helicopter
-
ఎయిర్బస్ హెలికాప్టర్లో ‘మేకిన్ ఇండియా’
మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ఏరోస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఏఎస్పీఎల్) ఎయిర్బస్ నుంచి ప్రతిష్ఠాత్మక కాంట్రాక్టును పొందింది. ఎయిర్బస్కు చెందిన హెచ్ 130 లైట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్లేజ్ తయారీ, అసెంబుల్ కాంట్రాక్టును దక్కించుకుంది. ఇది భారతదేశ 'మేక్ ఇన్ ఇండియా' విజన్కు ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో నమ్మకమైన భాగస్వామిగా మహీంద్రా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ శాఖ కార్యదర్శి వుమ్లన్మాంగ్ వుల్నామ్, భారత్, దక్షిణాసియాలో ఎయిర్బస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమి మైలార్డ్, మహీంద్రా గ్రూప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనీష్ షా సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం, హెచ్ 130 హెలికాప్టర్ ప్రధాన ఫ్యూజ్లేజ్ అసెంబ్లీని మహీంద్రా ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఐరోపాలోని ఎయిర్ బస్ హెలికాప్టర్ల కేంద్రానికి రవాణా చేస్తారు. ఉత్పత్తి వెంటనే ప్రారంభం కానుంది. మొదటి క్యాబిన్ అసెంబ్లీ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది.మహీంద్రా ఇప్పటికే ఎయిర్ బస్ వాణిజ్య విమాన కార్యక్రమాల కోసం వివిధ రకాల విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్ లను సరఫరా చేస్తోంది. విడిభాగాలు, సబ్-అసెంబ్లింగ్లే కాకుండా భారీ, మరింత సంక్లిష్టమైన ఏరో స్ట్రక్చర్ తయారీ, సరఫరాకు మహీంద్రా తన సామర్థ్యాల పోర్ట్ ఫోలియోను విస్తరిస్తున్న క్రమంలో తాజా ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.ఎయిర్ బస్ కు భారత్ ప్రధాన మార్కెట్, వ్యూహాత్మక వనరుల కేంద్రంగా ఉంది. ప్రతి ఎయిర్ బస్ వాణిజ్య విమానంలోనూ భారతదేశంలో తయారైన విడిభాగాలు, సాంకేతికతలు ఉన్నాయి. ప్రస్తుతం ఎయిర్ బస్ భారత్ నుంచి విడిభాగాలు, సేవల కొనుగోలు విలువ 1.4 బిలియన్ డాలర్లుగా ఉంది.హెచ్ 130 అనేది ప్రయాణికుల రవాణా, పర్యాటకం, ప్రైవేట్, వ్యాపార విమానయానం, అలాగే మెడికల్ ఎయిర్ లిఫ్ట్, నిఘా మిషన్ల కోసం రూపొందించిన ఇంటర్మీడియట్ సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్. ఇందులో విశాలమైన, అడ్డంకులు లేని క్యాబిన్ ఉంటుంది. పైలట్, మరో ఏడుగురు ఇందులో ప్రయాణించవచ్చు. చుట్టూ పెద్ద విండ్ స్క్రీన్, వెడల్పాటి కిటికీల ద్వారా అద్భుతమైన విజిబిలిటీ ఉంటుంది. -
టాటా బోయింగ్ అరుదైన ఘనత: 300వ AH-64 అపాచీ ఫ్యూజ్లేజ్
టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (TBAL) హైదరాబాద్లోని.. దాని తయారీ కేంద్రం నుంచి 300వ ఏహెచ్-64 అపాచీ ఫ్యూజ్లేజ్ డెలివరీ చేసింది. ఈ ఫ్యూజ్లేజ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం తయారు చేస్తారు.సుమారు 14,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఉత్పత్తి కేంద్రంలో కంపెనీ AH-64 అపాచీ హెలీకాఫ్టర్ ఫ్యూజ్లేజ్లతో పాటు.. సెకెండరీ స్ట్రక్చర్లను కూడా తయారు చేస్తోంది. భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, స్వదేశీ తయారీ నైపుణ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి TBAL నిరంతర అంకితభావాన్ని ఇది నిదర్శనం.భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం 22 AH-64 అపాచీ హెలికాఫ్టర్లు ఉన్నాయి. బోయింగ్ అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మధ్య ఉమ్మడి వెంచర్ 900 మందికి పైగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను నియమించింది. ఏరో స్ట్రక్చర్లను అసెంబుల్ చేయడానికి ఉపయోగపడే విడి భాగాల్లో దాదాపు 90 శాతం వరకు దేశీయంగానే తయారవుతాయి. -
హెలికాఫ్టర్ ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాంధీ నగర్ : గుజరాత్ (Gujarat)లో విషాదం చోటు చేసుకుంది. పోర్బందర్ ఎయిర్పోర్ట్ (Porbandar Airport)లో ఘోర హెలికాప్టర్ (helicopter crash porbandar) ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్కు చెందిన ఏఎల్హెచ్ ధృవ్ హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే మరణాలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రమాదం వెంటనే హెలికాప్టర్ భూమిని ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.Helicopter of Indian Coast Guard ALH Dhruv 'crashed' in Porbandar, Gujarat during a routine training sortie.3 crew members DEAD. pic.twitter.com/vt4L025Ifl— RAMULU.B (@vedicramrekha) January 5, 2025 -
ఓఎన్జీసీ నుంచి పవన్ హన్స్కు భారీ ఆర్డర్
ప్రభుత్వ యాజమాన్యంలోని హెలికాప్టర్ సేవల ఆపరేటర్ పవన్ హన్స్ తాజాగా ఓఎన్జీసీ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఓఎన్జీసీ ఆఫ్–షోర్ కేంద్రాలకు సిబ్బందిని తరలించడానికి నాలుగు హెలికాప్టర్లను పవన్ హన్స్ సమకూరుస్తుంది. ఈ డీల్ విలువ రూ.2,141 కోట్లు. 10 ఏళ్లపాటు పవన్ హన్స్ ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ద్వారా కాంట్రాక్ట్ దక్కించుకున్నట్టు పవన్ హన్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: హైదరాబాద్ ‘రియల్’ ట్రెండ్హెచ్ఏఎల్ తయారీ అత్యాధునిక ధ్రువ్ ఎన్జీ హెలికాప్టర్లను పవన్ హన్స్ వినియోగించనుంది. ‘దేశీయంగా తయారు చేసిన ధృవ్ ఎన్జీ అనేది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్హెచ్) ఎంకే–3 యొక్క సివిల్ వేరియంట్. ఏఎల్హెచ్ ఎంకే–3ని ప్రస్తుతం భారత రక్షణ దళాలు ఉపయోగిస్తున్నాయి. ఈ సైనిక హెలికాప్టర్లు నిరూపితమైన ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాయి. ఇప్పటి వరకు 335 కంటే ఎక్కువ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేశాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,75,000 గంటలపాటు గగనతల విహారం చేశాయి’ అని పవన్ హన్స్ తెలిపింది. సంస్థ వద్ద ప్రస్తుతం 46 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి చమురు, సహజ వాయువు అన్వేషణ, పోలీసు, కేంద్ర బలగాలు తరలింపు, యుటిలిటీ రంగంతోపాటు మారుమూల, కొండ ప్రాంతాలకు కనెక్టివిటీని అందిస్తున్నాయి. -
PM Modi: మోదీకి తప్పిన ప్రమాదం ?
-
Video: అమిత్షా హెలికాప్టర్ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సాధారణ పౌరులతోపాటు ప్రముఖ రాజకీయ నేతల వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, శిసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ల వాహనాలను సైతం తనిఖీ చేశారు. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్లో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన బ్యాగ్లను చెక్ చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా నే స్వయంగా వెల్లడించారు. తనిఖీలకు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్టు చేశారు.‘ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో నా హెలికాప్టర్ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను పాటిస్తుంది. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి’ అని అమిత్ షా పేర్కొన్నారు.आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई। भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है। एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT— Amit Shah (@AmitShah) November 15, 2024 -
రాహుల్ హెలికాప్టర్ టేకాఫ్కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్ చాలాసేపు హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ టేకాఫ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్ హెలికాప్టర్లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్ టేకాఫ్కు ఆలస్యం అవడంతో రాహుల్ ప్రయాణ షెడ్యూల్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.HUGE BREAKING 🚨⚡LoP Rahul Gandhi’s helicopter denied permission from flying in JharkhandIt’s been more than 2 hours but no permission granted yet 🚨Why is Modi & BJP so scared? pic.twitter.com/WJltLvaB5p— Ankit Mayank (@mr_mayank) November 15, 2024హెలికాప్టర్ టేకాఫ్కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్స్పేస్ మేనేజ్మెంట్ ఆందోళనలు హోల్డ్అప్కు కారణమై ఉండవచ్చని సమాచారం. -
తిరుమల శ్రీవారి ఆలయంపై హెలికాప్టర్ చక్కర్లు..
-
తిరుమల శ్రీవారి ఆలయంపై హెలికాఫ్టర్ చక్కర్లు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై సోమవారం ఉదయం ఓ హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం విరుద్దం. కానీ ఇటీవల తిరుమలలో అధికంగా విమానాలు, హెలికాప్టర్లు తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే సంఘ విద్రోహ శక్తుల నుంచి తిరుమలకు ముప్పు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు అందాయికాగా శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరచుగా తిరుమల కొండ మీదుగా విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. -
టెన్నిస్ టోర్నమెంట్.. హెలికాప్టర్లలో స్టేడియానికి
గ్వాడలహారా (మెక్సికో): ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు టోర్నీ నిర్వాహకులు ఏకంగా హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో ప్రస్తుతం డబ్ల్యూటీఏ–500 టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతోంది.ఇక్కడ తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. హోటల్స్ నుంచి ప్లేయర్లను నిరీ్ణత సమయంలోగా స్టేడియానికి తీసుకొచ్చేందుకు రోడ్డు మార్గంలో కుదరదని భావించిన గ్వాడలహారా టోర్నీ ఆర్గనైజర్లు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.దీనిపై టోర్నీ డైరెక్టర్ గుస్టావో శాంటోస్కాయ్ మాట్లాడుతూ ప్లేయర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. క్రీడాకారిణులు కూడా ఈ తరహా రవాణా అనుభవాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కొన్ని టోర్నీల్లో అప్పుడప్పుడు ప్లేయర్లను ఇలా హెలికాప్టర్లలో వేదిక వద్దకు తీసుకొస్తారు. కానీ రెగ్యులర్గా మాత్రం ఈ సదుపాయం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిసారి ప్లేయర్లను చాపర్లలోనే హోటల్ గదుల నుంచి టెన్నిస్ కోర్టులకు తీసుకొస్తున్నారు’ అని డబ్ల్యూటీఏ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలెక్స్ ప్రియర్ తెలిపారు. ఆకాశ మార్గాన త్వరితగతిన వేదికకు చేరుకోవడం ద్వారా ప్లేయర్లంతా ఎలాంటి ప్రయాణ బడలిక లేకుండా మ్యాచ్ల బరిలోకి దిగుతున్నారు. గ్వాడలహారా సబర్బన్ సిటీలో రోడ్డు మార్గాలన్నీ రద్దీగా ఉంటాయి. ప్లేయర్లు బస చేసే హోటల్స్ నుంచి టోర్నీ వేదికకు మధ్య దూరం 11 కిలో మీటర్లు ఉంటుంది. అయితే ఈ మాత్రం దూరానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టడంతో నిర్వాహకులు చాపర్లను అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల నాలుగైదు నిమిషాల్లోనే క్రీడాకారిణులు స్టేడియానికి చేరుకుంటున్నారు.చదవండి: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత.. -
రష్యాలో కుప్పకూలిన హెలికాప్టర్.. 22 మంది మృతి
మాస్కో: తూర్పు రష్యాలో 22 మందితో ప్రయాణిస్తూ అదృశ్యమైన హెలికాప్టర్ ఘటన విషాదాంతమైంది. హెలికాప్టర్ కూలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. హెలికాప్టర్ నుంచి చివరిసారి సంకేతాలు వచ్చిన ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు వెల్లడించారు.హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నవారిలో అందరూ చనిపోయినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు 17 మంది మృతదేహాలు వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మిగతా ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.A Vityaz Aero Mil Mi-8 helicopter (RA-25656) impacted terrain at an elevation of 900 m after taking off from the Vachkazhets volcano in Kamchatka Krai, Russia. At least 17 occupants have reportedly died:https://t.co/qGBfRTfp6z pic.twitter.com/fEUPuoUZQ4— Aviation Safety Network (ASN) (@AviationSafety) September 1, 2024 ఎంఐ-8 శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులతో రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చత్కా ద్వీపకల్పంలోని వచ్కజెట్స్ అగ్ని పర్వతం సమీపం నుంచి శనివారం(ఆగస్టు31) బయల్దేరింది. కానీ, గమ్యస్థానానికి చేరలేదు.వచ్కజెట్స్ సమీపంలో రాడార్ నుంచి హెలికాప్టర్ మాయమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. ఎంఐ-8 శ్రేణి హెలికాప్టర్లు తరచు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ రష్యాలో వాటిని ఎక్కువగా వినియోగిస్తుండడం గమనార్హం. -
హెలికాప్టర్ను కిందికి వదిలేశారు
రుద్రప్రయాగ(ఉత్తరాఖండ్): దాదాపు మూడు నెలలుగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్న ఓ హెలికాప్టర్ను తరలించేందుకు చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదాన్ని శంకించిన వైమానిక దళ(ఐఏఎఫ్) ఎంఐ–17 చాపర్ పైలట్ ఆ హెలికాప్టర్ను కొద్దిదూరం వెళ్లాక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ మే 24వ తేదీన కేదార్నాథ్కు తీర్థయాత్రికులతో వచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ హెలికాప్టర్ గిరికీలు కొడుతూ హెలిప్యాడ్కు సమీపంలో ల్యాండయ్యింది. అదృష్టవశాత్తూ అందులోని యాత్రికులు, పైలట్ సహా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోయింది. దానిని మరమ్మతుల కోసం గౌచార్కు తరలించాలని అధికారులు భావించారు. వైమానిక దళానికి చెందిన ఎంఐ –17 రకం చాపర్ శనివారం ఉదయం దానిని తీసుకుని బయలుదేరింది. గాల్లోకి లేచి ముందుకు సాగిన కొద్దిసేపటికే బ్యాలెన్స్ తప్పింది. హెలికాప్టర్ బరువెక్కువగా ఉండటంతోపాటు, కొండప్రాంతం కావడంతో పైలట్ ప్రమాదాన్ని శంకించారు. అధికారుల సూచనలతో థారు క్యాంప్కు సమీపంలోని కొండ ప్రాంతంలో జన సంచారం లేని చోట హెలికాప్టర్ను వదిలేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ఎటువంటి కూడా సామగ్రి లేదన్నారు. ఘటనాస్థలికి నిపుణుల బృందం చేరుకుని, పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. హెలికాప్టర్ కూలిందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. -
రష్యాలో హెలికాప్టర్ గల్లంతు
మాస్కో: తూర్పు రష్యాలోని కమ్చత్కాలో 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతయింది. హెలికాప్టర్లో ఉన్నవారిలో 19 మంది ప్రయాణికులు కాగా ముగ్గురు సిబ్బంది. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ రవాణా ఏజెన్సీ తెలిపింది. ఎంఐ-8టి శ్రేణికి చెందిన ఈ హెలికాప్టర్ శనివారం(ఆగస్టు31) కమ్చత్కాలోని వచ్కజెట్స్ అగ్నిపర్వతం వద్ద నుంచి బయలుదేరింది. కానీ గమ్యస్థానం చేరలేదని సమాచారం. హెలికాప్టర్ షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానం చేరిన తర్వాత పైలట్ల వద్ద నుంచి రావాల్సిన సమాచారం రాలేదు. హెలికాప్టర్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన హెలికాప్టర్ 1960లో తయారైన డబుల్ ఇంజిన్ హెలికాప్టర్. ఈ మోడల్ హెలికాప్టర్లు తరచూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ వీటిని రష్యాతో పాటు ఇతర దేశాల్లో ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. -
ఎయిర్ లిఫ్టింగ్.. నదిలో పడిపోయిన హెలికాప్టర్
డెహ్రాడున్: మరమ్మత్తులకు గురైన ఓ హెలికాప్టన్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ఎంఐ-17 హెలికాప్టర్ తరలిస్తుండగా.. ఒక్కసారిగా గాలిలోనే జారి నదిలో పడిపోయింది. ఇటీవల కేదార్నాథ్ సమీపంలోని భీంబాలి సమీపంలో ఓ హెలికాప్టర్ మరమ్మతులకు గురైంది. అయితే దానిని శనివారం ఎంఐ17 హెలికాప్టర్తో అధికారులు లిఫ్ట్ చేశారు. తరలిస్తుండగానే ఎంఐ17 హెలికాప్టర్ తీగ తెగి నదిలో పడిపోయింది. ఈ ఘటనుకు సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.‘‘ఎంఐ-17 హైలికాప్టర్ మరమ్మత్తులకు గురైన చిన్న హెలికాప్టర్ను గౌచర్ ల్యాండింగ్ స్ట్రిప్కు తీసుకువెళుతోంది. గాలి పీడనం, చిన్న హెలికాప్టర్ బరువు కారణంగా ఎంఐ-17 హెలికాప్టర్ బ్యాలెన్స్ కోల్పోయింది. అనంతరం కిందకు జారి నదిలో పడిపోయింది’’ అని జిల్లా పర్యాటక అధికారి రాహుల్ చౌబే పేర్కొన్నట్లు జాతీయమీడియా పేర్కొంది.VIDEO | Uttarakhand: A defective helicopter, which was being air lifted from #Kedarnath by another chopper, accidentally fell from mid-air as the towing rope snapped, earlier today.#UttarakhandNews(Source: Third Party) pic.twitter.com/yYo9nCXRIw— Press Trust of India (@PTI_News) August 31, 2024 -
నేపాల్లో హెలికాప్టర్ ప్రమాదం.. నలుగురి మృతి
ఖాట్మాండు: నేపాల్లో హెలికాప్టర్ కూలిపోయింది. బుధవారం మధ్యాహ్నం నువాకోట్ జిల్లాలోని శివపురి ప్రాంతంలో ఎయిర్ డైనాస్టీ హెలికాప్టర్ కూలిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఖాట్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్-7 వద్ద హెలికాప్టర్ కొండను ఢీకొట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మధ్యాహ్నం 1:54 గంటలకు ఖాట్మండు నుంచి బయలుదరి.. సూర్య చౌర్ చేరుకున్న తర్వాత అధికారులతో సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే హెలికాప్టర్లో సంబంధాలు తెగిపోయనట్లు అధికారులు పేర్కొన్నారు. -
ఇండియాలో హెచ్125 హెలికాఫ్టర్స్
ఫ్రెంచ్ విమానాల తయారీదారు ఎయిర్బస్ భారతదేశంలో హెచ్125 హెలికాఫ్టర్లను అసెంబ్లింగ్ చేయడానికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL)తో ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 'మేడ్ ఇన్ ఇండియా' హెచ్125ల డెలివరీలు 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఫార్న్బరో ఇంటర్నేషనల్ ఎయిర్షో 2024లో ఈ ఒప్పందంపై చేసినట్లు.. ఎయిర్బస్ సీఈఓ గుయిలౌమ్ ఫౌరీ అండ్ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటించారు. కంపెనీ భారతదేశంలో హెలికాప్టర్ తయారీ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది పౌర విమానయాన వృద్ధికి తోడ్పడుతుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుకరన్ సింగ్ అన్నారు.హెచ్125 ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రధాన కాంపోనెంట్ అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ హార్నెస్ల ఇన్స్టాలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్లు, ఫ్లైట్ కంట్రోల్స్, డైనమిక్ కాంపోనెంట్స్, ఫ్యూయల్ సిస్టమ్ అండ్ ఇంజన్ల ఏకీకరణను చేపడుతుంది. ఇది హెలికాప్టర్ల టెస్టింగ్ వంటి వాటిని కూడా నిర్వహిస్తుంది.హెచ్125 అనేది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్. ఈ విభాగంలో హెచ్125 అనేది ఇతర హెలికాఫ్టర్ల కంటే ముందు ఉంది. ఈ హెలికాఫ్టర్ స్క్విరెల్ (Ecureuil) కుటుంబానికి చెందింది.హెచ్125 హెలికాఫ్టర్ వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. వీటిని వైమానిక దళాలు మాత్రమే కాకుండా, అగ్నిమాకప, రెస్క్యూ, ఎయిర్ అంబులెన్స్, ప్రయాణీకుల రవాణా వంటి వివిధ కార్యకలాపాలలో కూడా విరివిగా ఉపయోగించారు. ఎవరెస్ట్ శిఖరంపై ల్యాండ్ అయిన ఏకైక హెలికాప్టర్ కూడా ఇదే కావడం గమనార్హం. -
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్కు ప్రమాదం
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్బైజాన్లో కూలిపోయినట్లు తెలుస్తోంది. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవాడనికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు. అందులో ఎవరు ఉన్నారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. భారీ పొగమంచు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలుగుతోందని ఇరాన్ మీడియా సంస్థలు కథనాల్ని వెలువరించాయిటెహ్రాన్ టైమ్స్ ప్రకారం.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన మీడియా కథనాలు చెబుతున్నాయి. కాగా, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాఫ్టర్ ప్రమాదంపై పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. -
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
భువనేశ్వర్: దేశంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అక్కడక్కడా వర్షం కురుస్తూ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో గాలివాన తీవ్రతరమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు.ఎన్నికల ప్రచారం ముగించుకుని ఖరియార్ నుంచి తిరిగి వస్తుండగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేడీ నాయకుడు కార్తిక్ పాండియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్ 30 నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ ఝర్సుగూడకు బయలుదేరింది.జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. ఝర్సుగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నవీన్ పట్నాయక్, బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండియన్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.#WATCH | Odisha: While returning from Khariar, the helicopter carrying CM Naveen Patnaik and 5T Chairman and BJD leader VK Pandian couldn't land at Bhubaneswar airport due to wind and rain. After hovering over the airport for nearly 30 minutes, the helicopter headed to… pic.twitter.com/B0lyEMQYN4— ANI (@ANI) May 6, 2024 -
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
ఉత్తరాఖండ్లోని కుమావోన్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లోని కార్చిచ్చును ఆర్పేందుకు స్థానిక యంత్రాంగం మొదలుకొని, సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదు. హెలికాప్టర్ నుంచి బాంబీ బకెట్ ద్వారా అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇంతకీ బాంబీ బకెట్ అంటే ఏమిటి? అది అగ్ని కీలలను ఎలా నియంత్రిస్తుంది?అటవీ ప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు నైనితాల్ పరిసర ప్రాంతాలలో భారత వైమానిక దళం ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ను వినియోగిస్తోంది. దీనిసాయంతో బాంబీ బకెట్ల ద్వారా అడవుల్లో నీటిని వెదజల్లుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బాంబీ బకెట్లను హెలికాప్టర్లుకు అనుసంధానం చేస్తూ, అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేస్తున్నారు.బాంబీ బకెట్ అనేది ఒక ప్రత్యేక వైమానిక అగ్నిమాపక సామగ్రి. దీనిని 1980 నుండి వినియోగిస్తున్నారు. ఇది హెలికాప్టర్ నుంచి తేలికగా తెరవగల కంటైనర్. దిగువన ఉన్న ప్రాంతాలకు దీని ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. బాంబీ బకెట్ వివిధ పరిమాణాలు, నమూనాలలో అందుబాటులో ఉంది. దీని సామర్థ్యం 270 లీటర్ల నుండి 9,840 లీటర్లకు మించి ఉంటుంది.బాంబీ బకెట్ను 1982లో కెనడియన్ వ్యాపారవేత్త డాన్ ఆర్నీ కనుగొన్నారు. ఈ బకెట్లను ఫైబర్గ్లాస్, ప్లాస్టిక్ కాన్వాస్తో మెటల్ ఫ్రేమ్తో తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్లో బాహ్య ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో నీటిని ఎక్కడి నుండైనా నింపవచ్చు. అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు బాంబీ బకెట్లు ఎంతగానో ఉపయక్తమవుతాయి. -
అదుపుతప్పిన అమిత్ షా హెలికాప్టర్.. నేలను తాకబోయి...
పాట్నా: కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షాకు పెద్ద ప్రమాదం తప్పింది. షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా అదుపుతప్పి నియంత్రణ కోల్పోయింది. బిహార్లోని బెగుసరాయ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు సోమవారం(ఏప్రిల్29) ఈ ఘటన జరిగింది.ప్రచారం ముగించుకుని అమిత్ షా హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ గాల్లోకి లేచే సమయంలో ఊగిసలాడి కుడివైపుకు వెళ్లింది. ఒక దశలో కిందకు వచ్చి నేలను తాకే దాకా వెళ్లింది. ఇంతలో అప్రమత్తమైన హెలికాప్టర్ను పైలట్ నియంత్రణలోకి తీసుకోవడంతో సరైన దిశలో ప్రయాణించింది. ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.— Dr. Abhishek Verma (@AbhishekVermaX) April 29, 2024 -
హెలికాప్టర్ వద్దన్నందుకు.. ఎడ్లబండిలో వచ్చి నామినేషన్
పాట్నా:ఎన్నికల వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో పాటు చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా నామినేషన్ పర్వంలోనైతే అభ్యర్థులు తమ బలాబలాలను ప్రదర్శిస్తుంటారు.ఈ క్రమంలోనే ఆసక్తికర ఘటనలు, పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. ఇదే తరహాలో బిహార్లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ వేసేందుకు హెలికాప్టర్లో వస్తానని అధికారులను అనుమతి అడిగారు. హెలికాప్టర్లో వచ్చి నామినేషన్ వేసేందుకు స్వతంత్ర అభ్యర్థి అమ్రేష్రాయ్కి అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన హెలికాప్టర్ నుంచి ఏకంగా ఎడ్లబండి రేంజ్కు వచ్చేశారు.ఎడ్లబండిలో ఊరేగింపుగా వచ్చి డ్యాన్సులతో హోరెత్తించి నామినేషన్ దాఖలు చేశారు. హెలికాప్టర్కు అనుమతివ్వనందుకే తాను ఎడ్లబండిలో వచ్చి నామినేషన్ వేశానని అమ్రేష్రాయ్ చెప్పారు. ఇదీ చదవండి.. పొలిటికల్ ఎంట్రీపై డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు -
అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్లో ఐటీ సోదాలు
కలకత్తా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రధాన కార్యదర్శి, సీఎం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ హెలికాప్టర్ను ఆదివారం(ఏప్రిల్14) ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) అధికారులు తనిఖీ చేశారు. కలకత్తాలోని బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో ఈ తనిఖీలు జరిగాయి. హెలికాప్టర్ వెళ్లకుండా ఐటీ అధికారులు చాలా సేపు అడ్డుకున్నారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. తనిఖీల సందర్భంగా అభిషేక్ బెనర్జీ సెక్యూరిటీ సిబ్బందికి ఐటీ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. తనిఖీలపై అభిషేక్బెనర్జీ ట్విటర్(ఎక్స్)లో స్పందించారు.‘ఇటీవల ప్రజల ఆగ్రహానికి గురైన ఎన్ఐఏ స్థానిక డీజీ, ఎస్పీలను తొలగించకుండా నా హెలికాప్టర్లో తనిఖీలకు ఐటీ అధికారులను పంపించారు. వారికి తనిఖీల్లో ఏం దొరకలేదు. జమీందార్లు ఎన్నిరకాల ఒత్తిళ్లు పెట్టినా బెంగాల్ తలవంచదు’ అని పోస్టులో బెనర్జీ పేర్కొన్నారు. అభిషేక్ బెనర్జీ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే విమర్శలు -
లద్దాఖ్లో ఐఏఎఫ్ అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దీంతో హెలికాప్టర్ దెబ్బతింది. లాద్దాఖ్లో కొండచరియలు, ఎత్తైన ప్రదేశాల కారణంగా చాపర్ దెబ్బతినడంతో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేసినట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. లడఖ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ (AOR)లో ఎత్తైన ప్రదేశాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి శిక్షణ ఇచ్చే సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్ను సమీపంలోని వాయుసేన స్థావరానికి చేర్చారు. ఈ ఘటనపై భారత వైమానిక దళం కోర్టు విచారణకు ఆదేశించింది. -
ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!
మనదేశంలో గోమాతలను దేవతగా పూజించడం వంటివి చేస్తారు. అయితే మనవాళ్లు వాటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ మన కంటే బాగా శ్రద్ధ చూపించే మరో దేశం ఉంది. మనం దేవతలా ఆవుని పూజించినా..ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఏ వ్యాన్లోనో తీసుకువెళ్తాం కదా!. కానీ వీళ్లు ఆవుని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు.! ఆవుని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదేంటి ఆవుని ఇలా తీసుకువెళ్తున్నారు అనుకోకండి. ఎందుకంటే దానికి గాయాలు కావడంతో స్విట్జర్లాండ్ అధికారులు ఏకంగా హెలికాప్టర్ని రంగంలోకి దింపి మరి ఆస్పత్రికి తరలిస్తునన్నారు. అయతే ఇలాంటి ఆవులు మన దేశంలో ఉండవు. వీటిని'హెవెన్ ఆన్ ఎర్త్' అని పిలుస్తారు. 23 సెకన్ల నిడివిగల ఈ వీడియో అమెజింగ్ నేచుర్ అనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. అయితే ఈ ఘటన మనకు వింత గానీ స్విట్జర్లాండ్ వాసులకు మాత్రం కాదట. ఇలా హెలికాప్టర్తో ఆవుని తరలించిన ఘటనలు అక్కడ పలుమార్లు జరిగాయట. గాయపడిన ఆవులను పర్వతాల మీద నుంచి హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తారట అక్కడ అధికారులు. ఏదీఏమైనా ఆవుల పట్ల ఇంతలా శ్రద్ధని, ప్రేమను చూపడం నిజంగా గ్రేట్ కదూ!. A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024 (చదవండి: 'అరుంధతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!
రైట్ బ్రదర్స్ విమానాన్న కనిపెడితే..ఈ బ్రదర్స్ కారుని హెలికాప్టర్గా మార్చారు. అది తమ జీవనోపాధికి ఉపయోగపడుతుందనుకున్నారు. కానీ ఇలా మార్పులు చేయాలంటే అధికారులు అనుమతి తప్పనసరి. అది తెలియక ఈ అన్నదమ్ములూ తయారు చేసిన కారు కమ్ హెలికాప్టర్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీంతో అన్నదమ్ములిద్దరు తలలుపట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ను హెలికాప్టర్గా మార్చారు. ఈశ్వర్దీన్, పరమేశ్వర్దీన్ అనే ఈ అన్నదమ్ములు.. వివాహాలకు ప్రత్యేకంగా కనిపించేలా కారును హెలీకాప్టర్లా మార్చారు. వధూవరులను తీసుకుని వెళ్లాలా ప్రత్యేకతగా ఉండాలనుకున్నారు. అందుకోసం హెలికాప్టర్ రోటర్ బ్లేడ్ను కారు పైకప్పుపై వెల్డింగ్ చేసి అతికించారు. కారు బూట్కు హెలీకాఫ్టర్ కు ఉండే తోకను జోడించారు. ఇలా కారు కమ్ హెలికాప్టర్లా విలక్షణంగా రూపొందిచారు. పైగా దీనివల్ల తమ కుటుంబానికి మంచి జీవనోపాధిగా ఉంటుందనేది వారి ఆలోచన. ఆ నిమిత్తమే ఈ ఇద్దరు సోదరులు కారుని హెలికాప్టర్లా మార్పుల చేసి చక్కగా రంగులు వేసేందుకు తీసుకువెళ్తుండగా ఊహించని విధంగా పోలీసుల వారిని అడ్డుకుని వాహనాన్ని చీజ్ చేశారు. అయితే ఈ అన్నదమ్ములు కారుని హెలికాప్టర్గా మార్చారు గానీ అందుకు అనుమతలు తప్పనసరి. ఇది తెలియకపోవడంతోనే ఈ బ్రదర్స్ అధికారులతో సమస్యను ఎదుర్కొన్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రవాణా నిబంధనలను పాటించనందుకు, సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా ఇలా మార్పులు చేసినందుకు సీజ్ చేశామని చెప్పారు. ఈ మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే మాట్లాడుతూ, "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కారణంగా, పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి ఒక తనిఖీ సమయంలో, ట్రాఫిక్ పోలీసులు ఈ కారును పట్టుకున్నట్లు తెలిపారు. మార్పులకు అనుమతి అవసరం కాబట్టి ఆర్టీవో విభాగం, వాహనాన్ని మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద సీజ్ చేసినట్లు వెల్లడించారు." పాండే. అయితే ఈ అన్నదమ్ములు చివరికీ జరిమాన చెల్లించి ఏదోలా వాహనాన్ని విడిపించుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. यूपी के अंबेडकर नगर में दो भाईयों ने जुगाड़ से कार को हेलीकॉप्टर बना दिया. डेंट- पेंट कराने जा रहे थे तभी पुलिस ने पकड़ लिया. और गाड़ी(हेलीकॉप्टर) सीज कर दी. pic.twitter.com/wK9QLaFZ1k — Priya singh (@priyarajputlive) March 17, 2024 (చదవండి: పార్కింగ్ స్థలంలో 1800 ఏళ్ల నాటి పురాతన విగ్రహం!) -
కుమార్తెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికిన ఎడిటర్
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికర ఉదంతం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా నిలిచింది. ఓ తండ్రి తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించాక, ఆమెను హెలికాప్టర్లో అత్తవారింటికి పంపారు. ప్రతాప్గఢ్ జిల్లాలోని పట్టి తహసీల్ ఉపాధ్యాయపూర్ గ్రామానికి చెందిన కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివకు అత్యంత ఘనంగా వివాహం జరిపించారు. అనంతరం ఆమెకు హెలికాప్టర్లో వీడ్కోలు పలికారు. సుల్తాన్పూర్లోని శంకర్గఢ్కు చెందిన సత్యప్రకాష్ పాండే కుమారుడు సతీష్ పాండేతో శివకు వివాహం జరిగింది. ప్రతాప్గఢ్లోని రాణి రామ్ ప్రియా గార్డెన్లో వీరి వివాహ వేడుక జరిగింది. అనంతరం కృపాశంకర్ తివారీ తన కుమార్తె శివను తన స్వగ్రామం ఉపాధ్యాయపూర్ నుండి హెలికాప్టర్లో అత్త వారింటికి పంపించారు. హెలికాప్టర్లో వధూవరులు కూర్చున్నారు. ఆ సమయంలో వీరిని చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ముంబై నుండి ప్రచురితమయ్యే ‘అభ్యుదయ వాత్సల్యం’ పత్రికకు కృపాశంకర్ తివారీ చీఫ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు అలోక్ రంజన్ తివారీ ఎటర్నల్ కార్పొరేట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ. -
మేడారం జాతరకు హెలికాప్టర్
ఏటూరునాగారం/ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్ను నడుపుతోంది. ఈ సేవలు నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానున్నాయి. హనుమకొండలోని సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ మైదానం నుంచి మేడారం వరకు సేవలందిస్తుంది. చార్జీలు ఇలా... ఒక్కో ప్యాసింజర్ (అప్ అండ్ డౌన్)కు వీఐపీ దర్శనం రూ. 28,999, జాతరలో ఏరియల్ వ్యూరైడ్ ఒక్కొక్కరికి రూ.4,800. బుకింగ్ ఇలా..: హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 74834 33752, 94003 99999 సెల్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఆన్లైన్లో info@helitaxi. com ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ సేవలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పర్యాటక శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయి. -
కేసీఆర్ కోసం హెలికాప్టర్ సిద్ధం
-
హెలికాప్టర్ ప్రమాదం: ప్రముఖ బ్యాంక్ సీఈఓ దుర్మరణం!
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నైజీరియాలోని అతిపెద్ద access bank సీఈఓతో సహా 9 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. కాలిఫోర్నియాలోని నిప్టన్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో కూలిపోయిన సమయంలో హెలికాప్టర్లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారిలో access bank యాక్సెస్ బ్యాంక్ గ్రూప్ సీఈఓ హెర్బర్ట్ విగ్వే ఉన్నారని, ఆయన మరణాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకోంజో ఇవెలా ఎక్స్లో పోస్ట్ చేశారు. నైజీరియన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ మాజీ చైర్మన్ అబింబోలా ఒగున్బాంజో సైతం విగ్వే మరణాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా.. ప్రమాద స్థలం హాలోరాన్ స్ప్రింగ్స్ రోడ్డు సమీపంలోని 15-ఫ్రీవేకు తూర్పున ఉందని నిర్ధారించామని శాన్ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. ఈ హెలికాప్టర్ను యూరోకాప్టర్ ఈసీ 130గా గుర్తించిన ఎఫ్ ఏఏ.. నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో కలిసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా, లాస్ వెగాస్కు వెళ్తుండగా నెవాడా- కాలిఫోర్నియా సరిహద్దు నగరం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. -
హెలికాప్టర్ క్రాష్.. చిలీ మాజీ అధ్యక్షుడి మృతి
సాంటియాగో: చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా (74) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. పినేరా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దక్షిణ చిలీలోని ఓ సరస్సులో కూలిపోయింది. ప్రమాదం జరిగినపుడు హెలికాప్టర్లో పినేరాతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ప్రమాదంలో పినేరా ఒక్కరే మృతిచెందగా మిగతావారు గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్ను పినేరానే స్వయంగా నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. పినేరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిలీ ఆర్మీ ప్రకటించింది. చిలీ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పినేరా తొలిసారి 2010 నుంచి 2014 వరకు, రెండోసారి 2018 నుంచి 2023 వరకు దేశాధ్యక్షుడిగా పదవిలో ఉన్నారు. బిలియనీర్ అయిన పినేరా చిలీలోని అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన మృతి పట్ల దక్షిణ అమెరికా దేశాధినేతలతో పాటు పలువురు ఇతర దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఇదీ.. చదవండి..పాక్ ఎన్నికల బరిలో ఆమె అంతంతే -
Nasa: మార్స్పై హెలికాప్టర్ క్రాష్
కాలిఫోర్నియా: అంగారకుని(మార్స్)పై అమెరికా అంతరిక్ష పరిశోపధన సంస్థ నాసాకు చెందిన మినీ హెలికాప్టర్ మూడేళ్ల ప్రస్థానం ముగిసింది. అంగారకునిపై ఈ నెల 18న చివరిసారిగా ఎగిరి ల్యాండ్ అయ్యే సమయంలో రోటర్ చెడిపోయి మినీ హెలికాప్టర్ క్రాష్ అయినట్లు నాసా ప్రకటించింది. మార్స్పై ఇన్జెన్యూటీ మినీ హెలికాప్టర్ ప్రయాణం ముగిసిందని నాసా అధికారులు తెలిపారు. హెలికాప్టర్ క్రాష్కు గల కారణాలను అణ్వేషిస్తున్నట్లు చెప్పారు. 2021 ఏప్రిల్లో మార్స్పై ల్యాండ్ అయినప్పుడు తొలుత హెలికాప్టర్ 30 రోజులు పనిచేస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా అది 3 సంవత్సరాల పాటు పనిచేసి మార్స్పై 14 సార్లు ఎగరగలిగింది. సౌరవ్యవస్థలో సరికొత్త ఏవియేషన్ ప్రయోగాలకు ఇన్జెన్యూటీ నాంది పలికింది. మార్స్పై ఇన్జెన్యూటీ హెలికాప్టర్ను ప్రిజర్వెన్స్ రోవర్ ఆపరేట్ చేసింది. ఇదీచదవండి.. మూన్ ష్నైపర్ శీర్షాసనం -
విమానమెక్కి.. శ్రీరాముణ్ణి మొక్కి!
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంబోత్సవానికి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గర్భగుడిలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా రామ భక్తులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఆహ్వానాలు వెళ్లాయి. దీంతో అయోధ్యకు వెళ్లే హెలికాప్టర్, చార్టర్డ్ విమానాలకు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈనెల 22న అయోధ్య విమానాశ్రయంలో 100 చార్టర్డ్ విమానాలు దిగుతాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. లక్షమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఇప్పటికే క్యాబ్లు, రైళ్లు ఫుల్ ఇప్పటికే జనవరి 22 నాటికి రైల్వే టికెట్ బుకింగ్లు 60 శాతం మేర పెరిగాయి. అలాగే అయోధ్యలో క్యాబ్ ఆపరేటర్ల బుకింగ్లు 50 శాతం పెరుగుతాయని ట్రావెల్ పోర్టళ్ల అంచనా. ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలు డిసెంబర్ 30 నుంచి దేశంలోని ప్రధాన మెట్రో నగరాల నుంచి అయోధ్యకు సాధారణ విమాన సేవలను ప్రారంభించాయి. ప్రస్తుతం అయోధ్యకు రోజుకు నాలుగు విమాన సర్విస్లు నడుస్తున్నాయని, రాబోయే రోజుల్లో ఇది 20–24కు పెరుగుతుందని అయోధ్య విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చార్టర్డ్ ఫ్లయిట్ ఆపరేటర్ల నుంచి 42 ఎంక్వయిరీలు వచ్చినట్లు చెప్పాయి. అయోధ్య విమానాశ్రయంలో విమానాల కోసం తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఈనెల 22న ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థలు ప్రయాణికులను పికప్, డ్రాప్ మాత్రమే చేయాలని, విమానాలను లక్నో, వారణాసి, ఖుషీనగర్, పాటా్న, ఢిల్లీ వంటి పొరుగు విమానాశ్రయాల్లో పార్కింగ్ చేయాలని సూచించారు. మెట్రో నగరాల నుంచి డిమాండ్ మిలియన్ ఎయిర్, క్లబ్ వన్ ఎయిర్, ఎంఏబీ ఏవియేషన్, జెట్సెట్గో వంటి ప్రైవేట్ చార్టర్డ్ విమాన సంస్థలు అయోధ్యకు విమాన సేవలను అందిస్తున్నాయి. ఈ ఏడాది చార్టర్డ్ ఫ్లయిట్లు, హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగిందని ఎయిర్ చార్టర్డ్ సంస్థ క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా తెలిపారు. తెలంగాణ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, అహ్మదాబాద్లో వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్టర్ సమిట్లతో ప్రైవేట్ చార్టర్డ్ ఆపరేటర్లకు గిరాకీ పెరిగిందని తెలిపారు. తాజాగా రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యకమంతో చార్టర్డ్ ఫ్లయిట్ల కోసం ఎంక్వయిరీలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే 12 సీట్ల జెట్ ఫాల్కన్ 2000 బుక్ అయిందని చెప్పారు. ఆలయ ప్రారంభోత్సవం రోజున చార్టర్డ్ విమానాల కోసం 25 ఎంక్వయిరీలు వచ్చాయని మరో ఎయిర్క్రాఫ్ట్ సంస్థ ప్రతినిధి తెలిపారు. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, పుణే, నాగ్పూర్ వంటి మెట్రో నగరాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. సీటింగ్ను బట్టి చార్జీలు విమానం సైజు, సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి ఈ మార్గంలో ధర రూ.10–20 లక్షలు ఉంటుందని ప్రైవేట్ ఎయిర్క్రాప్ట్ కంపెనీలు తెలిపాయి. అయితే చలికాలం నేపథ్యంలో పొగమంచు, తక్కువ విజిబిలిటీ కారణంగా అయోధ్యకు విమాన సర్విసులు సవాలేనని, దీంతో అయోధ్యకు ప్రైవేట్ చార్టర్డ్ ఎయిర్క్రాఫ్ట్ల అనుమతులపై విమానాశ్రయ వర్గాల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉందని తెలిపాయి. ప్రస్తుతం అయోధ్య విమానాశ్రయం రోజుకు 6 గంటలు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈనెల 22న ఆలయ ప్రారంబోత్సవం రోజున మాత్రం 24 గంటలు తెరిచి ఉండేలా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. -
లాంచ్కు సిద్దమవుతున్న సరికొత్త హెలికాఫ్టర్ - ఇది చాలా స్పెషల్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో కొత్త కొత్త వాహనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, CNG కార్లతో పరుగులు పెడుతున్న ఆటోమొబైల్ మార్కెట్లో మరో అడుగు ముందుకు వేసి మానవరహిత హెలికాప్టర్ను ఉత్పత్తి చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోటర్ టెక్నాలజీస్ ఇప్పుడు ఓ మానవ రహిత హెలికాప్టర్ తయారు చేయడంలో నిమగ్నమైంది. రాబిన్సన్ ఆర్44 రావెన్ II ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆర్550ఎక్స్ హెలికాఫ్టర్ మూడు గంటల కంటే ఎక్కువ సమయం, గంటకు 241 కిమీ/గం వేగంతో ప్రయాణించనుంది. ఇది సుమారు 550 కేజీల బరువును తీసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆర్550ఎక్స్ హెలికాఫ్టర్ టెస్టింగ్కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో చాలా సింపుల్గా కనిపించే ఈ హెలికాప్టర్ను రిమోట్స్ వంటి పరికరాల ద్వారా ఆపరేట్ చేయడం చూడవచ్చు. ఇది చూడటానికి ఓ డ్రోన్ తరహాలో ఉంది. ఇందులో సెన్సార్లు, ఇతర ఆధునిక పరికరాలు ఉండటం వల్ల రాత్రి పూట కూడా వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. ఇది సాధారణ నాలుగు సీట్లు కలిగిన హెలికాఫ్టర్ మాదిరిగానే కనిపించినప్పటికీ.. ఇందులో పెద్ద కార్గో బే తప్ప సీట్లు లేదు. ఇందులో ఏదైనా లోడ్ (సరుకులు) వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. గ్రౌండ్ బేస్డ్ శాటిలైట్ కమ్యూనికేషన్ రిలే నుంచి 16 కిమీ లేదా ఎయిర్బోర్న్ రిలే 16000 కిమీ వరకు కమ్యూనికేట్ చేయడానికి అనుకూలంగా ఉందనున్నట్లు సమాచారం. కమ్యూనికేషన్లు పోయినట్లయితే.. ఏక కాలంలో ఆరు వేర్వేరు డేటా లింక్లను రన్ చేయగలదు, తద్వారా మళ్ళీ కనెక్ట్ చేసుకోవచ్చు, తద్వారా తిరిగి దాని బేస్లోకి తీసుకురావచ్చు. ఇలాంటి హెలికాఫ్టర్లు కార్గో డెలివరీలు, అగ్నిప్రమాదం సమయంలో అగ్నిమాపక మిషన్లుగా కూడా పనిచేస్తాయి. ఇదీ చదవండి: దిగ్గజ వ్యాపారవేత్తల రైట్ హ్యాండ్స్.. వీళ్లు ఎంత చెప్తే అంతే! ఈ లేటెస్ట్ హెలికాఫ్టర్ల కోసం కంపెనీ స్పెషల్ ఎయిర్వర్తినెస్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇవి ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాయి, త్వరలోనే అవసరమైన సర్టిఫికెట్స్ కూడా పొందనున్నట్లు తెలుస్తుంది. సంస్థ ఈ రోటర్ ధరను అధికారికంగా వెల్లడించలేదు, అయితే వీటి డెలివరీలు 2024లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Images Source: Rotor Technologies -
సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్లో సాంకేతిక లోపం
కొమరంభీం జిల్లా: కాగజ్నగర్లో సీఎం కేసీఆర్ హెలికాఫ్టర్కు సాంకేతిక లోపం తెలెత్తింది. సిర్పూర్లో హెలికాఫ్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య కారణంగా పైలట్ చాపర్ను నిలిపివేశారు. దీంతో రోడ్డు మార్గాన సీఎం ఆసిఫాబాద్ బయలుదేరారు. సోమవారం కూడా కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సీఎం కేసీఆర్కు ప్రమాదం తృటిలో తప్పిన సంగతి తెలిసిందే. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మహబూబ్ నగర్ పర్యటన కోసం హెలికాఫ్టర్ బయలుదేరారు. అయితే హెలికాఫ్టర్ పైకి లేచిన కొద్ది సమయానికే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే అక్కడే సేఫ్ ల్యాండింగ్ చేశారు. కాగా, సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి ఆదిలాబాద్లో పర్యటిస్తున్నారు. సిర్పూర్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో జరిగే బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. -
హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం
చెక్ రిపబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ తన ఫాలోయర్లకోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా 10 లక్షల డాలర్లను వారి కోసం హెలికాప్టర్ నుంచి జార విడవడం వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే తొలిసారి డాలర్ల వర్షం అంటూ ముందుగానే ప్రకటించి మరీ తన ఫ్యాన్స్ను అబ్బుర పరిచాడు. దీంతో ఈ డబ్బులను దక్కించుకునేందుకు సంచులతో ఎగబడ్డారు ఫ్యాన్స్. లైసా నాడ్ లాబెమ్ పట్టణానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కజ్మా అనే మారుపేరుతో బార్టోస్జెక్ సోషల్మీడియాలో బాగా పాపులర్. తను ప్రకటించిన ఒక పోటీ ప్రకారం కజ్మా తన చిత్రం 'వన్మాన్షో: ది మూవీ'లో పొందుపరిచిన కోడ్ను ఛేదించాలి. అయితే, దీన్ని ఎవరూ పరిష్కరించలేకపోయారు. దీంతో మరో ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రకటించాడు. ఈ ప్రోగ్రాం కింద సైన్ చేసిన వారిందరికీ ఈ ప్రైజ్మనినీ గిఫ్ట్గా ఇవ్వాలని నిర్ణయించాడు. దీని ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటలకు డబ్బును ఎక్కడ పడేస్తాడనే ఎన్క్రిప్టెడ్ సమాచారంతో వారికి ఈమెయిల్ పంపాడు. అన్నట్టుగా సేమ్ ప్లేస్కి వెళ్లి నిర్ణీత సమయంలో తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. హెలికాప్టర్ నుంచి డాలర్ల వర్షం కురపించాడు. ఈ వీడియోను కజ్మా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు ''ప్రపంచంలో తొలిసారి నిజమైన డబ్బు వర్షం. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేదు. గాయాలు కాలేదు కూడా అంటూ తన పోస్ట్లో వెల్లడించాడు. View this post on Instagram A post shared by Kazma Kazmitch (@kazma_kazmitch) -
సామర్లకోట చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
సీఎం వైఎస్ జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ విజువల్స్
-
మమతా బెనర్జీకి తప్పిన పెను ప్రమాదం
బెంగాల్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఈ ఉదయం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టరును అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జల్పాయిపూర్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు వెళ్తూ బైకుంఠాపూర్ అడవులు దాటుతుండగా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. దీంతో సిలిగురి సమీపంలోని సెవోక్ ఎయిర్ బేస్ వద్ద హెలికాప్టరును ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు సిబ్బంది. ఒక్కసారిగా వర్షం ఉధృతం కావడంతో మార్గం స్పష్టంగా లేక ముందుకు వెళ్లడం ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ఈ ఘటనలో మమతా బెనర్జీ స్వల్ప గాయాలతో బయటపడినట్లు చెప్పారు అధికారులు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బాగ్డోగ్రా ఎయిర్ పోర్టుకు చేరుకొని మమతా బెనర్జీ కోల్కతా పయనమైనట్లు తెలిపారు అధికారులు. Due to low visibility, West Bengal CM Mamata Banerjee's helicopter made an emergency landing at Sevoke Airbase. She was going to Bagdogra after addressing a public gathering at Krinti, Jalpaiguri. She is safe, says TMC leader Rajib Banerjee (file pic) pic.twitter.com/IVNIPV3oJD — ANI (@ANI) June 27, 2023 ఇది కూడా చదవండి: సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే! -
చనిపోయినట్లు ప్రాంక్.. హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు
-
చనిపోయినట్లు ప్రాంక్.. హెలికాప్టర్లో ఎంట్రీ ఇచ్చి షాకిచ్చాడు
వర్చువల్ మాయాలోకంలో మనుషుల మధ్య అనుబంధాలు కరువైపోతున్నాయి. ఆప్యాయత, అనురాగాలను ఆన్లైన్లోనే చూపిస్తున్నారు. పైకి సంతోషంగా కనిపిస్తున్నా లోలోపల ఒంటరితనంతో బాధపడుతున్నారు. బెల్జియన్కు చెందిన డేవిడ్ బేర్టెన్ అనే వ్యక్తి బంధువులు తనను తక్కువ చేసి చూస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకు ఓ పథకం వేశాడు. తాను మరణించినట్లు కట్టుకథ అల్లాడు. తీరా కుటుంబసభ్యులు, బంధువులంతా అంత్యక్రియలకు తరలిరాగా సినిమా స్టైల్లో హెలికాప్టర్ నుంచి దిగా అందిరికి షాక్ ఇచ్చాడు.ఇంతకీ డేవిడ్ డెత్ ప్రాంక్ ఎందుకు చేశాడు? ఆ తర్వాత ఏమైంది? వివరాల్లోకి వెళ్తే.. బెల్జియన్కు చెందిన డేవిడ్ బేర్టెన్ తన కుటుంబ సభ్యులు తనని లోకువగా చూస్తున్నారని తెగ ఫీలైపోయేవాడు. సొంత బంధువులే తనను పట్టించుకోవడం లేదని బాగా హర్ట్ అయ్యాడు. సొంతవారే తనను చిన్నచూపు చూడడంతో వారికి బుద్దిచెప్పేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు.ఒక మనిషి లేకపోతే ఆ బాధ ఎంతగా ఉంటుందో, వారి విలువ ఏంటన్నది తెలియజేయాలని తాను మరణించినట్లు కట్టుకథ అల్లాడు. బతికుండగానే తన అంత్యక్రియలను దగ్గరుండి ఏర్పాడు చేశాడు. టిక్టాక్లో బాగా పాపులర్ అయిన డేవిడ్ బేర్టెన్(రాగ్నార్ లే ఫౌ) డెత్ ప్రాంక్ చేయడానికి ఆయన కూతుళ్లు కూడా సహాయం చేయడం మరో విశేషం. వాళ్లు ఎంతలా యాక్టింగ్ చేశారంటే.. తండ్రి నిజంగానే చనిపోయినట్లు వాట్సాప్ సందేశాల్లో పోస్ట్ చేశారు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మీరు ఎప్పటికీ మా ఙ్ఞాపకాల్లో బతికే ఉంటారు అని ఓ కూతురు సోషల్ మీడియాలో షేర్ చేయగా, త్వరలోనే మీరు తాత కాబోతున్నారు. మీరు మాతో ఉండాల్సింది డాడీ..దేవుడు ఇంత అన్యాయం ఎందుకు చేశారు? మీరే ఎందుకు చనిపోవాలి? మిస్ యూ సో మచ్ అంటూ మరో కూతురు ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆన్లైన్లో ఈ పోస్ట్ చూసి అయ్యో పాపం అనుకున్నారంతా. డేవిడ్ లేడనే వార్తతో శోకసంద్రంలో మునిగితేలారు. వారందరూ డేవిడ్ను తలుచుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తున్నారు. అంత్యక్రియలు మరికాసేపట్లో జరుగుతాయనగా అక్కడికి ఓ హెలికాప్టర్ వచ్చింది. అది ల్యాండ్ కాగానే దాని నుంచి డేవిడ్ కిందకు దిగాడు. అంతే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. తర్వాత డేవిడ్ "నా అంత్యక్రియలకు వచ్చిన మీకందరికీ స్వాగతం" అంటూ నవ్వుతూ పలకరిస్తున్నాడు. ఒక్కక్షణం అక్కడేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాక ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత తేరుకొని బంధువులు అతన్ని చుట్టుముట్టి హగ్ చేసుకుని ఏడ్చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ను షూట్ చేసిన ఓ బృందం దీన్ని నెట్టింట షేర్ చేయగా క్షణాల్లో వీడియో వైరల్గా మారింది. బతికుండానే అంత్యక్రియలకు ఎందుకు ప్లాన్ చేశారని ఆయన్ను అడగ్గా.. కుటుంబసభ్యులంతా ఎప్పుడో విడిపోయామని, తనని దేనికీ ఆహ్వానించరని, ఎవరూ చూడటానికి కూడా రారు అని అందుకే ఇలా డెత్ ప్రాంక్ చేసినట్లు డేవిడ్ చెప్పుకొచ్చాడు. వారికి గుణపాఠం నేర్పించాలని, మనుషుల మధ్య బంధాలు ఉండాలని, వారిని కలవాలంటే చనిపోయేవరకు వేచి ఉండకూడదని చూపించాలని ఇలా చేశానని తెలిపాడు. ఇప్పుడు కుటుంబం అందరం కలిపోయామని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. -
మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం
సాక్షి, యాదాద్రి: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు ప్రమాదం తప్పింది. వీరిద్దరూ మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అవడంతో పెద్దగుట్టపై అత్యవసర ల్యాండింగ్ చేశారు పైలట్. వివరాల ప్రకారం.. మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ మాలోతు కవిత ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ అయ్యింది. ఈ విషయం గుర్తించిన పైలట్ యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ను అత్యవసరం ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో హెలికాప్టర్ పెద్దగుట్టపై దాదాపు 20 నిమిషాల పాటు ఆగింది. అనంతరం, అక్కడ ఉన్న సిబ్బంది వ్యాన్లో ఇంధనం తీసుకురావడంతో హెలికాప్టర్లో ఇంధనం నింపారు. దీంతో, తిరిగి హెలికాప్టర్ హైదరాబాద్కు పయనమైంది. ఇక, ఎర్రబెల్లి, కవితకు ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
పోలవరం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
అర్ధంతరంగా అపాచీ ల్యాండింగ్
భిండ్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ ఎటాక్ హెలికాప్టర్ సోమవారం మధ్యప్రదేశ్లోని భిండ్ సమీపంలో అర్ధంతరంగా ల్యాండయింది. రోజువారీ శిక్షణ సమయంలో హెలికాప్టర్లో కొన్ని అవాంతరాలు తలెత్తడంతో పైలట్ ముందు జాగ్రత్తగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిపుణుల బృందం హెలికాప్టర్ను పరిశీలిస్తోందని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఉదయం 8.45 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో ఎవరికీ ఏవిధమైన హాని కలగలేదని, అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని పేర్కొంది. కాగా, హెలికాప్టర్ ల్యాండయిన ప్రాంతంలో జనం గుమికూడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. -
పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!
Ajay Singh Tanwar: భారతదేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో 'అజయ్ సింగ్ తన్వర్' కూడా ఒకరు. పాతికేళ్ళు కూడా నిండని ఈ యువకుడు ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తులలో కూడా ఒకరుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఉపయోగించే కార్లలో చాలా వరకు ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉండటం గమనార్హం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. నిజానికి అజయ్ తన్వర్ ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడుగా ఎదిగిన 'కన్వర్ సింగ్ తన్వర్' మనవడు. ఢిల్లీకి చెందిన సంపన్న పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ తన్వర్ రాజకీయ, వ్యాపారం రంగాలకు చెందిన కుటుంబంలో జన్మించారు. ఇతడు ప్రపంచములోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను కలిగి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రోల్స్ రాయిస్ ఫాంటమ్ వంటి ఖరీదైన కార్లను కూడా చూడవచ్చు. అజయ్ గ్యారేజీలో మూడు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు, మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ లగ్జరీ సెడాన్ వంటివి ఉన్నాయి. ఈ మెర్సిడెస్ బెంజ్ కారు ధర రూ. 2.79 కోట్లని తెలుస్తోంది. దీనితో పాటు కస్టమైజ్డ్ వైట్ ఫోర్డ్ ముస్టాంగ్ సెడాన్, మెర్సిడెస్ బెంజ్జి 63 AMG వంటివి కూడా ఇతని గ్యారేజిలో ఉండటం గమనార్హం. భారతీయ రోడ్ల మీద అరుదుగా కనిపించే 'హమ్మర్ హెచ్2' కూడా ఇతని వద్ద ఉంది. దీనిని భారతదేశానికి ప్రైవేట్గా దిగుమతి చేసుకోవడం జరిగింది. (ఇదీ చదవండి: వాట్సాప్లో అదిరిపోయే 'ఎడిట్ మెసేజ్ ఫీచర్'.. దీన్నెలా వాడాలో తెలుసా?) రూ. 3 కోట్ల విలువైన లెక్సస్ LX530, రూ. 1.94 కోట్ల విలువైన బిఎండబ్ల్యు ఎక్స్5 ఎమ్, రూ. 1.5 కోట్ల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, రూ. 2.30 విలువైన ఆడి ఆర్8 స్పోర్ట్స్, ఆడి ఆర్ఎస్5, లంబోర్ఘిని గల్లార్డో కార్లు మాత్రం కాకుండా DC రూపొందించిన రూ. 2 కోట్ల విలువైన కారవ్యాన్ కూడా ఉంది. కార్లు మాత్రమే కాకుండా రెండు హెలికాఫ్టర్లు కూడా ఉన్నాయి. (ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ) నివేదికల ప్రకారం, అజయ్ చత్తర్పూర్లో ఉన్న ఓషన్ పెరల్ గార్డెనియా, కింగ్స్ ఫోర్త్ అనే రెండు హోటళ్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యాపారం అనేది కుటుంబం నుంచి వారసత్వంగా లభించినట్లు గతంలోనే వెల్లడించారు. వ్యాపారంలో ఇతని కృషికి ఎలైట్ మ్యాగజైన్ 'మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ 2020' అవార్డును కూడా అందించింది. -
పట్నాలకు వచ్చాడు, పది రోజులున్నాడు, పాపం అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు
బోయినపల్లి(చొప్పదండి): జమ్ముకాశ్మీర్లోని ఓ నదిలో హెలికాప్టర్ కూలిపోయి మండలంలోని మల్కాపూర్కు చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ (29) మృతిచెందాడన్న విషయం మండలంలో దావనంలా వ్యాపించింది. నిరుపేద కుటుంబానికి చెందిన పబ్బాల మల్లయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు. అనిల్ పదో తరగతి గంగాధర ప్రైవేటు పాఠశాలలో.. ఇంటర్ కరీంనగర్లో పూర్తి చేశాడు. డిగ్రీ వరకు చదువుకున్న అనిల్ సుమారు 11 ఏళ్ల క్రితం ఆర్మీ రిక్రూట్మెంట్లో పాల్గొని తొలి ప్రయత్నంలోనే జాబ్ సాధించాడు. ఆయన ప్రస్తుతం జమ్మూకాశ్మీర్లో ఆర్మీ సీఎఫ్ఎన్ విభాగంలో ఏవీఎన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు కోరెం గ్రామానికి చెందిన సౌజన్యతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు అయాన్ (6), అరయ్ (3) సంతానం. తన అత్తగారి ఊరైన కోరెంలో ఇటీవల బీరప్ప పట్నాలు వేసుకోగా.. ఆ కార్యక్రమానికి అనిల్ హాజరయ్యాడు. అందరితో కలిసి సుమారు పది రోజుల పాటు ఆనందంగా గడిపాడు. కుమారుడికి పుట్టిన రోజు వేడుకలు 40 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన అనిల్.. ఇటీవలే చిన్న కుమారుడు అరయ్ మూడో పుట్టినరోజును ఘనంగా నిర్వహించాడు. తండ్రి మల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చూపించాడు. పదిరోజుల క్రితం తిరిగి విధులకు బయల్దేరాడు. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇదే ఘటనలో హెలికాప్టర్లో ఉన్న మరో ఇద్దరు కూడా మృతిచెందినట్లు సమాచారం. అనిల్కు ఇద్దరు సోదరులు (శ్రీనివాస్, మహేందర్) ఉన్నారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. తల్లి లక్ష్మి గతంలో గ్రామ సర్పంచ్గా పనిచేశారు. తండ్రి మల్లయ్య ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడు. అనిల్ మరణవార్త తెలుసుకున్న బంధువులు, స్నేహితులు ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు. తల్లి ఏడుస్తుంటే ఏమీ తెలియని ఆ చిన్నారులు బిక్కుబిక్కుమంటూ చూస్తుండడం పలువురిని కంటతడి పెట్టించింది. ఆర్మీకి వెళ్లాలని అనిల్ కోరిక అనిల్కంటే ముందు గ్రామానికి చెందిన మెట్ట కుమార్ మొదట ఆర్మీలో చేరాడు. మరోవ్యక్తి అకెన అనిల్ కూడా ఆర్మీలో చేరడంతో ఎలాగైనా ఆర్మీలో చేరాలని అనిల్ భావించాడు. అనిల్కు చిన్నప్పటి నుంచే సైనికుడిని కావాలనే కోరిక ఉండేదని ఆయన సోదరుడు శ్రీనివాస్ చెప్పాడు. బాధిత కుటుంబానికి ‘బండి’, ‘బోయినపల్లి’ పరామర్శ అనిల్ మృతిచెందిన విషయం తెలుసుకున్న కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ఫోన్లో మాట్లాడారు. అనిల్ కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతిమసంస్కారాలకు ఏర్పాట్లు చూడాలని స్థానిక నాయకులకు సూచించారు. అలాగే అనిల్ మృతి పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సంతాపం ప్రకటించారు. -
హెలిప్యాడ్ వద్ద మంటలు.. మరోసారి డీకే శివకుమార్కు తప్పిన ప్రమాదం
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్ స్థలంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హొన్నావర్లోని రామకొండతీర్థ కొండ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో శివకుమార్ సురక్షితంగా బయటపడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. కాగా మొన్నటికి మొన్న శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను పక్షి ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలింది. పైలట్లు అత్యంత చాకచక్యగా వ్యవహరించడంతో శివకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ చీఫ్ను రెండు ప్రమాదాలు వెంటాడంతో పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా: తదుపరి ఎన్సీపీ చీఫ్గా సూలేనా?.. అజిత్ పవర్? -
జమ్మూ కాశ్మీర్లో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్..పైలట్లకు గాయాలు..
జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటన జమ్ము కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలోని అటవీ సమీపంలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆర్మీ అధికారులు కిష్వార్ జిల్లాలోని మార్వా అటవీ ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన ఏఎల్హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ గురువారం కూలిపోయినట్లు తెలిపారు. ఈ హెలికాప్టర్లో పైలట్, కోపైలట్ తోసహా ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఐతే వారంతా సురక్షితంగానే ఉన్నారని అన్నారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి రెస్క్యూ బృందాలు చేరకున్నట్లు కిష్త్వార్ జిల్లా పోలీసు అధికారి ఖలీల్ పోస్వాల్ పేర్కొన్నారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని, ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. (చదవండి: 'బీజేపీని తరిమికొట్టే సమయం ఆసన్నమైంది'!: అరవింద్ కేజ్రీవాల్) -
పీసీసీ చీఫ్కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ను ఢీకొట్టిన పక్షి..
బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది. శివకుమార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగళూరులోని జక్కూర్ ఎయిర్పోర్టు నుంచి కోలార్ జిల్లాలోని ముల్బాగల్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపరిపీల్చుకున్నాయి. ఘటన సమయంలో హెలికాప్టర్లో డీకే శివకుమార్ను ఓ కన్నడ టీవీ ఛానల్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తున్నారు. పైలటతో కలిపి మొత్తం ముగ్గురు హెలికాప్టర్లో ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతల ో జరగనున్న విషయం తెలిసిందే. 13 న కౌంటింగ్ ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలున్నాయి. మెజార్టీకి 123 సీట్లు అవసరం. ఈ సారి కచ్చితంగా 150 స్థానాలకుపై కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చదవండి: లిక్కర్ స్కాం కేసు: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు షాక్! -
జరిమానా నుంచి తప్పించుకోవాలని..ఏకంగా చనిపోయిన పైలట్..
ఒక మహిళ విచిత్రమైన మోసానికి పాల్పడింది. ఏకంగా చనిపోయిన వ్యక్తి ఐడెంటీటిని ఉపయోగించి మోసగించే ప్రయత్నంలో పట్టుబడింది. దీంతో ఆమెకు కోర్టు శిక్ష విధించనుంది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఆస్ట్రేలియన్ మహిళ 33 ఏళ్ల స్టెఫానీ లూయిస్ బెన్నెట్ కారు డ్రైవ్ చేస్తూ మొబైల్ ఫోన్ ఉపయోగించడంతో పట్టుబడింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు అధికారులు ఆమెకు దాదాపు రూ. 88 వేలు జరిమానా విధించారు. ఐతే ఆమె ఈ ట్రాఫిక్ జరిమానా నుంచి తప్పించుకునేందుకు తాను ఎలాంటి నేరం చేయలేదంటూ ఆన్లైన్లోనే సదరు ట్రాఫిక్ సంస్థకు తెలిపింది. ఆ సమయంలో తన కారుని నడిపింది యాష్ జెంక్సిన్గా పేర్కొంది. అతను సీ వరల్డ్ పైలంట్. అతని ఐడెంట్ని ఉపయోగించి.. అతన డెత్ రిపోర్ట్ ఉన్న పూర్తి పేరు, పుట్టిన తేదీని వినియోగించింది. వాస్తవానికి అతను జనవరి 2న గోల్డ్ కోస్ట్ బ్రాడ్వాటర్లో హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా మరో హెలికాప్టర్ ఢీ కొట్టడంతో..అతను సిడ్నీ మహిళ వెనెస్సాటాడ్రోస్, బ్రిటీష్ జంట రాస్, డయాన్ హ్యైస్ అనే ముగ్గురు ప్రయాణికులతో కలసి స్పాట్లో చనిపోయాడు. జెంక్సిన్ మరణించిన కొన్ని వారాల తర్వాత అతని భార్యకు జరిమాన నోటీసులు అందాయి. ఆమె ట్రాఫిక్ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు సదరు మహిళ బెన్నెట్ తతమను తప్పుదారి పట్టించి మోసం చేసిందని గుర్తించారు. ఈ మేరకు సదరు మహిళను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆమె నేరం చేసినట్లు కోర్టు ఎదుట అంగీకరించింది. తాను ఆ మరుసటి రోజు తన వ్యాఖ్యలను ఆన్లైన్లో వెనక్కి తీసుకునేందుకు యత్నించినా..అందుకు సదరు వెబ్సైట్ అంగీకరించలేదని వాపోయింది. తాను ఆర్థిక సమస్యలను ఎదుర్కొనడం వల్లే ఇలా చేశానిని కోర్టుకి వివరించింది. ఈ మేరకు బెన్నెట్ చేసిన నేరానికి గాను మే 19న శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. (చదవండి: ఉక్రెయిన్కు నాటో భారీ ఆయుధ సాయం) -
అనంతపురం: సీఎం జగన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. నార్పల నుంచి పుట్టపర్తికి హెలికాప్టర్లో వెళ్లాల్సిన సీఎం.. రోడ్డు మార్గం ద్వారా బయలుదేరారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ తొలిసారి బుధవారం.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుంచి ‘జగనన్న వసతి దీవెన’ పథకం నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. చదవండి: పేదరికపు సంకెళ్లు తెంచే అస్త్రం చదువు: సీఎం జగన్ -
పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో
న్యూఢిల్లీ: ఇంట్లో పనిచేసే సహాయకులకు ఏ పండగ్గో,పబ్బానికో కొత్త బట్టలు, లేదంటే ఎంతో కొంత నగదు బోనస్లు ఇవ్వడం సహజం. ఎంత పెద్ద గొప్ప వ్యాపారవేత్తలయినా కాస్త అటూ ఇటూగా దాదాపు ఇదే చేస్తారు. కానీ మలేషియాకు చెందిన మహిళా వ్యాపారవేత్త మాత్రం అద్భుతమైన బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచింది. వెబ్సైట్ మదర్షిప్ ప్రకారం, ఫరావెన్ అనే మహిళ తన ముగ్గురు ఇంటి పనివాళ్లకు భారీ బహుమతి ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్. తన ముగ్గురు మహిళా గృహ సహాయకులకు సుమారు రూ. 1.8 లక్షల గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కవర్లు ఇస్తూ టిక్టాక్ వీడియోను ఫరా షేర్ చేసింది. ముస్లింలకు అతిపెద్ద సెలవుదినాలలో ఒకటైన హరి రాయ (దీనిని హరి రాయ ఐడిల్ఫిత్రి అని కూడా పిలుస్తారు) కోసం ద్వీపానికి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేసింది. (ఇది కూడా చదవండి: బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?) డిపింగ్ పూల్, బాత్టబ్, లాంజ్ ఏరియాతో కూడిన విలాసవంతమైన ప్రైవేట్ సూట్లో ఎంజాయ్ చేసేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం వారికి హెలికాప్టర్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ వీడియోలో హెలికాప్టర్లో సదరు ద్వీపానికి ప్రయాణం అవ్వడాన్ని, అలాగే యజమాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ, ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడొచ్చు. Jadi bibik pun dapat duit raya 5 angka, siap dapat pakej healing 😭 pic.twitter.com/94Sz6Gzj6V — 🇲🇾 (@localrkyt) April 13, 2023 టిక్టాక్లో మిలియన్ల వ్యూస్తో ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో ఇతర సోషల్మీడియాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఆమె దాతృత్వాన్ని కొంతమంది నెటిజన్లు ప్రశంసించారు. మరి కొందరు ఇది వాళ్లకి సంతోషాన్నిస్తుందా అని, ఇది ఫేక్ అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఇంట్లో పనిచేసే మహిళల పట్ల ఓనర్లు ఔదార్యాన్ని చూపించడం ఇదే మొదటిసారి గతేడాది దీపావళి రోజున చెన్నై వ్యాపారి తన సిబ్బందికి రూ.1.2 కోట్లకు పైగా విలువైన కార్లు, బైక్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. (క్రెడిట్కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) -
హెలికాఫ్టర్ పై నుంచి పూలాభిషేకం.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ..
-
ధ్రువ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. సిబ్బంది సేఫ్
సాక్షి, ముంబై: భారత నౌకా దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి.. ముంబై తీరంలో బుధవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ధ్రువ్ హెలికాఫ్టర్ రొటీన్ డ్యూటీలో ఉండగానే.. ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు నేవీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. అత్యాధునిక తేలికపాటి యుద్ధవిమానం అయిన ధృవ్.. ముంబై తీరంలో ఎమర్జెన్సీ ల్యాండ్ గురించి సమాచారం అందుకున్న వెంటనే నేవీ పెట్రోలింగ్ స్పందించింది. హెలికాఫ్టర్లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు తెచ్చింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. Indian Navy ALH on a routine sortie off Mumbai ditched close to the coast. Immediate Search and Rescue ensured safe recovery of crew of three by naval patrol craft. An inquiry to investigate the incident has been ordered. — SpokespersonNavy (@indiannavy) March 8, 2023 (చదవండి: మోదీ, షా, నడ్డా సమక్షంలో.. త్రిపుర సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం) -
మాజీ సీఎం యడియూరప్పకు తప్పిన ముప్పు.. వీడియో
బెంగళూరు: కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు తృటిలో ముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్కు అంతరాయం ఏర్పడింది. చివరకు పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. బీఎస్ యడియూరప్ప సోమవారం హెలికాప్టర్లో కలుబుర్గికి బయలుదేరారు. ఈ క్రమంలో జెవారీలో హెలికాప్టర్ను ల్యాండింగ్ చేసే సమయంలో హెలిప్యాడ్ పక్కనే ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, దుమ్ము, కాగితాలు ఒక్కసారిగా గాల్లోకి లేచాయి. దీంతో, పైలట్కు హెలికాప్టర్ ల్యాండింగ్ ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో కొద్దిసేపు ల్యాండింగ్ను నిలిపి వేసి ఆకాశంలోనే చక్కర్లు కొట్టారు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. హెలిప్యాడ్ అంతా క్లియర్ చేయడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #WATCH | Kalaburagi | A helicopter, carrying former Karnataka CM and senior leader BS Yediyurappa, faced difficulty in landing after the helipad ground filled with plastic sheets and waste around. pic.twitter.com/BJTAMT1lpr — ANI (@ANI) March 6, 2023 -
దేశంలో అతిపెద్ద హెలికాప్టర్ తయారీ కేంద్రం.. ప్రారంభించిన మోదీ..
బెంగళూరు: కర్ణాటక తుమకూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) హెలికాప్టర్ తయారీ కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా తేలికపాటి హెలికాప్టర్ను కూడా మోదీ ఆవిష్కరించారు. మోదీతో పాటు రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. PM Shri @narendramodi dedicates HAL helicopter factory to the nation in Tumakuru, Karnataka. pic.twitter.com/dqAZMsJXnI — BJP (@BJP4India) February 6, 2023 మోదీ శంకుస్థాపన చేసిన హెచ్ఏఎల్ హెలికాప్టర్ తయారీ కేంద్రం దేశంలోనే అతిపెద్దది. 615 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. భారత్లో హెలికాప్టర్ల అవసరాలను ఒక్క చోటు నుంచే తీర్చాలనే ఉద్దేశంతో కేంద్రం దీన్ని ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీలో మొదటగా లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు(తేలికపాటి హెలికాప్టర్లు) మాత్రమే తయారు చేస్తారు. వీటిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేశారు. మూడు టన్నుల బరువుండే ఈ సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్లను అత్యంత సులభంగా నడపవచ్చు. ఈ హెలికాప్టర్ తయారీ కేంద్రం నుంచి తొలుత ఏడాదికి 30 హెలికాప్టర్లు ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత విడతల వారీగా ఏడాదికి 60, 90 హెలికాప్టర్లను తయారు చేసేలా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతారు. ఈ కేంద్రం నుంచి 3-15 టన్నుల బరువుగల 1000 హెలికాప్టర్లను తయారు చేయాలని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే 20 ఏళ్లలో రూ.4లక్షల కోట్ల వ్యాపారం చేయాలని భావిస్తోంది. చదవండి: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం.. -
హెలికాప్టర్లో షూటింగ్కి వెళ్లిన స్టార్ హీరో.. ఫోటో వైరల్
హెలికాప్టర్లో షూటింగ్ లొకేషన్కు వెళుతున్నారు కమల్హాసన్. 1996లో హీరో కమల్హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్గా వీరిద్దరి కాంబినేషన్లోనే ‘ఇండియన్ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షటింగ్ ప్రస్తుతం కడపలోని గండికోట విలేజ్లో జరుగుతోంది. తిరుపతి నుంచి గండికోట లొకేషన్కు రోజూ హెలికాప్టర్లో వెళ్తున్నారు కమల్హాసన్. కాగా కమల్ హెలికాప్టర్ రైడ్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి, కాల్షీట్స్, షూటింగ్ సమయం వృథా కాకుండా చూసేందుకు కమల్ ఇలా హెలికాప్టర్ రైడ్ చేస్తున్నారన్నది కోలీవుడ్ టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ప్రీత్సింగ్, బాబీ సింహా కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది. #KamalHaasan sir pic.twitter.com/8JzAJIXdH7 — Expendables Bouncers (@Sathya45222505) February 1, 2023 -
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఘోర విమాన ప్రమాదం
-
ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్తో భారీ సిక్స్! వీడియో వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్లో విరాట్కు ఇది 46 సెంచరీ. ఈ సిరీస్లో కింగ్కు ఇది రెండో సెంచరీ. ఓవరాల్గా ఇప్పటివరకు విరాట్ కోహ్లి కెరీర్లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. ఇక ఈ మ్యాచ్లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. హెలికాప్టర్ షాట్ కొట్టిన విరాట్ ఈ మ్యాచ్లో అద్భతమైన హెలికాప్టర్ షాట్ బాదిన విరాట్ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. భారత ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన కసున్ రజిత బౌలింగ్లో నాలుగో బంతిని ఫ్రంట్ఫుట్ వచ్చిన విరాట్ లాంగ్ ఆన్ దిశగా 97 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. విరాట్ అద్భుతమైన షాట్ చూసిన అభిమానులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? 📹 Mighty Maximum - a 97m SIX from Virat Kohli 👀👀 Live - https://t.co/q4nA9Ff9Q2 #INDvSL @mastercardindia pic.twitter.com/R3CzXTWBT5 — BCCI (@BCCI) January 15, 2023 -
మధ్యప్రదేశ్ సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాలతో పైలట్ ఇలా చేశారు. హెలికాప్టర్ మనావర్ నుంచి ధార్ వెళ్తుండగా సమస్య రావడంతో తిరిగి మనావర్కే వచ్చింది. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈమేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హెలికాప్టర్ నిలిచిపోవడంతో సీఎం రోడ్డు మార్గం ద్వారా బస్సులోనే ధార్కు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఓ ర్యాలీకి హాజరై ప్రసంగించారు. సాంకేతిక కారణాలు తలెత్తిన ఈ హెలికాప్టర్ ఓ ప్రైవేటు కంపెనీకి చెందింది. చదవండి: ఎంపీ సుప్రియా సూలే చీరకు అంటుకున్న నిప్పు.. వీడియో వైరల్.. -
బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం
-
Viral Video: విమానంని ఆకాశంలోకి లాకెళ్లిన గుర్రాలు
-
హెలికాఫ్టర్కు పూజలు నిర్వహించిన తెలంగాణ వ్యాపారవేత్త
భారతదేశంలో కొత్త వాహనాలను వినియోగించే ముందు వాటికి పూజలు చేయడం ఆచారం. అందుకే ప్రజలు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు పూజలు జరిపిస్తుంటారు. అయితే తెలంగాణకు చెందిన వ్యాపారవేత్త బోయిన్పల్లి శ్రీనివాస్రావు మాత్రం ఈ సంప్రదాయాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. తాను కొత్తగా కొనుగోలు చేసిన హెలికాప్టర్ను పూజలు జరిపించారు. తెలంగాణకు చెందిన ప్రతిమ గ్రూప్కు యాజమాని బోయినపల్లి శ్రీనివాసరావు ఇటీవల ఎయిర్బస్ ACH-135హెలికాప్టర్ను కొనుగోలు చేశారు. కొత్త వాహనం కావడంతో హెలికాఫ్టర్కు వాహన పూజ జరిపేందుకు హైదరాబాద్కు 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న యాదాద్రి గుట్టపైకి వెళ్లారు. ముగ్గురు పూజారుల నేతృత్వంలో హెలికాఫ్టర్కు ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపారి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. మరో వైపు హెలికాప్టర్కు పూజలు చేస్తుంటే చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రస్తుతం ఈ హెలికాప్టర్ "వాహన్ పూజ" వీడియో సోషల్ మీడియాలో వైరల్ నెట్టింట హల్చల్ చేస్తోంది. Boinpally Srinivas Rao, the proprietor of the Prathima business, bought an Airbus ACH 135 and used it for the "Vahan" puja at the Yadadri temple dedicated to Sri Lakshmi Narasimha Swamy. Costing $5.7M, the opulent helicopter. #Telangana pic.twitter.com/igFHMlEKiY — Mohd Lateef Babla (@lateefbabla) December 15, 2022 చదవండి: భారత్లో అత్యంత ఖరీదైన కారు కొన్న హైదరాబాద్ వాసి.. వామ్మో అన్ని కోట్లా! -
టెన్త్ ,ఇంటర్ టాపర్స్ కు హెలికాప్టర్ రైడ్
-
కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చితా...
-
చీతా హెలికాప్టర్ క్రాష్ ...పైలెట్ మృతి
న్యూఢిల్లీ: చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ కూలిపోయినట్లు భారత ఆర్మీ పేర్కొంది. ఈ ఘటనలో పైలెట్, మృతి చెందగా, కో పైలెట్ తీవ్ర గాయాలపాలైనట్లు వెల్లడించింది. ఈ ప్రమాదం తవాంగ్ ప్రాంతంలో ఉదయం 10 గం.ల సమయంలో జరిగినట్లు తెలిపారు. ఈ చీతా హెలీకాప్టర్లో ఇద్దరు పైలెట్లు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే ఇద్దరు పైలెట్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఐతే లెఫ్టినెంట్ సౌరభ యాదవ్ పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. అలాగే కో పైలెట్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఇదే ఏడాది మార్చిలో మరో చీతా హెలికాప్టర్ జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో కూలిన సంగతి విధితమే. ఆఘటనలో కూడా పైలెట్ మృతి చెందగా, కోపైలెట్కి తీవ్ర గాయాలపాలయ్యాడు. (చదవండి: ఢిల్లీలో ‘ఉచిత విద్యుత్’పై దర్యాప్తు) -
వాయుసేన అమ్ములపొదిలోకి ప్రచండ్ హెలికాఫ్టర్లు
-
హెలికాప్టర్ సర్వీస్ అని రూ.17 వేలు టోపీ
మైసూరు: మైసూరు నగరంలో ఆన్లైన్ మోసాలకు హద్దు లేకుండా పోతుంది. ప్రతిరోజూ ఒకరో ఇద్దరో వంచనకు గురవుతున్నారు. జమ్ముకశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం దర్శనం కోసం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెబ్సైట్లో గాలించి రూ. 17,000 పోగొట్టుకున్నాడు. మైసూరు గాయత్రి పురంలో నివాసం ఉంటున్న జీ బసవణ్ణ (32) వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం జమ్ములో నుంచి ఆలయం వరకు హెలికాప్టర్ సర్వీసు ఉన్నదని, బుక్ చేసుకోవచ్చని హిమాలయ హెలిప్యాడ్ అనే సంస్థ ఆఫర్ ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయుడు వెబ్సైట్ ద్వారా రూ. 17,000 చెల్లించాడు. ఆ తరువాత ఎన్నిరోజులైనా స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు మైసూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. (చదవండి: వరదలపై సమీక్ష సమావేశం... నిద్రపోయిన మంత్రి) -
చినూక్ హెలికాప్టర్లను అర్థాంతరంగా నిలిపేసిన అమెరికా.. భారత్ ఆందోళన
వాషింగ్టన్: చినూక్ హెలికాప్టర్ల సేవలను అర్థాంతరంగా నిలిపివేసింది అమెరికా సైన్యం. ఇంజిన్లో మంటలు చెలరేగే ప్రమాదముందని ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్క చినూక్ హెలికాప్టర్ కూడా నింగిలోకి ఎగరకుండా నేలకే పరిమితమయ్యాయి. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న చినూక్ విమానాలను భారత వాయుసేన విరివిగా వినియోగిస్తోంది. ఈ నేపథ్యంలో వీటి సేవలను నిలిపివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీని గురించి వివరణ ఇవ్వాలని అమెరికాకు లేఖ రాసింది. 70 చినూక్ హెలికాప్టర్లను పరిశీలించిన తర్వాత అందులోని ఓ భాగం వల్ల ఇంజిన్లో మంటలు సంభవించే ముప్పు ఉందని అమెరికా ఆర్మీ మెటిరీయల్ కమాండ్ సూచించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వీటి సేవలను నిలిపివేశారు అధికారులు. గతంలో పలుమార్లు ఈ హెలికాప్టర్ ఇంజిన్ నుంచి మంటలు వచ్చి చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చినూక్ హెలికాప్టర్లను లాజిస్టిక్ సేవలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వందల టన్నుల బరువును ఇవి మోయగలవు. వీటిని తాత్కాలికంగా నిలిపివేసిన తరుణంతో అమెరికా సైన్యానికి వస్తు రవాణాలో సవాళ్లు ఎదరుయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఈ ఆంక్షలు ఎప్పటివరకు అమలులో ఉంటాయి అనే విషయంపై కూడా స్పష్టత లేదు. చదవండి: ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికిన సోవియట్ యూనియన్ నేత మృతి -
రాష్ట్రంలోకి అడెల్లు, మంగులు దళాలు! కేసీఆర్ పర్యటన రూటుమార్పు?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన రూట్మ్యాప్ ఆకస్మికంగా మారడానికి మావోయిస్టుల కదలికల సమాచారమే కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో ముందుజాగ్రత్త చర్యగా సీఎంను రోడ్డుమార్గాన వద్దని.. హెలికాప్టర్లో రావాలని పోలీసులు సూచించి నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వారం రోజులుగా రాష్ట్రంలో మావోలు సంచరిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మంథని, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం తదితర గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వారు సంచరించినట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. తెలంగాణలో కార్యకలాపాలు ముమ్మరం చేయాలన్న మావోయిస్టు సారథి, కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, పాండు అలియాస్ మంగులు తదితరుల దళాలు మహా రాష్ట్ర, దక్షిణ ఛత్తీస్గఢ్ల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పర్యటనలో ఆకస్మిక మార్పులు.. వాస్తవానికి సీఎం కేసీఆర్ పెద్దపల్లి కలెక్టరేట్ భవ నాన్ని ప్రారంభించేందుకు రెండు రోజుల ముందే కరీంనగర్కు చేరుకుంటారని పోలీసులకు సమాచా రం ఉంది. దాని ప్రకారం ఆయన కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తన నివాసం నుంచి పెద్దపల్లి సభకు బయల్దేరాలి. కానీ ఆదివారం రాత్రి వరకూ ఎలాంటి సమాచారం రాలేదు. సోమవారం మధ్యాహ్నం వరకు ఈ ఉత్కంఠ కొనసాగింది. పెద్దపల్లి జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాలకు మావోయిస్టులు వచ్చి ఉంటారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సీఎం ఆదివారం కరీంనగర్కు చేరుకోలేదని సమాచారం.ఉమ్మడి కరీంనగర్కు చెందిన పలువురు టీఆర్ఎస్, బీజేపీ నేతలను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నా రన్న విషయాన్ని నిఘా వర్గాలు ముందే పసిగట్టి వారిని అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం భద్రతకు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశా యి. ఒకప్పుడు పెద్దపల్లి జిల్లాలో కొత్త వారు, అను మానాస్పద వ్యక్తులను గుర్తించడం సులువుగా ఉండేది. కానీ జిల్లాలోని ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి, గ్రానైట్, క్రషర్, ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి వేలాది మంది వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు వచ్చే వారిలో ఎవరు కార్మికులో, ఎవరు మావోయిస్టు సానుభూతిపరులో గుర్తించడం కష్టం అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం భద్రత విషయంలో రాజీపడరాదని డీజీపీ మహేందర్రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రోడ్డుమార్గం వద్దని పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు సూచించినట్లు సమాచారం. భారీ వర్షంలోనూ టేకాఫ్..! సాధారణంగా వాతావరణ మార్పులు, భారీ వర్షాల నేపథ్యంలో వీఐపీ నాయకులు హెలికాప్టర్ వద్దని.. రోడ్డు మార్గాన్నే ఎంచుకుంటారు. సోమ వారం పెద్దపల్లి జిల్లాలో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో అంతా సీఎం రోడ్డు మార్గానే వస్తారనుకున్నారు. మధ్యాహ్నం తరువాత పరిణా మాలు చకచకా మారిపోయాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పలువురు ఐపీఎస్ల నేతృత్వంలో భారీగా పోలీసులు మోహరించారు. అక్క డికే సీఎం హెలికాప్టర్ చేరుకుంది. ఆ తరువాత వేదికపై ప్రసంగిస్తుండగానే భారీ వర్షం కురిసింది. అంతటి వర్షంలోనూ సీఎంను పోలీసులు హెలికాప్టర్లోనే పంపి ఊపిరి పీల్చుకున్నారు. రెండేళ్ల తరువాత రాష్ట్రానికి అడెల్లు..! 2020 జూలైలో లాక్డౌన్ ఎత్తివేత తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో మైలారపు అడెల్లు అలి యాస్ భాస్కర్ గిరిజన తండాల్లో రిక్రూట్ మెంట్ కోసం ప్రయత్నించారు. కానీ కదంబా ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందడం, మరోసారి జరిగిన ఎదురుకాల్పుల్లో అడెల్లు దళం తృటిలో తప్పించుకోవడంతో అతను తిరిగి మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్లి పోయాడు. రెండేళ్ల తరువాత తిరిగి అడెల్లు రాష్ట్రంలో ప్రవేశించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొంతకాలంగా ఉమ్మడి జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమలో పనిచేసే కొందరికి మావోలు ఆర్థికంగా, పేలుడు పదార్థాల విషయంలో సహకరించారు. అయితే మావో లతో లింకులున్న వారిని గుర్తించిన పోలీసులు వరుసగా అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలను హతమార్చి నిధులు, ఉనికిని సాధించే ప్రణాళికను అమలు చేసేందుకే అడెల్లు, ఇతర దళాలు తెలంగాణలోకి వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. కాగా,పాండు అలి యాస్ మంగులుపై రూ.5 లక్షలు, భాస్కర్పై 20 లక్షల రివార్డును పోలీసులు ప్రకటించారు. -
ఆకాశంలో 175 సార్లు రివవర్స్ స్పిన్నింగ్.. తన రికార్డును తానే బ్రేక్ చేసుకొని
స్కై డైవింగ్ అంటేనే సాహసం. కొద్దిసేపు ఊపిరి ఆడనట్టు అనిపించినా.. ఆ తరువాత ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తుంటే వచ్చే థ్రిల్ అనుభవిస్తే కానీ తెలియదు. అలా ఆకాశంలో తలకిందులుగా వేలాడుతూ హెలికాప్టర్ స్పిన్స్ కొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు యూఎస్కు చెందిన ఓ స్కై సర్ఫర్. నేలమీద చుట్టూ తిరిగితేనే కళ్లు గిర్రున తిరిగి మైకం వచ్చేస్తుంది. అలాంటిది ఆకాశంలో రివర్స్లో రొటేటర్లా తిరగడం.. ‘హే క్రేజీ’ అనుకుంటున్నారా. క్రేజీనే కాదు క్రేజీయెస్ట్... కూడా. ఎందుకంటే అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 175 స్పిన్స్ తిరిగిన కీత్ కెబె రికార్డు బ్రేక్ చేశాడు. వర్జీనియాలోని ఆరెంజ్ కౌంటీలో హెలికాప్టర్ నుంచి దూకి స్పిన్స్ చేస్తున్న కెబె వీడియోను గిన్నిస్ ఇటీవల విడుదల చేసింది. ఈ ఏడాది జూలై 4న ఈ ఫీట్ చేసిన కెబె.. 2021 ఈజిప్ట్లోని గిజాలోనూ ఇలాంటి స్పిన్సే చేశాడు. కాకపోతే అప్పుడు సింగిల్ జంప్లో 165 స్పిన్స్ చేశాడు. ఇప్పుడు మరో పది యాడ్ చేసి.. సింగిల్ జంప్లో 175 సార్లు తిరిగి తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడన్నమాట. -
స్కై సర్ఫింగ్ అదరహో! గిన్నిస్ రికార్డు బద్దలు
-
ఎగురుతున్న హెలికాప్టర్పై పులప్స్
సాధారణ పుషప్స్, పులప్స్, చేయాలంటేనే ఎంతో ఫిట్నెస్ కావాలి. ఇక ఎగురుతున్న హెలికాప్టర్కు వేలాడుతూ పులప్స్ చేయడమంటే.. ఫిట్నెస్ ఫ్రీక్స్ అయి ఉండాలి. రికార్డుల పిచ్చయినా ఉండాలి. అలాంటి సాహసాన్ని చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు డచ్ ఫిట్నెన్ ఇన్ఫ్లూయెర్స్ స్టాన్ బ్రూనింక్. యూట్యూబ్లో ఫిట్నెస్ చానల్తో స్టాన్ బ్రౌనీగా పాపులర్ అయిన బ్రూనింక్... అతని కోహోస్ట్–ఆర్జెన్ ఆల్బర్స్.. ఇద్దరూ బెల్జియమ్, ఆంట్వెర్ప్లోని హోవెనన్ ఎయిర్ఫీల్డ్లో గిన్నిస్ అధికారుల సమక్షంలో వరల్డ్ ఫీట్ కోసం ప్రయత్నించారు. నిమిషానికి 25 పులప్స్తో బ్రూనింక్ రికార్డును నెలకొల్పాడు. అది కూడా రెండు సార్లు. ఇక మొదట 24 పులప్స్ చేసిన ఆల్బర్స్ అంతకుముందు 23 పులప్స్తో ఉన్న ఓ రోమెనియన్ రికార్డును బ్రేక్ చేశాడు. తరువాత బ్రూనింక్ 25 పులప్స్తో ఆ రికార్డునూ బద్దలు కొట్టాడు. ఎగురుతున్న హెలికాప్టర్... విపరీతమైన గాలి, భయంకరమైన ధ్వని. అది ఊగుతూ ఉంటే.. దానికి వేలాడుతూ పులప్స్ చేసి, ఇద్దరూ సాహసమే చేశారు. ఇలా కదులుతున్న వాహనాల మీద సాహసాలు చేసిన రికార్డులు గతంలోనూ ఉన్నాయి. 1 నిమిషం 30 సెకన్లలో కదులుతున్న కారు టైర్ మార్చి రికార్డు నెలకొల్పగా.. అంతకంటే తక్కువ సమయం 1నిమిషం 13 సెకన్లలోనే మార్చేసి.. ఆ రికార్డును బ్రేక్ చేశారు ఇద్దరు ఇటాలియన్లు. -
హెలికాప్టర్కి వేళ్లాడుతూ.... క్రేజీ గిన్నిస్ రికార్డు
ఇంతవరకు పలు గిన్నిస్ రికార్డులు చూశాం. విచిత్రంగా గోళ్లు లేదా జుట్టు పెంచడం వంటివి చేసి రికార్డు సృష్టిస్తారు. మరికొందరూ తమ ప్రతిభా పాటవాలతో అందర్నీ అబ్బురపరుస్తూ ప్రపంచ రికార్డు సృష్టిస్తారు. కానీ ఇక్కడోక వ్యక్తి అందరిలా కాకుండా అన్నింటికంటే భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా చేసి గిన్నిస్ రికార్డులో కెక్కాడు . వివరాల్లోకెళ్తే....డచ్ ఫిట్నెస్ జౌత్సాహికుడు స్టాన్ బ్రౌనీ, తన సహచర అథ్లెట్ అర్జెన్ ఆల్బర్స్తో కలిసి యూట్యూబ్ ఛానెల్ని నడుపుతున్నాడు. ఈ ఇద్దరు అథ్లెట్లు గాల్లో హెలికాప్టర్కి వేళ్లాడుతూ ఫుల్ అప్ ఎక్సర్సైజులు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం వారాల తరబడి ప్రాక్టీస్ చేశారు చూడా. అదీగాక బ్రౌనీ కాలిస్టెనిక్స్కి సంబంధించిన జెమ్నాస్టిక్స్లో నిపుణుడు. ఈ మేరకు బ్రౌనీ జూలై 6, 2022న బెల్జియంలోని ఆంట్వెర్ప్లో హోవెనెన్ ఎయిర్ఫీల్డ్లో ఈ క్రేజీ రికార్డ్ను బద్దలు కొట్టాడు. అతను గాల్లో హెలికాప్టర్కి వేళ్లాడుతూ ఒక నిమిషం వ్యవధిలో దాదాపు 25 పుల్ అప్ ఎక్సర్సైజులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని సహచర అథ్లెట్ ఆల్బర్స్ గత అమెరికన్ రోమన్ సహ్రద్యన్ రికార్డుని బ్రేక్ చేస్తూ ఒక నిమిషంలో 24 పుల్ అప్ ఎక్సర్సైజులు చేశాడు. కానీ బ్రౌనీ ఈ రికార్డును కూడా బద్దలు కొడుతూ ఏకంగా ఒక నిమిషంలో 25 చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డు పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్లో ఆహుతైన వాహనాలు) -
వైరల్: తల్లి రిటైర్మెంట్ రోజు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు
జైపూర్: తన తల్లి ఉద్యోగ విరమణ రోజుని జీవితాంతం గుర్తుండిపోయేలా కొడుకు సర్ప్రైజ్ అందించాడు. అందరిని ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన బహుమతి ఇచ్చి.. తల్లి కళ్లలో ఆనందాన్ని చూసుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే.. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్కు చెందిన సుశీలా చౌహాన్ అనే మహిళ పిసంగన్లోని కేసర్పురా హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత 33 ఏళ్లుగా టీచర్గా సేవలందించిన సుశీలా శనివారం పదవి విరమణ చేశారు. తల్లి రిటైర్మెంట్ కార్యక్రమం గురించి తెలుసుకున్న అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు యోగేశ్ చౌహాన్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. పదవీ విరమణ రోజును తల్లికి మధురమైన జ్ఞాపకంగా మలిచేందుకు యోగేశ్ అదిరిపోయే ఆలోచన చేశాడు. ఆమె కోసం ఏకంగా హెలికాప్టర్ రైడ్ను బుక్ చేశాడు. హెలికాప్టర్లో తల్లిని స్కూల్ నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఇందుకు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నాడు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. తల్లి ఆనందం కోసం కొడుకు చేసిన మంచి పనిని పలువురు ప్రశంసిస్తున్నారు. చదవండి: Zomato: వీల్చైర్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు Rajasthan| A son gifted his mother helicopter ride as a retirement gift in Ajmer My mother retired as a teacher. I wanted to do something special for her& decided to book her a memorable helicopter ride to reach home. Didn't expect crowd,but feels great:Son Yogesh Chauhan (30.7) pic.twitter.com/adBoBIhOEV — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 31, 2022 దీనిపై యోగేశ్ చౌహాన్ మాట్లాడుతూ..‘ మా అమ్మ టీచర్గా రిటైరయ్యింది. నేను ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాను. అందుకే అమ్మను ఇంటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్ను బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ సమయంలో ఇంత మంది గుమికూడతారని ఊహించలేదు. అది మాకు మరింత సంతోషాన్నిచ్చింది.’ అని తెలిపాడు. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన యోగేష్ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నారు. -
హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతినివ్వలేం
సాక్షి, అమరావతి : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భీమవరం పర్యటన సందర్భంగా తన హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతివ్వాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. హెలికాప్టర్ ల్యాండింగ్కు స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఇంతకుముందు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవడం, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అనుమతినిచ్చినట్లు ఎలాంటి లేఖను కోర్టు ముందుంచని నేపథ్యంలో ల్యాండింగ్కు అనుమతిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. రోడ్డు మార్గం ద్వారా మాత్రమే భీమవరం వెళ్లాల్సి ఉన్నందున తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. జెడ్ ప్లస్ భద్రత ఉన్నందున పోలీసుల భద్రతకు ఆదేశాలు ఇవ్వలేమని పునరుద్ఘాటించింది. అయితే రఘురామకృష్ణరాజు భీమవరం వెళ్లే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. శాంతిభ్రదతలకు విఘాతం కలగకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. తాను వచ్చే హెలికాప్టర్కు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ల్యాండింగ్కు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు శనివారం అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్ వాదనలు వినిపిస్తూ, హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్కు గత నెల 17న వినతిపత్రం ఇచ్చామన్నారు. దీని సాధ్యాసాధ్యాలపై జిల్లా ఎస్పీని కలెక్టర్ నివేదిక కోరారని, ఆ తరువాత పరిణామాలు ఏంటో తెలియదన్నారు. మా చేతుల్లో ఏమీ లేదు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ.. ప్రధాని పర్యటన మొత్తం కేంద్ర హోం శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్జీపీ) కనుసన్నల్లో జరుగుతుందన్నారు. హెలికాప్టర్కు అనుమతులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలకు లోబడి ఉంటాయన్నారు. రఘురామకృష్ణరాజు వ్యాజ్యంలో కేంద్రాన్ని, ఎస్పీజీని, డీజీసీఏని ప్రతివాదులుగా చేర్చలేదన్నారు. వారే సమాధానం చెప్పాల్సి ఉందని, తమ చేతుల్లో ఏమీ ఉండదని అన్నారు. విజయవాడ విమానాశ్రయ అనుమతి, ఫ్లైట్ ప్లాన్ను సమర్పించనప్పుడు కలెక్టర్ చేసేదేమీ ఉండదన్నారు. ఎస్ఆర్కేఆర్ కాలేజీ ప్రాంగణం హెలికాప్టర్ ల్యాండింగ్కు అనువు కాదని ఆర్ అండ్ బీ అధికారులు నివేదిక ఇచ్చారని చెప్పారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నాయని ఆ స్కూలు యాజమాన్యం కలెక్టర్కు లిఖితపూర్వకంగా తెలిపిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వివేకానంద స్పందిస్తూ, పిటిషనర్ నిన్న రోడ్డు మార్గం ద్వారా వస్తాను, భద్రత కల్పించాలని కోర్టుకొచ్చారని, సానుకూల ఉత్తర్వులు రాకపోయేసరికి హెలికాప్టర్ను ఎంచుకున్నారని, రేపు షిప్లో వస్తానని చెబుతారని తెలిపారు. అందుకే వెనక్కి తీసుకుంది హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతినిచ్చిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరువాత వెనక్కి తీసుకోవడంపై అనుమానాలున్నాయని ఉమేశ్ తెలిపారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఎస్ఆర్కేఆర్ కాలేజీ అనుమతిని వెనక్కి తీసుకున్న లేఖలను తమ ముందుంచాలని ప్రభుత్వ న్యాయవాదులను న్యాయమూర్తి ఆదేశించారు. సుమన్ ఆ లేఖను వాట్సాప్ ద్వారా న్యాయమూర్తి ముందుంచారు. అనుమతులు వెనక్కి తీసుకోవడాన్ని తాము ప్రశ్నించడంలేదని ఉమేశ్ చెప్పారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై విద్యాశాఖ రైడ్ చేసిందని, అందుకే ఆ పాఠశాల ల్యాండింగ్కిచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ వినతిపై కలెక్టర్ ఏదో రకంగా స్పందించి ఉండాల్సిందని తెలిపారు. హెలికాఫ్టర్ దిగే స్థలం యజమాని అనుమతి తప్పనిసరని, అందువల్ల ఆ ప్రాంగణాల్లో ల్యాండింగ్పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. -
సముద్రంలో ఓఎన్జీసీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ముంబై: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ)కి చెందిన హెలికాప్టర్ ముంబైలోని అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. 9 మంది వ్యక్తులతో ప్రయాణిస్తున్న (ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు) హెలికాప్టర్లో లోపం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చిందని ఓఎన్జీసీ ట్వీట్ చేసింది. అయితే సాగర్ కిరణ్ రెస్క్యూ బోటు ద్వారా ఇప్పటి వరకు ఆరుగురు ప్రాణాలతో బయటపడగా, మిగిలిన వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి. #Helicopter carrying 7 passengers & 2 pilots makes emergency landing in #Arabian Sea near #ONGC rig Sagar Kiran in #Mumbai High. Four rescued. Rescue operations in full swing. @HardeepSPuri @Rameswar_Teli @PetroleumMin — Oil and Natural Gas Corporation Limited (ONGC) (@ONGC_) June 28, 2022 ముంబైలో సాగర్ కిరణ్ వద్ద రిగ్ సమీపంలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లతో కూడిన హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని కంపెనీ ఒక ట్వీట్లో తెలిపింది. ఇప్పటి వరకు నలుగర్ని రక్షించామని ట్వీట్ చేసింది. ఆ తరువాత రెస్క్యూ బోట్ మరో ఇద్దరిని రక్షించారు. రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ద్వారా ఇంటర్నేషనల్ సేఫ్టీ నెట్ను యాక్టివేట్ చేశామని, ఇండియన్ నేవీ, ఓఎన్జీసీ సమన్వయంతో పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. మరో నౌక ముంబై నుంచి సహాయక చర్యల్లో నిమగ్నమైందన్నారు. -
ఖమ్మంకు బయలుదేరిన కేటీఆర్
-
గుడ్ క్యాచ్! ఆకాశం నుంచి పడిపోతున్న రాకెట్ని పట్టుకున్న హెలికాప్టర్!
US-based launch firm was partially successful: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాకెట్ల్యాబ్ ప్రయోగ సంస్థ ఒక అత్యద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలలో ఒక గొప్ప మైలురాయిని సాధించింది. అంతరిక్షంలోకి బహుళ ఉపగ్రహాలతో రాకెట్ని పంపే ఖర్చుని తగ్గించుకునేలా వాటిని తిరిగి భూమ్మీదకు తీసుకువచ్చేందుకు చేసిన ఒక ప్రయోగం అద్భుతమైన విజయాన్ని సాధించింది. అపర కుభేరుడు, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ ఈ రాకెట్ ల్యాబ్ని నిర్వహిస్తున్నారు. న్యూజిల్యాండ్లో బుధవారం ఉదయం 10.50 గంటలకు అంతరిక్షంలోని కక్ష్యలోకి 34 ఉపగ్రహాలను పంపడానికి బయలుదేరిన బూస్టర్ రాకెట్ ఆకాశంలో ఒకనొక దశలో కొంత ఎత్తుకు చేరుకున్న తర్వాత భూమ్మీద పడిపోబోతోంది. అదే సమయంలో న్యూజిలాండ్ తీరంలో సౌత్ పసిఫిక్కి సమీపంలో ఉన్న ఒక హెలికాప్టర్ రాకెట్ని పట్టుకునేందుకు 22 మైళ్ల దూరంలో ఒక పారాచూట్ని వదిలింది. హెలికాప్టర్ పారాచూట్, కేబుల్ వైర్ల సాయంతో ఆ రాకెట్ని పట్టుకుంది. ఆ తర్వాత ఆ రాకెట్ పసిఫిక్ మహా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ మేరకు ఈ రాకెట్ ప్రయోగం పాక్షికంగా విజయవంతమైంది గానీ ఆ రాకెట్ని సముద్రంలో పడకుండా భూమ్మీదకు తేగలిగినట్లయితే పూర్తి స్థాయిలో విజయం సాధించనట్లు అని రాకెట్ ల్యాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ బెక్ చెప్పారు. ఆ రాకెట్ సురక్షితంగా సముద్రంలోకి వెళ్లిందని, దాన్ని ఓడ సాయంతో తిరిగి తీసుకువస్తామని తెలిపారు. ఐతే ఆ బూస్టర్ రాకెట్ తిరిగి వినయోగించనుందా లేదా అనేది స్పష్టం చేయలేదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. 🚁 This was the moment a helicopter caught a falling rocket booster before dropping it into the ocean https://t.co/sPxDJjhEtt pic.twitter.com/I00r9G014L — Reuters (@Reuters) May 3, 2022 This is what it looked like from the front seats. pic.twitter.com/AwZfuWjwQD — Peter Beck (@Peter_J_Beck) May 3, 2022 (చదవండి: నేనేం రోబోను కాదు.. నాకూ ఫీలింగ్స్ ఉన్నాయి: ఎలన్ మస్క్) -
నాన్స్టాప్గా ప్రయాణించిన హెలికాప్టర్గా రికార్డు
న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ నాన్స్టాప్గా ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఈ హెలికాప్టర్ సోమవారం చండీగఢ్ నుంచి అస్సాంలోని జోర్హాట్ వరకు ఏడున్నర గంటలపాటు 1910 కి.మీ ప్రయాణించి సుదీర్ఘమైన నాన్ స్టాప్ హెలికాప్టర్ సోర్టీగా రికార్డు సృష్టించిందని రక్షణ అధికారులు తెలిపారు. చినూక్ హెలికాప్టర్ సామర్థ్యం తోపాటు వైమానికదళం కార్యాచరణ, ప్రణాళిక అమలుతోనే ఈ రికార్డు సాధ్యమైందని రక్షణ ప్రతినిధి పేర్కొన్నారు. ఇది యుద్ధరంగంలో బహువిధాలుగా సేవలందించనుందని తెలిపారు. ఈ హెలికాప్టర్ దళాలను, ఫిరంగులు, యుద్ధ సామాగ్రి, ఇంధనాన్ని రవాణ చేయడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. మానవతా విపత్తు సహాయ కార్యకలాపాల్లో ముఖ్య భూమిక పోషించనుందని తెలిపారు. శరణార్థులను పెద్దఎత్తున తరలించడం వంటి మిషన్లలో కూడా ఉపయోగపడునుందని చెప్పారు. భారత వైమానిక దళం అవసరమైన మేరకు హెలికాప్టర్ను సముచితంగా మోహరించేందుకు వీలు కల్పిస్తుందని రక్షణ అధికారి తెలిపారు. అంతేకాదు దాని వేగవంతమైన మొబిలిటీ అవసరమైన విధంగా వినియోగించుకునే సౌలభ్యం కూడా ఉందని పేర్కొన్నారు. అయితే భారత్ 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్స్ ఛాపర్లను అమెరికా నుండి కొనుగోలు చేసేందుకు 2015లో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. An @IAF_MCC Chinook undertook the longest non-stop helicopter sortie in India, flying from Chandigarh to Jorhat (Assam). The 1910 kms route was completed in 7 hrs 30 min and made possible by the capabilities of Chinook along with operational planning and execution by @IAF_MCC. pic.twitter.com/n2aSZ3tRp4 — PRO Defence Palam (@DefencePROPalam) April 11, 2022 (చదవండి: గాలిలో ప్రాణాలు) -
రష్యా బలగాలకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్..
కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. నెలకు పైగా సాగిస్తున్న యుద్ధంలో రష్యా సేనలు క్రమంగా వెనకడుగు వేస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యం ప్రతి దాడులతో రష్యా బలగాలు చుక్కలు చూస్తున్నాయి. తాజాగా ఇంగ్లండ్లో తయారైన స్టార్స్ట్రీక్ మిసైల్ సాయంతో రష్యా ఎంఐ–28ఎన్ హెలికాప్టర్ను లుహాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ కూల్చేసింది. మిసైల్ ఢీకొట్టడంతో హెలికాప్టర్ రెండు ముక్కలై నేలకూలిన వీడియో వైరల్గా మారింది. ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లే ఈ లేజర్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ తక్కువ ఎత్తులో వెళ్లే హెలికాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో నేలకూలుస్తుంది. పైగా ఇది చాలా తేలిగ్గా ఉంటుంది గనుక ఎక్కడికైనా సులువుగా మోసుకెళ్లవచ్చు. భుజం మీది నుంచి కూడా ప్రయోగించవచ్చు. స్టార్స్ట్రీక్ ప్రయోగంపై రష్యా మండిపడింది. ఇకపై ఇంగ్లండ్ ఆయుధ సరఫరాల నౌకలు, వాహనాలను లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతామని హెచ్చరించింది. యుద్ధంలో రష్యా ఇప్పటిదాకా కనీసం 143 యుద్ధవిమానాలు, 131 హెలికాప్టర్లు, 625 ట్యాంకులు, 316 సైనిక వాహనాలను కోల్పోయినట్టు సమాచారం. ఇప్పటిదాకా 18 వేల మందికి పైగా రష్యా సైనికులను మట్టుపెట్టినట్టు ఉక్రెయిన్ చెప్తోంది. #Ukrainian Armed Forces shot down a #Russian military helicopter in the Luhansk region using a portable anti-aircraft missile system. pic.twitter.com/jJvzdhCupl — NEXTA (@nexta_tv) April 1, 2022 -
ఐరాస హెలికాప్టర్ కూల్చివేత
దకర్: కాంగోలో వేర్పాటువాదులు తెగించారు. ఎనిమిది మంది ఐక్యరాజ్య సమితి శాంతిదూతలు, పర్యవేక్షకులను తీసుకెళ్తున్న ఒక హెలికాప్టర్ను వేర్పాటువాదులు కూల్చేశారు. సోమవారం కాంగో తూర్పుప్రాంతంలో ఎం23 రెబల్స్ గ్రూప్ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని, హెలికాప్టర్ జాడ, ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని కాంగో సైన్యం మంగళవారంప్రకటించింది. ఖనిజ సంపదతో నిండిన తూర్పు కాంగోపై పట్టు కోసం చాలా వేర్పాటువాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. (చదవండి: పుతిన్ చేస్తున్న దుర్మార్గాలపై ఆక్రోశమది: బైడెన్) -
దేశంలోనే తొలిసారిగా ఎయిర్బస్ హెలికాప్టర్ కొన్న కేరళ బిలియనీర్!
ప్రముఖ ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బి. రవి పిళ్ళై అరుదైన ఘనతను సాధించారు. దేశంలోని తొలిసారిగా ₹100 కోట్ల విలువైన ఎయిర్బస్ H145 హెలికాప్టర్ కొనుగోలు చేసిన వ్యక్తిగా ఈ బి.రవి పిళ్ళై నిలిచారు. 68 ఏళ్ల ఈ కేరళ బిలియనీర్ ప్రస్తుతం 2.5 బిలియన్ డాలర్ల విలువ ఆస్తిని కలిగి ఉన్నారు. బి. రవికి చెందిన వివిధ కంపెనీల్లో సుమారు 70,000 మంది ఉద్యోగులను పనిచేస్తున్నారు. ప్రస్తుతం యుఏఈ వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. హెలికాఫ్టర్ కొనుగోలు చేయడంతో అతని పర్యాటక కార్యకలాపాలు ఊపందుకున్నాయి, ఎందుకంటే అతనికి రాష్ట్రవ్యాప్తంగా లగ్జరీ హోటళ్ళు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల మీదుగా తన అతిథులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు అని ఆర్పీ గ్రూప్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న అత్యాధునిక హెలికాఫ్టర్ ఏడుగురు ప్రయాణీకులను, ఒక పైలట్'ను తీసుకెళ్లగలదు. ఈ హెలికాప్టర్ సముద్ర మట్టానికి 20,000 అడుగుల ఎత్తులో ల్యాండింగ్ & టేకాఫ్ చేసే సామర్ధ్యం కలదు. ఆర్పీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బి. రవి పిళ్ళై ఎక్కువ శాతం లో ప్రొఫైల్ కలిగి ఉంటారు. పిళ్ళై, తన ఛారిటీ కార్యకలాపాల వల్ల భాగ ప్రసిద్ధి చెందారు. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. ఏడాదిలో లక్షకు రూ.23 లక్షలు లాభం!) -
ప్రభుత్వం, గవర్నర్ మధ్య ప్రొటోకాల్ వివాదం.. అసలేం జరిగింది!
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య ప్రొటోకాల్ వివాదం ముదురుతోంది. మేడారం జాతరలో గవర్నర్ తమిళిసైకి ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ తప్పనిసరిగా హాజరై ఆహ్వానించాల్సి ఉన్నా, వారు గైర్హాజర్ కావడం వివాదానికి కేంద్ర బిందువైంది. మేడారం ముగింపు రోజు శనివారం ఉదయం 11.15 నిమిషాలకు గవర్నర్ మేడారం వెళ్తారని, హెలికాప్టర్ సమకూర్చాలని గవర్నర్ కార్యాలయం కోరినా, దానిని సమకూర్చకపోవడంతో గవర్నర్ మధ్యాహ్నం 3.30 గంటలకు మేడారానికి చేరుకున్నారు. అయితే అదేరోజు కాస్త ముందుగా సీఎం కేసీఆర్ జాతరకు వెళ్తున్నారని, ప్రభుత్వం వద్ద ఉన్నది ఒక హెలికాప్టర్ మాత్రమేనని, అందుకే దానిని సమకూర్చలేమని ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. సీఎం హెలికాప్టర్లో మేడా రం వెళ్తారనే సమాచారం ముందుగానే ఇచ్చారని, ఆ తర్వాతే గవర్నర్ కార్యాలయం హెలికాప్టర్ కోరిందని ఆ వర్గాలు తెలిపాయి. చివరికి గవర్నర్ రోడ్డుమార్గంలో మేడారానికి వెళ్లిన విషయం తెలిసిందే. గవర్నర్ కార్యాలయం ముందు ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయడం, కోవిడ్ పేరుతో జనవరి 26 వేడుకలను రాజ్భవన్కు మాత్రమే పరిమితం చేయడం వంటి విషయాలపై ప్రభుత్వం, గవర్నర్కు మధ్య విభేదాలు పొడచూపాయి. ఢిల్లీకి గవర్నర్ ప్రొటోకాల్ వివాదం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం పర్యటన సందర్భంగా ఉన్నతాధికారులు ప్రొటోకాల్ను విస్మరించిన అంశం ఢిల్లీకి చేరింది. మహాజాతరలో చివరి ఘట్టమైన దేవతల వనప్రవేశం రోజున(19న) దర్శనానికి గవర్నర్ ముందుగానే షెడ్యూల్ ఇచ్చారు. గవర్నర్ పర్యటనకు కొద్దిగంటల ముందే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ కృష్ణఆదిత్య, ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్, ఇతర అధికారులు మేడారం ‘సక్సెస్ మీట్’నిర్వహించారు. తర్వాత మేడారం చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జాయింట్ కలెక్టర్ ఇలాత్రిపాఠి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క స్వాగతం పలికారు. స్వాగతం, వీడ్కోలు కార్యక్రమాలకు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ గైర్హాజరు కావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే సీతక్క వేర్వేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టుల ప్రాబల్యప్రాంతంలో గవ ర్నర్ పర్యటనను తేలికగా తీసుకోవడంపై విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
సూపర్ ఐడియా బాసూ.. అద్దె కోసం హెలికాప్టర్గా టాటా నానో కారు!
ఇటీవల కాలంలో కోడళ్ళను అత్తారింటికి తీసుకెళ్ళడానికి, పెళ్లి మండపానికి చేరుకోవడానికి చాలా మంది హెలికాఫ్టర్లు బుక్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సౌకర్యం కొందరు డబ్బున్నోళ్లకు మాత్రమే కుదరుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు హెలికాప్టర్ అద్దెకు తీసుకోవడం అనేది ఓ కలగానే ఉండిపోతుంది. సరిగ్గా ఈ వ్యాపారాన్ని టార్గెట్ చేశాడు బీహార్ రాష్ట్రంలోని భగా సిటీకి చెందిన మెకానిక్ గుడ్డు శర్మ. మధ్యతరగతి వాళ్లు కూడా పెళ్లిళ్లకు హెలికాప్టర్ను అద్దెకు ఇచ్చేందుకు గుడ్డు శర్మ డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం తన టాటా నానో కారును హెలికాప్టర్గా మార్చేశాడు. ప్రస్తుతం టాటా నానో కారును హెలికాఫ్టర్గా మార్చి దానిని రూ.15 వేలకు అద్దెకు ఇస్తున్నాడు. తక్కువ ధరకే హెలికాఫ్టర్ సేవలు అందుతుండటంతో అతడికి ఆర్డర్లూ పెరుగుతున్నాయి. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ ప్రత్యేకమైన టాటా నానో కారుకి చెందిన కొన్ని చిత్రాలు వైరల్ అయ్యాయి. ఈ పాత నానో కారును హెలికాప్టర్గా మార్చడానికి సుమారు ₹2 లక్షలు ఖర్చు చేసినట్లు గుడు శర్మ పేర్కొన్నారు. కారును హెలికాప్టర్గా సిద్ధం చేయడానికి కొన్ని ప్రత్యేక సెన్సార్ల వినియోగించినట్లు పేర్కొన్నాడు. 'వివాహా సమయంలో హెలికాప్టర్లను బుక్ చేసుకోవడం కోసం ప్రజలలో చాలా ఉత్సాహం ఉంది. ఇక్కడ వాటి సేవలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది హెలికాప్టర్ ద్వారా తమ వివాహానికి వెళ్లాలని కోరుకుంటారు. కానీ అధిక ఛార్జీల కారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. అందుకే నేను నా టాటా నానో కారును మార్పు చేర్పులు చేసి హెలికాప్టర్ డిజైన్ ఇచ్చాను. ఈ హెలికాప్టర్ సహాయంతో పేద ప్రజలు తమ అభిరుచిని తక్కువ మొత్తానికి నెరవేర్చకొగలరు" అని శర్మ అన్నారు. ఈ డిజిటల్ ఇండియా యుగంలో గుడ్డు శర్మ చేసిన ఈ ఆవిష్కరణ స్వావలంబన భారతదేశానికి సజీవ ఉదాహరణ. కాగా, గతంలో బీహార్ రాష్ట్రంలోని ఛప్రా గ్రామానికి చెందిన మిథిలేష్ ప్రసాద్ అనే వ్యక్తి కూడా పైలట్ కావాలని కలలు కన్నాడు. కానీ దానిని కాలేకపోయాడు. దీంతో తన నానో కారును హెలికాప్టర్గా మార్చి దానికి తనే పైలట్'గా మారిపోయాడు. -
సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్
ఇంతవరకు మనం హెలకాప్టర్ క్రాష్కి సంబంధించిన పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవల యూకేలోని యూనిస్ తుపాను కారణంగా వీచిన ఈదురు గాలుల బీభత్సానికి విమానం ఎంత ప్రమాదకరంగా ల్యాండ్ అయ్యిందో చూశాం. అయితే ఇక్కడొక హెలికాప్టర్ ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందో గానీ అందరూ చూస్తుండగానే బీచ్లోని అలల పైకి దూసుకుపోయింది. అసలు విషయంలోకెళ్తే...అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ఫ్లోరిడాలోని రద్దీగా ఉండే మియామీ బీచ్లో ముగ్గురు ప్రయాణికులతో కూడిన రాబిన్సన్ R44 హెలికాప్టర్ కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్తో హెలికాప్టర్ క్రాష్కి గల కారణాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు మయామి బీచ్ పోలీసులు, అగ్నిమాపక విభాగాలు ఘటనాస్థలికి వచ్చి ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. This afternoon at 1:10 p.m., MBPD received a call of a helicopter crash in the ocean near 10 Street. Police and @MiamiBeachFire responded to the scene along with several partner agencies. Two occupants have been transported to Jackson Memorial Hospital in stable condition. 1/2 pic.twitter.com/heSIqnQtle — Miami Beach Police (@MiamiBeachPD) February 19, 2022 (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్గా తీసుకుని..
Groom Father Spent Rs 6.5 Lakh Booking The Helicopter: నిజంగా ఒక్కోసారి విమర్శలు మనల్ని ఎంత దూరం అయిన తీసుకువెళ్తాయి అనడానికి ఇదొక నిదర్శనం. రాజస్తాన్లోని కరౌలి జిల్లాలోని కామ్రీ గ్రామానికి చెందిన రాధేశ్యామ్ సైనీ ఒక రోజు తన బిడ్డతో ఒక చిన్న హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా ఒక వ్యక్తి సరదాగా కొడుకు పెళ్లికి నిజమైన హెలికాప్టర్ని తీసుకురావలి అని హేళనగా అన్నాడు. అయితే రాధేశ్యామ్ ఆ విషయాన్ని చాలా సీరియస్గా అనుకున్నాడు. ఎప్పటికైన కొడుకు పెళ్లికి హెలికాప్టర్ బుక్చేసి తన గ్రామంలోని వాళ్లను ఆశ్చర్యపరచాలి అని అనుకుంటాడు. అతను అనుకున్నట్లుగానే తన కొడుకు పెళ్లికి నిజంగానే హెలికాప్టర్ను రూ 6 లక్షలు వెచ్చించి మరీ బుక్ చేశాడు. అయితే వధువు తండ్రి దినేష్ చాలా పేదవాడు. మరోవైపు పెళ్లికూతురు మాత్రం తాను కలలో కూడా ఊహించని విధంగా స్పెషల్ హెలికాప్టర్ రైడ్లో రావడంతో ఆమె చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు హెలికాప్టర్లో బయలుదేరిన వధూవరులను చూసి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి హెలికాప్టర్లో వధువు ఖుష్బూ అత్తమామల ఇంటికి వెళ్లడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని లక్ష్మణ్ అనే గ్రామస్తుడు తెలిపారు. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పై చిరుత దాడి! ఐతే ఆ తర్వాత.) -
హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు వెళ్లే అవకాశం: భరత్రెడ్డి
-
పైలట్ లేకుండా నింగిలోకి..
మనం డ్రైవర్రహిత కార్లు చూశాం. అయితే అమెరికాలో మొదటిసారి పూర్తిస్థాయిలో పైలట్రహిత హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగిరింది. మరి దీన్ని యుద్ధక్షేత్రాల్లో కూడా వినియోగించ వచ్చా? దాని విశేషాలు ఏంటి? ఓ లుక్కేద్దాం! –సాక్షి, సెంట్రల్ డెస్క్ 4వేల అడుగుల ఎత్తులో.... బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఈనెల 5న అమెరికా కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్బెల్ నుంచి పైలట్ లేకుండా టేకాఫ్ అయింది. యూహెచ్–60ఏ బ్లాక్హాక్ అనే ఈ హెలికాప్టర్ ప్రయోగ సమయంలో 30 నిమిషాలపాటు గగనతలంలో చక్కర్లు కొట్టింది. 4వేల అడుగుల ఎత్తులో గంటకు 115–125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. అమెరికా రక్షణ పరిశోధన సంస్థకు చెందిన ‘అలియాస్’ అనే సాంకేతికతను వినియోగించి అందులో పైలట్ లేకుండాహెలికాప్టర్ను ఆపరేట్ చేశారు. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు.. పైలట్ దాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చినప్పుడు స్వయంప్రతిప్రత్తి వ్యవస్థకు అనుసంధానించేలా దీన్ని రూపొందించారు. అంటే పైలట్ బదులు ‘కంప్యూటర్ బ్రెయిన్’ దీన్ని నియంత్రిస్తుంది. అమెరికా రక్షణ ఆయుధాల పరిశోధన ప్రాజెక్టుల సంస్థ (డీఏఆర్పీఏ), లాక్హీడ్ మార్టిన్ సికోర్స్కీ అనే వైమానిక సంస్థ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. మనుషుల ప్రాణాలను కాపాడొచ్చు... ‘ఎయిర్క్రూ లేబర్ ఇన్–కాక్పిట్ ఆటోమేషన్ సిస్ట మ్ (అలియాస్)’ అనే సాంకేతికతతో దీన్ని రూపొందించారు. ప్రయాణ సమయంలో ఆటంకాలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని కూడా ఈ ప్ర యోగంలో పరీక్షించారు. మానవరహిత హెలికాప్ట ర్ నేలమీద ల్యాండ్ అయి దాని బ్లేడ్లు తిరగడం ఆగి న తర్వాత ఇద్దరు పైలట్లు అందులోకి వెళ్లి దాన్ని మానవ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అనంతరం దాన్ని బేస్లోకి తీసుకెళ్లారు. పైలట్కు ఎలాం టి అపాయం కలగకుండా ఉండేందుకు ఈ అటానమస్ హెలికాప్టర్ను యుద్ధక్షేత్రాల్లోకి కూడా పంపవచ్చని అంటున్నారు. యుద్ధానికి అవసరమైన సా మగ్రిని దీని ద్వారా తరలించవచ్చని చెబుతున్నారు. విమానం గగనతలంలో ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా దృశ్యస్పష్టత తగ్గినప్పుడు పైలట్ ఈ సాంకేతికతను ఉపయోగించి అటానమస్ మోడ్కు అనుమతించి ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చని అంటున్నారు. విపత్కర పరిస్థితుల్లో పైలట్లు ఎలాంటి సంకోచం లేకుండా పూర్తి విశ్వాసంతో అటానమస్ మోడ్కు అనుసంధానించవచ్చని ఫోర్ట్ క్యాంప్బెల్కు చెందిన లీడ్ పైలట్ బెంజమిన్ విలియమ్సన్ చెప్పారు. ‘ఎప్పుడు అవసరమైతే అప్పుడు అటానమీ మోడ్కు, పైలట్ మోడ్కు మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. ప్రమాదకర పరిస్థితులను గుర్తించడంలో, వాటిని అధిగమించడంలో ఈ సాంకేతికత ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రమాదాలను కూడా నివారించి మనుషుల ప్రాణాలను కాపాడవచ్చు’ అని పేర్కొన్నారు. సురక్షితంగా ల్యాండింగ్... ‘అలియాస్’ అనే సాంకేతికతను బ్లాక్హాక్ హెలికాప్టర్లోగానీ, విమానంలో గానీ వినియోగించడం మొదటిసారి కాదని, మానవరహితంగా గాల్లోకి ఎగరడం, ల్యాండ్ అవడం మాత్రం ఇదే మొదటిసారని సంబంధిత వర్గాలు చెప్పాయి. సాధారణంగా ఎక్కువ విమానాల్లో అటానమస్ సాంకేతికతను పైలట్లకు సహాయకారిగా వాడతారు. అదికూడా చిన్నచిన్న టాస్క్ల కోసమే వినియోగిస్తారు. కానీ సంక్లిష్టమైన, ఊహించని పరిస్థితులు తలెత్తినప్పుడు మానవ పైలట్లకే వదిలేస్తారు. కానీ బ్లాక్హాక్లో వినియోగించిన ‘అలియాస్’ అనేది మానవప్రమేయం లేకుండా పూర్తిగా అటానమస్ వ్యవస్థమీద ఆధారపడి పనిచేస్తుంది. చిన్నచిన్న పనులే కాకుండా అన్ని రకాల వ్యవహారాలను చక్కపెడుతుంది. అత్యవసర సమయాల్లో కూడా సురక్షితంగా ల్యాండ్ చేసే నైపుణ్యం దీని సొంతం. ఒకవేళ గాల్లో ఎగురుతున్నప్పుడు ఉన్నట్టుండి రెండు ఇంజన్లు కూడా ఫెయిలైతే అప్పుడు కూడా మానవప్రమేయం లేకుండా సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. ఇది పైలట్లు ఉన్నా లేకున్నా కూడా సైనికులకు రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్నివేళలా సహాయకారిగా ఉంటుందని అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ వెల్లడించారు. -
తొలిసారిగా పైలెట్ లేకుండానే దూసుకెళ్లిన హెలికాప్టర్.. ఎలాగో తెలుసా!!
Helicopter Flew Without Pilot: ఇక నుంచి హెలికాప్టర్లను నడపటానికి ఫైలెట్లు అవసరం ఉండదట. పైగా వాతావరణం అనుకూలించని సమయంలో కూడా పయనించే గలిగే ఫైలెట్ రహిత హెలికాప్టర్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ప్రత్యక సాంకేతికతో రూపొందించిన ఈ చాపర్ 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించి చివరికి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. పైగా దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో గంటకు 115 నుంచి 125 మైళ్ల వేగంతో ప్రయాణించింది. ఈ విమానం స్వయం ప్రతిపత్తితో పయనించే హెలికాప్టర్. ఇది అలియాస్ అనే యూఎస్ డిఫెన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్లో భాగంగా పూర్తిగా కంప్యూటర్-ఆపరేటెడ్ హెలికాప్టర్. కెంటకీలోని ఫోర్ట్ క్యాంప్బెల్ నుంచి ఈ ట్రయల్ పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లలో పనితీరు ముగిసిన వాటిని తొలగించి, వాటి స్థానంలో అలియాస్ ఈ ఆటోమేటడ్ ఫైలెట్ రహిత హెలికాప్టర్లను భర్తీ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఈ మేరకు అలియాస్ ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ మాట్లాడుతూ..."ఈ రకమైన స్వయంప్రతిపత్త హెలికాప్టర్ సాంకేతికతకు మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది భద్రత తోపాటు భూభాగంలోకి దూసుకెళ్లడం, విపత్తులను నివారించడం. రెండవది హెలికాప్టర్ సహాయకారి. మూడవది ఖర్చు తగ్గింపు. అని పేర్కొన్నాడు. ఇది ఆర్మీకి కార్యాచరణ సౌలభ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు ఇది తప్పనిసరిగా పగలు లేదా రాత్రి అన్ని సమయాల్లో ఈ పైలట్ రహిత హెలికాప్టర్ సులభంగా పయనించడమే కాక క్లిష్టమైన దృశ్యమన రహిత వాతావరణ పరిస్థితిల్లోనూ, విభిన్న క్లిష్ట పరిస్థితిలోనూ సులభంగా పయనించగలిగే వెసులుబాటుని కల్పిస్తోంది. WATCH: A Black Hawk helicopter flew for the first time without pilots in Kentucky. The aircraft flew for 30 minutes through a simulated cityscape avoiding imagined buildings before performing a perfect landing pic.twitter.com/SD01LWhUZe — Reuters Asia (@ReutersAsia) February 12, 2022 (చదవండి: రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక... వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే..) -
Bipin Rawat: సైనిక్ స్కూల్కు జనరల్ బిపిన్ రావత్ పేరు
లక్నో: దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ పేరును మెయిన్పురి జిల్లాలోని ఒక సైనిక్ స్కూల్కు పెట్టాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హెలికాప్టర్ ప్రమాదంలో నీలగిరి కొండల్లో నేలకొరిగిన రావత్కు నివాళిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం గురువారం ఒక ట్వీట్చేసింది. 2019 ఏప్రిల్ ఒకటిన ఈ స్కూల్ను ప్రారంభించారు. కూనూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులుసహా 13 మంది అమరులైన విషయం విదితమే. -
నేచర్ లవర్స్కి గుడ్న్యూస్! కబిని, కూర్గ్లకు హెలికాప్టర్ సర్వీసులు
Helicopter Ride From Bangalore To Coorg: హెలికాప్టర్ సేవల సంస్థ బ్లేడ్ ఇండియా కొత్తగా బెంగళూరు–కూర్గ్, బెంగళూరు–కబిని రూట్లలో సర్వీసులను ప్రారంభించింది. బెంగళూరు నుంచి ఈ రెండు ప్రాంతాలకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు సుమారు 6–7 గంటల సమయం పడుతుంది. కర్ణాటకలో అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ, చాలా ప్రాంతాలకు చేరుకోవడం ప్రయాసతో కూడుకున్నదని సంస్థ ఎండీ అమిత్ దత్తా తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల సమయమంతా ప్రయాణంలో వృధా కాకుండా నేరుగా గమ్యస్థానానికి చేరుకుని, అక్కడ సరదాగా గడిపేందుకు ఈ సర్వీసులు ఉపయోగపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎవాల్వ్ బ్యాక్ రిసార్ట్స్తో జట్టు కట్టినట్లు వివరించారు. అమెరికాకు చెందిన బ్లేడ్ అర్బన్ ఎయిర్ మొబిలిటీ, దేశీ వెంచర్ క్యాపిటల్ సంస్థ హంచ్ వెంచర్స్ కలిసి 2019లో బ్లేడ్ ఇండియాను ప్రారంభించాయి. వారాంతాల్లో ప్రైవేట్ చార్టర్ సేవలు అందించడం ద్వారా 2020 డిసెంబర్లో బ్లేడ్ ఇండియా.. కర్ణాటక రాష్ట్రంలో సర్వీసులు మొదలుపెట్టింది. దేశంలోనే ప్రముఖ హిల్ స్టేషన్గా కూర్గ్ ప్రకృతి అందాలకు కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఇక కబిని టైగర్ రిజర్వ్ ఇటీవల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా కబిని ఫారెస్ట్లో కనిపించే బ్లాక్ చీతాలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు. చదవండి: ఎల్జీ సరికొత్త ఆవిష్కరణ.. ఇక కరెంట్ లేకున్నా 3 గంటలు టీవీ చూడొచ్చు..! -
ఆ వీడియో వాస్తవమేనా..?
Bipin Rawats Chopper Crash Video: ఆర్మీ హెలికాప్ట్టర్ ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు తీసిన వీడియో వాస్తవమేనా అన్న పరిశోధన సాగుతోంది. ఈ వీడియో చిత్రీకరించిన నాజర్ అనే వ్యక్తి వద్ద క్యూబ్రాంచ్ వర్గాలు విచారణ జరుపుతున్నాయి. ఈమేరకు ఘటనా స్థలంలోని కార్మికుల వద్ద ఆదివారం విచారణ సాగింది. వివరాలు.. నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని ఆర్మీ హెలికాçప్టర్ కుప్పుకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ సహా 13 మంది మరణించిన విషయం తెలిసిందే. (చదవండి: పాత కార్లు, సైకిల్ విడిభాగాలతో... ఏకంగా విమానాన్ని తయరు చేశాడు!!) ఈ ఘటనపై ఓ వైపు ఆర్మీ వర్గాలు, మరోవైపు రాష్ట్ర పోలీసు యంత్రాంగం దర్యాప్తు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో హెలికాప్ట్టర్ కుప్పకూలేందుకు ముందుగా చిట్ట చివరి దృశ్యం అంటూ ఓ వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఎంత వరకు వాస్తవం అన్నది పసిగట్టేందుకు క్యూబ్రాంచ్ రంగంలోకి దిగింది. విచారణను ముమ్మరం చేయగా, ఆ వీడియోను కోయంబత్తూరుకు చెందిన నాజర్ చిత్రీకరించినట్టు ఆదివారం వెలుగు చూసింది. దీంతో ఆయన వద్ద విచారణ జరుపుతున్నారు. తాము పరాట్యక ప్రాంత సందర్శనకు వెళ్లిన సమయంలో ఆ వీడియో చిత్రీకరించినట్టు ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అయితే, రైల్వే ట్రాక్ వైపుగా నడుచుకురావాల్సిన అవసరం ఏమిటో అన్న ప్రశ్నలతో నాజర్ వద్ద విచారణ చేపట్టారు. అలాగే, ఆయన సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని, ఆ వీడియో వాస్తవమేననా అన్నది నిగ్గుతేల్చేందుకు కోయంబత్తూరులోని పరిశోధన కేంద్రంలో çపరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్మీ వర్గాల నేతృత్వంలో సంఘటన జరిగిన ప్రదేశం పరిసరాల్లో మరోమారు పరిశీలన సాగింది. అయితే, ఆ పరిసరాల్లో 60 కుటుంబాలు ఉండగా, ఇందులో 12 మంది ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినట్టు సమాచారం. దీంతో హెలికాప్టర్ గాల్లో నుంచి కింద పడ్డ అనంతరం పేలిందా..? లేదా, గాల్లోనే ఏదేని మంటలు చెలరేగినట్టుగా కింద పడిందా...? అన్న కోణంలో వారిని ప్రశ్నించినట్లు సమాచారం. పాకిస్తానీ ట్విట్టర్లపై చెన్నై సైబర్ క్రైం కేసు పాకిస్తానీ ట్విట్టర్ ఖాతాదారులు పలువురిపై సీబీసీఐడీ సైబర్ క్రైం ఆదివారం కేసులు నమోదు చేసింది. బిపిన్రావత్ మరణం, హెలికాప్ట్టర్ ప్రమాద ఘటనపై పాకిస్తాన్కు చెందిన కొన్ని ట్విట్టర్ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారం, ఆధార రహిత ఆరోపణలు, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే రీతిలో సంభాషణలు సాగినట్టు తమిళనాడు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. దీంతో ఆయా ఖాతాలపై చర్యలకు తగ్గట్టు ట్విట్టర్ మీద ఒత్తిడి తెచ్చే విధంగా కేసులు నమోదు చేశారు. (చదవండి: వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్కి గురైన వెయిటర్!) -
సాంట్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన సాంట్ (స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్) మిస్సైల్ను భారత్ శనివారం విజయవంతంగా పరీక్షించింది. హెలికాప్టర్ నుంచి లాంచ్ చేయగలగడం ఈ మిస్సైల్ ప్రత్యేకత. రాజస్తాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో దీన్ని పరీక్షించారు. ఈ ఫ్లైట్ టెస్టింగ్ను డీఆర్డీఓ, భారతీయ వాయు దళం సంయుక్తంగా నిర్వహించాయని రక్షణ శాఖ వెల్లడించింది. మిసైల్ అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిందని తెలిపింది. పది కిలోమీటర్ల రేంజ్లో లక్ష్యాలను ఈ మిస్సైల్ ఛేదించగలదు. మిస్సైల్ రిలీజ్ మెకానిజం, గైడెన్స్, ట్రాకింగ్, అంతర్గత సాఫ్ట్వేర్ అన్నీ బాగా పనిచేశాయని రక్షణ శాఖ ప్రకటన తెలిపింది. ప్రాజెక్టు విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ పరిశోధక బృందాన్ని అభినందించారు. హైదరాబాద్లోని ఆర్సీఐ (ఇమారత్)లో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో పరీక్షించిన దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాల్లో ఇది మూడోదని రక్షణ శాఖ తెలిపింది. దేశీయ రక్షణ సామర్థ్యాలకు మరింత జోరునిచ్చేందుకు సాంట్ పరీక్ష విజయవంతం కావడం దోహదం చేస్తుందని డీఆర్డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి చెప్పారు. -
Bipin Rawat Chopper Crash: మృత్యువుతో పోరాడి కన్నుమూసిన రావత్
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కొయంబత్తూర్, కూనూరు మధ్యలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. కెప్టెన్ వరుణ్సింగ్ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బిపిన్ రావత్ మాత్రమే ప్రాణాలతో ఉన్నారు. 90 శాతం కాలిన గాయాలతో ఉన్న బిపిన్ రావత్కు వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందించారు. కానీ కొద్దిసేపటికే బిపిన్ రావత్ మృతి చెందారు. ప్రమాదంలో బిపిన్ రావత్, భార్య మధులికతో పాటు 13 మంది మృతిచెందారు. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉండటంతో డీఎన్ఏ టెస్టుల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు. చదవండి: (కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్: ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు) -
బ్లేడ్ ఇండియా విస్తరణ బాట
ముంబై: హెలికాప్టర్ రవాణా సర్వీసులందించే బ్లేడ్ ఇండియా తాజాగా 5 కొత్త హెచ్125 హెలికాప్టర్లను సమకూర్చుకోనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశీయంగా పెరుగుతున్న ఆన్డిమాండ్ హెలికాప్టర్ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వీలుగా యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్బస్తో జట్టు కట్టినట్లు బ్లేడ్ ఇండియా పేర్కొంది. యూఎస్ కంపెనీ బ్లేడ్ యూఏఎం, హంచ్ వెంచర్స్ గ్రూప్ ఇండియా భాగస్వామ్య పద్ధతిలో బ్లేడ్ ఇండియాను ఏర్పాటు చేశాయి. బ్లేడ్కు దేశీ అనుబంధ సంస్థగా 2019లో ప్రారంభమైన కంపెనీ ప్రధానంగా మహారాష్ట్రలో సర్వీసులు అందిస్తోంది. వచ్చే నెల నుంచి కర్ణాటకలోనూ కార్యకలాపాలు ప్రారంభించనుంది. దేశ వ్యాప్తంగా మరిన్ని రాష్ట్రాల్లో సర్వీసులను విస్తరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. -
రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి.. హెలికాఫ్టర్ సాయంతో
సాక్షి, చిత్తూరు: చంద్రగిరి నియోజకర్గం పరిధిలో వరదముంపు ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన హెలికాప్టర్ సాయంతో ఆహార పంపిణీ చేపట్టారు. రామచంద్రపురం మండలంలో రాయల చెరువు గండి పడే అవకాశం ఉండటంతో 18 గ్రామాలు ఖాళీ చేయించారు. తిరుపతిలో పునరావసం కల్పించారు. మరోవైపు కొంతమంది ఊరు వదిలి వెళ్లేందుకు ఇష్టపడని ప్రజలు స్థానికంగా ఉన్న కొండలు పైభాగంలో ఆవాసంగా చేసుకున్నారు. స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహించడంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెలికాప్టర్ సాయంతో వరద ముంపుకు గురైన రామచంద్రాపురం మండలంలోని సీకాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోని నిర్వాసితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. చదవండి: (ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి) రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ వైపు సహాయక, పునరావాస సౌకర్యాలు కల్పిస్తూనే మరోవైపు వరద ముంపు తగ్గించే పనులు వేగవంతం చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు వద్ద లీకేజీ అరికట్టేందుకు భారీగా ఇసుక, కంకర, సిమెంట్ తరలించి కట్టడి చేస్తున్నారు. టీటీడీ అందించిన ఖాళీ గోనె సంచులు, ప్లాస్టిక్, సిమెంట్ సంచుల్లో ఇసుక మిశ్రమం నింపి మూట కట్టి అడ్డుకట్ట వేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టి రాయల చెరువు లీకేజీని అదుపులోకి తెచ్చారు. రాయల చెరువుకు అవుట్ ఫ్లోను మరింత వెడల్పు చేసి, దిగువకు నీరు విడుదల చేశారు. అనంతరం ట్రాక్టర్పై వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పగలు, రాత్రి రాయల చెరువు వద్దనే ఉంటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చదవండి: ('మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నా') -
ఫిజిక్స్లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్నే అద్దెకు తీసుకున్నాడు
న్యూయార్క్: ఏదైనా పరీక్షలో ప్రశ్నకు సమాధానం తెలియక వదిలేస్తే మనం టీచర్నో లేక మన సీనియర్స్నో అడుగుతాం. కానీ ఈ యూట్యూబర్ ఫిజిక్స్ పరీక్షలోని ఒక ప్రశ్నకు సమాధానం కోసం హెలికాఫ్టర్నే అద్దెకు తీసుకుని కనుకున్నాడు. అసలు ఏంటిది అని ఆశ్చర్యంగా ఉందా. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) వివరాల్లోకెళ్లితే.....వెరిటాసియం అనే యూట్యూబ్ చానెల్ని నడుపుతున్న డెరెక్ ముల్లర్ తనను కలవరపెడుతున్న ఫిజిక్స్ ప్రశ్నను పరిష్కరించడానికి హెలికాప్టర్నే అద్దెకు తీసుకుని ప్రయాణించాడు. 2014 యూఎస్ ఫిజిక్స్ ఒలింపియాడ్ అర్హత పరీక్షలో 19వ ప్రశ్నకి సమాధానం కోసం నిజంగానే ఆచరణాత్మక ప్రయోగం చేశాడు. ఆ ప్రశ్న ఏంటంటే " ఒక హెలికాప్టర్ స్థిరమైన వేగంతో అడ్డంగా ఎగురుతోంది. హెలికాప్టర్ కింద ఒక సంపూర్ణ అనువైన యూనిఫాం కేబుల్ సస్పెండ్ చేయబడింది. కేబుల్పై గాలి రాపిడి చాలా తక్కువ కాదు. హెలికాప్టర్ గాలిలో కుడివైపుకి ఎగురుతున్నప్పుడు ఈ క్రింది రేఖాచిత్రాలలో ఏది కేబుల్ ఆకారాన్ని బాగా చూపుతుంది?". అయితే ఈ ప్రశ్న కోసం కాగితం లేదా కంప్యూటర్లో లెక్కించడానికి బదులుగా, ముల్లర్ దానిని ఆచరణాత్మకంగా పరిష్కరించాలని నిర్ణయించుకోవడం విశేషం. ఈ మేరకు ముల్లర్ హెలికాప్టర్ను అద్దెకు తీసుకుని 20-పౌండ్ల కెటిల్ బెల్తో పాటు ఛాపర్ నుండి ఒక కేబుల్ను క్రిందికి వేలాడిదిపి అది ఎలా ఎగురుతుందో చూశాడు. పైగా ఆ ప్రయోగం ఆ ప్రశ్నకి సమాధానం 'డీ' గా భావించాడు. కానీ ఆ సమాధానం కూడా సృతప్తినివ్వక మళ్లా మళ్లా అదే ప్రయోగం చేశాడు. ఈ మేరకు అతను ఆ ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఏఏపీటీ) సోషల్ మీడియాలో "కేబుల్పై గాలి రాపిడి ఉన్నందున, హెలికాప్టర్కు కేబుల్ జోడించే శక్తికి క్షితిజ సమాంతర భాగంలో ఉండాలి." అని ఒక పరిష్కారాన్ని పోస్ట్ చేసింది. (చదవండి: వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి) -
బందరు రోడ్డులో దసరా ఉత్సవాల సందర్బంగా హెలికాప్టర్ రైడ్
-
ఎయిర్ అంబులెన్స్గా జయలలిత హెలికాప్టర్
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత హయాంలో 2006లో కొనుగోలు చేసిన ప్రభుత్వ హెలికాప్టర్ను ఎయిర్ అంబులెన్స్గా మార్చేందుకు డీఎంకే ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పట్లో సీఎం పర్యటనల కోసం దీన్ని సిద్ధం చేశారు. సీఎంతో పాటుగా 14 మంది పయనించేందుకు అవసరమైన వసతులు ఇందులో ఉన్నాయి. అయితే తర్వాత వచ్చిన డీఎంకే సర్కారు ఈ హెలికాప్టర్ను పెద్దగా వాడుకోలేదు. 2011లో మళ్లీ అధికారంలోకి వచ్చిన జయలలిత దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. దీంతో అమ్మ హెలికాప్టర్గా ఇది ముద్ర పడింది. అమ్మ మరణం తర్వాత సీఎంగా పళనిస్వామి కొన్ని సందర్భాల్లో ఉపయోగించినా, చివరకు 2019 నుంచి ఇది మీనంబాక్కం విమానాశ్రయానికే పరిమితమైంది. ఇక ప్రస్తుత సీఎం స్టాలిన్ హెలికాప్టర్ పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా, రైలు, విమానం లేదా రోడ్డు మార్గంలోనే పయనిస్తున్నారు. చదవండి: (భార్యపై కోపంతో కారు, 4 బైకులకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి) అత్యవసర వైద్య సేవలకు వృథాగా పడి ఉన్న ప్రభుత్వ హెలికాప్టర్ సేవను ఎయిర్ అంబులెన్స్గా ఉపయోగించాలని సీఎం నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు తగ్గ కసరత్తులు ఆరోగ్య శాఖ చేపట్టడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ హెలికాప్టర్ 2,449 గంటలు మాత్రమే ప్రయాణించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల ఆవరణల్లో హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్కు తగ్గ వసతులు ఉన్న దృష్ట్యా, అత్యవసర వైద్య సేవలకు ఎయిర్ అంబులెన్స్గా సర్కారీ హెలికాప్టర్ను మార్చేందుకు సిద్ధమవుతున్నారు. అమ్మ హెలికాప్టర్ను రంగంలోకి దిగిన పక్షంలో రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. చదవండి: (అప్పుడు కేరళలో.. ఇప్పుడు తమిళనాడులో.. ఆ హక్కు మీకు ఉంది!) -
ల్యాండింగ్ ప్రాబ్లెమ్ తో క్రాష్ అయిన హెలికాప్టర్
-
రషీద్ ఖాన్ హెలికాప్టర్ సిక్స్.. వీడియో వైరల్
లండన్: అఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్లో అదరగొట్టాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్ ఖాన్ యార్క్షైర్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్ కొట్టిన హెలికాప్టర్ సిక్స్ ఇన్నింగ్స్కే హైలెట్గా నిలిచింది. జోర్డాన్ థాంప్సన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఆఫ్ స్టంప్ మీదుగా రషీద్ హెలకాప్టర్ సిక్స్ కొట్టాడు. అతని షాట్లో ఎంత కచ్చితత్వం అంటే ఫీల్డర్కు బంతి దొరికే చాన్స్ కూడా ఇవ్వకుండా గ్యాలరీలో పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓవరాల్గా రషీద్ 9 బంతులాడి మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 27 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్షైర్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. టామ్ కాడ్మోర్ 55, బాలన్స్ 55 పరుగులు చేశారు. ససెక్స్ బౌలింగ్లో టైమల్ మిల్స్ 3, రషీద్ ఖాన్, లెన్హమ్, జార్జ్ గార్టన్, క్రిస్ జోర్డాన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ లూక్ రైట్ 54 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రషీద్ ఖాన్ 27, డిల్రే రావ్లిన్స్ 27 పరుగులు చేశారు. ఈ విజయంతో ససెక్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచక పాలనతో రషీద్ ఖాన్ తన కుటుంబం గురించి ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. తన కుటుంబాన్ని తాలిబన్ల నుంచి కాపాడడంటూ కామెంట్స్ చేశాడు. ఇక పాకిస్తాన్, అఫ్గన్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ నిరవధిక వాయిదా పడింది. చదవండి: తాలిబన్ల మధ్యే కుటుంబం: పీటర్సన్ వద్ద రషీద్ ఆవేదన Virat Kohli- James Anderson: రవిశాస్త్రి ఏం జరిగినా పట్టించుకోడు 🚁 RASHID KHAN 🚁 How have you played this??!!#Blast21 pic.twitter.com/KU2DCptXgp — Vitality Blast (@VitalityBlast) August 24, 2021 -
హెలికాప్టర్ తయారుచేసి దానికే బలైన యువకుడు
-
వికటించిన ప్రయోగం: హెలికాప్టర్ తయారీ.. బ్లేడ్ పడి వ్యక్తి మృతి
ముంబై: విమానయానం ఇంకా సామాన్యులకు చేరువకాలేదు. ఆశగా ఆకాశంలోకి చూడటమే తప్ప.. ఆ రెక్కల విహంగంలో ఎక్కి ప్రయాణించడం నేటికి కూడా సామాన్యుడికి తలకు మించిన భారమే. ఈ క్రమంలో ఓ వ్యక్తి తానే హెలికాప్టర్ను తయారు చేద్దామని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది.. దాని బ్లేడ్ అతడి మీద పడి మరణించాడు. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్ర యావత్మాల పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మహగావ్ తాలుకా ఫుల్సవంగా గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ షేక్ ఇబ్రహీం అనే వ్యక్తి మెకానిక్గా పని చేసుకుంటూ ఉండేవాడు. అతడికి చిన్నప్పటి నుంచి విమానాలు, గాల్లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఈ క్రమంలో ఇబ్రహీం తానే సొంతంగా ఒక హెలికాప్టర్ తయారు చేయాలని భావించాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇబ్రహీం హెలికాప్టర్ను పరీక్షిస్తుండగా.. దానిలో తలెత్తిన లోపం వల్ల బ్లేడ్ అతడి తలపై పడింది. తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే ఇబ్రహీం మృతి చెందాడు. -
హెలికాప్టర్ బ్రదర్స్ అరెస్ట్.. చిక్కుల్లో మాజీ మంత్రి..
సాక్షి, చెన్నై: ఫైనాన్స్ మోసం కేసులో హెలికాప్టర్ బ్రదర్స్ను తంజావూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇక మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ మెడకు అక్రమాస్తుల కేసు ఉచ్చు బిగిసింది. తంజావూరు జిల్లా కుంభకోణంకు చెందిన హెలికాప్టర్ బ్రదర్స్ ఎంఆర్ గణేషన్, ఎంఆర్ స్వామినాథన్ దక్షిణ తమిళనాడులో పలుచోట్ల ఫైనాన్స్ సంస్థను నెలకొల్పారు. సొంతంగా హెలికాప్టర్ ఉండబట్టే, తమ పేరుకు ముందు ఈ ఇద్దరు హెలికాప్టర్ను చేర్చుకున్నట్టు ఆ జిల్లాలో చెబుతుంటారు. ఈ బ్రదర్స్ బీజేపీలోనూ చేరి, రాజకీయంగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా కొన్ని బ్రాంచ్లను మూసివేసినట్టు, రెట్టింపు ఆదాయం పేరిట తమను ఈ బ్రదర్స్ మోసం చేసినట్టుగా బాధితులు బుధవారం పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో తంజావూరు పోలీసులు రంగంలోకి దిగి విచారించారు. తమ పేరిట అతి పెద్ద పాడి పరిశ్రమ ఉన్నట్టు, విదేశాలకు ఇక్కడి ఉత్పత్తుల ఎగుమతులు, ఫైనాన్స్ సంస్థలో రెట్టింపు ఆదాయం అంటూ ఈ బ్రదర్స్ కోట్లాది రూపాయల్ని ఆర్జించినట్టు విచారణలో తేలింది. దీంతో గురువారం మధ్యా హ్నం ఈ ఇద్దర్ని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, విరుదునగర్జిల్లా రాజపాళయం కేంద్రంగా ఫైనాన్స్ సంస్థను నడిపి వందలాది మందిని మోసం చేసిన మరో కేసులో రాధాకృష్ణన్, లోకనాథన్, శంకరనారాయణ, మణిగండన్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి చెందిన రూ. ఏడు కోట్ల విలువగల ఆస్తులను గురువారం జప్తు చేశారు. చిక్కుల్లో మాజీ మంత్రి.. 2011–13 కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు కేటీ రాజేంద్ర బాలాజీ అక్రమాస్తులు కేసు కోర్టులో విచారణ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈ అక్రమార్జనకు సంబంధించిన ఆధారాల అన్వేషణలో డీఎంకే ప్రభుత్వం ఉంది. ఈ విచారణ నిలుపుదలకు రాజేంద్రబాలాజీ కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణను కొనసాగించేందుకు అంగీకరిస్తూ, స్టే ఇవ్వడానికి కోర్టు గురువారం నిరాకరించింది. దీంతో అక్రమాస్తుల కేసు ఉచ్చు కేటీ రాజేంద్ర బాలాజీ మెడకు బిగిసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
సైన్స్ ఫిక్షన్ సినిమా హీరోలేనా, మనము ఎగిరి పోదాం
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు, విలన్లు వీపుకి చిన్న సిలిండర్ తగిలించుకుని గాల్లోకి దూసుకెళ్తుంటారు. ఆ సీన్లని చూసినప్పుడల్లా ఇలాంటి టెక్నాలజీ డెవలప్ అయితే బాగుండు. మనం ఎంచక్కా గాల్లో ఎగిరిపోవచ్చు అని అనుకుంటాం. బహుశా రాబోయే రోజుల్లో ఇది సాధ్యం కావొచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన కాప్టర్ప్యాక్ అనే సంస్థ సోలో ‘బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్’ను డెవలప్ చేసింది. ప్రస్తుతం కాప్ట్ప్యాక్ టెస్ట్ రన్ వీడియోల్ని ఆ సంస్థ యూట్యూబ్లో షేర్ చేసింది. ఇందులో ఓ యువకుడు కాప్టర్ప్యాక్ను తగిలించుకుని, మెషీన్ ఆన్ చేసి 50 అడుగుల ఎత్తులో కొన్ని సెకన్ల పాటు ఎగిరాడు. ఎలా పనిచేస్తుంది హెలికాప్టర్ మోటార్, రూటర్లు ఎలా ఉంటాయో ఈ బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్ కు రెండు జైంట్ టర్బన్లు ఉంటాయి. టర్బన్లను వీపుకు తగిలించుకొని గాల్లో ఎగరవచ్చు. ఇందుకు సపోర్ట్ గా ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాటరీలు ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టి అవసరం అనుకున్నప్పుడు ఉపయోగించవచ్చు. అయితే ప్రస్తుతం ట్రయల్ రన్స్లో ఉన్న ఈ హెలికాప్టర్కు కొన్ని మార్పులు చేయాల్సి ఉందని దీన్ని డిజైన్ చేసిన మ్యాట్ తెలిపారు. గతంలో ఫ్లాప్, మరి ఇప్పుడో కాగా, గతంలో దుబాయ్, చైనా, న్యూజిలాండ్కు చెందిన కంపెనీలు బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్లను తయారు చేశాయి. కానీ అవి అట్టర్ ప్లాప్గా మిగిలిపోయాయి. గతేడాది ఓ దుబాయ్ సంస్థ జెట్ బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్ను తయారు చేసింది. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే జెట్ బ్యాక్ప్యాక్ను రూపొందించింది. జెట్ ఫ్యూయల్ ఇంజన్లతో 20 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లవచ్చు. కానీ ఫ్యూయల్ సమస్యలు తలెత్తడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఓ యువకుడు హెలికాప్టర్ను తగిలించుకొని ఎగిరే ప్రయత్నం చేశాడు. గాల్లో ఉండగా ఆ హెలికాప్టర్ అటాచ్ చేసిన ప్యారాచూట్ తెరుచుకోకపోవడం మరణించాడు. తాజాగా ఆస్ట్రేలియా కంపెనీ తయారు చేసిన బ్యాక్ ప్యాక్ హెలికాప్టర్ సక్సెస్ అవుతుందా? లేదంటే ఫెయిల్ అవుతుందా' అనేది టెక్నాలజీపై ఆదారపడి ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
చైనా కాచుకో... రోమియో వచ్చేసింది
వెబ్డెస్క్ : ఇండియన్ నేవి ఇకపై శత్రు దుర్భేద్యం కానుంది. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఒంటెద్దు పోకడలకు కళ్లెం వేపడనుంది. మరికొద్ది రోజుల్లోనే యూఎస్కి చెందిన MH 6 రోమియో హెలికాప్టర్లు భారత్కు చేరుకోనున్నాయి. ఇప్పటికే పైలెట్లు , ఇతర క్రూ అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. యాంటీ సబ్మెరైన్ వార్లో శక్తివంతమైన MH 6 రోమియో హెలికాప్టర్లలో మూడింటిని జులై చివరి నాటికి భారత్కి అందిస్తామని యూఎస్ ప్రకటించింది. యాంటీ సబ్మెరైన్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్లో ఎదురులేని రోమియో హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటో చూడండి -
ఆడపిల్ల పుట్టిందని.. హెలికాఫ్టర్ బుక్ చేశాడు..ఎందుకంటే!
జైపూర్: దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా.. అని ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే అరిష్టం, మగ పిల్లాడు పుడితే అదృష్టంగా భావించే కుటుంబాలు ఉన్నాయని మనం అప్పడప్పుడూ వార్తల్లో వింటూనే ఉంటాం. అంతేందుకు తల్లిదండ్రులు తమ కొడుకును ఒకవిధంగా, కూతురిని మరోలా చూడటంలాంటివి ఘటనలు ఒక్కోసారి మన ఇరుగు పొరుగు ఇంటిలోనే మనకు తారసపడే ఉంటాయి. అయితే ఇలాంటి అసమానతలను పక్కనబెట్టి ఆడపిల్ల ఇంట్లో పుట్టడం అదృష్టం అంటూ సంబరాలు చేసుకుంది ఓ రాజస్థానీ కుటుంబం. 35 ఏండ్ల తర్వాత తమ కుటుంబంలో లేకలేక జన్మించిన ఆడబిడ్డకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ చిన్నారి తమ ఇంట్లో అడుగుపెట్టే శుభ ముహూర్తాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంచుకోవాలనుకుంది ఆ కుటుంబం. అందుకోసం ఏకంగా ఓ హెలికాఫ్టర్నే బుక్చేశారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని నౌగౌర్ జిల్లాలోని నిమిబ్డి చందావతాకు చెంది హనుమాన్ ప్రజాపత్, చుకిదేవి దంపతులు. వారికి గత నెలలో ఆడ శిశువు జన్మించింది. అయితే ప్రసవం అనంతరం ఆస్పత్రి నుంచి ఆమె తన పుట్టింటికి వెళ్లింది. ఆ చిన్నారి తాత మదన్ లాల్ కుమ్హార్ కుటుంబంలో గత 35 సంవత్సరాలుగా ఆడపిల్లలు జన్మించనే లేదు. ఇన్నేళ్ల తరువాత తమ కుటుంబంలోకి ఓ ఆడపిల్ల రావడంతో హనుమాన్తోపాటు, అతని తల్లిదండ్రులు ఖుషీ అయ్యారు. పాపకు నెల రోజులు నిండటంతో తమ ఇంటికి తీసుకువాలనుకున్నారు. అయితే ఆ చిన్నారిని తమ ఇంట్లోకి ఘనంగా ఆహ్వానించాలని, అది ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలనుకున్నారు. అందుకోసం ఓ హెలికాప్టర్ను బుక్ చేసుకున్నారు. ఇంకేముంది ఊరంతా తెలిసేలా హెలికాఫ్టర్లో తన మనవరాలిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ పాప రాకను ఓ పండుగలా జరుపుకున్నారు. ( చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..! ) -
నాసా సాధించిన మరో ఘన విజయం..
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ఘన విజయాన్ని సాధించింది. మార్స్పై హెలికాప్టర్ ఇన్జెన్యూటీని నాసా తొలిసారిగా ఎగురవేసింది. తెల్లవారుజామున 3:34 గంటలకు,1.8 కిలోగ్రాముల బరువున్న ఇన్జెన్యూటీ మార్స్ ఉపరితలం పైన సుమారు 10 అడుగుల ఎత్తులో, 39.1 సెకన్ల పాటు ఎగిరినట్లు నాసా పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియోలను పర్సవరెన్స్ రికార్డు చేసినట్లు నాసా తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను 270 మిలియన్ల కిలోమీటర్ల నుంచి ట్రాన్స్మిట్ చేయడం కోసం సుమారు మూడు గంటల సమయం పట్టిందని నాసా పేర్కొంది. తొలుత ఈ ప్రయోగాన్ని ఏప్రిల్ 11న చేపట్టాలని నిర్ణయించగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ టెస్ట్ను నిలిపివేశారు. ఏప్రిల్ 22 న మరోసారి రెండో టెస్ట్ ఫ్లైట్ను జరుపనున్నట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ ఎగురవేయడానికి మార్స్పై అంతగా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఈ మిషన్పై మొదట్లో అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం రోజున హెలికాప్టర్ ఇన్జెన్యూటీని తొలిసారిగా టెస్ట్ ఫ్లైట్ను విజయవంతంగా పూర్తి చేశామని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను నాసా ట్విటర్లో పోస్ట్ చేసింది. నాసా ఈ పరీక్షను ‘రైట్ బ్రదర్స్ సోదరుల మూమెంట్’ గా అభివర్ణించింది. అంగారక గ్రహంపై పరిశోధనలు చేపట్టడానికి ‘పర్సవరెన్స్’రోవర్ను నాసా పంపిన విషయం తెలిసిందే. పర్సవరెన్స్ రోవర్ ప్రాజెక్టులో భాగంగా ఇన్జెన్యూటీ హెలికాప్టర్ను పంపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసినా.. మొదటిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్ను వినియోగించనుండటం ఇదే తొలిసారి. పర్సవరెన్స్ రోవర్తోపాటు ఇన్జెన్యుటీని పంపినా.. దీనిని పూర్తి ప్రత్యేక ప్రయోగంగానే నిర్వహిస్తున్నారు. అంగారకుడిపై పగటి ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల వరకు పెరిగి.. రాత్రికి మైనస్ 90 డిగ్రీల వరకు పడిపోతుంటాయి. "Wow!" The @NASAJPL team is all cheers as they receive video data from the @NASAPersevere rover of the Ingenuity #MarsHelicopter flight: pic.twitter.com/8eH4H6jGKs — NASA (@NASA) April 19, 2021 You wouldn’t believe what I just saw. More images and video to come...#MarsHelicopterhttps://t.co/PLapgbHeZU pic.twitter.com/mbiOGx4tJZ — NASA's Perseverance Mars Rover (@NASAPersevere) April 19, 2021 చదవండి: మార్స్పై బుల్లి హెలీకాప్టర్, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా? -
యూసూప్ ఆలీ కి తప్పిన పెను ప్రమాదం
-
మార్స్పై బుల్లి హెలీకాప్టర్, దానికి పేరు పెట్టిందెవరో తెలుసా?
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ అంగారకుడిపైకి చేపట్టిన ‘పర్సవరెన్స్’రోవర్ ప్రాజెక్టులో భాగంగా ఇన్జెన్యూటీ హెలికాప్టర్ను పంపారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంతరిక్ష ప్రయోగాలు చేసినా.. మొదటిసారిగా మరో గ్రహంపై హెలికాప్టర్ను వినియోగించనుండటం ఇదే తొలిసారి. పర్సవరెన్స్ రోవర్తోపాటు ఇన్జెన్యుటీని పంపినా.. దీనిని పూర్తి ప్రత్యేక ప్రయోగంగానే నిర్వహిస్తున్నారు. అంగారకుడిపై పగటి ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల వరకు పెరిగి.. రాత్రికి మైనస్ 90 డిగ్రీల వరకు పడిపోతుంటాయి. అక్కడి గాలి చాలా పలుచగా.. భూమితో పోలిస్తే ఒకశాతమే ఉంటుంది. ఈ పరిస్థితులను హెలికాప్టర్ తట్టుకోగలదా?, ఎంత కెపాసిటీతో ఎంత దూరం వరకు ఎగరగలదు?, భవిష్యత్తులో ఏమేం మార్పులు చేయాలన్న అంశాలను పరిశీలించనున్నారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో మార్స్పై గాల్లో ఎగురుతూ పరిశీలించే హెలికాప్టర్ను పంపుతామని నాసా ఇప్పటికే ప్రకటించింది. అది 1903వ సంవత్సరం.. డిసెంబర్ 17.. ప్రపంచ చరిత్ర మారిపోవడానికి కారణంగా నిలిచిన రోజు.. మనిషి తొలిసారిగా గాలిలో ఎగిరిన రోజు. రైట్ బ్రదర్స్ తాము తయారు చేసిన విమానంలో తొలిసారిగా ప్రయాణించిన రోజు.. ఎంత దూరం.. ఎంత సమయం? ► మార్స్ నుంచి భూమికి దూరం 27.7 కోట్ల కిలోమీటర్లు ► అక్కడి నుంచి ఇక్కడికి సమాచారం చేరడానికి పట్టే సమయం 16 నిమిషాలు ► మినీ హెలికాప్టర్ నుంచి డేటా పర్సవరెన్స్ రోవర్కు.. అక్కడి నుంచి మార్స్ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్కు.. దాని నుంచి భూమిపై ఉన్న నాసా డీప్ స్పేస్ నెట్వర్క్కు డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయి డేటా ఓపెన్ కావడానికి గంటకుపైగా పడుతుంది. ఇన్జెన్యూటీ ఏంటి.. ఏమున్నాయి? ► ఈ మినీ హెలికాప్టర్ బరువు 1.8 కిలోలు. బరువు తక్కువగా ఉండే అధునాతన మెటీరియల్స్తో తయారు చేశారు. ► రెండు రోటార్లు, వాటికి అమర్చిన రెండు జతల కార్బన్ ఫైబర్ బ్లేడ్లతో గాల్లోకి ఎగురుతుంది. ► హెలికాప్టర్ రోటార్లు నిమిషానికి 2,400 చుట్లు తిరుగుతాయి. ► పరిశీలన, పరిశోధనల కోసం మూడు ప్రత్యేకమైన కెమెరాలు, లేజర్, ఇతర పరికరాలు ఉన్నాయి. ► ఇన్జెన్యుటీ పొద్దంతా చార్జింగ్ చేసుకుంటుంది. రాత్రి అతిశీతల పరిస్థితిని తట్టుకునేందుకు.. లోపలి నుంచి వేడి చేసుకుంటూ ఉంటుంది. సుమారు 118 ఏళ్ల తర్వాత.. 2021, ఏప్రిల్ 11.. మానవ జాతి చరిత్రలో నిలిచిపోనున్న మరో అద్భుతమైన రోజు.. తొలిసారిగా భూమి అవతలమరో గ్రహమైన అంగారకుడిపై మినీ హెలికాప్టర్ గాల్లో ఎగరనున్న రోజు.. ఒక్కో చోట ఒక్కో టైం.. ఆదివారం ఉదయం 12.30 నిమిషాలకు ఇన్జెన్యుటీ మార్స్పై గాల్లోకి ఎగరనుంది. అది భూమ్మీది టైం కాదు అంగారకుడి మీది సమయం. అదే భూమ్మీద ఈస్టర్న్ స్టాండర్డ్ టైం (ఈఎస్టీ – అమెరికాలో వినియోగించే టైం) లెక్కన చూస్తే.. ఆదివారం రాత్రి 10.54 గంటలు అవుతుందని నాసా ప్రకటించింది. మన ఇండియాలో ఇది సోమవారం పొద్దున 8.24 గంటలు అవుతుంది. అయితే మార్స్పై డేటా రికార్డై పూర్తిగా భూమికి చేరే సరికి అమెరికా టైంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలు, ఇండియా టైంలో మధ్యాహ్నం రెండు గంటల సమయం అవుతుందని అంచనా. మొదట 90 సెకన్లే.. ► మార్స్ ఉపరితలంపై పది అడుగుల ఎత్తులో ఇన్జెన్యుటీ ప్రయాణిస్తుంది. ► ఒక్కో ప్రయాణంలో 90 సెకన్ల పాటు తిరుగుతూ ఫొటోలు తీస్తుంది. ► భూమి నుంచి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్పై హెలికాప్టర్ను రియల్ టైంలో కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అందుకే హెలికాప్టర్ దానికి నిర్దేశించిన సూచనల ఆధారంగా సొంతంగానే గాల్లో ఎగురుతూ.. పరిశీలిస్తుంది. పేరు పెట్టింది భారత సంతతి అమ్మాయే.. ‘ఇన్జెన్యూటీ’అంటే చాతుర్యం, బుద్ధి కుశలత అని అర్థం. శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి, తమ మేధస్సును వాడి ఈ మినీ హెలికాప్టర్ను తయారు చేశారన్న ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేశారు. మరి ఈ పేరును సూచించింది ఎవరో తెలుసా? అమెరికాలోని అలబామాలో ఉండే 17 ఏళ్ల భారత సంతతి అమ్మాయి వనీజా రూపానీ. నాసా నిర్వహించిన ‘నేమ్ ద రోవర్’పోటీకి వచ్చిన 28 వేల ఎంట్రీల నుంచి ఈ పేరును ఫైనల్ చేశారు. చదవండి: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’ -
ధోనీ పేరుతో కొత్త రకం చాక్లెట్
ముంబై: మార్కెట్లో ఫేమ్, నేమ్ ఉంటే చాలు బిజినెస్ చేయడానికి చాలా మార్గాలే ఉన్నాయి. దీన్నే ఇప్పడు ‘7 ఇంక్బ్రూస్’ అనే చాక్లెట్ కంపెనీ పాటిస్తోంది. అది ఎలా అంటారా..టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరుతో ఈ కంపెనీ చాక్లెట్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నాయి. ధోనీకి ఉన్న విపరీతమైన క్రేజ్ను ఇలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే తన క్రేజ్ కూడా. ఇక ధోనీ ఆట అంటే ప్రత్యేకంగా గుర్తుకు వచ్చేది అతని వైవిధ్యమైన హెలికాప్టర్ షాట్. దీనికే ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. కనుకే ముంబైకి చెందిన ‘7 ఇంక్బ్రూస్’ అనే పుడ్ అండ్ బెవరేజస్ స్టార్టప్ కంపెనీ, తయారు చేస్తున్న చాక్లెట్లకు ‘కాప్టర్ 7’ అని పేరు పెట్టింది. ఇక వాటి ప్యాకేజింగ్, లేబులింగ్ వంటివి ఈ చాక్లెట్కు అదనపు అందాన్ని జోడించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఇది ధోని విభిన్న జెర్సీలు వాటి రంగులతో వీటి లేబుల్ను తయారు చేస్తున్నారు. వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ భగ్చందని మాట్లాడుతూ ధోనీ లక్షణమైన “అన్డైయింగ్ ‘కాన్ట్ స్టాప్, వోన్ట్ స్టాప్’ స్పిరిట్ ’ క్యాప్షన్ ను బ్రాండ్గా వాడాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇవి ముంబై, గోవా, బెంగుళూరులో అందుబాటులలోకి రాగా, త్వరలో జార్ఘండ్, యూపీ, హర్యానా, పంజాబ్ లోనూ దొరకనున్నట్లు తెలిపారు. ఈ కంపెనీలో ధోనీ కూడా భాగస్వామ్యం కావడం విశేషం. 7 ఇంక్ బ్రూస్ వంటి సంస్థకు వాటాదారునిగా, బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం నాకు నిజంగా సంతోషంగా ఉందంటూ ” పత్రికా ప్రకటనలో ధోని పేర్కొన్నారు. ( చదవండి: IPL2021: చెన్నై జట్టుకు క్షమాపణలు చెప్పిన స్కాట్ స్టైరిస్ ) -
సెల్ఫోన్ తయారీ ఐడియా ఎలా వచ్చిందో తెలుసా?
సైన్స్ ఫిక్షన్లు అంటే చాలా మందికి ఇష్టం.. అవి బుక్స్ అయినా, సినిమాల్లో అయినా.. మనం ఊహించలేని ఏవేవో అద్భుతమైన టెక్నాలజీలు, చిత్రవిచిత్రమైన పరికరాలు, విజువల్ వండర్స్ భలే ఆకట్టుకుంటాయి. మరి ఈ సైన్స్ ఫిక్షన్లు కేవలం వినోదం కోసమేనా? చాలా మందికి అంతే. కానీ.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ సైన్స్ ఫిక్షన్ పుస్తకాల్లో రాసిన, ఆ సినిమాల్లో చూపించిన టెక్నాలజీని స్ఫూర్తిగా తీసుకుని.. గొప్ప ఆవిష్కరణలు చేశారు. అవేవో అల్లాటప్పా వస్తువులు కూడా కాదు.. మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఆవిష్కరణలు అవి. మరి ఈ విశేషాలేమిటో తెలుసుకుందామా? ‘స్టార్ ట్రెక్’ నుంచి సెల్ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఊపుఊపిన ‘స్టార్ ట్రెక్’ సిరీస్ సినిమాల్లో హీరో క్యారెక్టర్.. స్పేస్ కెప్టెన్ కిర్క్ ఓ కమ్యూనికేటర్ డివైజ్ వాడుతుంటాడు. ప్రస్తుతం మనం వాడుతున్న సెల్ఫోన్ తరహాలోని చిన్న డివైజ్తో వైర్లెస్గా ఇతరులతో కమ్యూనికేట్ అవుతుంటాడు. 1966 నాటి స్టార్ ట్రెక్ సినిమాలో ఈ సీన్లు ఎంతో ఆకట్టుకున్నాయి. దాని నుంచి స్ఫూర్తి పొందిన మార్టిన్ కూపర్ అనే మోటరోలా కంపెనీ శాస్త్రవేత్త 1973లో సెల్ఫోన్ తయారు చేశాడు. తొలిసారిగా కాల్ చేసి ఇతరులతో మాట్లాడాడు. నాటి సెల్ఫోన్ ఓ పెద్ద ఇటుక అంత సైజులో ఉండేది. నవల హెలికాప్టర్ను తెచ్చింది ఇగోర్ సికోర్స్కీ.. ఇప్పుడు మనం వాడుతున్న అత్యాధునిక హెలికాప్టర్ ఆవిష్కర్త.1936లో ఆయన తొలి పూర్తిస్థాయి హెలికాప్టర్ను విజయవంతంగా రూపొందించి, నడిపారు. మరి హెలి కాప్టర్ తయారీపై ఆయనకు స్ఫూర్తినిచి్చంది ఏమిటో తెలుసా? అప్పటి ప్రపంచ ప్రఖ్యాత రచయిత జూల్స్ వెర్న్ 1886లో రాసిన ‘క్లిప్పర్ ఆఫ్ క్లౌడ్స్’ అనే నవల. గాల్లో ఎగిరే ఓ పెద్ద వాహనం, దానితో సాగే యుద్ధమే.. ఆ నవల ఇతివృత్తం. ఇగోర్ సికోర్స్కీ తన చిన్నతనంలో ఆ నవలను చదివానని.. అలా గాల్లో ఎగిరే వాహనాన్ని తయారు చేయాలన్న తపన అప్పుడే మొదలైందని చాలాసార్లు చెప్పారు. నీటి అడుగున అడ్వెంచర్.. సబ్మెరైన్ జూల్స్ వెర్న్ 1870లోనే ‘ట్వంటీ థౌజండ్ లీడ్స్ అండర్ ది సీ’ అనే నవల రాశారు. సముద్రం అడుగున సాహస పోరాటాలు చేసే ఓ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ నవల ఇది. ఇందులో ప్రత్యేక వాహనాల్లో నీటి అడుగున మనుషులు ప్రయాణిస్తుంటారు. దీనిని స్ఫూర్తిగా తీసుకునే.. సిమన్ లేక్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి విజయవంతమైన జలాంతర్గామి ‘ఆర్గోనాట్’ను తయారు చేశారు. మరో విశేషం ఏమిటంటే.. అమెరికా నేవీ 1954లో తయారు చేసిన అత్యాధునిక జలాంతర్గామికి ‘నౌటిలస్’ అని పేరుపెట్టింది. ‘నౌటిలస్’ ఏమిటో తెలుసా?.. జూల్స్ వెర్న్ నవలలో నీటి అడుగున ప్రయాణించే వాహనం పేరే అది. గ్రహాంతర వాసుల యుద్ధంతో రాకెట్ ప్రఖ్యాత రచయిత హెచ్జీ వెల్స్ 1897లో రాసిన నవల ‘ది వార్ ఆఫ్ది వరల్డ్స్’. గ్రహాంతర వాసులు రాకెట్లలో భూమ్మీదికి రావడం, ఇక్కడ అల్లకల్లోలం సృష్టించడం, మనవాళ్లు రాకెట్లు తయారు చేసి వారిని తిరిగి పంపేయడం ఇతివృత్తంగా ఈ నవల సంచలనం సృష్టించింది. ఈ నవల పేరుతోనే పలు హాలీవుడ్ సినిమాలూ వచ్చాయి. ఈ నవలను స్ఫూర్తిగా తీసుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ గొడ్డార్డ్ మొట్టమొదటి స్పేస్ రాకెట్ను తయారు చేశారు. 1926లో విజయవంతంగా ప్రయోగించారు కూడా. ఆ నవలతోనే అణు బాంబు హెచ్జీ వెల్స్ 1914లో రాసిన మరో నవల ‘ది వరల్డ్ సెట్ ఫ్రీ’. వెల్స్ ఈ నవ లలో దేశాల మధ్య యుద్ధాలు, అణు బాంబుల గురించి రాశారు. కొన్నిరకాల మూలకాలతో విధ్వంసకరమైన, నియంత్రించలేని శక్తిని సృష్టించవచ్చని కథ లో పేర్కొన్నారు. దీని స్ఫూర్తితోనే హంగేరియన్ సైంటిస్ట్ లియో జిలార్డ్.. 1933లో అణు విచి్ఛత్తి, దాని శక్తిని ఆవిష్కరించాడు. తర్వాత అణు రియాక్టర్లను అభివృద్ధి చేశాడు. అప్పటికే అణుశక్తి గురించి అంచనాలున్నా.. హెచ్జీ వెల్స్ నవల, విస్తృతస్థాయిలో అణుశక్తి ఏమిటనేది ఆ నవలతోనే స్ఫూర్తి పొందానని జిలార్డ్ ప్రకటించారు. ఈ ప్రయోగాలే 1939లో అమెరికా అణు బాంబును తయారు చేయడానికి దారితీశాయి. -
మరీ విడ్డూరం.. శాండ్ విచ్ కోసం హెలికాప్టర్లో!
లండన్: లాక్డౌన్ సమయంలో ఓ వ్యక్తి గోధుమ పిండి కోసం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడం చూసి మనం ఔరా అనుకున్నాం. తనకిష్టమైన మెక్ డొనాల్డ్ బర్గర్ కోసం యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఓ మహిళ ఇటీవల కోవిడ్ ఆంక్షలను లెక్కచేయకుండా 100 మైళ్లకు పైగా ప్రయాణం సాగించింది. ఆ తర్వాత పోలీసు అధికారులు ఆమెకు జరిమానా కూడా విధి౦చారు. ఇదే తరహా ఘటన యునైటెడ్ కింగ్డమ్లో మరొకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి తనకు నచ్చిన శాండ్విచ్ కోసం ఏకంగా 130 కిలోమీటర్లు హెలికాప్టర్లో ప్రయాణించాడు. నోరూరించే శాండ్విచ్ ఆరగించి వార్తల్లో నిలిచాడు. వివరాలు.. చిప్పింగ్ ఫార్మ్ షాప్లో ఓ వ్యక్తి తను ఆర్డర్ చేసిన శాండ్ విచ్ కోసం ఏకంగా హెలికాప్టర్లో ప్రత్యక్షమైయ్యాడు. ఆర్డర్ తీసుకుని అదే చాపర్లో వెనుదిరిగాడు. ఈ వీడియోను షాపు యాజమాన్యం ఇన్ష్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. ఈ వీడియోను నాలుగు లక్షలకుపైగా యూజర్లు వీక్షించగా, వారి నుంచి వందల కొద్దీ కామెంట్లు వస్తున్నాయి. "శాండ్ విచ్ అని కాకుండా.. ది చాపర్ వూపర్ ' అని పేరు మార్చండి" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరొక నెటిజన్ ‘ఆ శాండ్ విచ్ లు అంతగా బాగుంటాయేమో’అని ఇంకొకరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Chipping Farm Shop (@chippingfarmshop) -
గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ
సాక్షి, వేములవాడ: ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్గా ఎదిగిన గంగవ్వ బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వడంతో మరింత ఆదరణ సొంతం చేసుకుంది. బిగ్బాస్లో కుర్రాళ్లకు ఏ మాత్రం తగ్గకుండా ప్రేక్షకులను అలరించింది. తన మార్క్ పల్లెటూరి డైలాగ్ లతో అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు ఓట్లు వేసేందుకు సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ కూడా నడిచింది. అయితే బిగ్బాస్ హౌజ్ వాతావరణం పడకపోవడంతో ఆమె అనారోగ్యం పాలైంది. దాంతో హౌజ్నుంచి మధ్యలోనే బయటకు రాక తప్పలేదు. ఇక బిగ్బాస్ హోస్ట్ నాగార్జున చలువతో సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా.. తన చిరకాల కోరికను తీర్చుకుంది. ఆమె హెలీకాప్టర్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. అంతెత్తు ఆకాశం నుంచి తన ఊరు పొలాలను, ఇళ్లను చూసి ఆమె మురిసిపోయింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో హెలీకాప్టర్ సేవలు మొదలైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాజన్న దర్శనానికి వెళ్లిన గంగవ్వ గాలి మోటార్ ఎక్కి పరవశించిపోయింది. -
వైరల్: హెలికాప్టర్లో ఊరేగుతూ.. ‘బరాత్’
జైపూర్: ‘జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పైనా పెడుతుంది’ అన్నట్లు డబ్బులుంటే చాలు ఎన్ని వేషాలు అయినా వేయవచ్చు. ఇప్పుడు చెప్పిన ఈ సామెత ఎక్కువగా వివాహాలకు వర్తిస్తుంది. ధనవంతుల ఇళ్లలో జరిగే పెళ్లి వేడుక చూస్తే.. ఈ సామెత గుర్తుకు వస్తుంది. వారి ఇంట పెళ్లి ఖర్చుతో కొన్ని కుటుంబాలు ఏళ్ల తరబడి సుఖంగా బతికేయగలవు. వాళ్ల డబ్బులు వాళ్ల ఇష్టం మనకెందుకు గానీ. ఇప్పుడు ఈ ధనవంతుల ముచ్చట ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ‘హెలికాప్టర్ వెడ్డింగ్’ పేరుతో ట్రెండ్ అవుతోంది. ఓ జర్నలిస్ట్ దాన్ని రిపోర్టు చేయడం కొసమెరుపు. ఈట్రేండి వివాహ వేడుక వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.. రాజస్తాన్లోని షేఖావతిలో ఈ నయా వివాహ వేడుక చోటు చేసుకుంది. రతన్గఢ్ తహసీల్లో ఓ చిన్న గ్రామానికి చెందిన కోటీశ్వరుడు తన కుమారుడి కోరిక మేరకు ‘బరాత్’ వేడుక కోసం హెలికాప్టర్ని రంగంలోకి దించాడు. వివాహం పూర్తయిన వెంటనే కొత్త జంట బరాత్ వేడుక కోసం హెలికాప్టర్లో ఎక్కి ఊరేగింది. ఈ తతంగాన్ని రిపోర్ట్ చేయడం కోసం ఓ జర్నలిస్ట్ని కూడా నియమించుకున్నాడు సదరు పెళ్లి కుమారుడి తండ్రి. ఈ రిపోర్టర్ వివాహం జరగుతున్న చోట ఉన్న పరిస్థితులు.. వధువు రియాక్షన్.. వరుడి స్పందన తదితర వివరాల గురించి పూస గుచ్చినట్లు రిపోర్డ్ చేశాడు. ‘‘కుమారుడి సంతోషం కోసం ఓ తండ్రి చేసిన ప్రయత్నం’’ అనే కామెటంరీతో వీడియో ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చదవండి: పైశాచిక వివాహం అంటే ఏంటో తెలుసా? వధువు జంప్..చెల్లిని పెళ్లాడిన వరుడు..ఇక్కడే ట్విస్ట్ -
పాలు అమ్మడానికి హెలికాప్టర్ కొనేశాడు
ముంబై : పాలు అమ్మడానికి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆటోలు లేదా ట్రక్కులు, లేదా మోటార్ సైకిల్ మీదనో వెళ్తుంటారు. కానీ మహారాష్ట్రలోని భివాండికి చెందిన ఓ రైతు మాత్రం ఏకంగా హెలికాప్టర్నే కొనేశాడు. ఇందుకోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు చేశాడు. వివరాల ప్రకారం..జనార్దన్ భోయిర్ అనే రైతు ఈ మధ్యే పాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన బిజినెస్ను విస్తరించుకునేందుకు పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్లోని పలు ప్రాంతాలకు తరచూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆయన వెళ్లే ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ సదుపాయం లేకపోవడంతో రైళ్లు, బస్సుల్లో వెళ్తుండేవాడు. దీంతో సమయం ఎక్కువగా వృధా అవుతుండటంతో స్నేహితుడి సలహా మేరకు ఓ హెలికాప్టర్ను కొనుగోలు చేశాడు. ఇప్పటికే హెలికాప్టర్ను తన గ్రామానికి తీసుకొచ్చి ట్రయల్స్ వేశారట. 2.5 ఎకరాల స్థలంలో హెలికాఫ్టర్ కోసం ప్రొటెక్టివ్ వాల్ను నిర్మించాడు. మార్చి 15న హెలికాప్టర్ను జనార్థన్ ఇంటికి డెలీవరీ చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయం, డైరీ బిజినెస్లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసే జనార్థన్కు దాదాపు రూ 100 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్కు చెందిన ఓ వృద్ధురాలు తన పొలానికి వెళ్లేందుకు హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు లోన్ ఇప్పించాలని రాష్ష్ర్టపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. చదవండి : (వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి') (అరుదైన దృశ్యం: పాముకు నీరు తాగించాడు..) -
వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి'
భోపాల్ : హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించాలని ఓ మహిళా రైతు రాష్ట్రపతికి లేఖ రాసింది. అంతేకాకుండా ఫ్లయింగ్ పర్మిషన్ కూడా ఇప్పించాని విఙ్ఙప్తి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి లేఖ నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం..మధ్యప్రదేశ్లోని మాండ్సౌర్ జిల్లాకు చెందిన బసంతి బాయ్ అనే మహిళ చిన్న పూరి గుడిసెలో నివసించేది. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే తనకున్న 2 బిగాల పొలంలోకి వెళ్లాలంటే పరమానంద్ అనే రైతుకి చెందిన పొలం దాటి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆయన తన ఇద్దరు కుమారులు సైతం బసంతితో వాగ్వాదానికి దిగేవారు. కొన్నాళ్ల తర్వాత ఆ దారిని మూసి వేయించారు. ఈ విషయంపై పై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది. కాలినడకన వెళ్లేందుకు వీలు లేకపోవడంతో హెలికాప్టర్ కొనడానికి లోన్ ఇప్పించాలని లేఖలో కోరడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. దీంతో స్పందించిన ఈ ప్రాంతం ఎమ్మెల్యే ఈ సమస్యను తానే దగ్గరుండి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. చదవండి : (ఆమె కోసం ఇల్లు అమ్మేసి... ఆటోలోనే తిండి, నిద్ర) (మిస్ ఇండియా రన్నరప్గా ఆటో డ్రైవర్ కూతురు) Alleging denial of passage into her agricultural plot, woman in MP's Mandsaur district writes to President of India for loan and license to fly by helicopter into her plot. On spot official probe, however, finds clear passage to woman's plot. @NewIndianXpress@TheMornStandard pic.twitter.com/zEiWdN0MiM — Anuraag Singh (@anuraag_niebpl) February 12, 2021 -
విషాదం: కుప్పకూలిన హెలికాప్టర్
శ్రీనగర్: దేశమంతా 72వ గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతున్న తరుణంలో జమ్మూ కశ్మీర్లో జరిగిన దుర్ఘటన విషాదాన్ని నింపింది. కతువా జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆర్మీ పైలట్ దుర్మరణం చెందారు. సోమవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ పంజాబ్లోని పఠాన్కోట్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండ్పూర్ వద్ద హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయినట్లు సీనియర్ పోలీసు అధికారి శైలేంద్ర తెలిపారు. సంఘటనా స్థలంలోనే ఒక పైలట్ మృతిచెందగా, గాయపడిన మరో పైలట్ను మిలటరీ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. చదవండి: చైనాతో మళ్లీ ఘర్షణ; ఇరు దేశాల జవాన్ల బాహాబాహీ -
రిసెప్షన్కు హెలికాప్టర్లో వచ్చాడు!
సాక్షి, నాగాయలంక (అవనిగడ్డ): కృష్ణా జిల్లాలోని మారుమూల పర్రచివర గ్రామంలో మంగళవారం వివాహ రిసెప్షన్కు గుజరాత్కి చెందిన ఓ పారిశ్రామికవేత్త ప్రైవేట్ హెలికాప్టర్లో వచ్చారు. గుజరాత్కు చెందిన కేపీ గ్రూప్ సీఎండీ ఫరూక్ జి.పటేల్కు పర్రచివర గ్రామస్తుడైన బొండాడ రాఘవేంద్రరావు పార్ట్నర్గా ఉన్నారు. తన మేనల్లుడు సందీప్–శరణ్యల వివాహ రిసెప్షన్కు ఫరూక్ను బొండాడ ఆహ్వానించారు. ఫరూక్ తన కుటుంబ సభ్యులతో గుజరాత్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పర్రచివర గ్రామానికి చేరుకుని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
సోదరిపై ప్రేమ: అతడు చేసిన పని హాట్టాపిక్..
సాక్షి, ముంబై: సాధారణంగా తన సోదరిని అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకురావడానికి బైక్ లేదా ఆటోలో వెళతారు. కొంత ఆర్థికంగా ఉన్నవారైతే సొంత కారులో లేదా అద్దె వాహనంలో వెళతారు. కానీ, జల్గావ్ జిల్లాలో తన సోదరిని అత్తారింటి నుంచి పుట్టింటికి ఏకంగా హెలికాప్టర్లో తీసుకొచ్చిన సంఘటన సర్వత్రా చర్చనీయంశమైంది. తన సోదరికి వినూత్నంగా స్వాగతం పలకాలనే ఉద్ధేశంతో విరాజ్ కావడియా అనే వ్యక్తి ఈ ఏర్పాట్లు చేశాడు. అకస్మాత్తుగా హెలికాప్టర్ గ్రామం బయట ల్యాండ్ కావడంతో కొద్దిసేపు గ్రామస్తులకు అర్థం కాలేదు. తరువాత ఇటీవల పెళ్లయిన తన సోదరిని పుట్టింటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్లో వచ్చినట్లు తెలియగానే ఆశ్చర్యపోయారు. సోదరికి సర్ప్రైజ్ ఇవ్వాలని. జల్గావ్ జిల్లాకు చెందిన శివాని కావడియా పెళ్లి పర్లీలోని వైజ్యనాథ్ ప్రాంతంలో ఉంటున్న జైన్ కుటుంబానికి చెందిన డాక్టర్ కుణాల్ జైన్తో ఇటీవల పెళ్లైంది. కుటుంబ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన కొద్ది రోజులకు పెళ్లి కూతురును పుట్టింటికి తీసుకురావాలి. దీంతో తన సోదరిని తానే తీసుకురావాలని సోదరుడు విరాజ్ కావడియా భావించాడు. కానీ, కారులో లేదా బైక్పై తీసుకురావడం సర్వసాధారణం. దీంతో సర్ఫ్రైజ్ చేయాలని కొత్త పద్దతిని ఆలోచించాడు. హెలికాప్టర్ను అద్దెకు తీసుకుని సోదరి గ్రామానికి వెళ్లాడు. ఊరు బయటున్న బారిస్టర్ నికం మైదానంలో ల్యాండింగ్ చేశాడు. ఈ వీడియో క్లిప్పింగు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చదవండి: (గర్భగుడిలో గుప్తనిధి.. రంగంలోకి అధికారులు..) -
హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం
-
నెల్లూరులో హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం
సాక్షి, నెల్లూరు : జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్ కలకలం రేపింది. ఆనంతసాగరం మండలం రేవూరులో అనుమతి లేకుండా హెలికాప్టర్ లాండింగ్ పై యావత్ యంత్రాంగం ఆశ్చర్య పోయింది. ఎక్కడైనా హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే ఏవియేషన్ అనుమతి తో పాటు స్థానిక పరిపాలన అధికారులు అనుమతి తప్పనిసరి.. కానీ, నెల్లూరు జిల్లా రేవూరు లో అవేవి లేకుండా నే హెలికాప్టర్ ల్యాండ్ అయింది. కారు లో వచ్చినట్టు ఓ బడా బాబు హెలికాప్టర్ వేసుకొని పెళ్లికి వచ్చేసాడు. (చదవండి : 70 ఏళ్ల వయసులో యూట్యూబ్ సెన్సేషన్) హైదరాబాద్ లో ఉంటున్న సినీ నిర్మాత, మాజీ ఏవియేషన్ అధికారి రామకోటేశ్వర రావు, రేవూరులో జనార్దన్ రెడ్డి అనే ఎన్నారై ఇంట్లో పెళ్లికి హెలికాప్టర్లో వచ్చాడు. ఏవిధమైన అనుమతి లేకుండా, స్కూల్ హెడ్ మాస్టర్ ఎన్ఓసి తీసుకుని ల్యాండ్ కావడంపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ నెల 27న గ్రామానికి చెందిన ఎన్నారై బోవెళ్ల జనార్దన్ రెడ్డి ఆహ్వానం మేరకే హెలికాప్టర్ లో కుటుంబ సమేతంగా రామకోటేశ్వర రావు వచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక జిల్లా పరిషత్ స్కూల్ లో ల్యాండ్ అయిన హెలికాప్టర్ అందులో ఉన్న వ్యక్తులు ను దింపి వెళ్ళిపోయింది. అయితే అందులో ఓ మహిళ కు ఆరోగ్యం బాగలేకపోవడం వలనే ఇలా హెలికాప్టర్ లో వచ్చినట్టు తెలుస్తోంది. ఏదీ ఏమైనా హెలికాప్టర్ ఘటనని అధికారులు సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆవును హెలికాప్టర్లో ఇంటికి చేర్చిన రైతు
స్విట్జర్లాండ్ : మన దేశంలో ఆవును గోమాతగా పూజిస్తూ కుటుంబంలోని వ్యక్తిలా చూస్తాం. ఆవుకు ఏమైనా అయితే విలవిల్లాడిపోతాం. తాజాగా ఇలాంటి ఘటనే స్విట్జర్లాండ్లోనూ చోటుచేసుకుంది. ఆవుకు గాయం కావడంతో ఆ రైతు తట్టుకోలేకపోయాడు. దీంతో విమానం తీసుకొచ్చి మరీ ఆవును ఇంటికి తరలించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అయ్యింది. వివరాల ప్రకారం..స్విట్జర్లాండ్ స్విస్ ఆల్ప్స్లోని ఓ పర్వతం వద్ద మేతకు వెళ్లిన ఆవు గాయపడింది. నొప్పితో కుంటుతూ నడుస్తున్న దృశ్యం రైతు కంట పడింది. దీంతో ఇంటిదాకా నడిస్తే మళ్లీ ఆవుకు నొప్పి ఎక్కువవుతుంది అనుకున్నాడు. వెంటనే హెలికాప్టర్ సాయం కోరగా రెస్క్యూ టీమ్ వచ్చి ఆవుకి తాళ్లు కట్టి క్షేమంగా ఇంటికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో తీసి ఓ న్యూస్ ఛానల్కి ట్యాగ్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. లక్షలమంది ఈ వీడియోను వీక్షించి రీట్వీట్లు చేస్తున్నారు. ఆవు మీద మీరు కురిపించిన ప్రేమకు ముగ్ధులమయ్యాం అంటూ పలువురు నెటిజన్లు రైతును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. (వైరల్ : అందుకే అవంటే మాకు ప్రాణం! ) WHEN COWS FLY: A Swiss farmer decided to use a helicopter to airlift one of his beloved bovines down the mountain. The farmer says the cow had been walking with a limp and he didn't want to risk further injury to the animal. https://t.co/HSjcKh5oy6 pic.twitter.com/5qZgRdcWWs — ABC News (@ABC) August 19, 2020 -
సానుకూల దృక్పథమే సరైన మార్గం
ఇటీవలే నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘గుంజన్ సక్సేనా’ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆ సినిమాకు ప్రేరణగా నిలిచి నిజజీవితంలోనూ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న భారతీయ వాయుసేన రిటైర్డ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా ఆ సినిమాలో తన పాత్ర చిత్రీకరణ గురించి వివరణ ఇచ్చారు. సంస్థగా వాయుసేనలో మహిళాధికారులుగా తామెన్నడూ వివక్షను ఎదుర్కోలేదని, కొంతమంది అధికారుల చిన్నచూపును చవిచూశామన్నారు. వారితో పోటీపడుతూనే వాయుసేనలో సమున్నత స్థానానికి చేరగలిగామని, మహిళలుగా అనేక అవకాశాలు పొందామని చెప్పారు. తన జీవితాన్ని, తన ప్రయాణాన్ని, తన కలలను, తాను సాధించిన చిన్న విజయాలను చిత్రిక పట్టడమే సినిమా ఉద్దేశమని చెప్పారు. శక్తివంతమైన పుకార్లు, పచ్చి అబద్ధాలు రాజ్యమేలుతూ మీ ఉనికిని సందేహాల ధూళిలో కనుమరుగు చేసే సమయాలు కూడా ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఇలాంటి తుపానులో నేను చిక్కుకుపోయాను. అది సోషల్ మీడియా కావచ్చు, ముద్రణా మాధ్యమం కావచ్చు.. కొంతమంది వ్యక్తులు నా ఉనికి, మనుగడకు సంబంధించిన మౌలిక విలువలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవం. ఈ దుమారాన్ని రూపుమాపవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. పాఠకులకు ఒక విషయం చెప్పనివ్వండి. గుంజన్ సక్సేనా చిత్ర నిర్మాతలు నా జీవితం ఆధారంగా తీసిన సినిమాలో సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకున్నప్పటికీ వారు తప్పించనిది, అతిశయోక్తులు చెప్పనిది అయిన ఒక అంశం ఉంది. అదేమిటంటే నేనే.. నిజమైన గుంజన్ సక్సేనాని. సినిమాలో చిత్రించినదాని కంటే నేను మరింత ఉక్కుసంకల్పంతో, దృఢ చిత్తంతో ఉంటూ వచ్చానని చెప్పగలను. వాయుసేనలో నా ఎనిమిదేళ్ల స్వల్ప కెరీర్లో నేను నా సీనియర్లు, జూనియర్లు, కొలీగ్స్ నుంచి పొందగలిగిన అమూల్యమైన అంశం ఏదంటే గౌరవం, ఆరాధన మాత్రమే. ఎంతో కష్టపడి సాధించిన ఈ ప్రతిష్టను కొద్దిమంది వ్యక్తుల బృందం అసందర్భ వ్యాఖ్యలతో మలినపర్చడం చూస్తూంటే నా హృదయం బద్దలవుతోంది. భారతీయ వాయుసేనలో నా తొలి సంవత్సరాల్లో ఎన్నో అంశాల్లో నేను ప్రథమురాలిగా ఉండగలిగి నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని అనే చెప్పాలి. వాటిలో కొన్నింటిని పేర్కొనాలంటే.. నా ప్రాథమిక శిక్షణలో, హెలికాప్టర్ శిక్షణలో కూడా నేనే ప్ర«థమురాలిగా ఉన్నాను. యుద్ధరంగంలో హెలికాప్టర్ నడిపిన తొలి మహిళను నేనే (లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో ఇది నమోదైంది కూడా). మహిళా హెలికాప్టర్ పైలట్లలో మొదటి బిజి (ప్రథమ శ్రేణి ఫ్లైయింగ్ కేటగిరీ) నాదే. అడవుల్లో, మంచులో ఎలా బతకాలో నేర్పే కోర్సు చేసిన మొట్టమొదటి మహిళా అధికారిని కూడా నేనే. ఇంకా మరెన్నో చిన్న విజయాలు ఉన్నాయి కానీ నా ఈ కథనానికి సంబంధించి వాటికేమంత ప్రాధాన్యత లేదు. ప్రశాంతంగానూ, రిజర్వుడ్గానూ ఉండే నా లాంటి వ్యక్తి ఇలా నా సొంత డబ్బా కొట్టకుండా ఉండటానికి కారణం ఉంది. ఈ వాస్తవాలను తారుమారు చేయడానికి ప్రయత్నించే ఎవరినైనా బహిరంగంగా సవాల్ చేయడమే నా ఉద్దేశం. నేను సాధించిన ఈ ప్రథమ రికార్డులన్నీ ఐఏఎఫ్ చరిత్రలో నమోదై ఉన్నాయి కూడా. అవన్నీ నా విశ్వసనీయతకు, నా విజయాలకు సంబంధించినవి. స్వార్థ ప్రయోజనాలు కలిగిన ఏ ఒక్కరినీ నా ప్రతిష్టపై వేలెత్తి చూపడాన్ని నేను అంగీకరించను. నిపుణురాలిగా చెప్పుకునే ఒకరయితే.. నేను కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి మహిళాధికారిని కాదని కూడా చెప్పేశారు. ఈ అసంబద్ధ ప్రచారాన్ని చదువుతున్న, పచ్చి అబద్ధాలను చూస్తున్న వారందరికీ నేను వినమ్రంగా ఒక విషయం చెబుతున్నాను. రహస్య ఎజెండాలో భాగంగా తాము ఐఏఎఫ్ ప్రతిష్టను కాపాడుతున్నట్లు చెప్పుకుంటున్న వారు కార్గిల్ యుద్ధం తర్వాత 1999లో వాయుసేన దృక్పథానికి చెందిన సాధికారతనే ప్రశ్నిస్తున్నారు. నేను స్వభావరీత్యా రిజర్వుడ్గా ఉంటాను. కానీ భారతీయ వాయుసేన నా విజయాలను మొత్తంగా మీడియా ముందు విప్పి చెప్పేసింది. ఇప్పుడే కాదు ఎప్పుడూ నేను మీడియా ముందుకు రావడాన్ని అసౌకర్యంగానే భావిస్తాను. కానీ కార్గిల్ యుద్ధ కాలంలో చక్కటి విజయాలు సాధించిన మహిళాధికారిగా నాకు సంబంధించిన వాస్తవాన్ని ఎవరైనా ఎలా తోసిపుచ్చగలరు? నేను కానీ, చిత్ర నిర్మాతలు కానీ నేను శౌర్యచక్ర అవార్డు గ్రహీతనని ఎన్నడూ చెప్పుకోలేదు. కార్గిల్ యుద్ధం తర్వాత ఉత్తరప్రదేశ్కి చెందిన ఒక పౌర సంస్థ నాకు శౌర్య వీర్ అనే అవార్డు బహూకరించింది. కానీ ఇంటర్నెట్ వార్తల మీడియాకు చెందిన కొందరు బహుశా వీర్ పదాన్ని చక్రగా మార్చేసి ఉండవచ్చు. సినిమా ప్రమోషన్లలో భాగంగా నేను మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ ఈ విషయాన్ని నేను స్పష్టం చేస్తూ వచ్చాను. నేను పొందని శౌర్య చక్ర అవార్డు విషయంలో నన్ను నిందించడం ఎంతవరకు సబబు? ‘గుంజన్ సక్సేనా’ సినిమా విడుదలయ్యాక సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న మరొక అంశం ఏదంటే లింగ వివక్ష. నెట్ఫ్లిక్స్లో సినిమా విడుదలయింది మొదలుకుని భారత వాయుసేన ప్రతిష్టపై దాడిగా అభివర్ణిస్తూ కవచధారులైన అనేకమంది వీరులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. వీళ్లందరికీ నేను చెప్పేదొకటే. ఐఏఎఫ్ అనేది అతి పెద్ద సంస్థ. ఏ వివాదం కూడా దానికి కాసింత మరకలు కూడా పడనీయనంత ప్రతిష్టాత్మక సంస్థ. లింగపరంగా కానీ, మరే రకంగానైనా సరే.. ఒక సంస్థగా ఐఏఎఫ్ సంస్థాగత వివక్షకు చోటివ్వదు. నేను వాయుసేనలో చేరినప్పుడు సంస్ధాగతంగా దాంట్లో ఎలాంటి వివక్షా ఉండేది కాదు. కానీ.. వ్యక్తిగతంగా చూస్తే ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది వ్యక్తులు ఇతరుల కంటే బాగా మార్పును స్వీకరించగలరు. వివక్ష అనేది సంస్థాగతం కాదు కాబట్టి మహిళాధికారుల అనుభవాలు కూడా విభిన్నంగానే ఉంటాయి. దీన్ని నిరాకరించడం అంటే అది భూస్వామ్య మనస్తత్వాన్నే చూపుతుంది. అంతే కాకుండా మహిళాధికారులు ఎదుర్కొన్న సమస్యలను పలుచన చేస్తుంది. వాయుసేనలోని కొందరు వ్యక్తుల్లోని దురభిప్రాయాలు, వివక్షకు చెందిన సమస్యలతో ఒక స్త్రీగా నేను కూడా పోరాడాను. కానీ అది సంస్థాగతంగా ఎన్నడూ ఉండేది కాదు కాబట్టే నేను అన్ని సమయాల్లోనూ సమాన అవకాశాలనే పొందాను. వాయుసేనలో చేరిన నా ప్రారంభ సంవత్సరాల్లో మహిళలకు ప్రత్యేక టాయ్లెట్, మహిళలు దుస్తులు మార్చుకునే చోటు విషయంలో మౌలిక వసతులకు సంబంధించి ఎలాంటి ఆరోపణనూ నేను చేయలేదు. ఇక నెలరోజులపాటు సర్వైవల్ కోర్సును పూర్తి చేసిన సమయంలో నేను ఒకే టెంటులో పురుష అధికారులతో కలిసి ఉండేదాన్ని. అనేక సందర్భాల్లో అడవుల్లో ఆరుబయట తెల్లారకముందే నేను కాలకృత్యాలు తీర్చుకునేదాన్ని. ఈ విషయంలో నేను ఎలాంటి మినహా యింపులు అడగలేదు. వాయుసేనలోని పురుషుల్లాగే నేను సర్వైవల్ కోర్సును ముగించాలని కోరుకున్నాను. ఇలాంటి స్వల్పాతిస్వల్పమైన అంశాలకు నా ఐఏఎఫ్ కెరీర్లో ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదనే చెబుతున్నాను. సినిమాలో కూడా నా పాత్ర టాయ్లెట్లు లేకపోవడంపై ఆరోపించలేదు కదా. అది ముఖ్యమే కావచ్చు కానీ ఒక విషయానికి మరీ ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం. సినిమాలో వాస్తవ విరుద్ధ అంశాల గురించి ఒక సీనియర్ జర్నలిస్టు ఎత్తి చూపినట్లు నేను విన్నాను. అవును. వాటిని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో ఘటనల పర్యవసానాలు నాకు తెలుసు. నేను వాటిని ఎన్నడూ తోసిపుచ్చలేదు. లేదా వాస్తవమని అంగీకరించలేదు. ఒకటి మాత్రం నిజం. సినిమా ఉద్దేశం తమ స్వప్నాలను ఆశాభావంతో, సానుకూల దృష్టితో ఎదుర్కోవాలని వ్యక్తులను ప్రభావితం చేయడమే. నేను కూడా అలాగే ఎదుర్కొన్నాను. మొత్తం సినిమా కథ అంతా నా జీవిత గమనం ఎలా సాగింది, నా స్వప్నాలు ఎలా సాకారమయ్యాయి అని చూపించడమే. కార్గిల్ యుద్ధంపై డాక్యుమెంటరీ తీయాలని ఈ సినిమా ఉద్దేశం కాదని నా భావం. నా జీవి తాన్ని, నా ప్రయాణాన్ని, నా కలలను, నేను సాధించిన చిన్న విజయాలను చిత్రిక పట్టడమే సినిమా ఉద్దేశం. నేను కానీ, చిత్ర దర్శకుడు శరణ్ శర్మ కానీ భారత వాయుసేనను అవమానించాలని అనుకోలేదు. నిజానికి వాయుసేన యూనిఫాం, నేను మెలిగిన తీరు, సైనిక కార్యాలయాల స్వరూపం, ఫ్లైయింగ్కు చెందిన సాంకేతిక పదాల సాధికారతపై నన్ను వాళ్లు ఫోన్ ద్వారా కానీ, నేరుగా కానీ సంప్రదించేవాళ్లు. చివరగా, మరొక విషయం చెప్పదలిచాను. ఈ సెలబ్రిటీ స్థాయి అనేది నా జీవితంలో అడుగుపెట్టిన కొత్త వైరస్ లాంటింది. నా మౌలిక విలువలను ఇది ఎన్నటికీ ముట్టలేదు. చెరపలేదు. ఎందుకంటే నా హృదయంలోనూ, మనస్సులోనూ ఒక విశ్వాసం ఉండేది. నేను పుట్టిన రోజు మొదలుకుని నా జీవితంలోని ప్రతి క్షణంలోనూ సైనిక దుస్తులు ధరించి ఉన్న వారి మధ్యే జీవించాను. నా సోదరుడు, నేను ఇద్దరం సాయుధ బలగాల్లోనే మా కెరీర్లను నిర్మించుకున్నాం. నా యూని ఫారం విడిచిపెట్టిన తర్వాత కూడా, ఒక అధికారి భార్యగా నేను వాయుసేన ఆవరణలోనే జీవించడం కొనసాగించాను. సాయుధ బలగాలకు సంబంధించి నా జ్ఞానం లేక జ్ఞాన లేమికి సంబంధించి ఎవరి ప్రబోధాలూ నాకు అవసరం లేదు. వ్యక్తిగతంగా కానీ, వృత్తి రంగంలో కానీ నేను సాధించిన అతి కొద్ది విజయాలు కూడా వాయుసేన నుంచే పొందాను. మిగిలిన విషయాలు అంటారా.. వాటిని మీ తీర్పుకు, మీ విజ్ఞతకే వదిలేస్తాను. (ఎన్డీటీవీ సౌజన్యంతో...) వ్యాసకర్త రిటైర్డ్ ఫ్లైట్ లెఫ్టినెంట్, హెలికాప్టర్ పైలట్, భారతీయ వాయుసేన గుంజన్ సక్సేనా -
ఆర్మీ కమాండోల ఆపరేషన్ సక్సెస్..
టేకుమట్ల : చుట్టూ వరదనీరు.. వాగు మధ్యలో ఎల్లమ్మ గుడి.. ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. గుడిలో పదిమంది రైతులు.. దాటుదామని వాగులోకి దిగితే కొట్టుకుపోవాల్సిందే. ప్రాణాలు అరచేతబట్టుకొని ఐదున్నర గం టలుగా బిక్కుబిక్కుమంటున్నారు.. అంతలోనేపైన గాలి మోటారు చప్పుడు వారి చెవిన పడింది. అంతే.. ప్రాణాలు లేచి వచ్చాయి. హెలికాప్టర్లో వచ్చిన ఆర్మీ కమెండోలు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో రైతుల కథ సుఖాంతమైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఐదు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో.. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. కుందనపల్లిలోని చలివాగు ఒడ్డు వెంట ఉన్న పొలాల్లో వ్యవసాయ మోటార్లు వరదలో కొట్టుకుపోకుండా తీసుకురావాలనుకున్నారు రైతులు. మోటార్లను తెచ్చేందుకు రెండు ట్రాక్టర్లలో పలువురు రైతులు శనివారం ఉదయం పది గంటలకు బయలుదేరారు. ఈ క్రమంలో పొలాల్లో ట్రాక్టర్లు దిగబాటుకు గురయ్యాయి. ట్రాక్టర్లను బయటికి తీసేందుకు పదిమంది రైతులు వెళ్లారు. అంతే.. ఒక్కసారిగా చలివాగు ప్రవాహం తీవ్ర రూపం దాల్చింది. దీంతో రైతులకు ఇరువైపులా వరదనీరు చేరడంతో ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. వాగులో రైతులు చిక్కుకుపోవడంతో స్థానికులు కూడా రక్షించే అవకాశాలు లేకపోయాయి. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి స్థానికులు విషయాన్ని తీసుకెళ్లారు. రంగంలోకి రెండు ఆర్మీ హెలికాప్టర్లు వాగులో రైతులు చిక్కుకున్న విషయాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్రావులకు వివరించారు. సీఎం జోక్యంతో హకీంపేట నుండి రెండు ఆర్మీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఆర్మీ కమాండోలు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మధ్యాహ్నం 3:30లకు రైతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, వాగు వద్ద సహాయక చర్యలను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ అబ్దుల్ అజీం, ఎస్పీ సంగ్రామసింగ్ పాటిల్ పర్యవేక్షించారు. చివరకు రైతులు సురక్షితంగా బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమను రక్షించినందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ రుణపడి ఉంటాం వరదలో చిక్కుకున్న మాకు సాయం అందించి రక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మేమూ, మా కుటుంబాలు ఎంతో రుణపడి ఉంటాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటికి తిరిగి వస్తామో, రామో అని భయపడ్డాం. ఈ పరిస్థితుల్లో మాకు ఎంతో సహకరించి 10 మంది కుటుంబాలకు దిక్కుగా నిలిచారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎస్పీ, ఇతర అధికారులకు కృతజ్ఞతలు. – మాడుగుల ప్రకాశ్, రైతు, కుందనపల్లి -
సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్–డ్రోన్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో భారత్తో పదేపదే కయ్యానికి కాలు దువ్వుతున్న డ్రాగన్ దేశం మరో అడుగు ముందుకువేయనుంది. పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు వీలుగా ఇటీవలే అభివృద్ధి చేసిన అత్యాధునిక హెలికాప్టర్–డ్రోన్ను త్వరలోనే టిబెట్లో భారత్ సరిహద్దుల్లో మోహరించనుందని చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ‘చైనా తయారీ మొట్టమొదటి ఈ హెలికాప్టర్–డ్రోన్ను 5,000 మీటర్ల నుంచి 6,700 మీటర్ల ఎత్తైన ప్రదేశాల నుంచి ఆపరేట్ చేయవవచ్చు. 500 కిలోల వరకు బరువు మోస్తూ గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఐదు గంటలపాటు ఏకబిగిన ఎగరగలదు’అని వెల్లడించింది. ప్రభుత్వ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా(ఎవిక్) గత వారమే దీనిని విజయవంతంగా ప్రయోగించి చూసిందని తెలిపింది. చైనా–భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో ఇది అందుబాటులోకి రానుందని పేర్కొంది. ‘శత్రు దేశ సైనిక కార్యకలాపాలపై నిఘా, శత్రుదేశాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు అంతరాయం కలిగించడంతోపాటు కాల్పులు జరపగల గలదు. నిట్టనిలువుగా, సమాంతరంగా ప్రయాణించగల ఈ ఆధునిక హెలికాప్టర్ను ఆపరేట్ చేయడమూ తేలికే. పర్వతమయమైన టిబెట్ ప్రాంతంలోని సరిహద్దుల పరిరక్షణలో చైనాకు అదనపు బలం కానుంది’అని పరిశీలకులు అంటున్నారు. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తూర్పు లద్దాఖ్లోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలకు రెండు దేశాలు సైనిక బలగాలను పెద్ద ఎత్తున తరలిస్తున్నాయి. గాల్వన్ లోయ, ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతాలకు మరిన్ని బలగాలను తరలించామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రాంతాల్లోనే చైనా కూడా తాత్కాలిక నిర్మాణం చేపట్టడంతో పాటు, 2,500 మంది సైనికులను సిద్ధంగా ఉంచింది. అయితే, అక్కడ భారత బలగాల బలమే అధికంగా ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని సైనికాధికారి ఒకరు వెల్లడించారు. గాల్వన్లోయలోని దార్బక్–షాయక్– దౌలత్ బేగ్ ఓల్డీ రోడ్ వెంబడి ఉన్న కేఎం 120 సహా పలు వ్యూహాత్మక ప్రదేశాల్లో చైనా ఆర్మీ మోహరించడం ఆందోళనకరమన్నారు. -
తొలి అంతరిక్ష హెలికాప్టర్ ‘ఇంజెన్యూటీ’
వాషింగ్టన్: అరుణగ్రహంపైకి తాము పంపించే తొలి హెలికాప్టర్కు భారత సంతతికి చెందిన పదిహేడేళ్ళ బాలిక వనీజా రూపానీ సూచించిన పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ సెలక్ట్చేసింది. ఈ హెలికాప్టర్ అంతరిక్ష నౌక తో పాటు ప్రయాణం చేస్తుంది అని నాసా ట్వీట్ చేసింది. అంతరిక్ష నౌక పర్సెవరెన్స్, ఇంజెన్యూటీలను జూలైలో నాసా అంతరిక్షంలోకి పంపనుంది. చిన్నప్పటినుంచి రూపానీకి అంతరిక్ష శాస్త్రం పై ప్రత్యేక ఆసక్తి ఉండేదని ఆమె తల్లి నౌషీన్ రూపానీ చెప్పారు. -
'అనంత' పొలాల్లో చాపర్
కళ్యాణదుర్గం రూరల్: సాంకేతిక సమస్యతో ఓ చాపర్ (హెలికాప్టర్) అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని ఎరడికెర పొలాల్లో అత్యవసరంగా దిగింది. వివరాలివీ.. కర్ణాటకలోని బళ్లారిలో జిందాల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ పరంజిత్, పైలట్ పాఠక్లు సోమవారం ఉదయం బళ్లారి నుంచి మైసూరుకు చాపర్లో బయలుదేరారు. ఈ క్రమంలో.. ఇంజిన్లో ఇంధనం లీకవడాన్ని గుర్తించిన పైలట్ బ్రహ్మసముద్రం సమీపంలోని ఎరడికెర పొలాల్లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివశంకర్ నాయక్, ఎస్ఐ నాగేంద్రబాబు, తహసీల్దార్ రమేష్, ఇతర అధికారులు వచ్చి వివరాలను సేకరించారు. బళ్లారి నుంచి సాంకేతిక నిపుణులు వచ్చి మరమ్మతులు చేసిన అనంతరం చాపర్ తిరిగి వెళ్తుందని చెప్పారు. చాపర్ దిగిన ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
సీఎం హెలికాప్టర్ ఘటనలో అధికారులకు నోటీసులు
సాక్షి, కర్నూలు (సెంట్రల్): సీఎం హెలికాప్టర్ కో ఆర్డినేట్స్ తప్పుగా నమోదు చేసిన ఘటనపై అధికారులకు గురువారం నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వే కోసం ఈ నెల 21వ తేదీన నంద్యాల వచ్చారు. అయితే ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ ఇచ్చిన ఇచ్చిన కోఆర్డినేట్స్(అక్షాంశాలు, రేఖాంశాలు) వివవరాలు తప్పుగా నమోదు చేయడంతో సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం దాదాపు 10 నిమిషాలపాటు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎంఓ కార్యాలయం కూడా ఆరా తీసింది. జిల్లా కలెక్టర్తో మాట్లాడి విచారించాలని ఆదేశించింది. అయితే మొదట జాయింట్ కలెక్టర్ రవిపట్టన్ శెట్టిని విచారణాధికారిగా వేశారు. ఆయన 22వ తేదీ హెలికాప్టర్ కోఆర్డినేట్స్ వివరాలను పరిశీలించారు. అయితే ఆ మరుసటి రోజే తిరిగి జిల్లా కలెక్టర్ విచారణాధికారిగా డీఆర్వో వెంకటేశంను నియమించారు. అయితే ఆయన తనకున్న పని ఒత్తిడితో నాలుగు రోజుల తరువాత నివేదికను రూపొందించి..సర్వే శాఖ ఏడీ హరికృష్ణ, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, శిరివెళ్ల తహసీల్దార్ బి.నాగరాజు, నంద్యాల తహసీల్దార్ రమేష్బాబు, ఉయ్యాలవాడ తహసీల్దార్ బీవీ నాగేశ్వరరెడ్డి, గోస్పాడు ఎంపీడీఓ సుగుణశ్రీ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఏ.వేణు తోపాటు మరొకరికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరు కావాలని విచారణాధికారి, డీఆర్వో వెంకటేశం ఆదేశించారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు డీఆర్వో కార్యాలయంలో సంబంధిత డ్యాకుమెంట్లు, ఆధారాలతో తప్పక హాజరు కావాలని ఆయన చెప్పారు. గంటల్లో ఇవ్వాల్సిన నివేదిక..రోజుల్లోకీ... ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనకు వస్తే పరిపాలన అనుమతులకు సంబంధించి జిల్లా కలెక్టర్, భద్రత పరమైన అంశాలకు సంబంధించి ఎస్పీ అనుమతులు ఇవ్వాలి. ఈ రెండు అనుమతులు ఒకే అయినా తరువాతే సీఎం పర్యటన ఖరారు అవుతుంది. అందులో భాగంగా ఈ నెల 21వ తేదీన వరద ప్రభావిత ప్రాంతాల్లోసీఎం ఏరియల్ సర్వేకు రెండు అనుమతులు ఇచ్చారు. అయితే పాలన పరమైన అనుమతుల్లో భాగంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కో ఆర్డినేట్స్ను మామూలుగా అయితే సర్వేయర్ శాఖ ఏడీ, డీఐతో కలసి లెక్కించాలి. దానిని జిల్లా కలెక్టర్ సీఎంఓకు నివేదించాలి. అయితే ఏడీ, డీఐ కలసి కోఆర్డినేట్స్ను లెక్కించాల్సి ఉండగా...డీఐ, స్థానిక సర్వేయర్లు లెక్కించి నివేదికను తయారు చేశారు. అయితే నివేదికను డిగ్రీలు, మినిట్స్, సెకన్లలో ఇవ్వాల్సి ఉండగా తిప్పించి రూపొందించడంతో హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం దాదాపు 10 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏడీ నివేదికను రూపొందించి ఇవ్వాల్సి ఉండగా డీఐపైన ఆధారపడడంతోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దానిని ఉన్నతాధికారి చూసుకోకుండా సీఎంఓకు పంపడం కూడా నిర్లక్ష్యం కిందకే వస్తోంది. అయితే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కాగా, సీఎం పర్యటనలలోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎక్కడైనా సీఎంఓ కార్యాలయం నివేదిక కోరితే గంటల్లో ఇవ్వాల్సి ఉన్నా జిల్లా అధికారులు మాత్రం రోజుల తరబడిపట్టించుకోవడంలేదు. విచారించే 30వ తేదీ కూడా బాధ్యులపై చర్యలకు తెలుస్తారో లేదో చూడాలి. -
సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కో ఆర్డినేట్స్ సమాచారం తప్పు
కర్నూలు(సెంట్రల్) : కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి.. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ముందుగా నంద్యాలకు హెలికాప్టర్లో వచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా కో ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) సమాచారం తప్పుగా ఉండటంతో దాదాపు 10 నిమిషాల పాటు హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కర్నూలు జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. దీంతో కలెక్టర్ జి.వీరపాండియన్ డీఆర్వో వెంకటేశంను విచారణాధికారిగా నియమించినట్లు తెలుస్తోంది. కోఆర్డినేట్స్ నివేదికను ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిగ్రీలు, నిమిషాలు, సెకన్లలో ఇవ్వాలి. అది కూడా సీఎంవో అడిగిన రెండు ఫార్మాట్లలో పంపాలి. సర్వే డిపార్టుమెంట్కు చెందిన ఏడీ హరికృష్ణ ఈ పనిని నంద్యాల డివిజన్ డీఐ వేణుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన కేవలం ఒకే ఫార్మాట్లో అది కూడా 15, 4, 326 అని నివేదించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేటతెల్లమవుతోంది. -
ఉత్తరాఖండ్లో కుప్పకూలిన హెలికాఫ్టర్
హరిద్వార్ : వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ హెలికాఫ్టర్ ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమయంలో చాపర్లో ఉన్న పైలట్ రాజ్పాల్, కో పైలట్ కప్తల్ లాల్, రమేష్ సవార్ అనే స్ధానికుడు మరణించారని అధికారులు వెల్లడించారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాల్లో నిర్వాసితులకు సహాయ సామాగ్రిని ఈ హెలికాఫ్టర్లో తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరకాశీ సమీపంలోని మోల్ది గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. హెలికాఫ్టర్కు వైర్ తగలడంతో చాపర్ కూలిందని అరాకోట్ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీ వరద ముంచెత్తడంతో మిగతా ప్రపంచానికి ఈ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. కాగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రూ 15 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. -
వాయుసేనకు అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్ మరింత శక్తిమంతం కానుంది. ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్ అపాచీ ఏహెచ్ 64ఈ త్వరలో వాయుసేన అమ్ములపొదిలో చేరనుంది. అమెరికా విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ నాలుగేళ్ల క్రితం చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు హెలికాప్టర్లను భారత్కు అందజేసింది. మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లకు డీల్ కుదరగా తొలి విడతగా నాలుగు హెలికాప్టర్లు ఐఏఎఫ్కి అందాయి. వచ్చేవారం మరో నాలుగు వస్తాయి. మొత్తం ఎనిమిది అపాచీ హెలికాప్టర్లు పఠాన్కోట్ వైమానిక కేంద్రం నుంచి త్వరలో భారత వైమానిక దళంలో లాంఛనంగా చేరనున్నాయి. అపాచీ చేరికతో తమ పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని ఐఏఎఫ్ ఆశాభావం వ్యక్తంచేసింది. -
వాయుసేన చేతికి కొత్త అస్త్రం
న్యూఢిల్లీ: భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన అపాచీ గార్డియన్ అటాక్ హెలికాప్టర్ను భారత వాయుసేన (ఐఏఎఫ్)కు అప్పగించింది. 2015 సెప్టెంబర్లో అమెరికా ప్రభుత్వం, బోయింగ్ సంస్థతో భారత వాయుసేన 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే మొదటి హెలికాప్టర్ను అరిజోనాలోని మెసాలో భారతవాయుసేనకి అమెరికా అప్పగించిందని వాయుసేన అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ తెలిపారు. జూలైలో మొదటి హెలికాప్టర్ ఇండియాకు రానుంది. 2017లో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆరు అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్ సంస్థతో రూ.4,168 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. అపాచీ హెలికాప్టర్ రాకతో భారత వాయుసేన ఆధునీకరణ వైపు మరో ముందడుగు పడిందన్నారు. ఐఏఎఫ్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఈ హెలికాప్టర్ తయారైందని, పర్వత ప్రాంతాల్లో దీని సామర్థ్యం గణనీయమైన స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. శత్రువులపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగల సామర్థ్యం ఈ హెలికాప్టర్లకు ఉందని, భూమిపై, గగనతలంలో కూడా దాడులు చేయగలదని భారత వాయుసేన అధికారి ఒకరు తెలిపారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్, హైదరాబాద్లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టం సంయుక్తంగా ఈ హెలికాప్టర్ల విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నాయి. -
హెలికాప్టర్ డోర్లకు స్క్రూలు బిగించిన రాహుల్గాంధీ
-
టీమ్ వర్క్.. మెకానిక్గా మారిన రాహుల్గాంధీ
సిమ్లా : ఎన్నికల ప్రచారానికి వెలుతున్న సోదరి ప్రియాంకా గాంధీకి విశాలమైన హెలీకాప్టర్ను కేటాయించి, సుడిగాలి పర్యటనలు చేస్తున్న తాను మాత్రం చిన్న హెలీకాప్టర్తో ఔదార్యాన్ని చాటుకున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఇప్పడు మోకానిక్ అవతారమెత్తారు. హెలికాప్టర్ను రిపేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చాపర్ కిందకు చేరి నేలపై పడుకొని మరమ్మతు చేశారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని ఉనాలో శుక్రవారం రాహుల్ గాంధీ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా, ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్కు సాంకేతిక సమస్య వచ్చింది. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, హెలికాప్టర్ సిబ్బంది దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ సైతం ఓ చెయ్యివేసి వారికి సహకరించారు. నేలపై పడుకొని హెలికాప్టర్ డోర్లకు స్క్రూలు బిగించారు. ఇలా అందరం కలిసికట్టుగా పనిచేసి మరమ్మతు చేశామని ప్రమాదమేమీ లేదని ఆయన తెలిపారు. టీమ్ వర్క్ అంటే అందరూ కలిసికట్టుగా శ్రమించడమేనని, సమిష్టిగా కష్టపడటంతో సమస్యను త్వరగా పరిష్కరించగలిగామని పేర్కొన్నారు. చదవండి : చెల్లెలి కోసం పెద్ద త్యాగం చేశా : రాహుల్ గాంధీ -
పవన్హన్స్లో ఆగిన వాటాల విక్రయం
న్యూఢిల్లీ: హెలికాప్టర్ సేవల సంస్థ పవన్హన్స్లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నుంచి బిడ్ వచ్చినట్టు ఓ సీనియర్ అధికారి తెలియజేశారు. ఎన్నికల వరకు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పవన్హన్స్లో కేంద్రానికి 51 శాతం వాటా, ఓఎన్జీసీకి 49 శాతం వాటా ఉన్నాయి. ఆసక్తి కలిగిన ఇన్వెస్టర్లు ఫైనాన్షియల్ బిడ్లను దాఖలు చేసేందుకు మార్చి 6వరకు సమయం ఇచ్చారు. ప్రభుత్వం, ఓఎన్జీసీ కలసి నూరు శాతం వాటాను విక్రయించే యోచనతో ఉన్నాయి. ‘‘ఒకే ఒక్క ఇన్వెస్టర్ నుంచి ఫైనాన్షియల్ బిడ్ వచ్చిందని ఈ లావాదేవీ వ్యవహారాలు చూసే (ట్రాన్సాక్షన్ అడ్వైజర్) సంస్థ మాకు సమాచారమిచ్చింది. ఈ బిడ్ విషయంలో ముందుకు వెళ్లాలా? లేక తిరిగి ఈ ప్రక్రియను మొదట నుంచి ఆరంభించాలా? అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎన్నికలయ్యే వరకు వేచి చూసి, ఆ తర్వాత ఏర్పడే ప్రభుత్వమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది’’ అని ఆ అధికారి వెల్లడించారు. మే 23న ఫలితాల వెల్లడితో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిపోనున్న విషయం తెలిసిందే. -
మోదీ హెలికాఫ్టర్ తనిఖీ యత్నించిన అధికారి సస్పెన్షన్
-
మోదీ హెలికాప్టర్లో ఏముంది?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ను తనిఖీ చేసిన ఎన్నికల అధికారిని సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. ఈ మేరకు అధికారిక ట్విటర్ పేజీలో స్పందించింది. ‘తన విధుల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ప్రధాని వాహనంతో సహా ఎన్నికల ప్రచారంలో ఉన్న నాయకుల వాహనాలను తనిఖీ చేయొచ్చని చట్టాలు చెబుతున్నాయి. తన హెలికాప్టర్లో మోదీ ఏం తరలించారు. దాన్ని దేశ ప్రజలు చూడకూదని ఆయన కోరుకుంటున్నారా?’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. 1996 బ్యాచ్కు చెందిన మహ్మద్ మోసిన్ అనే ఐఏఎస్ అధికారిని మంగళవారం ఈసీఐ సస్పెండ్ చేసింది. ఏప్రిల్ 10న, మార్చి 22న నిబంధనలకు విరుద్ధంగా ఆయన వ్యవహరించారని ఈసీఐ తెలిపింది. ఒడిశాలోని సబల్పూర్ ఎన్నికల సభ సందర్భంగా నరేంద్ర మోదీ హెలికాప్టర్లో మహ్మద్ మొసిన్ సోదాలు జరిపారు. అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించడంతో ప్రధాని మోదీ 15 నిమిషాలు వేచిచూడాల్సి వచ్చింది. అయితే ఎస్పీజీ భద్రత ఉన్న ప్రధాని హెలికాప్టర్కు తనిఖీల నుంచి మినహాయింపు ఉందని ఈసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఒడిశా ముఖ్యంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హెలికాప్టర్లలోనూ ఈసీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
యడ్యూరప్ప హెలికాఫ్టర్లో ఎన్నికల సింబ్బంది తనిఖీలు
-
దారి తప్పిన దీదీ హెలికాఫ్టర్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ దారితప్పడం పార్టీ శ్రేణుల్లో, అధికారుల్లో కలవరానికి కారణమయింది. బుధవారం ఉత్తర దీనాజ్పూర్ జిల్లా చోప్రా జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం మమతా బెనర్జీ.. మధ్యాహ్నం 1.05 గంటలకు సిలిగురి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరారు. అయితే షెడ్యూల్ ప్రకారం 1.27 గంటలకు ఆమె అక్కడికి చేరుకోవాల్సి ఉంది. అయితే సమయం దాటినా కూడా మమత ప్రయాణిస్తున్న చాపర్ అక్కడికి రావకపోవడంతో జిల్లా అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే మమత ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ పైలట్ సభాస్థలిని గుర్తించకపోవడంతో.. వారు బిహార్లోకి ప్రవేశించారు. వెంటనే పైలట్తో సంప్రదింపులు జరిపిన అధికారులు హెలికాఫ్టర్ సభాస్థలికి చేరుకునేలా డైరక్షన్స్ ఇచ్చారు. ఫైలట్ సభాస్థలిని గుర్తుపట్టేలా స్మోక్డ్ గన్స్ సాయంతో రంగుల పొగలను వదిలారు. దీంతో మమత ప్రయాణిస్తున్న చాపర్ 2 గంటల సమయంలో హెలిప్యాడ్ వద్ద క్షేమంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత చోప్రా సభలో ప్రసంగించిన మమత మాట్లాడుతూ.. సభకు సమయానికి రాలేకపోయినందుకు క్షమాపణలు కోరారు. ఫైలట్ హెలికాఫ్టర్ దిగే స్థలాన్ని గుర్తించకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిపారు. అయితే జెడ్ ప్లస్ భద్రత ఉన్న మమత ప్రయాణిస్తున్న చాపర్ దారితప్పడం కాసేపు అధికార యంత్రాగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సభ జరుగుతున్న ప్రాంతం బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉండటం కూడా వారిని ఉలిక్కిపడేలా చేసింది. కాగా, ఈ ఘటనపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు న్యూస్-18 ఓ కథనాన్ని ప్రచురించింది. -
లారీ ఎక్కిన హెలికాప్టర్
సాక్షి, చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం ఎల్లగిరి వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం హెలికాప్టర్ను తరలిస్తున్న ఓ లారీ ఆగింది. అమెరికాలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ హెలికాప్టర్ను షిప్లో ఆంధ్రప్రదేశ్ని విశాఖపట్నం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి లారీలో ముంబాయికి తీసుకెళ్తున్నారు. విశ్రాంతి కోసం డ్రైవర్ లారీని అక్కడ ఆపాడు. దీనిని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. పలువురు హెలికాప్టర్తో సెల్ఫీలు దిగారు. -
యోగి హెలికాప్టర్కు అనుమతి నిరాకరణ
బలూర్ఘాట్/లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు పశ్చిమబెంగాల్లో చుక్కెదురైంది. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్కు అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆదివారం బీజేపీ చేపట్టిన రెండు సభలకు సీఎం యోగి హాజరు కాలేకపోయారు. అందుకు బదులుగా ఫోన్ ద్వారా ఆయన రెండు సభలకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో సత్తా చూపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ‘గణతంత్ర బచావో’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ దినాజ్పూర్ జిల్లా బలూర్ఘాట్, ఉత్తర దినాజ్పూర్ జిల్లా రాయ్గంజ్లో నిర్వహించే సభలకు యూపీ సీఎం ఆదిత్యనాథ్తోపాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆదిత్యనాథ్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్కు ఈ రెండు చోట్లా మమతా బెనర్జీ రాష్ట్ర యంత్రాంగం అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన లక్నో నుంచే ఫోన్ ద్వారా ఈ రెండు సభలకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
పశ్చిమ బెంగాల్లో యోగి ర్యాలీకి దీదీ షాక్
-
యోగి ర్యాలీకి దీదీ బ్రేక్
లక్నో : పశ్చిమ బెంగాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ర్యాలీకి ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే బెంగాల్ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని యూపీ సీఎం కార్యాలయం పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ దినాజ్పూర్లో ఆదివారం యోగి ఆదిత్యానాథ్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హెలికాఫ్టర్ ల్యాండయ్యేందుకు సైతం మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని, ఇది ప్రజల్లో ఆయనకున్న ప్రతిష్టకు సంకేతమని యూపీ సీఎం సమాచార సలహాదారు మృత్యుంజయ్ కుమార్ అన్నారు. కాగా, బలూర్ఘట్ ఎయిర్పోర్ట్లో యోగి చాపర్కు అనుమతి నిరాకరించినందుకు నిరసనగా దినాజ్పూర్లో జిల్లా మేజిస్ర్టేట్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. యోగి విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరణపై జిల్లా మేజిస్ర్టేట్ సరైన వివరణ ఇవ్వలేకపోయారని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరోవైపు ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ చీఫ్ అమిత్ షా హెలికాఫ్టర్ ల్యాండింగ్కు సైతం అధికారులు తొలుత అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. -
నిబంధనలు ఉల్లంఘించామని తెలియదు: పాక్
ఇస్తామాబాద్: నిబంధనలు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ హెలికాప్టర్పై భారత సైనికులు కాల్పులు జరిపిని విషయం తెలిసిందే. ఈ ఘటనపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పర్యాటక మంత్రి ముస్తాక్ మిన్హాస్ స్పందించారు. ఆ సమయంలో తను హెలికాప్టర్లోనే ఉన్నానని, తనతో పాటు పీఓకే ప్రధాన మంత్రి రాజా ఫరూక్ హైదర్ ఖాన్, ఆయన భద్రతాధికారులు, ప్రొవిన్స్ విద్యాశాఖ మంత్రి ఇఫ్తికర్ గిలానీలను ఉన్నారని తెలిపారు. ‘ నిజానికి ఎయిర్స్పేస్ నిబంధనలు ఉల్లంఘించామని మాకు తెలియదు. మాపైకి కాల్పులు జరుగుతున్నాయని తెలుసుకున్నాం. మా గమ్యం చేరిన తరువాత ఆ కాల్పులు భారత్ నుంచి వచ్చాయని తెలిసింది.’ అని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ జిల్లా గుల్పూర్ సెక్టార్లోకి చొచ్చుకొచ్చిన తెలుపు రంగు హెలికాప్టర్ను కూల్చివేయడానికి భారత సైనికులు ప్రయత్నించడంతో, వెనక్కి మళ్లిందని భారత అధికారులు చెప్పారు. అది సైనిక హెలికాప్టర్ కాదని, గాల్లో చాలా ఎత్తులో చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో మూడు ఫార్వర్డ్ పోస్ట్ల్లోని సైనికులు చిన్న తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ వీడియోల్ని పాక్ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. ఐరాసలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్పై మండిపడిన తరువాతి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. నిబంధనల ప్రకారం..ఎల్వోసీకి కిలోమీటరు దూరంలోకి హెలికాప్టర్లు, పది కి.మీ. పరిధిలోకి విమానాలు రావొద్దు. (చదవండి: భారత గగనతలంలోకి పాక్ హెలికాప్టర్) -
భారత గగనతలంలోకి పాక్ హెలికాప్టర్
జమ్మూ: నిబంధనలు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ హెలికాప్టర్ ఆదివారం కలకలం సృష్టించింది. నియంత్రణ రేఖ వెంబడి పూంచ్ జిల్లా గుల్పూర్ సెక్టార్లోకి చొచ్చుకొచ్చిన తెలుపు రంగు హెలికాప్టర్ను కూల్చివేయడానికి భారత సైనికులు ప్రయత్నించడంతో, వెనక్కి మళ్లిందని అధికారులు చెప్పారు. అది సైనిక హెలికాప్టర్ కాదని, గాల్లో చాలా ఎత్తులో చక్కర్లు కొట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో మూడు ఫార్వర్డ్ పోస్ట్ల్లోని సైనికులు చిన్న తుపాకులతో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నేత రజా ఫరూక్ హైదర్ ఖాన్ ఆ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఆ వీడియోల్ని పాక్ టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. గగనతల నిబంధనల్ని పాక్ అతిక్రమించిందని చూపడానికే భారత్ కాల్పులు జరిపిందని, కానీ ఆ సమయంలో తమ గగనతలంలోనే ఉన్నామని ఫరూక్ కార్యాలయం వెల్లడించింది. ఐరాసలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్పై మండిపడిన తరువాతి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. నిబంధనల ప్రకారం..ఎల్వోసీకి కిలోమీటరు దూరంలోకి హెలికాప్టర్లు, పది కి.మీ. పరిధిలోకి విమానాలు రావొద్దు. మిలిటెంట్ కాల్పుల్లో పోలీస్ మృతి... షోపియాన్ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్పై మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒక పోలీస్ మృతి చెందారు. ఆదివారం పోలీస్ స్టేషన్పై మిలిటెంట్లు కాల్పులకు దిగడంతో వెంటనే జవాన్లు కూడా ఎదురు దాడి చేశారు. -
భారత సరిహద్దుల్లో చొరబడ్డ పాక్ హెలికాఫ్టర్
-
అగస్టా కుంభకోణం కేసులో కీలక మలుపు
అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటన్ దేశస్తుడు క్రిస్టియన్ మైకేల్ జేమ్స్ను భారత్కు అప్పగించాల్సిందిగా యూఏఈ కోర్టు ఆదేశాలు ఎన్టీయే ప్రభుత్వంలో ఉత్సాహాన్ని నింపాయి. రాఫెల్ ఒప్పందం, కోట్లాది రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయమాల్యా వంటి పారిశ్రామికవేత్తల పరారీ అంశాలపై విపక్షాల దాడితో సతమతమవుతున్న బీజేపీకి ఇప్పుడుకు కాంగ్రెస్ను ఇరుకున పెట్టే అవకాశం దొరికిందని భావిస్తోంది. వీవీఐపీలు ప్రయాణించడానికి ఉద్దేశించిన హెలికాప్టర్ల కుంభకోణంలో అత్యంత కీలకంగా మారిన మైకేల్ జేమ్స్ను భారత్కు తీసుకువచ్చి విచారిస్తే అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయల ప్రమేయాన్ని వెలుగులోకి తీసుకురావచ్చునన్న ఉత్సాహంలో ఎన్టీయే ప్రభుత్వం ఉంది. కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరు లబ్ధి పొందారన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు ముడుపులు అందినట్టుగా ఆరోపణలున్నాయి. క్రిస్టియన్ మైకేల్ తన డైరీలో కోడ్ భాషలో రాసుకున్న ఏపీ(AP), ఎఫ్ఏఎం(FAM), పీఓఎల్(Pol), బీయూర్(Bur), ఏఎఫ్(AF) అన్న పదాలు పజిల్గానే ఉన్నాయి. . మైకేల్ను అప్పగిస్తే వాటి అర్థం తెలిసే అవకాశం ఉంది. ఏమిటీ అగస్టావెస్ట్ల్యాండ్ కుంభకోణం అగస్టా వెస్ట్ల్యాండ్ యూకేకి చెందిన హెలికాప్టర్ తయారీ కంపెనీ. వైమానిక దళం అవసరాల కోసం ఈ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్లు ఏడబ్ల్యూ 101 కొనుగోలు చేయడానికి 3,600 కోట్లతో 2010 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి వీవీఐపీల పర్యటన కోసం ఈ హెలికాప్టర్లను వినియోగించాలన్న ఉద్దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందం కుదిరేలా అగస్టా వెస్ట్ల్యాండ్, ఇటలీలోని దాని మాతృసంస్థ ఫిన్మెకానికాలు సంయుక్తంగా మధ్యవర్తుల్ని రంగంలోకి దింపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు ముడుపులు చెల్లించడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపైనే 2013లో అగస్టా వెస్ట్ల్యాండ్ సీఈవో బ్రూనో స్పాగోలిన్, ఫిన్మెకానికా సంస్థ చైర్మన్ గిసెప్పె ఒరిస్ అరెస్ట్ కావడంతో యూపీఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2014లో ఇటలీ కోర్టు దీనిపై విచారణ జరిపి అప్పటి భారత వైమానిక దళం చీఫ్ ఎస్పీ త్యాగి ప్రమేయం ఈ కుంభకోణంలో ఉందని వెల్లడించింది. ఫిన్మెకానికా సంస్థ త్యాగికి ముడుపులు చెల్లించడంతో ఆయన ఒప్పందంపై సంతకాలు చేశారని పేర్కొంది. అంతేకాదు ఇటలీలోని మిలాన్ కోర్టు తన తీర్పులో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, అహ్మద్పటేల్ పేర్లను కూడా ప్రస్తావించింది. క్రిస్టియానా మైకేల్తో పాటు మరో ఇద్దరు మధ్యవర్తులు కార్లోస్ గెరోసా, గిల్డో మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలలో వీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో సోనియాగాంధీ, ఆమె సన్నిహితుడు అహ్మద్ పటేల్ అత్యంత కీలకమంటూ పేర్కొన్నట్టు వెల్లడించింది. ఎవరీ మైకేల్ జేమ్స్ భారత్తో హెలికాప్టర్ల ఒప్పందం కుదిరేలా చూడడానికి ఆంగ్లో ఇటాలియన్ సంస్థ అగస్టా వెస్ట్ల్యాండ్ నియమించిన ముగ్గురు మధ్యవర్తుల్లో క్రిస్టియానా మైకేల్ జేమ్స్ ఒకరు. బ్రిటన్కు చెందిన కన్సల్టెంట్ అయిన మైకేల్ భారత్ రక్షణ శాఖ అధికారులతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. భారత్కు చెందిన రాజకీయ వేత్తలు, రక్షణ శాఖ అధికారులు, బ్యూరోక్రాట్లు, భారతీయ వైమానిక దళం అధికారులకు ముడుపులు చెల్లించి హెలికాప్టర్ల కాంట్రాక్టర్ తమ కంపెనీకే దక్కేలా వ్యవహారం చక్కబెట్టడానికి మైకేల్ను అగస్టా కంపెనీ నియమించింది. ఇందుకోసం మైకేల్కు 350కోట్ల వరకు అగస్టా వెస్ట్ల్యాండ్ కంపెనీ డబ్బులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ విచారణ జరుగుతోంది. మెకేల్పై 2016 జూన్లో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మైకేల్ దుబాయ్లోని తన సంస్థ అయిన గ్లోబల్ సర్వీస్ ద్వారా ఢిల్లీలో ఇద్దరు భారతీయులతో కలిసి మీడియా సంస్థను ఏర్పాటు చేసి నేర కార్యకలాపాలను కూడా పాల్పడ్డారని, హెలికాప్టర్ ఒప్పందంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ఈడీ విచారణలో వెల్లడైంది. క్రిస్టియనా మైకేల్ 2008లో అగస్టా కంపెనీ భారత్ విభాగం అప్పటి చీఫ్ పీటర్ హ్యూలెట్కు రాసిన లేఖలో ఈ ఒప్పందం కుదరాలంటే సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవాలంటూ సూచించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ లేఖ బయటకు వచ్చి తీవ్ర దుమారాన్నే రేపింది. 2015లో మైకేల్పై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. మైకేల్ 2017లో దుబాయ్లో అరెస్ట్ అయ్యాడు. ఈ ఏడాది జులైలో బెయిల్పై విడుదలయ్యాడు. గత ఏడాది నుంచి మైకేల్ను అప్పగించడానికి యూఏఈతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. బెయిల్పై విడుదలైనప్పట్నుంచి మైకేల్ ఎక్కడ ఉన్నాడో కనిపించడం లేదంటూ ఆయన లాయర్ చెబుతున్నారు. అతనిని అప్పగించడానికి కోర్టు అంగీకరించడంతో మైకేల్ ఎప్పుడైనా కోర్టులో లొంగిపోయే అవకాశం ఉంది. -
మాజీ ఎంపీ హెలికాప్టర్ సీజ్..!
భువనేశ్వర్ : బీజూ జనతాదళ్ మాజీ ఎంపీ జే పాండా హెలికాప్టర్ను అధికారులు సీజ్ చేశారు. గగనతల నిబంధనలు ఉల్లఘించారన్న ఆరోపణలతో ఆయన హెలికాప్టర్ను మంగళవారం సీజ్ చేసినట్లు పూరి పోలీసులు వెల్లడించారు. భువనేశ్వర్ సమీపంలోని చిలికా సరస్సు వద్ద నిషేధిత వాతవరణ జోన్లో ఆయన చాపర్ను నడిపారని పోలీసులు తెలిపారు. చిలికా సరస్సు ప్రాంతంలో అతి తక్కువ ఎత్తులో హెలికాఫ్టర్ ప్రయాణించిందని ఫారెస్ట్ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారించి సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. చాపర్ సీజ్ చేయడంతో పాటు అతనిపై కేసు కూడా నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా బీజూ జనతాదళ్కు చెందిన జే పాండా ఇటీవల పార్టీకి, ఎంపీ పదవికి రాజనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతున్నారంటూ పాండాను అంతకు ముందే పార్టీ నుంచి బహిష్కరించారు. -
కూలిన హెలికాప్టర్.. ఏడుగురు గల్లంతు
ఖాట్మండు : సెంట్రల్ నేపాల్లోని కొండప్రాంతంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆల్టిట్యూడ్ ఎయిర్ లైన్స్కు చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలడంతో పైలట్ సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఓ జపాన్ పర్యాటకుడితోపాటూ ఐదుగురు నేపాలీలు ఉన్నట్టు సమాచారం. నేపాల్లోని గోర్ఖా జిల్లాలోని సమాగౌన్ నుంచి హెలికాప్టర్ బయల్దేరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతమైన సత్యవాహిలో హెలికాప్టర్ శకలాలు ఉన్నట్టు గుర్తించారు. శకలాలు ఉన్న ప్రాంతం ఎత్తైన కొండపైన ఉండటం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది.