంగా అనేక ఆకాంక్షలు ఉన్నా కూడా.. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటన్నింటిని గడ్డిపరక కంటే చిన్నగా చూశారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీజీ(బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్), జీఎన్ రావు కమిటీలు వేశాం. గతంలోని కమిటీల మాదిరిగానే ఇవి కూడా వికేంద్రీకరణకు ఓటు వేశాయి. ఈ నివేదికలను అధ్యయనం చేయడానికి పది మంది మంత్రులు, అధికారులతో హైపవర్ కమిటీ వేశాం. జస్టిస్ శ్రీకృష్ణ, శివరామకృష్ణన్, జీఎన్ రావు కమిటీలు.. బీసీజీ నివేదికలను పరిశీలించిన హైపవర్ కమిటీ వికేంద్రీకరణే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏకైక మార్గమని నివేదిక ఇచ్చింది. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ సూచనలు చేసింది. జిల్లాల వెనుకబాటుకు సంబంధించి వాస్తవాలు చెప్పింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసింది. అన్ని కులాలు, మతాలు నాకు సమానమే చంద్రబాబులాగా గ్రాఫిక్స్తో, అబద్ధాలతో భ్రమ కల్పించం. అమరావతికి చేయగలిగినంతా చేస్తాం. ఇక్కడే అసెంబ్లీ నిర్వహిస్తాం. అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలన్నదే నా విధానం. అందుకే ఈరోజు నాకు గొప్ప సహచరుడిగా కొడాలి నాని ఉన్నారని నేను గర్వంగా చెబుతున్నా. నా కార్యక్రమాలను చూసే రఘు ఎవరు? వీరంతా కమ్మవారు కాదా? ఇదే కమ్మవారు, కాపులు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, రెడ్లు అందరూ ఓటేస్తేనే నాకు 151 సీట్లు వచ్చాయి. కులం మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందడం కోసం జగన్ కమ్మవారికి వ్యతిరేకమని, విజయవాడ నుంచి రాజధానిని తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెడితే అక్కడ కమ్మవారు లేరా? అక్కడ మా ఎంపీనే కమ్మవారు అని కొడాలి నాని ఇప్పుడే చెప్పారు. విశాఖపట్నంలో నాలుగైదు సార్లు ఎంపీగా గెలిచిన వారు కూడా కమ్మవారే. కమ్మవారిలో అభద్రతా భావం సృష్టించి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కేవలం దుష్ప్రచారం కోసం చంద్రబాబు నీచానికి దిగజారారు. రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే నీచానికి పాల్పడుతున్నారు. ఆ పార్టీకి బాకా ఊదే టీవీ చానళ్లు, పత్రికలు కూడా ఆ స్థాయికి దిగజారాయి. అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాగుండాలి. అందరికీ మంచి చేయాలి. ఇదే నా విధానం. ఇంటింటికీ అభివృద్ధి ఫలాలు అందాలి. ఇందుకోసం అన్నింటా సంస్కరణలు కొనసాగిస్తాం. గ్రామ సచివాలయాల నిర్మాణం నుంచి రాష్ట్ర సచివాలయాల నిర్మాణం వరకూ భావితరాల, మన ప్రాంతాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేం నిర్ణయాలు తీసుకుంటాం. దీని కోసమే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం. విశాఖను కార్యనిర్వాహక రాజధాని, అమరావతిని శాసన నిర్మాణ రాజధానిగా అభివృద్ధి చేస్తాం. అన్యాయానికి గురైన కర్నూలు ప్రాంతానికి నా హయాంలో మేలు చేసే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాం. దీనిని న్యాయ రాజధాని చేస్తాం. ఇందుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రతి వ్యక్తినీ, ప్రతి కుటుంబాన్ని కోరుతున్నా. రాళ్లేస్తున్న చంద్రబాబు మనసు కూడా మార్చాలని దేవుని వేడుకుంటున్నాం. అమరావతి రైతులకు అన్యాయం జరగదు అమరావతి రైతులకు మా హయాంలో ఎలాంటి అన్యాయం జరగదు. రైతు పక్షపాతిగా, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా రైతుకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం మాది. 13 జిల్లాల్లోని ఏ రైతులకూ అన్యాయం జరగనీయను. అమరావతికి కూడా న్యాయమే చేస్తాం. అమరావతి రాజధానిగా ఉంటుంది. రైతులకు ఇచ్చే వార్షిక కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతున్నాం. 29 గ్రామాల్లో భూమి లేని పేదలకు జీవన భృతి పెన్షన్ను రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచుతున్నాం. దీనివల్ల 21 వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. అసైన్మెంట్ భూములను భూసమీకరణ కింద ఇచ్చిన వారికి తక్కువ పరిమాణంలో ఇంటి/వ్యాపార స్థలాలు ఇచ్చేలా చంద్రబాబు సర్కారు అప్పట్లో చట్టం చేసింది. అసైన్మెంట్ భూములు ఇచ్చిన పేదలైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు దీనివల్ల అన్యాయం జరుగుతుంది. మా ప్రభుత్వం వారికి కూడా న్యాయం చేస్తుంది. పట్టా భూములు ఇచ్చిన వారితో సమానంగా ప్లాట్లు ఇస్తుంది. అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. సహజ రీతిలో అమరావతి ఒక గొప్ప నగరంలా రూపుదిద్దుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోతాం మనం బాధ్యతగల నాయకత్వ స్థానంలో ఉన్నాం. కొన్ని నిర్ణయాలు చేయకపోవడంవల్ల రాష్ట్రం నష్టపోతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుందని అనిపిస్తున్నప్పుడు తీసుకోకపోవడం ధర్మమేనా? అని ఆలోచించాలి. రాజధాని మధ్యలోనే ఉండాలనే వాదన చంద్రబాబు గట్టిగా వినిపించారు. చంద్రబాబు చెబుతున్నట్లు రాజధాని మధ్యలో ఉండాలన్నదే కరెక్టయితే ఒక్కసారి ఢిల్లీ ఎక్కడుందో గమనించాలని అడుగుతున్నా. ఢిల్లీకి విజయవాడ మధ్య దూరం 1,856 కిలోమీటర్లు. హైదరాబాద్ 1556 కి.మీ, తిరుపతి 2000 కి.మీ, బెంగళూరు 2177 కి.మీ, చెన్నై 2200 కి.మీ.ల దూరంలో ఉంది. రాజధాని మధ్యలోనే ఉండాలన్నది కరెక్టే అయితే వెంటనే చంద్రబాబు, రామోజీరావు కలిసి రాజధాని మధ్యలో ఉండాలి, దానిని మార్చండి అని మోదీకి లేఖ రాయాలి. తమిళనాడు రాజధాని చెన్నైకి చివరి ప్రాంతం ఎంతదూరంలో ఉందో చూడండి. కర్ణాటక రాజధాని బెంగళూరు, మహారాష్ట్ర రాజధాని ముంబయి ఒక మూలనున్నాయి. రాజస్థాన్లో జైపూర్ ఎక్కడ ఉందో చూడండి. రాజధాని మార్చుతున్నామనేది వాస్తవం కాదు రాజధాని మధ్యలో ఉండాలని ఎవరూ కొలతలు వేసుకోవాలని ఆలోచించరు. రాజధాని ఎక్కడ పెడితే తక్కువ ఖర్చవుతుంది? జనాభా పెరుగుతుంది? రెవెన్యూ పెరుగుతుంది? అభివృద్ధి వేగంగా ముందుకు పోతుందనే అంశాలు ఆలోచించి రాజధానిని నిర్ణయిస్తారు. చంద్రబాబుకు అది అర్థం కాదు. ఆయనకు కొన్న భూములే గుర్తుకొస్తున్నాయేగానీ మరే విషయాలు అర్థం కావడంలేదు. అమరావతి విషయానికి వస్తే ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు భరోసా ఇవ్వదలిచాను. రాజధానిని మార్చుతున్నారని చంద్రబాబు అంటున్న మాట ఏమాత్రం వాస్తవం కానే కాదు. రాజధానిని మేం మార్చడంలేదు. రాజధాని ఎక్కడకూ పోవడంలేదు. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడంలేదు. మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నాం. ఇక్కడే లెజిస్లేటివ్ రాజధాని ఉంటుంది. అసెంబ్లీ ఉంటుంది. చట్టాలు చేస్తాం. దీంతోపాటు మరో రెండు కొత్తవి చేర్చుతున్నాం. విశాఖపట్నంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు పెడుతున్నాం. కర్నూలును జ్యుడీషియల్ కేపిటల్ చేస్తున్నాం. ఎక్కడా, ఏప్రాంతానికి అన్యాయం చేయడంలేదు. ఇక్కడ న్యాయం చేస్తూనే మిగిలిన ప్రాంతాలకు కూడా న్యాయం చేస్తున్నాం. -
ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం
సాక్షి, అమరావతి : అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఆమోదం తెలిపింది. సోమవారం మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు రాత్రి 11 గంటల వరకు కొనసాగాయి. సుధీర్ఘ చర్చల అనంతరం ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ.. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు శాసన సభ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా బిల్లు ఆమోదం పొందింది. అనంతరం సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లును సైతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా అధికార పార్టీ సభ్యుల హర్షధ్వానాల మధ్య ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకమైన బిల్లును ప్రవేశపెట్టి సభకు పరిచయం చేసే అవకాశం దక్కడం అదృష్టంగా పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్సించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సాక్షి, అమరావతి : పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ శాసన సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో సీఎం జగన్ సందేశం ప్రజలకు చేరకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్ తమ్మినేని సీతారాం సభా నియమాలు ఉల్లంఘించిన పలువురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, కరణం బలరాం, బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, చిన రాజప్ప, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, వెంకట్రెడ్డి నాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్ను నేటి సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
అమరావతికి అన్యాయం చేయను : సీఎం జగన్
సాక్షి, అమరావతి : అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలనే అభివృద్ధి వికేంద్రీకరణకు ఓటేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యూడీషియల్ క్యాపిటల్గా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అమరావతికి అన్యాయం చేయడం లేదని, మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. టీడీపీ నేతలకు రైతులపై ప్రేమలేదని అన్నారు. ఇలాంటి వారు ప్రపంచ చరిత్రలోనే ఉండరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ను పోగొట్టుకున్నామని గుర్తు చేశారు. వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన శాసన సభలో సోమవారం మాట్లాడారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... ఏపీ చరిత్రలో ఇవాళ ముఖ్యమైన రోజు ‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ముఖ్యమైన రోజు. ఈ రోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి గల కారణం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నన్ను మాట్లాడనీయకుండా చేస్తున్న టీడీపీ నేతల తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ మా ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు అనేకంటే.. దిద్దుబాట్లు అనడం కరెక్ట్. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్1న కర్నూలు రాజధానిగా అవతరించిన నాటి నుంచి 2014 జూన్లో 13 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ అవతరించేంత వరకు... ఆతర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే... రకరకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా అవతరిస్తూ మద్రాసును పోగొట్టుకున్నాం. ఆ తర్వాత కర్నూలును త్యాగం చేశాం. ఆ తర్వాత హైదరాబాద్ను పోగొట్టుకున్నాం. ఒక అభివృద్ధి కేంద్రంగా, ఉద్యోగాల కేంద్రంగా ఉన్న నగరాలను పోగొట్టుకున్న ఏకైక రాష్ట్రం మనదే. చివరకు 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ను ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడిన ఓ పెద్ద మనిషి వల్ల పోగొట్టుకున్నాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. కాగా, టీడీపీ సభ్యుల గందగోళంతో ముఖ్యమంత్రి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సీఎం తన ప్రసంగాన్ని కాసేపు నిలుపుదల చేశారు. టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. శ్రీకృష్ణ కమిటీ కూడా అదే చెప్పింది ‘1937లో శ్రీబాగ్ ఒప్పదం జరిగింది. గతంలో 1937లో అప్పట్లో మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉండగా.. తెలుగువారంతా ఒకటి కావాలి అని ఆరోజు శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. రాయలసీమ నుంచి పోతిరెడ్డి, కల్లూరి సుబ్బారావు లాంటి ప్రముఖ నాయకులు.. ఆంధ్ర నుంచి కాశీనాథుని నాగేశ్వరావు, కొండా వెంకటప్పయ్య లాంటి ప్రముఖులు ఒక చోట ఏకమై.. 1937లో శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలని, అన్నదమ్ములుగా బతకాలని, ప్రాంతాల మధ్య గొడవల రావొద్దని తాపత్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాలు, రాజధానులు ఎక్కడ ఉండాలనేదాటిపై చర్చ జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. హైకోర్టు, రాజధాని వంటివి ఒకే ప్రాంతంలో ఉండడం కరెక్ట్ కాదని, వేర్వేరు ప్రాంతాలల్లో ఏర్పాటు చేయాలని ఒడంబికలో రాసుకున్నారు. దాంట్లో భాగంగానే 1953లో కర్నూలును రాజధానిగా చేశారు.1956దాకా అదే రాజధానిగా ఉంది. 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు జస్టీస్ శ్రీకృష్ట కమిటీ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో అనేక అంశాలపై అధ్యయనం చేసింది. ప్రాంతీయ అసమానతలు, ఉద్యోగాల పరంగా అసమానతలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ఆ నివేదిక వెల్లడించింది. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృది రాహిత్యం వల్ల వస్తే.. రెండవ సారి అభివృద్ధి కేంద్రీకృతం కావడం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం జరుగుతుందో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు పేర్కొంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు తీరును శివరామ కృష్ణనే తప్పుపట్టారు ‘రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడానికి వీల్లేదని శిమరామకృష్ణ కమిటీ చెప్పింది. దీనిని చంద్రబాబు వక్రీకరించి చెప్పారు. సూపర్ క్యాపిటల్ వద్దని కమిటీ చెప్పింది. మూడు ప్రాంతాల్లో పాలనా వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణ కమిటీ సూచించింది. శివరాకృష్ణ తాను రాసిన వ్యాసాల్లో కూడా చంద్రబాబు తీరును తప్పుబట్టారు. చంద్రబాబు తీరు ఏపీకి ఆత్మహత్య సదృశంగా మారింది’అని సీఎం అన్నారు. టీడీపీ నేతలు ఎందుకు అక్కడ భూముల కొనలేదు ‘మేము అధికారలోకి వచ్చిన తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) రిపోర్టు కానీ, జీఎన్ రావు కమిటీ నివేదిక గానీ వికేంద్రీకరణకే ఓటేశాయి. గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ హైపవర్ కమిటీ సూచనలు కూడా చేసింది. గత ఒప్పందాలతో కానీ, గత చరిత్రతో కానీ, కమిటీ నివేదికలతోగానీ సంబంధం లేకుండా 2015లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారు. వస్తూ వస్తూ ఎవరికి ఏ అనుమానం రాకుండా తన వారితో, తన బినామీలతో, చివరకి తన పేరుతో కూడా ఈ ప్రాంతంలో వేల ఎకరాలు భూములు కొనుగోలు చేశారు. అందరికీ నూజివీడు దగ్గర రాజధాని అని చెప్పి భ్రమలు కల్పించారు. నాగార్జున యూనివర్సీటీ ప్రాంతంలో రాజధాని అని వారి పత్రికల్లో రాయించారు. వీళ్లు లీకులు ఇచ్చారు కాబట్టే పత్రికల్లో ఆ రాతలు వచ్చాయి. ఇలా రాతలు వచ్చినా కూడా.. ఇదే తెలుగు దేశం నాయకులు నూజీవీడు, నాగార్జున యూనివర్సీటీ ప్రాంతాల్లో ఎందుకు భూములు కొనుగొలు చేయలేదు..? నోటిఫికేషన్కు ముందే టీడీపీ నేతలకు రాజధాని ఏర్పాటు చేయబోయే గ్రామాల పేర్లు చెప్పారు. అందుకే అందరూ అక్కడ భూములు కొన్నారు. రాజధాని కోసం భూములా లేక చంద్రబాబు, ఆయన మనుషులు కొన్న భూముల కోసం రాజధానా..?’అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అక్కడే భూములు ఎలా కొన్నారు? ‘చంద్రబాబు తన స్వార్థం కోసం రైతులను ప్రలోభ పెట్టి.. భయపెట్టి భూములు లాక్కున్నారు. మచిలీ పట్నంలో గత నాలుగేళ్లుగా 144 సెక్షన్ పెట్టారు. తూర్పు గోదావరి జిల్లాలో 2016 నుంచి మా ప్రభుత్వం వచ్చేదాక 144 సెక్షన్ ఉంది. మా ప్రభుత్వం రెండు రోజులు 144 సెక్షన్ పెడితే నానా యాగీ చేస్తున్నారు. 29 గ్రామాల పరిధిలో 33వేల ఎకరాల భూములు తీసుకున్నారు. ఎవరైనా కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎక్కడ పెడతాం? విజయవాడకు మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో పెడతాం. లేదా గుంటూరుకు సమీపంలో పెడతాం. కానీ ఇక్కడ ఎం జరిగింది. పచ్చగా మూడు పంటలు పండే గ్రామాలు... విజయవాడకు, గుంటూరుకు చాలా దూరంలో ఉన్న గ్రామాల్లో.. రోడ్డు కూడా సరిగా లేని గ్రామాల్లో కావాలని భూములు కొన్నారు ఎందుకు? ఇక్కడే భూములు కొనాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? ఇదంతా చంద్రబాబు సీఎం అయ్యాక జరిగింది. రాజధాని ఇక్కడ వస్తుందని ప్రజలకు తెలియదు.. కానీ టీడీపీ నేతలకు మాత్రమే తెలుసు. రైతులను మోసం చేసి 4070 ఎకరాల భూములు కొన్నారు’అని సీఎం టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. అందుకే నారాయణ కమిటీ ‘వరద ముప్పు ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చింది. శివరామ కృష్ణ కమిటీ నివేదను నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు నారాయణ కమిటీ వేశారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను ఇవ్వకముందే చంద్రబాబు తన నిర్ణయాలను అమలు చేసేందుకు నారాయణ కమిటీ వేశారు. ఆ తర్వాత 9 నగరాలు నిర్మించబోతున్నామంటూ సినిమా చూపించారు. రాష్ట్రం మొత్తం నీటి కోసం, కూటి కోసం తపిస్తుంటే.. చంద్రబాబు మాత్రం కోట్ల కోసం పరితపించారు’అని సీఎం వైఎస్ జగన్ చురకలంటించారు. అమరావతి పేరుతో భ్రమరావతి కల్పించారు గత ఐదేళ్లలో చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ రాజధానిని నిర్మించాలంటే రూ.లక్ష కోట్లు కావాలి. అమరావతి పేరుతో ఒక భ్రమరావతి కల్పించారు. మౌలిక వసతుల కోసం లక్షా 9వేల కోట్లతో బాబు అంచనాలు వేశారు. రాజధాని నిర్మాణానికి రూ.4-5లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబే చెప్పారు. గతంలో అన్ని తాత్కాలికమని చెప్పి ఇప్పడు పర్మినెంట్ అంటున్నారు. మాట మార్చడంలో చంద్రబాబు దిట్ట. చంద్రబాబు చెప్పిన అమరావతిని నిర్మించాలంటే కనీసం 100 ఏళ్లు పడుతుంది. 30 ఏళ్లలో పూర్తి చేయాలనుకుంటే 5లక్షల 97వేల కోట్లు ఖర్చ అవుతుంది. గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలు, నది పరివాహక ప్రాంతాలు కావడం చేత ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం సాధ్యం కాదు. సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ రావాలంటే ఎకరం రూ.20కోట్లకు పోవాలి. ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు రాజధాని నగరంలో కనీస సదుపాలయలేకే లక్ష 9వేల కోట్లు పెట్టగలికే ఆర్థిక పరిస్థితి మనకు లేదు. రూ. 2.57లక్షల కోట్ల అప్పులతో మా పరిపాలన ప్రారంభించాం. రూ.21వేల కోట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించాలి. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు. ఈ భారం ప్రజలపై పడకుండా నేను జాగ్రత్తలు తీసుకున్నా. ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరో లక్ష కోట్లు రాజధాని కోసం ఖర్చు చేసే పరిస్థితి ఉందా అందరూ ఆలోచన చేయాలి. కృష్ణా నదిపై 8 జిల్లాలు ఆధారపడి ఉన్నాయి. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కృష్ణాలోకి తీసుకొచ్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా మాట్లాడాం. తక్కువ డబ్బుతో ఎక్కువ నీళ్లు ఎలా తీసుకురావాలో ఆలోచన చేశాం. ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులను చెద్దామా వద్దా? వెనుక బడిన ఉత్తరాంధ్రకు ఊపిరి పోసే ప్రాజెక్టు. ఉత్తరాంధ్ర సజల స్రవంతి వస్తే ఆ ప్రాంత వెనుకబాటు తనం పోతుంది. ఈ ప్రాజెక్టుకు రూ.16వేల కోట్లు ఖర్చు అవుతుంది. కరువు నివారణ కోసం కాల్పలు వెడల్పు చేసి ప్రాజెక్టుల సామర్థ్యం పెంచాలి. కరువు నివారణ పనుల కోసం రూ.25వేల కోట్లు ఖర్చవుతుంది. రైతులకు శాశ్వతంగా ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 10వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.36వేల కోట్టు ఖర్చు చేస్తున్నాం. సంక్షేమం వద్దా..! రాష్ట్రంలోని బడులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు లేక దారుణమైన పరస్థితుల్లో ఉన్నాయి. వాటి బాగుకోసం రూ.24 కోట్లు అవసరం. ప్రభుత్వాస్పత్రుల బాగు కోసం మరో రూ.14 వేల కోట్ల ఖర్చవుతుంది. వాటర్గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు అందించేందుకు రూ.45 వేల కోట్లు ఖర్చవుతుంది. ఉగాది నాటికి పేదలకు 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తాం. ఇందుకు రూ.40 వేల కోట్లు ఖర్చవుతుంది. 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 43 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 90 శాతం మందికి ఆరోగ్య శ్రీ, ఫీజురియంబర్స్మెంట్ సదుపాయం కల్పిస్తున్నాం. ఇన్ని ఖర్చుల మధ్య ఒక ప్రాంత అభిృద్ధికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అవసరమా..? రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిపేసి.. ఒక నగరానికి ఖర్చు చేయడం సాధ్యమేనా..? ఏదో ఒక రోజు అమరావతి కూడా మహానగం అవుతుంది. అందుకోసమే అసెంబ్లీని అమరావతిలోనే కొనసాగిస్తున్నాం. ఈ ప్రాంతంపై కోపం ఉంటే ఇక్కడే అసెంబ్లీ ఎందుకు పెడతాం. నేను కూడా సింగపూర్ నుంచి ఒకరిని.. జపాన్ నుంచి ఒకరిని తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేయను. మన దగ్గర పరిమిత సొమ్ముని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో చూడాలి. విశాఖ ఇప్పటికే రాష్ట్రంలో నెంబర్వన్ నగరం. విశాఖ రాజధాని అయితే పదేళ్లలో హైదరాబాద్తో మన పోటీ పడొచ్చు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు. అందరికీ మంచి చేయాలన్నదే నా విధానం పట్టా భూములను ఇచ్చిన రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తాం. అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వడంతోనే మాకు 151 సీట్లు వచ్చాయి. జగన్ కమ్మవారికి వ్యతిరేకమని చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. విశాఖలో కమ్మవారు లేరా? విశాఖలో మా ఎంపీ కూడా కమ్మే. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు.. కమ్మవారిలో అభద్రతా భావాన్ని పెంచేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు. రాజకీయం కోసం కులాన్ని వాడుకునే నీచ స్థాయికి బాబు దిగజారారు. అందరికీ మంచి చేయాలన్నదే నా విధానం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే అభివృద్ధి వికేంద్రీకరణకు ఓటేసున్నాం. అమరావతికి అన్యాయం చేయడం లేదు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చారని ఆరోపించింది. తెలుగు బీజేపీ నేతలు తెలిసి మాట్లాడుతున్నారో...తెలియక మాట్లాడుతున్నారా? అలాంటి వ్యక్తులను పార్టీ నుంచి బయటకు పంపించాలి. పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.830 కోట్లను ఆదా చేశాం.2021 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. శరవేగంగా పోలవరం ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అమరావతికి అన్యాయం చేయడంలేదు. అమరావతి రైతులకు ఎలాంటి అన్యాయం జరుగదు. అమరావతి రైతులకు న్యాయమే చేస్తాం. అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది. లెజిస్లేటీవ్ రాజధానిగా ఉంటుంది. చట్టాలు ఇక్కడే చేస్తాం.. సభలు ఇక్కడే జరుగుతాయి. అమరావతి గొప్ప నగరంగా రూపుదిద్దుతాం. భావితరాల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోని నిర్ణయాలు తీసుకుంటాం. దీనిలో భాగంగానే వికేంద్రీకరణకు ఓటు వేస్తున్నాం’ అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
చంద్రబాబు కావాలనే అలా చేస్తున్నారు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు శాసన సభలో అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై చంద్రబాబు నాయుడు దాదాపు 50 నిమిషాలు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి ఇతర అంశాలు మాట్లాడుతూ.. సభా సమయాన్ని వృథా చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కలుగజేసుకొని ప్రతిపక్ష నాయకుడు సభను తప్పుదోవ పట్టిస్తూ సమయాన్ని వృథా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 21మంది టీడీపీ సభ్యుల్లో ఐదుగురు మాట్లాడితే.. 151మంది ఉన్న తమ సభ్యుల్లో కేవలం ఏడుగురు మాత్రమే మాట్లాడారని గుర్తు చేశారు. ప్రజలు నిద్రపోయేవరకు మాట్లాడాలనే ఉద్ధేశంతోనే చంద్రబాబు ఇంకా మైకు వదలడం లేదని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడేది ప్రజలు వినకూడదని చంద్రబాబు అనుకుంటున్నారని.. అయినప్పటికీ ఆయనకు మరింత సమయం ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ కలగజేసుకొని చంద్రబాబును 10 నిమిషాల్లో ప్రసంగం ముగించాలని ఆదేశించగా.. మరో గంట సమయం కావాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ టీడీపీ నేతలపై మండిపడ్డారు. ‘అసెంబ్లీ టీడీపీ జాగీరు కాదని.. ఇది అందరిదీ.. ప్రతి ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని’ స్పష్టం చేశారు. -
‘సమాచారం ఇవ్వమంటే బాబు పట్టించుకోలేదు’
సాక్షి, అమరావతి : శివరామకృష్ణన్ కమిటీ గురించి చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎత్తైన భవనాలు అనుకూలం కాదని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని ఆయన గుర్తు చేశారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ‘ఇక్కడ వ్యవసాయ భూమిని తీసుకోవద్దని, అది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దారితీస్తుందని కమిటీ స్పష్టంగా చెప్పింది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వ భూమి ఉందా అని కమిటీ సమాచారం ఇవ్వమంటే.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. 25 గంటల్లోనే రాజధానిపై ఫోన్ ద్వారా తమ అభిప్రాయం చెప్పాలని కోరితే.. కేవలం 1500 మంది ప్రజలు మాత్రమే చెప్పారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయం చెప్పలేదు. వరదలు వస్తే... అమరావతి ప్రాంతం ఎలా మారుతుందో బాబుకు తెలియదా. ఆయన తెలిసి మాట్లాడుతున్నారో.. తెలియక వాదిస్తున్నారో అర్థం కావడం లేదు’అని బుగ్గన విమర్శలు గుప్పించారు. -
మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం
సాక్షి,అమరావతి: మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కడప: రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినందుకు ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా వైఎస్సార్ విగ్రహం వద్ద బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కర్నూలు: కర్నూలును జూడిషియల్ క్యాపిటల్గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినందుకు కర్నూలు వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని కొండారెడ్డి బురుజు వద్ద మిఠాయిలు పంపిణీ చేస్తూ సీఎం జగన్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తేర్నకల్ సురేందర్ రెడ్డి, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టినందుకు పులివెందులలో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పులాంగళ్ల సర్కిల్లో బాణాసంచా పేల్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అనంతపురం: మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల బిల్లు ఆమోదించడంపై కదిరిలో పార్టీ నాయకులు సంబరాలు చేశారు. పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ.. భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. నెల్లూరు: రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని కోరుతూ కావలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేతలు, కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల్లో పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, ర్యాలీలు చేపట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, బొలిశెట్టి గోవిందు పాల్గొన్నారు. శ్రీకాకుళం: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టినందుకు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ధర్మాన రామ్మనోహర్ నాయుడు, అందవరపు సూరిబాబు, మెంటాడ స్వరూప్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలాస: నియోజకవర్గంలోని కాశీబుగ్గ బస్టాండ్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేతలు, కార్యకర్తలు పూలమాల వేశారు. తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా అసెంబ్లీ బిల్లును ప్రవేశపెట్టినందుకు కార్యకర్తలు, నేతలు సంఘీభావం తెలిపారు. విశాఖ క్యాపిటల్ నిర్ణయానికి మద్దతుగా విశాఖ నార్త్ కన్వీనర్ ఆధ్వర్యంలో బాలయ్య శాస్త్రి లేఔట్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేతలు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మద్దిలపాలెం వినాయక టెంపుల్ మీదుగా కొనసాగిన భారీ ర్యాలీలో వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, పార్టీ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ కన్వీనర్లు కేకే రాజు, మల్ల విజయప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులు కొయ్య ప్రసాద్రెడ్డి, రొయ్య జగన్నాథం, జాన్ వెస్లీ, రొయ్య వెంకటరమణ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: నిడదవోలు పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీని కార్యకర్తలు నిర్వహించారు. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడురాజధానులు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని భీమడోలు, గణపవరం, నిడమర్రు గ్రామాల కార్యకర్తలు, ప్రజలు ఉంగుటూరు మండల కేంద్రంలో సంఘీభావ బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ గ్రామాల ప్రజలు సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి మద్దతు పలికారు. తాడేపల్లిగూడెంలో మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పాల్గొన్నారు. దేవరపల్లి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యలయం వద్ద మూడు రాజధానులకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేడుకలు నిర్వహించారు. చింతలపూడిలో సోమవారం అసెంబ్లీలో మూడు రాజధానుల తీర్మానం ప్రవేశ పెట్టినందుకు పార్టీ కార్యకర్తలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బుట్టాయిగూడెంలో ఆంధ్రప్రదేశ్ సమతుల్య అభివృద్ధి కోసం అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ కార్యకర్తలు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. దీంతోపాటు భారీగా బాణాసంచా కాల్చి, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ద్వారకాతిరుమలలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి.. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేతలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్న వెంకన్న పాదాల చెంత కొబ్బరికాయలు కొట్టి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అంటూ... జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో తన్నీరు నాగేశ్వరావు, చౌడవరపు జగదీష్, షేక్. మదార్ సాహెబ్, నూకల సాంబ, నంబూరి రవి, జుబేర్, ఫిరోజ్ ఖాన్, ప్రజలు పాల్గొన్నారు. -
‘సీఎం జగన్ నిర్ణయం వల్లే మా ప్రాంతాల్లో వెలుగులు’
సాక్షి, అమరావతి : వెనకబడిన ప్రాంతాల్ని విస్మరిస్తే సమస్యలు తప్పవని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. అది గమనించే సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాజధానిగా అమరావతి కొనసాగితే మళ్లీ ఉద్యమాలు వచ్చేవని ఆయన స్పష్టం చేశారు. అప్పుడు అందరం కలిసి ఉండటం సాధ్యమయ్యేదా అని టీడీపీ ఎమ్మెల్యేలను ధర్మాన ప్రశ్నించారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. వికేంద్రీకరణ బిల్లును స్వాగతిస్తున్నానని ఈ సందర్భంగా ధర్మాన తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుంటే.. వెనక నుంచి అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం వల్లే.. తమ ప్రాంతాల్లో వెలుగులు వచ్చాయని ధర్మాన ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) టీడీపీ పాలనలో చర్చలు లేవు.. రాజధానిని చంద్రబాబు పూర్తిగా వ్యాపార ధోరణితోనే చూశారని ధర్మాన విమర్శించారు. రాజధాని నిర్మాణం అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించే విధంగా ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని గత టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని గుర్తు చేశారు. ఎవరితో చర్చింకుండానే టీడీపీ పాలనలో నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ పర్యటన పూర్తి కాకముందే గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వానికి రాజ్యాంగంపై నమ్మకం లేదని, సుప్రీం కోర్టుపై గౌరవం లేదని ధర్మాన అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన విధంగానే సీఎం జగన్ చేశారని తెలిపారు. విశాఖ ఏమైనా మారుమూల ప్రాంతమా అని టీడీపీ ఎమ్మెల్యేలను ధర్మాన నిలదీశారు. చదవండి : అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం రాజధాని రైతులకు వరాలు చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని -
‘అవును.. అమరావతిలో భూములు కొన్నా’
సాక్షి, అమరావతి : రాజధాని ఏర్పడుతుందనే అమరావతిలో భూములు కొన్నానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అంగీకరించారు. రాజధానిలో భూములు ఉండాలనే తన కొడుకు పేరుపై భూములు కొన్నానని అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్నారు. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడుతూ.. అమరావతిలో రాజధానిఏర్పడబోతుందని తెలిసే భూములు కొన్నానని స్పష్టం చేశారు. రాజధానిలో భూములు కొంటే తప్పేంటని ప్రశ్నించారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) భూముల కొంటే తప్పులేదని.. 2014 జూన్ నుంచి డిసెంబర్లోగా టీడీపీ నేతలు అంతా ఒకే చోటభూములు ఎలా కొన్నారని బుగ్గన నిలదీశారు. రాజధాని అక్కడ..ఇక్కడ అని అమయాక ప్రజలను గందరగోళాని గురిచేసి.. టీడీపీ నేతలు మాత్రం అమరావతిలో భూములు కొన్నారని బుగ్గన ఆరోపించారు. గుంటూరు,కృష్టా జిల్లాల్లో రాజధాని అని ఉద్దేశపూర్వకంగా లీకులు ఇచ్చి.. అందరిని మభ్యపెట్టి టీడీపీ నేతలు మాత్రం అమరావతిలో భూములు కొన్నారన్నారు. కచ్చితంగా ఇది ఇన్సైడర్ ట్రేడింగే అని బుగ్గన అన్నారు. దీనిపైప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. (చదవండి : చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని) ప్రజలను మభ్యపెట్టేలా పయ్యావుల మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఇల్లు కట్టుకునేందుకు 4 ఎకరాల భూముటు కొంటారాఅని పయ్యావులను ప్రశ్నించారు. రాజధాని ఏర్పడే విషయం టీడీపీ నేతలకు ముందుగానే అందిందని.. అందుకే అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్పై తమ ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని పేర్కొనానరు. (చదవండి : ‘షో బ్యాగ్.. సీ బ్యాగ్ అనేది చంద్రబాబు పాలసీ’) -
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి: సుచరిత
సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు హోంమంత్రి మేకతోటి సుచరిత పూర్తి మద్దతు తెలిపారు. ఇదొక చరిత్రాత్మక రోజు, శతాబ్దాల రాష్ట్ర భవిష్యత్తుకు చక్కని పునాది అని ఆమె కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సుచరిత మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరి నుంచి కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా అందరి అభివృద్ధి, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ప్రజాసంక్షేమం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాంతీయ అసమానతలు, అనుమానాలకు తావులేని అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవించాలని, అందుకు చట్టసభలు వేదికగా కావాలని, అప్పుడే ప్రజల ఆకాంక్షలు సజీవంగా ఉండి.. అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ.. లబ్ధిదారులకు సేవలన్నీ తమ గడప వద్దకే తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ దిశగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే సరికొత్త విప్లవానికి నాంది పలుకనుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప నిర్ణయాలు అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో పనిచేయడం నిజంగా తమకు గర్వకారణంగా ఉందన్నారు. చదవండి: చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని రాజధానులు ఎంతెంత దూరం శాసనాలు చేసే రాజధానిగా అమరావతి రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం -
చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని
సాక్షి, అమరావతి : స్వార్థ ప్రయోజనాల కోసం అమరాతిపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా సామాజిక అంశాన్ని లేవనెత్తిన బాబు.. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని మంత్రి ప్రశ్నించారు. కులంపై ద్వేషంతో రాజధాని తరలించడం లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. (చదవండి : చంద్రబాబు సంఘవిద్రోహ శక్తా?) ‘ఉత్తరాంధ్ర ప్రజలు మంచివారు. పురందేశ్వరి కమ్మ కాదా. కంభంపాటి హరిబాబు కమ్మ కాదా. వైజాగ్లో ఉన్న నేతలు ఏ సామాజికవర్గానికి చెందినవారు. లోకేశ్ తోడల్లుడికి చెందిన గీతం వర్సిటీ విశాఖలో ఉంది. 50 నుంచి 80 శాతం వ్యాపారాలు కమ్మవారివే. కమ్మవారిపై కోపం ఉంటే కర్నూలు, కడప రాజధానిగా పెట్టేవారు కదా. ఇప్పుడు కమ్మవారికి రెండు రాజధానులు వచ్చాయి. బెదిరింపులకు సీఎం జగన్ భయపడరు. జోలె పట్టుకుని అడుక్కుంటే ఎవరూ జాలి చూపించరు. కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయాలి. అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ తెలంగాణ వాదం లేదంటే.. కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిచారు. గతంలో వైఎస్ జగన్ కూడా ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి గెలిచారు’అని మంత్రి తెలిపారు. (చదవండి : ‘ఢిల్లీ ఏమైనా మధ్యలో ఉందా’) సవాల్ స్వీకరించాలి.. ‘అమరావతినే ప్రజలు రాజధానిగా కోరుకుంటున్నారనే నమ్మకం మీకుంటే.. టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. మీపై మీకు నమ్మకం ఉంటే రాజీనామా చేసి గెలవాలి. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారు. నాకు వైఎస్సార్ లాంటి మరణాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. వైఎస్సార్ మరణానంతరం ఆయన పేరుపై పార్టీ పెట్టి 5 లక్షల మెజారిటీతో వైఎస్ జగన్ ఎంపీగా గెలిచారు. చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కున్నారు. కొడుకును కూడా బాబు గెలిపించుకోలేకపోయారు’అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) -
‘షో బ్యాగ్.. సీ బ్యాగ్’ చంద్రబాబు పాలసీ
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘ అనుభవం ఉందని గతంలో అధికారం కట్టబెడితే.. ఎన్ని విధాలుగా అవినీతికి పాల్పడవచ్చో, ఎన్నిరకాలుగా స్కామ్లు చేయవచ్చో చేసి చూపించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్మే కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. రాజధాని ఎక్కడ వస్తుందో తన అనుచరులకు ముందుగానే లీకులు ఇచ్చి పేద రైతుల భూములను కొట్టేశారని ఆరోపించారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ.. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో చంద్రబాబుకు చెందిన వ్యక్తులు తక్కువ ధరకే వేల ఎకరాల భూములను కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకోకుండా తనకు అనుకూలంగా మార్చుకొని పేద రైతులను మోసం చేశారని మండిపడ్డారు. వికేంద్రీకరణకు అందరూ మద్దతు ఇస్తుంటే.. తన అక్రమ ఆస్తులు తరలిపోతాయనే చంద్రబాబు ఆందోళన చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు శ్రీబాగ్ ఒడంబిక గురించి తెలియదు కానీ ‘క్యాష్ బ్యాగ్’ గురించి బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ‘షో బ్యాగ్.. సీ బ్యాగ్’ అనేదే చంద్రబాబు పాలసీ అని విమర్శించారు. చంద్రబాబుకు సొంత అభివృద్ధి, సొంత ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు లబ్ది పొందారని ఆరోపించారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనలేదా అని నిలదీశారు. నారాయణ దగ్గర పనిచేసే అటెండర్లు, క్లర్క్ల పేరుతో 55 ఎకరాలు కొన్నారన్నారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి రూ.2లక్షల కోట్లకు ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. 800 మంది తెల్లరేషన్ కార్డు దారులు కూడా రాజధానిలో భూములు కొన్నట్లు చూపిస్తున్నారని.. వారంతా చంద్రబాబు బినామీదారులే అని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం హయంలో దళితులు, నిరుపేదలు దారుణంగా మోస పోయారన్నారు. అధికారం ముసుగులో టీడీపీ నేతలు చేసిన దోపిడీని మొత్తాన్ని త్వరలోనే బయటకు తీస్తామన్నారు. రాజధాని విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కాకాణి పేర్కొన్నారు. -
చంద్రబాబు సంఘ విద్రోహ శక్తా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఒక కీలక ఘట్టాన్ని ఆవిష్కరించబోతున్నాయని, ప్రపంచంలోని తెలుగువారంతా ఈ ప్రత్యేక సమావేశాలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై అంబటి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, మూడు ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ చరిత్రాత్మక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారని, ఈ బిల్లును రాష్ట్ర ప్రజలందరూ హర్షించాలని కోరారు. ‘ఐదేళ్ల క్రితం 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. అంతకుమునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముందు కర్నూలు రాజధానిగా కొంతకాలం ఆంధ్ర రాష్ట్రం పరిపాలన కొనసాగింది. తెలుగువారంతా ఒకేప్రాంతంగా ఉండాలన్న భాషాప్రయోక్త రాష్ట్రాల భావనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేశారు. తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నాలుగు ప్రాంతాలను కలిపి ఉమ్మడి రాష్ట్రం కొనసాగింది. మన భాష ఒక్కటే.. యాసలు వేరు. సమైక్య ఉద్యమం జరిగినప్పుడు నందమూరి తారకరామారావు ‘తెలుగుజాతి మనది నిండుగ వెలుగుజాతి మనది’ అన్న పాటతో చైతన్యం కల్పించారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒక్కటే అని ఆనాడు నందమూరి చాటిచెప్పారు. కానీ ఆయన వారసులుగా చెప్పుకునేవారు, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు తుళ్లూరు నాది, మందడం నాది, ఉద్దండరాయపురం నాది.. అన్ని కలిసిన అమరావతి నాదే నాదే అంటున్నారు. విశాఖపట్నం నాది కాదు, కర్నూలు నాది కాదు, అమరావతి మాత్రమే నాది అనే సంకుచిత స్థాయికి చంద్రబాబు ఎందుకు దిగజారిపోయారు’ అని అంబటి మండిపడ్డారు. గతంలో తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నాది.. హైదరాబాద్లోని ప్రతి అంగుళం నాది అనే భావనతో శాసనసభకు వెళ్లేవాడినని, కానీ పరిణామక్రమంలో హైదరాబాద్ ఏమైందో అందరికీ తెలుసునని అన్నారు. దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ ఏకైక మహానగరంగా హైదరాబాద్ ఎదిగిందని, మన హైదరాబాద్ బ్రహ్మాండంగా ఎదిగిందని మనమంతా గర్వించామని, కానీ, తెలంగాణ ఉద్యమం, సమైక్య ఉద్యమాలు జరిగి.. చివరకు హైదరాబాద్ నుంచి మెడ పట్టుకొని మనల్ని బయటకు గెంటారా? లేదా? అని ప్రశ్నించారు. ఈ మహానగరం మాదేనని తెలంగాణవారు తిరుగుబాటు చేశారని, రాజధాని ఏర్పాటు సంబంధించి ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, రాజధాని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను ప్రజలు ఆయనపై పెడితే.. ఆయన మాత్రం అసలైన అమరావతిని విస్మరించి.. అమరావతి పేరిట కృష్ణా జిల్లా వైపును ఎన్నుకున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఉన్న అసలైన అమరావతిని నిర్లక్ష్యం చేసి.. ఆ పేరును వాడుకొని అటువైపు.. అమరావతిలో ల్యాండ్పూలింగ్ పేరిట చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. అమరావతి పేరిట చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదా? అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అమరావతిలో పెద్ద కుంభకోణానికి చంద్రబాబు పాల్పడ్డారని, రాజధాని విషయంలో ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయలేదని, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు.. ఇలా అన్ని తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టారని గుర్తు చేశారు. బలహీనవర్గాలను దెబ్బతీసేందుకు రాజధాని విషయంలో చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఆయన, టీడీపీ నేతలు బినామీ పేర్లతో అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపించారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో ఉండే సౌకర్యాన్ని వదిలిపెట్టి.. అర్ధంతరంగా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారని ప్రశ్నించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతా? లేక సంఘవిద్రోహ శక్తా? అని ధ్వజమెత్తారు. రాజధాని కోసం చంద్రబాబు పోరాటం చేయడం లేదని, కేవలం తన బినామీల కోసమే ఆయన పోరాటం చేస్తున్నారని అంబటి స్పష్టం చేశారు. అందరూ బాగుండాలనేవిధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చేస్తున్నారని, అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలనే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ వల్ల చంద్రబాబుకు వచ్చే నష్టమేంటని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఇలా అధికారాన్ని వికేంద్రీకరించడం వల్ల మళ్లీ ఎలాంటి ఉద్యమాలు రావు అని అన్నారు. నిజమైన రైతులకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయం చేయబోదని పేర్కొన్నారు. ఇప్పుడున్నవారంతా నిజమైన రైతులు కారని పేర్కొన్నారు. అమరావతి విషయంలో సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ ఒకే వాదన వినిపిస్తున్నారని, కానీ, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కమలంలో పచ్చపుష్పాలు ఎక్కువయ్యాయని అంబటి ఎద్దేవా చేశారు. అమరావతి నిర్మాణమంతా రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మారిందని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. చంద్రబాబునాయుడు మొదట ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకించారని, తర్వాత సమర్థించారని తెలిపారు. ఇప్పుడు విశాఖను వ్యతిరేకించిన వారు, తర్వాత సమర్థిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు అమరావతిపై ప్రేమ లేదని, కేవలం వారు కొనుక్కున్న భూములపైనే ప్రేమ ఉందని విమర్శించారు. అమరావతి రైతులకు ఎలాంటి సమస్యలున్నా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు మాటలు విని ఎవరూ మోసపోవద్దని కోరారు. -
ఎగ్జిక్యూటివ్ రాజధానిపై ఉద్యోగ సంఘాల హర్షం
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీలో సోమవారం విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ కాపిటల్గా ప్రకటించడంపై పలు ఉద్యోగసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగసంఘాల నేతలు స్వీట్లు పంచుకొని బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు, జీవీఎంసీ సంఘం నేత ఆనందరావు, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవిశంకర్తోపాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. కృష్ణా: అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును సోమవారం ప్రవేశపెట్టడంతో మద్దతుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు జిల్లాలోని కైకలూరు తాలూకా సెంటర్ దగ్గర బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: రాజధాని రైతులకు వరాలు శ్రీకాకుళం: పాలన వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా జిల్లాలోని నరసన్నపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ధర్మన పద్మప్రియ ఆధ్వరంలో సోమవారం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. తూర్పు గోదావరి: మూడు రాజధానుల బిల్లుకు సోమవారం ఆమోదముద్ర వేసిన సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అయినవిల్లి, మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పేరి కామేశ్వరరావు, నాగవరపు నాగరాజు, కొర్లపాటి కోటబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘ఢిల్లీ ఏమైనా మధ్యలో ఉందా’
సాక్షి, అమరావతి : తమిళనాడులో ఉన్నప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు వచ్చేదేమీ లేదని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా కొడాలి నాని అసెంబ్లీలో మాట్లాడారు. ఈ బిల్లును ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. సామాజిక అంశాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని.. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని ప్రశ్నించారు. (చదవండి : రాజధానులు ఎంతెంత దూరం) మధ్యలో ఉంటేనా అభివృద్ధి చెందుతుందా..? ‘డబ్బా మీడియా, చెత్త పేపర్లతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీకి మధ్యలో ఉంటేనే అమరావతి అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్తున్నారు. భారత దేశానికి ఢిల్లీ మధ్యలో ఉందా..? రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆలోచించడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలే కోసమే పరితపిస్తున్నారు. చంద్రబాబుకు స్పష్టత కరువైంది. ఇది అసలు అమరావతి కాదు. ఇది చంద్రబాబు అమరావతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను తీసుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగానే చెప్పారు’ అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి : 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు...) -
మూడు రాజధానులకు పూర్తి మద్దతు : రాపాక
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని ఒకేచోట కేంద్రీకృతమైతే.. ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందుతారని, ఈ నేపథ్యంలో 13 జిల్లాలూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధి దృష్టి పెట్టాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై రాపాక మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ను మాత్రమే అభివృద్ధి చేశారని, మన ఆదాయాన్ని సైతం హైదరాబాద్ అభివృద్ధికి వెచ్చించారని, కనీసం అప్పుడు వెనుకబడిన జిల్లాలను పట్టించుకోలేదని రాపాక పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర విభజన తర్వాత మనం తిరిగొచ్చాక ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజల వలస వెళ్తూ రాష్ట్రమంతా పనిచేస్తున్నారని, తినడానికి సరైన తిండి కూడా లేని దుర్భర పరిస్థితుల్లో కడుపునిండా తిండి కోసం వాళ్లు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే.. అక్కడి వలసలు ఆగుతాయని, అదేవిధంగా కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని ద్వారా అనంతపురం ప్రజలు బెంగళూరు వలస వెళ్లడం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి ప్రతిపక్షం కూడా ఆలోచించాలని కోరారు. అమరావతిలో జరిగిన అవినీతి గురించి బుగ్గన వివరంగా చెప్పారని, దీంతో అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఎంత మోసం జరుగుతుందో ప్రజలకు కూడా తెలిసిందన్నారు. తనకు రాష్ట్రాభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పడాన్ని స్వాగతించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిననాటి నుంచి వరుసగా పథకాలు అమలుచేస్తున్నారని, అమ్మ ఒడిలాంటి ప్రతిష్టాత్మక పథకాల ద్వారా ఇచ్చిన ప్రతి హామీని సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు 4.50 లక్షల ఉద్యోగాలు సృష్టించి ఇవ్వడం ఒక చరిత్ర అని ప్రశంసించారు. ప్రజలకు మంచి చేయాలన్న దృక్పథం, నిరంతరం ప్రజల కోసం ఆలోచన ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ అని అన్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రజల జీవితాల్లో వెలుగునింపడం కోసం ఆయన పనిచేస్తున్నారని అన్నారు. మూడు రాజధానులకు రాష్ట్రంలోని ప్రతిచోటా మద్దతు లభిస్తోందని, ప్రజాభిప్రాయం మూడు రాజధానులకు అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లుకు తన తరఫున, జనసేన తరఫున రాపాక పూర్తి మద్దతు తెలియజేశారు. చదవండి: రాజధానులు ఎంతెంత దూరం శాసనాలు చేసే రాజధానిగా అమరావతి రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా? భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా? -
రాజధానులు ఎంతెంత దూరం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రతిపాదించిన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న అంశంపై శాసనసభ ప్రత్యేక సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వికేంద్రీకరణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. (చదవండి : రాజధాని రైతులకు వరాలు) సమావేశాలు ప్రారంభం కాగానే రాష్ట్ర సమతుల అభివృద్ధికి అధికార వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి , రాజధాని ప్రాంతీయ అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) ను రద్దు చేస్తూ మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. అలాగే రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తారని ముందస్తు సమాచారంతో ఆ పరిసర ప్రాంతాల్లో వేలాది ఎకరాలను టీడీపీ నాయకులు ముందుగానే కొనుగోలు చేసుకుని ఇన్సైడర్ ట్రేడింగ్కు ఎలా పాల్పడినారో సమగ్రంగా వివరించారు. భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల పేర్లు, వారి బినామీ పేర్ల జాబితాను బయటపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి వికేంద్రీకరణ ఎందుకు అవసరం? గతంలో చేసిన తప్పిదాలు, వాటివల్ల జరిగిన నష్టాలను వివరించారు. చరిత్రలో రాజధానులు ఏర్పాటుకు దోహదం చేసిన అంశాలు, రాజధాని ఎంపిక, నిర్మాణాల విషయంలో శ్రీకృష్ణ కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ), హైపవర్ కమిటీల నివేదికలు ఏం చెప్పాయన్న వివరాలను సభలో వివరించారు. (చదవండి : ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా?) రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్రస్తుతం చెల్లిస్తున్న పరిహారాన్ని మరింత పెంచుతున్నట్టు మంత్రి బొత్స సభలో వెల్లడించారు. ఆయా గ్రామీల సమగ్రాభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై సుదీర్ఘంగా సాగిన చర్చలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పాల్గొని చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టారు. ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులు వాటి రాజధానులు ఎలా ఉన్నాయో ఉదహరించారు. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, రాజకీయాలకన్నా తాను రాష్ట్ర అభివృద్ధినే కాంక్షిస్తానని స్పష్టం చేశారు. వికేంద్రీకరణలో భాగంగా పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చేస్తే అది మిగతా ప్రాంతాలకు దూరమవుతుందన్న ప్రతిపక్ష వాదనను అధికారపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధికి ప్రాతిపదికలను ఉదాహరణలతో వివరించారు. ఆయా రాష్ట్రాల రాజధానులు ఎంతెంత దూరంలో వెలిశాయన్న వివరాలను వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ అనేక రాష్ట్రాలకు దూరంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. రాజధానులు వాటి మధ్య దూరాలపై కొన్ని ఉదాహరణలు : -
శాసనాలు చేసే రాజధానిగా అమరావతి
సాక్షి, అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సమర్థిస్తున్నట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తెలిపారు. శాసనసభలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుకు రాకుండా చేసిందని ఆరోపించారు. అమరావతి రాజధాని అనగానే మొదటగా సంతోషపడిన వాళ్లలో తానూ ఒకడినని, కానీ తర్వాత మోసపోయామని తెలుసుకున్నానని చెప్పారు. అమరావతిలో రాజధాని నిర్మాణం అనుకూలం కాదని పర్యావరణవేత్తలు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. కౌలు రైతు వ్యవస్థను చంద్రబాబు ధ్వంసం చేశారని దుయ్యబట్టారు. రాజధానిని కొంతమందికే పరిమితం చేసేలా చంద్రబాబు వ్యవహరించారని, దళిత సోదరులు అనుమతి తీసుకోకుండా భూములు లాక్కున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రైతుల నుంచి భూములు గుంజుకున్నారని తెలిపారు. కానీ సీఎం జగన్ ఇలా వ్యవహరించలేదని.. కమిటీ నివేదికలు, ప్రజల అభీష్టం మేరకే ముందుకు వెళ్తుతున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో పదేళ్లు ఉండేందుకు అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు అనాలోచిత నిర్ణయం వల్లే ఈ దౌర్భగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారని గుర్తు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే భయంతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. టీడీపీ బినామిలతో ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలోనే శాసనసభ శాసనాలు చేసే రాజధానిగా అమరావతి మారినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని తరలింపుపై అనుమానాలు పటాపంచలయ్యాయని తెలిపారు. శాసనసభ ఇక్కడే ఉంటుందని, కింగ్ మేకర్లను తామేనని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ భవిష్యత్తు ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమని స్పష్టం చేశారు. అమరావతిని అగ్రికల్చరర్ జోన్గా ప్రకటించాలని కోరారు. శాసనసభ, సచివాలయంతో సామాన్యులకు పనేం ఉండదన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముందుకు తెచ్చామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు బలవంతంగా ప్రయోగించిన భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు. చదవండి: రాజధాని రైతులకు వరాలు 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు... స్పీకర్ వినతి.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం: సీఎం ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా? భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా? -
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా..?
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా.. అని మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని ప్రాంతాల అభివృద్ధిని గత టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాంతీయ అసమానతలు, అవసరాల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని.. గత పాలకుల నిర్ణయాల వల్ల ప్రాంతీయ అసమానతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే 5 కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో..ఏ ఒక్క ప్రాంతానికో కాదన్నారు. హై పవర్ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో సమీక్ష జరిపామని.. వికేంద్రీకరణ వల్లే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం అని తెలిపారు. వనరులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని. అందుకే సీఆర్డీఏ రద్దు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ‘చంద్రబాబుకు జ్వరం వస్తే.. రాష్ట్రం మొత్తానికి జర్వం వస్తుంది. చంద్రబాబు బాగుంటే..రాష్ట్రం మొత్తం బాగున్నట్లా..’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతల్లాగా దోచుకోవడం మాకు తెలియదని.. ఐదేళ్లలో చేయాల్సిన అభివృద్ధి పనులే మాకు తెలుసునని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజకు మద్దతు ఇచ్చింది చంద్రబాబు కాదా.. మళ్లీ అటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. విశాఖలో తన కుటుంబ సభ్యులపై భూములు ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. (చదవండి: రాజధాని రైతులకు వరాలు) -
72 ఏళ్లు గడిచినా రాజధాని లేదు...
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు అనాలోచిత రాజకీయ నిర్ణయాల కారణంగానే ఆంధ్రరాష్ట్ర ప్రజలు రాజధాని లేకుండా మిగిలిపోయారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 72 ఏళ్లు గడిచినా.. ఇంకా కరువు ప్రాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలపై కుట్రపూరింతగా వివక్ష చూపడం వల్లనే వెనుకబడి పోతున్నాయని అన్నారు. కేవలం వెనుకబాటు తనం కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని, విభజన అనంతరం హైదరాబాద్ నుంచి పారిపోయి రావడానికి చంద్రబాబు నాయుడే కారణమని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘ప్రాంతాలపై వివక్ష చూపడం ఏ ప్రభుత్వానికి సరైనది కాదు. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిప్పుడు కర్నూలును రాజధానిగా నిర్మించాలి అనుకున్నాం. అంతలోనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాం. 2014లో రాష్ట్ర విభజనతో మళ్లీ హైదరాబాద్ నుంచి సర్దుకుని రావాల్సి వచ్చింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు నాయుడు ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటన్నింటిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీఎన్రావు, బీసీజీ, హైపవర్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్ని వికేంద్రీకరణ జరపాలని నిర్థారించాయి. వీటకంటే ముందే కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణకే ముగ్గుచూపింది. సూపర్ క్యాపిటల్ను నిర్మించవద్దని కూడా సూచించింది. శివరామకృష్ణ కమిటీ ప్రధానంగా మూడు సూచనలు చేసింది. గ్రీన్ఫీల్డ్ నగరం, ఉన్న నగరాన్ని విస్తరించడం, అభివృద్ధి వికేంద్రీకరణ. గత ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్సిటీ పద్దతిని ఎంచుకుని బొక్కబోర్లా పడింది. అమరావతి నిర్మాణం చేపట్టింది. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. చివరికి రైతుల నుంచి భూములు తీసుకున్నందుకు కనీసం వాళ్లకు ఫ్లాట్లు కూడా ఇవ్వలేకపోయింది. దీనికి చంద్రబాబు నాయుడు రాజకీయ నిర్ణయాలే కారణం. ఐదేళ్ల పాటు విదేశీ బృందాలు, గ్రాఫిక్స్లు, సినిమా డైరెక్టర్లను తెచ్చి డిజైన్లు చేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుదోవ పట్టించారు.’అని అన్నారు. -
రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం వరాలు
సాక్షి, అమరావతి: రాజధాని గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కంటే మిన్నగా రాజధాని గ్రామాలకు మేలు చేస్తామని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని గ్రామాల్లో భూమిలేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్ను రూ.2500 నుంచి రూ.5వేలకు పెంచబోతున్నామని తెలిపారు. రాజధానికి భూములు ఇచ్చిన పట్టా రైతులతో సమానంగా అసైన్డ్ భూములు ఇచ్చిన అసైన్డ్ దారులకు రిటర్న్ ప్లాట్లు కేటాయిస్తామని చెప్పారు. భూములిచ్చిన రైతులకు గతంలో జరీబుకైతే రూ.50 వేలు, మెట్ట భూమికి అయితే రూ.30 వేలు 10 ఏళ్లకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అలాగే ప్రతి ఏటా జరీబు భూమికి రూ.5వేలు, మెట్టభూమికి రూ.3వేలు పెంచాలని గతంలో నిర్ణయించారని, ఈ యాన్యునిటీని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయించామని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత జరీబు భూమికి ఇచ్చే యాన్యునిటీ రూ.1 లక్ష రూపాయిలు, మెట్ట భూమికి రూ.60 వేలు అవుతుందన్నారు. ఇప్పుడు ఒప్పందం ఉన్న 10 ఏళ్ల తర్వాత వచ్చే ఐదేళ్ల పాటు కూడా ఇదే రీతిలో యాన్యునిటీని చెల్లిస్తామని స్పష్టం చేశారు. (చదవండి: భూముల బండారం బట్టబయలు చేసిన బుగ్గన) -
స్పీకర్ వినతి.. విచారణ జరిపిస్తాం: సీఎం
సాక్షి, అమరావతి: అమరావతిలో టీడీపీ నేతల భూకొనుగొళ్ల బండారం బయటపెడుతూ ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో చేసిన ప్రకటనపై సభాపతి తమ్మినేని సీతారాం స్పందించారు. రాజధాని పేరుతో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని వివరిస్తూ.. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు దోచుకున్న భూముల వివరాలను రాజేంద్రనాథ్ సభముందు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పీకర్ స్పందిస్తూ.. అమరావతి భూముల వ్యవహారంపై ప్రజలకు నిజానిజాలు తెలిసేందుకు, నిజాలు నిగ్గుతేల్చేందుకు పకడ్బందీగా సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. దీనికి సీఎం వైఎస్ జగన్ స్పందిస్తూ.. సభాపతి నుంచి వచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. శాసనసభకు ప్రత్యేక ఐడెంటిటీ ఉంటుందని, సభాపతికి క్వాజీ జ్యుడీషియల్ అధికారాలు ఉంటాయని, స్పీకర్ జడ్జితో సమానమని పేర్కొన్నారు. ఏదైన అంశంపై విచారణ చేపట్టాలని అడిగే అధికారం స్పీకర్కు ఉంటుందని స్పష్టం చేశారు. మీకు అంత ఉలుకెందుకు? అమరావతి భూకుంభకోణాలపై విచారణ జరపాలని స్పీకర్ కోరడంతో టీడీపీ సభ్యులు సభలో గగ్గోలు చేశారు. అచ్చెన్నాయుడు తదితర టీడీపీ సభ్యులు రాద్ధాంతం సృష్టించే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ వారిమీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభాపతిగా విచారణ కోరే అధికారం తనకుందని, హద్దుమీరి టీడీపీ సభ్యులు మాట్లాడరాదని, హద్దుల్లో ఉండాలని మందలించారు. విచారణ జరిపించాలని కోరితే మీకెందుకు అంత ఉలుకు? అని టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ విచారణ కోరే అధికారం స్పీకర్కు ఉంటుందని, స్పీకర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చెప్పినవారు క్షమాపణ చెప్పాలని కోరారు. ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండటం తమ ఖర్మ అని పేర్కొన్నారు. -
ఎందుకు భయం.. విశాఖ ఏమైనా అరణ్యమా?
సాక్షి, అమరావతి: ‘విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెడతామంటే.. ప్రతిపక్ష టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు.. విశాఖపట్నం ఏమైనా అరణ్యమా?’ అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూటిగా ప్రశ్నించారు. సోమవారం శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ తీరుపై, ఎల్లో మీడియా ప్రచారంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో మావోయిస్టులు ఉన్నారని ఎల్లో మీడియాతో టీడీపీ నేతలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి గత ప్రభుత్వం అమరావతికి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. అమరావతిలో జరిగింది రాజధాని నిర్మాణామా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం 1600 ఎకరాల భూములను 125 ఆర్గనైజేషన్లకు కేటాయించిందని, 1300 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలకు ఒకవిధంగా, ప్రైవేటు సంస్థలకు మరోవిధంగా భూకేటాయింపులు జరిపి.. అనేక అవకతవకలకు పాల్పడిందని విమర్శించారు. అమరావతిలోని భూములను టీడీపీ స్వాహా చేసిందని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. అన్ని ప్రాంతాల మీద భారాన్ని మోపి.. అమరావతిలో తాను, తనకు చెందిన 20, 30 మంది మాత్రమే అభివృద్ధి చెందాలని చంద్రబాబు చూస్తున్నారని, అందుకే అమరావతిలోని భూములన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దుర్భరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని,అనంతపురం జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుందని, వానల కోసం అక్కడి ప్రజలు కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారని తెలిపారు. అనంతపురంలోని దుర్భర కరువు పరిస్థితులను చూసి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కంటతడి పెట్టారని, ఇక్కడి ప్రజలకు కనీసం గంజి కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని సూచించారని గుర్తు చేశారు. ఇక, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఎక్కువగా వలసలు చోటుచేసుకుంటున్నాయని, అక్కడ బతుకుదెరువు లేక, చేసుకోవడానికి పనిలేక అక్కడి ప్రజలు వలస వెళుతున్నారని, శ్రీకాకుళం మత్య్సకారులు పాకిస్థాన్లో పట్టుబడితే.. సీఎం జగన్ కల్పించుకొని వారిని విడిపించి.. ఇక్కడికి తీసుకొచ్చారని, వారికి ఐదు లక్షల చొప్పున సీఎం ఆర్థికసాయం అందించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తమ ప్రభుత్వం రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోదని బుగ్గన స్పష్టం చేశారు. వందేళ్ల తప్పులను సరిదిద్దాలనుకుంటున్నామని, ఐదేళ్లది కాదని తెలిపారు. ప్రజానామస్మరణ చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకెళుతున్నారని చెప్పారు. -
భూముల బండారం బయటపెట్టిన బుగ్గన
సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు దోచుకున్న భూముల వివరాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా ఆయన బట్టబయలు చేశారు. రాజధాని ప్రకటన ముందు చంద్రబాబు నాయుడు అక్రమంగా భూములు కొనుగోలు చేసేందుకు తొలుత గుంటూరు, ఆ తరువాత నూజివీడును రాజధానిగా ప్రచారం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. (మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!) ఈ క్రమంలోనే టీడీపీ నేతలు 4070 ఎకరాల భూములను అక్రమంగా కొనుగోలు చేసినట్లు మంత్రి సభలో వివరించారు. ఇన్సైడర్ ట్రేడింగ్తో పాటు రాజ్యాంగ్నాన్నీ ఉల్లంఘించారని విమర్శించారు. వికేంద్రీకరణ బిల్లుపై చర్చలో భాగంగా.. అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు అక్రమంగా కొనుగోలు చేసిన భూముల వివరాలను మంత్రి బుగ్గన సభలో చదవి వినిపించారు. (అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా?) ‘కంతేరులో హెరిటేజ్ పేరుతో 15 ఎకరాలను అక్రమంగా కొనుగోలు చేశారు. తుళ్లురులో టీడీపీకి చెందిన ముఖ్యనేత దినకర్ భూములను కొన్నారు. వేమురి రవికుమార్ కుటుంబ సభ్యులుపై కూడా అమరావతి ప్రాంతంలో భూమలు ఉన్నాయి. జీవీఎస్ ఆంజనేయులు 40 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. పయ్యవుల కేశవ్, ధుళీపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్రావులకూ భూములున్నాయి. యనమల రామకృష్ణుడు వియ్యంకుడికి తాడికొండలో భూములు ఉన్నాయి. టీడీపీ నేతలకు చెందిన బినామీలు కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలుకు పాల్పడ్డారు. నారా లోకేష్కు చెందిన బినామీలు వందల ఎకరాల్లో భూములు దోచుకున్నారు. బుచ్చయ్య చౌదరి, మురళీమోహన్ బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేశారు. లంక భూములు, పోరంబోకు, అసైన్డ్ భూముల్లో ప్లాట్లు తీసుకున్నారు. సుజనా చౌదరి, దమ్మలపాటి శ్రీధర్లు కూడా అక్రమంగా ప్రభుత్వ భూములను కొన్నారు. ఇంత వీరిలో పాటు అనేకమంది టీడీపీ నేతలు 40 వేల కోట్ల కుంభకోణం చేశారు. (సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స) అమరావతి ప్రాంతంలో 1600 ఎకరాల భూములను 125 ఆర్గనైజేషన్లకు కేటాయించారు. 1300 ఎకరాలను ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఎకరాకు రూ.4 కోట్ల చొప్పున అప్పగించారు. ప్రైవేటు సంస్థలకు మాత్రం ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారు. రాజధాని పేరు చెప్పి అన్ని భూములను టీడీపీ నేతలు స్వాహా చేశారు. ఇంత స్కామ్లో అమరావతిని రాజధానిగా కట్టాలంటారా?. వ్యాపార ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అమరావతిని చేపట్టారు. అమాయకులను బెదిరించి భూములు లాక్కున్నారు. అమరావతిలో జరిగింది రాజధాని నిర్మాణామా? లేక రియల్ ఎస్టేట్ వ్యాపారమా?. ’ అని అన్నారు. చదవండి: రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో.. -
అప్పుల్లో.. అమరావతి నిర్మించగలమా?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో శివరామకృష్ణ కమిటీ పర్యటనలో ఉండగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నారాయణ కమిటీని వేసిందని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ నివేదికను గత ప్రభుత్వం కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అన్ని కమిటీల నివేదికలను పరిశీలించిన తరువాతనే అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా పట్టాణాభివృద్ధిలో పీహెచ్డీలు చేసిన వారిని కమిటీలో సభ్యులుగా నియమించామని సభలో తెలిపారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రసంగించారు. (అసెంబ్లీ ముందుకు వికేంద్రీకరణ బిల్లు) ‘విభజన అనంతరం ఏపీ ఆదాయం తక్కువగా ఉందని, అప్పులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. వరద వస్తే 70 శాతం అమరావతి మునిగిపోయే అవకాశం ఉందని, దూర ప్రాంతాల నుంచి ప్రజలు అమరావతికి రాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నాం. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని మూడు కమిటీలూ తేల్చిచెప్పాయి. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్తో చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టారు. వ్యవసాయం మీద మన రాష్ట్రం ఆధారపడి ఉంది. ఐదేళ్లలో 66 వేలకోట్లు రెవిన్యూ లోటు వచ్చింది. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గొప్ప నగరాలు నిర్మించగలమా?. భావితరాలు నష్టపోయే విధంగా గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది’ అని అన్నారు. చదవండి: (ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు) సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స చంద్రబాబు విజన్ 2020 గుట్టువిప్పిన రోజా.. -
పోలీసులపై రాళ్లు.. దయచేసి వెళ్లిపోండి!
సాక్షి, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అమరావతి జేఏసీ, టీడీపీలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. చలో అసెంబ్లీ, ముట్టడి వంటి కార్యక్రమాలకు ఎలాంటి అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ ఆందోళనకారులు.. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. మందడం పొలాల్లో నుంచి సచివాలయం వెళ్లే దారి గుండా ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో గ్రామాల్లోకి వెళ్లి నిరసన తెలుపుకోవాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని పోలీసులు విఙ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ... ‘దయచేసి వెళ్లిపోండి. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించవద్దు’ అని ఆందోళనకారులను వేడుకున్నారు. ఇదిలా ఉండగా.. పచ్చ మీడియా మాత్రం ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. వివాదాన్ని పెద్దది చేసేందకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక ఈ ఘటనలో పలువురు పోలీసు సిబ్బంది గాయాలపాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.(అనుమతి లేదు... భద్రత కట్టుదిట్టం) అసెంబ్లీ ముట్టడికి టీడీపీ శ్రేణుల విఫలయత్నం అసెంబ్లీ ముట్టడికి టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఆందోళనకారులు రాళ్లు విసిరి పోలీసులను గాయపరిచారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం సంయమనంతో వ్యవహరించి టీడీపీ శ్రేణులు ప్రయత్నాన్ని తిప్పికొట్టారు. దీంతో పోలీసు వలయాన్ని ఛేదించలేక ఆందోళనకారులు వెనుదిరిగారు. కాగా సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల సూచనల మేరకు అసెంబ్లీతో పాటు ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు ప్రయాణించే మార్గాల్లో చెక్పోస్టులు, అవసరమైన చోట మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్ని రెండ్రోజుల ముందునుంచే బాంబ్స్క్వాడ్ బృందాలతో జల్లెడ పట్టిన పోలీసులు,. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఖరారు చేశారు. -
సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన బొత్స
సాక్షి, అమరావతి : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సీఆర్డీఏ రద్దు బిల్లును మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. అలాగే అమరావతి అథారిటీ బిల్లును కూడా ఆయన సభ ముందు ఉంచారు. అంతకుముందు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని, కర్నూలును న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. విశాఖలోనే రాజ్భవన్, సెక్రటేరియట్ ఉంటుందన్నారు. అదే విధంగా కర్నూలులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్లు బుగ్గన ప్రకటించారు. అమరావతి మెట్రోపాలిటన్రీజియర్ అథారిటీ ఏర్పాటుకు సంకల్పించామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అన్ని కమిటీల నివేదికలను పరిశీలించిన తరువాతనే అభివృద్ధి వికేంద్రీకరణ జరపాలని నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు. బిల్లు ఎంతో చారిత్రాత్మకం సభలో వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఎంతో చారిత్రాత్మకం అన్నారు. ‘రాష్ట్ర అభివృద్ధి కోసమే ఈ బిల్లును రూపొందించాం. సమ్మిళిత అభివృద్ధి మన బాధ్యత. రాజ్యాంగం తమపై పెట్టిన బాధ్యతను నెరవేరుస్తున్నాం. స్థానిక జోన్లను ఏర్పాటు చేస్తాం. ప్రాంతీయ మండళ్లనూ ఏర్పాటు చేస్తాం. ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మండళ్లపై ఉంటుంది. ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రచించాం. దీనిలో భాగంగానే శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలులో ఏర్పాటు చేయదలచుకున్నాం. న్యాయపరమైన అంశాలన్నీ కర్నూలులోనే జరుగుతాయి. హైకోర్టు అనుమతి తరువాతనే వీటిని ఏర్పాటు చేస్తాం. శ్రీబాగ్ ఒప్పందంలోనే వికేంద్రీకరణ.. పన్ను కట్టే ప్రతివారికి న్యాయం జరిగితీరాలి. కృష్ణదేవరాయలు స్థానిక సంస్థలను ఎంతో అభివృద్ది చేశారు. సామాన్య ప్రజలెవరూ రాజభవనాలను కోరుకోరు. అభివృద్ధిలో సమన భాగస్వామ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆంధ్ర అనే పదం వచ్చిన తరువాతనే తెలుగు వచ్చింది. 1937లో జరిగిన శ్రీ బాగ్ ఒడంబడికలో రాయలసీమ, ఆంధ్రా అభివృద్ధికి ఒప్పందాలు జరిగాయి. రాయలసీమ వెనుకబడి ఉందని అప్పుడే గుర్తించారు. వర్షాభావ పరిస్థితుల వల్లే రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. శ్రీ బాగ్ ఒడంబడికలోనే వికేంద్రీకరణ అవసరమని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్గా మార్చొద్దు గత వందేళ్ల చరిత్రను చూస్తే అభివృద్ధి ముఖ్యమని కనిపిస్తోంది.1920లోనే తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్లో ఆంధ్ర మహాసభను పెట్టారు. ఉప ప్రాంతాలు అభివృద్ధి జరగకపోతే ఉద్యమాలు తప్పవు. తెలంగాణ ఏర్పాటు కూడా అదే కోవకు చెందుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమకు ఎక్కడా పోలిక లేదు. ఉప ప్రాంతాలకు ప్రత్యేక అవసరాలున్నాయి. ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఉప ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తెలంగాణ ఏర్పాటుపై నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అనేక అంశాలను పరిశీలించింది. ఆ కమిటీ కూడా తెలంగాణ కన్నా.. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని కమిటీ రిపోర్టులో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధానిపై నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా 13 జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలని సూచించింది. ఒకే నగరాన్ని అభివృద్ధి చేయవద్దని కమిటీ తెలిపింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని తేల్చిచెప్పింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు వ్యవసాయానికి అత్యంత అనుకూలమని కమిటీ అభిప్రాయపడింది. వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్గా మార్చవద్దని కూడా సూచించింది. జియలాజికల్ సర్వే కూడా పెద్ద పెద్ద భవనాలు, కట్టడాలు నిర్శించవద్దని కమిటీ తెలిపింది. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పింది’ అని అన్నారు. -
పచ్చ మీడియాతో పక్కదారి పట్టించే యత్నం...
సాక్షి, అమరావతి: రైతుల ముసుగులో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య ధ్వజమెత్తారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. చంద్రబాబు ఎవరినైనా మోసం చేయగలననే పేటెంట్ హక్కు కలిగి ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మోసాలు ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేస్తున్నారని.. చంద్రబాబు ఏనాడు రైతు సంక్షేమం గురించి ఆలోచించ లేదన్నారు. గత టీడీపీ పాలనలో రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబాటులో ఉందని.. అమ్మ ఒడి పథకాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. పచ్చ మీడియా తో రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వికేంద్రీకరణను ప్రజలు స్వాగతిస్తున్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ చేస్తోన్న కృషిని ప్రజలు స్వాగతిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తపా తెలిపారు. ప్రజల మద్దతు సీఎం వైఎస్ జగన్కు ఉందన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు.. సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ అన్నారు. టీడీపీ నేతలు అమరావతి పేరుతో బాగుపడ్డారని విమర్శించారు. అమరావతికి సరైన సౌకర్యాలు లేవన్నారు. కనీసం రోడ్లు కూడా లేవని మండిపడ్డారు. మూడు ప్రాంతాల్లో అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడుం బిగిస్తున్నారని పేర్కొన్నారు. పాదయాత్రలో నాడు ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు.. అభివృద్ధి, సంక్షేమాన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రాకుండా ఉండాలనే ఆలోచనతో సీఎం జగన్ అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.ఏపీలో ప్రజారంజక పాలన జరుగుతోందని.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చట్టం తీసుకురాబోతున్నారని తెలిపారు. ఐదు సంవత్సరాల చంద్రబాబు ఏలుబడిలో ఐదు పకడ్బందీ రాళ్లు కూడా వేయలేదని.. వర్షం వస్తే సచివాలయంలో తడిసిపోవాల్సిన పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న మంచి నిర్ణయాలను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. కుయుక్తులు, కుట్రలు, అరాచకశక్తులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. రైతులను సీఎం జగన్ ఆదుకుంటారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. -
ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తదితర అంశాలపై చర్చించేందుకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రిమండలి పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. మంత్రిమండలి ఆమోదముద్ర వేసిన అంశాలపై ప్రస్తుత శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో చర్చించనుంది. సభ చర్చించాల్సిన అంశాల ఎజెండాతో పాటు సమావేశాల నిర్వహణపై స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమైంది. బీఏసీ అనంతరం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బీఏసీ నిర్ణయం తీసుకుంది. అలాగే వీటిపై సుదీర్ఘంగా చర్చించేందుకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ వంటి ప్రతిపాదిత అంశాలను బీఏసీలో టీడీపీ వ్యతిరేకించినట్లు తెలిసింది. రాష్ట్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తారా..? అని టీడీపీపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. (హై పవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం) -
హై పవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం
అమరావతి: హై పవర్ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమైన మంత్రిమండలి భేటీ పలు కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి శాసనసభలో ప్రతిపాదించే బిల్లుపై చర్చించి ఆమోదముద్ర వేసింది. అలాగే రాజధాని రైతులకు చెల్లిస్తున్న పరిహారానికి సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే పరిహారాన్ని పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రైతులకు చెల్లిస్తున్న పరిహారం రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచడాన్ని మంత్రిమండలి ఆమోదించింది. అలాగే, పరిహారం చెల్లింపు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సీఆర్డీఏను అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయాలు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ రూ.2500 నుంచి 5వేలకు పరిహారం పెంపు భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్లకు పెంపు శాసన రాజధానిగా అమరావతి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం మంత్రివర్గం భేటీ అనంతరం స్పీకర్ అధ్యక్షతన జరిగిన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, ఇక టీడీపీ తరఫున ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు. మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం జరిగింది. కాగా సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. చదవండి: సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అమరావతికి అన్నీ ప్రతికూలతలే మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు అమరావతిలో అలజడికి కుట్రలు.. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయం -
చంద్రబాబు విజన్ 2020 గుట్టువిప్పిన రోజా..
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి అనే భ్రమలో ప్రజలను మోసంచేసి కేవలం గ్రాఫిక్స్తోనే ఐదేళ్లు కాలంగడిపారని మండిపడ్డారు. చంద్రబాబు విజన్ 2020 ఏంటో అమరావతి కుంభకోణంతోనే తేటతెల్లమైందని రోజా అన్నారు. చంద్రబాబుది 420 విజన్ అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన చట్టసభలను అడ్డుకోవడం, అల్లర్లు సృష్టించడమే చంద్రబాబు విజనా? అని ఆమె ప్రశ్నించారు. కేవలం 20 మంది శాసనసభ్యులతో.. 20 గ్రామాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలో వేలకోట్ల ఖర్చుపెట్టినా తన కుమారుడు నారా లోకేష్ను గెలిపించుకోలేకపోయారని, ఇంతకంటే రెఫరెండమ్ ఇంకేముంటుందని వ్యాఖ్యానించారు. సీఎంగా ఉండి అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షనేతనా లేక పనికిమాలిన నేతనా అని రోజా నిలదీశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందకు రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు. జీఎన్రావు, బీసీజీ కమిటీలపై లోకేష్ అసభ్యకరంగా మాట్లాడారు. రాజధానిపై టీడీపీ నేతలు సిగ్గులేకుండా అసత్యాలు మాట్లాడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు రాయలసీమకు చేసింది ఏమీలేదు. రాయలసీమ ద్రోహి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబు, టీడీపీకి పుట్టగతులు లేకుండాపోతాయి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు వెళ్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుని, 40 ఏళ్ల సీఎం జగన్ అడుక్కునే గతిపట్టించారు. ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి వికేంద్రీకరణ జరుపుతున్నాం. ప్రజల రాజధానిని నిర్మిస్తాం’ అని అన్నారు. -
సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సోమవారం ఉదయం సమావేశమైంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నబిల్లులు, అంశాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై హై పవర్ కమిటీ సిఫార్సుపై ప్రజెంటేషన్ ఉంటుంది. కాగా రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ, ఇటీవల జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ నివేదికలు ఇచ్చిన విషయం విదితమే. ఈ కమిటీల నివేదికలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్ కమిటీ పలుమార్లు సమావేశమై విస్తృతంగా చర్చించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్తోనూ సమావేశమై.. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలను వివరించింది. ఈ మేరకు 130 పేజీల సమగ్ర నివేదిక ఇచ్చింది. ఇదే విషయమై క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గ సభ్యులందరికీ హై పవర్ కమిటీ.. ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అనంతరం ఉదయం 10 గంటలకు శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) భేటీలో అజెండా ఖరారు కానుంది. ఇక ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయి. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలలో అభివృద్ధి, పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులపై చర్చ జరగనుంది. చదవండి: అమరావతికి అన్నీ ప్రతికూలతలే మూడు కమిటీలూ వికేంద్రీకరణకే ఓటు అమరావతిలో అలజడికి కుట్రలు.. మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే ధ్యేయం -
కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి సోమవారం అసెంబ్లీ వేదిక కానుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిందేనని, ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం.. మరో వైపు మూడు గ్రామాల ప్రజలు మాత్రం అన్నీ అమరావతి కేంద్రంగానే ఉండాలని పట్టుపట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర, సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసేందుకు వీలుగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మకమైన బిల్లును ప్రతిపాదించనుందని తెలుస్తోంది. ఈ మేరకు నేటి నుంచి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై అధ్యయనం చేసి, హైపవర్ కమిటీ రూపొందించిన నివేదిక గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న బిల్లులు, చర్చకు వచ్చే అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను చేరవేయడం.. తదితర అంశాలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణం, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించే అంశంపై కూడా ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. అనంతరం 10 గంటలకు శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో అజెండా ఖరారు చేయనున్నారు. 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అన్ని కమిటీలు అదే చెప్పాయి.. రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ, ఇటీవల జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్.. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ నివేదికలు ఇచ్చాయి. అది జరగాలంటే పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే మార్గమని సూచించాయి. ఈ కమిటీల నివేదికలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ పలుమార్లు సమావేశమై విస్తృతంగా చర్చించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనూ సమావేశమై.. తమ పరిశీలనలో వెల్లడైన అంశాలను వివరించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై నేటి క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గ సభ్యులందరికీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్తు సమాచారం. సమగ్రాభివృద్ధే లక్ష్యం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖపట్టణాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రతిపాదిస్తూ వివిధ కమిటీలు, నిపుణుల సూచనల మేరకు అసెంబ్లీలో సమగ్ర చర్చ చేపట్టనున్నట్లు సమాచారం. ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. జిల్లాల వారీగా ప్రజల ఆకాంక్షల మేరకు చేపట్టనున్న అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, తదితర వెనుకబడిన జిల్లాల్లో సాగునీటి సౌకర్యం, ఇతరత్రా మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో అన్ని ప్రాంతాల ప్రజల కష్టాలను స్వయంగా చూశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రజలందరి ఆకాంక్షలు, కోరిక మేరకు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తోంది. కాగా, సీఆర్డీఏకు బదులుగా అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(ఏఎంఆర్డీఏ)ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని సమాచారం. ఈ విషయం కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. నేటి కార్యక్రమాలు ఇలా.. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులు, అంశాలపై చర్చ హైపవర్ కమిటీ చేసిన సిఫార్సులపై ప్రజెంటేషన్ ఉదయం 10 గంటలకు శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం. అజెండా ఖరారు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అభివృద్ధి, పాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులపై చర్చ -
ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి : ఈ నెల 20 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే 21 వ తేదీ నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి (ఇంచార్జీ) సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. ఈ రెండు కమిటీలపై ఇప్పటికే ఏర్పాటైన హైపవర్ కమిటీ తన నివేదికను సభలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ చేపట్టనున్నట్టు తెలిసింది. -
20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి : ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, 21న శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. పరిస్థితులను బట్టి శాసనసభ మరో రోజు అదనంగా 21న కూడా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. మండలి సమావేశం మాత్రం ఒకే రోజుతో ముగిస్తారు. రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెడుతుంది. ఈ రెండు కమిటీలపై ఇప్పటికే ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదికను కూడా ప్రవేశ పెడతారు. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది. ఇప్పటికే తమకు అందిన రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ దశల వారీగా సమగ్ర కసరత్తు చేస్తున్న విషయం విదితమే. -
హిందుత్వని విడిచిపెట్టను
ముంబై: హిందుత్వ ఎజెండాను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆదివారం ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరుని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సభనుద్దేశించి మాట్లాడారు. ‘‘హిందుత్వ భావజాలాన్ని నేను విడిచిపెట్టలేను. నా నుంచి ఎవరూ దానిని దూరం చేయలేరు‘‘అని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమంలో లౌకికవాదాన్ని అమలు చేస్తామని ప్రకటించిన రెండు, మూడు రోజుల్లోనే ఠాక్రే అసెంబ్లీ సాక్షిగా హిందూత్వపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘హిందు త్వని నిన్న అనుసరించాను. ఇవాళ అనుసరిస్తున్నాను. రేపు కూడా అనుసరిస్తాను’అని చెప్పారు. అర్ధరాత్రి ఏమీ చెయ్యను ఫడ్నవీస్పై కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఠాక్రే ప్రసంగం సాగింది. ఎన్నికలకు ముందు ఫడ్నవీస్ మళ్లీ నేనే వస్తా అన్న నినాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ‘నేను ఎప్పుడూ మళ్లీ వస్తానని చెప్పలేదు. కానీ ఈ సభకు వచ్చాను. మహారాష్ట్ర ప్రజలకి, ఈ సభకి నేను ఒక హామీ ఇస్తున్నాను. రాత్రికి రాత్రి ఏమీ చెయ్యను’ అంటూ ఫడ్నవీస్పై సెటైర్లు వేశారు. బీజేపీ–శివసేన మధ్య చీలికలు తేవడానికి ఫడ్నవీస్ ప్రయత్నించి ఉండకపోతే, తాను సీఎంగా గద్దెనెక్కేవాడిని కాదని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ 25 ఏళ్లుగా తనకు మంచి మిత్రుడని, ఎప్పటికీ స్నేహితుడిగానే ఉంటారని చెప్పారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. స్పీకర్గా రైతు బిడ్డ మహారాష్ట్ర అసెంబ్లీలో అనూహ్యంగా బీజేపీ స్పీకర్ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికయ్యారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి కిసాన్ కఠోర్ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవడంతో పటోలె స్పీకర్గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సె పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేలు పటోలెను సాదరంగా తోడ్కొని వచ్చి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. ఒకప్పుడు రైతు నాయకుడిగా పటోలె విశిష్టమైన సేవలు అందించారు. రైతు గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి స్పీకర్ పదవిని అందుకోవడం హర్షణీయమని ఠాక్రే వ్యాఖ్యానించారు. స్పీకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగించడానికే రేసు నుంచి తప్పుకున్నట్టు బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. నానా పటోలె 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. కానీ ప్రధాని మోదీ, దేవేంద్ర ఫడ్నవీస్లతో విభేదాల కారణంగా 2017లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. విదర్భ ప్రాంతంలోని సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పటోలె ఇటీవల ఎన్నికయ్యారు. -
18న శాసనసభ..19న మండలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం శాసనసభ, శాసన మండలి ప్రత్యేక సమావేశాలను ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించాలని సీఎం కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఉదయం 11 గంటలకు శాసనసభ, 19న మధ్యాహ్నం 2 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174లోని ఒకటో నిబంధన ప్రకారం గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలు కేవలం మున్సిపల్ బిల్లును ఆమోదించేందుకు మాత్రమే ఏర్పాటు చేసినట్లు సీఎం కార్యాలయం రెండురోజుల క్రితం స్పష్డం చేసింది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ వంటి ప్రొసీడింగ్లతో సంబంధం లేకుండా కేవలం ఎజెండాకు మాత్రమే సమావేశాలు పరిమితం అవుతాయి. మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మున్సిపల్ బిల్లుకు తుదిరూపం ఇచ్చేందుకు అవసరమైన ముసాయిదాను ప్రభుత్వం ఇది వరకే న్యాయశాఖకు పంపింది. -
అరుణాచల్ గవర్నర్ తొలగింపునకు సర్వం సిద్ధం
-
అరుణాచల్ గవర్నర్ తొలగింపునకు సర్వం సిద్ధం
గువాహటి: పదవినుంచి తప్పుకోవాలన్న కేంద్రం చేసిన సూచనను వ్యతిరేకించిన అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్ఖోవాను తప్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. బుధవారం నుంచి రెండ్రోజుల పాటు సమావేశం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల (జీఎస్టీ ఆమోదానికి) తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటివరకు ఆయనే గవర్నర్గా ఉంటారు. అనారోగ్యం తో బాధపడుతున్న జ్యోతిప్రసాద్ ఆగస్టు 13 నుంచి తిరిగి విధుల్లో చేరారు. దీంతో తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నందున రాజీనామా చేయాలని ఓ కేంద్ర మంత్రి ద్వారా గవర్నర్కు సందేశం వచ్చింది. దీనిపై అధికారికంగా సమాచారమేమీ లేనప్పటికీ.. తనను తప్పుకోమనటం అవమానకరమని, ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనా మా చేసే ప్రసక్తే లేదని గవర్నర్ తెలిపారు. రాష్ట్రపతి చెబితే తప్ప తప్పుకునే ప్రసక్తే లేదని, తన తప్పేంటో చెప్పాలన్నారు.