girls
-
వయస్సు 19.. ‘నేను మీ అక్కనిరా’ అంటూ.. స్కూల్ విద్యార్థులను వ్యభిచారంలోకి దింపి..
సాక్షి, వరంగల్ : అభం శుభం తెలియని బాలికల జీవితాలతో ఆడుకున్న కిలాడీ లేడీని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ మత్తులో ఆ మోసగత్తె చేసిన అరాచకాలు విని పోలీసులే అవాక్కయ్యారు. కొద్దిరోజుల క్రితం ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడీ లేడీ.. వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటోంది. డ్రగ్స్కు బానిసైన ఆ లేడీ.. తనతోపాటు డ్రగ్స్కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లంతా కలిసి వరంగల్లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తోంది ఈ ముఠా. నేను మీ అక్కని రా అంటూఇందుకోసం ఇన్ స్టాగ్రామ్ను వినియోగించింది. ఇన్స్టా స్టోరీస్లో ట్రెండింగ్ పాటలకు డ్యాన్స్ చేయడంతో పాటు ఖరీదైన దుస్తులు, లగ్జరీ కార్లలో ప్రయాణిస్తూ ఫొటులు దిగింది. ఆ ఫొటోల్ని చూసిన నెటిజన్లు ఆమెను ఫాలో అవడం మొదలు పెట్టారు. అనతి కాలంలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగారు. అంతే పాఠశాలలకు వచ్చి వెళ్లే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో నేను మీ అక్కనిరా అంటూ వారితో మెల్లగా మాటలు కలుపుతోంది ఈ కిలాడీ లేడీ. ఇన్ స్టాలో తన ఫాలోవర్లను చూపించి క్రమంగా వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకొని కిడ్నాప్ చేస్తోంది. ఆపై బాలికలకు మత్తు పదార్ధాలు ఇచ్చి వ్యభిచారంలోకి దించుతుంది.ఏడాదిన్నరగాఈ ముఠా దాదాపూ ఏడాదిన్నరగా ఇలాంటి పనులే చేస్తూ పలువురి బాలికల జీవితాల్ని నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్క జిల్లాలకు కూడా తరలించినట్లు సమాచారం. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వెలుగులోకి కిలాడీ లేడీ గ్యాంగ్ అరాచకాలు ఈ ఫిర్యాదు క్రమంలోనే ఇంటికి చేరుకున్న బాలికను ఆరాతీయగా తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలియదని తెలిపింది. స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారని చెప్పింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా తేలింది. ఆ బాలిక చెప్పిన వివరాలు, ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కిలాడీ లేడీ గ్యాంగ్ చేస్తున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ కిలాడీ లేడీని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో రెండ్రోజుల్లో ఆ కిలాడీ లేడీ లీలలను భయటపెట్టే అవకాశం ఉంది. -
గ్రూప్–3లోనూ పురుషులే ‘టాప్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–3 కొలువుల భర్తీ కోసం నిర్వహించిన అర్హత పరీక్షల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. గ్రూప్–2 లాగే గ్రూప్–3 పరీక్షల్లోనూ పురుషులే ఆధిపత్యం కనబరిచారు. ఈ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ఒకే ఒక్క మహిళ ఉన్నారు. టాప్ 92లో పది మంది మహిళలు మాత్రమే నిలిచారు. మొత్తం 450 మార్కులకు గాను మొదటి ర్యాంకు సాధించిన వ్యక్తి 339.239 మార్కులు సాధించాడు. గ్రూప్–2లో టాప్ 31 ర్యాంకుల్లో ఒక్క మహిళ కూడా లేని విషయం తెలిసిందే. 18 వేల మందికి అనర్హత మొత్తం 1,388 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ 30 డిసెంబర్, 2022లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం 5,36,400 మంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. గ్రూప్–3లో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కులు. ఈ పరీక్షల ఫలితాలు, జనరల్ ర్యాంకింగ్ లిస్టు(జీఆర్ఎల్), మాస్టర్ క్వశ్చన్ పేపర్లు, ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్ స్కాన్డ్ కాపీలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.ఈ పరీక్షలకు 2,67,921 హాజరుకాగా, వీరిలో ఏకంగా 18,364 మంది అనర్హతకు గురయ్యారు. దీంతో జీఆర్ఎల్లో 2,49,557 మంది అభ్యర్థుల వివరాలు మాత్రమే ఉన్నాయి. అభ్యర్థులు వారి టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో కమిషన్ వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. తాజాగా విడుదల చేసిన ఫైనల్ కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని కమిషన్ స్పష్టం చేసింది. జీఆర్ఎల్ ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలన కోసం ప్రాథమిక ఎంపిక జాబితా రూపొందిస్తామని తెలిపింది. నోటిఫికేషన్లో నిర్దేశించిన విధంగా అభ్యర్థులు వారి ఒరిజినల్ ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.సాంకేతిక సమస్యలకు సంబంధించిన సమాచారం కోసం టీజీపీఎస్సీ హెల్ప్డెస్క్ ఫోన్ నంబర్లు 040–23542185, 040–23542187లలో సంప్రదించాలని, లేదా ‘హెల్ప్డెస్్క(ఎట్)టీఎస్పీఎస్సీ.జీఓవీ.ఇన్’లో ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. ఈ నెల 10వ తేదీన గ్రూప్–1 మార్కులు విడుదల చేసిన టీజీపీఎస్సీ... 11న గ్రూప్–2 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా గ్రూప్–3 జీఆర్ఎల్ విడుదల చేసిన కమిషన్.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల తుది ఫలితాలను 17న, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్షల తుది ఫలితాలను 19న ప్రకటించనుంది. కాగా, గ్రూప్–3 జీఆర్ఎల్లో అభ్యర్థి ర్యాంకు, హాల్ టికెట్ నంబర్, సాధించిన మార్కులు మాత్రమే ఉన్నాయి. పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 కొలువులకు సంబంధించిన పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ వరుసగా విడుదల చేసింది. అయితే, ఈ మూడు కేటగిరీల్లోనూ టాపర్లుగా నిలిచినవారు ఎక్కువ మందే ఉన్నారని సమాచారం. అదేవిధంగా ఇప్పటికే గ్రూప్–4 ఉద్యోగాల్లో చేరిన కొందరు గ్రూప్–3లోనూ అర్హత సాధించారు. వీరిలో చాలామంది గ్రూప్–1 ఉద్యోగాల్లో లేదంటే గ్రూప్–2 ఉద్యోగాల్లో చేరుతారు. దీంతో గ్రూప్–3లో కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలో గ్రూప్–4 ఉద్యోగం చేస్తూ గ్రూప్–3 పోస్టు సాధించినవారు.. ప్రస్తుతం చేస్తున్న గ్రూప్–4 ఉద్యోగాలను వదిలేసే అవకాశమే ఎక్కువ. దీంతో పలు కేటగిరీల్లో కొన్ని పోస్టులు మిగిలిపోయే అవకాశం ఉందని సమాచారం.గ్రూప్–3 స్టేట్ టాపర్ అర్జున్రెడ్డి గ్రూప్–2లోనూ 18వ ర్యాంకు పాపన్నపేట (మెదక్): గ్రూప్– 3 పరీక్షల్లో స్టేట్ టాపర్గా మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్రెడ్డి నిలిచారు. శుక్రవారం టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో 450 మార్కులకు గాను ఆయన 339.239 మార్కులు సాధించారు. ఇటీవల ప్రకటించిన గ్రూప్– 2 ఫలితాల్లో కూడా అర్జున్రెడ్డికి స్టేట్ 18వ ర్యాంకు రావటం విశేషం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అర్జున్రెడ్డి.. ప్రస్తుతం హవేలిఘనపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ, మెదక్ కలెక్టరేట్లో డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్–2 పోస్టుకు ప్రాధాన్యం ఇస్తానని అర్జున్రెడ్డి తెలిపారు.గ్రూప్–3, గ్రూప్–2లో మహిళా టాపర్ ఒక్కరే సాక్షి, హైదరాబాద్: గ్రూప్–3 పరీక్ష ఫలితాల్లో మహిళా విభాగంలో డాక్టర్ వినీషారెడ్డి మహిళా విభాగంలో టాపర్గా నిలిచారు. మొత్తం 450 మార్కులకు గాను ఆమె 325.157 మార్కులు సాధించి 8వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. గ్రూప్–2 ఫలితాల్లోనూ మహిళల విభాగంలో ఆమే టాపర్ కావటం విశేషం. సీడీపీఓ పరీక్షల్లో సైతం వినీషారెడ్డి స్టేట్ టాపర్గా నిలిచారు. గ్రూప్–1 పరీక్షలో కూడా మంచి మార్కులు సాధించారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగా పరీక్షలకు సిద్ధమైనట్లు ఆమె తెలిపారు. తన లక్ష్యం ఐఏఎస్ ఉద్యోగం సాధించటమేనని చెప్పారు.3–7–27–27 పోటీ పరీక్షల్లో చంద్రకాంత్ ర్యాంకులివి శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు చంద్రకాంత్ పోటీ పరీక్షల్లో సత్తాచాటారు. గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, జూనియర్ లెక్చరర్పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంక్ సాధించిన చంద్రకాంత్, ఈ నెల 11 వెల్లడైన గ్రూప్–2 ఫలితాల్లోనూ రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంకు సాధించాడు. కొన్నాళ్ల క్రితం ప్రకటించిన గ్రూప్–4 పరీక్షల్లోనూ ఇతడు 27 ర్యాంకు సాధించటం విశేషం. అంతేకాదు, జూనియర్ లెక్చరర్ పరీక్షల్లో కూడా స్టేట్ 3వ ర్యాంకు సొంతం చేసుకొని ప్రశంసలు పొందాడు. ఈ నెల 12న రవీంద్రభారతిలో సీఎం చేతుల మీదుగా జేఎల్ ఉద్యోగ నియామక పత్రం అందుకున్నాడు.గ్రూప్స్ పరీక్షలన్నింట్లోనూ ర్యాంకులు పెంట్లవెల్లి: టీజీపీఎస్సీ గ్రూప్స్–1, 2, 3, 4 పరీక్షలన్నింట్లోనూ మంచి ర్యాంకులు సాధించి ఔరా అనిపించాడు నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామానికి చెందిన హవల్దారి శ్రీనాథ్. ఇతడు గ్రూప్–1లో 454.5 మార్కులు సాధించాడు. గ్రూప్–2లో స్టేట్ 68వ ర్యాంకు పొందిన శ్రీనాథ్.. శుక్రవారం ప్రకటించిన గ్రూప్–3లో స్టేట్ 88వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. గ్రూప్–4లో స్టేట్ 136వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడిన శ్రీనాథ్.. తన తల్లిదండ్రుల నిరంతర ప్రోత్సాహం వల్లే తాను పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించినట్లు చెప్పాడు. -
హద్దులు చెరిపేసి... నిరూపిస్తున్నారు
ఇరవై ఏళ్లుగా 35 దేశాల్లో జరిగిన బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఈవెంట్లకు హోస్ట్గా, జడ్జ్గా, గ్రూమర్గా ఉన్నాను. ఒకప్పుడు పదిమంది అమ్మాయిలు ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి వస్తే చాలు అనుకునేవాళ్లం. కానీ, నేడు అమ్మాయిలే కాదు, అమ్మలు అయ్యాక తమని తాము నిరూపించుకోవడానికి వచ్చే మహిళల శాతం 50 నుంచి 60 శాతానికి పెరిగింది. ప్రతి ఒక్కరికీ కల ఉంటుంది. దానిని నెరవేర్చుకునే క్రమంలో మహిళలకు సరైన ΄్లాట్ఫారమ్ దొరక్కపోవడం,ప్రొఫెషనల్ గా లేకపోవడం, తర్వాత చేద్దాం అనుకోవడం, కుటుంబ బాధ్యతలు అడ్డుగా ఉండటం .. వీటన్నింటి వల్ల టైమ్ దాటిపోతుంటుంది. కానీ, ఏదో ఒక సమయంలో రియలైజ్ అయి, ఆలస్యంగా అయినా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు ‘మిసెస్ బ్యూటీ’ పోటీలలో పాల్గొనే గృహిణుల సంఖ్య పెరిగింది. ‘నేను స్టేజీ మీద వాక్ చేయాలి, మంచి గ్లామరస్ డ్రెస్సులు వేసుకోవాలి, కాన్ఫిడెంట్గా సమాధానాలు చెప్పగలగాలి...’ ఇలా ఆలోచిస్తున్నారు. గత తరం వరకు సమాజంలో ఒక ఫ్యాషన్ స్టిగ్మా ఉండేది. దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మహిళా దినోత్సవం ఉద్దేశం కూడా అదే. అందుకు తగినట్టుగానే ఇప్పుడు చాలా వేదికలు ముందుకు వచ్చాయి. మిసెస్ కేటగిరీలోకి వచ్చే మహిళల మైండ్ సెట్, ఔట్ లుక్ పూర్తిగా మారింది. ఇప్పుడు కావాల్సింది టాలెంట్, కాన్ఫిడెన్స్. మహిళ జీవితమే ఒక ఛాలెంజ్. అందుకే, ఫ్యాషన్ ఇండస్ట్రీలో మహిళలు సవాళ్లను చాలా సులవుగా అధిగమిస్తున్నారు. ఒక కాలేజీ అమ్మాయి మిస్ కాలేజీ తర్వాత మిస్ ఇండియా ఆ తర్వాత మిస్ యూనివర్స్ గురించి ఆలోచిస్తున్నట్టే, గృహిణులుగా ఉన్నవారు కూడా అలాగే క్లారిటీగా ఆలోచిస్తున్నారు. గ్లామర్ రంగంలో గతంలో అమ్మాయిల గురించి ఉన్న నెగిటివిటీ స్థానంలో పాజిటివిటి చేరింది. ఇది చాలా మంచి మార్పు. జూన్లో మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్ని హోస్ట్ చేస్తున్నాను. దీనికి గృహిణులుగా ఫ్యాషన్ షోలలో పాల్గొనేవారికి శిక్షణ ఇస్తున్నాను.– వాలెంటీనా మిశ్రా, క్రియేటివ్ డైరెక్టర్, మిసెస్ అండ్ మిస్టర్ గ్రాండ్– సి వరల్డ్ హోస్ట్ -
సెయింటాన్స్ ఘటనపై కలెక్టర్ సీరియస్
పాడేరు: పట్టణంలోని సెయింటాన్స్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థినిపై పదో తరగతి విద్యార్థినులు దాడి చేసిన ఘటనపై కలెక్టర్ దినేష్కుమార్ సీరియస్ అయ్యారు. సోమవారం దినపత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా విద్యశాఖ అధికారి బ్రహ్మాజీరావును ఆదేశించారు. ఇందుకోసంప్రత్యేక కమిటీను ఏర్పాటు చేశారు. దీంతో డీఈవో సోమవారం పాఠశాల, వసతి గృహాన్ని సందర్శించారు. సంఘటన వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై ఆరా తీశారు. నివేదిక ఆధారంగా వసతి గృహా కేర్ టేకర్ శ్రావ్యను విధుల నుంచి తొలగించారు. ఘటనకు బాధ్యులైన ముగ్గురు టెన్త్ విద్యార్థినులను హాస్టల్ నుంచి ఇళ్లకు పంపించివేశారు. వసతి గృహా నిర్వాహణపై నిత్యం పర్యవేక్షణ జరపాలని, భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై ఇటువంటి ఘటనలు, వివాదాలు జరిగితే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని డీఈవో హెచ్చరించారు.#viralvideo… pic.twitter.com/dcVm70EvT0— greatandhra (@greatandhranews) February 17, 2025 -
బాలికలతో టీచర్ అసభ్య ప్రవర్తన
సాక్షి,అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాలో ఓ టీచర్ దారుణానికి పాల్పడ్డాడు. గొలుగొండ మండలం హై స్కూల్లో పీఈటీ టీచర్ కీచక పర్వం తాజాగా వెలుగు చూసింది. ఆటల కోసం వెళ్లిన బాలికలతో పీఈటీ నూకరాజు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలికల ఫిర్యాదుతో నూకరాజు బాగోతం బయటపడింది.రాష్ట్రస్థాయి పోటీలకు బాలికలను తమిళనాడు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డాడు నూకరాజు. విద్యార్థినులతో హెడ్మాస్టర్ శ్రీనివాసులు మహిళా టీచర్ను పంపకపోవడాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. తమిళనాడు నుంచి తిరిగి వచ్చి ఇంటికి చేరుకున్న తరువాత తల్లిదండ్రులకు బాలికలు అసలు విషయం చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పీఈటీ దారుణాలపై మండల విద్యాధికారి (ఎంఈవో) విచారణ ప్రారంభించారు. -
Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్లో పడితే జాగ్రత్త.. భయ్యా!
వాలెంటైన్స్ డే సందర్బంగా ప్రేమికులతో చాలా సందడిగా ఉంటుంది. ఎక్కడ చూసినా అందంగా ముస్తాబై సీతాకోక చిలుకల్లా విహరిస్తుంటారు. పార్క్ల్లో, సినిమాహాళ్లలో లవ్బర్డ్స్ హల్హల్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ వాతావరణం చాలావరకు తగ్గిపోయినట్టే కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాలతో యవతలో ప్రేమలు-పెళ్లిళ్లు అంటేనే భయం పెరుగుతోంది. కరియర్కే యువత ప్రాధాన్యతనిస్తోంది. దీనికితోడు సరియైన ఉద్యోగాలు కూడా లభించక పోవడంతో, ముందు బతుకు ఎలా ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. వాలెటైన్స్ డే సందర్భంగా సాక్షి.కామ్ పబ్లిక్టాక్ వింటే ఈ అభిప్రాయమే కలుగుతుంది ఎవరికైనా.. వాలెంటైన్స్ డే అంటే ఒకరోజు జరుపుకునేది కాదనీ, స్త్రీపురుఫుల మధ్య అయినా, మనుషుల మధ్య అయినా ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలంటోంది యువత. అమ్మాయిలు కరియర్ ముఖ్యం, ఆర్థికంగా స్థిరపడాలి అంటోంటే... అబ్బాయిలేమో మనకీ లవ్వులు, గివ్వులు వద్దు బ్రో..జర జాగ్రత్త భయ్యా.. అంటున్నారు.ప్రధానంగా అమ్మాయిల్లో ప్రేమిస్తే ఏమవుతుందో అనే ఆందోళన ఎక్కువ కనిపిస్తోంది. అందుకే బాగా చదువుకుని, ఆర్థికంగా నిలదొక్కు కోవాలంటున్నారు. అదే ఆడపిల్లలకు ఆత్మస్థైరాన్ని ఇస్తుందని ఒక యువతి పేర్కొంది. ఎంతో కష్టపడి పెంచి పోషించిన తల్లి దండ్రులనుజాగ్రత్తగా చూసుకోవాలి అంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది కెమెరా ముందుకు రావడం ఇష్టంలేని ఒక యువతి తన సొంత పిన్ని ఇంట్లో జరిగిన సంఘటన తమ కుటుంబంలో పెద్ద అలజడి రేపిందనీ, అందుకే తానీ నిర్ణయానికి వచ్చానని తెలిపింది. బాధ్యత ముఖ్యంప్రేమ అంటే బాధ్యత ఉండాలి. స్త్రీపురుషుల మధ్య అయినా, ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా బాధ్యత అనేది పునాది. అదే ప్రేమ. ఆ బాధ్యతతో కూడిన ప్రేమే కుటుంబాల్ని నిలుపుతుంది అన్నారు ఒక కార్పొరేట్ ఉద్యోగి. పిల్లలు బాధ్యతగా ఉన్నపుడు ఏ తల్లిదండ్రులైనా పిల్లల్నిఅంగీకరిస్తారు. యోగ్యుడైన అల్లుడు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు అందుకే చిత్తశుధ్దిగా ఉండండి. తల్లితండ్రులను ఒప్పించుకోండి.. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అంటూ యువతరానికి ఆయన సూచించారు. ఇదీ చదవండి: ఓటీటీ బెస్ట్ యాక్టర్గా రాగ్మయూర్ నామినేట్ : రాగ్ ఫ్యావరెట్ హీరోయిన్ ఎవరంటే..!ప్రేమా, గీమా ఇవ్వన్నీ వద్దు మనకి.. బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం కొట్టాలి, అమ్మానాన్నల్ని ఖుషీగా ఉంచాలి.. అంతే.. ఇంతకుమించి తనకే ప్రయార్టీస్ లేవని చెప్పాడు మరో యువకుడు. అలాగే ఒకవేళ ప్రేమిస్తే చిత్తశుద్ధిగా ఉండండి భయ్యా..కడదాకా నిలుపుకోండి అంటూ సలహా ఇస్తున్నాడు. కానీ జాగ్రత్త భయ్యా.. సింగిల్గా ఉంటేనే బెటర్ కదా భయ్యా అంటూ ఓ పెద్ద సందేశాన్నిచ్చేశాడు ఫన్నీగా.లేడీస్ హాస్టలా? ఎవడ్రా ఆ కూత కూసింది!ఎంత ధైర్యం చెప్పుకున్నా, ఆడపిల్లలు సాధికారతసాధిస్తున్నా..సమాజంలోజరుగుతున్న పరిణామాలు చాలా బాధిస్తున్నాయని ఒక తల్లి వాపోయింది. ప్రేమించిన పాపానికి కన్న తల్లిదండ్రులే ఆమె జీవితంలో నిప్పులు పోస్తున్నారు. మరొక చోట ప్రేమించకోతే, పెళ్లికి ఒప్పుకోకపోతే నరికి చంపుతున్నారు.. యాసిడ్లు పోస్తున్నారు కదా తల్లీ.. ఎలా అయితే ఎలా బతికేది ఆడపిల్లలు అంటూ భావోద్వేగానికి లోనైంది. అసలు వాలెండైన్స్డే మనది కాదు. ప్రేమ శాశ్వతం. శాశ్వతమైన ప్రేమే మనది. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలను జాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బలహీనమైన క్షణాల్లో వారికి అండగా ఉండాలి. అంతే తప్ప, నటుడు చిరంజీవి లేడీస్హాస్టల్ అనుకోవడం మూర్ఖత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారో తల్లి. అంతేకాదు తన తల్లి, చెల్లి, భార్య, కుమార్తెలు, కోడలు, ఆఖరికి మనవరాలిని కూడా ఘోరంగా అవమానించిన చిరంజివి మొత్తం స్త్రీ జాతికి క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. (ఈమె కూడా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు.) -
పెళ్లి వద్దు.. సంపాదన ముద్దు
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటుంటారు. అయితే ఇప్పుడు పెళ్లి వయసు దాటిపోతున్నా.. యువత మాత్రం అప్పుడే పెళ్లి వద్దు.. జీవితంలో సెటిల్ అయ్యాక చేసుకుంటాం అంటున్నారు. ఇంతలో మూడు పదుల వయసు దాటిపోతోంది. ఉద్యోగాల వేట, డాలర్ల భ్రమతో లేటు వయసు పెళ్లిళ్లకు మొగ్గు చూపుతున్నారు. జీవితంలో ఎంజాయ్ చేశాకే పెళ్లి అన్న ధోరణితో అసలుకే మోసం వస్తోంది. సరైన సమయంలో పెళ్లి చేసుకోకపోవడంతో సంతానం కోసం ఐవీఎఫ్ కేంద్రాలకు పరుగు పెడుతున్నారు. పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక అబ్బాయిలకైతే అమ్మాయిలు దొరక్క అవివాహితులుగా మిగిలిపోతున్నారు. –తాడేపల్లిగూడెంఅమ్మాయిల ట్రెండ్ మారిందితరం మారింది. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా మూడు పదులు దాటినా పెళ్లి చేసుకోవడం లేదు. 35 ఏళ్లు దాటే వరకు యువతకు పెళ్లి ఆలోచనలు లేకపోవడం చాలా అనర్ధాలకు దారితీస్తోంది. పెళ్లి చేసుకుంటాను.. ఇపుడే కాదు .. ఉద్యోగంలో స్థిరపడ్డాక చేసుకుంటాం.. ఇలా అనుకొనేసరికి వయస్సు 35 సంవత్సరాలు దాటుతోంది. అప్పుడు మేరేజ్ బ్యూరోలో వివరాల నమోదు చేయించుకుంటున్నారు. తీరా పెళ్లయ్యాక పిల్లలను కనే వయసు దాటిపోతుంది. మహిళల్లో ఆధునిక జీవన విధానాలతో 40 ఏళ్లకే మెనోపాజ్ వస్తుంది. రక్తహీనత, ఐరన్లోపం, విటమిన్ డీ లోపాలు ఏర్పడుతున్నాయి. దీంతో జంటలు ఐవీఎఫ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. 61 శాతం జంటల్లో హార్మోన్ సమస్యలు పిల్లలు వద్దు.. ఆదాయమే ముద్దు అనే పాశ్చాత్య దేశాల కల్చర్ మన యువతను కమ్మేస్తోంది. ముందు జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అన్న ధోరణి పెరుగుతోంది. అన«ధికారిక లెక్కల ప్రకారం వివాహమైన నేటి తరం జంటల్లో 61 శాతం హార్మోన్ సమస్యలు ఉంటున్నాయి. పెళ్లికాని ప్రసాదులే కాదు.. అమ్మాయిలు కూడాపశ్చిమ గోదావరి జిల్లాలో 18 నుంచి 39 సంవత్సరాల వయసున్న యువత 6,88,555 మంది 18 నుంచి 19 ఏళ్లు ఉన్నవారు 32,277 మంది20 నుంచి 29 ఏళ్లు ఉన్నవారు 2,57,495 మంది30 నుంచి 39 ఏళ్లు ఉన్నవారు 3,98,783 మంది యువకులు 3,42,643 మంది యువతులు 3,45,912 మంది వీరిలో సుమారు నాలుగు లక్షల మందికి ఇంకా వివాహాలు కాలేదని లెక్కలు చెబుతున్నాయి. పెళ్లి ట్రెండ్ మారింది జీవితంలో వివాహం ముఖ్య ఘట్టం. ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థ వివాహ స్వరూపాన్ని మార్చేసింది. ఇగోలు పెరిగి వివాహ బంధం విచ్ఛిన్నమవుతుంది. వయసు రాగానే పెళ్లి చేసుకోవడం మేలు. అనురాగం, ఆప్యాయతల నడుమ ఈ పెళ్లిళ్లు సాగాలి. – భోగిరెడ్డి ఆదిలక్ష్మి, స్పందన పౌండేషన్ లేటు వివాహాలు అనర్థదాయకం పెళ్లి ఆలస్యంగా చేసుకోవడం అనర్థం. ఇన్ఫెరి్టలిటీ పెరుగుతుంది. స్పెర్మ్ వైటాలిటీ తగ్గుతుంది. బీపీ, మధుమేహం వంటివి వస్తున్నాయి. బర్త్ రేటు తగ్తుతుంది. పుట్టిన పిల్లల్లో క్రోమోజోముల అసమతుల్యంతో వైకల్యం రావచ్చు. సహజీవనం, ఇతర మార్గాలలో సంబంధాలు పెట్టుకోవడం వల్ల సుఖ వ్యాధులు, హెచ్ఐవీ రిస్క్ పెరుగుతుంది. జనరేషన్ గ్యాప్ ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతాయి. 23 నుంచి 30 సంవత్సరాలలోపు పెళ్లిళ్లు చేసుకోవాలి. – డాక్టర్ తాతారావు, గూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ -
శాస్త్రీయ శక్తి
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చాలాకాలం పురుషాధిక్యమే కొనసాగింది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే, ఎవరైనా అల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఎడిసన్ వంటి పురుష శాస్త్రవేత్తల పేర్లే చెబుతారు కాని, ఎందరో మహిళా శాస్త్రవేత్తలు తమ తమ ఆవిష్కరణలో శాస్త్ర సాంకేతిక రంగాలను సుసంపన్నం చేసిన సంగతి మీకు తెలుసా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఘన విజయాలను సాధించిన మహిళా శాస్త్రవేత్తల ఆవిష్కరణలు ఎందరో యువతులను ఈ రంగాలవైపు ఆకట్టుకుంటున్నాయి, పెద్ద కలలు కనేలా చేస్తున్నాయి. బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక వారి శక్తి సామర్థ్యాలు వృథాగా పోతున్నాయి. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, విభిన్నమైన ఆలోచనలతో నవీన సాంకేతికతలను సృష్టించడానికి, అభివృద్ధి చేయడానికి వీలవుతుందనేది నిపుణుల మాట.ఇందుకోసం విద్యారంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని; శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి శక్తి సామర్థ్యాలను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రారంభమైన రోజే ఫిబ్రవరి 11 ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’.. ఈ సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆదర్శప్రాయులుగా చెప్పుకునే మహిళా శాస్త్రవేత్తల విజయాలు, వారి గురించిన విశేషాలతో ఈ ప్రత్యేక కథనం..అలా మొదలైంది...ప్రపంచ ప్రఖ్యాత కి నివాళిగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’, ‘మహిళలకు సైన్స్ కావాలి.. సైన్సుకు మహిళలు కావాలి’ అని నినాదం ఇచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా 2015లో ప్రకటించింది. దశాబ్దాల ఎదురుచూపు తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం లభించింది. ఇందుకోసం, ‘యునెస్కో’ ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికీ రేడియేషన్.. నోబెల్ బహుమతి అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆమె కనుగొన్న రేడియం పేరు మీదుగానే రేడియేషన్ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్ నోబెల్’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ’కెమిస్ట్రీ నోబెల్’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్కు గురయ్యారంటే, ఆమె రాసిన నోటు పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్ వెలువడుతోంది.నోబెల్ కుటుంబం ప్రపంచంలోనే అత్యధిక నోబెల్ బహుమతులు కూడా మేరీ క్యూరీ కుటుంబం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె భర్త పియరీ క్యూరీ, కుమార్తె ఐరీన్ జోలియట్ క్యూరీ, అల్లుడు ఫ్రెడరిక్ జోలియట్, మేరీ రెండుసార్లు గెలుపొందడంతో మొత్తం కుటుంబం ఐదు నోబెల్ బహుమతులను అందుకుంది.కంప్యూటరుకు భాష నేర్పిందితొలి ఎలక్ట్రానిక్–డిజిటల్ కంప్యూటర్ ‘యూనివాక్’ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించిన అమెరికన్ శాస్త్రవేత్త గ్రేస్ హెూపర్. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్ ప్రోగ్రామును ఆమె రూపొందించారు. ‘కోబాల్’ ప్రోగ్రామ్ రూపకల్పనలోనూ ఆమెది కీలకపాత్ర. అణుశక్తిచైనాలో పుట్టి, అమెరికాలో స్థిరపడి అణుశక్తి తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్త చీన్ షుంగ్ వు. అణుబాంబుల తయారీ కోసం ‘మాన్ హట్టన్ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని తొలిసారి ఆమె కనుగొన్నారు.తెలివైన సీతాకోక చిలుకమరియా సిబిల్లా కీటక శాస్త్రవేత్త. గొంగళి పురుగులు రూపాంతరం చెంది సీతాకోక చిలుకలుగా మారుతాయని నిరూపించింది. అంతేకాదు, కుళ్లిన పదార్థాలు వివిధ రకమైన పురుగులు, కీటకాలను ఉత్పత్తి చేస్తాయని కనుగొన్నది కూడా తనే! ఇలా కీటకాలపై తను చేసిన పరిశోధనలు ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాయి.కోపిష్టి దేవుళ్లు కాదు వాంగ్ జెనీ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. అమ్మాయిలను సైన్స్ చదవడానికి అనుమతించని కాలంలోనే జెనీ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడింది. అప్పటి వరకు చంద్రగ్రహణాన్ని కోపిష్టి దేవుడిగా భావించడాన్ని తను నమ్మలేదు. అందుకే, తాళ్లతో ఒక భూగోళం, అద్దం, దీపాన్ని పట్టుకొని, చంద్రుడు భూమి నీడలో అదృశ్యమవుతాడని నిరూపించింది. అదే ఎంతోమంది శాస్త్రవేత్తలు, సూర్య, చంద్రగ్రహణాలపై అధ్యయనాలు చేసేలా చేసింది.వైద్యరంగానికి చికిత్స అమెరికాలో వైద్య పట్టా సంపాదించిన మొదటి మహిళ ఎలిజబెత్ బ్లాక్వెల్. డాక్టర్గా వైద్యరంగంలో విశేషమైన కృషి చేసింది. ఒక ప్రమాదంలో తన కంటిచూపు కోల్పోయి, సర్జన్ను కావాలనే తన కలను వదులుకుంది. కాని, ఆశయాన్ని కాదు. తర్వాత ఒక వైద్య కళాశాల ప్రారంభించి, ఎంతోమంది బాలికలు వైద్యులుగా మారడానికి సహాయం చేసింది.జంపింగ్ జీన్స్వారసత్వ నిర్ధారణ కోసం చేసే డీఎన్ఏ పరీక్షకు మూలమైన జన్యువులను కనుగొన్న శాస్త్రవేత్త బార్బరా మెక్క్లింటాక్. జన్యువుల్లో ఉత్పరివర్తనలకు, డీఎన్ఏ పరిమాణంలో మార్పులకు కారణమయ్యే ‘జంపింగ్ జీన్స్’ను కనుగొన్నందుకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. సైన్స్ టీచర్ స్కూల్సైన్స్ టీచర్గా సాలీ రైడ్– ఎందరో బాలికలను సైన్స్ దిశగా ప్రోత్సాహించారు. తర్వాత వ్యోమగామిగా మారి, అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి అమెరికన్ మహిళగా చరిత్ర సృష్టించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆమె బోధించిన ఉపగ్రహాల సిద్ధాంతాలను తర్వాతి కాలంలో చేపట్టిన అంతరిక్ష పరిశోధనల్లో ఉపయోగించారు. సాలీ ముఖ్యంగా బాలికలు అంతరిక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి దోహదపడే కార్యక్రమాలను రూపొందించారు.డైనోసార్ మేడంశిలాజ శాస్త్రవేత్త మేరీ అన్నింగ్. ఇంగ్లాండ్ సముద్రతీరంలో కొండలను అన్వేషించి, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ప్లెసియోసారస్ అస్థిపంజరం ‘డగ్ ది డైనోసార్’ను కనుగొన్నారు. డైనోసార్ల గురించి మరింత తెలుసుకోవడానికి ఇది ఇతర శాస్త్రవేత్తలకు చాలా ఉపయోగపడింది.మరెందరో..సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిసారిగా వెల్లడించిన అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్ గాపోష్కిన్. అమెరికన్ అంతరిక్ష సంస్థ ‘నాసా’ కంప్యూటర్లను వినియోగించడానికి ముందు అంతరిక్ష ప్రయోగాల సమయాన్ని, కచ్చితంగా గణించి చెప్పిన ’హ్యూమన్ కంప్యూటర్’ కేథరిన్ జాన్సన్.. ఇన్సులిన్, పెన్సిలిన్, విటమిన్ బీ12 వంటి జీవరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త డొరోతీ హాడ్కిన్.. ఇలా మరెందరో మహిళా శాస్త్రవేత్తలు..భారతీయుల్లోనూ..అమ్మాయిలను ఇంటి గడప కూడా దాటనివ్వని రోజుల్లోనే చాలామంది మహిళలు ఈ రంగంలో ఎన్నో విజయాలను సాధించారు. అలా ఒకసారి వెనక్కి వెళితే, పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనందీ బాయి, 1883లో ‘భారతదేశంలోనే వైద్యశాస్త్రంలో తొలి పట్టభద్రురాలిగా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. రాయల్ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్ దీప్ ఎంతోమంది యువతులకు స్ఫూర్తినిచ్చారు.అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా; ఇటీవలి కాలంలో కోవిడ్ వైరస్ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్వో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్; మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్ సీ’ అనే ఎంజైమును గుర్తించిన కమలా సొహెూనీ; క్యాన్సర్ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసీమా ఛటర్జీ; మైక్రోవేవ్ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్ రీసెర్చ్ ల్యాబ్ నెలకొల్పిన శాస్త్రవేత్త రాజేశ్వరీ ఛటర్జీ; పుణె వైరాలజీ ల్యాబ్లో కోవిడ్ వైరస్ను వేరు చేసి, ‘కోవాక్సిన్’ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్ డైరెక్టర్ ప్రియా అబ్రహాం; అగ్ని–4, 5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.రోజువారీ ఆవిష్కరణలు..1 పేపర్ బ్యాగ్ యంత్రం మార్గరెట్ ఎలోయిస్ నైట్పర్యావరణ రక్షణలో భాగంగా ఉపయోగించే పేపర్ బ్యాగులను ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించింది శాస్త్రవేత్త మార్గరెట్ ఎలోయిస్ నైట్ 1870లో ఈస్టర్న్ పేపర్ బ్యాగ్ కంపెనీని స్థాపించి, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించారు.2 కాఫీ ఫిల్టర్ మెలిట్టా బెండ్జ్ఉదయాన్నే లేచి కాఫీ తాగితే వచ్చే ఆనందం కంటే, చివర్లో మిగిలిన పొడితో కాఫీ తాగడం ఇబ్బందికరమే! మొదటిసారి పలుచటి కాగితంతో మెలిట్టా బెండ్జ్ కాఫీ ఫిల్టర్ను తయారుచేశారు. ఇది మరెన్నో కాఫీ ఫిల్టర్స్ తయారీకి ఆధారంగా నిలిచింది.3 విండ్ షీల్డ్ వైపర్స్ మేరీ ఆండర్సన్దుమ్ము, ధూళి, మంచు, నీరు, ఇతర పదార్థాలను వెంటనే తొలగించి, ప్రయాణం సాఫీగా సాగించే విండ్ షీల్డ్ వైపర్స్ను 1903లో, మేరీ ఆండర్సన్ రూపొందించారు.4 జీపీఎస్ గ్లాడిస్ వెస్ట్తెలియని ప్రాంతాలకు వెళ్లాలన్నా, వాటి గురించి తెలుసుకోవాలన్నా ఉపయోగపడే జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ప్రోగ్రామింగ్ రూపకల్పనలో గ్లాడిస్ వెస్ట్ కీలక పాత్ర పోషించారు.5 గ్యాస్ హీటర్ అలిస్ ఎ పార్కర్శీతకాలంలో ఇంట్లో వెచ్చదనాన్ని అందించే గ్యాస్ హీటర్ను అలిస్ ఏ పార్కర్ రూపొందించారు. ఈ గ్యాస్ హీటర్ మరెన్నో ఎలక్ట్రికల్ హీటర్స్కు స్ఫూర్తినిచ్చింది.6 డిష్ వాషింగ్ మెషిన్ జోసెఫిన్ కోక్రాన్వంట సామాన్లను శుభ్రం చేసే, మొదటి డిష్ వాషింగ్ మెషిన్ను 1839లో జోసెఫిన్ కోక్రాన్ రూపొందించారు.7 వీఐఓపీ టెక్నాలజీ (వీడియో కాల్స్) మెరియన్ క్రోక్ప్రస్తుతం వీడియో కాల్స్ మాట్లాడుకోగలుగుతున్నామంటే కారణం మెరియన్ క్రోక్ .. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కృషి చేశారు.8 ఫ్రీక్వెన్సీ హోపింగ్ హెడీ లామర్హెడీ లామర్ గొప్ప ఆమెరికన్ నటి మాత్రమే కాదు, ఫ్రీక్వెన్సీ హోపింగ్ టెక్నాలజీని 1941లో కనుగొన్నారు. ఈ టెక్నాలజీనీ వైఫై, బ్లూటూత్లలో ఉపయోగిస్తున్నారు.మీకు తెలుసా?(యునెస్కో గణాంకాల ప్రకారం.. )⇒ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలలో మహిళల శాతం 33.3%⇒ మహిళా శాస్త్రవేత్తలకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు 30⇒ ‘స్టెమ్’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు 35%⇒ ఇప్పటివరకు నోబెల్ పొందిన మహిళలు 22⇒ జాతీయ సైన్స్ అకాడమీలలో మహిళల శాతం 12%⇒ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక రంగాలలో మహిళల శాతం 22%సైన్స్లో లింగ వివక్ష మహిళలను అభివృద్ధినే కాకుండా, దేశ అభివృద్ధిని కూడా నిరోధిస్తుంది. మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి గల కారణాలలో లింగ వివక్ష, సామాజిక ఒత్తిడి, ఆర్థిక పరిమితులు, పరిశోధనలకు నిధుల కొరత. గుర్తింపులో అసమానతలు వంటి సమస్యలను మహిళా శాస్త్రవేత్తలు ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు. పురుషులతో పోల్చుకుంటే మహిళా శాస్త్రవేత్తలు చేపట్టే పరిశోధనలకు నామమాత్రంగా నిధులు మంజూరవుతుంటాయి.ఇలాంటి పరిస్థితుల్లోనూ శాస్త్ర సాంకేతిక పరిశోధకుల మొత్తం సంఖ్యలో మహిళలు 33.3% ప్రాతినిధ్యం వహిస్తుండటం విశేషం. అయితే, శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న వేగంగా, ఈ రంగాల్లో మహిళలకు లభించాల్సిన ప్రోత్సాహంలో వేగం కనిపించడం లేదు. అందుకే, శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలకు, బాలికలకు సమాన అవకాశాలను కల్పించి, లింగ వివక్షను, వ్యత్యాసాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం. -
ఆ టైమ్లోనూ ఐరన్ యువతిలా...
భారతదేశంలోని మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. కొన్నేళ్ల కిందట దాదాపు 85 శాతం మంది మహిళలు అనిమిక్గా ఉండేవారు. క్రమంగా మహిళల్లోనూ చైతన్యం పెరుగుతుండటంతో ఇటీవల అది 57 శాతానికి చేరింది. ఇంతగా చైతన్యం పెరిగాక కూడా దేశంలోని సగానికి పైగా మహిళలు అనీమియాతో బాధపడుతున్నారు. ఇక ఇటీవలే పీరియడ్స్ మొదలైన టీనేజీ అమ్మాయిల్లో రక్తహీనతతో బాధపడుతుండేవారు ఇంకా ఎక్కువ.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019–21 ప్రకారం 15 నుంచి 19 ఏళ్ల వయసుండే కౌమార బాలికల్లో అనీమియాతో బాధపడేవారు 59.1 శాతం! రుతుస్రావంలో రక్తం కోల్పోతుండటం, అది భర్తీ అవుతుండగానే నెలసరితో రక్తం కోల్పోతుండటంతో యువతుల్లో రక్తహీనత కనిపిస్తోంది. కొత్తగా పీరియడ్స్ మొదలైన టీనేజ్ అమ్మాయిలు అనీమియాకు లోనుకాకుండా ఉండాలంటే ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. అవేమిటో చూద్దాం. ఆహారంలో ఎక్కువగా తీసుకోవాల్సినవి... శాకాహారులు తమ ఆహారంలో తాజాగా ఉండే ఆకుకూరలు, ఎండు ఖర్జూరం, నువ్వులు, బెల్లం (బెల్లం, నువ్వులు ఉండే నువ్వుల జీడీలు, బెల్లం, వేయించిన వేరుశనగలు ఉండే పల్లీపట్టీలు తీసుకోవడం మేలు), గసగసాలు, అటుకులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. ఒకవేళ మాంసాహారులైతే ఆహారంలో వేటమాంసం, చేపలు, చికెన్తోపాటు... మటన్, చికెన్ లివర్ను ప్రత్యేకంగా తీసుకోవడం మంచిది. మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉంటుంది. అయితే మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. హీమ్ ఐరన్ అంటే... తిన్న వెంటనే అది ఒంటికి పట్టే రూపంలో ఉంటుంది. అదే శాకాహార పదార్థాల్లో ఉండే నాన్హీమ్ ఐరన్ ఒంటికి పట్టేలా చేయడానికి విటమిన్–సి కావాలి. కాబట్టి శాకాహారులు తమ ఆహారాల్లో ఐరన్ ఉండేవి తినేటప్పుడు వాటితోపాటు విటమిన్–సి ఉండే తాజా పండ్లైన జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి లేదా వంటకాల్లో విటమిన్–సీ ఎక్కువగా ఉండే ఉసిరి వంటివి తీసుకుంటూ ఉండాలి. మాంసాహారులైనా, శాకాహారులైనా కోడిగుడ్డు, పాలు తప్పనిసరిగా రోజూ తీసుకోవాలి. కోడిగుడ్డులో పచ్చసొన తీసుకోకూడదనే అభిపప్రాయాన్ని వదిలించుకోవాలి. ఎందుకంటే పచ్చసొనతో వచ్చే హానికరమైన కొలెస్ట్రాల్ కంటే, అది తీసుకోకపోతే కోల్పోయే పోషకాలే ఎక్కువ. రుతుస్రావం అవుతున్న సమయంలో ద్రవాహారం సమృద్ధిగా లభించేలా ఎక్కువ నీళ్లు తాగుతూ, కొబ్బరినీళ్లు తీసుకోవడం కూడా మంచిదే. మరికొన్ని సూచనలురుతుస్రావం సమయంలో అమ్మాయిలు రక్తాన్ని ఎక్కువగా కోల్పోతుంటారు కాబట్టి ఎక్కువ మోతాదులో ఆహారం ఇవ్వాలంటూ పొరుగువారు, ఫ్రెండ్స్ చెబుతుంటారు. అది వాస్తవం కాదు. ఈ టీనేజ్లోనే అమ్మాయిలు తాము తీసుకునే క్యాలరీల వల్ల బరువు పెరుగుతుంటారు. అందుకే ఆహారం ఎక్కువగా తీసుకోవడం కంటే... ఆహారాన్ని ఎప్పటిలాగే తీసుకుంటూ ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలూ తీసుకోవాలి. కొత్తగా రుతుస్రావం మొదలైన అమ్మాయిలకు కొబ్బరి, బెల్లం పెట్టాలంటారు. సంప్రదాయకంగా పెద్దలు చెప్పే ఆ ఆహారం పెట్టినా పరవాలేదు. అయితే కొబ్బరిలో, నువ్వుల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువ. కాబట్టి వాటిని కాస్త పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. నెయ్యికి బదులు వెన్న వాడటం మేలు. ఎందుకంటే వెన్నకాచి నెయ్యి చేశాక అందులో కొన్ని పోషకాలు తగ్గుతాయి. అయితే వెన్న తీసుకుంటే అందులోని కొవ్వులు... ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ను బాగా ఒంటబట్టేలా చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా పీరియడ్స్ సమయంలోనూ తేలికపాటి వ్యాయామం చేయడం అవసరమని తెలుసుకోవాలి. క్రమం తప్పకుండా రోజుకు 45 నిమిషాల చొప్పున కనీసం వారానికి ఐదు రోజుల పాటైనా వ్యాయామం చేస్తే హార్మోన్లు క్రమబద్ధంగా విడుదల కావడం జరుగుతోంది. అయితే కొంతమంది విషయంలో మాత్రం పీరియడ్స్ సమయంలో వ్యాయామం కుదరక΄ోవచ్చు. వాళ్లు మినహా మిగతా యువతులంతా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అస్సలు తీసుకోకూడనివి... బేకరీ ఐటమ్స్, కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కూల్డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు. చాలా పరిమితంగా తీసుకోవాల్సినవి...ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు వంటి వాటినీ, కొవ్వులు ఉండే ఆహారాలను చాలా పరిమితంగా తీసుకోవాలి. కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ చాలా తక్కువగా తీసుకోవాలి. డా. పూజితాదేవి సూరనేని, సీనియర్ హైరిస్క్ ఆబ్స్టెట్రీషియన్ –రోబోటిక్ సర్జన్ (చదవండి: ఐవీఎఫ్ జర్నీ.. రోజుకు ఐదు ఇంజక్షన్స్.. అంత ఈజీ కాదు: కొరియోగ్రాఫర్) -
ఇన్స్టా లవ్.. బెంగుళూరుకు పయనమైన ముగ్గురు బాలికలు
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఇంస్టాగ్రామ్లో మూడు నెలల క్రితం పరిచయమైన ఓ వ్యక్తి మాయమాటలు నమ్మి ఓ బాలిక ఇల్లు వదిలి బెంగళూరుకు పయనం కాగా.. ఆమెకు తోడుగా మరో ఇద్దరు బాలికలు వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన అజిత్సింగ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. నార్త్జోన్ ఏసీపీ స్రవంతిరాయ్ తన కార్యాలయంలో ఈ కేసు వివరాలను మీడియాకు వెల్ల్లడించారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు.. న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన ఓ బాలిక సమీపంలోని ఓ మదర్సాలో చదువుకొని ఇంటి వద్దే ఉంటోంది. ఆమెకు ఇంస్టాగ్రామ్లో బెంగళూరుకు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్యలో ఆ యువకుడి స్నేహితుడైన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన వేణు(23) అనే యువకుడు రావడంతో వారి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి వారు దూరంగా ఉంటుండగా.. మూడు నెలల క్రితం నుంచి వేణు ప్రేమ పేరుతో ఆ బాలికకు మాయమాటలు చెబుతూ వచ్చాడు. తనతో వస్తే బెంగళూరు తీసుకెళ్లి పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో అతగాడి మాటలు విన్న ఆ బాలిక విషయాన్ని తన ఇద్దరి స్నేహితులకు చెప్పింది. దీంతో ఆ ఇరువురు బాలికలు తాము కూడా బెంగళూరు వస్తామని చెప్పడంతో వేణు వారిని తెనాలికి రమ్మని చెప్పాడు. ప్రణాళిక ప్రకారం బాలికలను గురువారం రాత్రి తెనాలికి రప్పించిన వేణు అక్కడ తన స్నేహితులైన కేతవత్ యువరాజ్నాయక్(21), పెద్ద వెంకటేశ్వర్లు(30)ను బాలికలకు పరిచయం చేశాడు. ఉదయాన్నే బెంగళూరుకు రైలులో వెళ్దామని, టికెట్లు కూడా తీసుకున్నామని బాలికలకు చూపించాడు. ఈ రాత్రికి మనం అందరం గుంటూరు జిల్లా చేబ్రోలులోని పెద్ద వెంకటేశ్వర్లు ఇంట్లో ఉందామనుకొని పయనమయ్యారు. గంటల వ్యవధిలో బాలికల ఆచూకీ.. ముగ్గురు బాలికలు కనిపించడం లేదంటూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో సింగ్నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో సింగ్నగర్ సీఐ వెంకటేశ్వర్లు వెంటనే స్పందించి.. ఎస్ఐ సేనాపతి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుల ఇంస్టాగ్రామ్ ఐడీ నంబర్లు, బండి నంబర్ల ఆధారంగా పోలీసులు తెనాలి చేరుకొని బాలికలు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న బాలిక పాత స్నేహితుడు నిందితులను పట్టించడంలో పోలీసులకు సహాయం చేసినట్లు తెలిసింది. బాలికలను వీరు వేరే రాష్ట్రంలోకి తీసుకువెళ్లి వారి జీవితాలను నాశనం చేసేందుకు పన్నాగం పన్నినట్లుగా తెలుస్తోంది. మరో కేసు కూడా.. అదేరోజు అదే ప్రాంతానికి చెందిన మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలిక కూడా అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందగా ఆ బాలిక ఆచూకీని కూడా గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఏసీపీ వివరించారు. ఒకే రోజు రెండు కేసులలో నలుగురు బాలికల ఆచూ కీని తెలుసుకొని, కేసులను ఛేదించిన బృందాలను సీపీ రాజశేఖర్బాబు, డీసీపీ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించినట్లు స్రవంతిరాయ్ తెలిపారు. -
మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం: ఇవి బెస్ట్ స్కీమ్స్..
ప్రపంచం ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా.. ఆడపిల్లల విషయంలో మాత్రం ఇంకా అసమానతలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టకూడదని కోరుకునే తల్లిదండ్రులు లేకపోలేదు. చదువు, పెళ్లి ఇలాంటివన్నీ భారమనుకునేవారు నేటికీ ఉన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలి. ఆడబిడ్డలను కూడా అన్ని రంగాల్లో ఎగదనివ్వాలి. దీనిని దృష్టిలో ఉంచుకునికి, బాలికలను ప్రోత్సహించడానికి.. ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఆడపిల్ల పుడితే.. భారమనుకునే ఆలోచన మారాలి. మగపిల్లలు మాత్రమే కాకుండా.. ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లోనూ తమ ముద్ర వేస్తున్నారు. కాబట్టి వారి ఎదుగుదలకు ఉపయోగపడే కొన్ని పథకాలు గురించి తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి.సుకన్య సమృద్ధి యోజనసుకన్య సమృద్ధి యోజన (SSY) అనేది ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ స్కీమ్ కింద 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లల కోసం సంరక్షులు లేదా తల్లిదండ్రులు.. అమ్మాయి పుట్టిన తేదీ నుంచి 10 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి ఖాతాను 250 రూపాయలతో ప్రారభించవచ్చు. ఇందులో గరిష్టంగా రూ. 1.50 లక్షలు వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ ఓపెన్ చేయడానికి పోస్టాఫీస్ను సందర్శించి ప్రారభించవచ్చు.చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్. పిల్లల వివాహం, ఉన్నత విద్య మొదలైన దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గిఫ్ట్ ఫండ్లు.. డెట్ అండ్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్ల కలయికలో పెట్టే పెట్టుబడి.ఎల్ఐసీ జీవన్ తరుణ్లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. ఈ 'జీవన్ తరుణ్ స్కీమ్' అందిస్తుంది. దీనిని ప్రత్యేకంగా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య పిల్లల విద్యకు ఆర్ధిక సహాయం అందించే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అంతే కాకుండా చదువుకునే సమయంలో విద్యా అవసరాలకు చెల్లింపులు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా మెచ్యూరిటీ సమయంలో మొత్తం కవరేజ్ లభిస్తుంది.బాలికా సమృద్ధి యోజన (BSY)భారతదేశంలో ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల బాలికల సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో బాలికా సమృద్ధి యోజన స్కీమ్ ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద, ఆడపిల్ల పుట్టినప్పుడు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఆ తర్వాత వారు ఉన్నత పాఠశాల వరకు విద్యను పొందేలా చూసేందుకు వార్షిక స్కాలర్షిప్లను సైతం అందించడం జరుగుతుంది.సీబీఎస్ఈ ఉడాన్ పథకంసీబీఎస్ఈ ఉడాన్ స్కీమును భారత ప్రభుత్వ మానవ వనరులు మరియు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MHRD) సహకారంతో 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్' (CBSE) ప్రారంభించింది. దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో మహిళా విద్యార్థుల నమోదు రేటును పెంచడం దీని లక్ష్యం. -
80 మంది విద్యార్థునుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ పైశాచికత్వం!
ధన్బాద్: ఓ ప్రైవేట్ స్కూల్ (private school) యాజమాన్యం 80 మంది పదో తరగతి విద్యార్థునుల పట్ల పైశాచికంగా ప్రవర్తించింది. పెన్ డే పేరుతో నిర్వహించిన వేడుకల్లో బలవంతంగా విద్యార్థునుల షర్ట్లను విప్పదీయించి బ్లేజర్తో ఇంటికి పంపించింది. పరీక్షలు పూర్తవడంతో ‘పెన్ డే’ (penday)పేరిట షర్ట్లపై పెన్నులతో రాసుకున్న పదో తరగతి విద్యార్థునులను ఆ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ దారుణంగా శిక్షించిన ఘటన జార్ఖండ్ jharkhand)లో ఆలస్యంగా వెలుగుచూసింది. మొత్తం 80 మంది అమ్మాయిల షర్ట్లను బలవంతంగా వారితోనే విప్పదీయించి అందర్నీ బ్లేజర్ (కోటు) మీదనే ఇంటికి పంపించేసిన ఉదంతం ధన్బాద్ జిల్లాలోని డిగ్వాడియా పట్టణంలో జరిగింది.విషయం తెల్సుకుని జిల్లాయంత్రాంగం వెంటనే విచారణకు ఆదేశించింది. జోరాపోఖార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఉదంతం చోటుచేసుకుందని వివరాలను ధన్బాద్ డెప్యూటీ కమిషనర్ మాధవీ మిశ్రా వెల్లడించారు. స్నేహితులకు సందేశాల పేరిట చొక్కాలను పెన్ను గీతలతో నింపేయడమేంటంటూ ప్రిన్సిపల్ పట్టరాని ఆవేశంతో విద్యార్థులపై కోప్పడి షర్ట్లను తీసేయాలని ఆజ్ఞాపించాడు. పిల్లలు క్షమాపణలు చెప్పినా వినిపించుకోలేదు. బలవంతంగా వారితోనే తీయించి ఇంటికి పంపేశారు.అవమానంగా భావించిన కొందరు విద్యార్థునులు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు కోసం జిల్లా యంత్రాంగం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో ఒక సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ , జిల్లా విద్యాధికారి, జిల్లా సామాజిక సంక్షేమాధికారి, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఉంటారు. ప్రిన్సిపల్ ఘటన సిగ్గుమాలిన, దురదృష్టకర చర్య అని ఝరియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.👉చదవండి : మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది! -
పుట్టినింటికి ఆడబిడ్డలు
ఊరు అంటే ఊరు కాదు. జ్ఞాపకాల తోట. ఖండాంతరాలు దాటినా ఆ పరిమళం మనసును వీడిపోదు. ఏదో ఒక సమయాన స్వరూపకు నాగమణి గుర్తుకు వస్తుంది. పక్కింటి నాగమణి, స్వరూప క్లోజ్ఫ్రెండ్స్. దగ్గరలో ఉన్న మండల కేంద్రానికి సినిమాకు వెళ్లడం నుంచి సీమచింతకాయల వేట వరకు వారి జ్ఞాపకాల్లో ఎన్నో ఉన్నాయి. పెళ్లి అయిన తరువాత నాగమణి అక్కడెక్కడో సూరత్లో ఉంటుంది. స్వరూప కూడా పెళ్లయిన తరువాత సొంతూరులో కాకుండా వేరే ఊళ్లో ఉంటుంది. ఆ దూరం అలా కొనసాగుతూనే ఉంది.ఇక అంతేనా?‘ఈ 5జీ జమానాలో కూడా అంతేనా... ఇంతేనా అంటూ నిట్టూరిస్తే ఎలా?’ అంటూ కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజన్న గూడెం మహిళలు. పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితుల ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’ మనకు తెలుసు. అయితే ఇది అలాంటి సమ్మేళనం కాదు... రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం!పెళ్లయిన తరువాత ఎక్కడెక్కడో వేరు వేరు ఊళ్లలో ఉంటున్న ఆడపడుచులు ఈ సమ్మేళనం పుణ్యమా అని ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. రోజంతా సంబరాలు చేసుకున్నారు! ‘నా బిడ్డలందరూ నా దగ్గరికి వచ్చారు’ అని ఊరు సంతోషంతో ఉప్పొంగి పోయిన రోజు అది....బతుకమ్మ పండుగ రోజు...యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాజన్న గూడెం ఆడబిడ్డలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఉన్న ఊరిని వదిలి అత్తారింటికి వెళ్లిన ఆడపడుచులందరు ‘ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో ఒక చోటకు చేరారు. అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చే వారి సంఖ్య ప్రతి యేడూ తగ్గుతోంది. పోయిన బతుకమ్మ పండుగ రోజు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు కొందరు మహిళలు. ‘అందరం ఒక రోజు కలుసుకొని మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది’ అనుకున్నారు. అది అసాధ్యమైన కోరికేమీ కాదనే విషయం కూడా వారికి తెలుసు. ‘ఎంత బాగుంటుంది అని ఒకటికి పదిసార్లు అనుకోవడం కాదు. కచ్చితంగా కలవాల్సిందే’ అంటూ నడుం బిగించారు.సోషల్ మీడియా వేదికగా....అనుకున్నదే తడవుగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వివిధ రంగాల్లో ఉన్న తమ ఊరి ఆడబిడ్డలను ఒకదగ్గర చేర్చడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. పేరాల ఇందిర, సూదిని రజిని, యాట ఇందిరాదేవి, రావుల ఉమాదేవి, ఊట్కూరి లక్ష్మి నాలుగు నెలల పాటు ఎంతో శ్రమ తీసుకున్నారు. ఫోన్ నెంబర్లు సేకరించడం నుంచి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వరకు ఎన్నో చేశారు.దాగుడుమూతలు... దస్తీబిస్తీలుఅనుకున్న రోజుకు దాదాపు అందరూ వచ్చారు. ఇరవై ఏళ్ల నుంచి తొంభై ఏళ్ల వయసు వరకు ఎంతోమంది మహిళలు వచ్చారు. వయసు తేడా లేకుండా చిన్నపిల్లలై పోయారు. దాగుడు మూతలు, దస్తీబిస్తీ, మ్యూజికల్ చైర్, బెలూన్ బ్లాస్టింగ్, ఒంటికాలి కుంటుడు ఆటలు, డీజే పాటలతో హోరెత్తించారు.‘ఎవరి లోకం వారిదే’ అయిపోయిన ఈ కాలంలో, ఒకే ఇంటి కుటుంబ సభ్యులు కూడా వేరు వేరు ప్రపంచాలు అయిన ఈ ఉరుకులు పరుగుల కాలంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తాయి. పల్లె మోములో రోజూ పండగ కళను తీసుకువస్తాయి.మరెన్నో ఊళ్లకు ‘రాజన్న గూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం’ స్ఫూర్తిని ఇవ్వాలని ఆశిద్దాం.ఇక ప్రతి సంవత్సరం...ఆ రోజు పండగే!మా ఊరి ఆడబిడ్డలం అందరం ఒకచోట చేరి చిన్న పిల్లలమయ్యాం. చిన్నప్పటి పండుగలను, ఆనాటి సంబరాలను గుర్తు చేసుకున్నాం. వయసు తేడా లేకుండా ఆటలాడుకున్నాం. మా ఊరి మీద మరింత ప్రేమ పెంచుకున్నాం. ప్రతి సంవత్సరం ‘ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ ఏర్పాటు చేయాలని, మరింత ఎక్కువమంది హాజరయ్యేలా చూడాలనుకుంటున్నాం.– ఊట్కూరి లక్ష్మి, నల్లగొండకళ్లనీళ్లు పెట్టుకున్నారు‘రాజన్న గూడెం ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో చేపట్టిన కార్యక్రమం మా జీవితంలో మరవలేనిది. ఎన్నోతరాల ఆడబిడ్డలను ఒకచోటికి రప్పించాం. రకరకాల కారణాలతో పుట్టిన ఊరికి ఇక రాలేమనుకున్న వారిని సైతం గుర్తించి రప్పించడం విశేషంగా భావిస్తున్నాం. ఆడబిడ్డలందరినీ ఒకచోట చూసి పెద్ద వయసు వారు కన్నీటి పర్యంతమయ్యారు.– పేరాల ఇందిర, మోత్కూరుమళ్లీ మళ్లీ రావాలని...తల్లిదండ్రులు చనిపోయిన వారు, సింగిల్ పేరేంట్స్... మొదలైనవారు మా ఊరికి చాలా ఏళ్లుగా రావడం లేదు. అలాంటి వారందరినీ ‘ఆత్మీయ సమ్మేళనం’ ద్వారా రప్పించాం. వచ్చినవారంతా ఒకరి కష్టసుఖాలు ఒకరు పంచుకున్నారు. నిక్నేమ్లను గుర్తు చేసుకున్నారు. మరోసారి ఇలాంటి కార్యక్రమం పెడితే మళ్లీ పుట్టింటికి వచ్చినట్లు వస్తామని సంతోషంగా చెప్పి వెళ్లారు. – సూదిని రజిని, సిరిపురంఅంబరాన్ని అంటిన సంబరంప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు కొద్దిమందిమి మాత్రమే పుట్టింటికి వస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆత్మీయ సమ్మేళనం’కు రూపకల్పన చేశాం. ఊరు దాటగానే ఎవరి లోకం వారిదై పోతుంది. అలా కాకుండా పట్టుదలగా, ఇష్టంగా పనిచేశాం. రాలేమన్న వారిని ఒప్పించి రప్పించాం. మా ఊరి ఆడబిడ్డల ముఖాల్లో మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని చూశాం. – యాట ఇందిరాదేవి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్,సీతాఫల్ మండి, సికింద్రాబాద్ – యంబ నర్సింహులు, సాక్షి, యాదాద్రి -
బుద్ధిమంతుడి ముసుగుతో అమ్మాయిలకు టోకరా
బుద్ధిమంతుడిలా నటించి.. డేటింగ్ ప్లాట్ఫామ్లో మోడల్నంటూ నమ్మించి వందల మంది యువతులను మోసగించిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తుషార్ సింగ్ బిష్ట్ను దిల్లీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. 23 ఏళ్ల తుషార్ సింగ్ బిష్ట్ను ఢిల్లీ పోలీసులు తాజాగా తమ అదుపులోకి తీసుకున్నారు. తుషార్ బీబీఏ పూర్తి చేశాడు. గత మూడేళ్లుగా నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో టెక్నికల్ రిక్రూటర్గా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ డబ్బుపై దురాశతో సైబర్ నేరాలకు అలవాటుపడ్డాడు. ఓ యాప్ నుంచి వర్చువల్ ఇంటర్నేషనల్ మొబైల్ నంబరు కొనుగోలు చేసి డేటింగ్ యాప్ బంబుల్, సోషల్ మీడియా వేదిక స్నాప్చాట్లో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. బ్రెజిల్కు చెందిన ఓ మోడల్ ఫొటోలు, స్టోరీలను తీసుకుని తన ప్రొఫైల్లో పోస్ట్ చేసేవాడు. అమెరికాలో తాను ఫ్రీలాన్స్ మోడల్గా పనిచేస్తున్నానని, త్వరలోనే భారత్ వస్తున్నానని నమ్మించి అనేకమంది యువతులతో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత వారితో స్నేహం చేసి ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించాడు. కొంతకాలానికి ఆ వీడియోలతోనే వారిని బ్లాక్మెయిల్ చేసి వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడు.గతేడాది డిసెంబరులో ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న ఓ యువతి తుషార్పై ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తులో అతగాడి మోసాల చిట్టా బయటకు వస్తోంది. 2024 జనవరిలో బంబుల్లో అతడితో పరిచయం అయినట్లు బాధిత యువతి తెలిపింది. ప్రేమ పేరుతో ప్రైవేటు వీడియోలు తీసుకొని, ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొంది. వాటిని డార్క్వెబ్లో పోస్ట్ చేస్తానని బెదిరించడంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మరిన్ని సంచలన విషయాలు బయటికొచ్చాయి.ఇప్పటిదాకా దాదాపు 700 మందికి పైగా అమ్మాయిలను అతడు వలలో వేసుకున్నట్లు గుర్తించారు. బంబుల్లో 500 మంది, స్నాప్చాట్లో 200 మంది యువతులతో స్నేహం చేసి వారి నుంచి డబ్బులు గుంజినట్లు తెలిపారు. అతడిని అరెస్టు చేసి ఓ మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. -
ఏడు ఆపరేషన్లు, ఏడు లక్షలు ఖర్చు, చివరికి ఏడడుగులు: ముద్దుగుమ్మల లవ్స్టోరీ
ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అమ్మాయిల స్నేహం వీర ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇందులో పెద్ద వింత ఏముంది అనుకుంటున్నారా? ఈ జంటలోఒక అమ్మాయి తన లింగాన్ని మార్చుకుని పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్లో జరిగిన వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఒక అమ్మాయి ఏకంగా ఏడుసార్లు లింగ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్లు చేయించుకుంది ఇందుకోసం ఏడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది. అంతేకాదు ఇరు కుటుంబాల అంగీకారంతో అంగరంగ వైభవంగాజరిగిన పెళ్లి వేడుకలో ఏడడుగులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.#UttarPradesh | Two girls got married, with one undergoing a gender change to become a man and taking on the role of the groom.This unique marriage has become the talk of the entire Kannauj district!What are your thoughts about this marriage? pic.twitter.com/w2Jskwytk2— Organiser Weekly (@eOrganiser) December 20, 2024 కన్నౌజ్లోని సరయామీరాలో ఉన్న డెవిన్ తోలా ప్రాంతానికి వీరిద్దరూ ఇటీవల కొన్ని రిలేషన్షిప్లో ఉన్నారట. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో తన లింగాన్ని మార్చుకొని మరీ స్నేహితురాల్ని పెళ్లాడింది. గతేడాది ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. బదౌన్కు చెందిన ఓ యువతి టీచర్ గా పని చేసేందుకు బరేలీకి వచ్చింది. అక్కడ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే పెళ్లి, లేదంటే చావు అన్న స్థితికి వచ్చారు. దీంతో కుటుంబ సభ్యుల చొరవతో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని అన్ని అవరోధాలు అధిగమించిన తరువాత వివాహం చేసుకున్నారు. -
కళ్ల జోడు.. స్టైల్ చూడు
కళ్ల జోడు కొత్త మోడల్స్ అనునిత్యం నయా పుంతలు తొక్కుతున్నాయి. నలుగురిలో భిన్నంగా ఉండాలనుకునే యువత మార్కెట్లోకి కొత్త మోడల్ వచి్చందంటే దాన్ని మనం ధరించాల్సిందే అంటున్నారు. ఈ తరహా ట్రెండ్ ప్రధానంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, సాఫ్ట్వేర్, ఇతర ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఇందులో అత్యధిక శాతం మంది మాత్రం ఎప్పటికప్పుడు తమ కళ్లజోడు మారుస్తున్నారు. నగరవాసులు కొత్త మోడల్స్కు మారిపోతున్నారు. అందం, అభినయానికి అనుగుణంగా తమ కళ్లజోడు ఉండేలా సెట్ చేసుకుంటున్నారు.కళ్ల జోడు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం సమస్య వేధిస్తోంది. మోటారు సైకిల్పై, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణాలు చేసేవారికి గాలిలోని ధూళి కణాలు కంట్లో పడి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి సమయంలో కంటికి రక్షణ, స్టైలిష్ కళ్ల జోడు కోసం నిత్యం వివిధ వెబ్సైట్లలో, ఆప్టికల్ దుఖాణాల్లో కొత్త మోడల్స్పై ఆరా తీస్తున్నారు. ఎండలో ప్రయాణాలు చేసేవారు ప్రమాదకరమైన సూర్య కిరణాల నుంచి రక్షణ కల్పించడం కోసం, రాత్రి వేళ డ్రైవింగ్ చేసే సమయంలో ఎదుటి వాహనాల వెలుతురు ప్రభావం మన కళ్లపై పడకుండా ఉండేందుకు యాంటీ గ్లేర్ గ్లాసెస్, కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే యువత కంప్యూటర్ కిరణాల నుంచి రక్షణ కసం బ్లూలైట్ యాంటీ గ్లేర్ వంటి వివిధ రకాల ప్రత్యేకతలున్న గ్లాసెస్ వినియోగిస్తున్నారు. మరికొంత మంది మాత్రం కంటి సమస్యలతో కళ్లజోడు వినియోగిస్తున్నారు. చూపు మందగించడం, రీడింగ్ గ్లాసెస్, కళ్లు ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించడం కోసం కొన్ని రకాల లెన్స్ అందుబాటులో ఉన్నాయి.బ్రాండ్స్పై మోజు.. ప్రపంచంలో పేరెన్నిక కలిగిన పలు బ్రాండెడ్ గాగుల్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. అనునిత్యం కొత్త కొత్త మోడల్స్, ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కేపీహెచ్బీ, హైటెక్సిటీ, రాయదుర్గం, శేరిలింగంపల్లి తదతర ప్రాంతాల్లో బ్రాండెడ్ గాగుల్స్ దుకాణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అచ్చం అలాగే కనిపించే లోకల్ బ్రాండ్స్ సైతం లభిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ధరల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. చిన్న చిన్న దుకాణాల్లో గాగుల్స్ అడిగితే రూ.100కే లభిస్తున్నాయి. అదే మల్టీనేషన్ కంపెనీ బ్రాండ్ అయితే కనీసం రూ.5 వేలు ఆపైనే ఉంటాయి. వీటి మన్నికలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.సమస్య ఎక్కడ మొదలవుతోంది? నగరంలో యువత జీవన శైలి మారిపోతోంది. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ ఫోన్ స్క్రీన్ ఎక్కువ సమయం చూడటం, ఉద్యోగం, వ్యాపార లావాదేవీల్లో అవసరాల రీత్యా కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్స్పై పనిచేయాల్సి రావడంతో కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో చాలామందిలో చూపు మందగించడం, కళ్లు ఎక్కువగా ఒత్తిడిగి గురై తలనొప్పి రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల్లో సైతం ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న బాధితులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.బ్రాండ్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి కాలుష్యం నుంచి కంటిని రక్షించుకోవడానికి గాగుల్స్ అవసరం. అయితే వాటిని నిపుణులైన వైద్యుల సూచనల మేరకు వినియోగిస్తే మంచిది. కంటి సమస్యలతో వచ్చేవారికి కళ్లజోడు రాయాల్సి వచి్చనప్పుడు కొత్త మోడల్స్ కావాలని కోరడం సహజంగా మారిపోయింది. కంటిపై ఒత్తిడి పెరగడం వల్ల దగ్గర, దూరం దృష్టి సమస్యలు, కళ్లు పొడిబారిపోవడం, తలనొప్పి రావడం, ఇంట్రాక్రీనియల్ ప్రెజర్ పెరగడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. బయటకు వెళ్లే సమయంలో సన్ ప్రొటెక్షన్, కంప్యూటర్పై పనిచేసేటప్పుడు నిపుణుల ఆదేశానుసారంగా లెన్స్ గ్లాసెస్ వాడుకోవాలి. ప్రతి 45 నిమిషాలకు ఒక 10 నిమిషాలైనా కంప్యూటర్, మొబైల్కు దూరంగా ఉండాలి. ఎక్కువ సార్లు కనురెప్పలను బ్లింక్ చేయాలి. కంట్లో ధూళి కణాలు పడితే నల్లగుడ్డుకు ప్రమాదం వాటిల్లుతుంది. కళ్లజోడు వినియోగించడంతో కంటి లైఫ్ టైం పెంచుకోవచ్చు. బ్రాండ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఏదో ఒకటి కళ్లజోడే కదా చాలు అనుకుంటేనే ఇబ్బంది. – డా.పి.మురళీధర్ రావు, వైరియో రెటినల్ సర్జన్, మ్యాక్స్ విజన్, సోమాజిగూడ -
బడి పంతులుకు బడిత పూజ
-
మండుటెండలో నిలబెట్టి... ఆపై జుత్తు కత్తిరించి!
జి.మాడుగుల: అసెంబ్లీకి సమయానికి రాలేదని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలోని కస్తూర్బా బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుతున్న విద్యార్థినుల జుత్తును ప్రిన్సిపాల్ కత్తిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్తీక పౌర్ణమి రోజైన శుక్రవారం నాడు పాఠశాల, కళాశాల విద్యార్థినులు కాలకృత్యాలు తీర్చుకొని పూజలు చేసుకొని ఆలస్యంగా కేజీబీవీకి వచ్చారు.పాఠశాలలో రోజువారీ నిర్వహించే అసెంబ్లీకి ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు అలస్యంగా రావడంతో వారిపై ప్రిన్సిపాల్ ఆగ్రహించారు. విద్యార్థినులను పాఠశాల, కళాశాలల ఆవరణలో ఎండలో 2 గంటలు సేపు నిలబెట్టారు. అసెంబ్లీకి రాని విద్యార్థినుల్లో కొంతమందిని దండించారు. వీరిలో 15 మందికి జట్టును ఇష్టానుసారంగా కత్తిరించారు. మనోవేదనకు గురైన విద్యార్థినులు ప్రిన్సిపాల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచినా.. వెంబడించి మరీ జుత్తు కత్తిరించినట్టు సమాచారం. వీరిలో ఒక విద్యార్థిని దేవుని మొక్కు ఉందని జుత్తు కటింగ్ చేయవద్దని ప్రాథేయపడినా ప్రిన్సిపాల్ కనికరించలేదు. జుత్తు కట్ చేస్తున్న సమయంలో మనోవేదనకు గురైన ఒక విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయినప్పటికీ తాగడానికి మంచినీరు కూడా ప్రిన్సిపాల్ అందించటానికి నిరాకరించారు. క్రమశిక్షణ నేర్పాలనే... విద్యార్థినుల జుత్తు కత్తిరింపుపై కేజీబీవీ ప్రిన్సిపాల్ సాయి ప్రసన్నను వివరణ కోరగా విద్యార్థినుల జుత్తు బాగా పెరిగిపోవడం వల్ల పేలు పట్టి, తలపై కురుపులు వస్తాయని, క్రమశిక్షణగా ఉంటారనే ఉద్దేశంతో జుత్తు కట్ చేసినట్లు తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని సాయిప్రసన్న తెలిపారు. ఉన్నతాధికారులకు సమాచారమిచ్చాం కేజీబీవీలో విద్యార్థినుల జుత్తును అకారణంగా కటింగ్ చేసినట్టు కొంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు తమ దృష్టికి తీసుకు వచ్చారని ఎంఈవో బాబూరావుపడాల్ తెలిపారు. ఈ విషయంపై కేజీబీవీని సందర్శించేందుకు వెళ్లగా ప్రిన్సిపాల్ సెలవులో ఉన్నట్టు చెప్పారన్నారు. అక్కడ నుంచి ఫోన్లో ప్రిన్సిపాల్ని సంప్రదించగా విద్యార్థినులకు జుట్టు పెరిగిపోయిందని, క్రమశిక్షణ(డిసిప్లేన్) కోసం విద్యార్థినుల్లో కొంతమంది జత్తు కటింగ్ చేసినట్టు చెప్పారని ఎంఈవో తెలిపారు. దీనిపై జిల్లా విద్యాశాఖ, జీసీడీవోకు సమాచారం అందించామని ఆయన వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే ‘మహోన్నత’ మహిళ!
సాక్షి, అమరావతి: రాష్టంలో మహిళా సాధికారత కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన కృషిని కూటమి ప్రభుత్వం భేష్ అని పరోక్షంగా ప్రస్తావించక తప్పలేదు. కూటమి సర్కారు సోమవారం ప్రవేశపెట్టిన జెండర్ బడ్జెట్ ఉపోద్ఘాతంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండానే గత ప్రభుత్వం సాధించిన ఫలితాలను ప్రస్తావించింది. రాష్ట్రంలో మహిళలను విద్య, ఉపాధి, సంక్షేమం, ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో సాధికారత వైపు అడుగులు వేయించేలా ఐదేళ్ల (2021–25) పటిష్ట కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర బడ్జెట్లో కొంతభాగాన్ని జెండర్ బడ్జెట్ పేరుతో మహిళాభివృద్ధికి ప్రభుత్వం 2021–22 నుంచి కేటాయింపులు చేస్తోంది. 2021–22లో మొదలైన జెండర్ బడ్జెట్ 2022–23 నాటికి మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మొదలైంది.విద్య, ఉపాధి, భూమి కేటాయింపు వంటి అనేక కీలకమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్ పనుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ చట్టం చేయడంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచింది. దీంతో మహిళలు ఇంటి యాజమాన్యంతోపాటు రాజకీయంగానూ, సామాజికంగానూ ముందడుగు వేశారు. ఫలితంగా మహిళా సాధికారతలో జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ రూపొందించిన ర్యాంకింగ్లో 4 నుంచి మూడో ర్యాంకును సాధించింది. 18 మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, వన్స్టాఫ్ సెంటర్లు, హెల్ప్డెస్్కల ఏర్పాటు వంటి అనేక చర్యలు చేపట్టింది. ఇలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక అంశాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జెండర్ బడ్జెట్లోని ఉపోద్ఘాతంలో ప్రస్తావించడం విశేషం.జెండర్ బడ్జెట్ కేటాయింపులు ఇలాప్రత్యేకంగా మహిళలు, బాలికల కోసం ఉద్ధేశించిన జెండర్ బడ్జెట్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం ప్రధాన కేటాయింపులు తగ్గించింది. ⇒ కూటమి ప్రభుత్వం(2024–25) బడ్జెట్లో 100శాతం కేటాయింపులు (పార్ట్–ఏ ప్రోగ్రామ్)లో రూ.20,935.56కోట్లు కేటాయించింది. 30 నుంచి 99శాతం లబ్ధి కలిగే పథకాలు (పార్ట్–బి ప్రోగామ్)లో రూ.58,355.44కోట్లు కేటాయించింది. మొత్తం రూ.79,291కోట్లు మాత్రమే కేటాయించింది. చిన్నారుల సంక్షేమానికి ఇలా.. ⇒ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చిన్నారుల సంక్షేమానికి మొత్తం రూ.21,910.75కోట్లు కేటాయించింది. నూరు శాతం పిల్లలకే ఉద్దేశించిన పథకాలు (పార్ట్–ఎ)లో రూ.13,793.51కోట్లు, పార్ట్–బిలో రూ.8,117.24కోట్లు మాత్రమే కేటాయించింది. -
ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు
సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్): ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం పోలీసులకు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ అన్నారు. ఆడపిల్లలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలను సమాజమే దీటుగా ఎదుర్కోవాలన్నారు. గుంటూరు అరణ్య భవన్లో ఆదివారం అటవీ అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. మహిళలపై నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ధి కావాలన్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచి్చనా.. కోల్కతాలో వైద్యురాలిపై పాశవిక దాడి జరిగిందన్నారు. తమ కళ్లెదుట జరుగుతున్న నేరాలు, ఘోరాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్య నేర్చుకుని, తమపై దాడులకు తెగబడే ఉన్మాదులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. గంజాయి. మత్తు పదార్థాలను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. అధికారుల్ని బెదిరిస్తే సుమోటో కేసులు రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఎక్కడ ఉన్నా పిలిపిస్తామని ఐపీఎస్ అధికారులపై చేస్తున్న బెదిరింపులపై సుమోటో కేసులు వేస్తామని పవన్కళ్యాణ్ హెచ్చరించారు. ఒక మాజీ సీఎం స్థాయిలో పోలీసు అధికారులను బెదిరించడం సరైంది కాదని వైఎస్ జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సప్త సముద్రాల ఆవల ఉన్నా వదలం అని మాజీ సీఎం అంటున్నారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లేదన్నారు. 20 ఏళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఉంటుందని గతంలో పోలీసు అధికారులతో ఘోర తప్పిదాలు చేయించారన్నారు.గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనల పేరిట రోడ్ల పక్కన చెట్లు నరికేశారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. షర్మిల కోరితే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని చెప్పారు. సరస్వతి భూములపై చర్యలు సరస్వతి పవర్ ప్లాంట్ భూముల వ్యవహారంపై చర్యలు చేపడతామని పవన్కళ్యాణ్ చెప్పారు. 76 ఎకరాల అసైన్డ్ భూములు, చుక్కల భూములు ఆక్రమించారని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నామన్నారు. పవర్ ప్లాంట్ పరిధిలో గ్రీన్జోన్ ఏర్పాటు చేయలేదని, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు సైతం లేవని అన్నారు. విశాఖ నడి»ొడ్డున గంజాయి పెంచుతున్నారని, గంజాయి సాగు, డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మొద్దునిద్రలో సర్కారు.. చిదిమేస్తున్న కామాంధులు!
సాక్షి, అమరావతి: ఆకాశాన హరివిల్లు విరిస్తే అది తమకోసమేనని ఆనందించే పసిపాపలను కామ పిశాచాలు నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నాయి! పుస్తకాల బ్యాగు భుజాన వేసుకుని తుళ్లింతలతో స్కూల్కు వెళ్లే బాలికలపై పాశవికంగా లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. భవిష్యత్పై కోటి ఆశలతో కాలేజీకి వెళ్లే విద్యార్థినులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్నారులు, బాలికల ఆర్తనాదాలు అరణ్య రోదనగా మారుతున్నాయి. కూటమి సర్కారు చేతగానితనం తల్లిదండ్రులకు గుండెకోత మిగులుస్తోంది! రెడ్బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్న పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూస్తోంది.నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో కామ పిశాచాలు ఓ చిన్నారిని అపహరించి హత్యాచారానికి తెVý బడ్డా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు! నాలుగు నెలలు గడిచినా కనీసం మృతదేహాన్ని అయినా బాధిత కుటుంబానికి అప్పగించలేకపోయామనే అపరాధ భావన లేకపోవడం విభ్రాంతి కలిగిస్తోంది!! చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో 9 మంది చిన్నారులపై అత్యాచారాలు వెలుగులోకి వచ్చాయి. చిత్తూరు జిల్లాలో ఐదుగురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఓ విద్యార్థిపై సామూహిక లైంగిక దాడి చోటు చేసుకుంది. నాలుగు నెలల్లో రాష్ట్రంలో 91 మంది చిన్నారులు, విద్యార్థినులపై అత్యాచారాలు, లైంగిక దాడుల ఘటనలు జరిగాయి. వీరిలో ఏడు మందిపై అత్యాచారానికి పాల్పడి హతమార్చడం రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనం.ఆగని అత్యాచారకాండకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రౌడీమూకలు, అసాంఘిక శక్తులు విశృంఖలంగా రెచ్చిపోతున్నాయి. ఐదేళ్ల అజ్ఞాతవాసం తరువాత సంకెళ్లు తెగినట్టుగా యథేచ్చగా సంచరిస్తూ బరితెగించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాయి. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అచ్చోసిన ఆంబోతుల్లా దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు, విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని కీచక పర్వానికి ఒడిగడుతున్నాయి. వరుస అత్యాచారాలతో రాష్ట్రం హడలిపోతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రలో జోగుతోంది.పోలీసుల అస్త్ర సన్యాసంబాలికలు, విద్యార్థినులు, మహిళల భద్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేయడంతో పోలీసులు పూర్తిగా అస్త్ర సన్యాసం చేశారు. అనంతపురం జిల్లాలో జరిగిన దారుణమే దీనికి తార్కాణం. పుట్లూరు మండలం అరకటివేములలో టీడీపీ కార్యకర్త రవితేజ ఈ ఏడాది జూలైలో ఓ బాలికను అపహరించి తాడిపత్రి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న ఐషర్ వాహనంలోకి తీసుకువెళ్లి తన స్నేహితుడు నాగేంద్రతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తాపీగా ఎనిమిది రోజుల తర్వాత కేసు నమోదు చేసినా ఉపసంహరించుకోవాలని బాధిత కుటుంబాన్ని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ‘ముఖ్య’నేత ఆదేశించినట్టుగా రెడ్బుక్ రాజ్యాంగం అరాచకాలకు కొమ్ముకాయడం.. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడమే తమ కర్తవ్యంగా పోలీసు శాఖ భావిస్తోంది. చిన్నారులను అపహరించారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడం లేదు. అందుకు పుంగనూరులో మైనార్టీ బాలిక ఉదంతమే అందుకు నిదర్శనం.బాలిక అపహరణకు గురైనా విస్తృత గాలింపు చర్యలు చేపట్ట లేదు. మూడు రోజుల తర్వాత నాలుగు కి.మీ. దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అదే పోలీసులు ఫిర్యాదు రాగానే స్పందించి ఉంటే ప్రాణాలతో కాపాడగలిగేవారు. యథా చేతగాని ప్రభుత్వం..తథా చేష్టలుడిగిన పోలీసు! అన్నట్టుగా తయారైంది రాష్ట్రంలో పరిస్థితి. -
తిరుపతిలో మిస్సింగ్ కేసుల కలకలం.. మరో బాలిక అదృశ్యం
సాక్షి, తిరుపతి జిల్లా: తిరుపతి నగరంలో రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి అక్సా క్వీన్ మిస్సింగ్ ఘటన మర్చిపోక ముందే మరో కేసు నమోదైంది. పశ్చిమ పోలీస్ స్టేషన్ పరిధిలో బొమ్మకుంటకు చెందిన ప్రవల్లికశ్రీ అదృశ్యం కావడంతో తండ్రి సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పదిరోజులుగా కనిపించకపోవడంతో చిన్నారి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.కాగా, ఏర్పేడు మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీలో బాలిక అదృశ్యంపై గత శనివారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. మండలంలోని గుడిమల్లం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక(17) ఈ నెల 14న రాత్రి భోజనం చేసి నిద్రించింది. ఆపై 15వ తేదీ ఉదయం నుంచి బాలిక కనిపించలేదు. బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. -
కీచక టీచర్ నిర్వాకం.. ట్యూషన్లోనే
సాక్షి,హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదో తరగతి విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు.హైదరాబాద్ పిలింనగర్లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ట్యూషన్ ఉపాధ్యాయుడు రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడు చేసిన పనికి మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కీచక టీచర్ రాములుపై ఫిలింనగర్ పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. -
ఏపీలో పెరుగుతున్న అమ్మాయిలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏపీలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే అధికమని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. ఈ మేరకు లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను కేంద్రం విడుదల చేసింది. 2023 జూలై నుంచి 2024 జూన్ వరకు ఈ సర్వే నిర్వహించినట్లు నివేదికలో తెలిపింది. దేశంలో అబ్బాయిల కన్నా అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో మేఘాలయ, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని పేర్కొంది.కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,138 మంది అమ్మాయిలుండగా.. ఆంధ్రప్రదేశ్లో 1,032 మంది అమ్మాయిలున్నారని వెల్లడించింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలుండగా.. 2023–24లో ఆ సంఖ్య 1,032కు పెరిగిందని పేర్కొంది. అలాగే ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,019 మంది అమ్మాయిలుండగా.. పట్టణ ప్రాంతాల్లో 1,064 మంది అమ్మాయిలున్నట్లు తెలిపింది. దేశం మొత్తం మీద 11 రాష్ట్రాల్లోనే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించింది. జాతీయ స్థాయిలోనూ పురోగతి..దేశం మొత్తం మీద చూస్తే అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉన్నప్పటికీ.. అమ్మాయిల సంఖ్య గతంలో కంటే పెరిగిందని నివేదిక వెల్లడించింది. దేశంలో 2019–20లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలుండగా.. 2023–24లో ఆ సంఖ్య 981కి పెరిగిందని తెలిపింది. ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తోందని నివేదిక పేర్కొంది. అమ్మాయైనా, అబ్బాయైనా.. ఒక్కరు చాలనుకునే వారి సంఖ్య పెరిగిందని వెల్లడించింది. ఇక హరియాణాలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 867 మంది అమ్మాయిలు, ఢిల్లీలో 837 మంది, దాద్రా–నగర్–హవేలీ–డామన్–డయ్యూలో 818 అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. -
చెరువులో మునిగి ఎనిమిది మంది చిన్నారులు మృతి
పట్నా: బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జీవితపుత్రిక పర్వదినం సందర్భంగా రెండు వేర్వేరు గ్రామాల్లోని చెరువులలో స్నానాలు చేస్తూ ఎనిమిది మంది చిన్నారులు నీట మునిగి మృతి చెందారు.ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని మదన్పూర్ బ్లాక్లోని కుషాహా గ్రామంలోను, బరున్ బ్లాక్లోని ఇతత్ గ్రామంలోను చెరువులో స్నానం చేస్తూ చిన్నారులు మృతిచెందడంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. నాలుగు లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.ఔరంగాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ శ్రీకాంత్ శాస్త్రి ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ జీవితపుత్రిక పండుగ సందర్భంగా పుణ్యస్నానం చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వివిధ చెరువులకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నదన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆయా చెరువుల వద్దకు వెళ్లి, బాధితులను బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఇది కూడా చదవండి: సీఎంను తాకిన వైద్యుల నిరసన సెగ -
ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల వాష్ రూమ్ల్లో రహస్య కెమెరాల వ్యవహారంలో యాజమాన్యం, ప్రభుత్వం దొంగాటపై ప్రజలు, మేధావులు మండిపడుతున్నారు. జరిగిన ఘటనను దాచిపెట్టడానికి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాల యాజమాన్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం తాపత్రయపడుతుండటంపై విమర్శల జడివాన కురుస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో కళాశాలకు వచ్చిన విద్యార్థినుల జీవితాలను రక్షించాలన్న, వారికి భరోసా ఇవ్వాలన్న కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని ప్రజలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో యాజమాన్యం వైఫల్యం.. ప్రభుత్వ నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోవడంలో సాగుతూ... ఉన్న జాగుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న గుడ్లవల్లేరు రహస్య కెమెరాల ఘటనపై ప్రజలు, మేధావులు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు సంధిస్తున్న ప్రశ్నలకు కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం బదులివ్వాల్సి ఉంది. ఎందుకీ ఉదాసీనత?: కళాశాలలో సీనియర్ల పేరుతో ఆకతాయిల వేధింపులు శృతిమించినా యాజమాన్యం ఎందుకు అడ్డుకట్టు వేయలేకపోయింది? ఇప్పుడీ ఘటనతో కళాశాల గుర్తింపు పోతోందని గగ్గోలు పెడుతున్న యాజమాన్యం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించింది? చివరకు విద్యార్థినుల వాష్రూమ్ల్లో రహస్య కెమెరాలు పెట్టే దుస్సాహసానికి కొందరు ఒడిగట్టినా ఎందుకు సీరియస్గా తీసుకోలేదు? ఈ విషయమై వారం క్రితమే విద్యార్థులు యాజమాన్యానికి చెప్పినా ఎందుకు పట్టించుకోలేదు? ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారా? చెప్పి ఉంటే ఎందుకు పోలీసులు స్పందించలేదు? వారం రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంటే వాళ్ల ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కళాశాల యాజమాన్యం టీడీపీ నేతల బంధువులది కాబట్టి.. చూసీచూడనట్టు వదిలేశారా? ఆదిలోనే ఆకతాయిలకు చెక్ పెట్టి ఉంటే.. అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారేదా? ఇంత దారుణ ఘటన జరిగాక కూడా బాధిత బాలికల్లో నైతిక స్థైర్యం నింపాల్సిన ప్రభుత్వం ఎందుకు యాజమాన్యం పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తోంది? రహస్య కెమెరాలతో ఏకంగా 300 వీడియోలు తీసిన భాగోతం భగ్గుమంటుంటే ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడంలేదు? ఎవరెవరి వీడియోలు ఉన్నాయో అనే తీవ్ర మనోవేదనతో ఆడబిడ్డలు ఆందోళన చెందుతుంటే యాజమాన్యం, ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబించడం ఎంతవరకు సమంజసం? అని ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.మసిపూసి మారేడుకాయ చేసేందుకు ఎందుకు యత్నించారు?విద్యార్థినుల ఆరోపణల్లో వాస్తవాలు తెలుసుకుని, మనోధైర్యం నింపాల్సిన యాజమాన్యం, ప్రభుత్వం ఎందుకు నిర్బంధంగా వ్యవహరిస్తున్నాయి? కళాశాల పాలకవర్గ సలహాదారు రవీంద్రబాబు రంగంలోకి దిగి విద్యార్థులకు ఎందుకు బెదిరించారు? అమ్మాయిలు ఆందోళన చేయడంతో రంగంలోకి దిగిన మంత్రి కొల్లు రవ్రీంద, ఎస్పీ, కలెక్టర్ వాస్తవాలను తెలుసుకోకుండా వ్యవహారాన్ని మసిపూసి మారేడు కాయ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు? అసలు విచారణే చేయకుండా.. ఏం జరిగిందో పరిశీలనే చేయకుండా.. ఉదయం 10 గంటలకే ఈ వ్యవహారంలో ఏమీ లేదని ఎస్పీ ఎలా చెప్పగలుగుతారు? కవరింగ్ కోసం మళ్లీ విచారణ చేస్తామని ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుంది? బాత్ రూమ్ల్లో కెమెరాలే లేవని తొలి రోజునే ప్రకటించిన పోలీసులు మరి షవర్లతోపాటు కొన్ని పరికరాలను ఎందుకు స్వాధీనం చేసుకున్నట్టు? వాటిని పరిశీలనకు పంపడం వెనుక మర్మం ఏమిటి? షవర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు షవర్లలో కెమెరాలు ఉన్నా లేవని చెప్పేందుకా? ఉన్న కెమెరాలను తీసివేసేందుకా? విద్యార్థినుల వీడియోలు వైరల్ చేసినట్టు ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో రికవరీలో ఏం గుర్తించనున్నారు? ఇది కూడా యాజమాన్యానికి అనుకూలంగా చేసేందుకు ఆ ఫోన్లలో ఏమీలేవని చెప్పేస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నాలుగు రోజుల సెలవుల వెనుక అసలు కారణమిదేనా?ఈ ఘటనలో బాధిత బాలికలకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి సంఘ నేతలు, తల్లిదండ్రులను, మహిళా కమిషన్ను హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్లకుండా యాజమాన్యం, పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? యాజమాన్యం ఇప్పుడు నాలుగు రోజులు సెలవులు ప్రకటించడం కెమెరాలను మాయం చేసేందుకేనా? విద్యార్థులను ఇంటికి పంపితే.. హాస్టల్ బాత్రూమ్లలో సాక్ష్యాలు తారుమారు చేయడానికేనా? ఆడపిల్లలు.. ఆధారాలు ఉంటే తనకు పంపాలని సీఎం స్థాయి వ్యక్తి చెప్పడం దారుణం కాదా? విద్యార్థుల గ్రూప్ల్లో వైరల్ అయినట్టు చెబుతున్న అటువంటి వీడియోలను ఏ మహిళ అయినా పంపిస్తారా? చట్ట ప్రకారం బాధిత యువతుల ఆధారాలు బయటపెట్టకుండా ఘటనపై దర్యాప్తు చేయాలనే కనీస జ్ఞానం కూడా లేదా కోల్పోయారా? కళాశాలను సందర్శించి అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన కనీస బాధ్యత సీఎంకు లేదా? మదనపల్లెలో కాగితాలు తగలబెడితే నానా రాద్ధాంతం చేసి డీజీపీ, సీఐడీ చీఫ్లను హెలికాప్టర్లో çపంపిన సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి గంట ప్రయాణం కూడా లేని గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లడంలేదు? ఆడపిల్లల భవిష్యత్తుకు సంబందించిన ఇంతటి సీరియస్ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు తేలిగ్గా తీసుకుంటోంది? ప్రత్యర్థి పార్టీలో ఉన్నవారిపైన కక్షలు తీర్చుకోవడానికే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్న చంద్రబాబు ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎందుకు అలక్ష్యం వహిస్తున్నారు? అని విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.హోం మంత్రి ఎక్కడ?ప్రతిపక్ష నేతను పట్టుకుని వాడు, వీడు అంటూ వెకిలిగా మాట్లాడే హోంమంత్రి అనిత గుడ్లవల్లేరు ఎందుకు వెళ్లలేకపోయారు? చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఈ వ్యవహారాన్ని వైఎస్సీర్సీపీ మీదకు నెట్టేయడానికి ఎందుకు ప్రయత్నించాయి? ఇది ఎవరి ప్రయోజనం కోసం? అని ప్రశ్నిస్తున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారనే ఇంగితం కూడా ఎల్లో బ్యాచ్కు లేకపోవడం శోచనీయం కాదా? రాష్ట్రంలో ఐపీఎస్లపై కక్షసాధింపులకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికి వదిలేసిందనేది వాస్తవం కాదా?అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
300 మంది అమ్మాయిల జీవితాలు నాశనం..
-
అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు తప్పొప్పులు నేర్పించాలి: బాంబే హైకోర్టు
ముంబై: బద్లాపూర్లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధంపుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలకు చిన్నతనం నుంచే వారి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. అమ్మాయిలను, మహిళలను గౌరవించడం నేర్పంచాలని సూచించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.ద్లాపూర్లోని తమ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుపై సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు..తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, పిల్లలకు సమానత్వం గురించి బోధించే వరకు ఏదీ మారదని పేర్కొంది.‘సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పేంత వరకు ఏమీ జరగదు. అప్పటి వరకు నిర్భయ వంటి చట్టాలన్నీ పని చేయవు. మనంం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటాం. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు చెప్పకూడదు? అబ్బాయిల ఆలోచనా ధోరణిని చిన్నతనంలోనే మార్చాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి’ అని పేర్కొంది.కాగా గత వారం బద్లాపూర్లో కిండర్ గార్టెన్ విద్యార్థినులపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధ్యాపకుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో ఈ ఘటనలను ఎలా అరికట్టాలనే దానిపై కమిటీ సిఫారసులతో ముందుకు రావలని తెలిపింది. -
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్లో ఫుట్బాల్లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్లో గైనకాలజిస్ట్గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్బాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
‘కోల్కతాలో జరిగినట్లు...’ బాలికలను బెదిరించిన ఆటో డ్రైవర్
దేశంలో తరచూ అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో జనం ఆగ్రహం వ్యక్తంచేస్తూ, నిందితులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఒక ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్కూల్కు వెళుతున్న ఇద్దరు బాలికలను ఓ ఆటో డ్రైవర్ బెదిరించాడు. పైగా కోల్కతాలో ట్రైనీ మహిళా డాక్టర్కు జరిగినట్టే మీపైన కూడా దాడి చేస్తానని నిందితుడు బెదిరించాడని ఆ బాలికలు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్ను చావబాదడాన్ని వీడియోలో చూడవచ్చు. మరోవైపు కొందరు ఆ బాధిత బాలికలకు ధైర్యం చెప్పడం కూడా కనిపిస్తుంది. తరువాత బాధితురాలు ఆ నిందితుడిని చెప్పుతో కొట్టింది.దీనికిముందు ఆటో డ్రైవర్ ఆ బాలికలను వెనుక సీట్లో కూర్చోవాలని, బిగ్గరగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. ఈ నేపధ్యంలో ఆ బాలికలకు డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే ఆ డ్రైవర్ కోల్కతా ఉదంతాన్ని గుర్తుచేస్తూ వారిని బెదిరించాడు. దీంతో ఆ బాలికలు ఆటోను ఆపాలని కేకలు పెట్టారు. దీనిని విన్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్ను ఆటోలో నుంచి బయటకు లాగి చావబాదారు. "I will do the same to you as happened in Kolkata!" An auto driver threatened a girl. Public caught him and serviced him properly before handing him over to police. pic.twitter.com/BfNvNakZj6— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2024 -
జనం రోడ్డెక్కనిదే స్పందించరా?
ముంబై: మహారాష్ట్రలో థానే జిల్లాలోని బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు దిగ్భ్రాంతికరమని బాంబే హైకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. దారుణం జరిగిన నాలుగైదు రోజులకు ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగితే గానీ పోలీసులు స్పందించలేదంటూ మండిపడింది. ‘‘పసిబిడ్డలపై అఘాయిత్యం జరిగితే తేలిగ్గా తీసుకోవడమేమిటి? జనం ఆగ్రహంతో వీధుల్లోకి వస్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదలదా? అంటూ ఆగ్రహించింది.ఈ కేసులో బద్లాపూర్ పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదంటూ ఆక్షేపించింది. ‘‘బాధితులు ఫిర్యాదు చేశారు గనుక ఈ వ్యవహారం బయటకొచి్చంది. బయటకు రాని కేసులు ఎన్నో ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది. ‘‘పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి రాకూడదు. వారు న్యాయం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండకూడదు’’ అని పేర్కొంది.‘‘పిల్లలకు స్కూళ్లలో కూడా భద్రత లేకపోతే ఏం చేయాలి? ఇక విద్యా హక్కు చట్టానికి అర్థమేమిటి?’’ అంటూ నిలదీసింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకు జాప్యం జరిగిందని పోలీసులను ప్రశ్నించింది. ‘‘బాలికల భద్రతపై రాజీపడడానికి వీల్లేదు. వేధింపుల గురించి తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయని స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోండి’’ అని ఆదేశించింది. 27లోగా నివేదిక సమర్పించండిబద్లాపూర్ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కూల్ వాష్ రూమ్లో అటెండర్ వారిని లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. ఈ నెల 12, 13న దారుణం జరిగితే పోలీసులు 16న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 17న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జస్టిస్ రేవతి మొహితే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్తో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేసింది. బాలికలకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని, మరింత బాధకు గురిచేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో 27వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. -
ధవళేశ్వరం బాలికల మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్ట్...
-
Iraq: బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు కుదిస్తూ బిల్లు ప్రతిపాదన
అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. పర్సనల్ స్టేటస్ లాను సవరించే ఉద్దేశంతో రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.. అయితే ఇది ఆమోదం పొంది చట్టంగా మారితే వివాహానికి కనీస అమ్మాయి వయస్సు 9 ఏళ్లు ఉండగా.. అబ్బాయి వయస్సు 15 ఏళ్లుకు కుదించనున్నారు.కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి ఈ బిల్లు అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో మహిళ హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు. బిల్లు కానీ పార్లమెంటులో ఆమోదం పొందితే బాల్య వివాహాలు భారీగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లింగ సమానత్వంతోపాటు మహిళా హక్కుల విషయంలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ బిల్లు నట్టేట్లో కలిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ బిల్లు ఆమోదం పొందితే, 9 ఏళ్లలోపు బాలికలు మరియు 15 ఏళ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తారు, ఇది పెరిగిన బాల్య వివాహాలు మరియు దోపిడీల భయాలను రేకెత్తిస్తుంది. ఈ తిరోగమన చర్య మహిళల హక్కులు మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కుతుందని విమర్శకులు వాదించారు.మానవహక్కుల సంఘాలు, మహిళా సంఘాలు సైతం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బాలికల విద్యను ఇది అడ్డుకుంటుందని, వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. చిన్న వయసులోనే గర్భం దాల్చడం, గృహ హింస వంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ ప్రకారం, ఇఆరక్లో 28శౠతం మంది బాలికలకు 18 ఏళ్ల లోపు వివాహాలుజరుగుతున్నట్లు వెల్లడైంది. అయితే ఇరాక్ గతంలోనూ ఇలాంటి ప్రయత్నమే చేసినప్పటికీ అప్పట్లో చట్ట సభ్యుల వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. -
పోకిరీల భయంతో రైలెక్కిన ఇద్దరు బాలికలు
యువతులను వేధించే పోకిరీల ఆగడాల గురించి తరచూ వింటుంటాం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే కుర్రాళ్ల గురించి కూడా వినేవుంటాం. ఇలాంటి యువకుల నుంచి తప్పించుకునేందుకు మహిళలు, యువతులు నానా అవస్థలు పడుతుంటారు. తాజాగా పోకిరీల భయంతో ఇద్దరు బాలికలు చేసిన పని చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్లోని ఇటావా రైల్వే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న గార్డుకు ఇద్దరు బాలికలు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆయన వారిని ప్రశ్నించగా వారు తమకు ఎదురైన అనుభవాన్ని తెలిపారు. తాము హత్రాస్లో నివాసముంటామని, ట్యూషన్ ముగిశాక, ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు పోకిరీలు తమకు ఎదురయ్యారని, వారి నుంచి తప్పించుకునేందుకు రైల్వే స్టేషన్కు చేరుకుని హడావుడిగా రైలు ఎక్కినట్లు తెలిపారు. ఇంతలో రైలు స్టార్ట్ అయ్యిందని, తాము 140 కిలోమీటర్ల దూరంలోని ఇటావా స్టేషన్ రాగానే స్టేషన్లో దిగేశామని తెలిపారు. వీరి మాటలు విన్న గార్డు ఈ సమాచారాన్ని చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు తెలిపారు. వారు ఈ బాలికలను వారి హత్రాస్లోని వారి ఇళ్లకు పంపించారు. -
నూటికో..కోటికో, ఈ అమ్మాయిల్ని చూసి నేర్చుకుందాం.. వైరల్ వీడియో
సాటి మనిషి ఇబ్బందుల్లోనో, కష్టాల్లోనో ఉన్నపుడు స్పందించడం మనుషులుగా మన కర్తవ్యం. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, పిల్లల విషయంలో ఈ బాధ్యత మరింత పెరుగుతుంది. కానీ చేయగలిగి ఉండి కూడా తమకేమీ సంబంధం లేదు అన్నట్టు పక్కనుంచి వెళ్లిపోతారు చాలామంది. ఇద్దరు అమ్మాయిలు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోఒకటి నెట్టింట వైరల్గా మారింది. విషయం ఏమిటంటే.. మెట్రో స్టేషన్లో ఎక్స్లేటర్ దగ్గర ఒక దివ్యాంగుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇద్దరు అమ్మాయిలు ఇది చూసి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లినాక విషయాన్ని అర్థం చేసుకుని ఎక్సలేటర్ మీద నుంచి వెనక్కి నడుచుకుంటూ వచ్చి మరీ ఆయనకు సాయం చేశారు. ‘‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’’ అన్న అందెశ్రీ ఆవేదనను మరిపించేలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. మానవత్వం ఇంకా బతికే ఉంది, ఈ అమ్మాయిలు చాలా గ్రేట్ అంటూ కమెంట్ చేయడం విశేషం. అయితే ఇది ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దగ్గర దృశ్యం అంటూ ఒక యూజర్ పేర్కొన్నారు. ఆర్వీసీజీ మీడియా ఎక్స్లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. &Respect for these girls ❤️📈pic.twitter.com/bc6yeRLXl9— RVCJ Media (@RVCJ_FB) August 1, 2024 -
అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లోనే టైప్-1 డయాబెటిస్ ముప్పు ఎక్కువ
ఆధునికకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. అయితే తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల కంటే అబ్బాయిల్లోనే టైప్ 1 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని యూకే లోని యూనివర్శిటీ ఆఫ్ ఎక్సెటర్కి చెందిన పరిశోధనా బృందం వెల్లడించింది. చిన్నపిల్లలకు టైప్-1 డయాబెటిస్ (T1D) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. తాజా అధ్యయనం ప్రకారం అమ్మాయిల్లో 10 ఏళ్ల తర్వాత టైప్ 1 మధుమేహం రిస్క్ గణనీయంగా తగ్గుతుంది. కానీ అబ్బాయిల్లో మాత్రం ఈ ముప్పు స్థిరంగా ఉంటుందని పరిశోధన వెల్లడించింది. సెక్స్ హార్మోన్లు పాత్ర పోషిస్తాయని పరిశోధన తెలిపింది. పురుషుల్లోని ఆటోఆంటిబాడీల అభివృద్ధితో దీనికి సంబంధం ఉండవచ్చని సూచించింది. రోగనిరోధక వ్యవస్థ, దీనికి సంబంధించిన ప్రోటీన్లైన్ ఆటోఆంటిబాడీ ఎక్కువున్న అబ్బాయిల్లో ప్రమాదం ఉందని అధ్యయనం చూపించింది. వీరు మెజారిటీ ఆటో ఇమ్యూన్ వ్యాధుల మాదిరిగా కాకుండా ఈ తరహా మధుమేహానికి ప్రభావితమవుతారని వెల్లడించింది.ఈ అధ్యయనంలో కంప్యూటర్, స్టాటిస్టికల్ మోడలింగ్ డేటా సాయంతో పరిశోధకులు టీఐడీ ఉన్న వ్యక్తుల 235,765 మంది బంధువులను పరిశీలించారు. ఇందులో మగవారిలో అధిక ఆటోయాంటిబాడీ స్థాయిలు ఉన్నట్లు కనుగొన్నారు (అమ్మాయిల్లో: 5.0శాతం, పురుషుల్లో: 5.4శాతం). అలాగే మగవారు మల్టిపుల్ యాంటిబాడీ ప్రతిరోధకాలకు పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నందున వీరిలో ఐదేళ్ల ముందే ఈ టీఐడీ వచ్చే అవకాశం ఉంది. పదేళ్ల వయస్సులో వచ్చే ప్రమాదంలో మార్పు టీనేజ్-సంబంధిత హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నఅధ్యయన బృందం మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9-13 వరకు జరిగే స్పెయిన్లోని మాడ్రిడ్లో యూరోపియన్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఈ ఫలితాలను ప్రెజెంట్ చేయనున్నారు. -
అందంగా లేనా? అస్సలేం బాలేనా? ఈ డిజార్డర్ గురించి తెలుసుకోండి!
ప్రసిద్ధ దర్శకుడు కరణ్ జోహార్ తాను ‘డిస్మార్ఫియా డిజార్డర్’తో బాధపడుతున్నానని తెలిపాడు. శరీరంలోని ఏదో ఒక అవయవం పట్ల వ్యక్తిలో తీవ్రమైన అసంతృప్తి ఉండి అది సరిగా లేదని పదే పదే బాధపడటమే ఈ డిజార్డర్. యువతీ యువకుల్లో టీనేజీ కాలంలో ఇదిపాదుకుంటే మున్ముందు వారు సామాజిక జీవితంలో ఇబ్బందిపడాల్సి ఉంటుంది. తగిన కౌన్సెలింగ్తో దీని నుంచి బయటపడొచ్చు.ఒక సైకియాట్రిస్ట్ దగ్గరకు ఒక టీనేజ్ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి చూడటానికి అందరూ భావించేటట్టుగా ‘అందం’గా ఉంది. చర్మం రంగు, రూపం, హైట్ అన్నీ బాగున్నాయి. కాని ఆ అమ్మాయికి ‘నా ముక్కు బాగా లేదు’ అని సందేహం, అనుమానం, అదే నిజం అనిపించే అబ్సెషన్. ఆ ముక్కును ఎలా అందంగా చేయించాలి అనేదే ఆమె సమస్య. ‘కాదు నీ ముక్కు చక్కగా ఉంది. నువ్వు అనుకున్నంత లోపం ఏ మాత్రం లేదు’ అని వీరికి చెప్తే ఒక నిమిషం తెరిపిన పడతారు. మరో నిమిషంలోనే ఆ అనుమానం పెనుభూతంలా ముందుకొస్తుంది. ఈ రుగ్మతను ‘బాడీ డిస్మార్ఫియా డిజార్డర్’ అంటారు. ఇది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్లో ఒక కోవ కిందకు వస్తుంది. ఇది ఉన్నట్టుగా చాలామందికి తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు కరణ్ జోహార్ దీని గురించి మాట్లాడి తాను ఆ డిజార్డర్తో బాధపడుతున్నట్టు చెప్పాడు. అందుకే నేను లూజ్ బట్టలు ధరిస్తాను’ అని తెలిపాడు.మైఖేల్ జాక్సన్ కూడాడిస్మార్ఫియా డిజార్డర్తో బాధపడిన వాళ్లలో మైఖేల్ జాక్సన్ ఒకడు. అతనికి తన ముక్కు నచ్చలేదు. దాని వల్ల లెక్కకు మించి ప్లాస్టిక్ సర్జరీలు చేసి చివరకు ప్లాస్టిక్ ముక్కు అంటించాల్సి వచ్చింది. మగవారికి తమ జుట్టు, కళ్లు, భుజాలు, పురుషాంగం, పిరుదులు... వీటిలో ఏదో ఒకటి అస్సలు బాగలేదనే భావన బాల్యంలోనో టీనేజీలోనో స్థిరపడి΄ోతుంది. ఆడవాళ్లకు తమ కళ్లు, ముక్కు, పెదవులు, ఒంటి రంగు... వీటిలో ఏదో ఒక అవయవం గురించి అసంతృప్తి ఏర్పడుతుంది. నిజానికి లోకంలో ఎవరూ చెక్కినట్టుగా ఉండరు. ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నా తమదైన రూపంతో బాగానే ఉంటారు. అయితే డిస్మార్ఫియా డిజార్డర్లో చూడటానికి మెరుగ్గా ఉన్నా, అంతపెద్ద లోపం ఏదీ లేక΄ోయినా వారి మైండ్ ‘నీ ఫలానా అంగం ఏం బాగ లేదు బాగలేదు’ అని చెప్తూ ఉంటుంది.మిర్రర్ చెకింగ్ఈ డిజార్డర్తో బాధపడేవాళ్లు తమకు లోపం ఉందని భావిస్తూ బట్టలతో, ఆభరణాలతో దానిని కవర్ చేసుకుంటున్నామని అనుకుంటూనే పదే పదే అద్దంలో చూసుకుంటూ ఉంటారు. లేదా ఎదుటివారిని ‘బాగున్నానా బాగలేనా?’ అని అడుగుతూ విసిగిస్తూ ఉంటారు. ‘బాగున్నావ్’ అన్నా నమ్మరు. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మటిక్ సర్జరీలు చేయించుకున్నా వీరికి సంతృప్తి కలగదు. ఎందుకు? సమస్య మైండ్లో ఉంది కాబట్టి. ఈ సమస్య ఉన్నవారు కాలక్రమంలో నలుగురినీ కలవని స్థితికి చేరుకుంటారు.కౌన్సెలింగ్డిస్మార్ఫియా డిజార్డర్తో బాధ పడేవారు ముందు చేయవలసిన పని తమ యథాతథ రూపాన్ని యాక్సెప్ట్ చేయడం. ‘నేను నా రూపాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను’ అని పదే పదే చెప్పుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. లేదా సైకియాట్రిస్ట్లను కలిస్తే వారు కౌన్సెలింగ్తో సమస్యను దూరం చేస్తారు. లేదా మరీ పదే పదే అందుకు సంబంధించి నెగెటివ్ థాట్స్ వస్తుంటే మందులతో చికిత్స చేస్తారు. ప్రకృతిలో ప్రతి ప్రాణి భిన్నమైన రూపాలతో ఉంటారని తెలుసుకుంటే శారీరక లోపాకు సంబంధించిన ఇలాంటి రుగ్మతలు దరి చేరవు. -
రిలీజ్కు ముందే అవార్డుల పంట.. ఆ సినిమా అరుదైన ఘనత!
కని కస్రుతి, ప్రీతి పాణిగ్రాహి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'గర్ల్స్ విల్ బి గర్ల్స్'. ఈ చిత్రానికి సుచి తలాటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన ఘనత దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ (IFFLA)లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెలుచుకుంది. రిచా, చద్దా అలీల నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే పలు ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా ఇప్పటికే రొమేనియాలోని ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫ్రాన్స్లోని బియారిట్జ్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రాండ్ జ్యూరీ ప్రైజ్లను గెలుచుకుంది. అంతే కాకుండా సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో రెండు ప్రధాన అవార్డులను కూడా గెలుచుకుంది. తమ చిత్రం పెద్ద విజయం సాధించడం పట్ల రిచా చద్దా ఆనందం వ్యక్తం చేశారు.రిచా మాట్లాడుతూ.. " మా చిత్రం గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ గెలవడం ఒక అపురూపమైన గౌరవం. మా టీమ్ మొత్తం కృషి, అంకితభావాన్ని గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. 'గర్ల్స్ విల్ బి గర్ల్స్' అనేది మన హృదయాలకు దగ్గరైన కథ. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. -
ఆడపిల్లలు పుట్టడమే పాపమా?
ఖిలా వరంగల్ : ‘ఆడపిల్లలు లేనిదే సృష్టి లేదు. ఆడపిల్లలను బతకనిద్దాం.. సమాజంలో గౌరవంగా నిలుపుదాం.. ఆడపిల్లను చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. ఇంటికి వెలుగులు.. ఆడపిల్ల చిరునవ్వులు.. అంటూ ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసినా కొందరు మారడం లేదు. ఆడపిల్లల పట్ల ఇంకా వివక్షే ప్రదర్శిస్తున్నారు. బాలికకు జన్మించిందంటే చాలు.. ఎక్కడో చోట ఆ తల్లిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. ఆడపిల్లలకు జన్మనివ్వడమే ఆ ఇల్లాలు చేసిన పాపం..! ఆడపిల్లలకు జన్మనిచ్చిందని ఓ ప్రభుద్ధుడు.. తన భార్య, ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి గెంటేసి తాళం వేసి పరారు కాగా.. స్థానికులు, బంధువుల సహకారంతో ఆ ఇల్లాలు తన ఇద్దరి పిల్లలతో కలిసి అత్తారింటి ఎదుట ధర్నా చేపట్టింది. ఈ ఘటన ఆదివారం వరంగల్ ఉర్సు కరీమాబాద్ సుభాశ్నగర్లో వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ నాయుడు పెట్రోల్ బంక్ సమీప కాలనీకి చెందిన బైరి వీరస్వామి, నాగమణి దంపతుల కుమార్తె నవితను 14 ఏళ్ల క్రితం వరంగల్ ఉర్సు కరీమాబాద్ సుభాష్నగర్కు చెందిన బలభద్ర నారాయణ, చంద్రకళ దంపతుల కుమారుడు రాజేశ్కు ఇచ్చి వివాహం చేశారు. ఈ సమయంలో కట్నం ఇతర కానుకలు అందజేశారు. అయితే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చావంటూ భర్త, అత్తామామ వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో నవిత ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో వీరస్వామి తనకుమార్తె ఎదురవుతున్న కష్టాలు చూడలేక 43వ డివిజన్ నక్కలపల్లిలో ఓ ఇళ్లు, మహారాష్ట్రలోని బీమండిలో ఒక ఇళ్లు బిడ్డకు ఇచ్చేశారు. అయినా ఆడపిల్లలకు జన్మనిచ్చావని మళ్లీ భర్త.. నవితను కొట్టిగా.. ఆరునెలల క్రితం ఒక కన్ను కోల్పోయింది. చికిత్స పొందిన తర్వాత ఆదివారం ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని అత్తారింటికి చేరింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్య, ఇద్దరు కుమార్తెలను ఇంటి నుంచి గెంటేసి తాళం వేసి భర్త తల్లిదండ్రులను వెంట తీసుకుని పరారయ్యాడు. దీంతో నవిత పుట్టింటికి వెళ్లకుండా స్థానికులు , బంధువుల సహకారంతో అత్తారింటి ఎదుట ధర్నా నిర్వహించింది. స్థానికులు.. తాళం ధ్వంసం చేసి భార్య, ఇద్దరు కుమార్తెలు ఇంట్లోకి పంపించారు. రాత్రి సమయంలో భర్త వచ్చి ఏదైనా బెదిరింపులకు పాల్పడితే 100 డైల్ చేసి పోలీసులకు సమాచారం చెప్పాలని భరోసా కల్పించారు. కాగా, ఆడపిల్లలకు జన్మనివ్వడమే నవిత చేసిన పాపమా..? పోలీస్ అధికారులు వెంటనే స్పందించి చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తకు బుద్ధి చెప్పాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీ మెట్రోలో మరోసారి అమ్మాయిల రచ్చ: వీడియో వైరల్
సోషల్ మీడియా పిచ్చితో మెట్రో రైళ్లలో కొంతమంది తీరు అభ్యంతరకరంగా, తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు మరిచిపోకముందే, తాజాగా ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.इन रील्स वालों के लिए एक दो मेट्रो कही साइड में खड़ी कर दो यार जहां देखो वहां चालू हो जाते है । #DelhiMetro में तो ये चल ही रहा है कही #MumbaiMetro में भी ये चालू न हो जाए pic.twitter.com/l8pzDHKxpy— Mahendra Singh (@mahendrasinh280) June 11, 2024సోషల్ మీడియాలో యూజర్ల రీల్స్తో గతంలో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో మెట్రోలో రీల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువతీ యువకుల ఆకతాయి పనులకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు కలిసి డ్యాన్సింగ్ వీడియోనే ఇందుకు ఉదాహరణ. తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న కనీస స్పృహను కూడా మర్చిపోయిన అమ్మాయిలు భోజ్పురి పాటకి రాడ్ పక్కన నిలబడి స్టెప్పు లేశారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు చూసీ చూడనట్టు కొందరు, మరి కొందరు అసహనం వ్యకం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్లో పోస్ట్ అయింది. మహేంద్ర సింగ్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ రీల్స్ చేసేవాళ్ల కోసం ఒకటి రెండు మెట్రోలు సైడ్కి నిలపండి రా బాబూ, ఎక్కడ చూసినా ఈ రీల్స్ గోలే.. ఈ జాడ్యం ముంబై మెట్రోకి కూడా విస్తరించకూడదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. -
Mosh Pub: అమ్మాయిలను ఎరగా వేసి దందా చేస్తున్న మోష్ పబ్..
సాక్షి,హైదరాబాద్: డేటింగ్ యాప్స్ కేంద్రంగా పబ్స్ యజమానులు, కొందరు యువతులు చేస్తున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు, బడా బాబులకు ఎర వేయడం, వాళ్లను పబ్స్కు రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లుల్ని మాత్రం వెంట వచి్చన వారికి ఇస్తాయి. ఇలా వచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవరూ బయటపడలేదు. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్లో మోసపోయిన వ్యాపారి సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచి్చంది. ఓ యువతి వలలో పడి రూ.40,505 బిల్లు చెల్లించిన ఆ బాధితుడి వ్యధ ఇది.. టిండర్ యాప్ ద్వారా పరిచయం.. నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఈమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్నుమీటింగ్ పాయింట్గా చెప్పింది. సోమవారం సాయంత్రం అక్కడకు వచ్చిన వ్యాపారిని కలిసిన రితిక కొద్దిసేపటికి సమీపంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న పబ్కు వెళ్దామని చెప్పింది. అక్కడకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరిచడంతో వెయిటర్ను కలిసి ఆ పబ్లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, పడిన వారిని పబ్కు తీసుకురావాలని పబ్ యజమానులు–యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘పబ్స్ అండ్ గారల్స్’ కలిసి వినూత్న స్కామ్కు తెరలేపారు. మద్యం పేరుతో కూల్డ్రింక్స్ సరఫరా.. వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించే పబ్ నిర్వాహకులు వెయిటర్ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా.. గ్లాసుల్లో సరఫరా చేసేది మాత్రం కూల్డ్రింకే. రితిక సైతం ఆ రోజు ఒక్కో పెగ్గు రూ.1,799 ఖరీదు చేసే పది పెగ్గుల మద్యం ఆర్డర్ చేసింది. ఈ పేరుతో పబ్ నిర్వాహకులు సరఫరా చేసిన కూల్డ్రింక్ తాగుతూపోయింది. దీంతో రూ.20 ఖరీదు చేసే కూల్డ్రింక్కు యువతి సహకారంతో మద్యం రంగుపూసిన నిర్వాహకులు రూ.1,799 చొప్పున వసూలు చేశారు. ఈ ‘మద్యం’తో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి రూ.40,505 (పన్నులతో కలిపి) బిల్లు చేసింది. చివరకు వెయిటర్ బిల్లు తీసుకువచి్చన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టిన యువతి వాష్రూమ్కు వెళ్లి వస్తానంటూ ఉడాయించింది. దాదాపు పది పెగ్గులు తాగిన ఆ యువతిలో ఎలాంటి తేడా లేకపోవడం, తూలకుండా నేరుగా నడిచి వెళ్లడంతో పాటు ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ అయ్యాడు. అక్కడ వేదనలు నిత్యకృత్యం సదరు పబ్లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలిబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్లో ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి రూ.16 వేలు, మరో వ్యక్తి రూ.24 వేలు, ఇంకొకరు రూ.20 వేలు చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్రూమ్కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లుకు అదనం. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచి్చన మొత్తంలో యువతులు కొంత కమీషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మోష్ పబ్పై కేసు నమోదు హైటెక్ సిటీలోని మోష్ పబ్ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్సై ఎన్వీ రమణ తెలిపారు. కొన్ని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా యువతులకు, పబ్కు మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బాధితుల భయమే వీరికి వరం ఇలా యువతుల వల్లో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా.. యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువుపోతుందని భయపడుతున్నారు. దీంతో కొందరు మాత్రం పబ్కు సంబంధించిన గూగుల్ రివ్యూస్లో విషయం పొందుపరుస్తున్నా.. అనేక మంది మిన్నకుండిపోతున్నారు. ఇదే అటు పబ్ నిర్వాహకులు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందాలో ఆ ఒక్క పబ్లోనే కాదని, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిలోకి ఈ ‘జంటలు’ ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి, నమోదు చేసుకుంటున్నారు. ఈ హనీట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలా చేయడం కచి్చతంగా నేరమే అని, దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులని స్పష్టం చేస్తున్నారు. బాధితులుగా మారిన ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
హైదరాబాద్ పబ్ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొంతమంది పబ్ యజమానులు.. అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్లో కొత్త మోసానికి తెరతీశారు. పబ్ యజమానులు, అమ్మాయిలు.. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు.ఒక వ్యాపారవేత్తకు రితికా అనే యువతి పరిచయం కాగా, పరిచయం అయిన మరుసటి రోజే కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రమ్మంది. మరుసటి రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. వ్యాపారవేత్తను పబ్లోకి తీసుకెళ్లి తియ్యని మాటలు చెప్పి గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగింది. రూ. 40,505 రూపాయిలు బిల్ను చేతిలో పెట్టి రితిక జారుకుంది. బిల్లును చూసి ఆ వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 45 వేల రూపాయల మద్యం తాగిన రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో విస్మయం చెందిన వ్యాపార వేత్త.. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్ ని అమ్మాయికి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నాడు.పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఇలాగే ఆ యువతి, పబ్ యాజమానుల చేతిలో చాలా మంది మోసపోయి పోయినట్లు తేలింది. రెండు రోజుల పరిధిలోని ఈ పబ్బులో ఇలాంటి మోసాలు జరిగినట్లు గుర్తించారు. తనకు జరిగిన మోసంపైన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వ్యాపారవేత్త బయటపెట్టాడు. -
అమ్మాయిల్లో తొలి పీరియడ్స్ : అదే పెద్ద ముప్పు అంటున్నతాజా అధ్యయనం
సాధారణంగా ఆడపిల్లలు 12 నుంచి 14 సంవత్సరాల వయసులో రజస్వల అయ్యేవారు. మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు, తదితర కారణాల రీత్యా ఈ మధ్య కాలంలోనే చాలా చిన్న వయసులోనే పీరియడ్స్ మొదలై పోతున్నాయి. అంటే దాదాపు 8-10 ఏళ్ల మధ్యే మెచ్యూర్ అవుతుండటాన్ని చూస్తున్నాం. అయితే తొలి ఋతుస్రావం, చిన్నతనంలోని స్థూలకాయంతో ముడిపడి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం, మొదటి పీరియడ్స్ వచ్చే సగటు వయస్సు 1950-1969 నుండి 2000-2005 వరకు జన్మించిన మహిళల్లో 12.5 సంవత్సరాల నుండి 11.9 సంవత్సరాలకు పడిపోయింది. అమెరికాలోని 70వేల మందికి పైగా యువతులపై ఈ పరిశోధన జరిగింది. అంతేకాదు చిన్నతనంలో రజస్వల కావడం హృదయ సంబంధ వ్యాధులు , కేన్సర్ వంటి ప్రతికూల ఆరోగ్య ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం కనుగొంది. ది జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) నెట్వర్క్ ఓపెన్లో ప్రచురితమైన ఈ అధ్యయనం, జాతులు , సామాజిక వర్గాలలో మహిళల్లో రుతుక్రమ పోకడలను గుర్తించిన తొలి అధ్యయంనంగా పరిశోధకులు పేర్కొన్నారు.ఋతు చక్రాలు సక్రమంగా ఉండేందుకు సమయం పడుతుందని అధ్యయనం వెల్లడించింది. 1950- 1969 మధ్య జన్మించిన వారిలో 76 శాతంమందిలో తొలి పీరియడ్స్ తర్వాత రెండు సంవత్సరాలలోపు రెగ్యులర్ పీరియడ్స్కనిపించగా, 2000- 2005 మధ్య జన్మించిన 56 శాతం మహిళళ్లో మాత్రమే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చాయి. ప్రారంభ నెలసరి, దాని కారణాలను పరిశోధనలు కొనసాగించడం చాలా కీలకమని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పోస్ట్డాక్టోరల్ రీసెర్చ్ ఫెలో , సంబంధిత రచయిత జిఫాన్ వాంగ్ తెలిపారు. -
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
ఆరోగ్యానికి మంచిదంటూ పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్. జపాన్లో ఒక వింత వంటకం తెగర వైరల్ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి జనం. అసలు స్టోరీ ఏంటంటే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఈ స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.జపాన్లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్పిట్ టెక్నిక్ను వంటగదిలో కస్టమర్లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫోక్షన్స్ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్ట్తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోందీరైస్ బాల్! కొందరు పాజిటివ్గా కమెంట్ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద రైస్బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్బాల్స్ అంటే ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. -
ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పైత్యం : మండిపడుతున్న నెటిజన్లు
దేశవ్యాప్తంగా హోలీ వాతావరణం వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రదేశాల్లో హోలీ సంబరాలు ఊపందు కున్నాయి. అయితే ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకున్న ఘటన ఒకటి వివాదాన్ని రాజేసింది. ఇద్దరు అమ్మాయిలు అభ్యంతరకరంగా హోలీ ఆడటం విమర్శలకు తావిచ్చింది. విషయం ఏమిటంటే..దేశ రాజధాని నగరానికి తలమానికంగా పేరొందిన ఢిల్లీ మెట్రో ప్రతిసారీ ఏదో ఒక కారణంతో హెడ్ లైన్స్ లోకి వస్తుంది. అమ్మాయిలు పోల్ డ్యాన్స్, జంటల అశ్లీల వీడియోలు, రీళ్లు తయారు చేయడం, సెల్ఫీలతో వివాదాన్ని రేపడం పరిపాటిగా మారిపోయింది. దీనికి సంబంధించి డిఎంఆర్సి అనేక చట్టాలు చేసినా ప్రజలు పాటించడం లేదు తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు అమ్మాయిలు అసభ్యకరంగా హోలీ ఆడారు. వీరు తెల్లటి చీరలు సూట్లు ధరించి, నడుస్తున్న మెట్రోలో ఒకరికొకరు రంగులను పూసుకుంటూ హోలీ ఆడారు. డాన్స్ చేశారు. పవిత్ర హోలీని అవమనాపరుస్తూ, బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్కు అభినయిస్తూ, ఒకర్ని ఒకరు తాకుతూ, మెట్రోలో బహిరంగంగా, అభ్యంతకరంగా ప్రవర్తించారంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు దీన్ని గమనించిన తోటి ప్రయాణీకులు రెచ్చగొట్టే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా యూజర్ ఒకరు దీన్ని ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు, విమర్శలుగుప్పిస్తున్నారు.దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఇది సరైంది కాదు అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రో కార్పొరేషన్లో చోటు చేసుకుంటున్న ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. We need a law against this asap pic.twitter.com/3qH1aom1Ml — Madhur Singh (@ThePlacardGuy) March 23, 2024 -
మీ అమ్మాయికి చెప్పండి!
మీ ఇంట్లో, మీ పక్కింట్లో, ఎదురింట్లో, పొరుగింట్లో కూతుళ్లు ఉండే ఉంటారు. నవ్వుతూ తుళ్లుతూ స్కూళ్లకు వెళుతుంటారు. కొన్ని కళ్లు చూపులతోనూ, మరికొన్ని చేతలతోనూ ఆ నవ్వులను చిదిమేయడానికి పొంచి ఉంటాయి. ఆమెకు చెప్పండి ‘గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ అంటే ఏమిటో...జాగ్రత్తగా ఎందుకు ఉండాలో. ‘మీ పక్కింట్లో, ఎదురింట్లో, పొరుగింట్లో, వెనకింట్లో ఉన్న అమ్మలు ఒక్కటవ్వండి. పరువు పరదాల మాటున పసిపిల్లలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయండి..’అని చెబుతున్నారు హైదరాబాద్ వాసులైన మమత, శైలజ, జయవర్ధని, పుష్పలత, లక్ష్మి. ఆడపిల్లల భవిత బాగుండాలంటే వారు ఈ రోజు సుర క్షితంగా ఉండాలి. చెడు చేతల బారిన పడకుండా ‘గుడ్ టచ్– బ్యాడ్ టచ్’ గురించి బడులు, మురికివాడలు, అపార్ట్మెంట్లు.. మొదలైన ప్రాంతాల్లో మమత, శైలజ, జయవర్ధిని, పుష్పలత, లక్ష్మి.. లు ‘అభయ భవిత’ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. వీరు చేసే ఈ అవగాహన కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా తెలుగు రాష్ట్రాలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోకీ తీసుకెళుతున్నామని తెలియజేశారు. పిల్లల భావాలను గ్రహించండి.. మూడు నుంచి పదేళ్లలోపు పిల్లలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని జాతీయ, అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.‘ఆ పై వయసు పిల్లలు కూడా ఎదురు చెప్పలేని, ఎదుర్కోలేని స్థితిలో ఉన్నారని గమనిస్తున్నాం’ అంటున్నారు చైల్డ్ సైకాలజిస్టులు. పిల్లల్లో ఆకలి తగ్గిపోవడం, ఎవరితో కలవకపోవడం, నిద్రలో ఉలిక్కిపడి లేవడం, ప్రతి విషయానికి చికాకు పడటం, చదువులో వెనకబడిపోవడం .. వంటి సమస్యలన్నీ చెడు స్పర్శకు గురైన పిల్లల్లో చూస్తుంటాం. ఈ ప్రభావం వారి భవిష్యత్తును దెబ్బతీయకుండా ఉండాలంటే పిల్లల్లో ఇలాంటి భావాలేమైనా ఉంటే వాటిని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. అబ్బాయిలనూ చెడు స్పర్శ సమస్య వెంటాడుతుంది. కాబట్టి, ఈ సమస్య అమ్మాయిలది మాత్రమే అని అనుకోవద్దు. పిల్లల ప్రవర్తనలో తేడాలు గమనించడం, నిపుణులు సాయం తీసుకోవడం సముచితం’ అని తెలియజేస్తున్నారు. తల్లిదండ్రులుగా మీరేం చేయాలంటే.. ఎవరైనా అమ్మాయిల తలపై, వీపుపై తట్టడం .. వంటి స్పర్శ వారిపై చూపించే శ్రద్ధగానే అనిపిస్తుంది. కానీ, వారి శరీరంలోని ప్రైవేట్ పార్ట్లను తడమడం, తాకడం, కొట్టడం.. వంటివి పిల్లల భావాలపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా సరే వారు స్పర్శించిన తీరు నచ్చకపోతే వెంటనే ‘నో’ చెప్పాలనే విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టుగా అనిపిస్తే .. ∙అప్రమత్తంగా ఉండమని చెప్పండి ∙భద్రత కోసం ఏదైనా వస్తువును ఉపయోగించమనండి ∙ఎవరినైనా సాయం కోరమనండి ∙గట్టిగా అరవమనండి చెడు స్పర్శ వద్దే వద్దు అని చెప్పండి. ∙నిర్భయంగా ఉండమనండి ∙నీలో ఎంతో శక్తి ఉంది అది గ్రహించు అని చెప్పండి ∙సంఘటనను బట్టి వెంటనే ప్రతిఘటించమనండి ∙ఎలాంటి బాధ అయినా పంచుకోమని చెప్పండి. ఎవరికీ చెప్పుకోలేని సమస్య ఎదురైతే వెంటనే హెల్ప్లైన్ 1098 లేదా 100కు ఫోన్ చేయమనండి. – నిర్మలారెడ్డి బోర్డుపైన బొమ్మలు వేయించి పదేళ్లుగా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాను. పిల్లల ఆరోగ్యం గురించి, మహిళలకు స్కిల్ ట్రైనింగ్ చేస్తుండేవాళ్లం. ఇప్పుడు పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పిస్తున్నాను. బళ్లారిలోని గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు అమ్మాయిలను నిలబెట్టి మిగతా అందరికీ అర్థమయ్యేలా వివరించాం. పిల్లల చేతనే బోర్డు మీద బాడీలో ఏయే పార్ట్స్ తాకితే బ్యాడ్ టచ్ అనే విషయాలను బొమ్మలు వేయించి, రాయించి తెలియజేశాను. ఈ కార్యక్రమంలో పిల్లలు వాళ్ల ఎక్స్పీరియన్స్ను షేర్ చేసుకోవడం, తాము ఎలా ప్రతిస్పందించాలో ఒకటొకటిగా చెబుతుంటే ఆనందంగా అనిపించింది. – పుష్పలత సమాచారం ఉన్నా అవగాహన లేదు బిజినెస్ ఉమన్గా నా పనులు చేసుకుంటూనే స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. కార్పొరేట్ స్కూళ్లలో మా ఫ్రెండ్ వాళ్లు స్టూడెంట్స్కు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక్కో కార్యక్రమానికి స్కూల్ నుంచి కొంత మొత్తం తీసుకుంటారు. కానీ, గవర్నమెంట్, ఇతర కాన్వెంట్ స్కూళ్లకు ఆ అవగాహన కల్పించేవారు తక్కువగా ఉన్నారు. మేము భవిత ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటీవల హన్మకొండ జిల్లా వంగరలోని స్కూల్ పిల్లలకు గుడ్టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇందుకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చాలామంది దగ్గర ఉన్నప్పటికీ ఈ విషయంపై పిల్లలకు ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నారు అనేది తెలియడం లేదు. ఒకసారి చెప్పి వదిలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సమస్యకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. – జయవర్ధని రక్షించుకోవాలనే ఆలోచన కలగాలి ఖమ్మంలో నా ఫ్రెండ్ డాక్టర్ ప్రశాంతితో కలిసి నిన్ననే ఒక స్కూల్ విద్యార్థులను కలిశాం. టీచర్గా, చైల్డ్ సైకాలజిస్ట్గా పిల్లలను ధైర్యవంతులను ఎలా చేయాలి అనే అంశాలపై చర్చించుకుంటూ ఉంటాం. పిల్లల మీద దాడులు జరిగినప్పుడు పెద్దలు ఆ విషయాలను బయటకు రానివ్వరు. ఎప్పుడో ఒకటో రెండో సంఘటనలు బయటకు వస్తాయి. ఈ కారణంగా చిన్నవయసులోనే పిల్లలు గర్భవతులు అవడం, ఆసుపత్రుల పాలవడం కూడా చూశాం. మేం చేసే ఈ కార్యక్రమం ద్వారా సమస్యను కొంతవరకైనా తగ్గించగలుగుతాం అనే ఆలోచనతో మొదలుపెట్టాం. కరోనాకు ముందు స్కూల్, కాలేజీలలో దాదాపు పదివేల మంది పిల్లలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి వివరించాం. ఇది పిల్లలున్న ప్రతి ఇంట్లో అవసరమైన టాపిక్. ఒక కథ లాగా చెప్పడం, తాము ఎవరి సమక్షంలో అయినా ఉన్నప్పుడు సురక్షితంగా అనిపించకపోతే గట్టిగా అరవడం, కొరకడం, నెట్టేయడం.. వంటివి చేయడం గురించి చెప్పాం. కరోనా టైమ్లో చాలామంది పిల్లలు ఈ విధానం వల్ల రక్షింపబడ్డారని వారి పేరెంట్స్ వచ్చి చెప్పినప్పుడు చాలా ఆనందం అనిపించింది. అనాథాశ్రమాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంటాం. తమని తాము ఎలా రక్షించుకోవాలనే ఆలోచనను పిల్లల్లో కలిగించడానికి వీలైనన్ని కాన్సెప్ట్స్ ఇస్తుంటాం. అభయ భవిత కార్యక్రమం ద్వారా వీలైనంత మందిమి గ్రూప్గా అవుతున్నాం. స్లమ్స్, ఇండ్లలోని వారిని కూడా కలుస్తున్నాం. తమ తమ ప్రాంతాల్లోనే ఉంటూ ఎవరైనా ఆడపిల్లల రక్షణ కోసం అవగాహన కల్పించవచ్చు. – ఏలూరి మమత పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి పోక్సో అండ్ పోష్ రెండూ సర్టిఫికేషన్ చేశాను. వీటిలో శిక్షణ తీసుకున్నాను. పిల్లలపై జరిగే అకృత్యాలు, దాడులకు సంబంధించిన చట్టాలు, ఎలా నియంత్రించవచ్చు... అనే దానిపై వర్క్ చేస్తుంటాను. మా ఫ్రెండ్ ఎన్జీవో నుంచి వాలంటీర్గా పిల్లలకు స్వీయరక్షణ కార్యక్రమాలు చేశాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్స్ను కలిసి, పిల్లలకు శిక్షణ తీసుకుంటూ ఉంటాను. ఇటీవల గోల్కొండ ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్కి వెళ్లినప్పుడు 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి గురించి తెలిసింది. ఆ అమ్మాయి మొదట్లో చాలా చురుకుగా ఉండేది. ఇప్పుడు మానసికంగా చాలా దెబ్బతింది. తనతో మాట్లాడితే హాస్టల్లో లైంగిక వేధింపులకు గురైన విషయం తెలిసింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, సరిగా చదవకపోవడం, చిరాకు పడటం.. వంటివన్నీ ఉన్నాయి. లైంగిక వేధింపుల కారణంగా మానసికంగా దెబ్బతిన్న పిల్లలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. – శైలజ యడవల్లి ఎదుర్కోవడానికి సిద్ధం చేయాలి మేం ఉంటున్న ఉప్పల్ ప్రాంతంలోనే ఉన్న కాన్వెంట్ స్కూల్కి వెళ్లి అక్కడి ప్రిన్సిపల్ అనుమతితో స్కూల్ అమ్మాయిలతో కలిసి, మాట్లాడాను. పిల్లల చేతనే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చిన్న చిన్న స్కిట్స్ చేయించాను. తోటి పిల్లల్లో ఎవరైనా ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ముభావంగా ఉంటూ, సరిగ్గా చదవకుండా ఉన్నట్టు గమనిస్తే సమస్యను తెలుసుకుని టీచర్లకు తెలియజేయండి అని వివరించాను. పిల్లలు బాగా స్పందించారు. రెండు గంటలపాటు చేసిన ఈ కార్యక్రమంలో పిల్లలు ఆత్మరక్షణతో ప్రతిరోజూ ఎలా ఉండాలో, ఏదైనా చెడు సంఘటన జరుగబోతోందని అర్థమయిన వెంటనే ఎలా ఎదుర్కోవాలో వివరించాను. పదవతరగతి లోపు పిల్లలందరికీ ఎలాంటి చెడు సంఘటన ఎదురు కాకుండా ఉంటే ఆ తర్వాత వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకోగలరు. లేదంటే, వారి భవిష్యత్తుకు ప్రమాదం అవుతుంది. ఈ విషయం గుర్తించి అవగాహన కల్పిస్తున్నాను. – లక్ష్మి -
18 ఏళ్లు నిండకుండానే తల్లులవుతున్న బాలికలు
కొరుక్కుపేట: టీనేజ్ బాలికలు గర్భం దాల్చుతున్న అంశంలో రాష్ట్రంలోనే ధర్మపురి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గత మూడేళ్లలో ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తం 8,742 టీనేజ్ ప్రసవాలు జరగగా, అందులో ధర్మపురి జిల్లాలోనే 3,429 మంది ఉన్నట్లు తేలింది. గత కొన్నేళ్లుగా బాలికలు గర్భం దాల్చే ఘటనలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ఆరోగ్యశాఖ అధికారులు సమాధానమిచ్చారు. ఇందులో చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం గత 3 ఏళ్లలో ధర్మపురిలో 3,249 మంది మైనర్లు పిల్లలకు జన్మనిచ్చినట్లు తేలింది. కరూర్కు ద్వితీయ స్థానం లభించగా, వేలూరుకు తృతీయ స్థానంలో నిలిచింది. ఇక చైన్నె, కోయంబత్తూర్, మదురై వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే, ధర్మపురిలో బాలికలు అత్యధిక సంఖ్యలో గర్భిణులుగా పేర్లు నమోదు చేసుకుంటున్నట్లు వెల్లడైంది. దీంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రుల గణాంకాలను విశ్లేషిస్తే ఈ సంఖ్య 10 వేలకు మించి ఉంటుందని సమాచారం. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు బాలికలు గర్భం దాల్చుతున్న అంశంపై ఆరోగ్య శాఖ కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడీ మాట్లాడుతూ టీనేజ్ గర్భం అనేది సామాజిక సమస్య. దీన్ని అరికట్టాలంటే రాష్ట్రవ్యాప్తంగా బాల్య వివాహాలను నిషేధించాలన్నారు. నిబంధనల ప్రకారం కేసులను పోలీసులు నమోదు చేశారని, ఈ కేసులను సమీక్షించాలని జిల్లా మేజిస్ట్రేట్లను కోరారు. అన్ని జిల్లాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఈ సమస్యకు ముగింపు పలకడానికి పోలీసులు, ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు చేతులు కలపాలన్నారు. దీని కోసం 1,098 టోల్ ఫ్రీ నంబర్తో చైల్డ్ హెల్ప్లైన్ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘గో నిషా గో’ గేమ్ : వారి కోసమే, డౌన్లోడ్లతో దూసుకుపోతోంది
చాలామంది అమ్మాయిలకు బంగారు కలలు ఉంటాయి. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కలలు సాకారం చేసుకోలేక పోతారు. ‘ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నా కలను సాకారం చేసుకుంటాను’ అనే పట్టుదల ఉంటే కలను నెరవేర్చుకోవడం అసాధ్యమేమీ కాదు. దిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ‘నిషా’ కల్పిత పాత్ర. ‘గో నిషా గో’ గేమ్లో ప్రధాన పాత్ర. ‘నా ప్రయాణంలో ధైర్యమే నా ఆయుధం’ అనుకుంటే తడబడడం ఉండదు. అధైర్యం అసలే ఉండదు. దీనికి ఉదాహరణ నిషా. పందొమ్మిది సంవత్సరాల నిషా ఎన్నో కలలు కంటుంది. ఆ కలల దారిలో నిషాకు ఎదురైన అనుభవాలకు ‘గో నిషా గో’ అద్దం పడుతుంది. మొబైల్ గేమ్ ‘గో నిషా గో’ యువ యూజర్లకు మార్గ నిర్దేశం చేస్తుంది. బాల్య వివాహాలను నిరాకరించడం నుంచి ఆర్థిక స్వాతంత్య్రం వరకు కీలక అంశాలపై అవగాహన కలిగించే గేమ్ ఇది. డిజిటల్ గేమ్ ప్లాట్ఫామ్ ‘గేమ్ ఆఫ్ చాయిస్ నాట్ చాన్స్’ నుంచి వచ్చిన తొలి గేమ్ ‘గో నిషా గో’. ‘క్రియేటివ్ నాన్– ప్రాఫిట్ సంస్థ గర్ల్ ఎఫెక్ట్ భాగస్వామ్యంతో దిల్లీ, రాజస్థాన్, బిహార్లలోని రెండు వందల మందికి పైగా అమ్మాయిలతో మాట్లాడాం. కౌమారదశలో వారు ఎదుర్కొన్న సమస్యలపై ఎన్నో ప్రశ్నలు అడిగాం. రకరకాల సవాళ్లు ఎదురైనప్పుడు సలహాల కోసం ఎవరి దగ్గరకు వెళతారు... ఇలాంటివి ఎన్నో అడిగాం’ అంటుంది ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ కంట్రీ డైరెక్టర్ కవితా అయ్యగారి. రుతుస్రావం నుంచి సంతానోత్పత్తి వరకు ఎన్నో అంశాలపై అమ్మాయిలకు విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో లేదనే విషయం కవిత బృందానికి అర్థమైంది. తాము ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడటానికి అమ్మాయిలు సంకోచించడం, సామాజిక కట్టుబాట్ల పేరుతో తల్లిదండ్రుల ఒత్తిడి... మొదలైన విషయాలను బృందం గ్రహించింది. ఏ సలహా దొరకక, ఏ దారి కనిపించక అయోమయంలో ఉన్న అమ్మాయిలకు ‘నిషా’ గేమ్ ఒక దారి చూపుతుంది. నైతికస్థైరాన్ని ఇస్తుంది. ఈ గేమ్ మెన్స్ట్రూయెల్ హెల్త్ హెల్ప్లైన్తో సహా రకరకాల ఆరోగ్య అంశాలకు సంబంధించిన ఉత్పాదనలు, సేవలు, మహిళల సమస్యలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి వీడియో లింక్లను అందిస్తుంది. ‘గో నిషా గో’ గూగుల్ ప్లేస్టోర్లో ఉచితంగా అందుబాటులో ఉంది. అవగాహన పెంచుతోంది... ‘గో నిషా గో’ గేమ్ ఆడని వారితో పోల్చితే ఆడేవారిలో వివిధ విషయాలపై అవగాహన మెరుగు అవుతున్నట్లు అధ్యయన ఫలితాలు తెలియజేస్తున్నాయి. విషయ అవగాహనతో పాటు ఆత్మస్థైర్యం కూడా ఈ ఆట పెంచింది. ఈ గేమ్ ప్రభావంతో ఆగి΄ోయిన చదువును తిరిగి కొనసాగించిన వారు, ‘నాకు పై చదువులు చదువు కోవాలని ఉంది. ఇప్పుడే పెళ్లి వద్దు’ అని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పిన వారు, ఆర్థిక స్వాతంత్య్రంపై దృష్టి పెట్టినవారు ఎంతోమంది ఉన్నారు. హోవార్డ్ డెలాఫీల్డ్ ఇంటర్నేషనల్(హెచ్డిఐ) ‘గేమ్ ఆఫ్ చాయిస్–నాట్ చాన్స్’ సోషల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ కింద ‘గో నిషా గో’కు శ్రీకారం చుట్టింది. హెచ్డీఐ’ అనేది సామాజిక, పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను అన్వేషించే మహిళల నేతృత్వంలోని బృందం. ‘మా అమ్మ తన కలలు, లక్ష్యాల పట్ల చాలా స్పష్టతతో ఉన్న వ్యక్తి. అమెరికాలో చదువుకోవాలనే కోరిక ఆమెకు ఉండేది. తన చదువు కోసం పెళ్లిని వాయిదా వేయాలని, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పింది. తన కలల గురించి గట్టిగా నిలబడక΄ోతే ఆమె జీవితం మరోలా ఉండేది’ అంటుంది ‘హెచ్డిఐ’ కో–ఫౌండర్ సుసాన్ హోవార్డ్. వీడియో గేమ్స్ అంటే పవర్పుల్ వెపన్స్, పవర్ఫుల్ ఫైట్స్ మాత్రమేనా? ‘కాదు’ అంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్కు పెద్ద పీట వేసిన ‘గో నిషా గో’ .పదిహేను నుంచి పందొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న అమ్మాయిలకు రుతుచక్రం, పెళ్లి, చదువు, కెరీర్... మొదలైన వాటి గురించి అవగాహన కలిగిస్తోంది ఫ్రీ మొబైల్ గేమ్ గో నిషా గో. ఈ గేమ్ అంతర్జాతీయ స్థాయిలో ‘బెస్ట్ సీరియస్ గేమ్’ అవార్డ్ గెలుచుకుంది...! -
దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థినుల ఆత్మహత్యపై ఆలస్యంగానైనా.. తమ డిమాండ్కు స్పందించి దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.. ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మా డిమాండ్ కు స్పందించి.... ఆలస్యంగానైనా దర్యాప్తునకు విచారణ అధికారిని నియమించినందుకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా, లోతుగా విచారణ జరిపించి కాలయాపన చేయకుండా ఇద్దరు బాలికల మరణానికి కారకులైన దోషులను… pic.twitter.com/eGOl6Y7va4 — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024 హైదరాబాద్లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. అయితే శనివారం సాయంత్రం ఆ ఇద్దరు విద్యార్థినిలు వారు ఉండే హాస్టల్ గదిలో ఫ్యాన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
అద్భుతం చేసిన అమ్మాయిలు: బాడీనే కాన్వాస్గా..వీడియో వైరల్!
తమ శరీరాలనే కాన్వాస్గా చేసుకుని అద్భుతమై ఆకృతులను మన కళ్ల ముందు సాక్షాత్కరింప చేయడం ఒక కళ. బాడీ పెయింటింగ్ ప్రక్రియ అతి పురాతనమైన కళల్లో ఒకటి. ఇది వేల సంవత్సరాలుగా మానవ సంస్కృతిలో కీలకమైనగా భాగంగా ఉంది. యుద్ధం, వేడుకల్లాంటి వివిధ సందర్బాలతోపాటు, శతృవుల నుంచి కాపాడు కునేందుకు, వేటగాళ్ళు తమను తాము దాచి ఉంచుకోవడానికి ఈ బాడీ పెయింటింగ్ ఉపయోపడిందని భావిస్తారు. గతంలో ఇలాంటివి బాడీ పెయింటింగ్ చాలానే చూసాం. తాజాగా అలాంటి బాడీ పెయింటింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నలుగురు యువతులు కలిసి బాడీలపై టైగర్ ను చిత్రీకరించిన వైనంగా విశేషంగా నిలిచింది. 25 మిలియన్లకు పైగా వ్యూస్ను సాధించడం గమనార్హం. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి చూసేయండి మరి. The best body art ever! pic.twitter.com/o951xUfKJh — Figen (@TheFigen_) January 28, 2024 View this post on Instagram A post shared by Johannes Stoetter Art (@johannesstoetterart) -
దేశంలో ప్రస్తుతం లింగ నిష్పత్తి ఎంతంటే..
భారత్లో ప్రతి ఏడాది జనవరి24నజాతీయ బాలికా దినోత్సవాన్ని(National Girl Child Day) జరుపుకుంటారు. ఈ ఏడాది 16వ బాలికా దినోత్సవాన్ని దేశంలో జరుపుకుంటున్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం దేశంలోని బాలికలకు వారి హక్కుల గురించి అవగాహన కల్పించి, వారికున్న హక్కులు, సమస్యలతో ఎలా పోరాడాలి తదితరాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అలాగే మహిళ సాధికారతకు పెద్దపీట వేసేలా లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజునే భారత తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాందీ ఈ రోజునే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందువల్ల మహిళ సాధికారతకు ఇదే అతిపెద్ద నిదర్శనం అని చాటి చెప్పేలా ఈ రోజునే జాతీయా బాలికా దినోత్సవంగా ఎంచుకున్నారు. తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జనవరి 24, 2008న జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేషన్ ఫ్యామిలీ హల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్-5)ఏం చెబుతోంది? ప్రస్తుతం బాలికల స్థితి ఎలా ఉంది తదితరాల గురించి తెలుసుకుందాం! ఎన్హెచ్ఎస్ గత నాలుగేళ్ల సర్వేలో..2015-16లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 991 మంది మహిళలు ఉండగా, 2019-21లో 1,020 మంది మహిళు మెరుగుదల కనిపించింది. ఈ కాలంలో స్త్రీల ఆయుర్దాయం కూడా గణనీయంగా మెరుగుపడింది కూడా. చెప్పాలంటే ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్న ఇన్నే ఏళ్లలో నెమ్మది నెమ్మదిగా చాలా మార్పులు సంతరించుకున్నాయి కూడా. కానీ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు మాత్రం తగ్గలేదు. చాలా చోట్ల కొంతమంది బాలికలకు విద్యా అవకాశాలు అందని ద్రాక్షలానే ఉండటం బాధకరం. నిజానికి భారతదేశంలో ఇందుకు సంబంధించిన కట్టుదిట్టమైన మంచి చట్టాలు ఉన్నాయి. కానీ వాటి అమల ఒక సవాలుగా ఉంది. ఆయా తాలుకా కేసుల్లో బాధిత బాలికలకు సత్వర న్యాయం కూడా అందడం లేదు. ఇక్కడ గర్ల్ చైల్డ్ ఫ్రెండ్లీ న్యాయవ్యవస్థను రూపొందించడంపై దృష్టి సారించి ఆ దిశగా వారికి న్యాయం సత్వరం అందే యత్నం చేయాల్సి ఉంది. అలాగే క్షీణిస్తున్న పిల్లల లింగ నిష్పత్తిని (సీఎస్ఆర్) సమస్యను పరిష్కరించే దిశగా 2015న హర్యానాలోని పానిపట్లో ప్రధానమంత్రి బేటి బచావో బేటీ పఢావో(బీబీబీపీ)ని ప్రారంభించారు. ఇది ఇది మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య -కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే జాతీయ కార్యక్రమం. దీనితో భ్రూణ హత్యలకు అడ్డుకట్టవేసి, వారికి విద్యా అవకాశాలు అందేలా చేయమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఒక రకంగా బాలికల మనుగడకు, అభివృద్ధికి తోడ్పాటునిచ్చే అద్భుతమైన కేంద్ర పథకం ఇది. అలానే ఇలాంటి ఎన్నో బాలికల సంక్షేమానికి పెద్ద పీట వేసేలా ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో.. మహిళలు, చిన్న పిల్లల అభివృద్ధికి సంబంధించిన పథకాలు, స్త్రీ సంక్షేమ పథకాలు, కౌమర బాలికలు పథకం వంటివి తీసుకొచ్చింది. మహిళ సాధికారతకు, లింగ సమానత్వానికి పెద్ద పీట వేసింది. అంతేగాదు ఈ దినోత్సవం పేరుతో ఆడపిల్లల హక్కులు, స్త్రీ విద్య, ఆరోగ్యం, పోషకాహారం గురించి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకోస్తున్నారు కూడా. అయితే లింగ వివక్ష ఇంకా ఎక్కువగానే ఉంది. మహిళలు, బాలికలు జీవితాంత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా. అది సమూలంగా తొలిగి దేశంలో ఆడపిల్లలు వారి హక్కులు, గౌరవం, విలువను పొందేలా చేయగలిగేతే దేశం మరింత అభివృద్ధిని సాధించనట్లే. (చదవండి: జాతీయ బాలికా దినోత్సవం 2024: ఎదగాలి.. చదవాలి!) -
గ్రామీణ బాలికలు.. డాక్టరమ్మలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల బాలికలు ఎక్కువగా వైద్య రంగం వైపే చూస్తున్నారు. 14.2 శాతం మంది డాక్టర్ కావాలనుకుంటే, మరో 25.2 శాతం మంది నర్స్ అవుదామని ఉందని చెప్పారు. అదే మగపిల్లల్లో డాక్టర్ కావాలనుకుంటున్నవారు 4.7 శాతం మందేకావడం గమనార్హం. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా చూసినా.. బాలికలు డాక్టర్, నర్స్ లేదా టీచర్ కావాలని కోరుకుంటే, బాలురు పోలీసు, ఇంజనీరింగ్, ఆర్మీ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 26 రాష్ట్రాల్లో సర్వే చేసి.. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల పరిధిలో ఉన్న 1,664 గ్రామాల్లో 34,745 మంది 14–18 ఏళ్ల మధ్య వయసున్న బాలురు, బాలికలపై ఈ సర్వే చేశారు. వారి ఉద్యోగ/ఉపాధి ఆశలు, విద్యా ప్రమాణాలు, డిజిటల్ స్కిల్స్, చదువు ను నిజజీవితంలో ఏమేరకు అమలు చేస్తున్నా రనేది పరిశీలించారు. స్కూళ్లు, కాలేజీల్లో చదు వుతున్నవారితోపాటు బయటివారినీ ప్రశ్నించా రు. మొత్తంగా త్వరగా జీవితంలో స్థిరపడాలనేది చాలా మంది ఆలోచనగా ఉందని, ఆ ప్రకారమే ఉద్యోగం/ఉపాధిపై దృష్టిపెడుతున్నారని కేంద్ర నివేదిక పేర్కొంది. లాక్డౌన్ సమయంలో కష్టాలు ఎదుర్కొన్నందున ప్రభుత్వ ఉద్యోగంపై చాలా మంది మక్కువ చూపిస్తున్నట్టు తెలిపింది. మహిళలు చదువుకున్నా ఇంటి పని తప్పదన్న ఉద్దేశంతో.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించింది. హోటల్ మేనేజ్మెంట్, టైలరింగ్, బ్యూటీ పార్లర్, వ్యవసాయం వంటి వాటిపై దృష్టిసారిస్తామని బాలికలు పేర్కొన్నట్టు తెలిపింది. లెక్కలు, ఇంగ్లిష్లో వెనుకబాటు తెలంగాణ గ్రామీణ యువతలో 14–18 ఏళ్ల వయసు వారిలో కూడికలు, తీసివేతలు వంటి లెక్కలు చేయగలిగినవారు 21.5 శాతమేనని కేంద్ర నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్పై కనీస అవగాహన ఉన్నవారు 41 శాతమేనని తెలిపింది. ఇక రాష్ట్రంలో పనిచేయడానికి ఆసక్తి చూపనివారిలో బాలురు 18 శాతం, బాలికలు 11.7 శాతం ఉన్నారు. పనిపై ఆసక్తి చూపనివారి విషయంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఈ అంశంలో దేశ సగటు రెండు శాతమే. ఉద్యోగ భద్రతకే గ్రామీణ యువత మొగ్గు ‘‘గ్రామీణ యువత జీవితంలో త్వరగా స్థిరపడాలని, ఉద్యోగ భద్రత కావాలనే ఆలోచనలో ఉన్నట్టు కేంద్ర నివేదిక చెప్తోంది. దానికి తగ్గట్టుగానే చాలా మంది పనిని ఎంచుకుంటున్నారు. అయితే సమాజ అవసరాలు కూడా ముఖ్యమే. పరిశోధనలు, ఉన్నత విద్య, వైద్య రంగంలో స్థిరపడటంలో ఆలస్యం కారణంగా తక్కువ మంది వాటివైపు వస్తున్నారు. పనిచేయడానికి ఆసక్తి చూపనివారూ ఎక్కువగా ఉండటం వెనుక కారణాలను అన్వేషించాలి. – డాక్టర్ కిరణ్ మాదల, సైంటిఫిక్ కన్వీనర్, ఐఏఎం, తెలంగాణ -
9వ తరగతి బాలిక.. తల్లయింది!
బాగేపల్లి: లోకమంటే ఏమిటో తెలియని పసివయసులోనే మరో పసిబిడ్డను పోషించాల్సిన దుస్థితి ఆమెకు దాపురించింది. ఆ చిన్నారి వయసు 14 ఏళ్లు, చదివేది 9వ తరగతి. తల్లి అంగనవాడి కార్యకర్త, తండ్రి రైతు. తాము ఇంటి వద్ద సక్రమంగా ఉండము కాబట్టి చదువుకు ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. అదే ఆ కుటుంబానికి శాపంగా మారింది. బాలికను ఎవరో దుండగుడు లోబర్చుకోగా గర్భం దాల్చి ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన అమానవీయమైన సంఘటన బాగేపల్లి తాలూకాలో జరిగింది. అందరిలో అయోమయం బాగేపల్లికి దగ్గరలోని బాలికల సంక్షేమ శాఖ హాస్టల్లో ఉంటూ బాలిక 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పి అని బాలిక ఇటీవల ఇంటికి రాగా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు ఇంజెక్షన్ వేసి కొన్ని మాత్రలిచ్చారు. ఇంటికి వచ్చిన మరో రెండు గంటల్లో మళ్లీ కడుపు నొప్పి వచ్చిందని చెప్పడంతో తాలూకా ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పరిశీలించి బాలిక నిండు గర్భిణి అని, ఇవి ప్రసవం నొప్పులు అని తెలిపారు. కాన్పు చేయగా బాలికకు మగబిడ్డ పుట్టాడు. చిన్నారి చేతిలో పసిబిడ్డను చూసిన వైద్యులు, తల్లిదండ్రులు, స్థానికులు ఏం జరిగిందోనని తీవ్ర అయోమయానికి గురయ్యారు. బాలికల హాస్టల్లో బాలికకు గర్భం ఎలా వచ్చిందని అటు తల్లిదండ్రులు, ఇటు వైద్యులకు అర్థం కాలేదు. బాలికకు పుట్టిన శిశువు 2.2 కేజీల బరువుంది. పోక్సో కేసు నమోదు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని తాలూకా వైద్యాధికారి డాక్టర్ సి.ఎన్. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. బాలిక తల్లి అంగనవాడి టీచర్ కాగా, నిత్యం ఎంతోమంది గర్భవతులు, బాలింతలకు పోషకాహారం అందిస్తూ ఆరోగ్య మెళకువలను చెబుతూ ఉంటుంది. అలాంటిది సొంత కూతురి పరిస్థితిని గమనించలేకపోవడం గమనార్హమని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగేపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, హాస్టల్ వార్డెన్, ఇతర ఇబ్బందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక, శిశువు ఆస్పత్రిలో ఉన్నారు. వారి ఆరోగ్యానికి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన తాలూకావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్!
ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాంప్లో మొత్తం 2,274 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. వీరిలో యువతుల భాగస్వామ్యం అధికంగా ఉండనుంది. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ ఈ వివరాలను తెలియజేశారు. ఎన్సీసీలో యువతుల భాగస్వామ్యం ప్రతి సంవత్సరం పెరుగుతోందని అన్నారు. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శిబిరానికి హాజరవుతున్న క్యాడెట్లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్కు చెందిన 122 మంది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 177 మంది ఉన్నారని సింగ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 45 మంది యువతుల బృందం తొలిసారిగా ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్లో పాల్గొంటున్నదన్నారు. వీరి బ్యాండ్ తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో అలరించనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ టీమ్, బెస్ట్ క్యాడెట్, హార్స్ రైడింగ్ మొదలైన పోటీలు నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు. కాగా 2023లో దాదాపు నెల రోజులపాటు జరిగిన ఎన్సీసీ శిబిరంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 710 మంది యువతులతో సహా మొత్తం 2,155 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయబోతున్నాయి. ఒక్కో బృందంలో 144 మంది మహిళా సైనికులు ఉండనున్నారు. వీరిలో 60 మంది ఆర్మీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి చెందిన వారు ఉంటారని రక్షణ అధికారులు తెలిపారు. ఈ బృందంలో నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన మహిళా అగ్నివీర్ సైనికులు కూడా ఉండనున్నారు. -
శానిటరీ నాప్కిన్ల పంపిణీలో ఏపీ అగ్రగామి
సాక్షి, అమరావతి: ఆడబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారిపట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మెన్స్ట్రువల్ హైజీన్ (నెలసరి పరిశుభ్రత) కార్యక్రమం అమలులో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ లోక్సభలో వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య 72.59 లక్షల నాప్కిన్లను పంపిణీ చేసి పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా.. 59,63,209 శానిటరీ నాప్కిన్ల పంపిణీతో ఏపీ రెండో స్థానంలో ఉంది. అనంతరం.. 45.86 లక్షలతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచింది. ఇక కేరళలో 80,166, కర్ణాటకలో కేవలం 5,613, తెలంగాణలో 3,920 మాత్రమే పంపిణీ చేశారు. కేటాయించిన నిధుల ఖర్చులో నెంబర్ వన్.. ఇక నెలసరి పరిశుభ్రత కార్యక్రమాలు అమలుచేయడం ద్వారా భవిష్యత్తులో బాలికలు అనారోగ్య సమస్యల బారినపడకుండా నియంత్రించేందుకు కేటాయించిన నిధులను ఖర్చుచేయడంలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల మేర నిధులు కేటాయించడమే కాకుండా దేశంలోనే అత్యధికంగా వంద శాతం నిధులను ఖర్చుచేసింది. పశ్చిమ బెంగాల్లో రూ.389 కోట్లు కేటాయించగా కేవలం రూ.9.32 కోట్లు, తెలంగాణాలో రూ.303 కోట్లు కేటాయించినప్పటికీ రూ.4 లక్షలు మాత్రమే ఖర్చుచేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు.. నెలసరి ఇబ్బందులతో బాలికలు విద్యకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. దేశంలో దాదాపు 23 శాతం బాలికల చదువులు ఆగిపోవడానికి ప్రధాన కారణం నెలసరి సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులేనని యునైటెడ్ నేషన్స్ వాటర్ సఫ్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికల్లో వెల్లడించారు. ఈ తరహా డ్రాపౌట్స్ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మిడియట్ చదువుతున్న 10 లక్షల మంది బాలికలకు ప్రతినెలా ఒకొక్కరికి 10 చొప్పున నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార దశ క్లినిక్లు.. ఇక కౌమార దశలో బాలబాలికలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి, వారికి వైద్యసేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రత్యేకంగా స్నేహపూర్వక కౌమార క్లినిక్లు నిర్వహిస్తున్నారు. క్లినిక్లలో సేవలు అందించే వైద్యులు.. కౌమార దశ పిల్లలపట్ల ఏ విధంగా వ్యవహరించాలి.. తదితర అంశాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. అంతేకాక.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానంలో గ్రామాలకు వెళ్లిన డాక్టర్లు మధ్యాహ్నం నుంచి పాఠశాలలు సందర్శించి అక్కడి బాలికల ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, మహిళా అధ్యాపకులు, గ్రామ సచివాలయాల్లోని ఏఎన్ఎంలు ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలు.. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల్లో చాలావరకు మధ్యతరగతి, పేద కుటుంబాల వారుంటారు. వీరికి శానిటరీ నాప్కిన్లు కొనే ఆర్థిక స్థోమత ఉండదు. దీంతో.. ► నెలసరి సమయంలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్ఫన్లు (జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు–ఆర్టీఐ) వస్తాయి. ► అలాగే.. సాధారణంగా జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్ది మోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్రమైన పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడిన తర్వాత కాలంలో సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. ► అంతేకాదు.. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది. భవిష్యత్లో సంతానలేమి సమస్యలూ తలెత్తుతాయి. -
అయినవారిపైనే అకృత్యాలు
ఆఫీస్ పని ముగించుకుని ధరణి (పేరు మార్చాం) ఇంటికెళ్లింది. భర్త పవన్ ఓ పెద్దాయనతో మాట్లాడుతున్నాడు. ఆ పెద్దాయన ఎవరా అనుకుంటూ గదిలోకి వెళ్లబోయింది ధరణి. ఇంతలో భర్త పవన్.. ‘ధరణీ.. ఈయన నీకు మావయ్య అవుతారట. చిన్నప్పుడు మీ ఇంటి పక్కనే ఉండేవారట. నువ్వు ఈయన చేతుల్లోనే పెరిగావట. ఈ ఊళ్లో బంధువుల ఇంటికి వచ్చారట. నువ్వు ఇక్కడే ఉంటున్నావని తెలిసి చూసి పోదామని వచ్చారట’ అన్నాడు. ధరణి లోనికి వెళ్లిపోయింది. చిన్ననాటి ఘటనలు ఆమె కళ్లముందు కదలాడాయి. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు.. పక్కింట్లో ఉండే ఆ పెద్దాయన తనను ఆడించేవాడు. ఆ ముసుగులో ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేవాడు. అలా రోజురోజుకు అతడి అకృత్యాలు పెరుగుతూ వచ్చాయి. ఆ విషయాలు గుర్తొచ్చి ధరణి వళ్లు జలధరించింది. కళ్లు కోపంతో ఎరుపెక్కాయి. ఆ పెద్దాయనకు భార్య కాఫీ తీసుకొస్తుందనుకున్నాడు పవన్. ఎంతసేపటికీ ధరణి బయటకు రాలేదు. ‘తనకు నేను గుర్తు రాలేదనుకుంట’ అంటూ ఆ పెద్దాయన మెల్లగా జారుకున్నాడు. ధరణి లాంటి బాలికలు, మహిళలు తెలిసిన వారి చేతిలోనే అత్యాచారాలకు గురవుతున్నారని జాతీయ నేర గణాంకాల సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. సాక్షి, అమరావతి: కుటుంబ సభ్యులు.. బంధువులు.. స్నేహితులు.. సహోద్యోగులు.. సోషల్ మీడియా ఫ్రెండ్స్.. అందరూ తెలిసినవారే. కానీ.. అందరూ తమ మంచి కోరుకునే వారేనని బాలికలు, మహిళలు అనుకుంటే పొరపాటే. బాగా తెలిసిన ఆ గోముఖాల మాటున ఎన్నో వ్యాఘ్రాలుంటాయి. అవకాశం చిక్కితే.. ఒంటరిగా ఉంటే కబళించేందుకు ఏమాత్రం వెనుకాడవు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక మరోసారి ఈ విషయంలో బాలికలు, మహిళలను అప్రమత్తం చేస్తోంది. దేశంలో బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిలో అత్యధికులు వారికి బాగా తెలిసిన వారేనని నివేదిక వెల్లడించింది. ఏకంగా 96 శాతం అత్యాచార కేసుల్లో దోషులు బాధిత మహిళలకు బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారు, సహోద్యోగులేనని సవివరంగా నివేదించింది. 2022లో దేశంలో మహిళలపై అత్యాచారాలకు సంబంధించి ఎన్సీఆర్బీ తాజాగా విడుదల చేసిన ఈ నివేదిక విస్మయపరిచే వాస్తవాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా సగటున రోజుకు 88 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారని ఆ నివేదిక తెలిపింది. స్నేహం.. ప్రేమ.. పెళ్లి పేరిట 2022లో దేశవ్యాప్తంగా 31,516 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వాటిలో 14,582 కేసుల్లో స్నేహం, ప్రేమ, పెళ్లి పేరిట నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డారు. 248 కేసుల్లో లైంగిక దాడి / సామూహిక లైంగిక దాడి, హత్యలకు బరితెగించారు. ఈ కేసుల్లో మొత్తం 29,900 మంది దోషులుగా తేలారు. వారిలో ఏకంగా 28,873 మంది లైంగిక వేధింపులకు గురైన బాలికలు, మహిళలకు తెలిసిన వారే అకృత్యాలకు పాల్పడటం గమనార్హం. కేవలం 1,027 మంది మాత్రమే బాధిత మహిళలకు ఏమాత్రం పరిచయం లేనివారు లేదా ఇప్పటికీ ఇంకా గుర్తించనివారు ఉన్నారు. అత్యధికంగా రాజస్థాన్లో.. దేశంలో విస్తీర్ణం, జనాభా పరంగా పెద్ద రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన 13 రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాల్లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో అత్యాచార కేసుల్లో 5,399 మంది దోషులుగా అభియోగాలు నమోదదయ్యాయి. వారిలో బాధిత మహిళలకు తెలిసిన వారు 5,131 మంది ఉన్నారు. పెద్ద రాష్ట్రాల్లో నమోదైన అత్యాచార కేసుల్లో తెలంగాణ 814 మంది నిందితులతో 12వ స్థానంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ చివరి (15వ స్థానం)లో ఉంది. 2022లో ఏపీలో అత్యాచార కేసుల్లో 621 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో బాధిత మహిళలకు తెలిసిన వారే 604 మంది ఉన్నారు. వారిలో కుటుంబ సభ్యులు 39 మంది, స్నేహితులు, విడిపోయిన భర్తలు 294 మంది, కుటుంబ స్నేహితులు, ఇరుగుపొరుగు వారు, సహోద్యోగులు 271 మంది ఉన్నారు. అవగాహన పెంపొందించాలి బాగా పరిచయం ఉన్నవారే బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారిలో కుటుంబ సభ్యుల నుంచి సహోద్యోగుల వరకు ఉంటున్నారు. బాలికలు, మహిళల్లో సరైన అవగాహన పెంపొందిచడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం. ప్రధానంగా బాలికలతో తల్లిదండ్రులు వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. లైంగిక దాడులకు గురికాకుండా ఉండేలా అవగాహన కల్పించాలి. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి తెలియజేయాలి. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నిస్తే వెంటనే ప్రతిఘటించేలా.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలనే అవగాహన పెంపొందించాలి. సోషల్ మీడియాలో స్నేహాలు, ఆన్లైన్ ఛాటింగ్లలో విషయంలో తగిన పరిధిలో ఉండటం, అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఇబ్బందికర పరిస్థితులు తెలెత్తితే వెంటనే రక్షణ ఎలా పొందాలన్నది బాలికలకు, మహిళలకు తెలియజేయాలి. మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ వంటి వాటిని సద్వినియోగం చేసుకోవడంపై అవగాహన కల్పించాలి. – కేజీవీ సరిత, ఎస్పీ, మహిళా భద్రత విభాగం, సీఐడీ -
డీ అడిక్షన్ సెంటర్ నుంచి 13 మంది యువతులు పరార్..
హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాకు చెందిన పర్వానూలో డీ అడిక్షన్ సెంటర్ (మత్తు పదార్థాల వినియోగం నుంచి విముక్తి కల్పించే సంస్థ) నుంచి 13 మంది యువతులు పారిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం చెలరేగింది. అనంతరం బాలికలను అడవిలో గుర్తించి, రక్షించారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పర్వానూలోని ఖాదిన్ గ్రామంలో డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ ఉంది. ఇక్కడ మొత్తం 17 మంది బాలికలు చికిత్స పొందుతున్నారు. శనివారం 13 మంది బాలికలు సెంటర్లోని కిటికీ అద్దాలు పగులగొట్టుకుని, బయటపడి సమీపంలోని అడవిలోకి పారిపోయారు. అయితే డి-అడిక్షన్ సెంటర్ సిబ్బంది పోలీసుల సహకారంతో ఈ యువతులను వెదికిపట్టుకుని తిరిగి సెంటర్కు తరలించారు. ఈ ఘటన డీ అడిక్షన్ సెంటర్ల పనితీరుపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ సెంటర్లో పంజాబ్ హర్యానాలకు చెందిన యువతులు చికిత్స పొందుతున్నారు. పంజాబ్లో డీ-అడిక్షన్ సెంటర్లపై నిషేధం విధించిన తర్వాత మత్తుమందు బాధితులు చికిత్స కోసం హర్యానా, హిమాచల్లకు వస్తున్నారు. అయితే హిమాచల్లో డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభించినప్పటి నుండి ఈ సెంటర్లలో పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు వెలువడుతున్నాయి. కాగా డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్ల నుంచి పారిపోయిన యువతులు.. పోలీసుల విచారణలో తమకు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం లేదని అందుకే పారిపోయామని ఫిర్యాలు చేశారు. ఈ ఉదంతంపై విచారణ జరుపుతున్నట్లు స్థానిక ఎస్పీ సోలన్ తెలిపారు. ఇది కూడా చదవండి: కొత్త ఏడాదిలో నూతన ఎక్స్ప్రెస్వే.. నాలుగు రాష్ట్రాలకు నజరానా! -
ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే..!
ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కొన్ని విషయాల్లో బిడియం, సిగ్గుతో వెనకబడే ఉన్నారు స్త్రీలు. ముఖ్యంగా పీరియడ్స్, లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయం. ఎవరిదైనా బ్రా, పెట్టీకోట్లు కొద్దిగా బయటకు కనిపిస్తుంటే... చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలా మాట్లాడ్డానికి ఇబ్బంది పడే అంశాన్నే కెరీర్గా ఎంచుకుంది రిచాకర్. అమ్మాయిల నుంచి మహిళలు ధరించే ‘బ్రా’ల బ్రాండ్ను ఎంతో ధైర్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎటువంటి బిడియం లేకుండా తీసుకొచ్చిన ఈ బ్రాండ్ నేడు కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోంది. జంషెడ్పూర్లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది రిచాకర్. తండ్రి టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించే మనస్తత్వం రిచాది. డిగ్రీ అయ్యాక ఐటీ కంపెనీలో కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసింది. శాప్ రిటైల్ కన్సల్టింగ్, స్పెన్సర్స్లో ఉద్యోగం చేశాక... సొంతంగా వ్యాపారం చేయాలన్న కోరికతో నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసింది. ఒకపక్క ఉద్యోగానుభవం, మరోపక్క మేనేజ్మెంట్ స్టడీస్ ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో సొంతంగా వ్యాపారం పెట్టడానికి పూనుకుంది. ఇందుకోసం మహిళల లోదుస్తుల వ్యాపారం ఎంచుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ‘‘సమాజంలో లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయడతారు. ఈ వ్యాపారం అవసరమా? వద్దు’’ అని నిరుత్సాహపరిచారు. తల్లిదండ్రులు అలా చెప్పినప్పటికీ రిచా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాపారం ప్రారంభ పనుల్లో మునిగిపోయింది. రేడియంట్ మి మహిళలు ధరించే బ్రాలను సొంతంగా డిజైన్ చేసి, తయారు చేసి, విక్రయించడంపై దృష్టిపెట్టింది. కొన్నిరోజులకి తన పనిమీద నమ్మకం ఏర్పడడంతో 2011లో ‘జివామే’ పేరుతో బ్రా బ్రాండ్ను ఏర్పాటు చేసింది. జివామే అంటే హిబ్రూలో ‘రేడియంట్ మి’ అని అర్థం. కాలేజీ అమ్మాయిల నుంచి పిల్ల తల్లుల వరకు అందరూ సౌకర్యంగా ధరించే బ్రాలను విక్రయించడం మొదలు పెట్టింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఐదువేల డిజైన్లు, యాభై బ్రాండ్లు వంద రకాల సైజుల్లో లోదుస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా అందిస్తోంది జివామే. డైరెక్టర్గా... కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోన్న సమయంలో కొన్ని కారణాలతో 2017 సీఈవో పదవి నుంచి తప్పుకుని, డైరెక్టర్గా కొనసాగుతోంది రిచా కర్. ప్రస్తుతం రిచా నెట్ వర్త్ దాదాపు 750 కోట్లు ఉండొచ్చని అంచనా. మంచి లాభాల్లో దూసుకుపోతోన్న జివామే బ్రాండ్ను 2020 లో రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. తన కలను నిజం చేసుకున్న 43 ఏళ్ల రిచా కర్ ప్రస్తుతం తన భర్త కేదార్ గవాన్తో కలిసి అమెరికాలో నివాసముంటోంది. ‘‘ ఒక స్త్రీ మనసును మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకుంటుంది. అందుకే మూసపద్ధతులను దాటుకుని మహిళలు సౌకర్యంగా ధరించే లో దుస్తుల బ్రాండ్ను తీసుకొచ్చాను. జివామేను మార్కెట్లోకి తేవడానికి, దానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకు రావడానికి చాలా సవాళ్లను, ఒత్తిళ్లనూ ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోబట్టే ఇవాళ ఈ స్థాయికి రాగలిగాను. ఇంట్లో... సమాజంలో మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. అయినా మన మీద మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడు అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు. మనసులో ఏదైనా నిర్ణయించుకుంటే అది కచ్చితంగా సాధించ గలుగుతారు’’ అని చెబుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది రిచాకర్. కోట్ల టర్నోవర్తో.. లోదుస్తులు ధరించిన మహిళలు సౌకర్యంగా... కాన్ఫిడెంట్గా ఉండడమే లక్ష్యంగా లోదుస్తులను అందుబాటులో ఉంచుతుండడంతో జివామే బ్రాండ్ మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడిదార్లను ఆకర్షించింది. దీంతో 2012లో మూడు మిలియన్ల డాలర్లు, మరుసటి ఏడాది ఇది రెట్టింపు అయ్యింది. 2015 నాటికి నలభై మిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ ఆరువందల కోట్లపైకి ఎగబాగి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (చదవండి: చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ ' ఇచ్చే శక్తిగా మార్చిన ఓ తల్లి కథ!) -
Dr. Neelima Arya: ‘షి నీడ్స్’ నీలిమ!
ఉరుకుల పరుగుల జీవితంలో మన ప్రయాసలే కనిపిస్తాయి. ఒకసారి ఆగి చుట్టూ చూస్తే.. ఇన్నాళ్లూ మనం మన కోసమే తప్ప చుట్టూ ఉన్న వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే స్పృహ కలుగుతుంది. కొందరు మనకెందుకులే అని మళ్లీ తమ పనుల్లో మునిగిపోతారు. డాక్టర్ నీలిమా ఆర్య లాంటివాళ్లు మాత్రం సున్నితమైన సమస్యలపై దృష్టి పెట్టి వాటికి సరైన పరిష్కారాలు వెదుకుతారు. హైదరాబాద్ వాసి నీలిమా ఆర్య నిరుపేద అమ్మాయిలకు లో దుస్తులను అందిస్తూ, శుభ్రతపైన అవగాహన కల్గిస్తూ వారి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఏడాదిలో రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నీలిమా ఆర్యను కలిసినప్పుడు ఆమెకు వచ్చిన ఈ ఆలోచన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘మా సొంతూరు బాపట్ల. అమ్మానాన్నలకు పెద్ద కూతురిని. ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ చేశాను. మా నాన్నగారు ఆర్మీ ఉద్యోగి కావడంతో నా చదువు అంతా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా భోపాల్లో జరిగింది. చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చాం. ఇక్కడ పదేళ్లపాటు ఇంగ్లిష్ లెక్చరర్గా వర్క్ చేశాను. ఆ తర్వాత తిరిగి భోపాల్కి వెళ్లాను. అక్కడ నుంచి సౌదీ గవర్నమెంట్కు ఆంగ్ల ప్రొఫెసర్గా వర్క్ చేశాను. ఆరేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి, మీడియా రంగంలో ఉండటంతో చాలా సామాజిక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. సమాజానికి నా వంతుగా ఏదైనా చేయాలనే తపన అప్పుడే మొదలైంది. అమ్మానాన్నల దేశ సేవ స్ఫూర్తి కూడా నాలో ఉండటం అందుకు కారణమై ఉంటుంది. ► ఐదు ప్రాజెక్ట్స్తో సేవా రంగం ఐదేళ్ల క్రితం ఐదు ప్రాజెక్ట్స్తో ‘యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా’ ఫౌండేషన్ను ప్రారంభించాను. దీంట్లో భాగంగా ఎవరూ ఆకలితో పడుకోకూడదు అనే ఆలోచనతో మొదటిది ఫీడ్ ద నీడ్ ప్రాజెక్ట్ చేశాను. రోడ్సైడ్ ఫ్రిడ్జ్లను ఏర్పాటు చేసి, నిరుపేదలకు ఆహారం అందేలా ఏర్పాటు చేశాం. ఆ తర్వాత ‘షీ నీడ్’ ద్వారా ముఖ్యంగా గ్రామీణ అమ్మాయిలకు, మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందజేశాం. ‘మిషన్ భద్రత’ పేరుతో ఒక్కో సెట్లో ఆరు నాణ్యమైన ఫ్యాబ్రిక్తో తయారుచేసిన లో దుస్తులను ఉంచి, ఏడాది నుంచి నిరుపేద అమ్మాయిలకు అందజేస్తున్నాం. వచ్చే ఏడాది వరకు రెండు లక్షల మంది అమ్మాయిలకు లో దుస్తులను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రముఖ డిజైనర్ రవిత మేయర్ ఈ లో దుస్తులను డిజైన్ చేస్తున్నారు. కొన్ని సేవాసంస్థల సహకారంతో ఇండియా మొత్తంలో ఎవరికి అవసరం ఉందో గుర్తించి, వారికి లో దుస్తులను అందజేస్తాం. వీటితర్వాత రైతులు, నిరుద్యోగులు, వయసుపైబడినవారి కోసం సాయం అందించాలనేది మా ఉద్దేశ్యం. ► లో దుస్తుల ప్రాముఖ్యత.. నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని, వారికి అత్యవసరంగా కావాల్సినవి ఏమిటి అనే ఆలోచనలు ఎప్పుడూ చేస్తుంటాం. షీ నీడ్ ప్రాజెక్ట్ లో భాగంగా భవన నిర్మాణాలు జరిగే చోట, స్లమ్స్లలో, కూలీల పిల్లలను చూసినప్పుడు వారికి లో దుస్తుల సమస్య ఉన్నట్టు గుర్తించాం. 3 నుంచి 13 ఏళ్ల అమ్మాయిల వరకు లో దుస్తుల గురించి సరైన అవగాహన చేయగలిగితే వారిలో పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీనిద్వారా భవిష్యత్తు తరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలం. అలాగే, శానిటరీ ప్యాడ్స్ వాడాలన్నా సరైన లో దుస్తులు ఉండాలి. నిజానికి గ్రామీణ అమ్మాయిలు, మహిళలకు సురక్షితమైన శానిటరీ ప్యాడ్స్, లో దుస్తులు అందుబాటులో ఉండవు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుందనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ఈ విషయాన్ని పదే పదే ఆ కుటుంబాలకు తెలియజేయడానికి కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నాం. ►సాధికారతలో భాగంగా.. ఆర్య రసోయి–క్లౌడ్ కిచెన్ ద్వారా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తున్నాను. ఎడ్యుకేటర్గా, అడ్మినిస్ట్రేటర్గా, ఆంట్రప్రెన్యూర్గా, ఇద్దరు పిల్లల తల్లిగా నా బాధ్యతలు కొనసాగిస్తూనే సమాజానికి నా వంతు సహకారాన్ని అందించాలనే లక్ష్యంతో కొనసాగతున్నాను. ధనం కన్నా ముందు జీవితాన్ని క్రమశిక్షణాయుతంగా మలుచుకోవడంలోనే విజయం దాగుంది అని నమ్ముతాను. ఆ క్రమశిక్షణే నన్ను నడిపిస్తుందని నమ్ముతాను’ అని వివరించారు నీలిమా ఆర్య. – నిర్మలారెడ్డి -
2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీకి ఈ నెల 25న జరగనున్న ఎన్నికలకు బీజేపీ గురువారం మేనిఫోస్టోను విడుదల చేసింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకిచ్చే వంటగ్యాస్ సిలిండర్పై రూ.450 చొప్పున సబ్సిడీ, వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పీఎం కిసాన్ యోజన కింద రైతులకిచ్చే ఆర్థిక సాయం పెంపు వంటివి ఇందులో ఉన్నాయి. ఈ మేరకు మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను బీ జేపీ చీఫ్ జేపీ నడ్డా గురువారం జైపూర్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు. సంకల్ప పత్రలోని మరికొన్ని హామీలు.. గోధుమలను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు బోనస్తో కలిపి క్వింటాలుకు రూ.2,700 చొప్పున కొనుగోలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంపు. ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్సీపీ)ను కేంద్రం సాయంతో నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడం. ఈ ప్రాజెక్టుతో 13 జిల్లాలకు తాగు, సాగునీటి సమస్య తీరుతుంది. మహిళలు, బాలికల కోసం... జిల్లాకో మహిళా పోలీస్ స్టేషన్. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా డెస్క్..ప్రతి నగరంలో యాంటీ రోమియో స్క్వాడ్ల ఏర్పాటు. లాడో ప్రోత్సాహన్ యోజన కింద పుట్టిన ప్రతి బాలిక పేరిట రూ.2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. లక్పతి దీదీ పథకం ద్వారా ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ. 12వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతిభావంతులైన బాలికలకు స్కూటీల పంపిణీ. పేద కుటుంబాల బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. రాష్ట్రంలో మూడు మహిళా బెటాలియన్ల ఏర్పాటు. పీఎం మాతృ వందన్ పథకం కింద అందించే ఆర్థిక సాయం రూ.5 వేల నుంచి 8 వేలకు పెంపు. యువత కోసం.. వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ పేద కుటుంబాల విద్యార్థులు పుస్తకాలు, దుస్తులు కొనుక్కునేందుకు ఏటా రూ.12 వేలు పంపిణీ. ప్రతి డివిజన్లో రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు. ఆరోగ్యరంగంలో.. భామాషా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా ఆరోగ్య రంగంపై రూ.40 వేల కోట్ల పెట్టుబడి కొత్తగా 15 వేల మంది వైద్యులు, 20 వేల పారామెడికల్ సిబ్బంది నియామకం. వీటితోపాటు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, జైపూర్ మెట్రో విస్తరణ, పారదర్శక బదిలీ విధానం, పేద కుటుంబాలకు ఉచిత రేషన్, దివ్యాంగులకు రూ.1,500 పింఛను, వృద్ధాప్య పింఛను పెంపు వంటివి ఉన్నాయి. ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 350 బిలియన్ డాలర్లకు పెంచుతామని వాగ్దానం చేసింది. జైపూర్, ఉదయ్పూర్, కోటా, అజీ్మర్, జోథ్పూర్, బికనీర్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడాన్ని కూడా మేనిఫెస్టో పేర్కొంది. ఓబీసీలకు నిర్ణిత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాల జారీ, వారికి రూ.15 వరకు విద్యారుణం. ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు. ఇవి కాకుండా, ఎస్సీ,ఎస్టీలు, గిరిజనులు, వీధి వ్యాపారులు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. -
కర్ణాటక కీలక నిర్ణయం: పరీక్షల్లో తలను కవర్ చేయడం నిషేధం..కానీ..!
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. నియామక పరీక్షల సమయంలో తలపై ధరించే అన్ని రకాల దుస్తులను నిషేధించింది. దీనికి సంబంధించి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ బోర్డు (KEA) కీలక అదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళన నేపథ్యంలో మంగళసూత్రాలు (వివాహిత హిందూ మహిళలు ధరించే నల్ల పూసల నెక్లెస్లు) మెట్టెలకు అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నియామక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. బ్లూటూత్ డివైసెస్ ద్వారా అభ్యర్థుల మాల్ప్రాక్టీస్లను అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం విధిస్తున్నట్టు కేఈఏ ప్రకటించింది. తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా టోపీ ధరించినవారికి పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదని కేఈఏ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష హాల్ లోపల ఫోన్లు ,బ్లూటూత్ ఇయర్ఫోన్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి ఉండదు. దీంతోపాటు మెటల్ ఆభరణాలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అయితే వివాహతులైన హిందూ మహిళలు, మంగళ సూత్రాలు, నల్ల పూసలు,మెట్టెలు ధరించవచ్చని ప్రకటించింది. డ్రెస్ కోడ్ నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్ను స్పష్టంగా పేర్కొననప్పటికీ తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారనున్నాయి. ఇది ఇలా ఉంటే అక్టోబర్లో జరిగిన రిక్రూట్మెంట్ పరీక్షల సందర్భంగా కేఈఏ హిజాబ్లను అనుమతించిన సంగతి గమనార్హం. అయితే బ్లూటూత్ పరికరాల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. 2023 అక్టోబర్లో KEA నిర్వహించిన పరీక్షల్లో కల్బుర్గి, యాద్గిర్ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు బ్లూటూత్ ఉపయోగించారన్న ఆరోపణలపై ప్రభుత్వం నవంబర్ 11న CID విచారణకు ఆదేశించింది. అంతకుముందు 2022లో, రాష్ట్రంలోని తరగతి గదుల్లో హిజాబ్ను నిషేధించడంపెద్ద దుమారాన్ని రేపింది. అయితే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ ఉత్తర్వును 10, 12వ తరగతి వంటి ఇతర బోర్డు పరీక్షలతో పాటు KEA నిర్వహించే సాధారణ ప్రవేశ పరీక్షలకు కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. -
ఇది మూణ్ణాళ్ళ కథ కాదు!
ప్రజల ఆరోగ్యం విషయంలోనూ పాలకులకు న్యాయస్థానాలు గడువు విధించాల్సి రావడం విచిత్రమే. అయితే, ఇప్పటికే అదే పనిలో ప్రభుత్వముంటే, త్వరితగతిన పనులు జరగడానికి ఈ గడువు విధింపు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. శానిటరీ న్యాప్కిన్ల పంపిణీపై దృష్టి పెడుతూ, జాతీయ స్థాయిలో ‘వాంఛనీయ’ ఋతుస్రావ కాల ఆరోగ్య విధానాన్ని 4 వారాల్లో ఖరారు చేయాలంటూ సుప్రీమ్ కోర్ట్ గత సోమవారం అన్నమాట అలాంటిదే. ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సగటున ఎంతమంది ఆడపిల్లలకు ఎన్ని మరుగుదొడ్లు ఉండాలన్న దానిపైనా జాతీయ స్థాయిలో ఒక మోడల్ను నిర్ణయించాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది.దాదాపు 37.5 కోట్ల మంది ఋతుస్రావ వయసువారున్న దేశంలో... 2011 నుంచి పెండింగ్లో ఉన్న కేసులో... దేశ ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశం మహిళా లోకానికి కొంత ఊరట. ఋతుస్రావ ఆరోగ్య ప్రాధాన్యాన్ని కోర్ట్ గుర్తించడం, ప్రస్తావించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఆ పని చేసింది. పట్టని ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. ఏడు నెలల క్రితం ఏప్రిల్లో కూడా ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో స్పందిస్తూ, ఋతుకాలపు ఆరోగ్యంపై ఏకరూప జాతీయ విధాన రూపకల్పనకు కేంద్రాన్ని సుప్రీమ్ ఆదేశించింది. తాజాగా, కోర్ట్లో ప్రభుత్వ వకీలు పేర్కొన్నట్టు జాతీయ విధానం ముసాయిదాను కేంద్రం ఇటీవలే ఆన్లైన్లో పెట్టింది. సామాన్య ప్రజల మొదలు నిపుణుల దాకా అందరి అభిప్రాయాలు కోరింది. తద్వారా ఋతుస్రావం పట్ల తరతరాలుగా మన దేశంలో నెలకొన్న అనేక అపోహలనూ, సవాళ్ళనూ నిర్వీర్యం చేయాలన్నది ప్రయత్నం. అర్ధంతరంగా బడి చదువు మానేయడం సహా అనేక సమస్యలకు కారణమవుతున్న ఈ ఆరోగ్య అంశం పట్ల దృష్టి పెట్టడానికి స్వతంత్ర దేశంలో ఏడున్నర దశాబ్దాలు పట్టింది. అలాగని అసలేమీ జరగలేదనలేం. కొన్నేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఋతుస్రావ కాల ఆరోగ్యం, పరిశుభ్రత (ఎంహెచ్హెచ్) పట్ల దృష్టి పెరుగుతోంది. భారత్లో సైతం ప్రజారోగ్య చర్చల్లో ఈ అంశాన్ని భాగం చేశారు. ‘జాతీయ ఆరోగ్య మిషన్ 2011’లో గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికల్లో ఋతుస్రావ కాలపు ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్లో దీన్ని చేర్చారు. కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ సైతం 2015లోనే పాఠశాలలకు మార్గ దర్శకాలు జారీచేసింది. దాని ఫలితాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల్లో కొంత కనిపించాయి. పీరియడ్స్ వేళ ఆరోగ్యకర మైన పద్ధతులను పాటించడమనేది మునుపటి సర్వేతో పోలిస్తే, అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో 15 నుంచి 24 ఏళ్ళ వయసు యువతుల్లో 20 శాతం పెరిగింది. ఇది కొంత సంతోషకరం. పైగా, ఐరాస పేర్కొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంహెచ్హెచ్ కూడా ఒకటనేది గమనార్హం. నిజానికి, ఆంధ్రప్రదేశ్లో ‘స్వేచ్ఛ’, కేరళలో ‘షీ ప్యాడ్’, రాజస్థాన్లో ‘ఉడాన్’ ఇలా రకరకాల పేర్లతో వివిధ రాష్ట్రాలు కౌమార బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తున్నాయి. దీర్ఘకాలిక వినియోగ నిమిత్తం కేరళ, కర్ణాటకలు న్యాప్కిన్లకు బదులు ఋతుస్రావ కప్స్ అందిస్తున్నాయి. అయితే, సమాజంలోని దురభిప్రాయాలను పొగొట్టడమనే సవాలు మిగిలే ఉంది. పన్నెండేళ్ళ సోదరి దుస్తుల మీద ఉన్న తొలి ఋతుస్రావ రక్తపు మరకలను చూసిన ఓ అన్నయ్య ఆమెను అనుమానించి, కొట్టి చంపిన ఘటన ఆ మధ్య మహారాష్ట్రలో జరిగింది. ఆడవారికే కాక, మగవారికి సైతం పీరియడ్స్ పట్ల అవగాహన పెంచాలంటున్నది అందుకే. ‘ఆ 3 రోజులు’ ఆడవారిని ప్రాథమిక వసతులైనా లేని గుడిసెల్లో విడిగా ఉంచే మహారాష్ట్ర తరహా అమానుష పద్ధతుల్ని మాన్పించడం లక్ష్యం కావాలి. ఋతుక్రమం అపవిత్రత కాదనీ, శారీరక జీవప్రక్రియనీ గుర్తెరిగేలా చేయాలి. తగిన ఎంహెచ్హెచ్ వసతులు లేకపోవడంతో ఏటా మన దేశంలో 2.3 కోట్ల మందికి పైగా బాలికలు అర్ధంతరంగా బడి చదువులు మానేస్తున్నట్టు సర్వేల మాట. సరిగ్గా చదువుకోని వారు ఋతుస్రావ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారన్నది దాని పర్యవసానం. అంటే, ఇది ఒక విషవలయం. దీన్ని ఛేదించాలి. బడిలో వసతులు పెంచడంతో పాటు జాతీయ విధానం ద్వారా ఆరోగ్యంలో, సామాజిక అనాచారాలను మాన్పించడంలో టీచర్లు కీలక పాత్ర పోషించేలా తగిన శిక్షణనివ్వాలి. విధానాల నిర్ణయం, కార్యక్రమాల రూపకల్పనలో తరచూ ఓ పొరపాటు చేస్తుంటారు. యువతుల మీదే దృష్టి పెట్టి, ఋతుక్రమం ఆగిపోయిన లక్షలాది మహిళల ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. అది మారాలి. మెనోపాజ్ అనంతర ఆరోగ్యం, అపోహల నివృత్తిపైనా చైతన్యం తేవాలి. ఆరోగ్య కార్యకర్తలకు అందుకు తగ్గ శిక్షణనివ్వాలి. ప్యాడ్ల పంపిణీతో బాధ్యత ముగిసిందను కోకుండా సంక్లిష్ట సామాజిక అంశాలపై జనచైతన్యం ప్రధానాంశం కావాలి. ఇన్నేళ్ళకు ఒక జాతీయ విధానం తేవడం విప్లవాత్మకమే కానీ దానితో పని సగమే అయినట్టు! గ్రామప్రాంతాల్లోనూ అందరికీ అందుబాటు ధరలో న్యాప్కిన్లుండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, నీటి వసతి బడిలో భాగం కావాలి. ఆరోగ్యం, ఆచారం లాంటి అంశాల్లో తరతరాలుగా సమాజంలో నెలకొన్న అభిప్రాయాలను పోగొట్టడం సులభం కాకపోవచ్చు. కానీ, అందుకు ప్రయత్నించకపోతే నేరం, ఘోరం. ఋతుస్రావ ఆరోగ్యంపై చైతన్యం తేవడంలో భారత్ మరింత ముందడుగు వేసేందుకు సత్వర జాతీయ విధానం తోడ్పడితే మేలు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సైతం ఏళ్ళు పూళ్ళు తీసుకొని, మరో అయిదేళ్ళ తర్వాత అమలు అంటున్న పాలక వర్గాలు ఆకాశంలో సగమనే ఆడవారి తాలూకు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వెంటనే పట్టించుకుంటే అదే పదివేలు. -
హమాస్ను మట్టికరిపించిన 13 మంది మహిళలు
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మొదట ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్పై క్షిపణులతో బాంబు దాడి చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ సైన్యం హమాస్ యోధులను భూ ఉపరితలంపై ఓడించింది. కాగా ఇజ్రాయెల్కు చెందిన ప్రత్యేక దళం కిబ్బట్జ్ నగరాన్ని హమాస్ యోధుల చెర నుండి విడిపించింది. ఈ దళంలో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉండటం విశేషం. వారికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబరు 7న హమాస్ యోధులు ఇజ్రాయెల్పై దాడి చేసినప్పుడు వారు ఇజ్రాయెల్లోని కిబ్బట్జ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరువాత ఇజ్రాయెల్ సైన్యం ఈ నగరాన్ని విడిపించే బాధ్యతను లెఫ్టినెంట్ బెన్ యెహుదా బృందానికి అప్పగించింది. ఈ టీమ్లో 13 మంది మహిళలు ఉన్నారు. ఈ 13 మంది కిబ్బట్జ్ నగరంలోకి ప్రవేశించి, హమాస్ యోధులను ఓడించారు. హమాస్ను అంతమొందించేందుకు ఇజ్రాయెల్ తన మొత్తం సైన్యాన్ని భూ ఉపరితలంపైకి దింపింది. ఈ సైన్యంలో దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వీరిలో దాదాపు పావువంతు మంది మహిళలే. గ్రౌండ్ జీరో వద్ద కూడా మహిళా సైనికులు హమాస్ యోధులతో భీకరంగా పోరాడుతున్నారు. అయితే లెఫ్టినెంట్ బెన్ యెహుదా బృందం కొన్ని గంటల్లో వంద మంది హమాస్ యోధులను హతమార్చింది. ఈ నేపధ్యంలో ఈ ఫోర్స్పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో పాటు, ఈ మహిళా యోధులను ఇజ్రాయెల్ సింహాలుగా పిలుస్తున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఇజ్రాయెల్- హమాస్ మధ్య 19 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 7,044 మంది మరణించారు. వీరిలో 1400 మంది ఇజ్రాయెల్కు చెందిన వారు కాగా, 6546 మంది గాజా స్ట్రిప్కు చెందిన వారు. గాజా స్ట్రిప్లో జరిగిన బాంబు పేలుళ్లలో మొత్తం 756 మంది మృతి చెందారు. ఇది కూడా చదవండి: చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్లు.. మహమ్మారులుగా మారనున్నాయా? -
గురుద్వారలో ఇద్దరు యువతుల వివాహం
చండీఘడ్లోని జలంధర్కు చెందిన ఇద్దరు యువతులు ఖరార్ (మొహాలీ)లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ఇద్దరికీ జీవిత భద్రత, స్వేచ్ఛను అందంచాలని జలంధర్ ఎస్ఎస్పీని ఆదేశించింది. ఈ పిటిషన్ను దాఖలు చేసిన ఆ ఇద్దరు యువతులు తాము ఒకరినొకరు ఇష్టపడ్డామని, అక్టోబరు 18న ఖరార్లోని గురుద్వారాలో వివాహం చేసుకున్నామని హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులు సంతోషంగా లేరని, తమ ప్రాణాలకు ముప్పు ఉందని, వారు కోర్టుకు అందించిన లేఖలో పేర్కొన్నారు. దీనికి ముందు ఆ యువతులు జలంధర్ ఎస్ఎస్పీకి లేఖ ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. వారి లేఖను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని జలంధర్ ఎస్ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. వారి ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? -
11,888 మంది బాలికలకు కన్య పూజలు
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో కూడా ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గొండాలో ఆడబిడ్డల ఆరాధన మహోత్సవం ‘శక్తి వందనం’ నిర్వహించారు. కార్యక్రమంలో 11,888 మంది బాలికలకు పూజలు చేసి, కన్యాభోజనం ఏర్పాటు చేశారు. షాహీద్-ఎ-ఆజం సర్దార్ భగత్ సింగ్ ఇంటర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఘనంగా ‘శక్తి వందనం’ వేడుకలను నిర్వహించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ నేహా శర్మ తెలిపారు. దేశంలోనే భారీ స్థాయిలో కన్యా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఘనమైన ఏర్పాట్లు చేయగా, 11 వేల 11,888 మందికి పైగా బాలికలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కన్యా పూజ వేడుకలో ‘జీరో వేస్ట్ ఈవెంట్’ కూడా నిర్వహించారు. ఈ భారీ కార్యక్రమంలో మొత్తం 138 కిలోల తడి చెత్త, సుమారు 70 కిలోల పొడి చెత్త ఏర్పడింది. ఈ వ్యర్థాలను అక్కడికక్కడే పూర్తిగా తొలగించేలా ఏర్పాట్లు చేశారు. తడి చెత్తను పారవేసేందుకు వేదిక వద్ద కంపోస్టు పిట్ను ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: టాయిలెట్కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి/చిలకలూరిపేట: బాలికల ఆరోగ్యంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. ప్రపంచ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ కింబెర్లీ– క్లార్క్ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు మంగళవారం ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్య, ఆరోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు ఈ సంస్థ 2.33 లక్షల శానిటరీ నాప్కిన్లు, 297 కేసుల డైపర్స్ను తొలి విడతలో పేద విద్యార్థులు, చిన్నారులకు అందజేసేందుకు ముందుకొచ్చింది. కార్య్రకమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ఏడో తరగతి నుంచి 12వ తరగతి లోపు ఆడపిల్లలకు స్వేచ్ఛ కార్యక్రమం కింద ప్రభుత్వం నెల నెలా 12 లక్షల శానిటరీ నాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేస్తోందన్నారు. హెల్త్ రికార్డులన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నామని మంత్రి రజిని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా వైద్యం పొందుతున్న అందరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. 1.6 కోట్ల కుటుంబాలకు ఈ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు. క్యాంపులకు హాజరైన వారిలో ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే అలాంటి వారిని పెద్దాస్పత్రులకు సిఫారసు చేస్తున్నామని చెప్పారు. వ్యాధి నయం అయ్యేంతవరకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని, కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి ప్రతి అంశంలోనూ బురదజల్లడమే పనిగా మారిందని మండిపడ్డారు. -
నేటి నుంచి జాతీయ చెస్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్: జాతీయ అండర్–11 చెస్ చాంపియన్షిప్ ఆదివారం విశాఖ పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆంధ్ర చెస్ సంఘం, ఆల్ విశాఖ చెస్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 27 రాష్ట్రాలకు చెందిన ఫిడే రేటింగ్ చిన్నారులు పోటీపడనున్నారు. పదకొండు రౌండ్ల పాటు సాగే ఈ పోటీలు 7వ తేదీతో ముగుస్తాయని ఆంధ్ర చెస్ సంఘం అధ్యక్షుడు కె.వి.వి.శర్మ తెలిపారు. విజేతకు రూ.70 వేల ప్రోత్సాహకం అందించనుండగా ఏడు నుంచి ఇరవై స్థానాల్లో నిలిచిన బాల బాలికలకు సైతం రూ.పదేసి వేల ప్రోత్సాహకం అందించనున్నామన్నారు. 386 మంది అండర్ 11 బాలబాలికలు పోటీ పడుతున్నారు. టోర్నీ టాప్ రేటింగ్తో కర్ణాటకకు చెందిన అపార్ పోటీ పడుతుండగా ఏపీ తరఫున అందాలమాల 17వ ర్యాంక్తో ఎత్తులు ప్రారంభించనున్నారు. -
జీడిమెట్లలో ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో చెప్పాపెట్టకుండా ఇద్దరు బాలికలు వెళ్లిపోయిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.పవన్ చెప్పిన వివరాల ప్రకారం.. చింతల్ ద్వారకానగర్కు చెందిన శ్రీనివాస్, విజయ్ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. శ్రీనివాస్ కుమార్తె దీక్షిత 9వ తరగతి, విజయ్ కుమార్తె పూజ పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ.. పొరుగు ఇళ్లలో ఉండటంతో స్నేహితులయ్యారు. పూజ రెండు రోజుల క్రితం వినాయక మండపం వద్దకు వెళ్లడంతో తల్లిదండ్రులు మందలించారు. మంగళవారం ఉదయం స్కూల్కు వెళ్లేందుకు యూనిఫాం వేసుకుంది. పాలు తాగుతుండగా అవి మీద పడటంతో డ్రెస్ మార్చుకుంది. పక్కింట్లో ఉండే దీక్షిత బయట నుంచి గడియపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరూ ప్రణాళిక ప్రకారమే 8 గంటల కంటే ముందే ఇళ్లలోంచి వెళ్లిపోయారు. దీక్షిత బాత్రూంకు గడియ పెట్టడం, పూజ డ్రెస్ మార్చుకోవడంపై అనుమానం వచి్చన ఇరువురి తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో జీడిమెట్ల పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఇద్దరు బాలికలు సికింద్రాబాద్లో రైలు ఎక్కి వరంగల్ వెళ్లినట్లు గుర్తించారు. వరంగల్ నుంచి ఆంధ్రాకు గాని చెన్నైకి గాని వెళ్లే అవకాశం ఉందని, ఓ బాలిక బంధువు సంగారెడ్డికి చెందిన యువకుడికి పూర్తి విషయాలు తెలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు యువకుడిని ప్రశ్నించేందుకు జీడిమెట్ల ఠాణాకు తీసుకువచ్చినట్లు సమాచారం. -
విద్యార్థినుల మృతితో రెండు గ్రామాల్లో విషాదం
నల్గొండ: నార్కట్పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన దొంతరబోయిన శివాని(18), అమ్మనబోలుకు చెందిన అనుగూతల మనీషా(18) నల్లగొండలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. శివాని, మనీషా ఇద్దరూ నార్కట్పల్లిలో ఇంటర్(బైపీసీ) ఒకే కళాశాలలో చదివారు. అప్పుడే వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఇంటర్ పూర్తయిన అనంతరం నల్లగొండలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీలో చేరారు. నల్లగొండలోనే ఎస్సీ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. నక్కలపల్లి గ్రామానికి చెందిన దొంతరబోయిన సైదులుకు ఒక కూతురు శివాని, ఒక కుమారుడు ఉన్నారు. తండ్రి గ్రామంలో వ్యవసాయకూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శివాని గ్రామంలోని హైసూ్కల్లో 10వ తరగతి వరకు చదివి ఇంటర్ నార్కట్పల్లిలో చదివింది. ఇదే మండలంలోని అమ్మనబోలు గ్రామానికి చెందిన ఎనుగుత్తల మల్లయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు కాగా.. మనీష రెండో కూతురు. ఆమె 10వ తరగతి వరకు గ్రామంలోని హైసూ్కల్లో, ఇంటర్ నార్కట్పల్లిలో చదివింది. తండ్రి రోజువారి కూలి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ‘నా బిడ్డను ఎవరో బెదిరించి సెల్ ఫోన్లో ఫొటోలు పెట్టారంట, అందుకే నా బిడ్డ గడ్డిమందు తాగి చనిపోయింది. నా బిడ్డను బెదిరించిన వాళ్లను పట్టుకోవాలి’ అని శివాని తల్లి రేణుక వేడుకుంది. ‘మా కూతురు కాలేజికి పోతున్నా అని పొద్దున్నే వెళ్లిపోయింది. నల్లగొండలో గడ్డిమందు తాగి చనిపోయింది. ఫోన్ చేసి నాకు ఏమో అవుతుందని చెప్పింది. అంతే తప్ప ఏమైందో తెలియదు’ అని మనీష తల్లిదండ్రులు మల్లయ్య, యాదమ్మ చెప్పారు. గ్రామాలకు చేరిన మృతదేహాలు శివాని, మనీషా మృతదేహాలకు బుధవారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తరువాత మధ్యాహ్నం వారి గ్రామాలకు తరలించారు. మృతదేహాలను చూడగానే కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. గ్రామస్తులు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. నక్కలపల్లిలో జరిగిన శివాని అంతిమ యాత్రలో ప్రజలంతా పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, మనీషా బాబాయ్ ముంబాయిలో ఉంటున్నందున ఆయన రాగానే మనీషా అంత్యక్రియలు అమ్మనబోలులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే పరామర్శ మృతుల కుటుంబ సభ్యులను ఆయా గ్రామాల్లో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లిఖార్జున్రెడ్డి పరామర్శించారు. మృతదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులరి్పంచారు. వీరి వెంట ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, సర్పంచ్లు ఈద మాదవి నర్సింహ్మ, బద్దం వరలక్ష్మి రాంరెడ్డి, ఎంపీటీసీలు కొంపెల్లి సైదులు, అంజయ్య, బాషపాక రవికుమార్ తదితరులు ఉన్నారు. -
Women : ఆడబిడ్డల ఆంధ్రా!
సాక్షి, అమరావతి: దేశంలో, రాష్ట్రంలో జననాల్లో బాలికల సంఖ్య పెరుగుతోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. దేశంలో ప్రతి వెయ్యి మంది బాలురకు 2022–23లో బాలికల నిష్పత్తి 15కు పెరగ్గా, రాష్ట్రంలో 24కు పెరిగింది. దేశం మొత్తంతోపాటు చాలా రాష్ట్రాల్లో గతంలో కన్నా జననాల్లో బాలికల నిష్పత్తి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే బిహార్తో పాటు మిజోరాం, నాగాలాండ్లలో గతం కన్నా బాలికల నిష్పత్తి తగ్గడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. బేటీ బచావో బేటీ పఢావో పథకం ద్వారా బాలికలు, మహిళా సాధికారతకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం కింద జనన సమయంలో లింగ నిర్ధారణను గుర్తించే చర్యలను ప్రభుత్వం నిలుపుదల చేసిందని, ఆడపిల్లల జననాల పట్ల అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టిందని తెలిపింది. ఆడపిల్లల అభివృద్ధికి ప్రోత్సాహం ఆడపిల్లల విద్య, పెరుగుదల, అభివృద్ధి, హక్కులకు మద్దతుగా సానుకూల చర్యలను ప్రోత్సహించడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ క్యాలెండర్ జారీ అయినట్లు తెలిపింది. దానిని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది. లింగ నిష్పత్తి తగ్గకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసినట్టు తెలిపింది. -
ఐదేళ్లలో 5,178 బాల్య వివాహాల నివారణ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాల్య వివాహాల నివారణకు చర్యలు తీసుకుంటున్నా ఇంకా 18 ఏళ్లు నిండని బాలికలు గర్భం దాల్చుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాల నివారణకు మరింత సమర్థంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 5,178 బాల్య వివాహాలను నివారించినప్పటికీ ఇంకా 8,496 మంది యుక్తవయసు బాలికలు గర్భం దాల్చినట్టు గర్భిణుల రిజి్రస్టేషన్లలో తేలిందన్నారు. అమ్మాయిలకు 18 ఏళ్లు నిండాక, 21 ఏళ్లు నిండిన అబ్బాయిలతో పెళ్లిళ్లు చేస్తేనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకెళ్లాలని సీఎస్ సూచించారు. ఏ గ్రామంలోనైనా బాల్య వివాహం జరిగితే సంబంధిత గ్రామ, వార్డు కార్యదర్శులను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్ ఆదేశించారు. ప్రకృతి సేద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా చర్యలు రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ జవహర్రెడ్డి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ప్రకృతి సేద్యం విస్తరణ, నిధుల సమీకరణ, ప్రకృతి సేద్యానికి సంబంధించి ప్రత్యేకంగా విశ్వ విద్యాలయం ఏర్పాటు అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. రైతులు ప్రకృతి సేద్యం విధానాన్ని పాటిస్తూ ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గిస్తే ప్రధాన మంత్రి ప్రాణం పథకం కింద పెద్ద ఎత్తున సబ్సిడీ పొందొచ్చన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యానికి సంబంధించి ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్, రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు. కాగా, కాకినాడ–శ్రీకాకుళం మధ్య ఏర్పాటు చేస్తున్న నాచురల్ గ్యాస్ పైపులైను పనులు వేగవంతం చేయాలని సీఎస్ ఆదేశించారు. సచివాలయంలో ఈ అంశంపై ఆయన అధికారులతో సమీక్షించారు. -
100 మందితో గర్ల్స్ హాస్టల్.. రాత్రుళ్లు 89 మంది మిస్సింగ్..
లక్నో: 100 మంది ఉన్నట్లు రిజస్టర్ చేసిన బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో రాత్రిళ్లు 89 మంది మిస్ అయ్యారు. ఈ మేరకు రాత్రిపూట అధికారులు తనిఖీలకు వెళ్లగా.. విషయం వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన బాలికలపై ప్రశ్నించగా.. హాస్టల్ వార్డెన్ సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని పరాస్పూర్ ప్రాంతంలో ఉన్న కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాలలో జిల్లా మెజిస్ట్రేట్ నేహా శర్మా సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. రిజిస్టర్లో 100 మంది పేర్లు నమోదు చేయగా.. కేవలం 11 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ వార్డెన్ సరితా సింగ్ సరైన సమాధానం ఇవ్వేలేకపోయారు. దీంతో దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా బేసిక్ శిక్షా అధికారి ప్రేమ్ చంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఓ టీచర్, హాస్టల్ వార్డెన్, వాచ్మెన్, ఓ జవాన్ పేర్లను నమోదు చేశారు. డిపార్టెమెంట్ కూడా సదరు వ్యవహారంపై చర్యలు తీసుకుంటోందని ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు. ఇదీ చదవండి: Onion Price Hike: ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
ఖరీదైన చాక్లెట్ చోరీ.. పరారైన అమ్మాయిల కోసం పోలీసుల గాలింపు!
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ఒక దొంగతనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు అమ్మాయిలు ఒక దుకాణంలో ఖరీదైన చాక్లెట్ చోరీ చేసి పరారయ్యారు. దుకాణదారు తెలిపిన వివరాల ప్రకారం ఆ చాక్లెట్ ఖరీదు రూ.500. ఈ ఘటన మొత్తం సీసీటీవీలొ రికార్డయ్యింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఈ చోరీ పట్టణంలోని డీడీ నగర్ గేట్ వద్దనున్న డిపార్ట్మెంటల్ స్టోర్లో జరిగింది. ఈ స్టోర్కు వచ్చిన నలుగురు అమ్మాయిలలో ఒక అమ్మాయి ఆ చాక్లెట్ను తన జీన్స్ ప్యాంటు జేబులో దాచుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమెతో పాటు మిగిలినవారు కూడా పరారయ్యారు. ఈ చాక్లెట్ చోరీ ఘటన స్టోర్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిలో ఆ ఆమ్మాయి చోరీ ఎలా చేసిందీ రికార్డయ్యింది. కౌంటర్లో డబ్బులు చెల్లించకుండా ఎలా తప్పించుకున్నదీ దానిలో రికార్డయ్యింది. వారు ఇక్కడికి సమీపంలోని ఏదో హాస్టల్కు చెందినవారిగా స్టోర్ యజమాని అనుమానిస్తున్నారు. దుకాణదారుని ఫిర్యాదు మేరకు మహరాజ్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ చాక్లెట్ ఖరీదు రూ. 500 ఉంటుందని దుకాణదారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు స్టోర్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయిల కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. -
లైంగిక వేధింపులు ధైర్యంగా ఎదుర్కోవాలి
బంజారాహిల్స్ (హైదరాబాద్)/సాక్షి, కామారెడ్డి: క్రీడారంగంలోనైనా, ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురవుతున్నట్టైతే ఆడపిల్లలు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన మార్షల్ ఆర్ట్స్ జాతీయ స్థాయి క్రీడాకారిణి సూచించారు. అదే సమయంలో క్రీడారంగంలోకి ఎంతో ఇష్టంగా వస్తున్న ఆడపిల్లలను వేధిస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీసే వారిపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఆమె అన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభించకపోగా, కొందరు అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు బాధిస్తున్నాయని చెప్పారు. ఆడపిల్లలు ఎందులోనూ త క్కువ కాదని, వారిని ప్రోత్సహించాల్సిందిపోయి వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటీవల హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. క్రీడాకారిణులు, ఆడపిల్లలు ఆత్మవిశ్వాసం, ధైర్యంతో వ్యవహరించినట్టైతే వేధింపులకు పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పవచ్చని చెప్పారు. తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని, అయితే తాను గట్టిగా హెచ్చరించి వేధింపుల నుంచి బయటపడ్డానని తెలిపారు. రాష్ట్ర క్రీడా మంత్రి పేషీలో పని చేసే ఓ వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నువ్వు క్యూట్గా ఉన్నావు..ఎప్పుడు కలుద్దాం అన్నాడు ‘బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో నివసించే క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేషీలో డేటాఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న సురేందర్ తాను మంత్రి పీఏనని నాకు చెప్పాడు. నాకు 2022 నవంబర్లో తైక్వాండ్లో సిల్వర్, చెస్ బాక్సింగ్లో బంగారు పతకం లభించాయి. ఈ విషయాన్ని మంత్రికి చెప్పాల్సిందిగా సురేందర్కు మెసేజ్ చేశా. గత ఏడాది జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆర్థిక సాయానికి సంబంధించిన సిఫార్సు లేఖ ఇవ్వడానికి మరోసారి మంత్రి క్వార్టర్స్కు వెళ్లా. ఇంగ్లాండ్లో జరిగిన పోటీలో పతకం లభించినప్పుడు కూడా మెసేజ్ చేశా. ఆయా సందర్భాల్లో సురేందర్ ‘నువ్వు చాలా అందంగా (క్యూట్గా) ఉంటావు. మనం ఎక్కడ కలుసుకుందామంటూ ప్రపోజల్ పెట్టాడు. అసలు విషయం పక్కన పెట్టి క్యూట్గా ఉన్నావు.. నన్ను కలుస్తావా..? నీ వయస్సెంత? అంటూ మెసేజ్లు పంపాడు. రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో ఇక లాభం లేదనుకుని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. తాను మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణిని అని, నాతో పెట్టుకుంటే బాగుండదని, బాడీలో ఏ ఒక్క పార్ట్ పనిచేయకుండా కొడతానని తీవ్రస్థాయిలో హెచ్చరించా. దీంతో సురేందర్ దారికొచ్చి క్షమాపణ చెప్పాడు. అప్పట్నుంచీ నాతో మర్యాదగానే ప్రవర్తించాడు..’ అని ఆమె తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే ఓ చానెల్లో మాత్రం (సాక్షి కాదు) తన అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్లు కథనం ప్రసారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
అమ్మాయిలు ఎన్ని రోజులకు ఐ లవ్ యూ చెబుతారు? ఆశ్చర్యపరుస్తున్న రిపోర్టు!
గర్ల్ఫ్రెండ్ తనబాయ్ ఫ్రెండ్కు ఐ లవ్ యూ చెప్పడానికి ఎన్నిరోజులు పడుతుంది? శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడు దేశాలకు చెందిన యువకుల నుంచి సమాధానాలు సేకరించిన పరిశోధకులు పలు విస్తుపోయే వివరాలను వెల్లడించారు. ఎవరైనా యువతి తన బాయ్ఫ్రెండ్కు ఐ లవ్ యూ చెప్పేందుకు 122 రోజులు తీసుకుంటుందని పరిశోధకులు తెలిపారు. యువకులు తమ ప్రేమను త్వరగా వ్యక్తం చేస్తారన్నారు. ఈ పరిశోధనను స్కాట్ల్యాండ్కు చెందిన ఎబర్ట్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. ది బ్రిటీష్ సైకలాజికల్ సొసైటీ ద్వారా వెలువడిన ఈ రిపోర్టులో విభిన్న సంస్కృతులు కలిగిన పలుదేశాల్లోని యువకుల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు. ఈ బృందం ఆస్ట్రేలియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఫ్రాన్స్,పోలాండ్,యూకేలకు చెందిన 3,109 మంది యువతీయువకులను ఈ పరిశోధనలో భాగస్వాములను చేసింది. వీరిలో 70 శాతం మంది యువతులు, 30 శాతం మంది యువకులు ఉన్నారు. వారి ముందు కొన్ని ప్రశ్నలను ఉంచి, వాటికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే వారు భాగస్వామికి ఎన్ని రోజులకు ఐ లవ్ యూ చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. 60 శాతం యువకులు తమ గర్ల్ప్రెండ్కు 69 రోజుల తరువాత ఐ లవ్ యూ చెప్పారని వెల్లడయ్యింది. యువతులతో పోలిస్తే యువకులు 15 రోజుల ముందుగానే తమ గర్ల్ఫ్రెండ్కు ఐ లవ్ యూ చెబుతుంటారని వెల్లడయ్యింది. యువతులు ఐ లవ్యూ చెప్పేందుకు కనీసంగా 77 రోజులు తీసుకుంటారని, గరిష్టంగా 122 రోజల సమయం తీసుకుంటారని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది కూడా చూడండి: సీమా హైదర్, అంజూ తరహాలో రాజస్థాన్ దీపిక.. భర్త, పిల్లలను వదిలేసి విదేశాలకు.. -
అందమైన భామలను తడిమి చూసి వదిలేసిన ఎలుగు.. తెలివితో తప్పించుకున్నారిలా!
ఎలుగుబంటి ఎంతో శాంతస్వభావం కలిగినదని చెబుతుంటారు. అయితే అది ఒక్కోసారి రెచ్చిపోయినప్పుడు దానిని ఆపడం ఎవరితరమూ కాదని కూడా అంటుంటారు. అయితే మీరు ఎప్పుడైనా అడవిమార్గం గుండా వెళ్లినప్పుడు ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలో తెలుసా? దాని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసా? సోషల్ మీడియాతో తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో అందమైన భామలు తాము ఎలుగుబంటి నుంచి ఎలా తప్పంచుకున్నదీ ఒక వీడియోలో చూపించారు. ఎలుగు ముంగిట చిక్కి, ఆపదలో ఉన్నవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడేలా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ముగ్గురు యువతులు రోడ్డుపక్కన ఉండటాన్ని గమనించవచ్చు. ఇంతలోనే వారి దగ్గరకు ఒక నల్లని ఎలుగుబంటి రావడాన్ని చూడవచ్చు. అది వారి దగ్గరకు వచ్చి, వారిని పట్టుకుంటుంది. అయితే ఆ యువతులు ఏ మాత్రం కంగారు పడకుండా కదలకుండా నిలుచునే ప్రయత్నం చేస్తుంటారు. దీంతో ఆ ఎలుగుబంటి ఆ అందమైన యువతుల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని భావించి, అక్కడి నుంచి కామ్గా వెళ్లిపోతుంది. ఈ వీడియోను ట్విట్టర్లో @CCTV IDIOTS పేరుతో షేర్ చేశారు. ఈ వీడియోకు క్యాప్షన్గా ‘ఎలుగుబంటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.. శాంతంగా, స్థిరంగా నిలుచోండి’ అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 269.4కేకు పైగా వీక్షణలు దక్కాయి. 3వేలకు పైగా లైక్స్ దక్కాయి. ఒక యూజర్ తన కామెంట్లో ఒకవేళ ఆ ఎలుగుబంటికి ఆ యువతుల స్మెల్ నచ్చకపోయి ఉంటే ఏమయ్యేదోనని అనగా, మరొకరు ఆ ఎలుగుబంటి వారిని కావలించాలనుకుంటోంది అని రాశారు. ఇది కూడా చూడండి: పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో! How to survive a bear attack… stand still and stay silent pic.twitter.com/zyE17dTbSv — CCTV IDIOTS (@cctvidiots) August 13, 2023 -
హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి
-
యూపీ స్కూల్ టీచర్
లక్నో: నిరుపేద యువతులు, మహిళల్లో రుతుస్రావంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ఉత్తరప్రదేశ్లో ఒక స్కూలు టీచర్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత డబ్బులతో ‘‘ప్యాడ్ బ్యాంక్’’ను ఏర్పాటు చేసి గ్రామంలో అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. బరేలి జిల్లా బొరియా బ్యాంకులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రాఖీ గంగ్వార్ తమ ఊళ్లో యుక్త వయసుకి వచి్చన అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో ఇంకా పాతకాలం పద్ధతుల్లో బట్టలనే వాడడం పట్ల ఆవేదనతో ఉండేవారు. వారిలో శానిటరీ ప్యాడ్స్పై అవగాహన పెంచడానికి స్కూల్లోనే ప్యాడ్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. తన సొంత డబ్బుతో ప్యాడ్స్ కొని ఆ బ్యాంకులో ఉంచుతున్నారు. అవి వాడడానికి ముందుకొచి్చన వారికి ఉచితంగా ఇస్తూ ఎలా వాడాలో నేరి్పస్తూ వారిలో అవగాహన పెంచుతున్నారు. మే 15న మదర్స్ డే సందర్భంగా ఈ బ్యాంక్ ప్రారంభించారు. మొదట్లో శానిటరీ ప్యాడ్స్ వాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో పరిశుభ్రత గురించి వివరంగా చెప్పాక ఒక్కొక్కరు వచ్చి ప్యాడ్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా ప్రస్తుతం ప్రతీ నెలా 150 వరకు మహిళలు ప్యాడ్ బ్యాంక్కి వస్తున్నారని రాఖీ గంగ్వార్ వివరించారు. -
ఫుల్లుగా తాగి ముగ్గురు అమ్మాయిల రచ్చ
-
బర్త్డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టూ జుట్టూ పట్టుకున్న యువతులు!
ఘనంగా బర్త్డే పార్టీ చేసుకుందామనుకున్న అమ్మాయిల బృందం ఒక హోటల్కు వెళ్లింది. అయితే బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య వివాదం తలెత్తింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దానిలో ఆ యువతులు ఎలా గొడవ పడ్డానేది కనిపిస్తోంది. ఈ ఉదంతం అమెరికాలో చోటుచేసుకుంది. ఈ వీడియోను విక్టర్ క్రిస్టియన్ పేరుతో టిక్టాక్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎంతో ఫన్నీగా కనిపిస్తున్న ఈ వీడియో నెటిజన్ల మధ్య చర్చకు తావిస్తోంది. కొంతమంది యువతులు భోజనం టేబుల్ వద్ద గొడవపడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్వైటీ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన బర్త్డే సందర్భంగా స్నేహితురాళ్లకు డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే బిల్లు రూ. 3 లక్షలు($4,600) దాటడంతో ఆ స్నేహితురాళ్ల మధ్య వివాదం చెలరేగింది. ఇంతలో ఒక యువతి ఈ భారీ బిల్లును సమానంగా పంచుకుని, ఎవరి పేమెంట్ వారు చేసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చింది. అయితే ఈ సూచన మిగిలిన స్నేహితురాళ్లకు ఏమాత్రం నచ్చలేదు. ఈ యువతుల వివాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన 28 ఏళ్ల విక్టర్ కూడా ఆ పార్టీలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ‘మేము ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే మా స్నేహం మునుపటిలా లేదు. అయితే త్వరలోనే ఇది సమసిపోతుందని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. పార్టీలో తాను స్ప్రైట్, కలామారి ఆర్డర్ చేశానని, వాటి ధర 25 డాలర్ల కన్నా తక్కువేనని, పార్టీలోని మిగిలినవారు ఖరీదైన ఆహార పదార్థాలు ఆర్డర్ చేశారని తెలిపింది. తాను బిల్లు షేర్ చేసేందుకు ఇష్టపడలేదని, ఎందుకంటే తాను తక్కువ ఆహారపదార్థాలనే ఆర్డర్ చేశానని తెలిపింది. ఇతరుల బిల్లు నేనెందుకు చెల్లించాలని ఆమె ప్రశ్నించింది. ఎవరు బర్త్డే పార్టీ ఇచ్చారో వారే బిల్లు చెల్లించాలని విక్టర్ డిమాండ్ చేసింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిని ప్రాంక్ అని అంటున్నారు. కొందరు ఆహారం ఆర్డర్ చేసేముందే బ్లిలు గురించి ఆలోచించాలని అంటుండగా, మరికొందరు డైనింగ్ టేబుల్ను క్రీడల మైదానంగా చేశారని కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఎత్తుకెళ్లిన విగ్రహాలన్నీ తిరిగి వస్తున్నాయి I went to a birthday dinner — and fought over splitting the $4.6K bill https://t.co/48P3UB3oAs pic.twitter.com/LPdjcBE55i — New York Post (@nypost) July 19, 2023 -
వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని
హోసూరు: యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సిఫ్కాట్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. పారిశ్రామిక ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకొని కొంత కాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి బృందావన్ నగర్ ప్రాంతంలో ఓ ఇంటిపై ఆకస్మిక దాడులు నిర్వహించగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రుజువైయ్యింది. నామక్కల్ జిల్లా తిరుచ్చంగోడు ప్రాంతానికి చెందిన వెంకటాచలం (56), భార్య మధుబాల (48)ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో.. గుట్కా, కారు సీజ్ హోసూరు: కర్ణాటక నుంచి కరూర్కు అక్రమంగా తరలిస్తున్న గుట్కాను సిప్కాట్ పోలీసులు స్వాధీనపరుచుకొని డ్రైవర్ను అరెస్ట్ చేశారు. సిఫ్కాట్ పోలీసు హోసూరు– బెంగళూరు హైవేపై జూజువాడి చెక్పోస్ట్ వద్ద ఆదివారం రాత్రి తనిఖీలు చేశారు. ఓ కారులో సోదాలు చేయగా రూ. 1.86 లక్షల విలువ చేసే గుట్కా పట్టుబడింది. ప్రవీణ్ (28) అనే డ్రైవర్ను అరెస్టు చేసి గుట్కాను, కారును స్వాధీనం చేసుకున్నారు. చదవండి హైదరాబాద్: మీర్పేటలో దారుణం.. బీరు బాటిళ్ల కోసం గొడవ.. కత్తితో పొడిచి.. -
అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్
నటి కస్తూరి శంకర్ మొదట్లో సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఆమె పలు స్టార్ హీరోలతో నటించడమే కాకుండా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. దీంతో ఒక్కోసారి ఆమెపై వ్యతిరేకత కూడా వస్తుంటుంది. (ఇదీ చదవండి; స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) తాజాగా ఆమె ఇద్దర అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వైన్ షాపునకు వెళ్లి మద్యం సీసాలు కొంటారు. దానిని షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది. 'తాగండి అమ్మాయిలు తాగండి.. ఏ మాత్రం తగ్గద్దు. ఎనిమిది మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు. ఇదీ ఏ మాత్రం తప్పుకాదు, అసహ్యమూ కాదు. ఏమవుతుంది మహా అయితే వాట్సాప్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే అవుతుంది. మీరు సూపర్.. మహిళల హక్కుల గురించి ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి.' అంటూ కామెంట్ చేసింది. దీంతో వాళ్లను పొగుడుతున్నావా..? లేదా తప్పుబడుతున్నావా..? ఏ మాత్రం అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కస్తూరిపై సీరియస్ అవుతున్నారు. అమ్మాయిల వీడియోను ఇలా నెట్టింట షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిత్రపరిశ్రమలోని ప్రముఖలకు చెందిన అమ్మాయిలు పబ్లకు వెళ్తున్నారు. వారి ఫోటోలు కూడా ఇలా షేర్ చేసే దమ్ము నీకు ఉందా..? అంటూ మండిపడుతున్నారు. ఇదే విషయంపై ప్రముఖ సింగర్ చిన్మయి కూడా స్పందించింది. 'కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం ఏమెచ్చింది. నిజాయితీగా చెప్తున్నా. ఇది చాలా తప్పు' అంటూ ట్వీట్ చేసింది. దీంతో చిన్మయిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు అయినంత మాత్రనా మద్యం తీసుకోకుడదా..? వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయినేది గుర్తించాలి. మద్యం మగవారు మాత్రమే తీసుకోవాలని రాసి ఉందా..? అని కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా వీడియో షేర్ చేయడంతో ఆమెపై కోలీవుడ్లో పెద్ద దుమారమే రేగుతుంది. தண்ணியடி, பெண்ணே தண்ணியடி ! எட்டு மறிவினில் ஆணுக்கிங்கே பெண் இளைப்பில்லை காணென்று தண்ணியடி. WhatsApp fwd of the day. As received. Super. அப்ப பெண்கள் உரிமை தொகை சிந்தாம சிதறாம திரும்பிடும் 🫤#dravidamodel pic.twitter.com/7SA889fwpp — Kasturi (@KasthuriShankar) July 13, 2023 (ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) -
డిప్యూటీ కలెక్టర్ వికృత చేష్టలు.. ఆకస్మిక తనిఖీల పేరుతో.. బాలికల గదిలోకి వెళ్లి.. మంచంపై
భోపాల్: ఆకస్మిక తనిఖీల పేరుతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి వసతిగృహ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని ఝాబువా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్డీఎం సునీల్ కుమార్ ఝా ఆదివారం బాలికల ఆశ్రమం ఝబువా హాస్టల్కు ఆకస్మిక తనిఖీ కోసం వెళ్లారు. అక్కడికి వెళ్లగానే హాస్టల్ సూపరింటెండెంట్ని గది బయటే ఉండమని.. బాలికలతో తాను ఒంటరిగా మాట్లాడాలని తెలిపారు. తనీఖీలో భాగంగా అనుకున్న ఆ సూపరింటెండెంట్ కూడా సరే అని రూం బయటే ఉండిపోయాడు. బాలికల గదిలోకి వెళ్లగానే.. ఆ అధికారి ముందుగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం గురించి పలు ప్రశ్నలు అడిగారు. తర్వాత బాలికల మంచంపైన కూర్చొని వారిపై చేతులు వేయడం, కౌగిలించుకోవడం వంటి వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించాడు. అంతటితో ఆగకుండా బాలికలు ఇబ్బందిపడేలా వారి వ్యక్తిగత విషయాలను కూడా అడిగాడు. 11 నుంచి 13 ఏళ్ల వయసున్న విద్యార్థినులతో అతను దారుణంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినులు సూపరింటెండెంట్తో కలిసి సోమవారం పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. మరోవైపు, బాలికల ఫిర్యాదుని నమోదు చేసుకున్న పోలీసులు ఆ అధికారిపై కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడంతో, జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా నిందితుడిని విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. పోలీసులు సునీల్ యాదవ్ ఝాను పోక్సో కోర్టు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరచి, జుడిషియల్ కస్టడీకి తరలించారు. చదవండి: ‘ఏమండీ వంటగదిలో డబ్బులు పెట్టాను. తీసుకోండి.. మీరు, పిల్లలు జాగ్రత్త’.. అంటూ -
రావమ్మా మహాలక్ష్మి.. ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి అబ్బాయిలే అధికంగా ఉంటున్నారు. కానీ.. 2021 తర్వాత అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజా నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తికి సంబంధించి 2021– 22 నివేదిక లో ఈ విషయాలను వెల్లడించింది. గతంలో వెయ్యి మంది అబ్బాయిలకు 977 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 1,046కు పెరిగినట్టు నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య కార్యక్రమాల అమలు భేష్ రాష్ట్రంలో ఆరోగ్య కార్యక్రమాలు బాగా అమలు చేస్తుండటం వల్లే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. సాధారణంగా ఆరే ళ్లు నిండకముందే బాలికల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తి మృతి చెందేవారు. కానీ.. ఈ పరిస్థితులు తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, క్రమం తప్పకుండా యాంటీనేటల్ చెకప్, వ్యాధి నిరో ధక టీకాల అమలు అద్భుతంగా ఉండటం వంటి పరిస్థితుల వల్ల మంచి ఫలితాలు వస్తున్నా యి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల స్థాయిలోనే ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థ కూడా సత్ఫలితాలు ఇస్తోంది. అమ్మాయిల సంఖ్య పెరగడానికి ఇవి కూడా కారణాలని నివేదిక వెల్లడించింది. చదవండి: పచ్చ మీడియా.. పరమ అరాచకం కేరళ తర్వాత ఏపీలోనే అధికం దేశంలో అమ్మాయిలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం గమనార్హం. కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,114 మంది అమ్మాయిలు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో 1,046 మంది నమోదయ్యారు. అత్యల్పంగా హర్యానాలో 887 మంది అమ్మాయిలు మాత్రమే నమోదయ్యారు. ఏపీలో పట్టణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,063 మంది, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి 1,038 మంది అమ్మాయిలు ఉన్నట్టు నివేదికలో వెల్లడైంది. 98 శాతం ప్రసవాలు ఆస్పత్రుల్లోనే జరుగుతుండటం వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు. ఇండియాలో సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 968 మంది అమ్మాయిలు నమోదయ్యారు. -
గోడలకు కళ్లుంటాయి.. గోప్యంగా చూస్తుంటాయి! జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: గోడలకు చెవులుంటాయ న్నది పాత సామెత. కానీ గోడ లకు కళ్లు కూడా ఉంటాయన్న చందంగా నేటి పరిస్థితులు మారుతున్నా యి. తమిళనాడు తిరు కొవి లూర్ లోని ఓ టెక్స్ టైల్ దుకాణంలో ఇటీ వల ట్రయల్ రూంలో దాచిన సెల్ఫోన్ ద్వారా యువతులు దుస్తులు మార్చు కొనే వీడి యోలను కొందరు గలీజుగాళ్లు రికార్డు చేయడం తెలిసిందే. ఇలా ఎక్కడో ఒక చోట ఈ తరహా ఘటనలు బయట పడుతూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో ట్రయల్ రూంలకు వెళ్లిన ప్పుడు లేదా హోటళ్లలో బస చేసిన ప్పుడు మహిళలు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని పోలీ సులు సూచిస్తున్నారు. ►నచ్చిన దుస్తులు సరిపోయాయో లేదో తెలుసుకోవాలంటే వినియోగదారులు ట్రయల్ రూంలకు వెళ్లక తప్పదు. అదేవిధంగా విహారయాత్రలు, ఆఫీస్ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేయడమూ అనివార్యమే. అక్కడ వాష్రూంలను వాడకుండా ఉండలేం. ఇదే అవకాశంగా చేసుకొని కొందరు సిబ్బంది రహస్య కెమెరాలు పెట్టి మహిళల వీడియోలను తీసే దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. హోటళ్లు, దుకాణ యజమానులకు తెలియకుండానే కొందరు సిబ్బంది ఇలాంటి అనైతిక పనులకు పాల్పడుతుండటం యాజమాన్యాలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇలా చేస్తే ముప్పు తప్పుతుంది.. ► వస్త్రాల కొనుగోలు కోసం మాల్స్కు వెళ్లిన ప్పుడు ట్రయల్ రూంకు వెళ్లాల్సి వచ్చినా లేదా హోటళ్లలో వాష్రూంలు వాడాల్సి వచ్చినా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి. ఏమాత్రం అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే బయటకు వచ్చేయాలి. ► సెల్ఫోన్ టార్చ్ వేస్తూ చూస్తే రహస్య కెమెరాలు ఉండి ఉంటే వాటి లెన్స్పై టార్చ్పడి రిప్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కూడా రహస్య కెమెరాల ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ► హోటల్ గదుల్లో బస చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా రాత్రివేళ్లలో నిద్రించాలంటే ముందుగా సీలింగ్ ఫ్యాన్ ఉన్న గదుల్లో లైట్లు ఆర్పి సెల్ఫోన్ టార్చ్ వేసి చూడాలి. రెడ్లైట్ బ్లింక్ అవుతున్నట్లు గమనిస్తే దాన్ని హిడెన్ కెమెరాగా అనుమానించాలి. ► ట్రయల్ రూంలు, హోటల్ రూంలకు ఉన్న తలుపులకు ఏవైనా అనుమానాస్పద రంద్రాలు ఉన్నట్లు గుర్తించినా.. అందులో ఏవైనా వస్తువులు ఉన్నట్లు గమనించినా వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ► ట్రయల్ రూంలు, వాష్ రూంలలో దుస్తులు తగిలించేందుకు ఉండే కర్టెన్ రాడ్స్ లేదా కొక్కాలకు కెమెరాలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉన్నాయో లేదో చూడాలి. ► ట్రయల్ రూంలలో, వాష్రూంలలో ఉండే అద్దాల వెనుక సైతం మనకు తెలియకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మిర్రర్ ట్రిక్ వాడాలి. మీ వేలిని అద్దానికి తాకేలా పెడితే దాని ప్రతిబింబానికి మీ వేలికి దూరం ఉంటే అది నిజమైనది. ఆ వేలు ప్రతిబింబానికి ఆనితే అది రెండోవైపు నుంచి మనం కనిపించే అవకాశం ఉన్నట్లు అనుమానించాలి. -
ఇదేం వికృతానందం.. పీజీలోకి వెళ్లి యువతులు స్నానం చేస్తుండగా..
కృష్ణరాజపురం(బెంగళూరు): పీజీలో ఉంటున్న యువతులను ఫొటోలు తీస్తూ వికృతానందం చెందుతున్న చిక్కబళ్లాపురకు చెందిన ఆశోక్ అనే కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహాదేవపురలోని హోడిలో లేడీస్ హాస్ట్ల్స్ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థినులు అందులో ఉంటున్నారు. నిందితుడు తన సమీపంలోని పీజీల్లోకి చొరబడి యువతులు స్నానాల చేస్తుండగా రహస్యంగా ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. ఇటీవల ఓ పీజీలో రహస్యంగా వీడియో తీస్తుండగా దీనిని గమనించిన ఓ యువతి చుట్టు పక్కన ఉండే వారిని అప్రమత్తం చేయడంతో యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని ఫోన్ను పరిశీలించగా యువతులు స్నానాలు చేసే దృశ్యాలు కనిపించాయి. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. చదవండి: ఐదేళ్లకే నూరేళ్లూ నిండాయా కన్నా! -
ఉగ్ర నెట్వర్క్లోకి చిన్నారులు, మహిళలు..!
శ్రీనగర్: భారత్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) మరో ప్రమాదకర పన్నాగాన్ని అమలు చేస్తోంది.కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల సంప్రదాయ సమాచార నెట్వర్క్ను సైన్యం దాదాపు నిర్వీర్యం చేసింది. దీంతో ఐఎస్ఐ మరో ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం ఉగ్ర మూకల మధ్య సమాచార మార్పిడికి మహిళలు, బాలికలు, మైనర్లను పావులుగా వాడుకుంటోంది. ఇటీవలి కాలంలో ఇందుకు సంబంధించిన పలు ఆధారాలు తమకు దొరికాయని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న 15 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ అమన్దీప్ సింగ్ అవుజ్లా తెలిపారు. ముఖ్యంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, డ్రగ్స్, ఆయుధాల రవాణాకు మహిళలు, బాలికలు, మైనర్లను వాడుకోవడం అనే కొత్త ప్రమాదం వచ్చిపడిందన్నారు. ఉగ్రమూకలు సమాచార బట్వాడాకు ప్రస్తుతం సెల్ఫోన్ల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాయని చెప్పారు. లోయలో ప్రశాంతతకు భగ్నం కలిగించేందుకు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉగ్ర మూకలు వ్యూహాలు పన్నుతుండటంతో బలగాలు సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. కశ్మీర్లో చొరబాట్లు తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ, పీర్ పంజాల్ దక్షిణ ప్రాంతం, పంజాబ్ల్లో పెరిగాయన్నారు. ఉత్తర కశ్మీర్లోని మచిల్లో ఇటీవలి చొరబాటుయత్నమే ఇందుకు తాజా ఉదాహరణ అని చెప్పారు. హింస పట్ల స్థానిక ప్రజల్లోనూ మార్పు కనిపిస్తుండటం ప్రశంసనీయమైన విషయమన్నారు. భద్రతా బలగాలకు కశ్మీర్ ప్రజలు సహకరిస్తున్నారని తెలిపారు. -
అదరగొట్టిన పోరీలు..ఇన్స్టాను షేక్ చేస్తున్న వీడియో చూస్తే ఫిదా!
సండే అంటే ఫండే. రొటీన్ లైఫ్కు ఆదివారం ఆటవిడుపు. ఇష్టమైన భోజనం, నచ్చిన స్నేహితులతో కాలం గడపడానికి ఎంత ప్రయారిటీ ఇస్తారో... ఎంటర్టైన్మెంట్కు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎంటర్టైన్మెంట్లో సినిమాలు షికార్లు, ఓటీటీ సందడి మాత్రమే కాదు. సోషల్ మీడియా బజ్ కూడా ఉంటుంది. ఇదీ చదవండి: ఆకాష్ అంబానీ-శ్లోక లిటిల్ ప్రిన్సెస్ పేరు: పండితులు ఏమంటున్నారంటే? ఇందులో వైరల్ రీల్స్, కామెడీ వీడియోలు, అబ్బురపరిచే విశేషాలుంటాయి. తాజాగా ఇంట్రస్టింగ్ వీడియో ఒకటి ఇన్స్టాలో చక్కర్లు కొడుతోంది. ఆరుగురు టీనేజర్లు తన డ్యాన్స్తో వైరల్ అవుతున్నారు. అద్భుతమైన స్టెప్పులతో ఇరగ దీశారు. ఈ వీడియో ఇప్పటికే 33 లక్షలకు పైగా లైక్స్ను దక్కించుకుంటే ఈ వీడియో క్రేజ్ను అర్థం చేసుకోవచ్చు.అలాంటి క్యూట్ అండ్ ఎనర్జటిక్ వీడియోను మీరు మిస్ అయితే ఎలా? cడాన్స్ ఆఫ్ టాలెంట్ అనే ఇన్స్టా హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియోలను చూసేయండి మరి! (ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ ఏదో తెలిస్తే షాకవుతారు) View this post on Instagram A post shared by DANCE OF TALENT (@danceoftalent) -
‘ప్లీజ్ అంకుల్.. మా నాన్నని అరెస్ట్ చేయండి’.. ఆ చిన్నారుల ఆవేదన విని..
భోపాల్: తమ తండ్రిని అరెస్ట్ చేయాలంటూ ఇద్దరు బాలికలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ జిల్లాలోని భితర్వాల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎప్పటిలానే ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఇద్దరు బాలికలు భయం భయంగా పోలీస్స్టేషన్లోకి అడుగుపెట్టారు. లోపల పని చేస్తున్న కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు ఇస్తాం మా నాన్నను అరెస్ట్ చేయండి అని అనగానే ఒక్కసారిగా అక్కడి వారంతా షాక్కు గురయ్యారు. వెంటనే ఆ కానిస్టేబుల్ స్టేషన్ ఇన్చార్జి ప్రదీప్ శర్మ దగ్గరకు తీసుకెళ్లాడు. ముందుగా ప్రదీప్ ఆ బాలికలకు భయపడకండని ధైర్యం చెప్పి... వారి సమస్య ఏంటో వివరించమన్నాడు. దీంతో వాళ్లిద్దరూ ఏడుస్తూ ‘మా తల్లిదండ్రులు తరచూ గొడవపడుతుంటారు. ఈ క్రమంలో మా నాన్న అమ్మను కొడుతుంటాడు. అది మేము చూడలేకపోతున్నాం. మా నాన్నను జైల్లో పెట్టండి అంకుల్’ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చారు. విషయం అర్థం చెసుకున్న ప్రదీప్ ఆ బాలికలిద్దరినీ వాళ్ల ఇంటికి తీసుకువెళ్లి విడిచిపెట్టాడు. అనంతరం వారి తల్లిదండ్రులకు ఈ విషయమై కాన్సిలింగ్ ఇచ్చాడు. ఇలా పిల్లల ముందు గొడవ పడుతుంటే వారిపై ప్రభావం పడుతుందని, ఇంకోసారి ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని బాలికల నాన్నను హెచ్చరించాడు. చదవండి: కేంద్ర మంత్రి ఉల్లిపాయల ఐడియా!.. మీరూ ట్రై చేస్తారా..? -
ఇంటర్ రెండేళ్ల ఫలితాల్లోనూ అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. మొదటి, రెండో సంవత్సరం రెండింటిలోనూ బాలురను మించి ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఫస్టియర్లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్ కావడం గమనార్హం. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ రెండేళ్ల పరీక్షలు కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారని తెలిపారు. ఫస్టియర్లో 61.68 శాతం, సెకండియర్లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు. ఫస్టియర్లో 1,75,505 మంది, సెకండియర్లో 1,91,698 మంది ఏ గ్రేడ్ (75శాతంపైన మార్కులతో)లో ఉత్తీర్ణులైనట్టు వివరించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ (75% పాస్) మొదటి స్థానంలో, రంగారెడ్డి (73% పాస్) ద్వితీయ స్థానంలో నిలిచా యని మంత్రి తెలిపారు. సెకండియర్లో ములుగు (85% పాస్) మొదటి స్థానంలో, కొమురం భీం (81 శాతం పాస్) రెండో స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేశారు. ఫెయిలైతే ఆందోళన పడొద్దు ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసి పాసవ్వాలని మంత్రి సూచించారు. ఎంసెట్లో ఈ ఏడాది ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని, అందువల్ల ఇంటర్ మార్కులు తక్కువ వచ్చినా ఆందోళన పడొద్దని చెప్పారు. నేటి నుంచి రీవెరిఫికేషన్.. ఇంటర్ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ ప్రక్రియను ఈ నెల 10 నుంచి 16 వరకు చేపడుతున్నామని.. విద్యార్థులు సంబంధిత కాలేజీల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. రీవెరిఫికేషన్కు రూ.100, రీవ్యాల్యూయేషన్కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులతోపాటు పాసైనా ఇంప్రూవ్మెంట్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 16 లోగా ఫీజు చెల్లించాలని సూచించారు. మార్కుల మెమోలు, కలర్ ప్రింట్లను ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మానసిక ఆందోళనకు గురైన విద్యార్థులు 14416 టోల్ ఫ్రీనంబర్కు కాల్ చేసి నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ పొందవచ్చని తెలిపారు. వీలైనంత త్వరగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇంటర్ బోర్డ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా.. ఏ కాలేజీలోనూ అడ్మిషన్లు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎంపీసీలో అత్యధిక ఉత్తీర్ణత.. రెండో స్థానంలో బైపీసీ – హెచ్ఈసీ, సీఈసీ కోర్సుల్లో 50 శాతంలోపే పాస్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ గ్రూపుల్లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండింటిలోనూ ఎంపీసీ (మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూపులో ఎక్కువ మంది పాసయ్యారు. తర్వాత స్థానంలో బైపీసీ ఉండగా.. సీఈసీ, హెచ్ఈసీ వంటి సంప్రదాయ గ్రూపుల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. తగ్గిన ఉత్తీర్ణత శాతం – వంద శాతం సిలబస్ కారణమంటున్న నిపుణులు – కోవిడ్కు ముందుతో పోలిస్తే ఉత్తీర్ణత ఎక్కువే ఇంటర్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటి ఫలితాలూ ఇలాగే ఉన్నాయి. కోవిడ్ కారణంగా 2021లో పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. తర్వాత 2022లోనూ 75శాతం సిలబస్తో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది వంద శాతం సిలబస్తో పరీక్షలు పెట్టారు. పూర్తి సిలబస్ నేపథ్యంలోనే ఇంటర్ జనరల్ విభాగంలో ఉత్తీర్ణత స్వల్పంగా తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. అయితే 2019తో పోలిస్తే మాత్రం పాస్ పర్సంటేజీ ఎక్కువగానే ఉంది. కొన్నేళ్లుగా ఇంటర్ ఉత్తీర్ణత శాతం (శాతాల్లో) ఏడాది ఫస్టియర్ సెకండియర్ 2018–19 60.60 64.94 2019–20 61.07 69.61 2020–21 100 100 2021–22 64.85 68.68 2022–23 62.85 67.27 -
స్వర్ణ దేవాలయం సమీపంలో పేలుడు.. ఆరుగురు అమ్మాయిలకు గాయాలు
చండీగఢ్: పంజాబ్ అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు అమ్మాయులు గాయపడ్డారు. పేలుడు శబ్దం వినగానే ఆలయంలోని భక్తులు, స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉగ్రదాడి జరిగి ఉంటుందని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఉగ్రదాడి కాదని చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. శాంతియుతంగా ఉండాలని సూచించారు. Video: Several injured in blast near #Amritsar's Golden Temple https://t.co/GWEtgJ37sH pic.twitter.com/XwLJxvg1T0 — TOIChandigarh (@TOIChandigarh) May 7, 2023 ఫోరెన్సిక్ టీం పేలుడు జరిగిన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ లభించిన కొంత పౌడర్ను స్వాధీనం చేసుకుంది. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు. పేలుడు ధాటికి కిటికీ అద్దాలు ధ్వంసమై రోడ్డుపై ఆటోలో వెళ్తున్న ఆరుగురు అమ్మాయిలకు స్వల్పగాయాలయ్యాయని ఓ స్థానికుడు తెలిపాడు. చదవండి: బైక్లే ఉన్నాయ్.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్షా సీరియస్ -
ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా.. ఫ్లాట్లో
జైపూర్: ఓ ఇంటి యజమాని పాడు పని చేశాడు. అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్రూం, బాత్రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు. ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా కరెంట్ పోవడంతో అమ్మాయిలు ఎలక్ట్రిషన్ను పిలిపించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతను వైర్లు పరిశీలిస్తుండగా ఐదారు సీక్రెట్ కెమెరాలు కన్పించాయి. దీంతో కంగుతిన్న ముగ్గురు అమ్మాయిలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు యజమానిని ఏఫ్రిల్ 27న అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం నిందితుడికి మే 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చదవండి: నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్.. ధూమ్ సినిమాను తలపించిన దొంగతనం రాజస్థాన్ ఉదయ్పూర్లో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని పేరు రాజేంద్ర సోని. సీసీటీవీల వ్యాపారం చేస్తున్నాడు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎంటెక్ చేసిన ఇతడు ఐటీ నిపుణుడు. స్పై కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేయాలో బాగా తెలుసు. అందుకే అమ్మాయిలు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు డూప్లికేట్ కీ ఉపయోగించి ఫ్లాట్లో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశాడు. ఉచిత వైఫై అందిస్తానని చెప్పి రూటర్ కూడా ఇన్స్టాల్ చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించాడు. ఇలా సీక్రెట్గా వీడియోలూ చూడటం తన బలహీనత అని చెప్పుకొచ్చాడు యజమాని. చాలా కాలంగా ఇలా చేస్తున్నట్లు తెలిపాడు. కాగా.. ఈ ముగ్గురు అమ్మాయిలు 8 నెలల క్రితం ఈ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ఇన్ని రోజులు గమనించలేకపోయామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. పాపం ప్యాంటు ఊడి ఇబ్బందిగా.. -
పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిల సగటు వయసు ఎంతంటే..?
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఒకప్పుడు ఎక్కువగా బాల్యవివాహాలు జరిగినా కొన్నేళ్లుగా సమాజంలో వచ్చిన మార్పులతోపాటు ప్రభుత్వాలు ఆడపిల్లల చదువులకు సైతం అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అమ్మాయిలు సైతం అబ్బాయిలతో సమానంగా ఉన్నత విద్యను అభ్యసిస్తుండటంతో దేశంలో అతివల సగటు పెళ్లిళ్ల వయసు పెరుగుతోంది. నేటికీ అక్కడక్కడా బాల్య వివాహాలు, నగరాల్లో లేటు వయసులో యువతుల పెళ్లిళ్లు జరుగుతున్నప్పటికీ రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం వివాహ వయసులపై జరిపిన జాతీయ నమూనా సర్వేలో దేశవ్యాప్తంగా మహిళల సగటు వివాహ వయసు 22.7 ఏళ్లుగా వెల్లడైంది. 2020లో ఈ సర్వే జరిగినప్పటికీ వాటి విశ్లేషణ ఆలస్యమైంది. అందుకు సంబంధించిన గణాంకాలను ఆ కార్యాలయం ఇటీవల విడుదల చేసింది. (బ్యూటీషియన్ మృతి.. చక్రవర్తి స్పృహలోకి వస్తేనే అసలు విషయం తెలిసేది?) దేశ సగటు కంటే తెలంగాణ మెరుగు... జాతీయ నమూనా సర్వే గణాంకాలను పరిశీలిస్తే 2017 నాటికి దేశంలో మహిళల వివాహ సగటు వయసు 22.1 ఏళ్లుకాగా 2020 నాటికి అది 22.7 ఏళ్లకు చేరింది. ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మహిళలు వివాహం చేసుకొనే వయసు ఆధారపడి ఉన్నందున వివిధ రాష్ట్రాల మధ్య సగటు వయసులో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. వివాహ సగటు వయసుకు సంబంధించి తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే పట్టణ ప్రాంతాల్లో 2020 నాటికి 24.3 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 22.8 ఏళ్లుగా తేలింది. సగటున 23.5 ఏళ్లకు తెలంగాణ మహిళలు వివాహాలు చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. దక్షిణ తెలంగాణతోపాటు తమిళనాడు మహిళలకు కొంత ఆలస్యంగా వివాహాలు జరుగుతున్నాయని ఈ సర్వేలో తేలింది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా సగటున 26 ఏళ్లకు కశీ్మర్ మహిళలు వివాహాలు చేసుకుంటుండగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్కు చెందిన యువతులు మాత్రం సగటున 21 ఏళ్లలోపే మాంగల్య బంధంలోకి అడుగు పెడుతుండటం గమనార్హం. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ మహిళల కంటే పట్టణ ప్రాంతాల్లోని మహిళలు కొంత ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారని జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. 21 ఏళ్లకు పెంచేందుకు బిల్లు దేశంలోని మహిళల చట్టబద్ధ కనీస వివాహ వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉండగా దాన్ని పురుషుల చట్టబద్ధ కనీస వివాహ వయసు అయిన 21 ఏళ్లకు సమానంగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వద్ద పరిశీలనలో ఉంది. అయితే దేశంలో కనీస వివాహ వయసును మార్చాలంటే కేంద్రం 6 చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్–1872, ది పార్సీ మ్యారేజ్ అండ్ డైవోర్స్ యాక్ట్–1936, ద ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్–1937, ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్–1954, ది హిందూ మ్యారేజ్ యాక్ట్–1955, ది ఫారిన్ మ్యారేజ్ యాక్ట్–1969లను సవరించాల్సి ఉంటుంది. చదవండి: 165 ఎకరాల్లో ఫామ్హౌస్ ఎలా? -
'నేను డేంజర్లో ఉన్నా' అని లవర్కు మెసేజ్.. కాసేపటికే ముగ్గురూ బీచ్లో..
క్విటో: బీచ్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ముగ్గురు యువతులు దారుణ హత్యకు గురయ్యారు. చనిపోవడనికి ముందు తమ ప్రియమైన వారికి వీరు పంపిన సందేశాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. తాము డేంజర్లో ఉన్నామని, ఎదో జరగబోతుందని ముందే పసిగట్టి వారు మెసేజ్లు పంపిన కాసేపటికే కిరాతకంగా హత్యకు గురయ్యారు. దండగులు వీరి గొంతులు కోసి చిత్ర హింసలకు గురి చేసి హతమార్చారు. ఈక్వెడార్లోని క్వినెడే సమీపంలో ఎస్మరాల్డస్ బీచ్లో ఏప్రిల్ 5న జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ముగ్గురు యువతుల పేర్లు.. డెన్నిసి రేనా(19), యులియానా మాసియస్(21), నయేలి తాపియా(22). ఏప్రిల్ 4న అదృశ్యమైన వీరు ఆ మర్నాడే దారుణంగా హత్యకు గురయ్యారు. మంచి స్నేహితులైన వీరు బీచ్కు వెళ్లి సరదాగా గపడపాలని ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని ఏప్రిల్ 4న అనుకున్నట్టే బీచ్కు వెళ్లారు. స్విమ్ సూట్ లాంటి దుస్తులు ధరించి అక్కడే హాయిగా సేదతీరారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఈ ముగ్గురూ ఊహించని ప్రమాదంలో పడ్డారు. ఎవరో వారిని వెంబడించారు. దీంతో తమకు ఏదో జరగబోతుందని భావించి తమ ప్రియమైన వారికి సందేశాలు పంపారు. అయితే మెసేజ్లు రాత్రి 11:10 గంటల సమయంలో పంపడంతో కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళన చెందారు. వారు అనుకున్నట్టే.. జరగకూడని ఘటన జరిగింది. నయేలి, డెన్నిసి చనిపోయే ముందు నయేలి తన సోదరికి వాట్సాప్ సందేశం పంపింది. 'ఏదో జరగబోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే మెసేజ్ చేస్తున్నా' అని నయేలి మెసేజ్ చేసింది. సోదరి వెంటనే ఆమెకు కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. నయేలికి పెళ్లైంది. నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. దీంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరో యువతి డెన్నిస్ హత్యకు గురికావడానికి ముందు తన బాయ్ఫ్రెండ్కు సందేశం పంపింది. 'ఏదో జరగబోతుందని నాకు అన్పిస్తుంది. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఒక్క విషయం గుర్తుంచుకో.. ఐ లవ్ యూ వెరీ మచ్' అని మెసేజ్ చేసింది. జాలర్లు చూసి.. ఆ తర్వాత కాసేపటికే ముగ్గురిని ఎవరో దారుణంగా హత్య చేశారు. బీచ్లో అర్ధనగ్నంగా ఉన్న వీరిని చిత్ర హింసలు పెట్టి పదునైన ఆయుధాలతో గొంతులు కోశారు. ఆ తర్వాత శవాలను పూడ్చిపెట్టారు. ఏప్రిల్ 5న చేపల వేటకు వెళ్లిన జాలర్లు.. ఓ కుక్క వీరి మృతదేహాల వద్ద తవ్వడం చూసి అక్కడకు వెళ్లగా శవాలు కన్పించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ హత్యలు ఎవరు చూసి ఉంటారనే విషయంపై పోలీసులకు ఇంకా ఎలాంటి క్లూ లభించలేదు. ముగ్గురిలో ఓ యువతి బీచ్కు వెళ్లినరోజు సమీపంలోని ఓ హోటల్లో గడిపింది. దీంతో అధికారులు క్లూ కోసం సీసీటీవీ రికార్డులను పరిశీలిస్తున్నారు. ముగ్గురిలో ఇద్దరు మంచి భవిష్యత్ కోసం వేరే దేశం వెళ్లి స్థిరపడాలనుకున్నారని, కానీ ఇంతలోనే ఇలా ప్రాణాలు కోల్పోతారని ఊహించలేదని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చదవండి: వేరొకరి ఇంటి డోర్బెల్ మోగించాడని చంపేందుకు యత్నం..చివరికి.. -
విశాఖలో ఆకట్టుకుంటోన్న తెలుగు అమ్మాయిల ప్రదర్శన
-
పశువుల వ్యాపారం చేస్తున్న ఐఐటీ అమ్మాయిలు, వందల కోట్ల టర్నోవర్తో..
Neetu Yadav and Kirti Jangra: ఉన్నత చదువులు చదివి సొంతంగా వ్యాపారం చేయాలని కలలు కంటూ విజయాన్ని సాధించిన వారు చాలానే ఉన్నారు. ఇందులో నీతూ యాదవ్ & కీర్తి జంగ్రా కూడా ఉన్నారు. ఢిల్లీలో ఐఐటి పూర్తి చేసి 'యానిమల్ టెక్నాలజీస్' స్థాపించి ఇప్పుడు కోట్లలో గడిస్తున్నారు. ఇంతకీ వీరి విజయ గాథ వెనుక ఉన్న అసలైన కథ ఏంటనేది ఇక్కడ ఈ కథనంలో చూసేద్దాం.. ఢిల్లీలో ఐఐటీ రూమ్మేట్స్గా కలిసిన అమ్మాయిలు తమ కలను సహకారం చేసుకోవడానికి నవంబర్ 2019లో పశువుల కోసం ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అయిన యానిమాల్ను ప్రారంభించారు. బెంగళూరులోని ఒక చిన్న అద్దె గదిలో ఉంటూ ప్రారంభమైన వీరి వ్యాపారం ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. పాడి రైతుల జీవితాలను మెరుగుపరచడానికి, పశువుల వ్యాపారం, పాడి పరిశ్రమలను మరింత లాభదాయకంగా మార్చాలనే ఉద్దేశ్యంతో యానిమల్ స్థాపించారు. ప్రతి వ్యాపారంలో ఎదురైనా ఇబ్బందులు మాదిరిగానే వీరు కూడా ప్రారంభంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ తరువాత గేదెలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల నుండి ఎక్కువ ఆర్డర్లను పొందడం ప్రారంభించారు. (ఇదీ చదవండి: Force Citiline: ఫోర్స్ మోటార్స్ కొత్త ఎమ్పివి లాంచ్ - ధర ఎంతంటే?) యానిమల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ జంతువుల సంరక్షణకు కూడా సేవలను అందిస్తుంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పొందిన ఆదాయంలో సుమారు 90శాతం పశువుల వ్యాపారం నుంచి రాగా.. మిగిలిన 10 శాతం వైద్య ఖర్చులు, అసిస్టెడ్ రీప్రొడక్షన్, సేల్స్ కమీషన్ వంటి వాటిద్వారా వచ్చిందని తెలుస్తోంది. యానిమాల్ (Animall) అనేది పశువుల వ్యాపారం చేయడానికి ఆన్లైన్ మార్కెట్ప్లేస్. దీని ద్వారా పశువుల అమ్మకం మాత్రమే కాకుండా కొనుగోలు కూడా ఉంటుంది. ప్రస్తుతం యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దూసుకెళ్తున్న ఈ కంపెనీలో షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్, జొమాటో వ్యవస్థాపకుడు & సీఈవో దీపిందర్ గోయెల్, అంజలి బన్సాల్, మోహిత్ కుమార్, సాహిల్ బారువాతో సహా మరో 3 మంది యానిమాల్ ఏంజెల్ పెట్టుబడిదారులుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఇంత మంచి ఆఫర్ మళ్ళీ మళ్ళీ వస్తుందా.. జీప్ కంపెనీ భారీ డిస్కౌంట్స్) 2019లో ప్రారంభమైన యానిమల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ FY22లో ఆదాయం రూ. 7.4 కోట్లుగా అంచనా వేయబడింది. అయితే ప్రస్తుతం ఇది రూ. 565 కోట్లకు పెరిగింది. రానున్న రోజుల్లో ఈ కంపెనీ మరిన్ని లాభాలను తప్పకుండా ఆర్జిస్తుందని భావిస్తున్నారు. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
వైరల్ వీడియో: ఇద్దరమ్మాయిలతో బైక్పై యువకుడి స్టంట్
-
మహిళలు బాలికలపై హింస ప్రబలంగా ఉంది! యూఎన్లో భారత్
మహిళలు, బాలికలపై ఉగ్రవాదులు సాగిస్తున్న హింస ప్రబలంగా ఉందని భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మహిళల శాంతి భద్రతలకు సంబంధించి 1325 రిజల్యూషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసంగించారు. ఈమేరకు రుచిరా మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం తదితరాలు మానవహక్కులను తీవ్రంగా ఉల్లంఘించేవి. పైగా ప్రపంచ శాంతి భద్రతలకు నిరంతరం ముప్పుగా కొనసాగుతున్నాయి. దీని కారణంగా మహిళలు, బాలికలు తీవ్రంగా కలత చెందుతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని రకాల తీవ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించాలని ఆమె పిలుపునిచ్చారు. అక్టోబర్లో మహిళల శాంతి భద్రతలపై ఐరాస భద్రతా మండలి 1325వ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం సంఘర్షణలు, శాంతి చర్చలు, శాంతి నిర్మాణం, శాంతి పరిరక్షణ, మానవతా ప్రతిస్పందన, తదితరాల్లో మహిళల పాత్రను తెలియజేస్తోంది. అంతేగాదు ఇది సంఘర్షణ అనంతర పునర్నిర్మాణం, సమాన భాగస్వామ్యం, శాంతి భద్రతలకు సంబంధించి అన్ని రకాలుగా వారి పూర్తి ప్రమేయానికి సంబంధించిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. మహిళలకు మంచి అనుకూలమైన వాతావరణాన్ని అందించడానికి చట్టబద్ధమైన నియమాలు తప్పనిసరి. అలాగే అఫ్ఘనిస్తాన్ పరిస్థితిని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 2021లో భారత్ కౌన్సిల్ ఆఫ్ది ప్రెసిడెన్సీలో ఆమోదించిన యూఎన్ఎస్సీ తీర్మానం 2593 ప్రకారం.. అప్ఘనిస్తాన్లో మహిళల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రాతినిథ్య పాలన ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అలాగే మహిళలపై హింసకు పాల్పడే వారి శిక్షార్హత గురించి తనిఖీ చేయడంలో జాతీయ అధికారులు ఐక్యరాజ్యసమితి, ప్రాంతీయసంస్థలకు సాయం చేయాలి. సంఘర్షణ అనంతర పరిస్థితుల్లో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతలు, హింసలను పరిష్కరించడంలో సభ్యదేశాలకు మద్దతు ఇవ్వాలి. శాంతిస్థాపన ప్రయత్నాలలో మహిళలపై దృష్టి పెట్టడం అత్యంత కీలకం. ఇలాంటి వాటిని ముందుకు తీసుకువెళ్లడంలో మహిళా పోలీసు అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. అలాగే భారత్లో లింగ సమానత్వాన్ని స్వాగతిస్తున్నాం. జనవరి 2023లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యక్రమాలకు అత్యధికంగా సైన్యాన్ని అందించిన దేశాలలో భారత్ ఒకటి. 2007 లైబీరియాలో మొత్తం మహిళా పోలీసుల విభాగాలను ఏర్పాటు చేసిన మొదటి దేశం భారతదేశం. అంతేగాదు మహిళ రక్షణ సలహాదారుల విస్తరణకు భారత్ మద్దతు ఇస్తోంది. మహిళా శాంతి భద్రతల ఎజెండాను బలోపేతం చేస్తున్నప్పటికీ శాంతి స్థాపనలో మహిళలు ఇప్పటికీ తక్కువగానే ప్రాతినిధ్యం వహించడం బాధకరం. కానీ భారత సాంస్కృతిక సంప్రదాయల్లో భూమిని తల్లిగా పరిగణించటం ప్రజలకు నేర్పింది. దేశ సాధికారతకు మహిళ పురోగతి చాలా ముఖ్యమని భారత్ గట్టిగా విశ్వసిస్తుందని రుచిరా అన్నారు. (చదవండి: వక్రీకరించే వైఖరిని మార్చుకోమంటూ యూఎస్కి చైనా స్ట్రాంగ్ వార్నింగ్) -
Ishita Sharma: మేమే మా ధైర్యం!
ముంబై జూహూ గ్రౌండ్స్లో విమెన్స్ డే సందర్భంగా 1500 మంది ఆడపిల్లలు కరాటేలో తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. వీళ్లంతా ఎవరో చదవండి... ‘మన దేశంలో 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలు రెండున్నర కోట్ల మంది ఉన్నారు. వీరు స్కూల్లో సైన్సు నేర్చుకున్నట్టు లెక్కలు నేర్చుకున్నట్టు ఆత్మరక్షణ ఎందుకు నేర్చుకోరు? ఎందుకు నేర్పించరు?’ అని అడుగుతుంది ఇషితా శర్మ. ముంబైలో డాన్స్ స్కూల్ను నడిపే ఇషితా శర్మ ఐదేళ్ల క్రితం ఒకరోజు రాత్రి కారులో వెళుతుంటే కొంతమంది పోకిరి కుర్రాళ్లు ఆమెను ఫాలో అయ్యారు. ముందామెకు ఏం చేయాలో తోచలేదు. భయపడింది. కాని చివరకు ధైర్యం కూడగట్టుకుని అద్దం దించి పెద్దగా అరిచింది. అంతే. వాళ్లు పారిపోయారు. ‘ఇంత వయసు వచ్చిన నేనే ఇలా భయపడ్డాను. చిన్నపిల్లలు ఎంత భయపడిపోతారో అనే ఆలోచన నాకు వచ్చింది’ అంటుందామె. ఈ ఆలోచన నుంచే ‘ముక్కా మార్’ ఆవిర్భవించింది. 11 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలకు కరాటే, కుంగ్ ఫూ వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పాలని అనుకుంది ఇషిత. తనకు తెలిసిన ఒక కరాటే మాస్టర్ని సహాయం అడిగింది. అతను అంగీకరించాడు. ముంబైలోని వెర్సోవా బీచ్లో ఐదుమంది ఆడపిల్లలతో 2018లో ‘ముక్కా మార్’ (దెబ్బ కొట్టు) కార్యక్రమం మొదలైంది. అయిదు పది, పది వంద అవడానికి ఎంతో సమయం పట్టలేదు. దేహం, గళం, బుద్ధి ‘ఆడపిల్లలు మగవాళ్ల కంటే బలహీనులు అనే భావనతోనే పెంచుతారు. అబ్బాయిలను మగాడిలా పోరాడు అంటారు. మేము– ఆడపిల్లను ఆడపిల్లలా పోరాడు అని చెబుతాం. ఆడపిల్ల ఎందులోనూ తక్కువ కాదు అని చెబుతాం. మన పెంపకంలో ఆడపిల్లకు ఏ అన్యాయం జరిగినా ఊరికే ఉండు, సహించు అనే బోధిస్తారు. మేము ఎదిరించు, నీ గళం వినిపించు, బుద్ధిని ఉపయోగించు అని చెబుతాం. ముఖ్యంగా హింసను ఎదిరించాలంటే ఈ మూడు తప్పవు’ అంటుంది ఇషిత. ‘ముక్కా మార్ శిక్షణలో చేరాక ఏదైనా ప్రమాదం వస్తే పెద్దగా అరిచి ప్రతిఘటించాలని, తర్వాత బుద్ధిని ఉపయోగించి అక్కడి నుంచి బయటపడాలని ఆ రెండూ సాధ్యం కాకపోతే శారీరకంగా తలపడి పోరాడాలని మాకు తెలిసొచ్చింది’ అని ఒక అమ్మాయి అంది. 1100 స్కూళ్లలో ‘ముక్కా మార్’ శిక్షణ అవసరం మహరాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. ఎం.సి.జి.ఎం (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై) పరిధిలోని 1100 పైగా స్కూళ్లలో ‘ముక్కా మార్’ కార్యకర్తలను వారానికి రెండు రోజులు ఆత్మరక్షణ విద్యలు నేర్పేందుకు ప్రోత్సహించింది. 6,7,8 తరగతులు విద్యార్థినులకు స్కూళ్లలో వారానికి రెండు రోజులు కరాటే, కుంగ్ ఫు, కుస్తీ క్లాసులు నేర్పిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ ద్వారా అంటే వాట్సప్ చాట్బోట్ ద్వారా క్లాసులు కొనసాగాయి. ఈ క్లాసులు దేశంలోని ఏ ప్రాంతం ఆడపిల్లలైనా నేర్చుకోవచ్చు. ఇప్పటికి ‘ముక్కా మార్’ ద్వారా 5 వేల మంది ఆడపిల్లలు నేరుగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకున్నారు. ఆన్లైన్ ద్వారా 16 వేల మంది అమ్మాయిలు నేర్చుకున్నారు. దాదాపు 300 మంది మహిళా టీచర్లకు శిక్షణ ఇవ్వడం వల్ల ఆ టీచర్ల ద్వారా 50 వేల మంది ఆడపిల్లల వరకూ నేర్చుకుంటున్నారు. మన సమాజంలో రోజురోజుకూ ఆడపిల్లల మీద హింస, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. అయితే వాటికి భయపడి ఆడపిల్లను ఇంట దాచడం అంటే వారి భవిష్యత్తును నాశనం చేయడమేనని అంటుంది ఇషితా శర్మ. ‘వారు ధైర్యంగా సమాజంలో తిరగాలి. ప్రమాదం ఎదురైతే ఎదిరించేలా ఉండాలి. ఆత్మరక్షణ విద్యలు నేర్పడం ద్వారా మాత్రమే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి భయం పోతుంది’ అంటుందామె. నిజంగానే ప్రతి స్కూల్లో మేథ్స్ టీచర్, సైన్స్ టీచర్ ఉన్నట్టుగా ఆడపిల్లల కోసం ఒక కరాటే టీచర్ ఉండాలని ఈ విమెన్స్ డే సందర్భంగా ప్రభుత్వాలు ఆలోచిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. -
ఆంధ్ర ప్రదేశ్ లో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య
-
ఇరాన్లో దారుణం.. వందలాది మంది విద్యార్థినులపై విష ప్రయోగం
ఇరాన్లో వందలాదిమంది విద్యార్థినులపై విష ప్రయోగం జరిగింది. ఇప్పటికే ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసాకాండ మరువుక మునుపే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశ్యంతో ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన టెహ్రాన్లో కోమ్లోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ హెల్త్ మినిస్టర్ యూనెస్ పనాహి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు వెల్లడించారు. అంతేగాదు విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని పాఠశాలలను ముఖ్యంగా బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్ స్థానికి మీడియాలు పేర్కొన్నాయి కూడా. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయమై అధికారులను నిలదీసేందుకు నగర గవర్నరేట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలను కనుగొనడానికి యత్నిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ ఘటనకు కారణాలపై సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులును అదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది వస్త్రధారణ నియమావళిని ఉల్లంఘించినందుకు అరెస్టు చేసిన 22 ఏళ్ల ఇరానియన్ కుర్ద్ మహ్సా అమిని డిసెబర్ 16న కస్టడీలో మరణించినప్పటి నుంచి ఇరాన్ నిరసనలతో అట్టుడుకుపోతోంది. (చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి) -
వంచనకు పరిచయం.. సామాజిక మాధ్యమాల్లో వేదికగా..
అనంతపురంలోని పాతూరుకు చెందిన స్వాతి (పేరు మార్చాం) ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన బెంగళూరుకు చెందిన అబ్బాయి వలలో పడింది. ఉన్నఫళంగా ఒకరోజు ఇంటినుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ‘దిశ’ పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. చివరకు పోలీసుల జోక్యంతో అమ్మాయిని వెతికి ఇంటికి తెచ్చారు. ధర్మవరానికి చెందిన అమ్మాయి కావ్య (పేరు మార్చాం) అనంతపురంలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. ఒకరోజు ఉన్నఫళంగా అబ్బాయితో వెళ్లిపోయింది. ఇరవై రోజుల తర్వాత ఫోన్ కాల్స్ ఆధారంగా కనుక్కుని అమ్మాయిని తీసుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అబ్బాయితో వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. వీరిద్దరే కాదు ఎంతోమంది స్మార్ట్ఫోన్లలో సామాజిక మాధ్యమాల ద్వారా ముక్కూమొహం తెలీని వ్యక్తులు విసిరిన వలలో చిక్కుకుని మోసపోతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు వినియోగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ ఉందంటే చాలు కచ్చితంగా తమ పేరుపై ఖాతాలు తెరిచేస్తున్నారు. ప్రతిదీ అందులో షేర్ చేసుకుంటున్నారు. అలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడెక్కడి వారో పరిచయమవుతున్నారు. అలా చాటింగ్తో స్నేహం పెంచుకుంటున్నారు. ప్రత్యక్షంగా వారిని చూడకపోయినా.. వారి గుణగణాలు, నేపథ్యం తెలియకపోయినా గుడ్డిగా నమ్ముతున్నారు. ఇటువంటి తరుణంలో అమ్మాయిలను కొందరు అబ్బాయిలు ట్రాప్లో పడేస్తున్నారు. క్రమక్రమంగా అమ్మాయిలు తమ కెరీర్ను పక్కనపెట్టి పోకిరీల చేతిలో మోసపోతున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలాంటి మాధ్యమాల ద్వారా నష్టపోతున్న అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొంపముంచుతున్న ఇన్స్టాగ్రామ్ ఇటీవలి కాలంలో ఇంటర్ చదువుతున్న అమ్మాయిలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసులంటూ పరిచయమైన ఈ ఫోన్లు ఇప్పుడు పర్సనల్ ఖాతాల వరకూ వెళ్లాయి. ప్రతి అమ్మాయి.. అబ్బాయి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల ద్వారా చాటింగ్ చేస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నామన్న కనీస అవగాహన కూడా లేకుండా అబ్బాయిలకు వ్యక్తిగత వివరాలు షేర్ చేస్తున్నట్టు వెల్లడైంది. దీన్ని కొందరు అబ్బాయిలు అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్కు దిగుతున్నారు. అమ్మాయిలు నష్టపోయే వరకూ వాస్తవ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అమ్మాయిలు నష్టపోయాక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వారిని చదువు మాన్పిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏడాది వ్యవధిలో 71 మంది అమ్మాయిలు ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా అబ్బాయిల వలలో పడినట్టు తేలింది. బాధితుల్లో అమ్మాయిలే ఎక్కువ సామాజిక మాధ్యమాల బాధితుల్లో ఎక్కువగా అమ్మాయిలే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ పరిచయాలు ఎక్కువయ్యాయి. నెలకు ఐదారు కేసులు వస్తున్నాయి. తల్లిదండ్రుల కోరిక మేరకు వివరాలు గోప్యంగా ఉంచి అబ్బాయిలను మందలించి పంపిస్తున్నాం. పరిచయం లేని వ్యక్తితో చాటింగ్ చేయొద్దు. వ్యక్తిగత, కుటుంబ వివరాలు షేర్ చేయద్దు. –ఆళ్ల శ్రీనివాసులు, డీఎస్పీ, ‘దిశ’ పోలీస్ స్టేషన్ వ్యసనంగా మారింది రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా ఆకర్షితులు కావడమనేది ‘ఎమోషనల్ డిపెండెన్సీ’ అంటారు. ఆ గ్రూపులో తిరిగే వారిని బట్టి కూడా ఉంటుంది. ముందుగా దీనిపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. నాలుగు రోజుల కిందట 8వ తరగతి అమ్మాయి ఇన్స్టాగ్రామ్ కోసం ఏడుస్తోందని తల్లిదండ్రులు నా దగ్గరకొచ్చారు. ఇలా అలవాటు చేయడం వల్ల వాళ్లు దానికి బానిసల్లా మారి నష్టపోతున్నారు. –డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం (చదవండి: ‘నారాయణ’ ఒత్తిళ్లు తాళలేకనే ఆత్మహత్యాయత్నం.. యాజమాన్యం లెటర్ డ్రామా.. విద్యార్థికి సీరియస్!) -
వైరల్: వామ్మో.. అంత మంది అమ్మాయిలా?
Viral News: పాపం.. పరీక్ష హాల్లో అంత మంది అమ్మాయిలను ఒక్కసారిగా చూసేసరికి ఆ కుర్రాడికి ఏం అనిపించిందో ఏమో!. వాళ్ల మధ్యలో తానొక్కడే ఉన్నాడన్న సంగతి తెలిసిన ఆ కుర్రాడు.. ఏకంగా స్పృహ కోల్పోయాడు. బిహార్లోని నలందాలో బుధవారం ఈ ఘటన జరిగింది. బీహార్లో 12వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మనీశ్ శంకర్ ప్రసాద్ (17) అనే విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజ్ స్టూడెంట్. తొలి పరీక్ష మ్యాథ్మెటిక్స్ రాసేందుకు మనీశ్ను అతని తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్, సుందరగడ్లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్కు తీసుకొచ్చాడు. అయితే.. పరీక్ష రాసేందుకు మనీశ్ హాల్లోకి వెళ్లాడు. అక్కడ అంతా బాలికలు ఉండేసరికి.. ఆశ్చర్యపోయాడు. అతని చూసి అమ్మాయిలంతా ఒక్కసారిగా ఘోల్లుమనడంతో.. అర్థంకాని అయోమయంలో ఒక్కసారి కళ్లు తిరిగి పడిపోయాడు మనీశ్. దీంతో అతన్ని సర్దార్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు పరీక్షా నిర్వాహకులు. ‘‘ఒకేసారిగా అంతమంది అమ్మాయిలను చూసి చాలా కంగారుపడ్డాడు. అందుకే స్పృహతప్పిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యంగానే ఉన్నాడని ఆస్పత్రిలో అతని బాగోగులు చూసుకుంటున్న మనీశ్ శంకర్ మేనత్త చెబుతోంది. పూర్తిగా అమ్మాయిల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో పొరపాటున మనీష్కు కేటాయింపు జరిగిందని అక్కడి విద్యాధికారులు చెప్తున్నారు. बिहार बोर्ड की 12वीं की परीक्षा के दौरान हुई अजीबोगरीब घटना | Unseen India pic.twitter.com/5awOkkjK6L — UnSeen India (@USIndia_) February 1, 2023 -
ఫుట్పాత్పై జుట్లు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్
స్కూల్లో అబ్బాయిలు అప్పుడప్పుడు స్నేహితులతో గొడపడుతుంటారు. మాటా పెరిగి ఒక్కోసారి పోట్లాడుకునే సందర్భాలు ఉంటాయి. అమ్మాయిల మాత్రం ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అసలు ఎలాంటి గొడవల జోలికి వెళ్లరు. కానీ ఇప్పుడు ట్రెండు మారింది. అమ్మాయిలే ఫైటింగ్కు దిగుతున్నారు. ఒకరిపైఒకరు దాడి చేసుకుంటూ సినిమా రేంజ్లో పోట్లాటకు దిగుతున్నారు. కారణమేదైనా ఒక్కోసారి సీరియస్గా ఫైట్ చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. స్కూల్ డ్రెస్సులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఫుట్పాత్పైనే రెచ్చిపోయారు. జుట్లు పట్టుకుని పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు. ఆవేశంతో ఊగిపోతూ ఫైటింగ్ చేస్తూ తోసేసుకుని కిందపడ్డారు. చుట్టుపక్కన ఉన్న వాళ్లు వీళ్లనే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. అబ్బాయిలైతే అరుపులు, కేకలు వేస్తూ ఫైటింగ్ను ఎంకరేజ్ చేశారు. చివరకు అక్కుడున్న ఒకరు జోక్యం చేసుకుని పైటింగ్ను ఆపారు. Kalesh B/w KV girls Over unnecessary comments on Celebrity Crushpic.twitter.com/546XV3DeBK — Ghar Ke Kalesh (@gharkekalesh) January 29, 2023 ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. ఈ అమ్మాయిలు బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అందించారని, పాప్కార్న్ తింటూ వీరి ఫైటింగ్ చూసి ఎంజాయ్ చేసినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. చదవండి: స్టేజీపై డ్యాన్స్ ఇరగదీసిన పెళ్లికూతురు.. వీడియో వైరల్.. -
అమ్మాయిల వీరంగం..ఫుల్లుగా తాగి మరో యువతిపై దాడి..వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ ఇండోర్లో అమ్మాయిలు రెచ్చిపోయారు. ఫుల్లుగా తాగిన నలుగురు యువతులు మరో యువతిని చితకబాదారు. బెల్టుతో కొట్టారు. పబ్బు బయటే ఈ ఘటన జరిగింది. అక్కడున్న వారు చూస్తే ఉండిపోయారే తప్ప.. వాళ్లను ఆపే సాహయం చేయలేదు. నలుగురూ కలిసి దాడి చేయడంతో బాధిత యువతి ఏమీ చేయలేకపోయింది. గతేడాది నవంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది. బాధిత యువతి తనపై దాడి చేసిన నలుగురు అమ్మాయిలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లను అరెస్టు చేశారు. 4 girls brutally beating 1 girl with belts and kicks passer-by watching and enjoying #Fights #streetfights #fightingvideos #Girlsfight #India #gemsoffights pic.twitter.com/MVLec2CYai — TheFight1 (@InsanelyIfight3) December 29, 2022 చదవండి: రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి -
ఇద్దరు బాలికలను బంధించిన యువకుడు.. మాయమాటలు చెప్పి!
సాక్షి, భువనగిరి: ఇద్దరు బాలికలను ఓ యువకుడు తన ఇంట్లో బంధించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండల పరిధిలోని బీఎన్ తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్ తిమ్మాపురం గ్రామానికి చెందిన మేడబోయిన యాకేష్ తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయం హైదరాబాద్కు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్నారు. పాఠశాలకు వెళ్లిన ఆ ఇద్దరు బాలికలు మధ్యాహ్నం తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వారికి మాయమాటలు చెప్పిన యాకేష్ తన ఇంటి ముందు నుంచి తాళం వేసి వెనుక వైపు నుంచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. కాగా సాయంత్రం వరకు బాలికలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. మధ్యాహ్నం బాలికలు యాకేష్ ఇంటికి వెళ్లినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాళం వేసి ఉన్న ఇంటి వెనుకకు వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం గుర్తించారు. దీంతో ఇంటి కిటికి అద్దాలను ధ్వంసం చేయగా బాలికలు అందులో ఉండడం చూసి కోపోద్రిక్తులై ఇంటి ఆవరణలో ఉన్న రెండు బైక్లకు నిప్పు పెట్టారు. ఇది గమనించిన యాకేష్ ఇద్దరు బాలికలను బయటకు పంపి తాను లోపలే ఉన్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి గ్రామస్తులు యాకేష్ ఇంటి ఎదుట పెద్దఎత్తున గూమిగూడారు. ఈ క్రమంలో యాకేష్పై గ్రామస్తులు దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేసి అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. యువకుడిని పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో కొంతమంది రాళ్లు విసరడంతో పోలీసు వాహనం అద్దాలు పగిలాయి. ఒక పోలీస్కు స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్థినులను పోలీస్ స్టేషన్కు తరలించి మహిళా పోలీసులతో విచారణ నిర్వహిస్తామని భువనగిరి రూరల్ సీఐ వెంకటేశం పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ రాఘవేందర్గౌడ్ చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి దగ్ధమవుతున్న బైక్లను ఆర్పేశారు. -
థ్రిల్లింగ్ స్టోరీ: బాయ్ఫ్రెండ్ కోసం ఐదుగురు అమ్మాయిల బిగ్ ఫైట్
పట్నా: ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకున్న సంఘటనలు చూసే ఉంటారు. అలాంటిది ఒక అబ్బాయి కోసం ఏకంగా ఐదుగురు అమ్మాయిలు జుట్టు పట్టుకుని కొట్టుకోవటం ఎప్పుడైనా చూశారా? అలాంటి అరుదైన సంఘటనే బిహార్లో జరిగింది. సోన్పుర్ మేళలో బాయ్ఫ్రెండ్ కోసం ఐదుగురు అమ్మాయిలు గొడవ పడ్డారు. జట్టుపట్టుకుని చితక్కొట్టుకున్నారు. చుట్టూ వందల మంది ఉన్నా.. చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం ఈ ఫైటింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇంతకీ బాయ్ఫ్రెండ్ని వదిలేసి వారు కొట్టుకోవటానికి కారణాలేంటి? సోన్పుర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి ఐదుగురితో ప్రేమ వ్యవహారాన్ని నడిపించాడు. ఏ ఒక్కరికి అనుమానం రాకుండా ఇన్నాళ్లు చూసుకున్నాడు. అయితే, ఆ ఐదుగురు అమ్మాయిల్లో ఒకరితో సోన్పుర్లో జరుగుతున్న ‘మేళ’కు రావటమే అతడు చేసిన తప్పు. అదే మేళకు మిగిలిన నలుగురు అమ్మాయిలు రావటంతో రెడ్హ్యాండేడ్గా దొరికిపోయాడు. కానీ, ఆ యువకుడి కోసం అమ్మాయిలు గొడవకు దిగటమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, నలుగురు అమ్మాయిలు కలిసి ఆ యువకుడితో వచ్చిన యువతిని చితకబాదారు. ఆ యువకుడు ఆమెను కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఓ అమ్మాయి కాలితో తన్నుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది సేపటి తర్వాత అక్కడే ఉన్న కొంత మంది కలుగజేసుకుని గొడవను ఆపారు. #Bihar: Five girls fight for a boyfriend, in Sonpur's mela. The girls saw that the guy was roaming with another girl, and they attacked her.#Viral #viralvideo #india pic.twitter.com/LBDdqqQMaK — Siraj Noorani (@sirajnoorani) November 29, 2022 ఇదీ చదవండి: షాకింగ్ ఘటన.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు -
ఈతరం రీయూనియన్.. ఒకే ఫ్రేములో హీరోయిన్స్ సందడి
తమిళసినిమా: 1980 తరానికి చెందిన దక్షిణాది స్టార్ హీరోహీరోయిన్లు ఏటా రీయూనియన్ పేరుతో సరదాగా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబైలో రీయునియన్ కార్యక్రమం జరిగింది. కాగా తాజాగా ఈ తరం తారలు రీయూనియన్ వేడుకను జరుపుకున్నారు. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ కూడా ఈతరం హీరోయిన్స్తో రీయూనియన్ నిర్వహించింది. నటి కీర్తి సురేష్ తమిళం, తెలుగు, మలయాళం చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్కు జంటగా మామన్నన్ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జయం రవి సరసన నటిస్తున్న సైరన్ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది అదేవిధంగా తెలుగులో చిరంజీవి కథానాయకుడు నటిస్తున్న భోళాశంకర్ చిత్రంలో ఆయనకు చెల్లెలుగా చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే కీర్తి సురేష్కు అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. ఆమెకు ఇన్స్ట్రాగామ్లో 1.39 కోట్ల పాలోవర్స్ ఉన్నారు. కాగా ఇటీవల ఈ బ్యూటీ ఇంట్లో ఈ తరం తారల రీయూనియన్ కార్యక్రమం జరిగింది. నటి కీర్తిసురేష్తో పాటు కళ్యాణి ప్రియదర్శన్, పార్వతి తిరువొత్తు, రీమా కళింగళ్, అతిథి బాలన్, ప్రియ మార్టిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నటి కీర్తి సురేష్ తల్లి మేనక ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, లిజీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆ ఫొటోలను కీర్తి సురేష్ తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేస్తూ నూతన ఆరంభం అని పేర్కొన్నారు. అత్యుత్తమ మనుషులతో మధురమైన రేయి అని పొందుపరిచింది. -
లాడ్జిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం.. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి..
తిరువొత్తియూరు(చెన్నై): చెన్నై సాలిగ్రామంలో లాడ్జిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముగ్గురు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడున్న ఆరుగురు యువతులను విడిపించారు. పోలీసుల కథనం మేరకు.. చెన్నై ఆర్కాడు రోడ్డులోని ఓ లాడ్జిలో యువతులను పిలిపించి వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. ఈ మేరకు పోలీసుల ఇన్స్పెక్టర్ లక్ష్మి నేతృత్వంలో పోలీసులు గురువారం రాత్రి సంబంధిత లాడ్జిలో తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ రెండో అంతస్తుల్లో నాలుగు గదులను అద్దెకు తీసుకుని యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు అక్కడున్న బ్రోకర్లు రెడ్హిల్స్ ప్రాంతానికి చెందిన కర్ణన్ (36), తిరువన్నామలైకు చెందిన మనికంఠన్ (30), విల్లుపురం పట్టణానికి చెందిన శివప్రసాద్(24)ను అరెస్టు చేశారు. అక్కడున్న ఆరుగురు యువతులను విడిపించారు. పోలీసులు విచారణ జరపగా వారు వ్యభిచార నిర్వహణకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని నడుపుతున్నట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరి కొందరు బ్రోకర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చదవండి: విదేశాంగశాఖలో హనీట్రాప్ కలకలం.. సైనిక రహస్యాల కోసం పాక్ పన్నాగం -
డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల శాతం పెరుగుతోంది. ఈ ఏడాది ‘దోస్త్’నియామకాలను పరిశీలిస్తే అబ్బాయిల సంఖ్యను మించిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 4.60 లక్షల డిగ్రీ సీట్లు ఉండగా ‘దోస్త్’ద్వారా 1,90,578 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో 90,534 (47.50 శాతం) మంది బాలురు చేరితే, 1,00,044 (52.50 శాతం) మంది బాలికలు వివిధ రకాల డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొందారు. అయితే బీకాం, బీఏ కోర్సుల్లో బాలికలకన్నా బాలుర శాతమే ఎక్కువగా ఉండగా సైన్స్ గ్రూపుల్లో మాత్రం బాలురకన్నా బాలికలే ఎక్కువగా ఉన్నారు. భవిష్యత్తులో డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల శాతం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉపాధి వైపు అబ్బాయిలు.. కోవిడ్ తర్వాత 50 శాతం మంది అబ్బాయిల్లో గ్రాడ్యుయేషన్ తర్వాత కుటుంబ బాధ్యతల్లోకి వెళ్లక తప్పడం లేదని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అధ్యయనంలో వెల్లడైంది. రెండేళ్లుగా వెంబడిస్తున్న ఆర్థిక ఒడుదుడుకులే ఈ పరిస్థితికి కారణంగా సెస్ పేర్కొంది. దీనికి అనుగుణంగానే ఇంటర్ తర్వాత ఉపాధి కోర్సులను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. పీజీ చేయాలనే ఆలోచన కొందరికి మాత్రమే ఉంటోంది. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లేదా సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరడం ద్వారా తక్షణ ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కామర్స్లో 54.45 శాతం బాలురు చేరారు. బీఏలో కంప్యూటర్ అనుబంధ కోర్సుల కాంబినేషన్ రావడవంతో ఈ కోర్సులో 60.84 శాతం మంది చేరారు. మేనేజ్మెంట్ కోర్సులైన బీబీఏ, బీబీఎంలో 56.54 శాతం మంది చేరారు. వాణిజ్యరంగం పెరగడం, కామర్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు విస్తృతమవ్వడంతో ఈ కోర్సును ఎంచుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమ్మాయిల లక్ష్యం పీజీ.. గత రెండేళ్లుగా పీజీ కోర్సుల్లో చేరుతున్న అమ్మాయిల శాతం పెరిగింది. కోవిడ్ కాలం నుంచి డిగ్రీలను ఎంపిక చేసుకోవడంలోనూ ఇదే విధానం వారిలో కనిపిస్తోంది. డిగ్రీతోనే ఉపాధి వైపు వెళ్లడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదని సెస్ సర్వేలో తేలింది. దీంతో పీజీ తర్వాత పోటీ పరీక్షలు రాయడం లేదా పరిశోధనల వరకూ వెళ్లే ఆలోచనలతోనే అమ్మాయిలు అందుకు తగ్గ డిగ్రీ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది ‘దోస్త్’ప్రవేశాల్లో బీకాం, బీఏ కోర్సులకన్నా, బీఎస్సీ (లైబ్రరీ సైన్స్), సాధారణ బీఎస్సీ కోర్సుల్లో అమ్మాయిల ప్రవేశాలు ఎక్కువగా ఉన్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల వైపు అమ్మాయిలు పెద్దగా వెళ్లకపోవడం గమనార్హం. అవకాశాలు పెరగడమే కారణం.. టెన్త్, ఇంటర్ దశ నుంచే అమ్మాయిలకు గురుకులాలు పెరగడం, ఉన్నతవిద్యను అందించాలనే అవగాహన తల్లిదండ్రుల్లోనూ పెరగడం వల్ల ఉన్నతవిద్యలో అమ్మాయిల ప్రవేశాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో వారి శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
మురుఘ మఠంలో మృగత్వం...ముగ్గురు కాదు 10 మంది బాలికలపై
బనశంకరి: చిత్రదుర్గలోని ప్రఖ్యాత మురుఘ మఠాధిపతి శివమూర్తి శరణుస్వామి మఠం ఆవరణలోని హాస్టల్ బాలికలపై అత్యాచారం కేసులో పోలీసులు చార్జిషీట్లో విస్మయకరమైన అంశాలను ప్రస్తావించారు. మత్తుమందు కలిపిన యాపిల్ పండ్లను ఇచ్చి వారు మత్తులోకి జారుకున్నాక అఘాయిత్యాలకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఆఖర్లో లైంగిక దాడులకు పాల్పడినట్లు ఇద్దరు బాలికలు ఆరోపించడం తెలిసిందే. తరువాత వారానికి పోక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల కింద శివమూర్తిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఉదంతం అంతటా సంచలనం కలిగించింది. చార్జిషీట్లో ఏముంది? ఈ నేపథ్యంలో రెండో పోక్సో కేసు దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ అనిల్ నేతృత్వంలోని పోలీస్బృందం సోమవారం చిత్రదుర్గ నగర రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో 694 పేజీల చార్జిషీట్ను సమర్పించారు. ఇందులో పలు అంశాలను సవివరంగా పేర్కొన్నారు. హాస్టల్ వార్డెన్ రశ్మి బాలికలను బెదిరించి శివమూర్తి స్వామి వద్దకు పంపేది. యాపిల్ పండ్లలో మత్తు కలిపి బాలికలకు తినిపించేవారు. మత్తులో ఉండగా దారుణాలకు పాల్పడేవారు. కార్యాలయం, బెడ్రూమ్, బాత్రూమ్కు బాలికలను తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిని వ్యతిరేకించే బాలికలను తీవ్రంగా హెచ్చరించి, మఠం పాఠశాల నుంచి ఇళ్లకు పంపేవారు. ఈ రకంగా 10 మందికి పైగా బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు చార్జ్షీట్లో పేర్కొన్నారు. నిత్యం బాలికలపై అఘాయిత్యాలు జరిగేవి. మఠం మహిళా వార్డెన్ రశ్మి, కార్యదర్శి పరమశివయ్యలను కూడా నిందితులుగా పేర్కొన్నారు. ఈ నెల 5న ఆస్పత్రిలో మురుఘ స్వామికి పురుషత్వ సామర్థ్య పరీక్షలు చేయగా, పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. ఉరి వేయాలి: ఒడనాడి చీఫ్ ఈ ఘటనపై ఒడనాడి సేవా సంస్థ అధ్యక్షుడు పరశురామ్ మాట్లాడుతూ మురుఘ స్వామికి ఉరిశిక్ష విధించాలన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ పోలీసులు బాగా దర్యాప్తు చేశారని, బాధితుల బాధను కోర్టు ముందుంచారని అన్నారు. అలాగే ఏడాది కిందట మఠంలో హత్యకు గురైన బాలిక కేసును బయటకు తేవాలని ఫిర్యాదు చేశామన్నారు. బాలికను హత్య చేసింది ఎవరు అనేదానిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి: నాలుగోసారి ఆడపిల్ల పుట్టిందని..) -
ఆ తండ్రి కోరిక నెరవేరింది.. ముగ్గురు కూతుళ్లకు పోలీసు ఉద్యోగం!
‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలను నిజం చేశారు వారు. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని రుజువు చేశారు సామాన్య రైతు కుంటుబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు. పోలీసు కొలువులు సాధించి, ఒకే సారి శిక్షణ పూర్తి చేశారు. వారే కీల్అవదం గ్రామానికి చెందిన ప్రీతి, నిరంజని, వైష్ణవి. వేలూరు: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు పోలీసుకొలువు సాధించి, శభాష్ అనిపించు కున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,791 మంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏడు నెలల శిక్షణ కాలం రెండు రోజుల క్రితం ముగిసింది. ఇందులో రాణిపేట జిల్లా కీల్ అవదం గ్రామానికి చెందిన అక్కచెల్లెళ్లు ప్రీతి, నిరంజని, వైష్ణవి ఒకేసారి పోలీస్ ఉద్యోగాలకు ఎంపికై, ఒకేచోట శిక్షణ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారి తండ్రి వెంకటేశన్ మాట్లాడుతూ తన భార్య షకీలా మృతి చెందినప్పటి నుంచి తన పిల్లలు ప్రీతి, నిరంజని, వైష్ణవి, కుమారుడు కార్తికేయన్ను సక్రమంగా చదివించి, ప్రభుత్వ ఉద్యోగంలో చేరి్పంచాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను ఫ్లస్–2 పూర్తి చేశానని, అనంతరం పోలీస్ ఉద్యోగం కోసం ప్రయతి్నంచానన్నారు. అయితే పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోయానని చెప్పారు. దీంతో తనకున్న ఐదు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ తన పిల్లలను చదివించుకుంటున్నానని తెలిపారు. తన ముగ్గురు కుమార్తెలు డిగ్రీ పూర్తి చేశారని, కుమారుడు చెన్నైలో చదువుతున్నాడని చెప్పారు. పెద్ద కుమార్తె ప్రీతికి రాజీవ్గాంధీ అనే వ్యక్తితో వివాహం జరిగి, ఇద్దరు కుమారులున్నారని, తన మిగిలిన ఇద్దరు కుమార్తెలకు ఇంకా వివాహం కాలేదని తెలిపారు. అక్కాచెల్లెళ్లందరికీ ఒకేసారి పోలీసు ఉద్యోగం రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. వారు ముగ్గురు కొన్నేళ్లుగా పోలీసు ఉద్యో గం కోసం వేచి ఉన్నారని, తనకు రాని పోలీస్ ఉద్యోగం తన కుమార్తెలకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ముగ్గురు కుమార్తెలు ప్రభుత్వ పాఠశాలలో విద్యను పూర్తి చేశారని, ముగ్గురు కుమార్తెలు ఇంట్లోనే చదివి పోలీస్ పరీక్షలకు హాజరైనట్లు తెలిపారు. తన ముగ్గురు కుమార్తెలు ఒకేసారి ఎంపికై ఒకే ప్రాంతంలో శిక్షణ పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చదవండి: ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం -
కరోనాతో ముందస్తు రజస్వల
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ముందస్తు రజస్వల అవడానికి కూడా దారి తీస్తోందన్న దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా బయట పడింది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాలికల్లో ఈ కేసులు పెరుగుతున్నట్లు సర్వేల్లో తేలింది. సాధారణంగా బాలికలు 13 నుంచి 16 ఏళ్ల వయసులో రజస్వల అవుతుంటారు. కానీ, 8 ఏళ్ల బాలికలు సైతం ఉదంతాలు బయటపడ్డాయి. ‘‘ఒకమ్మాయి నా దగ్గరికొచ్చింది. ఆమె వయసు ఎనిమిదేళ్ల తొమ్మిది నెలలు. అప్పుడే íపీరియడ్స్ మొదలయ్యాయి’’ అని ఢిల్లీలోని ప్రముఖ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మన్ప్రీత్ సేథీ చెప్పారు. కరోనాకు ముందు ఎర్లీ ప్యూబర్టీ కేసులు నెలకు 10 వరకూ వచ్చేవని, ఇప్పుడు 30 దాటుతున్నాయని వెల్లడించారు. ఇటలీ, టర్కీ, అమెరికాల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. కారణమేమిటి?: ముందస్తు రజస్వలకు ప్రధాన కారణం కోవిడ్–19 వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆ సమయంలో జనమంతా ఇళ్లకే పరిమితయ్యారు. విద్యార్థులకు ఆటపాటలు కూడా లేవు. నెలల తరబడి ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఫలితంగా వారిలో జీవక్రియలు(మెటబాలిజం) ప్రభావితమయ్యాయి. మన మెదడు మన శరీరం ఎత్తును పరిగణనలోకి తీసుకోదు. బరువును మాత్రం పరిగణనలోకి తీసుకుంటుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే అన్ని హార్మోన్ల స్థాయిలను పిట్యూటరీ గ్రంథి పర్యవేక్షిస్తూ ఉంటుంది. శరీరం ఒక స్థాయి బరువుకు చేరుకోగానే ఈ గ్రంథి ప్యూబర్టీని ప్రేరేపిస్తుంది. ఫలితంగా బాలికల్లో పిరియడ్స్ ప్రారంభమవుతాయి. ఇందులో హార్మోన్ల స్థాయి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంటే బరువును నియంత్రణలో ఉంచుకుంటే ముందుస్తు రజస్వలను అరికట్టవచ్చని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. -
స్నేహం పేరుతో టోకరా... ఇద్దరు నైజీరియన్లు అరెస్టు
హిమాయత్నగర్: సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్ట్రాగామ్ వేదికగా అమ్మాయిలను మోసం చేస్తున్న నైజీరియన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో అడిషనల్ డీసీపీ స్నేహ మెహర, ఏసీపీ కేవీఎం ప్రసాద్లతో కలిసి వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన ఓ యువతికి యూఎస్లో ఉంటానంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. స్నేహానికి గుర్తుగా యూఎస్ నుంచి విలువైన గిఫ్ట్లు పంపిస్తున్నట్లు సదరు వ్యక్తి యువతితో నమ్మబలికాడు. ఢిల్లీ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నామని యువతికి ఫోన్ చేసి రూ. 2.50 లక్షలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించగా.. నైజీరియాకు చెందిన అల్లోట్ పీటర్ అలియాస్ చిబుజా, రోమాన్స్ జాషువాలను గుర్తించి అరెస్ట్ చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. (చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం) -
షాకింగ్ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్ అయిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చక్దేపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్థానిక మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్డను శుభ్రం చేయమని బలవంతం చేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. వారంతా ఐదు, ఆరు తరగతులు చదువుతున్న విద్యార్థినులంటూ పలు కథనలు వచ్చాయి. ఐతే ఆ వార్తన్నింటిని జిల్లా విధ్యాధికారి సోనమ్ జైన్ ఖండించారు. విచారణలో ఆ బాలికలు తాము మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని, వర్షాల కారణంగా మరుగుదొడ్లు మురికిగా ఉన్నందున చేతిపంపు నుంచి నీటిని తెచ్చిపోశామని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆ బాలికలు, వారి తల్లిదండ్రుల స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు జైన్ వెల్లడించారు. ఐతే ఈ ఘటనపై సీరియస్ అయిన రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ విషయంపై గుణ జిల్లా కలెక్టర్ను విచారణ చేయమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో పాఠశాల విదయాశాఖ బృదం పాఠశాలకు చేరుకుని ప్రత్యేక విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేగాతు ఈ ఘటనలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సిసోడియా పేర్కొన్నారు. यह तस्वीरें बेहद आपत्तिजनक है… मामाजी की सरकार में स्कूल में भाँजियो से शौचालय साफ़ करवाया जा रहा है.. तस्वीरें गुना ज़िले के बमोरी के चकदेवपुर के प्राथमिक- माध्यमिक स्कूल की है…. “ बेटी पढ़ाओ “ अभियान की हक़ीक़त… pic.twitter.com/UweK7emh8l — Narendra Saluja (@NarendraSaluja) September 22, 2022 (చదవండి: భారీ వర్షాలు..స్కూల్స్ బంద్, ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం) -
సైకిల్ దీదీ... :సుధా వర్గీస్ సేవకు షష్టిపూర్తి
చదువు బతకడానికి అవకాశం ఇస్తుంది. అదే చదువు ఎంతోమందిని బతికించడానికి ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. బీహార్లో సామాజికంగా అత్యంత వెనకబడిన ముసహర్ కమ్యూనిటీకి చెందిన బాలికల సాధికారతకు ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తున్న సుధా వర్గీస్ చదువుతో పాటు ప్రేమ, ధైర్యం, కరుణ అనే పదాలకు సరైన అర్థంలా కనిపిస్తారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి సామాజిక నాయికగా ఎలా ఎదిగిందో తెలుసుకుందాం... ముసహర్ సమాజంలో సైకిల్ దీదీగా పేరొందిన సుధా వర్గీస్ పుట్టి పెరిగింది కేరళలోని కొట్టాయంలో. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒక పేపర్లోని వార్త ఆమెను ఆకర్షించింది. అందులో.. బీహార్లోని ముసహర్ల సమాజం ఎదుర్కొంటున్న భయానకమైన జీవనపరిస్థితులను వివరిస్తూ ఫొటోలతో సహా ప్రచురించారు. ‘ముసహర్’ అంటే ‘ఎలుకలు తినేవాళ్లు’ అనేది తెలుసుకుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో ఇలాంటివి ఎన్నడూ చూడని ఆ సామాజిక వెనుకబాటుతనం సుధను ఆశ్చర్యపరిచింది. ‘వీరి పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేయలేమా..?!’ అని ఆలోచించింది. తనవంతుగా కృషి చేయాలని అప్పుడే నిర్ణయించుకుంది. కాలేజీ రోజుల్లోనే... ముసహర్ ప్రజలకోసం పనిచేయాలని నిర్ణయించుకొని బీహార్లోని పాట్నా నోట్రే డామ్ అకాడమీలో చేరింది. అక్కడ శిక్షణ పొందుతున్న సమయంలోనే ఇంగ్లిష్, హిందీ నేర్చుకుంది. 1986లో తన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ముసహర్లతో కలిసి జీవించాలని, వారికి విద్యను అందించాలని, వారి జీవితాలను మెరుగుపరచడానికి తన సమయాన్ని, వనరులను వెచ్చించాలని నిర్ణయించుకుంది. గుడిసెలో జీవనం... ముసహర్లు గ్రామాల సరిహద్దుల్లో ఉండేవారు. ఆ సరిహద్దు గ్రామాల్లోని వారిని కలుసుకోవడానికి సైకిల్ మీద బయల్దేరింది. అక్కడే ఓ పూరి గుడిసెలో తన జీవనం మొదలుపెట్టింది. ‘ఇది నా మొదటి సవాల్. ఆ రోజు రాత్రే భారీ వర్షం. గుడిసెల్లోకి వరదలా వర్షం నీళ్లు. వంటపాత్రలతో ఆ నీళ్లు తోడి బయట పోయడం రాత్రంతా చేయాల్సి వచ్చింది. కానీ, విసుగనిపించలేదు. ఎందుకంటే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుని వచ్చాను. ఎలాంటి ఘటనలు ఎదురైనా వెనక్కి వెళ్లేదే లేదు’ అనుకున్నాను అంటూ తన ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటారు సుధ. పేదరికంతోనేకాదు శతాబ్దాలనాటి కులతత్వంపై కూడా పోరాటానికి సిద్ధమవడానికి ప్రకృతే ఓ పాఠమైందని ఆమెకు అర్ధమైంది. ముసహర్లు తమజీవితంలోని ప్రతి దశలోనూ, ప్రాంతీయ వివక్షను ఎదుర్కొంటున్నారు. వారికి చదువుకోవడానికి అవకాశాల్లేవు. స్కూల్లోకి ప్రవేశం లేదు. సేద్యం చేసుకోవడానికి భూమి లేనివారు. పొట్టకూటికోసం స్థానికంగా ఉన్న పొలాల్లో కూలీ పనులు చేస్తుంటారు. ఈ సమాజంలోని బాలికలు, మహిళలు తరచు అత్యాచారం, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మొదటి పాఠశాల... ముసహర్ గ్రామంలో వారిని ప్రాధేయపడితే చదువు చెప్పడానికి అంగీకరించారు. బాలికలకు చదువు, కుట్లు, అల్లికలు నేర్పించడానికి ఆమె ప్రతిరోజూ పోరాటమే చేయాల్సి వచ్చేది. దశాబ్దాల పోరాటంలో 2005లో సామాజికంగా వెనుకబడిన సమూహాలకు చెందిన బాలికల కోసం ఓ రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నుంచి వెనకబడిన సమాజానికి చెందిన బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. ఆమె కృషిని అభినందిస్తూ 2006లో భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కుటుంబం నుంచి ఆరుగురు తోబుట్టువులలో పెద్ద కూతురుగా పుట్టిన సుధ కళల పట్ల ప్రేమతో స్కూల్లో నాటకాలు, నృత్యం, పాటల పోటీలలో పాల్గొనేది. పెద్ద కూతురిగా తల్లీ, తండ్రి, తాత, బామ్మలు ఆమెను గారాబంగా పెంచారు. ‘స్కూల్లో నేను చూసిన పేపర్లోని ఫొటోల దృశ్యాలు ఎన్ని రోజులైనా నా తలలో నుంచి బయటకు వెళ్లిపోలేదు. అందుకే నేను బీహార్ ముసహర్ సమాజం వైపుగా కదిలాను’ అని చెబుతారు ఈ 77 ఏళ్ల సామాజిక కార్యకర్త. ‘మొదటగా నేను తీసుకున్న నిర్ణయానికి మా అమ్మ నాన్నలు అస్సలు ఒప్పుకోలేదు. నేనేం చెప్పినా వినిపించుకోలేదు. కానీ, నా గట్టి నిర్ణయం వారి ఆలోచనలనూ మార్చేసింది’ అని తొలినాళ్లను గుర్తుచేసుకుంటారు ఆమె. బెదిరింపుల నుంచి... అమ్మాయిలకు చదువు చెప్పడానికి ముసహర్ గ్రామస్తులను ఒక స్థలం చూపించమని అడిగితే తాము తెచ్చుకున్న ధాన్యం ఉంచుకునే ఒక స్థలాన్ని చూపించారు. అక్కడే ఆమె బాలికల కోసం తరగతులను ప్రారంభించింది. ‘ఈ సమాజానికి ప్రధాన ఆదాయవనరు మద్యం తయారు చేయడం. మద్యం కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వస్తుండటంతో యువతుల చదువుకు ఆటంకం ఏర్పడేది. దీంతో నేనుండే గుడిసెలోకి తీసుకెళ్లి, అక్కడే వారికి అక్షరాలు నేర్పించేదాన్ని. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ క్లాసులు కూడా తీసుకునేదాన్ని. రోజు రోజుకూ అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. వారిలో స్వయం ఉపాధి కాంక్ష పెరుగుతోంది. కానీ, అంతటితో సరిపోదు. వారి హక్కుల కోసం గొంతు పెంచడం అవసరం. తిరుగుబాటు చేస్తారనే ఆలోచనను గమనించిన కొందరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. చంపేస్తారేమో అనుకున్నాను. దీంతో అక్కణ్ణుంచి మరో చోటికి అద్దె ఇంటికి మారాను. కానీ, ఇలా భయపడితే నేననుకున్న సహాయం చేయలేనని గ్రహించాను. ఇక్కడి సమాజానికి అండగా ఉండాలని వచ్చాను, ఏదైతే అది అయ్యిందని తిరిగి మొదట నా జీవనం ఎక్కడ ప్రారంభించానో అక్కడికే వెళ్లాను’ అని చెబుతూ నవ్వేస్తారు ఆమె. ముసహర్ల కోసం సేవా బాట పట్టి ఆరు దశాబ్దాలు గడిచిన సుధి ఇప్పుడు వెనకబడిన సమాజపు బాలికల కోసం అనేక రెసిడెన్షియల్ స్కూళ్లను నడుపుతోంది. యువతులకు, మహిళలకు జీవనోపాధి కార్యక్రమాలను చేపడుతోంది. ఈ దళిత సంఘాలను అగ్ర కులాల సంకెళ్ల నుండి శక్తిమంతం చేస్తోంది. ఈమె శతమానం పూర్తి చేసుకోవాలని కోరుకుందాం. నైపుణ్యాల దిశగా.. సుధ వర్గీస్ ఏర్పాటు చేసిన ముసహర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలికలు చదువులోనే కాదు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో పతకాలను సాధించుకు వస్తున్నారు. ఇక్కడ నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, నాయకులు కావడానికి సన్నద్ధం అవుతున్నారు. ఈ సమాజంలోని మహిళలు బృందాలుగా కూరగాయలు పండిస్తూ జీవనోపాధిని మెరుగుపరుచుకుంటున్నారు. వీరు చేస్తున్న హస్తకళలను ప్రభుత్వ, ఉన్నతస్థాయి ఈవెంట్లలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి చవకగా లభించే శానిటరీ న్యాప్కిన్లను తయారుచేస్తున్నారు. -
ప్రియుడి కోసం ఇద్దరమ్మాయిల డిష్యుం.. డిష్యుం
ఔరంగాబాద్: ఇద్దరు టీనేజర్లు.. ఒకే కుర్రాడిని ప్రేమించారు. కాదు.. కాదు.. ఆ కుర్రాడే ఒకరికి తెలియకుండా మరొకరిని మ్యానేజ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి విషయం బయటపడేసరికి.. కుర్రాడి కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ఆ అమ్మాయిలు.. వాళ్లలో వాళ్లే ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని బాహాబాహీకి దిగారు. మహారాష్ట్రలోని పయ్థాన్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఇద్దరమ్మాయిల్లో.. ఒక అమ్మాయి సదరు కుర్రాడితో కలిసి స్థానిక బస్టాండ్కు చేరుకుంది. ఆ సమయంలో మరో అమ్మాయి కూడా అక్కడే ఉంది. వీళ్లిద్దరినీ గమనించి.. దగ్గరకు వచ్చి నిలదీసింది. విషయం తేలేసరికి.. ప్రియుడు తనవాడంటే తనవాడంటూ ఇద్దరు జుట్టు జుట్టు పట్టుకుని తన్నుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వీళ్లను నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. లాభం లేకపోయింది. ఈ గ్యాప్లో ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయినా అదేం పట్టించుకోకుండా ఆ యువతులు ఫైటింగ్ కొనసాగించారు. ఈలోపు పోలీసులు వచ్చి.. ఇద్దరినీ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇప్పి పంపించారు. ఇదీ చదవండి: చిన్నారుల స్టెప్పులకు కేటీఆర్ ఫిదా -
ట్రెండు మారుతోంది...ఆడబిడ్డే కావాలి..! ‘కారా’ దరఖాస్తు విధానం ఇలా!
సాక్షి, హైదరాబాద్: పిల్లల దత్తతలో ట్రెండు మారుతోంది. ఇప్పుడు అమ్మాయి కావాలనే డిమాండ్ పెరుగుతోంది. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలను పరిశీలిస్తే... దత్తత కోసం వచ్చే దంపతులు అమ్మాయిలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విదేశీ దంపతులు సైతం అమ్మాయిల దత్తతకే మొగ్గు చూపుతున్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 663 మంది పిల్లల్ని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దత్తత ఇచ్చింది. ఇందులో 190 మంది బాలురు, 473 మంది బాలికలు. వీరిలో విదేశీ దంపతులు 127 మందిని దత్తత తీసుకోగా... వారిలో బాలురు 38 మంది, 89 మంది బాలికలున్నారు. దత్తత వెళ్లినవారిలో బాలురతో పోలిస్తే బాలికలు దాదాపు రెండున్నర రెట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఇద్దరూ సమానమైనా... పిల్లల విషయంలో ఇప్పుడు ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఇదివరకు మగపిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.. వారిని ప్రైవేటు స్కూల్లో చేర్పించడం, ఉన్నత చదువులు చదివించడం కనిపించేది. కొన్నేళ్లుగా ఆ పరిస్థితులు మారిపోయాయి. అబ్బా యి, అమ్మాయి అనే తేడా కనుమరుగవుతోంది. పిల్లలెవరైనా సమాన దృష్టితో చూసే భావన పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలకే కాస్త ప్రాధాన్యత ఇస్తున్నారు. తల్లిదండ్రులిద్దరికీ ఆడబిడ్డతోనే అనుబంధం ఎక్కువగా ఉంటోందని పలు సర్వేలు సైతం చెబుతున్నాయి. ‘కారా’ దరఖాస్తుతో దత్తత కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పిల్లల దత్తత కోసం కారా (సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ) అనే ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకుంటున్న దంపతులు ముందు ఈ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు, అర్జీదారుల ఇంటికెళ్లి ప్రత్యేకంగా పరిశీలిస్తారు. దత్తత తీసుకుంటే.. పిల్లలను పోషించే స్తోమత ఉందా? కుటుంబ నేపథ్యం ఏమిటి? వంటివి తెలుసుకున్న తర్వాతే ఆన్లైన్ దరఖాస్తును ఫార్వర్డ్ చేస్తారు. తరువాత.. పిల్లల లభ్యత ఆధారంగా దరఖాస్తుదారులకు ఫోన్, ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం ఇస్తారు. దరఖాస్తుదారు సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని అధికారులు ఆ మేరకు సమాచారమిస్తుంటారు. దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన పిల్లలనైనా దత్తత తీసుకో వచ్చు. భారత ప్రభుత్వం, విదేశీ దంపతులకు సైతం దత్తత వెసులుబాటును కల్పించింది. -
గుంటూరు జిల్లాలో గుజరాత్ అమ్మాయిల ఆగడాలు
-
రోడ్డుపై అమ్మాయిల హల్చల్.. వీడియో వైరల్
సాక్షి, గుంటూరు: జిల్లాలో గుజరాత్ అమ్మాయిలు హల్చల్ చేశారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి అమ్మాయిల ముఠా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా బలవంతపు వసూళ్లపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ప్రభుత్వ పథకాలతో వివక్ష మాయం
భరుచా: ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలైతే సమాజంలో వివక్షల్ని రూపుమాపవచ్చునని, బుజ్జగింపు రాజకీయాలకు కూడా తెరదించవచ్చునని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడం కోసం రూపొందించిన నాలుగు పథకాలు నూటికి నూరు శాతం భరూచీ జిల్లాలో లబ్ధిదారులందరికీ అందిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ భావోద్వేగం అంతకు ముందు ప్రధాని మోదీ పథకాలు అందుకున్న లబ్ధి దారులతో మాట్లాడారు. వారిలో కంటి చూపు కోల్పోయిన అయూబ్ పటేల్ తన పెద్ద కుమార్తె అలియాతో కలిసి వచ్చారు. పన్నెండో తరగతి చదువుతున్న ఆమె డాక్టర్ చదవాలని అనుకుంటోందని, అందుకోసం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు డాక్టర్ చదవాలని అనుకుంటున్నావు అని ఆ అమ్మాయిని ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని ప్రధాని కదిలిపోయారు. చూపు లేని తన తండ్రి దుస్థితిని చూస్తూ తట్టుకోలేకపోతున్నానని, అందుకే డాక్టర్ అవుదామని అనుకుంటున్నానని అలియా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. దీంతో ప్రధాని కాసేపు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చే విషయంలో ఒక సరళమైన విధానాన్ని తీసుకురావాలన్నారు. మేధో సంపత్తి హక్కులు మంజూరు చేసే విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను సరళం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో కోవిడ్–19పై గురువారం నిర్వహించిన రెండో గ్లోబల్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాపోసా పాల్గొన్నారు. -
వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్ని తాగిన అథ్లెట్లు...ఆ తర్వాత..
School athletes drink sanitiser: నిజానికి దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందింప చేసేందుకు దోహదపడేవి క్రీడలు. అంతేకాదు ఐక్యతను చాటి చెప్పేందుకే ప్రపంచ దేశాలన్నీ క్రీడలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తాయి. ఆయ దేశాలు తమ క్రీడాకారులకు కావల్సిన సౌకర్యాలను కల్పించి మరి దేశ విదేశాల్లో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది కూడా. కానీ కొన్నిచోట్ల అరకొర సౌకర్యాలతో సమస్యలను ఎదుర్కొంటున్న క్రీడాకారులు ఉన్నారు. అంతేకాదు స్పోర్ట్స్ ట్రైయినింగ్ సెంటర్లలో క్రీడాకారులకు సంబంధించిన డైట్ విషయంలో నిర్లక్ష్యం వహించి వారి జీవితాలతో ఆడుకున్న సందర్భాలు అనేకం. అచ్చం అలానే ఒక పాఠశాలలోని అథ్లెట్లు స్పోర్ట్స్ నిర్వాహకులు నిర్లక్ష్య వైఖరితో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. వివరాల్లోకెళ్తే...జపాన్లోని ఒక పాఠశాలలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జపాన్లోని యమనాషి ప్రిఫెక్చర్లో నిర్వాహకులు గత వారాంతంలో బాలికల 5 వేల మీటర్ల మారథాన్ రేసును నిర్వహించారు. ఐతే పొరపాటున నిర్వాహకులు వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్ని కప్పుల్లో వేసి సర్వ్ చేశారు. దీంతో ఒక అథ్లెట్ వాంతులు చేసుకుని రేసు నుంచి నిష్క్రమించగా, మరో ఇద్దరు మాత్రం ఉమ్మివేసి రేసుని తిరిగి కొనసాగించినట్లు జపాన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు మొత్తం ముగ్గురు అథ్లెట్లు అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. తాగునీటి వాటర్ బాటిల్ తోపాటు శానిటైజర్ కూడా అదే ప్లాస్టిక్ బాటిల్తో ఉందని హైస్కూల్ యమనాషి స్పోర్ట్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని యమనాషి గవర్నర్ కొటారో నాగసాకి తెలిపారు. అంతేకాదు ఆయన అథ్లెట్లకు వారి కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక క్షమాపణలు చెప్పారు కూడా. (చదవండి: శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు) -
ఇంటి నుంచి వెళ్లిపోయిన నలుగురు ఆడపిల్లలు.. కారణం తెలిసి అవాక్కయిన తల్లిదండ్రులు
సాక్షి, బళ్లారి: పబ్జీలు, రియాలటీషోలతో ప్రభావితమైన నలుగురు చిన్నారులు ఏదైనా సాధించాలనే తపనతో ఉన్నఫళంగా ఇళ్లు వదిలారు. బస్సు ఎక్కి బెంగళూరు చేరుకోగా డ్రైవర్, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి వారిని సురక్షితంగా పోలీసులకు అప్పగించారు. వివరాలు.. బళ్లారిలోని పార్వతీనగర్లో నివాసం ఉంటున్న రెండు కుటుంబాలకు చెందిన దాదాపు పదేళ్ల వయసున్న ఆడపిల్లలు నలుగురు గతనెల 26న మధ్యాహ్నం ఇళ్లు వదిలారు. ఏదైనా సాధించేందుకు వెళ్తున్నామని, అంతవరకు తాము ఎక్కడున్నా పట్టించుకోవద్దని సెల్ఫోన్లో రికార్డు చేశారు. బళ్లారిలోని కొత్త బస్టాండుకు వెళ్లి బెంగళూరు బస్సు ఎక్కారు. వారి వెంట పెద్దలు లేకపోవడంతో డ్రైవర్, కండక్టర్ ఆరా తీశారు. కుటుంబ సభ్యుల వద్దకు వెళ్తున్నట్లు నమ్మబలికారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో బెంగళూరులో బస్సు దిగకుండా భయం భయంగా దిక్కులు చూస్తుండటంతో డ్రైవర్, కండక్టర్కు అనుమానం వచ్చి ఉప్పారపేటె పోలీసు స్టేషన్లో అప్పగించారు. మరో వైపు తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు గాలింపు చేపట్టారు. ఉప్పారపేటె పోలీసు స్టేషన్లో చిన్నారులు ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో రావడంతో తల్లిదండ్రులు వెళ్లి బళ్లారికి తీసుకొని వచ్చారు. బస్సు డ్రైవర్ రవికుమార్, కండక్టర్ నవాజ్కు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Divya Hagaragi Arrested: దివ్య మొబైల్ ముక్కలు! -
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. వైద్య విద్యార్థిని అలా చేస్తూ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: పెరంబలూరుకు చెందిన ఇద్దరు బాలికలు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. విడదీయలేని స్నేహబంధాన్ని వివాహ బంధంగా మార్చుకునేందకు లింగమార్పిడికి సిద్ధపడ్డారు. ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరిని పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పెరంబలూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు (17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఈనెల 5వ తేదీ కాలేజీకి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పెరంబలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిద్దరూ చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు పెరంబలూరుకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వారిని విచారించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆరో తరగతి నుంచే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. వీరిలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థినికి మగవారి చెప్పులు, దుస్తులు ధరించడం, క్రాఫ్ చేసుకోవడం వంటి లక్షణాలు అలవడ్డాయి. జీవితాంతం ఇద్దరం కలిసి ఉండాలంటే ఒకరు మగవారిగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ముందుగా చెన్నైలో వైద్య పరీక్షలు చేయించుకుని ముంబయికి వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్సకు సిద్ధపడుతున్న తరుణంలో శుక్రవారం వీరు చెన్నై పోలీసులకు చిక్కారు. ఇద్దరు విద్యార్థినులను తల్లిదండ్రులకు అప్పగించి చైల్డ్లైన్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. -
మేనేజర్ రోజూ ఏదో ఒక వంకతో మా దగ్గరకు వచ్చి..
మైసూరు(బెంగళూరు): మైసూరులోని హెబ్బాళ సమీపంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులను వేధింపులకు గురి చేసిన ఆరోపణలపై గురుకులం మేనేజర్ గిరీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ 18 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. గిరీష్ రోజూ ఎవరూ లేని సమయంలో తమ వద్దకు వచ్చి లైంగికంగా వేధిస్తున్నట్లు విద్యార్థినులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మేనేజర్ను అరెస్ట్ చేశారు. మరో ఘటనలో.. మద్యం మత్తులో గొడవ.. ఒకరి హత్య మండ్య: మద్యం మత్తులో జరిగిన గొడవలో ఒకరు హతమయ్యారు. ఈఘటన మళవళ్లి తాలూకా హలగూరులో చోటు చేసుకుంది. హలగూరుకు చెందిన మను(30) చెత్త పేపర్ల సేకరణతో జీవిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం లిక్కర్ షాపు వద్ద మద్యం తాగి వస్తుండగా మరో వ్యక్తితో గొడవ జరిగింది. షాపువారు ఇద్దరినీ మందలించి పంపారు. రాత్రి 9గంటల సమయంలో ఇద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. బీరు బాటిల్ తీసుకొని తలపై బాదడంతో మను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చదవండి: నోట్ రాసి మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం -
బాలికలను స్కూళ్లకు అనుమతించండి...తాలిబన్లను ఆదేశించిన యూఎన్
Taliban on allowing girls in high schools: గతేడాది అఫ్గనిస్తాన్ని స్వాధీనం చేసుకుని తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలికలను పాఠశాలలకు వెళ్లకుండా నిషేధిస్తూ తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు యూఎన్ఎస్సీ సభ్యుల ఈ విషయమై అఫ్గనిస్తాన్కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి డెబోరా లియోనన్స్తో చర్చించారు. ఆ సమావేశలో బాలికలతో సహా అఫ్గాన్లందరి విద్యా హక్కు గురించి పునరుద్ఘాటించారు. విద్యా హక్కును గౌరవించడమే కాకుండా విద్యార్థులందరూ పాఠశాలకు వెళ్లేలా స్కూళ్లు తెరవాలని తాలిబన్లకు పిలుపునిచ్చారు. అఫ్గనిస్తాన్ ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యూఎన్ఏఎంఏ) , ఈ సమస్యపై సంబంధిత అఫ్గాన్ వాటాదారులందరితో పరస్పర చర్చ కొనసాగించాలని సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిని ఆదేశించింది. అంతేగాదు ఈ అంశం పురోగతిపై భద్రతా మండలికి తెలియజేయాలని కూడా కోరింది. విద్యతో సహా అన్ని అంశాల్లో అఫ్గనిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యతను భద్రతా మండలి సభ్యులు నొక్కి చెప్పారు. అయితే గతేడాది అఫ్గనిస్తాన్లోని వేలాది మంది సెకండరీ పాఠశాల బాలికలు ఆగస్టు 2021 తర్వాత మొదటిసారి తరగతులకు హాజరు కావడానికి ఆసక్తి కనబర్చారు. కానీ కొన్ని గంటల్లోనే పాఠశాలలను మూసివేయాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాదు తాలిబాన్ ప్రభుత్వం తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే వరకు బాలికలు ఇంట్లోనే ఉండాలని సూచించారు కూడా. ఒక వారంలోగా బాలికల మాధ్యమిక పాఠశాలలను తిరిగి తెరవడంలో తాలిబాన్ విఫలమైతే దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని అప్గాన్లోని మహిళా హక్కుల కార్యకర్తలు హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాజధాని నగరం కాబూల్లో విద్యార్థినిలు విద్య మన సంపూర్ణ హక్కు అని నినాదాలు చేశారు. అయితే ఈ విషయమై తాలిబానీ విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ ఇస్లామిక్ ఎమిరేట్ సీనియర్ నాయకుడు మాత్రం పాఠశాలలను తిరిగి తెరవడానికి ముందు కొన్ని ఆచరణాత్మక సమస్యలను ఇంకా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. (చదవండి: రష్యా బలగాల ఉపసంహరణ దిశగా వ్యూహం.. భయాందోళనలో ఉక్రెయిన్) -
వేధింపులు ఆపాలని ధర్నా చేసినందుకు యువతి ముక్కు కోసిన సర్పంచ్
ఛత్తీస్గడ్: సర్పంచ్ అంటే ఊరికి పెద్ద. ఆ గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అతనిది. కానీ అలాంటి వ్యక్తే ప్రజలకు సమస్యగా మారాడు. ఆ గ్రామంలోని ముగ్గురు అమ్మాయిలను వేధింపులకు గురిచేశాడు. అతని చేష్టలకు వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు ఒక అమ్మాయి ముక్కును కత్తిరించాడు. ఈ దారుణ ఘటన బీహార్లోని సుపాల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్ గ్రామంలో సర్పంచ్ ముస్తాకిన్ తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను కొంత కాలంగా వేధిస్తున్నాడు. అతని వేధింపులను భరించలేని వాళ్లు తమకు న్యాయం చేయాలంటూ సర్పంచ్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. దీనికి కోపంతో ఊగిపోయిన ఆ సర్పంచ్ ధర్నా చేస్తున్న వారిలో ఒక అమ్మాయి ముక్కు కోశాడు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు సర్పంచ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు, తనపై, తన మద్దతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. -
తాలిబన్ల రాజ్యం ఆప్గన్లో స్కూల్స్ ఓపెన్.. స్పెషల్ కండీషన్స్ అప్లై..
కాబూల్: ఆప్గనిస్తాన్లో తాలిబన్ల ప్రభుత్వం కొనసాగుతోంది. ఆప్గన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆఫ్గాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. అనంతరం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాలిబన్లు మళ్లీ దేశంపై ఆధిపత్యం సాధించారు. ఇదిలా ఉండగా.. తాలిబన్ల సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆప్గనిస్తాన్ పిల్లల చదువు విషయంలో సర్కార్ దృష్టిసారించింది. వచ్చే వారం నుంచి విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రభుత్వ విద్యా మంత్రి అజీజ్ అహ్మద్ రయాన్ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే వారం నుంచి స్కూల్స్, కాలేజీలు తెరుస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో కొన్ని కండీషన్ అప్లై అంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా విద్యా సంస్థలు నడుస్తాయని చెప్పారు. అయితే, బాలికలకు సంబంధించిన విద్యా సంస్థల్లో కేవలం మహిళా స్టాఫ్ మాత్రమే బోధిస్తారని తెలిపారు. అలాగే, రిమోట్ ప్రాంతాల్లో మహిళా స్టాఫ్ లేని క్రమంలో వయస్సు మళ్లిన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందించనున్నట్టు వెల్లడించారు. కాగా, బాలుర విద్యాసంస్థల్లో పురుషులతో తరగతుల నిర్వహణ జరుగుతుందన్నారు. మరోవైపు, ఈ విద్యా సంవత్సరంలో స్కూల్స్, కాలేజీల మూసివేత ఉండదని స్పష్టం చేశారు. -
ముందులా కాదు.. ట్రెండ్ మారింది, ఆడపిల్ల విషయంలో అభిప్రాయం మారుతోంది
సాక్షి,రాజాం(శ్రీకాకుళం): ఆడపిల్ల విషయంలో అభిప్రాయం మారుతోంది. ఐదేళ్ల కిందటకు ఇప్పటికి స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఐదేళ్ల కిందటి వరకు అమ్మాయికి తొందరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపేద్దామనే ఆత్రుత జిల్లా ప్రజల్లో కనిపించేది. అధికారులు ఎంతగా ప్రచారం చేసినా, అవగాహన కల్పించినా గ్రామాల్లో గుట్టుగా బాల్య వివాహాలు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ విధి విధానాలు, బాలల సంరక్షణ విభాగం పటిష్ట చర్యలు, గ్రామాల్లో ఆర్థిక పరిపుష్టి, బాలికల విద్యావకాశాలు మెరుగుపడడంతో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. బాలల సంరక్షణ విభాగం చొరవ జిల్లాలో బాలల సంరక్షణ విభాగం చురుగ్గా పనిచేస్తోంది. గత నాలుగేళ్లుగా ఈ విభాగం సేవలు, నిత్య పర్యవేక్షణ, అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి వేగంగా వెళ్లాయి. ప్రధానంగా భారతీయ వివాహ చట్టాన్ని ఆడపిల్లల తల్లిదండ్రులకు చేరవేయగలిగారు. మరో వైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, చైల్డ్లైన్లు ఎక్కడికక్కడే అవగాహన కార్యక్రమాలు చేయడం, ఎప్పటికప్పుడు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ద్వా రా చదువు మానేస్తున్న బాలికలను గుర్తించి వారి కి ఉన్నత విద్యను అందించే ఏర్పాట్లు చేయడం, బాలికల సంరక్షణ వసతిగృహాల్లో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. గత పదేళ్లలో.. గత పదేళ్లుగా చూసుకుంటే బాల్య వివాహాలు 2011 కంటే ప్రస్తుతం భారీగా తగ్గుముఖం పట్టాయి. 2011–12లో ఏడాదికి సగటున బాల్య వివాహాల నమోదు 395గా ఉండేది. 2018–20 మధ్య కాలంలో ఏడాదికి 163 నుంచి 128కి తగ్గుముఖం పట్టాయి. 2021–22 ఏడాదిలో ఈ వివాహాలు 54కి నమోదు కాగా, ఈ ఏడాదిలో ఈ మొత్తం బాల్య వివాహాలను బాలల సంరక్షణ విభాగం అడ్డుకోగలిగింది. (చదవండి: Scolded Drinking Habit: తమ్ముడి నిర్వాకం...సొంత అక్కపైనే అఘాయిత్యం ) పెరిగిన విద్యావకాశాలు.. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు గ్రామాల్లో విద్యావకాశాలు బాగా పెరిగాయి. వైఎస్సార్ సీపీ వచ్చాక పాఠశాలలు, కాలేజీలు అభివృద్ధి చెందాయి. గతంలో పదో తరగతి వరకూ మాత్రమే ఆడపిల్లల చదువులు ఉండేవి. ఇప్పుడు ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లమో, బీ ఫార్మసీ వంటి కోర్సుల వైపు బాలికలు దృష్టి సారిస్తున్నారు. సచివాలయ ఉద్యోగాల భర్తీ ఉద్యోగ వ్యవస్థలో ఒక విప్లవం తీసుకురాగా, ఆయా ఉద్యోగాలు పొందిన బాలికలు మిగిలినవారికి మార్గదర్శులుగా మారారు. చట్టం ఏం చెబుతోంది..? భారతీయ వివాహ చట్టం 1955 ప్రకారం ఆడపిల్లకు 18 ఏళ్లు దాటిన తర్వాత, అబ్బాయికి 21 ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలి. పురుషులతో సమానంగా మహిళలకు కూడా వివాహ వయస్సు ఉండాలని 2006లో భారతీయ వివాహ చట్టాన్ని కేంద్ర క్యాబినెట్ మార్పుచేసింది. ఫలితంగా ఇప్పుడు అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉండాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా కాదని బాల్య వివాహాలు నిర్వహిస్తే రెండు కుటుంబాలపైన చట్టపరమైన చర్యలు తప్పవు. గత పదేళ్లలో జిల్లాలో 1120 బాల్య వివాహాల ఫిర్యాదులు నమోదు కాగా, ఇందులో 1112 పెళ్లిళ్లను అధికారులు నిలుపుదల చేసి, ఆయా కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మొండికేసి బలవంతంగా పెళ్లి జరిపిన 8 కుటుంబాలపై కఠిన చర్యలు చేపట్టారు. అవగాహన పెరిగింది బాల్య వివాహాలు చేయకూడదనే విషయం ప్రజలకు తెలిసింది. ప్రతి రోజు మేం చేస్తున్న కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ప్రజల్లోకి వెళ్లాయి. ప్రధానంగా బాల్య వివాహాలు చేయడం ద్వారా అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయే పరిస్థితి కూడా ఉంది. వీటిపై ప్రజల్లో అవగాహన రావడంతో బాల్య వివాహాలు తగ్గాయి. అంతేకాకుండా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ, విద్యావకాశాలు మెరుగుపర్చడం వంటి వాటి ద్వారా బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయి. – కేవీ రమణ, జిల్లా బాలల సంరక్షణ అధికారి, శ్రీకాకుళం -
బార్లో అశ్లీల నృత్యాలు.. 64 మంది అమ్మాయిలతో..
శివాజీనగర(బెంగళూరు): నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న బార్పై సీసీసీ పోలీసులు దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకుని రూ.1.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన 64 మంది మహిళలను కాపాడారు. నగరంలోని ఉప్పార పేటలో బార్లో డీజే పెట్టి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ( చదవండి: టీచర్ సులోచన మృతికి కారణాలు ఏంటి? ) మరో ఘటనలో.. క్రికెట్ బెట్టింగ్.. వ్యక్తి అరెస్ట్ బనశంకరి: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న వ్యక్తిని గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసి ఇతని వద్ద నుంచి రూ. లక్షకు పైగా నగదు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. ఐసీసీ మహిళా వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వినోబానగర్లో నవాజ్ అహ్మద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. -
కెరీర్పైనే గురి!
పెళ్లా...? కెరీరా...? గతంలో అమ్మాయిలంతా ఎటూ తేల్చుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా కెరీర్కే మొగ్గు చూపుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్న తర్వాతే ఏడడుగులు నడవాలని నిర్ణయించుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందని...జీవితం హాయిగా సాగుతుందని భావిస్తున్నారు. అందువల్లే విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న అనంతపురంజిల్లా అమ్మాయిల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఇరవై ఏళ్లకు పెళ్లి, పాతికేళ్లకు పిల్లలు, ఇరవై ఎనిమిదేళ్లకు కెరీర్ ముగించి గృహిణిగా స్థిరపడడం...ఇది గతం. కానీ ఇప్పుడు అమ్మాయిలు కెరీర్ను సవాల్గా తీసుకుంటున్నారు. చదువు పూర్తికావాలి, ఆ తర్వాత ఉద్యోగం.. అప్పుడే పెళ్లి.. 90 శాతం మంది అమ్మాయిల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. భర్త సంపాదన మీద నేను ఆధారపడటం కాదు తన సంపాదన కూడా కుటుంబానికి ముఖ్యం కావాలి అంటున్నారు. 24 ఏళ్ల వరకూ చదువులు, ఉద్యోగాలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న తీరు వారిలో నిండిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. పెళ్లిచేసుకుని భర్త వెంట అమెరికా, కెనడా వంటి దేశాలకు డిపెండెంట్ వీసాకింద వెళ్లడం కంటే...తానే అమెరికాలో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుని వెళితే.. మంచిది కదా అనే ఆలోచనతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. కెరీర్ సవాల్గా తీసుకుని.. అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు అమెరికా వెళ్తున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఎంబీబీఎస్ కోర్సులో గతంలో ఓపెన్ కేటగిరీలో 30 శాతం కంటే మించని అమ్మాయిల సీట్లు... ఇప్పుడు 60 శాతానికి వెళ్లాయి. అమెరికాలో రమారమి 30కిపైన ప్రధాన యూనివర్సిటీల్లో అనంతపురం జిల్లా అమ్మాయిలు చదువుతున్నట్టు తేలింది. ఇక ఏటా విదేశాలకు విద్యా, ఉద్యోగావకాశాలకోసం వెళ్తున్న వారిలో దాదాపు 40 శాతం మంది అమ్మాయిలే ఉన్నారు. ఒకప్పుడు ఇంజినీరింగ్, ఎంటెక్ కోర్సులకు జిల్లా దాటి వెళ్లని వారు... ఇప్పుడు దేశంలోని ప్రతిష్టాత్మక నిట్లు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీపడుతున్నారు. దీన్ని బట్టి కెరీర్ను ఎంత సవాల్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ ఇప్పుడు మార్పు వచ్చింది. ఇరవై ఏళ్లకే పెళ్లి చేసి బాధ్యతలు దించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు ఎవరికీ లేదు. అమ్మాయిల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు స్వేచ్ఛనిస్తున్నారు. ముందు ఎదగాలి జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్నదే ఇప్పుడు అందరి లక్ష్యం. అందుకే నేను కూ డా బీఫార్మసీ... ఆ తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేశా. పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నా. ఉన్నత చదువుతో సమాజంలో ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక భద్రత లభిస్తుంది. ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. మా నాన్న కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తూ చదివిస్తున్నా రు. –ఎన్. సుశీల, ఎంఫార్మసీ, ఎస్కేయూ. స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలి సమాజం పురోగతి చెందాలంటే లింగ వివక్ష, అసమానతలు ఉండకూడదు. మహిళలు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఆర్థిక, సమాజ, రాజకీయ సాధికారిత సాధిస్తున్నారు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలోనూ ఇలాంటి అంశాలపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. – డాక్టర్ వరలక్ష్మి దేవి, పరీక్షల విభాగం సమన్వయకర్త, ఎస్కేయూ మంచి ఉద్యోగంతో గుర్తింపు అమ్మాయిలు గతంలో మాదిరిగా ఒకరిపై ఆధారపడకూడదు. తల్లిదండ్రులకు భారం అనిపించకూడదు. ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగం సాధిస్తే మనకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎప్పుడైతే స్వతంత్రంగా స్థిరపడతామో అప్పు డు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. – బి.హిమవర్షిణి, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్, మైక్రాన్ టెక్నాలజీ -
పెళ్లా? కెరీరా?.. క్షణం ఆలోచించకుండా తేల్చేస్తున్న అమ్మాయిలు..
పెళ్లా...? కెరీరా...? గతంలో అమ్మాయిలంతా ఎటూ తేల్చుకోలేకపోయేవారు. కానీ ఇప్పుడు క్షణం కూడా ఆలోచించకుండా కెరీర్కే మొగ్గు చూపుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్న తర్వాతే ఏడడుగులు నడవాలని నిర్ణయించుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుందని...జీవితం హాయిగా సాగుతుందని భావిస్తున్నారు. అందువల్లే విదేశాల్లో చదువులు, ఉద్యోగాలు చేస్తున్న జిల్లా అమ్మాయిల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. సాక్షి, అనంతపురం: ఇరవై ఏళ్లకు పెళ్లి, పాతికేళ్లకు పిల్లలు, ఇరవై ఎనిమిదేళ్లకు కెరీర్ ముగించి గృహిణిగా స్థిరపడడం...ఇది గతం. కానీ ఇప్పుడు అమ్మాయిలు కెరీర్ను సవాల్గా తీసుకుంటున్నారు. చదువు పూర్తికావాలి, ఆ తర్వాత ఉద్యోగం.. అప్పుడే పెళ్లి అంటున్నారు. 90 శాతం మంది అమ్మాయిల్లో ఇదే ధోరణి కనిపిస్తోంది. భర్త సంపాదన మీద నేను ఆధారపడటం కాదు నా సంపాదన కూడా కుటుంబానికి ముఖ్యం కావాలి అంటున్నారు. 24 ఏళ్ల వరకూ చదువులు, ఉద్యోగాలే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న వారి తీరు నిండైన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది. పెళ్లిచేసుకుని భర్త వెంట అమెరికా, కెనడా వంటి దేశాలకు డిపెండెంట్ వీసా కింద వెళ్లడం కంటే...తానే అమెరికాలో ఉద్యోగం సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకుని వెళితే.. మంచిది కదా అనే ఆలోచనతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ప్రొఫెషనల్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. కెరీర్ సవాల్గా తీసుకుని.. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు అమెరికా వెళ్తున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఎంబీబీఎస్ కోర్సులో గతంలో ఓపెన్ కేటగిరీలో 30 శాతం కంటే మించని అమ్మాయిల సీట్లు... ఇప్పుడు 60 శాతానికి వెళ్లాయి. అమెరికాలో రమారమి 30కిపైన ప్రధాన యూనివర్సిటీల్లో అనంతపురం జిల్లా అమ్మాయిలు చదువుతున్నట్టు తేలింది. ఇక ఏటా విదేశాలకు విద్య, ఉద్యోగావకాశాలకోసం వెళ్తున్న వారిలో దాదాపు 40 శాతం మంది అమ్మాయిలే ఉంటున్నారు. ఒకప్పుడు ఇంజినీరింగ్, ఎంటెక్ కోర్సులకు జిల్లా దాటి వెళ్లని వారు... ఇప్పుడు దేశంలోని ప్రతిష్టాత్మక నిట్లు, ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీపడుతున్నారు. దీన్ని బట్టి కెరీర్ను ఎంత సవాల్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలోనూ కొన్ని రోజులుగా మార్పు వస్తోంది. ఇరవై ఏళ్లకే పెళ్లి చేసి బాధ్యతలు దించుకోవాలన్న ఆలోచన ఇప్పుడు ఎవరికీ లేదు. అమ్మాయిల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు స్వేచ్ఛనిస్తున్నారు. చదవండి: (తొలినాళ్ల క్షీరదం గుట్టు మన గడ్డమీదే!) ముందు ఎదగాలి జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలన్నదే ఇప్పుడు అందరి లక్ష్యం. అందుకే నేను కూడా బీఫార్మసీ... ఆ తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేశా. పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నా. ఉన్నత చదువుతో సమాజంలో ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక భద్రత లభిస్తుంది. ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. మా నాన్న కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తూ చదివిస్తున్నారు. – ఎన్. సుశీల, ఎంఫార్మసీ, ఎస్కేయూ పోటీతత్వం పెరిగింది అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా పెంపొందించుకుంటున్నారు. సమాన అవకాశాలను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో పోటీతత్వం పెరిగింది. నాయకత్వ లక్షణాలు మెరుగుపడే విధంగా అంతర్జాతీయ సదస్సులు, జాతీయ సదస్సుల్లో తరచుగా పాల్గొనేలా మేమూ ప్రేరణ కలిగిస్తున్నాం. – డాక్టర్ వి. శైలజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎంబీఏ విభాగం, ఎస్కేయూ. స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలి సమాజం పురోగతి చెందాలంటే లింగ వివక్ష, అసమానతలు ఉండకూడదు. మహిళలు మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఆర్థిక, సమాజ, రాజకీయ సాధికారిత సాధిస్తున్నారు. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలనే అంశంపై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్నాం. జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలోనూ ఇలాంటి అంశాలపై ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ వరలక్ష్మి దేవి, పరీక్షల విభాగం సమన్వయకర్త, ఎస్కేయూ మంచి ఉద్యోగంతో గుర్తింపు అమ్మాయిలు గతంలో మాదిరిగా ఒకరిపై ఆధారపడకూడదు. తల్లిదండ్రులకు భారం అనిపించకూడదు. ఉన్నత చదువులు అభ్యసించి మంచి ఉద్యోగం సాధిస్తే మనకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎప్పుడైతే స్వతంత్రంగా స్థిరపడతామో అప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. – బి.హిమవర్షిణి, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్, మైక్రాన్ టెక్నాలజీ -
టీచర్ పాడు బుద్ధి.. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపించి..
ధర్మారం(ధర్మపురి)జగిత్యాల జిల్లా: ఓ ఉపాధ్యాయుడే విద్యార్థినులకు సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపించిన ఘటన ధర్మారం మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. సదరు టీచర్ ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్డే సందర్భంగా విద్యార్థులకు సెల్ఫోన్లో సైన్స్ ప్రయోగాలు చూపించాడు. అయితే తమకు అశ్లీల చిత్రాలు చూపించాడని పేర్కొంటూ ఇద్దరు విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు తెలిపారు. అప్పటినుంచి పాఠశాలకు సెలవులు రావడంతో ఆ విషయాన్ని మర్చిపోయారు. అయితే సదరు ఉపాధ్యాయుడు గురువారం తొమ్మిదో తరగతి చదువుతున్న మరో విద్యార్థినికి అశ్లీల చిత్రాలు చూపించాడు. చదవండి: ప్రేయసితో పెళ్లికి భార్య అంగీకరించలేదని.. దీంతో ఆమె ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కోపోద్రిక్తులైన వారు ఫోన్ చేసి, హెచ్ఎంకు ఫిర్యాదు చేశారు. తర్వాత గ్రామస్తులతో కలిసి పాఠశాలకు చేరుకొని, ఆ ఉపాధ్యాయుడిని గదిలో బంధించి, చితకబాదారు. టీచర్ను పోలీసులు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయురాలు డీఈవోకు తెలిపారు. డీఈవో ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడి నిర్వాకంపై ఆమె జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎస్సై శ్రీనివాస్ రాత్రి గ్రామానికి వెళ్లి, విచారణ జరిపినట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. -
టీచర్ కాదు కామాంధుడు.. విద్యార్థులకు అశ్లీల చిత్రాలు చూపించి...
పాలకొండ/పాలకొండ రూరల్(శ్రీకాకుళం జిల్లా): అమ్మఒడి లాంటి బడిలో మరో అకృత్యం వెలుగుచూసింది. తండ్రి స్థానంలో ఉండి పిల్లలను చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడు గురు స్థానానికి మచ్చ తీసుకువచ్చాడు. చిన్నారులకు అశ్లీల వీడియోలు చూపించి తన వికృత కోణాన్ని పిల్లలకు పరిచయం చేశాడు. మృగాడి విషయం పిల్లల తల్లిదండ్రులకు తెలియడంతో గురువుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పాలకొండ ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. పాలకొండ మండలంలోని నవగాం గ్రామంలోని మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గొర్ల భానూజీరావు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. చదవండి: ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో.. ఈయన కొంతకాలంగా తన సెల్ఫోన్లో నీలి చిత్రాలను చిన్నారులకు చూపిస్తున్నారు. అశ్లీల చిత్రాల్లో ఉన్న మహిళలను చూపించి వారికి విద్యార్థినుల పేర్లు పెట్టడం చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా విద్యార్థినుల ఇంటిలో ఉన్న మహిళలను కూడా వారితో పోల్చి చెబుతున్నారు. దీంతో పిల్లలు వారి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీనిపై ఆగ్రహించిన తల్లితండ్రులు బుధవారం సాయంత్రం ఆ ఉపాధాయుడిని నిలదీసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ నీరజ ఉపాధ్యాయుడిని మందలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామంలోకి వెళ్లి టీచర్ను స్టేషన్కు తరలించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
అనంతపురం జిల్లాలో కీచక టీచర్
-
ఇంటిపని అని చెప్పి.. వ్యభిచార కూపంలోకి దింపారు
సాక్షి, చెన్నై (తమిళనాడు): ఇళ్లల్లో పని పేరిట త్రిపుర రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలను తీసుకొచ్చి.. ఓ ముఠా వ్యభిచార కుంపంలో దించి చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన చెన్నైలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్(38) అక్కడి బాలికలు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి బెంగళూరు, చెన్నైకు పంపిస్తోంది. ఈ క్రమంలో త్రిపురకు చెందిన నాలుగురు బాలికల్ని తొలుత ఓ బ్యూటీ పార్లర్లో ఉద్యోగం నిమిత్తం పంపించింది. కొన్నాళ్లు అక్కడున్న ఆ బాలికల్ని చెన్నైకు తరలించారు. ఈనెల 17వ తేదీ చెన్నై శివారులోని కేలంబాక్కం పడూర్లోని ఓ నివాసంలో ఈ బాలికల్ని ఉంచారు. అక్కడ అలావుద్దీన్, మైదీన్, అన్వర్, హుస్సేన్ అనే నలుగురు వ్యక్తులు బాలికలను చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టారు. ఈసీఆర్ మార్గంలోని కొన్ని రిసార్టులకు పంపించి బలవంతంగా వ్యభిచార కుంపంలోదించారు. ఈనెల 26న వారి నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక గస్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. ప్యారిస్ పోలీసులు ఆ నలుగురి బాలికల్ని రక్షించారు. అయితే, ఆ మహిళతో పాటుగా ముఠా సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా బాధిత బాలికలను త్రిపురకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. విద్యార్థిని ఆత్మహత్య పళ్లిపట్టు: ప్లస్టూ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆర్కేపేట పోలీసులు కథనం మేరకు బాలాపురం గ్రామానికి చెందిన స్నేహ(17) స్థానికంగా ఉంటున్న ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో ప్లస్టూ చదువుతోంది. ఈ బాలిక తల్లిదండ్రులు ఐదేళ్ల కిందట మృతి చెందడంతో అత్తమ్మ మునియమ్మ వద్ద ఉంటోంది. స్నేహ పేరిట దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్నేహకు వివాహం చేసేందుకు అత్త మునియమ్మ నిర్ణయించినట్లు సమాచారం. కాగా వివాహంపై ఆసక్తి లేని స్నేహ ఇంట్లో ఒంటిరిగా ఉంటున్న సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
Shanta Balu: పూనా పవార్.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా..
అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని, స్వీయరక్షణలో శిక్షణ పొందినప్పుడు ఆత్మస్థయిర్యం దానంతట అదే పెంపొందుతుందని పర్సనాలటీ డెవలప్మెంట్లో భాగంగా నిపుణులు చెప్తున్నారు. మహిళల రక్షణ కోసం పని చేసే విభాగాల ప్రముఖులందరూ ఈ విషయంలో అమ్మాయిల తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను పాఠశాల స్థాయిలోనే ప్రవేశ పెట్టాలనే సూచనలు కూడా చేస్తున్నారు. అయితే వీటన్నింటి గురించి ఏ మాత్రం తెలియని ఓ మామ్మ శాంతాబాలు పవార్ తాను నివసించే పూనా నగరంలో అమ్మాయిలకు కర్రసాములో శిక్షణనిస్తోంది. శాంతాబాలు పవార్ వయసు 86. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎంత ఫేమసో పూనాలో శాంతాబాలు పవార్ అంత పాపులర్. దాదాపు ఎనభై ఏళ్లుగా ఆమె పూనా వీధుల్లో విన్యాసాలు చేస్తోంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి కర్రసాము, తాడు మీద నడవడం వంటి విన్యాసాలు చేస్తూ పెరిగింది. ఇప్పటికీ ముఖం మీద నుంచి మాస్కు తీసి చీరకట్టుకు దూర్చి, ఆమె రెండు చేతుల్తో కర్రలు పట్టుకుంటే గాలి పక్కకు తప్పుకుంటుంది. ఆమె చేతి ఒడుపు తగ్గలేదు, వేగమూ తగ్గలేదు. ఒకప్పుడు వీధి ప్రదర్శనకు మాత్రమే పరిమితం అయిన కళ... ఇప్పుడు పూనాలోని ఆడపిల్లలకు స్వీయరక్షణ విద్యగా మారింది. వారియర్ ఆజి దగ్గర శిక్షణ తీసుకుంటే తమ ఆడపిల్లల రక్షణ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, భరోసా ఉంటుందని భావిస్తున్నారు తల్లిదండ్రులు. శాంతాబాలు అజి రెండేళ్ల కిందట కరోనా సమయంలో ప్రారంభించిన శిక్షణకేంద్రం ఇప్పుడు ఆడపిల్లల కర్రసాముతో ధైర్యవికాసం పొందుతోంది. అప్పట్లో సోనూసూద్, రితేశ్ దేశ్ముఖ్ వంటి సెలబ్రిటీలు శాంతా బాలూ పవార్ను అభినందనలతో ముంచెత్తారు. ఆమె చేతిలోని కర్రసాము యుద్ధవిద్య పూనా అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు ఇరవై మంది సభ్యులున్న ఆజి కుటుంబాన్ని పోషించడానికి ఆధారం అయింది. కరోనా కారణంగా ఆమె కొడుకులకు పని లేకపోవడంతో ఆమె కర్రసాముతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. ‘ఇంట్లో ఊరికే కూర్చోవడం నాకు నచ్చదు’’ అంటోంది శాంతాబాలు పవార్. అన్నట్లు ఈ వారియర్ ఆజీలో నటనాకౌశలం కూడా దాగి ఉంది. 1972లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన హిట్ మూవీ ‘సీత ఔర్ గీత’లో నటించింది. -
బాలికల సాధికారతకు ప్రాధాన్యం: మోదీ
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలోనూ బాలికా సాధికారతకు పెద్ద పీట వేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అమ్మాయిలకు మర్యాద దక్కేలా, అన్ని రకాల అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ట్వీట్ చేస్తూ ‘‘బాలికల సాధికారతపై మాకున్న చిత్తశుద్ధిని జాతీయ బాలికా దినోత్సవం మాకు గుర్తు చేస్తుంది. వివిధ రంగాల్లో అమ్మాయిలు సాధించిన విజయాలను నెమరువేసుకోవడానికి ఇదొక మంచి సందర్భం’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీతలతో మాటామంతీ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి మద్దతునివ్వాలని ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ గ్రహీతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుమతి గ్రహీతలతో ఆన్లైన్లో ముచ్చటించిన ప్రధాని కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ యువతను దృష్టిలో పెట్టుకునే రూపొందిస్తున్నామని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహావిష్కరణ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం కోసం విధి నిర్వహణ నేతాజీ ప్రథమ కర్తవ్యమని, దాని నుంచి స్ఫూర్తి పొంది ప్రతీ ఒక్కరూ దేశాభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు. సృజనాత్మక ఆలోచనలతో యువత ముందుకు వెళ్లడం దేశానికే గర్వకారణమన్నారు. -
AP: రాష్ట్రంలో పెరిగిన అమ్మాయిల సంఖ్య
‘లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం. దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అన్నాడో సినీ కవి. ‘అన్నిటా సగం.. ఆకాశంలోనూ తాను సగం’ అన్నట్టుగా వివిధ రంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు.. సంఖ్యాపరంగానూ పురుషుల్ని దాటేస్తున్నారు. అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా నమోదైంది. దేశంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు 2 శాతం అధికంగా ఉండగా.. రాష్ట్రంలో 4.5 శాతం అధికంగా ఉన్నట్టు తాజా సర్వే తేల్చింది. సాక్షి, అమరావతి: నాలుగేళ్ల క్రితం నాటి లెక్కలతో పోలిస్తే దేశంలోను, రాష్ట్రంలోను అమ్మాయిల సంఖ్య పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వెయ్యి మంది అబ్బాయిలకు 991 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 1,020కి పెరిగింది. అయితే, దేశవ్యాప్తంగా పట్టణాల్లో అమ్మాయిల సంఖ్య వెయ్యి మంది అబ్బాయిలకు 985 మాత్రమే ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం వెయ్యి మంది అబ్బాయిలకు 1,037 మంది అమ్మాయిలు ఉన్నట్టు తేలింది. దేశ సగటుతో పోలిస్తే ఏపీలో ఎక్కువే రాష్ట్రంలో 2015–16లో వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలు ఉండగా.. 2019–20లో ఆ సంఖ్య 1,045కు చేరింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య 1,024 చొప్పున నమోదు కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మంది అబ్బాయిలకు 1,055 మంది అమ్మాయిలు ఉన్నట్టు తేలింది. కాగా, 2015–16 ఆరి్థక సంవత్సరంతో పోలిస్తే 2019–20లో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా, చిత్తూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2015–16తో పోలిస్తే 2019–20లో అమ్మాయిల సంఖ్య తగ్గింది. -
‘నీకు అతడి నుంచి రిక్వెస్ట్ వచ్చిందా..? యూ ఆర్ లక్కీ’.. ఎందుకంటే
సాక్షి హైదరాబాద్: యువతులు, బాలికలే టార్గెట్గా సోషల్మీడియా కేంద్రంగా అనేక మందిని వంచించిన పాలకుర్తి అజయ్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడి చేతిలో పదుల సంఖ్యలో బాధితులుగా మారి ఉంటారని భావిస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇటీవల ఇతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం విదితమే. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన అజయ్ది నిరుపేద కుటుంబం. తమ కష్టాలు తీరుస్తాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ కష్టార్జితమైన రూ.4 లక్షలు చెల్లించి దిల్సుఖ్నగర్లోని మల్టీమీడియా సంస్థలో చేర్పించారు. విలాసాలు, జల్సాలకు అలవాటుపడిన ఇతగాడు పోర్నోగ్రఫీకి బానిసగా మారాడు. దీనికి తోడు సోషల్మీడియాలో ఎక్కువ సేపు కాలం గడుపుతున్నాడు. ఇతగాడు యువతీ, యువకుల పేర్లతో ఇన్స్ట్రాగామ్లో ఏడు, ఫేస్బుక్లో ఆరు నకిలీ ఖాతాలు తెరిచాడు. వీటిని వినియోగించి అనేక మంది యువ తులు, బాలికలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతూ యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేస్తున్నాడ యువతులను ట్రాప్ చేయడానికి అజయ్ ‘ద్విపాత్రాభినయం’ చేశాడు. టార్గెట్గా చేసుకున్న యువతి/బాలికకు తొలుత యువతిగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. దీన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్లతో కొన్ని రోజులు చాటింగ్ చేసి నమ్మకం కలిగిస్తాడు. ఆపై ఓ యువకుడి పేరుతో అదే టార్గెట్కు మరో రిక్వెస్ట్ పంపిస్తాడు. యువతిగా చాటింగ్ చేస్తున్నప్పు డు ఇలా రిక్వెస్ట్ వచ్చిన విషయం యువతిగా చాటింగ్ చేస్తున్న తనతో చెప్పేలా అజయ్ వ్యవహరిస్తాడు. అలా ప్రస్తావన వచ్చిన తర్వాత ‘నీకు అతడి నుంచి రిక్వెస్ట్ వచ్చిందా..? యూ ఆర్ లక్కీ’ అంటూ మొదలెడతాడు. ఎందుకు లక్కీ అని ఎదుటి వాళ్లు ప్రశ్నిస్తే కొద్దిసేపు చెప్పకుండా వారిలో ఉత్సుకత పెరిగేలా వ్యవహరిస్తాడు. చివరకు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిన వ్యక్తి చాలా మంచివాడని, సంపన్నుడు, తెలివిగల వాడంటూ చెప్తాడు. తనతో పాటు తన ఫ్రెండ్స్లో అనేక మంది అతడితో ఫ్రెండ్షిప్ కోసం పరితపిస్తున్నాడంటూ నమ్మిస్తాడు. అప్పటి వరకు తనతో చాటింగ్ చేస్తున్నది యువతిగా భావించే టార్గెట్స్ ఇవన్నీ నమ్మేస్తారు. యువకుడి పేరు, ఫొటోతో వచ్చిన రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసేస్తారు. అక్కడ నుంచి యువకుడిగా మారిపోయే అజయ్ ఆ పేరుతో టార్గెట్స్తో చాటింగ్ చేస్తాడు. గతంలో యువతిగా చాటింగ్ చేసినప్పుడే ఎదుటి వారి అభిరుచులు, ఆసక్తులు, ఆశలు, ఆశయాలు తెలుసుకుంటాడు. యువకుడిగా చాటింగ్ చేస్తున్నప్పుడు వాటికి తగ్గట్టు మాయమాటలు చెప్పి వారికి ఉచ్చులోకి దింపుతాడు. ఈ తరహాలో ఇతడు ఎన్ని నేరాలు చేశాడనే అంశాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇతడి నుంచి బెదిరింపులు ఎదురైన, డబ్బు చెల్లించిన బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. -
అమ్మాయిల ఐఐఠీవి
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో విద్యార్థినుల చేరికలు పెద్ద ఎత్తున పెరిగాయి. 2014–15లో దేశవ్యాప్తంగా ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య 9,450 మాత్రమే కాగా 2020–21 నాటికి 20,228కి చేరుకుంది. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్) విభాగాలలో యువతుల భాగస్వామ్యం 2017 నాటికి 14 శాతం ఉందని.. దీన్ని మరింత పెంచాలన్న నిపుణుల సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యార్థినుల చేరికలు పెరిగాయి. 2018 నుంచి అదనపు కోటా ఈ నేపథ్యంలో కమిటీ సిఫార్సుల మేరకు 2018–19లో కేంద్ర ప్రభుత్వం ఐఐటీల్లో విద్యార్థినులకు 14 శాతం మేర ప్రత్యేక కోటా సీట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర వర్గాల కేటాయింపులకు భంగం కలగ కుండా సూపర్ న్యూమరరీ కోటా కింద అదనంగా ఆ సీట్లను సిద్ధం చేసింది. అదనపు సీట్లను 2019–20లో 17 శాతానికి, 2020–21లో 20 శాతానికి పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఐఐటీల్లో అమ్మాయిల చేరికలు గతంలో కన్నా రెట్టింపు అయ్యాయి. గతంలో ఐఐటీల్లో 9,450 మాత్రమే ఉన్న విద్యార్థినుల సంఖ్య 2019–20 నాటికి 18,456కి పెరిగింది. 2020–21లో ఇది మరింత పెరిగి 20,228 మంది చేరడం గమనార్హం. ప్రత్యేక కోటా వల్ల ఐఐటీల్లో యువతుల చేరికలు 2018 నాటికి 18 శాతానికి పెరిగినట్లు వెల్లడైంది. ఐఐటీల్లో ఈ అదనపు కోటాను 8 ఏళ్ల పాటు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంటర్లో రాణిస్తున్నా.. మండి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ తిమోతి ఎ.గోన్సాల్వేస్ నేతృత్వంలో అధ్యయనం నిర్వహించిన ప్రత్యేక కమిటీ జేఈఈ అడ్వాన్స్డ్లో అర్హత సాధిస్తున్న బాలికల శాతం 11 నుంచి 12.5 శాతం మాత్రమే ఉందని పేర్కొంది. ఐఐటీ పరీక్షకు ప్రత్యేక తర్ఫీదు వారికి అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. ఇంటర్లో విద్యార్థినులు మంచి ఫలితాలను సాధిస్తున్నా జేఈఈ, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో వెనుకంజ వేయటానికి కారణాలను కమిటీ లోతుగా విశ్లేషించింది. -
కేపీహెచ్బీలో విషాదం.. సెల్లార్ గుంతలో పడి ముగ్గురు బాలికలు మృతి
సాక్షి, హైదరాబాద్: నిర్లక్ష్యంగా వదిలేసిన సెల్లార్ గుంత అభం శుభం తెలియని ముగ్గురు బాలికలను బలితీసుకుంది. శుక్రవారం పాఠశాలకు సెలవు కావటంతో ఇంటివద్దనే ఉన్న బాలికలు ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. గుంతలో ఉన్న నీటిలోకి దిగే క్రమంలో ఒకరు జారిపడిపోతోంటే.. ఆమెను కాపాడేందుకు ఒకరి తరువాత ఒకరు మొత్తం ఐదుగురు బాలికలు అందులో పడిపోయారు. ముగ్గురు చనిపోగా ఇద్దరు బయటపడ్డారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 4వ ఫేజ్లో ఆర్టీఐ కార్యాలయం ఆనుకొని ఉన్న ఆరెకరాల ఖాళీ స్థలంలో 8 ఏళ్ల క్రితం బహుళ అంతస్థుల నిర్మాణం కోసం సెల్లార్ గుంతలు తవ్వారు. అప్పటి నుంచి ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవటంతో గుంతలోకి భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. బతుకుదెరువు కోసం బిహార్ నుంచి వచ్చిన లక్ష్మీ ప్రసాద్ టీ కొట్టు నిర్వహిస్తూ తన ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకుతో ఆర్టీఐ కార్యాలయం సమీపంలో ఉంటున్నాడు. అతని నాలుగో కుమార్తె సంగీత కుమారి (12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. యూపీకి చెందిన ప్రమోద్ గుప్త, గీత దంపతులు కూడా ఆర్టీఐ కార్యాలయం సమీపంలోనే టీ కొట్టు నిర్వహిస్తున్నారు. వీరి కూతురు రమ్య (7) అదే పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. నాగర్కర్నూల్కు చెందిన పర్విన్ కుమార్తె సోఫియా (10) నాలుగో తరగతి చదువుకుంటోంది. వీరితోపాటు చదువుతున్న నేహా, సంగీత చెల్లెలు నబియా ఐదుగురు కలిసి మధ్యాహ్నం ఆడుకునేందుకు సెల్లార్ గుంత వద్దకు వెళ్లారు. తొలుత సంగీత నీటిలో దిగేందుకు యత్నించగా, ఆమెను కాపాడేందుకు రమ్య నీటిలోకి దిగి ఆమె సైతం మునిగింది. వీరిని కాపాడేందుకు సోఫియా యత్నించగా ఆమె కూడా మునిగిపోయింది. నేహా, నబియా వీరిని కాపాడేందుకు యత్నించి అదృష్టవశాత్తు బయటపడ్డారు. వీరు తర్వాత ఇంట్లో విషయం చెప్పడంతో కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో సంగీత, సోఫియా, రమ్య మృతదేహాలను వెలికి తీశారు. నిర్లక్ష్యమే పెను శాపం.. ఎనిమిదేళ్ల క్రితం రాష్ట్ర గృహ నిర్మాణ మండలి ఆధ్వర్యంలో కేపీహెచ్బీ 4వ ఫేజులో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులను అప్పగించారు. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో 20 అడుగుల లోతు సెల్లార్ గుంతను తవ్వి వదిలేశారు. దీంతో గుంత నీటితో నిండి నిరుపయోగంగా ఉంది. ఎనిమిదేళ్లుగా ఇలాగే ఉండటంతో పిల్లల ప్రాణాల పాలిట యమపాశంగా మారింది. గతంలో ఇద్దరు బాలురు ఇందులో పడి మృతిచెందారు. -
పెళ్లి వయస్సు పెంపుదల మంచిదే కానీ..
బాల్య వివాహ నిషేధ చట్టం–2006 అమలులో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయవద్దని అమ్మాయిలు తమ తల్లిదండ్రులను నిలదీసి అడగడానికి ఈ చట్టం ఎంతో ప్రేరణనిచ్చిందన్నది వాస్తవం. అదే సమయంలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పెళ్లిళ్లపై నిరసన తెలుపుతూ తమకు నచ్చిన వారితో వెళ్లిపోతున్న అమ్మాయిలను, వారు ఎంపిక చేసుకున్న వరులను శిక్షించడానికి ఈ చట్టం తల్లిదండ్రులకే ఎక్కువ అవకాశం ఇస్తోందన్నది కూడా వాస్తవమే. అంటే వివాహ వయస్సు పెంపుదలలో కంటే సమాజ వైఖరి, విధానాల్లోనే పరిష్కారం దాగుంది. మనుగడ కోసం పెళ్లి తప్పనిసరి అనే జంఝాటం నుంచి బాలికలకు విముక్తి కల్పించాలి. విద్య, ఉపాధి, భద్రతతోపాటు పెళ్లి ఎప్పుడు, ఎవరిని చేసుకోవాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను వారికి అందించాలి. ఇవన్నీ సాధ్యమైతే పెళ్లాడే వయస్సు దానికదే ముందుకెళుతుంది. భారతీయ మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ప్రసూతి మరణాల సంఖ్యను, మహిళల్లో పోషకాహార లేమిని తగ్గించడమే తన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ చెప్పుకుంది. కానీ పెళ్లి వయస్సు పెంపుదల అనేది ప్రసూతి మరణాలు, పోషకాహార లేమికి సంబంధించిన సమస్యలను నిజంగానే పరిష్కరిస్తుందా అన్న సందేహం వస్తోంది. పైగా, ప్రసూతి మరణాల సమస్య అన్ని రాష్ట్రాల్లో సమానంగా లేదు. ఈ సమస్య.. చక్కగా పనిచేసే ప్రజారోగ్య మౌలిక వ్యవస్థ, కనీస దారిద్య్ర స్థాయిలు, మెరుగైన ఆహార భద్రత వంటి ఇతర అభివృద్ధి చర్యలతో అనివార్యంగా ముడిపడి ఉంటుంది. మహిళల్లో రక్తహీనత సమస్యను తొలగించేందుకు గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయని తాజా డేటా, పరిశోధనలు తెలుపుతున్నాయి. ప్రసవ సమయంలో స్త్రీలు మరణించడానికి సాధారణ కారణం ఏమిటంటే, బిడ్డను కన్నప్పుడు లేక ఆ తర్వాత అధికంగా రక్తస్రావం జరగడమే. దేశంలో 50 శాతం మంది మహిళలు రక్తహీనతతో గర్భం దాలుస్తున్నారని తాజా డేటా చెబుతోంది. మహిళలు త్వరగా గర్భం దాల్చడం వల్లే ప్రసవ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పలేం. కుటుంబంలో ఆహార కేటాయింపుల విషయంలో బాలికలకంటే బాలురకు ప్రాధాన్యత ఇవ్వడం అనే బలమైన పితృస్వామిక సంప్రదాయాల ఆచరణ కూడా దీనికి దోహదం చేస్తోంది. శారదా చట్టానికి సవరణ చేసి తీసుకొచ్చిన ప్రస్తుత విధానం (బాల్యవివాహ నిరోధక చట్టం 1929 కూడా) అమ్మాయిలకు వివాహ వయస్సును 16 నుంచి 18 సంవత్సరాలకు, అబ్బాయిల వయస్సును 21 సంవత్సరాలకు పెంచుతూ 1978లో నిర్ణయించింది. నాలుగు దశాబ్దాలుగా ఇదే విధానం అమలువుతూ వస్తోంది. అయితే 18 ఏళ్లు దాటకముందే తమ కూతుర్లకు తల్లితండ్రులు పెళ్లిళ్లు చేయకుండా ఈ చట్టం నిరోధించలేకపోయిందన్నది స్పష్టం. అయితే కుటుంబాలు తమ కుమార్తెలకు ముందుగానే వివాహాలు చేస్తున్నందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. నగరప్రాంతాల్లోని పేదలు నివాసముండే ప్రాంతాల్లో తమ కుమార్తెల భద్రత గురించిన భీతి కారణంగా బాల్య వివాహాలు వ్యూహాత్మకంగా జరుగుతుండవచ్చు. అయితే పెళ్లి అనేది భద్రతకు హామీ ఇవ్వనప్పటికీ, అమ్మాయికి పెళ్లి చేశాక, ఆమె బాధ్యత తన భర్తది, అత్తామామలదే అవుతుంది. తర్వాత ఆమె భద్రత కానీ శీలం కానీ పుట్టింటివారికి సంబంధించిన సమస్యగా ఉండదు. వివాహ వయస్సు పెంపు నిర్ణయం సమయంలో ఇలాంటి సాధారణమైన అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించడం లేదు. ప్రత్యేకించి మహిళలకు సంబంధించిన సున్నితమైన సంబంధాలను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వ విధానం చాలా కఠినంగా ఉంటోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని అక్కడి బీజేపీ ప్రభుత్వాలు ఆమోదించాయి. యూపీలో, మధ్యప్రదేశ్లో లవ్ జిహాద్కు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడా వీటిని దూకుడుగా ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్మాయిల పెళ్లి వయస్సును పెంచడం అంటే తమకిష్టమైన విధంగా పెళ్లిని ఎంపిక చేసుకోవడాన్ని వారికి లేకుండా చేయడమే అవుతుంది. వివాహ వయస్సు పెంపుదల మహిళలకు సాధికారత కల్పించి, వారి ప్రాతినిధ్యం పెంచడమే కాకుండా, గర్భధారణ శక్తిపై వారికి నియంత్రణను సాధ్యం చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. బాల్య వివాహాలకు, బాలికల సాధికారతకు పరిష్కారం వివాహ వయస్సు పెంపుదలలో లేదని మన సమాజంలో చోటు చేసుకుం టున్న మార్పులు సూచిస్తున్నాయి. పైగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా డేటా ప్రకారం 18 సంవత్సరాలకు లోపు పెళ్లాడుతున్న అమ్మాయిల నిష్పత్తి వేగంగా తగ్గుముఖం పడుతోంది. ఇది ఇంకా తగ్గిపోతుందని కూడా సంకేతాలు ఉన్నాయి. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 (పీసీఎంఏ) అమలులో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేయవద్దని అమ్మాయిలు తల్లిదండ్రులను నిలదీసి అడగడానికి ఈ చట్టం ఎంతో ప్రేరణ నిచ్చిందన్నది వాస్తవం. అదేసమయంలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పెళ్లిళ్లపై నిరసన తెలుపుతూ తమకు నచ్చిన వారితో వెళ్లిపోతున్న అమ్మాయిలను, వారు ఎంపిక చేసుకున్న వరులను శిక్షించడానికి ఈ చట్టం తల్లిదండ్రులకే ఎక్కువ అవకాశం ఇస్తోందన్నది కూడా వాస్తవమే. అంటే వివాహ వయస్సు పెంపుదలలో కంటే సమాజ వైఖరి, విధానాల్లోనే ఈ సమస్యకు పరిష్కారం దాగుందని స్పష్టమవుతోంది. బాలికల విద్యావకాశాలను మరింతగా పెంచడం, హింసకు తావులేని రక్షిత వాతావరణాన్ని, మెరుగైన ఆరోగ్య సేవలను వారికి కల్పించడం, భవిష్యత్తు కోసం వారికి మంచి అవకాశాలు అందించడం వంటి మౌలిక మార్పులకు దోహదం చేసే పరిస్థితులు మన సమాజంలో ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. అదే సమయంలో మహిళల సామాజిక, ఆర్థిక హోదాను నిర్ణయించడంలో నేటికీ వివాహమే కేంద్రబిందువుగా ఉంటోంది. ఈనాటికీ మన కుటుంబాలు ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించివేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అమ్మాయిలు సైతం పెళ్లి చేసుకోవడమే తమ విధి అనే భావజాలంలోనే పెరుగుతున్నారు. ఆడపిల్లల వయస్సు పెరిగితే, వారు ఎక్కువ చదివితే కట్నం ఎక్కువగా ఇచ్చుకోవలసి వస్తుందనే భీతి కూడా బలవంతపు పెళ్లిళ్లకు, బాల్య వివాహాలకు ప్రధాన కారణమవుతోంది. మహిళలు ఇప్పుడు 18 ఏళ్ల వయసులో పార్లమెంటు సభ్యులు కాగలుగుతున్నప్పుడు, తాము ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనే ఎంపికను వారు నిర్ణయించుకోలేరా అనేది ప్రశ్న. తనకు తగని వ్యక్తిని పెళ్లాడటం ద్వారా అమ్మాయిలు తప్పు చేసినప్పటికీ, ఈ తప్పులను చేసే హక్కు, వాటినుంచి నేర్చుకునే హక్కు వారికి ఉండకూడదా అనేది మరో ప్రశ్న. పెళ్లి అనేది బతికేందుకు ఉపయోగపడే వ్యూహంగా ఉండకూడదు. అయితే దేశంలోని చాలామంది మహిళలు సామాజిక భద్రత లేని దుర్భరపరిస్థితుల్లో ఉంటున్న అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. దేశంలో మహిళలకు ఉద్యోగావకాశాలు లభిస్తున్న దుస్తుల ఫ్యాక్టరీల్లో, పని, ఆరోగ్య రంగంలో కూడా పరిస్థితులు చాలా ప్రాధమిక స్థితిలో మాత్రమే ఉంటున్నాయి. మహిళలకు ఇప్పుడు ఉంటున్న ఉపాధి పరిస్థితులను మెరుగుపర్చి మౌలికంగా మార్పులను తీసుకురావడం, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం చేస్తే, మహిళల పెళ్లికి ప్రత్యామ్నాయాలు లభించి వారు ఉత్పాదక రంగంలో ప్రవేశించి అర్థవంతమైన జీవితాలు గడిపే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు, చేసుకోవాలి అనే వ్యాపారంలోకి ఇప్పుడు ప్రభుత్వం నేరుగా దిగినట్లుగా కనిపిస్తోంది. – శ్రీపర్ణ ఛటోపాధ్యాయ్,అసోసియేట్ ప్రొఫెసర్, ఫ్లేమ్ యూనివర్సిటీ (‘ది వైర్’ సౌజన్యంతో) బాధితులనే శిక్షించే చట్టాలతో మార్పు ఎలా? కుటుంబాల్లో, సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్ష,, భర్త వైపునుంచి హింస, ఆస్తిపై యాజమాన్యం, సమాన వేతనం వంటివి మహిళలు నేటికీ ఎదుర్కొంటున్న సవాళ్లుగా ఉంటున్నాయి. పైగా అమలవుతున్న చట్టాలు బాధితులను మరింతగా శిక్షించడానికే తప్ప సామాజిక మార్పునకు దారి తీయడం లేదు. బాలికలను చిన్నవయస్సులోనే పెళ్లి చేసుకునేలా ఒత్తిడి చేస్తున్న వ్యవస్థాగత అంశాలను చట్టాలు అసలు పట్టించుకోవు. అందుకే విభిన్న సామాజిక, ఆర్థిక బృందాలు ఉనికిలో ఉంటున్న సమాజంలో చట్టం అనేది ఇప్పటికే సాధికారత కోల్పోయి ఉన్నవారిని శిక్షించే కొలమానంగానే మారుతుండటం విచారకరం. పెళ్లి వయస్సును చట్టం ద్వారా పెంచితే అది బాల్యవివాహాలను నిరోధించడానికి బదులుగా బాధితులను శిక్షించడానికే ఉపయోగపడుతుంది. పైగా అమ్మాయిల పెళ్లి వయస్సును 21 సంవత్సరాలకు పెంచడం అనేది యువతీ యువకులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కును తిరస్కరిస్తుంది. ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకోవడం అనే యువత హక్కును చట్టం ఎంత భంగపరుస్తోందో మనందరికీ తెలుసు. ఏ సమాజానికైనా చట్టం అవసరమే. కానీ సామాజిక బృందాలను శిక్షించడం కాకుండా వారికి సహకారం అందించే చట్టాలు మనకు అవసరం. బాల్యవివాహాల సమస్యను పరిష్కరించడానికి చట్టం మాత్రమే ప్రధాన సాధనంగా ఉండరాదు. వివాహం విషయంలో యువతకు భద్రత, సాధికారత కలిగించే వాతావరణాన్ని సృష్టించడంపై యావత్ సమాజం దృష్టి పెట్టాలి. బాలబాలికలను అణిచిపెడుతున్న నిర్బంధపూరితమైన లైంగికత స్థానంలో బాధ్యతాయుతమైన లైంగిక ప్రవర్తనను పెంచాలి. బాలికల వివాహ వయస్సును పొడిగించడంతోనే సమస్యకు పరిష్కారం లభించదు. గ్రామీణ సమాజంలోని అననుకూలతల నుంచి బాలికలను బయటపడేసి, వారికి తగినన్ని వనరులు, అవకాశాల కల్పనతో సాధికారతవైపు నడిపించాలి. సామాజిక, ఆర్థికపరంగా మనుగడ కోసం పెళ్లి తప్పనిసరి అనే జంఝాటం నుంచి బాలికలకు విముక్తి కల్పించాలి. విద్య, ఉపాధి, భద్రత, చలనశీలతతోపాటు పెళ్లి ఎప్పుడు, ఎవరిని చేసుకోవాలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛను వారికి అందించాలి. ఇవన్నీ సాధ్యపడినప్పుడు పెళ్లాడే వయస్సు దానికదే పెరుగుతూ పోతుంది. కానీ ఈ విషయాన్ని వినేదెవ్వరు? ప్రభుత్వం అయితే అసలు వినదనేది స్పష్టం. మనదేశంలో 18 ఏళ్ల వయస్సులో ఓటు వేయడం, కాంట్రాక్టు మీద సంతకం చేయడం, బతకడానికి పని ప్రారంభించడం సాధ్యపడుతున్నప్పుడు ఎవరిని పెళ్లిచేసుకోవాలో నిర్ణయించే శక్తి వారికి లేదని చెప్పడం వింతల్లోకెల్లా వింతే. – ఈనాక్షీ గంగూలీ, మానవహక్కుల కార్యకర్త -
భిక్షాటన చేస్తుంటే చేరదీసి స్కూల్కి పంపారు.. రెండు నెలల తర్వాత..
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల కిందట మంచాల కస్తూర్బాగాంధీ గిరిజిన బాలికల హాస్టల్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. మంచాల ఎస్సై రామన్ గౌడ్ కథనం ప్రకారం.. నగరంలో భిక్షాటన చేసే ఆరుగురు బాలికలను చైల్డ్లైన్వారు ఆపరేషన్ స్మైల్ ద్వారా చేరదీసి నగరంలోని చంద్రాయన్గుట్టలోని ఎంవీ ఫౌండేషన్లో చేర్పించారు. అక్కడ నుంచి రెండు నెలల కిందట మంచాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గిరిజన బాలికల హాస్టల్లో చేర్పించారు. వారిలో సమ్రీన్(14) 9వ తరగతి, నుస్రత్(13) 8వ తరగతి చదువుతోంది. వీరు ఇరువురు బాలికలు శనివారం ఉదయం హాస్టల్ నుంచి పారిపోయారు. గమనించిన హాస్టల్ వార్డెన్ శ్రీలతారెడ్డి ఎంవీ ఫౌండేషన్ వారికి సమాచారం అందించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం మంచాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: First Gay Marriage In Telangana: తెలంగాణలో తొలి ‘గే’ మ్యారేజ్ -
కామాంధుడి పైశాచికం.. చితక్కొట్టిన మహిళలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో ఓ రౌడీ షీటర్కు మహిళలు దేహశుద్ధి చేశారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి పుస్తకాలు, పెన్నలు ఎరచూపి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన రౌడీషీటర్ చిన్నారావుకు పిల్లల తల్లిదండ్రులు బడితెపూజ చేశారు. చదువుకునేందుకు సామాగ్రి ఇస్తానంటూ బాలికలను ఇంటికి తీసుకెళ్లిన చిన్నారావు.. వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థినీలు.. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఆ వ్యక్తికి బుద్ధి చెప్పారు. చిన్నారావును కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. కాళ్లు, చేతులు, తల మాయం -
ఇది కదా ఫిట్నెస్: ఈ ముగ్గురు భామలకు ఫిదా అవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యంగా ఉండాలని వ్యాయామాలు చేయడం సర్వసాధారణం. ఇందుకోసం వాకింగ్, జాగింగ్తోపాటు, యోగా, జిమ్లో బాగా కసరత్తులు చేయడం కూడా తెలిసిందే. అయితే ఒక్కసారి వ్యాయామం అలవాటు అయితే దాన్ని వదిలిపెట్టలేనంతగా లీనమైపోతారు. ఈ కోవలో యోగాసనాలు, జిమ్నాసిక్ట్స్ ముందు వరుసలో నిలుస్తాయి. తాజాగా ముగ్గురు యువతులు తమ యోగా విన్యాసాలతో ఆకట్టుకున్నారు. అసలు ఎముకలే లేనట్టుగా బాడీని విల్లులలా వంచడం పాటు వీరు చేసిన ఫీట్స్ ఆకర్షణీయంగా మారాయి మండే మోటివేషన్ అంటూ తరానా హుస్సేన్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. యోగా గాల్స్ స్టామినాకు ఎవరైనా అద్భుతం అంటూ ఫిదా అవ్వాల్సిందే. మీరు కూడా ఓ లుక్కేసుకోండి మరి! Monday motivation 💪💪. #goodmorning #fitness #fitnessmotivation #workoutmotivation #workout #yoga #healthcare #motivation #healthylifestyle #healthyliving #healthierhappenstogether #fit #FitnessGirl #inspiration #yogalife #yogagirl pic.twitter.com/TPmOaVrifS — Tarana Hussain (@hussain_tarana) November 22, 2021 -
విద్యార్థినులకు మాయమాటలు.. మార్కులు ఎక్కువగా వేయిస్తానని చెప్పి..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): విద్యార్థులను తండ్రి మాదిరిగా చూసుకోవాల్సిన ప్రిన్సిపాల్ కీచకుని అవతారమెత్తి కటకటాల పాలయ్యాడు. వర్కులు ఎక్కువ వేస్తానని నమ్మించి విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ప్రిన్సిపాల్ హయ్యాళప్పను అరెస్ట్ చేశారు. నిందితుడు యాదగిరి తాలక ముండరిగి కిత్తరు రాణి చెన్నమ్మ గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్గా ఉన్నాడు. పదవ తరగతి పరీక్షలలో అధిక మార్కులు వేసి ఉత్తీర్ణులు చేస్తానని మభ్యపెట్టి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ రాగప్రియ హాస్టల్ను పరిశీలనకు వచ్చారు. ఆ సమయంలో విద్యార్థినులు ఆమె ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆమె ఆదేశాలతో ఎస్పీ వేదమూర్తి వెంటనే ప్రిన్సిపాల్ హయ్యాళప్పపై కేసు నవెదు చేయించి అరెస్ట్ చేశారు. -
నీట్ పరీక్ష రాస్తున్న వారిలో బాలికలే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: వైద్య వృత్తిపై అమ్మాయిలు అమిత ఆసక్తి కనబరుస్తున్నారు. వైద్య విద్యలో ప్రవేశాలకు ఏటా నిర్వహించే నీట్ పరీక్షను బాలికలే అధిక సంఖ్యలో రాస్తున్నారు. అంతేకాదు ఆ మేరకు ఫలితాలు కూడా సాధిస్తున్నారు. 2021–22 సంవ త్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షకు 15.44 లక్షల మంది హాజరయ్యారు. అందులో 8.63 లక్షల మంది బాలికలే ఉండగా, 6.81 లక్షల మంది బాలురున్నారు. పరీక్షకు హాజౖ రెనవారిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. కాగా బాలుర కంటే బాలికలు 1.19 లక్షల మంది అధికంగా అర్హత సాధించడం విశేషం. అత్యధికంగా 4.94 లక్షల మంది బాలికలు అర్హులుగా నిలవగా, 3.75 లక్షల మంది బాలురు అర్హత సాధించారు. 2020లో నిర్వహించిన నీట్ పరీక్షలోనూ బాలికలే ఎక్కువగా అర్హత సాధించారు. అప్పుడు 4.27 లక్షల మంది బాలికలు అర్హులు కాగా, 3.43 లక్షల మంది బాలురు అర్హులుగా తేలారు. మొదటి ర్యాంకు ముగ్గురిలో ఒకరు బాలిక తాజా నీట్ పరీక్షలో ముగ్గురు విద్యార్థులు సమానంగా అంటే 720 మార్కులకు 720 మార్కులు సాధించి మొదటి ర్యాంకులను సాధించారు. అయితే అందులో తెలంగాణకు చెందిన మృణాల్ కుటేరి నంబర్ వన్ స్థానం సాధించినట్లు ప్రకటించారు. ముగ్గురికీ సమానంగా ఒకే ర్యాంకు, ఒకే మార్కు వచ్చినప్పుడు వివిధ అంశాలను ఆధారంగా చేసుకొని నంబర్ వన్ స్థానాన్ని ప్రకటిస్తారు. అయితే మొదటి ర్యాంకు సాధించిన వారిలో మహారాష్ట్రకు చెందిన కార్తీక్ జి.నాయర్ (బాలిక) కూడా ఉండటం గమనార్హం 2021–22 నీట్లోబాలురు, బాలికల సంఖ్య అంశం బాలురు బాలికలు దరఖాస్తు 7,10,979 9,03,782 హాజరు 6,81,168 8,63,093 అర్హత 3,75,260 4,94,806 కష్టపడే తత్వం ఎక్కువ మెడికల్ సీటు సాధించాలన్నా, ఆ తర్వాత దాన్ని కష్టపడి చదవాలన్నా, వైద్య వృత్తిలో రాణించాలన్నా ఓపిక, సహనం ఎక్కువగా ఉండాలి. బాగా కష్టపడేవారికే మెడికల్ సీటు వస్తుంది. ఈ తత్వం బాలికల్లోనే ఎక్కువగా ఉంటుంది. మొదటి నుంచీ బాలికలే వైద్య విద్యపై ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. ఫలితాలు కూడా సాధిస్తుంటారు. మేము ఇస్తున్న నీట్ కోచింగ్ల్లో కూడా 60 నుంచి 70 శాతం మంది బాలికలే ఉంటున్నారు. – శంకర్రావు, డీన్, శ్రీచైతన్య జూనియర్ కాలేజీలు, హైదరాబాద్ -
ముగ్గురు యువతుల ఆత్మహత్య
జగిత్యాల(కరీంనగర్): జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్లో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న గుట్టవద్ద గల ధర్మసముద్రం చెరువులో దూకి ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి వివాహం అవ్వగా, మరో యువతి ఇంటర్ చదువుతోంది మృతులు గంగాజల దేవి, మల్లిక, వందనలుగా పోలీసులు గుర్తించారు. వారి ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: లైవ్ వీడియోతో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ మిస్ తెలంగాణ -
ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు
ఆ తల్లి ఏమీ చదువుకోలేదు. ఆ తండ్రీ మామూలు తండ్రే. కాని కూతురు పుట్టడం శుభసూచకం అని తెలిసేంత తెలివి వారికుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఆరుమంది కుమార్తెలు పుట్టారు. ఆడపిల్లకు చదువుకు మించిన ధైర్యం లేదని ఆ తల్లిదండ్రులు వారిని చదివించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఆరుగురూ డాక్టర్లు అయ్యారు. ఆడపిల్ల విషయంలో పాతకాలపు భావాలున్న వారికి వీరి వైద్యం తప్పనిసరి కదూ. ‘నేను వరుసపెట్టి ఆడపిల్లలను కంటుంటే ఊళ్లో అందరికీ కంగారే. ఆ పిల్లల పరిస్థితి ఏం కాను. వాళ్ల పెళ్లిళ్లు ఎలా కాను అని. పెళ్ళిళ్లేమిటి... వాళ్లు ముందు చదువుకోవాలి కదా’ అంటుంది ఆరుగురు కుమార్తెలను కని, వారిని డాక్టర్లను చేసిన జైనా. పిల్లల ప్రయోజకత్వాన్ని చూడటానికి భర్త ఉంటే బాగుండునని ఆమె అనుకుంటుంది గాని ఆయన మరణించి ఆరేడేళ్లు అయిపోతోంది. అతని పేరు అహమద్. వారిది కోజికోడ్ జిల్లాలోని నాదపురం అనే చిన్న పల్లె. ‘నాకు పన్నెండు పెళ్లయ్యేటప్పటికి. ఐదో క్లాసుకే చదువు మాన్పించి ఇంట్లో కూచోబెట్టి పెళ్లి చేశారు. మా ఆయన నాకు బంధువే. అతను మద్రాసులో ఉద్యోగం చేసేవాడు. నాకు బాగా చదువుకోవాలని ఉండేది. ఆ తర్వాత సంసారంలో పడ్డాను. మద్రాసు నుంచి మేము కతార్ వెళ్లాం. అక్కడ నా భర్త ఒక ఆయిల్ కంపెనీలో పని చేసేవాడు. అక్కడే మా ఆరుమంది అమ్మాయిలు చదువుకున్నారు’ అంటుంది జైనా. అహమద్కు డాక్టర్ కావాలని ఉండేదట. కాని కాలేకపోయాడు. తమ్ముణ్ణి చేద్దామని అనుకుంటే ఆ తమ్ముడు టీచర్ అయ్యాడు. పిల్లలు డాక్టర్లు అయితే చూడాలనుకున్నాడు. జైనా కూడా అదే చెప్పింది. ‘నేను ఎలాగూ చదువుకోలేకపోయాను. పిల్లల్ని ఇద్దరం చదివిద్దాం’ అంది. ఇక అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు తమ ప్రతి పైసా పిల్లల చదువుకు ఉపయోగించేవారు. ‘సాయంత్రం స్కూళ్లు అయ్యి పిల్లలు ఆడుకునే మూడ్లో ఉంటే పిలిచి ఒకటే మాట చెప్పేదాన్ని– మీరంతా బాగా చదువుకోవాలి. అందులో రాజీ లేదు అని’ అంటుంది జైనా. ఇంకో సంగతి ఏమిటంటే ఆ ఆరుమంది ఆడపిల్లలను కన్న అహమద్కు లోకజ్ఞానం, పుస్తక జ్ఞానం ఎక్కువ. నా పిల్లలు పుస్తకాలు బాగా చదవాలి అని రకరకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. అలా వారికి చదువు మీదే కాక జనరల్ నాలెడ్జ్లో కూడా పరిణితి ఉండేలా చేశాడు. ఆరుమంది ఆడపిల్లల్లో ఇప్పుడు డాక్టర్ ఫాతిమా అహమద్ (39), హాజరా అహమద్ (33), ఆయిషా అహమద్ (30), ఫైజా అహమద్ (28) ఇప్పటికే వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రీహానా అహమద్ (23) ఫైనలియర్ ఎంబిబిఎస్ చేస్తోంది. అమీరా అహమద్(19) మొదటి సంవత్సరం ఎంబిబిఎస్లో ఉంది. ‘మొదట నేను మెడిసిన్ చేశాను. అదేం పెద్ద విషయం కాదని నా చెల్లెళ్లకు చెప్పాను. వారు వరుస అందుకున్నారు’ అంటుంది పెద్ద కూతురు ఫాతిమా అహమద్. ఈమె అబూదాబిలోని మిలట్రీ హాస్పిటల్లో పని చేస్తోంది. ‘కతర్ నుంచి మేము ఇండియాకు తిరిగొచ్చేసి రెండేళ్లు గడిచేసరికి ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేశాం. నా భర్తకు అంత అదృష్టమే ఉంది. ఆయన హార్ట్ ఎటాక్తో పోయారు’ అంది జైనా. అయితే భర్త చనిపోయినా ఆమె తన సంకల్పాన్ని వదల్లేదు. మిగిలిన కూతుళ్లను మెడిసిన్ చదివించాల్సిందే అనుకుంది. ‘నా మూడో కుమార్తె మాత్రం లా చేయాలని అనుకుంది. లా చేస్తే నీ భర్త ప్రాక్టీసు చేయించొచ్చు. మాన్పించవచ్చు. కాని మెడిసిన్ చేస్తే తప్పకుండా ప్రాక్టీస్ చేయించే అవకాశం ఉంది. డాక్టర్ని ఎవరు ఖాళీ పెడతారు అని సలహా ఇచ్చేసరికి మెడిసిన్ చేసింది’ అంది జైనా. ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె. ఇంకో విషయం డాక్టర్లకే ఇచ్చి చేస్తే ఇద్దరూ ఒకే రంగం కనుక ఒకరి సాధక బాధకాలు తెలుస్తాయని కూడా అనుకుంది. ఇప్పటికి పెళ్లయిన నలుగురి భర్తలూ డాక్టర్లే. పండక్కి పబ్బానికి అందరూ కలిస్తే తన ఆరుగురు కూతుళ్లను చూసుకుని ఆ తల్లి గుండె పొంగిపోతుంది. ‘నా పిల్లలు సమాజానికి సేవ చేస్తున్నారు’ అని గర్వంగా ఇరుగు పొరుగు వారితో అంటుంది. కాకుంటే ఒకటే లోటు. ఆ ఆరుగురు ఆడపిల్లలు తండ్రితో కలిసి దిగిన ఫొటో ఒక్కటీ లేదు. ‘ఏం పర్వాలేదు. ఆయన మా గుండెల్లో ఉన్నారు’ అంటారా ఆడపిల్లలు. నిజంగా వారిని కన్న తల్లిదండ్రులు ధన్యులు. కంటే కూతుర్నే కనాలి అని వీరు చెబుతున్నారు. అందరూ వినాల్సిన మాటే కదా అది. ఈ తల్లి పాటించిన మరో గొప్ప ఆదర్శం ఏమిటంటే అమ్మాయిలకు కట్నం ఇవ్వకూడదు అని. ఏ సంబంధం వచ్చినా ‘నా పిల్లల్ని అమ్మకానికి పెట్టలేదు. నేను కట్నం ఇవ్వను’ అని కచ్చితంగా చెప్పేసిందామె.