Governament
-
యోగి సర్కారుకు ఎనిమిదేళ్లు.. యూపీలో సంబరాలు
లక్నో: ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కారు ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాలోనూ బీజేపీ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జ్లు, కార్యకర్తలు ‘ఉత్తరప్రదేశ్ శ్రేయస్సు - ఎనిమిది వసంతాల బీజేపీ ప్రభుత్వం’ అనే నినాదంతో గ్రామాలలో సందడి చేస్తున్నారు.ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం(State Government) మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు నిర్వహించనుంది. రాష్ట్రంలోని బూత్ల నుండి జిల్లా ప్రధాన కార్యాలయాల వరకు అన్నిచోట్లా ఉత్సవాలు జరగనున్నాయి. మార్చి 24 నుండి జిల్లా స్థాయిలో వర్క్షాప్లు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పథకాలను, ఇందుకోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికి చేరవేయనున్నారు. అసెంబ్లీ స్థాయిలో అభివృద్ధి సదస్సులు కూడా నిర్వహించనున్నారు.జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టుల గురించి అందరికీ వివరించేందుకు యువమోర్చా బైక్ ర్యాలీ(Bike rally)లు నిర్వహించనుంది. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి, అందరికీ తెలియజేయనున్నారు. ఏప్రిల్ 14న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేయనున్నారు.ఇది కూడా చదవండి: ‘రెండు కిలోల వెల్లుల్లి, రూ. 500 తెస్తేనే కేసు దర్యాప్తు’ -
కూటమి నేతల అండదండలతో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా
-
ఢిల్లీలో హైబ్రీడ్ మోడ్లో పాఠశాల తరగతులు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ మునిసిపల్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను ‘హైబ్రిడ్ మోడ్’లో అంటే ఆన్లైన్, ఆఫ్లైన్లలో నడపాలని ఆదేశించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గాలి నాణ్యతలో కాస్త మెరుగుదల ఏర్పడిన దరిమిలా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సడలింపులను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పాఠశాలల నిర్వహణలో ఈ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలను అక్టోబర్ 18 నుండి ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా గాలి నాణ్యత చాలా తక్కువ వర్గానికి చేరుకుంది. ఈ నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తరగతులను పునఃప్రారంభించాలని సీఏక్యూఎం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో హైబ్రిడ్ మోడ్లో విద్యాబోధన కొసాగనుంది. దీని ప్రకారం పాఠశాల తరగతులను అటు ఆన్లైన్లో, ఇటు అఫ్లైన్లోనూ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో తరగతులు నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
Delhi Pollution: డ్రోన్ల సాయంతో కాలుష్యకారక పరిశ్రమల గుర్తింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం హద్దులు దాటి ప్రజలకు ఊపిరి అందనివ్వకుండా చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యం నియంత్రణ దిశగా నడుంబిగించింది. రాజధానిలోని నివాస ప్రాంతాల్లో అక్రమంగా నడుస్తూ, కాలుష్యాన్ని వ్యాప్తిచేస్తున్న జీన్స్ డైయింగ్ ఫ్యాక్టరీలు, రెడీ-మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లు, ఎలక్ట్రోప్లేటింగ్ యూనిట్లపై దృష్టి సారించింది.అక్రమ ఫ్యాక్టరీలు, యూనిట్లపై డ్రోన్తో నిఘా చేపట్టేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) సిద్ధమైంది. పారిశ్రామిక కాలుష్యానికి కారణమయ్యే యూనిట్లను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టి, వాటిని మూసివేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తుఖ్మీర్పూర్, కరవాల్ నగర్, గోకుల్పురి, ఘాజీపూర్, అలీ విహార్, మిథాపూర్ పరిసర ప్రాంతాలతో సహా 17 ప్రధాన కాలుష్య హాట్స్పాట్లలో డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. ఇక్కడ అక్రమంగా రంగులు వేసే యూనిట్లు, జీన్స్ వాషింగ్ యూనిట్లను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది.ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 15 రోజుల పాటు ఈ డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. డ్రోన్ ఆధారిత ఆర్థో-రెక్టిఫైడ్ ఇమేజరీ (ఓఆర్ఐ)ని ఇందుకోసం వినియోగించనున్నారు. ఇది కాలుష్య యూనిట్లకు ఫోటోలు తీస్తుంది. ఈ సర్వేలో ఉపయోగించే డ్రోన్ దాదాపు 45-60 నిమిషాల పాటు గాలిలో ఎగురుతుంది. దీని విజిబిలిటీ పరిధి 3-5 కి.మీ ఉంటుంది. ఇది 750 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ సర్వే కోసం 17 డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఇందుకోసం డీపీసీసీ టెండర్లు జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు నిర్ణీత గడువులోగా తమ ప్రతిపాదనలో డ్రోన్ ప్లాన్, డ్రాఫ్ట్ స్క్రిప్ట్, యాక్షన్ ప్లాన్, డ్రాఫ్ట్ డిజైన్ను సమర్పించాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ! -
ఇదేం చిత్రం..! జననాల రేటు పెంచడం కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ..!
ఇంతకుముందు "జనాభా నియంత్రణ" అంటూ ప్రపంచ దేశాలు గగ్గోలు పెట్టేవి. కానీ ఇప్పుడు ఆ కథే అడ్డం తిరిగింది. బాబు.. "పిల్లల్ని కనండి ప్లీజ్" అంటూ వెంటపడుతున్నాయి దేశాలు. ఈ సమస్య ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. చాలా దేశాల్లో ఇదే పరిస్థితి కనబడుతోంది. అందుకోసం ఆయా దేశాల అధికారులు జననాల రేటు పెంచేందుకు తీసుకుంటున్న చిత్ర విచిత్ర నిర్ణయాలు చూస్తే.. మరీ ఇంతలా దిగజారిపోవాలా..! అనుకుంటున్నారు చాలామంది. ఒకప్పుడు పిల్లలు వద్దు అని ప్రజల మనసుల్లో పాతకునేలా చేశాం. ఇప్పుడు కావాలంటే..ఎలా..? అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు కూడా. జనాభాని పెంచేందుకు ఆయా దేశాలు అమలు చేస్తున్న స్కీమ్లు, విధానాలు వింటే గోప్యతకు భంగం వాటిల్లేలా ఉన్నాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతలా ఆయా దేశాలు జనాభాను పెంచేందుకు ఏం చేస్తున్నాయనే కదా..!రష్యాలో జనాభా దారుణంగా తగ్గిపోతుంది. ఏం చేయాలో తెలియక అక్కడి అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఏదో ఒకటి చేసి జననాల రేటుని పెంచాలనే నిర్ణయానికి వచ్చేసింది రష్యా. అందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను(సెక్స్ మంత్రిత్వ శాఖ) ఏర్పాటు చేసి జననాల రేటుని పెంచే బాధ్యతను చేపట్టాలని నిర్ణయించింది. ఆ విషయమై పిటిషన్ని కూడా దాఖలు చేశారు అధికారులు. ఇది జనాభాను పెంచే రష్యా పార్లమెంట్ కమిటీ అధిపతి నినా ఒస్తానియా సమీక్షలో ఉంది. పని ప్రదేశాల్లో కూడా జంటలను ఎక్కువ విరామం తీసుకుని పిల్లలనే కనేలా ప్లాన్ చేసుకోండని ప్రోత్సహిస్తున్నారు అక్కడి అధికారులు. అక్కడితో ఆగలేదు ఆఖరికి బెడ్రూంలోకి కూడా ఎంటర్ అయ్యిపోయే స్థాయికి దిగజారిపోయింది రష్యా ప్రభుత్వం. దయచేసి బెడ్రూంలోకి రాగానే పౌరులంతా మొబైల్ ఫోన్లు ఆఫ్ చేయాలనే నిబంధనలు తీసుకొచ్చింది. అంతేగాదు పిల్లలను కనేలా ప్రోత్సహిస్తూ..జంటలకు రూ. 4 వేల రూపాయలు అందిస్తోంది. అదే కొత్తగా పెళ్లైన జంటలకు హోటల్లో గడిపేందుకు ఖర్చులు కింద ఏకంగా రూ. 22 వేల రూపాయల వరకు అందిస్తోంది. అలానే 18 నుంచి 23 మధ్య వయస్సు గల మహిళలకు బిడ్డను కనేలా రూ. 98,029 ఇస్తున్నారు. మొదటి బిడ్డకు ఏకంగా రూ.9.26 లక్షల వరకు పారితోషకం ఇవ్వడం విశేషం. అంతేగాదు ప్రభుత్వ రంగంలో పనిచేసే మహిళా ఉద్యోగులు ఫ్యామిలీ ప్లాన్ గురించి, వ్యక్తిగత ఆరోగ్య సమాచారానికి సంబంధించిన డేటాను సేకరిస్తారు. దీంతోపాటు గతంలో పిల్లలను కలిగి ఉన్నారా..ఎంతమంది కావాలనుకుంటున్నారు వంటి పూర్తి సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనట. ఇతర దేశాల్లో..దక్షిణ కొరియాఈ దేశంలో జననాల రేటు ఘోరంగా తగ్గిపోతోంది. అక్కడి ప్రభుత్వాలు ఈ విషయమై రకరకాలుగా సన్నాహాలు చేస్తోంది. ఆ నేపథ్యంలోనే పార్క్లు, పబ్లిక్ మ్యూజియంలలో ప్రజలు వివాహాలు చేసుకోవచ్చని గ్రీన్సిగ్నల్ ఇచ్చేసింది. జస్ట్ జంటలుగా మారితేనే రూ.30,270 చెల్లిస్తోంది. అంతేగాదు వివాహం గురించి మాటలు జరిగితేనే ఏకంగా రూ. 60540 పారితోషకం అందిస్తోందట. ఇక పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ. 1210810ల పారితోషకాన్ని గిఫ్ట్గా పొందొచ్చు. జపాన్జపాన్ ప్రభుత్వం వివాహం చేసుకునే మహిళలకు ఏకంగా రూ. 3 లక్షలు పైనే చెల్లించేలా ఓ ప్రత్యేక స్కీమ్ని ప్రవేశపెట్టింది. అయితే ఇది అంతగా వర్కౌట్ కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను ఆకర్షించేలా.. వివాహానికి సంబంధించిన పథకాలను ప్రవేశ పెట్టే యోచనలో పడింది.చైనాచైనా ఒకప్పుడు ఒకే బిడ్డ అనే పాలసీతో ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేసింది. అలాంటి దేశం ఇప్పుడు తీవ్ర జనాభా కొరతతో పోరాడుతోంది. చైనా అంతట జననాల రేటు దారుణంగా పడిపోయింది. దీంతో పిల్లలను కనండి అంటూ ఉద్యోగులకు ఎన్నో వెసులుబాటులు, సౌకర్యాలు కల్పిస్తోంది. మూడో బిడ్డను కనేవారికి ఏకంగా రూ. 3లక్షలుగా పైగా విలువైన సబ్సిడీలను కూడా అందిస్తోంది.(చదవండి: చిన్నారుల్లో మాటలు రావడం చాలా ఆలస్యమవుతుందా..?) -
ఢిల్లీ ప్రభావం.. పంజాబ్ క్యాబినెట్లో మార్పులు
చండీగఢ్: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మార్పులు చోటుచేసుకున్న దరిమిలా ఆ ప్రభావం పంజాబ్పై పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా చేయడం, అనంతరం కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా పంజాబ్లో ఆప్ ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ముందడుగు వేసింది. పంజాబ్ నీటి సరఫరా, పారిశుధ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బ్రహ్మ్ శంకర్ జింపా, సమాచార, పౌరసంబంధాలు, మైనింగ్, భూమి ప్రకటనల శాఖ మంత్రి చేతన్ సింగ్ జోరామజ్రా, పర్యాటక మంత్రి అన్మోల్ గగన్ మాన్తో పాటు మరో మంత్రి బాల్కర్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను పంజాబ్ ప్రభుత్వం ఆమోదించి, వెంటనే గవర్నర్కు పంపింది. అనంతరం పంజాబ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను ప్రకటించింది. కొత్తగా బరీందర్ కుమార్ గోయల్, తరణ్ప్రీత్ సింగ్ సౌంద్, మహీందర్ భగత్, హర్దీప్ సింగ్ ముండియాలను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు ప్రకటించింది.ఈ నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే తొలిసారి. 30 నెలల భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఇది నాల్గవసారి మంత్రివర్గ విస్తరణ. 117 మంది ఎమ్మెల్యేలున్న పంజాబ్ అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ సహా 15 మంది మంత్రులు కేబినెట్లో ఉన్నారు. మంత్రి మండలిలో మొత్తం 18 మంది మంత్రులు ఉండేందుకు అవకాశముంది. ఇది కూడా చదవండి: Sign Languages Day: ఒకప్పుడు చులకనగా చూసినవాళ్లే నేడు.. -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
స్లీపర్ వందేభారత్ ప్రత్యేకతలివే..
త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ రైలు గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ న్యూ జనరేషన్ రైలు పూర్తిగా భారత్లోనే తయారు కావడం విశేషం. ఇప్పటి వరకు వందేభారత్ రైలులో కేవలం చైర్ కార్ సౌకర్యం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు స్లీపర్ వందే భారత్ మరిన్ని సౌకర్యాలతో మనముందుకు రానుంది. ఈ రైలుకు సంబంధించిన కార్యకలాపాలను ఈ ఏడాది చివరి నాటికల్లా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024, ఆగస్టు 15న ఈ రైలు ట్రయల్ రన్ జరగనుంది.తాజాగా స్లీపర్ వందే భారత్కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్చేస్తున్నాయి. భారీ గాజు అద్దాల కిటికీలు రైలుకు ప్రీమియమ్ లుక్ని ఇస్తున్నాయి. బోగీలోని పైసీటు కాస్త కిందకే ఉంది. దాన్ని ఎక్కడానికి అమర్చిన మెట్లలో గ్యాప్ తక్కువగా ఉంది. అంతేకాకుండా మెట్లపై కుషన్లు కూడా ఏర్పాటు చేశారు. బోగీలో ఒకవైపు మూడు సీట్లు ఉన్నాయి.సీటు రంగు లేత గోధుమ రంగులో ఉంది. ఫ్యాన్సీగా కనిపించే లైట్లను అమర్చారు. ఇది కోచ్కు మరింత అందాన్నిచ్చింది. రాబోయే ఐదేళ్లలో 500 వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను పట్టాలపై పరుగులు తీయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
సిక్కింలో వర్ష బీభత్సం.. చిక్కుకుపోయిన పర్యాటకులు
సిక్కింలో వర్ష బీభత్సం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. బుధవారం రాత్రి ఉత్తర సిక్కింలో 220 మి.మీకు మించిన వర్షం కురిసింది. దీంతో తీస్తాలో వరదలు సంభవించాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. తీస్తా నదిలో నీటిమట్టం పెరగడంతో ఒడ్డున ఉన్న ఇళ్లలోకి భారీగా నీరు చేరింది.వాతావరణం అనుకూలించిన అనంతరం పర్యాటకులను ఇక్కడి నుంచి తరలించే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు మరమ్మతులకు ఐదు నుంచి ఆరు రోజులు పట్టవచ్చని సమాచారం. ఉత్తర సిక్కింలో శుక్రవారం కూడా భారీ వర్షం నమోదయ్యింది. ఈ విపత్తు బారిన పడి మృతిచెందినవారి సంఖ్య ఆరుకు చేరింది. గురువారం ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురు గల్లంతయ్యారు.సిక్కింలోని సంక్లాంగ్ ప్రాంతంలో వంతెన కొట్టుకుపోవడంతో చుంగ్తాంగ్, లాచుంగ్ ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విపత్తు పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. బాధిత ప్రాంతాలకు సంబంధించిన పరిస్థితులపై సమాచారం సేకరించి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో చిక్కుకుపోయిన పర్యాటకులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ భూషణ్ పాఠక్ తెలిపారు. #WATCH | One person dead, five missing and houses damaged due to heavy rain in Mangan, Sikkim (Video source: SSP Mangan) pic.twitter.com/lo7iD8tAFH— ANI (@ANI) June 13, 2024 -
'స్లీపింగ్ పార్టనర్' సమాధానం చెప్పదు.. నిర్మలా సీతారామన్
దేశంలో ఇప్పటి వరకు నాలుగు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఇంకా మూడు దశల్లో ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈ తరుణంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలతో పాటు స్టాక్ మార్కెట్ బ్రోకర్లపై విధించే పన్నులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' స్పందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇటీవల జరిగిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ను స్టాక్ మార్కెట్ లావాదేవీలతో పాటు ఇల్లు కొనుగోలుపై ప్రభుత్వం విధించే పన్నుల గురించి స్టాక్ బ్రోకర్ అడిగారు. తాను డబ్బును పెట్టుబడి పెట్టడంతోపాటు నష్టాలను కూడా భరిస్తున్నానని, అయితే ప్రభుత్వం దాదాపుగా తన “స్లీపింగ్ పార్టనర్” లాగా ఉందని అన్నారు.ప్రభుత్వం మాత్రమే జీఎస్టీ, ఐజీఎస్టీ, స్టాంప్ డ్యూటీ, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ నుంచి ప్రభుత్వం బాగానే ఆదాయాన్ని గడిస్తోందని అన్నారు. దీనికి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. స్లీపింగ్ పార్టనర్ ఇక్కడ కూర్చుని సమాధానం చెప్పలేదని చమత్కరించారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించేందుకు క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి)తో కలిసి పనిచేయాలని బిఎస్ఇకి మంత్రి విజ్ఞప్తి చేశారు.The Government of India is my sleeping partner. 😩FM Nirmala Sitharaman Stumped By This Question At BSE by stock market investor. pic.twitter.com/tr7yD9yQdg— Pankaj Parekh (@DhanValue) May 16, 2024 -
ఓట్ల లెక్కింపు ఎప్పుడు? ఫలితాలు ఎన్నడు?
ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులతో సతమతమవుతున్న పాకిస్తాన్లో గురువారం సాధారణ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. 336 సభ్యుల జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 169 సీట్లు అవసరం. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఇది కొనసాగనుంది. ఓటింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 150 పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ, ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. అవి పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్. పాకిస్తాన్లో ఎన్నికల జరిగిన రోజు అర్థరాత్రికల్లా ఫలితాలు వెలువడతాయి. ఓటింగ్ పూర్తయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పాక్లో సార్వత్రిక ఎన్నికల కోసం 26 కోట్ల బ్యాలెట్ పేపర్లు ముద్రించారు. వాటి మొత్తం బరువు 2100 టన్నులు. పాకిస్థాన్ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్ల లెక్కింపును ప్రారంభిస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక పోలింగ్ అధికారి రిటర్నింగ్ అధికారికి ఆ సమాచారం అందిస్తారు. అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. -
‘బిల్కిస్’ దోషులకు... శిక్ష తగ్గింపు చెల్లదు
న్యూఢిల్లీ/దాహోద్: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఆమెపై అత్యాచారం, కుటుంబీకుల హత్య కేసులో 11 మంది దోషులకు శిక్షా కాలం తగ్గిస్తూ గతేడాది గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది. వారు రెండు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాల్సిందిగా ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ మేరకు 251 పేజీల తీర్పు వెలువరించింది. ఓ మహిళపై ఇంతటి క్రూర నేరాలకు పాల్పడ్డ కేసుల్లో శిక్ష తగ్గింపునకు అసలు ఆస్కారమెలా ఉంటుందని గుజరాత్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాధితురాలి జాతి, మత విశ్వాసాలతో నిమిత్తం ఉండకూడదని స్పష్టం చేసింది. ‘‘శిక్ష తగ్గింపు (రెమిషన్) గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న మతిలేని నిర్ణయం. ఈ విషయంలో దోషులతో ప్రభుత్వం పూర్తిగా కుమ్మక్కైంది. వారి విడుదల కోసం అన్నివిధాలా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడింది’’ అంటూ కడిగి పారేసింది. ‘‘సుప్రీంకోర్టులో రెమిషన్ పిటిషన్ సందర్భంగా దోషులు ఈ కేసులో వాస్తవాలను దాచారు. తద్వారా అత్యున్నత న్యాయస్థానాన్నే ఏమార్చారు. తద్వారా రెమిషన్పై పరిశీలనకు ఆదేశాలు పొందారు’’ అంటూ ఆక్షేపించింది. ఆ తీర్పు కూడా చెల్లుబాటు కాబోదని ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పును బాధితురాలితో పాటు ప్రధాన రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. బానో స్వస్థలంలో ఆమె బంధుమిత్రులు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. జైలుకు వెళ్లిన అనంతరం రెమిషన్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించే అవకాశం దోషులకు ఉంది. గుజరాత్ ప్రభుత్వానికి అధికారం లేదు గుజరాత్లో 2002లో గోధ్రా రైలు దహనకాండ అనంతరం మత ఘర్షణలు చెలరేగడం తెలిసిందే. ఆ సందర్భంగా మిగతా బిల్కిన్ బానో ఉదంతం చోటుచేసుకుంది. ఐదు నెలల గర్భిణి అయిన 21 ఏళ్ల బిల్కిస్పై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె మూడేళ్ల కూతురుతో పాటు కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 11 మందిని దోషులుగా సీబీఐ ప్రత్యేక కోర్టు ఖరారు చేసింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ 2008లో తీర్పు వెలువరించింది. దీన్ని బాంబే హైకోర్టు కూడా సమరి్థంచింది. 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాక తమను విడుదల చేయాలంటూ వారిలో ఒకరు 2022 మేలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని పరిశీలించాలన్న కోర్టు ఆదేశం మేరకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దాని సిఫార్సు ఆధారంగా మొత్తం 11 మందికీ రెమిషన్ మంజూరు చేయడంతో 2022 ఆగస్టు 15న వారంతా విడుదలయ్యారు. దీనిపై బిల్కిస్ తీవ్ర ఆవేదన వెలిబుచి్చంది. రాజకీయ పారీ్టలతో పాటు అన్న విర్గాలూ వారి విడుదలను తీవ్రంగా తప్పుబట్టాయి. గుజరాత్ ప్రభుత్వ చర్యపై దేశమంతటా నిరసనలు వ్యక్తమయ్యాయి. వారి విడుదలను సుప్రీంకోర్టులో బిల్కిస్తో పాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 11 రోజుల వాదనల అనంతరం 2023 అక్టోబర్ 12న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. రెమిషన్ను కొట్టేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో విచారణ జరిగి దోషులకు శిక్ష పడింది మహారాష్ట్రలో గనుక వారికి రెమిషన్ ప్రసాదించే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. లేని అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్ష తగ్గించిందంటూ తప్పుబట్టింది. రెమిషన్ నిర్ణయాన్ని కొట్టేసేందుకు ఈ ఒక్క ప్రాతిపదికే చాలని పేర్కొంది. ‘‘2022లో సుప్రీంకోర్టుకు వెళ్లిన నిందితులు కేసులో వాస్తవాలను దాచి ధర్మాసనాన్ని తప్పుదోవ పట్టించి పునఃసమీక్షకు తీర్పును పొందారు. ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వం కూడా వారితో కుమ్మకైంది’’ అంటూ ఆక్షేపించింది. ‘‘రెమిషన్ కోసం దోషుల్లో ఒకరు 2019లోనే గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా మహారాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాల్సిందిగా సూచించింది. 2020లోనూ మరో పిటిషన్ పెట్టుకున్నా కొట్టేసింది. దాంతో దోషి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించినా లాభం లేకపోయింది. రెమిషన్ ఇవ్వొద్దంటూ సీబీఐతో పాటు సీబీఐ ప్రత్యేక జడ్జి కూడా సిఫార్సు చేశారు. ఈ వాస్తవాన్ని సుప్రీంకోర్టు ముందు దాచిపెట్టారు’’ అంటూ మండిపడింది. రెమిషన్ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంటూ బానో నేరుగా సుప్రీంకోర్టులో పిల్ వేయడం ఆరి్టకల్ 32 ప్రకారం సబబేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘శిక్ష విధించాల్సింది ప్రతీకార దృష్టితో కాదు. నేరం పునరావృతం కాకుండా చూసేందుకు. దాంతోపాటు దోషుల్లో మార్పు తెచ్చేందుకు’’ అన్న గ్రీకు తత్వవేత్త ప్లేటో సూక్తిని జస్టిస్ నాగరత్న ప్రస్తావించారు. శిక్ష తగ్గింపు నిర్ణయానికి కూడా దీన్ని వర్తింపజేయాల్సి ఉంటుందన్నారు. దోషుల హక్కులతో పాటు బాధితుల హక్కులనూ పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. బాక్సు తీర్పుపై స్పందనలు... ‘‘బానో అవిశ్రాంత పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అన్యాయంపై, బీజేపీ సర్కారు అహంకారంపై ఆమె సాధించిన విజయమిది. ఎన్నికల లబ్ధి కోసం నేరగాళ్లకు ఆశ్రయమిస్తున్నదెవరో, న్యాయానికి పాతరేస్తున్నదెవరో సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి తేటతెల్లమైంది’’ – కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ‘‘ఇది సాహసోపేతమైన తీర్పు. ఇందుకు సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు’’ – తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ‘‘బానోకు కేంద్రం తక్షణం క్షమాపణలు చెప్పాలి’’ – మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘‘మహిళలపై జరిగే అన్యాయాలను జాతి సహించబోదని ఈ తీర్పు మరోసారి నిరూపించింది’’ – బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత -
గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే..
ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులో మంటలు చెలరేగి, మూడు బోగీలు దగ్ధమయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలియజేశారు. కాగా గడచిన పదేళ్లలో పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా, వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం! 2012: మే 22న ఆంధ్రప్రదేశ్లో హంపి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు, హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్ప్రెస్ ఢీకొన్నాయి. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతోపాటు, ఒక బోగీలో మంటలు చెలరేగడంతో దాదాపు 25 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2014: మే 26న ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్లోని ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును గోరఖ్పూర్ వైపు వెళ్తున్న గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2016: నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్ప్రెస్ కాన్పూర్లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పడంతో, 150 మంది ప్రయాణికులు మృతి చెందారు. 150 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2017: ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్ప్రెస్కు చెందిన తొమ్మిది కోచ్లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. 2017: ఆగస్ట్ 18న పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్ప్రెస్ ముజఫర్నగర్లో పట్టాలు తప్పడంతో 23 మంది మృతి చెందారు. 60 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. 2022: జనవరి 13న పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్ ప్రాంతంలో బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్కు చెందిన 12 కోచ్లు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. 2023: జూన్ 2న ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 291 మంది మృతి చెందారు. 1,1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదాలివే.. -
ప్రభుత్వ ఉద్యోగులకు షాక్: రెండో పెళ్లి కుదరదంతే! షరతులు వర్తిస్తాయి
Assam అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జీవిత భాగస్వామి జీవించి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదని ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ కీలక ఆదేశాలు చేసింది. వారి వారి వ్యక్తిగత మతాల అనుమతి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేనిదే రెండో పెళ్లి చేసుకోవడం కుదరదని తెగేసి చెప్పింది. అలాగే ఏ మహిళా ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ భర్త బతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెళ్లి చేసుకోకూడదని అసోం ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింల ప్రస్తావన లేకుండా, వ్యక్తిగత చట్టం ద్వారా పలు వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఉన్న పురుషులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సర్క్యులర్లో పేర్కొంది, ఈ మేరకు అసోం సర్కార్ అక్టోబర్ 20న ఆఫీసు మెమోలో ఈ సూచనలను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి రావడం విశేషం. (19 ఏళ్లకే గ్యాంగ్స్టర్గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి) ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా బహు భార్యత్వం కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగి మరణానంతరం భర్త పెన్షన్ కోసం ఇద్దరు భార్యలు గొడవపడే సందర్భాలని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. (2014లోనే కాలం చెల్లిన ఫోన్లను వదిలేశారు: ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు) కాగా ఈ ఏడాది ప్రారంభంలో, అసోం బహుభార్యత్వాన్ని తక్షణమే నిషేధించాలనుకుంటున్నామనే అభిప్రాయాన్ని సీఎం ప్రకటించారు. సెప్టెంబర్లో జరిగే తదుపరి అసెంబ్లీ సెషన్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నామని, అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే జనవరి సెషన్లో ప్రవేశపెడతామని శర్మ హింటిచ్చారు. అలాగే ప్రతిపాదిత చట్టంపై ఆగస్టులో ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయాన్ని కోరారు. దీంతోపాటు బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర శాసనసభకున్న అర్హత విషయంలో అసోం ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా, దీనికి కమిటీ నివేదిక ఆమోదం లభించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇది ఇలా ఉంటే ఈనెల 18వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముస్లిం మంత్రికి వ్యతిరేకంగా హిమాంత శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. -
ఏ రాష్ట్రంలో మహిళలకు రిజర్వేషన్లలో పెద్దపీట? అమలవుతున్న 7 పథకాలు ఏవి?
మధ్యప్రదేశ్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ అవతరించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ తనను తాను మధ్యప్రదేశ్ మహిళల సోదరునిగా అభివర్ణించుకుంటారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారధ్యంలోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వడం, వితంతువులకు పింఛన్ ఇవ్వడం వంటి అనేక పథకాలను శివరాజ్ ప్రభుత్వం అమలు చేసింది. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం మహిళల కోసం ఏఏ పథకాలు అమలు చేస్తున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లాడ్లీ బెహన్ యోజన శివరాజ్ ప్రభుత్వం ‘లాడ్లీ బెహన్’ పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో ఈ పథకం కింద అక్కాచెల్లెళ్లకు రూ.1,000 ఆర్థిక సాయం అందించేవారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని నెలకు రూ. 1,250కి పెంచారు. 2. నారీ సమ్మాన్ కోష్ శివరాజ్ ప్రభుత్వం రూ. 100 కోట్లతో నారీ సమ్మాన్ కోష్ను ఏర్పాటు చేసింది. ఈ పథకంలో చిన్న వ్యాపారాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది. ఈ మొత్తాన్ని పీఎం స్వనిధి యోజన, ముఖ్యమంత్రి వీధి వ్యాపారుల పథకాల కింద అందజేస్తారు. 3. లాడ్లీ లక్ష్మీ యోజన ఈ పథకాన్ని మధ్యప్రదేశ్లో ఆడపిల్లలు పుడితే ప్రోత్సాహం, లింగ నిష్పత్తిలో మెరుగుదల, విద్యా స్థాయి, బాలికల ఆరోగ్య స్థితిపై ప్రజల్లో సానుకూల ధోరణి పెంపొందేందుకు ప్రారంభించారు. ఈ పథకం 2007 నుండి అమలులో ఉంది. లాడ్లీ ఇ-సంవాద్ యాప్ ద్వారా, ప్రజలు నేరుగా శివరాజ్ సింగ్ చౌహాన్ను కలుసుకోవచ్చు. 4. ముఖ్యమంత్రి కన్యా వివాహ పథకం మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి కన్యా వివాహ-నిఖా పథకం అమలవుతోంది. దీని కింద పేదలకు రూ.51వేలు ఆర్థిక సహాయంగా అందజేస్తారు. 5. ఉజ్వల పథకం మధ్యప్రదేశ్లో శివరాజ్ ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ను రూ. 450కి అందిస్తోంది. లాడ్లీ బెహనా లబ్ధిదారులతో పాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు, ప్రత్యేక వెనుకబడిన తెగల (బైగా, భరియా, సహరియా) మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. 6. స్కూటీ పథకం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళల కోసం స్కూటీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 12వ తరగతి టాపర్లు స్కూటీ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులు విడుదల చేస్తుంది. 7. మహిళా జర్నలిస్టులకు.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్తో పాటు చిన్న వార్తాపత్రికలకు ప్రకటనల హామీని కూడా ప్రకటించారు. పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ద్వారా అభివృద్ధి పనులపై అధ్యయనం చేయడానికి ప్రతి సంవత్సరం ఐదుగురు మహిళా జర్నలిస్టులకు ఫెలోషిప్ అందజేస్తారు. ఇది కూడా చదవండి: వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? -
‘... అయితే ఇండిగో ‘భాగో’ కానుందా?’... ‘ఇండియా vs భారత్’ తెగ నవ్విస్తున్న మీమ్స్!
త్వరలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక సమావేశంలో ఇండియా పేరును పూర్తిగా తొలగిస్తూ, దేశానికి ‘భారత్’ పేరు స్ధిరపరిచే ప్రస్తావన రానున్నదని అంటున్నారు. opposition named their alliance I.N.D.I.A government changes India's name to Bharat Opposition : pic.twitter.com/cTaigawSaF — coincasm | Meme Creator (@coincasmin) September 5, 2023 ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున రాష్ట్రపతి భవనం అధికారులు జీ-20 సమావేశాలకు దేశంలోని నేతలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని ఉండే చోటున ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉంది. #Bharat The names are like BIM, ABIMS,BIT,NBT pic.twitter.com/C4ioOR0sTk — Ashish (2nd edition) (@brb_memes17) September 5, 2023 దీనిని చూస్తుంటే దేశానికి ‘భారత్’ పేరును ఖాయం చేయనున్నారని వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో #Bharat ట్రెండ్ నడుస్తోంది. దీనిలో నెటిజన్లు వివిధ మీమ్స్ షేర్ చేస్తున్నారు. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. Opposition names their alliance I.N.D.I.A Government proposes to change India's name to Bharat Opposition : pic.twitter.com/YsT9OCUrLo — SwatKat💃 (@swatic12) September 5, 2023 -
చైనాను వీడని ప్రకృతి ప్రకోపం.. వరద బీభత్సం నుంచి బయటపడగానే..
ఇటీవలి కాలంలో చైనాను తరచూ ప్రకృతి విపత్తులు చుట్టుముడుతున్నాయి. ఈమధ్యనే వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దేశంలోని పలు నగరాలు నీట మునిగాయి. ఇప్పుడు వరదల కారణంగా ఆహార సంక్షోభం కూడా అంతకంతకూ పెరుగుతోంది. పొలాల్లోకి వరద నీరు చేరింది. పంటలన్నీ నాశనమయ్యాయి. కొత్త పంటలు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. గత కొన్ని నెలలుగా చైనా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ధాన్యం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న చైనాలోని ఈశాన్య ప్రాంతం వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యింది. తుఫాను కారణంగా సంభవించిన వరదలకు లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. 30 మంది మరణించారు. ఈ మరణాలు బీజింగ్, దాని పక్కనే ఉన్న హెబీ ప్రావిన్స్లో సంభవించాయి. ఆహార సంక్షోభం దిశగా.. హీలాంగ్జియాంగ్, జిలిన్, లియోనింగ్.. ఇవి చైనాకు ఈశాన్య ప్రాంతంలోని మూడు ప్రావిన్సులు. వీటిని చైనా ధాన్యాగారం అని పిలుస్తారు. ఈ మూడు ప్రావిన్సుల్లోనూ సాగు భూమి చాలా సారవంతమైనది. దేశంలోని ఆహార ధాన్యాలలో ఎక్కువ భాగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. సోయాబీన్స్, మొక్కజొన్న, వరి మొదలైనవి ఈ మూడు ప్రాంతాలలో ఎక్కువగా సాగవుతాయి. అయితే వర్షాల కారణంగా ఈ మూడు ప్రావిన్స్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో దేశంలో ఆహార సంక్షోభం సంభవించవచ్చనే చర్చలు జరుగుతున్నాయి. ధ్వంసమైన పంటపొలాలు హీలాంగ్జియాంగ్లో వరదల కారణంగా వరి పొలాలు పూర్తిగా నాశనమయ్యాయి. కూరగాయల ఉత్పత్తి కూడా పూర్తిగా నిలిచిపోయింది. హీలాంగ్జియాంగ్ రాజధాని హర్బిన్లో భారీ వర్షాలకు 90 వేల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. హర్బిన్కు ఆనుకుని ఉన్న షాంగ్జీ నగరంలో 42,575 హెక్టార్లలో పంటలు పూర్తిగా నీట మునిగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వర్షాలు, వరదల కారణంగా దేశంలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిన్నదని చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గోధుమల దిగుబడి కూడా తగ్గింది. వరి పొలాలు నాశనమయ్యాయి. గత ఏడాది తీవ్రమైన ఎండలకు పంటలు నాశనం కాగా ఈ ఏడాది వరదలు విధ్వంసం సృష్టించాయి. ఫలితంగా ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: 20 ఏళ్లపాటు వారానికో ఫొటో.. వయసొచ్చాక.. ‘సొగసు చూడతరమా’ -
సీడీపీ నిధులొచ్చాయ్..! ఒక్కో ఎమ్మెల్యేకు రూ.??
ఆదిలాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ) మంజూరయ్యాయి. జిల్లాలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.2.5 కోట్ల చొప్పున రూ.5కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి ఏడాదికి అందించే రూ.3కోట్లలో ప్రతీ మూడు నెలలకోసారి రూ.75లక్షల చొప్పున విడుదల చేస్తోంది. ఆ నిధులతో చేపట్టిన పనులు పూర్తయ్యాక మరోమూడు నెలలకు నిధులు విడుదల చేసేది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత రూ.75లక్షలు ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేసింది. అయితే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగతా మూడు విడతల నిధులు రూ.2.5కోట్లను ముందస్తుగానే విడుదల చేసింది. దీంతో అత్యవసర పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడింది. కాగా, ఈ నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంఽధించిన ప్రతిపాదనల తయారీలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. జిల్లాకు రూ.5 కోట్లు.. ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాలు ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. కాగా, శాసనమండలి సభ్యులు టీ జీవన్రెడ్డి, దండె విఠల్ ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లా పరిధిలోకి వచ్చే ఏ జిల్లానైనా వారు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. దీంతో జీవన్రెడ్డి నిజా మాబాద్ను ఎంపిక చేసుకోగా, దండె విఠల్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను ఎంపిక చేసుకున్నారు. వారి కోటా నిధులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు కేటాయిస్తోంది. నియోజకవర్గంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలను ఎమ్మెల్యేలు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి నిధులు ఒకేసారి రావడంతో అత్యవసరమైన, పెండింగ్ పనులు పూర్తిచేసే వెసులుబాటు ఎమ్మెల్యేలకు కలగనుంది. ప్రతిపాదనలకే పరిమితమైన గ్రీన్ఫండ్ 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో ఎమ్మెల్యేకు ఏడాదికి రూ.5కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇందులో రూ.2కోట్లను ‘మన ఊరు–మన బడి’ పథకానికి ఖర్చు చేయాలని సూచించింది. మిగతా రూ.3కోట్లలో 10 శాతం అంటే రూ.30లక్షలను గ్రీన్ఫండ్కు వినియోగించాలని సూచించింది. దీంతో ఆ నిధులు నియోజకవర్గ పరిధిలో పచ్చదనం పెంపునకు వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ నిధులు జిల్లాలో ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. గతేడాదికి సంబంధించి ప్రతిపాదనలు అందాయే గానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు రూ.30లక్షలకు పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు అందించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రూ.17లక్షలతో ప్రతిపాదనలు అందించగా పనులు కొనసాగుతున్నట్లుగా ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ రూ.11లక్షలతో కూడిన ప్రతిపాదనలు అందించారు. తాజాగా విడుదలైన నిధుల్లోనూ 10 శాతం నిధులు గ్రీన్ఫండ్ కింద ఖర్చు చేయాల్సి ఉండడంతో వాటిని ఏ మేరకు ఖర్చుచేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
దివ్యాంగులకు దిగులులేని మరింత దివ్యమైన ‘ఆసరా’
నెక్కొండ: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా దివ్యాంగులకు అందించే ఆసరా పింఛన్ను అదనంగా రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రూ.3,016 ఇస్తుండగా రూ. వెయ్యి పెంపుతో రూ.4,016 అందుకోనున్నారు. తాజా నిర్ణయంతో జిల్లాలోని 15,585 మందికి లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా ప్రభుత్వం వివిధ రూపాల్లో వారికి అండగా నిలుస్తోంది. దివ్యాంగులకు నెలనెలా పింఛన్లతోపాటు ఉపకరణాలు, వాహనాలు, ఇతర పథకాలను అందిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, బోదకాలు, డయాలసిస్ రోగులు మొత్తం 1,27,089 మంది ప్రతి నెలా ఆసరా పింఛన్లు పొందుతున్నారు. 13 మండలాలు.. 15,585 మంది లబ్ధిదారులు సీఎం ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా 13 మండలాల పరిధిలోని మొత్తం 15,585 మంది దివ్యాంగులు లబ్ధి పొందనున్నారు. వీరికి ప్రతి నెలా రూ.47 కోట్లను ఆసరా పింఛన్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తాజా పెంపుతో అదనంగా రూ.1.55 కోట్ల నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. మరీ ముఖ్యంగా దివ్యాంగులు ఎలాంటి పని చేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ నేపథ్యంలో పింఛన్ పెంపుతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులు రాగానే పంపిణీ.. జిల్లాలోని 13 మండలాల పరిధిలో మొత్తం 15,585 మంది దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం వీరికి రూ. 3,016 చొప్పున పింఛన్ అందిస్తోంది. సీఎం ప్రకటనతో వీరికి అదనంగా రూ.1000 కలిపి రూ.4,016 పింఛన్ అందనుంది. ఉత్తర్వులు రాగానే పంపిణీ చేస్తాం. పోరాడి సాధించుకున్నాం.. సంఘటితంగా దివ్యాంగులు చేసిన పోరాట ఫలితంగా ప్రభుత్వం పింఛన్ను పెంచింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచాలని సంఘం తరఫున ఉద్యమించాం. దాని ఫలితంగా రాష్ట్రంలో రూ.4,016 అందుకోనుండడం సంతోషంగా ఉంది. జిల్లాలో ఇంకా అర్హులైన దివ్యాంగులు ఉన్నారని, వారందరికీ ధ్రువపత్రాలు జారీ చేసి పింఛన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. రూ.వెయ్యి పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. వచ్చే నెలలో అమలు చేస్తామని చెప్పడం హర్షణీయం. –కృష్ణమూర్తి, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు, నెక్కొండ -
గుట్టలు గుట్టలుగా శవాలు.. ఎక్కడా ఖాళీ లేదు
ఒడిశా: గోరుచుట్టు మీద రోకలిపోటులా రైలు ప్రమాదం నుంచి తేరుకునేలోపే ఒడిశా ప్రభుత్వానికి మరో సమస్య వచ్చి పడింది. ప్రమాదంలో మృతి చెందినవారి మృతదేహాలను సంరక్షించడంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటోంది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. మృతదేహాలను సంరక్షించడానికి తగిన సదుపాయాలు లేక ఇప్పటికే 187 మృతదేహాలను జిల్లా కేంద్రమైన బాలాసోర్ నుండి భువనేశ్వర్ కు తరలించారు. అక్కడ కూడా అదే సమస్య తలెత్తడంతో ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించింది. శవాల నుండి దుర్వాసన... ఒడిశా రైలు ప్రమాదం మొత్తం దేశాన్నే కుదిపేసింది. చాలా తక్కువ వ్యవధిలో కోరమండల్ ఎక్స్ ప్రెస్, బెంగుళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురికావడంతో మృతుల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో చనిపోయినవారిని వారి బంధువులు గుర్తించే వరకు మృతదేహాలను సంరక్షించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే సంఘటన జరిగి రెండు రోజులు కావడంతోపాటు విపరీతంగా ఉన్న ఎండలకు శవాలు పాడైపోకుండా చూడటం శవాగార నిర్వాహకులకు కష్టసాధ్యంగా మారింది. భువనేశ్వర్ కు మృతదేహాలు తరలింపు... బాలాసోర్ శవాగారంలో తగినంత చోటు లేకపోవడంతో 187 మృతదేహాలను బాలాసోర్ నుండి భువనేశ్వర్ తరలించారు. భువనేశ్వర్లో కూడా శవాలను ఉంచడానికి తగినంత చోటు లేకపోవడంతో 110 మృతదేహాలను మాత్రమే అక్కడి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంచి మిగిలిన వాటిని క్యాపిటల్ హాస్పిటల్, అమ్రి హాస్పిటల్, సమ్ హాస్పిటల్, మరికొన్ని ప్రయివేటు హాస్పిటల్స్ కు తరలించారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో కూడా అక్కడ 40 మృతదేహాలు ఉంచే సౌకర్యం మాత్రమే ఉంది. మిగతావాటి నిర్వహణ వారికి కష్టంగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అండగా సోను సూద్ -
సూక్ష్మ రుణ సంస్థలకు ప్రభుత్వ మద్దతు కావాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడుగు వర్గాల రుణ అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న మైక్రోఫైనాన్స్ రంగానికి ప్రభుత్వం తగు తోడ్పాటు అందించాలని సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) సమాఖ్య ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. ఎంఎఫ్ఐలకు రుణ హామీ పథకాన్ని తిరిగి ప్రారంభించడం, ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐల కోసం ప్రత్యేకంగా రీఫైనాన్స్ సదుపాయం కల్పించడం, ఇండియా మైక్రోఫైనాన్స్ ఈక్విటీ ఫండ్ (ఐఎంఈఎఫ్) ద్వారా ఈక్విటీపరమైన సహాయం పెంచడం తదితర రూపాల్లో మద్దతు కల్పించాలని కోరుతున్నట్లు ఆయన వివరించారు. (ఇదీ చదవండి: అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు) తద్వారా సమ్మిళిత వృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో మైక్రోఫైనాన్స్ రంగం కూడా తన వంతు పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 2021-22 ఇండియా మైక్రోఫైనాన్స్ రివ్యూ ప్రకారం 2025-26 నాటికి సూక్ష్మ రుణాల మార్కెట్ రూ. 25 లక్షల కోట్లకు చేరవచ్చనే అంచనాలు నెలకొన్నట్లు మిశ్రా చెప్పారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 633 జిల్లాల్లో ఎంఎఫ్ఐలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయన వివరించారు. -
దేశీయ దగ్గు మందులపై కేంద్రం కీలక నిర్ణయం, త్వరలోనే అమల్లోకి
న్యూఢిల్లీ: దేశీయ కాఫ్ సిరప్లపై ఇటీవలి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దగ్గు మందు ఎగుమతులపై కీలక నిబంధనలు జారీ చేసింది. భారతీయ సంస్థలు ఎగుమతి చేసే దగ్గు మందుల (సిరప్)లపై అనుమతిని తప్పనిసరి చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నాణ్యతా పరమైన ఆందోళనలు తలెత్తిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: అదానీ గ్రూపు ఇన్వెస్టర్ జాక్పాట్: మూడు నెలల్లో ఎన్ని వేల కోట్లో తెలిస్తే..! ప్రభుత్వ ల్యాబ్ల్లో తనిఖీ తర్వాతే ఎగుమతులకు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ప్రభుత్వ ల్యాబుల్లో పరీక్షల అనంతరం మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ యా ల్యాబ్స్ టెస్టింగ్ సంబంధించి దగ్గు సిరప్లపై తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. ఎగుమతుల సమయంలో ఆ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. దేశం నుండి ఎగుమతి చేసే వివిధ ఔషధ ఉత్పత్తుల నాణ్యతకు భరోసా ఇవ్వడంలో తమ నిబద్ధతను తిరిగి నొక్కిచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇండియన్ ఫార్మకోపోయియా కమిషన్, ఆర్డీటీఎల్-చండీఘర్, సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్-కోల్కతా, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్-చెన్నై, హైదరాబాద్, ముంబై, ఆర్డీటీఎల్- గువహటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తింపు పొందిన ల్యాబ్ల్లో పరిక్షలకు అనుమతి. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో, తమిళనాడుకు చెందిన గ్లోబల్ ఫార్మా హెల్త్కేర్ ఐ డ్రాప్స్ను రీకాల్ చేసింది. గత సంవత్సరం గాంబియా, ఉజ్బెకిస్తాన్లలో వరుసగా 66, 18 మంది చిన్నారుల మరణాలకు భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్లు కారణమని ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్ఫ్రెండ్తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) చదవండి: అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్! -
నాలుగేళ్లలో ఏపీ వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు
-
ఎన్టీఆర్ జిల్లాలో అదనంగా 168 ఎకరాలు కేటాయింపు
-
మణిపూర్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం
-
వనస్థలిపురంలో రేడియో స్టేషన్ టవర్ ఎక్కి వక్తి హల్ చల్..
-
నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఈడీ
-
అల్లర్లకు పాల్పడ్డవారిని తలకిందులుగా ఉరి తీస్తాం
హిసువా (బిహార్): బిహార్లో నితీశ్ కుమార్ సారథ్యంలోని మహా ఘట్బంధన్ సంకీర్ణాన్ని ‘బ్యాడ్’ (భ్రష్టాచార్–అవినీతి, అరాచకం, దమన్–అణచివేతలకు పాల్పడుతున్న) సర్కారుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అనైతిక సంకీర్ణాన్ని బీజేపీ ఓడించి తీరుతుందని ధీమా వెలిబుచ్చారు. ఆదివారం బిహార్లోని నవడా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిహార్లో మత హింసకు నితీశే కారకుడంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచకం ప్రబలుతుంటే చూస్తూ ఊరుకోబోనన్నారు. ‘‘పరిస్థితిపై నేను గవర్నర్తో మాట్లాడటాన్ని జేడీ(యూ) చీఫ్ లాలన్సింగ్ తప్పుబడుతున్నారు. నేను కేంద్ర హోం మంత్రినని ఆయన మర్చిపోవద్దు. 2024 లోక్సభ ఎన్నికల్లో, తర్వాత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నెగ్గాక ఈ అల్లర్లకు పాల్పడ్డవారిని తలకిందులుగా ఉరి తీస్తాం’’ అని హెచ్చరించారు. 77 మంది అదుపులో బిహార్లో పలుచోట్ల మత ఘర్షణలు కొనసాగుతున్నట్టు సమాచారం. రామనవమి ఉత్సవాల సందర్భంగా నలంద జిల్లాలోని బిహార్ షరీఫ్లో జరిగిన హింసాకాండకు సంబంధించి ఇప్పటిదాకా 77 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులో ఉందన్నారు. శనివారం రాత్రి మరోసారి ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లోనే ఉన్నట్టు చెప్పారు. ససారాంలో శనివారం 45 మందిని అరెస్టు చేశారు. -
అర్చకులకు గుడ్ న్యూస్
-
బీజేపీ వాయిస్ లో నాయిస్..!
-
దేశంలో అత్యధికంగా ఏపీలో 64 లక్షల మందికి పైగా పెన్షన్ల పంపిణీ
-
తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం
-
కోవిడ్ ఫ్రీ బూస్టర్ డోస్లు నిల్.. కొనుక్కోవాల్సిందే!
చైనాలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అందులో భాగంగా కోవిడ్ బూస్టర్ డోస్లను త్వరిగతిన తీసుకోమని ప్రజలను హెచ్చరిస్తోంది. ఐతే 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా అందిచ్చే కోవిడ్ బూస్టర్ డోస్లు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లేవని, కనీసం దేశ రాజధాని ఢిల్లీలో సైతం తగినంత మొత్తంలో అందుబాటులో లేవని సమాచారం అలాగే సుమారు రూ. 400లు వసూలు చేసి బూస్టర్ డోస్లు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద ఉన్నాయి గానీ అవికూడా రానున్న కొద్ది రోజుల్లో అయిపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐతే అధికారిక లెక్కల ప్రకారం కోవిన్ వెబ్ పోర్టల్లో కూడా ఎన్నో బూస్టర్ డోస్లు అందుబాటులో లేవని స్పష్టంగా చెబుతోంది. ఐతే కొన్ని ప్రైవేట్ సెంటర్లో మాత్రం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు ప్రభుత్వం మాత్రం చైనా మాదిరిగా కేసులు పెరగకుండా ప్రజలను సత్వరమే బూస్టర్ డోస్లు తీసుకోమని చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, దేశంలో సాధారణ టూ డోస్ వ్యాక్సిన్ను ఇప్పటి వరకు 90 శాతం మంది తీసుకోగా, బూస్టర్ డోస్ను ఢిల్లీలో కేవలం 20 శాతం మంది తీసుకోగా, భారత్ అంతటా 30 శాతం మంది తీసుకున్నారు. ప్రజలంతా కూడా వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధైర్యంతో ధీమాగా ఉన్నారని కేంద్రం నొక్కి చెబుతోంది. అయినప్పటికీ అవగాహన డ్రైవ్లను నిర్వహించమని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం భారత్లో కేసుల తక్కువుగానే ఉన్నాయని, సగటున 200 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. (చదవండి: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!) -
పొలిటికల్ కారిడార్: సామజిక న్యాయ నామ సంవత్సరం
-
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో బీసీ కుటుంబాల్లో వెలుగులు : మంత్రి చెల్లుబోయిన
-
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అయ్యప్ప భక్తుల కుటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం
-
పెట్టుబడులు తరలిపోతున్నాయంటూ అవాస్తవ ప్రచారం : గుడివాడ అమర్నాథ్
-
టీచర్ల విధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఉద్యోగులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం : సజ్జల రామకృష్ణ రెడ్డి
-
చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
-
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇటువంటి సభ జరగలేదు : ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు
-
ప్రధాని పర్యటనపై టీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
పరిశ్రమలకు పెద్దపీట..
-
నా కూతురి పెళ్లికి సీఎం జగన్ కానుక ఇచ్చారు : అలీ
-
6,511 పోలీస్ నియామకాలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్
-
రైతుల ఆదాయం పెరుగుతోంది
హిమ్మత్నగర్: రైతుల ఆదాయం పెంచేందుకు తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా తీసుకున్న వివిధ చర్యల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. 2014లో పెట్రోల్లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్లు మాత్రమే కాగా, ఇప్పుడది 400 కోట్ల లీటర్లకు చేరుకుందన్నారు. మొట్టమొదటి సారిగా ఖాదీ, గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ రూ.1లక్ష కోట్ల మార్కు దాటిందన్నారు. ఈ పరిశ్రమల్లో కోటిన్నర మందికి ఉపాధి దొరుకుతోందని పేర్కొన్నారు. సబర్కాంత జిల్లా హిమ్మత్నగర్ సమీపంలోని సబర్ డెయిరీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను ప్రధాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘2014కు ముందు పెట్రోల్లో కలిపే ఇథనాల్ 40 కోట్ల లీటర్ల కంటే తక్కువగా ఉండేది. చెరుకు, మొక్కజొన్న వంటి వ్యవసాయోత్పత్తుల నుంచి తయారయ్యే ఇథనాల్ను పెట్రోల్తో కలపాలనే తమ ప్రభుత్వ నిర్ణయంతో నేడది 10% మేర పెరిగి 400 కోట్ల లీటర్లకు చేరుకుందని ఆయన చెప్పారు. -
బంగారం వెండి, వంటనూనెల బేస్ దిగుమతి రేటు తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: వంటనూనెలు, బంగారం, వెండి బేస్ దిగుమతి రేట్లపై సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ బుధవారం ఆలస్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రేట్లు నేటి నుంచే (జూన్16) అమలులోకి వచ్చాయి. ఎడిబుల్ ఆయిల్స్, గోల్డ్, సిల్వర్ బేస్ దిగుమతి ధరలను ప్రతీ 15 రోజులకు ఒకసారి సవరిస్తూ ఉంటుంది. వీటి ఆధారంగా దిగుమతిదారులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. క్రూడ్ పామ్ ఆయిల్, సోయా ఆయిల్, గోల్డ్, సిల్వర్ పై దిగుమతి సుంకాన్ని కోత పెట్టింది. మరోవైపు ఇతర వాటి బేస్ దిగుమతి ధరలు మాత్రం పెరిగాయి ముఖ్యంగా క్రూడ్ పామోలిన్, ఆర్బీడీ పామోలిన్, ఇతర పామోలిన్, బ్రాస్ స్క్రాప్ ధరలు మాత్రం పెరిగాయి. క్రూడ్ పామ్ ఆయిల్ బేస్ దిగుమతి ధర 1625 డాలర్ల నుంచి 1620 డాలర్లకు తగ్గింది. క్రూడ్ సోయా బీన్ ఆయిల్ రేటు 1866 డాలర్ల నుంచి 1831 డాలర్లకు తగ్గింది. గోల్డ్ బేస్ దిగుమతి ధర 597 డాలర్ల నుంచి 585 డాలర్లకు దిగి వచ్చింది. సిల్వర్ బేస్ దిగుమతి ధర 721 డాలర్ల నుంచి 695 డాలర్లకు తగ్గింది. మరోవైపు ఆర్బీడీ పామ్ ఆయిల్ రేటు 1733 డాలర్ల నుంచి 1757 డాలర్లకు పెరిగింది. ఇతర పామ్ ఆయిల్ బేస్ దిగుమతి రేటు 1679 డాలర్ల నుంచి 1689 డాలర్లకు ఎగసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిదారు ఇండియా గత నెలలో 2 మిలియన్ టన్నుల సోయాయిల్ను సుంకం రహిత దిగుమతులకు అనుమతించింది. 2 మిలియన్ టన్నుల సోయా ఆయిల్ దిగుమతికి ఇది వర్తిస్తుంది. వెండి, బంగారం మినహా బేస్ ధరలు ప్రతి కమోడిటీకి టన్నుకు డాలర్ చొప్పున ఉంటుంది. గోల్డ్ టారిఫ్ 10 గ్రాములకు ఒక డాలర్, అలాగే వెండికి కేజీకి డాలర్గా ఉంటుంది. కాగా దేశంలో గురువారం బంగారం ధరలు క్షీణించాయి. పది గ్రాముల పసిడి రూ. 270 పడిపోగా, కిలో వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. -
జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు
న్యూఢిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి సిఫార్సుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మండలి చేసే సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంది. అయితే, మనం సహకార సమాఖ్య వ్యవస్థలో ఉంటున్నందున ఆ సిఫార్సులకు తగిన విలువ ఇవ్వాలని పేర్కొంది. జీఎస్టీ సిఫార్సుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన హక్కులు ఉన్నాయని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్ల ధర్మాసనం గురువారం వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246ఏ ప్రకారం.. పన్నుల వ్యవహారాల్లో చట్టాలు చేయడంపై పార్లమెంట్కు, రాష్ట్రాల శాసన సభలకు సమాన హక్కులు ఉన్నట్లు గుర్తుచేసింది. ఆర్టికల్ 279 ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరించకూడదని తెలిపింది. జీఎస్టీ అమల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలకు జీఎస్టీ మండలి పరిష్కార మార్గాలు సూచించాలని ధర్మాసనం తెలిపింది. ఒకరి అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్దకూడదని, కలిసి చర్చించుకోవాలని వివరించింది. నేపథ్యం సముద్రంలో సరుకు రవాణాపై 5 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(ఐజీఎస్టీ) విధిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ను గుజరాత్ హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. కాగా, సుప్రీం తీర్పుతో ‘ఒక దేశం.. ఒకే పన్ను’ విధానంపై ఎలాంటి ప్రవేశం పడే అవకాశం లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ çఅన్నారు. పన్నుపై మండలి సిఫార్సులను అమోదించడం లేదా తిరస్కరించడంపై రాష్ట్రాలకు కూడా హక్కు ఉందని కోర్టు చెప్పిందన్నారు. చదవండి: కేంద్రం భారీ షాక్, ఆన్లైన్ గేమ్స్పై జీఎస్టీ బాదుడు! ఎంతంటే! -
పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు బిగ్ షాక్
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై రేపు అవిశ్వాస తీర్మానం జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇస్లామాబాద్లో ఇమ్రాన్ఖాన్ భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో ఇమ్రాన్ఖాన్ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు బిగ్ షాక్ తగిలింది. సోమవారం పాక్ పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కేందుకు చేస్తున్న ప్రయత్నంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మిత్రపక్షం జమూరీ వతన్ పార్టీ నేత షాజైన్ బుగ్తీ.. మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రతిపక్షమైన పాక్ డెమోక్రటిక్ మూవ్మెంట్లో చేరారు. ఈ సందర్భంగా బుగ్తీ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. పాక్, బలూచిస్థాన్ ప్రజల ప్రయోజనాల కోసం, మంచి భవిష్యత్ కోసం తాను ప్రతిపక్షంలో చేరానన్నారు. ఇమ్రాన్ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలో శాంతిభద్రతను మెరుగుపరిచేందుకు ఏమీ చేయలేకపోయిందని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. అధికార పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్కు చెందిన దాదాపు 50 మంది మంత్రులు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు. వారి జాడ తెలియడం లేదంటూ పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. తప్పిపోయిన మంత్రుల్లో 25 మంది ఫెడరల్, ప్రావిన్షియల్ అడ్వైజర్లు, స్పెషల్ అసిస్టెంట్లు ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇక, పాక్ జాతీయ అసెంబ్లీలో 342 సీట్లున్నాయి. ఇమ్రాన్ఖాన్ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే 172 మంది జాతీయ అసెంబ్లీ సభ్యుల మద్దతు అవసరం ఉంది. కాగా ఇమ్రాన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 179 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడింది. ఇమ్రాన్ ఖాన్ పీటీఐ నుంచి 155 మంది సభ్యులు ఉండగా.. నాలుగు ప్రధాన మిత్రపక్షాల నుంచి 20 మంది సభ్యులను కలిగి ఉంది. -
ప్రభుత్వం చేతికి వొడాఐడియా!
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న మొబైల్ సేవల టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 35.8 శాతం వాటా లభించనుంది. ఇందుకు వీలుగా సుమారు రూ. 16,000 కోట్ల వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలైతే వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలవనుంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో స్పెక్ట్రమ్ వేలం వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన వడ్డీని ఈక్విటీగా మార్పు చేసేందుకు బోర్డు నిర్ణయించినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఈ వడ్డీల ప్రస్తుత నికర విలువ(ఎన్పీవీ) రూ. 16,000 కోట్లుగా అంచనా వేసింది. ఈ అంశాలను టెలికం శాఖ(డాట్) ఖాయం చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ప్యాకేజీ ఎఫెక్ట్ కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టెలికం కంపెనీలు స్పెక్ట్రమ్ వాయిదాలు, ఏజీఆర్ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. ప్రస్తుతం కంపెనీ సుమారు రూ. 1.95 లక్షల కోట్ల రుణ భారంతో సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిలో వాయిదాపడిన స్పెక్ట్రమ్ బకాయిలు రూ. 1,08,610 కోట్లు, ఏజీఆర్ బకాయిలు రూ. 63,400 కోట్లు ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. ఇక బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల రుణాలు రూ. 22,700 కోట్లుగా నమోదయ్యాయి. రూ. 10 విలువలో ఈక్విటీ కేటాయింపులకు పరిగణనలోకి తీసుకున్న 2021 ఆగస్ట్ 14కల్లా షేరు సగటు ధర కనీస విలువకంటే తక్కువగా ఉన్నట్లు వొడాఫోన్ ఐడియా ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రభుత్వానికి షేరుకి రూ. 10 చొప్పున కనీస విలువలో ఈక్విటీని జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు డాట్ తుదిగా ధరను ఖరారు చేయవలసి ఉన్నట్లు పేర్కొంది. ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ పద్ధతిలో షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. ఈక్విటీ కేటాయింపుతో కంపెనీ ప్రమోటర్లుసహా వాటాదారులందరిపైనా ప్రభావముంటుందని వివరించింది. వెరసి తాజా ఈక్విటీ జారీతో కంపెనీలో ప్రభుత్వానికి 35.8% వాటా లభించనున్నట్లు అంచనా వేసింది. ప్రమోటర్లలో వొడాఫోన్ గ్రూప్ 28.5%, ఆదిత్య బిర్లా గ్రూప్ 17.8 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంటాయని తెలియజేసింది. ప్రభుత్వ వాటా ఇలా.. ప్రభుత్వం తమ ప్రణాళికలకు అనుగుణంగా ఈ రుణాలలో ఎంతమేర కావాలనుకుంటే అంతవరకూ ఈక్విటీకి బదులుగా ప్రిఫరెన్స్ షేర్లుగా కూడా మార్చుకునే వీలున్నట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ఇవి ఆప్షనల్గా, లేదా కచ్చితంగా మార్పిడి లేదా రీడీమబుల్గా ఎంచుకునే సౌలభ్యమున్నట్లు వెల్లడించింది. ఎస్యూయూటీఐ ద్వారా లేదా ప్రభుత్వం తరఫున ఏ ఇతర ట్రస్టీ ద్వారా అయినా ప్రభుత్వం వీటిని హోల్డ్ చేసే వీలున్నట్లు కంపెనీ వివరించింది. షేరు భారీ పతనం... ప్రభుత్వానికి వాటా జారీ వార్తల నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బీఎస్ఈలో ఈ షేరు ఇంట్రాడేలో 23 శాతంవరకూ దిగజారింది. రూ. 11.50 వద్ద కనిష్టానికి చేరింది. తదుపరి స్వల్పంగా కోలుకుని 20.5 శాతం నష్టంతో రూ. 11.80 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ 21 శాతం పతనమై రూ. 11.75 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్(విలువ)లో రూ. 8,764 కోట్లు ఆవిరైంది. రూ. 33,908 కోట్లకు పరిమితమైంది. టాటా టెలీలోనూ వాటా.. వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉపశమన ప్యాకేజీలో భాగంగా టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) వడ్డీ చెల్లింపులను ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించింది. వొడాఫోన్ ఐడియా బాటలో ఏజీఆర్ బకాయిలపై వడ్డీని ఈక్విటీగా మార్పు చేయడం ద్వారా ప్రభుత్వానికి కేటాయించనుంది. దీంతో టాటా టెలిలో ప్రభుత్వానికి 9.5 శాతం వాటా దక్కనున్నట్లు అంచనా. వడ్డీని షేర్లుగా జారీ చేసేందుకు వొడాఫోన్ ఐడియా నిర్ణయించిన వెనువెంటనే టాటా టెలి సైతం ఇదే బాటలో పయనించడం గమనార్హం! కాగా.. ఎన్పీవీ ప్రకారం దాదాపు రూ. 850 కోట్ల వడ్డీని ఈక్విటీగా కేటాయించనున్నట్లు తెలియజేసింది. బోర్డుకి చెందిన అత్యున్నత కమిటీ ఏజీఆర్ బకాయిలపై వడ్డీని పూర్తిగా ఈక్విటీగా మార్పు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. షేర్ల జారీకి పరిగణించే 2021 ఆగస్ట్ 14కల్లా డాట్ మార్గదర్శకాల ప్రకారం సగటు షేరు ధర రూ. 41.50గా మదింపు చేసినట్లు తెలియజేసింది. అయితే ఇందుకు తుదిగా డాట్ అనుమతించవలసి ఉన్నట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్కల్లా కంపెనీలో ప్రమోటర్ల వాటా 74.36 శాతంగా నమోదైంది. మిగిలిన వాటా పబ్లిక్ వద్ద ఉంది. షేరు జూమ్... ప్రభుత్వానికి వాటా జారీ వార్తలతో టాటా టెలి కౌంటర్కు డిమాండ్ పుట్టింది. బీఎస్ఈలో ఈ షేరు 5 శాతం జంప్చేసి రూ. 291 వద్ద ముగిసింది. కంపెనీ ఏజీఆర్ బకాయిలు రూ. 16,798 కోట్లుకాగా.. వీటిలో ఇప్పటికే రూ. 4,197 కోట్లు చెల్లించింది. కాగా.. గత వారం మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వడ్డీ చెల్లింపులకు బదులుగా ఈక్విటీ జారీ అవకాశాన్ని వినియోగించుకోబోమని స్పష్టం చేసిన విషయం విదితమే. -
క్రిస్మస్, కొత్త ఏడాదిపై ఆంక్షలు?
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): బెంగళూరుతో పాటు రాష్ట్రంలో కరోనా మూడో దశ, రూపాంతర ఒమిక్రాన్ భయాలు క్రిస్మస్, నూతన ఏడాది సందడిని తగ్గించేలా ఉన్నాయి. మూడో దశను అడ్డుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్, కొత్త సంవత్సర సంబరాలను కట్టడి చేయాలనుకుంటున్నట్లు సమాచారం. సర్కారుకు గురువారం కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. ఈ నెల 22 నుంచి జనవరి 2 వరకు జన సందడిని నియంత్రించాలని కోరింది. చదవండి: కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు! -
వాటిని ఎవరు నాశనం చేయలేరు..!ఎలన్ మస్క్ షాకింగ్ కామెంట్స్..!
ట్రెండ్ను పట్టుకోవడంలో మిగిలిన బిజినెస్మెన్ల కంటే ఒక అడుగు ముందుండే ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోన్న క్రిప్టోకరెన్సీని ప్రభుత్వాలు ఏం చేయలేవంటూ తేల్చి చెప్పారు. కాలిఫోర్నియాలో జరిగిన కోడ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజిటల్ టెక్నాలజీలో ఆయన ప్రసంగించారు. క్రిప్టో కరెన్సీపై వచ్చిన ప్రశ్నలకు ఎలన్ మస్క్ స్పందిస్తూ.. క్రిప్టో కరెన్సీని ప్రభుత్వాలు ఏం చేయలేవన్నారు. అయితే క్రిప్టో కరెన్సీ వేగంగా అభివృద్ధి చెందడాన్ని కొంత మేరకు ప్రభుత్వాలు అడ్డుకోగలవన్నారు. ఇటీవల చైనాకి చెందిన పీపుల్స్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అమెరికా సెనెట్ సైతం క్రిప్టో కరెన్సీకి సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ భవిష్యత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. తాజాగా ఎలన్ మస్క్ క్రిప్టో కరెన్సీని సమర్థిస్తూ మాట్లాడటంతో ఈ రంగంలో ట్రేడ్ చేస్తున్నవారికి కొండంత అండ లభించినట్టయ్యింది. సాధారణ మార్కెట్లో బిగ్ ప్లేయర్లు మార్కెట్ను శాసిస్తుంటారు. ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ అధికారికంగా బిగ్ ప్లేయర్లకు అనుగుణంగా మార్కెట్ కదలికలు ఉంటాయి. ఇలా మార్కెట్పై ఎవరి ఆధిపత్యం లేకుండా పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడి ట్రేడ్ నిర్వహించడం క్రిప్టో కరెన్సీ ప్రత్యేకత. ఇందులో ప్రభుత్వ నియంత్ర ఉండదు. అలాగే జవాబుదారీతనం కూడా ఉండదు. ఆర్థిక లావాదేవీలు అన్నీ వర్చువల్గానే జరుగుతాయి. దీంతో క్రిప్టో కరెన్సీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు దీన్ని సమర్థిస్తుండగా మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి : పాస్వర్డ్ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...! -
హైదరాబాదీలకు శుభవార్త! అంతటా ఫ్రీ వై ఫై సేవలు
హైదరాబాద్: నగర వాసులకు శుభవార్త! ఇంటి నుంచి బటయకు వస్తే ఇంటర్నెట్ ఉండదనే దిగులు ఇకపై అక్కర్లేదు. నగరంలో మీరు ఏ మూలకు వెళ్లినా ఇంటర్నెట్ సదుపాయం మిమ్మల్ని అంటుకునే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హై-ఫై ప్రాజెక్టులో భాగంగా ఈ కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. 3000 హాట్స్పాట్స్ తెలంగాణ ప్రభుత్వ సహాకారంతో ప్రముఖ ఇంటర్నెట్ ప్రొవైడర్ యాక్ట్ నగరంలో 3,000 హాట్స్పాట్లను అందుబాటులోకి తేనుంది. నగరం నలుమూలలా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆగష్టు 4వ తేదిన రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు ఈ హాట్స్పాట్ సెంటర్లను ప్రారంభించనున్నారు. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం 2015లో హైదరాబాద్ నగరంలో వంద చోట్ల ఉచిత వైర్లెస్ ఫిడిలిటీ (వై-ఫై) సర్వీసులను హై-ఫై పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ హై-ఫై సెంటర్ల దగ్గర ఎవరైనా గరిష్టంగా 5 ఎంబీపీఎస్ స్పీడ్తో అరగంట పాటు వైఫై సేవలను పొందే అవకాశం కల్పించింది. ఆ తర్వాత క్రమంగా ఈ సేవలను విస్తరిస్తూ వస్తోంది. సౌకర్యం గతానికి భిన్నంగా ఈసారి పెద్ద తెలంగాణ ప్రభుత్వం, యాక్ట్ సంస్థలు కలిసి భారీ స్థాయిలో ఫ్రీ వై ఫై సెంటర్లను ప్రారంభిస్తున్నారు. నగరం నలుమూలలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే టూరిస్టులు, విద్యార్థులతో పాటు సామాన్యులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. -
కరోనా ఫై యుద్ధం ...
-
భర్తతో విడిపోయిన మహిళపై ఊరి జనం..
భోపాల్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మహిళలకు రక్షణ లేదనేది మరోసారి రుజువైంది. దేశంలోని చాలా చోట్ల మహిళలు అనేక వివక్షలు, అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్న మహిళ పట్ల స్థానికులు, అత్తింటివారి ఆటవిక చర్యలు మధ్యప్రదేశ్లో వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళ్తే.. భోపాల్లోని గునా జిల్లాలో ఒక మహిళ తన భర్తతో విడిపోయి వేరే వ్యక్తితో సహజీవం చేస్తోంది. దీనిని జీర్ణించుకోలేని సదరు గ్రామస్తులు, అత్తింటివారు ఆమె ఇంటికి వచ్చి నానా దుర్భాషవలాడారు. అంతటితో ఆగకుండా మాజీ భర్త కుటుంబంలోని ఒకరిని భుజాలపై మోసుకుంటూ 3 కిలో మీటర్లు నడవాలని హుకుం జారీచేశారు. తన బతుకు తాను బతుకున్న ఆ మహిళ ఆటవిక మనుషుల ఆగడాలను ఎదిరించలేకపోయింది. అసహాయంగా వారు చెప్పినట్టు అత్తింటివారిలో ఓ వ్యక్తిని భుజాలపై ఎక్కించుకుని నడక సాగించింది. ఆమె నరకయాతన పడుతుంటే కొంత మంది ఆకతాయిలు ఆ దృశ్యాలను ఫోన్లలో వీడియో తీస్తూ... మరికొందరు ఆమె బాధతో ఒక్కో అడుగు వేస్తుంటే త్వరగా నడువ్.. అంటూ హేళన చేస్తూ బ్యాట్లు, కర్రలతో బెదిరింపులకు దిగారు. కొందరు రాక్షసులు ఆమె ఒంటిపై దెబ్బలు కూడా కొట్టారు. ఈ ఆటవిక చర్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన నలుగురిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. గతంలో కూడా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం జబువా జిల్లాలో ప్రేమించిన వ్యక్తికోసం ఇంటి నుంచి వెళ్ళిపోయిన మహిళకు గ్రామస్తులు ఇలాంటి శిక్షే విధించారు. అప్పటి ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. చదవండి: వివాహితపై సామూహిక అత్యాచారం.. -
దోహా చేరుకున్న తాలిబన్ నేతలు
ఇస్లామాబాద్: అఫ్గాన్ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తాలిబన్ నేతల బృందం ఖతార్ రాజధాని దోహాకు చేరుకుంది. ఫిబ్రవరిలో దోహాలో అమెరికా– తాలిబన్ల మధ్య జరిగిన శాంతి ఒప్పందానికి ఈ చర్చలు కొనసాగింపు. ఈ చర్చల కోసం అమెరికా అటు అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్లపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. చర్చల సారాంశం ఆధారంగా అఫ్గాన్ భవితవ్యం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలు, మైనార్టీల హక్కుల పరిరక్షణ, మిలిషియాలను నిరాయుధులను చేయడం, పునరావాసం కల్పించడం వంటి అనేక కీలకాంశాలు ఈ చర్చలపై ఆధారపడి ఉన్నాయి. గత వారం చర్చల కొనసాగింపునకు సంబంధించి అఫ్గాన్ అధ్యక్షుడితో యూఎస్ సెక్యూరిటీ సలహాదారు రాబర్ట్ ఓ బ్రెయిన్ మంతనాలు జరిపారు. మరోవైపు తాలిబన్లను చర్చలకు ఒప్పించేందుకు పాకిస్తాన్ వైపు నుంచి ఒత్తిడి తెచ్చారు. ఇప్పటికే ఈ చర్చలు జరగాల్సిఉండగా, ఖైదీల విడుదలపై ఎటూ తేలకపోవడంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. చర్చలకు ముందే ఇరుపక్షాలు హింసను విడనాడాలని యూఎస్, అఫ్గాన్ ప్రభుత్వాలు చెబుతుండగా, తర్వాతే కాల్పుల విరమణపై సంప్రదింపులు జరపాలని తాలిబన్లు అంటున్నారు. -
ఇకపై కుటుంబ సభ్యులు పాల్గొంటే క్రిమినల్ కేసులు
సాక్షి, జోగిపేట(అందోల్): అనాదిగా వివక్షతకు గురవుతున్న మహిళలకు భారత రాజ్యాంగం భరోసా కల్పించింది. వివక్షతో అనగదొక్కబడుతున్న అబలలు ఎన్నికల్లో పాల్గొనేలా రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం సీట్లు వారికి కేటాయించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పురుషుల ఆధిపత్యమే కొనసాగుతుంది. ప్రజాప్రతినిధి మహిళే అయినా పెత్తనం మాత్రం పతులే చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నచోట వారి భర్తలు, కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతుందనే విమర్శలు లేకపోలేదు. కొన్ని చోట్ల అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆజమాయిషీ చెలాయిస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధులను నామమాత్రం చేస్తూ వీరు పెత్తనం కొనసాగిస్తున్నారు. ఉల్లంఘిస్తే చర్యలు... అధికారిక కార్యక్రమాలు, సభలు, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధికి బదులు భర్తలు, బంధువులు కూర్చుంటే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు ప్రోత్సహించిన సంబంధిత అధికారులపై పంచాయతీరాజ్ చట్టం –2018 సెక్షన్ 37(5) ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. వారిని అధికారిక సమావేశానికి అనుమతిస్తే పంచాయతీ కార్యాదర్శి, మండల పరిషత్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. పాలనలో పారదర్శకత... పట్టణాలు, గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు పాలనలో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలకు పాలనాపరమైన అన్ని విషయాలు తెలియాలి. కానీ కొన్ని చోట్ల వారికి అవకాశం లేకుండా పోతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలు చేస్తే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా గ్రామాలు, వార్డుల్లో జరిగే అభివృద్ధి పనుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీగా, నిర్ణీత సమయంలో పనులు పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల మహిళా లోకం హర్షం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో మహిళలు పాలనపై పట్టు సాధిస్తారని పలువురు భావిస్తున్నారు. జిల్లాలో పలు ఘటనలు స్థానిక సంస్థల అభివృద్ధిలో భాగంగా ప్రతినెలా మండల సర్వసభ్య సమావేశాలు కొనసాగుతుంటాయి. అయితే మహిళా ప్రతినిధులకు బదులు వారి భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు హాజరైన ఘటనలు పలు మండలాల్లో చేసుకుంటున్నాయి. అందోలు మండలంలో జరిగే ప్రతి సర్వసభ్య సమావేశానికి భర్తలు హాజరుకావడమే కాకుండా అధికారులపై ప్రశ్నల వర్షం, నీలదీసిన సందర్భాలు ఉన్నాయి. అధికారులకు ప్రజాప్రతినిధి భర్త అని తెలిసినా వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంపై తోటిప్రజాప్రతినిధులు తప్పుబట్టారు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా పలుసార్లు ఎన్నికైన మహిళా ప్రతినిధులే సమావేశాలకు హజరు కావాలని సూచించిన సందర్భాలున్నాయి. మహిళా ప్రతినిధుల్లో మార్పు రావడం ఖాయం భార్యకు బదులుగా భర్తలు, కుటుంబ సభ్యులను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వుతో మహిళా ప్రతినిధులల్లో మార్పు వస్తుంది. జిల్లా పరిషత్లో ఉన్న 13 మంది మహిళా జెడ్పీటీసీలు మాత్రం సొంతంగా వ్యవహరిస్తున్నారు. స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్లల్లో కూడా ఈ విషయాన్ని చెబుతున్నాం. గ్రామ స్థాయిలో మహిళా సర్పంచ్లు ఉన్న చోట భర్తల పెత్తనం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలా జరగకుండా మహిళా సర్పంచ్లే స్వేచ్ఛగా వ్యవహరించేలా చూడాలని అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో మహిళా ప్రతినిధుల్లో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఈ ఉత్తర్వులతో మరో నాలుగేళ్ల పాటు మహిళా ప్రతినిధులు స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితి వస్తుంది. –మంజుశ్రీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, సంగారెడ్డి పకడ్బందీగా అమలు చేస్తాం భార్యలకు బదులుగా భర్తలను ప్రోత్సహించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాము కూడా భర్తలను, కుటుంబ సభ్యులను ప్రోత్సహించం. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా వ్యవహరిస్తాం. మహిళా ప్రతినిధులు సైతం మున్సిపల్ చట్టం పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళా ప్రజాప్రతినిధులకు పూర్తి స్వేచ్ఛ కల్పించి, పరిపాలనలో అభివృద్ధిలో వారినే పూర్తిగా భాగస్వాములను చేస్తాం. –కేశురాం, కమిషనర్, జోగిపేట మున్సిపాలిటీ -
ఆన్లైన్ తరగతులకు గ్రీన్సిగ్నల్
సాక్షి, కరీంనగర్: నాలుగు నెలలుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇళ్లకు పరిమితమయ్యారు. కరోనా సృష్టించిన భయోత్పాతానికి విద్యారంగంపూర్తిగా దెబ్బతినడంతో ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలు తెరుచుకోవడం లేదు. వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాతే ప్రభుత్వాలు, అధికారులు తరగతులు పునఃప్రారంభించాలని అనుకున్నా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండడానికి సర్కారు సిద్ధమైంది. సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించింది. ఆన్లైన్ క్లాసులపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి కాగా ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు విధులకు హాజరవ్వాలని సూచించింది. నాలుగు నెలల విరామం తర్వాత పాఠశాలలు ప్రారంభించి విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు చేపట్టనుంది. సెప్టెంబర్ 1 నుంచి నూతన విద్యాసంవత్సరం కరోనా ఎఫెక్ట్తో ప్రభుత్వ, ప్రవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. మార్చిలో విధించిన లాక్డౌన్ వల్ల వాటికి పడిన తాళాలు ఇప్పటికీ తెరుచుకోలేదు. రెండు నెలల కిందట సడలింపులు ఇచ్చినా వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో కొత్త విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాలేదు. సుమారు నాలుగున్నర నెలలుగా విద్యార్థులు ఇంటిపట్టునే ఉంటున్నారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండాలని విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించనుంది. 27 నుంచి క్రమంగా ఉపాధ్యాయులు పాఠశాలలకు విధిగా హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీచేయడం ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని అర్థమవుతోంది. దీంతోపాటు టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు బోధించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ దృష్టి.. జిల్లాలో 649 ప్రభుత్వ పాఠశాలలుండగా ఇందులో ప్రాథమిక పాఠశాలలు 424, ప్రాథమికోన్నత 76, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 149 ఉన్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 34,600 మంది విద్యార్థులున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠ్యపుస్తకాలు పంపిణీ కూడా పూర్తిచేశారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా యంత్రాంగం ఇది వరకే ఆన్లైన్ పాఠాల సాధ్యాసాధ్యాలు, స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉన్నాయా లేదా అన్న వివరాలను సేకరించి పాఠశాల విద్యాశాఖకు నివేదిక సమర్పించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో సెల్ఫోన్ మీద ఆధారపడ్డ వారికి మొబైల్ నెట్వర్క్ సమస్యలున్నాయని తేలింది. వీరికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషించి అందరికీ విద్యనందించే ప్రయత్నాలు విద్యాశాఖ యంత్రాగం సిద్ధం చేస్తోంది. మరో వారం రోజుల తర్వాత విద్యార్థిని, విద్యార్థులు పూర్తిస్థాయిలో ఆన్లైన్ తరగతులకు హాజరు కావాల్సిందే. -
కరోనా : వాటి ఎగుమతులపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధి నిర్ధారణ కిట్ల (డయాగ్నొస్టిక్ కిట్ల) ఎగుమతులపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని శనివారం ఆదేశాలు జారీ చేసింది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోఈ కిట్ల అవసరం చాలా వుందని పేర్కొంది. డయాగ్నొస్టిక్ కిట్ల ఎగుమతి (డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్ బ్యాకింగ్, ప్రిపరేషన్ డయాగ్నొస్టిక్ లేదా లాబొరేటరీ రియాజెంట్స్) ఎగుమతులను తక్షణమే నిలిపివేస్తున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపారు. మరోవైపు కరోనావైరస్ నిరోధంలో అవసరమైన రక్షణ పరికరాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా కోవిడ్-19 సంక్షోభంలో కీలక సేవలందిస్తున్న వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరతకు ప్రధాన సమస్యగా మారింది. కరోనా వైరస్ విస్తరిస్తున్ననేపథ్యంలో వ్యాధి నిర్ధారణ పరీక్షల పరిరకాల పాత్ర చాలా కీలకంగా మారింది. ముఖ్యంగా 386 కేసులతో మహారాష్ట్ర, తమిళనాడు తరువాత దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు దేశంలో మూడవ స్థానంలో ఉంది. దేశ రాజధానిలో 7000-8000 పీపీఏ కిట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి చెప్పారు. అలాగే అత్యవసరంగా 50 వేల కిట్లను ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కోవిడ్-19 కేసులు 3వేలకు సమీపంలో ఉండగా, 2,650 క్రియాశీల కేసులు నమోదయ్యాయి.183 మంది కోలుకోగా 68 మరణాలు సంభవించాయి. (వాట్సాప్ హ్యాకింగ్ : జర భద్రం) (లైట్లను ఆర్పేస్తే : గ్రిడ్ కుప్పకూలుతుంది) -
బీపీసీఎల్ విక్రయం: బిడ్డింగ్లకు ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశపు రెండవ అతిపెద్ద చమురు శుద్ధిదారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)ను ప్రైవేటీకరణలో సంస్థలో సగానికిపైగా వాటాల విక్రయానికి కేంద్రం శనివారం బిడ్డింగ్లను ఆహ్వానించింది. మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించడానికి బిడ్లను ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడి, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగం (డిపామ్) బిడ్నోట్ ప్రకారం బీపీసీఎల్ వ్యూహాత్మక అమ్మకం కోసం ఆసక్తి గల వారు మే 2వ తేదీలోగా తమ బిడ్డింగ్లను సమర్పించాల్సి వుంటుంది. భారత ప్రభుత్వం 114.91 కోట్ల (52.98శాతం ఈక్విటీ వాటా)ఈక్విటీ షేర్లతో కూడిన బీపీసీఎల్ మొత్తం వాటాను వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదిస్తోంది. తద్వారా బీపీసీఎల్ ఈక్విటీ వాటా 61.65 శాతం వాటా వున్న ఎన్ఆర్ఎల్ తప్ప, మిగిలిన నిర్వహణ నియంత్రణ వ్యూహాత్మక కొనుగోలుదారుకు బదిలీ అవుతుందని తెలిపింది. బిడ్డింగ్ రెండు దశల్లో వుంది మొదటి దశలో ఆసక్తి వ్యక్తీకరణ ఆసక్తి, అనంతరం రెండవ రౌండ్లో ఫైనాన్స్ బిడ్డింగ్ ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం లేదు. 10 బిలియన్ డాలర్ల నెట్వర్త్ ఉన్న ఏ ప్రైవేట్ సంస్థ అయినా బిడ్డింగ్కు అర్హులు . అలాగే నాలుగు సంస్థలకు మించని కన్సార్షియానికి అనుమతి వుండదు. బిడ్డింగ్ ప్రమాణాల ప్రకారం, కన్సార్టియం లీడర్ 40శాతం వాటాను కలిగి ఉండాలి. ఇతరులు కనీసం ఒక బిలియన్ డాలర్ల నెట్వర్త్ కలిగి ఉండాలి. 45 రోజుల్లో కన్సార్షియంల మార్పులు అనుమతించబడతాయి. కానీ కన్సార్షియానికి నేతృత్వం వహించే సంస్థను మార్చడానికి వీల్లేదు. కాగా మందగమనంలో ఉన్న ఆర్థికవ్యవస్థను ఆదుకునేందుకు రూ.లక్ష కోట్లు సమీకరించే లక్ష్యంగా భాగంగా ఎయిరిండియా, బీపీసీఎల్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే. -
ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలన ఎలా ఎత్తివేస్తారు?
జైపూర్: మహారాష్ట్ర రాజకీయంలో రాత్రికి రాత్రికే చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఆశ్చర్యంలో ముంచెత్తాయి. మహా సీఎం పీఠం బీజేపీకి చేజారిపోయినట్టేనని భావిస్తున్న తరుణంలో శనివారం తెల్లవారేసరికి పరిస్థితి మొత్తం బీజేపీకి అనుకూలంగా మారిపోయింది. ఈ మహా ట్విస్ట్ షాక్ నుంచే తేరుకునేలోపే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణం చేశారు. అటు ఎన్సీపీ కీలక నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఈ హఠాత్పరిణామాలపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇంత అకస్మాత్తుగా రాష్ట్రపతి పాలనను ఉపసంహరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీజేపీ-ఎన్సీపీ కూటమి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వైనాన్ని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఏ దిశకు తీసుకువెళుతున్నారంటూ ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. సరియైన సమయంలో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెపుతారని ట్వీట్ చేశారు. సీఎం ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఇద్దరూ అపరాధ భావనతో ఉన్నారని, తాము మంచి పాలనను అందించగలమనే విశ్వాసమే వారికి లేదని ఆరోపించారు. అంతేకాదు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా విజయవంతమై సుపరిపాలన ఇస్తారా అనే సందేహం తనకు ఉందని, అంతిమంగా మహారాష్ట్ర ప్రజలు నష్టపోనున్నారని గెహ్లాట్ పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో ఈ నెల 12న అక్కడ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ శనివారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఫడ్నవిస్ ప్రభుత్వ బల నిరూపణకు నవంబర్ 30వ తేదీ గడువు విధించారు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ. బిగ్ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం महाराष्ट्र में जो हुआ वह छिपकर करने की क्या आवश्यकता थी, इस प्रकार अचानक राष्ट्रपति शासन का हटना और इस प्रकार शपथ दिलाना कौनसी नैतिकता है? ये लोग देश में लोकतंत्र को किस दिशा में ले जा रहे हैं? समय आने पर देशवासी इसका जवाब देंगे और बीजेपी को सबक सिखाएंगे। — Ashok Gehlot (@ashokgehlot51) November 23, 2019 -
27 మాజీ ఎంపీలకు షాక్
ఢిల్లీ: అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయాల్సిందిగా మాజీ ఎంపీలకు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోతోంది. దీంతో 27 మంది మాజీ పార్లమెంట్ సభ్యులకు మంగళవారం కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మాజీ ఎంపీలు పదవీ కాలం ముగిసినప్పకీ ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీల ఇళ్లకు నీళ్లు, కరెంట్, గ్యాస్ కనెక్షన్లు వెంటనే నిలివేయాలని లోక్సభ హౌస్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వెంటనే మాజీలు భవనాలను ఖాళీ చేయాలని హెచ్చరించింది. కాగా ల్యూటెన్స్ ఢిల్లీలోని ఎంపీల అధికారిక భవనాల నుంచి ఇంకా 82 మంది మాజీలు ఖాళీ చేయాల్సి ఉందని గతంలో అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారిక నివాసాల నుంచి ఖాళీ చేయని ఎంపీల వైఖరిపై ప్రభుత్వం మండిపడింది. మాజీ ఎంపీల నివాసాలను ఖాళీ చేయకపోవడంతో ప్రస్తుత ఎన్నికైన ఎంపీలకు వేరేచోట్ల తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చదవండి: బంగళాలు వీడని మాజీలు -
ఆదాయం అల్పం.. చెల్లింపులు ఘనం
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ చెల్లింపుల విషయంలో మాత్రం రాజీ పడడం లేదు. ఎవ్వరికీ ఏ సమస్యా లేకుండా చెల్లింపులు చేస్తోంది. ఎన్నికల ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఖాళీ ఖజానాను అప్పగించింది. అయినప్పటికీ నిధులు లేవనే కారణం చూపకుండా ప్రభుత్వం వివిధ చెల్లింపులు సాఫీగా చేస్తోంది. ఉద్యోగులకు జీతభత్యాలు, మెడికల్ రీయింబర్స్మెంట్, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంటు, డైట్ చార్జీలు, వాటర్, విద్యుత్ తదితర బిల్లులన్నీ సకాలంలో చెల్లిస్తోంది. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ కూడా ఇస్తుండడం గమనార్హం. ఇక అభివృద్ధి పనులకు చెల్లింపుల విషయంలోనూ ఎక్కడా జాప్యం జరగడం లేదు. జిల్లా ట్రెజరీతో పాటు 14 సబ్ ట్రెజరీలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం జమతో పాటు చెల్లింపులు కూడా వీటి ద్వారానే చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని చలానాల రూపంలో జమ చేస్తున్నారు. ప్రస్తుతం జమలు, చెల్లింపులన్నీ సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్ఎంఎస్) ద్వారానే జరుగుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్తో మొదలైంది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు లావాదేవీలను పరిశీలిస్తే జిల్లా నుంచి ప్రభుత్వానికి అయిన జమలు రూ.476.29 కోట్లు మాత్రమే. రవాణా, ఎక్సైజ్, స్టాంపులు– రిజిస్ట్రేషన్లు, మార్కెట్ ఫీజు, మైనింగ్ రాయల్టీ తదితర రూపాల్లో ఈ ఆదాయం వచ్చింది. ఈ ఐదు నెలల్లో చెల్లింపులు మాత్రం ఏకంగా రూ.1,962.99 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని మినహాయిస్తే రూ.1,486.70 కోట్లు అధికంగా చెల్లించింది. దీన్నిబట్టి చూస్తే నిధుల కొరత ఉన్నప్పటికీ వివిధ అవసరాలకు డబ్బు సర్దుబాటు చేయడంలో ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. అత్యధిక చెల్లింపులు జిల్లా ట్రెజరీ నుంచే.. చెల్లింపులు, జమలు ఎక్కువగా కలెక్టరేట్లోని జిల్లా ట్రెజరీ కార్యాలయం ద్వారానే జరుగుతున్నాయి. జిల్లా నుంచి రూ.476.29 కోట్లు ప్రభుత్వానికి జమ కాగా.. ఇందులో రూ.234.78 కోట్లు ఒక్క జిల్లా ట్రెజరీ ద్వారానే జమ కావడం గమనార్హం. చెల్లింపుల్లోనూ రూ.715.15 కోట్లు ఇక్కడి నుంచే చేపట్టారు. జిల్లా ట్రెజరీ తర్వాత బనగానపల్లె సబ్ ట్రెజరీ నుంచి జమలు కొంత మెరుగ్గా ఉన్నాయి. బనగానపల్లె ప్రాంతంలో మైనింగ్ ఎక్కువగా ఉంది. దీంతో రాయల్టీలు, జరిమానాలు, ఇతరత్రా రూపాల్లో కాస్త ఎక్కువగా ఆదాయం జమ అవుతోంది. ఇక్కడ జూలైలో జమలు రూ.13.21 కోట్లు ఉండగా.. చెల్లింపులు రూ.11.05 కోట్లు ఉన్నాయి. మిగులు రూ.2.16 కోట్లు ఉంది. జిల్లా ట్రెజరీ, బనగానపల్లె సబ్ ట్రెజరీ మినహా మిగిలిన అన్ని సబ్ట్రెజరీల్లోనూ జమలు తక్కువగా, చెల్లింపులు మాత్రం భారీగా ఉన్నాయి. పక్కదారి పడుతున్న ఆదాయం జిల్లాలో వనరులు అపారంగా ఉన్నాయి. ముఖ్యంగా డోన్, ప్యాపిలి, కృష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, అవుకు, కొలిమిగుండ్ల, దేవనకొండ, బనగానపల్లె తదితర ప్రాంతాల్లో మైనింగ్ జరుగుతోంది. అక్రమ మైనింగ్ను, అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోంది. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తే జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశముంది. ఆర్థిక నిర్వహణ భేష్ గత ప్రభుత్వం ఖాళీ ఖజానాను అప్పగించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో మెరుగ్గా వ్యవహరిస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులకు సంబంధించిన బిల్లులేవీ ఆపడం లేదు. ప్రభుత్వానికి ఆదాయం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ చెల్లింపులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. – ఫలనాటి సునీల్, రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు అన్ని వర్గాల ప్రజలు సంతృప్తితో ఉన్నారు ప్రభుత్వ పనితీరుపై ఉద్యోగులే కాదు.. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం నిధుల సమస్య అనేది కన్పించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉద్యోగులకు ఐఆర్తో పాటు అన్ని రకాల చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు ఆనందాన్నిస్తోంది. ఆదాయం తక్కువగా ఉన్నా చెల్లింపులు మాత్రం షెడ్యూలు ప్రకారం జరుగుతుండడం విశేషం. – జయశంకర్రెడ్డి, జిల్లా కన్వీనర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఏ బిల్లునూ ఆపడం లేదు వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి వస్తున్న బిల్లులను వస్తున్నట్టే ఆమోదించి సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్బీఐకి పంపుతున్నాం. ఆర్బీఐ నుంచి ఎటువంటి జాప్యం లేకుండా వ్యక్తిగత ఖాతాలకు డబ్బు జమ అవుతోంది. జిల్లా నుంచి వెళ్తున్న బిల్లులేవీ పెండింగ్ ఉండటం లేదు. – వెంకటరమణ, ఉప సంచాలకులు, జిల్లా ట్రెజరీ -
కొత్త ఇసుక పాలసీ..
ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఇసుక పాలసీ గురువారం నుంచి అమలులోకి రానుంది. జిల్లాలో ఇప్పటికే ఆరు స్టాక్పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఇసుకను వినియోగదారులకు సులభంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇసుకను స్టాక్పాయింట్లకు తరలిస్తున్నారు. దీని కోసం రవాణా ధరలు కూడా నిర్ణయించారు. సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : కొత్త ఇసుక పాలసీ ప్రకారం ఇసుక అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. బుధవారం క్యాబినెట్ సమావేశం తర్వాత దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం విడుదల చేయనున్నదని ఆయన వెల్లడించారు. గోదావరి ర్యాంపుల నుంచి ఇసుకను బయటకు తీసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా జిల్లాలో వేర్వేరు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఆరు స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. పోలవరం, తాళ్లపూడి మండలం బల్లిపాడు, కొవ్వూరు మండలం కాపవరం, ఏలూరు నగరం, కరుగోరుమిల్లి, చించినాడ సమీపంలోని ఇలపర్రులో స్టాక్పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలకు ఇప్పటికే ఇసుకను తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రస్తుతం జిల్లాలో మూడు రకాల ఇసుక అందుబాటులో ఉంది. ఒకటి ఓపెన్ రీచ్ల ద్వారా, రెండు బోట్ల ద్వారా డీసిల్టింగ్ చేయడం, మూడు రైతుల పొలాల్లో మేట వేసిన ఇసుకను తవ్వడం. అయితే ప్రస్తుతం గోదావరి వరద కారణంగా ఓపెన్ రీచ్లు, రైతుల పొలాల్లో నీరు ఉండటం వల్ల తవ్విన ఇసుక అందుబాటులో లేదు. పడవల్లో డీసిల్టింగ్ చేసిన ఇసుక మాత్రమే అందుబాటులో ఉంది. ఇలాంటివి జిల్లాలో 15 రీచ్లు ఉండగా, 11 రీచ్లు పనిచేస్తున్నాయి. వినియోగదారులకు అందేదిలా.. బోట్లలో నుంచి తీసుకువచ్చిన ఇసుకను ముందుగానే ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా స్టాక్ పాయింట్లకు తరలిస్తారు. కొత్త పాలసీ వచ్చిన తర్వాత విధివిధానాలు వస్తాయి. మీసేవా ద్వారా, లేకపోతే వెబ్సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన తర్వాత సరఫరా చేస్తారు.ఎవరైనా ఇసుక తమ వాహనాల్లో ఇసుక తీసుకువెళ్తామంటే ఆ విధంగా కూడా అనుమతిస్తారు. లేనిపక్షంలో ప్రభుత్వం రిజిస్టర్ చేసిన వాహనాల ద్వారా ఇసుకను పంపిస్తారు. ఇసుక తవ్వకాలు, రవాణాలో ఎటువంటి అక్రమాలూ జరగకుండా అన్ని రీచ్లు, స్టాక్ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఇసుక తరలించే వాహనాలను నిరంతరం ట్రాకింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జీపీఎస్ పరికరాలు అమర్చిన వాహనాలను మాత్రమే ఇసుక రవాణాకు అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనుంది. జీపీఎస్ పరికరాలు అమర్చుకుని భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలన్నింటికీ స్టాక్ యార్డుల నుంచి వినియోగదారులు కోరిన చోటకు ఇసుక రవాణా చేసే అవకాశం కల్పించనున్నారు. ఇప్పటికే జిల్లాలో 250 వాహనాలను యజమానులు ఇసుక తరలించేందుకు రిజిస్టర్ చేయించుకున్నారు. రవాణాకు ధర నిర్ధారణ ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 ధర నిర్ణయించారు.15 కిలోమీటర్లలోపు ఉంటే ఈ ధర గిట్టుబాటు కానందున దాని కోసం వేరే ధర నిర్ణయించనున్నారు. 15 కిలోమీటర్లు దాటిన ప్రాంతాలకు ఈ ధరనే నిర్ణయిస్తారు. స్టాక్ యార్డు నుంచి దూరాన్ని బట్టి రేటు ఉంటుంది. అన్ని స్టాక్ యార్డుల వద్ద టన్ను ఇసుక రూ.375కే సరఫరా చేస్తారు. అయితే ఏలూరు స్టాక్ యార్డు రేటులో మాత్రం ధర తేడా ఉంటుంది. రూ.375 తో పాటు గోదావరి నుంచి ఏలూరుకు సుమారు 85 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ వరకూ రవాణాకు అయిన వ్యయాన్ని కూడా వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. -
‘ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ఏపీలోనే’
సాక్షి, వైఎస్సార్ కడప: ధికారం చేపట్టిన కొద్దిరోజుల్లోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఏపీలో జరుగుతుందని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేవలం రెండు పేజీల్లో యూనిక్గా నవరత్నాల అమలకు.. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నాంది పలికారని తెలిపారు. ఆదేవిధంగా జగన్మోహన్రెడ్డిని ప్రకృతి ఆశీర్వదించిదని, వాతావరణం పులకరించి.. అన్ని డ్యాంలు నిండు కుండలా ఉన్నాయన్నారు. కాగా తొట్టిగ్యాంగ్ పార్టీ అయిన టీడీపీ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అన్నారు. ‘70 ఏళ్లు ఉన్నాయి. పెద్ద మనిషివి కొంచెం మైండ్ పెట్టు. పదేళ్ల వెనక్కి వెళ్లావు’ అంటూ పరోక్షంగా చంద్రబాబుపై కొరముట్ల విమర్శలు చేశారు. -
38 మండలాలు.. 15,344 క్లస్టర్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదల విందు పరి పూర్ణం కానుంది. తెలుపు రంగు రేషన్కార్డు గల పేదలకు పౌర సరఫరాల విభాగం ద్వారా నా ణ్యమైన బియ్యాన్ని ఇంటికే తీసుకువచ్చే ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ బృహత్తర కార్యక్రమం తొలి విడత లబ్ధిదారుల జాబితా లో మన జిల్లా కూడా ఉంది. రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో తొలి దశ పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వలంటీర్లకు క్లస్టర్ల ఏర్పాటు, వారి రేషన్ కార్డుల అనుసంధానం, బియ్యం సరఫ రా చేసేందుకు వాహనాలు సిద్ధం చేసుకోవడం, వాటికి రవాణా ఖర్చులు అంచనా వేయడం వంటి చర్యలతో అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో ఈ నాణ్యమైన బియ్యం పంపిణీకి సంబంధించిన పనులు సుమారుగా 90 శాతం వరకు పూర్తి చేశారు. అక్కడక్కడా ట్రయల్ రన్ కూడా చేస్తున్నారు. లోపాలను ఎప్పటికప్పుడు సవరిస్తూ ఒకటో తేదీ నాటికి సజావుగా పంపిణీ జరిగేలా కలెక్టర్ నివాస్, జేసీ శ్రీనివాస్, సివిల్ సప్లై, డీఎస్ఓ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 15,344 క్లస్టర్ల ఏర్పాటు.. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు, 38 మండలాలు, ఇతర గ్రామ పంచాయతీలు, నగర పాలక, పురపాలక సంస్థలను కలిపి 15,344 క్లస్టర్లుగా విడదీశారు. ఒక్కో క్లస్టర్కి 50 నుంచి 60 కుటుంబాలను చేర్చారు. ఒక్కో క్లస్టర్లో ఒక్కో వలంటీర్ సేవలు అందిస్తారు. ఇప్పటికే నియమితులైన వలంటీర్లు ఆయా క్లస్టర్లలో కుటుంబాలను పరిచయం చేసుకునే కార్యక్రమం పూర్తి చేశారు. అలాగే వారి కార్డులు, క్లస్టర్ వలంటీర్ లాగిన్కి మ్యాపింగ్ కూడా చేస్తున్నారు. ఈ పనిలో ఇప్పటికే 96 శాతం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన శాతాన్ని ఈ గడువులో పూర్తి చేయనున్నారు. పంపిణీ వ్యయం సగటున రూ.383: ప్రభుత్వం పేదలకు అందజేసే నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకు చేర్చాలం టే గతంలో కంటే కొంత ఖర్చు పెరుగుతుంది. అయినా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని పేదలకు అందించేందుకు ఆర్థిక భారాన్ని లెక్క చేయడం లేదు. ఈ సరుకులు అందించేందుకు సగటున రూ.383 ఖర్చవుతుంది. ఇప్పటి వరకు చేస్తున్న హమాలీలు బియ్యంను గోదాముల్లో లోడ్ చేయ డం, అన్లోడ్ చేయడం, ఎఫ్పి షాపులకు తరలించడం కోసం ఒక్కో ప్రక్రియకు రూ.9లు వంతున ఖర్చు చేసేవారు. అయితే ఈ ప్రకియతోపాటుగా అదనంగా క్లస్టర్లలో వాహనాలకి ఇచ్చే ఖర్చు పెరిగింది. గిరిజన ప్రాంతాల్లో కొండకోనల్లో ఉన్న గూడేలకు ఈ నాణ్యమైన బియ్యాన్ని సరఫరాలకు మరికాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా ప్రతి నెల ఈ వాహనాల ఖర్చు సుమారుగా రూ. 58,76,980గా ఉండబోతోంది. నాణ్యమైన బియ్యం.. ఇప్పటివరకు పౌర సరఫరాల ద్వారా ఎఫ్పీ షాపులకు, అక్కడ నుంచి తెల్లకార్డుల లబ్ధిదా రులకు అందజేసే బియ్యం అధికంగా 25 శాతం కంటే ఎక్కువగా నూకలు, తవుడు చెత్తతో కూడి ఉండేది. వీటిలో నాణ్యత తక్కువగా ఉండేది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అందజేసే నాణ్యమైనబి య్యంలో ఈ నూకల శాతం చాలా తక్కువగా ఉంటుంది. బి య్యం కంప్యూటర్ మెజర్ ప్రకారం సార్ట్ చేసిన బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. తూర్పు గోదావరి నుంచి బియ్యం దిగుమతి.. నాణ్యమైన బియ్యం మనకు కావాల్సిన స్థాయిలో స్థానికంగా లభ్యం లేనందున, తొలి విడతలో మన జిల్లాకు కావల్సిన 13,242 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు, కాకినాడ, రామచంద్రాపురం, మండలపేట తదితర ప్రాంతాల్లోని సుమారుగా 300 రైస్ మిల్లులను నుంచి ఈ నాణ్యమైన బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ బియ్యం అక్కడ సిద్ధంగా తూనికలు, ప్యాకింగ్ ను పూర్తి చేసుకొని ఉంది. ఈ నెల 28వ తేదీ నాటికి జిల్లాకు చేర్చడానికి జిల్లా యంత్రాగం అన్ని చర్యలు సిద్ధం చేసింది. నేరుగా ఎఫ్పీ షాపులకే బియ్యం.. సెప్టెంబర్ ఒకటి నుంచి నాణ్యమైన బియ్యాన్ని తెలుపు రంగు కార్డుదారులకు అందజేయనున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ నెల 28 నాటికి తూర్పు గోదావరి జిల్లా నుంచి నాణ్యమైన బియ్యం జిల్లాకు చేరుతోంది. ఈ బియ్యం ప్యాకెట్ నేరుగా గ్రామాల్లోని ఎఫ్పీ షాపుల డీలర్లు గోదాములకు చేర్చుతున్నారు. అక్కడ నుంచి వలం టీర్లు డోర్ టు డోర్గా లబ్ధిదారులకు అందజేస్తారు. – జి.నాగేశ్వరరావు, డీఎస్ఓ, శ్రీకాకుళం -
‘చదువులు చారెడు బుక్స్ బారెడు’
నేహాంత్ తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. తన కుమారుడిని గొప్ప వాడిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో ఓ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించాడు. కానీ తన కొడుక్కి మోయలేని పుస్తకాల భారాన్ని చూసి చలించిపోతున్నాడు. ఆరో తరగతి చదువుతున్న నేహంత్ ప్రతి రోజు కేజీల కొద్ది పుస్తకాలను మోయడం వల్ల భవిష్యత్తులో తన ఎదుగుదలపై ఎంత ప్రభావం చూపుతుందో అని ఆ తండ్రి భయపడి పోతున్నాడు. ఈ సమస్య ఒక్క నేహాంత్దే కాదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఎదుర్కొంటున్న సమస్య. ప్రభుత్వ నిబంధనలను చాలా పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోకపోవడమే దీనికి కారణం. సాక్షి, మహబుబ్నగర్ : ప్రభుత్వం చిన్నారులకు ఎక్కువ సంఖ్యలో బరువైన పుస్తకాలను మోయకుండా ఉంచేందుకు తరగతుల వారీగా బరువులను నిర్ణయించింది. కానీ వాటిని యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోకుండా ఇష్టరీతిగా పిల్లలతో పుస్తకాలను మోయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరక బరువుతో ఇబ్బందులు పడుతుండగా, భవిష్యత్తు వారి ఎత్తు పెరుగుదల వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. బడి బ్యాగు మోయలేక చిన్నారులు నీరసించి పోతున్నారు. బాధను చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. ‘చదువులు చారెడు బుక్స్ బారెడు’ అన్న చందంగా మారింది ప్రవేటు పాఠశాలల తీరు. నర్సరీ, ఎల్కేజీ నుంచి బాల్యంలో బండెడు బరువు మోస్తూ ఆపసోపాలు పడుతున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు వారిని పాఠశాలకు పంపామని సంబురపడుతున్నారే తప్ప వారు మోస్తున్న పుస్తకాల బరువు ఎంత... అంత బరువును చిన్నారులు మోయడం వల్ల వచ్చే సమస్యలు, వారు పడుతున్న బాధను పట్టించుకోవడంలేదు. ఎన్ని పుస్తకాలు బ్యాగ్లో ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా చదువుతున్నారనే దోరణిలో ఉంటున్నారు. మార్గదర్శకాలు పట్టవా..? ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చదువుతున్న విద్యార్థులు ఎంతబరువుల పుస్తకాలు మోయాలన్న విషయంలో స్పష్టంగా వివరిస్తూ గత విద్యాసంవత్సరంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో 1, 2వ తరగతి విద్యార్థులకు 1.5 కేజీల బరువు, 3, 5 తరగతులకు 2 నుండి 3 కేజీలు, 6, 7 తరగతులకు చదువుతున్న విద్యార్థులు కేవలం 4 కేజీలు, 8,9 తరగతుల వారికి 4.50 కేజీలు, పదవ తరగతి విద్యార్థులకు కేవలం 5 కేజీల పుస్తకాలను మాత్రమే కేజీల పుస్తకాలను మాత్రమే మోయాలని పేర్కొంది. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఒక్కో విద్యార్థి 8కేజీల నుండి 10 కేజీలకు పైగానే బరువును మోస్తున్నట్లు తెలుస్తుంది. ఈ బరువు ప్రభుత్వ బడుల్లో తక్కువగానే ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఇందుకు సంబంధించి పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల పర్యావేక్షణ కూడా ఉండాల్సి ఉంది. కానీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిçస్తుండడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. ఇష్టారీతిగా పుస్తకాల మోతలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం సూచించిన పుస్తకాలను మాత్రమే వినియోగించాల్సి ఉంది. ఇందులో స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్కు సంబంధించినవి మాత్రమే వినియోగించాల్సి ఉంది. కానీ ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా పుస్తకాలను వినియోగిస్తున్నారు. అయితే సబ్జెక్టుల వారిగా స్టేట్, సెంట్రల్ సిలబస్కు సంబంధించినవి కాకుండా ఇతర పుస్తకాలను కూడా విద్యార్థులతో చదివిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఐఐటీ, నీట్, ఇంజనీరింగ్, అంటూ చదివే సబ్జెక్టులకు అధనంగా ఈ పుస్తకాలను విద్యార్థులతో చదివిస్తున్నారు. అంతేకాకుండా హోంవర్క్, ప్రాజెక్టులు, ప్రాక్టీస్, గైడ్లు, టెస్టు పేపర్లు అంటూ అదనపు బరువు పడుతుంది. సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్సు వంటి సబ్జెక్టులకు సంబందించి ఒక్కో పాఠశాల ఒక్కో మెటీరియల్ను అనుసరిస్తూ విద్యార్థుల చదువులను గందరగోళంలో పడేస్తున్నారు. అనేక పుస్తకాలను విద్యార్థులకు అధనంగా చేరడంతో బరువులు అమాంతం పెరిగిపోతున్నాయి. -
పేదలకూ టౌన్షిప్
సాక్షి, తిరుపతి : ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి అభివృద్ధిపై వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. తిరుపతి నగరాన్ని విస్తరించడంతో పాటు మంచినీరు, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలు లేకుండా పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పొట్టచేతబట్టుకుని వలస వచ్చిన వారందరికీ టౌన్షిప్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సహకారంతో తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వీసీ గిరీషా రంగంలోకి దిగారు. అందులో భాగంగా తుడా కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. జేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐతో పాటు ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు. వారి నుంచి తిరుపతి, తుడా అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. త్వరలోనే ఎమ్మెల్యేలు, తుడా మాజీ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నగరంలో మంచినీటి సమ స్య పరిష్కారానికి శాశ్వత ప్రణాళికలు రూపొందించనున్నారు. కపిలతీర్థం నుంచి వృథాగా వెళ్లే నీటిని ఒడిసి పట్టాలని నిర్ణయించారు. భూ గర్భ జలాలు మెరుగుపరిచేందుకు ఆక్రమణలకు గురైన చెరువులను అభివృద్ధి చేయనున్నారు. తుడా పరిధిలో విస్తారంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. నగరంలో ట్రాఫిక్, డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. మరిన్ని ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శెట్టిపల్లి సమస్య పరిష్కారానికి ప్రణాళికలు శెట్టిపల్లివాసులు కొన్నేళ్లుగా భూ సమస్య పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్కడున్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. అక్రమార్కులు కొందరు ఒకే ప్లాటును ముగ్గురు, నలుగురుకి అమ్మి సొమ్ము చేసుకున్నారు. దీంతో సమస్యలు తీవ్రమయ్యాయి. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక తుడా ఆధ్వర్యంలో శెట్టిపల్లివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. దేశంలోనే అత్యాధునికి టౌన్షిప్గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఆరు నెలల్లో శెట్టిపల్లివాసుల సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీఓ కార్యాలయం నుంచి పద్మావతి ఫ్లోర్మిల్లుకు వెళ్లే మార్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చెయ్యనున్నారు. రైల్వేగేటు వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మించాలని, అది పూర్తయితేనే రింగ్రోడ్డు సంపూర్ణమవుతుందని తుడా చైర్మన్ వెల్లడించారు. అత్యాధునికమైన టౌన్షిప్లు సూరప్పకశం, కరకంబాడి వద్ద ఉన్న తుడా భూముల్లో టౌన్షిప్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని వసతులతో ఈ టౌన్షిప్ను ఏర్పాటు చెయ్యనున్నారు. బస్స్టేషన్, కళాశాల, పాఠశాలలు, సినిమా థియేటర్లు, పార్క్లు వంటి సకల సౌకర్యాలతో టౌన్షిప్లు నిర్మించనున్నారు. తిరుపతి–శ్రీకాళహస్తి, చంద్రగిరి–తిరుపతి మధ్యలో కూడా టౌన్షిప్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాజకీయ నాయకులు సూచించారు. అందుకు ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. తిరుపతికి వలస వచ్చిన వేలాది మంది నివాసాలు లేక అద్దె ఇళ్లల్లో ఉన్న విషయాన్ని తుడా చైర్మన్ ప్రస్తావించారు. అర్హులైన వారికి సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నివాస స్థలాలు మంజూరు చేయడం లేదా ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి గృహ సముదాయాన్ని నిర్మించి ఇవ్వాలని భావిస్తున్నారు. రుయాలో మరో అత్యవసర విభాగం రుయాకు రాయలసీమ జిల్లాల నుంచి వేలాది మంది రోగులు, క్షతగాత్రులు వస్తుంటారు. రుయాలో ఒక్కటే అత్యవసర విభాగం ఉండటంతో ఆస్పత్రికి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని రుయాలో మరో అత్యవసర విభాగాన్ని నిర్మించాలని సమావేశంలో నిర్ణయించారు. అందుకు తుడా పూర్తి సహకారం అందిస్తుందని చైర్మన్ చెవిరెడ్డి తెలిపారు. పోలీస్స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదుదారులు చెట్ల కింద వేచి ఉండేపని లేకుండా ప్రత్యేకంగా రిసెప్షన్ కేంద్రాలను నిర్మించనున్నారు. అక్కడ వారికి మంచినీరు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఇలా తుడా పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం, సూచనలు తీసుకునేందుకు తుడా ఆధ్వర్యం లో మూడు నెలలకోసారి అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. టీడీపీ నాయకుడు, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్, బీజేపీ నాయకులు భానుప్రకాష్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్కుమార్రెడ్డి, సీపీఎం, సీపీఐ నాయకులు కందారపు మురళి, వందవాసి నాగరాజ, రామానాయుడు, పెంచలయ్య పాల్గొన్నారు. -
సంక్షేమానికి మరుగుదొడ్డితో లింక్
సాక్షి, నల్లగొండ : మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే జూలై నుంచి సంక్షేమ పథకాలు కట్ అవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకం కింద గ్రామీణ ప్రాంతంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు మరుగుదొడ్డి నిర్మించాలని 2014 సంవత్సరంలో పథకాన్ని ప్రవేశపెట్టారు. నిర్మించుకున్న ప్రతి లబ్ధిదారునికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.12వేలు చెల్లిస్తారు. అయితే పథకం ఈనెల చివరి నాటికి పూర్తవుతుంది. దాంతో ఆ తర్వాత నిర్మించుకున్న మరుగుదొడ్డికి కేంద్ర నిధులు అందే అవకాశం లేదు. ఆ స్కీం సమయం పూర్తవుతున్నందున ఈలోపు నిర్మించుకుంటేనే ఇటు మరుగుదొడ్డి డబ్బులు వారి ఖాతాలో జమ కానున్నాయి. ఈనెల 30లోపు ఎవరైతే మరుగుదొడ్లు మంజూరై నిర్మాణం చేసుకోకుండా ఉంటారో వారికి రేషన్ కట్ చేయడంతో పాటు పెన్షన్, ఇతర సంక్షేమ రుణాలను నిలిపివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ఇంకా బహిరంగ ప్రదేశాల్లోనే మలవిసర్జన గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఇంకా మరుగుదొడ్డి నిర్మించుకోకుండా బహిర్భూమికి వెళ్తున్నారు. సాంకేతికంగా ఎంత ముందుకు పోతున్నా ఇంకా బహిర్భూమికి బయటికి వెళ్లడాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేసి ప్రతి కుటుంబంలో మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. అందుకు రెండు ప్రభుత్వాలు నూటికి నూరు శాతం ఉచితంగా లబ్ధిదారునికి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు డబ్బులు మంజూరు చేస్తున్నాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.12వేలు చెల్లిస్తున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 60శాతం కింద రూ.7200, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాకింద రూ.4800 చెల్లిస్తున్నాయి. లబ్ధిదారునికి పూర్తిగా ఉచితంగానే నిర్మించుకునేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సహాయం అందజేస్తున్నాయి. 2014లో పథకం ప్రారంభం స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ పథకాన్ని 2014 సెప్టెంబర్లో ప్రారంభించారు. మొదట నీటి పారుదల, పారిశుద్ధ్య శాఖల ఆధ్వర్యంలో ఈ మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత దాన్ని గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద 95601 మరుగుదొడ్లను మంజూరు చేశారు. అందులో ఇప్పటివరకు 76309 మరుగుదొడ్లు పూర్తయ్యాయి. ఇంకా 18847 మరుగుదొడ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఎన్నిసార్లు హెచ్చరించినా పూర్తికాని నిర్మాణాలు ఐదేళ్లుగా పథకం కింద మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులు పదేపదే సమావేశాలు, సమీక్షలు నిర్వహించి చెప్తున్నప్పటికీ నిర్మాణాల్లో మాత్రం జాప్యం ఆగలేదు. ఇప్పటికే పూర్తి కావాల్సిన మరుగుదొడ్లు ఇంకా కొన్ని నిర్మాణ దశల్లోనే ఉన్నాయి. దీంతో ఇచ్చిన గడువుకూడా దగ్గర పడుతుండడంతో కలెక్టర్ గట్టి నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్మాణంలో వెనుకబడిన మండలాలు జిల్లాలో అత్యధికంగా అనుముల మండలంలో 2580 మరుగుదొడ్లు నిర్మాణంలో వెనుకబడి పోగా దేవరకొండ మండలంలో 2242, కనగల్ మండలంలో 1270, నిడమనూర్ మండలంలో 1698, పెద్దవూర మండలంలో 2653, త్రిపురారం మండలంలో 1441, వేములపల్లి మండలంలో వెయ్యి మరుగుదొడ్లు అసంపూర్తిగా ఉన్నాయి. అయితే చిట్యాల, దామరచర్ల మండలాలు నూటికి నూరుశాతం పూర్తి చేయగా, గుడిపల్లి మండలంలో ఒక్క మరుగుదొడ్డి పెండింగ్లో ఉంది. గుర్రంపోడులో పది, మిర్యాలగూడలో 35, నకిరేకల్లో 15, నార్కట్పల్లిలో 2, శాలిగౌరారంలో 25 మరుగుదొడ్లు మాత్రమే పెండింగ్లో ఉండగా 100 నుంచి వెయ్యిలోపు పెండింగ్లో ఉన్నాయి. -
ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
సాక్షి, మచిలీపట్నం : పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ కేడర్ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం లేదు. మిగిలిన 179 పోస్టుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి, నియామక పత్రాలను అందజేసేందుకు విద్యాశాఖాధికారులు దృష్టి సారించారు. 2018 డీఎస్సీ ఫలితాల మేరకు అర్హులైన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా నియమించనున్నారు. ఉపాధ్యాయ పోస్టులను దక్కించుకునేందుకు జిల్లాతో పాటు, ఇతర జిల్లాల నుంచి కూడా సుమారుగా 30 వేల మంది అభ్యర్థులు డీఎస్సీకి హాజరయ్యారు. వీరిలో సబ్జెక్టుల వారీగా అర్హులైన వారి మెరిట్ జాబితా ఇదివరకే సిద్ధమైంది. తాజాగా ప్రభుత్వం నుంచి నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశాలు రావటంతో విద్యాశాఖాధికారులు డీఎస్సీ ఫైళ్లను బయటకు తీస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలన మొదలు, పోస్టింగ్లు ఇచ్చేంత వరకు నిర్ధిష్టిమైన షెడ్యూల్ సైతం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విడుదల చేయడంతో జిల్లా విద్యాశాఖాధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అంతా ఆన్లైన్లోనే.. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా జరుగుతున్న నియామకాలు కావడంతో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. నియామకాల్లో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అంతా ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ప్రక్రియ సెప్టెంబర్ 4 వరకు కొనసాగనుంది. పాఠశాల విద్యాశాఖ (సీఎస్సీ) వెబ్సైట్ ద్వారా ఎంపిక అభ్యర్థుల జాబితాను ఈ నెల 20న అందుబాటులో ఉంచనున్నారు. దీనిని జిల్లాల స్థాయి సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆమోదించి ఈ నెల 21న జాబితాను ప్రకటిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 22, 23 తేదీల్లో వారికి సంబంధించిన ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పలు దఫాలుగా పరిశీలన అనంతరం ఆగస్టు 29న పోస్టుల కోసమని ఎంపికైన వారి తుదిజాబితా ప్రకటించనున్నారు. ఆగస్టు 30న వెబ్ అప్షన్ల అనంతరం ఎంపికైన వారికి పోస్టింగ్ ఆర్డర్లను సైతం ఆన్లైనే జారీ చేయనున్నారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ప్రత్యేక కమిటీ డీఎస్సీ ఫలితాల ఆధారంగా ఇప్పటికే సబ్జెక్టుల వారీగా మెరిట్ అభ్యర్థుల జాబితాను విద్యాశాఖాధికారులు ఎంపిక చేశారు. అయితే అందుబాటులో ఉన్న ఖాళీల మేరకు మెరిట్, రోస్టర్, అభ్యర్థుల ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకొని మెరిట్ జాబితాలో టాప్లో నిలిచిన వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు వడపోత కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఈ దశలోనే అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇదే విషయమై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులు పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాలను విద్యా, రెవెన్యూ, గిరిజన సంక్షేమ, వైద్యశాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ సభ్యులు పరిశీలన జరిపి, వాటికి ఆమోదం తెలిపిన తరువాతనే తుది జాబితా ప్రకటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భాషా పండితుల నియామకాలకు బ్రేక్ న్యాయస్థానంలో వివాదంలో ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్ కేడర్లో గల తెలుగు (12), హిందీ (6), ఎల్పీ తెలుగు (4), ఎల్పీ హిందీ (4), ఎల్పీ సంస్కృతం (3), పీఈటీ (14) పోస్టులు మొత్తం 43 ఖాళీగా ఉండగా, వీటి నియామకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా వీటిని భర్తీ చేసేలా, జాబితా సిద్ధం చేస్తున్నారు. -
ఉద్యోగుల ఆశలపై నీళ్లు...
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మభ్యపెడుతోంది. గత ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది డీఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పటి నుంచి పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు మరో ఏడాదిలో జరుగుతాయన్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నామని 2017 డిసెంబర్ 5న ప్రకటించారు. ఉద్యోగాలు వస్తాయని వేలాది మంది నిరుద్యోగులు ఆశపడ్డారు. డీఎస్సీ కోచింగ్ కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు. అప్పటి నుంచి రకరకాలుగా ప్రకటనలిస్తూ డీఎస్సీని కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. డీఎస్సీని ఎన్నికల వరకు సాగదీసేందుకు టెట్ను రెండుసార్లు నిర్వహించింది. చివరకు ఎన్నికలు ముంచుకువస్తున్న నేపథ్యంలో హడావుడిగా గతేడాది అక్టోబర్ 26న డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. గతేడాది డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 2వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి 15న ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు విడుదలై 45 రోజులు దాటినా డీఎస్సీ నియామకాలపై రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకువేయలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల కోసమే డీఎస్సీ ప్రకటనంటూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెల్లూరు(టౌన్): గత ఐదేళ్లుగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూశారు. డీఎస్సీ పడితే ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతో వేలాది మంది టీటీసీ, బీఈడీ కోర్సులు చదివారు. పోస్టులు భారీగా ఉంటాయని, కొంచెం కష్టపడితే ఉద్యోగం పొందవచ్చని ఆశపడ్డారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందంటూ 2017 డిసెంబర్ 5న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అప్పటి నుంచి డీఎస్సీ ప్రకటనను కాలయాపన చేశారు. పోస్టుల ఖాళీల వివరాలను గతేడాది డిసెంబర్ వరకు తీసుకోవాలని ఒకసారి, జూన్ వరకు చూడాలని మరొకసారి ప్రకటనలు ఇచ్చారు. చివరకు మార్చి వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. డీఎస్సీని కాలయాపన చేసేందుకు టెట్ను గతేడాది జనవరిలో ఒకసారి, జూన్లో మరోసారి ప్రభుత్వం నిర్వహించింది. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికలు ముంచుకువస్తున్న క్రమంలో హడావుడిగా గతేడాది అక్టోబర్ 26న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. భారీ సంఖ్యలో పోటీ డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందేందుకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. గత ఐదేళ్లుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉంటాయని భావించారు. జిల్లాలో టీటీసీ, డీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులు 50 వేల మందికిపైగా ఉంటారు. డీఎస్సీ ప్రకటస్తామని చెప్పిన నాటి నుంచి పరీక్షల వరకు కోచింగ్ కోసం ఒక్కో విద్యార్థి రూ.లక్షకుపైగా ఖర్చు చేశారు. అయితే వీరి ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. కేవలం జిల్లాలో 207 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో 172, మున్సిపల్ స్కూల్స్లో 29, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు లెక్కలు చూపింది. పోస్టుల కోసం 22244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానంగా ఎస్జీటీ పోస్టులు 35 ఉంటే 13480 మంది పోటీ పడ్డారు. వీరికి గతేడాది డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఫిబ్రవరి 15న ఫలితాలు విడుదల చేశారు. నియామకాలు ఎప్పుడో.. డీఎస్సీ ఫలితాలు విడుదలై 45 రోజులు దాటింది. మెరిట్ లిస్ట్ జాబితాను కూడా విడుదల చేశారు. ఎన్నికల కోడ్ ఈ నెల 10న అమలులోకి వచ్చింది. ఫలితాలు విడుదల నుంచి ఎన్నికల కోడ్ వచ్చిన నాటికి మధ్య 23 రోజులు ఉంది. పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే రోస్టర్ పాయింట్ వైజ్ అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఎన్నికల కోడ్ను చాకుగా చూపి నిరుద్యోగులను గాలికి వదిలివేసిందని పలువురు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందైనా పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తుందని ఆశగా ఎదురుచూశామని, కనీసం ఆ దిశగా కూడా పాలకులు, అధికారులు ఆలోచించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం
-
కలప అక్రమ రవాణాకు అడ్డేదీ..?
సాక్షి, త్రిపురారం : అడవుల సంరక్షణకు అధికార యంత్రాంగం చర్యలెన్నీ చేపడుతున్నా నిష్ప్రయోజనమే అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడటంతో స్వార్థపరుల గొడ్డలి వేటుకు అటవీ సంపద గురవుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఫారెస్ట్ భూముల నుంచి పెద్ద ఎత్తున కలప అక్రమ రవాణా జరుగుతుండటం అధికారుల నిర్లక్ష్యానికి తేటతెల్లం చేస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఉన్న ఫారెస్టు భూముల్లో గల వృక్ష సంపద నానాటికీ కనుమరుగవుతోంది. కొందరు స్వార్థపరులు తమ వ్యక్తి గత ప్రయోజనాల కోసం ఫార్టెస్టు భూముల్లో ఉన్న చెట్లను నరికి కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లపై యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కొందరు యజమానులు సోమ్ముచేసుకుంటున్నారు. నాణ్యతా లేని కలపను కోత మిషన్ల వ్యాపారులకు ఇటుక బట్టీలు కాల్చ డానికి వినియోగిస్తుండగా నాణ్యతా ఉన్న కలప ద్వారా అధిక ఆదాయం గడిస్తున్నారు. అధిక ధరకు విక్రయం.. నియోజకవర్గంలోని పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాలకు సరిహద్దున ఫారెస్టు భూములు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ అటవీ భూముల్లో లభిస్తున్న అడవివేప, మద్ది తదితర విలువైన చెట్లతో అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ చెట్లను నరికి వాటి నుంచి లభించే కలపను ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. అధికారుల కళ్లుకప్పి నిత్యం ట్రాక్టర్లను తరలిస్తున్నారు. కలప వ్యాపారులు పగటివేళల్లో నరికివేసిన చెట్లను రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లలో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు నిఘా ఏర్పాటు చేసి చెట్లను నరికివేస్తున్న కలప వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మామూళ్లు పుచ్చుకుంటూ.. ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదపై పర్యవేక్షణ ఉంచి దాన్ని కాపాడుకోవడానికి చర్యలు చేపట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక వేళ ఎవరైన అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడినా మామూళ్లు పుచ్చుకుంటూ వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఫారెస్టు భూముల్లోని వృక్ష సంపదను కాపాడుకోలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాల్టాకు తూట్లు.. పర్యావరణ పరిరక్షణకు నీరు, భూమి, చెట్లు ప్రధానం. వీటిని కాపాడుకుంటేనే మానవమనుగడ సాధ్యమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని విచ్ఛలవిడిగా వినియోగించకుండా ప్రభుత్వం ‘వాల్టా’చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ అక్రమార్కులు నిబంధనలు ఉల్లఘిస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. -
సర్కారు హత్యే
సాక్షి, అనంతపురం: హత్యలతో ఊరూవాడా ఉలిక్కిపడుతోంది. దౌర్జన్యాలతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ‘ఎన్నికలయ్యాక మీ ఇష్టం. చంపుకుంటారో, నరుక్కుంటారో.. నేను చూసుకుంటా’ అని ధర్మవరం ఎమ్మెల్యే సూరి స్వయంగా కత్తులు చేతికిచ్చి మారణహోమానికి ఉసిగొల్పుతున్న తీరు, రాప్తాడులో ‘టీడీపీలో చేరకపోతే ఎన్నికలయ్యాక పరిస్థితులు మరోలా ఉంటాయి’ అని పరిటాల వర్గీయుడు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే హెచ్చరికలు చేయడం చూస్తే.. ఈ ప్రభుత్వం ఎంతలా బరితెగించిందో అర్థమవుతోంది. తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం రాష్ట్రంలో రక్తం మరిగిన ప్రభుత్వ తీరుకు అద్దం పట్టింది. ప్రశ్నార్థకంగా మారిన శాంతిభద్రతలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అనాగరికులు హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారు నాయకులు కాదు అనాగరికులు. రాజకీయాల్లో హత్యలనేవి చాలా అనాగరికమైనవి. నాగరికత నేర్చుకుని అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో ఇప్పటికీ ఇలాంటి దరిద్రం ఉండడం బాధాకరం. రక్తం శరీరంలో, నేలపై నీళ్లు పోరాలి. మన దౌర్భాగ్యమేమంటే రాయలసీమలో నేటికీ చాలా ప్రాంతాల్లో శరీరంలో పారాల్సిన రక్తం భూమిపై పారుతోంది. తక్కిన ప్రాంతాల్లో నాయకులు నీళ్లు పారించుకోవడంతోనే వారి ప్రాంతాలు అభివృద్ధి చేసుకున్నారు. మన ప్రాంత నాయకులకు నీళ్లపైన శ్రద్ధ లేదుకా>ని రక్తం పారించడంలో శ్రద్ధ చూపుతున్నారు. ఇలాంటి నాయకులను రాజకీయ సమాధి కట్టాలి. – తలారి పీడీ రంగయ్య, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు సమన్వయకర్త అధికార పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటన హత్యారాజకీయాలకు, టీడీపీ దుర్మార్గానికి పరాకాష్ట. అత్యంత మృదు స్వభావి, కనీసం చిన్నపిల్లలకు హానీ చేయని వ్యక్తి. నాకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు. ఆయన మృతి వార్త బాధకలిగించింది. అయితే అది హత్య అని తెలియడం నన్ను కలిసివేసింది. ఈ హత్యతో రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దివాళాకోరు ఆలోచన చేస్తున్నారు. మా ప్రాణాలను సైతం అడ్డువేసి అధికార పార్టీ దౌర్జాన్యాలు, ఆగడాలను ఎండగడతాం. – గోరంట్ల మాధవ్, వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు సమన్వయకర్త హత్యా రాజకీయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం హత్యా రాజకీయాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఎన్నికల తరుణంలో మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రతిపక్ష నాయకుని పినతండ్రికే ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేక పోయింది. ఇక సామాన్య ప్రజలకు ఏ మేరకు రక్షణ కల్పిస్తుంది. ప్రతిపక్షపార్టీ వారిని చంపుతామంటూ ఇటీవల అధికారపార్టీ నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యనించడం చూస్తే ఎన్నికల్లో హింసాత్మకంగా గెలవాలనుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ మద్దతుతోనే హత్యలకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. – వి.రాంభూపాల్, సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి ఐదేళ్ల టీడీపీ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి. పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులకే రక్షణ లేకుండా పోయింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య చాలా దుర్మార్గమైన చర్య. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఈ హత్యకు టీడీపీ ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. హత్యారాజకీయాలను బీజేపీ ఖండిస్తుంది. – విష్ణువర్ధన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
రానున్నది రాజన్న రాజ్యమే
సాక్షి, విశాఖపట్నం: రానున్నది రాజన్న రాజ్యమేనని, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ అన్నారు. వైఎస్సార్సీపీ 9వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఉదయం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మళ్ల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో భూకబ్జాలు పెచ్చుమీరిపోయాయన్నారు. విశాఖలో భూట్యాంపరింగ్ జరిగి లక్షల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని సాక్ష్యాత్తు అప్పటి కలెక్టర్ ప్రవీణ్కుమారే వెల్లడించారని గుర్తు చేశారు. సుమారు మూడున్నర కోట్ల ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను ఐటీ గ్రిడ్ అనే ప్రైవేట్ సంస్థకు ఇవ్వడం పెద్ద సైబర్ నేరమన్నారు. అంచెలంచెలుగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూ, దొంగ ఓట్లు సృష్టిస్తూ టీడీపీ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టిందని ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు కలిగి ఉండడం వారి హక్కు అన్నారు. రాష్ట్రంలో ఉన్న 40 వేలకు పైగా బూత్ల్లో ఈ నెల 15వ తేదీ వరకు అధికారులను అందుబాటులో ఉంచి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టాలని కోరారు. ప్రజల ఆదరణ, అభిమానం తమ పార్టీ వైపే ఉన్నాయని చెప్పారు. ఈ సారి వై.ఎస్.జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. టీడీపీ చేస్తున్న కుట్ర, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని, దేశ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా రానున్న ఎన్నికల్లో తీర్పు ఉంటుందని చెప్పారు. తమ మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని, అవి ఫలించవన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. టికెట్ ఎవరికిచ్చినా కష్టపడి పనిచేయండి పార్టీ విశాఖ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఎనిమిదేళ్లపాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, అదే స్ఫూర్తితో ఎన్నికల్లో పనిచేయాలన్నారు. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్న నేపథ్యంలో టికెట్ ఎవరికిచ్చినా అందరం కలిసి పనిచేసి ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలోకి కొత్త వ్యక్తులు చేరారని, అందరికీ పదవులు వరించవని, అలాగని ఎవరూ నిరుత్సోహపడవద్దని సూచించారు. మనమంతా ఏకతాటిగా పనిచేసి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. -
కోతల కాన్పులకు ఇక చెల్లుచీటి..!
సాక్షి, పాలమూరు: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుల లెక్క ఇకనుంచి పక్కాగా ఉంటోంది. పుట్టిన ప్రతీ బిడ్డ, తల్లిదండ్రుల వివరాలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలను కట్టడి చేయడానికి, బోగస్ పౌరసత్వం తీసుకునే అవకాశం లేకుండా తల్లీబిడ్డల సంక్షేమమే లక్ష్యంగా వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ జనవరి 1నుంచి జిల్లాలో ఈ–బర్త్ విధానం అమల్లోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో ప్రసవాలు, జనన వివరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్లో నమోదు చేసే విధానం పకడ్బందీగా చేస్తున్నారు. ప్రతీ ఆస్పత్రికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్ను కేటాయించారు. ఏ రోజుకారోజు ప్రసవాల సంఖ్య, వివరాలను ఇందులోపూర్తిస్థాయిలో నమోదు చేస్తున్నారు. ఎన్నో ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–బర్త్ విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధానంలో తల్లీపిల్లల మరణాలను తగ్గించడంలో పాటు నూరుశాతం కాన్పులు ఆస్పత్రుల్లో జరుగుతాయి. ప్రభుత్వ పథకాలను వర్తింప చేయడంతో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు సులువుగా పొందుతారు. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా భ్రూణ హత్యలు అరికట్టవచ్చు. ప్రైవేట్ ఆస్పత్రుల వారు ధనార్జనే ధ్యేయంగా అవసరం లేకున్నా శస్త్రచికిత్స కాన్పులు చేస్తున్నారా.. అనే అంశాన్ని పరిశీలించవచ్చు. ప్రత్యేకంగా ఏదైనా ఒక ఆస్పత్రిలో కేవలం మగపిల్లలే జన్మిస్తుంటే అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయా.. అనే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలకు అడ్డుకట్ట వేసి బోగస్ విదేశీయులు దేశంలో చొరబడి తప్పుడు పౌరసత్వం తీసుకొకుండా నిలువరించవచ్చు. జనవరి 1వ తేదీనుంచి రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఎప్పటికప్పుడు ఆ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తోంది. సదరు కుటుంబీకులు సైతం ఈ విధానంలో రూపొందించిన పత్రంలోని వివరాల ప్రకారమే మున్సిపాలిటీ, పంచాయతీల్లో జనన ధ్రువపత్రం పొందవచ్చు. ప్రసవాల సంఖ్య.. జిల్లాలో జనవరి 1 నుంచి అమలు చేస్తున్న ఈ–బర్త్ విధానంలో ఈనెల 25వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2,251 కాన్పులు జరిగాయి. వాటిలో సాధారణ కాన్పులు 1,661, సిజేరియన్లు 583 జరిగినట్లు నమోదయ్యాయి. అలాగే జరిగిన కాన్పుల్లో ఆడ శిశువులు 1,128, మగ శిశువులు 1,129 ఉన్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లో 947 కాన్పులు జరుగగా అందులో సాధారణం 307, సిజరీయన్ 640 జరిగాయి. వాటిలో ఆడ శిశువులు 488, మగ శిశువులు 479 మంది ఉన్నారు. ఇలా నమోదు చేస్తారు.. వైద్యఆరోగ్య శాఖ పర్యవేక్షణలో అమలవుతున్న ఈ–బర్త్ నమోదు ప్రక్రియను పటిష్టంగా చేసేందుకు డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ఆస్పత్రుల జాబితా రూపొందించి వైద్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. తల్లీబిడ్డకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్ చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించిన యూజర్ ఐడీలలో వివరాలు నమోదు చేసే విధంగా పోర్టల్ను రూపొందించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రతి రోజు ఆస్పత్రుల్లో జరిగిన కాన్పుల వివరాలతో పాటు తల్లీబిడ్డల సమాచారాన్ని అందులో నమోదు చేస్తారు. భ్రూణ హత్యల నివారణ ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న భ్రూణ హత్యలను ఈ–బర్త్ పోర్టల్ ద్వారా ఆరోగ్య శాఖ ఇట్టే పసిగట్టనుంది. లింగనిర్ధారణ పరీక్షలు చేయించినా, గర్భస్రావం అయినా వెంటనే తెలిసిపోయేలా ప్రణాళిక రూపొందించింది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తల సమన్వయంతో ప్రతి గర్భిణి వివరాలను ఏఎన్సీ నమోదు చేస్తున్నారు. రెండో నెల నుంచి కాన్పు జరిగే వరకు గర్భిణి ఆరోగ్యస్థితిపై ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొనసాగుతుంది. చికిత్స పొందుతున్న ఆస్పత్రుల వివరాలతో పాటు ఆరోగ్యవివరాలను అందులో పొందుపరుస్తారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న వారి ప్రతి ఒక్కరి వివరాలను గుర్తిస్తారు. గర్భిణుల వివరాలు పక్కాగా సేకరించి కాన్పులు జరిగే వరకు వారి పట్ల పర్యవేక్షణ చేస్తారు. గర్భిణీతో పాటు శిశువు ఆరోగ్యస్థితిని కూడా పరిశీలిస్తూ తగిన సూచనలు సలహాలు అందిస్తారు. మరో ప్రయోజనం ఈ విధానం వల్ల అకారణంగా శస్త్రచికిత్స కాన్పులను అడ్డుకట్ట వేయవచ్చు. ప్రతి కాన్పు ఇంటర్నెట్లో నమోదు చేసేప్పుడు శస్త్రచికిత్స ప్రసవం చేస్తే ఎందుకు చేశారు.? సర్జరీ చికిత్స చేయడానికి గల కారణాలను వివరంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా జిల్లా అధికారులతో విచారణ చేపడతారు. అకారణంగా సర్జరీలు చేసినట్లు తేలితే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవ వివరాలను ఏరోజుకారోజు ఈ–బర్త్ విధానంలో నమోదు చేయనట్లయితే ఆయా ఆస్పత్రులపై వైద్యశాఖ కేసులు నమోదు చేయించి మూడేళ్ల జైలు శిక్షపడేలా చర్యలు తీసుకోనుంది. -
అభివృద్ధే తరువాయి
మెదక్ అర్బన్: జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో 2018–19 సంవత్సరానికి గాను రెండో విడత కింద రూ.3.70 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సెక్రటేరియట్, ప్లానింగ్ శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిధుల్లో మెదక్ నియోజకవర్గానికి రూ.1.85 కోట్లు, నర్సాపూర్ నియోజకవర్గానికి రూ.1.85 కోట్ల చొప్పున అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. ఈ నిధులతో ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు అభివృద్ధిపనులకు ప్రతిపాదనలు చేయడం జరుగుతుంది. దీనికి కలెక్టర్ మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో తమతమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నేరుగా అభివృద్ధి పనులను చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి (సీపీఓ) శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నిధులను రెండు నియోజకవర్గాల్లో రహదారులు, మురికి కాల్వలు, ఇతర అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. గతంలో నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 2018–19 సంవత్సరానికి గాను మొదటి విడత, మే నెలలో రూ. 90 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల్లో ఒక్కో నియోజకవర్గానికి రూ.45 లక్షలు చొప్పున విడుదల చేశారు. ఈ నిధులతో వేసవిని దృష్టిలో ఉంచుకొని అన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చడానికి బోర్లు వేయించడం, మురికి కాల్వలు శుభ్రం చేయించడం, సీసీ రోడ్లు వేయించడంతో పాటు, పెండింగ్లోని సమస్యలు, అలాగే నియోజకవర్గంలో నెలకొన్న ఇతర చిన్నచిన్న ఇతర సమస్యలను ఎమ్మెల్యేలు పరిష్కారం కల్పించాల్సి ఉంటుంది. -
అమెరికాలో అనిశ్చితి!
పట్టువిడుపుల్లేని తీరుతో అమెరికాను ఇబ్బందులపాలు చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడై ఆది వారం నాటికి రెండేళ్లు పూర్తయింది. ఆయన నిర్ణయాలు సాధారణ పౌరులకు ఎంత సంకటంగా మారుతున్నాయో చెప్పడానికన్నట్టు గత నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం పాక్షికంగా మూత బడింది. ఎప్పటికి పరిష్కారమవుతుందో ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడింది. ప్రభుత్వంలో ఉండే మొత్తం 15 విభాగాల్లో వాణిజ్యం, వ్యవసాయం, రవాణా, న్యాయ, ఆంతరంగిక భద్రత తదితర 9 విభాగాలు ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఈ విభాగాల్లో పనిచేస్తున్న 8 లక్షలమంది సిబ్బంది అయోమయావస్థలో పడ్డారు. వీరిలో చాలామందికి ఆయా విభాగాల అధిపతులు ‘వేతనా లివ్వలేం. ఉద్యోగానికి రావొద్దు’ అని వర్తమానం పంపారు. కేవలం అత్యవసర సేవలందించడానికి అవసరమైన సిబ్బందికి మాత్రమే మినహాయింపు లభించింది. ఈ రకం సేవలందించేవారికైనా వేత నాలు లభించవు. అంతా చక్కబడ్డాకైనా వస్తాయో, రావో తెలియదు. అయితే పని లేకపోవడంతో పోలిస్తే ఇది కాస్త మెరుగని వారు సంతృప్తిపడాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి రోడ్డున పడిన సిబ్బంది, వారి కుటుంబాల పరిస్థితేమిటన్న ఇంగిత జ్ఞానం ట్రంప్ సర్కారుకు ఉండటం లేదు. అమెరికాలోని అనేకచోట్ల వేలాదిమంది ప్రభుత్వ సిబ్బంది పూట గడవటం కోసం తాకట్టు వ్యాపారుల దగ్గర క్యూ కట్టారని సమాచారం అందుతోంది. వ్యాపార సంస్థలు, బ్యాంకులు పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వ సిబ్బంది చెల్లించాల్సిన బకాయిల వసూళ్లను వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించాయి. కొన్ని ధార్మిక సంస్థలు ఫుడ్ కూపన్లు అందిస్తున్నాయి. కానీ ఎన్నాళ్లని ఇలాంటి సంస్థల దయాదాక్షిణ్యాల మీద సిబ్బంది ఆధారపడతారు? వ్యాపార సంస్థలు ఎన్నాళ్లపాటు మినహాయింపులిస్తాయి? ఈ మాదిరి సంక్షోభాలు అమెరికాలో గతంలోనూ తలెత్తాయి. కానీ ఏ సంక్షోభమూ ఇంత సుదీర్ఘకాలంపాటు కొనసాగలేదు. విధానపరమైన విభేదాలు తలెత్తినప్పుడల్లా ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన బిల్లుల్ని, బడ్జెట్లనూ ఆపేయడం అక్కడ రివాజు. పర్యవసానంగా కొన్ని రోజు లపాటు సర్కారీ విభాగాలు మూతబడటం కొత్తేమీ కాదు. 1976 నుంచి ఇంతవరకూ 21 సంద ర్భాల్లో అలా జరిగింది. కానీ ఇప్పుడు తలెత్తిన వివాదం విధానపరమైనది కాదు. దేశానికి దక్షిణం వైపున్న మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టి తీరాలని ట్రంప్ భీష్మించుకుని కూర్చోవడంతో తాజా సమస్య తలెత్తింది. ఆ గోడ నిర్మాణం ప్రారంభించడానికి అవసరమైన 570 కోట్ల డాలర్ల సొమ్ము తక్షణం కేటాయించాలన్నది ఆయన డిమాండ్. అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఈ గోడ కోసం ఆయన పలవరిస్తూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు డెమొక్రాట్లు దానికి అడ్డుపడుతూ వచ్చారు. ప్రభుత్వ బిల్లులను ఆమోదింపజేసుకోవడం కోసం పాలక రిపబ్లికన్ పార్టీ రాజీ పడకతప్పడంలేదు. కానీ ఈసారి అమీతుమీ తేల్చుకోవాలని ట్రంప్ నిర్ణయించారు. బిల్లుల్ని అడ్డుకుని సర్కారు పాక్షి కంగా మూతబడటానికి కారకులయ్యారన్న నింద డెమొక్రాట్లపై పడుతుందని, ప్రజల ఛీత్కారాలతో వారు గత్యంతరంలేక దారికొస్తారని ఆయన అంచనా వేశారు. ఆరేళ్లక్రితం బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిజానికి ఇలాంటి స్థితే ఏర్పడింది. మన ‘ఆరోగ్యశ్రీ’ని పోలిన ఆరోగ్య బీమాను ఒప్పుకునేది లేదని అప్పట్లో రిపబ్లికన్లు మంకుపట్టు పట్టారు. దాదాపు 4 కోట్లమంది పేదలకు ప్రయోజనం చేకూరే ఆ బిల్లును ఆపేయమని వారు కోరారు. కోట్లాదిమంది పన్నుల ద్వారా చెల్లించే సొమ్మును ఇలా కొందరి ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం ఎందుకు చెల్లించాలన్నది వారి ప్రశ్న. కానీ సామాన్య జనం రిపబ్లికన్ల తీరును ఏవగించుకున్నారు. 16 రోజులు గడిచాక చివరకు వారే రాజీకొచ్చి ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలపక తప్పలేదు. ఇప్పుడు డెమొక్రాట్లు కూడా అదేవిధంగా దారికి రాకతప్పదని ట్రంప్ భావన. అందుకే కనీసం డెమొక్రాట్ల వద్దకు రాయబారం పంపి వారికి నచ్చజెప్పేందుకు కూడా ప్రయత్నించలేదు. పైగా గోడ నిర్మాణానికి ఒప్పుకుంటే సరిహద్దుల్లో వలసదారుల్ని అడ్డగించిన కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు 80 కోట్ల డాలర్లు కేటాయిస్తానని, వలసవచ్చినవారికి తాత్కాలికంగా మూడేళ్లపాటు వర్తించేవిధంగా ఆశ్రయం కల్పిస్తానని బహిరంగ ప్రకటన చేశారు. అయితే ఆయన ఈ ప్రతిపాదన బహిరంగంగా చేసేముందు డెమొక్రాట్లతో రాజీ చర్చలు జరిపి ఉంటే వేరుగా ఉండేది. వారు అదనంగా మరికొన్ని రాయితీలు కోరి, ఆయన ప్రతిపాదనకు ఒప్పుకునేవారేమో! కానీ ఈ బహిరంగ ప్రకటన తర్వాత పరిస్థితి మారింది. ఇదే స్థితి మరికొన్నాళ్లు కొనసాగిస్తే ఆయన పూర్తిగా దిగిరాక తప్పదన్న నమ్మకం డెమొక్రాట్లలో ఏర్పడింది. అటు వలస వచ్చినవారి విషయంలో ట్రంప్ విధానాలను గట్టిగా సమర్థిçస్తున్నవారు ఆయన తాజా ప్రతిపాదన తమకు సమ్మతం కాదం టున్నారు. ఏతావాతా డెమొక్రాట్లను ఇరకాటంలో పడేయాలనుకున్న ట్రంప్ తానే ఇరుక్కు పోయారు. ప్రభుత్వం మూతపడ్డాక నిర్వహించిన సర్వేల్లో ఆయనకున్న మద్దతు తగ్గినట్టు వెల్లడి కాగా, తాజా ప్రతిపాదనతో అది మరింత క్షీణించిందని కొత్త సర్వేలు చాటుతున్నాయి. ఈ మాదిరి సంక్షోభం ప్రపంచంలో మరే దేశంలోనూ కనబడదు. చాలా దేశాలు ద్రవ్య విని మయ బిల్లు ఆమోదం పొందకపోయిన సందర్భాలు తలెత్తినా ప్రభుత్వ కార్యకలాపాలు యధా విధిగా కొనసాగించే ఏర్పాట్లు చేసుకున్నాయి. మన దేశంలో అధికార, విపక్షాల మధ్య ఎన్ని విభేదాలున్నా బడ్జెట్ ఆమోదం విషయంలో పట్టుదలకు పోవు. ఆస్ట్రేలియాలో బడ్జెట్ ఆమోదం పొందని స్థితి ఏర్పడిందంటే దాన్ని పార్లమెంటు వైఫల్యంగా పరిగణిస్తారు. అలాంటి పరిస్థితి తలెత్తితే రాజ్యాంగం ప్రకారం అక్కడి పార్లమెంటు రద్దవుతుంది. అమెరికాలో ఏడాది వ్యవధిలో సర్కారు మూతబడటం ఇది మూడోసారి. పాలకులుగా ఉన్నవారు పట్టువిడుపుల ధోరణి ప్రదర్శిం చాలి తప్ప లక్షలాది కుటుంబాలను ఇలా అనిశ్చితిలోకి నెట్టకూడదని ట్రంప్ గుర్తించాలి. ఈ సంక్షో భానికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలి. -
నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ 10న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీన నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో దీనికి సంబంధించిన ఆల్బెండజోల్ మాత్రలను ఇస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు గైర్హాజరైన విద్యార్థులకు ఈ నెల 17వ తేదీన మాత్రలు ఇస్తామన్నారు. 1–19 ఏళ్ల మధ్య వయసు కలిగిన 99.56 లక్షల మంది పిల్లలకు ఈ మాత్రలు అందజేస్తామని పేర్కొన్నారు. పిల్లల్లో సాధారణంగా ఏలిక, నులి, కొంకి పురుగులు కనిపిస్తుంటాయని, ఇవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధి చెందుతాయన్నారు. ఈ పురుగులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణాలు బహిరంగ మల విసర్జన, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడమేనని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 41,337 మంది ఉపాధ్యాయులు, 35,700 అంగన్వాడీ ఉపాధ్యాయులకు ఆల్బెండజో ల్ మాత్ర వేయడంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ మాత్ర వేసుకోవడం వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవని, నులిపురుగుల సంక్రమణ ఎక్కువగా ఉన్న పిల్ల ల్లో వికారం, వాంతులు, కళ్లు తిరగడం లాంటివి ఉండే అవకాశముందన్నారు. ప్రతికూల ప్రభావాల కు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. -
వారిని సమాజ బహిష్కరణ చేయాలి
సాక్షి, హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కేంద్రంగా సాగిన వ్యభిచారంతో సంబంధమున్న వారిని సమాజ బహిష్కరణ చేయాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కూపంలోకి చిన్నారులను సైతం దించడంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, దీనిపై సీఎం జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో సమీక్షించాలని కోరారు. బాధితులకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మంలో హ్యాపీ ఫ్యూచర్ మల్టీపర్పస్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో మహ్మద్ రఫీ అనే వ్యక్తి రూ.100 కోట్లు వసూలు చేసి మోసం చేశాడని, దీనిపై సీబీసీఐడి దర్యాప్తు చేయాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. -
జన చేతనే రక్షణ కవచం
రాజ్యం అధికార బలంతో పౌరుల హక్కుల్ని కాలరాసినపుడు మానవహక్కుల సంఘం వంటి సంస్థలు పౌర రక్షణకు వచ్చిన సందర్భాలెన్నో! ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మేరకు కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓ సదుపాయంగా హక్కుల సంస్థలు రూపొందాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కలగనీయకుండా వాటి నిర్వహణ చట్టబద్ధంగా సాగాలి. సర్కార్లు నిర్వీర్యపరుస్తున్నపుడు ‘మనదేం పోయింది..?’ అనే అలసత్వంతో కాకుండా పౌర సమాజం బాధ్యతగా వాటిని పరిరక్షించుకోవాలి. అప్పుడే, సామాన్యుడు మాన్యుడవుతాడు. రాజ్యాంగ స్ఫూర్తి రహిస్తుంది, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పౌర హక్కుల స్ఫూర్తికి ప్రభుత్వాలే పాతరేస్తు న్నాయి. ప్రజలకు రాజ్యాం గం కల్పించిన హక్కుల్ని, ప్రత్యామ్నాయ సదుపా యాల్ని నిలువునా తొక్కేస్తున్నాయి. ఫలితంగా... చట్టాలు అయినవాళ్లకు చుట్టాలయి, కాని వాళ్లకు కష్టాలయి కూర్చున్నాయి. ప్రజల హక్కులకు భంగం కలిగినపుడు ఆసరాగా నిలిచే పలు స్వతంత్ర, ప్రజా స్వామ్య, హక్కుల సంస్థల్ని పనిగట్టుకు నీరుగారు స్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పౌరసమాజం వీధుల్లో పోరాడో, న్యాయస్థానాల తలుపు తట్టో వాటిని నిలుపుకోవాల్సి వస్తోంది. ఆయా సంస్థల్ని ప్రభుత్వాలు అసలు ఏర్పాటే చేయవు. చేసినా... పాలకులు అక్కడ తగిన బాధ్యుల్ని నియ మించరు. నియమించినా... అందుకు అవసరమైన సదుపా యాలు కల్పించరు, అరకొర కల్పించిన చోట కూడా... నామ మాత్రపు వ్యవహారమే తప్ప స్ఫూర్తిని రక్షించే ఒక్క చర్యా ఉండదు. ఇలా నిర్లక్ష్యం లానో, ఉదాసీనత లాగానో బయటకు కనిపించే సర్కారు చర్యల వెనుక లోతైన వ్యూహమో, ఎత్తుగడో దాగి ఉండటం ఇటీవలి పరిణామాల్లో కొట్టొచ్చినట్టు కని పిస్తోంది. అది మరింత బాధాకరం! కొంచెం లోతుగా పరిశీలిస్తే... ప్రజాస్వామ్య సంస్థల్ని ఏలిన వారు నిర్వీర్యం చేయడం వెనుక ఉండే దురుద్దేశాలు ఒకటొకటిగా తేటతెల్లమౌతున్నాయి. కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. మానవహక్కుల సంఘాలు లేవు, లోక్పాల్–లోకాయుక్తల్లేవు, బాలల హక్కుల సంఘా లదీ అదే గతి! సమాచార హక్కు కమిషన్ ఒక చోట లేనే లేదు, మరోచోట నామమాత్రం! పరిపాలనా ట్రిబ్యునల్ ఒక చోట లేనే లేదు మరో చోట అంతంత మాత్రమే. అఖిల భారత స్థాయిలో హరిత న్యాయ స్థానాల వ్యవస్థను పలుచన చేస్తున్నారు. ఇంకా ఇతరేతర సంస్థల్లోనూ ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీ, ఖాళీ! ఇదీ వరుస! పరిపాలనలో పారదర్శకత కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు నీడన పనిచేయా ల్సిన సమాచార హక్కు కమిషన్లను నిర్వీర్యం చేస్తున్న వైనాన్ని సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టే తప్పుబట్టింది. ‘కమిషన్లు ఎందుకు పనిచేయ ట్లేదు? కమిషనర్లను ఎందుకు నియమించలేదు? పెండింగ్ ఫిర్యాదులు, అప్పీళ్లనెలా పరిష్కరిస్తార’న్న సుప్రీంకోర్టు ప్రశ్నకు విస్పష్టంగా సమాధానమే లేని దుస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది! మూడు వారా లకు వాయిదా పడిన తాజా కేసులో, సుప్రీంకోర్టుకి అవేం సమాధానం చెబుతాయో వేచి చూడాలి. కనీస హక్కుల రక్షణకు వ్యవస్థల్లేవు! మానవ హక్కుల ఉల్లంఘన జరిగినపుడు వాటిని ఎత్తి చూపి, తగు రక్షణ పొందే వ్యవస్థల్ని మన రాజ్యాంగమే కల్పించింది. అటువంటి ఉపద్రవాల నుంచి సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాలే పౌరులను కాపాడాలి. ప్రభుత్వాలు, వాటి వివిధ విభాగాలు, సంస్థలు నైతిక సూత్రాలను, చట్ట నిబంధనలను ఉల్లంఘించినపుడు, తద్వారా మానవ హక్కులకు భంగం కలిగినపుడు పౌరులకు రక్షణ అవసరం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్ని అందుకే నెల కొల్పుతారు. చట్టాల అమలుకు బాధ్యత వహించా ల్సిన ప్రభుత్వాలే కట్టుదప్పి వ్యవహరిస్తే, ఆ తప్పుల్ని ఎత్తిచూపే తెగువ, స్వేచ్ఛ, చొరవ కోసమే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తటస్థ సంస్థల ఏర్పా టును రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యం అధి కార బలంతో పౌరుల హక్కుల్ని కాలరాసినపుడు మానవహక్కుల సంఘం వంటి సంస్థలు పౌర రక్ష ణకు వచ్చిన సందర్భాలెన్నో! అందుకే, నేరుగా రాజ్యాంగం ద్వారా కొన్ని, అందులోని స్ఫూర్తితో రూపొందించుకున్న చట్టాల ద్వారా మరికొన్ని సంస్థలు ఏర్పడ్డాయి. ఆ స్ఫూర్తి కోసమే ఆయా సంస్థలు సంపూర్ణ స్థాయిలో, స్వేచ్ఛగా, ఏ అవరో ధాలూ లేకుండా పనిచేయాలి. కానీ, ప్రభుత్వాలు అలా చేయనీయవు. సదరు సంస్థల్ని కొన్నిసార్లు అసలు ఏర్పాటే చేయవు! తమకు ఇతరేతర విష యాలు ప్రాధాన్యమైనట్టు, ఆయా విషయాల్ని పట్టిం చుకోవడానికి తమ వద్ద సమయమే లేనట్టు ప్రభు త్వాలు నటిస్తుంటాయి. ప్రస్తుతం జరుగుతున్నదదే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు లోకా యుక్త, ఉప లోకాయుక్త సంస్థలకు అధిపతులు లేరు. రెండు చోట్లా మానవహక్కుల సంఘాలూ పనిచే యడం లేదు. మానవహక్కుల సంఘానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిటైర్ట్ ప్రధాన న్యాయమూర్తి స్థాయి వారు నేతృత్వం వహించాలి. జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ పదవీ విరమణ తర్వాత మరెవరినీ ఆ పదవిలో నియమించలేదు. ఇప్పుడక్కడ సభ్యులు కూడా లేరు. నిబంధనలకు భిన్నంగా... కార్యదర్శి స్థాయి అధికారే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు, కమిష న్ను నడుపుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత, ఉద్యోగుల సర్వీసు వివాదాలు పరిష్కరించే పరిపా లనా ట్రిబ్యునల్ (ఏటీ) తెలంగాణకు లేకుండా పోయింది. అధికారికంగా దాని రద్దు ప్రకటించారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డపుడు నమోదయ్యే ఏసీబీ కేసులు, ఉన్నతాధికారులపై వచ్చే అభియో గాల విచారణను నిర్ణయించాల్సిన విజిలెన్స్ కమిషన్ కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. పలు ఇతర హక్కుల సంస్థలదీ ఇదే గతి! హైకోర్టు మందలించినా తోలు మందమే! పాలనలో పారదర్శకత కోసం దేశంలో పుష్కర కాలంగా అమలవుతున్న సమాచార హక్కు చట్టానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కష్టకాలమొచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఈ చట్టం అమలుకు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. చట్టం అమలును పర్యవేక్షించే, ఫిర్యాదులు–అప్పీళ్లు పరిష్క రించే కమిషన్ను క్రమంగా బలహీనపరిచాయి. ఈ పరిస్థితులు, పౌరులు కోరుకునే సమాచారం వెల్లడి విషయమై అన్ని స్థాయిల్లో అలసత్వాన్ని పెంచి పోషించాయి. సమాచారం సులువుగా లభించని పూర్వస్థితి మళ్లీ బలపడుతుండటంతో ప్రజలు భంగ పోతున్నారు. అంతకుముందు నియమించిన కమి షనర్ల పదవీ కాలం ముగిసి, కమిషన్లో అసలు కమి షనర్లే లేని పరిస్థితి తలెత్తినా... ప్రభుత్వాలు పట్టించు కోలేదు. ఆ దశలో జోక్యం చేసుకున్న ఉమ్మడి హైకోర్టు, నిర్దిష్టంగా ఒక తేదీ లోపల కమిషన్ ఏర్పాటు చేసి, కమిషనర్లను నియమించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ‘ఆ మేరకు’ ప్రధాన సమాచార కమిష నర్తో పాటు ఒక కమిషనర్ను నియమిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది. తొమ్మిది వేలకు పైగా అప్పీళ్లు పెండింగ్లో ఉంటే, పది మంది వరకు కమిషనర్లను నియమించుకునే వెసలుబాటున్నా, ఎందుకు నియ మించటం లేదన్నది న్యాయస్థానాల ప్రశ్న. అదనపు సమయం కావాలని పలుమార్లు వాయిదాలు కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాదాపు పదినెలలు కావ స్తున్నా ఇప్పటివరకు కమిషనర్లను నియమించలేదు. కమిషన్ ఏర్పాటుకు ఒక ఉత్తర్వు, కమిషనర్ల పోస్టుల్ని ఏర్పాటు చేస్తున్నట్టు మరో ఉత్తర్వు ఇచ్చి చేతులు దులుపుకొంది. కమిషనర్ల నియామకాలు జరుపలేదు. ఇదే విషయమై హైకోర్టు గట్టిగా నిలదీసినపుడు, చేసేస్తున్నామని మాట ఇచ్చింది. కానీ, ఇప్పటికీ అదేమీ చేయకపోవడం న్యాయధిక్కా రమనే అభియోగంతో కొందరు తిరిగి కోర్టును ఆశ్ర యించిన కేసు శుక్రవారం విచారణకు రానుంది. ప్రజ లకు మేలు చేయడం కన్నా, తమ వారికి పదవులు కట్టబెట్టి, అధికారంలో తామున్నా, లేకున్నా రాబోయే అయిదేళ్లు వారిని కీలకస్థానాల్లో చూసుకోవాలనే రాజకీయ స్వార్థంతోనే ఈ వ్యూహాలన్న విమర్శలు న్నాయి. వారి ఎత్తుగడల్లో చిత్తవుతున్నది మాత్రం ప్రజా ప్రయోజనాలు! జరుగుతున్నది పౌర హక్కుల హననం! చట్టం చెప్పే ప్రమాణాలు తుంగలో సమాచార హక్కు కమిషన్లలో ఖాళీలు భర్తీ చేయండి అన్న సుప్రీంకోర్టు సూచనకే హక్కుల కార్యకర్తలు సంబరపడి పోతున్నారు. ఈ ఇల్లు అలకడాలతో పండు గైపోయినట్టు కాదు. నిజానికి, చట్ట స్ఫూర్తి గల్లంతవు తున్న మతలబంతా అక్కడే ఉంది. ఈ ప్రభుత్వాలు తమకు వీలయినంత కాలం కమిషన్లను ఏర్పాటు చేయవు. ఇక తప్పదన్నపుడు, చట్టం నిర్దేశిం చిన అర్హతా ప్రమాణాలతో నిమిత్తం లేకుండా ‘తమ’ వారితో కమిషన్లను నింపేస్తున్నాయి. స్వతంత్ర ప్రతి పత్తి స్ఫూర్తినే గంగలో కలిపి, ఆయా సర్కార్లు– సదరు కమిషనర్లు పరస్పర ప్రయోజనకరంగా వ్యవహ రించడం దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా అఖిల భారత సర్వీసు రిటైర్డ్ అధికారుల్ని ముఖ్య కమిషనర్లుగా, కమిషనర్లుగా నియమిస్తు న్నారు. సర్వీసు కాలమంతా సమాచారాన్ని చెరబట్టి, జనాన్ని విలువైన సమాచారానికి దూరం పెట్టిన వారు అంత సులువుగా సమాచార వ్యాప్తికి ఎలా నడుం కడతారన్న పౌర సంఘాల ప్రశ్నకు సమాధానమే లేదు! ఆర్టీఐ చట్టం (2005), సెక్షన్లు 12 (5), 15 (5)లో కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియా మకానికి ఎలాంటి వారై ఉండాలో విస్పష్టంగా పేర్కొ న్నారు. ప్రజాజీవితంలో ప్రముఖులై ఉండి, న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సామాజిక సేవ, యాజమాన్య నిర్వ హణ, జర్నలిజం, జనమాధ్య మాలు, పరిపాలనలో విశేషానుభవం కలిగిన వారై ఉండాలని పేర్కొన్నారు. అంటే, అవన్ని రంగాల్లో విస్తృత పరిజ్ఞానమో, ఆ ప్రాధాన్యతా క్రమంలో ఏదైనా అంశంలో విశేష ప్రజ్ఞనో కలిగి ఉండటం ప్రామాణికం. అంతే తప్ప, ప్రభుత్వ సర్వీసుల్లో పదవీ విరమణ చేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్పు. దాని వల్ల వివిధ స్థాయిల్లో చిక్కులు తలెత్తుతున్నాయి. కమిషన్ నిర్వ హణ, సమచారం ఇచ్చే ప్రక్రియ, ఫిర్యాదులు–అప్పీ ళ్లను పరిష్కరించే విధానం అన్నిట్లోనూ ఈ ‘అధికార ముద్ర’ ఆధిపత్యమే కనిపిస్తోంది. ఫలితంగా, సమా చార కమిషన్ వ్యవస్థ కూడా జనహితానికి భిన్నంగా పనిచేస్తోందన్న విమర్శ వినిపిస్తోంది. ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మేరకు కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓ సదుపాయంగా హక్కుల సంస్థలు రూపొందాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కలగనీయకుండా వాటి నిర్వహణ చట్ట బద్ధంగా సాగాలి. సర్కార్లు నిర్వీర్యపరుస్తున్నపుడు ‘మనదేం పోయింది..?’ అనే అలసత్వంతో కాకుండా పౌర సమాజం బాధ్యతగా వాటిని పరిరక్షించుకోవాలి. అప్పుడే, సామాన్యుడు మాన్యుడవుతాడు. రాజ్యాంగ స్ఫూర్తి రహిస్తుంది, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. దిలీప్ రెడ్డి -
48 గంటల్లో నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో జరుగు తున్న అవినీతిపై ‘సాక్షి’ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం సంచలనం సృష్టిస్తోంది. ‘డబుల్’ఇళ్ల అక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వ్యవహారంపై 48 గంటల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్చంద్ను ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగం, పలువురు ఎమ్మెల్యేలు, వారి అనుచరుల్లో వణుకు మొదలైంది. హుటాహుటిన రంగంలోకి.. సీఎం కేసీఆర్ ఆదేశించిన మరుక్షణమే ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబ్నగర్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో విచారణ ప్రారంభించాయి. ఈ జిల్లాల్లో నిర్మాణం పూర్తయిన ఇళ్లెన్ని, ఎంత మందికి కేటాయింపులు చేశారు, ఏవిధంగా కేటాయింపులు జరిపారన్న అంశాలపై రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నాయి. అక్రమాలు వెలుగులోకి వచ్చిన జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులపై విచారణ జరిపేందుకు డీఎస్పీ ర్యాంకు అధికారులను ఇంటెలిజెన్స్ విభాగం నియమించింది. నాలుగు అంశాలపై ప్రధాన విచారణ డబుల్ బెడ్రూం ఇళ్ల వ్యవహారంలో ప్రధానంగా నాలుగు అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. లాటరీ పద్ధతి ద్వారా కాకుండా నేరుగా కేటాయింపులు ఎక్కడెక్కడ చేశారు, ఈ విధమైన కేటాయింపులను ప్రోత్సహించిన ఎమ్మెల్యేలెవరు, వారి అనుచరులెవరు, ప్రభుత్వ భూమి లేనిచోట, ప్రైవేట్ భూములను ఏ విధంగా కొనుగోలు చేశారు, అవి ఎంత మంది చేతులు మారాయి? అన్న అంశాలపై విచారణ జరపాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది. పలువురు ఎమ్మెల్యేల్లో వణుకు! ఇళ్ల కేటాయింపులు జరపడం రెవెన్యూ విభాగం పనే అయినా.. లాటరీ పద్ధతి కాకుండా దళారుల మధ్యవర్తిత్వం, అనుచరుల ఒత్తిడితో కేటాయింపులు చేసిన అధికార çపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జుల్లో వణుకు మొదలైంది. భారీగా డబ్బులు దండుకుని అనర్హులకు ఇళ్లు కేటాయించిన వ్యవహారంపై క్రిమినల్ కేసులకు కూడా వెళ్లేందుకు అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక రెవెన్యూ విభాగం తరఫున కేటాయింపుల్లో పాత్రధారులుగా ఉన్న ఎమ్మార్వోలకు కూడా సస్పెన్షన్ భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. సెలవుపై ఎమ్మార్వో.. ఉన్నతాధికారులు భద్రాచలంలో ఇళ్ల కేటాయింపు అక్రమాలకు సంబంధించి అక్కడి ఎమ్మార్వోను దీర్ఘకాలిక సెలవులో పంపించినట్టు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం సబ్ కలెక్టర్ను ఈ వ్యవహారంపై విచారణాధికారిగా నియమించినట్టు అక్కడి కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఇక పలు జిల్లాల్లో డబుల్ ఇళ్ల అక్రమాలకు సంబంధించి కొందరు అధికారులపై సస్పెన్షన్ వేటుకు రంగం సిద్ధమైనట్టు నిఘావర్గాలు పేర్కొన్నాయి. 10 మంది అనర్హుల గుర్తింపు భద్రాచలం : భద్రాచలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో 10 మంది అనర్హులను అధికారులు గుర్తించారు. డబుల్ ఇళ్ల అవకతవకలపై ‘సాక్షి’ ప్రచురితమైన కథనంతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ స్పందించి.. భద్రాచలంలో ఇళ్ల కేటాయింపుపై సమగ్ర వివరాలను తెప్పించుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. 10 మంది అనర్హులను గుర్తించామని, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులను సంప్రదించామని సబ్కలెక్టర్ పమెలా సత్పత్తి వెల్లడించారు. -
సీపీఎస్ మినహా 17 అంశాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై అడుగు ముందుకు పడింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు మినహా బదిలీలు, పీఆర్సీ, రిటైర్మెంట్ వయసు పెంపు సహా 17 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. శుక్రవారం ఉదయం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు ఈటల రాజేందర్, కె.తారక రామారావు, జి.జగదీశ్వర్రెడ్డి చర్చించారు. అనంతరం 17 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. కేబినెట్ సబ్ కమిటీ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీసుకుంటారని స్పష్టం చేసింది. సీపీఎస్ అంశాన్ని సైతం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా పరిశీలిస్తుందని సబ్ కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా, సానుకూలంగా ఉన్నట్లు, అన్నింటిపై సీఎంతో చర్చించాక నిర్ణయం ప్రకటిస్తామని మంత్రుల కమిటీ పేర్కొంది. మరోవైపు ఉపాధ్యాయులకు సంబంధించిన కీలకాంశాలపై శనివారం ఉదయం 8 గంటలకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించనున్నట్లు కమిటీ వెల్లడించింది. అనంతరం అన్ని అంశాలను క్రోడీకరించి, శనివారం సాయంత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదికను అందజేయనున్నట్లు తెలిపింది. మేమంతా ఒకే కుటుంబం: ఈటల ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుందని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘‘ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉంది. భవిష్యత్లోనూ ప్రభుత్వం, ఉద్యోగులు ఒకే కుటుంబంగా కలిసి పని చేస్తాం. ఉద్యమ సమయంలోనూ ఉద్యోగులతోనే కలిసి పని చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉద్యమకారులను వేరుగా చూడదు. గత నాలుగేళ్లలో ఉద్యోగుల సహకారంతోనే పథకాలు సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వానికి ఎదురైన అనేక అవరోధాలు, ఆటంకాలు, కుట్రలు, కుతంత్రాలను ఉద్యోగుల సహకారంతోనే ఎదుర్కొన్నాం. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురయ్యారు. వారి రెగ్యులరైజేషన్ న్యాయ వివాదాల్లో చిక్కుకున్నందున సమాన వేతనాలు ఇస్తున్నాం’’అని చెప్పారు. సమావేశంలో ఉద్యోగులు 18 సమస్యలను చెప్పారని, వాటిన్నింటిని పరిశీలిస్తామని వివరించారు. టీచర్ల సమస్యలను కూడా తెలుసుకొని సీఎంకు నివేదిక అందజేస్తామన్నారు. బదిలీలపై స్పందిస్తూ.. ప్రస్తుతం రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉన్నందునా ఈ నెలలో బదిలీలు చేయడం సాధ్యం కాదని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో టీజీవో, టీఎన్జీవో నేతలతోపాటు జేఏసీ నేతలు, ఇంటర్ జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్రెడ్డి, గ్రూప్–1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు గోలుకొండ సతీశ్, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సమస్యల పట్ల మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించడంతో టీఎన్జీవో నేతలు సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. పరిష్కరించేవేనని గుర్తించింది: కారెం రవీందర్రెడ్డి సమావేశం అనంతరం టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ మాట్లాడారు. ‘‘మా సమస్యలు, డిమాండ్లను సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం. వారు కూడా ఇవేవీ పెద్ద సమస్యలు కాదని, పరిష్కరించగలిగేవే అన్న నిర్ధారణకు వచ్చారు. బదిలీలు చేసేందుకు, హెల్త్ స్కీం పక్కాగా అమలుకు, ఏపీలోని ఉద్యోగులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు సానుకూలంగా స్పందించారు. నాలుగేళ్లుగా బదిలీలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నాని చెప్పాం. ఆ బదిలీల ప్రక్రియను పది రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. జూన్ 2లోగా ఏపీలో ఉన్నవారిని తెలంగాణకు తీసుకురావాలని చెప్పాం. పీఆర్సీని ఏర్పాటు చేయాలని, ఈ ఏడాది జూలై 1 నాటికి అమల్లోకి తేలేకపోతే ఐఆర్ ప్రకటించాలని కోరాం’’అని చెప్పారు. నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించాలన్నాం: మమత సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని టీజీవో అధ్యక్షురాలు మమత చెప్పారు. ‘‘సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లాం. అవన్నీ సీఎం దృష్టిలో ఉన్నాయన్నారు. రిటైర్మెంట్ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని కోరాం. గ్రంథాలయ, మార్కెటింగ్ ఉద్యోగులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని కోరాం. హౌజింగ్, మార్కెటింగ్ శాఖల్లో తొలగించిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నాం. నిర్ణీత కాల వ్యవధిలో సమస్యలను పరిష్కరించాలని కోరాం. మంత్రుల కమిటీ కూడా శాశ్వతంగా ఉండాలని, దీంతో ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించే అవకాశం ఉంటుందని చెప్పాం’’అని వివరించారు. సీపీఎస్పై ప్రభుత్వం ఆలోచిస్తోంది: శ్రీనివాస్గౌడ్ సీపీఎస్ రద్దుపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు టీజీవో చైర్మన్ శ్రీనివాస్గౌడ్ చెప్పారు. ఇతర సమస్యల పట్ల కమిటీ సానుకూలంగా స్పందించిందని, పీఆర్సీ బకాయిల చెల్లింపు, హెల్త్కార్డుల వంటివెన్నో చేసిందని పేర్కొన్నారు. ఈ 18 అంశాల్లోనూ కొన్నింటిపై జీవోలు వచ్చినా, అధికారుల కారణంగా అమలుకు నోచుకోలేదన్నారు. అన్ని వర్గాల సమస్యలకు పరిష్కారం: దేవీప్రసాద్ అన్ని వర్గాల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందని బ్రూవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ చెప్పారు. ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని, ఇది కాలయాపన చేసే కమిటీ కాదని పేర్కొన్నారు. -
టీఎస్పీఎస్సీ పరిధికి కత్తెర
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరిధికి కత్తెర పడింది. ఉద్యోగాల భర్తీలో ఆలస్యం జరుగుతుండటంతో టీఎస్పీఎస్సీ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. విద్యుత్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుల తరహాలో శాఖలవారీగా నియామక బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐఆర్బీ)ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6 వేల పోస్టులను భర్తీ చేసే బాధ్యతను టీఆర్ఈఐఆర్బీకి అప్పగించింది. గతేడాది గురుకులాలకు సంబంధించిన పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రమే టీఎస్పీఎస్పీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టింది. 8వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, ఇప్పటికీ నియామకాల ప్రక్రియ సాగుతూనే ఉంది. నోటిఫికేషన్ జారీ నుంచే టీఎస్పీఎస్సీకి, రెసిడెన్షియల్ సొసైటీల మధ్య సమన్వయ లోపం ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టింది. నియామకాల్లో అంతులేని జాప్యానికి కారణమైంది. గురుకులాలతోపాటు అన్ని నియామకాల్లోనూ టీఎస్పీఎస్సీ పనితీరు విమర్శల పాలైంది. దీంతో టీఎస్పీఎస్సీకి బదులుగా రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డుకే బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగో వంతు కూడా.. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో మొత్తం 1.10 లక్షల ఖాళీలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచీ ఇప్పటి వరకు 84,548 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వివిధ రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారా ఇప్పటికే 54,724 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. అందులో 28,116 పోస్టుల భర్తీ మాత్రమే పూర్తయింది. ఖాళీల తో పోలిస్తే నాలుగో వంతు పోస్టులు కూడా ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. టీఎస్పీఎస్సీ వల్లే ఉద్యోగాల భర్తీలో జాప్యం జరిగిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యామ్నాయంగా శాఖల వారీగా నియామకాలు ప్రస్తుతం పోలీస్, విద్యుత్ శాఖలకు ప్రత్యేక బోర్డులున్నాయి. వీటి ద్వారానే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ సొంత ఏర్పాట్లు చేసుకుంది. టీఎస్పీఎస్సీకి అప్పగించిన పోస్టుల భర్తీని కూడా తిరిగి వైద్య శాఖనే సొంతంగా నియమించుకునేందుకు ఫైళ్లు కదుపుతోంది. అదే తరహాలో సంక్షేమ శాఖలు, వ్యవసాయ శాఖలోనూ నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అమలు కాని సీఎం హామీ 84 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినా నియామక ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. అవినీతికి అవకాశం ఇవ్వరాదన్న పేరుతో పోలీసు మినహా టీచర్ల నియామకాలతో సహా అన్ని ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. అయితే టీఎస్పీఎస్సీ ఒక్కటే ఇన్ని ఉద్యోగ నియామకాలను చేపట్టలేకపోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిబ్బంది లేకపోవడం వల్లే నియామక ప్రక్రియ ఆలస్యమవుతోందని టీఎస్పీఎస్సీ చెబుతోంది. కార్యాలయంలో సిబ్బంది కొరతతోపాటు సాంకేతిక సాయం సమకూర్చే సీజీజీతో సమన్వయ లోపం, ప్రభుత్వ విభాగాల నుంచి తగిన సమాచారం అందకపోవటంతోనే నియామక ప్రక్రియ ఆలస్యమవుతోందని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యోగ అర్హతలు, నిబంధనలు, రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, లోకల్ కేడర్ వివరాలన్నీ శాఖలు రూపొందిస్తుండగా, నియామక ప్రక్రియ టీఎస్పీఎస్సీ చేపడుతోంది. ప్రభుత్వ శాఖలతో సమన్వయం కుదరక వివాదాలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. -
రాష్ట్రంలో వైనరీ కోసం కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వైన్ కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. తెలుగు రాష్ట్రాల్లో వైన్కు డిమాండ్ పెరుగుతుండటం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ద్రాక్ష తోటల పెంపకానికి అనుకూల వాతావరణం ఉండటం తదితర అనుకూలతల దృష్ట్యా టీఎస్బీసీఎల్ వైన్ షాపుల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. ఇందుకోసం జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించే పనిలో పడింది. కొత్తగా మద్యానికి అలవాటు పడుతున్న యువతలో 70% మంది వైన్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నెలకు 50 వేల కేసుల వైన్ లాగేస్తున్నారు. మన దగ్గర చెప్పుకోదగిన స్థాయి వైనరీ లేకపోవటంతో వైన్ కోసం బయటి రాష్ట్రాల మీదనే ఆధారపడాల్సి వస్తోం ది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి రోజుకు వైన్ దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందులో 70% మార్కెట్ను ఓ జాతీయ స్థాయి వైన్ కంపెనీ ఆక్రమించింది. తాజాగా టీఎస్బీసీఎల్ చైర్మన్ ఇదే కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఈ కంపెనీ ఆధ్వర్యంలో పెంచుతున్న ద్రాక్ష తోటలను సందర్శించారు. వైనరీ ప్లాంటు తో ఎంత మంది యువతకు ఉపాధి లభిస్తోంది ..మార్కెటింగ్ తీరు ఎలా ఉంది వంటి అంశాలను అధ్యయనం చేశారు. తెలంగాణలో రోజు కు 30 వేల కేసు లు, ఏపీలో రోజుకు 20 వేల కేసుల చొప్పు న వైన్ను తాగుతున్నారని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. రైతులకు, యువతకు మేలు కలిగేలా.. ఒకప్పుడు హైదరాబాద్ ద్రాక్ష తోటలకు నిలయం. నగరం చుట్టూ ద్రాక్ష తోటలే విస్తరించి ఉండేవి. నగర ఆధునీకరణ, రైతాంగం పత్తి ప ట్ల ఆసక్తి చూపడం వంటి కారణాలతో ద్రాక్ష సాగు కనుమరుగైపోయింది. వైన్ పరిశ్రమ ఏర్పాటుతో నగరం చుట్టూ ఉన్న మేడ్చల్, యాదాద్రి, శంషాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలకు చెందిన రైతాంగాన్ని పత్తి సాగు నుంచి ద్రాక్ష తోటల పెంపకం వైపు మళ్లించవచ్చు. యువతకు కూడా ఉపాధి కల్పించవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో వైన్కు డిమాండ్ పెరుగుతోంది యువత ఎక్కువగా వైన్ పట్ల ఆసక్తి చూపుతోంది. రాష్ట్రంలో వైన్ పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉంది. ఓ జాతీయ స్థాయి వైన్ కంపెనీలో వైన్ తయారీ, ద్రాక్ష తోటల పెంపకం, మార్కెటింగ్ విధానం అధ్యయనం చేశాను. – దేవీప్రసాద్, టీఎస్బీసీఎల్ చైర్మన్ -
కనిపించని గ్రోత్
‘‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పోటీలు పడుతున్నారు.. వేలాది మందికి ఉపాధి కల్పించాం..వందలాది పరిశ్రమలు తీసుకొచ్చామంటూ’’ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ వేదిక ఎక్కినా ఊకదంపుడు ఉపన్యాసాలతో హోరెత్తిస్తుంటారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సరైన ప్రోత్సాహకాలు లేక, పరిశ్రమలు నెలకొల్పేందుకు తగినన్ని వసతులు లేక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలెవరూ పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రాకపోగా..ప్రభుత్వ విధానాలతో నిర్వహణ భారమై ఉన్న పరిశ్రమలూ ఒక్కొక్కటీ మూతపడుతున్నాయి. జిల్లాలోని పారిశ్రామిక గ్రోత్ సెంటర్లలో గత నాలుగేళ్లలో చెప్పుకోదగిన ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో జిల్లాలోని పారిశ్రామికవాడలకు ఒక్క కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు చాలా వరకు మూతబడ్డాయి. పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్ చార్జీల పెంపు, జీఎస్టీ భారం పరిశ్రమలను దాదాపు నిర్వీర్యం చేసింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువు కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ వద్ద 1992 ప్రాంతంలో గ్రోత్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఏపీఐఐసీ ఇక్కడ పారిశ్రామికవాడకు ఏర్పాట్లు చేసింది. పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలో 131.6 ఎకరాలు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో 32.6 ఎకరాలు చొప్పున 164 ఎకరాలు భూములను కేటాయించింది. 2007లో వీటికి సంబంధించి 110 ప్లాట్లు వేశారు. వైఎస్ హయాంలో ఇక్కడ 45 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా సిమెంట్, ఇటుకల ఫ్యాక్టరీలు, పొగాకు ఫ్యాక్టరీలు, పండ్లు కూలింగ్ యూనిట్లు, పచ్చిపండ్లను మాగపెట్టే యూనిట్లు, ఐస్ ఫ్యాక్టరీలు, చిన్న చిన్న మెకానిక్ షెడ్లు ఏర్పాటయ్యాయి. వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గత నాలుగేళ్ల పాలనలో సింగరాయకొండ గ్రోత్ సెంటర్లో ఒక్క పరిశ్రమ రాలేదు. పసుపు, కారం పొడి ప్యాకింగ్ ఎక్స్పోర్ట్స్ యూనిట్లతో పలు పరిశ్రమలు ఇక్కడకు వస్తున్నట్లు అధికార పార్టీ నేతలు పలుమార్లు ప్రకటించారు. కానీ ఏ ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. మరోవైపు గతంలో ఎకరం లక్ష రూపాయలకు కేటాయించిన అధికారులు ఇప్పుడు ఎకరం రూ.50 లక్షలు చెబుతున్నారు. మరోవైపు పారిశ్రామిక రాయితీల్లేకపోవడం, విద్యుత్ చార్జీల పెంపు, జీఎస్టీ భారంతో ఇక్కడ పరిశ్రమ నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. మరోవైపు ఇక్కడ గ్రోత్ సెంటర్లో భూముల వివాదం పరిశ్రమలు రాకపోవడానికి తెలుస్తోంది. ఇక్కడి భూములు తమవేనంటూ తొలుత ఎండోమెంట్ విభాగం వివాదం లేవనెత్తింది. ఇందు కోసం ఏపీఐఐసీ పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక్కడ పారిశ్రామికవేత్తల పోరాటంతో ఎట్టకేలకు ఎండోమెంట్ విభాగం వెనక్కు తగ్గింది. ఆ తర్వాత రెవెన్యూ భూములు తమవేనంటూ మరో వివాదం లేవనెత్తింది. వరుస వివాదాలతో పారిశ్రామికవేత్తలు ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సమస్యలను పరిష్కరించి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు బాబు ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ కనబరచడం లేదు. గుండ్లాపల్లిదీ ఇదే పరిస్థితి: సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో గ్రోత్ సెంటర్ను ఏర్పాటు చేశారు. 1271 ఎకరాల భూములు కేటాయించారు. 644 ప్లాట్లు వేసి పరిశ్రమల పేరుతో పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. వైఎస్ హయాంలోనే ఇక్కడే 400 పరిశ్రమలు నెలకొల్పారు. ప్రధానంగా 250 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లతో పాటు పలు రకాల పరిశ్రమలు నెలకొల్పారు. వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆ తర్వాత ఇక్కడకు పరిశ్రమలు రాలేదు. చంద్రబాబు సర్కారు ఏర్పాటైన నాలుగేళ్లలో ఇక్కడ చిన్న చిన్న గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు 10 వరకు ఏర్పాటైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే గత నాలుగేళ్లలో 40 పరిశ్రమలు గ్రోత్ సెంటర్లో మూతబడటం గమనార్హం. జీఎస్టీ 28 శాతానికి పెంచటం, విద్యుత్ చార్జీలు మరింతగా పెంచటంతో పాటు పారిశ్రామిక రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొంది. వైఎస్ హయాంలో రాయల్టీలో 40 శాతం రాయితీ ఇస్తే చంద్రబాబు సర్కారు పైసా ఇచ్చేందుకు కూడా ముందుకు రాలేదు. మొత్తంగా అటు సింగరాయకొండ, గుండ్లాపల్లి పారిశ్రామికవాడలు పరిశ్రమల్లేక వెలవెలబోతున్నాయి. ఉన్న పరిశ్రమలు మూతబడే పరిస్థితి నెలకొనడంపై పారిశ్రామికవేత్తలతో పాటు ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. జీఎస్టీతో ఇబ్బందులు జీఎస్టీ అమలులోకి రావటంతో నాలాంటి చిరు వ్యాపారులు దెబ్బతిన్నారు. గతంలో మార్కింగ్ చేసుకుని లోకల్ గా అమ్ముకుంటే కొద్దిగా డబ్బు మిగిలేది. కుటుం బాలు జరుపుకోవటానికి వీలుగా ఉండేది. ప్రస్తుతం జీఎస్టీ వలన చిరు వ్యాపారులు పూర్తిగా దెబ్బతిన్నారు. దీంతో ఏదో ఒక ఫ్యాక్టరీలలో స్కిల్డ్ వర్కర్లుగా చేరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గుండ్లాపల్లి గ్రోత్సెంటర్లో చాలా మంది స్కిల్డ్ వర్కర్లు ఉండటంతో అందరికీ సరిపడా ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి ఉంది. – శ్యాం, స్కిల్డ్ వర్కర్, వ్యాపారి ప్రోత్సాహకాలు కరువు గుండ్లాపల్లి గ్రోత్సెంటర్లో పలు సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జీఎస్టీ వలన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. గ్రానైట్ పరిశ్రమ మీద జీఎస్టీ ప్రభావం ఎక్కువగా ఉంది. బ్యాంకులు వ్యాపారస్తులకు సహకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవటంతో భారంగా మారుతోంది. గుండ్లాపల్లి గ్రోత్సెంటర్లో గుండ్లకమ్మ రిజర్వాయర్ పక్కనే ఉన్నా తాగునీరు, వాడుక నీరు లేకపోవటం దారుణం. గ్రానైట్ వ్యర్థాలను రోడ్లపైనే వేస్తుండటంతో 60 అడుగుల రోడ్లు కూడా 15 అడుగులకు కుంచించుకుపోతున్నాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఒక సమయం సందర్భం లేకుండా విద్యుత్ నిలిపి వేస్తుండటంతో మిషనరీ రన్నింగ్ కష్టంగా మారుతోంది. గ్రోత్సెంటర్ మొత్తంలో డ్రైనేజి వ్యవస్థ లేకపోవటం మరీ దారుణం. పబ్లిక్ టాయిలెట్లు లేకపోవటంతో రోడ్లపైనే మల విసర్జన చేస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ లేదు. ఇటువంటి పరిస్థితులు ఉంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్యాక్టరీలు పెట్టడానికి ఎలా వస్తారు. – టీవై రెడ్డి, ఎండీ , లిఖిత ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ -
అన్నదాతలంటే అలుసా
రైతులు పండించిన ధాన్యాన్ని తెగనమ్ముకోవాల్సిన పనిలేదు.. మార్కెట్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న గోదాముల్లో నిల్వ చేసుకుంటే రైతుబంధు పథకం కింద వడ్డీలేని రుణం అందిస్తాం.. ధాన్యానికి మంచి ధర వచ్చినప్పుడు విక్రయించుకోవచ్చు.. ఇవి పాలకులు ఆర్భాటపు ప్రకటనలు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే అందుకు విరుద్ధంగా ఉంది. ధాన్యానికి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని రైతుల ఆశలు అడియాశలే అవుతున్నాయి. బడ్జెట్ రాలేదంటూ పాలకులు, అధికారులు మొహం చాటేస్తుండటంతో అన్నదాతలు అవస్థలుపడుతున్నారు. నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ శాఖ గోదాముల్లో దాచుకుని, ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ధాన్యాన్ని దాచుకున్న రైతులకు 75 శాతం వడ్డీలేని రుణం ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. రూ.16.40 కోట్ల బడ్జెట్ జిల్లాలో ఈ ఏడాది 2017–18కి గాను గోదాముల్లో దాచుకున్న రైతులకు రూ.16.40 కోట్ల బడ్జెట్ కేటాయించింది. మొత్తం 53 గోదాముల్లో 1,156 మంది రైతులు ఇప్పటికే ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. ధాన్యం నిల్వ చేసుకున్న రెండు రోజుల్లో రైతులకు నగదు ఇవ్వాల్సి ఉంది. మొత్తం రూ.16.40 కోట్లలో ఇప్పటివరకు రూ.8 కోట్లు రైతులకు ఇచ్చారు. మిగిలిన రూ.7.60 కోట్ల నగదుకు బడ్జెట్ ఇంకా విడుదల కాలేదని అ«ధికారులు చెప్పుకొస్తున్నారు. రూ.36 కోట్లు ఉన్నా పట్టించుకోరా...? మార్కెట్ శాఖలో రూ.36 కోట్ల దాకా నిధులు ఉన్నాయి. ఈ నిధులను రైతుల అవసరాలకు వాడుకోవచ్చు. ప్రధానంగా గోదాములు కట్టడానికి , రైతులకు కావాల్సిన వస్తువులు పంపిణీ చేసేందుకు ఈ నిధులు వాడాల్సి ఉంది. ఈ నిధులను మాత్రం బయటకు తీయకుండా బడ్జెట్ రాలేదంటూ రైతులను అధికారులు తిప్పుకుంటుండటం గమనార్హం. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కనీసం రైతుల కష్టాలపై దృష్టిపెడితే బాగుంటుందని రైతు సంఘాల నాయకులు హితవు పలుకుతున్నారు. బడ్జెట్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండటంతో మార్కెట్ శాఖ నిధులు వాడి, బడ్జెట్ వచ్చిన తరువాత మార్కెట్శాఖ నిధులకు జమ చేయవచ్చని నాయకులు సూచిస్తున్నారు. 17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి జిల్లాలో ఈ ఏడాది సుమారుగా 17 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు గోదాముల్లో దాచుకుందామనుకుంటే కేవలం 53 మాత్రమే ఉన్నాయి. వాటిలో కూడా 10 గోదాములు పౌరసరఫరాల శాఖ అధీనంలో ఉన్నాయి. ఉన్న 43 గోదాముల్లో 60 వేల నుంచి 70 వేల టన్నులు మాత్రమే నిల్వ చేసుకునేందుకు వీలు ఉంటుంది. ఈ పరిస్థితులలో రైతులు ధాన్యాన్ని ఎక్కడ దాచుకోవాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం గోదాముల్లో దాచుకున్న ధాన్యానికి రైతుబంధు పథకం కింద వడ్డీ లేని రుణం రైతులుకు ఇవ్వాల్సి ఉంది. మాకు వచ్చిన నిధుల వరకు ఇచ్చాం. మిగిలింది బడ్జెట్ వస్తే ఇస్తాం. ఈ విషయాలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళుతున్నాం. – ఎ.ఉపేంద్రకుమార్, మార్కెట్శాఖ ఏడీఎం -
బెల్ట్ తీసేదెప్పుడో?
గుర్ల : గ్రామాల్లో గుక్కెడు నీరు దొరకడం ఏమో గానీ, మద్యం దొరకని ప్రాంతం లేదు. బెల్టుషాపులను పూర్తిగా నివారిస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి విస్తరణకు పూనుకుంటుంది. మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం బెల్టు షాపులను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గుర్ల మండలమే చక్కని ఉదాహరణ. మండలంలోని పలు గ్రామాల్లో బెల్టు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి. మండల పరిధిలోనున్న గుర్ల, కోటగండ్రేడు, అచ్యుతాపురంలోనున్న నాలుగు మద్యం షాపుల ద్వారా అమ్మకాలు జరపాలని అధికారులు లైసెన్స్లు మంజూరు చేశారు. మండలంలోని 37 పంచాయతీలకు ఏదో ఒక మార్గం ద్వారా ఈ నాలుగు షాపుల నుంచి మద్యం బెల్టు షాపులకు సరఫరా అవుతుంది. గ్రామాల్లో మద్యం అమ్మకాలు వద్దంటూ పలుసార్లు గ్రామస్తులు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహిళలు ఆందోళన మేరకు గ్రామాల్లో రెండు, మూడు వారాలు పాటు అధికారులు మద్యం నిషేధించారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, షాపు యజమానులకు అధికారులతో పరిచయం వల్ల కొద్ది రోజుల వ్యవధిలోనే యథావిధిగా బెల్టుషాపుల్లో మద్యం అమ్ముకుంటున్నారని గ్రామస్తులు నుంచి ఆరోపణలు వినపడుతున్నాయి. బెల్ట్ షాపులు నడుపుతున్న విషయం ఎక్సైజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. బెల్టు షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్శాఖ అధికారులు గంభీరం వ్యక్తంచేసిన అందులో వాస్తవం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నన్స్ సొసైటీ) ఇచ్చిన సమాచారంలో మండలంలో ఎక్కడా బెల్టు షాపులు నిర్వహించలేదనే నివేదికను అధికారులు పంపించారు. గ్రామాల్లో తనిఖీలు నిర్వహిస్తే అసలు విషయం బయటకు వస్తుందని గ్రామస్తులు చెబుతు న్నారు. బెల్టు షాపుల్లో ముద్రిత ధరలకు కాకుండా అధిక రేట్లుకు అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మండల శివారు ప్రాంతాలైనా పకీరు కిట్టాలి, కోండగండ్రేడు, దేవునికణపాక గ్రామాల్లో బెల్ట్ షాపులకు ప్రత్యామ్నాయంగా సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గ్రామాల్లో మందుబాబులు జోరు ఆరికట్టాలంటే బెల్ట్ షాపులు నియంత్రణ అవసరమని ప్రజలంటున్నారు. ఎక్సైజ్ అధికారులు తూతుమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పంధించి గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను నిషేధించాలని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు. స్థానిక పోలీసులే నయం స్థానిక పోలీసులు దాడులు చేసి బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నారు తప్ప ఎక్స్జ్ పోలీసులు మాత్రం ఎక్కడా బెల్ట్ షాపులపై దాడి చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎవరైనా వ్యక్తి బెల్ట్ షాపు నడుపుతున్నట్లు ఎక్స్జ్ అ«ధికారులకు సమాచారం ఇస్తే వారి వివరాలను బెల్ట్ షాపు నిర్వహకులకు తెలియజేస్తున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. ఈ విషయంపై నెల్లిమర్ల ఎక్సైజ్ సీఐ శైలాజారాణి వివరణ కోసం సాక్షి ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. బెల్ట్ షాపులను నిర్ములించాలి మండలంలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మండల కేంద్రంలోనే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదు. – చింతపల్లి అప్పారావు, బీజేపీ నాయకుడు, గుర్ల దాడులు చేస్తున్నాం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై తరుచూ దాడులు చేస్తున్నాం. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటున్నాం. సమాచారం వచ్చిన వెంటనే గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నిర్వహకులపై కేసులు నమోదు చేస్తున్నాం. – సంభాన రవి, ఎస్ఐ, గుర్ల -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
సాక్షి, మహబూబాబాద్ : ప్రభుత్వ కార్యక్రమాలను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం మండల ప్రత్యేక అధికారులు, సంబం« దిత సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసి లీకేజీలు లేకుండా చూడాలని, కల్వర్టులు పూర్తి చేయాలని, ఏప్రిల్ 15 నాటికి నీటి సరఫరా చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ ఇన్ట్రా విలేజ్ పనుల్లో భాగంగా 1,075 ఓహెచ్ఎస్ఆర్లకు గాను 300 మాత్రమే పూర్తయ్యాయని, మిగతా వాటికి స్థల సేకరణ చేసి పూర్తి చేయాలన్నా రు. కాగా ఈ వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ మొదటి దశలో పెండింగ్లో ఉన్న పనులను ఈనెల చివరిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో చెరువు పూడికతీత పనుల్లో మిగతా 17చెరువుల్లో నీరున్నందున మే చివరి నాటివరకు పూర్తి చేయాలన్నారు. మూడోదశలో 183 చెరువుల పనులను జూన్లోగా, నాలుగో విడతలో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లను పూర్తిచేయాలన్నారు. హరితహారంలో 4వ విడతలో 96లక్షల మొక్కలు నాటమే లక్ష్యంగా కృషిచేయాలన్నారు. డీఆర్వో పి.రాంబాబు, డీఎఫ్ఓ కిష్టగౌడ్, డీఆర్డీఓ వైవీ.గణేష్, సీపీఓ వెంకటనారాయణ, ఆర్డీఓలు భాస్కర్రావు, కృష్ణవేణి పాల్గొన్నారు. -
తీపి కబురు
గద్వాల : గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వీరికోసం హరితహారం కార్యక్రమం ద్వారా ఈత, తాటి, ఖర్బూజా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో నాటేందుకుగాను గీత కార్మికుల సంఘాలకు వీటిని అందిస్తోంది. వాస్తవానికి ఎక్సైజ్ శాఖకు ఏటా గీత కార్మికులు వివిధ రూపాల్లో పన్ను చెల్లిస్తున్నారు. ఇక ఎలాంటి పన్నులు చెల్లించకుండా తమ వృత్తిని కొనసాగించేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా జిల్లాలోని గద్వాల, గట్టు, మల్దకల్, కేటీదొడ్డి, ఇటిక్యాల, రాజోళి, ధరూరు, వడ్డేపల్లి, అయిజ తదితర మండలాల్లో సుమారు 2,400మంది గీత కార్మికులు ఉన్నారు. ఒక్కో సంఘంలో 20నుంచి 30 మంది వరకు సభ్యులు ఉన్నారు. అలాగే 68 వ్యక్తిగత లైసెన్సులు ఉన్నాయి. ఏటా లైసెన్స్తోపాటు వివిధ రకాల పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖ రూ.22,05,250 వసూలు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ఎవరూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపాటికే హరితహారంలో భాగంగా గట్టు మండలం తప్పెట్లమెర్సులోని పదెకరాల్లో ఈత, ఖర్బూజ మొక్కలను నాటించింది. గీత కార్మికులు కల్లును గీసే క్రమంలో ప్రమాదం జరిగితే రూ.ఐదు లక్షల బీమా అందించనుంది. సంఘాల ద్వారా ప్రతి కార్మికుడికి రూ.రెండు లక్షల రుణ సదుపాయం కల్పించింది. ఇప్పటికే 50ఏళ్లుపై బడిన వారికి పింఛన్ కింద నెలకు రూ.వేయి అందిస్తోంది. మరోవైపు కల్తీ సారా, గుడుంబా తయారీ చేయకుండా వివిధ రకాల వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి గౌరవప్రదమైన జీవితం కల్పించింది. దీంతో గౌడ కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సంతోషదాయకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం. ప్రస్తుతం స్వచ్ఛమైన కల్లు దొరకడం కష్టంగా మారింది. ఇదే అదనుగా భావించిన కొందరు విష రసాయనాలతో తయారుచేసిన కల్లును విక్రయిస్తూ గీత కార్మికులను పెడదోవ పట్టిస్తున్నారు. దీనిని నివారించేందుకుగాను ఈత, ఖర్బూజ మొక్కలను విరివిగా పెంచాలని ఆదేశించడం శుభసూచకం. దీంతో కొందరు పంట పొలాల మధ్య వీటికి సాగుకు ముందుకు వస్తున్నారు. పన్నుల నుంచి మినహాయించడం ఇవ్వడం ఉపశమనం. – వెంకటేష్గౌడ్, గువ్వలదిన్నెతండా, కేటీదొడ్డి మండలం కార్మికులకు మరింత భరోసా గీత కార్మికులకు పలు వరాలు కురిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం శుభపరిణామం. గతంలోవలే సొసైటీలను తయారు చేసుకునే వీలు కల్పించడం, ఈత, తాటి చెట్లకు పన్ను రద్దు చేయడం సంతోషంగా ఉంది. ము ఖ్యంగా గీత కార్మికులకు పింఛను, బీమా పెంచడంతో ఆయా కుటుంబాలకు మరింత భరోసా లభించింది. – పరమేష్గౌడ్, పెద్దధన్వాడ, రాజోళి మండలం -
అటకెక్కినట్టేనా..?!
నేలకొండపల్లి : భద్రాచలం దేవస్థానం నిర్మాత.. పరమ భకాగ్రేసరుడు రామదాసు స్వస్థలంలో మహాద్వార నిర్మాణంపై భద్రాద్రి దేవస్థానం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. రామదాసు పుట్టిన గడ్డ నేలకొండపల్లిలో రామదాసు మహాద్వారం నిర్మించాలని పాలకవర్గం నిర్ణయించి, హడావుడిగా మంత్రితో శంకుస్థాపన చేయించింది. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. ఇప్పటివరకు అక్కడ ఆవగింజంత పని కూడా చేపట్టలేదు. ‘భక్త రామదాసుకు ఇచ్చే మర్యాద ఇదేనా అని రామదాసు భక్తులు మండిపడుతున్నారు..... భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మించినందుకుగాను చెరసాలలో గడిపిన కంచర్ల రామదాసు(గోపన్న)ను భద్రాచలం అధికారులు అవమానిస్తున్నారు. ఉత్సవాలు, ఊరేగింపులు, ఇతరత్రా కార్యక్రమాలకు ఎలాగూ సహకరించటం లేదు. రామదాసు భక్తుల కోరిక మేరకు భద్రాద్రి అధికారులు మహాద్వారం కోసం రూ.2.50 లక్షలను మంజూరు చేశారు. రామదాసు పేరున నేలకొండపల్లి ప్రధాన మహాద్వారం నిర్మించేందుకు 2011, నవంబర్ 17 న అప్పటి రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డితో భద్రాద్రి దేవస్థానం అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్, హడావుడిగా శంకుస్థాపన చేయించారు. నేటి వరకు అక్కడ చిన్న పని కూడా చేయలేదు. రామదాసు మందిరంలో కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం లేదు. మహాద్వార నిర్మాణాన్ని విస్మరించారు. భద్రాద్రి దేవస్థానం అధికారులు తీరుపై రామదాసు భక్తులు మండిపడుతున్నారు. ఇక్కడి రామదాసు మందిరాన్ని అభివృద్ధి చేసేందుకు అధికారులు ఇటీవల ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా మహాద్వారం నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. -
ఫ్లో కంట్రోల్
నిజామాబాద్అర్బన్: మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీటిని అందించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఎత్తు, పల్లాలు ఉన్న ప్రాంతాల్లోనూ ఒకే విధంగా నీరు సరఫరా అందించేలా చూస్తోంది. ఇందుకోసం నూతన పద్ధతిని అమలులోకి తీసుకొస్తోంది. ఇంటింటికి నల్లా ద్వారా నీరు అందించే క్రమంలో నీటి సరఫరాలో లోపాలు ఏర్పడకుండా, ప్రతి ఇంటికీ సమాన స్థాయిలో నీరందేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. మిషన్ భగీరథ పైప్లైన్లకు ‘ఫ్లో కంట్రోల్ వాల్వ్’ అమర్చడం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీటిని సరఫరా చేయనుంది. జిల్లావ్యాప్తంగా ఇది వరకే కొన్నిచోట్ల పైప్లైన్లు వేయగా, అవసరమున్న చోట ఆ పైప్లైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్లు అమర్చుతున్నారు. ముఖ్యంగా ఈ పద్ధతి ద్వారా ఎత్తైన ప్రాంతాలు, తండాలు, మారుమూల గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తొలగనున్నాయి. ఫ్లో కంట్రోల్ వాల్వ్ అంటే.. జిల్లాలో మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో వైపు ఇంటింటికి నల్లా కనెక్షన్ల పనులు కూడా కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2165.45 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం జరగాల్సి ఉండగా, ఇప్పటికే 670.45 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణానికిగాను పైపులు సరఫరా అయ్యాయి. కాగా ఇందులో 552.33 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం పూర్తయింది. ఇంటింటికి తాగునీరు అందించేందుకు 2,86,494 లక్షల నల్లా కనెక్షన్లు అవసరం ఉండగా, ఇప్పటి వరకు 37,834 నల్లా కనెక్షన్లు అందించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయి. అయితే అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందించేందుకుగాను పైపులైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్ను అమరుస్తున్నారు. ఈ వాల్వ్లను పైప్లైన్లో అవసరమున్న చోట ఏర్పాటు చేయడం ద్వారా నీరు ఒకే ప్రాంతానికి వేగంగా వెళ్లకుండా, అన్ని ప్రాంతాలకు నీటిని సమానంగా అందే వీలుంటుంది. బంతి మాదిరిగా ఉండే వాల్వ్ను పైపులైన్లో ఏర్పాటు చేస్తారు. ఈ వాల్వ్కు ఉండే రంధ్రాలు నీటి ఉధృతిని నియంత్రించి, ఒకే ప్రాంతానికి వెళ్లకుండా నీటి సరఫరాను సమన్వయం చేస్తుంది. ఎత్తు నుంచి పల్లానికి నీరు వేగంగా ప్రవహిస్తుంది.. కాబట్టి పైప్లైన్లకు ఈ వాల్వ్లను అమర్చుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎత్తుపల్లాలు ఉన్నచోట ఈ విధానం అమలు చేస్తే అందరికి సమానంగా నీరు అందుతుంది. వాల్వ్ ఏర్పాటుకు ప్రాంతాల గుర్తింపు.. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో ఎత్తుపల్లాలను గుర్తించి పైప్లైన్లకు ఫ్లో కంట్రోల్ వాల్వ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదివరకే కొన్ని చోట్ల పైప్లైన్ నిర్మాణం పూర్తికాగా, ఈ వాల్వ్లు ఏర్పాటు చేసేందుకు మళ్లీ తవ్వి పూడ్చివేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇదివరకే వాల్వ్ల ఏర్పాటు కూడా జరిగింది. గతంలో మున్సిపాలిటీల్లో నీటి నియంత్రణకు పైపులకు స్ప్రింగ్ల మాదిరి ఉండే పరికరాలను ఏర్పాటు చేసి నీటిని కంట్రోల్ చేసేవారు. అయితే కొన్నిరోజులకు స్ప్రింగ్లు సాగకపోవడంతో ఈ పద్ధతి విఫలమైంది. ఈ స్థానంలో ప్రస్తుతం ఫ్లో కంట్రోల్ వాల్వ్ విధానంను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని తండాలు, గ్రామ పంచాయతీలు, ఎత్తు ప్రాంతంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో శివారు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను ఇదివరకే గుర్తించారు. మిషన్ భగీరథలో నూతన వాల్వ్ విధానం ద్వారా అన్ని ప్రాంతాలకు సమానంగా నీరందే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
అపెరల్కు ఎసరు
చేనేతల అభ్యున్నతి కోసం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరు సమీపంలో అపెరల్పార్కును ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా రూ. 5.58 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం తీసుకోవాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో గార్మెంట్స్, హ్యాండ్లూమ్ పరిశ్రమల ఏర్పాటుతో చేనేతలను ఆదుకోవాలన్న వైఎస్ సంకల్పం నెరవేరకుండా పోతుంది. సాక్షి ప్రతినిధి, కడప : ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన అపెరల్ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేయకపోగా.. ఇప్పుడా స్థలంలో కొంత భాగం పేదల ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవర్లూమ్, డైయింగ్, హ్యాండ్లూమ్ పరిశ్రమలతోపాటు గార్మెంట్స్ తయారీ యూనిట్ల కోసం ఈ స్థలాన్ని 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించారు. ఆ మేరకు ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగించారు. 76.17 ఎకరాల స్థలంలో అపెరల్ పార్కు ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 15 నుంచి 20 సెంట్ల విస్తీర్ణంలో ప్లాట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు 47 ప్లాట్లను ఏర్పాటు చేశారు. పార్కు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి.. అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. పార్కు స్థలంపై పలువురి కన్ను... అపెరల్ పార్కు స్థలంపై పలువురు కన్నేశారు. దశాబ్ద కాలంగా పనులు ముందుకు సాగకపోవడం.. అత్యంత విలువైంది కావడంతో దానిని హస్తగతం చేసుకోవాలని బడాబాబులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించడం.. ఆ ఆక్రమణలను తొలగించడానికి అధికారుల పడిన హైరానా అందరికీ తెలిసిందే. ఇప్పటికే అందులో 5 ఎకరాల స్థలాన్ని రవాణా శాఖ కార్యాలయానికి విక్రయించడం జరిగింది. అప్పుడు 71.17 ఎకరాల స్థలం మాత్రమే అపెరల్పార్కుకు ఉంది. ప్రణాళిక ప్రకారమే పక్కన పెట్టారు.. వాస్తవానికి అపెరల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం దశాబ్దకాలం గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించకముందు వరకు అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చకచకా పనులు జరిగాయి. ఆయన మరణించాక.. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దీనిపై దృష్టి సారించకపోవడంతో అపెరల్ పార్కు అభివృద్ధికి నోచుకోలేదు. పైగా కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ స్థలం నుంచి 5 ఎకరాలను రవాణాశాఖకు కేటాయించారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకునే విషయంలో నిర్లప్తత చూపింది. ఇప్పుడు ఎన్టీఆర్ అర్బన్ పేరిట ఇళ్ల నిర్మాణం కోసం ఈ స్థలాన్ని సేకరించాలని భావిస్తోంది. ప్రతిపాదించిన మంత్రి నారాయణ.. పురపాలకశాఖ మంత్రి నారాయణ అపెరల్ పార్కు స్థలంలోని 35 ఎకరాలను ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని ఏపీఐఐసీ చైర్మన్కు ప్రతిపాదించారు. అందుకుగాను మరోప్రాంతంలో చేనేతలకు స్థలం కేటాయిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా రూ. 69 లక్షల చొప్పున ఏపీఐఐసీ ధర నిర్ణయించింది. అయితే దీనిపై చేనేత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చేనేతల అభ్యున్నతి కోసం కేటాయించిన పార్కు స్థలాలను పూర్తిగా వారికి కేటాయించాలంటున్నారు. అపెరల్పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో తయారయ్యే వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించడంతోపాటు పెట్టుబడికి రుణసాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు.. చేనేతలను ఆదుకునేందుకే అపెరల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ స్థలానికి సంబంధించిన వ్యవహారాలన్నీ మొదటి నుంచి ఏపీఐఐసీనే చూస్తోంది. ఇప్పుడా స్థలంలో ఇంటి నిర్మాణాలకు కేటాయించాలనే ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు. అయితే చేనేతల కోసం కేటాయించిన స్థలాన్ని వారికే కేటాయిస్తాం. అయితే ఏపీఐఐసీకి మా శాఖ నుంచి రూ. 2.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందుకోసం అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేసి వాటిని విక్రయించి చెల్లించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. – జయరామయ్య, ఏడీ, చేనేత జౌళి శాఖ అభివృద్ధి కోసమే వినియోగించాలి అపెరల్ పార్కు స్థలాన్ని చేనేతల అభివృద్ధి కోసమే వినియోగించాలి. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేతల దుస్థితిని చూసి 90 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రభుత్వం ఆస్థలాన్ని ఇళ్ల కోసం కేటాయిస్తామని చెప్పడం చేనేతలను అవమానించినట్లే. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడంటే అది చేనేతల పుణ్యమేనని టీడీపీ గుర్తు పెట్టుకోవాలి. మెండిగా ముందుకెళితే మా సత్తా ఏంటో చూపిస్తాం. – దశరథరామయ్య, చేనేత సంఘ రాష్ట్ర నాయకులు చేనేతల అభ్యున్నతికి కృషిచేయాలి చేనేత పరిశ్రమలకే అపెరల్ పార్కు స్థలం వాడాలి. కడప జిల్లాలో చిన్నతరహా, భారీ పరిశ్రమలు లేవు. ప్రధానంగా అపెరల్పార్కును గార్మెంట్స్ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అనుభవజ్ఞులైన కళాకారులు అందుబాటులో లేక పోవడం, పెట్టుబడీ దారులు ముందుకు రాక పోవడంతో చేనేతల అభ్యున్నతి కోసమే 2005లో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ కేటాయించిన స్థలంలో ఎలాంటి అభివృద్ది జరగలేదు. చేనేతల అభివృద్ధికి కృషి చేయాలి – అవ్వారు ప్రసాద్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రభుత్వ నిర్ణయం సరికాదు చేనేతలను అభివృద్ది చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అపెరల్ పార్కు స్థలాన్ని 13 ఏళ్ల కిందట కేటాయించినా ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. చేనేతలు పనులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఆ స్థలాన్ని ఇళ్లకు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తుండటం దారుణం. – నాగరాజు, చేనేత కార్మికుడు -
జిల్లాకు జలగండం
కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో తాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉంది. దీనివల్ల తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. రైల్వే ట్రాక్ అవతల ఉన్న బోరుకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు గేటు మూసేస్తున్నారు. ఇప్పుడు నీటికోసం ఎక్కడికెళ్లాలో అర్థం కావట్లేదు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. గత నెల 29న నిర్వహించిన జిల్లా గ్రీవెన్స్సెల్కు మండల లోక్సత్తా అధ్యక్షుడు ఐతంశెట్టి శ్రీనివాస్, ఇతర గ్రామస్తులు అందించిన వినతి. విజయనగరం గంటస్తంభం: తాగునీటికి ఒకప్పుడు బావులపై ఆధారపడే వారు. ఇప్పుడు బోర్లపై ఆధారపడుతున్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలో బోర్లున్నా తాగునీటికి ఇబ్బందులు తప్పట్లేదు. ఉన్న బోర్లలో కొన్ని పనిచేయక దిష్టిబొమ్మల్లా దర్శనమిస్తుంటే... మరికొన్ని బోర్లనుంచి వచ్చే నీరు తాగేందుకు పనికిరావట్లేదు. ఇలాంటి పరిస్థితి ఉన్న చోట శాశ్వత తాగునీటికి రక్షిత మంచినీటి పథకాలే అనివార్యం. జిల్లాలో అన్ని గ్రామాలకు రక్షిత తాగునీరు అందడంలేదు. 30శాతం గ్రామాలకు అసలు రక్షిత మంచినీటి పథకాలే లేవు. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. పథకాలు ఉన్నచోట కూడా పైపులైన్లు లేకపోవడం, నీటిసరఫరా వ్వవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, కుళాయిలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో నీటి సమస్య మాత్రం తీరడంలేదు. జిల్లాలో 180 గ్రామాల్లో ఈ పరిస్థితి ఉందని చెబుతున్నా రక్షిత మంచినీటి పథకాలున్న 70శాతం గ్రామాల్లో 10 నుంచి 20శాతం గ్రామాల్లో మినహా అన్నిచోట్లా తాగునీటి సరఫరా వీధులన్నింటికీ వెళ్లడంలేదు. ప్రతిపాదనలకే పరిమితం జిల్లాలో దాహం కేకలు వినిపించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయి రక్షిత నీటిసరఫరా చేయాలని అధికారులు భావించారు. ప్రభుత్వం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు కింద ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు ద్వారా సమాచారం రావడంతో ఈ మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళిక తయారు చేయగా కలెక్టర్ వివేక్యాదవ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 2560 గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా చేసేందుకు తాగునీటి వనరులైన రక్షిత మంచినీటి పథకాల నిర్మాణం, పాత వాటి విస్తరణ కోసం రూ.1024కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనలు గతేడాది ఆక్టోబర్లోనే ప్రభుత్వానికి వెళ్లాయి. రెండు, మూడు నెలల్లో నిధులు మంజూరైతే పనులు ప్రారంభించి వేసవికి ముందే పనులు పూర్తి చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని భావించారు. కానీ ఐదు నెలలు దాటుతున్నా ఇంతవరకు నిధుల విషయమే చర్చకు రాలేదు. మంత్రి సుజయ్కృష్ణ రంగారావు, ఇతర ఎమ్మెల్యేలు ఎవరూ దీనపి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. సర్కారు కూడా కనికరించలేదు. ఫలితంగా ఈ ఏడాది వేసవిలోనూ నీటి ఎద్దడి తప్పని పరిస్థితి నెలకొంది. నిధులు మంజూరైతే సమస్య తీరుతుంది జిల్లాలోని కొన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య ఉంటుంది. తాగునీటి సరఫరా అన్ని వీధులకు లేకపోవడంతో కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాలు లేని గ్రామాలున్నాయి. అలాంటి చోట బోరు నీరు బాగులేకపోతే సమస్య ఉత్పన్నమవుతోంది. ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులో నిధులకోసం ప్రతిపాదించాం. నిధులు విడుదలైతే పనులు పూర్తి చేస్తాం. ఆ తర్వాత అంతగా సమస్య ఉండదు. – ఎన్.వి.రమణమూర్తి, ఆర్డబ్యూఎస్ ఎస్ఈ -
తండాలకు మహర్దశ!
ఊర్కొండ : రాష్ట్ర ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా మార్చేందుకు ఆదేశా లు జారీచేయడంతో మండల స్థాయిలో తండాలపై కసరత్తు జరుగుతుంది. ఈ విషయంపై ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, పం చాయతీ కార్యదర్శులు, ఆయా తండా ల్లో పర్యటించి గిరిజనుల అభిప్రాయా లు తెలుసుకున్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మండలంలో ప్ర స్తుతం 12 గ్రామ పంచాయతీల ద్వారా మరో 5 కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. అన్ని పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. మండల అధికారులు, 5 గ్రా మ పంచాయతీల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గ్రామ పంచా యతీ ఏర్పడటానికి జనా భా, రెవెన్యూ, గ్రామాల మధ్య దూరం, సమానంగా గ్రామ నక్షను అధికారులు అందించారు. ఇవే 5 కొత్త గ్రామాలు.. మండలంలోని ఠాగూర్తండా, బాల్యలోక్తండా, తిమ్మన్నపల్లి, నర్స ంపల్లి, గుణగుంట్లపల్లి గ్రామాలను కొత్త గా ఏర్పడే పంచాయతీలకు ప్రతిపాదన లు పంపారు. ఇది వరకు ఊర్కొండపేట పంచాయతీలో ఉన్న గుణగుంట్లపల్లి, జంగాలకాలనీ, రెడ్యాతండాలను కలిపి గుణగుంటపల్లి పం చాయతీగా ఏర్పాటు కానుంది. నర్సంపల్లి ప్రత్యేక పంచాయతీ, రేవల్లి గ్రామ ంలో ఉన్న తిమ్మన్నపల్లిని ప్రత్యేక పం చాయతీ కానుంది. ఠాగూర్తండా, బూర్వానికుంట, మఠంతండా, అమ్మపల్లి తండాలను కలుపుతూ ఒక పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. బాల్యలోక్తండా, బావాజీతండాలను కలుపుతూ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు మండల స్థాయి అధికారులు ప్రతిపాదనలు అందించారు. రోడ్డెక్కిన గిరిజనులు.. ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మండలంలోని ఊర్కొండపేట పం చాయతీ పరిధిలోని నాలుగు తం డాలు అమ్మపల్లితండా, బూర్వా నికుంట తండా, మఠంతండా, ఠాగూర్తండాలను కలుపుతూ పంచాయ తీగా ఏర్పాటు చేయాలని అధికారు లు ప్రతిపాదనలు పంపించారు. అయితే అమ్మపల్లితండా, ఠాగూర్తండా వాసులు తమ తండాలను ఒ క పంచాయతీగా చేయాలని కోరు తూ రోడ్డెక్కారు. రెండు తండాలవాసులు మంత్రులు, జిల్లా అధికారులను సైతం కలిసినట్లు సమాచారం. సమస్యలు తీరుతాయి.. ఎన్నో ఏళ్లుగా గ్రామాలకు దూరంగా ఉన్న తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం సంతోషం. తండావాసులు గ్రామాలకు వెళ్లాలంటే చాలా సమయం పట్టేది. ఇప్పుడు నూతన పంచాయతీలతో సమస్యలు తొలగుతాయి. పాలన సక్రమంగా అందుతుంది. – రమేష్నాయక్, రెడ్యాతండా అభివృద్ధి చెందుతుంది.. గత కొన్నేళ్లుగా మా తండా వేరే పంచాయతీలో ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం మా గ్రామంపై చిన్నచూపు చూసేవారు. ఇప్పుడు నూతన పంచాయతీ ఏర్పాటు కావడం వల్ల గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. – రాధాకృష్ణ, తిమ్మన్నపల్లి -
ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలి
ఆర్మూర్ : ఎర్రజొన్నలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహం ప్రాంగణంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎర్రజొన్న రైతు ప్రతినిధులతో సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు దేవరాం అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 110 గ్రామాల్లో ఎర్రజొన్న పంటను సుమారు 50 వేల ఎకరాల్లో పండిస్తున్నారన్నారు. ఈ పంటను మన రాష్ట్రంతో పాటు హర్యానా, ఢిల్లీ, చత్తీస్ఘడ్ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా లాంటి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. ఇక్కడ పండిన పంట దేశ సరిహద్దులు దాటుతున్నా సీడ్ వ్యాపారుల మోసాల కారణంగా రైతులకు అందాల్సిన గిట్టుబాటు ధర అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కోసం రైతులు చేసిన ఉద్యమంలో రైతుల పక్షాన నిలిచిన టీఆర్ఎస్నాయకులు ఇప్పుడెందుకు రైతులను పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సీడ్ వ్యాపారుల సిండికేట్ వ్యాపారానికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వమే ఎర్రజొన్నలను కొనుగోలు చేస్తూ విత్తన వ్యాపారం చేయాలనే డిమాండ్తో రైతు ఐక్య కార్యాచరణ ఉద్యమాన్ని ప్రారంభించనున్నామన్నారు. అందులో భాగంగా ఈ నెల 9న చలో కలెక్టరేట్కు పిలుపునిస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో ఎర్రజొన్న రైతులు తరలి వచ్చి చలో కలెక్టరేట్ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్, రాజేశ్వర్, ఆర్మూర్ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు ఏపీ గంగారాం, రాజన్న, నాయకులు కిషన్, అశోక్, పీడీఎస్యూ జిల్లా మాజీ కార్యదర్శి సుమన్, ఏఐకేఎంఎస్ నాయకులు పాల్గొన్నారు. -
‘రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’
సిద్దిపేటటౌన్ : స్వరాష్ట్రంలో రైతులు బాగుపడతారని ఆశిస్తే.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి యాదగిరి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మద్దం లక్ష్మి, రాష్ట్ర నాయకుడు జంగిటి శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హాత్యలేనని ఆరోపించారు. బుధవారం జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్క పైసా కూడా ప్రభుత్వం విడుదల చేయలేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. రైతులకు మట్టితో సహా రూ.లక్ష రుణమాఫీ చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.6 లక్షలు పరిహారంగా ఇస్తామన్న హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో జువ్వన్న ప్రసాద్ తదితరులున్నారు. -
శుద్ధదండగే!
భూత్పూర్ : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో తాగునీటికి విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఐదు వందలకు పైగా విద్యనభ్యసిస్తున్నారు. ఇదివరకు పాఠశాలలో ఉన్న చేతిపంపునకు మోటార్ బిగించి నీటి సరఫరా చేసేవారు. క్రమక్రమంగా వర్షాలు పడకపోవడంతో బోరు వట్టిపోయింది. దీంతో పంచాయతీ వారు నూతనంగా బోరు వేసి మోటారు బిగించారు. కొన్నిరోజులపాటు నీరు వచ్చినా.. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ నిధులతో మంజూరైన వాటర్ ఫిల్టర్ను జూన్ 25న మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి వచ్చి ప్రారంభించారు. వాటర్ ఫిల్టర్ ప్రారంభించిన వారానికే బోరు వట్టిపోయింది. ఫలితంగా విద్యార్థులకు నీటి సమస్య మొదటికొచ్చింది. పాఠశాల బయటే మూత్రవిసర్జన ఉన్నత పాఠశాలలో నీరు లేకపోవడంతో పాఠశాల బయటనే విద్యార్థులు మూత్రవిసర్జనకు వెళ్తున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీనీలకు సైతం వంట చేయడానికి ఇబ్బందిగా మారింది. విద్యార్థులు చేసేదిలేక ఇంటి నుంచి బాటిళ్లలో నీరు తెచ్చుకుని మధ్యాహ్న భోజన సమయంలో అదే నీటిని తాగుతున్నారు. ఇం టర్వెల్ సమయంలో హోటల్ వద్దకు వెళ్లి తాగాల్సిన దుస్థితి నెలకొంది. పంచాయతీ బోరు దూరంగా ఉండటంతో పాఠశాలకు నీరందించేందుకు వీలులేకుండా పోయింది. కొత్త బోరు వేయాలి స్కూళ్లు తెరిచిన వారం రోజుల నుంచి నీళ్లు రావడంలేదు. స్కూల్లో ఉన్న బోరు ఎండిపోయింది. తాగడానికి నీళ్లు లేవు. బాటిల్ కొని ఇంటినుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. కొత్త బోరు వేయాలి. నీళ్లు లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది. – సునీత, 9వ తరగతి ఇంటినుంచి తెచ్చుకుంటున్నాం స్కూల్లో నీళ్లు లేకపోవడంతో ఇంటి వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. క్లాస్ మధ్యలో దాహం వేస్తే నీళ్లు లేకపోవడంతో దాహం తీర్చుకోలేకపోతున్నాం. మూత్రశాలలు ఉన్నా.. నీళ్లు లేక బహిరంగ ప్రదేశానికి వెళ్లాల్సి వస్తోంది. – రాజశేఖర్, 9వ తరగతి -
మాతృభాషలోనే మందులు
లక్ష్మణచాంద(నిర్మల్): అందరికీ అవసరమయ్యే ఔషధాల పేర్లను ప్రభుత్వం మాతృభాలోనే ముద్రిస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలై ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి తెలుగులో ముద్రించిన మందులు వస్తున్నాయి. తప్పిన ఆంగ్ల తిప్పలు.. చరిత్రలోనే నేటి వరకు ఔషధాల పేర్లు తెలుగులో ముద్రించిన దాఖలాలు లేవు. వైద్యులు మందుల చిట్టీపై ఆంగ్లంలో మందులు రాస్తే ఎవరికీ అర్థం కాని స్థితిలో ఉండేది. ప్రభుత్వం అందరికీ అర్థమయ్యలా రాయాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత మందులు కూడా తెలుగులో ముద్రితమై వస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మందుల పేర్లు అన్ని తెలుగులోనే ముద్రించాలని నిబంధన విధించిం ది. మాత్రలు, మందు సీసాలపై తెలుగులోనే ఔ షధ ఫార్ములా ముద్రించారు. అందువల్ల వైద్యులు కూ డా తప్పనిసరిగా జనరిక్ నామం రాయకతప్పడం లేదు. వైద్య, ఆరోగ్యశాఖపై ప్రత్యేక దృష్టి వల్ల నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖపై ప్రత్యేక దృష్టిని సారించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఇతరత్రా సౌకర్యాలను కల్పిస్తోంది. అలాగే ఔషధాల దుర్వినియోగం కాకుండా మందులను ఆన్లైన్లో నమోదు చేయిస్తోంది. తాజాగా ఔషధాల పేర్లు తెలుగులో ముద్రించడం ద్వారా కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లయిందని ప్రజలు పేర్కొంటున్నారు. 50 కంపెనీలు 500 రకాల ఔషధాలు.. ప్రభుత్వం ఇప్పటి వరకు అన్ని జిల్లాలోని జిల్లా ఆస్పత్రులకు, ప్రాథమిక ఆస్పత్రులకు 50 కంపెనీలకు చెందిన 500 రకాల మందులను సరఫరా చేస్తోంది. ఇందులో సాధారణ వ్యాధుల మందులతో పాటు ధీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే మందులు, వివిధ రకాల సిరప్లు, ఆయింట్మెంట్లు ఉన్నాయి. మందులపై అవగాహన పెరిగింది.. ఇంతకు ముందు మందుల పేర్లు ఆంగ్లంలో ఉండేవి. దీంతో మాలాంటి సామాన్యులకు అవేమీ అర్థం కాకపోయేవి. పలుకుదామంటే నోరు తిరిగేది కాదు. కానీ ప్రభుత్వం తెలుగులో మందుల పేర్లు ముద్రించడంతో మందులపై అవగాహన పెరిగింది. – మోహన్, తిర్పెల్లి సామాన్యులకు మేలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు చాలా వరకు మేలు జరిగింది. తెలుగులో మందుల పేర్లు ముద్రించడంతో వారే మందుల తెలుసుకుంటున్నారు. – మనోజ్ఞ, వైద్యులు, లక్ష్మణచాంద -
ఇక విద్యార్థులకు ‘బిర్యానీ’
వైరా/కొణిజర్ల : ప్రభుత్వం పాఠశాలల విద్యార్థలకు ఇక వేడి వేడి బిర్యానీ అందించనుంది. ప్రతి శనివారం వెజిటేబుల్ బిర్యానీ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆయా డీఈఓలను ఆదేశించారు. ఇటీవల రాష్ట్రంలో మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించిన కేంద్ర బృందం మెనూ మార్చాలని సూచించింది. దీనిలో భాగంగా ప్రతి శనివారం విద్యార్థులకు ఒక వెరైటీ బిర్యానీని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో గైర్హాజరీ శాతాన్ని తగ్గించి హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. మెనూలో మార్పులు చేస్తూ రుచికరమైన పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మండలంలో 20 గ్రామ పంచాయతీల పరిధిలో 48 పాఠశాలలున్నాయి. దానిలో జిల్లా పరిషత్ 9, ప్రాథమిక 27, ప్రాథమికోన్నత పాఠశాలలు 12 ఉన్నాయి. వాటితోపాటు ఒక్కోటి చొప్పున కేజీబీవీ, సాంఘిక సంక్షేమ గురుకులం, ఆదర్శ పాఠశాలలున్నాయి. మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 3,134 మంది విద్యార్థులు విద్యనభ్యస్తున్నారు. గతంలో వారానికి రెండు గుడ్లు, కూర గాయాలతో భోజనం అందించేవారు. అనంతరం గుడ్లను మూడుకు పెంచారు. మొదట దొడ్డు బియ్యంతో భోజనం అందించగా, కొద్ది రోజులుగా సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ప్రస్తుత మెనూ.. సోమవారం గుడ్డు, సాంబార్, మంగళవారం కూరగాయలు, బుధవారం పప్పు, కూరగాయలు, గుడ్డు, గురువారం సాంబార్, శుక్రవారం కూరగాయలు, గుడ్డు, శనివారం ఆకు కూర పప్పు ఇస్తున్నారు. అయితే.. ఇక నుంచి నెలలో మొదటి శనివారం బఠానీ పలాష్, కూరగాయలతో కుర్మా.. రెండో శనివారం కాబూలీ శనగలు, కూరగాయలతో బిర్యానీ అందిస్తారు. మూడో శనివారం మిల్ మేకర్ బిర్యానీ, కూరగాయల కుర్మా ఇవ్వనున్నారు. నాలుగో శనివారం మునక్కాయలు, పెసర పప్పుతో కిచిడి, చట్నీ.. వీటితో పాటు అన్నం టమాట, ఎండు బఠానీ కూర, పెసర పప్పులు, సోయా చిక్కుడు కూర అందించనున్నారు. విద్యార్థులకు వెజిటబుల్ బిర్యానీ పెట్టాలని మౌఖికంగా ప్రభుత్వం ఆదేశించింది. కాని విద్యాశాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదు. కొత్తమార్గదర్శ«కాలు రాగానే ప్రతి శనివారం కూరగాయాలు, బఠానీలు, శనగలు, మీల్మేకర్ తదితరాలతో చేసిన వెజిటబుల్ బిర్యానీ, కుర్మా, పెరగుచట్నీలతో కూడిన భోజనం అందించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలియజేసింది. ఈ మెను అమలు అయితే రోజువారీ భోజనం కంటే రుచికరంగా ఉండటం వల్ల ఎక్కువ మంది బాలబాలికలు భోజనం చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఈ మెను అమలు చేయడానికి ప్రస్తుతం అందిస్తున్న పారితోషికం సరిపోదని ఏజెన్సీల మహిళలు అంటున్నారు. ప్రభుత్వం రేట్లు పెంచాలని కోరుతున్నారు. ఆదేశాలు రాగానే అమలు చేస్తాం.. సాధారణ మెనూతో పాటు కొత్తగా విద్యార్థులకు కూరగాయలతో బిర్యానీని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు రాగానే అమలుకు చర్యలు తీసుకుంటాం. కె. వెంకటేశ్వరరావు, ఎంఈఓ, వైరా ఎటువంటి ఆదేశాలు రాలేదు.. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రతి రోజు మెను అమలు తీరు తెన్నులను పరిశీలిస్తున్నాం. వెజ్ బిర్యానీ పెట్టాలని ఆలోచన చేయడం మంచిదే. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే అమలు చేస్తాం. దీనివల్ల మండలంలో సుమారు 10 వేల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరుతుంది. – మోదుగు శ్యాంసన్, ఎంఈఓ, కొణిజర్ల -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
ఎర్రుపాలెం : ఈనెల 28 తేది నుంచి నిర్వహించనున్న పల్ప్పోలియో కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారి జి.రాజు సూచించారు. గురువారం మండలంలోని బనిగండ్లపాడు పీహెచ్సీలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు శిక్షణ నిర్వహించారు. వైద్యాధికారి రాజు మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటీకే 0–5 సంవత్సరాలలోపు గుర్తించిన 4460 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలన్నారు. అదే విధంగా ఈనెల 30 నుంచి వచ్చే నెల 13 వరకు గ్రామాల్లో కుష్టువ్యాధి నిర్మూలనకు ఇంటింటికి ఆశ కార్యకర్తలు వెళ్లి సర్వే నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో ఆరోగ్య విస్తరణాధికారి సదాశివరావు, హెల్త్ సూపర్వైజర్లు లంకా కొండయ్య, జయలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్స్ దండెం సాయిరెడ్డి, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. చింతకాని : ఈనెల 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ అనిత అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ, అంగన్వాడీ కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు. ప్రతిఒక్కరూ పోలియో చుక్కల కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. సమావేశంలో సీహెచ్ఓ మధుసూదన్రావు, సూపర్వైజర్లు జైపాల్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన గ్రామాల అభివృద్ధికి పెద్దపీట
ఎల్లారెడ్డిపేట : గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పీటీసీ తోట ఆగయ్య అన్నారు. వీర్నపల్లి మండలం గర్జనపెల్లి శివారులోని భిక్షపతి, పూనానాయక్, లచ్చయ్య తండాల్లో రూ.81 లక్షలతో నిర్మించనున్న బీటీరోడ్డు పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా గిరిజనులు అడవుల్లో దుర్భర జీవితాలు గడిపారన్నారు. వారి జీవితాల్లో మార్పు తేవడానికే ప్రభుత్వం తండాల మధ్య లింకురోడ్లు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ అందె సుభాష్, ఎల్సాని మోహన్కుమార్, ప్రభాకర్, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ కమల, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీరాంనాయక్, విఠల్, భాస్కర్, రాజిరెడ్డి, రవి, శేఖర్, తిరుపతి, బుగ్గయ్య పాల్గొన్నారు. -
జర్నలిస్టు సంక్షేమ నిధి లబ్ధిదారులకు ఫిబ్రవరిలో చెక్కులు
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరిలో చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా గతేడాది 71 మందికి, తర్వాత 30 మందికి ఈ సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. బుధవారం తెలుగు వర్సి టీలో తెలంగాణ మీడియా అకాడమీ పాలక మండలి సమావేశంతో పాటు జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశం నిర్వహించారు. సంక్షేమ నిధి ఆర్థిక సాయం కోసం వచ్చిన దరఖాస్తులను ఈ సందర్భంగా కమిటీ ఆమోదించింది. ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్ జర్నలిస్టులకు ప్రత్యేక శిక్ష ణా తరగతులు, మోనోగ్రాఫ్స్ తదితర అంశాలపై పాలకమండలి సభ్యులు ఆమోదం తెలిపారు. -
పొగచూరిన బతుకులు!
నంద్యాలటౌన్: బీడీ కార్మికుల బతుకులు రోజురోజుకు దీన స్థితికి చేరుకుంటున్నాయి. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కుటుంబమంతా కష్టపడి బీడీలు చుట్టినా తగినంత కూలి రావడం లేదు. దీంతో కటుంబపోషణ, పిల్లల చదువులు భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సహాయం, సంక్షేమ పథకాలు అందకపోడవడంతో ఆర్థిక ఇబ్బందులతో తమతమవుతున్నారు. పట్టణంలో బీడీలు తయారు చేసే మూడు కుటీర పరిశ్రమలు ఉన్నాయి. బీడీ తయారీకి కావాల్సిన ఆకు, పొగాకు, లేబుళ్లను, బస్తాల రూపంలో కార్మికులకు అందజేస్తారు. ఈ ముడిసరుకులను తీసుకొని కార్మికులు తమ ఇళ్ల వద్దనే బీడీలు తయారు చేస్తారు. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్, శ్రీనివాససెంటర్, ఖలీల్థియేటర్, ముల్లాన్పేట, వీసీకాలనీ తదితర ప్రాంతాల్లోని దాదాపు 500 మంది బీడీలు చుట్టుతూ జీవనం సాగిస్తున్నారు. కష్టానికి దక్కని ప్రతిఫలం... ఏజెన్సీలు కార్మికులకు వెయ్యి బీడీలు తయారు చేస్తే రూ.100 నుంచి రూ.150 వరకు కూలీ చెల్లిస్తున్నారు. దీంతో ఓ కుటుంబం మొత్తం రోజంతా కష్టపడినా రోజుకు వెయ్యి బీడీల కన్నా ఎక్కువ చుట్టలేమని కార్మికులు చెబుతున్నారు. దీంతో చాలీచాలని కూలిలతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నా మని వాపోతున్నారు. పిల్లల చదువులు కూడా భారంగా మారడంతో మధ్యలోనే ఆపివేసి పనులకు పంపాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని పాలకులు బీడీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం, నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు ఆరోగ్య పథకాలు, రుణాల మంజూ రు, పక్కా గృహాలు, తదితర పథకాలతో ఆదుకునే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. కూలీ గిట్టుబాటు కావడం లేదు కుటుంబ పోషణ కోసం బీడీలు చుడుతున్నా. ఈ పని తప్ప వేరే పని తెలియదు. రోజుకు 500 నుంచి 700 వరకు బీడీలు చుడుతాను. రోజుకు రూ.100 కూడా గిట్టడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారుతుంది. – నూర్జహాన్, నంద్యాల ప్రభుత్వం ఆదుకోవాలి బీడీ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ప్రభుత్వం ఎలాంటి రుణాలు, సంక్షేమ పథకాలు అందజేయడం లేదు. ఇతర వృత్తుల కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. – ఫాతిమాబీ, కార్మికురాలు, నంద్యాల -
నేడు హజ్ యాత్రికుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్ : హజ్ యాత్రికుల 2018 ఎంపికకు సంబంధించిన కంప్యూటరైజ్డ్ డ్రా పద్ధతిని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గురువారం నాంపల్లి హజ్హౌస్లో ప్రారంభించనున్నట్లు హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు 17,146 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 70 ఏళ్లకు పైబడిన కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న 508 మందిని నిబంధనల ప్రకారం డ్రా లేకుండా నేరుగా ఎంపిక చేశామని తెలిపారు. ఈ ఏడాది సౌదీ ప్రభుత్వం దేశ హజ్ కోటాలో 5 వేలు పెంచడంతో రాష్ట్ర కోటాలో 300 వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. వరుసగా మూడేళ్లు యాత్రకు దరఖాస్తు చేసుకున్నా డ్రాలో ఎంపిక కానివారిని నాలుగోసారి నేరుగా ఎంపిక చేసే కేటగిరీని కేంద్ర హజ్ కమిటీ రద్దు చేసిందని తెలిపారు. దీంతో ఈ ఏడాది ఎక్కువ మందికి డ్రా ద్వారా యాత్రకు వెళ్లే అవకాశం దక్కనుందని పేర్కొన్నారు. -
ఇంటర్ కాలేజీలకు 13 నుంచి సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఈ నెల 13 నుంచి 15 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. కాలేజీలను 16న పునఃప్రారంభించాలని సూచించింది. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ.అశోక్కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. -
‘గ్రేడింగ్’పై వెనక్కి!
⇒ కేవలం గ్రేడింగ్ మాత్రమే ⇒ అమలు చేయడం కష్టమే ⇒ జేఈఈలో 75 శాతం మార్కుల నిబంధనతో సమస్యలు ⇒ ర్యాంకుల ఖరారులో వెయిటేజీతో ఇబ్బందులు ⇒ కొందరి మార్కులు వెల్లడించాల్సి వస్తే ఎలాగన్న సందేహాలు ⇒ సాధ్యాసాధ్యాలపై ⇒ మళ్లీ కమిటీ పరిశీలన సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులను మార్కుల ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు, కార్పొరేట్ యాజమాన్యాల అడ్డగోలు ప్రచారానికి తెరవేసేందుకు అమల్లోకి తేవాలని నిర్ణయించిన గ్రేడింగ్ విధానంపై ఇంటర్మీ డియట్ బోర్డు వెనకడుగు వేస్తోంది. ప్రభుత్వం కూడా దీనిలోని ఇబ్బందులు, సందేహాలను లేవనెత్తడంతో గ్రేడింగ్ విధానం అమలును విరమించు కునే అవకాశం కనిపిస్తోంది. తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు, విద్యావేత్తలు, అధికారులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డు సలహా కమిటీ సిఫార్సు మేరకు ఇంటర్ బోర్డు గ్రేడింగ్ విధానం అమలుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. వాటిని పరిశీలించిన ఉన్నతాధికారులు గ్రేడింగ్ అమలుతో తలెత్తే సమస్యలు, సందేహాలను లేవనెత్తారు. ప్రస్తుతం దేశంలో తెలంగాణ, ఏపీలతోపాటు ఐదారు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు మార్కులను మాత్రమే ఇస్తుండగా.. సీబీఎస్ఈతోపాటు మరికొన్ని రాష్ట్రాల బోర్డులు మార్కులతోపాటు గ్రేడ్లను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం గ్రేడింగ్ మాత్రమే ఎలా అమలు చేస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. కమిటీ నివేదిక తరువాత తుది నిర్ణయం గ్రేడింగ్ విధానంపై సందేహాలు వస్తున్న నేపథ్యంలో.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గ్రేడింగ్ విధానాన్ని సిఫారసు చేసిన కమిటీకే ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి సమాధానాలను సూచించడంతోపాటు అసలు గ్రేడింగ్ సాధ్యాసాధ్యాలను తేల్చే పని అప్పగించారు. అయితే ప్రభుత్వం లేవనెత్తిన అంశాలకు తగిన పరిష్కారాలు లేవని, అందువల్ల గ్రేడింగ్పై వెనక్కి తగ్గే పరిస్థితి ఉందని ఇంటర్ బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కమిటీ తమ తుది నివేదికను ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇంటర్ బోర్డు ప్రతిపాదనలివీ.. ఎంసెట్ తుది ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండటం, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు పొందేవారు జేఈఈ ర్యాంకుతోపాటు ఇంటర్లో 75 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం) ఉండాలన్న నిబంధన నేపథ్యంలో ఇంటర్ బోర్డు మూడు రకాల ప్రతిపాదనలు చేసింది. 1. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు వెయిటేజీని తొలగించి.. ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టడం. 2. మార్కులకు బదులు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవడం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లను బట్టి వెయిటేజీని లెక్కించడం. 3. విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా, బోర్డు వద్ద మార్కులు ఉంటాయి. కాబట్టి ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ ఇవ్వడం. అలాగే జేఈఈ, అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించే సీబీఎస్ఈ, ఐఐటీలకు మా ర్కుల జాబితాలు అందజేయడం.. అయితే ఈ మూడు రకాల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ‘గ్రేడింగ్’పై సందేహాలివీ.. ► ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో విద్యార్థుల మధ్య పోటీ ఒకటీ రెండు మార్కుల వ్యత్యాసంతోనే ఉంటుంది. ఉదాహరణకు నలుగురు విద్యార్థులకు జేఈఈలో మంచి ర్యాంకు వచ్చి, ఆ నలుగురికీ ఇంటర్లో 70–79 శాతం గ్రేడ్ ఉంటే.. ఎవరికి ఎక్కువశాతం మార్కులు ఉన్నాయన్నది తెలియదు. సీబీఎస్ఈకి మార్కులు ఇచ్చినా విద్యార్థుల్లో సందేహాలు తలెత్తుతాయి. అలాంటపుడు వారి అనుమానాల నివృత్తి ఎలాగనే సందేహాలు తలెత్తుతున్నాయి. ► సందేహం వ్యక్తం చేసిన విద్యార్థులకు మార్కులను ఇచ్చి, మిగతావారికి ఇవ్వకపోవడం కుదరదు. ► ఎంసెట్లో వెయిటేజీ కోసం మార్కులు ఇచ్చినపుడు విద్యార్థులకు ఎందుకు ఇవ్వరనేదానిపై న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ► తక్కువ గ్రేడ్ వచ్చిన వారు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాయాలంటే ఎలా? రాసినా ముందు ఎన్ని మార్కులు వచ్చాయి, ఇప్పుడెన్ని పెరిగాయనేది తెలిసేదెలా? అన్న సందేహాలు వస్తున్నాయి. -
12 నుంచి 16 దాకా సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 12 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులుంటాయని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. జనవరి 17న తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ మేరకు జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
బీజింగ్లో భారీగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
బీజింగ్ : ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను చైనా ప్రభుత్వం భారీగా ఏర్పాటు చేస్తోంది. చైనా రాజధాని నగరం బీజింగ్లోనే లక్షా 12 వేలకు పైగా ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వం కూడా ఓ యాప్ను కూడా లాంచ్ చేసింది. దాని వల్ల డ్రైవర్లకు దగ్గరలో ఎక్కడ ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయో తెలుస్తోంది. చైనాలో క్రమేపీ విద్యుత్ వాహనాలు పెరగడంతో చార్జింగ్ స్టేషన్లను కూడా పెంచవలసి వస్తోంది. కనీసం 50 లక్షల విద్యుత్ వాహనాలకు సరిపోయేలా ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును పంచవర్ష ప్రణాళిక(2016-2020) లక్ష్యాల్లో పెట్టుకుంది. అలాగే వాహన తయారీదారులు 2019 నుంచి కనీసం 10 శాతం విద్యుత్ వాహనాలు విడుదల చేసే విధంగా మార్గదర్శకాలు రూపొందించింది. క్రమేపీ విద్యుత్ వాహనాల తయారీ పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలను నిషేధిస్తామని చైనా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెల్సిందే. ప్రకటన వెలువడిన 11 నెలల నుంచి చైనాలో ఇప్పటి వరకు విద్యుత్ వాహనాలు వాడకం 6 లక్షల యూనిట్లకు చేరుకుంది. దానికి తగ్గట్టే ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల కొనుగోలు పై సబ్సిడీ కూడా ప్రకటించింది. -
పన్ను మినహాయింపులో వారికి భారీ ఊరట?
సాక్షి, న్యూఢిల్లీ: పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుందా? తాజా నివేదికల ప్రకారం ఆదాయ పన్ను మినహాయంపులో పెన్షనర్లకు భారీ ఉపశమనం లభించనుంది. రూ.5లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చే అంశాన్ని ఆర్థికమంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. 2018 కేంద్రబడ్జెట్లో ఈ అంశాన్ని చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇటీవల చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ఆర్థికమంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆయనకు ఒక లేఖ రాసింది. పెన్షనర్లకు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలనే ప్రతిపాదనను వచ్చే 2018 బడ్జెట్ నాటికి పరిశీలిస్తామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. 2018ఆర్ధిక బిల్లులో దీని ఫలితాన్ని ప్రతిబింబించే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం వచ్చే పెన్షనర్లను ఆదాయ పన్నునుంచి మినహాయించాలనే తన అభ్యర్ధనకు ప్రభుత్వంనుంచి కొంత-ప్రోత్సాహక ప్రత్యుత్తరం వచ్చిందంటూ థరూర్ ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నెక్ట్స్ బడ్జెట్లో ఈ అంశాన్ని చేరుస్తారనే ఆశాభావాన్ని వయక్తం చేశారు. ప్రస్తుతం 60 నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న సీనియర్ పౌరుడు అయిన పింఛనుదారుడుకి లభిస్తున్న ఆదాయం పన్ను మినహాయింపు రూ 3లక్షలు. పెన్షన్తో సహా మొత్తం ఆదాయం రూ.5 లక్షలు మించకపోతే, 80 ఏళ్లకు పైబడిన పింఛనుదారుడు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయాలని శశి థరూర్ నవంబర్ 14 న కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని ప్రస్తుత నిబంధనలకు సవరణ చేయాలని కూడా ఆయన ప్రతిపాదించారు. కాగా 2018 కేంద్ర బడ్జెట్ కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి మొదటి వారంలో పార్లమెంటుకు సమర్పించనున్నారు. -
డెడ్లీ గేమ్పై చేతులెత్తేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ సూసైడ్ గేమ్ 'బ్లూ వేల్ చాలెంజ్' పై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భారత్ సహా పలు దేశాల్లో చిన్నారులతోపాటు, యువత ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆన్లైన్ గేమ్ను నిషేధించలేమని కేంద్రం సోమవారం సుప్రీకోర్టుకు తెలిపింది ఎన్క్రిప్టెడ్ లింక్స్ ద్వారా ఒకరి-నుంచి మరొకరికి కమ్యూనికేట్ అవుతోందని..కనుక దీన్ని బ్యాన్ చేయడం కష్టమని సుప్రీం ముందు నివేదించింది. ఫేస్బుక్, గూగుల్ లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు కూడా ఈ విషయంలో నిస్సహాయతను ప్రకటించాయని తెలిపింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, ఖాన్ వికార్, చంద్రచూడ్లతో కూడిన బెంచ్ ముందు కేంద్ర తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదన వినిపించారు. అనేకమంది యవతీ యువకుల ప్రాణాలను బలిగొన్న గేమ్ను బ్లాక్ చేయలేమంటూ కేంద్రం నిస్సహాయతను వ్యక్తం చేసింది. అనేకమంది శాస్త్రవేత్తలు, టెక్ నిపుణులు, ఇంటర్నెట్ , సోషల్ మీడియా కంపెనీలతో తీవ్రంగా చర్చించినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం అంతు చిక్కలేదని స్పష్టం చేసింది. ఎన్క్రిప్టెడ్ సీక్రెట్ కమ్యూనికేషన్స్ లింక్స్ ద్వారా ఇది విస్తరిస్తోందని అందుకే ఈ గేమ్ను గుర్తించడం, అడ్డగించడం, విశ్లేషించడం కష్టంగా ఉందని తెలిపింది. రష్యాలో పుట్టి ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న మృత్యు క్రీడ బ్లూవేల్పై దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగింది. దీంతో ఈ క్రీడను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని స్వీకరించిన సుప్రీం నిషేధ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. అలాగే ఈ డెడ్లీ గేమ్పై పూర్తి అవగాహన కల్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
మోదీ మరో మెగా మిషన్ ఇదేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం మరో మెగామిషన్ను పక్రటించనుందట. ఈజ్ ఆఫ్ బిజినెస్లో భారత్ 30 ర్యాంకులు ఎగబాకడం, అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్ బూస్ట్తో జోష్ మీద ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం మరో మెగా మిషన్కు సన్నద్ధమవుతోంది. డీమానిటైజేషన్, జీఎస్టీ, ఆధార్ అనుసంధానం లాంటి సంస్కరణల తరువాత మరో కీలక చర్యపై దృష్టిపెట్టింది. ఒకవైపు ఆధార్ అనుసంధానంపై వివాదం కొనసాగుతుండగానే.. 1 బిలియన్ , 1 బిలియన్, 1 బిలియన్ కనెక్టివిటీపై దృష్టి పెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అంటే 100కోట్ల ఆధార్ నంబర్లతో 100కోట్ల బ్యాంకు ఖాతాల అనుసంధానం, 100 కోట్ల మొబైల్స్ లింకింగ్.. ఇదే కేంద్ర సర్కార్ నెక్ట్స్ టార్గెట్. పెద్దనోట్ల రద్దు తర్వాత అధికంగా నమోదవుతున్న బ్యాంక్ ఖాతాలు, పుంజుకుంటున్న డిజిటల్ లావాదేవీల నేపథక్యంలో ప్రభుత్వం ఈ లక్ష్యంపై దృష్టి పెట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1 + 1 +1 ప్లాన్ తొందర్లనే ప్రకటించవచ్చని ప్రభుత్వ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఆర్థిక, డిజిటల్ సేవల విస్తరణలో ఇది పెద్ద ముందుడుగు భావిస్తున్నాయి. -
మధ్యమానేరుకు గండి ప్రభుత్వ వైఫల్యమే
కాంట్రాక్ట్ అప్పగింతలో ముందుచూపు కరువు నష్టపోయిన పంటలకు పరిహారమివ్వాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కుమార్, రాష్ట్ర కార్యదర్శి నగేశ్ మిడ్మానేరును సందర్శించిన నాయకులు బోయినపల్లి : మధ్యమానేరు ప్రాజక్టుకు గండిపడడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపెల్లి కుమార్ విమర్శించారు. మంగళవారం మిడ్మానేరును రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కే.నగేశ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వారికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రాజెక్టుపై స్పష్టమైన అవగాహన లేదన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా సర్కారు స్పందించకపోవడం శోచనీయమన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి బినామీలకు పనులు అప్పగించడంతో గండి పడి ప్రజాధనం వృథా అయ్యిందని విమర్శించారు. గండితో పంటలు కోల్పోయిన బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నగేశ్ మాట్లాడుతూ సామర్థ్యానికి మించి నీటిని నిల్వ చేయడంతోనే గండి పడిందన్నారు. మాన్వాడ గ్రామాన్ని పూర్తి ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్బాబు, రాష్ట్ర యువత కార్యదర్శి దుబ్బాక సంపత్, జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేని వేణుమాధవరావు, గినుకొండ రామకృష్ణారెడ్డి తదితరులున్నారు. -
మొద్దు నిద్రలో ప్రభుత్వం
– మంత్రులుగా కామినేని, నారాయణ ఫెయిల్ – డెంగీ సోకిన ఆరు నెలలకు మేల్కొంటారా? – ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం నగరి: ప్రజలు అనారోగ్యంతో అల్లాడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఎమ్మెల్యే ఆర్కేరోజా మండిపడ్డారు. నగరి మున్సిపాలిటీలో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఇది దొంగలు పడి దోచుకెళ్లిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు.. డెంగీ, విష జ్వరాలతో జనం ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఇప్పుడు మేల్కొందని విమర్శించారు. వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వెనక తిరగడానికే సమయం సరిపోతోందన్నారు. అనంతపురంలో డెంగీ వ్యాధితో ఇద్దరు చిన్నారులు చనిపోతే హెల్త్ ఎమర్జెన్సీ విధించారని ఆ జిల్లాకు ఇన్చార్జి మంత్రి, డాక్టర్ అయిన ఆయన జిల్లాకు వెళ్లి పరిస్థితులను పరిశీలించలేదన్నారు. ఆయన నిజమైన డాక్టరా ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ లాంటి డాక్టరా అనే సందేహం కలుగుతోందని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ నగరి నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఆయన కనీసం అడుగు కూడా పెట్టలేదన్నారు. పారదోలండి అంటే దోమలు పారిపోవని పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి కావలసిన నిధులు మంజూరు చేసి, తగినంతమంది సిబ్బందిని నియమించాలని హితవు పలికారు. దోమలపై దండయాత్ర అంటూ ర్యాలీలు చేయడంతోనే దోమలను అరికట్టలేమన్నారు. మంత్రులుగా ఫెయిల్ అయిన కామినేని, నారాయణ వారి పదవులకు రాజీనామా చేయాలన్నారు. -
మెట్రో పనుల్లో జాప్యం అందుకేనా?
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ ప్రారంభంపై నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వం నుంచి మరిన్ని రాయితీలు,ప్రోత్సాహకాలు ఆశించి ప్రారంభాన్ని మరింత ఆలస్యం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాగోల్–మెట్టుగూడా(8కి.మీ),మియాపూర్–ఎస్.ఆర్.నగర్(12 కి.మీ)మార్గంలో మెట్రో మార్గం పూర్తయ్యింది. ఈ రెండు రూట్లలో అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వాణిజ్య కార్యకలాపాల ప్రారంభానికి సంస్థ వర్గాలు ముందుకు రాకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 2011లో కుదిరిన నిర్మా ణ ఒప్పందం ప్రకారం ఎల్భీనగర్–మియాపూర్,నాగోల్–రహేజా ఐటీపార్క్,జేబీఎస్–ఫలక్నుమా మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మెట్రో మార్గాన్ని 2017 జూన్ లోగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే రైట్ఆఫ్వే అనుకున్న సమయానికి దక్కకపోవడం, ట్రాఫిక్ అనుమతులు, ఆస్తుల సేకరణ ప్రక్రియలో జాప్యం, కోర్టు కేసుల కారణంగా 2018 డిసెంబర్కు ప్రాజెక్టు గడువు ను పొడిగించారు. దీంతో యంత్రసామాగ్రి అద్దెలు, పెట్టుబడి, వడ్డీలతో కాంట్రాక్టు సంస్థపై సుమారు రూ.3 వేల కోట్ల అదనపు భారం పడినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని.. లేని పక్షంలో ఆ మేరకు రాయితీలు కల్పించాలని పట్టుబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే ఒప్పందానికి సవరణలు చేయాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. అయితే ఎల్అండ్టీ కోర్కెలను తీర్చేందుకు సర్కారు పెద్దలు అంగీకరించకపోవడం తో సయోధ్య కుదరక ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. జేబీఎస్–ఫలక్నుమా(కారిడార్–2) మార్గం లో ఎంజీబీఎస్–ఫలక్నుమా(5.3 కి.మీ)మార్గంలో అలైన్మెంట్ మార్పుపై సర్కారు ఎటూ తేల్చకపోవడంతో ఈరూట్లో పనులు ప్రారంభం కాలేదు. ఈ లెక్క న పాతనగరానికి మరో రెండేళ్లు ఆలస్యంగా మెట్రో రైళ్లు వెళ్లడం ఖాయమని సంకేతాలు వెలువడుతున్నా యి. ప్రస్తుతం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గానికి గాను.. 56 కి.మీ మార్గంలో మెట్రో పిల్లర్ల ఏర్పాటు, 47 కి.మీ మార్గంలో పిల్లర్లపై ట్రాక్ ఏర్పాటుకు అవసరమైన వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పనులు పూర్తయినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. దసరాకు ప్రారంభంపై వీడని సస్పెన్స్... ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మియాపూర్–ఎస్.ఆర్.నగర్,నాగోల్–మెట్టుగూడా మార్గాల్లో దసరాకు మెట్రో రైళ్ల రాకపోకలు సాగిస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఇటు సర్కారు పెద్దలు అటు హెచ్ఎంఆర్,ఎల్అండ్టీ వర్గాలు మాత్రం తొలిదశ ప్రారంభ తేదీపై పెదవి విప్పకపోవడం గమనార్హం. వారి తీరు ఎవరిదారి వారిదే అన్న చందంగా మారడంతో గ్రేటర్ సిటీజన్లు నిరాశకు లోనవుతున్నారు. పార్కింగ్..మినీ బస్సుల రాకపోకలపైనా అదే తీరు.. నాగోల్–మెట్టుగూడా,మియాపూర్–ఎస్.ఆర్.నగర్ రూట్లలో మొత్తం 20 కి.మీ మార్గంలో మెట్రో మార్గం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ రూట్లలో ఉన్న 16 మెట్రో స్టేషన్లలో అవసరమైన పార్కింగ్ వసతులు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. మరోవైపు ప్రయాణీకులకు వీలుగా మినీ బస్సులు అందుబాటు లో లేకపోవడం గమనార్హం. కాగా నిర్మాణ ఒప్పం దంలో మొత్తం మూడు కారిడార్లలో ఏర్పాటు కానున్న 65 స్టేషన్లలో ప్రతి స్టేషన్కు విధిగా పార్కింగ్ వసతులు, స్టేషన్లకు సమీపంలో ఉండే కాలనీలకు మినీ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో నేటికీ స్పష్టత కొరవడడం గమనార్హం. -
పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి
చెన్నూర్ : ప్రభుత్వం బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్లు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇటీవల ప్రభుత్వం తొలగించిన అంగన్వాడీ కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కషి చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీలను శనివారం అంగన్వాడీలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మాట్లాడారు. ప్రభుత్వానికి ఏ ఉద్యోగిని తొలగించాలనే ఉద్దేశం లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తే వేటు పడుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, ఎంపీపీ మైదం కళావతి, సర్పంచ్ సాధనబోయిన కష్ణ, ఎంపీడీవో మల్లేశం, సీడీపీవో మనోరమ, వేమనపల్లి జెడ్పీటీసీ సంతోశ్కుమార్, సూపర్వైజర్లు పవిత్ర, భారతి, సల్మా, నిర్మల పాల్గొన్నారు. -
దసరా నుంచే పాలన
అవసరం మేరకు సంక్షేమ కార్యాలయాలు అధికారులతో సీఎస్ రాజీవ్శర్మ సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : నూతన జిల్లాలతోపాటు కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా దసరా నుంచే పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరాన్ని బట్టి సంక్షేమ శాఖల డివిజన్ కార్యాలయాలనూ ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవో, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, సబ్ ట్రెజరీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కార్యాలయాలకు అధికారులను నియమించి దసరా రోజు ప్రారంభం కావాడానికి సిద్ధం చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి మండలంలో మండల రెవెన్యూ అధికారి, ఓఎస్డీ, అభివృద్ధి అధికారులు, మండల విద్యాధికారి, వ్యవసాయ అధికారి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటుకు ప్రతిపాదించిన మండలాల విస్తీర్ణం, జనాభా, ఆ ప్రాంతం, ప్రత్యేక లక్షణాలను ప్రభుత్వానికి తెలపాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన జిల్లాలోని, డివిజన్లు, మండలాలలో కార్యాలయాల ఏర్పాటుతోపాటు అధికారులు, సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. జిల్లాలో నూతన మండలాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సంజీవరెడ్డి, సీపీవో కేశవరావు, డీఎంహెచ్వో జలపతినాయక్, కలెక్టరేట్ ఏవో అరవింద్ కుమార్, పర్యవేక్షకులు సుశీల, సంజయ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
సర్పంచ్లకేదీ గౌరవం?
పదినెలలుగా అందని వేతనాలు నిధుల విడుదలలో సర్కారు జాప్యం పెగడపల్లి : ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలన్నా.. గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా సర్పంచులదే కీలకపాత్ర. గ్రామప్రజలకు సేవ చేస్తున్నందుకుగాను గతంలో సర్పంచులకు నెలనెలా రూ.1500లను ‘గౌరవవేతనం’ కింద అందేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక.. ఆ మెుత్తాన్ని రూ.ఐదు వేలకు పెంచింది. కానీ.. ఆ వేతనాలను మాత్రం నెలనెలా విడుదల చేయడంలో నిర్లక్ష్యం చూపుతోంది. ఫలితంగా సర్పంచులు నిరాశకు గురవుతున్నారు. పెంచిన గౌరవ వేతనాన్ని సర్కారు 2015 సెప్టెంబర్ వరకు మాత్రమే అందించింది. అప్పటి నుంచి జూలై 2016 వరకు (10 నెలల) వేతనాలు అందాల్సి ఉంది. పంచాయతీల ప్రథమపౌరులమైన తమపట్ల సర్కారు చిన్నచూపు చూస్తోందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. గౌరవవేతనాలు సకాలంలో చెల్లించకుండా అగౌరవ పరుస్తోందని పేర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నా వేతనాలు ఇవ్వకుండా నిరాశ పరుస్తోందంటున్నారు. -
‘లక్ష్మీ’ కటాక్షమెప్పుడో..?
బీసీ, ఈబీసీలకు అందని కల్యాణలక్ష్మి డబ్బులు నిధులున్నా నిష్ప్రయోజనం ఆందోళనలో లబ్ధిదారులు ఆదిలాబాద్ రూరల్ : దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న బీసీ, ఈబీసీ కులాలకు చెందిన యువతుల వివాహ సందర్భంగా ప్రభుత్వం సహాయం అందించేందుకు ఉద్దేశించిందే కల్యాణ లక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లి సందర్భంగా ప్రభుత్వం రూ.50,000 అందిస్తుంది. ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సహాయం అందడం లేదు. కల్యాణలక్ష్మి వర్తిస్తుందని కలలు కన్న ఆడపిల్లల తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. పథకం ప్రకటించి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ లబ్ధిదారుల ఖాతాలోకి నగదు జమ కావడం లేదు. ప్రభుత్వం మార్గదర్శకాలను సరిగా సూచించకపోవడం, అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో జాప్యం చేయడమే పథకం ప్రజలకు చేరువకాకపోవడానికి గల కారణాలని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి... గతంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు కల్యాణ లక్ష్మి, మైనార్టీలకు షాదీముబారక్ పేరుతో పథకాలను ప్రారంభించింది. పథకం అమలులో అవినీతి, అక్రమాలు జరిగాయని ఏసీబీ తేల్చడంతో బీసీల విషయంలో అలా జరగకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వం సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా అందించాలని నిర్ణయించింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో ఆదిలాబాద్లో బీసీలు 159, ఈబీసీలు 03, జైనథ్ మండలంలో బీసీ 99, బేల మండలంలో 63, మొత్తం 324 మంది వివాహం చేసుకున్న యువతులు కల్యాణ లక్ష్మి పథక లబ్ధి కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మంజూరుకు తమ కార్యాలయానికి వచ్చిన్నట్లు అధికారుల రికార్డులు పేర్కొంటున్నాయి. ఇవే కాకుండా మరిన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వం పేరు కోసం పథకాలను ప్రకటించి అమలు మరిచిపోతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి, లబ్ధిదారులకు అందజేయాలని కల్యాణలక్ష్మి లబ్ధిదారులు కోరుతున్నారు. -
స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
తెలంగాణ రాష్ట్ర జువైనల్ బోర్డు సలహాదారురాలు జి.రోషి జ్యోతినగర్: స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వారు ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర జువైనల్ బోర్డు సలహాదారురాలు జి.రోషి అన్నారు. శనివారం ఎన్టీపీసీ రామగుండం సాయి సామాజిక భవనంలో ప్రేమ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ స్వచ్ఛంద సంస్థల శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. ఆశ్రమాలు నిర్వహిస్తున్నవారు పాటించవలసిన అంశాలను తెలియజేశారు. ప్రభుత్వపరంగాఎన్జీవోలకు కలిగే సౌకర్యాలను వివరించారు. ఇష్టానుసారంగా స్వచ్ఛంద సంస్థలను నిర్వహించరాదన్నారు. అనంతరం వృద్ధుల ఆశ్రమానికి మంచాలు, పరుపులను అందజేశారు. ట్రస్టు నిర్వాహకులు స్వప్నా, సీఎస్సార్ డెప్యూటీ మేనేజర్ ఆకుల రాంకిషన్, ఎన్వైపీ రాష్ట్ర అధ్యక్షుడు యాదవరాజు, రహమత్పాషా, వెంకటేష్, లింగమూర్తి, సాయికృష్ణ, లింగమూర్తి, శ్యాం, ఓంకార్తో పాటు వివిధ సంఘాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
ఎన్నికల హామీలు విస్మరించిన టీఆర్ఎస్
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ సిరిసిల్లలో వైఎస్సార్ సీపీలో చేరికలు సిరిసిల్ల : ఎన్నికల హామీలు టీఆర్ఎస్ విస్మరించిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ విమర్శించారు. సిరిసిల్లలో శనివారం గుంటుక సంపత్ ఆధ్వర్యంలో 50 మంది వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. అట్టహాసంగా ప్రకటించి డబుల్బెడ్రూమ్ ఇళ్ల పథకంలో ఒక్క ఇంటిని కూడా పేదవాడికి నిర్మించి ఇవ్వలేదన్నారు. అర్హులకు పింఛన్లు రావడం లేదని, దళితులకు మూడెరాలు కలగానే మిగిలిందన్నారు. కేజీ టు పీజీ విద్యను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. మహిళలకు పావలా వడ్డీ రావడం లేదని, రైతుల రుణమాఫీ నిలిచిపోయిందన్నారు. పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల యాదగిరి, సిరిసిల్ల మండల అధ్యక్షుడు చొక్కాల రాము, పార్టీ నాయకులు దేవరనేని వేణుమాధవరావు, వంగరి అనిల్, కొంపెల్లి విష్ణు, బూర నాగరాజు, వరాల శ్రీనివాస్, చింతల అశోక్, కొత్వాల్ రవి, స్వర్గం బాలమణి, సాన రాజయ్య, ఉషకోళ్ల లక్ష్మి పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కోసం ఆర్డీవోకు వినతి సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు పట్టణంలో ర్యాలీ తీశారు. అనంతరం ఆర్డీవో శ్యామ్ప్రసాద్లాల్కు వినతిపత్రం అందించారు. సిరిసిల్లను జిల్లా చేయాలని కోరారు. -
జిల్లాకు ఐదు డయాలసిస్ యూనిట్లు
కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, రామగుండం ఆసుపత్రుల్లో ఏర్పాటు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికే మొగ్గు టెండర్లను ఆహ్వానించిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందులో ఐదు యూనిట్లను మన జిల్లాకు కేటాయించింది. జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు సిరిసిల్ల, జగిత్యాల, గోదావరిఖని ఏరియా ఆసుపత్రిల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆసుపత్రుల్లోనే ప్రత్యేకంగా కేటాయించే గదుల్లో డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా ఆసుపత్రులకు వచ్చే కిడ్నీ రోగులకు నిర్ణీత సమయాల్లో డయాలసిస్ సేవలందిస్తారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను రూపొందించింది. ఆయా ఆసుపత్రుల్లో డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి ఈ–టెండర్లు పిలిచింది. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ పరంగా ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా లేదు. కిడ్నీ రోగులకు ఇది ఆశనిపాతమైంది. జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో లేదా హైదరాబాద్ ఆసుపత్రుల్లో వ్యయప్రయాసలకోర్చి డయాలసిస్ చేయించుకుంటున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వం తెలంగాణలో ప్రతి 30 నుంచి 35 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీనికయ్యే ఖర్చును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ డయాలసిస్ కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించడంతోపాటు ఈ మేరకు ఆసక్తి కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లను పిలిచింది. సాధ్యమైనంత త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి డయాలసిస్ కేంద్రాలను రోగులకు అందుబాటులోకి తెస్తామని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. మరోవైపు జిల్లాలో ఇటీవల కాలంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఏటా వేలాది మంది కిడ్నీలు చెడిపోయి మంచం పడుతున్నారు. వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకోవడం తలకు మించిన భారమవుతోంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రోగులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇందులో డయాలసిస్ చికిత్సను పూర్తిగా ఉచితంగా చేస్తారా? లేక నామమాత్రపు చార్జీలు వసూలు చేస్తారా? అనే దానిపై అధికారుల్లో స్పష్టత లేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నందున చార్జీలు వసూలు చేసే అవకాశాలు లేకపోలేదని సమాచారం. -
డ్రాఫ్ట్ సిద్ధం
విభజనపై తుది కసరత్తు సోమవారంలోగా సమగ్ర నివేదికలు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశం ప్రతీ శాఖలో ఫైలును నంబరింగ్ చేస్తున్న వైనం నేడు హైదరాబాద్ అఖిలపక్ష సమావేశం ముకరంపుర : జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. కొత్త జిల్లాల సంఖ్య ఖరారు కావడంతో వాటి భౌగోళిక స్వరూపం, సరిహద్దులపై తుది కసరత్తు చేస్తోంది. జిల్లాలో కరీంనగర్, జగిత్యాలతోపాటు అనూహ్యంగా పెద్దపల్లి జిల్లాలను ఏర్పాటు చేసేందుకు డ్రాఫ్ట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అందుకు అవసరమైన అన్ని వివరాలను సిద్ధం చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాల స్వరూపం, జనాభా, మండలాల చేర్పుల వివరాలను జిల్లా అధికారులు క్రోడీకరిస్తున్నారు. భౌగోళిక స్వరూపం, సరిహద్దులను నిర్ధారించుకుని అందుకనుగుణంగా మ్యాపులను రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలను సోమవారంలోగా పంపించాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలకు ఉపక్రమించింది. విభజన అనంతరం సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, నిధులు, లబ్ధిదారుల వివరాలతో ఉన్న ఫైళ్లకు నంబరింగ్ చేస్తున్నారు. జిల్లాల విభజన తర్వాత ఆయా జిల్లాల వారీగా ఫైళ్లు విభజించే అవకాశాన్ని సులభతరం చేస్తున్నట్లు తెలిసింది. ఈనెల 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువరించాలని నిర్ణయించడంతో విభజన ప్రక్రియకు సంబంధించి యుద్ధప్రాతిపదికన నివేదికలు సిద్ధం చేయాలని, కలెక్టర్, జేసీ, డీఆర్వోలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రేమండ్పీటర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారంలోగా సమగ్ర వివరాలు పంపాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై శనివారం సీఎం కేసీఆర సమక్షంలో హైదరాబాద్ అఖిలపక్ష పార్టీల సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాలు, అందులో కలిసే మండలాలకు సంబంధించిన డ్రాఫ్ట్ను ఆయా పార్టీలకు అందజేశారు. వీటిపై అఖిలపక్ష పార్టీల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. డ్రాఫ్ట్ నివేదిక ప్రకారం ఆయా జిల్లాల్లో కలిసే మండలాలు.. – కరీంనగర్ : కరీంనగర్, మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, చిగురుమామిడి, సైదాపూర్, బెజ్జంకి, చొప్పదండి, గంగాధర, రామడుగు, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినపల్లి, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట. – జగిత్యాల : జగిత్యాల, సారంగాపూర్, ధర్మపురి, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, ధర్మారం, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, రాయికల్, కథలాపూర్. – పెద్దపల్లి : పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, శ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు, మంథని, కమాన్పూర్, ముత్తారం, రామగుండం. – భూపాలపల్లి : మహదేవపూర్, కాటారం, మల్హర్, మహాముత్తారం. – హన్మకొండ : ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, జమ్మికుంట, హుజురాబాద్. – సిద్దిపేట : హుస్నాబాద్, కోహెడ, ఇల్లంతకుంట, బెజ్జంకి, ముస్తాబాద్ మండలాలను సిద్దిపేట కలుపుతూ డ్రాఫ్ట్ రూపొందించారు. -
లోటు బడ్జెట్కు ప్రభుత్వమే కారణం
ఏఐఎస్జీఈఎఫ్ చైర్మన్ ముత్తు సుందరం మంకమ్మతోట : దేశంలో రూ.5,028వేల కోట్ల లోటు బడ్జెట్కు కేంద్రమే కారణమని ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాÄæూస్ ఫెడరేషన్ చైర్మన్ ముత్త సుందరం విమర్శించారు. సెప్టెంబర్ 2న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని టీఎన్జీవో భవన్లో గురువారం నిర్వహించిన సన్నాహక సదస్సులో మాట్లాడారు. రిలయన్స్ కంపెనీకి రూ.5వేల కోట్లకు పైగా పన్ను చెల్లింపులో మినహాయింపు ఇవ్వడంతోనే లోటు బడ్జెట్ ఏర్పడిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. టీఎన్జీవోస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్రావు మాట్లాడుతూ కొత్త పింఛన్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచినట్లు తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి వేముల సుగుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్వాకంతోనే విద్యారంగం అస్తవ్యస్థం
సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి కరీంనగర్ :ప్రభుత్వ నిర్వాకంతోనే విద్యారంగం అస్తవ్యస్థంగా మారిందని సీఎల్పీ ఉపనేత జీవన్రెడ్డి అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అధికారంలోకొచ్చి రెండేళ్లు గడుస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అర్అండ్బీ అతిథి గృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాసేలా వ్యవహరించడం దుర్మార్గమని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా, సర్వీసు రూల్స్పై తేల్చకుండా ఉపాధ్యాయులపై మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలు విడ్డూరమని అభిప్రాయపడ్డారు. కేంద్రం నిధులను రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కరువులో రైతులను ఆదుకునేందుకు ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చిన రూ.700 కోట్లను దారిమళ్లించిందని పేర్కొన్నారు. రుణమాఫీపై స్పష్టత కొరవడిందని, రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. -
యాంత్రీకరణపై సర్కార్ నజర్
మహబూబ్నగర్ వ్యవసాయం: సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయిలో అందాలన్నదే తమ లక్ష్యం అంటూ పదేపదే ముఖ్యమంత్రి చెబుతువస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా గడిచిన రెండేళ్ల కాలంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే సంక్షేమ పథకాలలో లబ్ధిపొందిన వారిపై ప్రభుత్వం నజర్ పెట్టింది. ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.కోట్లలో నిధులు కేటాయిస్తోంది. సదరు పరికరాలు రైతులు వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై ఇంటర్ డిస్ట్రిక్ స్వా్కడ్ టీంలను నియమించి క్షేత్రస్థాయిలో విచారణకు ఆదేశించింది. 2015–16 వార్షిక ఏడాదిలో జిల్లాలో వ్యవసాయాంత్రీకరణకు రూ. 5 కోట్ల రాయితీ యంత్ర పరికరాలను, ఆర్కేవీవై కింద రూ. 3.6 కోట్ల విలువలగల పరికరాలపై క్షేత్రస్థాయిలో విచారించనున్నారు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో పంపిణీ చేసిన పరికరాలు,ట్రాక్టర్లపై విచారించేందుకు రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఒక ఏడీఏ,ఒక ఎంఏఓతో కూడిన రెండు బృందాలు జిల్లాలో సోమవారం నుంచి జిల్లాలో విచారణ చేట్టాయి.మంగళవారం షాద్నగర్, జడ్చర్ల, అచ్చంపేట, నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించాయి. దీంతో అక్రమార్కుల గుండెల్లో దడమొదలైంది. -
ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటాలి
పెగడపల్లి(కాల్వశ్రీరాంపూర్): ప్రభుత్వ భూములు, చెరువు శిఖంలో విరివిగా మొక్కలు నాటాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్ రెడ్డి కోరారు. మండలంలోని పెగడపల్లి గ్రామంలో సోమవారం పెద్దచెరువు శిఖం భూములను, శ్మశానవాటిక, ప్రభుత్వ భూములను ఆయన పరిశీలించారు. ఎంపీపీ సారయ్య గౌడ్, జెడ్పీటీసీ లంక సదయ్య, ఎంపీడీవో అమరేందర్ రాజు, తహశీల్దార్ సుధాకర్, సర్పంచ్ లక్ష్మి రాజకొమురయ్య, ఎంపీటీసీ లలిత, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు ఆరెల్లి రమేశ్, సరోజన, నాయకులు మల్లారెడ్డి, రవిందర్ రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
హామీల అమలులో విఫలం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి బెజ్జంకి : ఎన్నికల హామీల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. అధికారంలో వస్తే స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి దేశానికి తీసుకొస్తానని, రెండు కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీలిచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇప్పుడు వాటిని విస్మరించారని అన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలంటూ ఎనెన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన సీఎం కేసీఆర్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్షాలను బలహీనపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు తదితర హామీలు అమలుకావడం లేదన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, రుణమాఫీ అమల్లో రైతులను దగా చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ సీపీఐని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గన్నేరువరానికి చెందిన సీనియర్ నాయకుడు బుర్ర అంజయ్యగౌడ్ తిరిగి పార్టీలో చేరారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె.రాంగోపాల్రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కొనగంటి కేదారి, మండల కార్యదర్శి పోతిరెడ్డి వెంకట్రెడ్డి, సహాయ కార్యదర్శి బోనగిరి రూపేష్, ఏఐవైఎష్ జిల్లా అధ్యక్షుడు ముల్కల మల్లేశం, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు సంగెం మధు పాల్గొన్నారు. -
సర్కారు తప్పుతో రైతులకు నష్టం
భద్రాద్రి ప్లాంట్ నిర్వాసిత రైతులతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మణుగూరు: భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ విషయంలో సర్కారు తొందరపాటు, తప్పిదం కారణంగా నిర్వాసిత రైతులు తీవ్రంగా నష్టపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్లాంట్ పనులు తిరిగి ప్రారంభమ్యేంత వరకు నిర్వాసిత రైతులు తమ భూముల్లో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి ప్లాంట్ వద్ద భూనిర్వాసిత రైతులతో ఆదివారం ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు తరువాత కొత్త ప్రాజెక్టు కోసం భూసేకరణ విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించింది ఒక్క మణుగూరు ప్రాంతమేనని అన్నారు. అయినప్పటికీ, నిర్వాసిత రైతుల్లో ఇంకా 186 మందికి పరిహారం, 346 మంది నిరుద్యోగ నిర్వాసిత యువతకు ఉద్యోగ హామీ పత్రాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాంట్ ఏర్పాటు పనులు ప్రారంభించడం పూర్తిగా ప్రభుత్వ తొందరపాటు, తప్పిదమేనని అన్నారు. దీని ఫలితంగా నిర్వాసిత రైతులు తమ భూముల్లో సాగు చేయలేక, పరిహారం అందక, ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పేరంటాల చెరువు కింద రెండు పంటలు పండే భూములను ఒక్క పంట భూములుగా ప్రభుత్వం చూపిందని, భూసేకరణ చట్టం అమలు చేయకుండానే నామమాత్రంగా పరిహారం ఇచ్చిందని విమర్శించారు. భద్రాద్రి ప్లాంట్ నిర్వాసితులకు సీపీఐ పూర్తి అండగా ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సహాయ కార్యదర్శి సాబీర్పాషా, కార్యవర్గ సభ్యుడు అయోధ్యచారి, నియోజకవర్గ కార్యదర్శి సరెడ్డి పుల్లారెడ్డి, నాయకులు అక్కి నర్సింహారావు, ఎడారి రమేష్, కామిశెట్టి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎంసెట్–2 లీకేజీపై ప్రభుత్వాన్ని విమర్శించవద్దు
► ఐఐటీ–జేఈఈ ఫోరమ్ కన్వీనర్ లలిత్ కుమార్ బాలానగర్: ఎంసెట్ –2 లీకేజీపై ప్రభుత్వంపై విమర్శలు మాని విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని ఐఐటీ–జేఈఈ ఫోరమ్ కన్వీనర్ కె. లలిత్ కుమార్ కోరారు. లీకేజి విషయంలో ప్రభుత్వ నిర్ణయమే చట్టబద్ధమైనదని అందుకు తగ్గట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పు దోవ పట్టిస్తున్నాయన్నారు. ఒకవేళ ఎంసెట్ – 2ను ప్రభుత్వం రద్దు చేయకపోయినా న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉందన్నారు. అప్పుడైనా ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలాగూ రద్దుచేస్తారన్నారు. అప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొనవలసిందేనని, ఒక సంవత్సరం విద్యా సంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడి ఉండేదన్నారు. కాపీ రైట్ చట్టం ప్రకారం ఒక విద్యార్ధి పరీక్షలో అక్రమ మార్గంలో ఉత్తీర్ణుడైనట్లయితే మొత్తం ఆ పరీక్షనే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని చట్టమే ఉన్నదన్నారు. ఆ చట్టానికి అనుగుణంగానే అన్ని కోణాల్లో ఆలోచించి ముఖ్యమంత్రి సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇటువంటి లీకేజీ సంఘటనలు పునరావృతం కాకుండా పరీక్షల విధానాన్ని సంస్కరించాలని కోరారు. -
హమీల అమలులో ప్రభుత్వం విఫలం
చిలుకూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచారణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు, బుధవారం చిలుకూరులో జరిగిన టీడీపీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సామాన్య ప్రజల బాధలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హత కలిగిన వారికి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై త్వరలో దశల వారి పోరాటాలు చేస్తామన్నారు. కరువు నేపథ్యంలో రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు, కోదాడ, మునగాల, నడిగూడెం, మోతే మండల పార్టీ అధ్యక్షులు సాతులూరి గురవయ్య, ఆదినారాయణ, అంజనేయులు, సుంకర అజయ్కుమార్, జానకీరాములు, జిల్లా, మండల నాయకులు కొల్లు నర్సయ్య, అలసకాని జనార్ధన్, కొల్లు సత్యనారాయణ, కొండా సోమయ్య, దండ వీరబద్రం, ఉప్పగళ్ల శ్రీను, గందం పాండు, కోటిరెడ్డి, ప్రమీళ,సైదిరెడ్డి, బూర మల్లయ్య, కొడారు రాంబాబు, కొండా పెరమయ్య, జానిమియా , నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘బీ థర్మల్’ విస్తరణపై ప్రభుత్వానికి నివేదించండి
ఎస్ఈకి అఖిలపక్ష కమిటీ వినతి రామగుండం : పట్టణంలోని 62.5 మెగావాట్ల బీ థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణకు గల అనుకూలతలను ప్రభుత్వానికి నివేదించాలని అఖిలపక్ష కమిటీ నాయకులు జెన్కో ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజనీర్ శంకరయ్యకు ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ కన్నూరి సతీశ్కుమార్ మాట్లాడారు. రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు నిలయమనే భావనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 800 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కేంద్రం విస్తరణపై ప్రకటన చేసేవరకూ దశలవారీగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో శాంతియుతమైన ఉద్యమం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం జెన్కో ఆధ్వర్యంలో పలుచోట్ల విద్యుత్ కేంద్రాల స్థాపనకు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని, భూసేకరణ సమస్య, వనరుల లభ్యత తదితర అంశాలకు రామగుండం భిన్నంగా ఉంటుందన్నారు. స్థానిక విద్యుత్ కేంద్రం స్థాపనకు ప్రభుత్వ భూమి అనువుగా ఉందని, వనరులు సమృద్ధిగా ఉన్నాయని, సమీపంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు, రాజీవ్రహదారి, రైల్వేలైన్ తదితర అంశాలు ఉత్పత్తి కేంద్రం స్థాపనకు అనువుగా ఉంటుందని నివేదికలు సైతం రూపొందించారన్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే మరోచోట ప్రతిపాదనలు చేస్తున్నారని, వీటన్నింటిని ప్రభుత్వం పక్కన పెట్టి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి ముందుకు ఇచ్చిన హామీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. జెన్కో ఎస్ఈ మాట్లాడుతూ స్థానిక పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు గుర్రాల నర్సింహులు, దండగట్ల శ్రీనివాస్, గోలి నాగమల్లు, సంజీత్పాషా, కమిటీ సభ్యులు పూదరి శ్రీనివాస్, గూడూరి లవణ్కుమార్, అజ్మత్అలీ, గోలివాడ ప్రసన్నకుమార్, గట్టు శ్రీనివాస్, చిలుక రామ్మూర్తి, ప్రణయ్, గురునాథ్, మహేందర్, రవి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
జీతాలు పెంచమన్న పాపానికి..
హైదరాబాద్: తమ జీతాలు పెంచాలని ఆందోళన చేపట్టిన అంగన్వాడీలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. వేలసంఖ్యలో అంగన్వాడీ వర్కర్లను తొలగించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే సీఎం క్యాంపు ఆఫీసును ముట్టడించిన అంగన్ వాడీ కార్యకర్తల వీడియోలను జిల్లా సీడీపీవోలకు పంపినట్లు సమాచారం. అంగన్వాడీల తొలగింపు ఉత్తర్వుల్లో వారిని ఎందుకు తొలగిస్తున్నారో తెలుపుతూ సెక్షన్లు కూడా పేర్కొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క కృష్ణా జిల్లా నుంచే 2,500 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి నేడో రేపో తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వ కఠిన వైఖరిపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జీతాలు పెంచమన్నందుకు ప్రభుత్వం తమ ఉద్యోగాలనే పీకేయడం ఎంతవరకు సబబని వారు వాపోతున్నారు. -
వామపక్షాల ఆందోళన..అరెస్ట్
విజయవాడ: కల్తీ మద్యం బారిన పడి విజయవాడలోని నెహ్రూనగర్కు చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై వామపక్షాలు మండిపడ్డాయి. సీఎం చంద్రబాబునాయుడు పరామర్శిస్తున్న ఆంధ్రా ఆస్పత్రి వద్ద సోమవారం రాత్రి వామపక్షాలు ఆందోళనకు దిగియి. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వామపక్షాలు పోలీసుల అనుమతి కోరాయి. అయితే వారిని ముందుకు రాకుండా అడ్డుకొని పలువురు నేతలను అరెస్టు చేశారు. -
'ఇవి ప్రభుత్వ హత్యలే'
ఏలూరు: కల్తీ మద్యం బారిన పడి విజయవాడలోని నెహ్రూనగర్కు చెందిన ఐదుగురు మృతి చెందిన ఘటనపై వామపక్షాలు మండిపడ్డాయి. ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి మద్యం పాలసీని తయారు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబే బాధ్యత వహించాలని వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని, అతను తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం వలన పేదల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
'ప్రభుత్వం వివక్ష చూపుతోంది'
కడప: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివక్ష పూరితమైన పాలనకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కడప జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా పోయిందని అన్నారు. సమావేశంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ ఎమ్మెల్యేలు జిల్లా పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పంటలు ఎండిపోతున్నా సాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించిన నేతలు జిల్లాకు తక్షణమే నికర జలాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
చిన్నారుల మిస్సింగ్పై సుప్రీంకోర్టు సీరియస్
ఢిల్లీ: దేశ వ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ ఘటనలపై స్పష్టమైన విధి విధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్రన్ని ఆదేశించింది. 'బచ్పన్ బచావో ఆందోళన్' అనే స్వచ్చంద సంస్థ దాఖలు చేసిన పిటీషన్పై విచారణ సందర్భంగా జస్టీస్ లోకూర్, లలిత్లతో కూడిన ధర్మాసనం చిన్నారుల మిస్సింగ్ నివారణకు స్పష్టమైన విధానాలను తయారుచేయాలని ఆదేశించింది. అలాగే కోయాపాయ, ట్రాక్దమిస్సింగ్చైల్డ్ వెబ్సైట్లను అనుసంధానం చేయాల్సిందిగా ఉన్నత ధర్మాసనం మహిళా, శిశు సంక్షేమ శాఖను కోరింది. ఇటీవలి కాలంలో చిన్నారుల మిస్సింగ్ ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో దీనిని నివారించడానికి సీనియర్ లాయర్ హెచ్ ఎస్ పూల్కాను చైల్డ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ పటిష్టంగా అమలవడానికి కావాల్సిన విధి విధానాలు రూపొందించడానికి నియమించింది. నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(ఎన్సీపీసీఆర్)లో ఖాళీగా ఉన్నటువంటి చైర్ పర్సన్ పోస్టును, ఇతర ఉద్యోగులను సత్వరమే బర్తీ చేయాల్సిందిగా మంత్రిత్వ శాఖను ఆదేశించిన ధర్మాసనం రాష్ట్రాల వారిగా అదృశ్యమైన చిన్నారుల జాబితాను కోర్టుకు మార్చ్ 21 లోగా సమర్పించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. -
పద్మ అవార్డును వెనక్కి ఇవ్వనున్న ప్రముఖ శాస్త్రవేత్త
హైదరాబాద్: ఇప్పటికే పలువురు శాస్త్రవేత్తలు దేశంలో జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా తమకు లభించిన పలు అవార్డులను వెనక్కి ఇవ్వగా, తాజాగా ప్రముఖ శాస్త్రవేత్త పీ ఎమ్ భార్గవ తనకు లభించిన పద్మ భూషన్ అవార్డును తిరిగి ఇవ్వనున్నట్ల ప్రకటించారు. భార్గవ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ మాలిక్యులార్ బయాలజీ స్థాపకుడు. శాస్త్రవిఙ్ఞాన రంగంలో ఆయన సేవలకు గాను 1986లోపద్మ భూషన్ అవార్డు లభించింది. దేశంలోని హేతువాదం తీవ్రమైన భయాందోళనల మధ్య ఉన్నదనీ దీనికి నిరసనగా తన అవార్డుని వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్యం క్రమంగా మతతత్వ ప్రాతిపదికగా మారిపోతుందని భార్గవ ఆరోపించారు. -
నిధుల నీరు లేని చెట్టు
నేటి నుంచి నీరు-చెట్టు కార్యక్రమం నిధులు విడుదల చేయని ప్రభుత్వం తలలు పట్టుకుంటున్న డ్వామా, అటవీ అధికారులు ప్రస్తుతానికి ఉపాధి హామీ నిధులే గతి దాని వల్ల ఉపాధి పనులు తగ్గుతాయని ఆందోళన శ్రీకాకుళం పాతబస్టాండ్ : పథకాలు ప్రకటించడం.. కార్యక్రమాలు చేపట్టడంలో చూపుతున్న శ్రద్ధను ప్రభుత్వం నిధుల విడుదలపై చూపడం లేదు. గురువారం నుంచి ప్రారంభమవుతున్న నీరు-చెట్టు కార్యక్రమానిదీ అదే పరిస్థితి. మొక్కలు నాటడం, పర్యావరణం, జల వనరుల పరిరక్షణ లక్ష్యంగా ఈ నెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా చెబుతూ వస్తోంది. అయితే నిధుల విషయానికొచ్చేసరికి మాత్రం మొండి చెయ్యి చూపింది. దాంతో ప్రస్తుతానికి ‘నీరు-చెట్టు’ కార్యక్రమాలను జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులతో చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దీనివల్ల ఉపాధి హామీ పనులు తగ్గిపోయి.. ఆ మేరకు వేతనదారులు నష్టపోతారు. ఆర్భాటానికి కొదవలేదు నిధులివ్వకపోయినా అన్ని స్థాయిల్లోనూ కార్యక్రమాలు చేపట్టాలని మాత్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మండల కేంద్రాలు, గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటాలని, చెరువుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్దేశించింది. ఇవన్నీ చేయాలంటే వేలు, లక్షల్లోనే నిధులు ఖర్చవుతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు పాల్గొనే కార్యక్రమాల ఖర్చు మరింత పెరుగుతుంది. ఈ కార్యక్రమాలకు జిల్లాకు కోటి రూపాయలు కేటాయించనున్నట్లు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చెప్పినా.. నిధులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి. మరోవైపు గురువారం నుంచే పనులు చేపట్టాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పలు కార్యక్రమాలకు ఇప్పటికీ నిధులు జమకాలేదు. ఇప్పుడు మరో కొత్త కార్యక్రమం చేపట్టాల్సి రావడంతో అధికారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను డ్వామా, అటవీ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా గురువారం నందిగాం మండలం కల్లాడ పంచాయతీ సాగరంపేట వద్దనున్న పద్మనాభసాడరం చెరువు గట్టుపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ లక్ష్మీనరసింహం, ఇతర ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.రవీంద్ర తదితరులు పాల్గొంటారు. -
వచ్చేసింది.. కోతల కాలం!
శ్రీకాకుళం :వేసవి కాలం పూర్తిగా ప్రవేశించకముందే జిల్లాలో కోతల కాలం మొదలైంది. అనధికారికంగా విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. గ్రామస్థాయిలో గంట నుంచి రెండు గంటల పాటు కోతలు విధిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో అర్ధగంట పాటు విద్యుత్ను నిలిపేస్తున్నారు. పరిశ్రమలకు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. అయితే అధికారులు దీన్ని ధ్రువీకరించడం లేదు. కోతలు అమలు చేయాలని తమకు ఎటువంటి ఆదేశాలు లేవని చెబుతున్నారు. జిల్లాలో 7,11,842 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 6,29,081 గృహ, 44,900 వాణిజ్య, 25040 పరిశ్రమలు, 178 చిన్నతరహా పరిశ్రమలు, 250 భారీ పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు 6,813 వీధి దీపాల కనెక్షన్లు, 5580 దేవాలయాలు, పాఠశాలల కనెక్షన్లు ఉన్నాయి. వీటికి రోజుకు 3.1 లక్షల యూనిట్ల నుంచి 3.2 లక్షల యూనిట్లు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. శీతాకాలం, వర్షాకాలాల్లో జిల్లాకు అవసరమైన మేరకు విద్యుత్ సరఫరా కాగా వినియోగం అంతస్థాయిలో ఉండకపోవడంతో మిగులు కనబడుతోంది. అయితే వేసవి కాలంలో డిమాండ్ పెరుగుతుండగా సరఫరా తగ్గుతుండడంతో కోతలు విధించడం అనివార్యమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ కొరతే లేదని నిరంతర విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని అమలు చేసే తేదీని కూడా ముందుగానే ప్రకటించేసింది. అయితే దీని అమలులో మాత్రం చిత్తశుద్ధి కొరవడి కొన్ని మండలాలకు మాత్రమే నిరంతర విద్యుత్ను పరిమితం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా అత్యవసరమైతే తప్ప కోతలు ఉండవని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఫిబ్రవరి నెలలోనే కోతలుప్రారంభం కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాఖాధికారులు మాత్రం మరమ్మతుల కోసం అప్పుడప్పుడూ నిలుపుదల చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం విద్యుత్ ఆదా కోసం ఎల్ఈడీ బల్బులు ఇంటింటికీ పంపిణీ చేస్తామని ప్రకటించి ఆర్భాటంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. పది రోజులు గడిచినా ఇప్పటికీ బల్బుల జాడ లేదు. ఇవి ఎప్పటికి వస్తాయో కూడా అధికారులకు సైతం తెలియడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పేదొకటి...చేసేదొకటిగా ఉందని ఆవేదనతో అభిప్రాయపడుతున్నారు. విషయాన్ని ట్రాన్స్కో ఎస్ఈ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా కోతలకు సంబంధించి తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. మరమ్మతుల కోసం అప్పుడప్పుడు సరఫరా ఆపుతుండవచ్చని అభిప్రాయపడ్డారు. ఎల్ఈడీ బల్బులు త్వరలోనే జిల్లాకు పంపుతున్నట్లు సమాచారం వచ్చిందని అది ఖచ్చితంగా ఎప్పుడన్నది తనకు తెలియదన్నారు. -
అడవికి రక్షణ
ప్రత్యేక దృష్టి సారించిన సర్కారు కలెక్టర్ చైర్మన్గా ప్రత్యేక కమిటీ మెంబర్ కన్వీనర్గా డీఎఫ్ఓ డీఐజీ, సీఎఫ్లు ప్రత్యేక ఆహ్వానితులు జేసీ, ఎస్పీ సహా 9 మంది సభ్యులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 33 శాతం అడవుల అభివృద్ధి లక్ష్యం వన్యప్రాణులకూ తగిన భద్రత అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, పరిపాలన సౌలభ్యం కోసం అటవీ శాఖను పునర్వ్యవస్థీకరించాలన్న ప్రతిపాదనలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. అధికారులు చేసిన సిఫారసులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనల గురించి పలుమార్లు చర్చించిన ఉన్నతస్థాయి అధికారులు సర్కారుకు నివేదికను సమర్పించారు. దాని ఆధారంగానే పునర్వ్యవస్థీకరణ ఫైలుకు ఆమోదం లభించింది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, 33 శాతం అడవు ల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసేందుకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం నియమించింది. కలెక్టర్ రోనాల్డ్రోస్ చైర్మన్గా మ రో తొమ్మిది మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేస్తుంది. డాక్టర్ నర్పట్సింగ్ నివేదికకు మోక్షం మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, అటవీ శాఖ పునర్వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్ డాక్టర్ నర్పట్సింగ్ ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేసి సమర్పించిన నివేదికలో, సమూల మార్పులు చేయాలని సూచించారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల పెంపకం, అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు మార్గదర్శనం చేశారు. జిల్లాలో ఇకపై ఐఎఫ్ఎస్ క్యాడర్ కలిగిన అధికారులనే ఫారెస్టు కన్జర్వేటర్, డిప్యూటీ కన్జర్వేటర్, డిఎఫ్ఓలుగా నియమించాలని సూచించారు. అటవీ శాఖలో మార్పులు, చేర్పులకు శ్రీకారం జరగనున్న నేపథ్యంలో డివిజన్, రేంజ్, బీట్ అధికారులకు అటవీ పరిధి తగ్గించాలన్నారు. ప్రస్తుతం ఒక్కో డివిజన్లో 1473 చద రపు కిలోమీటర్లు కాగా, 750 చదరపు కిలోమీటర్లకు తగ్గిం చాలి. అదేవిధంగా ఒక్కో డివిజన్లో మూడు నుంచి నాలు గు రేంజ్లు, సెక్షన్ పెరుగుతుండటంతో బీట్ ఆఫీసర్ల పరిధి 25 చదరపు కిలో మీటర్ల నుంచి 15 చదరపు కిలోమీటర్లకు కుదించాలి. నిజామాబాద్ అటవీ సర్కిల్ పరి ధిలో నిజామాబాద్, మెదక్ డివిజన్లు ఉండగా, ఈ రెండింటిని త్వరలోనే విడదీసి రెండు సర్కిళ్లు చేయాలని ఆయన ప్రతిపాదించారు. దీంతో నిజామాబాద్ జిల్లాలోని రెండు డివిజన్లు నాలుగుకు పెరగనున్నా యి. ఇదే క్రమంలో మొదటగా తెలంగాణ ప్రభుత్వం జిల్లాస్థాయి కమిటీలను వేయడంతో నర్పట్సింగ్ ప్ర తిపాదనలకు కదలిక వచ్చినట్లుగా భావిస్తున్నారు. దశలవారీగా అమలు అటవీ శాఖ పటిష్టత, పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాలను దశలవారీగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తు న్న ప్రభుత్వం మొదటగా జిల్లా స్థాయిలో కమిటీలను వేసింది. కలెక్టర్ చైర్మన్గా కమిటీని రూపొం దిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి రాజేశ్వర్ తివారి జీఓ నంబర్ 33 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో జిల్లా కేంద్రంలో ఉండే డివి జనల్ ఫారెస్టు అధికారి మెంబర్ కన్వీనర్గా, కన్సర్వేటర్, పోలీసుశాఖ డీఐజీలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. జాయింట్ కలెక్టర్,ఎస్పీ , డివిజన్ ఫారె స్టు అధికారులు (టెరిటోరియల్), ఐటీడీఏ పీఓ/గిరిజన సంక్షేమశాఖాధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ నామినేట్ చేసే ఇద్దరు నాన్-ఆఫీషియల్స్ సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయిలో పనిచేసే ఈ అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ తరచూ అడవులలో తనిఖీలు నిర్వహిస్తుంది. అక్రమ కలప రవాణాను అడ్డుకునేందుకు దాడులను కొనసాగిస్తుంది. అటవీ, పోలీసు, రెవెన్యూ, గిరిజన సంక్షేమశాఖలను సమన్వయం చేస్తూ అడవులను అభివృద్ది చేసేందు కు ప్రభుత్వ కార్యచరణను అమలు చేస్తుంది. ‘హరి తహారం’ తదితర పథకాల ద్వారా జిల్లాలో 25 శా తం నుంచి 33 శాతం అడవులను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేస్తారు. -
అనారోగ్య బాల్యం!
విద్యార్థుల సంక్షేమంపై సర్కారుకు చిత్తశుద్ధి కొరవడింది. విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ప్రవేశపెట్టినజవహర్బాల ఆరోగ్యరక్ష పథకం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటి వరకూ రక్తహీనత పరీక్షలు చేయలేదు. ‘చిన్నారి డాక్టర్’ను ప్రవేశపెట్టి రెన్నెళ్లు దాటుతున్నా పురోగతి లేదు. ఇదేంటని ఆరాతీస్తే ఒక్క రూపాయి నిధులు లేకుండా పథకాన్ని ముందుకు నడపాలనే ధోరణిలో ప్రభుత్వం...సర్కారు తీరుకు తగ్గట్లుగా ‘మమ’ అనిపించేలా అధికారులు నివేదికలు తయారుచేసి చేతులు దులుపుకోవడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. సాక్షి, కడప: జిల్లా జనాభా 28.82 లక్షలు. వీరిలో ఆరేళ్ల లోపు చిన్నారులు 3,13,455 మంది. అలాగే 15-18 ఏళ్ల వయసు మధ్య ఉన్న యువత 3.54 లక్షల మంది ఉంటారని ప్రభుత్వ పాఠశాలల గణాంకాలు చెబుతున్నాయి. వీరికి ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహించడం, రక్తహీనతను తగ్గించే చర్యలకు ఉపక్రమించడంలో రాజీవ్విద్యామిషన్ అధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జవ హర్ బాల ఆరోగ్య రక్ష ఆధ్వర్యంలో 2012-13లో వైద్య పరీక్షలు నిర్వహించారు. 10-18 ఏళ్ల మధ్య ఉన్న 2,03,462 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే, అందులో1,36,661 మందికి రక్తహీనత ఉందని తేలినట్లు సమాచారం. దీనికి చికిత్స అందించడంలో ప్రభుత్వం గతేడాది ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది రక్తహీనత పరీక్షలు నిర్వహించి, వారికి చికిత్స చే యాల్సిన అధికారులు ఇప్పటి వరకూ ఆ దిశగా ఆలోచన చేయలేదు. గతేడాది కంటే ఈ ఏడాది మరో 10శాతం మంది విద్యార్థులకు అదనంగా రక్తహీనత ఉండొచ్చని కొందరు వైద్యులు చెబుతున్నారు. అయినా చిన్నారుల ఆరోగ్యంపై అధికారులు జాగ్రత్తలు తీసుకోలేదు. ఇవేం పరీక్షలు: అనారోగ్య పరిస్థితులకు దారితీసే రక్తహీనత సమస్యను గుర్తించడానికి ప్రభుత్వ యంత్రాంగం వద్ద పరీక్షల వ్యవస్థ లేదు. దీంతో విద్యార్థుల్లో రక్తహీనత సమస్య తీవ్రతను గుర్తించడంలో విఫలమవుతున్నారు. 15-18 ఏళ్ల మధ్య యువతకు డెస్సీ లీటర్ రక్తంలో 14 గ్రాములకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలి. అయితే 9-13 మధ్య హెచ్బీ ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఘోరమేంటంటే 8 శాతం మందిలో 7 గ్రాములు మాత్రమే ఉంది. బాలికల్లో 12.5 గ్రాములు ఉండాల్సి ఉండగా 7-10 మధ్య ఉంటోందని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఇంతదారుణమైన పరిస్థితి ఉంటే ఈ ఏడాది రక్తహీనత పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. హెచ్బీ గుర్తించడానికి, రక్తపరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ప్రత్యేక కిట్లు కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు. రక్తహీనత సమస్య ఉన్నవారికి కనీసం ఐరన్ టాబ్లెట్లు కూడా పంపిణీ చేయడం లేదు. కొరవడిన సమన్వయం: విద్యార్థుల ఆరోగ్యం కోసం విద్యా, వైద్యం స్త్రీ శిశు సంక్షేమ శాఖలు పని చేయాలి. కానీ ఈ శాఖల మధ్య సమన్వయం సరిగా లేదు. కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య ఉన్నవారికి పౌష్టికాహారంపై, శుభ్రతపై అవగాహన కల్పించాల్పిన బాధ్యత స్త్రీశిశు సంక్షేమ శాఖది. సమస్య ఉన్నట్లు గుర్తించాల్సింది వైద్య ఆరోగ్య శాఖది. చదువుకుంటున్న వారికి విద్యా సంస్థల్లో జవహర్ బాలఆరోగ్యరక్ష ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించాలి. కానీ ఈ శాఖలు సమన్వయంతో వ్యవహరించడం లేదు. బడ్జెట్ లేదు..సరైన యంత్రాంగం లేదు జవహర్బాల ఆరోగ్యరక్ష పథకానికి నిధులు ఖర్చు చేయడంలో ప్రభుత్వం పూర్తి అలసత్వం ప్రదర్శిస్తోంది. ఒక్కరూపాయి నిధులు విడుదల చేయకుండా కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలనే దిశగా ఆలోచిస్తోంది. దీంతో జవహర్బాలఆరోగ్యరక్ష అధికారులు కూడా మొక్కుబడిగా బండి లాగిస్తున్నారు. ‘చిన్నారిడాక్టర్’ అనే కార్యక్రమాన్ని రెన్నెళ్ల కిందట ప్రవేశపెట్టారు. ఈ విషయం చాలామంది టీచర్లకే తెలీదు. ఏ రకమైన నిధులు లేవు చిన్నారిడాక్టర్ అమలుకు ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. జవహర్ బాల ఆరోగ్యరక్ష పరిస్థితి అంతే! అయినప్పటికీ చిన్నారిడాక్టర్ను కొన్నిపాఠశాలల్లో కొనసాగిస్తున్నాం. రక్తహీనత పరీక్షలు త్వరలోనే చేపడతాం. విద్యార్థులకు ఆల్బెండజోల్ అందించాం. అది పూర్తయింది. వెంటనే రక్తహీనీత పరీక్షలు చేపడతాం. ఇప్పటికే కొన్నిచోట్ల ఐరన్టాబ్లెట్ల పంపిణీ చేపట్టారు. అయితే రియాక్షన్ ఇవ్వడంతో ఆపేశారు. ఐరన్సిరప్ కూడా వచ్చాయి. ప్రస్తుతం సెలవులో ఉన్నాను. రాగానే పరిస్థితిని సమీక్షిస్తా. డాక్టర్ ప్రవీణ్ కుమార్, జవహర్ బాల ఆరోగ్య రక్ష కోఆర్డినేటర్, -
గామీణ ప్రజలకు వైద్య సేవలు మృగ్యం
అనంతపురం అర్బన్, న్యూస్లైన్ : గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మృగ్యమయ్యాయి. రోగమొస్తే ‘ప్రైవేటు’ చికిత్సే శరణ్యంగా మారుతోంది. ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీలు), ఉప కేంద్రాలు చాలా వరకు అలంకారప్రాయంగా మారాయి. వాటిలో కనీస సేవలు సైతం అందడం లేదు. వైద్యులు ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు పీహెచ్సీలలో వైద్యులుండాలి. ఈ సమయ పాలనను చాలా మంది పాటించడం లేదు. వారి కోసం ఎదురుచూసే ఓపిక లేక, రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు. ఇక పాముకాటు, పాయిజన్, విష జ్వరాలు తదితర సీరియస్ కేసులకు ప్రాథమిక చికిత్స కూడా చేయడం లేదు. సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి వంటి కారణాలు కూడా గ్రామీణులకు ప్రభుత్వ వైద్య సేవలను దూరం చేస్తున్నాయి. జిల్లాలో 80 పీహెచ్సీలు ఉన్నాయి. ఇందులో 24 గంటలూ పనిచేసేవి 24 ఉన్నాయి. వీటికి 185 వైద్యుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం 96 మంది రెగ్యులర్, 74 మంది కాంట్రాక్టు వైద్యులున్నారు. ఇంకా 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాగా, రెగ్యులర్ వైద్యుల్లో 22 మంది పీజీ కోసం వెళ్లారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలకు లోటు ఏర్పడుతోంది. విడపనకల్లు, ముద్దినాయనిపల్లి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, గరుడచేడు, పాముదుర్తి, రెడ్డిపల్లి పీహెచ్సీల్లో ఒక్క వైద్యుడూ లేకపోవడం గమనార్హం. ఇక 24 గంటలూ పనిచేసే పీహెచ్సీలలో ఒక్క వైద్యుడు కూడా రాత్రి వేళల్లో ఉండడం లేదు. దీంతో డెలివరీ కేసులను పట్టణాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. పీహెచ్సీలు, ఉప కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. దీని కారణంగా జననీ సురక్ష యోజన, జేఎస్కే పథకాలు, మదర్ చైల్డ్ ట్రాక్ సిస్టమ్లో పేర్ల నమోదు, గర్భిణులకు సూచనలు, మందుల పంపిణీ వంటి వాటిలో జాప్యం జరుగుతోంది. సొంత భవనాల కొరత జిల్లా వ్యాప్తంగా 80 పీహెచ్సీలు, 586 ఉప కేంద్రాలు ఉన్నాయి. 68 పీహెచ్సీలకు మాత్రమే పక్కాభవనాలున్నాయి. 12 పీహెచ్సీలకు ఇంకా నిర్మించడంలోనే ఉన్నారు. నీలకంఠాపురం, ముద్దినాయనపల్లి, బత్తలపల్లి, కదిరేపల్లి, ఎద్దులపల్లి, ఆవులదట్ల, గుట్టూరు, రెడ్డిపల్లి, గరుడచేడు, కొక్కంటి, హేమవతి, శ్రీధర్గట్ట పీహెచ్సీలు అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల నడుమ నడుస్తున్నాయి. ఇక 586 ఆరోగ్య ఉప కేంద్రాల్లో 282 కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. ప్రస్తుతం 58 భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. ఇంకా 246 కేంద్రాలకు నిర్మించాల్సివుంది. నేలపైనే వైద్యం పీహెచ్సీల్లో కేటాయించిన మేరకు పడకలు సైతం లేవు. కటిక నేలపైనే వైద్యం అందించే పరిస్థితి దాపురిస్తోంది. వాస్తవానికి ఆరు నుంచి పది పడకలుండాలి. చాలాచోట్ల నాలుగు కూడా లేవు. విధిలేక రోగులను నేలపై పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. మందులు తీసుకెళ్లడంలో జాప్యం అనంతపురంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్స్లో మందులు పుష్కలంగా ఉన్నా, వాటిని తీసుకుపోవడంలో పీహెచ్సీల ఫార్మసిస్టులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో మందులు అందుబాటులో లేక వైద్యులు బయటకు రాస్తున్నారు. గత్యంతరం లేక అప్పోసప్పో చేసి మందులు కొనాల్సి వస్తోంది. ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు పీహెచ్సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాం. వైద్య సేవలు అందడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తప్పవు. గతంలో ఎంతో మంది వైద్యులకుషోకాజ్ నోటీసులిచ్చాం. పేదలకు వైద్యం అందించడంలో జాప్యం చేయరాదు. - డాక్టర్ రామసుబ్బారావు, డీఎంఅండ్హెచ్ఓ -
మనసులేని పాలకులు : వైఎస్ జగన్
ముమ్మడివరం: తుపానులు, అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు, పేదలను ఆదుకోని ఈ పాలకులకు మనసు అనేది ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటలను ఈరోజు ఆయన పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యేరులో రైతులను పరామర్శిస్తున్న సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఎకరాకు 10 వేల రూపాయలు తక్షన సాయం అందించాలని డిమాండ్ చేశారు. 3 ఎకరాలు, 60 వేల రూపాయల పెట్టుబడి పెట్టానని, అంతా నీటిపాలైందని జగన్ దగ్గర ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఎకరాలకు 70 వేల రూపాయల పెట్టుబడి పెట్టానని అంతా హెలెన్ తుపాను తీసుకుపోయిందని మరోరైతు బాధపడ్డారు. ప్రభుత్వం నుంచి ఏ అధికారి రాలేదని, తమ దగ్గరకు వచ్చి నష్టం అంచనా వేయలేదని రైతులు వాపోయారు. తుపాన్ దెబ్బకు పాడైపోయిన వరి పైరును వారు జగన్కు చూపించారు. గతేడాది నీలం తుపాన్ నష్టపరిహారమే తమకు అందలేదని వాపోయారు. బాల అనే రైతు కన్నీరుమున్నీరయ్యారు. తన ఐదు ఎకరాలు పంట నీటిపాలైందని ఓ వృద్ధ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాన్ దెబ్బకు వేల ఎకరాల్లో అరటి తోటలు, లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నాయని అన్నదాతలు వాపోయారు. హెలెన్ తుపాన్ దెబ్బకు విరిగిపడిన అరటి మొక్క్లలను,గెలలను వారు జగన్కు చూపించారు. జగన్ పొలాల్లోకి దిగి రైతుల కష్టాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. రైతుల కష్టాలపై సీఎంకు లేఖ రాస్తానని చెప్పారు. తుపాన్ దెబ్బకు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు. అంతకు ముందు జగన్ కొత్తపేట నియోజకవర్గం అవిడిలోని హెలెన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని జగన్ వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీలం తుపాన్ నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని రైతులు చెప్పినప్పుడు ప్రభుత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసుగా రెండు తుపాన్లు వచ్చినా పాలకులు రైతులను ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండటం చూస్తుంటే బాధ అనిపిస్తోందన్నారు. రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ కింద విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం మనస్ఫూర్తిగా కృషి చేసిన నాయకుడు వైఎస్ఆర్ అని తూర్పు గోదావరి జిల్లా రైతులు జగన్తో అన్నారు. -
ఘాటుగా స్పందించిన విజయమ్మ
నల్లొండ జిల్లాలో తన పర్యటనను అడ్డుకొని అరెస్ట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఘాటుగా స్పందించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఖమ్మం-నల్గొండ జిల్లాల సరిహద్దుల్లోని పైనంపల్లి వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అందుకు ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అడ్డుకున్నందుకు నిరసనగా ఆమె అక్కడే నేలమీద బైఠాయించారు. వరద బాధితులను పరామర్శిస్తూ కొనసాగుతున్న తన పర్యటనను రాజకీయం చేయడం పట్ల ఆమె మండిపడ్డారు. బాధితులకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడానికి వెళుతుంటే అడ్డుకోవడంతో ఆమెకు బాధకలిగింది. ఇంతకు ముందు ఎన్నడూ మాట్లాడనంత ఆగ్రహంతో మాట్లాడారు. మా మీద ఏమైనా రౌడీషీటుందా? ఇదేమైనా పాకిస్థానా? బంగ్లాదేశా? సమైక్యవాదాన్ని వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో పర్యటిస్తే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా? అడ్డుకుంటారా? బాధితులను పరామర్శించడం కూడా తప్పేనా? అడ్డుకునే వారిని అరెస్ట్ చేయాలి. రైతులను పరామర్శిస్తే అరెస్ట్ చేస్తారా? మనం ప్రజాస్వామ్యా దేశంలో ఉన్నామా? అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యతకు కట్టుబడి ఉంది. ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్ బాబును గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు. కొంత మంది నాయకులు, పార్టీలు వ్యక్తిగత స్వేచ్చను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కలవనీయకుండా ప్రభుత్వమే అడ్డుకోవడం దారుణం అన్నారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను మంత్రులు గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గానీ, సోనియా గాంధీ గానీ పరామర్శించారా అని ప్రశ్నించారు. త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాము మళ్లీ వస్తామని విజయమ్మ ప్రజలకు భరోసా ఇచ్చారు. వైఎస్ విజయమ్మ నల్లొండ జిల్లా పర్యటనను అడ్డుకోవాలని మంత్రులు జానా రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డిలు పిలుపు ఇవ్వడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా బాధితులను పరామర్శించడం అనేది మానవత్వంతో కూడిన అంశం. ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలుగా వెళ్లడం ఆమె బాధ్యత. ఇటువంటి పర్యటనను అడ్డుకోవాలనిప్రభుత్వంలోని మంత్రులే పిలుపు ఇవ్వడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. వారు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యంగా పేర్కొంటున్నారు. అధికారంలో ఉండి ఇలా విద్వేషాలు రెచ్చగొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా వారి వ్యాఖ్యలను వ్యతిరేకించారు. అన్నీ కోల్పోయి నిరాశ, నిస్పృహల్లో ఉన్న అన్నదాతను, ప్రజలకు తామున్నామని భరోసా కల్పించే ఉద్దేశంతో తలపెట్టిన విజయమ్మ పర్యటనను రాజకీయ కోణంలో ఆలోచించడం దిగజారుడు రాజకీయమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉత్తమ కుమార్ రెడ్డి కూడా ఆ విధంగా పిలుపు ఇచ్చారంటే దీనికి వెనుక సిఎం హస్తం కూడా ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. విడిపోయినా అందరం కలిసుందామన్న జానారెడ్డి ఇప్పుడు విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని పిలుపు ఇవ్వడం రాజకీయ లబ్ధికోసం ఆయన పూటకోమాట మాట్లాడతారన్న విమర్శలు వినవస్తున్నాయి. -
ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం: హరీష్రావు
తెలంగాణవాదులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహారిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగిపై సీమాంధ్ర ఉద్యోగుల దాడిని నిరసిస్తూ సోమవారం విద్యుత్ సౌథ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతుందని అన్నారు. ఆ ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హరీష్రావు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్ తదితరులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం వారు విద్యుత్ సౌథలోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.