Commit suicide
-
మైసూరుకు ఏమైంది?
మైసూరు: రాచనగరిలో అప్పుల బాధతో ఓ వ్యాపారవేత్త భార్య, కుమారుడు, తల్లికి విషమిచ్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. నగరవాసులు ఈ షాక్ నుంచి తేరుకోకముందే అదే మాదిరి మరో సామూహిక ఆత్మహత్యల ఘటన సంభవించింది. జెస్సీ ఆంటోని, అతని సోదరుడు జోబి ఆంటోని, అతని భార్య స్వాతి బలవన్మరణానికి పాల్పడినవారు. మృతులు నగరంలోని విద్యానగర, యరగనహళ్లి నివాసులుగా గుర్తించారు. వీరి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. వివరాలు.. జోబి ఆంటోని, జెస్సీ ఆంటోనీలు కవల సోదరులు. తాలూకాలోని రమ్మనహళ్లిలో జెస్సీ ఆంటోని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు అతను ఒక వీడియో చేశాడు. అందులో జోబి ఆంటోని, అతని భార్య స్వాతి అలియాస్ శర్మిల, తన సోదరి మేరీ షెర్లిన్ ద్వారా ఊరు నిండా అప్పులు చేశారు, అప్పులవారి బాధ భరించలేకున్నాం, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. షెర్లిన్కి భర్త లేడని, ఆమెను మోసం చేశారని, ఆమెని, ఆమె బిడ్డను చంపాలని ప్రయత్నించారని తెలిపాడు. దీనంతటికీ జోబి ఆంటోని, అతని భార్య స్వాతి కారణమని, వారిని శిక్షించాలని వీడియోలో అభ్యర్థించాడు. ఆ వీడియోను తన సోదరికి పంపి ఉరి బిగించుకున్నాడు. భయపడి.. జోబి జంట.. మేరీ షెర్లిన్ మైసూరు దక్షిణ పోలీసు స్టేషన్లో జోబి, స్వాతిలపై ఫిర్యాదు చేయగా ఆత్మహత్యకు ప్రేరేపించారనే సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ పరిణామాలతో భయపడిన జోబి, స్వాతి విజయనగర క్రీడా మైదానంలోని నీటి ట్యాంకు నిచ్చెనకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జోబి ఆంటోని తన సోదరి పేరిట బెట్టింగ్ కోసం సుమారు రూ.80 లక్షల మేర అప్పులు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో ఘర్షణలు చెలరేగాయని తెలుస్తోంది. వరుస ఆత్మహత్యల పరంపర మైసూరులో కలకలం సృష్టిస్తోంది. -
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం
శాంతిపురం: వివాదంలోని భూమిపై రెవెన్యూ అధికారుల తీరును నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులపై పెట్రోల్ చల్లి, తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం చోటుచేసుకుంది. శాంతిపురం మండలంలోని 30 సొన్నేగానిపల్లి పంచాయతీ పరిధిలోని నాయనపల్లికి చెందిన లక్ష్మీపతి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపతి తల్లి లక్ష్మమ్మ కర్ణాటకలోని రాజుపేట రోడ్డులో ఓ బట్టల దుకాణం యజమాని ఇంట్లో పనిచేసేది. లక్ష్మమ్మ 2019లో మరణించాక దుకాణం యజమాని సుమమ్మ తాను మృతురాలి నుంచి 2002లో భూమిని కొనుగోలు చేశానని కుప్పం కోర్టును ఆశ్రయించింది.అనువంశిక ఆస్తిని తన తల్లి ఒక్కరే విక్రయించే హక్కు లేదని, చదువులేని తన తల్లిని మోసం చేశారని లక్ష్మీపతి సైతం కోర్టుకు వెళ్లాడు. ఈ కేసు కుప్పం కోర్టులో విచారణలో ఉంది. అయితే కుప్పం–పలమనేరు జాతీయ రహదారి పక్కనే ఉన్న 0.79 ఎకరాల వివాదాస్పద భూమి విలువ రూ.2 కోట్లకు పైగా ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల్లో యజమాని పేరు మార్పునకు ద్రస్తాలు కదిలాయి. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీపతి శుక్రవారం సాయంత్రం తహశీల్దారు శివయ్యకు తన గోడు వినిపించే ప్రయత్నం చేశాడు. పట్టించుకోని తహశీల్దారు తనను బయటకు గెంటించారని తెలిపాడు.దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీపతి శనివారం తన కుటుంబ సభ్యులతో తహశీల్దారు కార్యాలయానికి వచ్చాడు. తహసీల్దారు అందుబాటులో లేకపోవడంతో డీటీ పౌలే‹Ùని కలిసి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు హేళన చేశాడు. ఎంతకీ తహశీల్దారు రాకపోవడం, ఇతర అధికారులు పట్టించుకోకపోవటంతో లక్ష్మీపతి తన వంటిపై పెట్రోల్ పోసుకుని, కుటుంబ సభ్యులపైనా చల్లే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించి వారు పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెను అతని నుంచి లాక్కుని నీళ్లు పోశారు. కలెక్టర్, కుప్పం ఆర్డీవో ఆదేశాల మేరకు సదరు భూమిని రెవెన్యూ రికార్డుల్లో వివాదాస్పద భూమిగా నమోదు చేస్తామని తహశీల్దారు చెప్పారు. తాను రికార్డుల ప్రకారమే మ్యుటేషన్ చేశానని, భూమి కొనుగోలు పత్రం, ఈసీలను క్షుణ్ణంగా చూశాకే యజమాని పేరు మార్చానన్నారు. -
పచ్చని సంసారంలో చిచ్చురేపిన మద్యం
నెల్లూరు (క్రైమ్): పచ్చని సంసారంలో మద్యం చిచ్చు రేపింది. ఉరేసుకుని భార్య, రైలు కింద పడి భర్త ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన నెల్లూరు నగరం ఎన్టీఆర్నగర్లో శనివారం జరిగింది. అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారు. దంపతులు బలవన్మరణం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఏం జరిగిందో తెలియక మృతుల కుమారులిద్దరూ అటు ఇటూ తిరుగుతూ ఉండడం చూపరులను కంట తడి పెట్టించింది. ఎన్టీఆర్ నగర్కు చెందిన కె. నాగరాజు(23), సురేఖ (19) నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికంగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా రు. వారికి మూడేళ్లు, పదకొండు నెలల కుమారులు ఉన్నారు. నాగరాజు మార్బుల్స్, టైల్స్ పనులు చేసుకుంటుండగా, సురేఖ మాగుంట లేఅవుట్లోని ఓ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు సంతోషంగా సాగుతున్న వీరి కాపురాన్ని మద్యం విచ్ఛిన్నం చేసింది. మద్యానికి బానిసైన నాగరాజు సంపాదించిందతా మద్యానికి ఖర్చు చేయడంతో పాటు అప్పులు చేశాడు. దీంతో కుటుంబ భారం సురేఖపై పడింది. ఆమె తాను సంపాదించిన మొత్తంలో కొంత కుటుంబ పోషణకు ఖర్చు చేసి మిగిలిన దాంతో అప్పులు తీర్చింది. పలుమార్లు మద్యం మానేయమని, అప్పులు చేయొద్దని భర్తను ప్రాధేయపడింది. అయినా అతని తీరులో మార్పు రాలేదు. కొద్ది రోజులుగా పుట్టింటికి వెళ్లి నగదు తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో వారి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ నేపథ్యంలో శనివారం నాగరాజు పని నిమిత్తం బయటకు వెళ్లగా సురేఖ తన ఇంట్లోనే ఉరేసుకుంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలు సుకున్న ఆమె తల్లిదండ్రులు గీత, సురేష్ హుటాహుటిన ఇంటి వద్దకు చేరుకుని ఆమెను కిందకు దించారు. ఆమెను నగరంలోని రామచంద్రారెడ్డి హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సురేఖ మృతి చెందిందని నిర్ధారించారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న నాగరాజు హాస్పిటల్ వద్దకు వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. భార్య లేని జీవితం వ్యర్థమంటూ రోదించాడు. ఇక తాను బతకలేనంటూ అక్కడి నుంచి పరుగున వెళ్లి విజయమహాల్ రైల్వే గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గంటల వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం అందరి హృదయాలను కలిచి వేసింది. సురేఖ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఎస్ఐ విజయ్శ్రీనివాస్, నెల్లూరు తహసీల్దార్ హాస్పిటల్కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి దీప్తి ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ ఎస్ఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు ఆత్మహత్య ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుమారునికి ఉరివేసి, తల్లి ఆత్మహత్య
బనశంకరి: భర్త మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళ జీవితంపై విరక్తి చెంది తీవ్ర నిర్ణయం తీసుకుంది. పేగు తెంచుకుని పుట్టిన కుమారున్ని హత్యచేసిన తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. మనసులను కలిచివేసే ఈ ఘోర దుర్ఘటన బెంగళూరులో యలహంక పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. యలహంక ఆర్ఎంజెడ్ అపార్టుమెంట్లో పులివర్తి శ్రీధర్ (47), రమ్యా (40), వారి కుమార్తె (20), కుమారుడు భార్గవ్ (13) నివాసం ఉంటున్నారు. వీరి స్వస్థలం తిరుపతి ప్రాంతమని తెలిసింది. శ్రీధర్ ఐటీ ఇంజినీరుగా పనిచేసేవారు. మూడు నెలల క్రితం పులివర్తి శ్రీధర్ క్యాన్సర్తో మరణించారు. అప్పటి నుంచి రమ్యా భర్తను తలచుకుంటూ మనో వ్యాకులతకు గురైంది. ఇటీవల నగరంలోనే పీజీ హాస్టల్లో ఉన్న కుమార్తెతో రమ్యా ఫోన్లో మాట్లాడి బాధపడింది. ఈ నేపథ్యంలో రమ్యా పోలీసులకు, డాక్టరు, కుమార్తెకు లేఖ రాసి, అపార్టుమెంటులో కుమారుడు భార్గవ్ను ఉరివేసి హత్యచేసిన తరువాత రమ్యా కూడా ఉరి బిగించుకుని ప్రాణాలు వదిలింది. సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని మృతదేహాలకు శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్లో జవాన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ సెంటర్లో ఆర్మీ జవాన్ గన్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్కు చెందిన రాజిందర్ బుధవారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. చదవండి: రమేష్ కుమార్ జైస్వాల్ ఎక్కడ? -
మంత్రి సబిత గన్మెన్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గన్తో కాల్చుకుని ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలాన్ని మంత్రి సబితా పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ మీడియాతో మాట్లాడుతూ, ఫాజిల్ ఉదయం ఆరుగంటలకు గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. కూతురితో మాట్లాడిన తర్వాత పిస్తోల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ తెలిపారు. -
Vizag: లాడ్జిలో మెడికో ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే!
సాక్షి, విశాఖపట్నం: డాబా గార్డెన్స్లో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్ గదిలో రమేష్ కృష్ణ అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేరళ రాష్ట్రం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన రమేష్ కృష్ణ.. సెలవుల కోసం సొంత గ్రామానికి వచ్చింది. ఈనెల 13న తన ఇంటి నుంచి తిరుగు ప్రయాణమై 18వ తేదీన వైజాగ్ చేరుకున్న ఆ యువతి.. డాబా గార్డెన్స్లోని లాడ్జిలో అద్దెకు దిగి.. ఆగస్టు 9వ తేదీన గది ఖాళీ చేసింది. తిరిగి మళ్లీ ఈ నెల 24న ఆమె అదే గదికి వచ్చింది. 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు.. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది. ‘‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’’ అంటూ ఆ సూసైడ్ నోట్లో ఉందని టూ టౌన్ సిఐ తెలిపారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పిల్లలను హతమార్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి దంపతుల ఆత్మహత్య
మచిలీపట్నంటౌన్: బందరుకోటలో విషాదఛాయలు అలముకున్నాయి. నగరంలోని 21వ డివిజన్ బందరుకోటకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండు వీరార్జున వినయ్ (కన్నా) తో పాటు కుటుంబ సభ్యుల మృతదేహాలు శనివారం స్వస్థలానికి చేరుకున్నాయి. కన్నా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల నుంచి భార్య, ఇద్దరి కుమార్తెలతో బెంగళూరులో ఉంటున్నారు. నాలుగు రోజుల క్రితం కన్నా భార్య హైమావతి తల్లిదండ్రులు.. ఆమెకు ఫోన్ చేస్తున్నా తీయలేదు. అనుమానం వచ్చిన వారు బెంగళూరులో కుమార్తె ఉంటున్న అపార్ట్మెంట్కు వెళ్లి చూడగా లోపలి నుంచి దుర్వాసన వస్తుండటంతో సమీపంలోని కడిగోడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్యభర్తలతో పాటు పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. పిల్లలను హతమార్చి తరువాత భార్యభర్తలు ఉరివేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే ఘటనకు పాల్పడ్డారనే చర్చ జరుగుతోంది. వీరికి రెండేళ్ల వయసున్న హనీ, ఎనిమిది నెలల వయసున్న కుమార్తెలు ఉన్నారు. నాలుగు రోజుల క్రితం ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని కడిగోడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి అనంతరం బంధువులకు అప్పగించారు. ఘటనపై కడిగోడి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
భర్తను యాదాద్రికి పంపించి.. హైదరాబాద్లో తల్లీకూతురు ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. మణికొండ ఆంధ్రా కాలనీలో తల్లి, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అలివేలు, ఆమె కుమార్తె లాస్యగా గుర్తించారు. నిన్న సాయంత్రం భర్తకు రూ.5 వేలు ఇచ్చి యాదాద్రి ఆలయానికి వెళ్లమని అలివేలు చెప్పినట్లు సమాచారం. ఈ రోజు(శుక్రవారం) తెల్లవారుజామున పడక గదిలో కూతురు లాస్య, వంటగదిలో తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు పాత దుస్తుల్ని అలివేలు తగులబెట్టింది. తల్లి పాత బట్టలను తగులబెడుతుండగా ప్రశ్నించిన కుమారుడికి సమాధానం ఇవ్వలేదు. కూతురు లాస్యకి ఉరి వేసి చంపి, తల్లి అలివేలు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కొడుకును కూడా చంపే ప్రయత్నం చేసిన తల్లి.. గాడ నిద్రలో ఉండటంతో వదిలేసింది. లాస్య, అలివేలు మానసిక స్థితి సరిగ్గా లేదని, కరోనా టైం నుంచి అందరికీ దూరంగా ఉంటున్నారన్నారని రాయదుర్గం సీఐ మహేష్ తెలిపారు. చదవండి: నాచారంలో సెల్ఫీ సూసైడ్ -
ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య
కళ్యాణదుర్గం: మున్సిపాలిటీ పరిధికి చెందిన మౌనిక (15) అనే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలమేరకు... ఒంటిమిద్ది గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మౌనిక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్ర పోయాక పురుగుల మందు తాగింది. శుక్రవారం తెల్లవారు జామున అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను హుటా హుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక చనిపోయిందని నిర్ధారించారు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన కుమార్తె విగాత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాడిపత్రిలో... తాడిపత్రి: రూరల్ పరిధిలోని బిందెల కాలనీలో నాగేంద్ర, లక్ష్మినరసమ్మ దంపతుల రెండో కుమార్తె కావ్య (18) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో కావ్య ఫెయిల్ అయింది. శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. అయితే ఇంటి తలుపులు మూసివేయకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్వేత మృతికి కారణం ఏంటంటే..? షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ
సాక్షి, విశాఖపట్నం: నగరంలో సంచలనం సృష్టించిన వివాహిత శ్వేత మృతి కేసు అనేక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే.. ఆర్.కె.బీచ్లో మంగళవారం అర్ధరాత్రి ఆమె శవమై కనిపించిన విషయం విదితమే.. అయితే, శ్వేతది ఆత్మహత్యేనని సీపీ త్రివిక్రమ్ వర్మ స్పష్టం చేశారు. శ్వేత ఆత్మహత్యకు గల కారణాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘‘శ్వేతపై అత్తింటి వేధింపులు నిజమే.. శ్వేత తల్లి ఎదుటే దంపతులు గొడవపడ్డారు.. ఆమె కనిపించడం లేదని బంధువులు ఫిర్యాదు చేశారు. బీచ్ దగ్గర మృతదేహం ఉందని సమాచారం వచ్చింది. శ్వేత భర్త, ఆడపడుచు భర్తపై కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. 90 సెంట్ల భూమి శ్వేత పేరు మీద ఉంది. ఆ భూమి తన పేరు మీదకి మార్చాలని భర్త మణికంఠ ఇబ్బంది పెట్టాడు. అత్త, మామ చిన్నచూపు చూడటంతో శ్వేత మనస్తాపానికి గురైంది’’ అని సీపీ వివరించారు. చదవండి: సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి.. ‘‘అత్తింటి వారు వేధింపులు కారణంగా గతంలోనూ శ్వేత ఆత్మహత్యకు యత్నించింది. గృహ, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్ 354 498(ఏ) కింద కేసు నమోదు చేశాం, శ్వేత ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. పోస్ట్ మార్టం వీడియో గ్రఫీ చేయించాం’’ అని సీపీ పేర్కొన్నారు. -
40 అడుగుల హోర్డింగ్ ఎక్కిన యువకుడు
భువనేశ్వర్: నగరంలోని శిశుభవన్ ఛక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువకుడు ఆత్మహత్యకు విఫలయత్నం చేశాడు. 40 అడుగుల హోర్డింగ్ పైకి ఎక్కి, కలకలం సృష్టించాడు. గమనించిన చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో 2గంటలు నిరవధికంగా శ్రమించి అతడిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. అతనిని స్థానిక క్యాపిటల్ ఠాణా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. యువకుడు ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సొరొ మండలం అంగులా గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సందర్భంగా అతని భార్య సుస్మితా పాత్ర మీడియాతో మాట్లాడుతూ తన భర్త భువనేశ్వర్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడని తెలిపారు. తీవ్రమైన పేదరికం కారణంగా ఈ వైపరీత్యానికి పాల్పడి ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేశారు. తల దాచుకునేందుకు నిలువ నీడ లేదని, కుమర్తెల పాఠశాల ఫీజులు కట్టే స్తోమత లేక అల్లాడుతున్నట్లు వాపోయారు. ఈ నేపథ్యంలో తన భర్త ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని వివరించారు. -
గిరి పల్లెలో విషాదం.. భార్య మృతిని తట్టుకోలేక భర్త కూడా..
సాక్షి, అల్లూరి: చింతూరు మండలంలోని కలిగుండం అనే గిరిజన పల్లెలో విషాదం చోటు చేసుకుంది. భార్య, భర్తల మధ్య చెలరేగిన మనస్పర్థలు వారి బలన్మరణానికి కారణమయ్యాయి. భర్త కొట్టాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. అయితే.. ఆమె మృతిని తట్టుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలాఉన్నాయి. భార్యాభర్తలైన కుంజా భద్రయ్య(70), కుంజా సమ్మక్క(65)బంధువుల ఇంట్లో జరిగిన దినకార్యానికి వెళ్లి ఇంటికి తిరిగివచ్చారు. తనకు భోజనం పెట్టమని భార్య సమ్మక్కను భర్త భద్రయ్య కోరగా నువ్వే పెట్టుకుని తినమని భార్య చెప్పింది. దీంతో ఆగ్రహించిన భద్రయ్య భార్యను కర్రతో కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురైంది. ఇంట్లోని పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతిని తట్టుకోలేని భర్త భద్రయ్య కూడా పురుగు మందు సేవించి అపస్మారక స్థితికి చేరాడు. దీంతో అతనిని సమీపంలోని ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి తెలిపారు. -
‘డబుల్’ ఇల్లు ఇవ్వడంలేదని...
కొండపాక(గజ్వేల్): డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల్లో భూమిని కోల్పోయానని, అయినా ఇల్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కుకునూరుపల్లి మండలం మేదీనీపూర్లో చోటుచేసుకుంది. మేదినీపూర్కు ప్రభుత్వం ఐదేళ్ల క్రితం 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేసింది. అయితే ప్రభుత్వస్థలం అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ విరుపాక లావణ్య ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి స్థానికుడైన నంగి కనకయ్య దంపతులకు చెందిన కొంతస్థలాన్ని డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎంపిక చేశారు. ఆ సమయంలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక కనకయ్యకు ఒక డబుల్ బెడ్రూం ఇంటిని అందిస్తామని తీర్మానించారు. కాగా, 2022 జూన్ 27న మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా 48 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తనకు ఇల్లు కేటాయించలేదని ఆగ్రహించిన కనకయ్య మిగిలిన రెండు ఇళ్లలో ఓ ఇంటిని ఆక్రమించుకొని 6 నెలలుగా నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రెవెన్యూ అధికారులు కనకయ్య ఉంటున్న ఇంటికి వెళ్లి ఖాళీ చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూంల నిర్మాణంలో 14 గుంటల భూమిని కోల్పోయానని, అయినా తనకు ఇల్లు ఇవ్వలేదని, ఇప్పుడు ఉంటున్న ఇంట్లో నుంచి వెళ్లమంటారా అంటూ మనస్తాపం చెంది కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. చుట్టుపక్కలవారు అప్రమత్తమై అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పుష్పరాజ్ ఘటనాస్థలానికి చేరుకొని కనకయ్యకు నచ్చజెప్పారు. ఈ విషయమై తహసీల్దార్ ఆశాజ్యోతిని వివరణ కోరగా సమాధానం దాటవేశారు. సమాఖ్య భవనంలో ఉంటున్నాం... డబుల్ బెడ్రూం నిర్మాణాల్లో ఇంటి స్థలంతోపాటు 12 గుంటల భూమిని కోల్పోయాం. లబ్ధిదారుల జాబితాలో పేరు రావడంతో అధికారులు పట్టా సర్టిఫికెట్ అందజేశారు. కానీ, ఇప్పటివరకు ఇంటిని అప్పగించలేదు. దీంతో మహిళా సమాఖ్య భవనంలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాం. అధికారులు స్పందించి త్వరగా ఇంటిని కేటాయించాలి. – మరో బాధితురాలు నంగి ఐలవ్వ -
భార్యతో గొడవలు.. మరో మహిళతో వివాహేతర సంబంధం.. చివరికి..
అన్నానగర్(తమిళనాడు): ఊటీ బొటానికల్ గార్డెన్లో ఆత్మహత్యకు యత్నించిన వివాహేతర జంట చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. నీలగిరి జిల్లా ఓల్డ్ ఊటీకి చెందిన జైశంకర్ (36) పెయింటర్. అదే ప్రాంతానికి చెందిన మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఉద్యోగరీత్యా తరచూ బయటి ఊరుకి వెళ్లేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కొంత కాలంగా వీరు విడిగా ఉంటున్నారు. పెయింటర్ పనులకు వెళ్లే క్రమంలో జైశంకర్కు మేట్టుపాళయానికి చెందిన వివాహిత రాధతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత రాధను రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం మేట్టుపాళయం నుంచి రాధను ఊటీలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో జైశంకర్ కుమారులు తండ్రితో మాట్లాడలేదు. దీంతో జైశంకర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గత వారం రాధతో కలిసి ఊటీ బొటానికల్ గార్డెన్ను చూడటానికి వెళ్లాడు. జైశంకర్, రాధ అక్కడే విషం తాగి స్ఫృహ తప్పి పడిపోయారు. దీంతో పర్యాటకులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ఊటీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఇద్దరూ మృతి చెందారు. ఊటీ సెంట్రల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పరిశోధకుడు కాదు.. కామాంధుడు.. ప్రేమ పేరుతో లోబర్చుకుని.. -
అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం.. ఫ్లాట్ అద్దెకు తీసుకుని.. చివరికి..
సాక్షి, తాడేపల్లి రూరల్: వడ్డేశ్వరంలోని ఓ వర్సిటీలో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థి మధ్య చిగురించిన ప్రేమ కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో వారి మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన గురువారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజమండ్రి రూరల్ మండలం రాజవోలుకు చెందిన హెల్త్ ఇన్స్పెక్టర్ రవికుమార్ రెండో కుమారుడైన మందపాటి అజయ్కుమార్(20) వడ్డేశ్వరంలోని వర్సిటీలో బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు టీచర్ కుమార్తె బీబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తడంతో ఇద్దరూ కలిసి కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకుని అన్నా చెల్లెళ్ల ముసుగులో సహజీవనం చేస్తున్నారు. విద్యార్థిని కాలేజీకి తరచూ రావడం లేదనే విషయమై గత నెల 25న ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థిని గత నెల 29న రాజవోలులోని తల్లి దగ్గరకు వెళ్లిపోయింది. బుధవారం సాయంత్రం అజయ్కుమార్ విద్యార్థినికి ఫోన్చేసి ఫ్లాట్లో పెంచుతున్న కుక్కపిల్ల (షాషా)కు ఫీడ్ ఇవ్వను, చంపేస్తానని బెదిరించడంతో విద్యార్థిని హుటాహుటిన విజయవాడ వచ్చింది. రాత్రి 1.40 గంటల సమయంలో రోడ్డుమీద ఇద్దరూ గొడవ పడ్డారు. విద్యార్థిని నా జీవితాన్ని నాశనం చేయకు అని వేడుకోవడంతో అతను నన్ను ఎందుకు ప్రేమించావంటూ దురుసుగా ప్రవర్తించాడు. చదవండి: ఆర్య సమాజ్లో ప్రేమ పెళ్లి.. మియాపూర్లో కాపురం.. చివరికి భర్త షాకింగ్ ట్విస్ట్ ఆ తర్వాత ఇద్దరూ ఒకే బైక్పై ఫ్లాట్కు వెళ్లారు. రాత్రి 2.30 గంటలకు అలికిడి కావడంతో విద్యార్థిని నిద్ర లేచి చూడగా నోట్లో గుడ్డలు కుక్కుకుని కిటికీకి హీటర్ వైర్తో ఉరివేసుకుని అజయ్కుమార్ కనిపించాడు. భయపడిన విద్యారి్థని వెంటనే మిగతా ఫ్లాట్ల వారిని లేపి విషయం వివరించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అజయ్కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అమెరికన్ హిప్హాప్ డ్యాన్స్, కొరియోగ్రాఫర్, నటుడు డీజే స్టీఫెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్ ఏంజిల్స్లోని ఓ హాటల్లో ఆయన గన్తో షూట్ చేసుకున్ని ఆత్మహత్య పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. దీంతో హాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా స్టీఫెన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. చదవండి: అనన్య ఫ్యాన్గర్ల్ మూమెంట్.. ‘ఆయన నాకు చేయి ఊపారు’ కాగా ది ఎలెన్ డిజనరేస్ షో, సో యూ థింక్ యూ కెన్ డాన్స్’ వంటి రియాలిటీ షోలతో స్టీఫెన్ పాపులర్ అయ్యాడు. స్టెప్ అప్, మ్యాజిక్ మైక్ డబుల్ ఎక్స్ సినిమాల్లో కూడా ఆయన నటించాడు. అలాగే టెలివిజన్ ప్రొడ్యూర్గా కూడా స్టీఫెన్ గుర్తింపు పొందాడు. కాగా స్టీఫెన్కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ellen DeGeneres (@theellenshow) -
‘మిమ్మల్ని మోసం చేస్తున్నానని తెలుసు.. నాకు బతకాలని లేదు’
కొండాపురం(నెల్లూరు జిల్లా): ‘నాకు బతకాలని లేదు’ అంటూ ఓ విద్యార్థి సొంత తమ్ముడు, మరికొందరికి మెసేజ్ పెట్టి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని చింతలదేవి పంచాయతీ తూర్పు బ్రాహ్మణపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కొండాపురం ఎస్సై ఎస్కే ఖాజావలీ కథనం మేరకు.. గ్రామానికి చెందిన నీలపాటి శ్రీరాములు, రాజేశ్వరి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లారు. వారికి అజయ్ (20), విజయ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరూ బంధువులతో కలిసి నెల్లూరులో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్నారు. చదవండి: మామయ్య ఇంటికి వచ్చిన ఖమ్మం యువతి.. షాపింగ్ చేస్తుండగా యువకుడు షాకింగ్ ట్విస్ట్.. అజయ్ డిగ్రీ ఫైనలియర్, విజయ్ ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నారు. పెద్దవాడైన అజయ్ ఆదివారం స్వగ్రామమైన తూర్పు బ్రాహ్మణపల్లికి వచ్చి అత్త అంకమ్మ ఇంట్లో ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి ప్రాజెక్ట్ వర్క్ ఉందని అత్తకు చెప్పి తన సొంత ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి తన సెల్ఫోన్ ద్వారా తమ్ముడు విజయ్, బంధువులు, మరికొంతమంది స్నేహితులకు ‘నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నా. మిమ్మల్ని మోసం చేస్తున్నానని తెలుసు. నాకు బతకాలని లేదు. చనిపోతున్నా..’ అంటూ వాట్సాప్లో మెసేజ్ చేశాడు. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో తమ్ముడు విజయ్ మెసేజ్ చూసి గ్రామంలో ఉన్న బంధువులకు సమాచారం అందజేశాడు. వారు అజయ్ ఇంటికి వెళ్లి తలుపులు తెరిచారు. అప్పటికే అతను ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులకు సమాచారం వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించామని ఎస్సై తెలిపారు. -
అప్పులు ఇవ్వడమే అతడికి శాపమైందా? అందమైన కుటుంబం చివరికి ఇలా?
తూర్పు గోదావరి: కొంతమంది రూ.లక్షల్లో రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టడంతో అదికాస్తా బ్యాంకు మేనేజర్ మెడకు చుట్టుకుని ఉరితాడయ్యింది.. హాయిగా సాగిపోతున్న పచ్చని కాపురంలో చిచ్చురేపింది. భార్య, ఇద్దరు కుమార్తెల భవితవ్యం అగమ్యగోచరమయ్యింది. యానాం పోలీసుల కథనం ప్రకారం పిఠాపురం మార్కెట్ ప్రాంతానికి చెందిన విస్పాప్రగడ సాయిరత్న శ్రీకాంత్(33) గతంలో మచిలీపట్టణంలో యూకో బ్యాంకు మేనేజర్గా పనిచేశారు. రొయ్యల చెరువుల సేద్యానికి అక్కడ కొంతమందికి లక్షలాది రూపాయలు రుణాలు ఇచ్చారు. తీసుకున్న రుణాలను సంబంధిత వ్యక్తులు చెల్లించకపోవడంతో యాజమాన్యం మేనేజర్ శ్రీకాంత్పై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొంతమేర రుణాలను శ్రీకాంత్ వ్యక్తిగతంగా చెల్లించారు. ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితం శ్రీకాంత్ యానాం శాఖకు బదిలీ అయ్యారు. స్థానిక గోపాల్నగర్లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం ఉదయం 8.00 గంటలకు భార్య కావ్యను పిల్లల్ని స్కూల్ వద్ద దింపేసి రావాలని శ్రీకాంత్ చెప్పడంతో.. ఆమె మూడవ తరగతి చదువుతున్న స్వరాగ, ఎల్కేజీ చదువుతున్న స్వరి్ణతను స్కూల్కు తీసుకువెళ్లారు. ఆమె ఇంటికి వచ్చి తలుపులు కొట్టినా తెరవకపోవడంతో మరోమార్గంలో వెళ్లి చూడగా ఫ్యాన్కు శ్రీకాంత్ ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. స్థానికులు, భార్య కలిసి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అయినవారు కన్నీరుమున్నీరు యానాం జీజీహెచ్లో కుమారుడి మృతదేహం వద్ద శ్రీకాంత్ భార్య, తల్లి బోరున విలపించారు. బ్యాంకుకు సంబంధించిన రుణాలు ఏదోలా తామే చెల్లిస్తామని చెబుతూ ఉన్నామని, అయిన్పప్పటికీ ఈ అఘాయిత్యానికి పాల్పడతాడని తాము ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సైతం ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ఒడిగడితే తాము నివారించామని, కాని ప్రస్తుతం విధి కాటేసిందని శ్రీకాంత్ మావయ్య చెప్పారు. తమను భుజాలపై ఎక్కించుకుని ఆడించిన నాన్న తమను శాశ్వతంగా విడిచి అందనిలోకాలకు వెళ్లిపోయాడని తెలియని శ్రీకాంత్ కుమార్తెల అమాయక చూపులు అందరిని కలిచివేశాయి. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బడుగు కనకారావు తెలిపారు. -
పెళ్లైన ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. పెళ్లికి ఒప్పుకోరని
సాక్షి, ఖమ్మం: వివాహితులైన ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీయగా.. పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించరనే మనస్తాపంతో ఇద్దరూ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని వినోభానగర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై పోటు గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వినోభానగర్ గ్రామానికి చెందిన తంబారపు ప్రసన్న జ్యోతి(25)కి అదే గ్రామానికి చెందిన కరుణాకర్తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విబేధాల నేపథ్యంలో జ్యోతి రెండేళ్లుగా పుట్టింట్లో ఉంటోంది. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కొత్తగూడెంలో కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సిరికొండ ప్రశాంత్(30) అనే ట్రాలీ, లారీ డ్రైవర్తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధంగా మారింది. ఈనెల 4న ఉదయం ప్రసన్నజ్యోతి హాల్టికెట్ తెచ్చుకుంటానని చెప్పి జూలూరుపాడుకు బయలుదేరింది. ఆమెతో పాటు ప్రశాంత్ కూడా వెళ్లాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో ప్రసన్నజ్యోతి కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే అదేరోజు ఇద్దరూ పురుగుమందు తాగి ఖమ్మంలోని లారీ అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లారు. ఆఫీస్లో వాంతులు చేసుకోవడంతో అక్కడున్న వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ఇరు కుటుంబాల వారికి సమాచారం అందించారు. కాగా, ప్రశాంత్ శనివారం రాత్రి, ప్రసన్న జ్యోతి ఆదివారం ఉదయం మృతి చెందారు. ప్రశాంత్కు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, ప్రసన్న జ్యోతికి భర్త, కుమారుడు ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరి మృతితో వినోభానగర్లో విషాదం అలుముకుంది. మృతురాలి తల్లి తంబారపు లలిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. -
కలిసి బతకలేమని.. చావులోనైనా ఒక్కటవ్వాలని..
బెళుగుప్ప(అనంతపురం జిల్లా): దశాబ్దాలు వేగంగా మారుతున్నాయి.. సాంకేతిక వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కుతోంది. మనిషికి చావే లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కుల జాడ్యం మాత్రం మనుషుల మధ్య చిచ్చుపెడుతూనే ఉంది. తాజాగా కుల పట్టింపులకు ఓ ప్రేమ జంట బలైంది. తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో నిండు నూరేళ్లు కలసి బతకాల్సిన ఆ యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: మిస్ సౌత్ ఇండియాగా వైజాగ్ అమ్మాయి రాయదుర్గం పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన శ్రీకన్య (20) స్థానిక నర్సరీలో పనిచేసేది. రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన బోయ ధనుంజయ (23) పట్టణంలోని ఓ సెల్ఫోన్ రిపేరీ షాపులో పనిచేసేవాడు. ఏడాదిన్నర క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబీకులకు తెలిపారు. అయితే కులాలు వేరు కావడంతో ఇరువైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన శ్రీకన్య, ధనుంజయ కలిసి బతకలేమని భావించారు. చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి వీరిద్దరూ బెళుగుప్ప మండలం నరసాపురం సమీపంలోని ఓ తోట వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న విషద్రావకం తాగారు. ఆ తర్వాత తమ స్నేహితులకు ఫోన్ చేసి తాము చనిపోతున్నామని తెలిపారు. దీంతో వారు బెళుగుప్ప పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే వారున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ వెంటనే 108 వాహనం రావటంతో అందులో వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకన్య గురువారం తెల్లవారుజామున, రాత్రి ధనుంజయ మృతి చెందారు. ఈ ఘటనపై యువతి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెళుగుప్ప ఎస్ఐ రుషేంద్రబాబు తెలిపారు. -
పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన
ప్రముఖ నేపథ్యగాయనిగా పేరు సంపాందించుకుంది కల్పన (Singer Kalpana). తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడింది. సంగీతంపై అమితమైన మక్కువతో ఐదేళ్ల నుంచే పాటలు పాడటం ప్రారంభించింది. శాస్రీయ, జానపద, కర్ణాటక, హిందూస్థానీ, పాశ్చాత్య సంగీతం ఇలా ఏ జోనర్లోనైనా అవలీలగా కల్పన ఆలపిస్తుంది. 'మనోహరం' సినిమాలో మంగళ గౌరి అనే సాంగ్తో ఫుల్ టైమ్ ప్లేబ్యాక్ సింగర్గా మారింది. ఎమ్ఎస్ విశ్వనాథన్, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, కెవి, మహదేవన్, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్తో కలిసి ఆమె పనిచేశారు. వరల్డ్వైడ్గా 3 వేల స్టేజ్ షోలు ఇచ్చి రికార్డు క్రియేట్ చేసిన కల్పన బిగ్బాస్లో కూడా అలరించింది. అయితే ఎంతో సక్సెస్ సాధించిన కల్పన జీవితంలో కూడా ఎంతో విషాదం ఉంది. తన జీవితంలో జరిగిన సంఘటనలతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. ''25 ఏళ్లుగా పాటలు పాడుతున్నా. అనేక వేధింపులతో వివాహబంధం 2010లో ముగిసిపోయింది. ఒక పాప ఉంది. ఉద్యోగం లేదు. అన్నీ కోల్పోయిన నేను ఆఖరికి చనిపోవాలనుకున్నా. కానీ సింగర్ చిత్రమ్మ ధైర్యం చెప్పారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా? అంటూ నన్ను మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడ పోటీ జరుగుతోంది.. అందులో పాల్గనమని ఎంకరేజ్ చేశారు. చదవండి: అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్ వ్యాఖ్యలు తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. సరదాగా అంటే నేను నిజంగానే వేళ్లా. అప్పటికి నాకు మలయాళం అస్సలు తెలియదు. కసితో వెళ్లాను. నా కుమార్తె కోసం విల్లా గెలవాలనుకున్నాను. ఇండస్ట్రీలో పరువు పోయిందని చాలా మంది మాటలు అన్నారు. మా తల్లిదండ్రులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో కష్టపడి ఆ పోటీ గెలుపొందా. ఈ విషయంలో ఎవరూ సహాయం చేయలేదు. చీకటిలో ఒంటరి పోరాటం చేశాను. ఆ గెలుపు తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది'' అని ఇటీవల తెలిపారు సింగర్ కల్పన. చదవండి: నూలుపోగు లేకుండా రణ్వీర్ సింగ్.. మానసిక రోగి అంటూ బ్యానర్లు శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ -
తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య!
చిక్కడపల్లి (హైదరాబాద్): వైమానిక దళంలో పనిచేసి రిటైరయ్యాక, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న టి.శివారెడ్డి అనే వ్యక్తి శుక్రవారం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఆయన భార్యతో విభేదాల నేపథ్యంలోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానిక ప్రజలు తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లాకు చెందిన టి.శివారెడ్డి (44) గతంలో వైమానిక దళంలో పనిచేసి, రిటైరయ్యారు. కొంతకాలం నుంచి బాగ్లింగంపల్లిలోని మానస ఎన్క్లేవ్లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. భార్య రమాదేవితో విభేదాల నేపథ్యంలో 2017లోనే విడాకులు తీసుకున్నారు. అయితే ఇటీవల కడపకు వెళ్లిన శివారెడ్డి.. శుక్రవారం ఉదయం 6గంటల సమయంలో బాగ్లింగంపల్లి నివాసానికి వచ్చారు. ఆయన సోదరి మహేశ్వరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పలుమార్లు శివారెడ్డికి ఫోన్ చేశారు. ఎంతకూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి.. కవాడిగూడకు చెందిన తన స్నేహితురాలు లక్ష్మీభవానికి ఫోన్ చేసి, తన సోదరుడికి ఇంటికి వెళ్లాలని కోరారు. లక్ష్మీభవాని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన తల్లితో కలసి శివారెడ్డి నివాసం వద్దకు వచ్చారు. తలుపు లోపలికి గడియ పెట్టి ఉండటంతో ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా స్పందన రాలేదు. దీంతో వారికి అనుమానం వచ్చి.. వాచ్మన్ సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే శివారెడ్డి తుపాకీతో కాల్చుకుని, మంచంపై పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్కుమార్, క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే శివారెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారని బంధువులు చెప్తున్నారు. వీటికితోడు భార్యతో గొడవలతో మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ -
పెళ్లయిన మూడో రోజే గొంతు కోసుకొని నవ వరుడి ఆత్మహత్య
వైరా రూరల్: కోటి ఆశలతో పెళ్లి చేసుకున్నాడు.. వైవాహిక జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఏమైందో కానీ బాత్రూంలో బ్లేడుతో గొంతు, చెయ్యి కోసుకుని నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో పెళ్లి ఇంట విషాదం అలుముకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం పుణ్యపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. పుణ్యపురానికి చెందిన కంభంపాటి ఇస్రాయిల్, నాగమ్మ దంపతులకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇస్రాయిల్ 25 ఏళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి నాగమ్మ ఆశవర్కర్గా పనిచేస్తూ పిల్లలను చదివించింది. చిన్నకుమారుడైన నరేశ్ (29) 2014లో బీటెక్ పూర్తిచేశాడు. ప్రస్తుతం గ్రూప్ –1, ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు సిద్ధమవుతూనే ఖాళీ సమయాల్లో ఉపాధి హామీ పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఈ నెల 4వ తేదీన నరేశ్ వివాహం జరిగింది. 5వ తేదీ ఆదివారం స్వగ్రామమైన పుణ్యపురంలో జరిగిన రిసెప్షన్లో మిత్రులు, బంధువులతో కలసి రాత్రి 11 గంటల వరకు నరేశ్ సరదాగా గడిపాడు. సోమవారం ఉదయం విజయవాడ గుణదలలోని మేరీమాత చర్చికి వెళ్లాలని నిర్ణయించుకుని అద్దె కారు కూడా మాట్లాడాడు. తెల్లవారు జామునే కుటుంబీకులను నిద్ర లేపిన నరేశ్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంలోకి వెళ్లాడు. అయితే ఎంత సేపటికీ నరేశ్ రాకపోకడంతో తలుపు కొట్టినా పలకలేదు. దీంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు కుర్చీ వేసుకుని పైనుంచి చూడగా నరేశ్ బ్లేడ్తో గొంతు, ఎడమ చేయి మణికట్టు వద్ద కోసుకుని రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించారు. తలుపులు పగులగొట్టి చూడగా అతను అప్పటికే మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు. చదవండి: Hyderabad: బాలికపై ఐదుగురి లైంగిక దాడి.. వీడియోలు తీసి, బెదిరించి -
నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్య చేశారా?
విజయనగరం క్రైమ్ : అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, వన్టౌన్ పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మయూరి జంక్షన్కు చెందిన నిర్మలకు (27) 2020లో స్థానిక బాలాజీ రోడ్డు నటరాజ్ కాలనీకి చెందిన భార్గవ్తో వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయినప్పటికీ... కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్కే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే పెళ్లయినప్పటి నుంచి భర్త భార్గవ్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం నిర్మలను వేధించేవారు. దీంతో ఆమె పలుమార్లు కన్నవారింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద గోడు వెల్లబోసుకుంది. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో నిర్మలను ఆమె తల్లిదండ్రులు సర్ది చెప్పి అత్తవారింటికి పంపించేవారు. కొద్ది రోజులుగా గొడవలు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నిర్మల శనివారం ఇంటిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక అత్తింటి వారు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి లక్ష్మణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. -
యువతితో రౌడీషీటర్ సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ చివరికి..
పాయకాపురం(విజయవాడ రూరల్): వాంబేకాలనీలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ ఓయా బాను శంకర్ అలియాస్ టోనీ (25) మంగళవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వాంబేకాలనీ హెచ్ బ్లాక్లో అద్దెకు ఉంటున్న శంకర్ ట్యాటూస్ వేస్తుంటాడు. మూడు నెలల నుంచి అనూష అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. సోమవారం రాత్రి మద్యం విషయంలో వీరిరువురి మధ్య గొడవ జరిగింది. చదవండి: కొత్త గర్ల్ఫ్రెండ్తో కెమెరా కంటికి చిక్కిన ఎలాన్ మస్క్ దీంతో అనూష అతనిపై అలిగి ఇంటి బయటకు వచ్చి పడుకుంది. దీంతో శంకర్ తలుపులు మూసుకొని చున్నీతో ఫ్యాన్రాడ్ కు ఉరివేసుకొన్నాడు. అర్ధరాత్రి తర్వాత అనూష మూసి ఉన్న తలుపుతీసే ప్రయత్నం చేయగా.. రాకపోవడంతో ఆమె మృతుని తమ్ముడు రామకృష్ణకు ఫోనులో సమాచారం అందజేసింది. అతను కిటికీలో నుంచి చూడగా శంకర్ ఉరివేసుకొన్నట్టు గమనించి పగులకొట్టి లోపలికి వెళ్లాడు. అన్నను కిందికి దించి, ఆటోలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందాడు. మృతుని తమ్ముడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
గోడు చెప్పుకోవడానికొచ్చి.. ఉసురు తీసుకోబోయారు
ఇందూరు(నిజామాబాద్ అర్బన్)/వరంగల్: నిజామాబాద్, వరంగల్ జిల్లాల కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల్లో కలకలం చెలరేగింది. తమ సమస్యలు పరిష్కరించడం లేదని ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. నిజామాబాద్లో ఇద్దరు, వరంగల్లో ఒకరు ఈ అఘాయిత్యానికి యత్నించగా అధికారులు, పోలీసులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఓ మహిళ ఫినాయిల్ తాగగా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. లైంగికంగా వేధిస్తున్నారని.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్కు చెందిన నాగలక్ష్మి తన కూతురితో కలసి కలెక్టరేట్కు వచ్చింది. నామ్దేవ్, ఎర్రం గణపతి అనే వ్యక్తులు లైంగికంగా వేధిస్తున్నారని, తన ఆత్మహత్యకు వారే కారణమని సూసైడ్ నోట్ రాసుకుంది. వెంట తెచ్చుకున్న ఫినాయిల్ తాగేసింది. భర్త లేని తనకు ఉద్యోగం ఇప్పిస్తామంటూ వారు ఆశచూపినా లొంగకపోవడంతో మంత్రాలు చేస్తున్నానని కాలనీలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే నాగలక్ష్మిని జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రాణాపాయం నుంచి బయటపడింది. వేధించినవారిని విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. భూమిని కబ్జా చేశారని.. ప్రభుత్వం తనకు ఇచ్చిన మూడెకరాల వ్యవసాయ భూ మిని కబ్జా చేసిన పెద్దోళ్ల గంగారెడ్డిపై అధికారులు చర్య లు తీసుకోవడం లేదంటూ జక్రాన్పల్లి మండలం అర్గుల్కు చెందిన మేకల చిన్న చిన్నయ్య అనే దళిత రై తు నిజామాబాద్ ప్రజావాణికి వచ్చాడు. ఉన్నట్టుండి ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించగా పోలీసులు వారించారు. గంగారెడ్డి గతేడాది జూన్లో తన భూమిని ఆక్రమించి దున్నాడని, ప్రశ్నించినందుకు చం పుతానని బెదిరిస్తున్నాడని చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. చిన్నయ్యను పోలీసులు కలెక ్టర్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు ఇప్పించారు. భాగస్వాములు మోసం చేశారని.. వరంగల్ నగరానికి చెందిన జిన్నింగ్ మిల్స్ వ్యాపారి రఘునందన్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చారు. తన వ్యాపార భాగస్వాములు లెక్కల్లో మోసం చేసి కేవలం రూ.40 లక్షల వరకు బకాయి పడినట్లు చూపుతున్నారని కలెక్టర్కు వివరిస్తూ వినతిపత్రం అందించారు. ఆ వెంటనే పెట్రోల్ను ఒంటిపై పోసుకోవడంతోనే అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని, ఇది ప్రైవేటు సమస్య అయినందున సీపీకి సిఫారసు చేస్తున్నానని తెలిపారు. తర్వాత సుబేదారి పోలీసులు రఘునందన్ను బయటకు తీసుకెళ్లారు. -
మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె మహాలక్ష్మి(27) గురువారం తెల్లవారుజామున సారపాకలోని స్వగృహంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లోని ముందు గదిలో ఫ్యాన్కు వేలాడుతున్న మహాలక్ష్మిని ఆమె వ్యక్తిగత సహాయకురాలు గమనించి, ఇరుగుపొరుగు సహకారంతో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్కు వెళ్లిన వెంకటేశ్వర్లు బుధవారం రాత్రి దమ్మపేటకు చేరుకుని అక్కడి నివాసంలో ఉండిపోయారు. వెంకటేశ్వర్లు భార్య రత్నకుమారి గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. కుమారుడు రవికుమార్ హైదరాబాద్లో ఉన్నారు. ఎంబీబీఎస్ పూర్తి.. కరీంనగర్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన మహాలక్ష్మి పీజీ ప్రవేశపరీక్షకు సిద్ధమవుతున్నారు. 15 రోజులుగా మహాలక్ష్మి ముభావంగా ఉంటోందని, పీజీ ప్రవేశపరీక్ష సమీపిస్తున్నందున ఆందోళనకు గురవుతోందని భావించానని తండ్రి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి తెలిపారు. స్థలం మారితే మంచిదని బంధు వుల ఇంటికి పంపించానని, రెండు రోజులకు తిరిగొచ్చి మామూలుగానే ఉంటున్నట్టు చెప్పారు. ఇంతలోనే తన కుమార్తె అఘాయిత్యానికి పాల్పడిందని కన్నీరుమున్నీరయ్యారు. కాగా, మానసిక ఒత్తిడితోనే మహాలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రేమ వివాహం వద్దన్నందుకు యువకుడి ఆత్మహత్య
కొండాపురం : మండల పరిధిలోని కె.సుగుమంచిపల్లె గ్రామానికిచెందిన యలమకురు చరణ్కుమార్ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ జె.రవికుమార్ కథనం మేరకు తాళ్లప్రొద్దుటూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కె. సుగుమంచిపల్లె గ్రామానికి చెందిన యలమకురు యల్లప్ప కుమారుడు ఎస్సీ కులం అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమవివాహం చేసుకోవద్దని తండ్రి మందలించాడు. దీంతో ఇంటిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నచ్చిన యువతితో పెళ్లి చేయలేదని..
బేతంచెర్ల: నచ్చిన యువతితో కుటుంబీకులు పెళ్లి చేయలేదని ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నంద్యాల రైల్వే ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వడ్డె సుబ్బరాయుడు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో రెండవ కుమారుడు చిన్న నాగరాజు(22) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం గౌండ పనితో పాటు కారు డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం ఈ యువకుడికి ఓ పెళ్లి సంబంధం చూశారు. కాని కుటుంబ సభ్యులు ఆ సంబంధం వద్దని చెప్పారు. దీంతో నచ్చిన యువతితో పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన చిన్న నాగరాజు గురువారం అర్ధరాత్రి స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు నంద్యాల రైల్వే ఎస్ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ముగ్గురు రైతులను మింగిన అప్పులు
గార్ల/భూపాలపల్లి రూరల్/నార్నూర్: పంటల పెట్టుబడికి తెచ్చిన అప్పులు చివరికి ఆ రైతులనే కబళించాయి. పంటల దిగుబడి ఆశించిన మేర రాక, అప్పులు తీర్చే మార్గం కానరాక మహబూబాబాద్, భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గోపాలపురం పంచాయతీ వేదనాయక పురం గ్రామానికి చెందిన కుడితెట్టి ఉపేందర్(32) ఎకరంలో మిర్చితోట సాగు చేశాడు. రూ.1.50 లక్షల అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. పూత కాత రాక మిర్చి పంట ఎండిపోయింది. సోమవారం ఉదయం తోటకు వెళ్లి కంటనీరు పెట్టుకొని అప్పులెలా తీర్చాలని మధనపడుతుండగా ఉపేందర్కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు గార్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందా డు. అతడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు న్నారు. జయశంకర్ భూపాలపల్లి మున్సి పాలిటీ పరిధిలోని కాసింపల్లికి చెందిన ఎల కంటి ఈశ్వరయ్య (45) తనకున్న మూడెక రాలలో మిర్చి సాగు చేశాడు. తామర పురుగు సోకడంతో దిగుబడి రాలేదు. పంటకు చేసిన రూ.4.50 లక్షలతోపాటు బిడ్డ పెళ్లికి చేసిన అప్పులు కుప్పలవడంతో మనస్తాపానికి గురై ఆదివారంరాత్రి తోటలోకి వెళ్లి పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఉమ్రీ గ్రామానికి చెందిన జాదవ్ రమేశ్(40)తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దిగుబడి సరిగా రాలేదు. యాసంగిలో జొన్నపంట సాగు చేయగా, ఆశించిన మేర దిగుబడి వచ్చే పరిస్థితిలేదు. పంటల సాగు కోసం రెండేళ్లలో రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. కూతురు పెళ్లికి ఎదగడం, వ్యవసాయంలో నష్టాలు రావడం, ఇప్పటికే చేసిన అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో సోమవారం ఉదయం తన చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్కు భార్య బిక్కుబాయి, కొడుకు, కూతురు ఉన్నారు. -
కలిసి బతకలేం.. ఒక్కటిగా చనిపోదాం
హాలియా: పెళ్లికి పెద్దలు అంగీకరించరని ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కలిసి బతకలేమని.. ఒక్కటిగానైనా చనిపోదామని నిర్ణయించుకొని ప్రేమికులిద్దరూ నాగర్జునసాగర్ ఎడమ కాల్వలో దూకారు. ప్రియురాలిని స్థానికులు రక్షించగా.. అప్పటికే నీటి ప్రవాహంలో యువకుడు గల్లంతయ్యాడు. నల్లగొండ జిల్లా హాలియాలో సోమవారం ఈ విషాదం జరిగింది. పెద్దలు అంగీకరించరని భావించి.. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం నర్లంగ తండాకు చెందిన రమావత్ లింగ, కవిత దంపతుల కుమార్తె నందిని (18) దేవరకొండలో ఇంటర్ చదువుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మాచర్ల మండలం రేగులవరం తండాకు చెందిన వడ్త్యా బాలకృష్ణ (21) ఒంగోలులోని ఓ హోటల్లో పని చేస్తున్నాడు. బాలకృష్ణ సోదరుడు వడ్త్యా బాబురావుతో నందిని అక్క రమా వత్ అనితకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరి వివాహ సమయంలో బాలకృష్ణ, నందిని మధ్య ఏర్పడిచన పరిచయం ప్రేమగా మారింది. 9 నెలల క్రితం బాబురావు భార్య అనిత ఆత్మహత్య చేసుకుంది. పిల్లలు తల్లిలేనివారయ్యారు. అక్క పిల్లల కోసం బావను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు నందినిపై ఒత్తిడి తెచ్చారు. అయితే నందిని, బాలకృష్ణ తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించారు. ఆదివారం ఫోన్లో మాట్లాడుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాళ్ల సాయంతో యువతిని కాపాడి.. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రేమ జంట హాలియాకు చేరుకుంది. ఎడమ కాల్వలోకి ముందుగా ప్రియుడు బాలకృష్ణ దూకగా ఆ తర్వాత ప్రియురాలు దూకింది. విషయం గమనించిన హోంగార్డు వెంకట్.. వెంటనే ఎస్ఐ క్రాంతికుమార్కి సమాచారం అందించాడు. ఆయన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువతిని స్థానిక యువకుల సాయంతో తాళ్లతో కాపాడారు. అప్పటికే బాలకృష్ణ కనిపించకుండాపోయాడు. పోలీసులు గాలించినా బాలకృష్ణ ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ప్రేమ విఫలమైనట్టు వాట్సాప్లో స్టేటస్లు.. గాయకుడు ఆత్మహత్య
సైదాబాద్(హైదరాబాద్)/ తిరుమలగిరి(సాగర్): నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్ మోహన్ నాయక్ (20) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మోహన్ ప్రస్తుతం హైదరాబాద్లోని సైదాబాద్ రెడ్డి కాలనీలో ఉంటున్నాడు. బంజారా పాటలతో సామాజిక మాద్యమాల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మోహన్ మంగళవారం రాత్రి తన రూమ్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పై చదువులకని నగరానికొచ్చి.. మోహన్ పై చదువుల కోసం నగరానికి వచ్చి గది అద్దెకు తీసుకుని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. అయితే రెండు మూడు రోజులుగా వాట్సాప్లో తన ప్రేమ విఫలమైనట్లుగా స్టేటస్లో పెడుతున్నాడని, ఓ వీడియోను కూడా పోస్టు చేశాడని స్నేహితులు చెబుతున్నారు. తన గదిలోనే ఉంటున్న ఇద్దరు స్నేహితులు మంగళవారం రా త్రి బయటకు వెళ్లిన సమయంలో మోహన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించి పక్కగదిలో ఉంటున్న వారు మోహన్ స్నేహితులకు ఫోన్చేసి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, మోహన్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడి బొమ్మగీసి..
నర్సింహులపేట: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని సూసైడ్ నోట్ రాసి యువతి అత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన కొండ లింగమల్లు అనే యువకుడు, పోలేపల్లి శరణ్య మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియుడు ఒక ప్రజా ప్రతినిధి వద్ద డ్రైవర్గా పని చేస్తున్నాడు. పెళ్లి గురించి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ కూడా చేశారు. కొంత సమయం కావాలని ప్రియుడు కోరాడు. ఇచ్చిన సమయం అయిపోయినా లింగమల్లు పెళ్లికి నిరాకరించడంతో శరణ్య (23) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన యువకుడి ఫొటో బొమ్మ గీసింది. కాగా.. యువతి శవాన్ని యువకుడి ఇంటి ముందుకు తీసుకొచ్చి బంధువులు ఆందోళన చేశారు. -
డబుల్ బెడ్రూం లాక్కుంటాం అన్నారని..
మర్కూక్ (గజ్వేల్): తనకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇల్లు తీసు కుంటామని కొంత మంది గ్రామ నాయకులు బెదిరించడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలో ఎర్రవల్లిలో చోటు చేసు కుంది. ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుంట నర్సమ్మ (45) గతంలో ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంట్లో కుటుంబంతో కలి సి ఉంటోంది. ఇంటి ఆవరణలో ఉన్న ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించుకు నేందుకు సిద్ధపడగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రహరీ నిర్మించు కుంటే ఇల్లు తిరిగి తీసుకుంటా మని బెదిరింపులకు పాల్పడటంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. మ నస్తాపం చెందిన నర్సమ్మ శనివా రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వా స్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫి ర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణలో ఉద్రిక్తత
దామెర: నాగపూర్– విజయవాడ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత నెలకొంది. తమ భూములను లాక్కోవద్దంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. హను మకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులు వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా, రైతులు ఆం దోళనలకు దిగుతూ అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. శనివారం ఉదయం అధికారులు ఊరుగొండ, దుర్గంపేట్ రెవెన్యూ గ్రామాల్లో తిరిగి సర్వే ప్రారంభించారు. ఏసీపీ శివరా మయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా 163 జాతీయ రహదారి వద్ద అడ్డుకున్నారు. ఆందోళనలు చేసిన పలువురిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో ఇతరమార్గాల ద్వారా కొందరు రైతులు అక్కడికి చేరుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఊరుగొండకు చెందిన చెల్పూరి అశోక్ అనే రైతు ఉరేసుకోవడానికి యత్నించడంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఓదెల రజిత అనే మరో మహిళారైతు ఆత్మహత్యే శరణ్యమని, ఇంటిల్లిపాది పురుగులమందు తాగి చనిపోతామంటూ రోదించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, అధికారులు వారికి నచ్చజెప్పి సర్వే కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరిసరాల్లోని వ్యవసాయబావుల వద్ద, ఎస్సార్ఎస్పీ కెనాల్ వద్ద, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు రెండు 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. -
పంచాయతీ కార్యదర్శినా... పాలేరునా? చావే నాకు దిక్కు!
బయ్యారం: ‘నాది మధ్యతరగతి కుటుంబం. మా కాడ ఎవరూ పెట్టుబడి పెట్టరు. కార్య దర్శినే పెట్టుకోవాలి. ఇదెక్కడి న్యాయం? ట్రాక్టర్ పర్సంటేజీలు తీసుకునేది సర్పంచ్లు. కానీ కార్యదర్శి డీజిల్ పోయించి ట్రాక్టర్ నడపాలా.. వారికి బాధ్యత లేదా? ఇది ఉద్యోగమా.. బానిస బతుకా సార్’ అంటూ ఎంఏ బీఈడీ చదివిన ఓ దివ్యాంగ పంచాయతీ కార్యదర్శి శుక్రవారం సూసైడ్నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం పంచాయతీ కార్యదర్శిగా అదే మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఈసం వెంకటేష్ 16 నెలలుగా పనిచేస్తున్నాడు. గ్రామంలో వాడే ట్రాక్టర్కు డీజిల్ను రోజూ తన డబ్బులతోనే కొంటున్నాడు. వాటి బిల్లుల కోసం వెళ్లితే జాయింట్ చెక్ పవర్ ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్లు సంతకాల కోసం తిప్పించుకుంటున్నారు. దీంతో కలత చెందిన వెంకటేష్ ఇంటివద్ద పురుగుమందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. సూసైడ్ నోట్లో ఏముందంటే.. ‘అడిషనల్ కలెక్టర్ మేడం... కలెక్టర్ సార్.. గ్రా మంలో ఏమైనా ఖర్చులు పెట్టాల్సి వస్తే కా ర్యదర్శి పెట్టాలి అని ఏమైనా చట్టంలో ఉందా.. మేమూ మనుషులమే. మమ్మల్ని బలిపశువుల్ని చేశారు. పాలేరు కంటే ఎక్కువగా వాడుకుం టున్నారు. ఉపసర్పంచ్ సంతకం ఏమైనా రాష్ట్రపతి సంతకమా? అ, ఆ..లు రానివాళ్లు సర్పంచ్, ఉపసర్పంచ్లు అయితే మా పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. -
నిరుద్యోగి దారుణం.. ‘ఉద్యోగం లేకపోతేనే, మేం సాద్దుము కొడుకా.. ’
ఖమ్మం క్రైం: ‘తల్లిదండ్రులు కూలికి వెళ్లి సంపాదించిన డబ్బులతో కోచింగ్ సెంటర్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నన్ను ఇంకా ఎంతకాలం పోషిస్తారు. తెలంగాణలో ఇగ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావేమో... పిచ్చిలేస్తోంది’అని ఆందోళన చెందిన ఓ నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన ముత్యాల సాగర్(23) ఖమ్మం మామిళ్లగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఏ పూర్తిచేశాడు. అక్కడే ఎన్సీసీలో చేరి ‘సీ’సర్టిఫికెట్ సాధించాడు. తల్లిదండ్రులు భద్రయ్య, కళమ్మ దినసరి కూలీలు. ఇటీవలే సాగర్ సోదరికి వివాహమైంది. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో సాగర్ ఎస్సై, కానిస్టేబుల్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ స్నేహితులతో కలసి అద్దెగదిలో ఉంటున్నాడు. సంక్రాంతి తర్వాత స్వగ్రామం నుంచి ఖమ్మం వచ్చిన సాగర్ సోమవారం అర్ధరాత్రి దాటాక తన గది సమీపాన రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన సెల్ఫోన్ వాట్సాప్ స్టేటస్లో ‘ఇగ నోటిఫికేషన్లు రావు... పిచ్చి లేస్తోంది’అని పెట్టాడు. మంగళవారం ఉదయం స్థానికులు సాగర్ మృతదేహాన్ని గమనించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం వద్ద లభించిన పాన్ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రవికుమార్ సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు, సభ్యుల సాయంతో మార్చురీకి తరలించారు. సాగర్ మృతదేహాన్ని భద్రపరిచిన జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద పలు పార్టీలు ఆందోళన చేశాయి. ఆత్మహత్యకు కేంద్రప్రభుత్వం కూడా కారణమేనంటూ న్యూడెమోక్రసీ నేతలు ఆరోపించడంతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని బయ్యారం తరలించారు. కాగా, సాగర్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బయ్యారంలోని ఇల్లందు–మహబూబాబాద్ రహదారిపై న్యూడెమోక్రసీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతోపాటు పలు కులసంఘాలు రాస్తారోకో చేశాయి. దీంతో దహనస్కారాలు పూర్తి అయ్యే వరకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉద్యోగం లేకపోతేనే, మేం సాద్దుము కొడుకా.. బయ్యారం: ‘మా కడుపున పుట్టిన నీవు మమ్ముల్ని సాదుతావు అనుకున్నాం కొడుకా... ఉద్యోగం లేకున్నా.. నాన్న, నేను రెక్కల కష్టంతో చెల్లిని, నిన్ను పెంచి పెద్ద చేశాం. ఉద్యోగం చేయమని మేం అడిగామా... నీకు ఉద్యోగం లేకున్నా మేం సాద్దుము.. మేం ఎవరి కోసం బతకాలి కొడుకా.. మమ్ముల్ని ఎందుకు అన్యాయం చేశావు నాయనా’అంటూ సాగర్ తల్లి కళమ్మ విలపించిన తీరు పలువురిని కన్నీటి పర్యంతం చేసింది. -
ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి..
శామీర్పేట్(హైదరాబాద్)/ధన్వాడ: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తల్లిదండ్రుల కోరిక తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలోని పాతపల్లికి చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల చిన్న కుమారుడు నరసింహ (23) బీఎస్సీ (బయో టెక్నాలజీ) పూర్తి చేశాడు. కొద్దికాలంగా శామీర్పేటలోని ఓ రూంలో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఉంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యో గం చేస్తున్నాడు. అయితే నరసింహ స్వగ్రామానికి వెళ్లిన ప్రతిసారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు సాధిస్తావు అంటూ అడుగుతుండటంతో మనస్తాపానికి గురయ్యాడు. గత కొంతకాలంగా తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోయానంటూ బాధపడుతున్నాడు. ప్రభుత్వ ఉద్యో గం చేసిన వాల్లే మనుషులా..ప్రైవేటు ఉద్యోగం చేసిన వాళ్లు మనుషులు కారా? అంటూ లేఖ రాసి గత నెల 27న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో తోటి మిత్రులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారమిచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సోమవారం ఉదయం లాల్గడి మలక్పేట గ్రామంలోని మల్క చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ వివాహం.. భారీగా కట్నకానుకలు అయినా..
సాక్షి, స్టేషన్ఘన్పూర్(వరంగల్): అదనపు కట్నం కోసం భర్త, అత్తమామాల వేధింపులు తాళలేక వివాహిత ముప్పిడి లావణ్య(20) బలైన సంఘటన మండలంలోని కోమటిగూడెంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. కోమటిగూడెం గ్రామానికి చెందిన పర్శ బాలరాజు, యాకమ్మ దంపతుల కుమార్తె అయిన లావణ్య ఇంటర్ చదివి ఇంటి వద్ద ఉండేది. వారి ఇంటి ఎదురుగా ముప్పిడి కొండయ్య, మల్లమ్మ దంపతులు ఉండేవారు. వారి కుమారుడు ముప్పిడి నరేష్ లావణ్యతో ప్రేమలో పడ్డాడు. విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలియగా ఇద్దరూ ఒకే కులానికి(ముదిరాజ్) చెందిన వారు కావడంతో 11 నెలల క్రితం వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నంగా అర ఎకరం చెలుక, ఐదు తులాల బంగారం, పెళ్లి ఖర్చులకు రూ.లక్ష నగదు ఇచ్చారు. అయితే మొదట్లో బాగానే ఉన్నప్పటికీ ఐదారు నెలలుగా అదనపు కట్నం కోసం లావణ్యను భర్త నరేష్తో పాటు అత్తమామలు వేధిస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా నరేష్కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్యను బాగానే చూసుకుంటానని పెద్దమనుషులు, పోలీసుల సమక్షంలో చెప్పిన నరేష్ తిరిగి వేధింపులను ప్రారంభించాడు. దాంతో కొద్దిరోజులుగా ఆమె తల్లిగారి ఇంటి వద్దనే ఉంటుంది. అయితే రోజూ మాదిరిగానే వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన ఆమె తల్లిదండ్రులు లావణ్య ఇంట్లో ఉరి వేసి ఉండటం గమనించి రోధిస్తూ కిందకుదించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెంది ఉంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి తమ కుమార్తెను ఆమె భర్త నరేష్ ఉరివేసి చంపాడని ఆరోపిస్తూ అతడి ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. అయితే అప్పటికే నరేష్ ఇంట్లో ఎవరూ లేకుండా పరారు కావడంతో రాత్రి వరకూ మృతదేహంతో ఆందోళన చేశారు. మృతదేహంపై పడి తల్లి, బంధువులు పెద్ద ఎత్తున రోదించారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాస్రెడ్డి పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆమెది ఆత్మహత్యనా, హత్య అనే విషయమై గ్రామంలో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. కమలాపూర్లో మరొకరు.. కమలాపూర్: వరకట్న వేధింపులు తాళలేక కమలాపూర్ మండలకేంద్రానికి చెందిన పబ్బు హారిక (27) అనే వివాహిత గురువారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపూర్కు చెందిన పబ్బు పాపయ్య– సుభద్రల కుమారుడు కిరణ్, జక్కు సాంబమూర్తి– కళమ్మల కూతురు హారిక ప్రేమించుకోగా సుమారు ఐదేళ్ల క్రితం ఇరు కుటుంబాలు వారి ప్రేమను అంగీకరించి వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.లక్ష నగదు, 6 తులాల బంగారం, కల్లు చీరిక రాసిచ్చి ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. ప్రస్తుతం వీరికి మూడున్నర ఏళ్ల కుమారుడు ఉన్నారు. పెళ్లైన కొద్ది కాలం నుంచి అదనపు కట్నం తేవాలంటూ హారికను ఆమె భర్త కిరణ్, అత్త సుభద్ర శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో మూడు విడతలుగా రూ.లక్ష చొప్పున మొత్తం రూ.3 లక్షలు అదనంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 16న కళమ్మతో పాటు ఆమె ఇద్దరు కూతుర్లు సంధ్య, హారికలు మొట్టుపల్లిలో జరిగిన బంధువుల వివాహానికి వెళ్లారు. ఈ నెల 18న కిరణ్ అక్కడికి వెళ్లి హారికతో గొడవపడి ఆమెను తీసుకుని కమలాపూర్కు వచ్చాడు. అదే రోజు రాత్రి హారిక ఉరి వేసుకుని మృతి చెందినట్లు తెలిపారు. తన కూతురు హారిక మృతి పట్ల భర్త కిరణ్, అత్త సుభద్రలపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి కళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. -
మేడ్చల్ జిల్లా: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్
-
ఇద్దరి ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
-
క్వారి గుంతలో దూకి తల్లి, ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య
-
బావిలో దూకి నలుగురు కరోనా రోగులు ఆత్మహత్య
-
కుటుంబంలో గొడవలు.. విచక్షణ కోల్పోయిన ఆమహిళ..
సాక్షి, సుభాష్నగర్(కుత్బుల్లాపుర్): కుటుంబంలో చిన్నపాటి గొడవలతో కొంత మంది విచక్షణ కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి ఘటన గురువారం దూలపల్లిలో చోటు చేసుకుంది. దూలపల్లి కమ్మరిబస్తీ గుడిసెల్లో ఉండే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకునేందుకు పక్కనే ఉన్న లింగయ్య చెరువులో దూకింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇద్దరు యువకులు వెంటనే చెరువులోకి దూకి మహిళను కాపాడికి ఒడ్డుకు తీసుకు వచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఎమ్మెల్యే కారు ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, నర్సాపూర్(మెదక్): తన భూమిలో సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన రైతు ముచ్చర్ల లక్ష్మయ్య నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి కారు ఎదుట సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం స్థానిక మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొని వెళ్తున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి తన కారు వద్దకు వచ్చిన పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఆయన కారుకు ఎదురుగా పట్టణానికి చెందిన రైతు లక్ష్మయ్య కూర్చుని తలపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పలువురు నాయకులు గమనించి అక్కడే ఉన్న ఎస్ఐ సత్యనారాయణతో చెప్పడంతో ఆయన రైతు వద్దకు వెళ్లి అతని చేతిలో నుంచి కిరోసిన్ బాటిల్ను లాక్కొని పక్కన పారవేశారు. అప్పటికే లక్ష్మయ్య తలపై కిరోసిన్ పడడంతో అతడిని ఎస్ఐతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి పక్కకు తీసుకుపోయారు. కాగా రైతు ముచ్చర్ల లక్ష్మయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా అక్కడే ఉన్న అతని భార్య చంద్రకళను టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్రెడ్డి వద్దకు తీసుకుపోయి మీ సమస్యను చెప్పాలని సూచించారు. తమకు నర్సాపూర్లో కొంత భూమి ఉందని అందులో దున్నకుండా తమ దాయాదులు అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా కారుకు అడ్డంగా కూర్చుంటే సమస్యలు పరిష్కారం అవుతాయా అని ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆమెను ప్రశ్నించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. చంద్రకళ చెప్పిన భూముల వివరాలను స్థానిక ఆర్డీఓ, తహసీల్దార్కు ఎమ్మెల్యే వివరించి లక్ష్మయ్య, చంద్రకళ దంపతులకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. -
నా చావుకు ఎస్ఐ వేధింపులే కారణం..
సాక్షి, విజయవాడ: పోలీసులు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. విజయవాడలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న చిట్టూరి మురళి ఆర్థిక ఇబ్బందులు కారణంగా పగలు కళాశాలకు వెళ్ళి చదువుకుంటూ..రాత్రి పూట టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి గన్నవరం ఎస్ఐ నారాయణమ్మ భర్త బైక్ మీద వెళ్తుండగా..మురళి ఎదురుగా రావడంతో ఒకరినొకరు ఢీ కొన్నారు. దీంతో మురళీని స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులు ప్రశ్నించగా, తీవ్ర మనస్తాపం చెందిన మురళీ.. గన్నవరం కోనాయిచెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ఎస్ఐ నారాయణమ్మ మానసికంగా వేధించినట్లు, తన చావుకు ఎస్ఐ కారణమంటూ స్నేహితుడికి మురళీ చివరిగా చేసిన ఫోన్కాల్లో చెప్పినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా కుమారుడు మృతికి పోలీసులు కారణం కాదు.. అయితే తన కుమారుడు మురళి మృతికి పోలీసులు కారణం కాదని మృతుడి తల్లి పార్వతి తెలిపారు. పోలీసులతో చాలా లౌక్యంగా ఉంటాడని చెప్పారు. ఇక విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సిఐ శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. మృతుడు మురళీని పోలీస్స్టేషన్కు పిలిచి విచారించింది వాస్తమేనని, రాంగ్ డ్రైవింగ్ చేస్తూ ఎస్ఐ భర్త బైక్ను ఢీ కొట్టడంతో పిలిచి విచారణ జరిపామని తెలిపారు. -
ఊరు కాని ఊరిలో... దుర్మణం
టెక్కలి రూరల్: రాష్ట్రం కాని రాష్ట్రం, భాష కాని భాష... ఎందుకు మనస్తాపం చెందాడో... ఎందుకు చనిపోవాలనుకున్నాడో... ఊరు కాని ఊరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తేలినీలాపురం సమీపంలో శుక్రవారం 70 అడుగుల ఎత్తులో ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్పై ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించిన వ్యక్తిని ఒడిశావాసిగా గుర్తించారు. శుక్రవారం చీకటి పడటంతో మృతదేహాన్ని దించలేకపోయారు. శనివారంఉదయం టెక్కలి సీఐ ఆర్.నీలయ్య, ఎస్ఐ బి. గణేష్, విద్యుత్ శాఖ ఏఈ దయాళ్ నేతృత్వంలో 8మంది సభ్యులు టవర్పైకి ఎక్కి మృతదేహాన్ని కిందకు దించారు. మృతుని జేబులో ఉన్న ఆధా ర్ కార్డు, ఇన్సూరెన్స్ కార్డు ఆధారంగా మృతుడి ది ఒడిశా రాష్ట్రం కళహండి జిల్లా బగడ మండ లం ఇచ్చాపూర్ గ్రామమని, అతని పేరు కళియమణి బెహర (40) అని గుర్తించారు. అయితే ఒడిశాకు చెందిన అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడే ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలేమిటి? 70 అడుగుల ఎత్తులో ఉన్న టవర్ ఎక్కి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తదితర విషయాలు పోలీసులు దర్యాప్తు లో తేలాల్సివుంది. మృతుడి వద్ద బరంపురం నుంచి విజయనగరం వైపు ఈ నెల 14వ తేదీన తీసిన రైలు టిక్కెట్ ఉంది. అతని జేబులో దొరికిన వివరాలను బట్టి బంధువులకు ఫోన్ చేయగా మృతుడు కొద్ది రోజులుగా కేరళలో పనిచేస్తున్నాడని తెలిసింది. కేరళ నుంచి బరంపురం వెళ్లి.. అక్కడి నుంచి విజయనగరం వెళ్లేందుకు రైల్వే టికెట్ తీసుకొని ఉంటాడని, మధ్యలో నౌపడ స్టేషన్లో దిగి తేలినీలాపురం సమీపంలో బలవన్మరణానికి పాల్పడి వుంటాడని భావిస్తున్నారు. బరంపురం ఎందుకు వెళ్లాడు.. ఇక్కడికి ఎందుకు వచ్చాడు.. తెలియాలంటే అతని కుటుంబసభ్యులు రావాలని, అతని వద్ద ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా మృతుడి మేనమామకు సమాచారం అందించామని పోలీసులు తెలిపారు. మృతుడికి ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
-
వేధింపులు బరించలేక పూజారి ఆత్మహత్య
-
కోడెల ఆత్మహత్య
-
క్యూనెట్ చేతిలో మోసపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
హత్య చేసి.. ఆపై భయంతో ఆత్మహత్య..
నవాబుపేట(జడ్చర్ల): ఒకరిని హత్యచేసిన వ్యక్తి, భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మండలంలోని పోమాల్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పోమాల్ గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య(యాసూభు)(35) ఆదివారం రాత్రి పొలంవద్ద గేదెలకు పాలుపితికి బైక్పై క్యాన్లో ఇంటికి తీసుకువస్తుండగా, అప్పటికే కాపుకాసిన అదే గ్రామానికి కామారం యాదయ్య బైక్ను అడ్డగించాడు. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో వెంకటయ్య పరుగు తీస్తూ గ్రామంలోకి చేరుకుని కిందపడిపోయాడు. గ్రామస్తులు, బంధువులు గమనించి అతన్ని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు సోమవారం మృతిచెందాడు. వెంకటయ్య చనిపోయాడని తెలియడంతో యాదయ్య(25) తీవ్ర భయానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం గ్రామ సమీపంలోని మర్రిచెట్టుకు ఉరి వేసుకు ని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ శివకుమార్ తెలిపారు. పెట్రోల్ దాడికి పాతకక్షలే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. -
గుత్తిలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య
-
నేను చనిపోయాక నా ప్రేమ నిజమని నమ్ము
వెల్గటూరు(ధర్మపురి): ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదని ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో తట్టుకోలేక నిద్రమాత్రలు మింగింది. బాధితురాలి కుటుం బసభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గ టూరు మండలం ముక్కట్రావుపేటకు చెందిన కొప్పుల స్వామి–సుశీలకు ఐదుగురు కూతుళ్లు. చిన్నకుమార్తె అనూష నాలుగేళ్ల క్రితం జగిత్యాలలోని జ్యోత్స్న ఆసుపత్రిలో నర్స్గా పనిచేసింది. ఈక్రమంలో అక్కడే పనిచేస్తున్న జగిత్యాలకు చెందిన కిరణ్తో పరిచయం ప్రేమగా మారింది. తర్వాత అనూష కరీంనగర్లోని అపెక్స్ ఆసుపత్రిలో నర్స్గా చేరింది. వీరి ప్రేమాయణం మూ డేళ్లు కొనసాగింది. ఈక్రమంలో అనూష పెళ్లి చేసుకుందామనడంతో, మన కులాలు వేరని, మా ఇంట్లో ఒప్పుకోవడం లేదని కిరణ్ నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆదివారం సాయంత్రం కరీంనగర్లోని తన రూములో సూసైడ్ నోట్ రాసుకుని, స్వగ్రామం ముక్కట్రావుపేటకు చేరుకుని నిద్రమాత్రలు మింగింది. ఆలస్యంగా గమనించిన తల్లితండ్రులు ఆమెను కరీంనగర్ అపెక్స్ ఆసుపత్రికి తరలించగా ప్రాణాలతో పోరాడుతోంది. సూసైడ్ నోట్ వివరాలు.. ‘అమ్మానాన్న నన్ను క్షమించండి. అక్కయ్యలు బావలు అమ్మనాన్నలను బాగా చూసుకోవాలి. నేను ఎంతగానో ప్రేమించిన కిరణ్ వారి ఫ్యామిలీ నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు. నేను ప్రాణంగా భావించిన కిరణ్ పెళ్లికి నిరాకరిస్తున్నాడు. పైగా మన కుటుంబాన్ని మొత్తంగా రోడ్డున పడేస్తానని బెదిరిస్తున్నాడు. ఆయన ద్వేషించడం తట్టుకోలేకపోతున్నాను. నేను ఎవ్వరినీ తెలిసి బాధపెట్టలేదు. నా చావుకు పూర్తిగా కిరణ్ కుటుంబమే కారణం. నాకు బతకాలని ఉంది. అందరి ఆడపిల్లల్లాగా ఉండాలని ఉంది. అయినా కిరణ్ పెట్టే టార్చర్ను భరించలేకపోతున్నాను. అందుకే అందరిని విడిచి వెళ్తున్నాను. కిరణ్ నా ప్రాణాలను అడిగావు కదా ఇస్తున్నాను. నేను చనిపోయాక అయినా నా ప్రేమ నిజమని నమ్ము. ఇప్పటికైనా ఆడపిల్లను అనుమానించడం మానుకో, నీవు జాగ్రత్త. లైఫ్ను బాగా ఎంజాయ్ చేసుకో. బై నిన్ను ప్రాణంగా త్రీ ఇయర్స్ ప్రేమించిన నీ అను’ అని సూసైడ్ నోట్లో పేర్కొంది. -
ప్రేమోన్మాదం
మహబూబ్నగర్ క్రైం: ప్రేమను నిరాకరించడాన్ని తట్టుకోలేక ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. బ్లేడ్తో యువతి గొంతు కోయడమే కాకుండా తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘట న చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం బాదేపల్లికి చెందిన అనుదీప్ స్విట్స్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్కు చెందిన సౌమ్య(18) కూడా చదువుతోంది. ఇద్దరూ క్లాస్మేట్స్ కావడంతో ఏడాదిగా తనను ప్రేమించాలంటూ అనుదీప్ ఆమెపై ఒత్తిడి చేయగా.. ఆమె నిరాకరిస్తూ వస్తుంది. ఇటీవల వేధింపులు తీవ్రం కావడంతో యువతిని ఆమె తల్లిదండ్రులు కళాశాల మాన్పించారు. దీంతో ఆగ్రహించిన అనుదీప్.. సోమవారం రాత్రి సౌమ్య ఒంటరిగా ఉన్నట్లు తెలుసుకుని ఇంట్లో చొరబడ్డాడు. అక్కడ ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనుదీప్ తన వెంట తీసుకొచ్చిన బ్లేడ్తో ఆమె గొంతు, తల భాగంలో కోశాడు. భయాందోళనతో ఆమె కేకలు వేసింది. దీంతో స్థానికులు అనుదీప్ను బంధించారు. అయితే అనుదీప్ కుర్చీలపై దుస్తులు వేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో అతనికి గాయాలయ్యాయి. అలాగే.. బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు గాయపడిన అనుదీప్ను జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎస్వీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్యతో ఎస్పీ రెమారాజేశ్వరి, డీఎస్పీ భాస్కర్ మాట్లాడారు. ప్రస్తుతం ఇద్దరు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
తల్లి లేకుండా ఉండలేనని ..
సాక్షి, నల్లగొండ క్రైం : ‘అమ్మ లేకుండా నేను జీవించలెను..అమ్మే నా ప్రాణం..మరికొద్ది గంటల్లో తల్లి మృతి చెందుతుందని మనస్తాపం చెందిన కుమారుడు రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పాజిపేట గ్రామానికి చెందిన మర్రి భానుమతి అలియాస్ ఇద్దమ్మ (65) పక్షవాతంతో మంచాన పడింది. నోటి మాట రావడంలేదు. మరణానికి దగ్గరలో ఉం ది. కొద్దిగంటల్లో ప్రాణం పోతుందని భావించిన కుమారుడు ప్రకాశ్ (30) తల్లి లేని జీవితం ఊహించలేనని ..అమ్మలేకుండా తాను బతకనని నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలోని 61కి.మీ వద్ద రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడి మరణంతో తల్లి .. కుమారుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తల్లి ఇద్దమ్మకు చెప్పారు. దీంతో ఆమె మంచంలోనే ప్రాణం విడిచింది. అమ్మలేకుండా బతకలేనని.. ప్రకాశ్ ఇంటి నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచూ తన అమ్మ అనారోగ్యంపై చర్చించేవాడని స్నేహితులు తెలిపా రు. అమ్మలేకుండా బతకలేనని చెప్పినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రోజువారీగా శనివారం ఉదయం ఇంటి పనుల డబ్బుల తీసుకువస్తానని చెప్పి వెళ్లిపోయినట్లు ఇరుగుపొరుగు తెలిపారు. రైలుపట్టాలపై ప్రకాశ్ మృతిచెందడాన్ని గమనించిన సమీప రైతులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఇద్దమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇద్దమ్మకు కుమారుడు,కుమార్తె కుమార్తెకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా మూడేళ్ల క్రితం ఆమె భర్త చెట్టుపై నుంచి మరణించాడు. ఆ ఇంటికి ప్రకాశ్ ఒక్కడే ఆధారం. ఇప్పుడు తల్లితోపాటు అతనూ మృతిచెందడంతో ఒక్కదాన్ని చేసి వెళ్లిపోయారా అంటూ సోదరి రోదించిన తీరు గ్రామస్తులను కంటతడిపెట్టించింది. -
ఏ కష్టమొచ్చిందో.. ఏమైందో..!
ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చిందో తెలియడం లేదు.. ఉపాధికి వచ్చి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తిరిగిరాని లోకాలకు చేరారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థల కారణంగా ఒకరిపై ఒకరు పంతానికి పోయి క్షణికావేశంలో పురుగుమందు తాగి.. పిల్లలచేత తాగించి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అన్నది అంతుచిక్కడం లేదు. భర్త, పిల్లలు మృతిచెందిన గది, పరిసరాల్లో ఇందుకు ఆనవాళ్లు పోలీసులకు లభించలేదు. నోటి నుంచి నురగలు, దుర్వాసన వంటివి రాకపోవడంతో వీరు తీసుకున్న ఆహారం లేదా తాగునీరు విషతు ల్యమై ఉంటుందన్న వాదన వ్యక్తమవుతోంది. భార్య కొన ఊపిరితో కొట్టమిట్టాడుతూ విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. ఆమె కోలుకుంటేనే అసలు విషయం వెలుగులోకి వస్తుందంటున్నారు. ఈ హృదయ విదారక సంఘటన శనివారం రాత్రి కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో చోటుచేసుకుంది. కె.కోటపాడు(మాడుగుల)/అనంతగిరి: కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకొంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పాటు భార్య ప్రాణాపాయ స్థితిలో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతోంది. చంద్రయ్యపేటలోని సబ్బవరపు కన్నంనాయుడుకు చెందిన కోళ్లఫారంలో అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బుడ్డిగరువుకు చెందిన పాంగి చిన్నోడు పనికి కుదిరాడు. భార్యా పిల్లలతో కలిసి ఆరు నెలల కిందట ఉపాధి కోసం ఇక్కడికి వచ్చాడు. వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతోంది. దీంతో పాటు పిల్లల చదువు విషయంలో దంపతులు తరచూ తగాదా పడేవారు. ఈ క్రమంలో రోజూ మాదిరి శనివారం రాత్రి అంతా భోజనం చేసి నిద్రపోయారు. ఆదివారం ఉదయాన్నే వారు కోళ్లఫారంలో లేకపోవడాన్ని గమనించిన కన్నంనాయుడు వారుంటున్న గది వద్దకు వెళ్లి పిలిచాడు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా చిన్నారావు(30), ఆయన కుమారుడు సిద్ధు(6), కుమార్తె దీనా(3)లు మృతిచెంది ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో భార్య లక్ష్మి(25)కొట్టుమిట్టాడుతోంది. తలుపులను పెకలించి ఆమెను ఎకాయెకిన కె.కోటపాడు 30 పడకల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించాక విశాఖ కేజీహెచ్కు తరలించారు. కె.కోటపాడు పోలీసులకు సమాచారం అందించారు. చోడవరం సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్.ఐ ఎం.వీ.రమణలు సంఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. పురుగు మందు తాగి ఉంటారని తొలుత అనుమానించారు. వారుంటున్న గదితో పాటు సమీపంలో వెదికారు. పురుగు మందు అనవాళ్లు కనిపించలేదు. మృతుల నోటి వెంట ఎటువంటి నురగలు రాకపోవడాన్ని గుర్తించారు. దీనిపై చోడవరం సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ విషం తీసుకోవడం లేదా విషాహారం తినడం వల్లే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి వారు తీసుకున్న ఆహరంతో పాటు నీటిని ల్యాబ్కు పరీక్షలకు పంపుతున్నామన్నారు. చోడవరం సీఐ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలను చదివించాలన్నదే చిన్నారావు ఆశ చిన్నారావు ఎప్పుడూ కొడుకు సిద్ధును బాగా చదివించాలని ఆశపడేవాడు. అందుకే బుడ్డిగరువు నుంచి చంద్రయ్యపేట వచ్చి కోళ్లఫారంలో చేరానని అందరితో చెప్పేవాడు. చంద్రయ్యపేటలోని ప్రాథమిక పాఠశాలలో కొడుకును ఒకటో తరగతిలో చేర్పించాడు. భార్య లక్ష్మి స్వగ్రామం వెళ్ళిపొదామని భర్త చిన్నారావుతో పదేపదే అనేదని స్ధానికులు తెలిపారు. కుమారుడి చదువు మధ్యలో ఆపేయొద్దని ఈ ఏడాది పూర్తయ్యాక వెళ్లిపోదామని చిన్నారావు చెబుతుండేవాడని తెలిపారు. క్రిస్మస్ పండగకు చిన్నారావు భార్య, పిల్లలతో కలిసి బుడ్డిగరువు ఈ నెల 25న వెళ్లాడు. మళ్లీ 27న సాయంత్రం కుటుంభ సభ్యులతో కలిసి తిరిగి వచ్చాడు. వారు చనిపోయిన గదిలో తలవైపున బైబిల్ ఉంది. చిన్నారావు అందరితోనూ సరదాగా ఉండేవాడు. మర్యాదపూర్వకంగా మెలిగేవాడు. ఆదివాసీల ఆందోళన చిన్నారావు, పిల్లలు మృతిపై అతని తల్లిదండ్రులు లింగ న్న, వరహలమ్మలతో పాటు ఆ గ్రామానికి చెందిన గిరి జనులు అనుమానం వ్యక్తం చేశారు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారని, ఆర్థిక ఇబ్బందులు కుడా లేవని, కుమారుడి చదువు కోసం చిన్నారావు కుటుంబంతో చంద్రయ్యపేట వచ్చాడని తల్లి వరహలమ్మ విలేఖరులకు తెలిపింది. అటువంటిది కుమారుడు, మనుమలు మరణం పై అనుమానాలు ఉన్నాయని ఆమె తెలిపింది. ఇప్పుడు వృద్ధాప్యంలో తాము ఎలా బతకాలంటూ వారు రోదించడం స్ధానికులను కలిచివేసింది. ఈమేరకు మృతదేహాల ను పోస్టుమార్టానికి తరలించకుండా గిరిజనులు రోడ్డుపై మంటలు వేసి ఆదివారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మి పరిస్థితి విషమం పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న లక్ష్మి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆమెను అత్యవసర వైద్య విభాగంలో చేర్చి సేవలు అందిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యాధికారులంటున్నారు. -
అర్హత సాధించినా ఉద్యోగమివ్వరా?
ఖమ్మం సహకారనగర్: కోర్టులో ప్రభుత్వ ఉద్యోగానికి తాను అర్హత సాధించినా తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఖమ్మంకు చెందిన ఓ యువకుడు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నగరంలోని నిజాంపేటకు చెందిన జాగటి సాంబయ్య కోర్టులో అటెండర్ ఉద్యోగానికి 2012లో దరఖాస్తు చేశాడు. అయితే, అతడికి ఉద్యోగం రాలేదు. కానీ, సమాచార హక్కు చట్టం వివరాల ప్రకారం.. తాను రెండో సా ్థనంలో ఉండగా, మొదటి, మూడో స్థానంలో ఉన్న వారికి అటెండర్ ఉద్యోగం కల్పించారని తేలింది. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ను కలిసేందుకు ప్రజావాణికి వచ్చాడు. దీంతో ఔట్ సోర్సింగ్లో ఉద్యోగం కల్పిస్తానని చెప్పడంతో మనస్తాపానికి గురై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అధికారులు, కలెక్టర్లు గన్మెన్లు అతడిని అడ్డుకుని బయటకు పంపించారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
మేదరమెట్ల: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఇక తనకు పెళ్లి కాదని భావించి మనస్తాపం చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మేదరమెట్లలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన సాతులూరి భరత్కుమార్ (32) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పెళ్లి కాలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో దూలానికి ఉరేసుకున్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం భరత్కు కీళ్లవ్యాధి ఉంది. పెళ్లి చేసుకునేందుకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు కూడా దూరంగా ఉండటంతో ఇక తనకు పెళ్లి కాదని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బజారు నుంచి వచ్చిన తాత నిర్జీవంగా ఉరికి వేలాడుతున్న మనుమడిని చూసి ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ పాండురంగారావు తెలిపారు. -
కర్నూలులో వైద్య విద్యార్ధి ఆత్మహత్య
-
సివిల్స్ పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదని..
న్యూఢిల్లీ : పరీక్ష కేంద్రంలోనికి అనుమతించలేదని ఓ సివిల్స్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని కర్ణాటకకు చెందిన వరుణ్గా గుర్తించారు. ఆదివారం జరిగిన యూపీఎస్సీ పరీక్షకు కొద్దిగా అలస్యంగా చేరుకోవడంతో వరుణ్ను అధికారులు లోనికి అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన వరుణ్ రాజేంద్రనగర్లోని తన గదికి చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం వరుణ్ను కలువడానికి వచ్చిన స్నేహితురాలు ఎంత సేపు ప్రయత్నించిన అతను తలుపు తెరవకపోవడంతో అమె ఇరుగుపొరుగు వాళ్లకి సమాచారం ఇచ్చింది. వారు గది తలుపులు తెరచేసరికే వరుణ్ చనిపోయాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతని రూంలోని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష నియమాలు బాగానే ఉన్నప్పటికి.. కొన్ని సడలింపులు ఉంటే బాగుండేది అని వరుణ్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడని ఓ పోలీస్ అధికారి తెలిపారు. పోస్ట్మార్టమ్ అనంతరం వరుణ్ మృతదేహాన్ని ఢిల్లీలో ఉంటున్న అతని సోదరికి అందజేశామన్నారు. -
హైదర్గూడలో యువకుడు ఆత్మహత్య
-
ఇద్దరు పిల్లలను హతమార్చి తండ్రి ఆత్మహత్య
-
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వృద్ధ రైతు మృతి
-
సాయంపాలెంలో మానని గాయం
‘‘వాళ్లు తప్పుచేయలేదు... కానీ శిక్ష అనుభవిస్తున్నారు. అకారణంగా ఒకరిని చెట్టుకు కట్టేసి కొడితే, మనస్తాపంతో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మరొకరు మేనకోడలి కోసం పోలీస్స్టేషన్లో బాధను అనుభవిస్తుంటే.. ఇంకొకరు భార్యపై నిందతో మానసిక వేదనను భరించలేక ఆత్మహత్యే శరణ్యమని పురుగుమందు తాగారు. వాస్తవానికి ఈ ముగ్గురూ చేసిన తప్పేమీ లేదు. మరో ఇద్దరు వ్యక్తుల కారణంగా నలిగిపోతున్నారు. కుటుంబాలు సైతం విచ్ఛిన్నం అయ్యే దారుణస్థితి ఏర్పడింది. వాస్తవాలు మరుగుచేసినా... రెండు కుటుంబాల్లోని ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వారిని వెంటాడుతోంది. క్షణికమైన ఆవేశాలతో తీసుకునే నిర్ణయాలకు భారీ మూల్యం తప్పదనే అనుభవాన్ని కాలం వారికి నేర్పుతోంది. కొడుకు తప్పునకు తండ్రి... మేనకోడలి తప్పునకు మేనమామ, భర్త తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.’’ ఏలూరు టౌన్/టి.నర్సాపురం : టి.నరసాపురం మండలం సాయంపాలెం గ్రామంలో ఒక వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. కొడుకు నాగేంద్ర ఒక వివాహిత మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె బంధువులు తండ్రి ఆడమిల్లి సంజీవరావుపై తమ అక్కసు తీర్చుకున్నారు. ఇదే ఘటనలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన మహిళ మేనమామను పోలీసులు అరెస్టు చేశారు. ఇక భార్య కారణంగా పరువుపోయిందనే మానసిక వేదనతో భర్త నాగేంద్రప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భర్త పురుగుల మందు తాగాడని తెలియటంతో తానెందుకు మిగలాలంటూ వివాహిత కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. వరుసగా మూడు రోజులుగా సాయంపాలెంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు ఇరువర్గాలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మొత్తానికి గ్రామంలో ఇరు కుటుంబాలు, వారి బంధువుల మధ్య సంబంధాలు పూర్తిగా విచ్ఛిన్నమై ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే ప్రమాదం నెలకొంది. కేవలం ఇద్దరు వ్యక్తుల అనాలోచిత, అవాంఛనీయ చర్య గ్రామంలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. వైరి వర్గాలుగా మారి కేసులు, ప్రతికేసులతో ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు అడ్డదారులు తొక్కేందుకు వెనుకాడడంలేదు. కేవలం ఇద్దరు వ్యక్తులే సాయంపాలెంను ‘హేయం’పాలెంగా మార్చేయటంలో కీలకపాత్రధారులుగా ఉన్నారు. పోలీస్స్టేషన్కు వెళ్లరు : సాయంపాలెం గ్రామస్తులు ‘సాయం’ కోసం పోలీస్స్టేషన్కు వెళ్లరు. ఏది జరిగినా గ్రామంలోని కులపెద్దలు పంచాయితీ పెట్టి వారే తీర్పు చెబుతారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీని ప్రస్తుత సంఘటన బ్రేక్ చేసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలే ఇక్కడ జీవిస్తున్నా... వైరి వర్గంలా మారి ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాటాలు చేసుకోవటం పరిపాటిగా మారింది. ఒకే వర్గంలో పెత్తనం కోసం పరితపించే పెద్ద మనుషులు ఐక్యతను కాకుండా వైషమ్యాలను నూరిపోస్తున్నారు. ఫోన్ రికార్డింగ్లున్నాయని బెదిరింపులు: గ్రామంలోని కొందరు యువకులు తమ వద్ద ఫోన్లో రికార్డు చేసిన మాటలు ఉన్నాయని మీరు తమను ఏమీ చేయలేరని బెదిరించడంతోపాటు అసభ్యంగా మాట్లాడుతూ వివాహిత భర్తను బెదిరించారు. తీవ్ర మానసిక వేదనకు గురైన అతను శుక్రవారం అర్ధరాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త పురుగుల మందు తాగటంతో భార్య కూడా పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తను కొందరు యువకులు బెదిరిస్తున్నట్లు వాంగ్మూలం ఇచ్చింది. ఇక తన మేనమామను వెంటనే అరెస్టు చేసిన పోలీసులు తనను చేయిపట్టుకుని వేధించిన ఆడమిల్లి నాగేంద్ర అనే వ్యక్తిని మాత్రం ఇంతవరకూ పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలను జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ శనివారం పరామర్శించి న్యాయం చేస్తానని చెప్పారు. నాగేంద్రప్రసాద్ పరిస్థితి విషమంగా ఉందని, రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాల్సి ఉంటుందని బంధువులు తెలిపారు. -
ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
-
రాలుతున్న విద్యా కుసుమాలు
-
బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య
-
ప్రాణం మీదకు తెచ్చిన ప్రైవేటు వడ్డీ
ఒంగోలు టౌన్ : ప్రైవేట్ వడ్డీలు ఓ బడుగుజీవి ప్రాణాల మీదకు తెచ్చాయి. జీవనోపాధి కోసం తీసుకున్న అప్పునకు అసలు, వడ్డీ చెల్లించినా ఇంకా చెల్లించాలని, లేదంటే చంపుతానని బెదిరిస్తుండటంతో తన గోడు అధికారులకు చెప్పుకుందామని అర్జీ చేతపట్టుకుని కలెక్టరేట్కు వెళ్లాడు. కలెక్టర్ కార్యాలయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో గురువారం సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు కొత్తపట్నం రోడ్డులోని ఎన్టీఆర్ కాలనీలో కాకర్ల మోషె కుర్చీలకు వైర్లు అల్లుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదాయం తగ్గిపోవడానికి తోడు మోషె అనారోగ్యం బారిన పడటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో ఒంగోలుకు చెందిన రాపూరి వాసు అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.4లక్షలు అప్పు తీసుకున్నాడు. నెలకు నూటికి ఆరు రూపాయల వడ్డీ చొప్పున రోజువారీ డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. డబ్బులు మొత్తం వడ్డీతో సహా రూ.4 లక్షలు చెల్లించినప్పటికీ ఇంకా కట్టాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. చివరకు దౌర్జన్యానికి కూడా దిగుతున్నాడు. ఖాళీ ప్రామిసరీ నోట్లు, వంద రూపాయల స్టాంపు పేపర్లపై బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నాడు. రెక్కాడితేగాని డొక్కాడని తనకు అప్పు ఇచ్చిన వారికి వడ్డీ సహా చెల్లిస్తే ఇంకా చెల్లించాలంటూ బెదిరిస్తుండటంతో మోషె తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఒకవైపు వడ్డీ వేధింపులు, ఇంకోవైపు అనారోగ్య పరిస్థితులు తట్టుకోలేక పోయాడు. తన సమస్యలను అర్జీ రూపంలో రాసుకుని గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కొద్ది సేపు మెట్ల మీద కూర్చున్న మోషె వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న మోషేను, పక్కన పురుగుల మందు డబ్బాను గమనించి అక్కడున్నవారు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు 48 గంటల పాటుఅబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. చంపుతానని బెదిరిస్తున్నాడు.. తాను తీసుకున్న డబ్బును వడ్డీతో సహా చెల్లించినా ఇంకా చెల్లించాలంటూ రాపూరి వాసు అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని మోషె వాపోయాడు. ప్రామ్సరీ నోట్లు, స్టాంపు పేపర్లపై సంతకాలు చేయించుకోవడంతోపాటు డబ్బు చెలించకుంటే చంపుతానంటూ ఇంటికి వచ్చి బెదిరించాడన్నాడు. దీంతో తనకు మరణమే శరణ్యమని పురుగులమందు తాగినట్లు చెప్పాడు. తన గోడు జిల్లా కలెక్టర్కు చెప్పుకోవాలన్న ఉద్దేశంతో కలెక్టరేట్కు వెళ్లినట్లు తెలిపాడు. తనను, తన కుటుంబాన్ని వాసు బారి నుంచి కాపాడాలని వేడుకున్నాడు. -
తండ్రీ కూతుళ్లకు అప్పుల ఉరి
-
నారాయణ కాలేజిలో ఇంటర్ విద్యార్ధి సూసైడ్
-
వేధింపులతో బార్ నిర్వాహకుడు ఆత్మహత్య
-
క్లాస్రూమ్లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
భూపాలపల్లి అర్బన్: పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. స్థానిక గుడ్ మార్నింగ్ రెసిడెన్షియల్ పాఠశాలలో సందీప్ వర్మ పదో తరగతి చదువుతూ పాఠశాల హాస్టల్లోనే ఉంటు న్నాడు. గురువారం మధ్యాహ్నం దోమలను చంపేందుకు ఉపయోగించే రసాయన ద్రవం తాగాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే సందీప్ ను సింగరేణి ఏరియా ఆస్పత్రికి, అనంతరం వరంగల్కు తరలించారు. -
లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కాశీబుగ్గ: కాశీబుగ్గ బస్టాండ్ ఎదురుగా ఉన్న అప్సర లాడ్జిలో వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మందస మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన బగాది మోహన్రావు(42) గురువారం రాత్రి అప్సర లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే పూటుగా తాగిన మోహన్రావు మద్యంతోపాటు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకు లాడ్జి తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. కాశీబుగ్గ పోలీసులకు తెలియజేశారు. ఘటన స్థలానికి ఎస్సై కేవీ సురేష్కుమార్, కానిస్టేబుల్ డి.సూరిబాబు చేరుకున్నారు. తలుపులను పగలగొట్టి విగతజీవిగా పడి ఉన్న మోహన్రావును బయటకు తీసుకొచ్చారు. అయితే, అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే 108లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికి ప్రథమ చికిత్స అందించడంతో ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. మోహన్రావు రామకృష్ణ ఇంజనీరింగ్ కళాశాల వాచ్మన్గా పని చేస్తున్నట్లు తెలిసింది. -
’కాలేజీ యాజమాన్యమే నా బిడ్డను హత్య చేసింది’
-
కాసేపట్లో వెల్దుర్తికి వైఎస్ జగన్
-
కోర్టు ఆవరణలో కత్తితో పొడుచుకుని..
హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆత్మహత్యాయత్నం బెల్లంపల్లి: ఏడేళ్ల నుంచి తనకు, హోంగార్డులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సకినాల నారాయణ మంగళవారం కోర్టు ఆవరణలో కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ కేసు విషయంలో నారాయణ మంగళవారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి బదిలీ కావడంతో కోర్టు క్లర్క్ మరో తేదీ ఇచ్చి కోర్టుకు హాజరు కావాలని సూచించారు. కోర్టు హాలులో నుంచి బయటకు వస్తూనే నారాయణ వెంట తెచ్చుకున్న కత్తితో తొలుత చేతిపై కోసుకున్నాడు. ప్రధాన ద్వారం వద్దకు వచ్చి కడుపులో పొడుచుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇది చూస్తున్నవారు బలవంతంగా ఆ కత్తిని లాక్కున్నారు. అంతలోనే నారాయణ కోర్టు ఆవరణలో నుంచి బయట రోడ్డు పైకి వచ్చి కూలబడ్డారు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్హెచ్వో కె.స్వామి, వన్టౌన్ ఎస్సై గంగరాజగౌడ్ వచ్చి తమ వాహనంలో నారాయణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై నారాయణ మాట్లాడుతూ తనకు హోంగార్డు ఉద్యోగం లేకుండా చేశారని, హోంగార్డుల సమస్య లను కూడా పరిష్కరించకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేశానన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నారాయణపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్హెచ్వో కె.స్వామి తెలిపారు. -
వేధింపులు తాళలేక ఏఈ ఆత్మహత్య
-
భార్య మృతి.. భర్త ఆత్మహత్యాయత్నం..!
బుక్కపట్నం(అనంతపురం): బుక్కపట్నం మండలపరిధిలోని సిద్దరాంపురం గ్రామానికి చెందిన దైవకుమార్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన ఎరికలప్ప కుమారుడు దైవకుమార్ ఏడాది క్రితం చెన్నేకొత్తపల్లి మండలం గంగినేపల్లి గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో భార్య నాగమణి మంగళవారం ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది. వరకట్న వేధింపులతోనే నాగమణి మృతిచెందినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు చెన్నేకొత్తపల్లి పోలీసులు దైవకుమార్పై కేసు నమోదు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన దైవకుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బత్తలపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దైవకుమార్పై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ గోవిందు తెలిపారు.