Brahmanandam
-
నెల రోజుల నుంచి ఏకాకిగా.. కమెడియన్కు మంచి జీవితం ఇవ్వండి: బ్రహ్మానందం
‘‘తమ్ముడు సప్తగిరి సినిమా ఇది. ఒక హాస్యనటుడు సినిమా హిట్ కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను’’ అన్నారు బ్రహ్మానందం (Brahmanandam). సప్తగిరి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘పెళ్లికాని ప్రసాద్’. ఈ చిత్రంలో ప్రియాంకా శర్మ హీరోయిన్. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వంలో కేవై బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది.పవిత్రమైన వృత్తిహైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను పది కాలాల పాటు నవ్వించాలని తపన పడేవాడు హాస్యనటుడు. హాస్యనటుడిది మనల్ని నవ్వించే వృత్తి. నిజంగా ఇది పవిత్రమైనది. ‘పెళ్లికాని ప్రసాద్’ సినిమా కోసం సప్తగిరి చాలా కష్టపడ్డాడు. నెల రోజుల నుంచి ఏకాకిగా తిరిగాడు. కనిపించే, కనిపించని దేవుళ్లందరికీ మొక్కుకున్నాడు. మంచి జీవితం ఇవ్వండిఈ సినిమా సక్సెస్ అయితే ఈ ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చినందుకు హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతానన్నా అన్నాడు. కమెడియన్ ఎప్పుడూ ఒంటరి కాకూడదు. ఈ సినిమాను హిట్ చేసి, హాస్య నటుడికి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంది’’ అని మరో ముఖ్య అతిథి, దర్శక–నిర్మాత మారుతి తెలిపారు. ‘‘ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్లో చూడండి’’ అని పేర్కొన్నారు కేవై బాబు. పెళ్లి కాని ప్రసాద్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సంతృప్తే సదానందం
బ్రహ్మాండమైన హాస్యనటుడు బ్రహ్మానందం. కానీ తనని మించిన హాస్య నటులు చాలామంది ఉన్నారని ఆయన అంటున్నారు. ఎలా అంటే..? ‘చుట్టూ ఉన్నవాళ్లని చూస్తూ... ఆనందపరుస్తూ... నవ్విస్తూ ఉండగలిగితే నీ అంతటి హాస్య నటుడు ఇంకొకడు లేడు’ అన్నారు బ్రహ్మానందం. సంతృప్తే సంతోషం అనే ఈ సదానందం ‘వరల్డ్ హ్యాసీనెస్ డే’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విశేషాలు.→ ఆనందానికి మీరిచ్చే నిర్వచనం? ఆనందం అనేది ఓ అనుభూతి... ఓ భావోద్వేగం. నవ్వు కూడా ఓ అనుభూతి. కేవలం శబ్దం కాదు. ఇక ఆనందం ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది. నువ్వు చేసే పని ద్వారా నువ్వు ΄పొందే అనుభూతే ఆనందం. మన మనసుకి ఏదైతే ఆనందాన్నిస్తుందో అదే ఆనందానికి నిర్వచనం.→ ఒక మనిషి నవ్వుతూ ఉన్నాడంటే ఆనందంగా ఉన్నట్టేనా? ఉన్నట్టు కాదు. నవ్వు నిస్సహాయతలోనూ వస్తుంది. అలానే ఏడుస్తున్నాడంటే విపరీతమైన బాధలోనూ ఉన్నట్టు కాదు. మనం ఒక ట్రాజెడీ నాటకం చూస్తున్నప్పుడు ఏడుస్తుంటాం. కానీ అది మన వ్యక్తిగత బాధ కాదు. మనం చూస్తున్న దాని ద్వారా ΄పొందిన అనుభూతి. ‘వియ్ కెన్ గెట్ హ్యాపీనెస్ ఫ్రమ్ ట్రాజెడీనెస్ ఆల్సో’. ఇక మనిషి భావాలను బట్టి అతను బయటకు కనిపించేది... అతని లోపల జరిగేది ఒకటే అనుకోలేం.→ చిన్నప్పుడు మీరు ఆర్థికపరమైన, ఇంకా ఎన్నో ఒడిదొడుకులు చూశారు. సో... మీకు పరిపూర్ణమైన ఆనందం పరిచయమైనది ఎప్పుడు? నే¯ð ప్పుడూ ఆనందం ఇలా ఉంటుంది... దుఃఖం ఇలా ఉంటుందీ అనుకోలేదు. రెండింటినీ వేరువేరుగా చూడలేదు... తెలియదు కూడా. ఆర్థిక సమస్యలుంటే దుఃఖం, అవి లేకుంటే ఆనందం అనుకోలేదు. ఒక మహర్షిలా తలకిందులుగా తపస్సు చేసి, నేర్చుకున్నటువంటి జ్ఞానం కాదిది. స్వతహాగానే ఏర్పడింది. ఈ పూట భోజనం ఉండదే అని బాధపడిపోలేదు. బట్టలు సరిగ్గా లేవా... ఓకే అనుకునేవాణ్ణి. అమ్మ పెట్టిందే బాగుందనుకోవడం.... నాన్న ఇచ్చినవే బాగున్నాయనుకోవడం. ఆనందాన్ని, దుఃఖాన్ని విభజించడం రాకపోవడం నాకు అలవాటుగా మారిపోయింది. ప్రస్తుతానికి అన్నీ ఉన్నాయి. బావుంది. అలాగని బ్రహ్మానందపడిపోలేదు. అప్పటి ఆ దుఃఖం తెలియకపోవడంవల్లే ఇప్పటి ఈ ఆనందం కూడా మనసుకి ఎక్కలేదు అనుకుంటుంటా. అయినా ప్రతిదీ లోతుగా విశ్లేషించి చూడక్కర్లేదు. సౌకర్యం ఇచ్చేది ఆనందం అంటా. అలాగే అసౌకర్యం ఆనందం ఇవ్వనిది కాదు కానీ విషాదం అని మాత్రం అనను.→ స్థితప్రజ్ఞతతో ఉండటం అనేది మీకు చిన్నప్పుడే అలవాటైందనుకోవచ్చా? ఏమో... ఏది ఏమైనా జీవితం నేర్పినపాఠాలు కొన్ని ఉంటాయి. పేదరికమంటే నాకు విపరీతమైన ఇష్టం. అందుకే నేను పేదవాళ్లకి సహాయం చేసినా బయటకు చెప్పను... కానీ చేస్తూనే ఉంటా. ఇక పేదరికం అనేది మన దగ్గర ఏది లేదో దాన్ని సంపాదించడానికి కృషి చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. నీ దగ్గర తిండి, డబ్బు, గౌరవం లేకపోతే వాటిని ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచిస్తావు. అలా నీకు లేనిదాన్ని ΄పొందడానికి దారి చూపించే ఓ మంచి మార్గం పేదరికం. అందులో నుంచి ఎలా బయటకు రావాలనే తపన ఉండాలి తప్ప మనకు లేదు... వాడికి ఉంది అని పోల్చి చూసుకోవడాలు ఉండకూడదు. ఈ లేదూ... ఉంది అనే ఆలోచనల్లో కన్నీళ్లు తప్ప ఏమీ మిగలవు.→ పేరుకు తగ్గట్టు మీరు బ్రహ్మానందాన్ని పంచుతున్నారు... ‘నాకీ పేరు ఎందుకు పెట్టాలనిపించింది’ అని మీ తల్లిదండ్రులను ఎప్పుడైరా అడిగారా?ఇలా మన గురించి ఒకరు అనుకుంటే హ్యాపీగా ఉంటుందేమో. నేనెప్పుడూ వాళ్లని అడగలేదు. అడుగుదామనే స్థాయికి చేరుకునే సరికి వాళ్లు పెద్దవాళ్లై పోయారు. మేం ఎనిమిది మంది సంతానం. నేను ఏడోవాడిని. ఏదో పేరు పెట్టారు... అనుకున్నానంతే. ఇప్పుడీ స్థితికి వచ్చాక నా తల్లిదండ్రులు పెట్టిన పేరుకి జస్టిఫికేషన్ జరిగిందని అనుకుంటుంటాను.→ స్ట్రెస్లో ఉన్నప్పుడు కొందరు మీ కామెడీ సీన్లు చూసి, రిలీఫ్ అవుతుంటారు. మరి... మీ స్ట్రెస్ బస్టర్? నేనెప్పుడూ ఆనందంగా ఉంటాను. నా ఫిలాసఫీ చె΄్పాను కదా. బాధ, ఆనందం వేరు వేరు అనుకోను. కెరటం ఎగిసినప్పుడు విజయం అని, కిందపడినప్పుడు అపజయం అనీ అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకటే. అలాగే ఆనందం, బాధ కూడా. గతంలో ఇదే ప్రశ్న అడిగి ఉండుంటే, మంచి భోజనం తింటే ఆనందం అనేవాణ్ణేమో. కానీ ఇప్పుడు ఈ 70 ఏళ్ల వయసులో తినే ఓపిక, తిన్నా అరిగించుకునే ఓపిక రెండూ లేవు. ‘ఏంటోనండీ ఓ ముద్ద తినలేకపోతున్నాం’ అనుకోవాలి. దీన్ని మళ్లీ బాధ అంటున్నాం. ఇది కూడా బాధ కాదు. ఆనందం, బాధ... ఈ రెండూ మన ఆలోచనా విధానం మీదే ఆధారపడి ఉంటాయి.→ మీ లైఫ్లో డల్ మూమెంట్స్ ఉంటాయా? సూర్యుడే డల్ అయిపోతాడు సాయంత్రానికి. మనమెంత? ఇదంతా ఓ నిరంతర ప్రక్రియ. అయితే కోరి డల్నెస్ తెచ్చుకోవడం వేరు... రావడం వేరు. సాగుతున్నప్పుడు డల్నెస్ అదే వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు నాకు నాలుగు గంటలకల్లా కాఫీ ఇవ్వాలనుకోండి... ఓ రెండు నిమిషాలు లేట్ అయిందంటే... ఏంటో ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నారని డల్ అయిపోవచ్చు... ఏముందీ కాస్త లేట్ అయిందని కూల్గానూ ఉండొచ్చు. సో... డల్నెస్ అనేది సాగనప్పుడు రాదు. జీవితం అనేది మన చేతిలో స్టీరింగ్ లాంటిది. ఎటు తిప్పుతున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది.→ ఇప్పుడు యువత చిన్న చిన్న విషయాలకే విపరీతంగా బాధపడిపోతున్న ధోరణి కనబడుతోంది... వాళ్లకి ఏం చెబుతారు? ఇప్పుడు యువత ఆనందంగా లేరని చెప్పలేం. అయితే ఇప్పుడు యూత్లో ఎక్కువమంది కష్టపడకుండా ఎలాగైనా డబ్బులు సంపాదించుకోవాలనే దాని మీద దృష్టి పెడుతున్నట్లున్నారు. అలా కాకుండా కష్టపడి పని చేసి, సక్సెస్ సాధించాలి. వేరే ఇతర మార్గాల వైపు... అంటే సులువైన మార్గాల్లో వెళ్లి సంపాదించుకుంటే, కష్టపడి సాధించేదాంట్లో దొరికే తృప్తి దొరకదు. ఇలాంటివన్నీ సాధ్యమైనంత వరకూ చెప్పే ప్రయత్నం చేయాలి. మన హిందూ ధర్మం గొప్పదనం ఏంటంటే... ఎదుటివారిని బాధించకుండా ఉండటం. ఎవరి అభిప్రాయం వారిది అని గౌరవించడం. → ప్రస్తుతం దాదాపు అందరి జీవితం ఒత్తిడి అయిపోయిన ఫీలింగ్...ఒత్తిడి లేకుండా ఎప్పుడుంది? పూర్వం కూడా ఒత్తిడి జీవితమే. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితం అంటున్నాం. మరి... జనాభా పెరిగిపోయారు కదా. సమస్యలు పెరిగాయి. భక్తి పెరిగింది. అన్ని రకాలుగా పెరుగుదలలు ఉన్నప్పుడు ఒత్తిడి కూడా వస్తుంది. అలాగే ఒత్తిడి సహజంగా రావడం... లేదా మనం తెచ్చుకుంటే రావడం... రెండు రకాలుగానూ వస్తుంది.ప్రస్తుతం నెగటివిటీ వైపే చాలామంది ఆకర్షితులవుతున్నారు... ఈ పరిస్థితి గురించి?ప్రస్తుతం ఏ మనిషికైనా రెండే పద్ధతులు పని చేస్తాయి. నచ్చింది తీసుకోవడం.... నచ్చనిది పట్టించుకోకపోవడం.పాజిటివ్గా ఉండాలంటే నెగటివ్వైపు వెళ్లకుండా ఉండటమే. పోనీ వెళ్లడంలోనే ఆనందం ఉందీ అనుకుంటే... అది వారి ఆలోచనా విధానం. ఎక్కడైనా ఫలానాది జరిగింది అంటూ ఓ నెగటివ్ హెడ్లైన్ చదివితే... ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం. తీరా అసలు విషయంలో ఏమీ ఉండదు. సో... నెగటివిటీకి ఎట్రాక్ట్ అవుతున్నారు. అందుకే పెరిగిపోతోంది. ఈ పెరుగుదలకు కూడా కారణం మనమే. అందుకే పాజిటివిటీని పెంచడానికి ప్రయత్నించడం మంచిది.– డి.జి. భవానిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్ -
ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు సినిమా
చాన్నాళ్ల తర్వాత బ్రహ్మానందం కీలక పాత్రలో నటించిన సినిమా 'బ్రహ్మానందం'. ఇందులో బ్రహ్మీతో పాటు ఆయన తనయుడు రాజా గౌతమ్, వెన్నెల తదితరలు నటించారు. గత నెలల థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు పెద్దగా హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)బ్రహ్మానందం సినిమాని తాత-మనవడు మధ్య జరిగే ఎమోషనల్ కంటెంట్ తో తీశారు. కథ పరంగా బాగానే అనుకున్నారు కానీ సినిమాగా రిలీజ్ చేసిన తర్వాత ఎందుకో జనానికి సరిగా కనెక్ట్ కాలేదు. ఇలాంటివి ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో గోల్డ్ యూజర్స్ కోసం స్ట్రీమింగ్ అవుతోంది. రేపటి (మార్చి 20) నుంచి యూజర్స్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.'బ్రహ్మానందం' విషయానికొస్తే.. నటుడు కావాలనుకునే బ్రహ్మా (రాజా గౌతమ్).. ఢిల్లీలో నాటకం వేయాలని అనుకుంటాడు. కానీ దీనికి డబ్బులివ్వాల్సి ఉంటుంది. దీంతో తాత ఆనంద్ రామ్మూర్తి (బ్రహ్మానందం) పేరిట ఉన్న భూమి అమ్మాలని అడుగుతాడు. దీనికి తాత ఒప్పుకొంటాడు కానీ కొన్ని షరతులు పెడతాడు. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: నటనకు గుడ్ బై.. హేమ ఇప్పుడేం చేస్తుంది?) -
ఓటీటీలోకి 'బ్రహ్మానందం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రస్తుతం ఒకటిఅరా అంటూ సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యే తన పేరు మీదే తీసిన 'బ్రహ్మానందం' (Brahmanandam OTT) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ప్రమోషన్స్ బాగానే చేశారు కంటెంట్ ఓ మాదిరిగా ఉండటంతో జనాల దృష్టిలో పడలేదు.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)ఇకపోతే బ్రహ్మానందం సినిమా వచ్చి నెలరోజులైపోతోంది. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కాగా.. మార్చి 14న అంటే ఈ శుక్రవారమే వస్తుందనే హింట్ ఇచ్చారు. కానీ ఏమైందో ఏమో ఓటీటీలోకి రాలేదు. దీంతో ఏంటి విషయం అని ఆరా తీస్తే ఐదారు రోజులు ఆలస్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నట్లు తెలిసింది.అలా మార్చి 20 నుంచి ఆహా ఓటీటీలోకి 'బ్రహ్మానందం' మూవీ రానుందని క్లారిటీ ఇచ్చారు. ఇందులో బ్రహ్మానందంతో పాటు ఆయన కొడుకు రాజా గౌతమ్(Raja Gautham).. తాత-మనవడి పాత్రల్లో నటించడం విశేషం. ఫ్యామిలీ మూవీ కాబట్టి థియేటర్లలో పెద్దగా పట్టించుకోనప్పటికీ ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది.(ఇదీ చదవండి: 'కోర్ట్' మూవీ హీరోయిన్.. ఎవరీ 'జాబిలి'?) -
కుమారుడితో బ్రహ్మానందం నటించిన సినిమా.. ఓటీటీలో ఎప్పుడంటే?
దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ (Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మా ఆనందం. ఈ మూవీలో వీరిద్దరూ తాతామనవళ్లుగా యాక్ట్ చేశారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద సినిమాల ఫేమ్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించాడు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహాలో రేపటి (మార్చి 14) నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.కథేంటంటే?బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) ఓ థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలన్నది తన లక్ష్యం. ఈ ప్రయత్నాల్లో ఉండగా ఢిల్లీలో ఓ నాటకం వేసే ఛాన్స్ దొరుకుతుంది. అయితే అక్కడ పాల్గొనాలంటే రూ.6 లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు. దానికోసం ప్రయత్నాలు చేసే క్రమంలో వృద్ధాశ్రమంలో ఉన్న తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం) తన దగ్గర ఆరెకరాల భూమి ఉందని చెప్తాడు. అది ఇవ్వాలంటే ఓ కండీషన్ పెడతాడు. మరి బ్రహ్మకు ఆ భూమి దక్కిందా? అతడిన ఎంతో ప్రేమించే తార (ప్రియ వడ్లమాని) తనను వదిలి ఎందుకు వెళ్లిపోయింది? చివరకు కలిశారా? బ్రహ్మ నటుడయ్యాడా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!చదవండి: Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ -
‘ఖాన్తో గేమ్స్ ఆడితే షాల్తీలు గల్లంతవుతాయ్’
కాజీపేట అర్బన్: ‘హలో నిట్ ఫ్రెండ్స్. నేనూ మీలా కుర్రాడి నే.. మీలాగే అల్లరి చేశాను. క్రియేటివ్గా ఆలోచించి అందరినీ నవ్వించాను. గిన్నిస్ వరల్డ్ రికార్డు, పద్మశ్రీ అవార్డు అందుకున్నాను. మీలో మనోధైర్యం నింపేందుకే ఇక్కడిదాకా వచ్చా’ అని అన్నారు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం. శుక్రవారం నిట్ వరంగల్ క్యాంపస్లో స్ప్రింగ్స్ప్రీ–25 వేడుకలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి చదివి లెక్చరర్గా సెటిలవుదామనుకున్నా. చంటబ్బాయి సినిమాతో దేవుడు నాకో గొప్ప అవకాశం ఇచ్చాడు. నాకున్న కళతో సినీ అరంగేట్రం చేశా. దాదాపు 40 ఏళ్ల ఇండస్ట్రీలో పన్నెండు వందలకుపైగా సినిమాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించా. పద్మశ్రీ అవార్డు అందుకున్నా. దేవుడు మనకు చాన్స్ ఇస్తాడు. దాన్ని క్యాచ్ చేయాలి. లక్ష్యాన్ని ఎంచుకోవాలి. కృషి, పట్టుదలతో ముందుకు సాగాలి.లాల్బహదూర్ శాస్త్రి, అంబేడ్కర్, అబ్దుల్ కలాం, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ప్రధాని నరేంద్రమోదీ ఇలా.. ఉన్నత స్థానాలకు చేరిన వారందరి విజయగాథలను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. ‘ప్రయత్నిస్తూ సాగితే విజయం, ప్రయత్నాన్ని విరమిస్తే మరణం’ అనే కొటేషన్ను గుర్తుంచుకోవాలి. ‘ఖాన్తో గేమ్స్ ఆడితే షాల్తీలు గల్లంతవుతాయ్’ అనే డైలాగ్తో విద్యార్థులను నవ్వించారు. స్ప్రింగ్స్ప్రీ–25 సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు.. బైబై నిట్ వరంగల్ అంటూ ప్రసంగం ముగించారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ శ్రీనివాసాచార్య పాల్గొన్నారు. -
రంగమార్తాండ కోసం నాన్న భోజనం కూడా చేయలేదు: రాజా గౌతమ్
టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (Brahma Anandam), ఆయన కుమారుడు రాజ గౌతమ్ (Raja Gautam) బ్రహ్మ ఆనందం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన రాజా గౌతమ్ తండ్రి బ్రహ్మనందం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీ నాన్న దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారని ప్రశ్నించగా.. దానికి సమాధానమిచ్చారు.రాజా గౌతమ్ మాట్లాడుతూ..' నాన్న దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా ఆయనకు నుంచి వచ్చిన క్వాలిటీ గ్రాటిట్యూడ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ ఈవెంట్ జరిగినా జంధ్యాల గారి పేరు రాకుండా ఉండదు. ఎవరైనా బాగా చేశారని తెలిస్తే వెంటనే ఫోన్ చేసి అభినందిస్తారు. రంగమార్తాండ చిత్రంలో వైఫ్ చనిపోతే చితి దగ్గర ఏడ్చే సీన్ ఉంటుంది. ఆ సీన్ కోసం నాన్న భోజనం చేయకుండా ఉన్నారు. ఆ సీన్లో నేను కొంచెం వీక్గా కనిపించాలి.. అందుకే భోజనం చేయకపోతే ఆ సీన్ ఎలివేట్ అవుతుంది అన్నారు. ఈ వయసులో కూడా ఆయన నిరూపించుకోవాలనే తపన ఉంది. అందుకే ఆయనే ఆదర్శం' అని ప్రశంసలు కురిపించారు.కాగా.. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. బ్రహ్మా ఆనందం చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుండటం హ్యాపీగా ఉందని రాజా గౌతమ్ పేర్కొన్నారు. -
తండ్రిగా చాలా సంతోషంగా అనిపించింది: బ్రహ్మానందం
‘‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) సినిమా చూసిన వారు ‘మీ కన్నా.. మీ అబ్బాయి బాగా చేశాడు’ అని రాజా గౌతమ్ని మెచ్చుకుంటుంటే ఓ తండ్రిగా చాలా సంతోషంగా అనిపించింది. ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలనే ఆలోచనతోనే నేను సినిమాలు చేస్తుంటాను. చాలా కాలం తర్వాత ‘బ్రహ్మా ఆనందం’ వంటి ఓ మంచి సినిమా, మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది’’ అని నటుడు బ్రహ్మానందం చెప్పారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో బ్రహ్మానందం(Brahma Anandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Gautam) తాతా మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’.ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్(Success Meet)లో రాజా గౌతమ్ మాట్లాడుతూ–‘‘బ్రహ్మా ఆనందం’ చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుండటం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు.‘‘నా గత చిత్రాల్లా ‘బ్రహ్మా ఆనందం’కి కూడా మంచి మౌత్ టాక్ వచ్చింది. అన్ని చోట్లా షోలు ఫుల్ అవుతున్నాయి’’ అని రాహుల్ యాదవ్ చెప్పారు. ‘‘ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం... మేం ఊహించని సన్నివేశాల్లోనూ నవ్వుతున్నారు’’ అని ఆర్వీఎస్ నిఖిల్ తెలిపారు. -
అంపశయ్యపై MS నారాయణ.. చివరి క్షణాల్లో ఏం జరిగిందంటే?: బ్రహ్మానందం
కమెడియన్స్ చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే కొందరు హాస్యనటులు సినిమా తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటారు. వారి డైలాగులు, అవాక్కులు-చవాక్కులు, హావభావాలు గుర్తు చేసుకుని మనలో మనం కాసేపు నవ్వుకుంటూ ఉంటాం. అలా తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ (MS Narayana) ఒకరు. ఈయనకు హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్ బ్రహ్మానందానికి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది.చివరి స్టేజీలో నాకోసం పరితపించాడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం (Brahmanandam).. ఎమ్మెస్ నారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎమ్మెస్ నారాయణ మంచానపడి అంతిమ ఘడియలకు దగ్గరవుతున్నప్పుడు ఆయన మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తనకు ఎంతోమంది తెలుసు. రక్తసంబంధాలు, స్నేహసంబంధాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే చివరి స్టేజీలో ఉన్నప్పుడు నన్ను చూడాలనుకున్నాడు. నన్నెలాగైనా కలుసుకోవాలనుకున్నాడు.చెప్పాపెట్టకుండా వెళ్లిపోయా..మాట్లాడలేని స్థితిలో ఉన్న నారాయణ.. అతడి కూతుర్ని పిలిచి తెల్లకాగితం అడిగాడు. దానిపై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలనుంది అని రాశాడు. అది చదివిన అమ్మాయి నాకు వెంటనే ఫోన్ చేసింది. అప్పుడు నేను గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' సినిమా షూటింగ్లో ఉన్నాను. శంషాబాద్లో షూటింగ్.. సడన్గా నేను వెళ్లాలి అని చెప్తే దర్శకుడు ఒప్పుకోకపోతే? ఎలా అన్న సంకోచం.. అందుకే ఎవరికి చెప్పకుండా నేరుగా కారెక్కి వెళ్లిపోయాను.అదే ఆఖరి రోజునన్ను చూడగానే అంపశయ్యపై పడుకున్న ఎమ్మెస్ నారాయణ కళ్ల వెంట నీళ్లు కారాయి. అది ఎన్నటికీ మర్చిపోలేను. నన్ను చూసి నా చేయి గట్టిగా పట్టుకుని వదిలేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి మళ్లీ కళ్లు తెరిచాడు. డబ్బు గురించి ఆలోచించొద్దని, ఎంతైనా పర్వాలేదు, నా మిత్రుడిని బతికించండని డాక్టర్స్ను కోరాను. ఇప్పటికీ మింగుడుపడదుషూటింగ్ మధ్యలో వచ్చేశానని, మళ్లీ వీలు చూసుకుని వస్తానని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాను. తిరిగి షూటింగ్కు వెళ్తుండగా మార్గమధ్యలోనే ఆయన మరణించారన్న వార్త వచ్చింది. అంతటి మేధావి తక్కువ వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం నాకిప్పటికీ మింగుడుపడదు అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఎమ్మెస్ నారాయణ (63).. 2015 జనవరి 23న అనారోగ్యంతో మరణించారు.చదవండి: 'ఛావా' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే? -
మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన తన తాతయ్య గురించి మాట్లాడారు. మా కుటుంబంలో ఆయనకు ఓ ప్రత్యేకమైన అలవాటు ఉండేదని అన్నారు. ఆయన మంచి కళా పోషణ కలిగిన వ్యక్తి అని నవ్వుతూ మాట్లాడారు. బ్రహ్మనందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మెగాస్టార్.చిరంజీవి మాట్లాడుతూ..'మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన స్వస్థలం నెల్లూరు అయితే మొగల్తూరు వచ్చి స్థిరపడ్డారు. అక్కడే స్టేట్ ఎక్సైడ్ ఇన్స్పెక్టర్గా రిటైరయ్యారు. నీకు ఎవరి బుద్ది అయినా రావొచ్చు కానీ.. ఆయన బుద్ధి మాత్రం రాకూడదనేవారు. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. మా ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. వాళ్లద్దరిపై అలిగితే మూడో ఆమె దగ్గరికి వెళ్లేవారు. నాకు తెలిసి ముగ్గురే.. అలా నాలుగు, ఐదు ఉన్నారేమో నాకు తెలియదు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావ్ కదా జాగ్రత్త. అసలే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనను మాత్రం ఆదర్శంగా తీసుకొవద్దని చెప్పారు.' అని నవ్వుతూ సరదాగా అన్నారు మెగాస్టార్. ఇంకేముంది ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదే ఈవెంట్లో బ్రహ్మానందం తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..'మా అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. నా తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు పెద్దరికంతో బతికారు. నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎప్పుడు గర్వపడుతుంటా. మా నాన్న నాకు ఒక మాట చెబుతుండేవారు.. ఒక మనిషి 18 రోజులు భోజనం చేయకపోతే చనిపోతాడు. 17 రోజుల వరకు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దు. 18వ రోజు తప్పనిసరి అయితేనే ఎవరినైనా సాయం అడుగు అనేవారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తా. నా జీవితంలో అప్పు అనే మాట తావులేదు' అని అన్నారు.కాగా.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్తో కలిసి బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవలే ప్రభాస్ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు. -
‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రాజకీయాలకు దూరంగా... సినిమాలకు దగ్గరగా ఉంటా: చిరంజీవి
‘‘బ్రహ్మానందం(Brahmaanandam)లో స్పార్క్ని గమనించి నేను తనని మద్రాసు తీసుకువెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి బంధం, ప్రేమానురాగాలు, గురు–శిష్యుల అనుబంధం ఉన్నాయి. ఓ రోజు బ్రహ్మానందం ఇంటికి వెళితే ఎన్నో అవార్డులు ఉన్నాయి. తన చరిత్ర అంతా ఓ గదిలో కనిపించింది. అలాంటి బ్రహ్మానందం కొడుకు చేసిన రెండు మూడు సినిమాలు అంతంతగా అలరించినా సరే... మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని హీరో చిరంజీవి(Chiranjeevi)అన్నారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధానపాత్రల్లో, ‘వెన్నెల’ కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలకపాత్రల్లో నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’.ఉమేష్ కుమార్, సావిత్ర సమర్పణలో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’(Brahmaanandam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(pre release event)కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై, అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు (బ్రహ్మానందం) పుత్రోత్సాహం కలుగుతుంది. నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ విధంగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో, అలానే నువ్వూ అనుభవించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అత్తిలిలో నేను లెక్చరర్గా చేస్తున్నప్పుడు భీమవరం వెళ్లి ‘ఖైదీ’ సినిమా చూశాను. చిరంజీవి ట్రెండ్ సెట్టర్. ఆయన చూడని చరిత్రా... చెప్పని చరిత్రా. చిరంజీవి కింగ్ ఆఫ్ వరల్డ్ సినిమా. ఈ వేడుకకు చిరంజీవిగారిని చీఫ్ గెస్ట్గా పిలవాలనుకుని కాస్త తటపటాయించాను. 9వ తారీఖు ఒక ఫంక్షన్. మళ్లీ 11న మరొక ఫంక్షన్ కదా అనుకున్నాను. ‘గౌతమ్ నీకు బిడ్డ. నాకూ బిడ్డలాంటి వాడే..’ అన్నారు. నన్ను తొలిసారి చెయ్యి పట్టుకుని విమానం ఎక్కించింది చిరంజీవిగారే. ఇప్పుడు నా బిడ్డ చేయిపట్టుకుని ఈ విమానం ఎక్కిస్తున్నారు.మంచి సినిమాలు తీయాలనే అభిరుచి ఉన్న కుర్ర నిర్మాతల్లో రాహుల్ ఒకడు. ఇది తాత–మనవడు గురించి చెప్పే కథ. ఈ సినిమా చాలా బాగుంటుంది’’ అన్నారు. ‘‘హీరో అనే పదానికి నాకు మీనింగ్ చిరంజీవిగారే. బ్యూటిపుల్ ఎమోషనల్ మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్లో అందరూ హాయిగా చూడండి’’ అన్నారు రాజా గౌతమ్. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా అంటే బ్రహ్మానందంగారే. ఆయనతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. రాజా గౌతమ్గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఆర్వీఎస్ నిఖిల్. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చినందుకు ఈ వేదికపై ఆయన్ను బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ సన్మానించారు.అప్పుడు ఒత్తిడిగా ఉండేది సినిమాల్లో ఉండగా నేను ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. పొలిటికల్ సైడ్ వెళ్లినప్పుడు కాస్త ఒత్తిడిగా ఉండేది. అన్నవాడిని, అననివాడిని కూడా ఏదో అనాలని తిట్లు రాసుకోవాల్సి వచ్చేది. ఒత్తిడిగా ఫీలయ్యేవాడిని. ఎందుకు స్పందించడం లేదని మా ఆవిడ నన్ను అడిగింది. నాలో హాస్య గ్రంథులు ΄ోయాయేమో అనుకున్నాను. ‘ఖైదీ నెంబరు 150’ తర్వాత మళ్లీ నవ్వడం ప్రారంభించాను. ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటాను. చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్లందరికీ దగ్గరవుతున్నాడు, వాళ్లందరూ దగ్గరకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా అటు (రాజకీయాలు) వెళ్తాడా అని. కాదు... మరో రకంగా సేవలు అందివ్వడం కోసమే తప్ప పొలిటికల్గా వెళ్లడం అనేది లేదు. – చిరంజీవి -
బ్రహ్మ ఆనందం ట్రైలర్.. ప్రభాస్ చేతుల మీదుగా విడుదల
టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), ఆయన కుమారుడు రాజా గౌతమ్ (Raja Goutham) నటించిన తాజా చిత్రం 'బ్రహ్మ అనందం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు. -
నన్ను నేను చాలెంజ్ చేసుకున్నాను: నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా
‘‘స్క్రిప్ట్ చదివి, ఓ మంచి సినిమా తీయడం నిర్మాత బాధ్యత అని భావిస్తాను. అందుకే ప్రతి స్క్రిప్ట్ను నేనే చదివి నిర్ణయం తీసుకుంటాను. సినిమా ట్రైలర్, ఫస్ట్ షో తర్వాత వచ్చే ఆడియన్స్ ఫీడ్బ్యాక్ నా ట్రంప్కార్డ్స్. పరిమిత బడ్జెట్తో, తక్కువ సమయంలో సినిమాలు తీస్తే నిర్మాతలకు లాభాలు వస్తాయని నమ్ముతాను’’ అని అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా(Rahul Yadav Nakka). ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam). ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Goutham) లీడ్ రోల్స్లో నటించగా, మరో కీలక పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ– ‘‘తాత–మనవళ్ల కథ ఇది. తాను చేసిన తప్పులను తాత ఎలా రియలైజ్ అయ్యాడు? మనవడు తాను చేసిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకున్నాడు? అనే అంశాలతో ఈ సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మూవీ ఉంటుంది. బ్రహ్మానందంగారు కథ ఓకే చేయకపోతే ఈ సినిమాయే లేదు.ఇందులో మూర్తి పాత్రలో బ్రహ్మానందంగారు, బ్రహ్మా పాత్రలో రాజా గౌతమ్, గిరి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. ముందుగా బ్రహ్మా పాత్రకు ‘వెన్నెల’ కిశోర్గారిని అడగ్గా, ఆయన హీరో ఫ్రెండ్ గిరి పాత్ర చేస్తానన్నారు. దీంతో రాజా గౌతమ్ పేరు ప్రస్తావనకు వచ్చి, ఆయనతో మాట్లాడి, ఈప్రాజెక్ట్లోకి తీసుకున్నాం.. ఇక సినీ ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయాలని నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను. నేను పరిచయం చేయబోతున్న నాలుగో దర్శకుడు నిఖిల్. మా నెక్ట్స్ప్రాజెక్ట్ ‘వైబ్’. ఇందులో రాజా గౌతమ్ హీరోగా చేస్తున్నారు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, మసూద’ చిత్రాలకు సీక్వెల్స్ ఉన్నాయి. కానీ ఇంకా సమయం ఉంది ’’ అని అన్నారు. -
వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ...
వారాహి అమ్మవారిని దర్శించుకున్నారు బ్రహ్మానందం(Brahmanandam ). మరి... ఏం కోరుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సుమంత్(Sumanth) హీరోగా రూపొందుతున్న ‘మహేంద్రగిరి వారాహి’(Mahendragiri Vaarahi) చిత్రంలోని ఓ సన్నివేశం ఇది. ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్ని విడుదల చేశారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాజశ్యామల ఎంటర్టైన్మెంట్పై కాలిపు మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘‘సుమంత్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ కాంబినేషన్లో రూపొందుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని కాలిపు మధు తెలిపారు. -
అడ్డంగా నువ్వు బుక్కయ్యావా...
బ్రహ్మానందం(brahmanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. శాండిల్య పిసపాటి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని రెండో సాంగ్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విడుదల చేశారు.సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిరియాల పాడారు. ‘అయ్యో అడ్డంగా నువ్వు బుక్కయ్యావా.. ఓరయ్యో ఘోరంగా చిరిగి చాటయ్యావా... గురిచూసి బాగా దెబ్బేశాడా నిన్నే తాతయ్యా...’ అంటూ గ్రామీణ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: మితేష్ పర్వతనేని, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు. -
అవకాశాలు లేక కాదు, రాక కాదు.. అందుకే సినిమాలు తగ్గించా!
తెలుగు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేశాడు. ఒకప్పుడు జెట్ స్పీడ్లో చిత్రాలు చేసిన ఆయన ఈ మధ్య మాత్రం మూవీస్పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏదో అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు గౌతమ్తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశాడు.సినిమాలు ఎందుకు తగ్గించేశానంటే?గురువారం జరిగిన బ్రహ్మ ఆనందం టీజర్ లాంచ్ ఈవెంట్ (Brahma Anandam Teaser Launch Event)లో సినిమాలు తగ్గించడానికి గల కారణాన్ని హాస్య బ్రహ్మ బయటపెట్టాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నాకు మంచి ఇమేజ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈయన కామెడీ అప్పట్లో బాగుండేది.. ఈ మధ్య కామెడీ చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లేదు అన్న మాట కొందరు కమెడియన్ల దగ్గర విన్నాను. అది నాకొద్దు. ఎంత చేసినా ఇంకా ఏదో వెతుకుతూ ఉంటారు.నాకు తెలుసుఅలాగే నా వయసేంటో నాకు తెలుసు. వయసు పెరుగుతోందని అర్థం చేసుకోకుండా నేనింకా యంగ్ అంటే కుదరదు. ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా నేను చేయలేకపోతున్నాను. నేను చేసిన పాత్రలే మళ్లీ ఆఫర్ చేస్తున్నారు, చేసిన కామెడీనే మళ్లీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.. నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అందుకే సినిమాలు తగ్గించేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. సినిమాల్లో వేషాలు లేక కాదు, నాకు ఇవ్వక కాదు, నేను చేయలేకా కాదు! ఎంతజాగ్రత్తగా చేసినా దొరికిపోతాం. చేసిన కామెడీ చేస్తున్నాడన్న ఇమేజ్ వద్దనే సినిమాలు తగ్గించాను. ఇండస్ట్రీలో నా వారసత్వాన్ని వెన్నెల కిషోర్ కొనసాగిస్తాడు అని చెప్పాడు.ఆనందో బ్రహ్మ ఎలా ఒప్పుకున్నానంటే?డైరెక్టర్ నిఖిల్.. నా పేరుపైనే ఒక సినిమా రాసుకున్నానని, మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తానన్నాడు. నాతో ఒక్క షాట్ అయినా డైరెక్ట్ చేయాలని తన కోరిక అని లేదంటే ఈ సినిమా పక్కనపెట్టేస్తానన్నాడు. అప్పటివరకు పోజు కొడదామనుకున్నాను కానీ నేను ఒప్పుకుంటేనే సినిమా అనేసరికి సరే అని అంగీకరించాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. హీరో ఎవరు? అని అడిగితే మా అబ్బాయి గౌతమ్ పేరు చెప్పారు. సినిమా కోసం వాడికి నేను తాతనయ్యాను అని చెప్పాడు. బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చదవండి: సంక్రాంతి రభస: మోహన్బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం (ఫొటోలు)
-
కర్నూలులో టీ షాప్ ప్రారంభించిన టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (ఫొటోలు)
-
సంక్రాంతి బరిలో మరో టాలీవుడ్ సినిమా!
సుమంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల బ్యానర్పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు. ఈ మూవీ గ్లింప్స్కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.కాగా.. మహేంద్రగిరి వారాహి సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు ఇటీవల వెల్లడించారు. ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని బ్రహ్మానందం చేయబోతున్నారని దర్శకుడు సంతోష్ తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.కాగా.. వచ్చే ఏడాది-2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా.. వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే!
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ప్రతి సోమవారం ‘కన్నప్ప’ నుంచి ఆయా పాత్రలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్స్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పిలక పాత్రలో నటించగా, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ వీరి పాత్రలను పరిచయం చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. -
వీళ్లూ ఎక్కారు... గిన్నిస్ రికార్డుల్లోకి!
నాలుగు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. తన డ్యాన్స్, నటనతో కోట్లాదిమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. తన సినీ జర్నీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ తాజాగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో రికార్డ్ బ్రేక్ చేశారు. దీంతో ఆయనకు ఈ రికార్డు దక్కింది. సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్కు చేరుకుని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతులు మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. అయితే, చిరు కంటే ముందే మన టాలీవుడ్ లెజెండ్స్ కొందరు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.దాసరి నారాయణరావుతెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో అత్యధిక చిత్రాల దర్శకుడుగా ఆయనకు గుర్తింపు రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడంతో పాటు 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలకు కథ, మాటల రచయితగా, గీత రచయితగా పనిచేశారు. తెలుగు సినీ దిగ్గజంగా కీర్తిని పొందిన ఆయన 2017 మే 30న మరణించారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంశ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. ఆయన్ను ఎస్పీ బాలు అని ఎంతోమంది ప్రేమతో పిలుస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠ,మలయాళం భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు బాలు పాడారు. ఇలా ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. బాలు నేపథ్య గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 6 జాతీయ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. 2020 సెప్టెంబరు 25న బాలు మరణించగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.దగ్గుబాటి రామానాయుడుదగ్గుబాటి రామానాయుడు.. మూవీ మోఘల్గా ఆయన అందరికీ దగ్గరయ్యారు. ఒకే వ్యక్తి 100 చిత్రాలకు పైగా నిర్మాతగా తెరకెక్కించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో రామానాయుడు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. బెంగాలీలో ఆయన నిర్మించిన అసుఖ్ (1999) ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కించుకుంది. 2015 ఫిబ్రవరి 18న క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించారు.విజయనిర్మల తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల దర్శకురాలుగా కూడా తన ప్రతిభను చాటారు. డైరెక్టర్గా 44 చిత్రాలను తెరకెక్కించి రికార్డ్ సెట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నీస్ బుక్లో ఆమె చోటు సంపాదించారు. 11 ఏళ్ల ప్రాయంలోనే ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఆమె.. 1971లో 'మీనా' చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆమె సుమారు 50కి పైగా సినిమాల్లో నటించారు. 2019లో విజయనిర్మల మరణించారు. పి. సుశీల ఆరు దశాబ్దాల పైగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురాలైన గానకోకిల పి. సుశీల పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. 12 భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ, సంస్కృత, సింహళ, పడుగు, తుళు, బెంగాలీ, పంజాబీ) సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 30 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. అయితే, గిన్నీస్ బుక్ వారు మాత్రం 1960ల నుంచి 6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలను మాత్రమే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చారు. ఈ ఘనత సాధించిన ఏకైక ఫిమేల్ సింగర్గా ఈ ‘గాన సరస్వతి’కి దక్కింది. దీంతో ఆమెకు గిన్నీస్ బుక్లో చోటు దక్కింది. భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవించాయి.బ్రహ్మానందంకన్నెగంటి బ్రహ్మానందం.. ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకే భాషలో 754 చిత్రాలలో నటించినందుకుగాను ఆయన పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చేరింది. ఒకే భాషలో ఇన్ని సినిమాలు నటించిన నటులు ఇంతవరకు ఎవరూ లేరు. అయితే, వాస్తవంగా బ్రహ్మానందం ఇప్పటి వరకు 1250 సినిమాలకు పైగానే నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ను దక్కించుకున్నారు. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా బ్రహ్మానందం సినీ రంగ ప్రవేశం చేశారు. -
బ్రహ్మానందం వీడియోలు చూస్తుండగా మహిళకు సర్జరీ
వయసుతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులకు కామెడీ ఇష్టం. యూట్యూబ్లో అయితే బ్రహ్మానందం, సునీల్ కామెడీ వీడియోలు తెగ చూసేస్తుంటారు. ఇప్పుడు అలానే 'అదుర్స్' సినిమాలోని బ్రహ్మీ కామెడీ వీడియోలు చూస్తుండగా 55 మహిళకు డాక్టర్స్ సర్జరీ చేశారు. కాకినాడలోని జీజీహెచ్లో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: లైంగిక వేధింపుల కేసు.. పరారీలో జానీ మాస్టర్)కొత్తపల్లికి చెందిన 55 ఏళ్ల అప్పన్న అనంతలక్ష్మికి ఏడాదిగా కుడి కాలు, కుడి చెయ్యి లాగేస్తుండటం వల్ల బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు పలు పరీక్షలు చేయగా మెదడులో ఎడమవైపు ట్యూమర్ ఉందని గుర్తించారు. దీన్ని అలానే వదిలేస్తే పక్షవాదం వచ్చే ప్రమాదం ఉందని చెప్పి సర్జరీకి సిద్ధమయ్యారు. అయితే మత్తు మందు ఇవ్వకుండా ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం వీడియోలు చూపిస్తూ క్రైనీయాటమీ సర్జరీ పూర్తి చేశారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సర్జరీ చేశారు. ఇది విజయవంతం కావడంతో వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి. అలానే శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు సదరు మహిళ బ్రహ్మానందం కామెడీ సీన్స్ చూస్తున్న ఆరు సెకన్ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?) -
నవ్వులే నవ్వులు
‘పద్మశ్రీ’ బ్రహ్మానందం కీలక పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటì స్తున్నారు. సావిత్రి, ఉమేష్ యాదవ్ సమర్పణలో స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.సోమవారం రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, గ్లింప్స్ రిలీజ్ చే శారు మేకర్స్. ‘‘బ్రహ్మానందం, రాజా గౌతమ్ నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో తాత, మనవడుగా వారు అలరించబోతున్నారు. రాజా గౌతమ్ స్నేహితుని పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మిమిక్రీ చేసి ఆశ్చర్యపరిచిన బ్రహ్మనందం..
-
బ్రహ్మానందంలో ఈ టాలెంట్ చూశారా? ఆయన ముందే మిమిక్రీ..
భారతీయుడు.. దశాబ్ధం క్రితం వచ్చిన ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. జనాలను ఆలోచింపజేసిన ఈ మూవీకి సీక్వెల్గా భారతీయుడు 2 వస్తోంది. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఆదివారం ఘనంగా జరిగింది.లోకనాయకుడిని దింపేసిన బ్రహ్మానందంఈ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ విశ్వంలోనే కమల్ హాసన్లాంటి నటుడు మరొకరు ఉండరని, ఆయనతో నటించినందుకు గర్వపడుతున్నాని తెలిపారు. అలాగే కమల్ హాసన్ వాయిస్ను మిమిక్రీ చేశారు. 'ఈ రోజు నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ 1 మూవీని బాగా హిట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. సౌత్ ఇండియన్స్ అందరూ నన్నెంతో ఆశీర్వదించారు, అభినందించారు. మాటలు రావడం లేదుచాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేస్తే నేను హ్యాపీ.. ఆల్వేస్.. యువర్ కమల్ హాసన్' అంటూ విశ్వనటుడి వాయిస్ను దింపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారగా బ్రహ్మానందంలోని ఈ టాలెంట్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కదా మిమ్మల్ని లెజెండ్ అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. Brahmanandam Garu mimics Kamal Haasan Sir’s voice. Wow!!! #Bharateeyudu2 pic.twitter.com/ka16cyYMGB— Aakashavaani (@TheAakashavaani) July 7, 2024 చదవండి: కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్, మౌనిక -
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో తాత, మనవడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించనున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్న ఈ సినిమాని ప్రీ–లుక్ పోస్టర్, వీడియోతో ప్రకటించారు. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిస΄ాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి. దయాకర్ రావు. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
స్వామీ బ్రహ్మానంద్ ఎవరు? ఎంపీ స్థాయికి ఎలా చేరారు?
దేశంలో 18వ లోక్సభకు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు (80) కలిగిన ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో సాధువుల ప్రవేశం 90వ దశకంలో రామమందిర ఉద్యమం నుంచి ప్రారంభమైంది. ఇది నేటికీ కొనసాగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా లోక్సభ సభ్యునిగా ఎన్నికైన స్వామి బ్రహ్మానంద్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి బ్రహ్మానంద్ గోసంరక్షణ కోసం పాటుపడ్డారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చించారు. స్వాతంత్య్రానంతరం 1951-52లో తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి. గోరఖ్నాథ్ పీఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్నాథ్ 1952,1957 ఎన్నికలలో హిందూ మహాసభ నుండి పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ ముందు సత్తా చాటలేకపోయారు. 1966లో స్వామి బ్రహ్మానంద్ స్వామి కర్పాత్రి మహారాజ్తో కలిసి లక్షలాది సాధువులతో కలసి గోహత్యను నిషేధించాలనే ఉద్యమాన్ని చేపట్టారు. దీనిపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ ఉద్యమ నేపధ్యంలో అప్పటి ప్రభుత్వం స్వామి బ్రహ్మానంద్ను అరెస్టు చేసి, జైలుకు తరలించింది. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లోకి రావాలని ఆయనను పలువురు కోరారు. దీంతో ఆయన జన్ సంఘ్లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి కాలుమోపారు. 1967లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ లోక్సభ స్థానం నుండి స్వామి బ్రహ్మానంద్ పోటీ చేసి విజయం సాధించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సాధు సన్యాసి లోక్సభ సభ్యునిగా ఎన్నికవడం అదే తొలిసారి. తరువాతి కాలంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1967లో బ్యాంకుల జాతీయకరణ అంశాన్ని లేవనెత్తినప్పుడు, స్వామి బ్రహ్మానంద్ అందుకు మద్దతుగా నిలిచారు. దీంతో జన్సంఫ్కు, స్వామి స్వామి బ్రహ్మానంద్కు మధ్య దూరం పెరిగింది. 1971 లోక్సభ ఎన్నికల్లో హమీర్పూర్ నుండి స్వామి బ్రహ్మానంద్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధంగా ఆయన రెండోసారి ఎంపీ అయ్యారు. -
బ్రహ్మనందం గొప్ప మనసు.. వారి కుటుంబానికి ఆర్థికసాయం!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మనందం ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే విఐపీ దర్శన సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు తిరుమలలో ఘనస్వాగతం పలికిన వేద పండితులు.. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మనందం అనంతరం పుస్తాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కళాకారుని కుటుంబాన్ని ఆదుకుని మంచి మనసును చాటుకున్నారు. కళాకారుడు మరణించిన కుటుంబానికి రూ.2.17 లక్షల ఆర్థికసాయం అందించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బ్రహ్మనందం చేసిన పనిని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మనందం కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. -
Brahmanandam Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్యబ్రహ్మ (ఫోటోలు)
-
కుమారుడిపెళ్లి.. మరింత బక్కచిక్కిపోయిన కమెడియన్ సుధాకర్
హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాడు. దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలాడు సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఆయన సినిమాలకు దూరమై సుమారు 17 ఏళ్లు అవుతోంది. తను నటనకు దూరమైనా తన ఒక్కగానొక్క కుమారుడు బెనిడిక్ మైఖేల్(బెన్నీ)ని టాలీవుడ్కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు గతంలో వెల్లడించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీదుగానే బెన్నీ ఎంట్రీ ఉంటుందని హింటిచ్చాడు. సుధాకర్ తనయుడి పెళ్లి సినిమాల సంగతి పక్కనపెడితే ఇటీవల బెన్నీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు, బ్రహ్మానందం, చంద్రబోస్ దంపతులు, రోజా రమణి వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. బ్రహ్మానందం అయితే బెన్నీని పెళ్లికొడుకు చేసేటప్పుడు, వివాహ వేడుక, రిసెప్షన్లోనూ సందడి చేశాడు. కొత్త జంటపై కేసు పెడతా సరదా మాటలతో అక్కడున్న అందినీ నవ్వించాడు. ఈ హాస్యబ్రహ్మ సొంత ఇంటి మనిషిలా పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రిసెప్షన్ స్టేజీపైకి ఎక్కి మైకు అందుకున్న బ్రహ్మానందం.. వీళ్లిద్దినీ చూస్తుంటే పోలీసు కేసు పెట్టాలనిపిస్తోంది. ఎందుకంటే ఇది బాల్యవివాహంలా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ముదిరిపోయిన జంటల పెళ్లిళ్లు చూశాక వీళ్లను చూస్తుంటే చిన్నపిల్లల్లా, క్యూట్గా కనిపిస్తున్నారు అని మాట్లాడాడు. నడవలేని స్థితిలో.. కాగా బెన్నీ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోల్లో సుధాకర్ ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారినట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను ఇద్దరి సాయంతో స్టేజీపైకి తీసుకొచ్చారు. ఆయన మరింత బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన అభిమానులు.. ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? అని విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు -
తెలుగు, నేపాలీ భాషల్లో...
ప్రముఖ నటుడు బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న తొలి తెలుగు, నేపాలీ చిత్రం ‘హ్రశ్వదీర్ఘ’. చంద్ర పంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హరిహర్ అధికారి, నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. నీతా ఫిలిమ్స్ ప్రోడక్షన్పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘హ్రశ్వదీర్ఘ’లోని ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ని విడుదల చేయడంతో పాటు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
లారీలకు రంగులేసిన వ్యక్తి ఇప్పుడు నవ్వుల రేడు!
టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకులను తన హావభావాలతో కట్టిపడేశారు. తాజాగా ఆయన నేడు 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఇవాళ ఆయన బర్త్డే కావడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా నిలిచారు. కేవలం ముఖ కవళికలతోనే నవ్వించే టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతం. అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు పొందారు. బహ్మనందం సినీ ఇండస్ట్రీలో 31 ఏళ్ల పాటు కమెడియన్గా అభిమానులను అలరించారు. ఆయన దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించారు. గతేడాది రంగమార్తాండ చిత్రంలో కనిపించిన ఆయన అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. బహ్మనందం ప్రస్థానమిది.. ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు ఇంత స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. చెప్పులు కూడా కొనలేని స్థితిలో నుంచి లెక్చరర్గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. అయితే తన వద్ద చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో ఇతరుల సాయంతోనే చదువు పూర్తి చేశారు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పీజీ చేసేందుకు తన దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అదే సమయంలో వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం టాలెంట్, కామెడీని చూసి ఎంఏ తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. లారీలకు రంగులు వేస్తూ.. పీజీ చదువుకునే రోజుల్లో నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలకు పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశారు. తాను చేసిన పనికి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా సొంతంగా పనులు చేసుకుంటూ.. దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్గా మారాడు. ఆ తర్వాత లెక్చరర్ స్థాయి నుంచి టాలీవుడ్లోనే ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగిన తీరు అద్భుతం. కళారంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఎంత సంపాదించారంటే.. కొన్ని వందల సినిమాల్లో మెప్పించిన హాస్య బ్రహ్మ ఆస్తులు ఎంత సంపాదించారో తెలుసుకుందాం. చదువుకోవడానికి డబ్బుల్లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఇవాళ ఆయన బర్త్డే కావడంతో అభిమానుల్లో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. తాజా సమాచారం ప్రకారం.. ఆయన స్థిర, చరాస్థులు కలిపి దాదాపు రూ. 500 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా. లగ్జరీ కార్లు.. ఆయనకు కోట్లు విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందట. దీనితో పాటు జూబ్లీహిల్స్లో ఓ లగ్జరీ ఇల్లు కూడా. కార్ల విషయానికొస్తే ఆడి క్యూ7, క్యూ8(ఆడి ఆర్8, ఆడి క్యూ7)తో పాటు మెర్సిడెజ్ బెంజ్ కారు ఉందట. ఇలా నటుడిగా బ్రహ్మీ బాగానే ఆస్తులు సంపాదించారట. అయితే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. ఆత్మకథ రాసుకున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాదు.. చిత్ర కళాకారుడనే విషయం తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. ఒకప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధించిన బ్రహ్మనందం.. నేడు తిరుగులేని నటుడిగా తన పేరు చరిత్రలో లిఖించుకున్నారు. ఇటీవలే మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని మెగాస్టార్, రామ్చరణ్కు అందించారు. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. -
తిరుమల లో టాలీవుడ్ నటుడు బ్రహ్మానందం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ, బ్రహ్మానందం, సునీత (ఫోటోలు)
-
'గేమ్ ఛేంజర్' సెట్లో చరణ్.. ఆ పుస్తకంపై స్పెషల్ ట్వీట్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మర్యాద పూర్వకంగా కలిశారు. బ్రహ్మీ.. తన జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన అంశాలతో, అనుభవాలతో 'నేను' అనే పుస్తకాన్ని రాశారు. ఈ మధ్యే దీన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ పుస్తకాన్ని హీరో చరణ్కి బ్రహ్మానందం బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన మెగాహీరో.. తన అభిప్రాయాన్ని కూడా క్యాప్షన్ రూపంలో రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) 'బ్రహ్మానందం.. తమ జీవితంలోని అనుభవాలతో 'నేను' రాశారు. అత్యద్భుతమైన ఆయన జీవిత ప్రయాణాన్ని ఇందులో సంక్షిప్తం చేశారు. అక్కడక్కడా చమత్కారంతో, మనసులోని ఎన్నెన్నో విషయాలను ఇందులో రాసుకున్నారు. ఓ వైపు జీవిత పాఠాలను నేర్పుతూ, అనుభవాలను పంచుకుంటూ, అక్కడక్కడా నవ్విస్తూ, ఎన్నో సినిమాల సంగతులను గుర్తుచేస్తూ, ఆద్యంతం అద్భుతంగా సాగింది ఈ పుస్తకం. బ్రహ్మానందంగారు రాసిన ఆటోబయోగ్రఫీ 'నేను' అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకం ఇది' అని చరణ్ ట్వీట్ చేశారు. తాజాగా హైదరాబాద్లో 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ మొదలైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బ్రహ్మానందం కూడా ఓ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఆటోబయోగ్రఫీని చరణ్కు బహుకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చాలారోజుల తర్వాత బ్రహ్మీ-చరణ్ షూటింగ్లో పాల్గొనడం, సరికొత్త లుక్లో కనిపించారు. (ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?) Journeying through the incredible life of #Brahmanandam Garu in 'NENU,' his autobiography crafted with humor and heart. 📘 These pages hold the essence of laughter, life lessons, and the cinematic charm he brought to us all. Order the book through this link:… pic.twitter.com/kY7qgaFtrS — Ram Charan (@AlwaysRamCharan) January 10, 2024 -
బ్రహ్మానందం తొలి సంపాదన ఎన్ని రూపాయలో తెలుసా?
ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు, చెప్పులు కూడా కొనుకోలేని దుస్థితిలో ఉన్న పిల్లవాడు లెక్చరర్గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. సైకిలే గొప్ప అనుకునే ఆయన కార్లలో తిరిగాడు. విద్యార్థులకు పాఠాలు బోధించే అతడు ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం నటుడిగా ముఖానికి రంగు వేసుకున్నాడు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఆయనే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన ఆయన నేను మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. గత నెలాఖరున ఈ పుస్తకం విడుదలైంది. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. దగ్గర డబ్బులు లేవు ఈ పుస్తకంలో తన గురించి ఎవరికీ తెలియని విషయాలను పొందుపరిచాడు. తన చదువంతా ఎవరో ఒకరి సాయంతోనే కొనసాగిందని తెలిపాడు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవు. సరిగ్గా అప్పుడే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం కళను, కామెడీని చూసి MA తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. పూర్తిగా ఆమె మీద ఆధారపడితే బాగోదని, కనీసం తినడానికి అయినా సంపాదించాలని ఏదో ఒక పని చేద్దామనుకున్నాడు. లారీలకు రంగు వేసే పనిలో.. నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలు రిపేర్లు చేస్తూ పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశాడు. అప్పుడు నెల జీతంలా కాకుండా పనిని బట్టి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా చిన్నపాటి పనులు చేసుకుంటూ, దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్గా మారాడు. మరోవైపు తనలోని కామెడీ యాంగిల్తో ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగాడు. చదవండి: వర్మ ఆడిషన్కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు -
కమెడియన్ బ్రహ్మానందం మరో టాలెంట్.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
బ్రహ్మానందం పేరు చెప్పగానే మనలో చాలామంది ముఖంపై ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. 1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ.. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోవడం, వయసు అయిపోవడంతో సినిమాలు బాగా తగ్గించేశారు. ఇలాంటి టైంలో తనలోని వేరే టాలెంట్స్ని బయటకు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు అలా ఓ పని చేయగా, దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) బ్రహ్మానందం అనగానే కమెడియన్ అనే గుర్తొస్తుంది. అయితే ఆయనలో మంచి ఆర్టిస్టు కూడా ఉన్నాడు. చాలాసార్లు దేవుడి చిత్రాల్ని తన చేతులతో గీశారు. వాటిని పలువురు హీరోలకు బహుమతిగా ఇచ్చారు. లాక్డౌన్ టైంలో బ్రహ్మీలో డ్రాయింగ్ ప్రతిభ బయటపడింది. ఇప్పుడు ఏకంగా ఈయనలో రైటప్ ఉన్నాడని తెలిసింది. 'నేను' పేరుతో తన జీవితాన్నే పుస్తకంగా రాసి ప్రచురించేశారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. 'నాకు అత్యంత ఆప్తుడు, ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందాన్ని అందించిన వ్యక్తి మనందరి బ్రహ్మానందం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకు ఎదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకు అందించడం ఆనందంగా ఉంది. ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం, మార్గదర్శకం కావొచ్చు. చదివే ప్రతిఒక్కరికీ ఈ బుక్ ఇన్సిపిరేషన్ అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, దీన్ని రాసిన ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని చిరు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇకపోతే ఈ పుస్తకం ధర రూ.275. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇది అందుబాటులో ఉంది. (ఇదీ చదవండి: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా… pic.twitter.com/0wg2p7LqNF — Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023 -
‘యానిమల్’లో హీరో బ్రహ్మానందం అయితే.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో కమెడియన్ బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నెట్టింట యాక్టివ్గా ఉండరు కానీ..ఆయన మీమ్స్ మాత్రం వైరల్ అవుతుంటాయి. సినిమాపైనే కాదు ట్రెండింగ్లో ఏ అంశం ఉన్నా..బ్రహ్మానందంపై మీమ్స్ రెడీ అయిపోతుంటాయి. అవి చూస్తే చాలు.. సీరియస్ అంశం అయినా సరే..పగలబడి నవ్వేస్తాం. తాజాగా బ్రహ్మానందంకు సంబంధించిన ఓ స్ఫూప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ‘యానిమల్’సినిమాపై చేసిన స్ఫూప్ వీడియా. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ రావడంతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అనిల్ కపూర్ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ లో రణబీర్కు బదులుగా బ్రహ్మీని పెట్టి ఓ వీడియోని రూపొందించారు. అందులో బ్రహ్మానందం నటించిన పలు సినిమాల్లోని సీన్లతో వాడేశారు. ఇక అనిల్ కపూర్ పాత్రకి బదులుగా నాజర్ని చూపించారు. బ్రహ్మానందం, నాజర్ తండ్రి కొడుకులైతే..యానిమల్ మూవీ ఇలా ఉంటుందంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యానిమల్’ లోని కొన్ని సీన్లకి సరిగ్గా సూట్ అయ్యేలా బ్రహ్మానందం సినిమాల సీన్లను పెట్టారు. ఇది ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ.. అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూసి నవ్వుకోండి. Bramhi in & as Animal😁✂️ Share & Follow @TeluguBroEdits .#brahmandam #AnimalTheMovie #AnimalPark @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/Cbc5VqwPQU — Telugu Bro (@TeluguBroEdits) December 9, 2023 -
ఓటేయడానికి వెళ్లిన బ్రహ్మానందం.. అక్కడ కూడా కామెడీయే
తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష.. అసెంబ్లీ ఎన్నికలు. ఈరోజు(నవంబర్ 30న) తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు అంతటా 50 శాతానికి పైగా పోలింగ్ జరగ్గా హైదరాబాద్, రంగారెడ్డి మాత్రం పోలింగ్లో వెనకబడ్డాయి. హైదరాబాద్లో ఇప్పటివరకు కేవలం 31% మాత్రమే పోలింగ్ జరగడం గమనార్హం. మరోవైపు సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోండని చెప్తూ లైన్లలో నిలబడి మరీ ఓటేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్బాబు, వెంకటేశ్, రానా, అల్లుఅర్జున్, నాని.. ఇలా పలువురు సినీతారలు కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా కామెడీ కింగ్ బ్రహ్మానందం తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి.. ఓటు హక్కు ఉండి వినియోగించుకోలేనివాళ్లను ఏమంటారు? అని అడిగాడు. దీనికి బ్రహ్మానందం స్పందిస్తూ... 'ఏమంటామండీ.. ఓటు హక్కు ఉపయోగించుకోలేనివాళ్లు అంటాం' అని తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కామెడీ బ్రహ్మ అని ఊరికే అనలేదు.. పోలింగ్ బూత్ వద్ద కూడా కామెడీ పండిస్తున్నాడు మహానుభావుడు అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Legend 🔥😂 #brahmanandam #TelenganaElections2023 pic.twitter.com/aN5SbQO6Sw — Narasimha (@_narasimha___) November 30, 2023 చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- పోలింగ్.. తదితర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం : బ్రహ్మానందం
‘‘ఒక సినిమా తీయడానికే ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం ఓ సంచలనం. తన కుమారుడు ఉపేంద్రని హీరోగా పరిచయం చేయడంతో పాటు ఒకేసారి అతనితో ఐదు సినిమాలు తీస్తున్న అచ్యుతరావుకి అభినందనలు. దీనివల్ల పరిశ్రమను నమ్ముకున్నవారికి అవకాశాలు ఇచ్చి, భోజనం పెట్టినట్లవుతుంది. ‘ఉపేంద్రగాడి అడ్డా’ మంచి హిట్టవ్వాలి’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్పై కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, ‘ఉపేంద్రగాడి అడ్డా’ ట్రైలర్ను, ‘1920 భీమునిపట్నం’ ΄ోస్టర్ను విడుదల చేశారు. అలాగే ఉపేంద్ర హీరోగా ఇదే బ్యానర్లో తీస్తున్న ఐదు సినిమాల టీజర్లను విడుదల చేశారు. కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో నవంబర్ నుంచి ప్రతీ నెల ఒక సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘నా పుట్టిన రోజుకి ఇది వెలకట్టలేని పెద్ద బహుమతి’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర. ‘‘సోషల్ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. హీరోయిన్ సావిత్రీ కృష్ణ, సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు. -
అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ నిర్మాత, ఐకాన్ అల్లు అర్జున్ తండ్రి అని చాలామంది అంటారు. కానీ అప్పట్లో చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారని ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకు చాలామందికి తెలియదు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఆయనతో ప్రయోగం చేద్దామని టాలీవుడ్ యువ దర్శకుడు ఒకరు అనుకున్నారు. కానీ ఆ పాత్ర బ్రహ్మానందంతో చేయించాడు. ఇంతకీ ఏంటా సినిమా? (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) టతరుణ్ భాస్కర్ పేరు చెప్పగానే 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది?' లాంటి క్రేజీ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడా డైరెక్టర్ చాలా ఏళ్ల తర్వాత తీస్తున్న సినిమా 'కీడా కోలా'. థ్రిల్లర్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్తో తీస్తున్న ఈ సినిమాలో సాధారణ ఆర్టిస్టులే ఎక్కువగా నటించారు. సినిమా ఆసాంతం వీల్ ఛైర్లో కూర్చుని ఉండే వరదరాజులు అనే పాత్రలో మాత్రం బ్రహ్మానందం యాక్ట్ చేశాడు. అయితే స్టోరీ అంతా రెడీ కాగానే వరదరాజులు పాత్ర అల్లు అరవింద్ చేస్తే బాగుంటుందని తరుణ్ భాస్కర్ అనుకున్నాడు. తాజాగా 'కీడా కోలా' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని రానాతో చెప్పాడు. అల్లు అరవింద్ దగ్గరకెళ్లి.. మీరు యాక్ట్ చేస్తారా అని తరుణ్ భాస్కర్ అడిగితే.. ఆయన సింపుల్గా నవ్వి ఊరుకున్నారట. దీంతో ఆ పాత్ర కోసం బ్రహ్మీ లైనులోకి వచ్చాడు. నవంబరు 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) -
కీడా కోలా నవ్విస్తుంది
తరుణ్ భాస్కర్ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ వంటి ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. ‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్ ్ర΄÷డక్షన్స్లో చాలా సినిమాల రీమేక్స్ రైట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్ చేయడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్ టైమ్లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్లో ఓ కీడా ఉంటే కన్జ్యూమర్ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్గారితో సురేష్ ప్రొడక్షన్స్లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్ వర్క్ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్ భాస్కర్తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు. -
'మన దగ్గర పైసలెక్కడివిరా సేవ్ చేయడానికి'.. ఆసక్తిగా ట్రైలర్
పెళ్ళిచూపులు, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే బ్రహ్మానందం సీన్స్తో కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమా నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పణలో నవంబరు 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. Unleashing the madness of #KeedaaCola. Mothaa mogipovaali 💥🥁#KeedaaColaTrailer is here!https://t.co/WNeT1GvOcs#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns @saregamasouth pic.twitter.com/a2RQIpDes7 — Rana Daggubati (@RanaDaggubati) October 18, 2023 -
బ్రహ్మానందం, తన కామెడీ అంటే నాకు చాలా ఇష్టం
-
బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?
స్టార్ హీరో అల్లు అర్జున్.. జాతీయ అవార్డు తనని వరించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ విషెస్ చెబుతూ నిన్నంతా గడిపేశాడు. ఇప్పుడు సడన్గా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ ఆయన్ని కలిశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇంతకీ కారణమేంటి? (ఇదీ చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?) అల్లు అర్జున్-బ్రహ్మానందం బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉంటారు. అయితే గతవారం బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లి జరిగింది. దీనికి హాజరు కాలేకపోయిన బన్నీ.. ఇప్పుడు స్వయంగా ఇంటికెళ్లి మరీ బ్రహ్మీ ఫ్యామిలీని కలిశారు. వాళ్లతో టైమ్ స్పెండ్ చేశారు. అయితే గత వారం మిస్ అయినప్పటికీ, గుర్తుపెట్టుకుని మరీ ఇప్పుడు బ్రహ్మీని ఆయన ఇంట్లోనే బన్నీ కలిశాడు. అలానే తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 'పుష్ప' సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నిలిచాడు. ఈ విషయమై బన్నీతో మాట్లాడిన బ్రహ్మీ.. తన ఇంట్లో అతడిని సన్మానించాడు. ప్రస్తుతం బ్రహ్మీ కుటుంబం, కొడుకు-కోడలుతో అల్లు అర్జున్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?) -
Brahmanandam 2nd Son Haldi Photos: బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య హల్దీ ఫంక్షన్ (ఫోటోలు)
-
బ్రహ్మానందం చిన్న కోడలి బ్యాగ్రౌండ్ ఇదే!
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన ద్వితీయ కుమారుడు సిద్దార్థ వివాహం శుక్రవారం(ఆగస్టు 18న) ఘనంగా జరిగింది. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడడుగులు నడిచాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త కోడలు ఎవరంటే? గౌతమ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో చాలామంది పెళ్లికూతురు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. బ్రహ్మానందం కొత్త కోడలి పేరు ఐశ్వర్య. ఈమె ప్రముఖ డాక్టర్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ పద్మజ వినయ్ కూతురు. ఐశ్వర్య కూడా డాక్టర్ విద్యనభ్యసించింది. అంటే బ్రహ్మానందం డాక్టర్ను తన ఇంటి కోడలిగా తెచ్చుకున్నాడన్నమాట! ఎంగేజ్మెంట్ సమయంలో హాస్య బ్రహ్మ కొత్త కోడలికి బంగారు నెక్లెస్ ఇచ్చాడట. ఇది కొన్ని లక్షల ఖరీదు చేస్తుందని టాక్ నడుస్తోంది. బ్రహ్మానందం తనయుడి పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి బ్రహ్మానందం ఫ్యామిలీ.. బ్రహ్మానందం విషయానికి వస్తే.. ఆయన వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. ఆయన పెద్ద కుమారుడు రాజా గౌతమ్ తండ్రి బాటలో నడుద్దామని ప్రయత్నించాడు, కానీ సక్సెస్ కాలేకపోయాడు. పల్లకిలో పెళ్లికూతురు, చారుశీల వంటి పలు చిత్రాల్లో కనిపించాడు. ఈయనకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడప్పుడూ బ్రహ్మానందం తన మనవళ్లతో ఆడుకున్న ఫోటోలను గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. చిన్న కుమారుడు గౌతమ్ విదేశాల్లో విద్యనభ్యసించి అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: తెలుగు సినిమాతో ఎంట్రీ.. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్.. రాజకీయాల్లోనూ హల్చల్ -
అంగరంగ వైభవంగా బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం
హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం. ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ ఈ రోజు ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముడులు వేశారు. సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు... తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
Brahmanandam Son Siddharth: బ్రహ్మనందం కుమారుడి పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ... చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు.
-
హీరోగా స్టార్ కమెడియన్.. బ్రహ్మానందంతో కలిసి!
కామెడీ రోల్స్ నుంచి హీరోగా మారిన నటుడు సంతానం. ఇతడి కంటే ముందు వడివేలు, వివేక్ లాంటి కమెడియన్స్ హీరోలు అయ్యారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. సంతానం మాత్రం హీరోగా హిట్స్ కొడుతున్నాడు. ఆ మధ్య కొన్ని చిత్రాలు నిరాశపరిచినా.. ఈ మధ్యే 'డీడీ రిటర్న్స్' హిట్ కావడంతో సంతానంలో జోష్ వచ్చింది. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) ఈ క్రమంలోనే తాజాగా 'కిక్' మూవీతో అలరించడానికి సిద్ధమైపోయాడు. ఫార్చూన్ పతాకంపై సంతానం హీరోగా నటించిన చిత్రం కిక్. కన్నడంలో లవ్ గురు, గాని బనానా, విజిల్, ఆరెంజ్ మూవీస్ తీసిన ప్రశాంత్ రాజ్ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్ హీరోయిన్. ఇందులో తంబిరామయ్య, బ్రహ్మానందం, సెంథిల్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాల, వైజీ మహేంద్రన్, షకీలా, స్కూల్ సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ ఈ జనవరిలోనే విడుదలైంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల రిలీజ్ కొంత ఆలస్యం అయిందని నిర్మాతలు పేర్కొన్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కిక్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
కమెడియన్ రచ్చ రవి బర్త్డే.. సినీ సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు.. సీఎం కేసీఆర్ను కలిసిన హాస్యబ్రహ్మ
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన రెండో తనయుడు సిద్దార్థ్.. డాక్టర్ ఐశ్వర్యతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. త్వరలో హైదరాబాద్లో జరగనున్న పెళ్లి కోసం అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారిని బ్రహ్మానందం కుటుంబ సమేతంగా కలిసి పెళ్లి పత్రిక అందజేశారు. తన కుమారుడి పెళ్లికి తప్పకుండా రావాల్సిందిగా కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాజా గౌతమ్ 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పలు చిత్రాల్లో నటించారు. గౌతమ్కు ఇదివరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం తన మనవళ్లతో కలిసి ఆడుకున్న ఫోటోలను అప్పుడప్పుడూ షేర్ చేస్తుంటారు గౌతమ్. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడికి సినిమాల మీద ఆసక్తి లేకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరంగా ఉంచినట్లు సమాచారం. చదవండి: ఆ సినిమాకు రూ.250 కోట్లా?: కంగనా ఫైర్ -
బ్రహ్మానందం కోసం మహేష్ బాబు ఏం చేశారంటే..?
తెలుగు సినీ ప్రపంచంలో హాస్యనటుడు బ్రహ్మానందానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన హాస్యం వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన.. తెరపై కనిపించినప్పుడల్లా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అలా గిన్నిస్బుక్ రికార్డును కూడా కైవసం చేసుకున్న లెజండరీ కమెడియన్ ఆయన. బ్రహ్మానందం స్క్రీన్పై కనిపిస్తే, ఎవరైనా నవ్వడం అనేది కామన్ పాయింట్. బ్రహ్మీతో టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్లో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో దిగాడు) అలాంటి వాటిలో బ్రహ్మానందం-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో అంటే వెరీ స్పెషల్. త్రివిక్రమ్ నుంచి వచ్చిన చాలా సినిమాల్లో బ్రహ్మానందం కనిపించి సందడి చేశారు. ముఖ్యంగా మహేష్బాబు సూపర్ హిట్ సినిమా 'అతడు'లో బ్రహ్మనందం చేసిన కామెడీ సీన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాత్రకు సంబంధించిన మీమ్స్ వాడుతూనే ఉంటారు. బ్రహ్మానందం-త్రివిక్రమ్ కాంబో నుంచి వచ్చిన ఖలేజా, జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా అదే రేంజ్లో మెప్పిస్తాయి. కానీ 'అరవింద సమేత, అఆ, అజ్ఞాతవాసి' చిత్రాలలో బ్రహ్మీ కనిపించలేదు. వారి కాంబినేషన్లో వచ్చే సినిమాలు ఎవరికైనా ఇప్పటికీ అలా చూస్తూ చూడాలనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఆస్కార్లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ) తాజాగా టాలీవుడ్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. 'గుంటూరు కారం' సినిమాలో బ్రహ్మానందం సందడి చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో మళ్లీ ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందట. కానీ ఈ స్క్రిప్ట్లో మార్పులు చేసి బ్రహ్మీకి ఓ పాత్ర క్రియేట్ చేయాలని ప్రిన్స్ మహేష్ సూచించారట. దీంతో త్రివిక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. బ్రహ్మీ కోసం ఆడియన్స్ను మెప్పించే ఓ పాత్రను డిజైన్ చేశారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. దీంతో మహేష్ ఫ్యాన్స్ కూడా గుంటూరు కారంతో పాటు గుంటూరు కామెడీ కూడా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. -
బ్రహ్మానందం చేతి నుంచి జాలువారిన కళాఖండాలు (ఫోటోలు)
-
బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా?
బ్రహ్మనందం టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్గా ఆయన తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో బ్రహ్మనందం లేకపోతే ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో బ్రహ్మనందం అంటే అంతలా ఫేమస్.. మరీ ఆయన కుమారుడు రాజ గౌతమ్ ఈ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు. తండ్రి బాటలో నడిచిన ఇండస్ట్రీలో నిలదొక్కుకొలేకపోయారు. (ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!) పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో గుర్తింపు వచ్చినా అంతగా ఫేమ్ రాలేదు. ఆ తర్వాత బసంతి, చారుశీల, మను లాంటి చిత్రాల్లో కనిపించారు. అలా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న గౌతమ్.. తాజాగా బ్రేక్ అవుట్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. అయితే గౌతమ్కు సినిమాల్లో నటించడం అసలు డ్రీమ్ కాదట. మరీ రాజ గౌతమ్ సినిమాలు కాకుండా ఏం చేస్తాడో మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. కేవలం టైమ్ పాస్ కోసమే సినిమాలు చేస్తుంటాడని టాక్ వినిపిస్తోంది. ఆయన అసలు వృత్తి వ్యాపారం. గౌతమ్కు హైదరాబాద్లో కమర్షియల్ కాంప్లెక్స్లతో పాటు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టారట. అంతేకాకుండా బెంగళూరులోనూ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయట. కేవలం వాటి ద్వారానే నెలకు రూ.30 కోట్ల రూపాయిల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత సంపాదన వస్తే ఇంకా సినిమాల్లో నటించాల్సిన అవసరమేముంది మీరే చెప్పండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు సినిమాలు చేస్తుంటాడని చెబుతున్నారు అంతే. (ఇది చదవండి: అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!) View this post on Instagram A post shared by Raja Goutham (@rajagoutham) -
బ్రహ్మానందాన్ని ఎప్పుడు ఇలా చూడలేదు..
-
కొత్త వాళ్లను ప్రోత్సహించాలి
‘‘జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాల్లో తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్లీ ఇంతమందిని (దాదాపు 50 మంది) ఒక్క దగ్గరికి చేర్చి ‘అన్స్టాపబుల్’ లాంటి మంచి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలని యువ దర్శకులు, నటులు ప్రోత్సహించాలి.. అప్పుడే చిత్ర పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అన్స్టాపబుల్’లో నటించిన వారందరూ ఒక బ్రహ్మానందం కావాలి’’ అన్నారు. ‘‘డైమండ్ రత్నబాబులాంటి దర్శకులు సక్సెస్ అయితే మాలాంటి వాళ్లకు మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘అన్స్టాపబుల్’ పై ఉన్న నమ్మకంతో రిలీజ్కి ముందే నాకు కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాత రజిత్ రావు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘ఫ్యామిలీతో చూసే చిత్రం ఇది’’ అన్నారు రజిత్ రావు. -
హాస్యనటుడు బ్రహ్మానందానికి ఎన్టీఆర్ పురస్కారం
విజయవాడ కల్చరల్: సినీ నటుడు ఎన్టీ రామారావు పురస్కారం అందుకోవడం మహాభాగ్యమని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మానందానికి ఎన్టీఆర్ ప్రధాన పురస్కారం, వివిధ రంగాలకు చెందిన 35 మందికి ఎన్టీఆర్ సెంటినరీ పురస్కారాలు అందించారు. (చదవండి: కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!) ఎక్స్రే సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ ఎన్టీఆర్తో తక్కువ సినిమాలే నటించినా ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ యుగం స్వర్ణ యుగమని చెప్పారు. ఎక్స్రే సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి సభను నిర్వహించారు. శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్రావు, టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి తదితరులు మాట్లాడారు. -
ఘనంగా బ్రహ్మానందం చిన్న కొడుకు నిశ్చితార్థం (ఫోటోలు)
-
అట్టహాసంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం వీడియో
-
బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. డాక్టర్ ఐశ్వర్యతో ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, సుబ్బిరామిరెడ్డి సహా పలువురు సినీ సెలబ్రిటీలు విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే. చదవండి: నటిని పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఆమెను మోసం చేశావంటూ ట్రోల్స్ పెద్ద కొడుకు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.గౌతమ్కు ఇది వరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కర్ణాటక ఎన్నికల ప్రచార ‘సిత్రాలు’ గ్యాలరీ
-
నటుడు బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం
కర్ణాటక: చిక్కబళ్లాపురం బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ తరఫున తెలుగు హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమ్మగుట్టహళ్లి, మండికల్లు పెరేసంద్ర పరిధిలో సుధాకర్తో కలిసి రోడ్షో నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి సుధాకర్ కృషి చేశారని, ఆయన్ను గెలిపించాలని కోరారు. అంతకుముందు సుధాకర్ మాట్లాడుతూ చిక్కబళ్లాపురంలో నీట్ అకాడమి ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రూ.2వేలు వంతున పంచుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మనందం ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా?
బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రణరంగం చివరి అంకానికి చేరుకుంటోంది. ఎన్నికలకు ఇంకా వారం రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రియాంక గాంధీ, ఖర్గేతో సహా అన్ని పార్టీల ముఖ్యనేతలంతా రాష్ట్రంలోనే మకాం వేశారు. త్రిముఖ పోరు నెలకొన్న కర్ణాటకలో గెలుపెవరిదనేది ఉత్కంఠగా మారింది. కాగా ఎన్నికల ప్రచారంలో సినీతారలు మెరుస్తున్నారు. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్కు మద్దతుగా రాహుల్గాంధీ ప్రచారంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సందడి చేశారు. తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడు చేరాడు. అయితే ఆయన టాలీవుడ్కు చెందిన ఫేమస్ కమెడియన్ కావడం గమనార్హం. చదవండి: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ కోసం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్న కే సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు. చిక్కబళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి సుధాకర్కు మద్దతు తెలుపుతూ ఆయనకు ఓటేయాలంటూ క్యాంపెయిన్ నిర్వహించారు. రోడ్డు షో ద్వారా ప్రజలతో సందడి చేశారు. చదవండి: Anil Dujana: యూపీలో ఎన్కౌంటర్.. మరో గ్యాంగ్స్టర్ హతం -
‘రంగమార్తాండ’ క్లైమాక్స్ అలా ఉండి ఉంటే మరింత బాగుండేది
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ టాక్ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, రాహుల్, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు. మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్ చూపించారు. కళాభారతిని పునర్ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్రాజ్కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు. -
నవ్వుకు బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్!
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కామెడీకి మించిన ఎంటర్టైన్మెంట్ ఏం ఉంటుంది? ఎంత సీరియస్ సినిమా అయినా.. అందులో కాసింత కామెడీ లేకపోతే ఆడియన్స్ సహించరు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కామెడీకీ, కమెడియన్స్కి మన దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. కమెడియన్స్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియస్ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువైయ్యాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మర్చారు. తమదైన హాస్యంతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యే గిలిగింతలు పెట్టిన కమెడియన్స్.. ఇప్పుడు భయపెడుతున్నారు.. ఏడిపిస్తున్నారు. నవరసాలను పండిస్తూ ‘వావ్’ అనిపిస్తున్నారు. నవ్వుకు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మీ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా కామెడీ పండించిన బ్రహ్మీ.. సడెన్గా నవ్వుకు బ్రేక్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్రహ్మానందంలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు. ఇన్నాళ్లు తనదైన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం..‘రంగమార్తాండ’తో ప్రేక్షకులను ఏడిపించాడు. భయపెట్టిన సునీల్ భీమవరం యాసతో అందరిని నవ్విస్తూ స్టార్ కమెడియన్గా ఎదిగాడు సునీల్. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి, తనదైన మార్కు కామెడీకి సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత ‘అందాల రాముడు’తో హీరోగా మారాడు. సిక్స్ఫ్యాక్స్ చూపించాడు. అదరిపోయే స్టెప్పులతో అలరించాడు. కానీ వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. రూటు మార్చి మళ్లీ కమెడియన్గా మారాడు. కానీ లెక్కల మాస్టార్ సుకుమార్ మాత్రం సునీల్ని సీరియస్ ట్రాక్ ఎక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రంలో మంగళం శ్రీనుగా సునీల్ నటన, ఆహార్యం కొత్తగా అనిపించింది. సునీల్ బెదిరిస్తే.. ఆడియన్స్ భయపడ్డారు. దీంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. పుష్ప 2లోనూ సునీల్ సీరియస్ లుక్లో కపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’లోనూ సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ‘సీరియస్’ నరేశ్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా రాణించిన వ్యక్తి ‘అల్లరి’ నరేశ్. తొలి సినిమా ‘అల్లరి’ నుంచి 2021లొ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ వరకు తనదైన కామెడీతో నవిస్తూ హాస్యరస చిత్రాలకు కేరాఫ్గా నిలిచాడు. కానీ ఇప్పుడే ఈ కామెడీ స్టార్ సీరియస్ బాట పట్టాడు. 2021లో వచ్చిన ‘నాంది’ చిత్రంతో సీరియస్ కథలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీసు అధికారిగా నరేశ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది. నవ్విస్తూనే..ఏడిపించిన దర్శి తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అందరిని నవ్విస్తున్న ప్రియదర్శి.. మధ్య మధ్యలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక బలగం సినిమాతో అందరిని నవ్విస్తూనే.. చివర్లో తనదైన నటనతో ఏడిపించాడు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడని ఈ చిత్రంతో నిరూపించాడు. కన్నీళ్లు పెట్టించిన కోవై సరళ టాలీవుడ్లో లేడీ కమెడియన్స్ అనగానే అందరికి గుర్తొంచే పేరు కోవై సరళ. కోవై సరళ, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్లు రాసుకునేవారు మన దర్శకులు. అయితే గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. ఇటీవల ఆమె నటించిన తమిళ మూవీ ‘సెంబి’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో కోవై సరళ తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ బామ్మ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందో బామ్మగా నటించిన కోవై సరళ.. తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. కొన్ని సన్నివేశాల్లో కోవై సరళ నటన చూస్తే.. కన్నీళ్లు ఆగవు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సత్యం రాజేశ్ నట విశ్వరూపం ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించిన సత్యం రాజేశ్.. ‘మా ఊరి పొలిమేర’ వెబ్ సిరీస్తో అందరిని భయపెట్టాడు. ఉత్కంఠగా సాగే ఆ వెబ్ సిరీస్లో ఆటో డ్రైవర్ కొమిరిగా సత్యం రాజేశ్ జీవించేశాడు. క్లైమాక్స్లో ఆయన ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అందరిని భయపెట్టిస్తాడు. త్వరలోనే ‘మా ఊరి పొలిమేర 2’ కూడా రాబోతుంది. ఇందులో సత్యం రాజేశ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. బలగం వేణు జబర్దస్త్ కామెడీ షోతో అందరికి పరిచమైన కమెడియన్ వేణు. చాలా కాలంగా కమెడియన్గా రాణిస్తున్న వేణుకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ మూవీతో వేణు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అని అందరు చర్చించుకునేలా చేసింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ వేణు ప్రతిభ గురించే చర్చిస్తున్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇలా వెండితెరపై నవ్వులు కురిపించే కమెడియన్స్.. నవ్వుకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ ట్రాక్ ఎక్కి మెప్పిస్తున్నారు. -
రెండు పూటలు తినడానికి కూడా లేదు, ఆర్థిక ఇబ్బందులు: బ్రహ్మానందం
నవ్వినంత ఈజీ కాదు నవ్వించడం.. కానీ కమెడియన్లు రకరకాల డైలాగులతో, స్కిట్లతో, పంచులతో, చేష్టలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. సింగిల్ డైలాగ్ లేకుండా కేవలం హావభావాలతోనూ నవ్వించగల దిగ్గజ నటుడు బ్రహ్మానందం. అందుకే ఆయన్ను హాస్యబ్రహ్మ అని పిలుస్తారు. ఇప్పటివరకు కేవలం కామెడీ తరహా పాత్రలే చేసిన ఆయన రంగమార్తాండలో వైవిధ్యమైన పాత్ర పోషించాడు. బ్రహ్మీని ఇలా చూడటం కొత్తగా ఉందంటున్నారు ఆడియన్స్. తాజాగా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'నా జీవితంలో జరుగుతున్నదేదీ ముందుగా ఊహించలేదు. రెండు పూటలా తినడానికి కూడా ఆలోచించుకున్న రోజులున్నాయి. అటువంటిది ఎమ్ఏ చదివాను, లెక్చరర్ ఉద్యోగం చేశాను. ఊహించకుండా సినిమాల్లోకి వచ్చాను. ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. అంతకుముందు డబ్బు కోసం ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు మంచి స్థానంలోకి వచ్చాక పేరు కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎవరైనా సరే ఎదుటివారు బాగుండాలని కోరుకుంటారు. కానీ తమ కన్నా బాగుండాలని మాత్రం కోరుకోరు. నేను స్టార్ హీరోలందరితోనూ పనిచేస్తూ ఎదుగుతున్నప్పుడు చాలామంది అసూయపడ్డారు. సుధాకర్ వచ్చాడు బ్రహ్మానందం పనైపోయింది, బాబూ మోహన్, ఎల్బీ శ్రీరామ్ వచ్చారు.. ఇక బ్రహ్మీ పనైపోయినట్లే, పృథ్వీ వచ్చాడు బ్రహ్మీ వెనకబడిపోయాడు.. ఇలా కొత్తగా ఏ కమెడియన్ వచ్చినా సరే నా పనైపోయింది అన్నారు. ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. రంగమార్తాండ సినిమాలో ఆ పాత్ర మీరు తప్ప ఇంకెవరు చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు. నాకది చాలు' అని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం. -
ఓటీటీలో రంగమార్తాండ.. అప్పుడే రిలీజ్!
ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల థియేటర్లలో అలరిస్తోంది. మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’ మూవీకి రీమేక్గా తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేగాక.. సినిమాకు పెట్టిన బడ్జెట్లో దాదాపు 70 శాతానికి పైగా రికవరీ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. -
రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి ప్రశంసలు
ఆడియెన్స్ని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకునే కమెడియన్ బ్రహ్మానందం. స్క్రీన్పై ఆయన ఒక్కసారి కనిపిస్తే చాలు, స్టార్ హీరోలకు ధీటుగా రెస్పాన్స్ వస్తుంటుంది. అయితే కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్లో రన్ అవుతోంది. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని అనుకుంటున్నారు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ఆడియెన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు. -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ( ఫొటోలు)
-
ఆయన నటనలోని మ్యాజిక్ని చూశా: ప్రకాశ్రాజ్
ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వంలో కాలిపు మధు, ఎస్. వెంకట్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ.. ‘‘మరాఠీ ‘నటసామ్రాట్’ సినిమా చూశాక ఒక కళాకారుడి జీవితంలో ఉన్న బరువు నాకు అర్థం అయింది. ఇలాంటి కథను నేను చూపించాలని అనుకున్నాను. ‘నటసామ్రాట్’ గురించి కృష్ణవంశీకి చెప్పగానే బాగుందన్నాడు. ఎమోషన్స్ చక్కగా ప్రెజెంట్ చేయగలడని తనని ఈ సినిమా రీమేక్ ‘రంగ మార్తాండ’కు దర్శకత్వం వహించమని కోరాను. బ్రహ్మానందంగారితో కలిసి వర్క్ చేయడం వల్ల ఆయన నటనలోని మ్యాజిక్ను చూసే అవకాశం దొరికింది’’ అన్నారు. ‘‘ప్రకాశ్రాజ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న అద్భుత నటులు బ్రహ్మానందం ఈ సినిమా కోసం కొత్త ఆర్టిస్టులా నటించారు’’ అన్నారు కృష్ణవంశీ. ‘ఈ చిత్రం క్లయిమాక్స్లో ప్రకాశ్రాజ్ నట విశ్వరూపం చూస్తారు. ప్రతి సీన్ని కృష్ణవంశీ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు బ్రహ్మానందం. -
Rangamarthanda Review: ‘రంగమార్తాండ’ రివ్యూ
టైటిల్: రంగమార్తాండ నటీనటులు: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నిర్మాతలు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి దర్శకత్వం : కృష్ణవంశీ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లి విడుదల తేది: మార్చి 22, 2023 క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘నక్షత్రం’(2017) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ..ఇప్పుడు ‘రంగమార్తాండ’తో వచ్చాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్లో భాగంగా సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలతో పాటు మీడియాకు కూడా పలుమార్లు ప్రిమియర్స్ వేడయంతో ‘రంగమార్తాండ’కు బజ్ ఏర్పడింది. భారీ అంచనాల ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ‘రంగమార్తాండ’ కృష్ణవంశీకి కమ్బ్యాక్ చిత్రమైయిందా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రాఘవరావు(ప్రకాశ్ రాజ్) ఓ రంగస్థల కళాకారుడు. తన నటనతో ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో కీర్తిప్రతిష్టతలను సాధిస్తాడు. ఆయన ప్రతిభకు మెచ్చి ‘రంగమార్తాండ’బిరుదుని ప్రదానం చేస్తారు అభిమానులు. అయితే ఆ సత్కార సభలోనే తన రిటైర్మెంట్ని ప్రకటించి అందరికి షాకిస్తాడు. అంతేకాదు తన ఆస్తులను పిల్లలకు పంచిస్తాడు. కొడుకు రంగారావు(ఆదర్శ్), కోడలు గీత(అనసూయ)లకు ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, అమ్మాయి శ్రీ(శివాత్మిక రాజశేఖర్)కి తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న సొమ్ముని అప్పగిస్తాడు. ప్రేమించిన వ్యక్తి(రాహుల్ సిప్లిగంజ్)తో కూతురు పెళ్లి కూడా చేస్తాడు. ఇలా బాధ్యతలన్ని తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి రాఘవరావు అనుకున్నట్లుగా శేష జీవితం ఆనందంగా సాగిందా? తను ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే ఆయన ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? పిల్లలే తన సర్వస్వం అనుకున్న రాఘవరావు దంపతులకు జీవితం ఎలాంటి పాఠం నేర్పించింది? భర్తే సర్వస్వం అనుకొని నమ్ముకున్న భార్యకు, చిన్నప్పటిని నుంచి కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ప్రాణ స్నేహితుడు చక్రి(బ్రహ్మానందం)కు ఎలాంటి న్యాయం చేశాడు? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి.. జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు ? చివరికి అతని నిజజీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మారాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేకే రంగమార్తాండ. ఇలాంటి కథను ముట్టుకోవడమే పెద్ద సాహసం. ఆ చిత్రంలో కథ, కథనం కంటే నటన చాలా బలంగా ఉంటుంది. నానా పటేకర్తో సహా ఆ సినిమాలో పనిచేసిన వాళ్లంతా కెరీర్ బెస్ట్ యాక్టింగ్లు ఇచ్చేశారు. అలాంటి కథను రీమేక్ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. కానీ ఈ విషయంలో కృష్ణవంశీ వందశాతం విజయం సాధించాడు. ‘నటసామ్రాట్’ సోల్ మిస్ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసి మెప్పించాడు. తెలుగు నాటకాలు..పద్యాలతో ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేకంగా రాసుకున్నాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రాఘవరావు రంగస్థలం నాటకాలకు రిటైర్మెంట్ ప్రకటించి జీవితం అనే నాటకంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి సీన్ చాలా ఎమోషనల్గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. భార్యను ముద్దగా ‘రాజుగారు’అని పిలుస్తూ సేవలు చేసే దృశ్యాలు హృదయాలను ఆకట్టుకుంటాయి. ’ఆనందం.. రెండు విషాదాల మధ్య విరామం’ అంటూ ఇంటర్వెల్ బోర్డు పడడంతో ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో సీట్ల నుంచి లేస్తారు. ఇక సెకండాఫ్లో వచ్చే ప్రతి సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. కూతురు దగ్గరకు వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు.. స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదాలతో సెకండాఫ్ మొత్తం ఎమోషనల్గా సాగుతుంది. ఆస్పత్రిలో ఉన్న చక్రి ‘ముక్తిని ఇవ్వరా’ అంటూ స్నేహితుడిని వేడుకోవడం... ‘మన ఇంటికి మనం వెళ్లిపోదామయ్యా..’ అంటూ రాఘవరావు భార్య అడగడం.. ఇవన్ని గుండెని బరువెక్కిస్తాయి. క్లైమాక్స్ సీన్ చూసి భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. భార్యభర్తల అనుబంధం, స్నేహబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. ఎవరెలా చేశారంటే.. ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించగల గొప్ప నటుడు ఆయన. రంగమార్తండ రాఘవరావు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఈ సినిమాకు బ్రహ్మానందం ఒక సర్ప్రైజింగ్ ప్యాకెజ్. చక్రి పాత్రలో ఆయన తన కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తర్వాత దర్శకనిర్మాతలు బ్రహ్మానందంను చూసే కోణం మారుతుంది. ఆ స్థాయిలో బ్రహ్మానందం నటన ఉంటుంది. ముఖ్యంగా ఆస్పత్రి సీన్లో ప్రకాశ్రాజ్ని బ్రహ్మానందం పూర్తిగా డామినేట్ చేశాడు. తెరపై ఓ కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు. ఇక రాఘవరావు భార్యగా రమ్యకృష్ణ నటన అద్భుతమని చెప్పాలి. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్రల పరిధి మేర నటించారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. ఎలాంటి రణగొణ ధ్వనుల లేకుండా.. చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలకు కూడా సినిమాలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో ‘రంగమార్తాండ’ కచ్చితంగా ఉంటుంది. ఈ కథ కొత్తదేం కాదు. అందరికి తెలిసిన కథే.. మనం నిత్యం చూస్తున్న అమ్మ నాన్నల జీవిత కథే. ఇంత గొప్పకథను అంతేగొప్పగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ తరం, రేపటి తరం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. -అంజిశెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం-ప్రకాశ్ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్ ఈ చిత్రంలో హైలెట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో బ్రహ్మనందం సీరియస్ లుక్ సినిమాకే హైలెట్గా మారనుంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. -
‘రంగమార్తాండ’ చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: కృష్ణ వంశీ
‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్. -
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
బ్రహ్మానందంగారు చెప్పినట్టే ఆ ఇల్లు బాగా కలిసోచ్చింది: రచ్చ రవి
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టిన రచ్చ ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఈ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన రవి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. దాదాపు 100 సినిమాల్లో నటించిన తొలి జబర్దస్త్ కంటెస్టెంట్గా రవి గుర్తింపు పొందాడు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో అలరించిన రచ్చ రవి తాజాగా ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించాడు. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానన్నాడు. ఈ సందర్భంగా జబర్దస్త్ మానేయడంపై వివరణ ఇచ్చాడు. చదవండి: ఆ హీరోయిన్ని బ్లాక్ చేసిన బన్నీ! స్క్రిన్ షాట్స్తో నటి ఆరోపణలు.. ‘నిజానికి జబర్దస్త్ నాకు తల్లి లాంటిది. సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోయాను. అందువల్లే జబర్దస్త్ మానేసి సినిమా కెరీర్పై ఫోకస్ పెట్టాను’ అని చెప్పాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక సమస్యలు ఉన్న ఈ షో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అదే సమయంలో బ్రహ్మానందం గారు నన్ను పిలిచి ఓ సలహా ఇచ్చారు. ఆయన వల్లే నా సొంతింటి కల నిజమైంది. ఆయన ఓ ఇల్లు చూపించారు. చదవండి: తారక్ వండర్ కిడ్: ఎన్టీఆర్పై శుభలేఖ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘ఇది తీసుకోరా నీకు బాగా కలిసి వస్తుంది. వాస్తు బాగుంది. ఎంత డబ్బు అయిన పర్వాలేదు నేను ఇస్తాను. ఇప్పటికిప్పుడు రూ. 5 లక్షలు అయిన పర్వలేదు నేను ఇస్తాను’ అని అన్నారు. అయన చెప్పినప్పుటి నుంచి నాకు డబ్బు కలిసి వచ్చింది. దాంతో ఆ ఇల్లు కొనుక్కున్నాను. బ్రహ్మానందంగారు చెప్పినట్టుగానే నాకు ఆ ఇల్లు బాగా కలిసి వచ్చింది. ఆ ఇంటికి మారాక నాకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నా. నటుడిగా మంచి పేరు సంపాదించాను. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డాను’’ అంటూ రచ్చ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ ఇంటి గృహప్రవేశానికి కూడా ఆయన వచ్చారంటూ రచ్చ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే బ్రహ్మానందంగారి దగ్గర డబ్బు తీసుకోకుండానే ఇల్లు కొన్నానని స్పష్టం చేశాడు. -
రంగమార్తాండ వచ్చేస్తున్నాడు
థియేటర్స్కు రావడానికి రెడీ అయ్యాడు రంగ మార్తాండ. ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ‘‘ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం..’ అని పేర్కొన్నారు దర్శకుడు కృష్ణవంశీ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు ΄ోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్గా ‘రంగమార్తాండ’ రూ΄÷ందింది. -
ఆ పాత్ర నేను చేయాల్సింది.. వెంకటేశ్ ఏం పొడిచారో చూస్తా?..బ్రహ్మానందం
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి తండ్రికొడుకులుగా నటించిన వెబ్సిరీస్ ‘రానా నాయుడు’. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించి ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా బ్రహ్మానందం నటించిన ఓ స్పెషల్ వీడియోని నెట్ఫిక్స్ విడుదల చేసింది. అందులో బ్రహ్మీ తనని తాను ఆస్కార్ నాయుడిగా పరిచయం చేసుకొని నాగ నాయుడు (ఈ సిరీస్లో వెంకటేశ్ పోషించిన పాత్ర పేరు) క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ ఇచ్చాడు. కిరీటి దామరాజు డైరెక్టర్గా, జబర్దస్త్ అవినాష్ ఆయన అసిస్టెంట్గా కనిపించారు. ఈ స్పెషల్ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బ్రహ్మానందం ఆడిషన్ చూసి విసుగుచెందిన వెంకటేశ్..చివరకు రానాకు తండ్రిగా తానే నటిస్తానని చెబుతాడు. దీంతో బ్రహ్మీ కోపంతో..‘ఆ క్యారెక్టర్కి నా ఏజ్ సరిపోలేదని.. వెంకటేశ్ను పెట్టారు. ఓకే.. ఏం పొడిచారో..ఎంత పొడిచారో నేను చూస్తాను. మీరూ.. చూడండి.. వాచ్ రానా నాయుడు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్’ అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది. -
వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసే యుద్ధం 'వీరఖడ్గం'
సృష్టిడాంగే ప్రధాన పాత్రలో ఎమ్ఏ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరఖడ్గం’. బ్రహ్మానందం, సత్యప్రకాష్, ఆనంద్ రాజ్ కీలక పాత్రలు చేశారు. కె.కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల మూడోవారంలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఎమ్ఏ చౌదరి మాట్లాడుతూ.. ‘‘చరిత్ర శిథిలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి.. పగ కూడా అంతే. వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు లైన్ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్ సునీల్కుమార్. -
నారాయణ మూర్తి ప్రజా దర్శకుడు
‘‘ఇండస్ట్రీలో కళా దర్శకులు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు. కానీ, ప్రజా దర్శకుడు అంటే ఆర్. నారాయణ మూర్తి ఒక్కరే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి ఆయన’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా టైటిల్ లోగోని బ్రహ్మానందం రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఎడ్యుకేషన్ మాఫియా, విద్యా వ్యవస్థ లోని లోపాలతో నారాయణ మూర్తిగారు తీసిన ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను, నా ఫ్యాన్స్ని కోరుతున్నాను’’ అన్నారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వైజాగ్ సత్యానంద్ గారి శిష్యులు ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో ‘యూనివర్సిటీ’ తీశాను. విద్య, వైద్యం ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాను.. నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యనారాయణగారికి, ఇతరులకు థ్యాంక్స్’’ అన్నారు. -
నన్ను క్షమించగలవా?
ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. నటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు (ఫిబ్రవరి 1) సందర్భంగా ‘రంగ మార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘‘ధగ ధగ్గాయ రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా, సుయోధన సౌర్వభౌమ.. శరాఘతాలతో ఛిద్రమై.. ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ.. అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్లెవేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? నా దైవ స్వరూపమా.. నన్ను క్షమించగలవా?’’ అంటూ భావోద్వేగంతో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్తో గ్లింప్స్ సాగుతుంది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా. -
బ్రహ్మానందం మొత్తం ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
టాలీవుడ్ ‘హాస్య బ్రహ్మ’, నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో వందల చిత్రాల్లో నటించిన ఆయన నిన్నటితో 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. బుధవారం(ఫిబ్రవరి 1న) బ్రహ్మానందం బర్త్డే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటికి వెళ్లిన ఆయన బర్త్డేను సెలబ్రెట్ చేశారు. ఇక ఆయన చేసిన సినిమాలకు గానూ గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా నిలవడం విశేషం. కేవలం ముఖ కవళికలతోనే నవ్వించే ఆయన హాస్య బ్రహ్మగా బిరుదు పొందారు. చదవండి: కత్రినా వచ్చాక నా లైఫ్ మారిపోయింది.. నేను పర్ఫెక్ట్ హస్భెండ్ కాదు..!: విక్కీ కౌశల్ దాదాపు ఇండస్ట్రీలో 31 సంవత్సరాల పాటు కమెడియన్గా చక్రం తిప్పిన ఆయన దాదాపు1200లకు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఆడపాదడపా చిత్రాలు చేస్తూ వస్తున్నారు. అన్ని వందల సినిమాలు చేసిన బ్రహ్మీ ఇప్పటి వరకు ఎంత కూడబెట్టి ఉంటారనేది నెటిజన్లో ఆసక్తి నెలకొలంది. బుధవారం ఆయన బర్త్డే నేపథ్యంలో బ్రహ్మానందం ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. నటుడిగా ఆయన వందల కోట్లు సంపాదించారట. ఆయన స్థిర, చరాస్థులు కలిపి దాదాపు రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. అలాగే కోట్లు విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందట. దీనితో పాటు జుబ్లిహిల్స్లో ఓ లగ్జరీ ఇల్లు కూడా. ఇక ఆయన కార్ల కలెక్షన్స్కి వస్తే.. ఆడి క్యూ7, క్యూ8(Audi R8, Audi Q7)తో పాటు మెర్సిడెజ్ బెంజ్ కారు ఉందట. ఇలా నటుడిగా బ్రహ్మీ బాగానే ఆస్తులు సంపాదించాడంట నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. కాగా బ్రహ్మానందం నటుడే కాదు.. చిత్ర కళాకారుడనే విషయం తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. కాగా ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. -
'వరదరాజు' పాత్రలో బ్రహ్మానందం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. ఎనిమిది ప్రధాన పాత్రలతో ఈ మూవీ రూపొందుతోంది. వారిలో బ్రహ్మానందం ఒక కీలక పాత్ర చేస్తున్నారు. బుధవారం బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ‘మీ ప్రపంచం వింతగా మారబోతోంది’ అని పోస్టర్పై క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ప్రతి ఇంట్లో ఉండే తాత పాత్రలో (వరదరాజు) బ్రహ్మానందంగారు కనిపిస్తారు’’ అన్నారు తరుణ్ భాస్కర్. Bhascker meets Bramhi.#keedaacola #Brahmanandam pic.twitter.com/PvOB0j3Dlw — Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) February 1, 2023 -
Happy Birthday Brahmanandam: బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
నాకు తెలిసిన బ్రహ్మనందం ఓ లెక్చరర్: మెగాస్టార్
హాస్యనటుడు అనే పదం ఆయనకు సరిపోదేమో.. ఎందుకంటే అంతలా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించాడు. హాస్యమే ఆయన కోసం పుట్టిందంటే ఆ పదానికి సరైన అర్థం దొరుకుతుందేమో. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయనే టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు . బ్రహ్మనందం అసమాన ప్రతిభను ఆయన కొనియాడారు. ఈ మేరకు ట్విటర్లో సందేశం పోస్ట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'నాకు తెలిసిన బ్రహ్మనందం అత్తిలిలో ఓ లెక్చరర్. ఈ రోజు బ్రహ్మనందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయనక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మనందానికి హృదయపూర్వక శుభాభినందనలు. బ్రహ్మనందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పదిమందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మనందంకు మరింత బ్రహ్మండమైన భవిష్యత్ ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మనందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తనకి నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. హాస్య నటుడు బ్రహ్మనందంకు టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు. Happy Birthday Dear Brahmanandam 💐 pic.twitter.com/sp0r9wUJPQ — Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2023 -
అప్పుడు అందరినీ నవ్వించి.. ఇప్పుడు తిండి కోసం తిప్పలు
తెలుగులో మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రం అసెంబ్లీ రౌడీ మీకు గుర్తుందా? అంతే కాకుండా ఆ సినిమాలో దివ్య భారతి ఆయనకు జోడీగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మనందం కామెడీ మామూలుగా పాపులర్ కాలేదు. ఈ చిత్రంలో అందరినీ కడుప్పబ్బా నవ్వించిన పాత్ర మరొకటుంది. బ్రహ్మనందంతో కామెడీ సీన్స్లో కనిపించిన పాకీజా రోల్. ఆ చిత్రం ద్వారానే ఆమె తెలుగులో పాపులర్ అయింది. సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి. తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో ఎన్నో వందల సినిమాలు, స్టార్ హీరోల సినిమాలలో గుర్తింపు తెచ్చిన పాత్రల్లో నటించింది. కానీ.. ఇప్పుడు తిండిలేక తిప్పలు పడుతోంది. ఆమె చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి, సినిమాలకు దూరంగా ఉంటోంది. సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని పోగొట్టుకుని చివరికి రిక్త హస్తాలతో మిగిలిపోయి దీనస్థితిలో బతుకు వెళ్లదీస్తోంది. ఆ తర్వాత పెదరాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాల్లోనూ నటించింది పాకీజా. అందరి స్టార్ హీరోల సినిమాల్లో తెలుగులోనే దాదాపు 50 చిత్రాల్లో నటించింది. ఒకప్పుడు అందరినీ నవ్వించినా ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఇటీవల ఆమె ఛానెల్తో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను, ఆమె పరిస్థితికి గల కారణాలను వివరించారు. పాకీజా రోల్లో మంచి కమెడియన్ అందరినీ నవ్వించినా పేరు తెచ్చుకున్నా.. ఆస్తులు ఏ మాత్రం లేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలయ్య, మోహన్ బాబు.. ఇలా అందరి సినిమాల్లో చేశా. తెలుగులో దాదాపు 50 సినిమాలు చేశా. ఆ తర్వాత నా స్వస్థలం తమిళనాడులోని కరైకుడికి వెళ్లా. నాకు తెలుగులో బెస్ట్ ఫ్రెండ్ జయలలిత. 150 చిత్రాల్లో నటించినా చెన్నైలో సొంత ఇల్లు లేదు. సాయం కోసం తమిళ నడిగర్ సంఘంతో పాటు హీరోలను సంప్రదించాను. సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నా పరిస్థితిని వివరించా. ఎవరూ సాయం చేయలేదు. ప్రస్తుతం హాస్టల్ ఉంటున్నా. ఎవరైనా ఆదుకుంటారేమో అని వేచి చూస్తున్నా.' అని ఎమోషనలయ్యారామె. -
ఇండస్ట్రీలో ఆ తేడా లేదు: బ్రహ్మానందం
‘‘చిత్ర పరిశ్రమలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఓ మూవీ కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తారు. సినిమా బాగుంటే అదే హిట్ అవుతుంది’’ అని నటులు బ్రహ్మానందం అన్నారు. వెంకట్ కల్యాణ్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’. గాయత్రీ పటేల్ హీరోయిన్. అబుజా, శ్రీలీల ఎంటర్టైన్మెంట్స్పై సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ని బ్రహ్మానందం ఆదివారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘హాస్య నటులు తీసే సినిమాలన్నీ సక్సెస్ కావాలని, హాస్యం బయటకు రావాలని మా గురువు జంధ్యాలగారు చెప్పేవారు. హాస్యాన్ని బతికించాలని కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ వేడుకకి వచ్చాను’’ అన్నారు. ‘‘నిర్మాతలు రైతుల్లాంటి వాళ్లు.. ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఈ మూవీ రెండో భాగం ఉంటుంది.. అన్నీ కుదిరితే బ్రహ్మానందంగారు నటిస్తారు’’ అన్నారు సీహెచ్ క్రాంతి కిరణ్. ‘‘పూర్తి కామెడీ డ్రామాగా రూపొందిన సినిమా ఇది’’ అన్నారు వెంకట్ కల్యాణ్. ఈ చిత్రానికి కెమెరా: జీకే యాదవ్ బంక, సంగీతం: అర్జున్ నల్లగొప్పుల. -
‘పంచత్రంతం’ మూవీ రివ్యూ
టైటిల్: పంచతంత్రం నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి, నరేశ్ ఆగస్త్య,శివాత్మిక రాజశేఖర్, ఉత్తేజ్ తదితరులు నిర్మాణ సంస్థలు:టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ నిర్మాతలు: అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు కథ, స్క్రీన్ప్లే: దర్శకత్వం: హర్ష పులిపాక సంగీతం:ప్రశాంత్ ఆర్ విహారి సినిమాటోగ్రఫీ: రాజ్ నల్లి ఎడిటర్:గ్యారీ బి హెచ్ విడుదల తేది: డిసెంబర్ 9 , 202 బాల్యంలో మనం పంచతంత్ర కథలు పుస్తకం చదువుకుని... వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి కథల ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన యాంథాలజీ చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ..కథనం ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి రిటైర్డ్ అయిన వేదవ్యాసమూర్తి(బ్రహ్మానందం)రైటర్గా ఎదగాలనుకుంటాడు. కానీ అతని కూతురు డాక్టర్ రోషిణి(స్వాతి)మాత్రం వయసును గుర్తు చేస్తూ తండ్రిని నిరుత్సాపరుస్తుంది. ఇప్పటి యువతను కథలతో మెప్పించడం సాధ్యం కాదంటూ తండ్రిని ఎగతాళి చేస్తుంది. అయితే వ్యాస్ మాత్రం కూతురి మాటలు పట్టించుకోకుండా స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్కు వెళతాడు. అక్కడ ఐదు కథలు చెబుతాడు.దానికి పంచేంద్రియాలు అని పేరు పెడతాడు. దృశ్యం, రుచి, స్పర్శ, వాసన, వినికిడి అంశాల ఆధారంగా ఈ ఐదు కథలు సాగుతాయి. ఇందులో మొదటి కథ సాగర తీరాన్ని(బీచ్) చూడాలనుకునే ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ది. ఇందులో నరేశ్ అగస్త్య, శ్రీవిద్య మహర్షి ప్రధాన పాత్రలు పోషించారు. విహారి(నరేష్ అగస్త్య) సాఫ్ట్ వెర్ ఎంప్లాయ్ గా పని చేస్తూ స్నేహితులతో సరదాగా గడుపుతాడు.అతని ఒక్కసారి కూడా బీచ్కి వెళ్లలేదు. స్నేహితుల మాటల్లో సాగరతీరం ఎలా ఉంటుందో విని.. ఒక్కసారైనా బీచ్ని చూడాలని తపన పడతాడు. మరి తన కోరిక ఎలా నేరవేరిందనేదే మిగతా స్టోరీ. ఇది కాస్త నెమ్మదిగా, చప్పగా సాగుతుంది. ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాదు. రెండోది చిన్నప్పుడు ఇష్టపడిన అమ్మాయి జ్ఞాపకాలను తడిమి చూడాలనుకునే ఓ యువకుడిది. ఈ స్టోరీ లో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సుభాష్(రాహుల్ విజయ్)కి ఇంట్లో సంబంధాలు చూస్తుంటారు. అయితే ఏ అమ్మాయి అతనికి నచ్చదు.చివరకు తల్లి కోసం లేఖ(శివాత్మిక)తో పెళ్లికి ఓకే చెబుతాడు. పెళ్లికి ముందు వాళ్లిద్దరు కలిసి మాట్లాడుకునే క్రమంలో ఇష్టమైన ప్రదేశం..చిన్నప్పటి లవ్స్టోరీని షేర్ చేసుకుంటారు. . ఒక అమ్మాయి లేదా అబ్బాయి పెళ్ళికి ఓకే చేసినప్పుడు అది పర్ఫెక్ట్ మ్యాచ్ అని ఎలా చెప్పగలం? అసలు ఒక అమ్మాయి, అబ్బాయికి ఉండాలిసింది ఏంటి? అనేది ఈ ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ గా చూపించారు. ఇక మూడోది మానసిక రోగానికి గురైన ఓ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ది. రామనాథం(సముద్ర ఖని) ఉద్యోగవిరమణ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. మరో పక్షం రోజుల్లో కూతురికి డెలివరీ ఉందనగా..అతనికి ఓ వింతవ్యాధి సోకుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పటికీ అతనికి మాత్రం బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది.తన ప్రవర్తనతో కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తాడు.అసలు అతనికి మాత్రమే చెడు వాసన ఎందుకు వస్తుంది? ఆ అరుదైన మానసిక వ్యాధి అతనికి ఎలా సోకింది? చివరకు ఆ వ్యాధి నుంచి రామనాథం ఎలా భయటపడ్డాడు అనేదే మిగతా కథ. ఇందులో సముద్రఖని తనదైన నటనతో అదరగొట్టేశాడు. నాలుగో కథ మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులది. కొత్తగా పెళ్లైన దంపతులకు ఊహించని కష్టం వస్తుంది. ఆ సమయంలో వీరిద్దరు ఒకరికొకరు ఎలా తోడుగా నిలిచారనేదే ఈ కథ సారాంశం. ప్రాణాలు పోయినా సరే విడిపోకుండా కలిసి ఉండే ఓ అనోన్యమైన యవజంట కథ ఇది. కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి అనే సందేశాన్ని ఇచ్చే ఈ కథకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది.ఈ స్టోరీ లో దివ్య శ్రీపాద, వికాస్ ఇద్దరు అన్యోన్య దంపతులు గా చక్కగా నటించారు. ఇక ఈ యాంథాలజీలో చివరిది 5వ కథ చాలా స్పూర్తిదాయకమైనది.ఇందులో స్వాతి ప్రధాన పాత్ర పోషించింది. లియా( స్వాతి) ఒక ఎంట్రప్రినర్. ప్రతి రోజు పాడ్ కాస్టింగ్ లో లియా స్టోరీస్ చెప్తుంటుంది. ఆ పాడ్ కాస్ట్ విని లియా ని ఎంతగానో అభిమానించే చిన్నారులు ఉంటారు. ఆ క్రమంలో పాడ్ కాస్టింగ్ ప్రోగ్రామ్ ఎండ్ చేసి, నెస్ట్ లెవెల్ కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ, రూపా అనే చిన్నారి వల్ల, ఆ పాడ్ కాస్టింగ్ కి మరింత వెయ్యి రేట్లు ప్రాణం పోస్తుంది. అసలు ఆ చిన్నారి ఎవరు? ఏం చేసింది? ఆ పాప ప్రాముఖ్యత ఏంటి? అనేదే మిగతా స్టోరీ. ఇది చాలా ఎమోషనల్గా సాగుతుంది.క్లైమాక్స్ హర్ట్ని టచ్ చేస్తుంది. మొత్తంగా ఈ ఐదు కథలుగా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’.. మంచి సందేశాన్ని ఇచ్చింది. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథలు... వాటిని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి. కాకపోతే కొన్ని ఎపిసోడ్స్లో అక్కడక్కడ సాగదీత గా అనిపిస్తుంది. ‘కెరియర్ అంటే 20ల్లోనే కాదు 60ల్లోనూ మొదలు పెట్టొచ చ్చు’, ‘కష్టం వచ్చినప్పుడు తుంచుకోడం కాదు...పంచుకోవాలి’, 'వదులుకోవడం ఎంత సేపు? క్షణం పట్టదు' లాంటి డైలాగ్స్ హృదయాలు హత్తుకుంటాయి. బ్రహ్మానందం అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ విహారి పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పనితీరు పర్వాలేదు. ఇలాంటి చిత్రాలను నిర్మించాలంటే అభిరుచి ఉండాలి. కమర్షియల్ లెక్కలు వేసుకోకుండా అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు ఈ సినిమాను రిచ్గా తెరకెక్కించారు. ఎలాంటి అశ్లీలత, ద్వందార్థాలకు చోటులేకుండా తెరకెక్కిన ఈ ‘పంచతంత్రం’ ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. - అంజిశెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్
చాలా గ్యాప్ తర్వాత ‘కలర్స్’ స్వాతి రీఎంట్రీ ఇస్తున్న మూవీ ‘పంచతంత్రం’. ఐదు కథలతో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రి రిలీజ్ ఈవెంట్ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్, కలర్స్ స్వాతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వాతి తన ఆల్ టైమ్ క్రష్ అని చెప్పాడు. ‘‘కలర్స్’ ప్రోగ్రామ్ నుంచి తను స్వాతిని చూస్తున్నారు. ఆమె నా ఆల్ టైం క్రష్. మిరపకాయ్ చిత్రంలో స్వాతి ఓ రోల్ చేసింది. ఆమె ఇక్కడ ఉండటం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం’’ అంటూ స్వాతిపై ప్రశంసలు కురింపించాడు ఆయన. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి చక్కని టైటిల్ పెట్టడంలోనే దర్శకడుఉ సగం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలోని హీరోయిన్స్ అంతా తెలుగువారే అని అన్నారు. నా సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు న్యాయం చేయలేకపోతుంటాను. ఇందాకటి నుంచి అంతా ఇది చిన్న సినిమా అంటున్నారు. రిలీజ్ అయిన తరువాత ఇది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని తెలుస్తుంది’ అని అన్నాడు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్పై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ -
మరోసారి తాతైన బ్రహ్మానందం
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మరోసారి తాతయ్యాడు. బ్రహ్మీ తనయుడు, నటుడు రాజా గౌతమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. రాజా గౌతమ్- జ్యోత్స్న దంపతులకు ఇదివరకే పార్థ అనే బాబున్నాడు. తాజాగా ఈ జంట మరోపాపకు జన్మనిచ్చింది. ఈ గుడ్న్యూస్ను అతడు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. పార్థ తన చెల్లిని ముద్దాడుతున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీనికి 'రెట్టింపైన సంతోషం' అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్గా మారింది. ఇకపోతే బ్రహ్మానందం ముఖ్యపాత్రలో నటించిన పంచతంత్రం సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. View this post on Instagram A post shared by Raja Goutham (@rajagoutham) చదవండి: మూడేళ్లుగా డిప్రెషన్లో, ఇంతలో గుండెపోటు: డైరెక్టర్ సోషల్ మీడియాలోకి స్టార్ హీరో భార్య ఎంట్రీ -
ఆకట్టుకుంటున్న బ్రహ్మానందం ‘పంచ తంత్రం’ ట్రైలర్
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న యాంథాలజీ ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసిన చిత్ర యూనిట్కి అభినందనలు తెలియజేసింది. ‘పంచతంత్రం’ ట్రైలర్ను గమనిస్తే.. ఇది 5 జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. డా.బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేస్తారని ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది కథాంశం అని క్లియర్గా తెలుస్తుంది. సినిమాలో మనకు కనిపించబోయే ఐదు జంటలకు ఒక్కో కథ .. ఒక్కో రకమైన ప్రయాణం.. అవన్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయనే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో ముందుకు సాగుతుంది. ప్రతి కథలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో వ్యక్తుల వ్యక్తిత్వాలను దర్శకుడు హర్ష ఎంతో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది. అర్థవంతమైన సంభాషణలు ప్రతి పాత్రలోని భావోద్వేగాలను సెన్సిబుల్గా ఎలివేట్ చేస్తున్నాయి. డిసెంబర్9న ఈ చిత్రం విడుదల కాబోతంది. -
బ్రహ్మానందం ‘పంచతంత్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడిస్తూ.. ఓ వీడియోని వదిలారు. ఆ వీడియోలో బ్రహ్మానందం కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తున్నాడు. తర్వాత రాహుల్ విజయ్ కాస్త ఆత్రుతగా, గాలిలోకి చూస్తూ నడవడం మనం చూస్తాం. హ్యాపీ మూడ్లో ఉన్న శివాత్మిక రాజశేఖర్ని అతనికి జోడీగా చూపించారు. సముద్రఖని మరియు దివ్య వాణి మధ్య వయస్కులైన జంటగా కనిపిస్తున్నారు. దివ్య శ్రీపాద తన భర్తతో కలిసి ఆనందకరమైన భావోద్వేగ మూడ్లో ఉన్న దృశ్యాలు ఉన్నాయి. సాగాగా అభివర్ణిస్తున్న ఈ చిత్రంలో 'కలర్స్' స్వాతి కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె మరోసారి 'పంచతంత్రం' క్యాసెట్తో వృత్తాన్ని పూర్తి చేస్తోంది. మరి ఈ పంచత్రంతం కథేంటో తెలియాలంటే డిసెంబర్ 9వరకు ఆగాల్సిందే. సినిమా విడుదల తేది ప్రకటన సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం ‘వేదవ్యాస్’ పాత్ర పోషించారు. ఆయనతో పాటు మిగిలిన నటీనటులు కూడా చక్కగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న రాబోతున్న మా చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాం’అన్నారు. ‘బ్రహ్మానందం, స్వాతిరెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. వీరి పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి. ఇందులో నటించిన వారంతా చాలా చక్కటి నటనను కనబరిచారు. అన్ని వర్గాల వారికి నచ్చేవిధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’అని దర్శకుడు హర్ష పులిపాక అన్నారు. -
Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు
తిరుమల : తిరుమలలో రెండేళ్ల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా గతంలో రెండు బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. దీంతో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆర్జిత సేవలు, రూ.300 దర్శన టికెట్లతోపాటు శ్రీవాణి ట్రస్ట్ దాతలు, ఇతర ట్రస్ట్ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసింది. స్వయంగా వచ్చే ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. గదులకు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. మిగిలిన గదులను ఆఫ్లైన్లో తిరుమలలోని వివిధ కౌంటర్ల ద్వారా భక్తులకు కేటాయిస్తారు. అక్టోబర్ ఒకటో తేదీన గరుడసేవ కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రస్ట్ల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లో గదుల కేటాయింపును నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రెండు కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 71,158 మంది స్వామిని దర్శించుకోగా.. 27,968 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.3.73 కోట్లు సమర్పించుకున్నారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. మరోవైపు సోమవారం శ్రీవారిని సినీనటుడు బెల్లంకొండ శ్రీనివాస్, సినీనటి మాళవిక నాయర్, హాస్య నటుడు బ్రహ్మానందం, నేషనల్ చెస్ చాంపియన్ గూకేష్ దర్శించుకున్నారు. (క్లిక్: అహ్మదాబాద్లో శ్రీవారి ఆలయానికి భూమి) -
'బ్రేక్ అవుట్'మూవీ ట్రైలర్ విడుదల చేసిన అల్లు అర్జున్
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్ అవుట్’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ మోదుగ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్లుక్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఆసక్తి కలిగిస్తోందని అన్నారు. టాలీవుడ్ లో ఓ యంగ్ టీమ్ ఈ తరహా కథలతో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా సర్వైవల్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజా గౌతమ్ తో పాటు కిరీటి దామరాజు, చిత్రం శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. Happy to launch the trailer of #BreakOut. The concept of the movie looks interesting. It’s good to see a young team in TFI experimenting with such stories. My best wishes to #RajaGoutham, director @its_Subbu4U and the whole cast & crew.https://t.co/sJ6BlKpa4N — Allu Arjun (@alluarjun) August 29, 2022 -
బ్రహ్మానందం కొడుకు నటించిన తాజా చిత్రం.. ఫస్ట్లుక్ వచ్చేసింది
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్ అవుట్’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ మోదుగ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని శనివారం విడుదల చేశారు. కిటికీ నుంచి బయటికి చూస్తూ బిగ్గరగా అరుస్తున్న రాజా గౌతమ్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది. ‘‘సర్వైవల్ థ్రిల్లర్గా తెరకెక్కతున్న చిత్రమిది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో చెబుతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘చిత్రం’ శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఇతర కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోహన్ చారీ, సంగీతం: జోన్స్ రూపర్ట్. -
హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ
ట్రెండ్ అనేది ఉందా? నో అంటారు కృష్ణవంశీ. ప్రేక్షకుల మైండ్సెట్ మారిందా? అస్సలు కానే కాదు అంటారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్య తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ మార్తాండ’. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్లో విడుదల కానుంది. ఇక కృష్ణవంశీ ఇంటర్వ్యూలోకి వెళదాం... ► మీ కెరీర్లో ‘రంగ మార్తాండ’ రెండో రీమేక్ (నాగార్జునతో తీసిన ‘చంద్రలేఖ’ మలయాళ రీమేక్ ). మళ్లీ రీమేక్ సినిమా చేయాలని ఎందుకనుకున్నారు.. కథలు రాయలేకపోతున్నారా? కృష్ణవంశీ : (నవ్వుతూ)... కథలు రాయలేకపోవడం కాదు. ‘రంగ మార్తాండ’ నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ రీమేక్లో నటించడంతో పాటు డైరెక్ట్ చేయాలనుకున్నాడు ప్రకాశ్రాజ్. ‘ఈ సినిమాని రీమేక్ చేయా లనుకుంటున్నాను. నాకు స్క్రీన్ ప్లేలో సహాయం చెయ్’ అని అడిగాడు. ఒకరోజు రాత్రి కూర్చుని చూడటం మొదలెట్టా.. ఒకచోట కాదు ఐదార్లు చోట్ల ఏడుపొచ్చేసింది. ‘ఇది ఎక్స్ట్రార్డినరీ సినిమా. రీమేక్ చెయ్, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను’ అని ప్రకాశ్తో అన్నాను. ‘నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం కంటే నువ్వెలాగూ ఎమోషన్స్ని అద్భుతంగా డీల్ చేస్తావు. నన్ను కూడా బాగా డీల్ చేస్తావు. నువ్వు డైరెక్ట్ చేస్తే బావుంటుంది. నాకోసం చెయ్’ అన్నాడు. సరే అన్నాను. అలా ‘రంగ మార్తాండ’ ప్రాజెక్ట్లోకి వచ్చాను. ► ‘నట సామ్రాట్’లో మిమ్మల్ని అంతగా కదిలించినదేంటి? ఇది మన తల్లిదండ్రుల కథ. మన తల్లిదండ్రులకు కావాల్సినంత విలువ ఇస్తున్నామా? లేదా గౌరవించి తప్పుకుంటున్నామా? అనే పాయింట్ ఉంది. సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మారుతోంది. సక్సెస్ సాధించాలని పరుగు తీయడంలోనో, అందరితో పొగిడించుకోవాలనే ప్రయత్నంలోనో, అందరికంటే అధికుణ్ణి అనిపించుకోవాలనే తపనలోనో మనల్ని మనం కోల్పోతున్నాం. అది ‘నట సామ్రాట్’లో నాకు కనిపించింది. ఇది ఒక స్టేజ్ యాక్టర్ కథ. అతను స్టేజ్ మీద విలువలతో బతికినవాడు.. బ్రహ్మాండమైన నటుడు. అందుకే ‘రంగ మార్తాండ’ అనే బిరుదు ఇస్తారు. ఆ బిరుదు వచ్చిన రోజునే అతను నటనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. అప్పటివరకూ నటుడిగా రంగుల ప్రపంచం, నిరంతరం చప్పట్ల మధ్య ఉండే అతను నిజ జీవితంలో తండ్రిగా, తాతగా, భర్తగా, స్నేహితుడిగా తన పాత్ర పోషించే సమయంలో లైఫ్లో ఎంతమంది నటులున్నారో తెలుస్తుంది. అతను నమ్మిన ఆదర్శాలకు, బయట నిజాలకు క్లాష్ అవుతుంది. తల్లిదండ్రులు స్వార్థపరులయిపోయారు. పిల్లలు స్వార్థపరులయిపోయారు అని నిందించకుండా ఎవరి పాయింట్లో వాళ్లే కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ, వాళ్ల మధ్య క్లాష్ ఎలా వస్తుంది? అనేదే ఈ కథ. ► ‘రంగ మార్తాండ’ మళ్లీ మిమ్మల్ని హిట్ ట్రాక్లోకి తీసుకుని వస్తుందనుకుంటున్నారా? నేను ఇలా చెబితే నమ్మశక్యంగా ఉంటుందో లేదో తెలియదు కానీ హిట్ కోసం నేనెప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ఇదెందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమయిందేంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి... అంతే. ► ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా సాగుతోంది. ఈ ట్రెండ్ని మీరెలా చూస్తారు? నా చిన్నప్పటినుంచి మా ఊర్లో హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమా (తెలుగు) దేశం నలు మూలలకు వెళుతోంది. అన్ని ప్రాంతాల వాళ్లు ఆదరిస్తున్నారు. ఇది కేవలం సౌత్ సినిమాలా కాకుండా సౌత్ సినిమాని కూడా ఇండియన్ సినిమాగా చేయొచ్చు అనే అర్థంతో పాన్ ఇండియా సినిమా అంటున్నారని అనుకుంటున్నాను. ► మీరు పాన్ ఇండియా సినిమా ట్రై చేస్తారా? ఏమో చెప్పలేం. అది సినిమాను బట్టి ఉంటుంది. ► కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలామందికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కానీ దానికంటే ముందే మీకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం? ఆటోమేటిక్గా వచ్చేసింది అలా. ఫ్లాప్ అయిన తర్వాత పుంజుకోవడం కష్టం. హిట్.. ఫ్లాప్ అనేది నేను తీసుకోను. కానీ ఆ ఎఫెక్ట్ నా మీదుంటుంది. హిట్ కోసమని మెట్టు దిగి, దిగజారి ప్రజల్ని మభ్యపెట్టి సినిమా తీయలేను. రాజీ పడలేను. ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు కదా. గ్యాప్ అయితే ఫ్లాప్స్ వల్లే వచ్చింది. హిట్ ఇస్తుంటేనే ఇండస్ట్రీలో ఫాస్ట్గా ఉంటాం. ► ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని కొంత వల్గర్ కామెడీ, రేంజ్కి మించిన వయొలెన్స్ తీస్తున్నారు కొందరు... దీని గురించి మీరేం అంటారు? ప్రేక్షకుల మైండ్ సెట్ మారలేదని నా అభిప్రాయం. అయినా ఇదో ఫేజ్ అనుకుంటున్నాను. మనం ఆ తరం (పాత సినిమాలు) చూశాం కాబట్టి ఇప్పుడు సినిమాలు చూసి బాధపడతాం. కానీ ఇప్పటివాళ్లు ఇవే చూశారు కాబట్టి వారికి ఇదే కరెక్ట్ అనిపిస్తుందేమో. ► ఫార్ములా ఫాలో కాకపోతే మీరు పోటీలో ఎలా నిలబడతారు? సినిమా తీసే ఫార్మాట్ ఒక్కటే మారింది. బేసిక్ ఎమోషన్స్ అన్నీ అవే. అదే లవ్, అదే ఫ్యామిలీ, అదే విలనిజం అన్నీ అవే. మంచి మీద చెడు గెలుస్తుంది అని చివర్లో చెప్పడం. కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి. అలా అని ప్రయాణం మానేస్తామా? మన ప్రయాణం మనది. మనం ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా, వీలైతే మన వల్ల కొందరైనా పాజిటివ్గా ఉండగలుగుతున్నారా అనేదే మనం పట్టించుకోవాల్సింది. సో.. పోటీ గురించి భయపడటం, బాధపడటం నాకు రాదు. ► అలాగే ఒకప్పుడు ఎమోషన్ అంటే బలంగా చూపించేవారు. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో లైటర్వీన్గా కనిపిస్తోంది. అదేమంటే ట్రెండ్ మారిందంటున్నారు... ఎమోషన్ని స్ట్రాంగ్గా చూపించడానికి ఇష్టపడటంలేదా? తెలియడం లేదా? చేతకావడం లేదా? దాసరిగారిలా, కేవీ రెడ్డిగారిలా, విశ్వనాథ్గారిలా సినిమాలు తీయలేం. అలా ఎవ్వరూ తీయలేరు కాబట్టి ట్రెండ్ మారింది అనుకుందామా? కరెక్ట్గా తీయగలిగితే అలా అనుకోనక్కర్లేదా? మరి.. కరెక్ట్గా తీయడం అంటే ఏంటని నన్ను అడగకండి. నాక్కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమాను ప్రపంచం ఆదరించింది కదా? ట్రెండ్ అంటూ ఏదీ లేదు. ట్రెండ్ అంటే నా దృష్టిలో బూతు. మనకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అందర్నీ నీతిగా నిజాయితీగా సామరస్యంగా ఉండాలనే బోధించాయి. ఏ మతమయినా ఇదే చెప్పింది. ఇప్పటికీ మనం వాటినే అనుసరిస్తున్నాం. ఇప్పుడు సినిమా కూడా ఒక మతంలా అయిపోయింది. ఏం మాట్లాడాలి? ఏం బట్టలు వేసుకోవాలి? అన్నీ సినిమా చెబుతుంది. సో... అలాంటి మీడియమ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం ఏం చేసినా సోషల్ బెనిఫిట్ ఉండాలి. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్.. ఇలా అన్నింటికీ ఉపయోగపడేలా తీయాలి. ► ‘రంగ మార్తాండ’కి చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్ గురించి? ఒక నటుడు తనని తనెలా అర్థం చేసుకుంటాడు? అనేది ఓ కాన్సెప్ట్లా అనుకుని, వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నాను. రచయిత లక్ష్మీ భూపాల్తో రెగ్యులర్ పాటలా.. మాటాలా వద్దు.. షాయిరీలా చెప్పిద్దాం.. అలా రాయమని అన్నాను. ఇదే మాట ఇళయరాజాగారికి చెబితే ‘నువ్వు రాయించుకుని తీసుకురా చేద్దాం’ అన్నారు. బ్రహ్మాండంగా వచ్చింది. ఈ వాయిస్ ఓవర్ని ఏదైనా పెద్ద యాక్టర్తో చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తట్టినవి రెండే పేర్లు. సీనియర్ ఎన్టీఆర్గారు... చిరంజీవిగారు. చిరంజీవిగారికి ఫోన్ చేస్తే, రమ్మన్నారు. వెళ్లి, వివరించాను. షాయరీ ఐడియా విని ఆయన థ్రిల్లయ్యారు. ‘నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంది’ అన్నారు. ► అన్నం’ సినిమా అనౌన్స్ చేశారు? ‘రంగ మార్తాండ’ తర్వాత అదే చేస్తాను. ‘సింధూరం, ఖడ్గం, మహాత్మ’ ఆ జోన్ ఫిల్మ్ ఇది. ఫుడ్ మాఫియా, వ్యవసాయం, అన్నం, మనిషి తన స్వార్థం కోసం ఆవుల్ని, కోళ్లను ఎలా వాడుకుంటున్నాడు? అనేది కాన్సెప్ట్. ► ‘రంగ మార్తాండ’ సినిమాలో ఒక నటుడు తన రియల్ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడో చూపిస్తున్నారు. మరి.. మీ లైఫ్ని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది? నా అర్హతకి కొన్ని వేల రెట్లు ఎక్కువే ఇచ్చింది ఈ జీవితం. ఇప్పుడు నా మనసిక స్థితి ఎలా ఉందంటే.. ఏం చేసినా అది నేను చేయలేదు. అది (విధి) చేయించింది నాతో. ఎంత కాలం చేయించదలచుకుంటే అంత కాలం చేయిస్తుంది. నేనంటూ ఏం కోరుకోవడం లేదు. మన పుట్టుక మన కంట్రోల్లో లేదు. ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మా ఊరి నుంచి మద్రాస్ తోసింది, అక్కడి నుంచి వర్మగారి దగ్గరకు తోసింది హైదరాబాద్కు. అక్కడ నుంచి దర్శకుడిని అయ్యాను. అన్నీ అలా జరుగుతూ వచ్చేశాయి.. అంతే. ► చాలామంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.. మీకు ఆ ఉద్దేశం లేదా? వచ్చే ఏడాది చేసే ప్లాన్ ఉంది. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు. ► మీ సినిమాల్లో హీరోలతో బ్రహ్మాండంగా నటింపజేశారు. మీ అబ్బాయి రిత్విక్తో సినిమా చేస్తారా? వాడేం అవ్వాలనుకుంటాడో అది వాడి ఇష్టం. కాసేపేమో ఫుట్బాల్ అంటాడు. రేసర్ అంటాడు. యాక్టర్ అంటాడు. ఇప్పుడు టీనేజ్లో ఉన్నాడు కదా. కొత్తది ఏది చూసినా దాని మీదకు ధ్యాస వెళ్లిపోతుంది. ► మీ అబ్బాయి ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవడంలేదు. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు, రమ్యకృష్ణకి బిడ్డ అయ్యాడంటేనే వాడి అదృష్టం మీకు అర్థం అవుతుంది కదా (నవ్వుతూ). – డి.జి. భవాని -
Panchathantram: ఏ రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘పంచతంత్రం’.టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. ‘ఏ.. రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే…ఏ వేగమో.. గతాన్నే స్వా..గతించే పదంలో.. సా..గుతుంటే తమాషా..’అంటూ సాగే ఈ పాటకుప్రశాంత్ ఆర్. విహారి, శ్రవణ్ భరద్వాజ్లు సంగీతం అందించగా, రవి, ప్రశాంత్ ఆర్. విహారి, లక్మీ మేఘన,శ్రీ కావ్య అద్భుతంగా ఆలపించారు. సాంగ్ విడుదల సందర్భంగా నిర్మాతలు సృజన్ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. "ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు,ఫస్ట్ గ్లింప్స్కు ప్రేక్షకుల నుండి పెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వస్తున్న ఏ రాగమో సాంగ్ కూడా అదే స్థాయిలో అలరిస్తుందనే నమ్మకం ఉంది.బ్రహ్మానందం గారు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నారు. వెయ్యి చిత్రాలకు పైగా చేసిన బ్రహ్మానందం గారు మా సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు. -
ఒంటరితనం భయంకరం అంటున్న బ్రహ్మానందం తనయుడు
ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. సుబ్బు చెరుకూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం (మార్చి 2) గౌతమ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ని రిలీజ్ చేశారు. ‘ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా’ అనే డైలాగ్తో గౌతమ్ లుక్ రివీల్ చేశారు. ‘‘ఈ చిత్రంలో గౌతమ్ మోనోఫోబియాతో బాధపడుతున్న రచయిత పాత్రలో కనిపిస్తాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది? అతను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని ఎలా అధిగమించాడు? అనేది థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రస్తుతం మా సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Comedian Brahmanandam Assets, Net Worth: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.. కామెడీకి కేరాఫ్ అడ్రస్. తెరమీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులు విరబూస్తాయి. ఆయన పేరు తలుచుకున్నా సరే పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది.. దటీజ్ బ్రహ్మానందం. తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన బ్రహ్మానందం తనదైన ఎక్స్ప్రెషన్స్తో చక్కిలిగింతలు పెట్టిస్తారు. అందుకే ఈమధ్య ఆయన సినిమాలు తగ్గించినా సోషల్మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటారు. సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఇమేజ్ అసామాన్యమైంది. ఎందుకంటే బ్రహ్మీ లేని మీమ్స్ ఊహించడం కూడా కష్టమే. ఆయన స్టైల్లో చెప్పే డైలాగులు ఇప్పటికీ ఎవర్గ్రీనే. ఇండస్ట్రీలో కామెడీ కింగ్గా సుమారు 1250కి పైగా సినిమాల్లో నటించిన ఆయన 2010 లో గిన్నిస్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నాడు. సినిమా ఎలాంటిదైనా అందులో బ్రహ్మీ మార్క్ ఖచ్చితంగా కనపడుతుంది. అందుకే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో బ్రహ్మానందం కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుదన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిబడి పెట్టిన బ్రహ్మానందం ఆస్తుల విలువ సుమారు రూ.400కోట్ల నుండీ రూ.450 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. -
హాస్యబ్రహ్మ: బ్రహ్మీ ...‘ది హీరో’
హాస్యబ్రహ్మ...నవ్వుల రారాజు.. కామెడీ కింగ్..కామెడీకి బ్రాండ్ అంబాసిడర్.. అసలు ఏ పేరుపెట్టి పిలవాలి? ఆయన కనుబొమ్మ అలా ఎగరేస్తే చాలు ప్రేక్షకుడి పొట్ట చెక్క లవ్వాల్సిందే. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పేరు తలుచుకుంటే చాలు మనం ఏమూడ్లో ఉన్నా చిరునవ్వు ఇట్టే వచ్చేస్తుంది.. దటీజ్ బ్రహ్మానందం. బహుశా అందుకే ఆయనకు చిన్నప్పుడే బ్రహ్మా..నందం అని పేరు పెట్టాశారేమో. టాలీవుడ్కు జంధ్యాల పరిచయం చేసిన తెలుగు మాస్టారు బ్రహ్మానందం బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ వీడియో మీకోసం... కన్నెగంటి బ్రహ్మానందం అనే బ్రహ్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సత్తెనపల్లిలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. విద్యాభ్యాసం తరువాత అత్తిలిలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న ఆయను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు దక్కుతుంది. నటుడిగా బ్రహ్మానందంగా అరంగేట్రం చేసింది, తొలి వేషం వేసిందీ కూడా ఫిబ్రవరి 1వ తేదీనే కావడం విశేషం. నరేష్ హీరోగా నటించిన తాతావతారం మూవీలో నటించారు. ఆ తరువాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఎవరగ్రీన్ క్లాసిక్ ’అహానా పెళ్లంట’ సినిమాలో అరగుండు బ్రహ్మానందంగా పండించిన హాస్యానికి జనం విరగబడి నవ్వారు. జయహో బ్రహ్మానందం అంటూ నవ్వుల రారాజుకి బ్రహ్మరథం పట్టారు. ఇక అది మొదలు తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి..నవ్వించీ కరియర్కు తిరుగులేని బాట వేసుకున్నారు. సినీ దర్శక నిర్మాతలకే కాదు టాప్ హీరోలకు కూడా బ్రహ్మానందం ఫ్యావరేట్గా మారిపోయాడు. అరగుండు, కిల్ బిల్ పాండే, కత్తి రాందాస్, ఖాన్ దాదా, శంకర్ దాదా ఆర్ ఎంపి, నెల్లూరి పెద్దారెడ్డి, గచ్చిబౌలి దివాకర్, లవంగం, భట్టు , మైఖెల్ జాక్సన్, పద్మశ్రీ, ప్రణవ్, జయసూర్య లాంటి పాత్రల్లో ఆయన పండించిన అద్భుతమైన కామెడీ నభూతో నభవిష్యతి. దశాబ్దాలు గడిచినా ఆ పాత్రలు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వులు పువ్వులు విరగబూయాల్సిందే. అలాగే అలనాటి హీరోలు మొదలుమొత్తం మూడు తరాల వారితో కలిసి కామెడీ పండించిన భాగ్యం దక్కిన ఏకైక కమెడియన్ ఆయన. అంతేకాదు బ్రహ్మానందం గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు కూడా. మరోవైపు సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఇమేజ్ అసామాన్యమైంది. సందర్భం ఏదైనా బ్రహ్మానందం ఇమేజ్లేని మీమ్స్ లేవంటే అతిశయోక్తి లేదు. ఆయన పలికించని భావం, రస ఉందా అసలు. బ్రహ్మానందం పలికించిన హావభావాల ప్రాధాన్యత పాపులారిటీ అలాంటి మరిది. జంబలకిడి పంబ, చిత్రం భళారే విచిత్రం, మనీ, వినోదం అనగనగ ఓ రోజు, మన్మధుడు, అతడు, దూకుడు, అదుర్స్, రేసుగుర్రం ఇలా.. జాతిరత్నందాకా ఆయన సినీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ఏకంగా ఐదు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయన విశిష్ట సేవలను గురించిన భారత ప్రభుత్వం 2010లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక ఫిలిమ్ ఫేర్ అవార్డు సైతం అందుకున్నాడు. అలాగే 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించిన బ్రహ్మానందం తనలోని మరో కళా నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. అద్భుత పెన్సిల్ స్కెచ్లతో ఫ్యాన్స్తో ఔరా అనిపించుకుంటున్నారు బ్రహ్మానందం. -
సమంత నన్ను కాపీ కొట్టిందనడం దుర్మార్గం: బ్రహ్మానందం
Brahmanandam About Pushpa Item Song: పుష్ప సినిమా ఎంత హిట్టయ్యిందో అందులోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా..' అనే పాట అంతకంటే పెద్ద హిట్టయ్యింది. ఇక ఈ పాట బయటకు వచ్చిననాటి నుంచి ఎన్నో పేరడీలు, మరెన్నో ఎడిటింగ్ వర్షన్లను రోజుకొకటి చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సాంగ్లో సమంత స్టిల్ ఒకటి ఆ మధ్య బాగా వైరల్ అయింది. మీమ్స్లో బీభత్సంగా వాడే బ్రహ్మానందం స్టిల్ ఒకటి కూడా అచ్చం అలాగే ఉంటుంది. View this post on Instagram A post shared by Unprofessional Trollers (@unprofessional_trollers) దీంతో మీమ్స్రాయుళ్లు 'మా బ్రహ్మానందం స్టైల్ను కాపీ చేయొకండి సామ్.. అంటూ ఓ ఫన్నీ మీమ్ వదలగా అది సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. తాజాగా దీనిపై బ్రహ్మానందం స్పందించాడు. ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన సదరు మీమ్ను చూసి.. 'నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం అలా అన్నాను. దానికి బ్రహ్మీని సమంత కాపీ కొట్టిందనడం ఎంత దుర్మార్గం' అని కౌంటరిచ్చాడు. -
ఎంఎస్ చివరి క్షణాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న బ్రహ్మానందం
Brahmanandam About MS Narayana In Latest Interview: టాలీవుడ్ హాస్య బ్రహ్మ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం. తెలుగు కమెడియన్స్ జాబితాలో ఆయనది అగ్రస్థానం. ఇక ఆయన తర్వాత ఎంఎస్ నారాయణ ఉంటారు. ఒకప్పుడు వీరిద్దరి లేకుండా సినిమాలు ఉండేవే కాదు. అంతగా తమ కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు. ఇక వీరద్దరూ కలిసి చేసిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే 2017లో ఎంఎస్ నారాయణ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వయసు రీత్యా బ్రహ్మానందం కూడా సినిమాలు తగ్గించారు. ఆడపాదడపా సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ టీవీ షోకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు ముఖ్యంగా పరిశ్రమలో తన తమ్ముడిగా చెప్పుకునే ఎంఎస్ నారాయణను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. కాగా ఈ షో హోస్ట్ తెలుగులో మీకు నచ్చిన కమెడియన్ ఎవరని అడగగా.. దానికి ఎంఎస్ నారాయణ అని సమాధానం చెప్పారు. ఇక తనకు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఎంఎస్ అని.. అతడిలో కేవలం కమెడియన్ మాత్రమే కాదు ఒక మంచి విద్యావేత్త ఉన్నాడంటూ ప్రశంసించారు. ఇక ఆయన చనిపోయే ముందు జరిగిన ఓ సన్నివేశం గురించి కూడా గుర్తు చేసుకుని ఆయన ఎమోషనల్ అయ్యారు. ‘హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న ఎంఎస్ నారాయణ తానను తలుచుకున్నారని, ఒక పేపర్పై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని రాసి తన కూతురుకు చూపించారట. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో ఎంఎస్ కూమార్తె తనకు ఫోన్ చేసి విషయం చెప్పిన వెంటనే షూటింగ్ మధ్యలో నుంచే కిమ్స్ హాస్పిటల్కు వెళ్లాను. అక్కడికి వెళ్లాక నా చేతిలో చెయ్యేసి అలా ఒకసారి కిందికి పైకి చూసి పక్కనే ఉన్న తన కొడుకును, నన్ను మరోసారి చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో ఎమ్ఎస్ నారాయణ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. అక్కడే కాసేపు ఉండి ఎంఎస్తో మాట్లాడాను. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన 15-20 నిమిషాల వ్యవధిలోనే ఎంఎస్ చనిపోయారు అనే చేదు వార్త తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటన ఇంకా గుర్తు ఉంది’’ అంటూ బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. కాగా 2017 జనవరి 23న ఎమ్ఎస్ నారాయణ కన్నుమూశారు. -
భీమ్లా నాయక్లో బ్రహ్మానందం.. పోస్టర్ విడుదల
Brahmanandam Look Poster Out From Bheemla Nayak Movie: బ్రహ్మానందం అంటే ఓ చక్కిలిగింతలు. కడుపుబ్బ నవ్వించే కమెడియన్. అనేక చిత్రాల్లో నటించిన ఆయన యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులను నవ్వులు పూయించారు. తెలుగు తెరపై చెరగని చిరునవ్వును శాశ్వతంగా ఉంచిన కామెడి కింగ్లలో బ్రహ్మానందం ఒకరు. ఆయన నటించిన చిత్రాల్లోని సీన్లు, హావభావాలను ఇప్పటికీ మీమ్స్ రూపంలో వాడుతున్నారంటే ఆయన ఎంతలా నవ్వించారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అరకొర చిత్రాల్లో నటిస్తున్న బ్రహ్మానందం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని బ్రహ్మానందం లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో బ్రహ్మీ పోలీసు పాత్రలో నటిస్తున్నారు. బీమ్లా నాయక్లో బ్రహ్మానందం నటిస్తున్నారంటే యాక్షన్, డైలాగ్స్తోపాటు కామెడీ కూడా అదిరిపోద్దనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం నటించడం విశేషంగా మారింది. అయితే బ్రహ్మీ కామెడీ ఏమేరకు పండుద్దో సినిమా విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం జనవరి 12, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు డైలాగ్స్ రాస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషీయమ్' చిత్రానికి ఇది రీమేక్. -
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కొత్త సినిమా ప్రారంభం
విభిన్న కథలతో ప్రేక్షకులకు దగ్గరయిన బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని ఎలా అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సినిమా రూపుదిద్దుకుంటోంది. శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యస్ ఒరిజినల్స్ లో దర్శకుడిగా పరిచయం కాబోతున్న విశ్వ ఈ సినిమాకు ముహూర్తపు క్లాప్నిచ్చారు. -
బ్రహ్మానందంకు నితిన్ షాక్, ఆ మూవీ నుంచి బ్రహ్మీ తొలగింపు!
Comedian Brahmanandam Sacked From Nithiin Movie?: ఒకప్పుడు ఏడాది పొడవునా వరుస పెట్టి సినిమాలు చేసే టాలీవుడ్ హాస్యబ్రహ్మ, ప్రముఖ నటుడు బ్రహ్మానందం కొంతకాలంగా సినిమాల సంఖ్యను తగ్గించాడు. వయస్సు రీత్యా ప్రస్తుతం ఆయన పరిమిత స్థాయిలో సినిమాలకు మాత్రమే టైం కేటాయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్ హీరోగా ఎంఎస్ రాజశేఖర్ దరకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ నుంచి బ్రహ్మానందంను తొలిగించి నితిన్ ఆయనకు షాక్ ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో ఈ వార్త హాట్టాపిక్గా మారింది. నితిన్కు బ్రహ్మీకి మధ్య ఏం జరిగిందని, ఆయనను సినిమా నుంచి తొలగించేంత పెద్ద విషయం ఏం జరిగిందా? అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. దీనికి కారణం ఇదేనంటూ మరో వార్త బయటకు వచ్చింది. ఈ మూవీ షూటింగ్ కోసం మూవీ టీం వైజాగ్ వెళ్లారని, ఈ 10 రోజుల షూటింగ్ షెడ్యూల్కు నితిన్తో పాటు బ్రహ్మానందం కూడా పాల్గొనాల్సి ఉందట. కానీ బ్రహ్మానందం అనుకున్న సమయానికి షూటింగ్కు రాకపోవడం, డైరెక్టర్ చెప్పినట్టు చేయకపోవడంతోనే ఆయనను సినిమా నుంచి తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట. అయితే దీనిపై డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ నుంచి ఎలాంటి కామెంట్ రాలేదు. ఈ సినిమాను నితిన్ తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం తీరుతో విసుగిపోయిన నితిన్ ఆయనను పక్కకు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం ఈ సినిమాకు బ్రహ్మీ ఒక్క రోజుకు 5 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాడట. అంటే 10 రోజులకు రూ. 50 లక్షలన్నమాట. ఈ పారితోషికాన్ని అడ్వాన్స్గానే చెల్లించాడట నితిన్. అయితే పారితోషికం నష్టపోయిన ఫర్వాలేదు కానీ ఆయనను భరించాల్సి అవసరం లేదని మేకర్స్ అభిప్రాయపడ్డంటూ టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే నితిన్ కానీ, మూవీ టీం కానీ ఈ రూమార్స్పై స్పందించే వరకు వేచి చూడాలి. -
కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్
కృష్ణంరాజు దంపతులకు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇటీవల కృష్ణంరాజు తుంటికి శస్త్ర చికిత్స జరిగిన తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం బ్రహానందం కృషంరాజు ఇంటికి వెళ్లారు. ఆయనతో కాసేపు సరదాగా మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం తాను స్ఫెషల్గా గీసిన సాయిబాబా చిత్రపటాన్ని బహుమతిగా అందించారు. ఈ స్పెషల్ సర్ప్రైజ్ వల్ల కృష్ణంరాజు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ‘మన కామెడీ జీనియస్.. ఆర్ట్లోనూ జీనియస్సే. అద్భుతమైన టాలెంట్ కలిగిన మంచి వ్యక్తి మన బ్రహ్మానందం. థ్యాంక్యూ ఫర్ ది స్పెషల్ సర్ప్రైజ్’అంటూ బ్రహ్మానందంతో కలిసి దిగిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేశాడు కృష్ణం రాజు. కాగా, గతంలో అల్లు అర్జున్, రానాలకు కూడా తాను స్వయంగా గీసిన చిత్రపటాలను బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్న బ్రహ్మీ.. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ మూవీలో నటిస్తున్నాడు. The comedy genius is an art genius as well. Such a beautiful person with wonderful talent. Thank you for this sweet surprise. God Bless you #Brahmanandam. pic.twitter.com/MPnWkwpeAY — U.V.Krishnam Raju (@UVKrishnamRaju) October 30, 2021 -
ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ టీజర్
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పంచతంత్రం’. ఎన్నో పంచతంత్ర కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ చిత్రానికి హార్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు మేకర్స్. నటుడు సత్యదేవ్ వాయిస్ ఓవర్తో పంచతంత్ర కథలను బెబుతూ విడుదలైన ఈ టీజర్ ఆసక్తిగా సాగింది. ‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పిన బాహుబలి కథలు.. వినటానికి వచ్చిన వాటికి మైక్ దగ్గర ఓ ముసలి తాబేలు కలిసింది’ అంటూ ప్రారంభమైంది. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్ గుడ్ మూవీగా పంచతంత్రం చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి అఖిలేష్ వర్ధన్, సృజన్లు నిర్మాతలుగా వ్వవహరిస్తున్నారు. -
పంచేంద్రియాల నేపథ్యంలో...
డా. బ్రహ్మానందం, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ముఖ్య తారలుగా ఓ చిత్రం రూపొందనుంది. హర్ష పులిపాక దర్శకుడు. టికెట్ ఫ్యాక్టరీ–ఎస్ ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. సృజన్ ఎరబోలు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో మరో ముగ్గురు స్టార్లు కూడా నటించనున్నారు. 13 రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ఆ తర్వాత విశాఖ, పాండిచ్చేరిలో షెడ్యూల్స్ ప్లాన్ చేశాం. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ మా చిత్రానికి మాటలు రాయడం హ్యాపీ’’ అన్నారు. హర్ష పులిపాక మాట్లాడుతూ– ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు (చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన) చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. యువతరం ఆలోచనలకు అద్దం పట్టేలా కథ, కథనాలు నిజాయతీగా ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, కెమెరా: రాజ్ కె. నల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భువన్ సాలూరు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఉషారెడ్డి వవ్వేటి, రఘురామ్ శ్రీపాద. -
కమెడియన్ కూతురి నిశ్చితార్థంలో తారల సందడి
కమెడియన్ రఘుబాబు కూతురు నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే కదా!. ఆదివారం రాత్రి జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్లోని పలువురు సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. క్రాక్ హీరో రవితేజ, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, గోపీచంద్, డైలాగ్ కింగ్ మోహన్బాబు, కమెడియన్ బ్రహ్మానందం, మంచు లక్ష్మీ, మంచు విష్ణు, అనసూయ భరద్వాజ్, ప్రకాశ్రాజ్, ఉదయభాను, బ్రహ్మాజీ సహా పలువురు తారలు ఈ ఎంగేజ్మెంట్కు విచ్చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక రఘుబాబు సినిమాల విషయానికొస్తే... కేవలం ఎక్స్ప్రెషన్స్తోనే నవ్వించగల ఘనుడాయన. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే టాలెంట్తో తక్కువ కాలంలోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి కమెడియన్గా పేరు తెచ్చుకున్నాడు. పాత్ర డిమాండ్ మేరకు కొన్నిసార్లు విలనిజం ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించాడు. ఈ మధ్యే వచ్చిన జాంబీరెడ్డిలోనూ కనిపించిన రఘుబాబు ప్రస్తుతం ఏ1 ఎక్స్ప్రెస్, సన్ ఆఫ్ ఇండియా, గాలి సంపత్ సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: నెట్టింట్లో సినీతారలు: స్టైల్గా ల్యాండైన లైగర్ అవసరమైతే వేడుకుంటారు.. అవసరానికి వాడుకుంటారు..! -
హాస్య బ్రహ్మ బర్త్డే.. స్టార్ హీరోల విషెస్
-
హాస్య బ్రహ్మ బర్త్డే.. స్టార్ హీరోల విషెస్
హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్ బ్రహ్మానందం నేటితో 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. సోమవారం (ఫిబ్రవరి 1) ఆయన పుట్టిన రోజు సందర్భంగా కామెడీ కింగ్కు పలువురు టాలీవుడ్ ప్రముఖులు నటీనటులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తూ స్టార్ హీరోలు, అభిమానుల నుంచి బర్త్డే విషెస్ వెల్లువెత్తున్నాయి. ‘హ్యాపీ బర్త్డే కామెడీ కింగ్ మీరు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుడి పార్థిస్తున్న’ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేయగా.. రామ్ చరణ్ కూడా ‘వెరీ హ్యాపీ బర్త్డే టూ కామెడీ కింగ్ పద్మశ్రీ బ్రహ్మానందం అంకుల్’ అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. Wishing our king of comedy and most loved Padma Shri. Brahmanandam Uncle a Very Happy Birthday !! #HBDBrahmanandam pic.twitter.com/bd21O2c7fx — Ram Charan (@AlwaysRamCharan) February 1, 2021 అంతేగాకుండా మాస్ మహారాజ రవీతేజ కూడా ట్వీట్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్డే టూ బ్రాహ్మానందం గారు!! మీతో ఉంటే అసలు షూటింగ్లో అలసటే ఉండదు.. ఎప్పుడూ షూటింగ్స్ను సరదగా.. ఆనందంగా చేస్తారు. అందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఎప్పటికీ సంపూర్ణ ఆరోగ్యంతో నవ్వతూ ఉండాలని ఆశిస్తున్న’ అంటూ విష్ చేశాడు. అంతేగాక మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్లతో పాటు పలువురు స్టార్ హీరోహీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు సైతం ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Happy Birthday Brahmanandam garu!! Thank you for always making shoots fun and lively. Sending much love and wishing you all the good health!! 🤗#HBDBrahmanandam pic.twitter.com/qJvXbLIBOP — Ravi Teja (@RaviTeja_offl) February 1, 2021 -
అల్లు అర్జున్కు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్
"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం" అంటుంటారు. ఈ మాటను నమ్మడమే కాదు, సినీ ప్రేక్షకులను నవ్వించడమే తన జీవిత ధ్యేయంగా ముందుకు పోతూ హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. ఆయన నటన గురించి అందరికీ తెలుసు కానీ చిత్ర లేఖనం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ లాక్డౌన్లో ఆయన కాగితం, పెన్సిలు పట్టుకుని గీసిన చిత్రాలు ఎంతగానో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సాహితీ ప్రియుడి కళా నైపుణ్యానికి అభిమానులు మంత్ర ముగ్దులవుతున్నారు. మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు 'ఆంజనేయుని ఆనంద భాష్పాలు' పేరుతో చిత్రం గీశారు. ఆ డ్రాయింగ్ చాలామందిని ఆకట్టుకుంది. (చదవండి: 30 ఏళ్లలోపు పెళ్లి వద్దే వద్దు: నటి) వెలకట్టలేని బహుమతి.. ఇప్పుడు తాజాగా శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కుంచెతో కాగితంపై సాక్షాత్కరించారు. దీన్ని గీయడానికి ఆయనకు 45 రోజుల సమయం పట్టింది. వెంకన్న కరుణా రసం కురిపిస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు బహుమతిగా ఇచ్చారు. స్వహస్తాలతో గీసిన ఈ డ్రాయింగ్స్ చూసి బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు వెలకట్టలేని బహుమతి అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దగ్గుబాటి హీరో రానాకు సైతం వెంకటేశ్వరుని పటాన్ని నూతన సంవత్సర బహుమతిగా అందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రహ్మానందం డ్రాయింగ్ ఫొటోలు వైరల్గా మారాయి. (చదవండి: నలుగురికి ఉపయోగపడదాం: బ్రహ్మానందం) THE MOST PRICELESS GIFT I RECEIVED FROM OUR BELOVED BRAHMANANDAM GARU. 45 DAYS OF WORK . HAND DRAWN PENCIL SKETCH . THANK YOU ❤ #AlluArjun #Pushpa @alluarjun pic.twitter.com/rkqY6D8FEi — TelanganaAlluArjunFC (@TelanganaAAFc) January 1, 2021 Got this beautiful gift from #Brahamanadam Garu!! Thank you and Happy new year sir!! My Tatha would have loved it. ❤️❤️❤️ pic.twitter.com/CZNxgBQUlg — Rana Daggubati (@RanaDaggubati) January 1, 2021 -
సోహైల్కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్
బుల్లితెర ప్రేక్షకులను 106 రోజుల పాటు అలరించిన బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్ మొన్నటి ఆదివారంతో ముగిసింది. నాల్గో సీజన్ విన్నర్గా అభిజిత్ నిలిచినా... అంతకు మించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు సోహైల్. సెకండ్ రన్నరఫ్గా నిలిచినా.. విన్నర్ సాధించినంత ఫ్రైజ్ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్ నిర్ణయం అందరిని ఆకట్టుకుంది. (చదవండి : బిగ్బాస్ : హారిక నా చెల్లి.. అభిజిత్ షాకింగ్ కామెంట్స్) అందులో నుంచి రూ.10 లక్షలు అనాథశ్రయాలకు ఇస్తానంటే.. వద్దని, ఆమొత్తాన్ని నేనే ఇస్తానని నాగార్జున్ చెప్పాడు. ఐదు లక్షలు మిత్రుడు మెహబూబ్కి ఇస్తానంటే.. వద్దొద్దు.. నేనే మెహబూబ్కి పది లక్షలు ఇస్తానని షోకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి చెప్పాడు. దీంతో సోహైల్కు మంచి పేరు రావడంతో పాటు రూ.25లక్షలు దక్కాయి. అంతే కాకుండా తను తీయబోయే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం సోహెల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది ఇలా ఉంటే సోహైల్ను మరో బంపర్ ఆఫర్ వరించింది. ప్రముఖ టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపాడట. ఈ విషయాన్ని సోహైలే స్వయంగా వెల్లడించాడు. ‘బ్రహ్మనందం ఫోన్ చేసి.. సోహైల్ నీ కోసమే బిగ్బాస్ చూశా అన్ని అన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేనే వచ్చి కలుస్తానని చెప్పారు. అలాగే నేను తీయబోయే సినిమాలో ఫ్రీగా నటిస్తానని హామీ ఇచ్చారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి’ అని సోహైల్ చెప్పుకొచ్చాడు ఓ వైపు చిరంజీవి, నాగార్జున అండ, మరోవైపు బ్రహ్మానందం వంటి స్టార్ కమెడీయన్ కూడా సోహెల్కు తోడుగా తన సినిమాలో నటిస్తాననడం సూపర్ అంటున్నారు నెటిజన్స్. ఇలా ఓ కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Telugu Entertainment Page🔥 (@dubcaffehub) -
నలుగురికి ఉపయోగపడదాం
‘‘శరీరంలోని అన్ని అవయవాల్లో కళ్లు చాలా ప్రధానమైనవి. కళ్లతో చూస్తాం.. మాట్లాడతాం. అనంత సృష్టిలో ఉన్న దాన్ని కళ్లతో చూసి ఆనందిస్తాం. అలాంటి ఒక అద్భుతమైన వరాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. మనం మరణించిన తర్వాత మన కళ్లు వృథాగా పోకుండా నేత్రదానం చేసినట్లయితే మన రెండు కళ్లు నలుగురికి ఉపయోగపడతాయి. మరణించిన తర్వాత కూడా బతికుండాలంటే మనం నేత్రదానం చేద్దాం’’ అన్నారు బ్రహ్మానందం. ఇంకా మాట్లాడుతూ –‘‘మనం చనిపోయాక వ్యర్థ పదార్థంలా మట్టిలో కలిసిపోవడం కంటే మనలోని అవయవాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయంటే అంతకంటే కావాల్సింది ఏముంది. ఒక్క గుండె ఉంటేనే సరిపోదు.. కళ్లు కూడా ఎంతో ముఖ్యం. ‘కార్నియా అంధత్వ్ ముక్త్ భారత్ అభ్యాన్’ ద్వారా ‘సాక్షం సేవ’ అనే సంస్థవారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.. ఇందుకు వారికి హ్యాట్సాఫ్’’ అన్నారు బ్రహ్మానందం. -
బ్రహ్మీ మట్టి గణపతి.. ఫ్యాన్స్ ఖుషీ
హాస్య బ్రహ్మగా టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు కమెడియన్ బ్రహ్మానందం. ఆయన లేనిదే సినిమాలో కామెడీ లేదు అనేంత పేరును సంపాదించారు. బ్రహ్మానందం అంటే ఒక ట్రెండ్ సెట్ అనే చెప్పవచ్చు. రెండు దశాబ్దాలకుపైగా వెండితెరపై తనదైన శైలిలో కామెడీని పండించి సినిమాలకు ఒక స్పెషల్ క్రేజ్ను అందించారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి ఓ రికార్డు క్రియేట్ చేశారు. అయితే ఈ మధ్య సినిమాల్లో నటించడం బ్రహ్మనందం తగ్గించేశారు. దీంతో ఇటీవల కాలంలో ఆయన గురించి మాట్లాడుకోవడం తగ్గిపోయింది. (ఆంజనేయుని ఆనందబాష్పాలు) ఈ క్రమంలో తాజాగా ఆయన వార్తల్లో నిలిచారు. శనివారం వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుడిని బ్రహ్మనందం తయారు చేశారు. తమ స్వగృహంలో తన చేతితో మట్టి వినాయకుడిని తయారు చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే పర్యావరణానికి హానీ కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీ గణేశాను పూజించాలని సందేశం ఇస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే వీటిని ముందుగా ఎవరూ పోస్టు చేయారో తెలియదు కానీ.. బ్రహ్మీ అభిమానులు తమ ట్విటర్లో షేర్ చేసేస్తున్నారు.. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘బాలీవుడ్ కంటే సౌత్ యాక్టర్స్ బెటర్.. సాంప్రదాయలకు, పండగలకు విలువిచ్చే వ్యక్తి అని కొనియాడుతున్నారు. రియల్ యాక్టర్ బ్రహ్మనందం. బ్రహ్మ ద క్రియేటర్’ అంటూ పొగిడేస్తున్నారు. (ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ) -
ఆంజనేయుని ఆనందబాష్పాలు
బ్రహ్మానందం నటుడని అందరికీ తెలుసు. సాహితీప్రియుడు అని కొందరికి తెలుసు. ఆయన చిత్రలేఖనం చేస్తారని చాలా కొద్దిమందికి తెలుసు. కరోనా లాక్డౌన్ తర్వాత బ్రహ్మానందం చిత్రకళను సాధన చేస్తున్నారు. సుప్రసిద్ధ చిత్రకారుడు శేషబ్రహ్మంతో ఆయన తన చిత్రాలు పంచుకుంటూ ఆనందం పొందుతున్నారు. బ్రహ్మానందం ఎక్కువగా పెన్సిల్ డ్రాయింగ్స్ సాధన చేస్తున్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం వేసిన మదర్ థెరిసా బొమ్మ ఆ కారుణ్యమూర్తి కరుణను రేఖల్లో పట్టుకోగలిగింది. ఇప్పుడు రామమందిర నిర్మాణ సందర్భం. ఈ సందర్భం రాముడి భక్తులందరికీ ఆనందదాయకం. ఇక అపర భక్తుడైన ఆంజనేయస్వామికి ఆనంద బాష్పాల సమయం కాకుండా ఉంటుందా. అందుకే బ్రహ్మానందం కాగితం, పెన్సిల్ అందుకున్నారు. ‘ఆంజనేయుని ఆనందబాష్పాలు’ పేరుతో ఈ చిత్రం గీశారు. రాముని కోవెలకు ఈ బొమ్మ ఒక భక్తిపూర్వక సమర్పణం అనుకోవచ్చు. -
ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన నివాసంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ 3వ విడతలో భాగం యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించిన ఆయన స్వీకరించారు. ఇందులో భాగంగా మణికొండలోని తన నివాసంలో శనివారం ఉదయం మొక్కలు నాటి, అందుకు సంబంధించిన ఫోటోలను బ్రహ్మానందం షేర్ చేశారు. కాగా తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. (చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్) ఈ ఛాలెంజ్లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, ప్రభాస్, వీవీ వినాయక్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్ స్వీకరించి మరి కొందరికి సవాల్ విసిరారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. (ఎన్టీఆర్కు సుమ గ్రీన్ చాలెంజ్) -
తెలుగు కమెడియన్లూ... మీ నవ్వులు కావాలి
తెలుగువారు హాస్యప్రియులు. కాని ప్రస్తుతం భయం భయంగా నవ్వుతున్నారు. జాగ్రత్తగా నవ్వుతున్నారు. తుమ్ము, దగ్గు రాకుండా చూసుకొని మరీ నవ్వుతున్నారు. కరోనా అలా చేసి పెట్టింది. రోజూ తన వార్తలతో తెలియకుండానే వొత్తిడి తెచ్చి పెడుతోంది. ఆ వొత్తిడిని దూరం చేయాల్సిన బాధ్యత కళాకారులది. ధైర్యం చెప్పాల్సిన సందర్భం కళాకారులది. దేశీయంగా, ప్రాంతీయంగా చాలా రంగాలలోని కళాకారులు తమ ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు కమెడియన్లు ఏదైనా కొత్త ఆలోచన చేయాల్సిన సమయం ఇది.భారతదేశంలోని అమితాబ్, చిరంజీవి, రజనీకాంత్ వంటి సూపర్స్టార్లు ‘ఫ్యామిలీ’ అనే షార్ట్ఫిల్మ్ చేశారు కరోనా ప్రచారం కోసం. ‘ఇంట్లోనే ఉండండి’ అని మెసేజ్ ఇచ్చిన షార్ట్ఫిల్మ్ అది. ఆ తర్వాత సంగీతకారులందరూ ‘సంగీత్సేతు’ అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేశారు. అందరూ ఇళ్లల్లోనే ఉండి తాము పాడదగ్గ పాటలను ట్రాక్లు ప్లే చేస్తూ పాడారు. బాలూ, ఏసుదాస్ దగ్గరి నుంచి కుమార్షాను, ఆశా భోంస్లే వరకూ అందరూ ఇందులో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్ దీనికి యాంకర్గా పని చేశారు. కైలాష్ ఖేర్ ఈ కార్యక్రమంలో మన బాహుబలిలోని ‘దండాలయ్యా దండాలయ్య’ హిందీ వెర్షన్ పాడారు. బాలూ ‘రోజా’లోని ‘నా చెలి రోజావే’ పాడారు. సురేష్ వాడ్కర్ ‘సద్మా’లోని ఇళయరాజా కంపొజిషన్ ‘ఏ జిందగీ గలే లగాలే’ పాడారు. ఏసుదాస్ అదే ‘సద్మా’లోని ‘సుర్మయి అఖియోంమే’ పాడారు. కవితా కృష్ణమూర్తి ‘ప్యార్ హువా చుప్కేసే’ ఆలపించారు. ఇదంతా వారు చేసింది ఇళ్ల పట్టున ఉండి రకరకాల ఆలోచనలు చుట్టుముట్టిన ప్రజలను ఊరడింప చేయడానికే.ఇదే సందర్భంలో తెలుగు టెలివిజన్ ఆర్టిస్టులు కూడా కలిసి ఒక షార్ట్ఫిల్మ్ చేశారు. ‘స్టేహోమ్’ అనే ఈ షార్ట్ఫిల్మ్లో ఎస్.పి.బాలుతో సహా సుజిత, జయలలిత, యమున, జాకీ వీరంతా కలిసి నటించారు. ‘పుట్టడానికి తొమ్మిని నెలలు ఓపిక పట్టావ్.. బతకడానికి కొన్ని రోజులు ఓపిక పట్టలేవా’ అని ఇంట్లో ఉండమని ఈ షార్ట్ఫిల్మ్ మెసేజ్ ఇస్తుంది. ఇక ర్యాప్సాంగ్స్ చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నవారు, మిమిక్రీలు చేసి సందేశాలు ఇస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో కామెడీ స్టార్లు కూడా తమ వంతుగా జనం కోసం ఏదైనా చేస్తే బాగుంటుందని హాస్యప్రియులు ఆశిస్తున్నారు. ఒకరినొకరు కలవకుండా ఇళ్లల్లోనే ఉంటూ ఏదైనా షూట్ చేసి పోస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. నిజానికి అన్ని భాషలలోనే కంటే తెలుగులో హాస్యనటులు ఎక్కువని అందరూ ఆనందపడుతుంటారు. బ్రహ్మానందం, అలీ, రమా ప్రభ, వెన్నెల కిశోర్, కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి, హేమ, పృథ్వి, సప్తగిరి, రాజేష్, ప్రియదర్శి, తాగుబోతు రమేష్, రఘుబాబు, శ్రీనివాస్ రెడ్డి, ధన్రాజ్, సత్య, షకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, మహేశ్ విట్టా... ఇలా ఎందరో ఇప్పుడు అందరికి మల్లే లాక్డౌన్లో ఇళ్లకు పరిమితమయ్యారు. వీరు లాక్ అయినా వీరి ద్వారా కొన్ని నవ్వులు ఔట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, అల్లరి నరేష్, సునీల్ వంటి కామెడీ హీరోస్ కూడా ఏదైనా ఆలోచన చేయవచ్చు. విషాదం కమ్ముకున్న వేళ హాస్యానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. తెలుగు నవ్వులు ఎన్ని వీలైతే అన్ని పకపకలాడాలని కోరుకుందాం. -
కరోనా విరాళం
బ్రహ్మానందం – 3 లక్షలు (’సీసీసీ మనకోసం’కి) చదలవాడ శ్రీనివాస్ – పది లక్షలా పదకొండు వేల నూట పదకొండు రూపాయిలు (’తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి’ కోసం ) తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ – 25 లక్షలు (తెలంగాణ ప్రభుత్వానికి) రాజమౌళి, డీవీవీ దానయ్య – 10 లక్షలు. (‘సీసీసీ మన కోసం’కి). -
కరోనాపై పోరు.. సీసీసీకి బ్రహ్మానందం విరాళం
లాక్డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసిస్ చారిటీ(సీసీసీ) మన కోసం’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థకు పలువురు సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం సీసీసీ ట్రస్ట్కు సాయం అందించేందకు ముందుకు వచ్చారు. సీసీసీకి రూ. 3 లక్షల విరాళం అందజేయనున్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు. కాగా, సీసీసీ సంస్థకు చిరంజీవి చైర్మన్గా ఉండగా.. సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్ శంకర్, సీ కల్యాణ్, దాము సభ్యులుగా ఉన్నారు. సీసీసీ ద్వారా 24 క్రాప్ట్స్లో పనిచేస్తున్న నిరుపేద సినీ కార్మికులకు నిత్యావసరాలు, ఇతర సాయం అందజేస్తున్నారు. -
క్యాన్సర్ రహిత దేశాన్ని నిర్మించుకోవాలి: బ్రహ్మనందం
సాక్షి, తూర్పుగోదావరి : క్యాన్సర్ రహిత భారత దేశాన్ని దూపొందించుకోవాల్సిన అవసరం ఉందని పద్మశ్రీ పురస్కార గ్రహీత, హస్యనటుడు బ్రహ్మనందం తెలిపారు. పిబ్రవరి 4 (మంగళవారం) ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ గురించి అందరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. పొగాకు మన సంస్కృతి కాదని, విదేశీయులకు ఉన్న పొగతాగే అలవాటును మనం నేర్చుకున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో విదేశీ ప్రభావం ఎక్కువ అవడం వల్ల వారి అలవాట్లు బాగా నేర్చుకున్నామన్నారు. మంచి ఆరోగ్యం ఒక వరమని.. అలాంటి వరాన్ని అందరూ పొందాలని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో గుండె, క్యాన్సర్ రోగాలు ఎక్కువగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. -
నటిస్తూ..నవ్విస్తా!
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): తనను ఎంతగానో ఆదరించి సత్కరించిన విశాఖపట్నం ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాను... తాను ఆంధ్రా యూనివర్సిటీలోనే మొదటి నాటకం వేశాను... నేను నమ్మిన వెంకటేశ్వరస్వామి విశాఖవాసులతో ఈ సత్కారం చేయించినట్టు ఉంది... ఇదీ సిరిపురం వీఎంఆర్డీఏ గురజాడ కళాక్షేత్రంలో రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పౌరసత్కారం అందుకున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం స్పందన. తనకు జరిగిన సత్కారం అనంతరం ఆయన మాట్లాడుతూ, బీచ్రోడ్డులో ఊరేగింపు సమయంలో ప్రజల చిరునవ్వు చూస్తే తనకెంతో ఆనందం కలిగిందన్నారు. నేను నటిస్తూ మిమ్మల్ని నవ్విస్తూ నా జీవితం కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. రైటర్స్ అకాడమీ చైర్మన్, సీనియర్ పాత్రికేయుడు వీవీ రమణమూర్తి స్వాగతోపన్యాసం పలుకుతూ సినిమా రంగంలో ఎవరి సపోర్ట్ లేకుండా బ్రహ్మానందం తన నటననే ప్రతిభగా తీర్చిదిద్దుకుని 35 వసంతాల సినీ ప్రస్థానంలో 1154 చిత్రాల్లో నటించారని గుర్తు చేశారు. సినీ కళారంగానికి ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ పౌరసత్కారం చేస్తున్నామన్నారు. ♦ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సాంస్కతిక, సాహిత్య, సేవా రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న ఎంతో మంది ప్రముఖులను రైటర్స్ అకాడమీ జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించడం అభినందనీయమన్నారు. తెలుగువారి గొప్పదనాన్ని చాటిచెప్పిన సినీ హాస్య నటుడు, వక్త, సాహితీవేత్త, రచయిత కన్నెగంటి బ్రహ్మానందం సత్కార కార్యక్రమంలో ఎందరో ప్రముఖులు సైతం భాగస్వాములు కావడం ఆనందదాయకంగా ఉందన్నారు. మంచి సంగీతం, హాస్యం జీవితంలో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. అటువంటి హాస్యాన్ని అందరికి పంచి పెట్టే విధంగా బ్రహ్మానందం కృషి మరువలేనదన్నారు. చరిత్రలో కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, భమిడిపాటి రాధాకృష్ణ, ఆదివిష్ణు తరం తర్వాత కూడా హాస్యానికి ప్రాముఖ్యత పెరిగిందన్నారు. మైసూరులోని గణపతి ఆశ్రమంలో మ్యూజిక్ థెరపీ ద్వారా పలు రోగాలను తగ్గిస్తున్నారని, హాస్యానికి అంత ప్రాధాన్యం ఉందన్నారు. ఆ సంస్థలో ఒక్క రోజైనా తమ కార్యక్రమం నిర్వహించాలని ఎంతో మంది కళాకారులు కలలు కంటారని పేర్కొన్నారు. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు అక్కడ హాస్యథెరపీ ద్వారా చికిత్స అందిస్తున్న విషయాన్ని స్వయంగా చూశానన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నటుడు రేలంగి, అల్లు రామలింగయ్యల తరువాత అంతటి ఖ్యాతి గడించిన బ్రహ్మానందం 1154 చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారని వివరించారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ సినిమా రంగంలో హాస్యనటుడు బ్రహ్మానందం తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకున్నారన్నారు. ఆంధ్రాయూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని కోరారు. విశాఖలో ఎన్నెన్నో అందమైన లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. హాస్యనటుడు బ్రహ్మానందం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ముందుకొస్తే ఏయూలో ఓ భవనం సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ శివశంకర్ తదితరులుపాల్గొన్నారు. తెలుగు ప్రముఖులు రాసిన వ్యాసాల సంపుటిని ఆవిష్కరిస్తున్న ప్రముఖులు ఘనంగా పౌర సత్కారం... ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందానికి ఘనంగా పౌరసత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖులు, అతిథుల చేతులమీదుగా రైటర్స్ అకాడమీ తరఫున జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. వెండికిరీటం, బంగారు పుష్పాలతో సత్కరించారు. ఈ సందర్భంగా 35 మంది తెలుగు ప్రముఖులు రాసిన వ్యాసాల సంపుటిని విడుదల చేశారు. సాగర తీరంలోప్రత్యేకంగా అలంకరించినగుర్రపుబగ్గిపై అభివాదంచేస్తున్న హాస్యనటుడు బ్రహ్మానందం అట్టహాసంగా ఊరేగింపు... అంతకుముందు ఆర్కేబీచ్రోడ్డులోని నేవీ స్మారక స్థూపం నుంచి గురజాడ కళాక్షేత్రం వరకూ ‘బ్రహ్మరథం’ పేరిట ఉత్తరాంధ్ర సాంస్కృతిక కళారూపాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ఉత్తరాంధ్రకు చెందిన తప్పెటగుళ్లు, కోలాటం, పులివేషాలు, డప్పు విన్యాసాలు, చెక్కభజన, బొమ్మల డ్యాన్సులు, మత్స్యకార నృత్యాలు మొదలైన కార్యక్రమాలు హైలెట్గా నిలిచాయి. దారి పొడుగునా బ్రహ్మానందం ప్రజలకు అభివాదం చేశారు. -
హాస్యనటుడు బ్రహ్మనందానికి ఘనంగా సన్మానం
-
బ్రహ్మానందం సినీప్రస్ధానం మొదలై 35ఏళ్లు
-
‘ఈ రోజు నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపింది’
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని హాస్యనటుడు బ్రహ్మానందం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో ఎంతో విషాదాన్ని నిపిందని.. అది తలుచుకుంటేనే మాటలు రావడం లేదన్నారు. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని ఆమె అన్నారు. ఎన్టీఆర్పై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం అందుకుంటున్న బ్రహ్మానందానికి లక్ష్మీ పార్వతీ అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని అందుకున్న అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని, ఎన్టీఆర్ లలిత కళా పురస్కారానికి తనను ఎంపిక చేశారని తెలిసినప్పుడు భయం వేసిందన్నారు. ఎన్టీఆర్తో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ పార్వతికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్నటీ జమున మాట్లాడుతూ.. ఎన్టీఆర్కు సంతానం ఉన్నా వారు చేయాల్సిన కార్యక్రమాన్ని లక్ష్మీ పార్వతి నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఎన్టీఆర్ లలితకళా పురస్కారం అందుకున్న బ్రహ్మానందంకు ఆమె అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉండి.. ఎన్టీఆర్పై తనకున్న పతిభక్తిని చాటుకున్న లక్ష్మీ పార్వతి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. ఎన్టీఆర్ ఓ నటచక్రవర్తి అని, ఆయన పక్కన నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఓ మహానుభావుడని.. కృష్ణుడు సత్యభామ అంటే ఎన్టీఆర్, తానే గుర్తుకు వచ్చేలా నటించామన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. బ్రహ్మానందంకు ఈ అవార్డు ఇవ్వడం తామందరికి గర్వకారణమని అన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా ఎంత గొప్పవారో సీఎంగా కూడా అంతే గొప్పవారని గుర్తు చేశారు. ఎంతో మంది నటుల్ని ఎన్టీఆర్ ప్రోత్సహించారని తెలిపారు. మనుషులు ఎంతో మంది ఉంటారు కానీ, తోటివారి బాగుకోరుకునే కొద్దిమంది మంచివారిలో ఎన్టీఆర్ ఒకరని రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ ఓ దైవాంశ సంభూతుడని.. ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ ఈ అవార్డును బ్రహ్మానందం అందుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాష పట్ల ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని చెప్పారు. లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మీ పార్వతి అని ఆర్టీఏ మాజీ కమీషనర్ విజయబాబు అన్నారు. పార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందకు ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో నేడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా బ్రహ్మానందం ఉండాల్సిందేనని.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని విజయబాబు కొనియాడారు. -
నటుడు అలీ దంపతులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్ : సినీనటుడు అలీ అద్భుతమైన కళాకారుడని, విలువలుగ వ్యక్కి అని ప్రముఖ హాస్య నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం కితాబిచ్చారు. ఎస్ఆర్ఆర్ ఫార్చూన్ ఇన్ఫ్రా సౌజన్యంతో పద్మ మోహన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో అలీ, జుబేదా దంపతులకు ‘పద్మ మోహన స్వర్ణ కంకణం, విశిష్ట దంపతులు, జీవిత సాఫల్య పురస్కారాన్ని’ గురువారం రవీంద్రభారతిలో ప్రధానం చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. సామాన్యంగా కొన్ని వంద సినిమాలు చూడడమే కష్టమని.. అలాంటిది కొన్ని వందల సినిమాల్లో నటించడం అలీకే చెల్లిందన్నారు. అలీ మాట్లాడుతూ.. ‘సినీ పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పలు భాషలలో 11 వందల సినిమాలలో నటించాను. త్వరలో దబాంగ్–3, హాలీవుడ్ చిత్రం గోల్డెన్ బర్డ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి’ అని పేర్కొన్నారు. కాగా వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులకు ఇదే వేదికపై పద్మ మోహన అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
‘ఎమోషనల్ క్యారెక్టర్ చేశా.. ఆ సినిమా చూడండి’
బాలీవుడ్లో పలు హిట్ చిత్రాలు తీసిన బొకాడియా ‘నమస్తే నేస్తమా’ అనే సినిమా ద్వారా తెలుగులో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. గతంలో ఆయన నిర్మాణంలో బ్లాక్బస్టర్హిట్ సాధించిన ‘తేరి మెహర్భానియా’ సినిమా స్ఫూర్తితో వస్తోన్నఈ మూవీని తెరకెక్కించారు. ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీరామ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రెండు కుక్కలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నాయి. ఈ చిత్రానికి బప్పిలహరి, చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలోని తన పాత్ర గురించి నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘కెసి బొకాడియా నిర్మించి తొలిసారి తెలుగులో దర్శకత్వం వహించిన సినిమా ‘నమస్తే నేస్తమా’. ఈ సినిమాలో నేను హాస్యమే కాకుండా కొంచెం ఎమోషనల్గా ఉండే క్యారెక్టర్ చేశాను. నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన క్యారెక్టర్. బొకాడియా నిర్మాతగా చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయనతో సినిమా చేస్తున్నపుడు ఏ రకమైన టెన్షన్ లేకుండా ఎంతో హ్యాపీగా తనకు కావాల్సినటువంటి రీతిలో ఆర్టిస్టుల నుండి కావాల్సిన పెర్ఫామెన్స్ రాబట్టుకుని అద్భుతమైన సినిమా నిర్మించారు. నమస్తే నేస్తమా సినిమా థియేటర్లో చూడండి. పర్టిక్యులర్గా నా క్యారెక్టర్ బాగుంటుందని మీకు చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని బ్రహ్మానందం అన్నారు. -
అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమాలు చేయాలనుంది
‘‘మా నాన్నగారు ఒక్క సినిమా చూసింది లేదు. అలాంటి కుటుంబం నుంచి వచ్చి బోంబేలో పోటీని తట్టుకుని సంజీవ్ కుమార్తో ‘రివాజ్’ సినిమా నిర్మించాను. మా నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో హిట్ చిత్రాలే ఎక్కువ. ఇప్పుడు తెలుగులో తొలిసారి సినిమా చేస్తున్నాను. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత బొకాడియా. బాలీవుడ్లో పలు హిట్ చిత్రాలు తీసిన బొకాడియా ‘నమస్తే నేస్తమా’ అనే సినిమా ద్వారా తెలుగులో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈషానియ మహేశ్వరి, నాజర్, బ్రహ్మానందం, షాయాజీ షిండే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ అతిథి పాత్రలో నటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కేసీ బొకాడియా మాట్లాడుతూ – ‘‘నేను ఎవరి దగ్గరా సహాయ దర్శకుడిగా పని చేయలేదు. తమిళ దర్శకుడు మణివన్నన్తో అర్ధగంట సంభాషించి సినిమాలు తీయడం ప్రారంభించాను. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అక్షయ్కుమార్, అజయ్ దేవగన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్లతో సినిమాలు చేశాను. నేను తీసిన ‘తేరీ మెహర్భానియా’ సినిమా స్ఫూర్తితో ‘నమస్తే నేస్తమా’ సినిమా తీశాను. రెండు కుక్కలు ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తీశాం. భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ భాషల్లో సినిమా తీయాలన్నది నా లక్ష్యం’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. స్టార్స్ని పరిచయం చేసిన బొకాడియాగారి సినిమాలో నటించడం హ్యాపీ’’ అన్నారు ఈషానియ. ‘ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. ‘తేరి మెహర్భానియా’కి ఇది పార్ట్ 2’’ అన్నారు సమర్పకులు గౌతమ్ చంద్. నటుడు తాగుబోతు రమేశ్, ఫైట్ మాస్టర్ బి.జె శ్రీధర్ మాట్లాడారు. -
బ్రహ్మానందం, స్నేహ ఉల్లాల్ ప్రచారం
సాక్షి, షోలాపూర్: తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలంటు కోరారు. శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే వరకు అనేక మంది తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో అక్టోబరు 21వ తేదీ సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు నటుడైన మాజీ మంత్రి బాబు మోహన్, నిజమాబాదు ఎంపి ధర్మపురి అరవింద్, ధరం గురువా రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డిలతోపాటు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, హస్య నటుడు బ్రహ్మానందం, సీతారాం ఏచూరి తదితర నాయకులు గత కొన్ని రోజులుగా ప్రచారం చేశారు. బై, భివండీలతోపాటు పశ్చిమ మహారాష్ట్రలని షోలాపూర్, పుణే మొదలగు ప్రాంతాలపై వీరు ప్రత్యేక శ్రద్ద చూపించారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలిగిందని చెప్పవచ్చు. ఫ్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలన్ని దాదాపు తెలుగులోనే దర్శనమిస్తున్నాయి. మహేశ్ కోటెకు మద్దతుగా బ్రహ్మానందం, స్నేహా ఉల్లాస్ షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న శివసేన తిరుగుబాటు ఇండిపెండెంట్ అభ్యర్ధి మహేశ్ కోటేకు మద్దతుగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, నటీ స్నేహా ఉల్లాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం వీరిద్దరు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 70 ఫీట్ల రోడ్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో తుకారాం చౌక్, అశోక్ చౌక్, పద్మశాలి చౌక్, మౌలాలి చౌక్, సివిల్ కోర్టు మీదుగా సాగింది. సినీ నటీ నటులను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇండిపెండెంట్గా పోటీచేస్తున్న మన తెలుగు అభ్యర్ధి మహేశ్ కోటేను గెలిపించాలని ఇరువురు కోరారు. ముగిసిన ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వాడివేడిగా సాగిన ప్రచారపర్వం నిన్నటితో ’(శనివారం)తో ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ప్రచారాలు ముగిశాయి. అక్టోబరు 21వ తేదీ జరగనున్న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 8,97,62,706 మంది ఓటర్లున్నారు. ఇతర ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95, 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 1.8 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు. ఈ సారి సుమారు 13 రోజులు మాత్రమే ప్రచారాలకు సమయం లభించింది. బహుముఖ పోటీ? రాష్ట్రంలో నియోజకవర్గాలన్నింటిలో త్రిముఖ, బహుముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత సంవత్సరం ఒంటరిగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలు, శివసేన, బీజేపీల కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు వంచిత్ బహుజన్ ఆఘాడి, ఎమ్మెన్నెస్, ఎంఐఎం, ఎస్పీ, బీఎస్పీలతోపాటు ఇతర స్థానిక పార్టీలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీ ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీల కూటమి, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమిల మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. హామీల వర్షం.. అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన వివిధ పార్టీల మేనిఫేస్టోలలో హామీల వర్షం కురిపిచాయి. అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర వీర్ సావర్కర్కు భారతరత్న అవార్డు ఇవ్వనుండటంతో మరాఠ్వాడా కోసం వాటర్ గ్రిడ్ ఇతర మౌళిక సదుపాయాలు, రూ. 10కే భోజనం, రూ. 1 కే వైద్యకీయ పరీక్షలు మౌళిక సదుపాయాలు, సొంత ఇళ్లు, విద్యుత్ సమస్య, రైతుల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం తదితరాలు మేనిఫేస్టోలలో పొందుపరిచారు. పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ? రాష్ట్రంలో అత్యధిక సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికలకు ముందు చేసిన సర్వేలన్ని కూడా ఇవే చెబుతున్నాయి. గత కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతమైంది. లోకసభ ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నిండింది. దీంతో ఈసారి బీజేపీ మనోబలంపెరిగింది. మరోవైపు శివసేన రెండవ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని కొందరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఈ సారి నాలుగో స్థానంలో నిలువగా ఎన్సీపీ రెండో స్థానంలో నిలుస్తుందని అంచనాలు వేశాయి. ప్రచారం చేసిన ప్రముఖులు.. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ప్రచారం చేశారు. ప్రముఖ పార్టీల జాతీయ నాయకులు ప్రచార సభలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ తదితర అనేక మంది పాల్గొన్న సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే వీరందరు ఓట్లు ఎవరికి వేస్తారనేది వేచిచూడాల్సిందే. ఈ సారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కోసం కాంగ్రెస్ జాతీయ నాయకులు దూరంగా ఉండటం అందరినీ విస్మయం కలిగించింది. రాహుల్ గాంధీ ముంబైలో ఒక సభలో పాల్గొన్నప్పటికీ సోనియాగాంధీ, ప్రియంకా గాంధీలు మాత్రం ఎక్కడా కానరాలేదు. ప్రచారానికి వారిద్దరు దూరం ఉండటం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో దివంగత బాల్ ఠాక్రే మనుమడైన యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా ఆయన పోటీ చేస్తుండటం ఈ ఎన్నికల విశేషం. భారీ వర్షంలో శరద్ పవార్ సభ... సాతారాలో భారీ వర్షంలో కూడా ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ సభ కొనసాగించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. సుమారు 80 ఏళ్ల వయసులో కూడా ఆయన వర్షంలోను ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాతారాలో శుక్రవారం రాత్రి సభలో శరద్ పవార్ ప్రసంగం ప్రారంభించగానే భారీ వర్షం ప్రారంభమైంది. అయితే అనేక మంది వర్షం కారణంగా సభలను రద్దు చేసుకోగా శరద్ పవార్ మాత్రం భారీ వర్షంలోనే సభ కొనసాగించారు. దీనిపై యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే స్పందించారు. తన తాత దివంగత బాల్ ఠాక్రే మిత్రులైన శరద్ పవార్ నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉందన్నారు. మరోవైపు ఉక్కులాంటి నేతృత్వం మాకు లభించిందని అజిత్ పవార్ను కొనియాడారు. -
కమెడియన్ల పిల్లలు కమెడియన్లు కాదు...
కమెడియన్ గౌతంరాజ్ నిర్మాతగా ఆయన కుమారుడు కృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘కృష్ణారావు సూపర్ మార్కెట్’. శ్రీనాథ్ పులకరం దర్శకుడు. ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్బంగా చిత్రం బిగ్ సీడీని అనిల్ రావిపూడి, ట్రైలర్ను బ్రహ్మానందం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అంబికా కృష్ణ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ‘మా’ అధ్యక్షుడు వి.కే. నరేశ్లతో పాటు తనికెళ్లభరణి, బెనర్జీ, కృష్ణభగవాన్, శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు, అలీ, రాజీవ్ కనకాల, తదితరులు పాల్గొన్నారు. నరేశ్ మాట్లాడుతూ– ‘‘గౌతమ్ 400 సినిమాలకు పైగా నటించారు. నాకు 30 ఏళ్లుగా మంచి స్నేహితుడు. అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న గౌతంరాజు నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘హాస్య కుటుంబం నుండి వచ్చిన పిల్లలు హాస్యానికే పరిమితం అనుకుంటారు. అది నిజం కాదు అని నిరూపించుకోవటానికే కృష్ణ మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు. గౌతంరాజు మాట్లాడుతూ– ‘‘నా మీద అభిమానంతో ఇంతమంది ఇక్కడికొచ్చి నా కొడుకును ఆశీర్వదించారు. ఇంతమంచి చిత్రాన్ని తీసిన దర్శకుడు శ్రీనా«థ్ పులకరంకి థ్యాంక్స్’’ అన్నారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ చిత్రమిది’’ అన్నారు. -
ఘనంగా జాషువా జయంతి
-
ఏపీ సీఎంవోలో గుర్రం జాషువా జయంతి వేడుకలు
సాక్షి, విజయవాడ : గుర్రం జాషువా 124వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరై గుర్రం జాషువాకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాహితివేత్తలు కత్తి పద్మారావు, బోయి హైమావతి, గుజ్జర్లమూడి కృపాచారి, చందు సుబ్బారావులకు పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. జాషువా రచనలను వారు ప్రస్తుతించారు. ఆయన సామాజిక చైతన్యం కోసం నడుం కట్టి నేటి తరం కవులకు ఆదర్శప్రాయంగా నిలిచారని వక్తలు ప్రశంసించారు. దళిత సాహిత్యం, చైతన్య వంతమైన సాహిత్యానికి జాషువా పెట్టింది పేరని వారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు. భగత్సింగ్కు నివాళుర్పించిన జగన్.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘నేడు నిజమైన హీరో జన్మించిన రోజు.. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటీకి మరవలేనివి, అలోచనలకు మరణం లేదని నిరుపించిన వ్యక్తి భగత్ సింగ్ ఆయనకు నా ఘన నివాళి’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మా సైన్మాని సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు
‘‘మా బాబాయ్కి (పవన్ కల్యాణ్) ‘గబ్బర్సింగ్’ వంటి పెద్ద హిట్ ఇచ్చిన హరీష్ శంకర్గారు నా కోసం కథ తీసుకువస్తారనుకోలేదు. మా ఇద్దరికీ సినిమా తప్ప వేరే ఏదీ తెలీదు. హరీష్ ఏదైనా సినిమా కోసమే చేస్తారు. అందుకే నేను తనకు పర్సనల్గా కనెక్ట్ అయ్యాను’’ అని వరుణ్ తేజ్ అన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘మా ‘గద్దలకొండ గణేష్’ సైన్మాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఈ సినిమా టైటిల్ మార్చాలన్నప్పుడు చరణ్ అన్న ఇంటికి వెళ్లాను. అక్కడ చరణ్ అన్న, తారక్ కలిసి కాఫీ తాగుతున్నారు. ఆ రోజు నా ఒత్తిడిని తగ్గించిన వారిద్దరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘రెండు రోజుల్లో 50 శాతం, మూడో రోజుకి 70–75శాతం వరకూ అమౌంట్ వెనక్కి వచ్చింది’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘బ్రహ్మానందంగారి సినిమాలు చూడడం మాకు వరం. ఆయన్ని డైరెక్ట్ చేయడం గర్వకారణం. ఈ సినిమా ‘వాల్మీకి’ అనే టైటిల్తో మొదలైంది. అందుకే ఈ చిత్రం ఘన విజయాన్ని వాల్మీకి మహర్షికి అంకితం ఇస్తున్నా’’ అన్నారు హరీష్ శంకర్. నటి పూజా హెగ్డే, మృణాళిని రవి, నటుడు బ్రహ్మానందం, నటి డింపుల్ హయాతి, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్, పాటల రచయిత భాస్కరభట్ల, లైన్ ప్రొడ్యూసర్ హరీష్ కట్టా తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మీ @ పుంబా అలీ @ టీమోన్
డిస్నీ ఇండియా వారు తాజాగా విడుదల చేస్తున్న చిత్రం ‘లయన్ కింగ్’. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన సింహం పేరు సింబ. ఈ ‘లయన్ కింగ్’ కథకి సింబనే హీరో. టీమోన్ అనే ముంగిస, పుంబా అనే అడివి పంది కూడా ‘లయన్ కింగ్’ కథలో ముఖ్య పాత్రలు. ప్రపంచంలోని అన్ని ముఖ్యభాషల్లో జూలై 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘లయన్ కింగ్’ లో కీలక పాత్ర అయిన ముసాఫాకు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ముసాఫా తనయుడు, సినిమాకు హీరో అయిన సింబాకు షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్లో పుంబా పాత్రకు బ్రహ్మానందం, టీమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘లయన్ కింగ్’ చిత్రం తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. -
నార్త్లో సౌత్ నవ్వులు
బ్రహ్మానందం, సునీల్ తెలుగు ప్రేక్షకులను కొన్నేళ్లుగా నవ్విస్తున్నారు. ఈ ఇద్దరూ సీన్లో ఉంటే పంచ్లు, సెటైర్లు పేలుతూనే ఉంటాయి. లేటెస్ట్గా వీళ్లిద్దరూ బాలీవుడ్ ఆడియన్స్నూ నవ్వించడానికి ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కబోతున్నారని తెలిసింది. సన్నీ లియోన్, మందాన కరిమి ముఖ్య పాత్రల్లో ప్రసాద్ తాటికేని దర్శకత్వంలో ఓ హారర్–కామెడీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మహేంద్ర దరివాల్, పరమదీప్ సాందు నిర్మాతలు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో బ్రహ్మానందం, సునీల్ నటిస్తే బావుంటుందని భావించిన చిత్రబృందం వీళ్లను ఎంపిక చేసిందట. వచ్చే నెలలో బ్రహ్మానందం షూట్లో జాయిన్ కాబోతున్నారు. సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తిచేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. సో.. వీరిద్దరూ నార్త్ ఆడియన్స్నూ నవ్వుల్లో ముంచేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. -
ఆయనను చూసే ఇండస్ట్రీలోకి వచ్చాను : చిరంజీవి
తెలుగు తెరపై చెరిగిపోని నటుడు ఎస్వీరంగారావు.. శత జయంతి సందర్భంగా ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను ‘మహా నటుడు’ పేరుతో ఫొటో బయోగ్రఫీగా రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకాగా.. తమ్మారెడ్డి భరద్వాజ, బ్రహ్మానందం, తణికెళ్ల భరణి లాంటి ప్రముఖులు విచ్చేశారు. మహానటుడు ఎస్వీ రంగారావును చూసే తాను సినీ పరిశ్రమలోకి వచ్చానని చిరంజీవి అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘నేను గొప్పగా ఆరాధించే రంగారావు గారి పుస్తకం నేను రిలీజ్ చేయడం నా పూర్వ జన్మ సుకృతం. మా నాన్న గారికి రంగారావు అంటే ఎంతో అభిమానం. ఆయన రంగారావుతో సినిమా చేశారు. ఇంటికి వచ్చి రంగారావు గురించి గొప్పగా చెప్పేవారు అప్పటి నుంచి ఆయన అన్నా, నటన అన్నా నా ఒంట్లో బీజం పడింది. రామ్చరణ్ ఇండస్ట్రీలోకి రావాలని చెప్పగానే రంగారావు గారి సినిమాలు చూడమని సలహా ఇచ్చాను’ అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. మహానటుడు ఎస్వీ రంగారావు గారి మీద సంజయ్ కిషోర్ పుస్తకం రాశారు.. అలాగే చిరంజీవి మీద కూడా పుస్తకం రాయాలని ఆయనను కోరారు. సంజయ్ ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నారని, ఎంతో బాధ్యతగా, సంతోషంగా చిరంజీవిపై పుస్తకాన్ని రాస్తానని సంజయ్ కిషోర్ అన్నట్లు తెలిపారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటువంటి పుస్తకాలు తరువాతి తరానికి అవసరమని అన్నారు. ఇలాంటి పుస్తకాలను చిరంజీవి లాంటి వ్యక్తి విడుదల చేస్తేనే విలువ ఉంటుందని అన్నారు. చిరంజీవిని ఇండస్ట్రీ గురించి పట్టించుకోవాలని అడిగానని, ఆయన కొన్ని విన్నారని, కొన్ని చేశారని, మరికొన్ని సమస్యలు మీద వేసుకున్నారని అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. వ్యక్తి బతికి ఉండగా పట్టించుకోని వారున్న ఈ రోజుల్లో.. 45ఏళ్ల తరువాత రంగారావు గారి పుస్తకం రాయడమంటేనే ఆయన విలువ తెలుస్తోందని అన్నారు. -
తెలుగు హాస్యం
కథలో అయినా, సినిమాలో అయినా హాస్య రసం లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. తెలుగు సినిమా చరిత్రలో ఎందరో గొప్ప హాస్యనటులు ఉన్నారు. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రేక్షకులకు కితకితలు పెట్టి నవ్వించారు... నవ్విస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని హాస్య నటులపై రచయిత యడవల్లి ‘తెలుగు చలన చిత్రాల్లో హాస్యం’ (50 సంవత్సరాల పరిశీలన) అనే పుస్తకాన్ని రచించారు. ప్రముఖ హాస్యనటులు, పద్మశ్రీ పురస్కారగ్రహీత డాక్టర్ బ్రహ్మానందం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం బ్రçహ్మానందం స్వగృహంలో ఈ కార్యక్రమం జరిగింది. మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ వంశీరామరాజు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. -
బ్రహ్మానందాన్ని పరామర్శించిన అల్లు అర్జున్
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో గత నెల 14న ఆయనకు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించారు. ఆయన మునుపటి లా చురుక్కా సినిమాలు చేయాలని, మరింత కాలం మనల్ని నవ్వించాలని ఆయన ఆకాంక్షించారు. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ లుక్లో కనిపించనున్నాడు. Real Iron Man . Man with a strong heart . Funny & Fearless . Soo happy to see my Kill Bill Pandey killing it . 😘❤️ pic.twitter.com/1bYygm84OL — Allu Arjun (@alluarjun) 7 February 2019 -
నాన్నగారి ఆరోగ్యం బాగుంది
ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందంకు గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఆస్పత్రిలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కలవరపడ్డారు. అయితే బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ ఆయన తనయుడు, హీరో రాజా గౌతమ్ తెలిపారు. ‘‘కొన్ని నెలలుగా నాన్నగారికి ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారు. వారి సలహా మేరకు ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టి్టట్యూట్’ లో సోమవారం (14.1.20 19 ) గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. శ్రీ రమాకాంత్ పాండాగారు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చాం. నాన్నగారి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమలోని ప్రముఖుల ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు రాజా గౌతమ్. కాగా బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థ్లు ప్రస్తుతం తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. -
నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది : హీరో గౌతమ్
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలో కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తనయుడు, హీరో గౌతమ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ‘కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారు బ్రహ్మానందం. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించు కోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్’లో సోమవారం (14.1.19) నాడు గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ వైద్య నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా, బ్రహ్మానందం గారికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చటం జరిగింది’ అని తెలిపారు. ‘నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయటం మొదలు పెట్టారు. అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది, వారందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. -
నిలకడగా బ్రహ్మానందం ఆరోగ్యం
‘అహ నా పెళ్ళంట!’ (1985) సినిమాతో వస్తూనే తెలుగు తెరౖపై నవ్వులు పూయించారు హాస్యనటులు బ్రహ్మానందం. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నారు. దాదాపు వెయ్యిచిత్రాలు చేసిన బ్రహ్మానందం ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా నటుడిగా ఫామ్లో ఉన్నారు. ఇటీవలే ‘గ్రేట్ తెలుగు లాఫ్టర్ చాలెంజ్’ షోతో బుల్లితెర ప్రేక్షకులను కూడా పలకరించారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెలో నొప్పి అనిపించడంతో హైదరాబాద్లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారట బ్రహ్మానందం. శస్త్రచికిత్స ఇక్కడ చేయించుకుంటే అభిమానుల రాకపోకలు, వారి ఆందోళనతో ఇబ్బందిగా ఉంటుందని భావించిన ఆయన ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నేడు ఐసీయు నుంచి సాధారణ గదికి మారనున్నారు. ‘‘ఆదివారం ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో బ్రహ్మానందంగారిని ఆస్పత్రిలో జాయిన్ చేశాం. ఆయనకు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది’’ అని బ్రహ్మానందం కుటుంబ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. -
హాస్యనటుడు బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ!
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. గత ఆదివారం అనారోగ్యంతో ముంబైలోని ఏషియన్ హర్ట్ ఇన్స్టిట్యూట్లో చేరిన ఆయనకు సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. డాక్టర్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆయన కుమారులు గౌతమ్, సిద్ధార్థ్లతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి హాస్యలోకపు రారాజుగా వెలుగొందిన బ్రహ్మానందంకు ఇటీవల సినిమాలు తగ్గాయి. -
క్రిస్మస్కి భయపెడతారు
‘గీతాంజలి’ ఫేమ్ అంజలి లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘లిసా’. బ్రహ్మానందం, సామ్ జోన్స్, మకరంద్ దేశ్పాండే, సలీమా, సబితా రాయ్, సురేఖ వాణి, కల్యాణి నటరాజన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో పీజీ మీడియా వర్క్స్ సమర్పణలో పి.జి.ముత్తయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో పూర్తయింది. రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘100 రోజులకు పైగా ‘లిసా’ షూటింగ్ జరిగింది. ఒక సినిమా షూటింగ్ ఎంత కష్టమో తెలిసిందే. ఇక త్రీడీలో అయితే మరింత కష్టమైన పని. కానీ, పీజీ ముత్తయ్యగారి కష్టం వల్ల సజావుగా పూర్తయింది. తన పాత్రకి న్యాయం చేశారు అంజలి. నటి సలీమాగారు రెండు దశాబ్దాల తర్వాత మా చిత్రంలో నటించారు’’ అన్నారు. ‘‘లిసా’ చిత్రానికి నేను నిర్మాతగా, సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించాను. ఇండియాలో ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ మూవీగా హీలియం 8కే కెమెరాతో చిత్రీకరించాం. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని ముత్తయ్య అన్నారు. ‘‘మొదటిసారి 3డీ చిత్రంలో నటించా. రాజు విశ్వనాథ్ వంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. ముత్తయ్య ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు అంజలి. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ దయానిధి. -
హాస్యం ఎక్కాల పుస్తకం కాకూడదు
సిల్వర్ స్క్రీన్పై బ్రహ్మాండంగా నవ్విస్తున్న బ్రహ్మానందం ఇప్పుడు స్మాల్ స్క్రీన్కి రానున్నారు. అయితే నవ్వించడానికి కాదు.. నవ్వించేవారిని ‘జడ్జ్’ చేయడానికి. ‘ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ చాలెంజ్’ షోలో కనిపించనున్నారు బ్రహ్మానందం. ఈరోజు ‘స్టార్ మా’లో ఈ షో స్టార్ట్ అవుతున్న సందర్భంగా బ్రహ్మానందంతో స్పెషల్ టాక్. ► ఇన్ని రోజులు వెండితెరపై ప్రేక్షకులను నవ్వించిన మీరు ఇప్పుడు తొలిసారి బుల్లితెరపైకి రాబోతున్నారు. ఈ అనుభూతి మీకు ఎలా అనిపిస్తోంది? నవ్వించేవాళ్లను జడ్జ్ చేయబోతున్నాను. ఈ షోలో అద్భుతమైన ప్రతిభ ఉన్న కుర్రాళ్లు స్టాండప్ కామెడీ చేయబోతున్నారు. ఎవరు బాగా నవ్వించారో వాళ్లను ఎంపిక చేయాలి. ► జడ్జ్మెంట్ అనేది కష్టం అంటారు? నవ్వొస్తే బాగుందని చెబుతాం. నవ్వు రాకపోతే బాగోలేదు అంటాం. దీనిని జడ్జ్ చేయడానికి మనకు ఓ సీట్ కేటాయించారు. లెక్కలేసుకుని ‘నవ్వు’కి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. హాస్యం ఎక్కాల పుస్తకం కాకూడదు. పెద్ద బాల శిక్షలా ఉండాలి. ► ఈ షోను అంగీకరించడానికి కారణం ఏంటి? నేను ఒకప్పుడు మిమిక్రీ కళాకారుడిని. మిమిక్రీనే స్టాండప్ కామెడీ అంటుంటారు. ఇప్పుడు కుర్రాళ్లు చాలామంది స్టాండప్ కామెడీ చేసి నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లను ప్రోత్సహించాలి. ఎవరో ప్రోత్సహించే కంటే అనుభవం ఉన్న నాలాంటివాళ్లు ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుందనిపించింది. వాళ్లకూ ఉత్సాహంగా ఉంటుంది. ► మీరు బ్రహ్మాండంగా నవ్విస్తారు. ఈ షోలో పాల్గొనేవారు మిమ్మల్ని నవ్వించగలరని నమ్ముతున్నారా? నవ్వడం అనేది పెద్ద విషయమో, లేక పెద్ద పెద్ద బరువులు ఎత్తడమో కాదు. నవ్వినోళ్లు మళ్లీ నవ్వకూడదని ఏమీ లేదు. నవ్వొస్తే ఎవరైనా నవ్వుతారు. ఆ నవ్వు వస్తే దేశ ప్రధాని అయినా నవ్వుతాడు. సామాన్యులూ నవ్వుతారు. నవ్వు అందరికీ కామన్. పెద్ద కమెడియన్ నవ్వకూడదని కాదు. ► అన్ని రసాల కన్నా హాస్య రసం కష్టం అంటారు.. నవ్వించడం బ్రహ్మానందానికే కాదు ఎవరికైనా కష్టమే. నవరసాల్లో హాస్యరసాన్ని పండించడం అంత ఈజీ కాదు. జుగుప్సాకరంగా కాకుండా అందంగా నవ్వించి, ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేయడం అనేది గొప్ప విషయమే. ► మరి ‘జుగుప్సాకరమైన హాస్యం’ ఉండకూడదని నిర్వాహకులతో మీరు చెప్పారా? నా దగ్గరకు నిర్వాహకులు రావడానికి, నేను ఈ షో అంగీకరించడానికి మొదటి కారణం అదే. ఇంటిల్లిపాదీ చూస్తూ కామెడీని ఆనందించే షోకే నేను జడ్జ్గా చేస్తాను. అలా కాకుండా భిన్నమైన మార్గాల్లో నవ్వించాలని ప్రయత్నిస్తే అదే రోజు మానేస్తానని కూడా చెప్పాను. ► ఫైనల్లీ ఈ షో వల్ల మీకెలాంటి అనుభవం దొరకుతుందని అనుకుంటున్నారు? కొత్త కుర్రాళ్లకు వాళ్ల ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక మంచి వేదిక దొరికింది. ఉదాహరణకు.. పాటలు పాడేవారు, మిమిక్రీ చేసేవారు.. ఇలా విభిన్న రంగాల్లో ప్రతిభ ఉన్నవాళ్లు ఉన్నారు. అత్త కూడా ఒకప్పటి కోడలే అంటారు కదా... ఇంకా చానెల్స్ రానప్పుడు డీడీ 8లో నేనూ స్టాండప్ కామెడీ చేసినవాడినే. ఒక్కసారి ఆ పూర్వపు రోజులను గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ షోలో పాల్గొనబోయే వాళ్లలో ప్రతిభ ఉన్న వారు రేపు మంచి స్థాయికి వెళితే సంతోషపడతాను. -
నవ్వుకునే చిత్రాలను ఆదరించాలి
‘‘సిల్లీ ఫెలోస్’ చిత్రంలో నాలుగైదు రోజుల పాత్ర చేశాను. భీమనేని శ్రీనివాస్తో 26 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. తను హార్డ్ వర్కర్ కాబట్టే సినిమాలన్నీ సూపర్ హిట్స్ అవుతున్నాయి. నరేశ్, సునీల్.. ఎవరో ఒకరుంటేనే కామెడీ పరంగా తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇద్దరూ కలిసి నటించారంటే కామెడీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హాయిగా నవ్వుకునే సినిమాలను ఆదరించాలి’’ అని నటుడు డా. బ్రహ్మానందం అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినీరాయ్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సుడిగాడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేనిగారితో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సునీల్గారు, నేను ఈగోస్ లేకుండా నటించాం. ప్రేక్షకులు ‘సుడిగాడు’ రేంజ్ హిట్ అందిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘నరేష్గారు, నేను అన్నదమ్ముల్లా కలిసిపోయాం. ‘తొట్టిగ్యాంగ్’ సినిమాకు ఎంత ఎంజాయ్ చేశానో ‘సిల్లీ ఫెలోస్’కి కూడా అంతే ఎంజాయ్ చేశా. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర చేశా’’ అన్నారు సునీల్. ‘‘సిల్లీ ఫెలోస్’ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. మా కష్టాన్ని ఈరోజు తెరపై చూస్తారు. ‘సుడిగాడు’ తర్వాత నేను ఒక సినిమా చేస్తే.. నరేష్గారు 12 చిత్రాలు చేశారు’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘భీమనేని మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. పెద్ద హీరోలందరూ తమ సినిమాల్ని కనీసం ఒక షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇందుకు దర్శక–నిర్మాతలను, హీరోలను రిక్వెస్ట్ చేస్తున్నా’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ఈ వేడుకలో డైరెక్టర్ కె.నాగేశ్వర్ రెడ్డి, నటి నందినీరాయ్ పాల్గొన్నారు. -
బుల్లితెరపై బ్రహ్మానందం!
బ్రహ్మానందం పేరు వింటేనే హాస్యం పుడుతుంది. ఆయన తెరపై కనబడితే నవ్వుల పూలు పూస్తాయి. ఒకప్పుడు ఈయన పాత్ర లేని సినిమాలు ఉండేవి కాదు. పెద్ద హీరోల సినిమాల్లో బ్రహ్మానందం పాత్రను స్పెషల్గా డిజైన్ చేసేవారు దర్శకులు. ఒక్కోసారి హీరోల పాత్రను డామినేట్ చేసేంతగా.. ఆ సినిమా సక్సెస్లో పాలుపంచుకున్నారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం ప్రేక్షకులు కొత్త తరహా కామెడీని ఆస్వాదించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఒకే తరహా పాత్రలు చేస్తే సినీ అభిమానులు స్వీకరించడం లేదు. దీనికి తోడు యంగ్ జనరేషన్ కమెడియన్స్ సత్తా చాటుతున్నారు. దీంతో ఈ మధ్య బ్రహ్మానందం చేస్తోన్న సినిమాలు అంతగా విజయం సాధించకపోవడం, అందులోని కామెడీ కూడా వర్కౌట్ కాకపోవడంతో బ్రహ్మానందం కాస్త విరామం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. వెండితెరపై హాస్యాన్ని పండించిన నవ్వుల రారాజు బ్రహ్మానందం.. ఇక నుంచి బుల్లితెరపై తన హాస్య చతురతను ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. బుల్లి తెరపై హాస్య ప్రధానమైన కార్యక్రమాలు ఏ రేంజ్లో విజయం సాధిస్తున్నాయో తెలిసిందే. స్టార్ మాలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమోతో ఆకట్టుకుంటోన్న ఈ షో.. త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు.