Brahmanandam
-
రంగమార్తాండ కోసం నాన్న భోజనం కూడా చేయలేదు: రాజా గౌతమ్
టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (Brahma Anandam), ఆయన కుమారుడు రాజ గౌతమ్ (Raja Gautam) బ్రహ్మ ఆనందం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాతా మనవళ్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్కు హాజరైన రాజా గౌతమ్ తండ్రి బ్రహ్మనందం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీ నాన్న దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారని ప్రశ్నించగా.. దానికి సమాధానమిచ్చారు.రాజా గౌతమ్ మాట్లాడుతూ..' నాన్న దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా ఆయనకు నుంచి వచ్చిన క్వాలిటీ గ్రాటిట్యూడ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఏ ఈవెంట్ జరిగినా జంధ్యాల గారి పేరు రాకుండా ఉండదు. ఎవరైనా బాగా చేశారని తెలిస్తే వెంటనే ఫోన్ చేసి అభినందిస్తారు. రంగమార్తాండ చిత్రంలో వైఫ్ చనిపోతే చితి దగ్గర ఏడ్చే సీన్ ఉంటుంది. ఆ సీన్ కోసం నాన్న భోజనం చేయకుండా ఉన్నారు. ఆ సీన్లో నేను కొంచెం వీక్గా కనిపించాలి.. అందుకే భోజనం చేయకపోతే ఆ సీన్ ఎలివేట్ అవుతుంది అన్నారు. ఈ వయసులో కూడా ఆయన నిరూపించుకోవాలనే తపన ఉంది. అందుకే ఆయనే ఆదర్శం' అని ప్రశంసలు కురిపించారు.కాగా.. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. బ్రహ్మా ఆనందం చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుండటం హ్యాపీగా ఉందని రాజా గౌతమ్ పేర్కొన్నారు. -
తండ్రిగా చాలా సంతోషంగా అనిపించింది: బ్రహ్మానందం
‘‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam) సినిమా చూసిన వారు ‘మీ కన్నా.. మీ అబ్బాయి బాగా చేశాడు’ అని రాజా గౌతమ్ని మెచ్చుకుంటుంటే ఓ తండ్రిగా చాలా సంతోషంగా అనిపించింది. ప్రేక్షకులకు కొత్తగా కనిపించాలనే ఆలోచనతోనే నేను సినిమాలు చేస్తుంటాను. చాలా కాలం తర్వాత ‘బ్రహ్మా ఆనందం’ వంటి ఓ మంచి సినిమా, మంచి పాత్ర చేశాననే సంతృప్తి కలిగింది’’ అని నటుడు బ్రహ్మానందం చెప్పారు. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో బ్రహ్మానందం(Brahma Anandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Gautam) తాతా మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’.ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్(Success Meet)లో రాజా గౌతమ్ మాట్లాడుతూ–‘‘బ్రహ్మా ఆనందం’ చూసిన వారు నా నటన గురించి మాట్లాడుతుండటం హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు.‘‘నా గత చిత్రాల్లా ‘బ్రహ్మా ఆనందం’కి కూడా మంచి మౌత్ టాక్ వచ్చింది. అన్ని చోట్లా షోలు ఫుల్ అవుతున్నాయి’’ అని రాహుల్ యాదవ్ చెప్పారు. ‘‘ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం... మేం ఊహించని సన్నివేశాల్లోనూ నవ్వుతున్నారు’’ అని ఆర్వీఎస్ నిఖిల్ తెలిపారు. -
అంపశయ్యపై MS నారాయణ.. చివరి క్షణాల్లో ఏం జరిగిందంటే?: బ్రహ్మానందం
కమెడియన్స్ చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే కొందరు హాస్యనటులు సినిమా తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటారు. వారి డైలాగులు, అవాక్కులు-చవాక్కులు, హావభావాలు గుర్తు చేసుకుని మనలో మనం కాసేపు నవ్వుకుంటూ ఉంటాం. అలా తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ (MS Narayana) ఒకరు. ఈయనకు హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్ బ్రహ్మానందానికి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది.చివరి స్టేజీలో నాకోసం పరితపించాడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం (Brahmanandam).. ఎమ్మెస్ నారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎమ్మెస్ నారాయణ మంచానపడి అంతిమ ఘడియలకు దగ్గరవుతున్నప్పుడు ఆయన మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తనకు ఎంతోమంది తెలుసు. రక్తసంబంధాలు, స్నేహసంబంధాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే చివరి స్టేజీలో ఉన్నప్పుడు నన్ను చూడాలనుకున్నాడు. నన్నెలాగైనా కలుసుకోవాలనుకున్నాడు.చెప్పాపెట్టకుండా వెళ్లిపోయా..మాట్లాడలేని స్థితిలో ఉన్న నారాయణ.. అతడి కూతుర్ని పిలిచి తెల్లకాగితం అడిగాడు. దానిపై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలనుంది అని రాశాడు. అది చదివిన అమ్మాయి నాకు వెంటనే ఫోన్ చేసింది. అప్పుడు నేను గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' సినిమా షూటింగ్లో ఉన్నాను. శంషాబాద్లో షూటింగ్.. సడన్గా నేను వెళ్లాలి అని చెప్తే దర్శకుడు ఒప్పుకోకపోతే? ఎలా అన్న సంకోచం.. అందుకే ఎవరికి చెప్పకుండా నేరుగా కారెక్కి వెళ్లిపోయాను.అదే ఆఖరి రోజునన్ను చూడగానే అంపశయ్యపై పడుకున్న ఎమ్మెస్ నారాయణ కళ్ల వెంట నీళ్లు కారాయి. అది ఎన్నటికీ మర్చిపోలేను. నన్ను చూసి నా చేయి గట్టిగా పట్టుకుని వదిలేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి మళ్లీ కళ్లు తెరిచాడు. డబ్బు గురించి ఆలోచించొద్దని, ఎంతైనా పర్వాలేదు, నా మిత్రుడిని బతికించండని డాక్టర్స్ను కోరాను. ఇప్పటికీ మింగుడుపడదుషూటింగ్ మధ్యలో వచ్చేశానని, మళ్లీ వీలు చూసుకుని వస్తానని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాను. తిరిగి షూటింగ్కు వెళ్తుండగా మార్గమధ్యలోనే ఆయన మరణించారన్న వార్త వచ్చింది. అంతటి మేధావి తక్కువ వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం నాకిప్పటికీ మింగుడుపడదు అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఎమ్మెస్ నారాయణ (63).. 2015 జనవరి 23న అనారోగ్యంతో మరణించారు.చదవండి: 'ఛావా' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే? -
మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆసక్తికర కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన తన తాతయ్య గురించి మాట్లాడారు. మా కుటుంబంలో ఆయనకు ఓ ప్రత్యేకమైన అలవాటు ఉండేదని అన్నారు. ఆయన మంచి కళా పోషణ కలిగిన వ్యక్తి అని నవ్వుతూ మాట్లాడారు. బ్రహ్మనందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మెగాస్టార్.చిరంజీవి మాట్లాడుతూ..'మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన స్వస్థలం నెల్లూరు అయితే మొగల్తూరు వచ్చి స్థిరపడ్డారు. అక్కడే స్టేట్ ఎక్సైడ్ ఇన్స్పెక్టర్గా రిటైరయ్యారు. నీకు ఎవరి బుద్ది అయినా రావొచ్చు కానీ.. ఆయన బుద్ధి మాత్రం రాకూడదనేవారు. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. మా ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. వాళ్లద్దరిపై అలిగితే మూడో ఆమె దగ్గరికి వెళ్లేవారు. నాకు తెలిసి ముగ్గురే.. అలా నాలుగు, ఐదు ఉన్నారేమో నాకు తెలియదు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావ్ కదా జాగ్రత్త. అసలే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనను మాత్రం ఆదర్శంగా తీసుకొవద్దని చెప్పారు.' అని నవ్వుతూ సరదాగా అన్నారు మెగాస్టార్. ఇంకేముంది ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదే ఈవెంట్లో బ్రహ్మానందం తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..'మా అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. నా తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు పెద్దరికంతో బతికారు. నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎప్పుడు గర్వపడుతుంటా. మా నాన్న నాకు ఒక మాట చెబుతుండేవారు.. ఒక మనిషి 18 రోజులు భోజనం చేయకపోతే చనిపోతాడు. 17 రోజుల వరకు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దు. 18వ రోజు తప్పనిసరి అయితేనే ఎవరినైనా సాయం అడుగు అనేవారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తా. నా జీవితంలో అప్పు అనే మాట తావులేదు' అని అన్నారు.కాగా.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్తో కలిసి బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ట్రైలర్ను ఇటీవలే ప్రభాస్ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు. -
‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రాజకీయాలకు దూరంగా... సినిమాలకు దగ్గరగా ఉంటా: చిరంజీవి
‘‘బ్రహ్మానందం(Brahmaanandam)లో స్పార్క్ని గమనించి నేను తనని మద్రాసు తీసుకువెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి బంధం, ప్రేమానురాగాలు, గురు–శిష్యుల అనుబంధం ఉన్నాయి. ఓ రోజు బ్రహ్మానందం ఇంటికి వెళితే ఎన్నో అవార్డులు ఉన్నాయి. తన చరిత్ర అంతా ఓ గదిలో కనిపించింది. అలాంటి బ్రహ్మానందం కొడుకు చేసిన రెండు మూడు సినిమాలు అంతంతగా అలరించినా సరే... మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని హీరో చిరంజీవి(Chiranjeevi)అన్నారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధానపాత్రల్లో, ‘వెన్నెల’ కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలకపాత్రల్లో నటించిన సినిమా ‘బ్రహ్మా ఆనందం’.ఉమేష్ కుమార్, సావిత్ర సమర్పణలో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ‘బ్రహ్మా ఆనందం’(Brahmaanandam) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్(pre release event)కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై, అత్యద్భుతంగా ఆడుతుంది. నీకు (బ్రహ్మానందం) పుత్రోత్సాహం కలుగుతుంది. నువ్వు చక్కగా గర్విస్తావు. నేను ఏ విధంగా పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో, అలానే నువ్వూ అనుభవించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అత్తిలిలో నేను లెక్చరర్గా చేస్తున్నప్పుడు భీమవరం వెళ్లి ‘ఖైదీ’ సినిమా చూశాను. చిరంజీవి ట్రెండ్ సెట్టర్. ఆయన చూడని చరిత్రా... చెప్పని చరిత్రా. చిరంజీవి కింగ్ ఆఫ్ వరల్డ్ సినిమా. ఈ వేడుకకు చిరంజీవిగారిని చీఫ్ గెస్ట్గా పిలవాలనుకుని కాస్త తటపటాయించాను. 9వ తారీఖు ఒక ఫంక్షన్. మళ్లీ 11న మరొక ఫంక్షన్ కదా అనుకున్నాను. ‘గౌతమ్ నీకు బిడ్డ. నాకూ బిడ్డలాంటి వాడే..’ అన్నారు. నన్ను తొలిసారి చెయ్యి పట్టుకుని విమానం ఎక్కించింది చిరంజీవిగారే. ఇప్పుడు నా బిడ్డ చేయిపట్టుకుని ఈ విమానం ఎక్కిస్తున్నారు.మంచి సినిమాలు తీయాలనే అభిరుచి ఉన్న కుర్ర నిర్మాతల్లో రాహుల్ ఒకడు. ఇది తాత–మనవడు గురించి చెప్పే కథ. ఈ సినిమా చాలా బాగుంటుంది’’ అన్నారు. ‘‘హీరో అనే పదానికి నాకు మీనింగ్ చిరంజీవిగారే. బ్యూటిపుల్ ఎమోషనల్ మూవీ ఇది. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్లో అందరూ హాయిగా చూడండి’’ అన్నారు రాజా గౌతమ్. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా అంటే బ్రహ్మానందంగారే. ఆయనతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. రాజా గౌతమ్గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’’ అన్నారు ఆర్వీఎస్ నిఖిల్. చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చినందుకు ఈ వేదికపై ఆయన్ను బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ సన్మానించారు.అప్పుడు ఒత్తిడిగా ఉండేది సినిమాల్లో ఉండగా నేను ఎంతో ఉత్సాహంగా ఉండేవాడిని. పొలిటికల్ సైడ్ వెళ్లినప్పుడు కాస్త ఒత్తిడిగా ఉండేది. అన్నవాడిని, అననివాడిని కూడా ఏదో అనాలని తిట్లు రాసుకోవాల్సి వచ్చేది. ఒత్తిడిగా ఫీలయ్యేవాడిని. ఎందుకు స్పందించడం లేదని మా ఆవిడ నన్ను అడిగింది. నాలో హాస్య గ్రంథులు ΄ోయాయేమో అనుకున్నాను. ‘ఖైదీ నెంబరు 150’ తర్వాత మళ్లీ నవ్వడం ప్రారంభించాను. ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటాను. చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. పెద్ద పెద్ద వాళ్లందరికీ దగ్గరవుతున్నాడు, వాళ్లందరూ దగ్గరకు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా అటు (రాజకీయాలు) వెళ్తాడా అని. కాదు... మరో రకంగా సేవలు అందివ్వడం కోసమే తప్ప పొలిటికల్గా వెళ్లడం అనేది లేదు. – చిరంజీవి -
బ్రహ్మ ఆనందం ట్రైలర్.. ప్రభాస్ చేతుల మీదుగా విడుదల
టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam), ఆయన కుమారుడు రాజా గౌతమ్ (Raja Goutham) నటించిన తాజా చిత్రం 'బ్రహ్మ అనందం'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మూవీ సూపర్ హిట్ అవుతుందని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు. -
నన్ను నేను చాలెంజ్ చేసుకున్నాను: నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా
‘‘స్క్రిప్ట్ చదివి, ఓ మంచి సినిమా తీయడం నిర్మాత బాధ్యత అని భావిస్తాను. అందుకే ప్రతి స్క్రిప్ట్ను నేనే చదివి నిర్ణయం తీసుకుంటాను. సినిమా ట్రైలర్, ఫస్ట్ షో తర్వాత వచ్చే ఆడియన్స్ ఫీడ్బ్యాక్ నా ట్రంప్కార్డ్స్. పరిమిత బడ్జెట్తో, తక్కువ సమయంలో సినిమాలు తీస్తే నిర్మాతలకు లాభాలు వస్తాయని నమ్ముతాను’’ అని అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా(Rahul Yadav Nakka). ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam). ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Goutham) లీడ్ రోల్స్లో నటించగా, మరో కీలక పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ– ‘‘తాత–మనవళ్ల కథ ఇది. తాను చేసిన తప్పులను తాత ఎలా రియలైజ్ అయ్యాడు? మనవడు తాను చేసిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకున్నాడు? అనే అంశాలతో ఈ సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసేలా మూవీ ఉంటుంది. బ్రహ్మానందంగారు కథ ఓకే చేయకపోతే ఈ సినిమాయే లేదు.ఇందులో మూర్తి పాత్రలో బ్రహ్మానందంగారు, బ్రహ్మా పాత్రలో రాజా గౌతమ్, గిరి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. ముందుగా బ్రహ్మా పాత్రకు ‘వెన్నెల’ కిశోర్గారిని అడగ్గా, ఆయన హీరో ఫ్రెండ్ గిరి పాత్ర చేస్తానన్నారు. దీంతో రాజా గౌతమ్ పేరు ప్రస్తావనకు వచ్చి, ఆయనతో మాట్లాడి, ఈప్రాజెక్ట్లోకి తీసుకున్నాం.. ఇక సినీ ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయాలని నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను. నేను పరిచయం చేయబోతున్న నాలుగో దర్శకుడు నిఖిల్. మా నెక్ట్స్ప్రాజెక్ట్ ‘వైబ్’. ఇందులో రాజా గౌతమ్ హీరోగా చేస్తున్నారు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, మసూద’ చిత్రాలకు సీక్వెల్స్ ఉన్నాయి. కానీ ఇంకా సమయం ఉంది ’’ అని అన్నారు. -
వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ...
వారాహి అమ్మవారిని దర్శించుకున్నారు బ్రహ్మానందం(Brahmanandam ). మరి... ఏం కోరుకున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సుమంత్(Sumanth) హీరోగా రూపొందుతున్న ‘మహేంద్రగిరి వారాహి’(Mahendragiri Vaarahi) చిత్రంలోని ఓ సన్నివేశం ఇది. ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన లుక్ని విడుదల చేశారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రాజశ్యామల ఎంటర్టైన్మెంట్పై కాలిపు మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‘‘సుమంత్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ కాంబినేషన్లో రూపొందుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం’’ అని కాలిపు మధు తెలిపారు. -
అడ్డంగా నువ్వు బుక్కయ్యావా...
బ్రహ్మానందం(brahmanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Gautam) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. శాండిల్య పిసపాటి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని రెండో సాంగ్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విడుదల చేశారు.సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించిన ఈ పాటని రామ్ మిరియాల పాడారు. ‘అయ్యో అడ్డంగా నువ్వు బుక్కయ్యావా.. ఓరయ్యో ఘోరంగా చిరిగి చాటయ్యావా... గురిచూసి బాగా దెబ్బేశాడా నిన్నే తాతయ్యా...’ అంటూ గ్రామీణ నేపథ్యంలో ఈ పాట సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమేరా: మితేష్ పర్వతనేని, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: డి.వంశీకృష్ణా రెడ్డి, పి.దయాకర్ రావు. -
అవకాశాలు లేక కాదు, రాక కాదు.. అందుకే సినిమాలు తగ్గించా!
తెలుగు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేశాడు. ఒకప్పుడు జెట్ స్పీడ్లో చిత్రాలు చేసిన ఆయన ఈ మధ్య మాత్రం మూవీస్పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏదో అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు గౌతమ్తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశాడు.సినిమాలు ఎందుకు తగ్గించేశానంటే?గురువారం జరిగిన బ్రహ్మ ఆనందం టీజర్ లాంచ్ ఈవెంట్ (Brahma Anandam Teaser Launch Event)లో సినిమాలు తగ్గించడానికి గల కారణాన్ని హాస్య బ్రహ్మ బయటపెట్టాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నాకు మంచి ఇమేజ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈయన కామెడీ అప్పట్లో బాగుండేది.. ఈ మధ్య కామెడీ చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లేదు అన్న మాట కొందరు కమెడియన్ల దగ్గర విన్నాను. అది నాకొద్దు. ఎంత చేసినా ఇంకా ఏదో వెతుకుతూ ఉంటారు.నాకు తెలుసుఅలాగే నా వయసేంటో నాకు తెలుసు. వయసు పెరుగుతోందని అర్థం చేసుకోకుండా నేనింకా యంగ్ అంటే కుదరదు. ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా నేను చేయలేకపోతున్నాను. నేను చేసిన పాత్రలే మళ్లీ ఆఫర్ చేస్తున్నారు, చేసిన కామెడీనే మళ్లీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.. నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అందుకే సినిమాలు తగ్గించేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. సినిమాల్లో వేషాలు లేక కాదు, నాకు ఇవ్వక కాదు, నేను చేయలేకా కాదు! ఎంతజాగ్రత్తగా చేసినా దొరికిపోతాం. చేసిన కామెడీ చేస్తున్నాడన్న ఇమేజ్ వద్దనే సినిమాలు తగ్గించాను. ఇండస్ట్రీలో నా వారసత్వాన్ని వెన్నెల కిషోర్ కొనసాగిస్తాడు అని చెప్పాడు.ఆనందో బ్రహ్మ ఎలా ఒప్పుకున్నానంటే?డైరెక్టర్ నిఖిల్.. నా పేరుపైనే ఒక సినిమా రాసుకున్నానని, మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తానన్నాడు. నాతో ఒక్క షాట్ అయినా డైరెక్ట్ చేయాలని తన కోరిక అని లేదంటే ఈ సినిమా పక్కనపెట్టేస్తానన్నాడు. అప్పటివరకు పోజు కొడదామనుకున్నాను కానీ నేను ఒప్పుకుంటేనే సినిమా అనేసరికి సరే అని అంగీకరించాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. హీరో ఎవరు? అని అడిగితే మా అబ్బాయి గౌతమ్ పేరు చెప్పారు. సినిమా కోసం వాడికి నేను తాతనయ్యాను అని చెప్పాడు. బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చదవండి: సంక్రాంతి రభస: మోహన్బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం (ఫొటోలు)
-
కర్నూలులో టీ షాప్ ప్రారంభించిన టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (ఫొటోలు)
-
సంక్రాంతి బరిలో మరో టాలీవుడ్ సినిమా!
సుమంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల బ్యానర్పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు. ఈ మూవీ గ్లింప్స్కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.కాగా.. మహేంద్రగిరి వారాహి సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు ఇటీవల వెల్లడించారు. ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని బ్రహ్మానందం చేయబోతున్నారని దర్శకుడు సంతోష్ తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.కాగా.. వచ్చే ఏడాది-2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా.. వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే!
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ప్రతి సోమవారం ‘కన్నప్ప’ నుంచి ఆయా పాత్రలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్స్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పిలక పాత్రలో నటించగా, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ వీరి పాత్రలను పరిచయం చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. -
వీళ్లూ ఎక్కారు... గిన్నిస్ రికార్డుల్లోకి!
నాలుగు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. తన డ్యాన్స్, నటనతో కోట్లాదిమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. తన సినీ జర్నీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ తాజాగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో రికార్డ్ బ్రేక్ చేశారు. దీంతో ఆయనకు ఈ రికార్డు దక్కింది. సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్కు చేరుకుని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతులు మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. అయితే, చిరు కంటే ముందే మన టాలీవుడ్ లెజెండ్స్ కొందరు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.దాసరి నారాయణరావుతెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో అత్యధిక చిత్రాల దర్శకుడుగా ఆయనకు గుర్తింపు రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడంతో పాటు 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలకు కథ, మాటల రచయితగా, గీత రచయితగా పనిచేశారు. తెలుగు సినీ దిగ్గజంగా కీర్తిని పొందిన ఆయన 2017 మే 30న మరణించారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంశ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. ఆయన్ను ఎస్పీ బాలు అని ఎంతోమంది ప్రేమతో పిలుస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠ,మలయాళం భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు బాలు పాడారు. ఇలా ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. బాలు నేపథ్య గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 6 జాతీయ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. 2020 సెప్టెంబరు 25న బాలు మరణించగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.దగ్గుబాటి రామానాయుడుదగ్గుబాటి రామానాయుడు.. మూవీ మోఘల్గా ఆయన అందరికీ దగ్గరయ్యారు. ఒకే వ్యక్తి 100 చిత్రాలకు పైగా నిర్మాతగా తెరకెక్కించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో రామానాయుడు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. బెంగాలీలో ఆయన నిర్మించిన అసుఖ్ (1999) ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కించుకుంది. 2015 ఫిబ్రవరి 18న క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించారు.విజయనిర్మల తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల దర్శకురాలుగా కూడా తన ప్రతిభను చాటారు. డైరెక్టర్గా 44 చిత్రాలను తెరకెక్కించి రికార్డ్ సెట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నీస్ బుక్లో ఆమె చోటు సంపాదించారు. 11 ఏళ్ల ప్రాయంలోనే ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఆమె.. 1971లో 'మీనా' చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆమె సుమారు 50కి పైగా సినిమాల్లో నటించారు. 2019లో విజయనిర్మల మరణించారు. పి. సుశీల ఆరు దశాబ్దాల పైగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురాలైన గానకోకిల పి. సుశీల పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. 12 భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ, సంస్కృత, సింహళ, పడుగు, తుళు, బెంగాలీ, పంజాబీ) సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 30 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. అయితే, గిన్నీస్ బుక్ వారు మాత్రం 1960ల నుంచి 6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలను మాత్రమే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చారు. ఈ ఘనత సాధించిన ఏకైక ఫిమేల్ సింగర్గా ఈ ‘గాన సరస్వతి’కి దక్కింది. దీంతో ఆమెకు గిన్నీస్ బుక్లో చోటు దక్కింది. భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవించాయి.బ్రహ్మానందంకన్నెగంటి బ్రహ్మానందం.. ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకే భాషలో 754 చిత్రాలలో నటించినందుకుగాను ఆయన పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చేరింది. ఒకే భాషలో ఇన్ని సినిమాలు నటించిన నటులు ఇంతవరకు ఎవరూ లేరు. అయితే, వాస్తవంగా బ్రహ్మానందం ఇప్పటి వరకు 1250 సినిమాలకు పైగానే నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ను దక్కించుకున్నారు. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా బ్రహ్మానందం సినీ రంగ ప్రవేశం చేశారు. -
బ్రహ్మానందం వీడియోలు చూస్తుండగా మహిళకు సర్జరీ
వయసుతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులకు కామెడీ ఇష్టం. యూట్యూబ్లో అయితే బ్రహ్మానందం, సునీల్ కామెడీ వీడియోలు తెగ చూసేస్తుంటారు. ఇప్పుడు అలానే 'అదుర్స్' సినిమాలోని బ్రహ్మీ కామెడీ వీడియోలు చూస్తుండగా 55 మహిళకు డాక్టర్స్ సర్జరీ చేశారు. కాకినాడలోని జీజీహెచ్లో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: లైంగిక వేధింపుల కేసు.. పరారీలో జానీ మాస్టర్)కొత్తపల్లికి చెందిన 55 ఏళ్ల అప్పన్న అనంతలక్ష్మికి ఏడాదిగా కుడి కాలు, కుడి చెయ్యి లాగేస్తుండటం వల్ల బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు పలు పరీక్షలు చేయగా మెదడులో ఎడమవైపు ట్యూమర్ ఉందని గుర్తించారు. దీన్ని అలానే వదిలేస్తే పక్షవాదం వచ్చే ప్రమాదం ఉందని చెప్పి సర్జరీకి సిద్ధమయ్యారు. అయితే మత్తు మందు ఇవ్వకుండా ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం వీడియోలు చూపిస్తూ క్రైనీయాటమీ సర్జరీ పూర్తి చేశారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సర్జరీ చేశారు. ఇది విజయవంతం కావడంతో వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి. అలానే శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు సదరు మహిళ బ్రహ్మానందం కామెడీ సీన్స్ చూస్తున్న ఆరు సెకన్ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?) -
నవ్వులే నవ్వులు
‘పద్మశ్రీ’ బ్రహ్మానందం కీలక పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటì స్తున్నారు. సావిత్రి, ఉమేష్ యాదవ్ సమర్పణలో స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.సోమవారం రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, గ్లింప్స్ రిలీజ్ చే శారు మేకర్స్. ‘‘బ్రహ్మానందం, రాజా గౌతమ్ నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో తాత, మనవడుగా వారు అలరించబోతున్నారు. రాజా గౌతమ్ స్నేహితుని పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మిమిక్రీ చేసి ఆశ్చర్యపరిచిన బ్రహ్మనందం..
-
బ్రహ్మానందంలో ఈ టాలెంట్ చూశారా? ఆయన ముందే మిమిక్రీ..
భారతీయుడు.. దశాబ్ధం క్రితం వచ్చిన ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. జనాలను ఆలోచింపజేసిన ఈ మూవీకి సీక్వెల్గా భారతీయుడు 2 వస్తోంది. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఆదివారం ఘనంగా జరిగింది.లోకనాయకుడిని దింపేసిన బ్రహ్మానందంఈ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ విశ్వంలోనే కమల్ హాసన్లాంటి నటుడు మరొకరు ఉండరని, ఆయనతో నటించినందుకు గర్వపడుతున్నాని తెలిపారు. అలాగే కమల్ హాసన్ వాయిస్ను మిమిక్రీ చేశారు. 'ఈ రోజు నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ 1 మూవీని బాగా హిట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. సౌత్ ఇండియన్స్ అందరూ నన్నెంతో ఆశీర్వదించారు, అభినందించారు. మాటలు రావడం లేదుచాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేస్తే నేను హ్యాపీ.. ఆల్వేస్.. యువర్ కమల్ హాసన్' అంటూ విశ్వనటుడి వాయిస్ను దింపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారగా బ్రహ్మానందంలోని ఈ టాలెంట్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కదా మిమ్మల్ని లెజెండ్ అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. Brahmanandam Garu mimics Kamal Haasan Sir’s voice. Wow!!! #Bharateeyudu2 pic.twitter.com/ka16cyYMGB— Aakashavaani (@TheAakashavaani) July 7, 2024 చదవండి: కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్, మౌనిక -
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో తాత, మనవడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించనున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్న ఈ సినిమాని ప్రీ–లుక్ పోస్టర్, వీడియోతో ప్రకటించారు. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిస΄ాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి. దయాకర్ రావు. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
స్వామీ బ్రహ్మానంద్ ఎవరు? ఎంపీ స్థాయికి ఎలా చేరారు?
దేశంలో 18వ లోక్సభకు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు (80) కలిగిన ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో సాధువుల ప్రవేశం 90వ దశకంలో రామమందిర ఉద్యమం నుంచి ప్రారంభమైంది. ఇది నేటికీ కొనసాగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా లోక్సభ సభ్యునిగా ఎన్నికైన స్వామి బ్రహ్మానంద్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి బ్రహ్మానంద్ గోసంరక్షణ కోసం పాటుపడ్డారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చించారు. స్వాతంత్య్రానంతరం 1951-52లో తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి. గోరఖ్నాథ్ పీఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్నాథ్ 1952,1957 ఎన్నికలలో హిందూ మహాసభ నుండి పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ ముందు సత్తా చాటలేకపోయారు. 1966లో స్వామి బ్రహ్మానంద్ స్వామి కర్పాత్రి మహారాజ్తో కలిసి లక్షలాది సాధువులతో కలసి గోహత్యను నిషేధించాలనే ఉద్యమాన్ని చేపట్టారు. దీనిపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ ఉద్యమ నేపధ్యంలో అప్పటి ప్రభుత్వం స్వామి బ్రహ్మానంద్ను అరెస్టు చేసి, జైలుకు తరలించింది. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లోకి రావాలని ఆయనను పలువురు కోరారు. దీంతో ఆయన జన్ సంఘ్లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి కాలుమోపారు. 1967లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ లోక్సభ స్థానం నుండి స్వామి బ్రహ్మానంద్ పోటీ చేసి విజయం సాధించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సాధు సన్యాసి లోక్సభ సభ్యునిగా ఎన్నికవడం అదే తొలిసారి. తరువాతి కాలంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1967లో బ్యాంకుల జాతీయకరణ అంశాన్ని లేవనెత్తినప్పుడు, స్వామి బ్రహ్మానంద్ అందుకు మద్దతుగా నిలిచారు. దీంతో జన్సంఫ్కు, స్వామి స్వామి బ్రహ్మానంద్కు మధ్య దూరం పెరిగింది. 1971 లోక్సభ ఎన్నికల్లో హమీర్పూర్ నుండి స్వామి బ్రహ్మానంద్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధంగా ఆయన రెండోసారి ఎంపీ అయ్యారు. -
బ్రహ్మనందం గొప్ప మనసు.. వారి కుటుంబానికి ఆర్థికసాయం!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మనందం ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే విఐపీ దర్శన సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు తిరుమలలో ఘనస్వాగతం పలికిన వేద పండితులు.. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మనందం అనంతరం పుస్తాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కళాకారుని కుటుంబాన్ని ఆదుకుని మంచి మనసును చాటుకున్నారు. కళాకారుడు మరణించిన కుటుంబానికి రూ.2.17 లక్షల ఆర్థికసాయం అందించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బ్రహ్మనందం చేసిన పనిని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మనందం కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. -
Brahmanandam Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్యబ్రహ్మ (ఫోటోలు)
-
కుమారుడిపెళ్లి.. మరింత బక్కచిక్కిపోయిన కమెడియన్ సుధాకర్
హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాడు. దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలాడు సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఆయన సినిమాలకు దూరమై సుమారు 17 ఏళ్లు అవుతోంది. తను నటనకు దూరమైనా తన ఒక్కగానొక్క కుమారుడు బెనిడిక్ మైఖేల్(బెన్నీ)ని టాలీవుడ్కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు గతంలో వెల్లడించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీదుగానే బెన్నీ ఎంట్రీ ఉంటుందని హింటిచ్చాడు. సుధాకర్ తనయుడి పెళ్లి సినిమాల సంగతి పక్కనపెడితే ఇటీవల బెన్నీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు, బ్రహ్మానందం, చంద్రబోస్ దంపతులు, రోజా రమణి వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. బ్రహ్మానందం అయితే బెన్నీని పెళ్లికొడుకు చేసేటప్పుడు, వివాహ వేడుక, రిసెప్షన్లోనూ సందడి చేశాడు. కొత్త జంటపై కేసు పెడతా సరదా మాటలతో అక్కడున్న అందినీ నవ్వించాడు. ఈ హాస్యబ్రహ్మ సొంత ఇంటి మనిషిలా పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రిసెప్షన్ స్టేజీపైకి ఎక్కి మైకు అందుకున్న బ్రహ్మానందం.. వీళ్లిద్దినీ చూస్తుంటే పోలీసు కేసు పెట్టాలనిపిస్తోంది. ఎందుకంటే ఇది బాల్యవివాహంలా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ముదిరిపోయిన జంటల పెళ్లిళ్లు చూశాక వీళ్లను చూస్తుంటే చిన్నపిల్లల్లా, క్యూట్గా కనిపిస్తున్నారు అని మాట్లాడాడు. నడవలేని స్థితిలో.. కాగా బెన్నీ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోల్లో సుధాకర్ ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారినట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను ఇద్దరి సాయంతో స్టేజీపైకి తీసుకొచ్చారు. ఆయన మరింత బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన అభిమానులు.. ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? అని విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు -
తెలుగు, నేపాలీ భాషల్లో...
ప్రముఖ నటుడు బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న తొలి తెలుగు, నేపాలీ చిత్రం ‘హ్రశ్వదీర్ఘ’. చంద్ర పంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హరిహర్ అధికారి, నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. నీతా ఫిలిమ్స్ ప్రోడక్షన్పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘హ్రశ్వదీర్ఘ’లోని ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ని విడుదల చేయడంతో పాటు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
లారీలకు రంగులేసిన వ్యక్తి ఇప్పుడు నవ్వుల రేడు!
టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకులను తన హావభావాలతో కట్టిపడేశారు. తాజాగా ఆయన నేడు 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఇవాళ ఆయన బర్త్డే కావడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా నిలిచారు. కేవలం ముఖ కవళికలతోనే నవ్వించే టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతం. అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు పొందారు. బహ్మనందం సినీ ఇండస్ట్రీలో 31 ఏళ్ల పాటు కమెడియన్గా అభిమానులను అలరించారు. ఆయన దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించారు. గతేడాది రంగమార్తాండ చిత్రంలో కనిపించిన ఆయన అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. బహ్మనందం ప్రస్థానమిది.. ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు ఇంత స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. చెప్పులు కూడా కొనలేని స్థితిలో నుంచి లెక్చరర్గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. అయితే తన వద్ద చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో ఇతరుల సాయంతోనే చదువు పూర్తి చేశారు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పీజీ చేసేందుకు తన దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అదే సమయంలో వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం టాలెంట్, కామెడీని చూసి ఎంఏ తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. లారీలకు రంగులు వేస్తూ.. పీజీ చదువుకునే రోజుల్లో నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలకు పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశారు. తాను చేసిన పనికి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా సొంతంగా పనులు చేసుకుంటూ.. దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్గా మారాడు. ఆ తర్వాత లెక్చరర్ స్థాయి నుంచి టాలీవుడ్లోనే ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగిన తీరు అద్భుతం. కళారంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఎంత సంపాదించారంటే.. కొన్ని వందల సినిమాల్లో మెప్పించిన హాస్య బ్రహ్మ ఆస్తులు ఎంత సంపాదించారో తెలుసుకుందాం. చదువుకోవడానికి డబ్బుల్లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఇవాళ ఆయన బర్త్డే కావడంతో అభిమానుల్లో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. తాజా సమాచారం ప్రకారం.. ఆయన స్థిర, చరాస్థులు కలిపి దాదాపు రూ. 500 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా. లగ్జరీ కార్లు.. ఆయనకు కోట్లు విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందట. దీనితో పాటు జూబ్లీహిల్స్లో ఓ లగ్జరీ ఇల్లు కూడా. కార్ల విషయానికొస్తే ఆడి క్యూ7, క్యూ8(ఆడి ఆర్8, ఆడి క్యూ7)తో పాటు మెర్సిడెజ్ బెంజ్ కారు ఉందట. ఇలా నటుడిగా బ్రహ్మీ బాగానే ఆస్తులు సంపాదించారట. అయితే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. ఆత్మకథ రాసుకున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాదు.. చిత్ర కళాకారుడనే విషయం తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. ఒకప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధించిన బ్రహ్మనందం.. నేడు తిరుగులేని నటుడిగా తన పేరు చరిత్రలో లిఖించుకున్నారు. ఇటీవలే మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని మెగాస్టార్, రామ్చరణ్కు అందించారు. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. -
తిరుమల లో టాలీవుడ్ నటుడు బ్రహ్మానందం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ, బ్రహ్మానందం, సునీత (ఫోటోలు)
-
'గేమ్ ఛేంజర్' సెట్లో చరణ్.. ఆ పుస్తకంపై స్పెషల్ ట్వీట్
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మర్యాద పూర్వకంగా కలిశారు. బ్రహ్మీ.. తన జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన అంశాలతో, అనుభవాలతో 'నేను' అనే పుస్తకాన్ని రాశారు. ఈ మధ్యే దీన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ పుస్తకాన్ని హీరో చరణ్కి బ్రహ్మానందం బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన మెగాహీరో.. తన అభిప్రాయాన్ని కూడా క్యాప్షన్ రూపంలో రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) 'బ్రహ్మానందం.. తమ జీవితంలోని అనుభవాలతో 'నేను' రాశారు. అత్యద్భుతమైన ఆయన జీవిత ప్రయాణాన్ని ఇందులో సంక్షిప్తం చేశారు. అక్కడక్కడా చమత్కారంతో, మనసులోని ఎన్నెన్నో విషయాలను ఇందులో రాసుకున్నారు. ఓ వైపు జీవిత పాఠాలను నేర్పుతూ, అనుభవాలను పంచుకుంటూ, అక్కడక్కడా నవ్విస్తూ, ఎన్నో సినిమాల సంగతులను గుర్తుచేస్తూ, ఆద్యంతం అద్భుతంగా సాగింది ఈ పుస్తకం. బ్రహ్మానందంగారు రాసిన ఆటోబయోగ్రఫీ 'నేను' అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకం ఇది' అని చరణ్ ట్వీట్ చేశారు. తాజాగా హైదరాబాద్లో 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ మొదలైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బ్రహ్మానందం కూడా ఓ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఆటోబయోగ్రఫీని చరణ్కు బహుకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చాలారోజుల తర్వాత బ్రహ్మీ-చరణ్ షూటింగ్లో పాల్గొనడం, సరికొత్త లుక్లో కనిపించారు. (ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?) Journeying through the incredible life of #Brahmanandam Garu in 'NENU,' his autobiography crafted with humor and heart. 📘 These pages hold the essence of laughter, life lessons, and the cinematic charm he brought to us all. Order the book through this link:… pic.twitter.com/kY7qgaFtrS — Ram Charan (@AlwaysRamCharan) January 10, 2024 -
బ్రహ్మానందం తొలి సంపాదన ఎన్ని రూపాయలో తెలుసా?
ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు, చెప్పులు కూడా కొనుకోలేని దుస్థితిలో ఉన్న పిల్లవాడు లెక్చరర్గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. సైకిలే గొప్ప అనుకునే ఆయన కార్లలో తిరిగాడు. విద్యార్థులకు పాఠాలు బోధించే అతడు ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం నటుడిగా ముఖానికి రంగు వేసుకున్నాడు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఆయనే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన ఆయన నేను మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. గత నెలాఖరున ఈ పుస్తకం విడుదలైంది. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. దగ్గర డబ్బులు లేవు ఈ పుస్తకంలో తన గురించి ఎవరికీ తెలియని విషయాలను పొందుపరిచాడు. తన చదువంతా ఎవరో ఒకరి సాయంతోనే కొనసాగిందని తెలిపాడు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవు. సరిగ్గా అప్పుడే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం కళను, కామెడీని చూసి MA తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. పూర్తిగా ఆమె మీద ఆధారపడితే బాగోదని, కనీసం తినడానికి అయినా సంపాదించాలని ఏదో ఒక పని చేద్దామనుకున్నాడు. లారీలకు రంగు వేసే పనిలో.. నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలు రిపేర్లు చేస్తూ పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశాడు. అప్పుడు నెల జీతంలా కాకుండా పనిని బట్టి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా చిన్నపాటి పనులు చేసుకుంటూ, దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్గా మారాడు. మరోవైపు తనలోని కామెడీ యాంగిల్తో ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగాడు. చదవండి: వర్మ ఆడిషన్కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు -
కమెడియన్ బ్రహ్మానందం మరో టాలెంట్.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
బ్రహ్మానందం పేరు చెప్పగానే మనలో చాలామంది ముఖంపై ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. 1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ.. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోవడం, వయసు అయిపోవడంతో సినిమాలు బాగా తగ్గించేశారు. ఇలాంటి టైంలో తనలోని వేరే టాలెంట్స్ని బయటకు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు అలా ఓ పని చేయగా, దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) బ్రహ్మానందం అనగానే కమెడియన్ అనే గుర్తొస్తుంది. అయితే ఆయనలో మంచి ఆర్టిస్టు కూడా ఉన్నాడు. చాలాసార్లు దేవుడి చిత్రాల్ని తన చేతులతో గీశారు. వాటిని పలువురు హీరోలకు బహుమతిగా ఇచ్చారు. లాక్డౌన్ టైంలో బ్రహ్మీలో డ్రాయింగ్ ప్రతిభ బయటపడింది. ఇప్పుడు ఏకంగా ఈయనలో రైటప్ ఉన్నాడని తెలిసింది. 'నేను' పేరుతో తన జీవితాన్నే పుస్తకంగా రాసి ప్రచురించేశారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. 'నాకు అత్యంత ఆప్తుడు, ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందాన్ని అందించిన వ్యక్తి మనందరి బ్రహ్మానందం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకు ఎదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకు అందించడం ఆనందంగా ఉంది. ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం, మార్గదర్శకం కావొచ్చు. చదివే ప్రతిఒక్కరికీ ఈ బుక్ ఇన్సిపిరేషన్ అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, దీన్ని రాసిన ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని చిరు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇకపోతే ఈ పుస్తకం ధర రూ.275. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇది అందుబాటులో ఉంది. (ఇదీ చదవండి: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా… pic.twitter.com/0wg2p7LqNF — Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023 -
‘యానిమల్’లో హీరో బ్రహ్మానందం అయితే.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో కమెడియన్ బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నెట్టింట యాక్టివ్గా ఉండరు కానీ..ఆయన మీమ్స్ మాత్రం వైరల్ అవుతుంటాయి. సినిమాపైనే కాదు ట్రెండింగ్లో ఏ అంశం ఉన్నా..బ్రహ్మానందంపై మీమ్స్ రెడీ అయిపోతుంటాయి. అవి చూస్తే చాలు.. సీరియస్ అంశం అయినా సరే..పగలబడి నవ్వేస్తాం. తాజాగా బ్రహ్మానందంకు సంబంధించిన ఓ స్ఫూప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ‘యానిమల్’సినిమాపై చేసిన స్ఫూప్ వీడియా. రణ్బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ రావడంతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేస్తుంది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, అనిల్ కపూర్ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ లో రణబీర్కు బదులుగా బ్రహ్మీని పెట్టి ఓ వీడియోని రూపొందించారు. అందులో బ్రహ్మానందం నటించిన పలు సినిమాల్లోని సీన్లతో వాడేశారు. ఇక అనిల్ కపూర్ పాత్రకి బదులుగా నాజర్ని చూపించారు. బ్రహ్మానందం, నాజర్ తండ్రి కొడుకులైతే..యానిమల్ మూవీ ఇలా ఉంటుందంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యానిమల్’ లోని కొన్ని సీన్లకి సరిగ్గా సూట్ అయ్యేలా బ్రహ్మానందం సినిమాల సీన్లను పెట్టారు. ఇది ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ.. అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూసి నవ్వుకోండి. Bramhi in & as Animal😁✂️ Share & Follow @TeluguBroEdits .#brahmandam #AnimalTheMovie #AnimalPark @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/Cbc5VqwPQU — Telugu Bro (@TeluguBroEdits) December 9, 2023 -
ఓటేయడానికి వెళ్లిన బ్రహ్మానందం.. అక్కడ కూడా కామెడీయే
తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష.. అసెంబ్లీ ఎన్నికలు. ఈరోజు(నవంబర్ 30న) తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు అంతటా 50 శాతానికి పైగా పోలింగ్ జరగ్గా హైదరాబాద్, రంగారెడ్డి మాత్రం పోలింగ్లో వెనకబడ్డాయి. హైదరాబాద్లో ఇప్పటివరకు కేవలం 31% మాత్రమే పోలింగ్ జరగడం గమనార్హం. మరోవైపు సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోండని చెప్తూ లైన్లలో నిలబడి మరీ ఓటేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్బాబు, వెంకటేశ్, రానా, అల్లుఅర్జున్, నాని.. ఇలా పలువురు సినీతారలు కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా కామెడీ కింగ్ బ్రహ్మానందం తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి.. ఓటు హక్కు ఉండి వినియోగించుకోలేనివాళ్లను ఏమంటారు? అని అడిగాడు. దీనికి బ్రహ్మానందం స్పందిస్తూ... 'ఏమంటామండీ.. ఓటు హక్కు ఉపయోగించుకోలేనివాళ్లు అంటాం' అని తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కామెడీ బ్రహ్మ అని ఊరికే అనలేదు.. పోలింగ్ బూత్ వద్ద కూడా కామెడీ పండిస్తున్నాడు మహానుభావుడు అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Legend 🔥😂 #brahmanandam #TelenganaElections2023 pic.twitter.com/aN5SbQO6Sw — Narasimha (@_narasimha___) November 30, 2023 చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- పోలింగ్.. తదితర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం : బ్రహ్మానందం
‘‘ఒక సినిమా తీయడానికే ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం ఓ సంచలనం. తన కుమారుడు ఉపేంద్రని హీరోగా పరిచయం చేయడంతో పాటు ఒకేసారి అతనితో ఐదు సినిమాలు తీస్తున్న అచ్యుతరావుకి అభినందనలు. దీనివల్ల పరిశ్రమను నమ్ముకున్నవారికి అవకాశాలు ఇచ్చి, భోజనం పెట్టినట్లవుతుంది. ‘ఉపేంద్రగాడి అడ్డా’ మంచి హిట్టవ్వాలి’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్పై కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. హైదరాబాద్లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, ‘ఉపేంద్రగాడి అడ్డా’ ట్రైలర్ను, ‘1920 భీమునిపట్నం’ ΄ోస్టర్ను విడుదల చేశారు. అలాగే ఉపేంద్ర హీరోగా ఇదే బ్యానర్లో తీస్తున్న ఐదు సినిమాల టీజర్లను విడుదల చేశారు. కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో నవంబర్ నుంచి ప్రతీ నెల ఒక సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘నా పుట్టిన రోజుకి ఇది వెలకట్టలేని పెద్ద బహుమతి’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర. ‘‘సోషల్ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. హీరోయిన్ సావిత్రీ కృష్ణ, సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు. -
అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ నిర్మాత, ఐకాన్ అల్లు అర్జున్ తండ్రి అని చాలామంది అంటారు. కానీ అప్పట్లో చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారని ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకు చాలామందికి తెలియదు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఆయనతో ప్రయోగం చేద్దామని టాలీవుడ్ యువ దర్శకుడు ఒకరు అనుకున్నారు. కానీ ఆ పాత్ర బ్రహ్మానందంతో చేయించాడు. ఇంతకీ ఏంటా సినిమా? (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) టతరుణ్ భాస్కర్ పేరు చెప్పగానే 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది?' లాంటి క్రేజీ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడా డైరెక్టర్ చాలా ఏళ్ల తర్వాత తీస్తున్న సినిమా 'కీడా కోలా'. థ్రిల్లర్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్తో తీస్తున్న ఈ సినిమాలో సాధారణ ఆర్టిస్టులే ఎక్కువగా నటించారు. సినిమా ఆసాంతం వీల్ ఛైర్లో కూర్చుని ఉండే వరదరాజులు అనే పాత్రలో మాత్రం బ్రహ్మానందం యాక్ట్ చేశాడు. అయితే స్టోరీ అంతా రెడీ కాగానే వరదరాజులు పాత్ర అల్లు అరవింద్ చేస్తే బాగుంటుందని తరుణ్ భాస్కర్ అనుకున్నాడు. తాజాగా 'కీడా కోలా' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని రానాతో చెప్పాడు. అల్లు అరవింద్ దగ్గరకెళ్లి.. మీరు యాక్ట్ చేస్తారా అని తరుణ్ భాస్కర్ అడిగితే.. ఆయన సింపుల్గా నవ్వి ఊరుకున్నారట. దీంతో ఆ పాత్ర కోసం బ్రహ్మీ లైనులోకి వచ్చాడు. నవంబరు 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) -
కీడా కోలా నవ్విస్తుంది
తరుణ్ భాస్కర్ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ వంటి ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. ‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్ ్ర΄÷డక్షన్స్లో చాలా సినిమాల రీమేక్స్ రైట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్ చేయడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్ టైమ్లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్లో ఓ కీడా ఉంటే కన్జ్యూమర్ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్గారితో సురేష్ ప్రొడక్షన్స్లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్ వర్క్ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్ భాస్కర్తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు. -
'మన దగ్గర పైసలెక్కడివిరా సేవ్ చేయడానికి'.. ఆసక్తిగా ట్రైలర్
పెళ్ళిచూపులు, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు, జాతీయ అవార్డ్ గ్రహీత తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అలాగే బ్రహ్మానందం సీన్స్తో కడుపుబ్బా నవ్వుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఈ సినిమా నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి సమర్పణలో నవంబరు 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతమందిస్తున్నారు. Unleashing the madness of #KeedaaCola. Mothaa mogipovaali 💥🥁#KeedaaColaTrailer is here!https://t.co/WNeT1GvOcs#KeedaaColaOnNov3 🪳@TharunBhasckerD @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @SureshProdns @saregamasouth pic.twitter.com/a2RQIpDes7 — Rana Daggubati (@RanaDaggubati) October 18, 2023 -
బ్రహ్మానందం, తన కామెడీ అంటే నాకు చాలా ఇష్టం
-
బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?
స్టార్ హీరో అల్లు అర్జున్.. జాతీయ అవార్డు తనని వరించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ విషెస్ చెబుతూ నిన్నంతా గడిపేశాడు. ఇప్పుడు సడన్గా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ ఆయన్ని కలిశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇంతకీ కారణమేంటి? (ఇదీ చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?) అల్లు అర్జున్-బ్రహ్మానందం బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉంటారు. అయితే గతవారం బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లి జరిగింది. దీనికి హాజరు కాలేకపోయిన బన్నీ.. ఇప్పుడు స్వయంగా ఇంటికెళ్లి మరీ బ్రహ్మీ ఫ్యామిలీని కలిశారు. వాళ్లతో టైమ్ స్పెండ్ చేశారు. అయితే గత వారం మిస్ అయినప్పటికీ, గుర్తుపెట్టుకుని మరీ ఇప్పుడు బ్రహ్మీని ఆయన ఇంట్లోనే బన్నీ కలిశాడు. అలానే తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 'పుష్ప' సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నిలిచాడు. ఈ విషయమై బన్నీతో మాట్లాడిన బ్రహ్మీ.. తన ఇంట్లో అతడిని సన్మానించాడు. ప్రస్తుతం బ్రహ్మీ కుటుంబం, కొడుకు-కోడలుతో అల్లు అర్జున్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?) -
Brahmanandam 2nd Son Haldi Photos: బ్రహ్మానందం చిన్న కోడలు ఐశ్వర్య హల్దీ ఫంక్షన్ (ఫోటోలు)
-
బ్రహ్మానందం చిన్న కోడలి బ్యాగ్రౌండ్ ఇదే!
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన ద్వితీయ కుమారుడు సిద్దార్థ వివాహం శుక్రవారం(ఆగస్టు 18న) ఘనంగా జరిగింది. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడడుగులు నడిచాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త కోడలు ఎవరంటే? గౌతమ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో చాలామంది పెళ్లికూతురు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. బ్రహ్మానందం కొత్త కోడలి పేరు ఐశ్వర్య. ఈమె ప్రముఖ డాక్టర్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ పద్మజ వినయ్ కూతురు. ఐశ్వర్య కూడా డాక్టర్ విద్యనభ్యసించింది. అంటే బ్రహ్మానందం డాక్టర్ను తన ఇంటి కోడలిగా తెచ్చుకున్నాడన్నమాట! ఎంగేజ్మెంట్ సమయంలో హాస్య బ్రహ్మ కొత్త కోడలికి బంగారు నెక్లెస్ ఇచ్చాడట. ఇది కొన్ని లక్షల ఖరీదు చేస్తుందని టాక్ నడుస్తోంది. బ్రహ్మానందం తనయుడి పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి బ్రహ్మానందం ఫ్యామిలీ.. బ్రహ్మానందం విషయానికి వస్తే.. ఆయన వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. ఆయన పెద్ద కుమారుడు రాజా గౌతమ్ తండ్రి బాటలో నడుద్దామని ప్రయత్నించాడు, కానీ సక్సెస్ కాలేకపోయాడు. పల్లకిలో పెళ్లికూతురు, చారుశీల వంటి పలు చిత్రాల్లో కనిపించాడు. ఈయనకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడప్పుడూ బ్రహ్మానందం తన మనవళ్లతో ఆడుకున్న ఫోటోలను గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. చిన్న కుమారుడు గౌతమ్ విదేశాల్లో విద్యనభ్యసించి అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: తెలుగు సినిమాతో ఎంట్రీ.. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్.. రాజకీయాల్లోనూ హల్చల్ -
అంగరంగ వైభవంగా బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ వివాహం
హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం. ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ ఈ రోజు ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముడులు వేశారు. సిద్ధార్థ, ఐశ్వర్యల వివాహం శుక్రవారం (ఆగస్టు 18) రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు గల అన్వయ కన్వెన్షన్స్ లో జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు... తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ, మంచు మోహన్ బాబు, మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాస రావు, రాజశేఖర్ జీవిత దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పాటు చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దమ్మాయి సుష్మిత, శ్రీకాంత్ ఫ్యామిలీ, సాయి కుమార్ ఫ్యామిలీ, మంచు విష్ణు దంపతులు, మంచు మనోజ్ దంపతులు, దర్శకులు కోదండరామిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల, నటులు రావు రమేష్, ఆలీ ఫ్యామిలీ, ఎల్బీ శ్రీరామ్, నిర్మాతలు శివలెంక కృష్ణ ప్రసాద్, బెల్లంకొండ సురేష్, అచ్చిరెడ్డి, ఆదిశేషగిరిరావు, కెఎల్ నారాయణ, రఘు బాబు తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
Brahmanandam Son Siddharth: బ్రహ్మనందం కుమారుడి పెళ్లిలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ... చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు.
-
హీరోగా స్టార్ కమెడియన్.. బ్రహ్మానందంతో కలిసి!
కామెడీ రోల్స్ నుంచి హీరోగా మారిన నటుడు సంతానం. ఇతడి కంటే ముందు వడివేలు, వివేక్ లాంటి కమెడియన్స్ హీరోలు అయ్యారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. సంతానం మాత్రం హీరోగా హిట్స్ కొడుతున్నాడు. ఆ మధ్య కొన్ని చిత్రాలు నిరాశపరిచినా.. ఈ మధ్యే 'డీడీ రిటర్న్స్' హిట్ కావడంతో సంతానంలో జోష్ వచ్చింది. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) ఈ క్రమంలోనే తాజాగా 'కిక్' మూవీతో అలరించడానికి సిద్ధమైపోయాడు. ఫార్చూన్ పతాకంపై సంతానం హీరోగా నటించిన చిత్రం కిక్. కన్నడంలో లవ్ గురు, గాని బనానా, విజిల్, ఆరెంజ్ మూవీస్ తీసిన ప్రశాంత్ రాజ్ దర్శకత్వం వహించారు. తాన్యా హోప్ హీరోయిన్. ఇందులో తంబిరామయ్య, బ్రహ్మానందం, సెంథిల్, మన్సూర్ అలీ ఖాన్, మనోబాల, వైజీ మహేంద్రన్, షకీలా, స్కూల్ సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ ఈ జనవరిలోనే విడుదలైంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల రిలీజ్ కొంత ఆలస్యం అయిందని నిర్మాతలు పేర్కొన్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కిక్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) -
కమెడియన్ రచ్చ రవి బర్త్డే.. సినీ సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు.. సీఎం కేసీఆర్ను కలిసిన హాస్యబ్రహ్మ
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన రెండో తనయుడు సిద్దార్థ్.. డాక్టర్ ఐశ్వర్యతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. త్వరలో హైదరాబాద్లో జరగనున్న పెళ్లి కోసం అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారిని బ్రహ్మానందం కుటుంబ సమేతంగా కలిసి పెళ్లి పత్రిక అందజేశారు. తన కుమారుడి పెళ్లికి తప్పకుండా రావాల్సిందిగా కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాజా గౌతమ్ 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పలు చిత్రాల్లో నటించారు. గౌతమ్కు ఇదివరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం తన మనవళ్లతో కలిసి ఆడుకున్న ఫోటోలను అప్పుడప్పుడూ షేర్ చేస్తుంటారు గౌతమ్. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడికి సినిమాల మీద ఆసక్తి లేకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరంగా ఉంచినట్లు సమాచారం. చదవండి: ఆ సినిమాకు రూ.250 కోట్లా?: కంగనా ఫైర్ -
బ్రహ్మానందం కోసం మహేష్ బాబు ఏం చేశారంటే..?
తెలుగు సినీ ప్రపంచంలో హాస్యనటుడు బ్రహ్మానందానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన హాస్యం వల్ల హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో నటించిన ఆయన.. తెరపై కనిపించినప్పుడల్లా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. అలా గిన్నిస్బుక్ రికార్డును కూడా కైవసం చేసుకున్న లెజండరీ కమెడియన్ ఆయన. బ్రహ్మానందం స్క్రీన్పై కనిపిస్తే, ఎవరైనా నవ్వడం అనేది కామన్ పాయింట్. బ్రహ్మీతో టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. (ఇదీ చదవండి: భారత్లో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో దిగాడు) అలాంటి వాటిలో బ్రహ్మానందం-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో అంటే వెరీ స్పెషల్. త్రివిక్రమ్ నుంచి వచ్చిన చాలా సినిమాల్లో బ్రహ్మానందం కనిపించి సందడి చేశారు. ముఖ్యంగా మహేష్బాబు సూపర్ హిట్ సినిమా 'అతడు'లో బ్రహ్మనందం చేసిన కామెడీ సీన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాత్రకు సంబంధించిన మీమ్స్ వాడుతూనే ఉంటారు. బ్రహ్మానందం-త్రివిక్రమ్ కాంబో నుంచి వచ్చిన ఖలేజా, జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా అదే రేంజ్లో మెప్పిస్తాయి. కానీ 'అరవింద సమేత, అఆ, అజ్ఞాతవాసి' చిత్రాలలో బ్రహ్మీ కనిపించలేదు. వారి కాంబినేషన్లో వచ్చే సినిమాలు ఎవరికైనా ఇప్పటికీ అలా చూస్తూ చూడాలనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఆస్కార్లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ) తాజాగా టాలీవుడ్లో వినిపిస్తున్న వార్త ఏమిటంటే.. 'గుంటూరు కారం' సినిమాలో బ్రహ్మానందం సందడి చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత త్రివిక్రమ్ సినిమాలో మళ్లీ ఆయన కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి అయిందట. కానీ ఈ స్క్రిప్ట్లో మార్పులు చేసి బ్రహ్మీకి ఓ పాత్ర క్రియేట్ చేయాలని ప్రిన్స్ మహేష్ సూచించారట. దీంతో త్రివిక్రమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. బ్రహ్మీ కోసం ఆడియన్స్ను మెప్పించే ఓ పాత్రను డిజైన్ చేశారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. దీంతో మహేష్ ఫ్యాన్స్ కూడా గుంటూరు కారంతో పాటు గుంటూరు కామెడీ కూడా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. -
బ్రహ్మానందం చేతి నుంచి జాలువారిన కళాఖండాలు (ఫోటోలు)
-
బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా?
బ్రహ్మనందం టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్గా ఆయన తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో బ్రహ్మనందం లేకపోతే ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో బ్రహ్మనందం అంటే అంతలా ఫేమస్.. మరీ ఆయన కుమారుడు రాజ గౌతమ్ ఈ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు. తండ్రి బాటలో నడిచిన ఇండస్ట్రీలో నిలదొక్కుకొలేకపోయారు. (ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!) పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో గుర్తింపు వచ్చినా అంతగా ఫేమ్ రాలేదు. ఆ తర్వాత బసంతి, చారుశీల, మను లాంటి చిత్రాల్లో కనిపించారు. అలా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న గౌతమ్.. తాజాగా బ్రేక్ అవుట్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. అయితే గౌతమ్కు సినిమాల్లో నటించడం అసలు డ్రీమ్ కాదట. మరీ రాజ గౌతమ్ సినిమాలు కాకుండా ఏం చేస్తాడో మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. కేవలం టైమ్ పాస్ కోసమే సినిమాలు చేస్తుంటాడని టాక్ వినిపిస్తోంది. ఆయన అసలు వృత్తి వ్యాపారం. గౌతమ్కు హైదరాబాద్లో కమర్షియల్ కాంప్లెక్స్లతో పాటు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టారట. అంతేకాకుండా బెంగళూరులోనూ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయట. కేవలం వాటి ద్వారానే నెలకు రూ.30 కోట్ల రూపాయిల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత సంపాదన వస్తే ఇంకా సినిమాల్లో నటించాల్సిన అవసరమేముంది మీరే చెప్పండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు సినిమాలు చేస్తుంటాడని చెబుతున్నారు అంతే. (ఇది చదవండి: అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!) View this post on Instagram A post shared by Raja Goutham (@rajagoutham) -
బ్రహ్మానందాన్ని ఎప్పుడు ఇలా చూడలేదు..
-
కొత్త వాళ్లను ప్రోత్సహించాలి
‘‘జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాల్లో తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్లీ ఇంతమందిని (దాదాపు 50 మంది) ఒక్క దగ్గరికి చేర్చి ‘అన్స్టాపబుల్’ లాంటి మంచి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలని యువ దర్శకులు, నటులు ప్రోత్సహించాలి.. అప్పుడే చిత్ర పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అన్స్టాపబుల్’లో నటించిన వారందరూ ఒక బ్రహ్మానందం కావాలి’’ అన్నారు. ‘‘డైమండ్ రత్నబాబులాంటి దర్శకులు సక్సెస్ అయితే మాలాంటి వాళ్లకు మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘అన్స్టాపబుల్’ పై ఉన్న నమ్మకంతో రిలీజ్కి ముందే నాకు కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాత రజిత్ రావు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘ఫ్యామిలీతో చూసే చిత్రం ఇది’’ అన్నారు రజిత్ రావు. -
హాస్యనటుడు బ్రహ్మానందానికి ఎన్టీఆర్ పురస్కారం
విజయవాడ కల్చరల్: సినీ నటుడు ఎన్టీ రామారావు పురస్కారం అందుకోవడం మహాభాగ్యమని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా బ్రహ్మానందానికి ఎన్టీఆర్ ప్రధాన పురస్కారం, వివిధ రంగాలకు చెందిన 35 మందికి ఎన్టీఆర్ సెంటినరీ పురస్కారాలు అందించారు. (చదవండి: కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!) ఎక్స్రే సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ ఎన్టీఆర్తో తక్కువ సినిమాలే నటించినా ఆయన వద్ద ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ యుగం స్వర్ణ యుగమని చెప్పారు. ఎక్స్రే సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి సభను నిర్వహించారు. శాసన సభ్యుడు గద్దె రామ్మోహన్రావు, టీడీపీ మహిళా నాయకురాలు నన్నపనేని రాజకుమారి తదితరులు మాట్లాడారు. -
ఘనంగా బ్రహ్మానందం చిన్న కొడుకు నిశ్చితార్థం (ఫోటోలు)
-
అట్టహాసంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం వీడియో
-
బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. డాక్టర్ ఐశ్వర్యతో ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, సుబ్బిరామిరెడ్డి సహా పలువురు సినీ సెలబ్రిటీలు విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే. చదవండి: నటిని పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఆమెను మోసం చేశావంటూ ట్రోల్స్ పెద్ద కొడుకు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.గౌతమ్కు ఇది వరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కర్ణాటక ఎన్నికల ప్రచార ‘సిత్రాలు’ గ్యాలరీ
-
నటుడు బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం
కర్ణాటక: చిక్కబళ్లాపురం బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ తరఫున తెలుగు హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమ్మగుట్టహళ్లి, మండికల్లు పెరేసంద్ర పరిధిలో సుధాకర్తో కలిసి రోడ్షో నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి సుధాకర్ కృషి చేశారని, ఆయన్ను గెలిపించాలని కోరారు. అంతకుముందు సుధాకర్ మాట్లాడుతూ చిక్కబళ్లాపురంలో నీట్ అకాడమి ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రూ.2వేలు వంతున పంచుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. -
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మనందం ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా?
బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రణరంగం చివరి అంకానికి చేరుకుంటోంది. ఎన్నికలకు ఇంకా వారం రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ, అమిత్ షా, ప్రియాంక గాంధీ, ఖర్గేతో సహా అన్ని పార్టీల ముఖ్యనేతలంతా రాష్ట్రంలోనే మకాం వేశారు. త్రిముఖ పోరు నెలకొన్న కర్ణాటకలో గెలుపెవరిదనేది ఉత్కంఠగా మారింది. కాగా ఎన్నికల ప్రచారంలో సినీతారలు మెరుస్తున్నారు. ఇప్పటికే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్కు మద్దతుగా రాహుల్గాంధీ ప్రచారంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సందడి చేశారు. తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడు చేరాడు. అయితే ఆయన టాలీవుడ్కు చెందిన ఫేమస్ కమెడియన్ కావడం గమనార్హం. చదవండి: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ కోసం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా ఉన్న కే సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు. చిక్కబళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి సుధాకర్కు మద్దతు తెలుపుతూ ఆయనకు ఓటేయాలంటూ క్యాంపెయిన్ నిర్వహించారు. రోడ్డు షో ద్వారా ప్రజలతో సందడి చేశారు. చదవండి: Anil Dujana: యూపీలో ఎన్కౌంటర్.. మరో గ్యాంగ్స్టర్ హతం -
‘రంగమార్తాండ’ క్లైమాక్స్ అలా ఉండి ఉంటే మరింత బాగుండేది
పరుచూరి గోపాలకృష్ణ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన రివ్యూలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవలే విడుదలైన సూపర్ హిట్ టాక్ అందుకున్న 'రంగమార్తాండ' చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక, అనసూయ ప్రధానపాత్రల్లో నటించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..'సినిమా గురించి నేను ఎక్కువ చెప్పడం లేదు. ఈ సినిమాలో జీవితం గురించి ఉంది కాబట్టి చెబుతున్నా. ప్రస్తుత సమాజంలో ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉంటే చూసి కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయిని చంపుతుంటే ఎవరు పట్టించుకోకుండా వీడియోలు తీసే సీన్తోనే సినిమా ప్రారంభమైంది. ప్రపంచంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, రాహుల్, అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ అద్భుతంగా నటించారు. శివాత్మిక పాత్ర అద్దం పట్టేలా ఉంటుంది. ఒక కూతురు తన తండ్రిని సెల్లార్లో పడుకోమని చెప్పినప్పుడు ప్రేక్షకులకు తప్పకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. ఈ సినిమాలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. బ్రహ్మానందం అంటే నవ్విస్తాడనుకుంటాం. కానీ ఆయన ఏడిపించగలడని ఈ సినిమాలో నిరూపించారు. మన అమ్మా, నాన్నలను మించినది ఏది లేదు. మనకు ఏది రాదు కూడా. అందుకే వారిని పదిలంగా చూసుకుందాం. ఈ సినిమా చూశాక ఎవరైనా తమ అమ్మా, నాన్న దగ్గరకు వెళ్లి ఉంటే కృష్ణవంశీ జన్మ ధన్యమైనట్లే. కళాభారతిని చూసి రాఘవరావు అంటే ప్రకాశ్ రాజ్ కన్న మూయడం. పిల్లలందరూ వచ్చి చూడడంతో క్లైమాక్స్ చూపించారు. కళాభారతిని పునర్ నిర్మాణం చేయించి.. రాఘవరావు సౌజన్యంతో అని పెట్టి క్లైమాక్స్ సీన్ తీసి ఉంటే ఇంకా బాగుండేది. ఈ విషయాన్ని కృష్ణవంశీతో చెప్పా. కానీ ఒరిజినల్ కథలో అలా లేదు. అందుకే పెట్టలేదన్నారు. ప్రకాశ్రాజ్కు, బ్రహ్మనందానికి మధ్య ఉండే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం నటనా ప్రావీణ్యాన్ని తెలిసేలా ఇంకొన్ని షాట్స్ పెట్టి ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేది. కన్నీళ్లు రావు అనుకున్న వాళ్లకు కూడా కన్నీళ్లు తెప్పించే సినిమా ఇది.' అని పరుచూరి వివరించారు. -
నవ్వుకు బ్రేక్.. కన్నీళ్లు పెట్టిస్తున్న కమెడియన్స్!
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. కామెడీకి మించిన ఎంటర్టైన్మెంట్ ఏం ఉంటుంది? ఎంత సీరియస్ సినిమా అయినా.. అందులో కాసింత కామెడీ లేకపోతే ఆడియన్స్ సహించరు. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కామెడీకీ, కమెడియన్స్కి మన దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. కమెడియన్స్ వల్లే సినిమాలు సక్సెస్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది. సీరియస్ కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సీరియస్ సినిమాలు ఎక్కువైయ్యాయి. దీంతో కమెడియన్స్ కూడా తమ రూటు మర్చారు. తమదైన హాస్యంతో ఆడియన్స్ పొట్ట చెక్కలయ్యే గిలిగింతలు పెట్టిన కమెడియన్స్.. ఇప్పుడు భయపెడుతున్నారు.. ఏడిపిస్తున్నారు. నవరసాలను పండిస్తూ ‘వావ్’ అనిపిస్తున్నారు. నవ్వుకు బ్రేక్ ఇచ్చిన బ్రహ్మీ దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు విరామం లేకుండా తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు బ్రహ్మానందం. ఆయన పేరు విన్నా..ఫొటో చూసినా నవ్వు రావాల్సిందే. సోషల్మీడియా ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఫన్నీ మీమ్స్ బ్రహ్మానందం ప్రస్తావన లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. అంతలా కామెడీ పండించిన బ్రహ్మీ.. సడెన్గా నవ్వుకు బ్రేక్ ఇచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగమార్తాండ’లో చక్రపాణిగా సీరియస్ పాత్రలో నటించి తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బ్రహ్మానందంలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అనుకుంటారు. ఇన్నాళ్లు తనదైన కామెడీతో నవ్వించిన బ్రహ్మానందం..‘రంగమార్తాండ’తో ప్రేక్షకులను ఏడిపించాడు. భయపెట్టిన సునీల్ భీమవరం యాసతో అందరిని నవ్విస్తూ స్టార్ కమెడియన్గా ఎదిగాడు సునీల్. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితో కలిసి నటించి, తనదైన మార్కు కామెడీకి సరి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు. ఆ తర్వాత ‘అందాల రాముడు’తో హీరోగా మారాడు. సిక్స్ఫ్యాక్స్ చూపించాడు. అదరిపోయే స్టెప్పులతో అలరించాడు. కానీ వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. రూటు మార్చి మళ్లీ కమెడియన్గా మారాడు. కానీ లెక్కల మాస్టార్ సుకుమార్ మాత్రం సునీల్ని సీరియస్ ట్రాక్ ఎక్కించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రంలో మంగళం శ్రీనుగా సునీల్ నటన, ఆహార్యం కొత్తగా అనిపించింది. సునీల్ బెదిరిస్తే.. ఆడియన్స్ భయపడ్డారు. దీంతో అదే పంథాను కొనసాగిస్తున్నాడు. పుష్ప 2లోనూ సునీల్ సీరియస్ లుక్లో కపించబోతున్నాడు. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘జైలర్’లోనూ సునీల్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ‘సీరియస్’ నరేశ్ రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీ హీరోగా రాణించిన వ్యక్తి ‘అల్లరి’ నరేశ్. తొలి సినిమా ‘అల్లరి’ నుంచి 2021లొ వచ్చిన ‘బంగారు బుల్లోడు’ వరకు తనదైన కామెడీతో నవిస్తూ హాస్యరస చిత్రాలకు కేరాఫ్గా నిలిచాడు. కానీ ఇప్పుడే ఈ కామెడీ స్టార్ సీరియస్ బాట పట్టాడు. 2021లో వచ్చిన ‘నాంది’ చిత్రంతో సీరియస్ కథలకు శ్రీకారం చుట్టాడు. తాజాగా ఆయన నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రంలో పవర్ఫుల్ పోలీసు అధికారిగా నరేశ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రం మే 5న విడుదల కాబోతుంది. నవ్విస్తూనే..ఏడిపించిన దర్శి తెలంగాణ యాసలో కామెడీ పండిస్తూ అందరిని నవ్విస్తున్న ప్రియదర్శి.. మధ్య మధ్యలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ‘మల్లేశం’ సినిమాతో తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇక బలగం సినిమాతో అందరిని నవ్విస్తూనే.. చివర్లో తనదైన నటనతో ఏడిపించాడు. ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగలడని ఈ చిత్రంతో నిరూపించాడు. కన్నీళ్లు పెట్టించిన కోవై సరళ టాలీవుడ్లో లేడీ కమెడియన్స్ అనగానే అందరికి గుర్తొంచే పేరు కోవై సరళ. కోవై సరళ, బ్రహ్మానందం కాంబినేషన్ గురించి ఎంత సూపర్ హిట్టో అందరికి తెలిసిందే. వీరిద్దరి కోసం స్పెషల్ ట్రాక్లు రాసుకునేవారు మన దర్శకులు. అయితే గతకొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది కోవై సరళ. ఇటీవల ఆమె నటించిన తమిళ మూవీ ‘సెంబి’ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో కోవై సరళ తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది. తన మనవరాలికి జరిగిన అన్యాయంపై ఓ బామ్మ చేసే పోరాటమే ఈ చిత్రం. ఇందో బామ్మగా నటించిన కోవై సరళ.. తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది. కొన్ని సన్నివేశాల్లో కోవై సరళ నటన చూస్తే.. కన్నీళ్లు ఆగవు. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయింది. సత్యం రాజేశ్ నట విశ్వరూపం ఇన్నాళ్లు తనదైన కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించిన సత్యం రాజేశ్.. ‘మా ఊరి పొలిమేర’ వెబ్ సిరీస్తో అందరిని భయపెట్టాడు. ఉత్కంఠగా సాగే ఆ వెబ్ సిరీస్లో ఆటో డ్రైవర్ కొమిరిగా సత్యం రాజేశ్ జీవించేశాడు. క్లైమాక్స్లో ఆయన ఇచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. అందరిని భయపెట్టిస్తాడు. త్వరలోనే ‘మా ఊరి పొలిమేర 2’ కూడా రాబోతుంది. ఇందులో సత్యం రాజేశ్ నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. బలగం వేణు జబర్దస్త్ కామెడీ షోతో అందరికి పరిచమైన కమెడియన్ వేణు. చాలా కాలంగా కమెడియన్గా రాణిస్తున్న వేణుకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ‘బలగం’ మూవీతో వేణు పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది. కమెడియన్ వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా? అని అందరు చర్చించుకునేలా చేసింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వేణు తెరకెక్కించిన ‘బలగం’ చిత్రం..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ వేణు ప్రతిభ గురించే చర్చిస్తున్నారు. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.ఇలా వెండితెరపై నవ్వులు కురిపించే కమెడియన్స్.. నవ్వుకు బ్రేక్ ఇచ్చి.. సీరియస్ ట్రాక్ ఎక్కి మెప్పిస్తున్నారు. -
రెండు పూటలు తినడానికి కూడా లేదు, ఆర్థిక ఇబ్బందులు: బ్రహ్మానందం
నవ్వినంత ఈజీ కాదు నవ్వించడం.. కానీ కమెడియన్లు రకరకాల డైలాగులతో, స్కిట్లతో, పంచులతో, చేష్టలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారు. సింగిల్ డైలాగ్ లేకుండా కేవలం హావభావాలతోనూ నవ్వించగల దిగ్గజ నటుడు బ్రహ్మానందం. అందుకే ఆయన్ను హాస్యబ్రహ్మ అని పిలుస్తారు. ఇప్పటివరకు కేవలం కామెడీ తరహా పాత్రలే చేసిన ఆయన రంగమార్తాండలో వైవిధ్యమైన పాత్ర పోషించాడు. బ్రహ్మీని ఇలా చూడటం కొత్తగా ఉందంటున్నారు ఆడియన్స్. తాజాగా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 'నా జీవితంలో జరుగుతున్నదేదీ ముందుగా ఊహించలేదు. రెండు పూటలా తినడానికి కూడా ఆలోచించుకున్న రోజులున్నాయి. అటువంటిది ఎమ్ఏ చదివాను, లెక్చరర్ ఉద్యోగం చేశాను. ఊహించకుండా సినిమాల్లోకి వచ్చాను. ఇలా అవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. అంతకుముందు డబ్బు కోసం ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు మంచి స్థానంలోకి వచ్చాక పేరు కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను. ఎవరైనా సరే ఎదుటివారు బాగుండాలని కోరుకుంటారు. కానీ తమ కన్నా బాగుండాలని మాత్రం కోరుకోరు. నేను స్టార్ హీరోలందరితోనూ పనిచేస్తూ ఎదుగుతున్నప్పుడు చాలామంది అసూయపడ్డారు. సుధాకర్ వచ్చాడు బ్రహ్మానందం పనైపోయింది, బాబూ మోహన్, ఎల్బీ శ్రీరామ్ వచ్చారు.. ఇక బ్రహ్మీ పనైపోయినట్లే, పృథ్వీ వచ్చాడు బ్రహ్మీ వెనకబడిపోయాడు.. ఇలా కొత్తగా ఏ కమెడియన్ వచ్చినా సరే నా పనైపోయింది అన్నారు. ఇవన్నీ దాటుకుంటూ ఇక్కడిదాకా వచ్చాను. రంగమార్తాండ సినిమాలో ఆ పాత్ర మీరు తప్ప ఇంకెవరు చేయగలరు మాస్టారు అని కృష్ణవంశీ అన్నారు. నాకది చాలు' అని చెప్పుకొచ్చాడు బ్రహ్మానందం. -
ఓటీటీలో రంగమార్తాండ.. అప్పుడే రిలీజ్!
ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల థియేటర్లలో అలరిస్తోంది. మరాఠీ సూపర్ హిట్ ‘నట సామ్రాట్’ మూవీకి రీమేక్గా తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రంగమార్తాండ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజైన నాలుగు వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేగాక.. సినిమాకు పెట్టిన బడ్జెట్లో దాదాపు 70 శాతానికి పైగా రికవరీ అయ్యేలా డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. -
రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి ప్రశంసలు
ఆడియెన్స్ని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకునే కమెడియన్ బ్రహ్మానందం. స్క్రీన్పై ఆయన ఒక్కసారి కనిపిస్తే చాలు, స్టార్ హీరోలకు ధీటుగా రెస్పాన్స్ వస్తుంటుంది. అయితే కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్లో రన్ అవుతోంది. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని అనుకుంటున్నారు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ఆడియెన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు. -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో ఉగాది వేడుకలు ( ఫొటోలు)
-
ఆయన నటనలోని మ్యాజిక్ని చూశా: ప్రకాశ్రాజ్
ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన ΄ాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వంలో కాలిపు మధు, ఎస్. వెంకట్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ.. ‘‘మరాఠీ ‘నటసామ్రాట్’ సినిమా చూశాక ఒక కళాకారుడి జీవితంలో ఉన్న బరువు నాకు అర్థం అయింది. ఇలాంటి కథను నేను చూపించాలని అనుకున్నాను. ‘నటసామ్రాట్’ గురించి కృష్ణవంశీకి చెప్పగానే బాగుందన్నాడు. ఎమోషన్స్ చక్కగా ప్రెజెంట్ చేయగలడని తనని ఈ సినిమా రీమేక్ ‘రంగ మార్తాండ’కు దర్శకత్వం వహించమని కోరాను. బ్రహ్మానందంగారితో కలిసి వర్క్ చేయడం వల్ల ఆయన నటనలోని మ్యాజిక్ను చూసే అవకాశం దొరికింది’’ అన్నారు. ‘‘ప్రకాశ్రాజ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. ఎన్నో సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న అద్భుత నటులు బ్రహ్మానందం ఈ సినిమా కోసం కొత్త ఆర్టిస్టులా నటించారు’’ అన్నారు కృష్ణవంశీ. ‘ఈ చిత్రం క్లయిమాక్స్లో ప్రకాశ్రాజ్ నట విశ్వరూపం చూస్తారు. ప్రతి సీన్ని కృష్ణవంశీ చక్కగా తెరకెక్కించారు’’ అన్నారు బ్రహ్మానందం. -
Rangamarthanda Review: ‘రంగమార్తాండ’ రివ్యూ
టైటిల్: రంగమార్తాండ నటీనటులు: ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నిర్మాతలు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి దర్శకత్వం : కృష్ణవంశీ సంగీతం: ఇళయరాజా సినిమాటోగ్రఫీ: రాజ్ కె.నల్లి విడుదల తేది: మార్చి 22, 2023 క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా ‘నక్షత్రం’(2017) బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడింది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ..ఇప్పుడు ‘రంగమార్తాండ’తో వచ్చాడు. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. దానికి తోడు ప్రమోషన్స్లో భాగంగా సినీ ప్రముఖులు, సామాజిక కార్యకర్తలతో పాటు మీడియాకు కూడా పలుమార్లు ప్రిమియర్స్ వేడయంతో ‘రంగమార్తాండ’కు బజ్ ఏర్పడింది. భారీ అంచనాల ఉగాది సందర్భంగా మార్చి 22న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ‘రంగమార్తాండ’ కృష్ణవంశీకి కమ్బ్యాక్ చిత్రమైయిందా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. రాఘవరావు(ప్రకాశ్ రాజ్) ఓ రంగస్థల కళాకారుడు. తన నటనతో ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో కీర్తిప్రతిష్టతలను సాధిస్తాడు. ఆయన ప్రతిభకు మెచ్చి ‘రంగమార్తాండ’బిరుదుని ప్రదానం చేస్తారు అభిమానులు. అయితే ఆ సత్కార సభలోనే తన రిటైర్మెంట్ని ప్రకటించి అందరికి షాకిస్తాడు. అంతేకాదు తన ఆస్తులను పిల్లలకు పంచిస్తాడు. కొడుకు రంగారావు(ఆదర్శ్), కోడలు గీత(అనసూయ)లకు ఇష్టపడి కట్టుకున్న ఇంటిని, అమ్మాయి శ్రీ(శివాత్మిక రాజశేఖర్)కి తాను ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న సొమ్ముని అప్పగిస్తాడు. ప్రేమించిన వ్యక్తి(రాహుల్ సిప్లిగంజ్)తో కూతురు పెళ్లి కూడా చేస్తాడు. ఇలా బాధ్యతలన్ని తీర్చుకున్న రాఘవరావు శేష జీవితాన్ని భార్య(రమ్యకృష్ణ)తో ఆనందంగా గడపాలనుకుంటాడు. మరి రాఘవరావు అనుకున్నట్లుగా శేష జీవితం ఆనందంగా సాగిందా? తను ఇష్టపడి కట్టుకున్న ఇంటి నుంచే ఆయన ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? పిల్లలే తన సర్వస్వం అనుకున్న రాఘవరావు దంపతులకు జీవితం ఎలాంటి పాఠం నేర్పించింది? భర్తే సర్వస్వం అనుకొని నమ్ముకున్న భార్యకు, చిన్నప్పటిని నుంచి కష్టసుఖాల్లో తోడుగా ఉన్న ప్రాణ స్నేహితుడు చక్రి(బ్రహ్మానందం)కు ఎలాంటి న్యాయం చేశాడు? రంగస్థలంపై గొప్ప నటుడిగా పేరొందిన వ్యక్తి.. జీవితమనే నాటకంలో ఎలా తేలిపోయాడు ? చివరికి అతని నిజజీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మారాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేకే రంగమార్తాండ. ఇలాంటి కథను ముట్టుకోవడమే పెద్ద సాహసం. ఆ చిత్రంలో కథ, కథనం కంటే నటన చాలా బలంగా ఉంటుంది. నానా పటేకర్తో సహా ఆ సినిమాలో పనిచేసిన వాళ్లంతా కెరీర్ బెస్ట్ యాక్టింగ్లు ఇచ్చేశారు. అలాంటి కథను రీమేక్ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. కానీ ఈ విషయంలో కృష్ణవంశీ వందశాతం విజయం సాధించాడు. ‘నటసామ్రాట్’ సోల్ మిస్ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేసి మెప్పించాడు. తెలుగు నాటకాలు..పద్యాలతో ప్రతి సన్నివేశాన్ని చాలా భావోద్వేకంగా రాసుకున్నాడు. కథ ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా.. రాఘవరావు రంగస్థలం నాటకాలకు రిటైర్మెంట్ ప్రకటించి జీవితం అనే నాటకంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రతి సీన్ చాలా ఎమోషనల్గా, ఆసక్తికరంగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం అయితే కంటతడి పెట్టిస్తుంది. భార్యను ముద్దగా ‘రాజుగారు’అని పిలుస్తూ సేవలు చేసే దృశ్యాలు హృదయాలను ఆకట్టుకుంటాయి. ’ఆనందం.. రెండు విషాదాల మధ్య విరామం’ అంటూ ఇంటర్వెల్ బోర్డు పడడంతో ప్రేక్షకులు బరువెక్కిన హృదయాలతో సీట్ల నుంచి లేస్తారు. ఇక సెకండాఫ్లో వచ్చే ప్రతి సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. కూతురు దగ్గరకు వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు.. స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదాలతో సెకండాఫ్ మొత్తం ఎమోషనల్గా సాగుతుంది. ఆస్పత్రిలో ఉన్న చక్రి ‘ముక్తిని ఇవ్వరా’ అంటూ స్నేహితుడిని వేడుకోవడం... ‘మన ఇంటికి మనం వెళ్లిపోదామయ్యా..’ అంటూ రాఘవరావు భార్య అడగడం.. ఇవన్ని గుండెని బరువెక్కిస్తాయి. క్లైమాక్స్ సీన్ చూసి భారమైన మనసుతో, బరువెక్కిన గుండెతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు. భార్యభర్తల అనుబంధం, స్నేహబంధాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది. ఎవరెలా చేశారంటే.. ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించగల గొప్ప నటుడు ఆయన. రంగమార్తండ రాఘవరావు పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఈ సినిమాకు బ్రహ్మానందం ఒక సర్ప్రైజింగ్ ప్యాకెజ్. చక్రి పాత్రలో ఆయన తన కెరీర్ బెస్ట్ ఫెర్మార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ సినిమా తర్వాత దర్శకనిర్మాతలు బ్రహ్మానందంను చూసే కోణం మారుతుంది. ఆ స్థాయిలో బ్రహ్మానందం నటన ఉంటుంది. ముఖ్యంగా ఆస్పత్రి సీన్లో ప్రకాశ్రాజ్ని బ్రహ్మానందం పూర్తిగా డామినేట్ చేశాడు. తెరపై ఓ కొత్త బ్రహ్మానందాన్ని చూస్తారు. ఇక రాఘవరావు భార్యగా రమ్యకృష్ణ నటన అద్భుతమని చెప్పాలి. శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ తదితరులు పాత్రల పరిధి మేర నటించారు. ఇక ఈ సినిమాలో మరో ప్రధాన బలం ఇళయరాజా సంగీతం. ఎలాంటి రణగొణ ధ్వనుల లేకుండా.. చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలకు కూడా సినిమాలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటర్ల పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్రతి వారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి చిత్రాల్లో ‘రంగమార్తాండ’ కచ్చితంగా ఉంటుంది. ఈ కథ కొత్తదేం కాదు. అందరికి తెలిసిన కథే.. మనం నిత్యం చూస్తున్న అమ్మ నాన్నల జీవిత కథే. ఇంత గొప్పకథను అంతేగొప్పగా తెరకెక్కించాడు కృష్ణవంశీ. ఈ తరం, రేపటి తరం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. -అంజిశెట్టి, సాక్షి వెబ్డెస్క్ -
'నీ బంగారు నిన్ను దొంగ అంటోంది'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్
ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'రంగమార్తాండ'. దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను హౌల్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తే కుటుంబంలో జరిగే సంఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లు కనిపిస్తోంది. కుటుంబ నేపథ్యంలో సాగే ఎమోషన్స్, డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రమ్యకృష్ణ-ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం-ప్రకాశ్ రాజ్ మధ్య సాగే ఎమోషన్స్ ఈ చిత్రంలో హైలెట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్లో బ్రహ్మనందం సీరియస్ లుక్ సినిమాకే హైలెట్గా మారనుంది. జీవితంలో నటనను ప్రాణంగా భావించే ఒక రంగస్థల కళాకారుడి జీవిత అనుభవాలను సినిమాగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షోను ప్రదర్శించగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. -
‘రంగమార్తాండ’ చిత్రం ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
అప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాను: కృష్ణ వంశీ
‘‘రంగమార్తాండ’ సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత ఒక చిన్నారి నా వద్దకు వచ్చి, ‘నేను మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటాను’ అని చెప్పడం విశేషం. ప్రతిఒక్కరూ తమ తల్లితండ్రులతో కలిసి ఈ సినిమాను చూడాలి’’ అని డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక జంటగా నటించిన చిత్రం ‘రంగమార్తాండ’. హౌస్ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఉగాది కానుకగా ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చిత్ర దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ–‘‘రంగమార్తాండ’ సినిమాకి ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణల అద్భుతమైన నటన, ఇళయరాజాగారి సంగీతం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం.. ఇలా అన్నీ అద్భుతంగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దీంతో ఎలాంటి పెద్ద డైలాగులు లేకుండా కళ్లతోనే నటించాలని చెప్పినప్పుడు తను సరేనంది. ఈ మూవీ క్లైమాక్స్లో రమ్యకృష్ణపై సన్నివేశాలు తీసేటప్పుడు చాలా బాధపడ్డాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది.. చిత్రీకరిస్తుంటే కంట్లో నుంచి నాకు నీళ్లు వస్తూనే ఉన్నాయి’’ అన్నారు. ‘‘కృష్ణవంశీగారి దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ వంటి మంచి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు సింగర్, నటుడు రాహుల్ సిప్లిగంజ్. -
'రేయ్.. నువ్వొక చెత్త నటుడివిరా'.. ఆసక్తిగా టీజర్
ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. రంగమార్తాండ టీజర్ ఫుల్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేను ఒక నటుడిని అనే చిరంజీవి వాయిస్తో టీజర్ మొదలైంది. 'రేయ్.. నువ్వు ఒక చెత్త నటుడివిరా.. మనిషిగా అంతకంటే నీచుడివిరా' అనే బ్రహ్మనందం డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. 'నేను సహస్త్ర రూపాల్లో సాక్షాత్కారించిన నటరాజు విరాట స్వరూపాన్ని.. రంగమార్తాండ రాఘవరావుని' అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పె డైలాగ్తో టీజర్ అదిరిపోయింది. ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రం రంగమార్తాండుడి జీవన నాటకమని దర్శకుడు కృష్ణవంశీ పేర్కొన్నారు . ఈ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు పోషించగా.. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్గా ‘రంగమార్తాండ’ చిత్రాన్ని తెరకెక్కించారు. -
బ్రహ్మానందంగారు చెప్పినట్టే ఆ ఇల్లు బాగా కలిసోచ్చింది: రచ్చ రవి
బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టిన రచ్చ ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఈ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన రవి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. దాదాపు 100 సినిమాల్లో నటించిన తొలి జబర్దస్త్ కంటెస్టెంట్గా రవి గుర్తింపు పొందాడు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో అలరించిన రచ్చ రవి తాజాగా ఓ యూట్యూబ్ చానల్తో ముచ్చటించాడు. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానన్నాడు. ఈ సందర్భంగా జబర్దస్త్ మానేయడంపై వివరణ ఇచ్చాడు. చదవండి: ఆ హీరోయిన్ని బ్లాక్ చేసిన బన్నీ! స్క్రిన్ షాట్స్తో నటి ఆరోపణలు.. ‘నిజానికి జబర్దస్త్ నాకు తల్లి లాంటిది. సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోయాను. అందువల్లే జబర్దస్త్ మానేసి సినిమా కెరీర్పై ఫోకస్ పెట్టాను’ అని చెప్పాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక సమస్యలు ఉన్న ఈ షో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అదే సమయంలో బ్రహ్మానందం గారు నన్ను పిలిచి ఓ సలహా ఇచ్చారు. ఆయన వల్లే నా సొంతింటి కల నిజమైంది. ఆయన ఓ ఇల్లు చూపించారు. చదవండి: తారక్ వండర్ కిడ్: ఎన్టీఆర్పై శుభలేఖ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘ఇది తీసుకోరా నీకు బాగా కలిసి వస్తుంది. వాస్తు బాగుంది. ఎంత డబ్బు అయిన పర్వాలేదు నేను ఇస్తాను. ఇప్పటికిప్పుడు రూ. 5 లక్షలు అయిన పర్వలేదు నేను ఇస్తాను’ అని అన్నారు. అయన చెప్పినప్పుటి నుంచి నాకు డబ్బు కలిసి వచ్చింది. దాంతో ఆ ఇల్లు కొనుక్కున్నాను. బ్రహ్మానందంగారు చెప్పినట్టుగానే నాకు ఆ ఇల్లు బాగా కలిసి వచ్చింది. ఆ ఇంటికి మారాక నాకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నా. నటుడిగా మంచి పేరు సంపాదించాను. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డాను’’ అంటూ రచ్చ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ ఇంటి గృహప్రవేశానికి కూడా ఆయన వచ్చారంటూ రచ్చ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే బ్రహ్మానందంగారి దగ్గర డబ్బు తీసుకోకుండానే ఇల్లు కొన్నానని స్పష్టం చేశాడు. -
రంగమార్తాండ వచ్చేస్తున్నాడు
థియేటర్స్కు రావడానికి రెడీ అయ్యాడు రంగ మార్తాండ. ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ‘‘ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం..’ అని పేర్కొన్నారు దర్శకుడు కృష్ణవంశీ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు ΄ోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్గా ‘రంగమార్తాండ’ రూ΄÷ందింది. -
ఆ పాత్ర నేను చేయాల్సింది.. వెంకటేశ్ ఏం పొడిచారో చూస్తా?..బ్రహ్మానందం
విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి తండ్రికొడుకులుగా నటించిన వెబ్సిరీస్ ‘రానా నాయుడు’. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్.వర్మ దర్శకత్వం వహించి ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రమోషన్స్లో భాగంగా తాజాగా బ్రహ్మానందం నటించిన ఓ స్పెషల్ వీడియోని నెట్ఫిక్స్ విడుదల చేసింది. అందులో బ్రహ్మీ తనని తాను ఆస్కార్ నాయుడిగా పరిచయం చేసుకొని నాగ నాయుడు (ఈ సిరీస్లో వెంకటేశ్ పోషించిన పాత్ర పేరు) క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ ఇచ్చాడు. కిరీటి దామరాజు డైరెక్టర్గా, జబర్దస్త్ అవినాష్ ఆయన అసిస్టెంట్గా కనిపించారు. ఈ స్పెషల్ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. బ్రహ్మానందం ఆడిషన్ చూసి విసుగుచెందిన వెంకటేశ్..చివరకు రానాకు తండ్రిగా తానే నటిస్తానని చెబుతాడు. దీంతో బ్రహ్మీ కోపంతో..‘ఆ క్యారెక్టర్కి నా ఏజ్ సరిపోలేదని.. వెంకటేశ్ను పెట్టారు. ఓకే.. ఏం పొడిచారో..ఎంత పొడిచారో నేను చూస్తాను. మీరూ.. చూడండి.. వాచ్ రానా నాయుడు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్’ అని చెప్పడంతో వీడియో ముగుస్తుంది. -
వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసే యుద్ధం 'వీరఖడ్గం'
సృష్టిడాంగే ప్రధాన పాత్రలో ఎమ్ఏ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరఖడ్గం’. బ్రహ్మానందం, సత్యప్రకాష్, ఆనంద్ రాజ్ కీలక పాత్రలు చేశారు. కె.కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల మూడోవారంలో రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఎమ్ఏ చౌదరి మాట్లాడుతూ.. ‘‘చరిత్ర శిథిలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి.. పగ కూడా అంతే. వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ‘వీరఖడ్గం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది’’ అన్నారు లైన్ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్ సునీల్కుమార్. -
నారాయణ మూర్తి ప్రజా దర్శకుడు
‘‘ఇండస్ట్రీలో కళా దర్శకులు, వ్యాపారాత్మక దర్శకులు ఉన్నారు. కానీ, ప్రజా దర్శకుడు అంటే ఆర్. నారాయణ మూర్తి ఒక్కరే. నమ్ముకున్న సిద్ధాంతం కోసం పాటు పడే వ్యక్తి ఆయన’’ అన్నారు ప్రముఖ నటుడు బ్రహ్మానందం. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా టైటిల్ లోగోని బ్రహ్మానందం రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘ఎడ్యుకేషన్ మాఫియా, విద్యా వ్యవస్థ లోని లోపాలతో నారాయణ మూర్తిగారు తీసిన ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రేక్షకులను, నా ఫ్యాన్స్ని కోరుతున్నాను’’ అన్నారు. ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘వైజాగ్ సత్యానంద్ గారి శిష్యులు ఈ సినిమాలో నటించారు. భారతదేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలతో ‘యూనివర్సిటీ’ తీశాను. విద్య, వైద్యం ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. విజయనగరం పార్లకిమిడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాను.. నాకు సహకరించిన మంత్రి బొత్స సత్యనారాయణగారికి, ఇతరులకు థ్యాంక్స్’’ అన్నారు. -
నన్ను క్షమించగలవా?
ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. నటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు (ఫిబ్రవరి 1) సందర్భంగా ‘రంగ మార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘‘ధగ ధగ్గాయ రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా, సుయోధన సౌర్వభౌమ.. శరాఘతాలతో ఛిద్రమై.. ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ.. అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్లెవేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? నా దైవ స్వరూపమా.. నన్ను క్షమించగలవా?’’ అంటూ భావోద్వేగంతో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్తో గ్లింప్స్ సాగుతుంది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా. -
బ్రహ్మానందం మొత్తం ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా?
టాలీవుడ్ ‘హాస్య బ్రహ్మ’, నటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో వందల చిత్రాల్లో నటించిన ఆయన నిన్నటితో 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. బుధవారం(ఫిబ్రవరి 1న) బ్రహ్మానందం బర్త్డే. ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఇంటికి వెళ్లిన ఆయన బర్త్డేను సెలబ్రెట్ చేశారు. ఇక ఆయన చేసిన సినిమాలకు గానూ గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా నిలవడం విశేషం. కేవలం ముఖ కవళికలతోనే నవ్వించే ఆయన హాస్య బ్రహ్మగా బిరుదు పొందారు. చదవండి: కత్రినా వచ్చాక నా లైఫ్ మారిపోయింది.. నేను పర్ఫెక్ట్ హస్భెండ్ కాదు..!: విక్కీ కౌశల్ దాదాపు ఇండస్ట్రీలో 31 సంవత్సరాల పాటు కమెడియన్గా చక్రం తిప్పిన ఆయన దాదాపు1200లకు పైగా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఆడపాదడపా చిత్రాలు చేస్తూ వస్తున్నారు. అన్ని వందల సినిమాలు చేసిన బ్రహ్మీ ఇప్పటి వరకు ఎంత కూడబెట్టి ఉంటారనేది నెటిజన్లో ఆసక్తి నెలకొలంది. బుధవారం ఆయన బర్త్డే నేపథ్యంలో బ్రహ్మానందం ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. ఈ తాజా బజ్ ప్రకారం.. నటుడిగా ఆయన వందల కోట్లు సంపాదించారట. ఆయన స్థిర, చరాస్థులు కలిపి దాదాపు రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. అలాగే కోట్లు విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందట. దీనితో పాటు జుబ్లిహిల్స్లో ఓ లగ్జరీ ఇల్లు కూడా. ఇక ఆయన కార్ల కలెక్షన్స్కి వస్తే.. ఆడి క్యూ7, క్యూ8(Audi R8, Audi Q7)తో పాటు మెర్సిడెజ్ బెంజ్ కారు ఉందట. ఇలా నటుడిగా బ్రహ్మీ బాగానే ఆస్తులు సంపాదించాడంట నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. కాగా బ్రహ్మానందం నటుడే కాదు.. చిత్ర కళాకారుడనే విషయం తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. కాగా ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ చిత్రంతో బిజీగా ఉన్నారు.