banjarahills
-
ఐసీసీసీలోకి గుర్తుతెలియని వ్యక్తి.. అలా ఎలా వెళ్లాడబ్బా!
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)కు ఇటీవల కాలంలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy), ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలకు హాజరవుతున్నారు. ఇంతటి కీలకమైన ఐసీసీసీలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి.. టాస్క్ఫోర్స్ పోలీసునంటూ తిరగడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం అయింది.ఐసీసీసీలోకి ఎవరు వెళ్లాలన్నా చెకింగ్ పాయింట్లో అన్ని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు (identity card) కూడా చూపించాలి. ఎవరిని కలవాలో చెప్పాలి. నకిలీ టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ ఐసీసీసీలోకి మూడుసార్లు వెళ్లి రావడం పట్ల పోలీసులు ఆరా తీస్తున్నారు. లోపలికి ఎలా వచ్చాడు ఎవరిని కలిశాడు, ఏం చెప్పి వచ్చాడు అన్నదానిపై ఉన్నతాధికారులు, నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.కూకట్పల్లికి చెందిన జ్ఞాన సాయి ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్లో కలుసుకున్న నకిలీ టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్.. తన పేరు హరిజన గోవర్ధన్గా పరిచయం చేసుకొని హోటల్ బిజినెస్లో లాభాలు వస్తాయంటూ రూ.2.82 లక్షలు వసూలు చేశాడు. మూడు విడతలుగా ఇదే హోటల్లో బాధితుడు చెల్లించడం జరిగింది. ఈ మూడుసార్లు నిందితుడు హరిజన గోవర్దన్ ఐసీసీసీ (ICCC) నుంచి బయటికి వచ్చి బాధితుడిని నమ్మించాడు. బాధితుడు కూడా నేరుగా కమాండ్ కంట్రోల్సెంటర్ (command and control centre) నుంచి సదరు వ్యక్తి వస్తుండటంతో అందులో పని చేస్తున్న వ్యక్తిగానే భావించాడు. ఇక్కడే బాధితుడు దెబ్బతిన్నాడు. అడిగినంత డబ్బు చెల్లించుకొని తీరా మోసపోయిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐసీసీసీలో సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితుడు మూడుసార్లు రావడం పోలీసులు గుర్తించారు.చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండిఇంతటి కీలకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి అది కూడా సీఎం రోజూ హాజరవుతున్న ప్రాంతంలోకి నకిలీ పోలీసు వెళ్ళడం దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికకారులు లోతుగా విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. గతంలో నిందితుడు ఇలాంటి మోసాలకు పాల్పడి ఉంటాడా.. అనే కోణంలో కూడా పాత నేరస్తుల కదలికలపై దృష్టి పెట్టారు. మొన్నటికి మొన్న సచివాలయంలో నకిలీ అధికారులు సంచలనం సృష్టించగా తాజాగా సీఎం సమీక్షలకు వస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. -
HYD: బంజారాహిల్స్లో పోర్షే కారు బీభత్సం
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం -
ప్రాణం తీసిన మోమోస్..
-
Hyderabad: పటోలా ఆర్ట్స్.. వస్త్ర ప్రదర్శన ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్లోని లేబుల్స్ పాప్–అప్ స్పేస్ వేదికగా కొలువుదీరిన ’డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన’ను ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ప్రారంభించారు. విభిన్నమైన హ్యాండ్లూమ్ చీరలతోపాటు పటోలా ఆర్ట్ చీరలు, డిజైనర్ వేర్ వ్రస్తోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు. వస్త్ర ఉత్పత్తులను ఫ్యాషన్ప్రియులకు నేరుగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు.డి సన్స్ పటోలా ఆర్ట్స్ ఎక్స్పో నిర్వాహకులు భవిన్ మక్వానా మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు మంచి మార్కెట్ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ లక్ష్యమని వివరించారు. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో రాజ్కోట, పటోలా దుపట్టా, పటోలా శాలువాలు, సింగిల్ పటాన్ చీరలు, సింగిల్ పటోలా దుప్పట, పటాన్ పటోలా చీరలు, సిల్క్ టిష్యూ పటోలా వంటి 2 వేల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.35 మంది కళాకారులు.. 70 చిత్రాలు!– ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైన చిత్రప్రదర్శనమాదాపూర్: కళాకారులు వేసిన చిత్రాలు సందేశాత్మకంగా ఉన్నాయని తెలంగాణ టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీప్రసాద్ అన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్గ్యాలరీలో సోమవారం ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను ఆమె ప్రారంభించారు.మున్ముందు చిత్రకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. 35 మంది కళాకారులు వేసిన 70 పెయింటింగ్ చిత్రాలు అందుబాటులో ఉన్నాయని ఈ నెల 25వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె.లక్షి్మ, టూరిజం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. ప్రకాశ్రెడ్డి, టూరిజం డైరెక్టర్ ఇలా త్రిపాఠి, భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కళాకారులు పాల్గొన్నారు. -
జిమ్.. ఆరెంజ్ థీమ్..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రత్యేకమైన ఆరెంజ్ థీమ్తో వినూత్నంగా అనిపించే ఆరెంజ్ థియరీ ఫిట్నెస్ ఇండియా.. నగరంలో తన సెంటర్ను నెలకొల్పింది. బంజారాహిల్స్ రోడ్ నెం–7లో ఏర్పాటైన ఈ ఫిట్నెస్ సెంటర్ను నగరవాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఆదివారం బ్రాండ్ చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ దృష్టి చాబ్రియా తెలిపారు. దాదాపు 2,700 చదరపు అడుగులపైగా విస్తీర్ణంలో ఈ విశాలమైన అత్యాధునిక వ్యాయామ కేంద్రం నెలకొల్పామని, శాస్త్రీయ నేపథ్యం కలిగిన వర్కవుట్స్కి తమ బ్రాండ్ పేరొందిందని వివరించారు. మితిమీరిన శిక్షణ అవసరం లేకుండా తమ సభ్యులు ఫిట్నెస్ లక్ష్యాలు చేరుకునేలా తమ వర్కవుట్ రొటీన్ డిజైన్ చేశామన్నారు. అంతర్జాతీయ జీవన ప్రమాణాలకు నిలయమైన హైదరాబాద్లో స్థానికులకు నచ్చే వ్యక్తిగతీకరించిన వర్కవుట్ అనుభవాలను అందిస్తామన్నారు. -
బంజారాహిల్స్లో ఫర్నెస్ట్రీ..
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీకి చెందిన అత్యాధునిక ప్రీమియం ఫర్నిచర్ బ్రాండ్ ‘ఫర్నెస్ట్రీ’ హైదరాబాద్లో అడుగుపెట్టింది. బంజారాహిల్స్లో 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి ఎక్స్పీరియన్స్ స్టూడియోను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫర్నెస్ట్రీ ఫౌండర్ మాన్సీ అలెన్ మాట్లాడుతూ.. కస్టమర్లు కోరుకున్న విధంగా ప్రీమియం ఫర్నీచర్, వాల్ ఆర్ట్ వంటి గృహాలంకరణలను తయారు చేసి ఇస్తామని తెలిపారు.కస్టమర్లకు డిజైన్ కాన్సెప్్టలను విజువలైజ్ చేయడానికి ప్రత్యేకమైన కాంప్లిమెంటరీ మూడ్ బోర్డ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్టూడియోలో ఆధునిక, సంప్రదాయ హస్తకళను మిళితం చేస్తూ డైనింగ్ టేబుల్స్, స్థానిక కళాకారుల వాల్ ఆర్ట్, స్కాండినేవియన్ డిజైన్తో జపనీస్ సౌందర్యాన్ని మిళితం చేసే జపాండీ ఫ్యూజన్ ఫర్నిచర్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఇవి చదవండి: సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు.. -
బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన మూడు కార్లు
-
Meenakshi Choudhary: బంజారాహిల్స్లో సందడి చేసిన నటి మీనాక్షి చౌదరి (ఫొటోలు)
-
బంజారాహిల్స్లో బార్ & కిచెన్ని ప్రారంభించిన హీరోయిన్ లక్ష్మీ రాయ్
-
HYD: కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీలో ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీలపై ఇన్కం ట్యాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్లోని మాదన్నపేట, శాస్త్రీపురం, బంజారాహిల్స్, శంషాబాద్ సహా పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అయితే, ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో కోహినూర్ ఇన్ఫ్రా కంపెనీ అవకతవకలకు పాల్పడినట్టు ఐటీ అధికారులు ఆరోపించారు. ఏకకాలంలో 30 బృందాలతో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే సుమారు 100 వాహనాల్లో ఐటీ అధికారులు సోదాలకు తరలి వెళ్లారు. ఇది కూడా చదవండి: దుబాయ్ కేంద్రంగా చైనీయుల దందా -
ఎమ్మెల్యే కాలనీ దొంగతనం కేసు: వంట మనిషే లాకర్ దొంగ
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే రాజధాని హోటల్ యజమాని అరిహంత్ జైన్ ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును బంజారాహిల్స్ క్రైం పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు అదే ఇంట్లో పని చేస్తున్న వంట మనిషిగా గుర్తించారు. మంగళవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బంజారాహిల్స్ ఏసీపీ ఎం. సుదర్శన్, సీఐ నరేందర్, డీఐ ప్రవీణ్ కుమార్, డీఎస్ఐ మల్లికార్జున్తో కలిసి దొంగతనం వివరాలు వెల్లడించారు. రాజస్తాన్ నాగోర్ జిల్లా బేగాన మండలం గుండీసన్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్(31) రెండున్నరేళ్ళ క్రితం అరిహంత్ జైన్ ఇంట్లో వంట మనిషిగా కుదిరాడు. పక్కా ప్రణాళికతో ఈ ఇంట్లో వంటవాడిగా చేరిన చంద్రశేఖర్ ఇంటి యజమానుల కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ డబ్బు లావాదేవీలు, ఆభరణాలు ఎక్కడెక్కడ దాచి పెడతారు తదితర వివరాలు గమనిస్తూ వచ్చి రాజస్తాన్కు చెందిన తన స్నేహితుడు రామకృష్ణ అలియాస్ రామకిషన్తో ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే రామకృష్ణకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రా ద్వారా ఇంటి వివరాలను, లొకేషన్, ఆభరణాలు ఎక్కడ దాస్తారు తదితర వివరాలు చెప్పసాగాడు. ఇందులో భాగంగానే ఈ నెల 3వ తేదీన జైన్ ఇంటి వాచ్మెన్ సెలవులో ఉండటంతో ఇదే అదునుగా దొంగతనానికి ప్లాన్ వేసిన చంద్రశేఖర్ రామకృష్ణను రాజస్తాన్ నుంచి పిలిపించాడు. సాయంత్రం 6.30 గంటలకు ఆ ఇంటికి చేరుకున్న రామకృష్ణ గోడ దూకి సీసీ కెమెరాల వ్యవస్థను భగ్నం చేసి అవి రికార్డు కాకుండా చూశాడు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో మొదటి అంతస్తుకు వెళ్ళి కప్బోర్డ్లో ఉన్న లాకర్ను చంద్రశేఖర్ సాయంతో దొంగిలించి మూడో అంతస్తులో సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్న చంద్రశేఖర్ గది ముందు పెట్టి దానిపైన వేరే డబ్బాలు పెట్టి చెప్పుల స్టాండ్ అడ్డుగా పెట్టి కనిపించకుండా చేశారు. అదే రాత్రి 2.30 గంటలకు రామకృష్ణ రాజస్తాన్కు ఉడాయించాడు. ఈ నెల 4న బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. అయిదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఆ ఇంటి ముందు ఉన్న ఒక సీసీ కెమెరాలో మాత్రమే ఓ వ్యక్తి గోడ దూకి లోనికి వెళ్ళడం అదే వ్యక్తి బయటికి రావడం మాత్రం కనిపించింది. దొంగిలించిన సొత్తు బయటికి తీసుకెళ్ళలేదని నిర్ధారణకు వచ్చిన డీఐ ప్రవీణ్ కుమార్ మరింత లోతుగా విచారణ చేపట్టి అక్కడ పని చేస్తున్న 12 మందిని విచారించారు. మూడు రోజులు విచారించినా ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ మాత్రం పోలీసుల ముందుకు వస్తూనే ఏ మాత్రం బయట పడలేదు. పోలీసులకు గాలిస్తున్న సమయంలోనే లాకర్ను తెరిచేందుకు తీసుకొచ్చిన గ్యాస్ కట్టర్, ఇతర సామాగ్రి చంద్రశేఖర్ గది ముందు దొరికాయి. దీంతో ఇంటి పనిమనిషుల సాయంతోనే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని భావించి అనువనువు గాలించగా చంద్రశేఖర్ గది ముందు లాకర్ దొరికింది. తెరిచి చూడగా అందులో నగదుతో పాటు ‘ 25 లక్షల విలువ చేసే ఆభరణాలు భద్రంగా ఉన్నాయి. తన స్నేహితుడు రామకృష్ణ సాయంతో లాకర్ను దొంగిలించిన చంద్రశేఖర్ గ్యాస్ కట్టర్తో అది తెరుచుకోకపోవడంతో తన ఇంటి ముందు భద్రపరిచినట్లుగా చెప్పాడు. మరో పది రోజుల్లో రాజస్తాన్కు వెళ్ళే ప్లాన్ వేసుకున్న చంద్రశేకర్ ఆ లోపున రామకృష్ణను పిలిపించి ఇద్దరూ కలిసి ఈ లాకర్ను తీసుకెళ్ళాలని పథకం వేసి చివరికి పోలీసులకు చిక్కారు. చంద్రశేఖర్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ పరారీలో ఉన్నాడని తెలిపారు. (చదవండి: అయ్యో.. ఏమైందో ఏమో!) -
బంజారాహిల్స్లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలోనే మరో రెండు కార్లను బలంగా ఢీ కొట్టింది. ఈ సమయంలో అటుగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని బలంగా ఢీ కొట్టడంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులను భీమవరకు చెందిన ఈశ్వరి, రావులపాలెంకు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ధమాకా సినిమాకు ధమ్కీ.. దర్శకుడు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఉప్పర కులస్తులను ధమాకా సినిమా దర్శకుడు త్రినాథరావు ప్రీ రలీజ్ ఈవెంట్లో అవమానించారని వెంటనే తమ కులస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు బుధవారం ఫిలించాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాంబర్ వద్ద బైఠాయించారు. దర్శకుడు త్రినాథ్రావు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సగర ఉప్పర సంఘం ప్రతినిధులు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథ్ రావు ‘నీ ఉప్పర లొల్లి’ ఏంటి అంటూ హేళన చేశారని ఆరోపించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సాగర్, కోశాధికారి రామస్వామి, ఫిలింనగర్ అధ్యక్షుడు మధుసాగర్, ప్రధాన కార్యదర్శి నాగేష్ సాగర్, డి.రాంచందర్, చెన్నయ్య, సీతారాములు, వెంకటస్వామి, మూసాపేట్ సగర సంఘం అధ్యక్షుడు లోకేష్ సాగర్, రామకృష్ణ సాగర్, అంజయ్య నగర్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, బి.శేఖర్ పాల్గొన్నారు. -
నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు..దాదాపు 12 గంటలు తర్వాత...
‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ రాసిన అందెశ్రీ ఇది చూసి ఉంటే ‘అసలెక్కడున్నడమ్మా మనిషన్నవాడూ’ అంటూ అక్షరాలా ఆవేదన చెందకమానరు.. సాక్షి, బంజారాహిల్స్: సాటి మనిషి శవమై నడిరోడ్డుపై పడుంటే పక్కనుంచే ఏమీ పట్టనట్టు పోతున్న మనుషుల్ని చూస్తే అసలు వీరు..బతికున్నారా? అనిపించకమానదు. ఉసురు పోయినా పట్టక ఉరుకులూ పరుగులు తీస్తున్న మనిషీ ఊపిరి ఉన్నంత వరకే ఈ ‘సిరి’ అని మరిచావా అని అరవాలనిపించకమానదు. ఒక కాకి చనిపోతే వంద కాకులు గుమికూడి విలపించినట్టు హైరానా పడతాయి. కానీ మన నగరవాసి మంత్రం రెండు కిలో మీటర్ల దూరంలో ఇద్దరు వ్యక్తులు రోడ్ల పైన చచ్చిపడి ఉన్నా పట్టించుకోలేదు. ఎందుకిలా జరిగి ఉంటుందని ఆగి చూసే ఓపిక లేకుండా పోయింది. రోడ్డు పైన పడి ఉన్న శవాల పక్క నుంచే వందలాది మంది వెళ్తున్నారు తప్ప పోలీసులకో, ప్రభుత్వ యంత్రాంగానికో సమాచారం ఇద్దామనే ఆలోచన, ఓపిక కూడా లేదు. సంపన్నులు నివసించే బంజారాహిల్స్లోని బసవతారకం ఆస్పత్రివద్ద, జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్ స్కూల్ వద్ద బుధవారం రెండు గుర్తు తెలియని వ్యక్తుల శవాలు పడి ఉన్నాయి. వీరు ఎలా చనిపోయారో..ఎప్పుడు చనిపోయారో తెలియలేదు. రోడ్డుపైన, ఫుట్పాత్పైన నిద్రిస్తున్నట్లుగానే పడిపోయారు. దాదాపు 12 గంటలు గడిచాక..ఎవరో ఓ వ్యక్తి ఎట్టకేలకు వారు నిద్రించడం లేదు...చనిపోయారని గుర్తించి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈలోపే మరొకరెవరో ఆ శవంపై నుంచి వాహనాలు వెళ్లకుండా ఓ రాయిని, ఓ కర్రను అడ్డంగా పెట్టి వెళ్లిపోయాడు. ఇక వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. కనీసం ఇక్కడ విధులు నిర్వర్తించే జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఈవిషయాన్ని గుర్తించ లేదు. చివరకు మధ్యాహ్నం వేళ పోలీసులు వచ్చి..అనాథ శవాలుగా కేసు నమోదు చేసి...మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. (చదవండి: ఫాంహౌజ్ కేసు: బెయిల్పై విడుదల, ఆ వెంటనే మళ్లీ అదుపులోకి..) -
Hyderabad: రోజుకో రోడ్డు క్లోజ్!.. వాహనదారులకు చుక్కలు
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వారం క్రితం ట్రాఫిక్ పోలీసులు ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రాఫిక్ డైవర్షన్ విమర్శలకు దారి తీస్తోంది. రోజుకొక కొత్త నిర్ణయాన్ని తీసుకొస్తున్న ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ రోజు వెళ్లిన మార్గం తెల్లారేసరికి మూసేస్తున్నారు. ఆ తెల్లవారి అటు నుంచి వెళ్దామనుకుంటే మళ్లీ ‘వన్వే’గా మారుస్తున్నారు. సాక్షి, బంజారాహిల్స్: ఇలా ఇష్టానుసారంగా రోడ్లను మూసేస్తుండటం, వన్వేలో ఏర్పాటు చేస్తుండటాన్ని కేవలం వాహనదారులే కాకుండా జూబ్లీహిల్స్ కాలనీవాసులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం. 54 చట్నీస్, ఫర్జీ మీదుగా వాహనాలు రాకపోకలు సాగించాయి. ►గురువారం తెల్లవారుజామున చట్నీస్ ముందు నుంచి రోడ్ నెం. 54 వైపు వాహనాలు అనుమతించకుండా కేవలం రోడ్ నెం. 54 నుంచి రోడ్ నెం. 36 వైపు మాత్రమే వన్వేగా మార్చారు. దీంతో ఇటువైపు వెళ్లే వాహనదారులు చుట్టూ తిప్పుకొని రావాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ►ఇంకోవైపు సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జర్నలిస్టు కాలనీ, బాలకృష్ణ నివాసం చౌరస్తా మీదుగా అటు రోడ్ నెం45 వెళ్లాలన్నా, ఇటు జూబ్లీహిల్స్ చెక్పోస్టుకు వెళ్లాలన్నా గతంలో మాదిరిగానే ట్రాఫిక్ జామ్ అవుతున్నది. రోడ్ నెం. 45 ఫ్లై ఓవర్ కింద యధాప్రకారం ట్రాఫిక్ స్తంభించిపోతూ వాహనదారులను ప్రత్యక్ష నరకానికి గురి చేస్తున్నది. ►రోడ్ నెం. 45 నుంచి ఫినిక్స్ పక్కన ఉన్న రోడ్డు నుంచి, అల్లు అర్జున్ ఇంటి వైపు రోడ్డు నుంచి వాహనాలను అనుమతించకుండా రోడ్ క్లోజ్ చేశారు. దీంతో ఇక్కడ వాహనాలన్నీ బాలకృష్ణ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తాకు వెళ్లాల్సి రావడంతో ఇక్కడ రోడ్డు ఎత్తుగా ఉండటం, ఇరుకుగా ఉండటం, పుట్పాత్ లేకపోవడంతో అటు పెట్రోల్ బంక్ మరో అడ్డంకిగా మారి ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వాహనాలు స్తంభించిపోతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో స్తంభించిన ట్రాఫిక్ ►ట్రాఫిక్ ఉన్నతాధికారులు మాత్రం రోజుకొకరు చొప్పున ఈ రోడ్డును పరిశీలించడం, స్థానిక పోలీసులకు సూచనలు జారీ చేయడంతోనే సరిపెట్టుకుంటున్నారు. ►ఇప్పటిదాకా ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టిన రోడ్లలో జీహెచ్ఎంసీ ఇంజనీర్లు గుంతలను పూడ్చలేదు. రోడ్డు మరమ్మతులు చేపట్టలేదు. దెబ్బతిన్న ఫుట్పాత్లను బాగు చేయలేదు. ►విద్యుత్ అధికారులు రోడ్డుకు అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను, హైటెన్షన్ వైర్ స్తంభాలను తొలగించిన పాపాన పోలేదు. రోడ్లపక్కనే కేబుల్ వైర్లు జారిపడుతూ వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. గతంలో సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వెళ్లడానికి పది నిమిషాల సమయం పడితే ప్రస్తుతం డైవర్షన్ చేపట్టిన తర్వాత 15 నిమిషాలు పడుతున్నదని వాహనదారులే స్వయంగా ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ట్రాఫిక్ డైవర్షన్పై వాహనదారులు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రయోగాత్మకం పేరుతో తమను జూబ్లీహిల్స్ వీధులన్నీ తిప్పిస్తున్నారంటూ ట్రాఫిక్ పోలీసుల తీరును ఎండగడుతున్నారు. ►ట్విట్టర్లో ఇప్పటికే వందలాది మంది వాహనదారులు ట్రాఫిక్ డైవర్షన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నగర పోలీస్ కమిషనర్కు, నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్కు తమ బహిరంగ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ ప్రయోగం విఫలమైందంటూ ఘాటుగా చెబుతున్నారు. రోడ్లను విస్తరించకుండా... దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టకుండా... ఫుట్పాత్లను అందుబాటులోకి తీసుకురాకుండా ట్రాఫిక్ డైవర్షన్ నిర్ణయాలు తీసుకొని వాహనదారుల నెత్తిన రుద్దారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ►ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో చేపట్టిన ట్రాఫిక్ డైవర్షన్లు జూబ్లీహిల్స్లోని మిగతా రహదారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. రెసిడెన్షియల్ ఏరియాల్లో వాహనాలు స్తంభించిపోతూ అటు శబ్ధ కాలుష్యం, ఇటు వాయు కాలుష్యంతో పాటు తమకు నరకాన్ని చూపిస్తున్నాయంటూ కాలనీవాసులు గగ్గోలు పెడుతున్నారు. -
షూటింగ్ కోసం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒక్కటై..
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడని సినీ పరిశ్రమకు చెందిన ఓ హెయిర్ స్టైలిస్ట్పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని నంది నగర్లో నివాసం ఉంటున్న మహిళ సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్గా పని చేస్తోంది. 2018 లో ఆమెకు సినీ ఇండస్ట్రీలో హెయిర్ స్టైలిస్ట్గా పని చేస్తున్న మన్మధ రావు అలియాస్ మహేష్తో పరిచయం ఏర్పడింది. మన్మథ రావు ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో తాను ఇప్పటికే రేప్ కేసులో బాధితురాలిగా ఉన్నానని, తనకు కొద్ది రోజులు గడువు కావాలని కోరింది. ఆ తర్వాత షూటింగ్ నిమిత్తం నెల్లూరుకు వెళ్లిన సందర్భంలో శారీరకంగా ఒకటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా, మహేష్ ఆమెను దూరంగా పెడుతున్నాడు. ఆమె ఫోన్ నంబర్ సైతం బ్లాక్ చేశాడు. ఆదివారం మధ్యాహ్నం కృష్ణానగర్లో కనిపించిన మన్మథ రావును పెళ్లి విషయమై ప్రశ్నించగా ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఆరు నెలల క్రితమే పెళ్లి.. పక్కింటి కుర్రాడితో మాట కలిపి..) -
HYD: కరెంట్ షాక్తో కుప్పకూలితే.. కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిబద్ధతను, అంతకు మించి సమయస్ఫూర్తిని కనబరిచే ఉద్యోగులను అభినందించకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటనే నగరంలో ఒకటి జరిగింది. కరెంట్ షాక్తో కుప్పకూలిన ఓ వ్యక్తి ప్రాణాల్ని.. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్1లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ ట్రాఫిక్ పీఎస్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు శంకర్. డ్యూటీలో ఉండగా.. రోడ్ నెంబర్ 1లోని జీవీకే హౌజ్ మెయిన్ గేట్ ముందర ఓ వ్యక్తి కరెంట్ షాక్తో పడిపోయాడని సమాచారం అందుకున్నాడు. కరెంట్ బాక్స్కి చెయ్యి తగిలి అతను షాక్కి గురయ్యాడు.దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసి అతన్ని కాపాడాడు శంకర్. ఆపై ఆంబులెన్స్లో అతన్ని ఆస్పత్రికి తరలించారు సిబ్బంది. ఒక ప్రాణం కాపాడిన శంకర్ అక్కడున్న వాళ్లతో పాటు అధికారులు సైతం అభినందిస్తున్నారు. -
Hyderabad: నేను డిప్యూటీ సీఎం అయ్యాక అంతు చూస్తా...
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కోరె నందుకుమార్ అలియాస్ నందుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మరో చీటింగ్ కేసు నమోదైంది. వ్యవసాయ భూమికి సంబంధించి కమీషన్ కోసం తనను బెదిరించడమే కాకుండా అంతు చూస్తానంటూ హెచ్చరించాడని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యా పారి ఎస్.సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ భూమి లావాదేవీలకు సంబంధించి రూ.21 లక్షలు నందుకుమార్కు ఇచ్చామని ఈ విషయంలోనే పలుమార్లు తనను బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. త్వరలోనే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అప్పుడు తాను డిప్యూటీ చీఫ్ మినిష్టర్ను అవుతానని, పరిగి సమీపంలోని దోమ మండలం భూంపల్లి గ్రామంలో 12 ఎకరాల స్థలం తన పేరు మీద రాయకపోతే అంతు చూస్తానని బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు) -
Hyderabad: పవన్ కల్యాణ్ బౌన్సర్లతో గొడవ; యువకుల అరెస్ట్
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్నెం. 35లోని తబలారసా హోటల్లో అర్ధరాత్రి విందు ముగించుకొని ఇద్దరు యువకులు కారులో బయల్దేరారు. పక్కనే ఉన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారు ఆపగా పక్కకు తొలగించాలని చెప్పిన బౌన్సర్లపై దుర్భాషలాడారు. బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఆ యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీరాంనగర్కు చెందిన చిట్నేని సాయికృష్ణ చౌదరి(32), జవహర్నగర్కు చెందిన చిట్నేని విజయ్ ఆదిత్య(27)లు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి తబలా రసా హోటల్కు విందుకు వచ్చారు. అర్ధరాత్రి 12 గంటలకు విందు ముగించుకొని బయటికి వచ్చిన వీరు కారును పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఆపారు. ఇదేమిటని బౌన్సర్లు వెంకటేష్, రాకేష్ ప్రశ్నించి అక్కడి నుంచి తొలగించాలని కోరారు. దీంతో సాయికృష్ణ, విజయ్ ఆదిత్య ఇద్దరూ బౌన్సర్లపై గొడవకు దిగారు. తీవ్ర వాగ్వాదం జరిగింది. చెయ్యి చేసుకునేదాకా వెళ్లడంతో ఉధ్రిక్తత ఏర్పడింది. దీంతో బౌన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీలతో పాటు కారు నెంబర్ ఆధారంగా సాయికృష్ణ, విజయ్ ఆదిత్యలను అదుపులోకి తీసుకొని వీరిపై ఐపీసీ సెక్షన్ 341, 323, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. చదవండి: (పవన్కళ్యాణ్ని అనుసరిస్తున్న అనుమానాస్పద వాహనాలు) -
హెచ్ఎం చనువుతో.. టీచర్గా మారిన డ్రైవర్
సాక్షి, బంజారాహిల్స్: డ్రైవర్గా ఉండాల్సిన వ్యక్తి సదరు స్కూల్ హెచ్ఎం ఇచ్చిన చనువుతో ఏకంగా టీచర్గా మారాడు. ప్రతిరోజూ ఎల్కేజీ విద్యార్థులకు హాజరు తీసుకోవడంతో పాటు క్లాస్లు కూడా చెప్పేవాడు. ఇదే చనువుతో ఎల్కేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన ఘటనలో ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రోడ్ నెం. 14 డీఏవీ పబ్లిక్ స్కూల్లో అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రజనీకుమార్, హెచ్ఎం మాధవిల కస్టడీ మంగళవారంతో ముగిసింది. వీరిని బుధవారం తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. కస్టడీ విచారణలో పోలీసులు పలు విషయాలను రాబట్టారు. నిందితుడు రజనీకుమార్ పాఠశాలలో అన్ని తానై వ్యవహరించడమే కాకుండా ఏకంగా క్లాస్ తీసుకునేవాడని విచారణలో తేలింది. ప్రతిరోజూ ఓ క్లాస్ తీసుకోవడమే కాకుండా చిన్నారుల హాజరును కూడా నమోదు చేసేవాడని గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాల వ్యవస్థ మొత్తం ఆయన పర్యవేక్షణలోనే ఉండటంతో తన అక్రమాలు వెలుగు చూడకుండా కొన్ని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన విషయాన్ని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. కొందరు టీచర్లు నిందితుడిపై ఫిర్యాదు చేసినా హెచ్ఎం మాధవి నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం కూడా విచారణలో వెలుగు చూసింది. పాఠశాలలో ఏదైనా కార్యక్రమం జరిగితే తల్లిదండ్రులు డబ్బులను నేరుగా నిందితుడి అకౌంట్లోకే పంపించేవారని పోలీసులు గుర్తించారు. డ్రైవర్గా ఉండాల్సిన నిందితుడు టీచర్ అవతారం ఎత్తడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. స్కూల్లో ఇష్టారాజ్యం నెలకొనడం, క్రమ శిక్షణ లేకపోవడం ఇవన్నీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధవి నిర్వాకంతోనే జరిగినట్లుగా తేలింది. -
మొదటి ప్రియుడిపై హత్యాయత్నం.. టీవీ సీరియల్ నటి అరెస్టు
సాక్షి, బంజారాహిల్స్: టీవీ సీరియల్స్లో జరిగే ట్విస్ట్లను నిజ జీవితంలో కూడా ఆ టీవీ సీరియల్ నటులు చూపించారు. గుప్పెడంత మనసు, గుండమ్మ కథ సీరియల్స్లో నటిస్తున్న నాగవర్ధిని తమ ప్రేమకు అడ్డు వస్తున్నాడని తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్గూడ శ్రీకృష్ణానగర్ సమీపంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉంటున్న తిరుమారెడ్డి సూర్యనారాయణ సినిమాలు, టీవీ సీరియల్స్లో నటిస్తున్నాడు. ఆతడితో పాటు నటిస్తున్న నాగవర్ధినితో సూర్యనారాయణ నాలుగేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఈ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి నాగవర్ధిని తనతో పాటు టీవీ సీరియళ్లలో నటిస్తున్న దాసరి శ్రీనివాస్రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఒకే అపార్ట్మెంట్లో మాజీ ప్రియుడు సూర్యనారాయణ ఓ గదిలో ఉంటుండగా నాగవర్ధిని, శ్రీనివాస్రెడ్డి మరో గదిలో అద్దెకుండేవారు. తరచూ సూర్యనారాయణతో వీరికి గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం నేరుగా నాగవర్ధిని ఇంట్లోకి వచ్చిన సూర్యనారాయణ ఆమెతో గొడవపడి శ్రీనివాస్రెడ్డిని వదిలేయాలని తనతో ఉండాలని వాగ్వాదానికి దిగాడు. తమ ప్రేమకు అడ్డు పడుతున్నాడని భావించిన నాగవర్ధిని, శ్రీనివాస్రెడ్డి ఇద్దరూ పథకం ప్రకారం సూర్యనారాయణను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. అతడికి తీవ్ర గాయాలు కాగా పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాగవర్ధిని, శ్రీనివాస్రెడ్డిలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. -
జూనియర్ ఆర్టిస్ట్ల ప్రేమాయణం.. నాలుగేళ్లు ఒకరితో.. నాలుగు నెలలు మరొకరితో..
సాక్షి, బంజారాహిల్స్: తాజా ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని రెండో అంతస్తు నుంచి కిందకు తోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో యువతీ, యువకులను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుమల్రెడ్డి సూర్యనారాయణ(30) సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా పని చేస్తూ యూసుఫ్గూడ సమీపంలోని శ్రీకృష్ణానగర్లో నివాసం ఉంటున్నాడు. నాలుగేళ్ల క్రితం తనతో పాటు జూనియర్ ఆర్టిస్ట్గా పని చేస్తున్న నాగవర్ధినితో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసేదాకా కొనసాగింది. అదే భవనంలో ఈ ఇద్దరూ కలిసి రెండో అంతస్తులో నాలుగేళ్లుగా నివాసం ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. చదవండి: ('నాన్నా అమ్మను రోజూ ఎందుకు కొడతావు.. మాతో ఎందుకు సంతోషంగా ఉండవు') ఎవరికి వారు వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకొని ఈ మేరకు సూర్యనారాయణ అదే భవనంలో ఆమె నుంచి విడిపోయి నాల్గో అంతస్తులో కిరాయికి ఉంటున్నాడు. ఈ లోపు నాగవర్ధిని రాజమండ్రికి చెందిన మరో జూనియర్ ఆర్టిస్ట్ శ్రీనివాస్రెడ్డితో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి గత నాలుగు నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఈ విషయంపై సూర్యనారాయణ ఇటీవల ఆమెను నిలదీశాడు. శ్రీనివాస్రెడ్డితో సహజీవనం మానుకోవాలని తనతో పాటే ఉండాలని గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి సూర్యనారాయణను ఆమె గదిలోకి వెళ్లగా శ్రీనివాస్రెడ్డి, నాగవర్ధిని ఇద్దరూ కనిపించడంతో వారితో గొడవపడ్డాడు. మాటా మాటా పెరగడంతో వారిద్దరూ కలిసి సూర్యనారాయణను అదే అంతస్తు పైనుంచి కిందికి తోసేశారు. పక్కటెముకలు విరిగిపోయి ఓ ఎముక ఊపిరితిత్తుల్లో గుచ్చుకోవడంతో అతడి పరిస్థితి విషమించింది. బాధితుడిని పంజగుట్టలోని మురుగన్ ఆస్పత్రిలో బాధితుడిని చేర్నించగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నిందితులు శ్రీనివాస్రెడ్డి, నాగవర్ధినిలను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అప్పటికే నాగవర్ధినికి వివాహం జరిగినట్లు తేలింది. వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి) -
అరుదైన శస్త్ర చికిత్స.. ప్రసవం జరుగుతుండగా శిశువుకు సర్జరీ.. 11 నిమిషాల్లోనే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెయిన్బో ఆస్పత్రి వైద్యులు తొలిసారిగా అరుదైన శస్త్ర చికిత్స చేశారు. తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు ఏర్పడిన కణితిని ప్రసవ సమయంలోనే తొలగించారు. బంజారాహిల్స్లోని రెయిన్బో ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. వరంగల్కు చెందిన ఓ మహిళ పలుమార్లు గర్భస్రావానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గర్భం దా ఆమె ఈసారి గర్భాన్ని నిలబెట్టుకోగలిగినప్పటికీ, గర్భస్థ శిశువుకు మెడపై భారీ కణితి ఉన్నట్టు స్కానింగ్ ద్వారా అక్కడి వైద్యులు నిర్ధారించారు. ఆ దశలో చికిత్స అసాధ్యం కావడంతో మరోసారి గర్భస్రావం చేయించుకుంటేనే మేలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో నగరానికి వచ్చి రెయిన్బో వైద్యులను సంప్రదించారు. అనంతరం రెయిన్బో వైద్యుల పర్యవేక్షణలో 9 నెలలు నిండిన అనంతరం.. వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. ఓ వైపు ప్రసవం జరుగుతున్న సమయంలోనే మరోవైపు బిడ్డ మెడకు ఉన్న కణితిని కూడా తొలగించారు. అత్యంత సంక్లిష్టమైన ఎక్సూటరో ఇంట్రా పార్టమ్ ట్రీట్మెంట్ (ఎగ్జిట్) ద్వారా ఈ కణితి తొలగింపు ప్రక్రియ నిర్వహించారు. పాక్షిక ప్రసవం సమయంలో తల ఒక్కటే బయట ఉండి మిగిలిన దేహమంతా తల్లి గర్భాన్ని అంటిపెట్టుకుని ఉండగానే 11 నిమిషాల అత్యంత స్వల్ప సమయంలో శస్త్ర చికిత్స జరగడం వైద్యరంగంలో అపూర్వమని వైద్యులు తెలిపారు. ప్రసవం అనంతరం ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్టు వెల్లడించారు. సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్స కోసం రెయిన్బో ఆస్పత్రికి చెందిన వివిధ విభాగాలకు చెందిన 25 మంది వైద్య నిపుణులు పాల్గొన్నారని తెలిపారు. (చదవండి: టెన్త్లో ఆరా? పదకొండు పేపర్లా? ఎస్సీఈఆర్టీ మొగ్గు ఎటువైపు?) -
ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది.. చిరు ఎమోషనల్ ట్వీట్
హైదరాబాద్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన అందరినీ కలిచివేసింది. ఈ దారుణం రాజధాని నగరంలో కలకలం రేపింది. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పిల్లల భద్రతపై రాజీ పడవద్దని సూచించారు. తాజాగా ఈ ఘటనపై మెగాస్టార్ చిరు సైతం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పసిబిడ్డపై జరిగిన అఘాయిత్యం తనను తీవ్రంగా కలచివేసిందని ఎమోషనల్ అయ్యారు. దీనికి కారణమైన కఠినాతి కఠినంగా శిక్షించాలని చిరంజీవి ట్వీట్ చేశారు. విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్ వేదికగా కోరారు. (చదవండి: డీఏవీ స్కూల్ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల) మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'బంజారాహిల్స్లోని పాఠశాలలో చిన్నారిపై జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను తీవ్రంగా కలిచివేసింది. నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన ఘటన చాలా బాధాకరం. ఇలాంటి ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు విధించాలి. అంతే కాకుండా అన్ని విద్యాసంస్థల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. భావి తరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా.' అంటూ మెగాస్టార్ ఎమోషనలల్ పోస్ట్ చేశారు. Let such Horrors not recur ever again! pic.twitter.com/s1tzujCevh — Chiranjeevi Konidela (@KChiruTweets) October 25, 2022 -
బంజారాహిల్స్ డీఏవీ పాఠాశాల గుర్తింపు రద్దు
-
కులం పేరుతో దూషించారు.. ప్రాణహానీ ఉంది: నిర్మాత ఫిర్యాదు
తాను నిర్మిస్తున్న సినిమాను వివిధ కారణాలతో ఆపేందుకు ప్రయత్నించడమే కాకుండా కులం పేరుతో దూషిస్తూ తనను ఆత్మహత్యకు ఉసిగొల్పుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సిసీ దర్శకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఇద్దరు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వివరాలు.. నల్లకుంటలో నివసించే మంచాల ప్రమోద్(27) సినిమాలు నిర్మించేందకు గాను శ్రీనగర్ కాలనీకి వచ్చి సొంత బ్యానర్పై ‘కంటోన్మెట్ పోస్టాఫీస్’ పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే నీకు ఎందుకంటూ బాల సతీష్, రాజేష్ చిలువురి అనే ఇద్దరు వ్యక్తులు మానసికంగా వేధిస్తూ తనను సినీ పరిశ్రమ నుంచి దూరం చేసేందుకు యత్నించడమే కాకుండా తన సినిమా నిర్మాణాన్ని ఎలాగైనా ఆపాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అలాగే తనను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ తనపై దుష్ప్రచారం చేస్తూ ఆత్మహత్యకు కూడా ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. గణపతి కాంప్లెక్స్ వద్ద తనతో పాటు సహాయ దర్శకుడు బి. రవితేజపై కూడా కులం పేరుతో దుషించారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాల సతీష్, రాజేష్ చిలువూరిలపై బంజారాహిల్స్ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: బ్యాగ్లో 35 వజ్రాలు.. పార్క్ హయత్లో చోరీ జరిగిందా? మర్చిపోయారా?
సాక్షి, బంజారాహిల్స్: ముంబై నుంచి వచ్చిన ఓ వ్యాపారి బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్హయత్ హోటల్లో మర్చిపోయిన ఆభరణాల బ్యాగును బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. అటు పంజగుట్ట, ఇటు బంజారాహిల్స్ క్రైం పోలీసులు ఈ ఆభరణాల మిస్సింగ్ విషయంలో హైరానా పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు దీన్ని ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన అహ్మద్ బేగ్ అనే వ్యాపారి తన భార్యతో కలిసి గతనెల 22వ తేదీన బంజారాహిల్స్లోని పార్క్హయత్ హోటల్లో బస చేశారు. గత నెల 24వ తేదీన హోటల్లో ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ బస చేయడంతో వీవీఐపీ తాకిడి ఎక్కువ కావడం, సేవలు సరిగ్గా లేకపోవడంతో బేగ్ ఇక్కడి నుంచి ఖాళీ చేసి సోమాజిగూడలోని పార్క్ హోటల్కు వెళ్లాడు. పార్క్ హయత్ నుంచి ఖాళీ చేసే క్రమంలో ఆయన భార్య తన ఆభరణాల బ్యాగును లిఫ్ట్ వద్ద ఉన్న సర్వీస్ ఫోన్ టేబుల్పై ఉంచి మర్చిపోయింది. పార్క్ హోటల్కు వెళ్లాక చూసుకోగా ఆభరణాల బ్యాగు కనిపించలేదు. వెంటనే బేగ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చోరీ జరిగిందన్న నేపథ్యంలో సీసీ ఫుటేజీలు, అనుమానితుల కదలికలను పరిశీలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో బాధితుడు ఈ నెల 1వ తేదీన పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోగొట్టుకున్న బ్యాగులో డైమండ్ బ్రాస్లైట్, 35 డైమండ్లు, డైమండ్ రింగ్, మంగళసూత్రం, బంగారు గొలుసు, చెవి దిద్దులు ఉన్నాయని వీటి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మంగళవారం బంజారాహిల్స్ క్రైం పోలీసలు మరోసారి పార్క్హయత్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. అయితే లిఫ్ట్ వద్ద ఉన్న టెలీఫోన్ స్టూల్ బంగారు వర్ణంలో ఉండటం, ఆభరణాల బ్యాగు కూడా అదే రంగులో ఉండటంతో దాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల నుంచి ఆభరణాల బ్యాగు అక్కడే ఉండటాన్ని ఎవరూ నమ్మడం లేదు. పార్క్హయత్ హోటల్ నిర్వాకంపై గతంలోనే ఎన్నో విమర్శలు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని తెలుసుకొని అప్పటికప్పుడు ఈ బ్యాగును అక్కడ ఉంచి నాటకానికి తెరలేపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిందా..? మర్చిపోయారా అన్నది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్న ఎప్పుడూ ఆ మాటలు చెప్తుంటాడు: నిహారిక
సాక్షి, బంజారాహిల్స్: గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్కులో సోమవారం నటి నిహారికా కొణిదెల మొక్కలు నాటారు. తన తండ్రి నాగబాబు ఎప్పుడూ ప్రకృతిని ప్రేమించాలని, మొక్కలను పెంచాలని చెబుతుంటారని ఈ ప్రపంచంలో అందరినీ కాపాడే మొదటి దేవుడు ప్రకృతి అని ఆ ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ మొక్కలు నాటించడం అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. చదవండి: (NIMS Director: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్కు..!) -
ఆత్మీయతను పంచడం అభినందనీయం: గవాస్కర్
సాక్షి, హైదరాబాద్: అవస్థలు, నొప్పులు లేకుండా ఏ జీవితం ముగియదు. అలాంటి సందర్భంలో మేమున్నామని ఆత్మీయతను పంచడం ఉన్నతమైన సేవలని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. నగరంలోని స్పర్శ్ హాస్పీస్ పాలియాటివ్ కేర్ సెంటర్ను సునీల్ గవాస్కర్ ఆదివారం సందర్శించి అక్కడి పేషెంట్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవిత చరమాంకంలో ఎదురయ్యే అవస్థలను తగ్గించడానికి అందించే ఉపశమన సేవలు అరుదని, నగరం వేదికగా రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ ఆధ్వర్యంలో ఉచితంగా అందింస్తున్న ఈ సేవలు అభినందనీయమన్నారు. చిన్నతనంలో తను కూడా డాక్టర్ కావాలనే బలమైన కోరిక ఉండేదని, తన కుటుంబ సభ్యుల్లో ఉన్న డాక్టర్ల వలన వైద్య రంగంలోని ఔన్నత్యాన్ని తెలుసుకున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, స్పర్శ్ హాస్పీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చదవండి: (Ind Vs Aus 3rd T20- Uppal: హైదరాబాద్ బిర్యానీకి రోహిత్ ఫిదా) -
దారి కాచి.. దాడి చేసి..
సాక్షి, బంజరాహిల్స్: అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిపై నలుగురు ఆకతాయిలు మద్యం మత్తులో కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్లోని జ్ఞానిజైల్సింగ్ నగర్ బస్తీకి చెందిన నగేష్ కొత్త చెరువు వద్ద ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నలుగురు యువకులు డబ్బులు డిమాండ్ చేస్తూ అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా ముగ్గురు నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. పోలీసులు వెళ్లిన క్షణాల్లోనే చెట్ల మాటున దాక్కున్న మిగతా ముగ్గురు మళ్లీ అక్కడికి వచ్చి మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మరోసారి బాధితుడిపై కర్రలతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు కొద్దిసేపు నిఘా ఉంచితే మళ్లీ దాడి జరిగి జరిగే ఉండేది కాదని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. (చదవండి: భార్య గొంతుకోసి హత్య) -
నగరం నడిబొడ్డున ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఇదా?.. వర్షం నీరు రంగు మారినా..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాలు చదువుకునే పాఠశాలలపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నదానికి ఫిలింనగర్లోని బీజేఆర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిని చూస్తే అర్థమవుతోంది. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఈ పాఠశాల వరద నీటితో నిండిపోయింది. అప్పటి నుంచి వరద నీటితో పాటు మురుగు కూడా పేరుకుపోయి ఆకుపచ్చ రంగులో నీళ్లు ఈ పాఠశాల దుస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఇప్పటికే ఇక్కడి విద్యార్థులను సమీపంలోని ఎంజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తరలించారు. ఇప్పటి వరకు బీజేఆర్ నగర్ ప్రైమరీ స్కూల్ను మాత్రం బాగు చేయలేదు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో ఈ పాఠశాల చిక్కుకుంది. విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులకు తీరిక దొరకడం లేదు. ఫలితంగా చిన్నారుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా అధికారులు స్పందించిన పాపాన పోవడం లేదని బస్తీవాసులు వాపోతున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ పాఠశాల ఉండటం విశేషం. పాఠశాల దుస్థితిని కళ్లకు కడుతూ మంత్రి కేటీఆర్కు ఫొటోల రూపంలో ట్వీట్ చేసినా అధికారులకు చలనం కరువైంది. చదవండి: (హెలికాప్టర్ అడిగితే ఇవ్వలేదు.. తెలంగాణ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు) -
బంజారాహిల్స్ లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో కృష్ణాష్టమికి ఏర్పాట్లు
-
TS: ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్ ట్విన్ టవర్స్ ప్రత్యేకలివే..
సాక్షి, సిటీ బ్యూరో: రాష్ట్రానికే తలమానికంగా దేశానికే ఆదర్శంగా నగరంలో ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ) ఆధునిక సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్గా మారనుంది. అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దీన్ని నిర్మించారు. గురువారం జరగనున్న దీని ప్రారంభ వేడుకలను చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. చదవండి: టీఆర్ఎస్లో టెన్షన్.. మునుగోడుపై ‘ఐ ప్యాక్’ కీలక నివేదిక! ఈ నేపథ్యంలోనే వీటి కోసం నగర పోలీసు విభాగానికి చెందిన 25 మంది అధికారులను నియమించారు. ఆద్యంతం పర్యవేక్షించే బాధ్యతల్ని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్కు అప్పగించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆహ్వానిస్తున్నారు. టీఎస్పీఐసీసీసీ హంగులివే.. పోలీసు సింగిల్ విండో: నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలుకానుంది. కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ: టీఎస్ఐసీసీసీలో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవి తక్కువ సమయంలో అందరికీ చేరడం అదనపు ఆకర్షణలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనికోసం ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం: డయల్– 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంటాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం స్పందించేలా కంప్యూటర్ ప్రొగ్రామింగ్ ఉండనుంది. జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో అనుసంధానమైన వ్యవస్థ ఇది. సిటిజన్ పిటిషన్ మేనేజ్మెంట్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని విభాగాల వారీగా కేటాయింపు, సత్వర స్పందన, పరిష్కారం, వీటి మ్యాపింగ్ మొత్తం కంప్యూటర్ ద్వారా జరుగుతుంది. మార్కెట్, సోషల్ మీడియా విశ్లేషణ, మెబైల్ యాప్స్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. రిసెప్షన్ సెంటర్లో కియోస్్కలు ఏర్పాటు చేస్తారు. శాంతిభద్రతల విభాగం నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రత్యేక ఎనలటిక్స్గా పిలిచే సాఫ్ట్వేర్స్ ద్వారా శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేస్తారు జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలను అవసరమైన చోటుకు మళ్ళిస్తారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం నగరంలో ట్రాఫిక్ నిర్వహణకూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. సెన్సర్ల ద్వారా వివిధ మార్గాల్లో ట్రాఫిక్ను అధ్యయనం చేసి మార్పు చేర్పులు సూచిస్తారు. ఆర్టీఏ డేటాబేస్–అనుమానిత వాహనాల డేటాబేస్లను అనుసంధానిస్తారు. తక్షణ స్పందన కోసం ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం: ఎఫ్ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ లాబ్ ఇతర టూల్స్ నేరాల నిరో«ధం, కేసుల సత్వర పరిష్కారానికి ఉపకరిస్తాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్: నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్స్ సెర్చ్కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్తో మెరుగైన సేవలు అందించనున్నారు. అనేక కార్యాలయాల మార్పు.. నగర పోలీసు కమిషనరేట్ ఆగస్టు నెలాఖరు కల్లా టీఎస్ఐసీసీసీలోకి తరలనుంది. 18వ అంతస్తులో కొత్వాల్ కార్యాలయం ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తదితరాలు సైతం అక్కడకే వెళ్తాయి. ఇవి అయిదో అంతస్తులో ఉండనున్నాయి. ఏడో అంతస్తును ఇతర విభాగాల కోసం కేటాయించారు. ప్రధాన కంట్రోల్ రూమ్లోనూ వీరికి భాగస్వామ్యం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బషీర్బాగ్లోని పోలీసు కమిషనరేట్ సిటీ ట్రాఫిక్ కమిషనరేట్గా మారనుంది. దీంతో పాత కంట్రోల్ రూమ్ను పూర్తి స్థాయిలో సీసీఎస్, డిటెక్టివ్ డిపార్ట్మెంట్లతో పాటు మధ్య మండల కార్యాలయానికి అప్పగిస్తారు. ఫలితంగా సిట్ కార్యాలయం కూడా ఇక్కడకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాతబస్తీలో ఉన్నట్లే బషీర్బాగ్లోనూ కమిషనర్ కోసం ఓ కార్యాలయం ఉండనుంది. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ పోలీసును దేశంలోనే బెస్ట్ పోలీసింగ్గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సదుపాయాలు కల్పించారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్కు రూపకల్పన చేసినట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం, 14వ అంతస్తులో గ్యాలరీని ప్రారంభిస్తారని తెలిపారు. పకడ్బందీ ఏర్పాట్లు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వారం రోజుల నుంచి ఏర్పాట్లలో మునిగిపోయారు. బుధవారం సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణకే తలమానికం.. టీఎస్ఐసీసీసీ (ఫొటోలు)
-
బంజారాహిల్స్లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న బంజారాహిల్స్లో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయం, పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్మ్నగర్, బంజారాహిల్స్ మీదుగా వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి రోడ్డు నంబర్–36, 45 మీదుగా మాదాపూర్ వైపునకు మళ్లాలి. మాసబ్ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 వైపు వచ్చే వాహనాలు బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1, 10 మీదుగా జహీరానగర్, కేన్సర్ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి. ఫిల్మ్నగర్ మీదుగా ఒర్సి ఐస్ల్యాండ్ మీదుగా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ, ఎన్ఎఫ్సీఎల్ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాలి. మాసబ్ట్యాంక్ మీదుగా రోడ్డు నంబర్ 12, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, నానల్నగర్, టోలిచౌకి, ఫిల్మ్నగర్, జూబ్లిహిల్స్కు చేరుకోవాలి. 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్న సీఎం బంజారాహిల్స్లో ప్రభుత్వం నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని మంగళవారం ఆయ న హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు నాగేందర్, గోపీనాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, సీపీ సీవీ ఆనంద్తో కలిసి పరిశీలించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్ చేతుల మీదు గా ప్రారంభం జరుగుతుందని తెలిపారు. (క్లిక్: జీహెచ్ఎంసీ నెత్తిన మరో పిడుగు) -
హైదరాబాద్లో టర్కీ ఫుడ్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని హయత్ ప్లేస్ వేదికగా నేటి నుంచి జులై 3వ తేదీ వరకు ఫ్లేవర్స్ ఆఫ్ టర్కీ పేరుతో టర్కీష్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమాన్ని బుధవారం హయత్ ప్లేస్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టర్కీ కాన్సులేట్ జనరల్ ఒర్హాన్ ఎల్మాన్ ఒకన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరవాసుల కు తమ ఆహారం, సంస్కృతిని మరింత దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామ ని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ టెన్లో టర్కిష్ ఫుడ్ వెరైటీస్ ఉంటాయని తెలిపారు. హైదరాబాదీ ఫుడ్కు, టర్కీ ఫుడ్కు సారూప్యత ఉంటుందన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొనే వారు లక్కీ డ్రాలో భాగంగా టర్కీలో ఉచితంగా బస చేసే బహుమతిని పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: మంచు ఖండాన.. గ్రీన్ చాలెంజ్ జెండా) -
డిప్రెషన్తోనే ప్రత్యూష ఆత్మహత్య: పోలీసుల ప్రాథమిక నిర్థారణ
-
Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్లోని తన నివాసంలో ప్రత్యూష.. శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్మోనాక్సైడ్ బాటిల్ లభ్యమైంది. దీంతో ఆమె కార్బన్మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఫ్యాషన్ డిజైనర్గా ప్రత్యూష గుర్తింపు పొందారు. బాలీవుడ్, టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్లు డిజైన్ చేశారు. దేశంలోని 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్లో ప్రత్యూష ఒకరుగా గుర్తింపు ఉంది. రిటైర్డ్ ఐఆర్ఎస్ కృష్ణారావు కుమార్తె ప్రత్యూష. సూసైడ్ నోట్ రాసిన ప్రత్యూష ప్రత్యూష ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. తల్లి దండ్రులకు భారం కాలేనని, క్షమించండి అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. తాను కోరుకున్న జీవితం ఇది కాదని లేఖలో పేర్కొంది. కాగా, నిన్న రాత్రి జూబ్లీహిల్స్లోని సొంతింటి నుంచి బోటిక్కు వచ్చిన ప్రత్యూష.. అక్కడకు కేవలం ఒక బ్యాగ్తోనే వెళ్లింది. తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని లోపలికి వెళ్లేముందు వాచ్మెన్కు ప్రత్యూష చెప్పింది. ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో వాచ్మెన్ వెళ్లి చూడగా.. ఆమె కిందపడిపోయి ఉండటంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు.. ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం నిమ్మితం ఆసుపత్రికి తరలించారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టులో ప్రత్యూష కార్బన్మోనాక్సైడ్ వాయువు పీల్చుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లండి.. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రియురాలికి హాయ్ చెప్పాడని.. మరోసారి వీడు నీ జోలికి రాడంటూ
బంజారాహిల్స్: తన ప్రియురాలికి హాయ్ చెప్పాడనే కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి తన స్నేహితులతో కలిసి పదో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి మూసీ పరిసరాలకు తీసుకెళ్లి చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్, జ్ఞానిజైల్సింగ్నగర్ బస్తీకి చెందిన బాలుడు (16) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16)తో కొన్ని రోజులుగా మాట్లాడేందుకు ప్రయత్నించడంతోపాటు నువ్వంటే నాకిష్టం అని చెబుతున్నాడు. కాగా సదరు బాలిక లంగర్హౌజ్ సమీపంలోని ప్రశాంత్నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థి కాంబ్లే రోహన్(19)ని ప్రేమిస్తోంది. తనను ఒకరు ఇబ్బంది పెడుతున్నారని ఫోన్ చేసి రోహన్కు చెప్పడంతో ఆగ్రహానికి గురైన రోహన్ తన స్నేహితులు సంజయ్, అభిషేక్, నరేష్లతో కలిసి మంగళవారం రాత్రి రెండు బైక్లపై ఫిలింనగర్కు వచ్చాడు. మాట్లాడే పని ఉందని సదరు బాలుడిని వెంకటేశ్వర హోటల్ చౌరస్తా వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తమ బైక్పై ఎక్కించుకున్న రోహన్, సంజయ్ లంగర్హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వెనుకాల ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లారు. చదవండి: (పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని..) తన లవర్ జోలికి వస్తే అంతు చూస్తానంటూ హెచ్చరించిన రోహన్ అతడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడమేగాక ఆగకుండా తన లవర్ జోలికి రానంటూ చెప్పాలంటూ వీడియోలు తీశారు. రక్తసిక్తమైన బాలుడితో సెల్ఫీ దిగి తన లవర్కు పంపుతూ మరోసారి వీడు నీ జోలికి రాడంటూ ఫోన్ చేసి చెప్పాడు. అనంతరం అతడిని బైక్పై ఎక్కించుకొని బాపూఘాట్ వద్ద రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి తన స్నేహితుడు సంజయ్తో కలిసి పరారయ్యాడు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న లంగర్హౌజ్ పోలీసులు ఆరా తీయగా సంఘటన జరిగిన ప్రాంతం రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోకి వస్తుందని అక్కడికి వెళ్లాలని సూచించడంతో బాధితుడు అక్కడికి వెళ్లాడు. పోలీసులు అతడిని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స చేయించారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు పంపించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితులు సంజయ్, రోహన్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చదవండి: (భర్తతో విడాకులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య) -
Photo Feature: ట్రాఫిక్ చక్రబంధనం...
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు చిరుజల్లులు... మరోవైపు ఆఫీసుల నుంచి ఉద్యోగులు, సిబ్బంది ఇళ్లకు చేరే సమయం కావడంతో నగరంలో బుధవారం ట్రాఫిక్ సమస్య ఎదురైంది. మెహిదీపట్నం, పంజగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట, మాసాబ్ట్యాంకు, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్లపై వాహనాలు బారులుదీరి కన్పించాయి. -
హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం 4,935 చదరపు గజాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం బంజారాహిల్స్లో 4,935 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. హైదరాబాద్ జిల్లా షేక్పేట మండలం/గ్రామం, ఎన్బీటీ నగర్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం.12 వద్ద సర్వే నంబర్ 18/పీ, 21/పీలో ఈ స్థలం ఉంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ధరను ఖరారు చేసే ప్రక్రియను పెండింగ్లో ఉంచినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీన్ని త్వరగా పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం కోసం సదరు స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ ఈ నెల 9న ప్రతిపాదనలు పంపగా 10న సీసీఎల్ఏ ఆమోదముద్ర వేసింది. స్థలం విలువ దాదాపు రూ.70 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
Hyderabad: అపార్ట్ మెంట్లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకొని పోలీసుల కళ్లు గప్పి వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ దాడి చేశారు. ఫిజియోథెరపీ పేరుతో ఈ ఫ్లాట్ అద్దెకు తీసుకున్న సదాలక్ష్మి అనే నిర్వాహకురాలు ఆ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి దాడి నిర్వహించారు. ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి తరలించి సదాలక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య) -
ఖరీదైన చీరలపై మోజు
బంజారాహిల్స్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని చీరల షోరూంలలో సరికొత్త డిజైన్ల చీరలు కట్టుకోవాలని ఆమెకు ఆశ. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో కనువిందు చేసే వాటిని కట్టుకోవడం కష్టతరంగా మారింది. తన ఇష్టాన్ని ఎలాగైనా తీర్చుకోవాలన్న కోరిక ఓ యువతిని దొంగగా మార్చింది. తల్లితో కలిసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని ఖరీదైన షోరూంలకు వెళ్తూ సేల్స్మెన్స్ కళ్లుగప్పి తాము ఇష్టపడ్డ చీరలను దొంగిలిస్తున్న తల్లీ, కూతుళ్లను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... అంబర్పేట సలీంనగర్ కాలనీకి చెందిన నల్లూరి సుజాత, ఆమె కుమార్తె నల్లూరి వెంకటలక్ష్మి పావనికి చీరలంటే మోజు. ఈ నేపథ్యంలో ఈ నెల 21న జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని తలాశా క్లాత్ షోరూంకు వచ్చింది. అందులో తాను ఇష్టపడ్డ రూ. 1.10 లక్షల విలువ చేసే అయిదు చీరలను, అదే రోజు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని గోల్డెన్ థ్రెడ్స్ క్లాత్ స్టోర్లో రూ. 2.80 లక్షల విలువ చేసే నాలుగు చీరలను దొంగిలించి పరారయ్యారు. షాపు యజమానురాలు కవిత ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ క్రైం సీఐ రమేష్, డీఎస్ఐ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేసిన తర్వాత తల్లీకూతుళ్లు ఇద్దరు జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్లో రైలెక్కి ముసరంబాగ్ స్టేషన్లో దిగారు. ఆయా ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలు స్పష్టంగా ఉండటంతో వీరు స్వైప్ చేసిన మెట్రో కార్డ్ ఆధారంగా వారి అడ్రస్ గుర్తించారు. సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ. 3.90 లక్షల విలువైన తొమ్మిది చీరలను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: ఐపీఎల్ బెట్టింగ్ ముఠాల గుట్టు రట్టు) -
ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్థలం కబ్జా
బంజారాహిల్స్: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఎమ్మార్పీఎస్ ముసుగులో ఓ ప్లాట్ను కబ్జా చేసిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే భార్య, ఆమె కుమార్తెను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... ఖమ్మం జిల్లా, సుజాత నగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొగ్గారపు సీతారామయ్య(96) కరోనాతో గత ఏడాది మృతి చెందాడు. అంతకుముందే ఆయన తన ఆస్తులను మొదటి భార్య వరమ్మ, ఇద్దరు కుమార్తెలకు, రెండో భార్య రుక్మిణి, మూడో భార్య దాక్షాయణికి, ఆమె కుమార్తెకు వీలునామా రాశాడు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ఎమ్మెల్యే కాలనీలో బీఎస్ఆర్ గోల్డెన్ ఎన్క్లేవ్లో తాను ఎమ్మెల్యేగా ఉండగా ప్రభుత్వం కేటాయించిన ఫ్లాట్లో డెవలప్మెంట్లో భాగంగా రెండు ఫ్లాట్లు రాగా అందులో ఒకటి మొదటి భార్య వరమ్మ కుమార్తెలు ఉషారాణి, మంగమ్మలకు, రెండో ఫ్లాట్ను రెండో భార్య రుక్మిణమ్మకు చెందేలా వీలునామా రాశారు. మూడో భార్య దాక్షాయణికి పలుచోట్ల ఆస్తులు రాశారు. ఆయన మృతి చెందిన తర్వాత ఏడాది వరకు ఇంట్లో ఉండటం మంచిది కాదని సిద్ధాంతి చెప్పడంతో ఉషారాణి, మంగమ్మతో పాటు ఆయన రెండో భార్య రుక్మిణమ్మ ఫ్లాట్లు ఖాళీ చేసి మరో చోటికి వెళ్ళారు. ఇదే అదనుగా వాటిపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే మూడో భార్య కోనేరు దాక్షాయణి, ఆమె కుమార్తె ఉషారాణికి కేటాయించిన ఫ్లాట్కు నకిలీ డాక్యుమెంట్ సృష్టించారు. గత నెల 2న పథకం ప్రకారం ఎమ్మార్పీఎస్ అనుబంధం సంఘం రాష్ట్ర కార్యాలయం పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసి ఫ్లాట్ తాళాలు పగలగొట్టి అందులోకి ప్రవేశించారు. అదే రోజు ఫ్లాట్ యజమానురాలు ఉషారాణి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టి నకిలీ డాక్యుమెంట్లతో ఫ్లాట్ను కబ్జా చేసినట్లుగా గుర్తించి తల్లీ కూతుళ్లపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. (చదవండి: పక్కాగా లెక్క..కేంద్రం ఆదేశాలతో రంగంలోకి ఎఫ్సీఐ) -
అభిషేక్ను పట్టుకోవడంతో అర్జున్ జంప్!
సాక్షి, హైదరాబాద్: రాడిసన్ బ్లూప్లాజా హోటల్ ఆధీనంలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమీప బంధువైన అర్జున్ వీరమాచినేని తృటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. గత ఆదివారం తెల్లవారుజామున పబ్పై పోలీసులు దాడిచేసి అందరినీ బంజారాహిల్స్ ఠాణాకు తరలించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం అర్జున్ ఠాణా వద్దకు వచ్చాడు. తానెవరో చెప్పకుండా గమనించడం మొదలుపెట్టాడు. అప్పటికే పబ్ భాగస్వామి అభిషేక్, మేనేజర్ అనిల్కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇది చూసిన అర్జున్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంటికి కూడా వెళ్లకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిర్ధారించుకున్నట్టు సమాచారం. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందాలు గురువారం అర్జున్, కిరణ్రాజ్ల ఇళ్లకు వెళ్లి ఆరా తీసినట్టు తెలిసింది. ఈ పబ్లో అభిషేక్తోపాటు అర్జున్, పెనుమత్స కిరణ్రాజు భాగస్వాములుకాగా.. అనిల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. పోలీసులు దాడి చేసినప్పుడు అనిల్, అభిషేక్ పబ్ వద్దే ఉండటంతో పట్టుబడ్డారు. రిమాండ్లో ఉన్న ఈ ఇద్దరిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్పై శుక్రవారం ఎంఎస్జే కోర్టులో వాదనలు జరగనున్నాయి. (చదవండి: లగేజ్ బ్యాగేజ్లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
హైదరాబాద్ పబ్ డ్రగ్స్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
RGV Sensational Comments On Drugs Case: రాష్ట్రంలో సంచలనం రేపిన బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసుపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పోలిస్తే హైదరాబాద్ డ్రగ్స్ కేసు చాలా చిన్నదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తాజా చిత్రం డేంజరస్ మూవీ ప్రమోషన్ల భాగంగా ఆర్జీవీ ఈ డ్రగ్స్ కేసుపై స్పందించారు. చదవండి: రామ్ గోపాల్ వర్మకు చేదు అనుభవం, స్పందించిన ఆర్జీవీ ఈ మేరకు వర్మ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ వాడకం కామన్గా మారింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పోలిస్తే ఇది చాలా చిన్నది. మిగతా వాటితో పోలిస్తే ఇది ఒక షాట్ ఫలిం అంతే అనుకుంటున్నా. ముంబైలో నా అసిస్టెంట్ డైరెక్టర్స్ టీ తాగినంత ఈజీగా డ్రగ్స్ తీసుకునేవారు. ఇది చాలా సర్వసాధారణ విషయం’ అని చెప్పుకొచ్చాడు. అలాగే తాను డ్రగ్స్ వాడనని చెప్పిన ఆర్జీవీ ఓసారి ట్రై చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ముట్టుకోలేదని స్పష్టం చేశారు. చదవండి: రామ్ చరణ్కి జోడిగా అంజలి!, ఏ సినిమాలో అంటే.. అయితే తాను డ్రగ్స్ తీసుకోలేదు కానీ అంతకంటే ప్రమాదకరమైనవి చేస్తానంటూ తనదైన శైలిలో చెప్పారు. ఇక ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం డ్రగ్స్ కన్నా ప్రమాదకరమని ఆర్జీవీ పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 2 రాత్రి పోలీసులు బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్పై దాడి జరపగా ఈ డ్రగ్స్ వ్యవహరం బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ చేసిన కామెంట్స్ హాట్టాపిక్గా మారాయి. -
మందు తాగలేదు, డ్రగ్స్ తీసుకోలేదు.. జస్ట్ పార్టీ చూద్దామని వెళ్లా : కుషిత
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్, నిహారిక వంటి సెలబ్రిటీలు సహా పలువురు ప్రముఖల పిల్లలు పేర్లు బయటకు రావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. పోలీసుల దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి నోటీసులు కూడా ఇచ్చారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) తాజాగా ఈ ఘటనలో తనపై జరుగుతున్న ప్రచారంపై షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా స్పందించారు. అక్కడ అసలు డ్రగ్స్ వాడుతున్నారనే విషయమే తనకు తెలియదని, ఒకవేళ తెలిస్తే అసలు వెళ్లేవాళ్లం కాదని చెప్పింది. నేను మందు తాగలేదు, డ్రగ్స్ తీసుకోలేదు. జస్ట్ పార్టీ చూద్దామని వెళ్లాను. కానీ ఇంత ఇష్యూ అవుతుందనుకోలేదు. వీకెండ్లో మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి వెళ్లాను. నా ఫ్రెండ్ హర్ష సహా ఐదుగురుం ఆ పబ్కి వెళ్లాం. కానీ హర్ష గతంలో డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడన్న విషయం నాకు తెలియదు. మా గ్రూప్లో అయితే ఎవరూ డ్రగ్స్ తీసుకోలేదు. ఎలాంటి శాంపిల్స్ తీసుకోవడానికైనా మేం రెడీ. నేను రెగ్యులర్గా పార్టీలకు వెళ్లను. నాకు షూటింగ్స్ ఉంటాయి. కానీ వీకెండ్ కావడంతో కర్మాగాలి వెళ్లాను. అంతకు మించి ఏం లేదు. ఇక ఈ ఇష్యూ గురించి ఇంట్లో కూడా బాగా గొడవ జరిగింది. మా పేరెంట్స్ నన్ను బాగా తిట్టారు. ఇంకోసారి ఇలాంటి పార్టీలకు వెళ్లను అంటూ చెప్పుకొచ్చింది. -
పబ్ రైడ్స్: ‘ఆ మూడు టేబుళ్ల’పైనే పోలీసుల ఫోకస్!
-
పబ్ రైడ్స్: ఆ మూడు టేబుళ్లే కీలకం!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ అధీనంలోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్లో జరిగిన రేవ్ పార్టీ కేసు విచారణలో ‘మూడు టేబుళ్లు’ కీలకంగా మారాయి. శనివారం రాత్రి వీటిని బుక్ చేసుకున్న వాళ్లే మాదకద్రవ్యాలు వినియోగించారని బంజారాహిల్స్ పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న పబ్ భాగస్వామి అర్జున్ వీరమాచినేని చిక్కడంతో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మేనేజర్ అనిల్కుమార్ను కూడా కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ అంశంలో స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క ఈ కేసు దర్యాప్తును బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు మంగళవారం అధికారికంగా స్వీకరించారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఆ పబ్పై దాడి చేసి నటుడు నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక, బిగ్బాస్ విన్నర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా సిద్ధార్థ్ తో పాటు మాజీ కేంద్రమంత్రి మనవడు సహా అనేకమందిని అదుపులోకి తీసుకుని విడిచిపెట్టిన విషయం విదితమే. ఆ మూడు టేబుళ్లలో 20 మంది! టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న 148 మందిలో 18 మంది పబ్ సిబ్బంది కూడా ఉన్నారు. కాగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కానీ పబ్లో ఓ పక్కగా ఉన్న మూడు టేబుళ్లపై జరిగిన వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో మంగళవారం పబ్లో పనిచేసే కొందరు ఉద్యోగులను ప్రశ్నించారు. ఆ మూడు టేబుళ్లను అర్జున్ ఆదేశాల మేరకు అభిషేక్ కోరిన మీదట మేనేజర్ అనిల్కుమార్ చాలాసేపటి వరకు రిజర్వ్ చేసి ఉంచినట్లు పోలీసులు తెలుసుకున్నారు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో 15 నుంచి 20 మంది వచ్చారని, వారిని లోపలకు తీసుకురావడానికి అనిల్ స్వయంగా పబ్ ప్రధాన ద్వారం వరకు వెళ్లారని ఓ ఉద్యోగి వెల్లడించాడు. పబ్లో ఉన్న ఉద్యోగుల్లో ఇద్దరు మాత్రమే ఆ మూడు టేబుళ్లకు సర్వ్ చేశారని, మిగిలిన వాళ్లను అనిల్ ఆ దరిదాపులకు కూడా రానీయలేదని చెప్పాడు. కౌంటర్ నుంచే కొకైన్ అందించాడా? పబ్లో సోదాలు చేసిన సందర్భంలో టాస్క్ఫోర్స్ పోలీసులు అనిల్కుమార్ అధీనంలోని లిక్కర్ కౌంటర్ పైన ఉన్న స్ట్రాల డబ్బా నుంచి ఐదు కొకైన్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందే దాదాపు 10 నుంచి 15 ప్యాకెట్లు ఆ మూడు టేబుళ్లలో కూర్చున్న వారికి అనిల్ అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనిల్, అభిషేక్ల పోలీసు కస్టడీపై బుధవారం కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనిల్ కస్టడీకి వచ్చిన తర్వాత ఈ కోణంలోనే ప్రశ్నించాలని పోలీసులు నిర్ణయించారు. మరోవైపు ఆ మూడు టేబుళ్లపై కూర్చున్న వారిని గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. -
పరారీలో ఆ ఇద్దరు
-
పోలీసులు రాగానే మేము అడ్డంగా ఇరుక్కుపోయాం:కుషిత
-
రేవ్ పార్టీలో పట్టుబడ్డ సింగర్ రాహుల్ సిప్లిగంజ్
-
బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో ఎన్టీఆర్ కూతురి అల్లుడు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. నిబంధనలకు విరుద్ధంగా పబ్ పార్టీకి మైనర్లను యాజమాన్యం అనుమతించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అభిషేక్, అనిల్ను అరెస్ట్ చేయగా.. అర్జున్, కిరణ్రాజ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఏ1 అనిల్, ఏ2 అభిషేక్, ఏ3గా ఎన్టీఆర్ కూతురి అల్లుడు అర్జున్ వీరమాచినేని, మాజీ ఎంపీ రేణుకాచౌదరి అల్లుడు కిరణ్రాజ్ను ఏ4 నిందితుడిగా పోలీసులు చేర్చారు. 2017-20 వరకు తన భార్యతో కలిసి కిరణ్రాజ్ పబ్ నడిపాడు. 2020 ఆగష్టులో అభిషేక్, అనిల్కు లీజు ఇచ్చిన కిరణ్రాజ్.. పార్ట్నర్గా కొనసాగుతున్నట్లు సమాచారం. చదవండి: పబ్లో యథేచ్ఛగా మత్తు దందా... డ్రగ్ మారో డ్రగ్ డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా.. హైదరాబాద్ డ్రగ్స్ సరఫరాపై పూర్తి నిఘా ఉందని నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ చీఫ్ చక్రవర్తి తెలిపారు. డ్రగ్స్ వినియోగించే స్పాట్స్పై సమాచారం ఉందన్నారు. పబ్బులు, క్లబ్లు, రెస్టారెంట్, రిసార్ట్స్పై పూర్తి నిఘా ఉంచామన్నారు. గోవా నుంచి డ్రగ్స్ రవాణా అవుతున్నట్లు గుర్తించామన్నారు. డార్క్ నెట్ ద్వారా విదేశాల నుంచి డగ్ర్స్ రవాణా అవుతుందన్నారు. డార్క్ నెట్ ఢీకోడ్ చేసే టెక్నాలజీ తమ వద్ద ఉందన్నారు. డక్స్ ఫెడ్లర్స్, కంజూమర్స్పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డ్రగ్స్ కేసు నిందితులను ఐదు రోజుల కస్టడీ కోరతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు రాడిసన్ హోటల్ లైసెన్స్ను ప్రభుత్వం రద్దు చేసింది. పబ్, లిక్కర్ లైసెన్స్లను రద్దు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటలపాటు లిక్కర్ సప్లైకి రాడిసన్ హోటల్ అనుమతి తీసుకుంది. జనవరి 7న లిక్కర్ లైసెన్స్కి అనుమతి తీసుకోగా, రూ. 56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించి లైసెన్స్ పొందింది. 2బీ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో అనుమతి తీసుకుంది. పబ్లో డ్రగ్స్ బయటపడటంతో లైసెన్స్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నం.6లో ఉన్న ర్యాడిసన్ బ్లూ ప్లాజా హోటల్కు చెందిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో ఆదివారం తెల్లవారుజామున నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. పెద్ద మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని.. పబ్ సిబ్బంది సహా 148 మందిని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు. చదవండి: పబ్లతో తారల బంధం! వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు. పబ్బులో డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేశారు, ఆ ఏరియా ఏసీపీ మంత్రి సుదర్శన్కు చార్జ్మెమో జారీ చేశారు. -
డ్రగ్స్ కేసు నిందితుడు లక్ష్మీపతి కోసం గాలింపు ముమ్మరం
-
పబ్ రైడ్స్: ప్లీజ్ తప్పుడు ప్రచారం చేయకండి.. నటి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ కేసులు సంచలనంగా మారాయి. మొన్న డ్రగ్స్ తీసుకొని ఓ విద్యార్ధిని మృతి చెందగా.. ఆదివారం బంజారాహిల్స్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ వాడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖుల కొడుకులు, కూతుళ్ల పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారికి నోటీసులు కూడా ఇచ్చారు. తాజాగా ఈ కేసు విషయమై.. పబ్లో ఉన్నవారు అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం కావడంతో షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా స్పందించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఫ్రెండ్స్తో కలిసి పార్టీకి వెళ్లాను. మరికాసేపట్లో పార్టీ ముగుస్తుంది.. ఇంటికి వెళ్దామనుకున్నాం. కానీ అంతలోనే పోలీసులు వచ్చారు. మేము వారికి సహకరించాం. అనవసరంగా మాపై తప్పడు ప్రచారం చేయకండి. మేం డ్రగ్స్ తీసుకోలేదు. మీడియా వాళ్లు కొంచం సమన్వయం పాటించాలన్నారు. తమలాగే ఈ వివరాలపై దుష్ప్రచారం చేస్తున్న వారికి సైతం కుటుంబాలు ఉన్నాయని, గుర్తుంచుకోవాలని ఇది నిజమని కుటుంబసభ్యులు భావిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లేట్ నైట్ పబ్లో ఉండటం తమ తప్పు కాదన్నారు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న విషయం తమకు తెలియదన్నారు. తెలిస్తే మేము ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు ఆపాలని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏం సెప్తిరి... ఏం స్టెప్పేస్తిరి!
సాక్షి, హైదరాబాద్: రేవ్ పార్టీ జరిగిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్ అంశంలో బిగ్బాస్ సీజన్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్, బంజారాహిల్స్ తాజా మాజీ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర ఇద్దరూ వార్తల్లో నిలిచారు. వీరిలో ఒకరు ఆ పార్టీలో పాల్గొని పట్టుబడగా... మరొకరు విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ సంబంధించిన రెండు వేర్వేరు వీడియోలు ఆదివారం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. నషా ముక్త్ హైదరాబాద్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సిటీ పోలీసులు ‘డ్రగ్ ఫ్రీ హైదరాబాద్’పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బోరబండ ప్రాంతంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో రాహుల్ సిప్లిగంజ్ అతిథిగా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉందని, మంచి కార్యక్రమమని ప్రశంసించారు. ఇదే అంశాన్ని తన అధికారిక సోషల్మీడియాలోనూ పొందుపరిచారు. ఇక ఇన్స్పెక్టర్ శివచంద్ర తన ఇంట్లో ‘హాయే మేరా దిల్’అనే హిందీ పాటకు డ్యాన్స్ చేశారు. షార్ట్స్, టీషర్టులో ఉన్న శివచంద్ర డ్యాన్స్ చేసిన వీడియో యూట్యూబ్లో ఉంది. అది కూడా ఆదివారం వైరల్గా మారింది. (చదవండి: పట్టుబడగానే... మావాడు మంచోడే!) -
పట్టుబడగానే... మావాడు మంచోడే!
సాక్షి, బంజారాహిల్స్: నాకేం తెలియదు.. మా పిల్లలు చాలా మంచి వారు.. అందులో మా పిల్లలు లేరు.. మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది.. ఇలా ఏదైనా ఘటనలో తమ పిల్లలు పట్టుబడగానే ప్రముఖులు నీతి సూక్తులు వల్లె వేస్తుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు పిల్లలు ఇంటికి రాకపోతే ఎక్కడున్నారనే విషయం కూడా కొంత మంది తెలుసుకోవడంలేదు. తీరా ఏదైనా పబ్లోనో, రేవ్ పార్టీలోనో, రిసార్ట్స్లోనో మద్యం తాగి, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే మాత్రం ఆ ఘటనతో తమకేమీ సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు. తాజాగా బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పబ్లో రేవ్ పార్టీలో పాల్గొని టాస్క్ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినవారి కుటుంబ సభ్యులందరు డ్రగ్స్తో సంబంధం లేదంటూ ఒకేతీరుగా సమాధానాలు చెప్పారు. ఇక ఓ రాజకీయనేత కుమారుడు పట్టుబడ్డాడంటూ మీడియాలో ప్రసారం కాగానే ఆ కుటుంబం వెంటనే స్పందించి తమవాడు అక్కడ లేడంటూ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే మీడియాలో వచ్చిన పేరుతో ఉన్న కొడుకు లేడు కానీ ఆ రాజకీయ నాయకుడి ఇంకో కొడుకు మాత్రం పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎక్కడ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా ఇలాగే బుకాయించేస్తున్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో అదుపు తప్పిన వేగంతో దూసుకొచ్చి ఓ రాజకీయ నాయకుడి తనయుడు ఓ చంటి బిడ్డ ప్రాణాన్ని బలిగొన్న ఘటనలో కూడా ఆ నేత ఆ కారులో తన కొడుకే లేడంటూ గట్టిగా వాదించాడు. తీరా చూస్తే కారులో వెనుక సీటులో ఆ నేత కొడుకు దర్జాగా కూర్చొని ఉన్నాడు. ఇక శివార్లలో రిసార్ట్లకు వెళ్తే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇలాంటి గానా బజానాలు, రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీలు కోకొల్లలు. దొరికిన సందర్భాల్లో ప్రముఖులు తమ పిల్లలను ఇలాగే వెనుకేసుకొస్తున్నారు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్గా నాగేశ్వర్రావు బంజారాహిల్స్ నూతన ఇన్స్పెక్టర్గా 2004 బ్యాచ్కు చెందిన కె. నాగేశ్వర్రావును నియమిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. గతంలో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డీఎస్ఐగా పని చేశారు. బంజారాహిల్స్ సీఐగా పని చేసిన పూసపాటి శివచంద్రను విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన కారణంగా సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో నాగేశ్వర్రావును నియమించారు. -
బంజారాహిల్స్ డ్రగ్స్ కేసు: తీవ్రంగా స్పందించిన రేణుకా చౌదరి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్లోని పుడింగ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి ఆ పబ్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటుపబ్ యజమానులతో సహా 148 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. డ్రగ్స్ వ్యవహారం పూర్తి వివరాలను కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కాగా, ఆ పబ్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి కుమార్తె తేజస్విని చౌదరిదంటూ ప్రచారం జరుగడంతో ఆమె స్పందించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలో రాడిసన్ బ్లూ హోటల్ లో ఉన్న ఫుడింగ్ అండ్ మింక్ బార్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. అయితే, మీడియాలోని కొన్ని వర్గాలు ఆ పబ్ రేణుకా చౌదరి కూతరు తేజస్విని చౌదరిదని ప్రచారం చేస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ.. పుడింగ్ అండ్ మింక్ పబ్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలతో మా అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన కుమార్తె తేజస్వినిని పోలీసులు అరెస్ట్ చేయలేదని, అసలు డ్రగ్స్ కేసులో తన కూతురిక ప్రమేయం లేదని తెలిపారు. చదవండి: డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ.. ‘ఆ కోడ్ చెప్తేనే అనుమతి’ -
బంజారాహిల్స్ రేవ్ పార్టీ: వివరణ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj Talks With Media Over Drugs Case: బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ రేవ్ పార్టీ టాలీవుడ్లో సంచలనం రేపుతుంది. ఈ పార్టీలో ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం హాట్ టాపిక్గా మారింది. ఆదివారం రాత్రి ఈ పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారు. చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన.. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు 145 మందిని బయటకు పంపించివేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సాక్షి టీవీతో మాట్లాడాడు. డ్రగ్స్ వ్యవహరంతో తనకు సంబంధంలేదని స్పష్టం చేశాడు. ఆదివారం జరిగిన ఈ పార్టీకి తl కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యానని, తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ జరిగినట్లు తెలిపాడు. చదవండి: రామ్ చరణ్ గొప్ప మనసు, ఆర్ఆర్ఆర్ టీం ఒక్కొక్కరికి తులం బంగారం.. ఈ పార్టీలో తను అసలు డ్రగ్స్ తీసుకోలేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, అసలు డ్రగ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదన్నాడు. ఎవరో ఇద్దరి ముగ్గురి వల్ల అందరికి చెడ్డ పేరు వచ్చిందని పేర్కొన్నాడు. అలాగే లేట్నైట్ వరకు పబ్ నిర్వహిస్తుంటే యాజమాన్యాన్ని నిలదీయాలి, కానీ ఇలా మమ్మల్ని పలిచి ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచిన వెళ్తానని, ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం లేనప్పడు తాను భయపడాల్సిన అవసరం లేదని రాహులు పేర్కొన్నాడు. -
డ్రగ్స్ కేసులో నాగబాబు కుమార్తెకు నోటీసులు
Pudding And Mink Pub Raid: సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పబ్ యజమానులతో సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పబ్లో డ్రగ్స్(కొకైన్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పోలీసుల రాకతో పబ్లోని యువతీ యువకులు డ్రగ్స్ను కిటికీ నుంచి కింద పడేశారు. కాగా, బయట పడేసిన మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు ఉన్నారు. పట్టుబడిన వారిలో నాగబాబు కుమార్తె నిహారిక, టీడీపీ ఎంపీ కుమారుడు, మాజీ ఎంపీ కుమారుడు తదితర ప్రముఖులు ఉన్నారు..కాగా, ఈ కేసులో నిహారికాను విచారించిన తర్వాత ఆమెకు నోటీసులు ఇచ్చారు. మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. అర్ధరాత్రి పబ్పై దాడులు.. పోలీసుల అదుపులో ప్రముఖ సింగర్.. మరోవైపు.. పబ్ విషయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పబ్పై గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. అయితే, పబ్ మాజీ ఎంపీ కుమార్తెది కావడంతో పోలీసుల చూడనట్టు వదిలేశారని తెలుస్తోంది. ఈ కేసులో సీఐ శివచంద్రను సస్పెండ్ చేసి ఏసీపీ సుదర్శన్కు ఛార్జ్ మెమోను అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఫుడింగ్ మింక్ పబ్లో డ్రగ్స్ వాడినట్టు తెలిపారు. పబ్యాజమాన్యమే డ్రగ్స్ సప్లై చేసిందని స్పష్టం చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తే డ్రగ్స్ సప్లై చేసినట్టు అంగీకరించారు. ఆ హోటల్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పబ్ల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు డ్రగ్స్ కేసులో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు ఉన్నతాధికారులు. అసలు పబ్ల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే దానిపై నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రంగంలోకి దిగింది. వీఐపీలు, వీవీఐపీల పిల్లల తీరుపై దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. పబ్ల్లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు. అదే సమయంలో పబ్ యాజమాన్యం, సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ సప్లై చేసిన పెడర్ల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. -
పబ్స్పై డ్రగ్స్ పడగ
Pudding And Mink Pub Raid, సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: గంజాయి నుంచి కొకైన్ దాకా.. రోడ్లపైనే డ్రగ్స్ అమ్మకాలు.. గోవాల్లో పార్టీలు.. యూట్యూబ్లో చూసి తయారుచేసి విక్రయాలు.. మితిమీరి వాడిన యువకుడు చనిపోవడం.. ఇలా కొద్దిరోజులుగా మాదకద్రవ్యాల వ్యవహారం ఆందోళన రేపుతుంటే.. ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున పబ్బులో డ్రగ్స్ గబ్బు బయటపడింది. అర్ధరాత్రి దాటినా యువతీ యువకులు ‘మత్తు’లో చిందేస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేయడం, అక్కడ పలువురు ప్రముఖుల పిల్లలు ఉండటం సంచలనంగా మారింది. హైదరాబాద్లోని బంజా రాహిల్స్ రోడ్ నం.6లో ఉన్న ర్యాడిసన్ బ్లూప్లాజా హోటల్కు చెందిన ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో ఆదివారం తెల్లవారుజామున నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని.. పబ్ సిబ్బంది సహా 148 మందిని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఇందులో 90 మంది యువకులు, 38 మంది యువతులు, 18 మంది స్టాఫ్, ఇద్దరు నిర్వాహకులు ఉన్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా సిద్ధార్థ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, బిగ్బాస్ విజేత, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తదితరులు ఉన్నారు. పబ్బులో డ్రగ్స్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేశారు, ఆ ఏరియా ఏసీపీ మంత్రి సుదర్శన్కు చార్జ్మెమో జారీ చేశారు. 24 గంటల లిక్కర్ అనుమతి పేరిట.. ర్యాడిసన్ బ్లూప్లాజా స్టార్ హోటల్ కావడంతో దానిలోని బార్ అండ్ రెస్టారెంట్కు 24 గంటలూ మద్యం సరఫరా చేసే అనుమతి ఉంది. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు గత నెల 16న కాసిబట్ట అశోక్ పేరుతో రెన్యువల్ అనుమతి పత్రం జారీ చేశారు. ఇక్కడ ఏ సమయంలోనైనా మద్యం లభిస్తుంటుంది. ఈ క్రమంలోనే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్తోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన వీఐపీలు, ప్రముఖులు, వారి సంతానం ఈ హోటల్కు క్యూ కడుతుంటారు. ఈ అనుమతిని అడ్డం పెట్టుకున్న హోటల్ నిర్వాహకులు.. అందులోని పబ్ను సైతం ఇష్టానుసారం నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసు, ఎక్సైజ్ అధికారులెవరైనా తనిఖీలకు వస్తే.. తమకు 24 గంటలు లిక్కర్ సరఫరా చేసే అనుమతి ఉందంటూ చూపిస్తున్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ పబ్లో ఈ దందా నడుస్తోంది. మెంబర్షిప్ ద్వారా వచ్చే యాక్సెస్ కార్డుతో మాత్రమే పబ్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తుంటారు. దీనిని తమకు అనువుగా మార్చుకున్న కొందరు పెద్దలు, వారి పిల్లలు ఫుడింగ్ అండ్ మింక్ పబ్ను వారాంతాల్లో రేవ్ పార్టీలకు అడ్డాగా వాడుకుంటున్నారు. కోడ్ చెప్పిన వారికే ఎంట్రీ.. ఈ పబ్లో శనివారం అర్ధరాత్రి రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు రెండు, మూడు రోజుల ముందే ‘వీఐపీ సర్కిల్’కు సమాచారం వెళ్లింది. పబ్కు సంబంధించిన ప్రత్యేక యాప్ ద్వారా, ఎంపిక చేసుకున్న వాట్సాప్ గ్రూపుల ద్వారా.. ఓ బర్త్డే పార్టీ పేరిట ‘డ్రగ్ ఈవెంట్’ నిర్వాహకులు ‘కస్టమర్ల’కు ఆహ్వానం పంపారు, వారికి ప్రత్యేకంగా కోడ్వర్డ్స్ ఇచ్చారు. ఆ కోడ్ చెప్పినవారిని మాదకద్రవ్యాలతో వచ్చినా తనిఖీలు లేకుండా లోనికి పంపేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలా ఎల్ఎస్డీ, కొకైన్, గంజాయి పెద్ద ఎత్తున పబ్లోకి చేరింది. రాత్రి 9 గంటలకు మొదలైన హడావుడి అర్ధరాత్రి 12 గంటలకు జోరందుకుంది. అప్పటికే హోటల్లో బసచేసిన కొందరు బడాబాబులు పబ్లోకి చేరుకున్నారు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.. శనివారం సాయంత్రం నుంచే నిఘా పెట్టారు. రేవ్ పార్టీ సమాచారాన్ని ధ్రువీకరించుకున్నారు. నార్త్, సెంట్రల్, వెస్ట్జోన్లకు చెందిన టాస్క్ఫోర్స్ బృందాలు.. దాదాపు 40 మంది సివిల్ పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో పబ్పై దాడి చేశాయి. ఎక్కడిక్కడ డ్రగ్స్ను విసిరేసి.. పబ్లో పోలీసులు ప్రవేశించగానే.. నిర్వాహకులు, డ్రగ్స్ వాడుతున్నవారు అవాక్కయ్యారు. తమ వద్ద ఉన్న డ్రగ్స్ను పూలకుండీల్లో, స్ట్రాలు ఉంచే డబ్బాల్లో దాచేశారు. కొందరు బాత్రూమ్ల్లో పడేశారు. కిటికీల్లోంచి కొకైన్ షాట్స్, ఎల్ఎస్డీ బోల్ట్స్ను బయటికి విసిరేశారు. పోలీసులు ఆ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. గల్లా సిద్ధార్థ్, రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల సహా మొత్తం 148 మందిని బంజారాహిల్స్ పోలీసుస్టేషన్కు తరలించారు. పబ్ లీజుకు తీసుకొని నడిపిస్తున్న అభిషేక్ ఉప్పాల (39)తోపాటు మేనేజర్ మాదారం అనిల్కుమార్ (35)ను అరెస్టు చేశారు. ఈ పార్టీ నిర్వాహకుడిగా అనుమానిస్తున్న అర్జున్ వీరమాచినేని కోసం గాలిస్తున్నారు. ఈవెంట్ మేనేజర్గా ఉన్న కునాల్, డీజే శశిధర్రావులు రేవ్పార్టీ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో పాల్గొన్నవారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. సొంత పూచీకత్తు ఆదివారం ఉదయం విడుదల చేశారు. కాగా.. దాడి సందర్భంగా క్లూస్టీమ్లు పబ్లోపల, చుట్టుపక్కల ప్రాంతాల్లో శాంపిల్స్ సేకరించాయి. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపి విశ్లేషించనున్నారు. కోడ్వర్డ్స్తో సరఫరా.. పబ్లో జరిగిన పార్టీలో యువతీయువకులు కోడ్వర్డ్స్తో డ్రగ్స్ను పిలుచుకున్నట్టు పోలీసువర్గాలు గుర్తించాయి. మేనేజర్ అనిల్కుమార్ స్ట్రాలు ఉంచే డబ్బాల్లో కొకైన్ పెట్టి.. వినియోగదారులకు అందజేశాడని తెలిసింది. పోలీసులు దాడి చేసినప్పుడు అదేమిటని అడిగితే.. మాక్టైల్లో కలిపే షుగర్ అని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని సమాచారం. డ్రగ్స్ తీసుకున్నది ఎవరెవరు? ఇటీవల డ్రగ్స్పై పోలీసుల నిఘా పెరగడంతో.. ఫుడింగ్ అండ్ మిక్ పబ్ డ్రగ్స్ వినియోగదారులు, విక్రేతలకు సేఫ్జోన్గా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొన్నాళ్లుగా తరచూ డ్రగ్స్, రేవ్ పార్టీలు జరుగుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది తేల్చేందుకు పబ్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాలని నిర్ణయించారు. ఆదివారం తెల్లవారుజామున దాడి సందర్భంగా సీసీ ఫుటేజీ ఉన్న డీవీఆర్ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని వీడియోల ఆధారంగా డ్రగ్స్ను ఎవరెవరు తీసుకొచ్చారు. ఎంత మంది డ్రగ్స్ తీసుకున్నారు? సరఫరా చేసింది ఎవరన్నది తేలిపోతుందని పోలీసులు చెప్తున్నారు. సీఐ సస్పెండ్.. ఏసీపీకి మెమో ఫుడింగ్ అండ్ మింక్ పబ్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉంది. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు కనిపెట్టలేకపోయారా? లేక సహకరించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. మరోవైపు తక్షణ చర్య కింద బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్రను సస్పెండ్ చేస్తూ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఆ బాధ్యతలను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు అప్పగించారు. పర్యవేక్షణ విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ బంజారాహిల్స్ డివిజన్ ఏసీపీ మంత్రి సుదర్శన్కు చార్జ్మెమో జారీ చేశారు. నిహారికకు సంబంధం లేదు: నాగబాబు సాక్షి, హైదరాబాద్: పబ్లో డ్రగ్స్ కేసుతో తన కుమార్తె నిహారికకు ఎలాంటి సంబంధం లేదని జనసేన నేత, సినీనటుడు నాగబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘గత రాత్రి రాడిసన్ అండ్ బ్లూ పబ్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం.. నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ వేళల పరిమితికి మించి నడపడం వల్ల పబ్పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు అంతా క్లియర్.. నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకూడదని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’.. అని నాగబాబు ఆ వీడియోలో పేర్కొన్నారు. అనుమానితుల శాంపిల్స్ ఫోరెన్సిక్కు..! ► డ్రగ్స్ ఎవరెవరు వాడారనేది తేల్చడంపై పోలీసుల దృష్టి పబ్లో నిర్వాహకులు సహా మొత్తం 148 మంది పోలీసులకు చిక్కారు. పబ్ లోపల, బయట ప్రాంగణంలో తప్ప ఎవరి వద్దా నేరుగా డ్రగ్స్ లభించలేదు. సాధారణంగా మాదకద్రవ్యాల కేసులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నమోదు చేస్తారు. దాని ప్రకారం డ్రగ్స్ కలిగి ఉన్న వారిని మాత్రమే అప్పటికప్పుడు అరెస్టు చేయవచ్చు. పబ్లో డ్రగ్స్ దొరికినా వాటిని ఎవరు వాడారన్నది ఇప్పుడే తేల్చలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పబ్లో పట్టుబడినవారి నుంచి రక్తం, వెంట్రుకలు, ఇతర నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి కోర్టు అనుమతి అవసరంకావడంతో న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. డ్రగ్స్ వినియోగించినవారి తల వెంట్రుకల్లో దాదాపు ఆరు నెలల పాటు ఆనవాళ్లు ఉంటాయని పోలీసులు చెప్తున్నారు. ఐదు ప్యాకెట్ల కొకైన్ లభించింది సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ ‘హెచ్–న్యూ’విభాగాన్ని ఏర్పాటు చేశారు. దానితో పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టి, కొన్నిసార్లు డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నాం. ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో దాడి చేసి, 148 మందిని అదుపులోకి తీసుకున్నాం. ఐదు ప్యాకెట్ల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. ఈ పబ్ వాళ్లు తమకు 24 గంటలు కార్యకలాపాలు నిర్వహించే అనుమతి ఉందంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. విచారణ చేసి ఎవరెవరు డ్రగ్స్ వాడారో తేలుస్తాం. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ పిలిచి విచారిస్తాం. – జోయల్ డెవిస్, వెస్ట్జోన్ డీసీపీ పోలీసులే కస్టమర్లలా మారి.. ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్, రేవ్ పార్టీలు చాలాకాలంగా సాగుతున్నట్టు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీనితో నిఘా పెట్టారు. ఈ పబ్ సభ్యత్వం కోసం ఏడాదికి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా పామ్ (ఫుడింగ్ అండ్ మింక్) పేరుతో ఓ యాప్ నిర్వహిస్తున్నారు. పార్టీలకు రావాలని భావించే వారంతా దాన్ని డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకోవాలి. పబ్లోకి ప్రవేశించే సమయంలో దానికి సంబంధించిన ఓటీపీని చెప్పాల్సి ఉంటుంది. పబ్ వ్యవహారం ఇంత పకడ్బందీగా సాగుతుండటంపై టాస్క్ఫోర్స్ పోలీసులకు అనుమానం వచ్చింది. దీనిని ఛేదించడానికి పది రోజుల కింద పక్కాగా డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. కొందరు పోలీసులు కస్టమర్లుగా రిజిస్టర్ చేసుకున్నారు. శనివారం రాత్రి యాప్, ఓటీపీల తతంగం పూర్తి చేసుకుని పబ్లోకి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో డ్రగ్స్ వినియోగం మొదలవడాన్ని గమనించి అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే కాపుకాసిన ప్రత్యేక బృందాలు పబ్పై దాడి చేసి.. రేవ్ పార్టీ గుట్టురట్టుచేశారు. -
కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం
సాక్షి,బంజారాహిల్స్(హైదరాబాద్): కళాశాలకు వెళ్లళ్లో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని శ్రీరాంనగర్లో నివసించే హస్నియా బేగం(19) మహబూబియా జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నది. ఈ నెల 17న కాలేజీకని వెళ్లిన హస్నియా సాయంత్రం తిరిగి రాకపోవడంతో తండ్రి షేక్ మషువుద్దీన్ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని యువతి కోసం గాలింపు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 90308 42080లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. (చదవండి: ప్రేమించిన యువతి ఫోన్ స్విచ్ ఆఫ్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య.. ) -
క్లాస్లో ఫస్ట్.. ఆన్లైన్ క్లాసులని చెప్పి తలుపులు వేసి..
సాక్షి,బంజారాహిల్స్: యూసుఫ్గూడ సమీపంలోని శ్రీకృష్ణానగర్లో నివసించే ఏముల నవిక(13) అనే బాలిక మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న నవిక తల్లి విధులకు వెళ్లిన తర్వాత తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మోహన్బాబు ఇంటికి వచ్చి తలుపు తట్టినా తెరవకపోవడంతో బెడ్రూమ్ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కూతురు విగతజీవిగా కనిపించడంతో వెంటనే తలుపులు పగలగొట్టి ఆమెను అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్లకు హాజరవుతున్న నవిక క్లాస్లో ఫస్ట్ కాగా ఆ స్కూల్లోనే బ్రిలియంట్ స్టూడెంట్గా టీచర్లు మెప్పును పొందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేట్ స్కూల్లో దారుణం..పిడిగుద్దులతో విద్యార్థిపై దాడి..చివరికి..
బంజారాహిల్స్ (హైదరాబాద్): నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. డిజిటల్ క్లాస్లో అల్లరి చేస్తున్న సహవిద్యార్థిని వారించడమే అతడికి శాపమైంది. ఆ విద్యార్థితోపాటు అతడి స్నేహితుడూ తరగతి గదిలోనే దాడి చేశారు. గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. శ్రీకృష్ణానగర్లోని బీ బ్లాక్కు చెందిన సయ్యద్ మంజూర్ (15) స్థానికంగా ఉన్న సాయికృప హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఇతడు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో డిజిటల్ క్లాస్ వింటున్నాడు. ఆ సమయంలో తరగతి గదిలో టీచర్లు లేరు. హైలం కాలనీకి చెందిన సహవిద్యార్థి క్లాస్ వినకుండా కాగితాలతో రాకెట్లు, పడవలు చేసి గాల్లోకి విసురుతున్నాడు. ఇది గమనించిన మంజూర్ అతడిని వద్దంటూ వారించాడు. నన్నే నిలదీస్తావా? అంటూ అతడు రెచ్చిపోయాడు. మంజూర్ కాలర్ పట్టుకుని కొట్టాడు. అతడి స్నేహితుడు కూడా కలగజేసుకుని మంజూర్పై దాడి చేశాడు. ఇద్దరూ పిడిగుద్దులు కురిపించారు. మంచినీటి బాటిల్, స్కేల్తో కొట్టారు. ఈ దెబ్బల తాకిడికి మంజూర్ క్లాస్రూమ్లోనే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు మంజూర్ను కృష్ణానగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి గమనించిన వైద్యులు మెరుగైన చికిత్సకు సిఫార్సు చేశారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండె కొట్టుకునే వేగం అంతకంతకూ మందగిస్తోందని గుర్తించారు. దీంతో అపోలో ఆస్పత్రికి తరలించగా, మంజూర్ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కన్నుమూశాడు. ఫుటేజీ పరిశీలించిన పోలీసులు మంజూర్ తండ్రి హబీబ్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆధారాలు సేకరించారు. స్కూలు, క్లాసుల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీలను జూబ్లీహిల్స్ డీఐ రమేష్, ఎస్ఐ ప్రభాకర్రెడ్డి పరిశీలించారు. స్కూల్ ప్రిన్సిపల్ అంజనారావు నుంచి వివరాలు సేకరించారు. డిజిటల్ క్లాస్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉపాధ్యాయులు లేకపోవడంపై ఆరా తీశారు. నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే బాధ్యులపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంజూర్ తండ్రి నిరుద్యోగి కాగా.. తల్లి ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. దాడి చేసిన విద్యార్థి కుటుంబమూ దిగువ మధ్యతరగతి వర్గానికి చెందినదేనని పోలీసులు చెప్తున్నారు. -
మరదలితో కలిసి భార్య చిన్నచూపు చూసిందని..
సాక్షి, హైదరాబాద్: మరదలితోకలిసి భార్య చిన్నచూపు చూసిందని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని సయ్యద్నగర్ ఫస్ట్ లాన్సర్లో నివసించే సయీద్బిన్ మాబ్రుక్(40) ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. ఈ నెల 9న భార్య షాహిన్ బేగం గొడవ పడి తన చెల్లెలు ఇంటికి వెళ్లింది. దీంతో ఈ నెల 12వ తేదీన రాత్రి తన భార్యను తీసుకురావడానికి సయీద్ అక్కడికి వెళ్లిగా భార్యతో పాటు ఆమె చెల్లెలు కించపరిచారు. అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన సయీద్ తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యకు భార్య, తోడల్లుడు, ఆయన మరదలు కారణమని వారిపై చర్యలు తీసుకోవాలంటూ మహ్మద్ బిన్ హమీద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..) -
మిసెస్ ఇండియా తెలంగాణగా ఇందూ అగర్వాల్
బంజారాహిల్స్: మిసెస్ ఇండియా తెలంగాణగా నగరానికి చెందిన ఇందూ అగర్వాల్ ఎంపికయ్యారు. మంగళవారం వర్చువల్గా ఫైనల్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో నగరానికి చెందిన ఇందూ అగర్వాల్ మిసెస్ ఇండియా తెలంగాణ టైటిల్ను దక్కించుకుంది. మిసెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విజేతగా బైశాలి పాండా నిలిచారు. 40నుంచి 60 ఏళ్ల వయసు కేటగిరి అయిన క్లాసిక్విభాగంలో తెలంగాణకు చెందిన స్నేహ చౌదరి, ఏపీకి చెందిన పద్మావతి టైటిల్స్ దక్కించుకున్నారు. వీరితో పాటు మలేషియాలో నివాసం ఉంటున్న అలంకృత దండు మిసెస్ తెలంగాణ ఎన్నారై టైటిల్ను గెలుచుకున్నారు. నాలుగేళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, కోవిడ్ నిబంధనల కారణంగా ఈ సారి వర్చవల్ పద్ధతిలో నిర్వహించినట్లు నిర్వాహకురాలు మమతా త్రివేది తెలిపారు. చదవండి: (జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి.. నిద్రమత్తులో..) -
మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. 3 నెలలుగా అదే పనిలో ఓనర్ కొడుకు..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో మహిళ స్నానం చేస్తుండగా కేబుల్ టెక్నిషియన్ వీడియో తీసి అడ్డంగా దొరికిన ఘటనను మరవకుండానే నగరంలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని మాగంటి కాలనీలో నివసించే ఓ మహిళ(35) బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ఇంటి యజమాని కొడుకు దిలీప్ సెల్ఫోన్లో వీడియోలు తీస్తున్నట్లు గమనించింది. వెంటనే ఆమె తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. చదవండి: (నర్సుని బంధించి అత్యాచారం.. అదే రోజు బస్సెక్కించి..) ఇదే విషయాన్ని ఇంటి యజమాని దృష్టికి కూడా తీసుకెళ్లగా తమ కొడుకు అలాంటి వాడు కాదంటూ వారు వెనకేసుకొచ్చారు. దీంతో బాధితురాలు భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దిలీప్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత మూడు నెలల నుంచి మహిళ బాత్రూమ్లో స్నానం చేస్తున్న దృశ్యాలు వీడియో తీస్తున్నట్లుగా నిందితుడు దర్యాప్తులో వెల్లడించాడు. చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం) -
Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: మహిళ బాత్రూమ్లో స్నానం చేస్తుండగా వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యాడో యువకుడు. బంజారాహిల్స్ రోడ్నెంబర్-2లో ఓ టెక్నీషియన్ చేసిన నిర్వాకమిది. కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన టెక్నీషియన్.. మహిళా బాత్రూమ్లో స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించాడు. టెక్నీషియన్ చేస్తున్న పనిని గమనించిన కొందరు స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. చదవండి: (టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..) -
బంజారాహిల్స్లో కారు బీభత్సం..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్-2లో ఆదివారం అర్ధరాత్రి కారు బీభత్సాన్ని సృష్టించింది. కారు అతివేగంతో రోడ్డును దాటుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులు త్రిభువన్(23), ఉపేందర్(25)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు రెయిన్బో ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు తెలిపారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులు రోహిత్గౌడ్, సాయిసోమన్ వాహన ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం తర్వాత నిందితుడు.. జూబ్లీహిల్స్లోని తన ఇంటికి వెళ్లి కారును పార్క్ చేశాడు. ఈ నేపథ్యంలో.. అక్కడ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ అనుమానించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, మృత దేహలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు దేవేంద్రకుమార్ ,అయోధ్య రాయ్ -
ఈ–కేటుగాళ్లు.. అరగంటలో రూ.కోటికి పైగా కొట్టేశారు!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఓ సంస్థను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు పక్కా పథకం ప్రకారం వ్యవహరించారు. దాని సర్వర్లో ఉన్న లోపాన్ని క్యాష్ చేసుకోవడానికి క్లయింట్గా పరిచయమయ్యారు. అదును చూసుకుని సాంకేతిక సమస్య సృష్టించి రూ.1.28 కోట్లు కాజేశారు. సోమవారం రాత్రి కేవలం అరగంట వ్యవధిలోనే ఈ–కేటుగాళ్లు తమ పని పూర్తి చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలన అనంతరం బాధిత కంపెనీ శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మోసం ఇలా... బంజారాహిల్స్కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ వివిధ కంపెనీలకు పేమెంట్ గేట్వేలకు సంబంధించిన సాంకేతిక సేవల్ని అందిస్తోంది. ఆయా కంపెనీలకు సంబంధించిన యూపీఐ లావాదేవీలన్నీ దీని ద్వారానే జరుగుతుంటాయి. బంజారాహిల్స్ సంస్థకు దాదాపు 100 కంపెనీలు క్లయింట్స్గా ఉన్నాయి. ఇటీవల కొందరు సైబర్ నేరగాళ్లు ఒడిస్సాకు చెందిన ఎలక్ట్రికల్ వైర్ల తయారీ కంపెనీ ముసుగులో వీరి వద్దకు వచ్చారు. తమ లావాదేవీలకు సంబంధించిన యూపీఐ సేవల్నీ అందించాలని కోరారు. దీనికి నగర సంస్థ అంగీకరించడంతో పాటు వాళ్ల ఖాతాలను తమ సర్వర్లో రిజిస్టర్ చేసింది. ఒక సంస్థ లేదా వ్యక్తి నుంచి మరో సంస్థ లేదా వ్యక్తికి యూపీఐ ద్వారా చెల్లింపులు జరగాలంటే ఆ మొత్తం బంజారాహిల్స్ సంస్థకు చెందిన పూల్ ఖాతా నుంచి జరుగుతుంది. ఒకరి ఖాతాలో ఉన్న డబ్బు దీని ద్వారానే మరొకరి ఖాతాలోకి వెళ్తుంది. కొన్ని రోజుల పాటు నగర సంస్థ కార్యకలాపాలను పరిశీలించిన సైబర్ నేరగాళ్లు సోమ వారం రాత్రి అసలు కథ మొదలెట్టారు. ఆ రోజు రాత్రి నగర సంస్థకు చెందిన సర్వర్లో సాంకేతిక సమస్య సృంష్టించారు. ఆపై లావాదేవీలు చేయడం ద్వారా తమ ఖాతా ల్లో డబ్బు లేకపోయినా పేమెంట్ గేట్వే సేవల్ని అందించే సంస్థ పూల్ అకౌంట్ నుంచి ఇతరుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఇలా కేవలం అరగంట వ్యవధిలో రూ.1.28 కోట్లను ఎనిమిది వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించారు. మరికొంత కొల్లగొట్టే ప్రయత్నాలు చేసినా...సర్వర్లో సమస్యపై అలారం రావడంతో నగర సంస్థ సత్వరం స్పందించింది. ఆ లోపాన్ని సరిచేయడంతో సైబర్ నేరగాళ్లు మరికొంత మొత్తం కాజేయలేకపోయారు. ప్రతి రోజూ నిర్వహించే ఆడిటింగ్ నేపథ్యంలో జరిగిన స్కామ్ను బంజారాహిల్స్ సంస్థ గుర్తించింది. దీనిపై ప్రాథమిక పరిశీలన పూర్తి చేసి శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఒడిస్సాకు చెందినదిగా చెప్పిన ఎలక్ట్రికల్ కంపెనీకి చెందిన దానితో పాటు నగదు బదిలీ అయిన ఖాతాలను పరిశీలించారు. ప్రస్తుతం వాటిలో పెద్ద మొత్తం బ్యాలెన్స్ లేదని గుర్తించారు. పథకం ప్రకారం ఈ నేరం చేసిన సైబర్ నేరగాళ్లు ఖాతాల్లో పడిన డబ్బును డ్రా చేయడమో, మళ్లించడమో చేశారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారాలకు పాల్పడిన వారిని గుర్తించడానికి సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఆయా బ్యాంకుల నుంచీ సమాచారం సేకరిస్తున్నారు. ఒడిస్సాకు చెందినదిగా చెప్పిన కంపెనీ నేరం జరగడానికి ముందు, ఆ తర్వాత బంజారాహిల్స్లోని సంస్థ సేవల్ని వినియోగించుకోకపోవడాన్ని అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. -
రెండున్నర లక్షలు మాయం.. డబ్బుకోసం వెతుకుతుండగా బాత్రూంలోకి వెళ్లి..
సాక్షి, బంజారాహిల్స్: నగదు దొంగిలించాడు కానీ.. పట్టుబడితే శిక్షిస్తారేమోనన్న భయంతో ఆ డబ్బును బాత్రూంలోని కమోడ్లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో అక్షరాలా రూ.రెండున్నర లక్షలు మరుగుదొడ్లోని మ్యాన్హోల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.18లో నివసించే ప్రకాశ్చంద్ జైన్ అనే వ్యాపారి దీపావళి సందర్భంగా ఈ నెల 2వ తేదీన రాత్రి బంధుమిత్రులతో కలిసి ఇంట్లో లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం అమ్మవారి ఎదుట రూ. 3.50 లక్షల నగదు కట్టలు ఉంచాడు. పూజల అనంతరం ఏర్పాటుచేసిన విందు కోసం 18 మంది కేటరింగ్ సిబ్బంది వచ్చారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో విందు ముగిశాక ప్రకాశ్చంద్తో పాటు కుటుంబ సభ్యులు బంధుమిత్రులను పంపించేందుకు గేటు వరకు వెళ్లారు. చదవండి: (ఆస్ట్రేలియా నుంచి నిత్యం వీడియో కాల్స్.. నగ్న వీడియోలు, ఫొటోలతో) అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న కేటరింగ్ బాయ్ షేక్ చాంద్ రజాక్ అమ్మవారి ఎదుట పెట్టిన డబ్బు కట్టలను ఎవరూ చూడకుండా తన జేబులో పెట్టుకున్నాడు. పది నిమిషాల్లో తిరిగి వచ్చిన ప్రకాశ్చంద్కు నగదు కట్టలు కనిపించలేదు. దీంతో డబ్బుకోసం అందరూ వెతుకుతుండగా తనను ఎక్కడ పట్టేస్తారోనని రజాక్ వెంటనే బాత్రూంలోకి వెళ్లి రూ. 2.50 లక్షలను వెస్ట్రన్ టాయ్లెట్లో పడేసి ఫ్లష్ నొక్కాడు. దీంతో డబ్బు కట్టలన్నీ డ్రెయినేజీ పైపుల్లోంచి మ్యాన్హోల్లోకి వెళ్లాయి. దొంగలించిన నగదులో రూ. 75 వేలను తన ప్యాంట్ జేబులో దాచుకోగా దొంగను గుర్తించిన యజమాని వాటిని తీసుకొని మిగతా డబ్బుకోసం ఆరా తీశారు. కమోడ్లో పడేసానని చెప్పగానే అందులో చూడగా రూ. 500 నోట్లు నాలుగు తేలుతూ కనిపించాయి. ఘటనకు సంబంధించి బుధవారం యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రజాక్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: TS: మానవత్వం చాటుకున్న వైఎస్ షర్మిల) -
బెదిరించానని చెబితే ఖతం చేస్తా...
సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో దారికాచి ఓ స్కూటరిస్ట్ను బ్లేడ్తో బెదిరించి బలవంతంగా డబ్బులు లాక్కున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని హైలైన్ కాంప్లెక్స్లో నివసించే ముస్తఫా హష్మి అనే వ్యాపారి ఆదివారం అర్ధరాత్రి విధులు ముగించుకొని తన బైక్పై బంజారాహిల్స్ రోడ్ నం. 12 ఎన్బీటీ నగర్ కమాన్ మీదుగా ఇంటికి వెళ్తున్నాడు. ఎన్బీటీ నగర్ కల్లు కంపౌండ్ వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు హష్మిని బలవంతంగా ఆపాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. లేవని చెప్పగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసభ్యకరంగా దూషిస్తూ బెదిరించాడు. అంతటితో ఆగకుండా బ్లేడ్తో మెడ కోస్తానంటూ బెదిరించి బలవంతంగా జేబులో ఉన్న రూ. 5 వేలు లాక్కున్నాడు. డబ్బులు లాక్కున్నట్లు ఎవరికైనా చెబితే నిన్ను ఖతం చేస్తానంటూ బెదిరించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత బెదిరించిన వ్యక్తి కోసం ఆరా తీయగా బంజారాహిల్స్రోడ్ నం. 12లోని భోలానగర్కు చెందిన అఫ్రిది అహ్మద్ అలియాస్ అజహర్గా తేలింది. ఈ మేరకు అఫ్రిది అహ్మద్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 341, 384, 506, 504ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఓ వైపు చదువు, మరో వైపు ప్రేమ.. భరించలేక..) -
Drugs: అలవాటయ్యే వరకు అగ్గువ!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): గంజాయి సంబంధిత ద్రవ పదార్థమైన హష్ ఆయిల్ విక్రయంలో ఓ ముఠా కొత్త ఎత్తు వేసింది. ప్రధానంగా యువత, విద్యార్థులను టార్గెట్గా చేసుకున్న వీళ్లు..ఈ మత్తుకు అలవాటు పడేవరకు వారికి తక్కువ రేటుకు అమ్మారు. బానిసలుగా మారిన తర్వాత భారీ రేటు కట్టి విక్రయించారు. ఈ ముఠా వ్యవహారంపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారని టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి బుధవారం వెల్లడించారు. సనత్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ మహబూబ్ అలీ వృత్తిరీత్యా డ్రైవర్ అయినప్పటికీ నేర చరితుడు. మాదాపూర్లో రెండు దోపిడీ, మరో హత్యాయత్నం కేసులతో పాటు ఎస్సార్నగర్లో డ్రగ్స్ కేసు ఇతడిపై నమోదై ఉన్నాయి. గంజాయి, హష్ ఆయిల్ వినియోగానికి బానిసగా మారిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం హష్ ఆయిల్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయించాలని భావించాడు. ఈ ఆలోననను తన స్నేహితులైన సనత్నగర్ వాసులు మహ్మద్ సర్ఫ్రాజ్, మహ్మద్ హాజీ పాషాలకు చెప్పడంతో వాళ్లూ జట్టుకట్టారు. కొన్నాళ్ల క్రితం ఈ త్రయం ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు వెళ్లింది. అక్కడి వెంకట్ అనే వ్యక్తి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేసుకువచ్చింది. తన స్నేహితులు, పరిచయస్తులైన వారికి తక్కువ రేటుకు అమ్మడం మొదలెట్టింది. వారి ద్వారా పరిచయమైన వారికీ ఈ మాదకద్రవ్యం విక్రయించింది. అలా వారిని ఈ మత్తుకు బానిసలుగా మార్చేసిన తర్వాత హష్ ఆయిల్ రేటును అమాంతం పెంచేసి అధిక ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటోంది. హైదరాబాద్తో పాటు సైబరాబాద్ పరిధిలోని వారికీ దీన్ని విక్రయిస్తోంది. ఇప్పుడు వీళ్లు వెళ్లాల్సిన పని లేకుండా ఆర్డర్ చేస్తే చాలా వెంకట్ వివిధ రకాలుగా పార్శిల్ చేసి పంపిస్తున్నాడు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థకియుద్దీన్, కె.చంద్రమోహన్ వలపన్నారు. బంజారాహిల్స్ ప్రాంతంలో హష్ ఆయిల్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి 205 చిన్న బాక్సుల్లో ఉన్న 1.02 లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని కేసును బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న వెంకట్ కోసం గాలిస్తున్నారు. -
ప్రచారం నేతలది.. ఖర్చు జీహెచ్ఎంసీది.. ఎలాగంటారా?
బంజారాహిల్స్: రాజకీయ నేతలు రోడ్లకిరువైపులా, కూడళ్లలో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్పాత్, రోడ్లను సైతం ఆక్రమిస్తుండటంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే క్రమంలో ఫుట్పాత్లపై పెద్ద పెద్ద కర్రలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కూడళ్లలో చెట్లను తొలగించి, గడ్డిని సైతం తవ్వి ఏర్పాటు చేస్తున్నారు. రహదారుల పక్కన ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలతో అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని అగ్రసేన్ చౌరస్తాలో భారీ వర్షంలో వెళ్తున్న ఓ వ్యక్తిపై ఫ్లెక్సీ పడగా ఈ ఘటనలో బాధితుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. (చదవండి: Huzurabad Bypoll: మాట ముచ్చట: అయిలన్నా.. ఏం నడ్తందే?) సొంత నిధులతో.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రతి రోజూ ఏదో ఒకటి కొత్త కటౌట్లు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూనే ఉంటారు. ఈ వ్యవహారంపై నెటిజన్లు మండిపడుతూ జీహెచ్ఎంసీ అధికారులు, మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ నిలదీస్తున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారికి జరిమానాలు విధిస్తున్నామంటూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే.. ఇంత వరకు ఎవరి దగ్గర కూడా జరిమానాలు వసూలు చేసినట్లు కనిపించడం లేదు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మాత్రం డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి వాటిని తొలగిస్తున్నారు. కటౌట్లు ఏర్పాటు చేసిన నేత వాటిని తొలగించే ఖర్చు నుంచి తప్పించుకుంటుండగా జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందం మాత్రం తమ సొంత సిబ్బందితో వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ వాటిని తొలగిస్తుండటం విమర్శలకు దారి తీస్తోంది. కటౌట్ పెట్టిన నేత వాటిని తొలగించే బాధ్యత కూడా ఆయనే తీసుకోవాల్సి ఉండగా జీహెచ్ఎంసీ పుణ్యమా అంటూ తొలగించే ఖర్చులు మిగులుతున్నాయి. (చదవండి: రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..) -
Hyderabad: అమ్ముతావా.. చస్తావా!
సాక్షి, బంజారాహిల్స్: తక్కువ ధరకే ఖరీదైన భూమిని విక్రయించాలని కొంత కాలంగా బెదిరించినా తమ మాట వినలేదనే కోపంతో నగరంలోని బంజారాహిల్స్ పరిధిలో దుండగులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గం కౌడిపల్లికి చెందిన కొత్త హరీష్కుమార్ (36)కు తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కొంత కాలంగా ఈ భూమిపై కన్నేసిన కౌడిపల్లి టీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, కౌడిపల్లి సర్పంచ్ ఎ.సుధీర్రెడ్డి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, బుర్దరం పేట సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, నాయికోటి రాజు, టి.సంతోష్రావు, ఎస్కే ఆసిఫ్, లింగం తదితరులతో పాటు మొత్తం 18 మంది మూడు కార్లలో ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్కు వచ్చారు. ►యూసుఫ్గూడ సమీపంలోని శ్రీకృష్ణదేవరాయ నగర్ భవానీ అపార్ట్మెంట్స్లో అద్దెకుంటున్న హరీష్ కుమార్ ఇంట్లోకి చొరబడ్డారు. ఆయన కాలర్ పట్టుకొని కారులోకి ఈడ్చుకొచ్చారు. అడ్డుగా వచ్చిన హరీష్ తమ్ముడు మహేష్ను కొట్టుకుంటూ కారులోకి ఎక్కిస్తుండగా ఆయన తప్పించుకొని సమీపంలో దాక్కున్నాడు. హరీష్ను కిడ్నాప్ చేసి మూడు కార్లలో నర్సాపూర్ అడవుల వైపు వెళ్లారు. ►తప్పించుకున్న మహేష్ డయల్ 100కు ఫోన్ చేసి తన సోదరుడు హరీష్ కిడ్నాప్ అయిన విషయాన్ని చెప్పాడు. హుటాహుటిన బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కిడ్నాప్ చేసిన కృష్ణగౌడ్ నంబర్ తీసుకొని వెంటనే హరీష్ను తీసుకొని రావాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. దీంతో భయపడ్డ కృష్ణగౌడ్, సుధీర్రెడ్డి తదితరులు బాధిత హరీష్ను కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. ►తన దుస్తులు విప్పేసి దారి పొడవునా తీవ్రంగా కొట్టారని, తొమ్మిది ఎకరాల స్థలాన్ని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలంటూ హెచ్చరించారని, లేకపోతే నర్సాపూర్ అడవుల్లో పెట్రోల్ పోసి చంపేస్తామంటూ బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. సోమవారం సాయంత్రం బాధితుడు నగర పోలీస్ కమిషనర్ను కలిశారు. తనను కిడ్నాప్ చేశారంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ►తనకు ప్రాణహాని ఉందంటూ సెప్టెంబర్ 17న కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని బాధితుడు ఆరోపించారు. ఆ రోజు తన ఫిర్యాదుపై పోలీసులు స్పందించి ఉంటే తనను కిడ్నాప్ చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. కాగా.. కిడ్నాపర్లు విదేశాలకు వెళ్తున్న ఓ ఎమ్మెల్యేకు వీడ్కోలు పలికేందుకు ఎయిర్పోర్టుకు వచ్చి తిరిగి వెళ్తూ ఈ పని చేశారని సమాచారం. -
Banjarahills: భార్యను చంపి.. గడ్డిలో చుట్టేశాడు
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్మెన్గా పని చేస్తున్న వ్యక్తి తన భార్యను హత్య చేసి పరారైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని దుర్గా భవానీనగర్ను ఆనుకొని ఉమెన్ కో–ఆపరేటివ్ సొసైటీలో ఓ బిల్డర్ వద్ద చత్తీస్ఘడ్కు చెందిన అటల్ పార్థి, రేఖా పార్థి(32) గతేడాది కాలంగా పని చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం వారిద్దరి మధ్య గొడవ తీవ్రమవడంతో అటల్ తన భార్య రేఖను హత్య చేసి అదే ప్లాట్ ప్రహరీ వెంబడి గడ్డిలో చుట్టి పడేశాడు. ఇది గమనించి చుట్టుపక్కల వారు జూబ్లీహిల్స్ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న భర్త అటల్పార్థీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నల్లగొండ: పట్టపగలే దారుణం.. మధ్యవయస్కురాలిపై హత్యాచారం -
Banjara Hills: భర్తను చున్నీతో హత్యచేసి.. ఆ తర్వాత
హైదరాబాద్: బంజారాహిల్స్లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను చున్నీతో హత్య చేసి గుండెపోటులో చనిపోయాడంటూ చిత్రీకరించిందో మహా ఇల్లాలు. రెండు నెలల క్రితం జులై 16 ఈ సంఘటన జరిగింది. తాజాగా, నిందితురాలి కొడుకు తన తల్లి హత్య చేసిన విషయాన్ని అతని బాబాయ్ ప్రసాద్కి చెప్పడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జగదీష్కు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే సుశ్రీతను 2007లో వివాహం చేసుకున్నాడు. జగదీష్ డ్రైవర్గా ఉద్యోగం చేసేవాడు. వీరు తమ 11 ఏళ్ల కొడుకుతో కలిసి ఫిలింనగర్లోని బంజారాహిల్స్లో కొన్నెళ్లుగా నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం జులై16న సుశ్రీత భర్తను హాత్యచేసి గుండెపోటుతో చనిపోయాడంటూ ఇంట్లో వారిన నమ్మించింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, బాలుడు తన తల్లే.. తండ్రి జగదీష్ను హత్యచేసిందంటూ చెప్పడంతో ఈ అమానుషం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: దారుణ ఘటన.. ఒకే మర్రికి వెయ్యిమంది ఉరితీత...! -
బంజారాహిల్స్: ఓయో రూమ్స్లో అవసరమైన వారికి..
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.14లో డ్రగ్స్తో పాటు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ టీమ్ అరెస్ట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ ప్రశాంత్నగర్లో మార్ధి శివశంకర్ రెడ్డి(26), బల్కంపేట తులసీ నగర్ జయప్రకాశ్ నగర్లో నివసించే గంధం మణికంఠ(26), వెస్ట్బెంగాల్ డార్జిలింగ్కు చెందిన శిల్పారాయ్(27) ముగ్గురూ కలిసి కొంత కాలంగా అవసరమైన వారికి డ్రగ్స్తో పాటు గంజాయి విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వీరిని బంజారాహిల్స్లో అరెస్ట్ చేశారు. ఓయో రూమ్స్లో అవసరమైన వారికి ఈ డ్రగ్స్ను, గంజాయిని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ను దిగుమతి చేసుకుంటున్నట్లుగా విచారణలో తేలింది. ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసి వీరి నుంచి పెద్ద ఎత్తున గంజాయితో పాటు డ్రగ్స్ను, మొబైల్ ఫోన్స్, మో టార్ బైక్లను సీజ్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఎన్ఏ అజయ్రావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డి, సీఐ పి.నరేందర్, ఎస్ఐ నజీర్ హుస్సేన్, కానిస్టేబుల్ భాస్కర్రెడ్డి, అజీమ్, శ్రీధర్ తదితరులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. చదవండి: ఊరికెళ్లే విషయంలో యువ దంపతుల గొడవ.. ఉదయం లేచేసరికి -
Jubilee Hills: స్పోర్ట్స్ బైకు యజమానికి కౌన్సిలింగ్
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): నంబర్ ప్లేట్ లేకుండా జూబ్లీహిల్స్ రహదారులపై చక్కర్లు కొడుతున్న రూ.25 లక్షల విలువైన వాహనాన్ని జూబ్లీహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ చెక్పోస్టులో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వేగంగా, నంబర్ ప్లేట్ లేకుండా వెళ్తున్న ఓ స్పోర్ట్స్ బైక్ను ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి గుర్తించి పట్టుకున్నారు. సంబంధిత ధ్రువపత్రాలు చూపించమని కోరగా అతని వద్ద లేకపోవడంతో పాటు బైక్కు నంబర్ ప్లేట్ కూడా లేదు. ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్న 800 సీసీ ఆస్టానా స్పోర్ట్స్ బైక్గా దీన్ని పోలీసులు గుర్తించారు. దీని ఖరీదు రూ.25 లక్షల వరకు ఉంటుందని వారు తెలిపారు. జూబ్లీహిల్స్కు చెందిన అనూష్రెడ్డికి చెందిన బైక్గా దీన్ని గుర్తించిన పోలీసులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొచ్చిన తర్వాత నంబర్ ప్లేట్ లేకుండా తిరగవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. చదవండి: ట్విటర్లో పరిచయం.. ఆపై వాట్సాప్.. చివరికి నమ్మకంగా -
మరుగుజ్జు.. శివలాల్ సాధించాడు!
బంజారాహిల్స్: అతడి ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది.. లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల ఓ మరుగుజ్జును అందరికీ ఆదర్శంగా నిలిపింది.. హైదరాబాద్ బంజారాహిల్స్రోడ్ నంబర్–10లోని గౌరీశంకర్ కాలనీలో నివసించే జి.శివలాల్(39) మరుగుజ్జు. బీకాం చదివాడు. భార్య కూడా మరుగుజ్జే. వీరికి ఒక కొడుకు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో దారి వెంట వెళుతుంటే ‘పొట్టివాడు’అంటూ కొందరు గేలిచేసేవారు. వీడు సైకిల్ కూడా తొక్కలేడంటూ నవ్వేవారు. ఈ అవమానాలు శివలాల్లో పట్టుదలను పెంచాయి. సైకిల్ ఏం ఖర్మ, ఏకంగా కారే నడిపిద్దామని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది..! గతే డాది నవంబర్ 27న ఓ కారు కొనుక్కున్నాడు. క్లచ్, బ్రేక్ అందదు కాబట్టి కారును రీమోడలింగ్ చేయించాడు. ఈ ఏడాది జనవరి 1 నుంచి అదే కారులో డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టి నెలరోజుల్లోనే పూర్తిగా తర్ఫీదు పొందాడు. గత మార్చి 12న కారు నడిపించుకుంటూ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నాడు. అయితే, ఇంతవరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరుగుజ్జులకు డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వలేదు. ఉన్నతాధికారులు వారంపాటు ఈ విషయంపైనే చర్చించి చివరకు ఈ నెల 6న శివలాల్కు పర్మనెంట్ లైసెన్స్ జారీ చేశారు. తెలంగాణలో ఉన్న సుమారు 400 మంది మరుగుజ్జులలో డిగ్రీ చేసిన మొట్టమొదటివ్యక్తి శివలాల్. అంతేకాకుండా మొదటగా డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మరుగుజ్జు కూడా ఆయనే కావడం గమనార్హం. చదవండి: 3 పేర్లు 3 ఫోన్ నంబర్లు.. స్రవంతికి పెళ్లయినా వదల్లేదు.. -
పోలీస్నంటూ వైద్యుడిని బెదిరించి రూ.75 లక్షలు కాజేయబోయిన కిలాడి దొంగ
హైదరాబాద్: హైదరాబాద్లోని ఓ ప్రముక ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు బంజారాహిల్స్లో నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం ఆ వైద్యుడి వద్ద మహేశ్ అనే వ్యక్తి డ్రైవర్గా పని చేశాడు. ఆ సమయంలోనే ఆ వైద్యుడికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి అతను సేకరించాడు. ఈ విషయం తెలిసుకున్న ఆ వైద్యుడు అతన్ని పనిలో నుంచి తీసేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి మహేశ్ ఓ ప్రైవేటు సంస్థలో హెచ్ఆర్గా పని చేస్తున్న గౌతం నాయర్ వద్ద డ్రైవర్గా చేరాడు. అయితే మహేశ్ తన జల్సాల కోసం గౌతం నాయర్ వద్ద నుంచి మొత్తం రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు చెల్లించ లేని మహేశ్ తప్పుడు మార్గంలో అధిక మొత్తం సంపాదంచే ఓ ప్రణాళికను గౌతం నాయర్కు చెప్పాడు. గతంలో తాను ఓ వైద్యుడి వద్ద పని చేశానని, వైద్యుడు తన భార్యను చంపుతానని మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి తన వద్ద ఉందని దానిని ఆసరాగా చేసుకొని ఆ వైద్యుడిని బెదిరించి డబ్బు సంపాదిద్దామని గౌతం నాయర్కు ప్లాన్ చెప్పాడు. మహేశ్ మాటలు విని ఈ నెల 14న గౌతం నాయర్ వైద్యుడికి ఫోన్ చేసి తాను ఖమ్మం సీఐనని మీ ఆడియో క్లిప్ ఒకటి తన వద్ద ఉందని రూ.75 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరించాడు. దీంతో ఆ వైద్యుడు వెంటనే పోలీస్లను ఆశ్రయించాడు. కేసు నమొదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ వైద్యుడితో గౌతం నాయర్కు రూ.75 లక్షలు కాదని రూ.20 లక్షలు చెల్లిస్తానని తన ఆడియో క్లిప్ తనకి ఇవ్వవలసిందిగా పోలీసులే దగ్గరుండి ఫోన్ చేయించారు. అలాగే డబ్బులు తీసుకోడానికి బంజారాహిల్స్లోని ఓ ప్రముక ఆలయం వద్దకు రావాల్సిందిగా సూచించారు. అయితే గౌతం నాయర్ పోలీస్ స్టిక్కర్ వేసిన కారులో ఆలయానికి వచ్చాడు. అప్పటికే పోలీసులు ఆ ఆలయం వద్ద కాపు కాశారు. ఈ క్రమంలోనే ఆ వైద్యుడితో గౌతం నాయర్ మాట్లాడుతుండగానే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో ప్రధాన నిందితుడు మహేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. ఇక అనంతరం పోలీసులు మాట్లాడుతూ ఇలా ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే భయపడకుండా ధైర్యంగా తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. -
‘న్యూ మోకోకాల్’ వ్యాక్సిన్.. పిల్లలకు వేయించారా?!
బంజారాహిల్స్: వర్షాకాలం, శీతాకాలంలో ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా న్యుమోనియాతో బాధపడుతుంటారు. చిన్నారులు శ్వాస ఆడక విలవిల్లాడుతుంటారు.. ఇలాంటి వారికి సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాల మీదకు వస్తుంది. పిల్లల్లో శ్వాసకోశ సమస్యల నివారణకు న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్(పీసీవీ) పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధమయ్యారు. 0–5 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయనున్నారు. ప్రస్తుతం ఈ టీకా ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రమే లభ్యమవుతోంది. ఒక్కో డోసు ఖరీదు రూ.2,800 నుంచి రూ.3,800 వరకు ఉంటుంది. ఈ టీకా పంపిణీలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, షేక్పేట, యూసుఫ్గూడ, రెహ్మత్నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సనత్నగర్, వెంగళరావునగర్, అమీర్పేట డివిజన్ల పరిధిలోని 11 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈ డివిజన్లలో 28వేల మందికి పైగా పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ నెల 18 నుంచి టీకా ప్రక్రియను అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రారంభించనున్నారు. చదవండి: హైదరాబాద్లో యువతి కిడ్నాప్, సామూహిక అత్యాచారం వ్యాధుల కట్టడికి.. న్యుమోకాకల్ అనేది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల సమూహం. వీటిని అధిగమించడానికి ఈ టీకా వేస్తారు. పిల్లల్లో అంటు వ్యాధులు సోకకుండా ఇది అడ్డుకుంటుంది. న్యుమోనియా మెనింజిటిస్ వంటి వ్యాధుల వ్యాప్తిని కట్టడి చేస్తుంది. పీసీవీ గురించి ఇప్పటికే ఆయా ఆరోగ్య కేంద్రాల నర్సులు, వైద్యాధికారులు, ఆశ వర్కర్లు విస్తృత ప్రచారం చేపట్టారు. పీహెచ్సీల వారీగా టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశారు. పీహెచ్సీ వైద్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేస్తారు. టీకాల కార్యాచరణ ముందుకు తీసుకెళ్లడంలో స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆలస్యమైతే నష్టమే.. శిశువు పుట్టిన ఏడాదిలోగా తప్పనిసరి టీకా ఇ వ్వాల్సి ఉంటుంది. ప్రతి డోస్లోనూ 0.5 మి.లీ. మోతాదు వ్యాక్సిన్ ఇస్తారు. ఒకవేళ ఆలస్యమైతే మొదటి పుట్టిన రోజుకు ముందు కనీసం ఒక మో తాదు పీసీవీ వేసి ఉంటే మిగతా వాటిని ఇవ్వొచ్చు. పుట్టిన మొదటి సంవత్సరంలోనే ఆలస్యమైతే కనిష్టంగా 8 వారాల వ్యవధిలో వేరు చేసి తదుపరి డోసు షెడ్యూల్ ఇమ్యునైజేషన్ సందర్శనలో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ వందశాతం సురక్షితం. తల్లిపాలు, పోషకాహారం లేని పిల్లలకు ఈ వ్యాధి అధికంగా సోకే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఉచితంగా అందించే టీకాను సద్వినియోగం చేసుకోవాలి. చిన్నారులకు టీకాలు అందేలా అధికారులు చొరవ చూపుతున్నారు. ఆరు వారాల వయసులో మొదటి డోసు, 14 వారాల వయసులో రెండో డోసు, 9 నెలల్లో బూస్టర్ డోసును చిన్నారులకు వేస్తారు. తల్లిదండ్రుల్లో అవగాహన అవసరం పీసీవీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతోంది. పిల్లలకు రొటీన్గా ఇస్తున్న టీకాలకు ఇది అదనం. 0–5 ఏళ్లలోపు పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ కల్పిస్తుంది. పిల్లలకు పీసీవీ ఇప్పించడంలో తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. అందుకే వారికి అవగాహన క లిగించాం. నెలన్నర క్రితం పుట్టిన పిల్లలను పీసీవీ వే యడానికి పరిగణలోకి తీసుకుంటాం. ఈ వ్యాక్సిన్ తీ సుకున్న పిల్లలకు ఐదేళ్ల వరకు న్యుమోనియా రాదు. రక్తహీతన నివారణకు కూడా దోహదపడుతుంది. – డాక్టర్ షీమా రెహమాన్, వైద్యాధికారిణి, బంజారాహిల్స్ యూపీహెచ్సీ అన్ని ప్రభుత్వ సెంటర్లలో.. ఏడాదిలోపు చిన్నారుల్లో న్యూ మోనియా వ్యాధిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘న్యూ మోకోకాల్’ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాక్సిన్ను అన్ని యూపీహెచ్సీ సెంటర్లలో నేటినుంచి పంపిణీ చేస్తున్నారు. 80శాతం మంది పిల్లల్లో ‘స్ప్రెక్టోకోకస్’ అనే బాక్టిరియా కారణంగా న్యూమోనియా సోకుతుంది. దీన్ని నియంత్రించేందుకు అన్ని ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సిన్ను ఇస్తారు. – డాక్టర్ దీప్తి ప్రియాంక మంచాల, మెడికల్ ఆఫీసర్, బొగ్గులకుంట యూపీహెచ్సీ సెంటర్ -
కన్న కూతురితో అసభ్యకరంగా ప్రవర్తించడమే గాక..
సాక్షి, బంజారాహిల్స్( హైదరాబాద్): తన తండ్రి అసభ్యంగా ప్రవర్తిస్తూ కొడుతున్నాడంటూ ఓ యువతి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడికుంటలో నివసించే ఓ యువతిని ఈ నెల 14వ తేదీ ఉదయం తండ్రి మహ్మద్ యూసుఫ్, పిన తండ్రి ఫరూఖ్ ఇద్దరూ కలిసి కొట్టారని అడ్డు వచ్చిన తల్లి అమీష, సోదరి ఫర్హీదపై కూడా దాడి చేశారని ఆరోపించింది. కొంత కాలంగా తనతో పాటు తల్లీ, సోదరిని మానసికంగా వేదిస్తున్నాడని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించింది. దీంతో పోలీసులు యూసుఫ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
20 ఏళ్లు జైల్లో.. అయినా మళ్లీ
బంజారాహిల్స్( హైదరాబాద్): మర్డర్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించినా ప్రవర్తనలో మార్పు రాలేదు.. పీడీయాక్ట్ నమోదు చేసి రెండేళ్లు జైల్లో ఉంచినా తీరు మార్చుకోలేదు. రౌడీషీట్ ఓపెన్ చేసి కదలికలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా మార్పులేదు.. తరచూ బెదిరింపులకు పాల్పడుతూ, దారికాచి బెదిరిస్తూ.. హెచ్చరికలు జారీ చేస్తూ.. పలువురిని ఇబ్బందులకు గురిచేసే క్రమంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. గత అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా క్షమాభిక్షలో భాగంగా సత్ప్రవర్తన కింద ఏడాది క్రితం విడుదలయ్యాడు. జైలులో ఉన్న స్రత్పవర్తన సమాజంలోకి వచ్చాక మళ్లీ పాత కథనే కొనసాగిస్తున్నాడు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్ను బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ సమీపంలోని లక్ష్మీనరసింహ నగర్లో నివసించే ఓ మహిళ పట్ల అదే ప్రాంతంలో నివసిస్తున్న రౌడీషీటర్ లక్ష్మణ్(46) ఈ నెల 11వ తేదీన ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఆమె భర్తను కొట్టడమే కాకుండా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అరుపులు విన్న భార్య అక్కడికి చేరుకొని ఆపేందుకు యత్నించగా లక్ష్మణ్ ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఆమెను కిందకు తోసేశాడు. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు రౌడిషీటర్ లక్ష్మణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
హారతి ఆరిపోయింది.. కుంకుమ భరిణె కిందపడింది..
సాక్షి, బంజారాహిల్స్: దేవుడికి హారతి ఇస్తుండగా మధ్యలోనే హారతి ఆరిపోయింది.. దేవుడికి బొట్టు పెట్టేందుకు కుంకుమ భరణె చేతులోకి తీసుకోగానే అది చేతులో నుంచి జారి కిందపడిపోయింది. దీంతో తనకు ఆయుష్షు మూడిందని భావించిన ఓ వివాహిత సెల్ఫీ వీడియో ఆన్చేసి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్కు చెందిన ఓంప్రకాశ్, కబిత తమ నాలుగేళ్ల కూతురుతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నెం.78లోని పద్మాలయ అంబేడ్కర్నగర్ బస్తీలో అద్దెకుంటున్నారు. ఈ నెల 2వ తేదీన ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఓంప్రకాశ్ తాను డ్రైవింగ్ చేసే చోటకు కూతురిని తీసుకొని వెళ్లిపోయాడు. రాత్రి 7.30 గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చి తలుపుతట్టగా భార్య ఎంతకూ తలుపు తీయలేదు. కిటికీలో నుంచి లోనికి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఇంటి యజమాని సహాయంతో తలుపులు తీసి చూడగా అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అక్కడే ఉన్న సెల్ఫోన్ చూడగా ఆన్లోనే ఉంది. సెల్ఫోన్లో వీడియో ఆన్చేసి ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా అంతకుముందు హారతి ఆరిపోవడాన్ని, కుంకుమ భరణి కిందపడిపోవడాన్ని సైగలతో చూపించి తనకు ఆయుష్షు తీరిపోయిందని చెప్పినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో బార్లో యువకుల వీరంగం
సాక్షి, బంజారాహిల్స్: మద్యంమత్తులో బార్లో యువకులు వీరంగం సృష్టించారు. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని టెయిల్స్ ఓవర్ స్పిరిట్ పేరుతో బార్ అండ్ రెస్టారెంట్ కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం వెంపటి ఈశ్వర్, షణ్ముక్, దినేష్ రాజ్, సన్నీ, రోనిత్ అనే యువకులు పార్టీకి వచ్చారు. ఇందులో భాగంగా కొన్ని పాటలు ప్లే చేయాలంటూ డీజేని కోరగా అప్పటికే వాటిని ప్లే చేశామని, మరోసారి వేయలేమంటూ చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. మాటామాటా పెరగడంతో డీజేపై ఆ యువకుల్లో ఒకరు చేయిచేసుకున్నారు. దీంతో బార్ సిబ్బంది, యువకులు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరగడంతో బార్ యజమాని శ్రీనివాస్ చేతికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కాగా తమపై దాడికి పాల్పడడంతో పా టు గదిలో బంధించారంటూ బాధిత యువకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయ గా, బిల్లు చెల్లించకుండా బయటకు వెళ్లేందుకు ప్రయ త్నిస్తే తమపై దాడి చేశారంటూ బార్ మేనేజర్ శ్రీశై లం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్లో కుండపోత వాన పడుతోంది. అక్కడక్కడ ఈదురు గాలులు, చిన్నపాటి మెరుపులతో వర్షంపడింది. దాంతో గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ నగర వాసులకు కాస్తంత ఉపశమనం కలిగింది. అయితే ఒక్కసారిగా జడివాన కురియడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు నాలాలు ఉప్పొంగాయి. రోడ్లపై, కాలనీల్లో ఎటుచూసినా వరదనీరే. మూతలు లేని మ్యాన్హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. పలు బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరదనీటిని తొలగించేందుకు స్థానికులు అవస్థలు పడ్డారు. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో భారీగా నిలిచిన వరదనీటిని తొలగించేందుకు సహాయకచర్యలు చేపట్టాయి. -
ఇరాన్లో ఎలక్షన్.. హైదరాబాద్లో ఓటింగ్
సాక్షి, బంజారాహిల్స్: ఎన్నికలు ఇరాన్లో జరగడమేమిటి? ఇక్కడ హైదరాబాద్లో ఓటు వేయడమేమిటి? అర్థం కాలేదు కదూ.. శుక్రవారం ఇరాన్లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తమ దేశ పౌరులందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునేందుకు వీలుగా.. ఆ దేశ కాన్సులేట్ భారత్లోని ఢిల్లీ, హైదరాబాద్, రాజమండ్రి, బెంగళూరు, పుణే, ముంబై తదితర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే శుక్రవారమిక్కడ బంజారాహిల్స్లోని కాన్సులేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 220 మంది ఇరాన్ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు రాజమండ్రిలో 28 మంది ఓటేశారు. చదవండి: ఐరాస సెక్రటరీ జనరల్గా మళ్లీ గుటెరస్ -
వీధికుక్కకు ఎక్స్రే..!
బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వీధికుక్కను చేరదీయడమే కాకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్రే తీయించి చికిత్స నిర్వహించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆ వీధికుక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వద్ద విధి నిర్వహణలో ఉండే ఇంటర్సెప్టర్ వెహికిల్ పోలీస్ కానిస్టేబుల్ కె.ప్రవీణ్కుమార్, హోంగార్డ్ ఎ.నరేష్ ఇద్దరు గత మూడు వారాల నుంచి పార్కు వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న వీధికుక్కను చూస్తూ నిఘా ఉంచారు. ఆహారం తినకుండా దగ్గుతూ గొంతులో ఏదో ఇరుక్కున్నట్లుగా అవస్థలు పడుతున్న ఆ కుక్కను చూసి చలించిపోయారు. సోమవారం ఉదయం వీరు ఆ కుక్కను తమ వాహనంలో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్.3లోని సాగర్సొసైటీలో ఉన్న పెట్ క్లినిక్లో ఎక్స్రే తీయించారు. వైద్యపరీక్షలు నిర్వహించేలా చేశారు. ఎక్స్రేలో దాని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలియడంతో సంబంధిత డాక్టర్ వ్యాధి తగ్గుదల కోసం మందులు రాసిచ్చాడు. పెట్ క్లినిక్లో ఫీజులు చెల్లించిన ఈ పోలీసులు మందులను కూడా తమ సొంత డబ్బులతోనే కొనుగోలు చేసి మళ్లీ కేబీఆర్ పార్కు వద్ద వదిలిపెట్టారు. ‘బ్రౌనీ’ అని ఈ వీధికుక్కకు పేరుపెట్టుకున్న ఈ పోలీసులు ప్రతిరోజు బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెడుతుంటారు. ఒక్కసారిగా అనారోగ్యానికి గురైన ఈ కుక్కను చూసి చలించిపోయి తమ సొంత డబ్బులతోనే వైద్యపరీక్షలు నిర్వహించిన వీరి గొప్పదనాన్ని అధికారులు సైతం ప్రశంసించారు. ఈ కుక్క ఆరోగ్యం ఇంకో రెండు వారాల్లో మెరుగుపడుతుందని వైద్యులు చెప్పడంతో పోలీసులిద్దరూ దాని ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించారు. -
బంజారాహిల్స్: ప్రియుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య
బంజారాహిల్స్: మైనార్టీ తీరకున్నా పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి బెదిరింపులను భరించలేక మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి గ్రామానికి చెందిన కండ్రకోట దుర్గాభవానీ(16) 5వ తరగతి చదివి ఇంట్లోనే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కల్యాణ్ అనే యువకుడితో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటామంటూ దుర్గాభవానీ తండ్రి శ్యామ్సన్ వద్దకు వెళ్లి అడగగా మందలించాడు. మైనార్టీ తీరకముందే పెళ్లి చేసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించాడు. దీంతో ఐదు రోజుల క్రితం దుర్గాభవానీ ఇంట్లోంచి చెప్పకుండా వచ్చి బంజారాహిల్స్ రోడ్ నంబర్.2లోని ఇందిరానగర్లో ఉంటున్న అక్క వెంకటలక్ష్మి వద్దకు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన తండ్రి శ్యామ్సన్కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో శనివారం ఉదయం శ్యామ్సన్ నగరానికి వచ్చాడు. కూతురు దుర్గాభవానీతో మాట్లాడి నచ్చ జెప్పాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కల్యాణ్ తీవ్ర పదజాలంతో బెదిరింపులకు దిగడంతో పాటు పెళ్లికి అంగీకరించకపోతే శ్యామ్సన్ను, దుర్గాభవానీని చంపేస్తానంటూ బెధిరించి వెళ్లిపోయాడు. ఇదే విషయంపై రోజంతా కుటుంబ సభ్యులు చర్చించారు. సాయంత్రం పనిమీద శ్యామ్సన్తో పాటు మిగిలిన వారు బయటికి వెళ్లి రాత్రికి తిరిగి వచ్చారు. ఆలోగా ఇంట్లో ఒంటరిగా ఉన్న దుర్గాభవానీ చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి చావుకు కల్యాణ్ బెదిరింపులే కారణమంటూ ఆదివారం మృతురాలి తండ్రి శ్యామ్సన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 306, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. ప్రియుడితో కలిసి.. -
పీఎఫ్ డబ్బు ఇప్పించలేదని కిరోసిన్ పోసుకుని
సాక్షి, బంజారాహిల్స్: పీఎఫ్ డబ్బు ఇప్పించడం లేదనే ఆవేదనతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్లోని సైదప్ప బస్తీలో నివసించే జె.సంగీత(45) సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదేళ్లుగా హౌస్కీపింగ్ విభాగంలో పని చేస్తుంది. ఇటీవల ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించారు. రోజూ ఆఫీస్కు వెళ్లి తన పీఎఫ్ డబ్బులు అడుగుతుండగా హౌస్కీపింగ్ సూపర్వైజర్ ప్రవీణ్ కుమార్ పట్టించుకోకపోగా సమాధానం సైతం ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కరోనా దెబ్బతో 71 లక్షల ఈపీఎఫ్ ఖాతాల తొలగింపు -
Banjara Hills: సహజీవనం.. విషాదం
బంజారాహిల్స్: తనకంటే మూడేళ్లు పెద్దదైన యువతిని ప్రేమించి సహజీవనం చేస్తూ మూడు రోజులు గడవకముందే విభేదాలు పొడసూపి ఇద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... యూసుఫ్గూడ సమీపలలోని యాదగిరి నగర్లో నివసించే బి.బాలాజీ(17) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో అద్దెకుంటూ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న బి.నీలిమ అలియాస్ అమ్ము(20)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ కొద్ది రోజులుగా జవహర్నగర్లో గది అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. వారం క్రితం గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఇంకో వారం రోజులు గడిస్తే 17 ఏళ్ల వయసు వచ్చే క్రమంలో బాలాజీకి ఆ యువతితో గొడవలు మొదలయ్యాయి. శనివారం తెల్లవారుజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఈ మేరకు బాలాజీ ఫ్యాన్కు ఉరేసుకొగా నీలిమ చున్నీతో మెడకు బిగించుకొని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. బాలాజీ మృతి చెందిగా ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. మృతుడి తండ్రి ఏఆర్ ఏఎస్ఐగా పని చేస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లాక్డౌన్ వేళ.. ఇంటింటా హింస.. ఇంతింతా కాదు! -
విరించి ఆస్పత్రిలో కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మీటింగ్ ముగిసిన గంటల వ్యవధిలోనే ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో బంజారాహిల్స్లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ చికిత్సకు అనుమతులు రద్దు చేశారు. గతంలో కూడా విరించి ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నప్పటికి.. తీరు మార్చుకోకపోవడం గమనార్హం. కరోనా చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితుల నుంచి వందల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో 64 ఆస్పత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. హైదర్గూడ అపోలో, కిమ్స్, సోమాజీగూడ యశోద,విరించి ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులకు, మేడ్చల్ జిల్లా పరిధిలోని కూకట్పల్లి ఓమ్ని ,హైదరాబాద్ నర్సింగ్ హోమ్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
భూ వ్యవహారంలో రూ.2కోట్ల మోసం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి విక్రయిస్తానంటూ నమ్మబలికి రూ.2కోట్లు వసూలు చేసి మోసం చేసిన ఘటనలో నిందితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎంకేపల్లిలో తనకు 12 ఎకరాల 33 గుంటల వ్యవసాయ భూమి ఉందని.. ఇందులో మామిడి తోట ఉందని బంజారాహిల్స్ రోడ్ నంబర్–10కి చెందిన మీర్జా హుస్సేన్ అలీఖాన్ చెప్పడంతో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–10లోని వెంకటగిరి భగవతినగర్కు చెందిన ఎస్.భక్తప్రియ అనే మహిళ అతడితో చర్చలు జరిపి రూ.9.45 కోట్లకు బేరం కుదుర్చుకుంది. దీని కోసం అడ్వాన్స్గా రూ.2 కోట్లు చెల్లించారు. కాగా నిర్ణీత సమయంలో మిగిలిన డబ్బులు అడ్జెస్ట్ కాకపోవడంతో మరో రెండు నెలలు అదనంగా సమయం ఇవ్వాలని ఆమె కోరింది. అయితే తనకు త్వరగా డబ్బులు కావాలని వేరొకరికి అమ్మేసిన తర్వాత మీరిచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇస్తానంటూ హుస్సేన్ అలీఖాన్ చెప్పాడు. అయితే స్థలం వేరొకరికి అమ్మి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోగా కనీసం ఫోన్లు కూడా ఎత్తకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 406 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: వివాహేతర సంబంధం: మహిళ దారుణ హత్య) -
రెండు నిమిషాలు ఆలస్యంగా మద్యం తెచ్చాడని...
బంజారాహిల్స్( హైదరాబాద్): బోరబండ ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని కాకతీయ వైన్స్లో మద్యం తీసుకునేందుకు గోపి అనే డ్రైవర్ శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. మద్యం ధరకు అనుగుణంగా క్యూఆర్ కోడ్తో డబ్బులు చెల్లించేందుకు యత్నిస్తుండగా ఆ మిషన్ రెండు నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఇంత ఆలస్యమా అంటూ గోపి మద్యం సీసా ఇచ్చిన సేల్స్మెన్ రంజిత్పై అదే సీసాతో తలపై దాడి చేశాడు. దీంతో రంజిత్ తల పగలడంతో ఆగ్రహానికి లోనైన వైన్షాప్ ఇతర సిబ్బంది మూకూమ్మడిగా గోపిని కొట్టారు. రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై కూడా దాడి చేశారంటూ గోపి కూడా శనివారం ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టారు. ( చదవండి: ఆస్పత్రిలో పక్కా ప్లాన్: సెంట్రీ బిర్యానీలో మత్తు మందు కలిపి ) -
మాస్కు లేకుండా వెళ్తున్నారా? అయితే, కష్టమే!
బంజారాహిల్స్: కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. మాస్్కలు లేకుండా తిరుగుతున్న వారిపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రతిరోజూ ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ మాస్్కలు ధరించకుండా తిరుగుతున్న వారిపై రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారి ఫొటోలను తీసుకొని ఆన్లైన్లో జరిమానా రశీదును అందజేస్తున్నారు. చెల్లించని వారిని కోర్టులో ప్రవేశపెట్టి 51(ఏ) డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద వారెంట్ జారీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నుంచి మాస్్కలు లేని వారికి జరిమానాలు విధించే స్పెషల్ డ్రైవ్ ప్రారంభమైంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిత్యం రెండు వేర్వేరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. గురువారం ఒక్కరోజే 220 మంది మాస్్కలు ధరించకుండా తిరుగుతున్నారంటూ వారికి జరిమానాలు వేశారు. మాస్్కలు ధరించకపోతే కరోనా విస్తరించే అవకాశం ఉందని ఒక వైపు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తుంటే చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తాజా తనిఖీల్లో బయటపడిందని పోలీసులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వాహనదారులు మాస్్కలు ధరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూటరిస్ట్లు 50 శాతం మంది మాస్్కలు లేకుండానే దర్జాగా దూసుకుపోతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందన్నారు. ప్రస్తుతం రెండు చోట్ల నిర్వహిస్తున్న తనిఖీలు వచ్చే వారానికి నాలుగైదు చోట్ల నిర్వహించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. (చదవండి: తెలంగాణ: టెన్త్ పరీక్షలు అవసరమా?) -
నువ్వు ప్రేమిస్తున్న నీ మేనకోడలిని నేను ప్రేమిస్తున్నా..
సాక్షి, బంజారాహిల్స్: ‘నువ్వు ప్రేమిస్తున్న నీ మేనకోడలిని నేను ప్రేమిస్తున్నా.. నా కోసం నీ ప్రేమను త్యాగం చేయ్... లేకపోతే బాగుండదు’ అంటూ స్నేహితుడికి ఓ యువకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్నేహితుడు బ్లేడ్తో ఆ యువకుడి మెడపై గాట్లుపెట్టాడు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బ్లేడ్తో దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... రహ్మత్నగర్ బంగారు మైసమ్మ టెంపుల్ వద్ద నివసించే సాయి చైతన్య(19) ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసిస్తున్న తన అక్క కూతురు(17)ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. తమ ఇద్దరి ప్రేమకు సహకరించాల్సిందిగా స్నేహితులైన ఇద్దరు బాలురు (17)ను సాయిచైతన్య కోరాడు. అయితే, వారు చైతన్యను మోసగించి ఆ యువతితో ప్రేమాయణం నడిపిస్తున్నారు. అంతేకాకుండా నీ ప్రేమను త్యాగం చేయాలంటూ రెండు రోజుల క్రితం సాయి చైతన్యకు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన చైతన్య ఎల్ఆర్ కిషోర్ స్కూల్ సమీపంలోని గ్రౌండ్కు వస్తే తేల్చుకుందామని వారిని హెచ్చరించాడు. దీంతో స్నేహితులతో పాటు చైతన్య గ్రౌండ్కు వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. సాయిచైతన్య తన వెంట తెచ్చుకున్న బ్లేడ్తో స్నేహితుల్లోని ఓ బాలుడి మెడపై గాట్లు పెట్టాడు. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న బాధితుడిని ఆస్పత్రిలో చేర్చారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సాయి చైతన్యపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. తనను చంపేస్తానని బెదిరించడంతో ముందుగానే స్నేహితుడిని చంపేందుకు పథకం వేసి బ్లేడ్తో దాడి చేశానని నిందితుడు చైతన్య తెలిపాడు. చదవండి: బంజారాహిల్స్: ప్రేమిస్తావా.. చస్తావా.. చావాలా.. ! ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే! -
విషయం తెలియడంతో భార్యపై సిద్ధిఖీ ఆగ్రహం, దాంతో
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ కార్మికనగర్లో టైలర్ సిద్దిఖీ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో సిద్దిఖీ భార్య రుబీనా పక్కా ప్రణాళికతో ప్రియుడు సయ్యద్ మహ్మద్ అలీచే హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. కార్మికనగర్లో నివసించే మహ్మద్ సిద్దిఖీ అహ్మద్ (40), రుబీనా దంపతులు. సిద్దిఖీ టైలర్ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో బోరబండ అక్బర్ మసీద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్ అలీ (22)తో రుబీనాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భార్యపై సిద్దిఖీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ ‘బంధానికి’ అడ్డుగా ఉన్న సిద్దిఖీని అంతమొందించేందుకు మహ్మద్ అలీ పక్కా పథకం వేశాడు. గత నెల 31న అర్ధరాత్రి ఇంటిలో ఒంటరిగా ఉన్న సిద్దిఖీ తలపై బైక్ షాక్ అబ్జర్వర్ రాడ్తో బలంగా బాది హత్య చేశాడు. ఈ నెల 1న మృతుడి సోదరుడు అతీక్ అహ్మద్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలు, సెల్ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుణ్ని అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసినట్లుగా అంగీకరించాడు. హత్యకు ముందు.. ఆ తర్వాత మృతుడి భార్య రుబీనాతో నిందితుడు మహ్మద్ అలీ మాట్లాడినట్లు విచారణలో తేలింది. వీరిద్దరూ కలిసే సిద్దిఖీ హత్యకు పథకం వేసినట్లు నిర్ధారించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
బంజారాహిల్స్లోయువతి కిడ్నాప్.. బలవంతంగా బైక్పై ఎక్కించి..
సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్లో యువతి కిడ్నాప్ కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లోని ఆల్మండ్ హౌస్ వెనుకాల నిర్మానుష్య చీకటి ప్రదేశంలో మద్యంమత్తులో ఉన్న ముగ్గురు యువకులు బైక్లపై వచ్చి ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆ యువతి కూడా మద్యం మత్తులో ఉండగా ఆమెను తమ బైక్పై ఎక్కించుకునేందుకు తీవ్రంగా యత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు కిందపడుకుంది. అయితే అప్పటికే బైక్ స్టార్ చేసి ఓ యువకుడు సిద్ధంగా ఉండటంతో యువతి ‘హెల్ప్హెల్ప్’ అంటూ అరవడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడికి చేరుకునే లోపే ఆమెను ఓ యువకుడు బలవంతంగా బైక్పై కూర్చుండబెట్టుకొని ఉడాయించాడు. స్థానిక మహిళలు పరిగెత్తుకుంటూ వచ్చేలోపే యువకులంతా బైక్లపై పరారయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల ఆరా తీశారు. ఆ యువతి గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా స్పష్టమైన దృశ్యాలు నమోదు కాలేదు. అయితే బలవంతంగా యువతిని బైక్పై ఎక్కించుకొని పరారవుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. రాత్రంతా మూడు పోలీసు బృందాలు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాయి. నిర్మానుష్య ప్రాంతామే కాకుండా చీకటి ఉండటంతో ఇక్కడ దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో సరిగ్గా నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై తమకు ఇంత వరకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అయితే కిడ్నాప్కు గురైన యువతి ఎవరన్న దానిపై స్పష్ట రావడం లేదు. యువతి అదృశ్యం పంజగుట్ట: యువతి అదృశ్యమైన సంఘటన పంజగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలో నివసించే గౌతం దుర్గేశ్వరి(18) పంజగుట్టలోని ఓ షాప్లో సేల్స్గర్ల్గా పనిచేస్తుంది. మంగళవారం రోజూ మాదిరిగానే విధులకు వెళ్లిన దుర్గేశ్వరి తిరిగి ఇంటికి రాలేదు. షాపులో సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 7:10కి షాపు నుంచి వెల్లిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద, చుట్టుప్రక్కల సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బుధవారం పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 9490616365 నెంబర్లో సంప్రదించాలని ఎస్సై సతీష్ తెలిపారు. చదవండి: విషాదం.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. ఘోరం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..! -
సూరీడుపై హత్యాయత్నం
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): తన తల్లిదండ్రులపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ సూరీడు కుమార్తె గంగాభవానీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో పోలీసులు బుధవారం సూరీడు అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్రెడ్డిని అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీ హిల్స్ రోడ్ నంబరు 10లోని గాయత్రీహిల్స్లో నివసించే ఇ. సూర్యనారాయణరెడ్డి అలియాస్ సూరీడు కుమార్తె గంగాభవాని, డాక్టర్ సురేంద్రనాథ్రెడ్డి భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి సురేంద్రనాథ్రెడ్డి తన మామ ఇంట్లోకి ప్రవేశించి, కర్రబ్యాటుతో సూరీడుపై వెనుక నుంచి దాడి చేశాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా దాడి చేశాడు. ఘటనలో గంగాభవానీకి కూడా గాయాలయ్యాయి. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సురేంద్రనాథ్రెడ్డిని అరెస్ట్ చేశారు. గంగాభవానీ ఫిర్యాదు మేరకు సురేంద్రపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. చదవండి: (బీఫార్మసీ విద్యార్థిని సుప్రియ ఆత్మహత్య) -
ప్రిన్సిపల్పై విద్యార్థి దాడి
సాక్షి, బంజారాహిల్స్: స్కూల్ ఫీజు కట్టడానికి మరుసటి రోజు రమ్మని చెప్పిన ప్రిన్సిపాల్పై ఓ విద్యార్థి దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 సయ్యద్ నగర్లోని ది ఆక్స్ఫర్డ్ మిషన్ హైసూ్కల్లో స్థానికంగా నివసించే ఇలియాస్(19)అనే విద్యార్థి సోమవారం పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు వచ్చాడు. అయితే ఫీజు చెల్లించేందుకు రేపు రావాలని స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్దోస్ అంజుమ్ సూచించారు. ఇప్పడే కట్టుకోవాలంటూ వాగ్వాదానికి దిగిన ఇలియాస్ కోపంతో ఊగిపోతూ ప్రిన్సిపల్ను కొట్టాడు. అప్పుడే వచ్చిన అతడి తల్లి జాఫరున్నీసాబేగం కూడా చెప్పు తీసుకొని ప్రిన్సిపల్ ముఖంపై బాదింది. బాధితుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇలియాస్తో పాటు అతడి తల్లి జాఫరున్నీసాబేగంపై ఐపీసీ సెక్షన్ 354, 324, 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నా కోరిక తీర్చు.. లేదంటే నీ భర్త, కొడుకును..
సాక్షి, బంజారాహిల్స్: తనతో స్నేహం చేయాలంటూ వివాహితను తరచూ వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై, అతడికి సహకరించిన మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం.1లో నివాసముంటున్న వివాహిత(36) ఓ బ్యూటీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్లో మెడికల్ హెడ్గా పనిచేస్తోంది. ఇటీవల వరప్రసాద్ అనే క్లైంట్ వెంట క్లినిక్కు వచి్చన విశ్వనాథ్ అనే వ్యక్తి ఆమె ఫోన్ నంబర్ను సేకరించి తరచూ ఫోన్లు చేస్తున్నాడు. తనతో స్నేహం చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో ఫోన్ నంబర్ను బ్లాక్లిస్ట్లో పెట్టింది. అయినప్పటికీ వెంట్రుకలకు సంబంధించిన సమస్య ఉందంటూ తరచూ క్లినిక్కు వచ్చి అక్కడ పనిచేస్తున్న వారితో స్నేహం పెంచుకున్నాడు. బాధితురాలికి సంబంధించిన కుటుంబ వివరాలు, చిరునామాను తెలుసుకున్న విశ్వనాథ్ ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఓ ఫ్లాట్ను నాగరాజు అనే వ్యక్తి పేరుతో తీసుకున్నాడు. అక్కడే ఉంటూ బాధితురాలి కుమారుడికి చాక్లెట్లు, బొమ్మలు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. తన కోరిక తీర్చకపోతే కొడుకుతో పాటు భర్తను అంతం చేస్తానంటూ బెదిరింపులు ప్రారంభించాడు. ఆమె కదలికలపై సమాచారం సేకరించేందుకు కారులో జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చాడు. ఇదిలా ఉండగా ఇటీవల అతడి వేధింపులు ఎక్కువ కావడంతో భర్తకు విషయాన్ని చెప్పింది. దీంతో అతడు నివాసముంటున్న ఫ్లాట్కు వెళ్లడంతో అక్కడి నుంచి విశ్వనాథ్ పరారయ్యాడు. కారులో తనిఖీ చేయగా జీపీ ఎస్ పరికరం దొరికింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని మరోసారి విశ్వనాథ్ నీ భార్య జోలికి రాడంటూ సురేష్ అనేవ్యక్తి ఫోన్ చేశాడు. పులి శ్రీకాంత్ పటేల్ అనే రాజకీయ నేత కూడా ఫోన్లు చేస్తూ రాజీకుదుర్చుకుందామని లేకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులు వై.విశ్వనాథ్, సురేష్, శ్రీకాంత్ పటేల్, నాగరాజు అనే వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అర్థరాత్రి షూటింగ్లో గాయపడ్డ నటి
సాక్షి, హైదరాబాద్ : అర్థరాత్రి షూటింగ్ చేస్తుండగా అనుకోకుండా తలెత్తిన ప్రమాదంలో నటి రాయ్ లక్ష్మి గాయపడ్డారు. వివరాల ప్రకారం..హైదరాబాద్లోని బంజారాహిల్స్లో జరిగిన సినిమా షూటింగ్ చేస్తుండగా ప్రమాదం తలెత్తింది. ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా, నటి రాయ్ లక్ష్మి ఒక్కసారిగా కిందపడిపోయారు. దోంతో ఆమె మోకాలికి గాయమైంది. దీంతో వెంటనే స్పందించిన చిత్రయూనిట్ షూటింగ్ను నిలిపివేసి, హీరోయిన్ రాయ్ లక్ష్మీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని పేర్కొంటూ నటి రాయ్ లక్ష్మి..దానికి సంబంధించిన ఫోటోలను నటి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గెట్ వెల్ సూన్ మేడమ్ అంటూ పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో రాయ్ లక్ష్మి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్గా అంతగా కలిసిరాకపోవడంతో పలు ఐటెం సాంగ్స్లో మెరుస్తుంది ఈ భామ. బలుపు, ఖైదీ నెంబర్ 150 మూవీల్లోనూ రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. చదవండి : భార్యకు ఖరీదైన గిఫ్టిచ్చిన ఎన్టీఆర్! ఆ టైంలో డిప్రెషన్కు లోనయ్యా : హీరోయిన్ -
బంజారాహిల్స్ : ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ అంబేద్కర్నగర్లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. బంజారాహిల్స్ రోడ్ నెం.11లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చదవండి : (పంజాగుట్ట: ఇంట్లో చొరబడి యువతిపై అత్యాచారం) (శామీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం ) -
పని మనిషిపై లైంగిక దాడికి పాల్పడ్డ యజమాని అరెస్టు
సాక్షి, బంజారాహిల్స్: ఇంట్లో పని కోసం కుదుర్చుకున్న పని మనిషిపై లైంగిక దాడికి పాల్పడిన బంజారాహిల్స్కు చెందిన పొన్నుగోటి ఉదయ భాను(52) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 17న ఉదయ భాను రాజమండ్రికి చెందిన ఓ మహిళ(45)ను వంట పని, ఇంటి పని కోసం అని చెప్పి రప్పించుకుని ఆమెను రెండు వారాల పాటు ప్లాట్లో బంధించి భౌతికంగా హింసిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీన బాధిత మహిళ రాజమండ్రిలో ఉన్న తన కూతురికి ఫొన్ చేసి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. దీంతో భాదిత మహిళ కూతురు 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో బంజారాహిల్స్ పోలీసులు అపార్టుమెంటుకు చేరుకొని 19వ అంతస్తులో ఉన్న బాధితురాలిని రక్షించారు. అనంతరం ఉదయ భానును అదుపులోకి తీసుకని అతడిపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేగాక గతంలోనూ నిందితుడు పలు వివాదాల్లో ఉన్నట్లు పోలీసుల పేర్కొన్నారు. ఇదివరకు కూడా అతడు అధికార పార్టీకి చెందిన పెద్దలు తనకు బంధువులంటూ దబాయిస్తూ ఎమ్మల్యేలు, సినీ ప్రముఖులతోనూ దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలున్నాయి. కాగా ఇవాళ ఉదయభానుని రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పని మనిషిని ఫ్లాట్లో బంధించి రెండు వారాలుగా... ప్రాణం తీసిన వివాహేతర సంబంధం -
తమాషా చేస్తున్నారా.. నన్ను ఆపడానికి మీరెవరు?
సాక్షి, బంజారాహిల్స్: ‘నన్ను ఆపడానికి మీరెవరంటూ’ ఎంపీ ధర్మపురి అరవింద్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాను భైంసాకు వెళ్తున్నట్లు సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన బంజారాహిల్స్ పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరవింద్ను అడ్డుకునేందుకు ఇంటి వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే ఆయన వెళ్లిపోయినట్లు తెలియడంతో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఆర్. కళింగరావు, ఎస్ఐలు బాలరాజు, కె.ఉదయ్తో పాటు పోలీసులు పెట్రోకార్లలో ఆయనను వెంబడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్హయత్ హోటల్ ముందు నుంచి వెళ్తున్న ధర్మపురి అరవింద్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోకార్లు రోడ్డుకు అడ్డంగా నిలిపి అడ్డుకున్నారు. దీంతో కారులో నుంచి దిగిన అరవింద్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఆపడానికి మీరెవరంటూ పోలీసులను నిలదీయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాను నిజామాబాద్ వెళుతుంటే ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు. హిందువులను నాశనం చేయాలనుకున్నారా.. తమాషా చేస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో సహకరించాలని ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. నిజామాబాద్ వెళ్తుంటే వద్దని చెప్పేందుకు ఆర్డర్ ఏదంటూ నిలదీశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చదవండి: నల్లధనం తేలేదు.. నల్ల కుబేరులను దేశం దాటించారు 15 నుంచి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ -
బంజారాహిల్స్: ఫ్లాట్లో బంధించి రెండు వారాలుగా..
బంజారాహిల్స్: ఇంట్లో పని కోసం కుదుర్చుకున్న పని మనిషిపై ఇంటి యజమాని ఫ్లాట్లో బంధించి రెండు వారాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. బాధితురాలు చాకచక్యంగా నిందితుడి నుంచి తన ఫోన్ను లాక్కొని కూతురికి ఫోన్ చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్.1905లో ఉదయ భాను(52) అనే వ్యాపారి నివసిస్తున్నాడు. సినిమా పరిశ్రమలో పని చేస్తున్న ఇతడు గత నెల 17వ తేదీన రాజమండ్రి నుంచి ఓ పని మనిషిని రప్పించుకున్నాడు. ఆమెకు అదే అపార్ట్మెంట్లో చిన్న గదిని కేటాయించారు. కాగా, అదే నెల 18వ తేదీన ఆమె పని చేస్తుండగా బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి పొక్కితే నిన్ను, నీ కూతురును చంపేస్తానంటూ బెదిరించాడు. అంతే కాదు ఆమె సెల్ఫోన్ కూడా తన వద్దే పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఆమెను బెదిరిస్తూ లైంగికదాడికి పాల్పడటమే కాకుండా గదిలో బంధించి బయటి నుంచి తాళం వేసి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె కూతురికి చెప్పడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఈ నెల 5వ తేదీన నిందితుడు ఉదయ భాను బయటికి వెళ్తున్న సమయంలో చాకచక్యంగా ఆమె తన సెల్ఫోన్ను తీసుకొని కూతురికి జరిగిన విషయం చెప్పింది. ఆందోళన చెందిన కూతురు 100కు ఫోన్ చేసింది. పోలీసులు వెంటనే సెల్సిగ్నల్ ఆధారంగా కేసును ఛేదించి ఫిలింనగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఎస్ఐ రాంబాబు సిబ్బందితో కలిసి అపార్ట్మెంట్లోకి వెళ్లి ఫ్లాట్లో బంధించిన బాధితురాలికి విముక్తి కలిగించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ భానుపై ఐపీసీ సెక్షన్–342, 376(2), 323, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: భార్య నోట్లో పురుగుల మందు కలిపిన కూల్డ్రింక్ పోసి -
అక్రమ కట్టడాలపై కేటీఆర్కు కోన వెంకట్ ట్వీట్
నగరంలోని అక్రమ నిర్మాణాలపై ప్రముఖ టాలీవుడ్ రచయిత కోన వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన బంజారాహిల్స్లోని అక్రమ కట్టడాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల కార్పోరేషన్ దృష్టికి తీసుకేళ్లే ప్రయత్నం చేశారు. మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్కు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘సయ్యద్ నగర్, రోడ్ నెంబర్ 12, బంజారాహిల్స్లో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరగుతున్నాయి. మురుగు నీరు లేదు, పారిశుధ్యం లేదు, రోడ్లు లేవు. కానీ ఈ మురికి వాడల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. దయ చేసి దీనిని పరిశీలించండి’ అంటూ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ను ట్యాగ్ చేశారు. Lot of Illegal constructions are coming up in Sayyed Nagar, Road no 12, Banjarahills... No sewerage, No sanitation, No roads.. but multi storied constructions in these slums will lead to major problems in future.. Please look into this 🙏 @CommissionrGHMC @KTRTRS @GHMCOnline pic.twitter.com/rHN7uNFySC — kona venkat (@konavenkat99) February 26, 2021 -
ఆడిషన్స్ అదుర్స్..
-
ఎంఎఫ్ హుస్సేన్ ‘సినిమా ఘర్’.. ఇక ఫొటోలోనే..
సాక్షి, బంజారాహిల్స్: సినిమాలు, కళలను అనుసంధానిస్తూ ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్.హుస్సేన్ బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రధాన రహదారిలో తన కలల సౌధంగా నిర్మించుకున్న సినిమా ఘర్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఒక వైపు సినిమాలను, ఇంకోవైపు పెయింటింగ్స్ను తిలకిస్తూ కళాకారులు మురిసిపోయే విధంగా 1994లో ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడ సినిమా ఘర్ పేరుతో తన సొంత ఆలోచనతో దీన్ని నిర్మించారు. అప్పటి బాలీవుడ్ అగ్రనటి మాధురి దీక్షిత్ చేతులమీదుగా ప్రారంభించారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు దీని నిర్వహణ వదిలేశారు. కోట్ల విలువ చేసే పెయింటింగ్స్ను ముంబైకి తరలించారు. పది సంవత్సరాల నుంచి ఈ భవనం శిథిలావస్థలోనే ఉంది. పదేళ్ల క్రితమే మళ్లీ తెరుస్తామని ప్రకటనలు వచ్చినప్పటికీ ఆ లోపే ఆయన 2011 జూన్ 9న మరణించడంతో మళ్లీ తెరుచుకోలేదు. ఎంఎఫ్ హుస్సేన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ సినిమా పేరుతో కనువిందుగా ఈ మ్యూజియంను తీర్చిదిద్దారు. 50 మంది కూర్చొని సినిమా తిలకించే విధంగా సౌందర్య టాకీస్ పేరుతో ఇందులో మినీ థియేటర్ కూడా ఉండేది. ఇక పెయింటింగ్స్, బుక్స్, పోస్ట్కార్డుల ప్రదర్శన కోసం ప్యారిస్ సూట్ పేరుతో మరో హాల్ ఉండేది. తరచూ ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడికి వచ్చి తన సన్నిహితులతో, కళాకారులతో సంభాషిస్తూ ఉండేవారు. ఆయన మరణం సినిమా ఘర్ పాలిట శాపంగా మారింది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చివేస్తుంటే కళాభిమానులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఎంఎఫ్ హుస్సేన్ జ్ఞాపకాలు కళ్లముందే కూలిపోతుంటే ప్రతిఒక్కరూ చలించిపోతున్నారు. కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఈ భవనాన్ని తీసుకొని కళాకారుల సందర్శనార్థం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. -
భర్తతో గొడవ.. బిడ్డతో సహా భవనంపై నుంచి దూకిన తల్లి
సాక్షి, హైదరాబాద్: భర్తతో ఘర్షణ పడిన ఓ యువతి 8 నెలల కూతురితో సహా రెండంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా.. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. బిహార్కు చెందిన బిమల్ కుమార్ నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ, భార్య ఆర్తి (22)తో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11.30కి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆర్తి తన కూతురుతో సహా బయటకు వచ్చి ఇంటి గడియ వేసి భవనం రెండో అంతస్తుకు వెళ్లి కిందికి దూకింది. చుట్టుపక్కల వారు గమనించి గడియ తీసి భర్తకు విషయం చెప్పారు. బాధితురాలితో పాటు చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆర్తి మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఒంటిపై దుస్తులు తీసేసి యువతి హల్చల్
సాక్షి, బంజారాహిల్స్: మద్యం మత్తులో ఓ యువతి హల్చల్ చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. రహ్మత్నగర్కు చెందిన యువతి(30) బుధవారం మధ్యాహ్నం భరత్ అనే యువకుడికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. దీంతో భరత్ కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. యువతి కృష్ణకాంత్ పార్కు వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. (చదవండి: పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం..) జూబ్లీహిల్స్ పోలీసులు కృష్ణకాంత్ పార్కు వెళ్ళి పరిశీలించగా అంతకు అరగంటముందే ఆమె ఆటోలో వెళ్ళినట్లుగా స్థానికులు చెప్పారు. ఆటో నంబర్ ఆధారంగా పోలీసులు బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రహ్మత్నగర్లో ఆమెను గుర్తించారు. పోలీస్ అవుట్ పోస్ట్కు విచారణ కోసం తీసుకురాగా అప్పటికే మత్తులో ఉన్న సదరు యువతి పోలీసులు చూస్తుండగానే ఒంటిమీద దుస్తులు తీసేసి చిందులేసింది. ఇద్దరు మహిళల సాయంతో ఆమెకు సర్దిచెప్పి భరత్ను పిలిపించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. (చదవండి: భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య) -
‘కేరింత’ నటుడు విశ్వంత్కు నోటీసులు
సాక్షి, బంజారాహీల్స్: డిస్కౌంట్లో కారు ఇప్పిస్తానని ఓ వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఘటనలో సినిమా హీరో విశ్వంత్ (కేరింత,మనసంతా, ఓ పిట్టకథఫేమ్) కు బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) కింద నోటీసులు అందజేశారు. ఈ కేసులో విచారణ కోసం హాజరుకావాలని కోరారు. వివరాల్లోకి వెళ్తే... రామకృష్ణ అనే వ్యాపారి కారు కొనేందుకు స్పేస్ టైమ్ ఇంటీరియర్స్ అధినేత ఆత్మకూరి ఆకాష్ గౌడ్ ద్వారా రూ. 25 లక్షల విలువచేసే ఇన్నోవా క్రిస్టా కారును రూ.17.60 లక్షలకు ఇప్పిస్తానని హీరో విశ్వంత్ నమ్మించాడు. అడ్వాన్స్గా రూ.10 లక్షలు తీసుకున్నాడు. మరో నెల తర్వాత రూ. 2.50 లక్షలు ఇచ్చి కారు తీసుకున్నాడు. నెల రోజుల్లో ఈ కారును రామకృష్ణ పేరు మీదికి మారి్పస్తానని, అప్పుడు మిగతా డబ్బులు తీసుకుంటానని చెప్పాడు. రెండు నెలలుదాటినా కారు బదిలీ కాలేదు. ఆరా తీయగా ఆ కారుపై రూ.20 లక్షల అప్పుతీసుకున్నట్లు తెలిసింది. హీరో విశ్వంత్, ఆయన తండ్రి లక్షి్మకుమార్ ఉద్దేశపూర్వకంగా తమను మోసం చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపోలీసులు నోటీసు జారీ చేశారు. కాగా విశ్వంత్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’ మూవీలో విశ్వంత్ సెకండ్ హీరోగా నటించి టాలీవుడ్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత మలయాళ నటుడు మోహన్లాల్, గౌతమిలు నటించిన ‘మనమంతా’లో నటించాడు. అనంతరం ఇటీవల వచ్చిన ‘ఓ పిట్టకథ’ మూవీతో పాలు పలు వెబ్ సిరీస్లో కూడా నటించాడు. కాగా కాకినాడ సామర్లకోటకు చెందిన అతడు పదో తరగతి వరకు విశాఖలో చదువుకున్నాడు. ఇంటర్ హైదరాబాద్లో.. ఇంజనీరింగ్ డిగ్రీని కోయంబత్తూర్లో పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులకు కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే విశ్వంత్కు 2015లో ‘కేరింత’లో నటించే అవకాశం వచ్చింది. -
బంజారాహిల్స్లో దారుణం.. కూతుళ్లపై కన్న తండ్రే
సాక్షి, బంజారాహిల్స్: కన్నతండ్రి కూతురిపాలిట కామాంధుడయ్యాడు. మూడేళ్లుగా ఆమెపై లైంగికదాడికి పాల్పడుతూ ఎవరికైనా ఫిర్యాదు చేస్తే చంపేస్తానంటూ బెదిరించసాగాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లోని బోలానగర్ ఫస్ట్లాన్సర్లో నివసించే విద్యార్థిని(18)పై ఆమె తండ్రి(42) గత కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు తాళలేక బాధితురాలు గత డిసెంబర్ 29న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు గాలింపు చేపట్టి ఆమెను జనవరి 5న ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయావని సోదరి నిలదీయడంతో మహ్మద్ కరీం అనే వ్యక్తి తనను తీసుకెళ్లాడని.. రెండుసార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పింది. అంతేగాక తండ్రి కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. మూడేళ్లుగా తన సోదరిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, తనపై కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఇద్దరం తండ్రి బాధితులమేనని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్
సాక్షి, బంజారాహిల్స్: ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని ప్రభాస్ ఓ సినిమాలో అంటే అందరూ చూశారు.. కానీ మూడు అడుగులు ఉన్న శివలాల్ కూడా ఇదే డైలాగ్ కొడితే అందరూ ఫక్కున నవ్వేశారు.. కానీ ఇప్పుడు శివలాల్ను చూసిన ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.. నువ్వు పొట్టోడివి.. నీకు కారు నడపడం చేతనవుతుందా.. నువ్వు తినడానికి తప్పితే ఎందుకూ పనికిరావంటూ బంధుమిత్రులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారు చేసిన హేళన మరుగుజ్జు గట్టిపల్లి శివలాల్ (38)పై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆరు అడుగుల పొడవుంటేనే కారు నడపవచ్చా..? మూడడుగులు ఉంటే నడపరాదా అనే ప్రశ్నను తనుకు తానే వేసుకొని నూతన సంవత్సరంలో ఓ గట్టి ఛాలెంజ్ను తనకు తానే తీసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని ఉదయ్ నగర్లో నివసించే జి.శివలాల్ పుట్టుకతోనే మరుగుజ్జు. మూడు అడుగుల పొడవు. అయితేనేం ఆత్మవిశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 400 మంది మరుగుజ్జుల్లో డిగ్రీ చేసిన మొదటి వికలాంగుడు. అంతేకాదు టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్లో డివిజన్ ఫస్ట్ వచ్చాడు. కంప్యూటర్లో పీజీ డీసీఏ చేయడమే కాదు బీకాం కూడా చదివాడు. ప్రస్తుతం ఓ చిన్న జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శివలాల్కు కారు నేర్చుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. తానెందుకు కారు నడపకూడదని అనుకోవడమే కాకుండా తన స్నేహితుడి కారు తీసుకొని దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని కారు నేర్చుకున్నాడు. తనకు తానే దిక్సూచిగా మార్చుకున్నాడు. ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం అడ్డురాదని నిరూపించాడు. ప్రస్తుతం 90 శాతం డ్రైవింగ్ నేర్చుకోవడం పూర్తయిందని ఈ వారంలో డ్రైవింగ్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకుంటున్నానని వెల్లడించాడు. డ్రైవర్గా ఉండటానికి తాను డ్రైవింగ్ నేర్చుకోవడం లేదని భార్య, పిల్లలతో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మాత్రమే కారు నడుపుతానని శివలాల్ అంటున్నాడు. -
ఆకలి కేకలు.. కన్నీటి చిత్రం
అవలీలగా నటించగలరు. కానీ, జీవించడమే వారికి కష్టతరమవుతోంది. రంగుల ప్రపంచంలో గడిపినవారి ముందు ఇప్పుడు అంతా చీకటి ఆవరించింది. రకరకాల పాత్రల్లో నవ్వులు పండించినవారి ముఖాల్లో దిగులు కనిపిస్తోంది. వెండితెరపై వెలిగినవారిప్పుడు కరోనా కష్టాల్లో నలిగిపోతున్నారు. లైట్బాయ్స్, కెమెరా అసిస్టెంట్లు, సహాయ దర్శకులు, కో డైరెక్టర్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, మేకప్మెన్, జూనియర్ ఆర్టిస్ట్లు, క్రేన్ బాయ్స్, డ్యాన్సర్లు, డ్రైవర్లు ఇలా చెప్పుకుంటూ పోతే సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్లోని కార్మికులందరూ రోడ్డున పడ్డారు. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్, సౌండ్ ఇంజనీర్లు ఇలా.. ప్రతి ఒక్కరూ పనుల్లేక అవస్థలు పడుతున్నారు. కృష్ణానగర్, ఫిలింనగర్, ఇందిరానగర్, రహమత్నగర్, చిత్రపురికాలనిలో 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తున్న వారి సంఖ్య సుమారు 24 వేలు. పరోక్షంగా ఇంకో 75 వేల మంది పనిచేస్తుంటారు. జూనియర్ ఆర్టిస్ట్లు, మిగతా సినీ కార్మికులు ఏవేవో చిన్నా, చితక పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. కరోనా వారి బతుకులను ఎలా అతలాకుతలం చేసిందో తెలుసుకుందామని కొంతమందిని ‘సాక్షి’పలకరించింది. – బంజారాహిల్స్ ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఎన్.మహేష్కుమార్. స్టిక్కర్లతో ఫిలింనగర్ రోడ్లపై కనిపించాడు. సాక్షి ప్రతినిధి స్టిక్కర్లు బేరమాడుతూ మాట కలిపారు. కదిలిస్తే కన్నీటి పర్యంతమయ్యాడు. ‘మా స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు. వెండితెరపై వెలిగిపోవాలన్న మోజుతో 38 ఏళ్ల క్రితం మద్రాస్కు రైలెక్కా. చిత్రపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్కు తరలివచ్చాక ఫిలింనగర్కు మకాం మార్చా. జూనియర్ ఆర్టిస్ట్గానే బతుకు వెళ్లదీస్తున్నా. ఈ ఏడాది మార్చిలో కరోనా మహమ్మారి సినిమా బతుకుల్ని బజారుపాల్జేసింది. షూటింగ్లు లేక రోడ్డున పడ్డా. తిండికి తిప్పలు పడుతున్నా. ఇంటి కిరాయి కట్టలేక ఫుట్పాత్పై నిద్రిస్తున్నా. స్టిక్కర్లు అమ్ముకుంటున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉబికి వచ్చిన కన్నీటిని ఒక చేత ఒత్తుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూ ముందుకెళ్లిపోయాడు. మరి, ఎన్ని స్టిక్కర్లు అమ్మితే.. లెక్కలేనన్ని అతడి గతుకుల బతుకు అతుకుతుందో ఏమో! (చదవండి: ముంబైలో తెలుగు సీరియల్ నటి అరెస్టు) మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్నా... నాది తెనాలి. 30 ఏళ్ల క్రితం సినిమాలపై మోజుతో మద్రాస్ వెళ్లా. చిత్రపరిశ్రమ హైదరాబాద్ తరలివచ్చాక 20 ఏళ్లుగా కృష్ణానగర్లోనే ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాను. షూటింగ్ ఉన్ననాడే కడుపుకింత తిండి. గత మార్చి నుంచి షూటింగ్లు ఆగడం మాకు శాపమైంది. ఫలితంగా ఫుట్పాత్పై పడ్డాను. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కార్యాలయం దగ్గరే పడుకుంటూ ఇక్కడే కాలం గడుపుతున్నాను. మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్నా. – జూనియర్ ఆర్టిస్ట్ కొండల్రావు మాస్కులు అమ్ముకుంటున్న ప్రొడక్షన్ అసిస్టెంట్ కృష్ణానగర్ వీధుల్లో మాస్కులు, శానిటైజర్లు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని ‘సాక్షి’ పలకరించింది. పేరు శివకుమార్. నల్లగొండ జిల్లావాసి. కృష్ణానగర్లో ఉంటూ 20 ఏళ్లుగా సినిమాలకు ప్రొడక్షన్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. సినిమా షూటింగ్లప్పుడు ఉన్నంతలో ఎంతోకొంత వెలిగిపోయిన శివ.. కరోనా కారణంగా ఇప్పుడు కష్టాల్లో నలిగిపోతున్నాడు. ‘నాలుగు రాళ్లు వెనుకేసుకునే పరిస్థితిలేక ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్నా. భార్యాపిల్లల పొట్టనింపడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లు అమ్ముకుంటున్నా. సినిమాలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయా.. మళ్లీ బతుకు ఎప్పుడు గాడిన పడుతుందా.. అని ఎదురుచూస్తున్నా’అని ఎంతో ఆశగా చెప్పాడు. ఎన్ని మాస్కులు అమ్మితే.. కరోనా ముసుగు కమ్ముకున్న అతడి జీవితంలో ఆనందానికి తెరతీస్తుందో కదా. అప్పులు చేసి కిరాయిలు కడుతున్నాం... కరోనా మహమ్మారి సినిమా బతుకుల్ని రోడ్డుకీడ్చింది. కుటుంబ పోషణకు నెలకు రూ.30 వేల ఖర్చు. ఈ 8 నెలల్లో పనిలేక అప్పులు చేసి కిరాయిలు కడుతున్నాం. కొంతమంది ఇక్కడ బతకలేక స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఓ చిన్నసినిమా మొదలైతే 70 మందికి, పెద్ద సినిమా మొదలైతే 100 మందికి పని దొరుకుతుంది. 45 ఏళ్ల నా సినీసర్వీసులో ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. – సినీ దర్శకుడు విజయసారథి రియల్ ఎస్టేట్లోకి దిగిన గౌస్ ఆయన పేరు ఎండీ గౌస్. పేరుకు జూనియర్ ఆర్టిస్టు. కానీ, అందరి కంటే చాలా సీనియర్. 1982 నుంచి జూనియర్ ఆర్టిస్ట్గా మంచి మంచి పాత్రలు పోషించాడు. షూటింగ్లకు కరోనా బ్రేకులు వేయడంతో ఆయన జీవితం కుదుపులకు గురైంది. దీంతో రియల్ ఎస్టేట్ వైపు దృష్టి సారించాడు. ప్లాట్లు అమ్మేవారికి, కొనేవారికి మధ్య వర్తిగా పనిచేస్తూ ఎంతోకొంత సంపాదిస్తూ రోజులు నెట్టుకొస్తున్నాడు. మెల్లమెల్లగా షూటింగ్లు గత 3 వారాల నుంచి సినిమా షూటింగ్లు మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. ఊర్లకు వెళ్లిన వారికి మెసేజ్లు పంపి రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఇంకో నెలరోజుల్లో పూర్తి స్థాయిలో షూటింగ్లు ప్రారంభమవుతాయని ఆశాభావంతో ఉన్నాం. సినీపరిశ్రమలోని కార్మికులను ఆదుకోవడానికి కొంతమంది ముందుకు వచ్చారు. కరోనా కష్టకాలంలో.. మెగాస్టార్ చిరంజీవి సీసీసీ పథకంలో భాగంగా 1,500 మంది జూనియర్ ఆర్టిస్టులకు మూడు నెలలపాటు బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు. చదలవాడ లాంటి ప్రముఖులు రూ.3 లక్షల మేర నగదు ఇవ్వగా కార్మికులకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. -డి.స్వామిగౌడ్, అధ్యక్షుడు, తెలుగు సినీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ -
ఉరితాడు కోసి.. ఊపిరి పోసి
బంజారాహిల్స్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సకాలంలో స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను కాపాడి పునర్జన్మనిచ్చారు. ఘటన జరుగుతున్న సమయంలో జూబ్లీహిల్స్ పోలీసుల సమయస్ఫూర్తి ఆ మహిళను కాపాడగలిగింది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో నివసించే రమావత్ సిరి (45) అనే మహిళ శనివారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటికి వచ్చి ఓ ఖాళీ ప్లాటులోని చెట్టుకు ఉరేసుకుంటుండగా పక్క ప్లాటులో ఉన్న విశ్వనాథ్రెడ్డి అనే అడ్వకేట్ గమనించారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్డ్యూటీలో ఉన్న ఎస్ఐ శేఖర్ వెంటనే గస్తీ పోలీసులను అక్కడికి వెళ్లాల్సిందిగా పురమాయించారు. అదే సమయంలో విశ్వనాథరెడ్డిని రిక్వెస్ట్ చేసి వెంటనే అక్కడికి వెళ్లి చెట్టుకు కట్టిన తాడును తెంపేయాల్సిందిగా సూచించారు. 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. హుటాహుటిన ఎస్ఐ కూడా అక్కడికి బయల్దేరారు. అయిదు నిమిషాల వ్యవధిలోనే బ్లూకోట్స్ పోలీసులు సందీప్, బాలపెద్దన్న, అడ్వకేట్ విశ్వనాథరెడ్డి అక్కడికి వెళ్లారు. చెట్టుకు వేలాడుతున్న మహిళను కిందకు దించేందుకు తాడును కోసేశారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆమె కొట్టుమిట్టాడుతుండగా అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి ఆక్సిజన్ అందించి ఊపిరిపోశారు. ఆమె గంట సేపట్లోనే తేరుకుంది. పోలీసులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఆ మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని పోలీసులను స్థానికులు ప్రశంసించారు. ఎస్ఐ శేఖర్కు అధికారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
ఆదిత్య బిల్డర్స్ కోటారెడ్డిపై కేసు
సాక్షి, హైదరాబాద్: ఆదిత్య బిల్డర్స్ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఆదిత్య బిల్డర్స్తో కలిసి తాము ఏర్పాటు చేసిన ‘శ్రీ ఆదిత్య వంశీరామ్ హోమ్స్ ఎల్ఎల్పీ జాయింట్ వెంచర్లో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా మోసపూరితంగా వ్యవహరిస్తూ అక్రమంగా విల్లాలు విక్రయిస్తుస్తున్న ఆదిత్య అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వంశీరామ్ అధినేత సుబ్బారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. (నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్రెడ్డి) ఈ మేరకు పోలీసులు కోటారెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే నందగిరి హిల్స్లో నివసించే సుబ్బారెడ్డి నార్సింగిలోని సర్వే నంబర్ 155, 156లో ఉన్న 16 ఎకరాల 24 గుంటల స్ధలంలో విల్లాల నిర్మాణానికి ఆదిత్య హోమ్స్ సంస్థతో 2014లో డెవలప్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య సంస్థ అధినేత కోటారెడ్డి ఉద్దేశ పూర్వకంగా 23 విల్లాల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కారణంగా తనకు రూ. 79.36 కోట్ల మేర నష్టం వచ్చిందని సుబ్బారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (100 కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసులో కొత్త కోణం) యువతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్ నాగోలు: ఎల్బీనగర్ పరిధిలోని ధనాపూర్ జనప్రియ కాలనీలో ఉన్న ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్లో పనిచేసే యువతిని హత్య చేసి పారిపోయిన మరో ఉద్యోగిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు వివాహం అయ్యింది. అతనిపై భార్య వేధింపుల కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన మూడు నెలల క్రితమే స్థానికంగా ఈ ఉద్యోగంలో చేశాడు. ఓ రోజు వెంకటేశ్వరావు మద్యం సేవించి వచ్చి యువతితో కలసి గదిలో వంటచేశాడు. యువతి ఒక్కతే ఉండటంతో ఆమెను లోబరుచుకోవాలని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు తన గురించి బయట చెబుతుందోమోననే భయంతో ఆమెపై దాడి చేసి నోరు గట్టిగా మూసి చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఓ ప్రైవేట్ వాహనాన్ని బుక్ చేసుకుని పారిపోతుండగా సెంటర్ నిర్వాహకుడు చంద్రశేఖర్రెడ్డి నిందితుడిని గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తాను చేసిన నిర్వాకాన్ని ఆ యువతి ఎవరితోనైనా చెబుతుందేమోననే భయంతో మద్యం మత్తులో హత్య చేసినట్లు వెంకటేశ్వరరావు అంగీకరించాడని సమాచారం. (ఎల్బీ నగర్లో యువతి దారుణ హత్య) -
నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆదిత్యా హోమ్స్ డైరెక్టర్, చైర్మన్ మధ్య నెలకొన్న వివాదం తారా స్థాయికి చేరింది. ఇంటి సమస్య కాస్తా తీవ్ర విభేదాలతో రచ్చకెక్కింది. 100 కోట్ల రూపాయలు విలువచేసే డాక్యుమెంట్ల చోరీతో మొదలైన వివాదం మరింత ముదిరింది. తన బావ కోటారెడ్డి తనను జైలుకు పంపేందుకు కుట్రలు పన్నుతున్నారని సుధీర్రెడ్డి ఆరోపించారు. వ్యాపారం పేరుతో తన కుటుంబాన్ని నిలువునా మోసం చేశారని, కంపెనీ లాభాలు తీసుకుని తమను దోచుకున్నారని వాపోయారు. కొడుకుతో తనకు ప్రాణహాని ఉందని సుధీర్రెడ్డి తల్లి అజంతా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. (ఆ చోరీ చేసింది నా కొడుకే.. ప్రాణాహాని ఉంది) ‘15 ఏళ్లుగా కోటారెడ్డి కుటుంబంతో మాకు మాటల్లేవు. 1995లో నేను అమెరికా వెళ్లాను. నేను, నా భార్య కలిసి డబ్బు సంపాదించి తిరిగి ఇండియా వచ్చాం. మా నాన్న చనిపోతూ కుటుంబమంతా కలిసి ఉండాలని కోరుకున్నారు. 2016లో నేను ఆదిత్యా హోమ్స్లో డైరెక్టర్గా చేరాను. అప్పటి నుంచి అమ్మ, అక్క.. నన్ను వేధించడం మొదలుపెట్టారు. ఇంటిని మా అమ్మకు ఇచ్చేందుకు అక్కా,బావ ప్లాన్ వేశారు. 2014లో వంశీరామ్ బిల్డర్స్తో కలిసి.. గండిపేట్లో మా బావ కోటారెడ్డి విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించారు. అందులో 25 విల్లాలకు నా ద్వారానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసే అధికారం ఎవరిచ్చారంటూ.. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి నన్ను ప్రశ్నించారు. సుబ్బారెడ్డికి తెలియకుండా విల్లాల రిజిస్ట్రేషన్లు చేసే అధికారం మా బావ కోటారెడ్డే నాకు ఇచ్చారు. ఈ విషయంలో కోటారెడ్డి నన్ను మోసం చేశారు. సుబ్బారెడ్డి అనుమతి లేకుండా నేను సేల్ డీల్స్ చేయడం తెలీకుండా చేసిన తప్పు. (100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు అపహరణ) ఆదిత్యా హోమ్స్పై కేసులు పెడతానని ఆనాడే సుబ్బారెడ్డి హెచ్చరించారు. వాళ్లు చేసిన తప్పులను నాపై నెట్టేశారు. నేను సుబ్బారెడ్డితో కుమ్మక్కయ్యాననేది మా బావ అపోహ.. నా ఇంటిని కాజేయాలని, నన్ను ఇంటి నుంచి గెంటేసే కుట్ర చేశారు. పోలీసుల పేరుతో నా ఇంట్లో సోదాలు చేసేందుకు కోటారెడ్డి కొందరు మనుషుల్ని పంపించారు. నాకు, మా బావకు వ్యక్తిగతంగా గన్ లైసెన్స్లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో తన గన్ సరెండర్ చేయడానికి మా బావే నాకు ఆథరైజేషన్ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఇద్దరి గన్స్ సరెండర్ చేస్తే పోలీసులు మా బావ గన్ మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇదంతా కుట్రలో భాగంగానే సాగుతోంది. నేను బావ బాధితుడిని’ అని తెలిపారు. -
బంజారాహిల్స్లో భారీ చోరీ
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్లో శనివారం భారీ చోరీ జరిగింది. బిల్డర్ కార్యాలయంలోకి చొరబడిన దుండగుడు 100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, రివాల్వర్, 20 బుల్లెట్లను అపహరించాడు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్ అధినేత కోటారెడ్డి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు సుధీర్రెడ్డిగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. -
వారికి సెల్యూట్: సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనాపై యుద్ధంలో నగర పోలీసులు చేస్తున్న కృషి చరిత్రలో నిలుస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. నక్సల్స్ నుంచి కరోనా వరకు అన్ని సమస్యలను పోలీసులు ముందుడి ఎదుర్కొంటున్నారని.. పోలీసు వ్యవస్థ ఎప్పుడూ వైఫల్యం చెందదని వ్యాఖ్యానించారు. ప్రాణాంతక కోవిడ్-19 బారిన పడి కోలుకున్న 45 మంది పోలీసులు సోమవారం తిరిగి విధుల్లో చేరారు.(హైదరాబాద్లో మళ్లీ లాక్డౌన్పై ప్రకటన!) ఈ సందర్భంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో అంజనీ కుమార్ మాట్లాడుతూ.. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో తక్కువ కేసులు నమోదుకావడానికి సిటీ పోలీసుల కృషి కారణమన్నారు. జనతా కర్ఫ్యూ నుంచి ఇప్పటివరకు ప్రతీ సందర్భంలో వారు ముందుండి నడిచారని పేర్కొన్నారు. కరోనా వీరులకు, వారికి కుటుంబాలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. వారికి స్వాగతం పలకడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కరోనాను జయించిన తర్వాత తిరిగి మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటిస్తూ.. సానిటైజర్లు వాడాలని సూచించారు.(చదవండి: 100 రోజుల లాక్డౌన్.. ఏం జరిగింది?) -
షేక్పేట తహసీల్దార్ భర్త బలవన్మరణం
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త ప్రొఫెసర్ అజయ్కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిక్కడపల్లిలో లలిత మాన్షెన్లోని తన రెండో అక్క రేఖ ఇంట్లో తన కుమారుడితో అజయ్ ఉంటున్నారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు అజయ్కు ఓ ఫోన్ కాల్ రాగా మొదటి అంతస్తు నుంచి ఐదో అంతస్తుపైకి వెళ్లి మాట్లాడుతూ.. అపార్ట్మెంట్ పైనుంచి కిందకు దూకారు. తీవ్రంగా గాయపడిన అజయ్కుమార్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరోపణలు భరించలేకే.. చిన్నప్పట్నుంచే సున్నిత మనస్కుడైన అజయ్ తన భార్యపై వచ్చిన అవినీతి ఆరోపణలను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఉన్నత కుటుంబం, భార్యాభర్తలిద్దరికీ మంచి ఉద్యోగాలు.. నల్లేరుపై నడకలా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. అవి నీతి ఆరోపణలు ఎదుర్కొని ఒకరు జైలుపాలు కాగా.. మరొకరు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. ఇక అజయ్కుమార్ది విద్యావంతుల కుటుంబం. గత 15 ఏళ్లుగా ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మొదట్లో సివిల్స్ కోసం శిక్షణ పొంది ఇంటర్వూ్య వరకు వెళ్లారు. తొలుత మహబూబ్నగర్ పీజీ కళాశాలలో, నిజాం కళాశాలలో, కోఠి ఉమెన్స్ కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పీహెచ్డీ పూర్తిచేసిన అజయ్ తన థీసిస్ సబ్మిషన్ దశలో ఉన్నారు. అంతకుముందు ఓ జూనియర్ కళాశాలలో పనిచేస్తుండగా తన కొలీగ్స్ ద్వారా పరిచయమైన ఖమ్మం జిల్లా, మధిరకు చెందిన సుజాతను పెళ్లి చేసుకున్నారు. ఇక అజయ్ బాబాయ్లు, పెద్దనాన్నలు కూడా ఉన్నత విద్యావంతులే. పెదనాన్న గోకా రామలింగం ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే తన రెండో పెదనాన్న రామస్వామి అప్పటి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇక తండ్రి ఆంజనేయులు డీఎస్పీగా పనిచేసి రిటైరయ్యారు. తన బాబాయ్లు మోహన్ కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా, మరో బాబాయ్ గోకా మురళీ డాక్టర్గా ఉన్నతస్థాయిల్లో పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో అజయ్ చురుగ్గా పాల్గొన్నారు. ఇక సుజాత కూడా గ్రూప్–2 ఆఫీసర్గా ఎంపికై మొదట మెదక్ జిల్లాలో, తర్వాత నగరంలోని ముషీరాబాద్, హిమాయత్నగర్ తదితర ప్రాంతాల్లో తహశీల్దార్గా పనిచేశారు. కావాలనే టార్గెట్ చేశారా? షేక్పేట తహసీల్దార్ సుజాతను ఆమె కుటుంబాన్ని కొందరు రెవెన్యూ అధికారులతో పాటు ఏసీబీ అధికారులు కావాలానే టార్గెట్ చేశారని ఫిర్యాదులు వస్తున్నాయి. సుజాతను ఇప్పటికే అరెస్ట్ చేయగా, ఆమె భర్త ప్రొఫెసర్ అజయ్ను సైతం అరెస్ట్ చేస్తామన్న సంకేతాల నేపథ్యంలోనే బుధవారం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వాస్తవానికి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సర్వే నెంబర్ 403/పీలో 4,865 గజాల భూవివాదంలో తనను ఎస్ఐ రవీందర్నాయక్ వేధిస్తున్నాడని అబ్దుల్కాలీద్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయగా.. ఏసీబీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) నాగార్జునరెడ్డిని వలపన్ని పట్టుకుంది. ఆపై కాలీద్ను పోలీస్లు విచారించిన సమయంలో అతను తహశీల్దార్ సుజాత ప్రస్తావనే తీసుకురాలేదని సమాచారం. అయినా కేసును ముందుకు తీసుకెళ్లే దిశగా ఆమె నివాసంలో సోదాలు చేయటం రూ.30 లక్షల నగదుకు సరైన లెక్కలు చూపని కారణంగా ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అనంతరం భర్త అజయ్కు ఏసీబీ నుంచి తరచూ ఫోన్లు రావటం, తాము అడిగిన వివరాలు చెప్పకపోతే అరెస్ట్ తప్పదన్న సంకేతాలివ్వటం వల్లే అజయ్ ఆత్మహత్యకు ఒడిగట్టారని సమీప బంధువులతో పాటు రెవెన్యూ సంఘాలు ఆరోపించాయి. అయితే సుజాతను ఏసీబీ వివాదంలో ఇరికించేందుకు నగర రెవెన్యూశాఖలోని ఒకరిద్దరు అధికారులు సైతం ఏసీబీకి తప్పుడు సమాచారం ఇచ్చారన్న అంశం తెరమీదకు వచ్చింది. రెండు మార్లే ఫోన్ చేశాం..: ఏసీబీ డీఎస్పీ అజయ్ ఆత్మహత్య నేపథ్యంలో ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర్రావును ‘సాక్షి’ప్రశ్నించగా.. కేసు విచారణలో భాగంగానే తహశీల్దార్ సుజాతను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆమె భర్త అజయ్కు ఫోన్లో ధ్రువీకరించామని, ఆపై హన్మకొండ సమీపంలో తమకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉందని సుజాత తమకు చెప్పగా, అదే విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు తాము అజయ్ను అడిగితే ఒకే ఎకరం ఉందని చెప్పారని ఈ రెండు సమయాల్లో తప్పితే తాము మరే కాల్ చేయలేదని చెప్పారు. తహసీల్దార్ సుజాత, ఆమె కుమారుడు భరత్ను ఓదారుస్తున్న బంధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరైన సుజాత.. సుందరయ్య విజ్ఞానకేంద్రం: భర్త అజయ్కుమార్ ఆత్మహత్య నేపథ్యంలో చర్లపల్లి జైలు నుంచి కండీషనల్ బెయిల్పై తహశీల్దార్ సుజాత విడుదలయ్యారు. సాయంత్రం చిక్కడపల్లిలోని తన ఆడపడుచు ఇంటికి చేరుకొని ఒక్కగానొక్క కొడుకు భరత్ను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఇటు ఏసీబీ అధికారుల వేధింపుల వల్లే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నట్లు అజయ్ అక్కలు ఆరోపించారు. సుజాత అరెస్టైనప్పటి నుంచి అజయ్ డిప్రెషన్లోకి వెళ్లారని, చేయని తప్పుకు తన భార్య అరెస్టు కావడాన్ని జీర్ణించుకోలేకపోయాడన్నారు. ఏసీబీ అధికారి వేధింపులు తట్టుకోలేక తాను చనిపోతున్నట్లుగా తన తమ్ముడు ఆ అధికారికి మెసేజ్ కూడా పెట్టాడని అక్క మంగళ తెలిపారు. సుజాత కుటుంబానికి అండగా ఉంటాం.. ఈ నేపథ్యంలోనే సుజాతను పలువురు రెవెన్యూ అధికారులు పరామర్శించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్కుమార్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, డిప్యూటీ కలెక్టర్లు సంగీత, అశోక్కుమార్, రాధిక రమణి, తహశీల్దార్ లలిత సుజాతను ఓదార్చారు. ‘తహశీల్దార్ సుజాత కుటుంబానికి అండగా ఉంటాం. షేక్పేట్ ఆర్ఐ నాగార్జునరెడ్డి డబ్బులు తీసుకున్న కేసుకు సుజాతకు ఎలాంటి సంబంధం లేదు. సుజాతకు రెవెన్యూశాఖలో ఎలాంటి చెడ్డపేరు లేదు. మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఒకవేళ సుజాత నేరస్తురాలైతే కోర్టులో తేలుతుంది. సుజాత విషయంలో ఏసీబీ అధికారులు ఆమె భర్తకు ఫోన్ చేసి వేధించడం సరైంది కాదు..’అని గౌతమ్కుమార్ అన్నారు. అజయ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. అఫ్జల్గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో ప్రొఫెసర్ అజయ్ మృతదేహానికి ఫొరెన్సిక్ నిపుణులు డాక్టర్ ఝాన్సీ నేతృత్వంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం పూర్తి చేసింది. కాగా మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులెవరూ రాకపోవడంతో మార్చురీలో భద్రపరిచారు. గురువారం అజయ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. -
షేక్పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ భూ వివాదం కేసులో ఇటీవలే ఏసీబీకి పట్టుబడ్డ షేక్పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం గాంధీనగర్లోని తన సోదరి నివాసానికి వచ్చారు. అనంతరం అయిదంతస్తుల భవనం పైనుంచి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు, మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ కేసులో అజయ్ను కూడా గతంలో ఏసీబీ విచారణ చేసింది. భార్య ఏసీబీకి పట్టుబడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. (చదవండి : ఫిర్యాదుతోనే అసలు కథ మొదలైంది) రెవెన్యూ శాఖలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో షేక్పేట తహసీల్దార్ సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సుజాతను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. సుదీర్ఘంగా విచారించి భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆమె నివాసంలో పట్టుబడ్డ రూ.30 లక్షల డబ్బు సహా పలు అంశాలపై ఆరా తీశారు. ఇదే కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్పేట ఆర్ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సెక్టార్ ఎస్ఐ రవీంద్ర నాయక్ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో సుజాత విచారణ ఎదుర్కోంటుంన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం
సాక్షి, హైదరాబాద్ : బైక్ అదుపుతప్పి గుంతలో పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న విదేశీయుడికి తీవ్ర గాయాలైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ సైనిక్పురి నిర్మల్ నగర్కు చెందిన చిలుక అరవింద్(24) పంజగుట్టలోని స్విఫ్ట్ సొల్యూషన్స్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తూనే ఖాళీ సమయాల్లో ఉబర్ బైక్ డ్రైవర్గా పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నాడు. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో ఉండేనైజీరియా దేశస్తుడైన అబ్దుల్లాహి అనే యువకుడు ఉబర్ మోటో బైక్ను బుక్ చేసుకున్నాడు. పంజగుట్ట నుంచి బైక్(టీఎస్ 08 ఈఎన్ 6329)పై అరవింద్ ఆ విదేశీయుడిని కూర్చోబెట్టుకొని బంజారాహిల్స్రోడ్ నం. 12 లోటస్పాండ్ మీదుగా పారామౌంట్ కాలనీకి వెళ్తుండగా ఫొటోగ్రాఫర్స్ కాలనీ వద్ద బైక్ అదుపు తప్పి గుంతలో పడింది. దీంతో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్నఅబ్దుల్లాహికి తీవ్ర గాయాలుకాగా సమీపంలోని సిటీ న్యూరో సెంటర్కు తరలించారు. ఎస్ఐ వాసవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ షాక్తో తొమ్మిదేళ్ల బాలుడు మృతి
-
ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని.. ఆత్మహత్యాయత్నం
బంజారాహిల్స్: ప్రేమించిన యువకుడు పెళ్లికి అంగీకరించకపోవడంతో ఓ యువతి పోలీసుల ఎదుటే గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన వీరబాబు(20) జూబ్లీహిల్స్లోని పెద్దమ్మగుడి సమీపంలో అద్దెకుంటూ డ్రైవర్గా పని చేస్తున్నాడు. బీహెచ్ఈఎల్ లింగంపల్లిలో బ్యూటీషియన్గా పనిచేస్తున్న స్వప్న(20)తో 5 నెలల క్రితం టిక్టాక్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వీరబాబు తరచూ స్వప్నను తన గదికి పిలిపించుకునేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని నిలదీసింది. అందుకు వీరబాబు నిరాకరించాడు. దీంతో స్వప్న జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో అతనిపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించినా వీరబాబు మొండికేశాడు. ఈ క్రమంలో స్వప్న శనివారం తన తల్లితో కలిసి జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చి వీరబాబుపై చర్యలు తీసుకోవాలని కోరగా పోలీసులు అతడిని పిలిపించారు. అతని వైఖరిలో మార్పులేకపోడంతో ఆగ్రహించిన బాధితురాలు తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్తో గొంతు కోసుకుంది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. కాగా, ఆమె తన ప్రియుడి తీరుపై ఓ సెల్ఫీ వీడియోను కూడా తీసి తనను అర్థంచేసుకోవాలని కోరింది. పోలీసులు వీరబాబును అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కత్తులతో ఇద్దరు వ్యక్తుల పరస్పరం దాడి
సాక్షి, బంజారాహిల్స్ : బంజారాహిల్స్లో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. కాగా రవీందర్(22), నవాజ్(20) కత్తులతో పరస్పరం దాడి చేసుక్నునట్లు తెలిసింది. అయితే ఎందుకు కత్తులతో దాడి చేసుకున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలోనే వీరిద్దరిపై కేసులు ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రవీందర్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు నవాజ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
‘నిర్లక్ష్యం తగదు’
బంజారాహిల్స్: చారిత్రక ప్రదేశాలపై నిర్లక్ష్యం తగదని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. బంజారాహిల్స్లోని షేక్పేట మండల కార్యాలయం వెనకాల ఉన్న ఓ పురాతన భవనం ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. 1922లో నిర్మించిన ఈ భవనం గత 40 ఏళ్లుగా ఎవరూ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. సంబంధిత అధికారులు ఈ భవనాన్ని గుర్తించి దీన్ని లైమ్లైట్లోకి తీసుకురావాలని వీటి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. -
ప్రవిజ.. ఇక్కడే సూసైడ్ చేసుకుందాం: సురేష్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేసిన అట్లూరి సురేష్, ప్రవిజ దంపతులకు సంబంధించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. తన భార్య ప్రవిజను పోలీసులు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపిస్తూ.. సురేష్.. ఎస్హెచ్వోతో వాదనకు దిగాడు. ఒకవేళ పోలీసులు అలాంటి మాటలు అన్నది నిజమే అయితే.. లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలని.. తాము వెంటనే చర్యలు తీసుకుంటామని ఎస్హెచ్వో తెలిపారు. అయితే సురేష్ మాత్రం పదే పదే తన భార్య పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేయడానికి వస్తే గెంటేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సీపీకి ఫోన్ చేసి అందరి పైనా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. అలాగే చేయమని ఎస్హెచ్వో సూచించడంతో... ప్రవిజ, తాను స్టేషనులో ఆత్మహత్యకు పాల్పడతామని బెదిరింపులకు దిగాడు. కాగా పోలీసులు, తన భర్తకు జరుగుతున్న వాగ్వాదంతో వేదనకు గురైన ప్రవిజ.. పోలీసులు నిజంగా ఏ తప్పూ చేయకుంటే తనకు గతంలో ఎందుకు క్షమాపణ చెప్పారని ప్రశ్నించారు. ఇందుకు బదులిచ్చిన ఎస్హెచ్వో.. ‘మీరు బాధపడి ఉంటే క్షమించమని అడగడం తప్పా మేడం’ అని అడిగారు. ఈ క్రమంలో రిసెప్షన్లోకి వెళ్లి ఫిర్యాదు రాసివ్వాలని సూచించగా.. మేం ఇక్కడే కూర్చుంటామంటూ సురేష్ తన భార్యతో సహా ఎస్హెచ్వో రూంలోనే కూర్చున్నారు. దీంతో పోలీసు స్టేషనులో ఉద్రిక్తత నెలకొంది. కాగా బంజాహిల్స్ ఇన్స్స్పెక్టర్ కలింగరావుతో పాటు ఇద్దరు ఎస్ఐలపై ప్రవిజ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సోమవారం వైరల్ అయిన విషయం తెలిసిందే. పోలీసులు తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో డీసీపీ విలేకరులతో మాట్లాడారు. అట్లూరి సురేష్, వాసుదేవశర్మ అనే వ్యక్తి మధ్య సివిల్ తగాదాలు ఉన్నాయన్నారు. శర్మవద్ద రూ.4.70లక్షలు తీసుకున్న సురేష్ వాటిని తిరిగి ఇవ్వాలని కోరితే బెదిరింపులకు పాల్పడ్డాడన్నారు. దీనిపై శర్మ ఫిర్యాదు చేసేందుకు రాగా అది సివిల్ వివాదమైనందున ఫిర్యాదు తీసుకోలేదని తెలిపారు. దీంతో వాసుదేవశర్మ కోర్టుకు వెళ్లి నోటీసు తీసుకురావడంతో కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు సురేష్ను పిలిపించి మాట్లాడరన్నారు. ఆ సమయంలో సురేష్ పోలీసులను దూషించడమేగాక ఓ ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించాడని, దీంతో 8న సురేష్, ప్రవిజలపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించామన్నారు. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లోనూ వారు అదే తరహాలో ప్రవర్తించడంతో కేసు నమోదైందన్నారు. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ఆయా పోలీస్ స్టేషన్లలో పోలీసులను బ్లాక్మేయిల్ చేస్తుంటారని తెలిపారు. -
కక్షతోనే సురేష్, ప్రవిజ దంపతుల ఆరోపణలు..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ పోలీసులపై సోషల్ మీడియాలో అర్థరహిత ఆరోపణలు చేసిన అట్లూరి సురేష్, ప్రవిజ దంపతులు అందుకు సంబంధించిన వాస్తవాలు వెల్లడించాలని లేనిపక్షంలో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ ఎఆర్.శ్రీనివాస్ తెలిపారు. బంజాహిల్స్ ఇన్స్స్పెక్టర్ కలింగరావుతో పాటు ఇద్దరు ఎస్ఐలపై ప్రవిజ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో సోమవారం వైరల్ అయింది. పోలీసులు తనపట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోమవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో డీసీపీ విలేకరులతో మాట్లాడారు. అట్లూరి సురేష్, వాసుదేవశర్మ అనే వ్యక్తి మధ్య సివిల్ తగాదాలు ఉన్నాయన్నారు. శర్మవద్ద రూ.4.70లక్షలు తీసుకున్న సురేష్ వాటిని తిరిగి ఇవ్వాలని కోరితే బెదిరింపులకు పాల్పడ్డాడన్నారు. దీనిపై శర్మ ఫిర్యాదు చేసేందుకు రాగా అది సివిల్ వివాదమైనందున ఫిర్యాదు తీసుకోలేదని తెలిపారు. దీంతో వాసుదేవశర్మ కోర్టుకు వెళ్లి నోటీసు తీసుకురావడంతో కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు సురేష్ను పిలిపించి మాట్లాడరన్నారు. ఆ సమయంలో సురేష్ పోలీసులను దూషించడమేగాక ఓ ఎస్ఐ పట్ల దురుసుగా ప్రవర్తించాడని, దీంతో 8న సురేష్, ప్రవిజలపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించామన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారనే కక్షతో నిందితులు వారిపై ఆరోపణలు చేశారని దీనిపై తాను విచారణ చేపట్టగా అవన్నీ అవాస్తవాలుగా తేలిందన్నారు. గతంలో జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లోనూ వారు అదే తరహాలో ప్రవర్తించడంతో కేసు నమోదైందన్నారు. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ఆయా పోలీస్ స్టేషన్లలో పోలీసులను బ్లాక్మేయిల్ చేస్తుంటారని తెలిపారు. న్యాయ సలహా తీసుకొని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 8న పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వీడియోలు తమవద్ద ఉన్నాయన్నారు. -
యువతి దుస్తులు చింపి..
సాక్షి, బంజారాహిల్స్ : ‘దిశ’ ఘటనను మరిచిపోకముందే ముగ్గురు మైనర్లు ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బంజారాహిల్స్లో చోటుచేసుకుంది. రోడ్ నంబర్ 10లోని గఫార్ఖాన్ కాలనీలో నివసిస్తున్న ఓ యువతి సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తోంది. సోమవారం రాత్రి ఫిలింనగర్లో దర్శక, నిర్మాతలతో మాట్లాడి స్నేహితుడితో కలసి కారులో బసవతారక కేన్సర్ ఆసుపత్రి నుంచి జహీరానగర్ వైపు వస్తుండగా వెనుకాల నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఆ కారు డ్రైవర్ అజీజ్కు, వీరికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అజీజ్కు చెందిన ముగ్గురు మైనర్లు అక్కడకు చేరుకుని యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమె దుస్తులు చించేశారు. కారులో కూర్చున్నాక చేతులు లోపలికి పెట్టి ఆమె ను తాకుతూ హింసించారు. ఈ ఘటన జరుగుతుండగా ఆమె 100కు డయల్ చేసింది. అనంతరం స్థానిక ఎస్ఐకి సమాచారం ఇచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి కోసం గాలిస్తున్నారు. -
గ్రీన్ చాలెంజ్: మొక్కలు నాటిన రాహుల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ చేపట్టిన ‘గ్రీన్ చాలెంజ్’కు బిగ్బాస్–3 విజేత రాహుల్ సిప్లిగంజ్ స్పందించారు. ‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా వంతు బాధ్యతగా మొక్కలు నాటాను. మీరూ కూడా నాటండి’ అంటూ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. గ్రీన్ చాలెంజ్లో భాగంగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల ఇటీవల మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో రాహుల్ కూడా ఉన్నారు. సుమ కనకాల చాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటినట్లుగా రాహుల్ పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: రాహుల్కు సుమ గ్రీన్ చాలెంజ్) -
మొక్క నాటిన సింధు
రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్చాలెంజ్కు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్పందించారు. దీనిలో భాగంగా శనివారం ఆమె మూడు మొక్కలు నాటి హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా కృషి చేయాలని కోరారు. అలాగే విరాట్ కోహ్లి, అక్షయ్ కుమార్, సానియా మీర్జాలకు గ్రీన్ చాలెంజ్ చేసి మొక్కలు నాటాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. – బంజారాహిల్స్ -
ఆపద్బాంధవుడు హనీఫ్..
తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సమాజ సేవకు వినియోగించాలని తలపెట్టారాయన. పేదల సేవలో నేను సైతం అంటూ ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నారాయన. వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా తన జీవితాన్నే సేవా తత్పరతకు అంకితం చేశారు. మానవత్వానికి చిరునామాగా నిలుస్తున్నారు 84 ఏళ్ల మహ్మద్ హనీఫ్ సాహెబ్. మానవతకు మారుపేరుగా. మంచితనానికి మరోరూపుగా.. కష్టకాలంలో ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న హనీఫ్సేవాగుణంపై కథనం ఇదీ.. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని జహీరానగర్లో నివసించే హనీఫ్కు ఆరుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. 50 ఏళ్లుగా ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తాను సంపాదించినదానికి కొంత సార్థకత చేకూరాలనే ఉద్దేశంతో తలంచారు. కష్టాల్లో ఉన్నవారికి 20 ఏళ్లుగా తన ఆటో ద్వారా ఉచితంగా ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని బాలింతలు, గర్భిణులు, ఆస్పత్రులకు వెళ్లే వృద్ధులు ఫోన్ చేస్తే చాలు.. తాను కళ్లారా చూస్తే చాలు వారిని తన ఆటోలో ఎక్కించుకొని ఆస్పత్రులకు కిరాయి డబ్బులు తీసుకోకుండానే ఉచితంగా చేరువేస్తున్నారు. ప్రతినిత్యం కనీసం 10 మందినైనా ఆస్పత్రులకు చేరుస్తుంటానని హనీఫ్ తెలిపారు. ఇలా చేయడంలో తనకెంతో ఆనందం ఉందని, తన కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహిస్తారు తప్పితే ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన సబ్కా సాథ్.. సబ్కా వికాస్ నినాదానికి ప్రభావితమయ్యాయనన్నారు. తన ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఆటోపై రాసి ఓ బోర్డు ఏర్పాటు చేసుకొని ఉచిత సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పట్టపగలు.. అర్ధరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా వెంటనే అక్కడ వాలిపోతుంటారు ఆయన. ప్రమాదం జరిగినప్పుడు పలువురు తనకు ఫోన్ చేసి పిలుస్తాంటారని వెల్లడించారు. సైకిల్పై హజ్ యాత్ర.. 2006లో హనీఫ్ సైకిల్పై మక్కా యాత్ర చేపట్టారు. 2006 ఆగస్ట్ 7న నాంపల్లి హజ్భవన్ నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర తొమ్మిది నెలల తర్వాత 2007లో మక్కాకు చేరుకుంది. ఏడు రాష్ట్రాలు, ఏడు దేశాలు దాటుకొని ఆయన మక్కా చేరుకున్నారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం వద్దకు వెళ్లి తను మక్కా వెళ్లేందుకు సైకిల్ యాత్ర కోసం అనుమతిప్పించాల్సిందిగా కోరారు. ఇందుకోసం ప్రస్తుత సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి అప్పట్లోనే తనకు అనుమతులు ఇప్పించారని గుర్తు చేసుకున్నారు హనీఫ్. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సైకిల్ యాత్రకు అనుమతివ్వడానికి సతాయించగా బీజేపీ నేతలు మాత్రం దగ్గరుండి తనకు అనుమతులు ఇప్పించారని వారి మేలు మర్చిపోలేనిదన్నారు. నెలకు రూ.30 వేల ఆర్జన.. తాను స్కూల్ పిల్లలను ప్రతిరోజూగచ్చిబౌలి నాసర్ స్కూల్కు తీసుకెళ్లి మళ్లీ గమ్య స్థానాలకు చేర్చేందుకు నెలకు రూ.21 వేలు సంపాదిస్తానన్నారు. మిగతా సమయంలో మరో రూ.9 వేల దాకా వస్తుందన్నారు. రూ.30 వేలు జీవనోపాధికి సరిపోతాయని ఉచితంగా సేవలు అందించేందుకు మహా అంటే నెలకు రూ.5 వేలు ఖర్చవుతుందని, ఈ రూ.30 వేల నుంచే ఆ ఖర్చులు తీసేసుకుంటానని వెల్లడించారు. ఎవరు, ఎప్పుడు ఫోన్ చేసినా తనకు శక్తి ఉన్నంత వరకుఈ సేవలు కొనసాగుతాయనిస్పష్టంచేశారు. ఆపదలో ఉంటే ఫోన్ చేయొచ్చు.. ఎవరైనా ఆపదలో ఉంటే, ప్రమాదంలో గాయపడి ఆటో దొరక్క ఇబ్బంది పడితే 76808 58966 నంబర్లో సంప్రదించవచ్చని హనీఫ్ తెలిపారు. -
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్: కోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: టీవీ9 నిధుల కుంభకోణంలో అరైస్టయిన రవిప్రకాష్ను తమ కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. టీవీ9 యాజమాన్యమైన అలందా మీడియా హౌజ్కు చెందిన రూ. 18 కోట్ల మొత్తాన్ని బోనస్ పేరుతో పక్కదారి పట్టించారన్న రవిప్రకాష్పై అభియోగాలు నమోదయ్యాయి. రవిప్రకాష్ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నాడు. -
రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్: కోర్టు విచారణ
-
వీధి కుక్క చావుకు కారకుడైన డ్రైవర్ అరెస్టు
బంజారాహిల్స్: నిర్లక్ష్యంగా కారు నడిపి కుక్క చావుకు కారకుడైన క్యాబ్ డ్రైవర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం ఎండీ అబ్దుల్ నయీం (24) బంజారాహిల్స్ రోడ్ నంబర్–2లోని కేబీఆర్ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపునకు క్యాబ్ డ్రైవింగ్ చేసుకుంటూ వేగంగా దూసుకెళ్తున్నాడు. అదే సమయం లో కేబీఆర్ పార్కు ఫుట్పాత్వైపు నుంచి ఓ వీధికుక్క రోడ్డు దాటుతుండగా నయీం చూసుకోకుండా ఢీకొట్టాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది. కంపాసియోనేట్ సొసైటీ ఫర్ యానిమల్స్ స్వచ్ఛంద సంస్థకు చెందిన వలంటీర్ అజయ్ ఈ దృశ్యాన్ని చూశాడు. నయీం కారును అనుసరించి అతన్ని పట్టుకొని జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్కు తీసుకొచ్చి ఫిర్యాదు చేశాడు. కుక్క మరణానికి కారకుడైన డ్రైవర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆ సంస్థ చైర్మన్ ప్రవల్లిక ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నయీంపై ఐపీసీ సెక్షన్ 429, సెక్షన్ 11(1)(ఏ)(ఎల్), ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ యానిమల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. -
భారీ వర్షం.. ట్రాఫిక్లో ఇరుక్కున్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మంత్రి కేటీఆర్ సైతం ట్రాఫిక్లో ఇరుకున్నారు. భారీ వర్షంతో బంజారాహిల్స్ కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అటుగా వెళ్తున్న మంత్రి కేటీఆర్ వాహనం సైతం ట్రాఫిక్లో నిలిచిపోయింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరం తడిసిముద్దయిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం కాస్తా తెరపి ఇచ్చినా.. సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం మొదలైంది. ముషిరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, హిమాయత్నగర్, అబిడ్స్, కోఠీ, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్నగర్, మీర్పేట్, వనస్థలిపురం, ఎల్బీనగరలో భారీ వర్షం కురుస్తోంది. కాగా వర్షాలపై జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. భారీ వర్షాలతో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 13 డిజాస్టర్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలో మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారుల తెలిపారు.రానున్న రెండు గంటల పాటు ఉద్యోగులు కార్యాలయాల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మెట్రో సర్వీసులకు అంతరాయం భారీ వర్షం కారణంగా ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్, మియాపూర్ రూట్లో మెట్రో సర్వీసులకి అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటకు పైగా రైళ్లు నిలిచిపోయాయి. ట్రాక్పైకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో
సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సినీ హీరో సాయి దరమ్ తేజ్ తన చేతుల మీదుగా తీసుకొని వెళ్లి ఆసుపత్రిలో అడ్మిట్ చేసి మానవత్వం చాటుకున్నారు. అయితే ప్రమాదానికి గురైన వ్యక్తి అతని స్నేహితుడే కావడం గమనార్హం. వివరాలు.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 52లో ఓ వ్యక్తి బైక్పై వెళ్తూ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి టైర్ స్కిడ్ అయి కింద పడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్లున్న సాయి ధరమ్ తేజ్ ప్రమాదాన్ని చూసి కిందకు దిగి ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తి తన స్నేహితుడు, మ్యూజిక్ డైరక్టర్ అచ్చు అని తెలుసుకొని స్వయంగా వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాగా, మానవత్వంతో స్పందించిన హీరో వ్యక్తిత్వాన్ని మిగతా వాహనదారులు, ప్రయాణీకులు ప్రశంసించారు. -
హైదరాబాద్ నగరంలో ఖరీదైన ప్రాంతం ఇదే..!
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె ఎంత ఉంటుంది..? ఏ పది వేలో.. లేక పదిహేను వేల రూపాయలో అనుకుంటాం. కానీ నగరంలోని ఓ ప్రాంతంలో మాత్రం కనీసం రూ.25 వేలకు పైనే పెట్టనిదే అద్దె ఇల్లు దొరకదు. ఎందుకంటే ప్రముఖులు, వీవీఐపీలు ఉండే ప్రాంతమది. సకల హంగుల చోటది. అదే బంజారాహిల్స్. ‘హిల్స్’ అన్నందుకు కొండలంత ఉన్నతంగా ఖర్చు కూడా ఉంటుంది ఇక్కడ. జూబ్లీహిల్స్ కూడా కాస్త అటుఇటుగా ఇంతే ఖరీదైన ప్రాంతం. ‘అనరాక్ ప్రాపర్టీస్’ సంస్థ చేపట్టిన ఖరీదైన ప్రాంతాల అధ్యయనంలో బంజారాహిల్స్ టాప్లో నిలవగా జూబ్లీహిల్స్ రెండో స్థానంలో నిలిచింది. గ్రేటర్లో సంపన్నుల నివాసం ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలు నాడూ.. నేడూ ఖరీదైన నివాస ప్రాంతాలుగా గుర్తింపును నిలుపుకొన్నాయి. ప్రధానంగా ఇంటి అద్దె విషయంలో గత రికార్డులను సుస్థిరం చేసుకొని ఎవర్ గ్రేట్గా వెలుగొందుతున్నాయి. నివాస వ్యయం పరంగా చూస్తే కొన్ని దశాబ్దాలుగా అద్దెల విషయంలోనూ ఈ ప్రాంతాలు ఆల్టైమ్ రికార్డును నిలబెట్టుకున్నాయి. తాజాగా ఈ ఏడాది సైతం ఇదే ట్రెండ్ కొనసాగించడం గమనార్హం. కాస్మొపాలిటన్ కల్చర్కు కేరాఫ్ అడ్రస్గా మారిన ఈ ప్రాంతాల్లో సినీ, రాజకీయ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార రంగ ప్రముఖులతో పాటు దేశ, విదేశాలకు చెందిన ముఖ్యులు, ఎన్ఆర్ఐలు స్థిర, తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ ప్రాంతాల్లో సువిశాల ప్రాంగణాల్లో అత్యాధునిక వసతులున్న భవంతులు అందుబాటులో ఉండటం, ఆయా నివాస సముదాయాల ప్రాంగణాల్లోనే ఐటీ, బీపీఓ, కేపీఓ, బీమా, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, ఫార్మా ఇతర వాణిజ్య, వ్యాపార సముదాయాలకు సంబంధించిన కార్పొరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేయడంతో ఆ సంస్థల్లో పనిచేస్తున్న వృత్తి నిపుణులు, ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నివాస సముదాయాలకు గిరాకీ అమాంతం పెరగుతోంది. గ్రేటర్ పరిధిలో అత్యధిక ఇంటి అద్దెలున్న ప్రాంతాలపై ఇటీవల అనరాక్ ప్రాపర్టీస్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. మహానగరంలో ఈ రెండు ప్రాంతాలతో పాటు హైటెక్సిటీ, గచ్చిబౌలి, బేగంపేట్, కొండాపూర్, నల్లగండ్ల, నార్సింగి, మియాపూర్, ఎల్బీనగర్ ప్రాంతాలు టాప్ టెన్ స్థానాల్లో నిలవడం గమనార్హం. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో సరాసరిన వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అద్దెలను ప్రామాణికంగా తీసుకొని తాజా అంచనాలు రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో గతేడాదితో పోలిస్తే ఇంటి అద్దెలు సరాసరి తొమ్మిది శాతానికి పైగానే పెరిగినట్లు ఈ తాజా నివేదిక వెల్లడించింది. అద్దె పెరుగుదలకు కారణాలివీ.. ♦ ఐటీ, బీపీఓ, కేపీఓ, వాణిజ్య, బీమా, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ తదితర సేవారంగాలతో పాటు ఫార్మా తదితర రంగాల కార్పొరేట్ కార్యాలయాలకు కేంద్రాలుగా ఉండడం. ♦ ఆయా సంస్థల్లో పనిచేస్తున్న సీఈఓలు, ఇతర ఎగ్జిక్యూటివ్లు, ఉద్యోగులు ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపడం. ♦ కార్పొరేట్ పాఠశాలలు, ఆస్పత్రులకు ఈ ప్రాంతాలు నిలయంగా మారడం. అత్యాధునిక వైద్య, విద్య సదుపాయాలు వీటి సొంతం కావడం. ♦ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లు, పబ్లు, బార్లు, లిక్కర్ మాల్స్, గేమింగ్ జోన్స్, దేశ విదేశీ వస్త్ర బ్రాండ్లు, బంగారు వజ్రాభరణాలు, లెదర్, అత్యాధునిక ఇంపోర్టెడ్ ఫర్ణిచర్ షోరూమ్లు ఇతర షాపింగ్ అవసరాలతో పాటు ఆకాశమే హద్దుగా వినోదాన్ని పంచే రిక్రియేషన్ జోన్లు అత్యధికంగా కొలువుదీరడం. ♦ ఇళ్లలో అత్యాధునిక ఇంటిరీయర్, వెల్ ఫర్నిష్డ్ ఫ్లాట్స్, ఇతర వసతులు ఉద్యోగులను విశేషంగా ఆకర్షిస్తుండటం. ♦ ఈ ప్రాంతాల్లో నివాసం ఉండటంతో తమ సోషల్ స్టేటస్ పెరుగుతుందని కొందరు భావించడం. -
సీఎం సారూ.. కనికరించండి
సాక్షి, బంజారాహిల్స్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను.. ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోయింది.. అనేక ఏళ్లుగా ఎలాగోలా బతుకు బండి లాగాను..ఇప్పుడు వృద్ధుడినై పోయా..ఏదో ఒక ఉపాధి చూపండి అని ఓ కుటుంబం సీఎం కోసం తెలంగాణ భవన్ వద్ద కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తోంది. రెండు రోజుల క్రితం బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ వద్ద సీఎం కేసీఆర్ను కలవాలని వచ్చారు. రోడ్లపైనే పడుకుంటున్నారు. తెలంగాణ భవన్లో ఎవరినీ కలవడానికి అక్కడి సిబ్బంది కనికరించలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన షేక్ ఖాసిం దీనావస్థ ఇది.. ఆ వివరాలు ఖాసీం మాటల్లోనే..1980 నుంచి 1999 వరకు హోంగార్డుగా విధులు నిర్వహించా. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో మెదడు దెబ్బతిని పక్షవాతం వచ్చింది. దీనికి తోడు మూర్ఛవ్యాధి వేధిస్తోంది. అప్పటికి పిల్లలు చిన్నవారు కావడంతో కుటుంబ పోషణ భారమైంది. ఉన్న ఒక్క కుమారుడు యాకుబ్పాషా సరిగ్గా మేజర్ అయ్యే సమయానికి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ ప్రమాదంలోనే తల్లి షేక్ మొగలబికి నడుం విరిగింది. ఉన్న ఒక్క కూతురు షేక్ మీరాబి ఆలనా పాలన చూసుకుంటున్నది. మా కుటుంబం పరిస్థితి ప్రస్తుతం వర్ణనాతీతంగా ఉంది. ఎలాంటి ఆదాయ వనరులు లేకపోవడంతో కూతురు మీరాబి తల్లిదండ్రుల పోషణ భారంతో ఒత్తిడికి గురవుతోంది. నా హోంగార్డు ఉద్యోగాన్ని గానీ, పోలీసు శాఖలో లేదా ఏ ఇతర శాఖలోనైనా మరో జాబ్ గానీ కూతురు మీరాబికి ఇవ్వాలని కోరుకుతున్నా. ఈ నెల 8న హోంమంత్రిని కలవడానికి సచివాలయానికి వెళ్లగా కుదరలేదు. అక్కడి సిబ్బంది బయటికి పంపించారు. తెలంగాణ భవన్లో సీఎంను కలిసేందుకు వచ్చినా ప్రయోజనం లేకపోయింది. మాతో పాటు కూతురు మీరాబి తన చిన్నారితో చెట్ల కింద నిద్రించాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా స్పందించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు. -
దొంగతనానికి వచ్చాడు.. మరణించాడు
సాక్షి, బంజారాహిల్స్ : ఫిలింనగర్లో సోమవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందిన వేముల ప్రేమ్సాగర్(20) మిస్టరీ వీడింది. తన స్నేహితుడు సత్యానంద్తో కలిసి ఓ అపార్ట్మెంట్లోకి దొంగతనానికి వెళుతూ ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్రంగా గాయాలై మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్లోని దుర్గాభవానీనగర్కు చెందిన ప్రేమ్సాగర్ గత ఏడాది జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో సెల్ఫోన్ చోరీ కేసులో అరెస్టై రిమాండ్కు వెళ్లాడు. అంతకుముందే అతడిపై మాదాపూర్ పీఎస్లోలోనూ సెల్ఫోన్ చోరీ కేసులు ఉన్నాయి. దీన్దయాల్నగర్ బస్తీకి చెందిన సత్యానంద్ బైక్ చోరీ కేసులో అరెస్టై జువైనల్ హోమ్కు వెళ్లి వచ్చాడు. వీరిద్దరికీ ఓ దొంగతనం కేసులోనే పరిచయం ఏర్పడి స్నేహితులయ్యారు. ఆదివారం రాత్రి ప్రేమ్సాగర్ తన స్నేహితుడు సత్తిని సికింద్రాబాద్లో రైలెక్కించి వస్తానని తల్లికి చెప్పి స్కూటీ తీసుకొని బయటికి వచ్చాడు. అపోలో చౌరస్తాలో మరో ఇద్దరు స్నేహితులు గణేష్, నాగరాజులతో కలిసి మద్యం తాగారు. అనంతరం హైటెక్ సిటీ వైపు వెళ్లారు. అక్కడ ప్రేమ్సాగర్, సత్యానంద్ నిద్రమాత్రలు వేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ నలుగురు కలిసి మద్యం తాగడమేగాక గంజాయి తీసుకున్నారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అంతా కలిసి ఫిలింనగర్కు రాగా గణేష్, నాగరాజు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రేమ్సాగర్, సత్యానంద్ స్కూటీని అపోలో ముందు పార్క్ చేసి నడుచుకుంటూ అపోలో ఆస్పత్రి మెడికల్ కాలేజీ వెనుక గేటు నుంచి ఓ అపార్ట్మెంట్ వైపు వెళ్లారు. అపార్ట్మెంట్ ప్రహరీ ఎక్కిన వీరు మద్యం మత్తులో చూసుకోకుండా కిందకు దూకడంతో సెల్లార్లో పడ్డారు. ముందు ప్రేమ్సాగర్ పడగా అతడి ముక్కు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. సత్యానంద్ నేరుగా అతడిపై పడటంతో గాయాలు కాలేదు. తెల్లవారుజామున వారిని గుర్తించిన అపార్ట్మెంట్ వాచ్మెన్ ఓ ప్లాటు యజమానితో కలిసి వారిద్దరినీ రోడ్డుపైకి తీసుకొచ్చారు. వారి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అప్పటికే ప్రేమ్సాగర్ మృతి చెందినట్లు నిర్దారించారు. అపార్ట్మెంట్లో చోరీ యత్నం జరిగినట్లు తెలిస్తే తన ఉద్యోగం పోతుందన్న భయంతోనే వారిని రోడ్డుపైకి తీసుకొచ్చినట్లు వాచ్మెన్ మధు తెలిపాడు. మూడు రోజుల క్రితం అదే అపార్ట్మెంట్లో చోరీకి యత్నించిన వీరు ఓ ప్లాటు ముందు ఉన్న ఖరీదైన షూస్ ఎత్తుకెళ్లినట్లు సత్యానంద్ అంగీకరించాడు. ఇదిలా ఉండగా రెండు రోజులైనా సత్యానంద్ మద్యం మత్తు దిగకపోవడంతో కేసు విచారణలో జాప్యం జరుగుతోంది. సీసీ ఫుటేజీలే ఈ ఘటనను వెలుగులోకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసుల అదుపులో రేవతి
-
పోలీసుల అదుపులో మోజో టీవీ మాజీ సీఈఓ
సాక్షి, బంజారాహిల్స్ : మోజో టీవీ మాజీ సీఈఓ రేవతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. రేవతి నివాసం వద్ద నుంచి స్టేషనుకు తరలించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బంజారాహిల్స్లో రెచ్చిపోయిన ఆకతాయి
-
వ్యభిచారం... బోనస్గా డ్రగ్స్ దందా
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని కింది భాగంలో తాముంటూ, పైభాగంలో వ్యభిచార బాగోతం నడిపించారు ఆ దంపతులు. ఇది చాలదన్నట్టు కొందరు విటులు డ్రగ్స్ తీసుకుని రావడాన్ని గమనించి, తామే డ్రగ్స్ సరఫరా ఎందుకు చేయకూడదని ఆలోచించి నైజీరియన్లను ఆశ్రయించారు. వారి దగ్గరి నుంచి కొకైన్, ఓపీఎం, ఎండీఎంఏ లాంటి మత్తుపదార్థాలను కొనుగోలు చేసి అధిక ధరలకు తమ వద్దకు వచ్చే విటులకు విక్రయించారు. ఆ జంట గుట్టును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఇద్దరినీ అరెస్టు చేసి మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో ఈనెల 2వ తేదీన ఫిలింనగర్, రోడ్డునంబర్ 5లో ఉన్న ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ అధికారులు 7 గ్రాముల కొకైన్, 2 గ్రాముల ఓపీఎం, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.1.13 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు బి.సంతోష్, మహ్మద్ మసూద్లను అరెస్టు చేశారు. అయితే ఆ సమయంలో ఆ ఇంటిని వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్న నిర్వాహకుడు షేక్ ఫహద్ అలియాస్ మదన్ తన కారులో పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్.అంజిరెడ్డిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సి.వివేకానందరెడ్డి నియమించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు గాలింపును ముమ్మరం చేశాయి. అయితే, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12లోని సాయిబాబా ఆలయం వద్ద ఓ కారులో కొకైన్ అమ్మకానికి సిద్ధంగా ఉందని ఎక్సైజ్ అధికారులకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. అక్కడకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కారులో షేక్ ఫహద్ అలియాస్ మదన్ (37), ఆయన భార్య సలీమా రబ్బాయి షేక్ (27)లు కూడా తారసపడ్డారు. వెంటనే వీరిని అదుపులోనికి తీసుకుని 9 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. వీరి దగ్గరి నుంచి రూ.3 లక్షల నగదు, 4 మొబైల్ఫోన్లు, ఒక స్వైపింగ్ మెషీన్, స్విఫ్ట్ కారు, ఈనెల 2న పారిపోవడానికి ఉపయోగించిన ఐ10 కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం నుంచి.. విచారణలో తేలిన వివరాల ప్రకారం... ఫహద్ ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు నుంచి హైదరాబాద్కు వచ్చి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో వ్యభిచారం నిర్వహించేవాడు. 2018 జనవరిలో అరెస్టు చేసి కేసు కూడా నమోదు చేశారు. దీంతో ఫిలింనగర్ రోడ్డు నంబర్ 5కు మకాం మార్చిన ఫహద్ అక్కడ నెలకు రూ.75వేల కిరాయితో ఇల్లు తీసుకున్నాడు. కింద భాగంలో తానుంటూ పైభాగంలోని గదులలో వ్యభిచారం నిర్వహించేవాడు. అయితే, వ్యభిచారం కోసం వచ్చే కొందరు విటులు డ్రగ్స్ తీసుకుని రావడాన్ని ఫహద్ గమనించాడు. దీంతో ఆ డ్రగ్స్ను కూడా తానే సరఫరా చేయాలని నిర్ణయించుకుని సన్సిటీ ప్రాంతంలో ఒక నైజీరియన్ నుంచి రూ.6వేలకు గ్రాము చొప్పున కొకైన్ కొనుగోలు చేసి రూ.7,500కు అమ్మేవాడు. స్నేహితులు సంతోష్, సురేశ్, మహ్మద్ మసూద్లను ఉపయోగించుకోవడంతో పాటు తన భార్య సహకారంతో ఈ దందాలు నడిపేవాడు. కొకైన్తో పాటు ఓపీయం, ఎండీఎంఏలు కూడా విక్రయించేవాడు. వీరిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం సెక్షన్–27 ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ విదేశీ యువతి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని సాయి ఎన్క్లేవ్లో ఉన్న డౌన్టౌన్ హోటల్పై బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఓ విదేశీ యువతితో పాటు పంజాబ్కు చెందిన మరో యువతి ఇక్కడ వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరిని పోలీసులు శనివారం పునరావాస కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే... సైఫాబాద్ సచివాలయం ఎదురుగా ఉన్న అమృతాక్యాజిల్ హోటల్లో సాయి అలియాస్ శర్మ అనే వ్యక్తి రెండు గదులను అద్దెకు తీసుకొని విదేశాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. కొంత మంది విటులు ఈ హోటల్కు కాకుండా తాము కోరుకున్న హోటల్కు యువతులను పంపించాలని ఒప్పందం కుదర్చుకుంటే ఆ మేరకు ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపిస్తూ సహాయకుడిగా రాజేష్కుమార్ సాహును నియమించుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఓ విటుడు బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని ది డౌన్టౌన్ హోటల్లో గదిని బుక్ చేసుకొని అక్కడికి ఉజ్బకిస్తాన్ దేశానికి చెందిన ఓ యువతిని రప్పించుకున్నాడు. ఆమెతో పాటు పంజాబ్కు చెందిన మరో యువతిని కూడా ఒప్పందంలో భాగంగా పంపించాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హోటల్పై దాడి చేసి ఉజ్బకిస్తాన్కు చెందిన అజీజాతో పాటు ఖుషీపాటక్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన వ్యభిచార నిర్వాహకుడు సాయి పరారీలో ఉండగా ఆయన అనుచరుడు రాజేష్కుమార్ను అరెస్ట్ చేశారు. యువతులను సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. ది టౌన్టౌన్ హోటల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ ఎస్ఐ బచ్చు శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం
-
హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో వాతావరణం చల్లబడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురు గాలులతో పాటు చిరుజల్లులు పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం బాగానే కురిసింది. జూభ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, సికింద్రబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు వడగాల్పుల నుంచి ఉపశమనం పొందారు. తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం -
ఉనికి కోల్పోనున్న ఎంఎఫ్ హుస్సేన్ కళాసౌధం
ప్రస్తుతం కూల్చివేస్తున్న ‘సినిమా ఘర్’ ఎంఎఫ్ హుస్సేన్ కలల సౌధం. ఈ భవనంలోని పోర్టికోలో కూర్చుని తన విటేజ్ కారును చూస్తూ కాఫీ తాగడం ఆ ప్రసిద్ధ చిత్రకారుడికిఅలవాటు. తన మనసుకు కష్టం కలిగినా.. ఆనందం వచ్చినా ఇక్కడే గడిపేవారు. ఎన్నో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్రాలను ఆయన ఇక్కడే గీసారు. ఈ ప్రాంతంలో ఈ భవనం ఓ ల్యాండ్ మార్క్గా ఉండేది. ఇక్కడే ఓ బస్టాప్ సైతం చాన్నాళ్లు కొనసాగింది. సినిమా ఘర్కూల్చివేతతో ఇప్పుడు ఇవన్నీకనుమరుగు కానున్నాయి బంజారాహిల్స్: తన కుంచెతో అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్ది పేరు, ప్రతిష్టలతో పాటు వివాదాలను సైతం మూటగట్టుకున్న ‘ఇండియన్ పికాసో’గా సుప్రసిద్ధుడైన భారతీయ చిత్రకారుడు మగ్బూల్ ఫిదా హుస్సేన్(ఎంఎఫ్ హుస్సేన్) కళాసౌధం ‘సినిమా ఘర్’ కూలిపోతోంది. హుస్సేన్ 1999లో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ప్రధాన రహదారిలో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఆనాడు ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీదీక్షిత్ ఈ సినిమాఘర్ను ప్రారంభించారు. పర్షియన్ శిల్పకళా నైపుణ్యంతో ప్రత్యేకమైన గోడలు, అందంతో పాటు ఆకర్షణీయమైన మార్బుల్తో చూడగానే వినూత్నంగా కనిపించేలా ‘సినిమాఘర్’ను తీర్చిదిద్దారు. లోపల ఇంద్రధనస్సులోని అన్ని రంగులతో గోడలను మలిచారు. ఎన్నోసార్లు ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడ చిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సినిమాఘర్లో 50 సీటింగ్ కెపాసిటీతో ‘సౌందర్య టాకీస్’ పేరుతో మినీ థియేటర్ ఏర్పాటు చేశారు. అలాగే సినిమా, డ్యాన్స్, ఆర్ట్, మ్యూజిక్, కంప్యూటర్, సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన 2 వేల పుస్తకాలతో ‘ప్యారిస్ సూట్’ పేరుతో లైబ్రరీ కూడా ఏర్పాటైంది. ఇక సినిమా మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ. ఎంఎఫ్ హుస్సేన్ వేసిన పెయింటింగ్స్ను ప్రదర్శించేందుకు ఓ ఎగ్జిబిషన్ హాలు కూడా సుందరంగా నిర్మించారు. హైదరాబాద్ అంటే అమితంగా ఇష్టపడే ఎంఎఫ్ హుస్సేన్ దేÔశంలో ఎన్నోచోట్ల సినిమాఘర్ నిర్మాణానికి అవకాశాలు వచ్చినా ఇక్కడ మాత్రమే ఆ కోరిక తీర్చుకున్నారు. విదేశాల్లో ఉండే ఆయన స్వదేశానికి తిరిగివచ్చి సినిమాఘర్లోనే చివరి మజిలీని గడపాలనుకునేవారు. తనకు మనసు బాగాలేనప్పుడు సినిమాఘర్లో కాసేపు కూర్చోవడం ద్వారా మనసు తేలికపడుతుందని హుస్సేన్ బతికుండగా భావించేవారు. నెలలో వారం రోజులు ఇక్కడే ఒంటరిగా గడిపేవారాయన. ఎన్నో కళాత్మక పెయింటింగ్స్ను ఇక్కడ ఉండగానే గీశారు. 2002లో ఏడాది పాటు సినిమాఘర్ మూతపడ్డప్పుడు కళాభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 2004, జనవరి 26వ తేదీన దీన్ని తిరిగి తెరిచారు. ఆ సమయంలో ఎంఎఫ్ హుస్సేన్ చివరిసారిగా హైదరాబాద్కు వచ్చారు. చిత్రకారుడిగా ఘనకీర్తి పొందిన హుస్సేన్ కొన్ని వివాదాలతో ప్రాణభీతి కారణంగా 2007లో లండన్ వెళ్లిపోయి ఇక తిరిగి రాలేదు. ఎంఎఫ్ హుస్సేన్ నెలరోజుల సుదీర్ఘ అస్వస్థతతో 2011, జూన్ 9వ తేదీన లండన్లో తన 95 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. దాంతో తన చివరి మజిలీని నగరంలోని సినిమా ఘర్లో గడపాలని భావించినా ఆయన కోరిక మాత్రం తీరలేదు. సినిమాఘర్ స్థానంలోవాణిజ్య సముదాయం ఎంఎఫ్ హుస్సేన్ మరణానంతరం సినిమాఘర్ ఘనకీర్తి మెల్లమెల్లగా కనుమరుగవడం మొదలైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, నలుగురు కొడుకులు సంతానం. సినిమాఘర్ ప్రాపర్టీని ఇద్దరు కూతుళ్లు రైసా హుస్సేన్, అఖిలా హుస్సేన్తో పాటు చిన్నకొడుకు ఒవైసీ హుస్సేన్కు రాసిచ్చారు. వీరంతా ముంబై, దుబాయ్లో స్థిరపడ్డారు. తండ్రి మరణానంతరం ఇందులోని ఒక్కో కళాఖండాలను ఆయన సంతానం ముంబైకి తరలించారు. దీంతో ఇప్పుడు ఈ భవనం పూర్తిగా ఖాళీ అయిపోయింది. తండ్రి జ్ఞాపకార్థం ఉంచుకోవాల్సిన ఈ కళాక్షేత్రాన్ని.. తమకు ఇ భవనం అవసరం లేదని ఇటీవల సంజయ్ గుప్తా అనే వ్యాపారికి విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఈ కళా సౌధాన్ని కూల్చివేసి ఓ వాణిజ్య భవనాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఒకప్పుడు కళాభిమానులను రంజింపజేసిన సినిమాఘర్ ఇక తన ఉనికిని కోల్పోయినట్టే. ఎంఎఫ్ హుస్సేన్ గీచిన చిత్రాలు గుండెల్లోని భావోధ్వేగాలను తట్టి లేపుతాయని అభిమానులు చెబుతుంటారు. అలాంటి సినిమాఘర్ ఇక లేదన్న విషయాన్ని కళాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కట్టడం కూల్చివేత ప్రక్రియ మొదలైంది. మరికొద్ది రోజుల్లో కట్టడం పూర్తిగా కనుమరుగు కానుంది.