nagpur
-
‘మీరు సమాధుల్లో దాక్కున్నా తవ్వితీస్తాం’
ముంబై: నాగ్ పూర్ లో జరిగిన హింసకు కారణమైన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడిగా ఆయన పేర్కొన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా వారికి కఠిన శిక్ష తప్పదన్నారు. అసెంబ్లీలో ఫడ్నీవీస్ నాగ్ పూర్ లో జరిగిన హింసాత్మక ఘటనపై ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదు. వారు ఎక్కడ దాక్కున్నా బయటికి తీసి మరీ శిక్షిస్తాం. ఆఖరికి సమాధుల్లో దాక్కున్నా తప్పించుకోలేరు. ఈ దాడిలో 33 మంది పోలీసులకు తీవ్ర గాయాలు కావడాన్ని ఫడ్నవీస్ ప్రస్తావించారు. ఇదొక అమానుష ఘటన అని, పక్క వ్యూహంతో హింసాత్మ ఘటనలకు పాల్పడ్డారన్నారు.కాగా, ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో సోమవారం ఈ ఘర్షణ చెలరేగింది. తొలుత చిన్నపాటి ఘర్షణగా మొదలై, ఆపై తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీన్ని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై కూడా అల్లరి మూకలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలపాలయ్యారు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. -
Nagpur issue కొనసాగుతున్న కర్ఫ్యూ, స్థానిక ఎన్నికల కోసమే ఇదంతా?
నాగ్పూర్: మొఘల్ పాలకుడు ఔరంగజేబు ‘సమాధి తొలగింపు’పై చెలరేగిన హింస అనంతరం నాగ్పూర్లోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొత్వాలి, గణేష్ పేత్, తహసీల్, లకద్గంజ్, పచ్పావోలి, శాంతి నగర్, సక్కర్దార, నందన్వన్, ఇమామ్బాడ, యశోధర నగర్. కపిల్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అదేరోజు సాయంత్రం మధ్య నాగ్పూర్లో చెలరేగిన హింసలో ముగ్గురు డీసీపీలు (డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్) సహా 12 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. హింసకు సంబంధించి పోలీసులు 15 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కర్ఫ్యూ సమయంలో, అవసరానికి అనుగుణంగా సడలింపులపై సంబంధిత ప్రాంత డీసీపీ నిర్ణయం తీసుకుంటారని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ నాగ్పూర్లోని చిట్నిస్ పార్క్ ప్రాంతంలోని మహల్లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధి తొలగింపు కోసం ఒక మితవాద సంస్థ చేపట్టిన ఆందోళనలో ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని దహనం చేశారన్న పుకార్లతో అల్లర్లు చెలరేగాయి. ఓల్డ్ భండారా రోడ్డు సమీపంలోని హన్సపురి ప్రాంతంలో రాత్రి 10.30 నుండి 11.30 గంటల మధ్య మరో ఘర్షణ చెలరేగింది. ఒక అల్లరి మూక అనేక వాహనాలను తగలబెట్టింది. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు, ఒక క్లినిక్ను ధ్వంసం చేసింది. ఈ సంఘటనలల్లో అనేక మంది గాయపడ్డారు. వరుసగా రెండో రోజు కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. రాష్ట్రంలో కలహాలకు దారితీసే చిన్న సంఘటనలను కూడా తీవ్రంగా పరిగణించి, వాటిని మొగ్గలోనే తుంచివేయాలని మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా జిల్లా ఎస్పీలను కోరారు.నాగ్పూర్ అల్లర్లు ప్రభుత్వ ప్రేరేపితమే– జరంగే ఛత్రపతి సంభాజీనగర్: నాగ్పూర్లో హింసను ప్రభుత్వ ప్రేరేపితమేనని, పట్టణంలో అశాంతికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసే కారణమని మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగే మంగళవారం ఆరోపించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం వారిదే. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే అది వారికి నిమిషంలో పని. కాంగ్రెస్ అప్పట్లో తప్పు చేసి ఉంటే ఇప్పుడు దాన్ని సరిదిద్దే అవకాశం వారికి ఉంది . ఒకే సమయంలో రెచ్చగొట్టే ప్రకటనలు అదే సమయంలో సమాధి చుట్టూ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థంచేసుకోవాలి. ‘స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. వీటిలో విజయం సాధించేందుకే ఇదంతా అని వ్యాఖ్యానించారు -
నాగ్పూర్ దారుణం
ఉన్నత విద్యలో చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రం వగైరా మానవ విజ్ఞాన శాస్త్రాల ప్రాధాన్యత అడుగంటి రెండున్నర దశాబ్దాలు దాటుతుండగా చరిత్రను ఆధారం చేసుకుని నిర్మించినట్టు చెబుతున్న సినిమాలు వివాదాస్పదం కావటం, ఉద్రిక్తతలు ఏర్పడటం ఇటీవలి ధోరణి. తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో రాజుకున్న హింసాకాండ మూలాలు కూడా అక్కడే ఉండటం యాదృచ్ఛికం కాదు. సోమవారమంతా నాగ్పూర్లో చెలరేగిన హింసలో 33మంది పోలీసులు, అయిదుగురు పౌరులు గాయపడగా రెండు బుల్డోజర్లతోసహా అనేక వాహనాలకు దుండగులు నిప్పంటించారు. ఆరో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పవిత్ర గ్రంథంలోని వాక్యాలున్న చద్దర్ను దగ్ధం చేశారన్న వదంతి ఈ హింసకు కారణమని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల మొదటివారం నుంచే మహారాష్ట్రలో ఉద్రిక్తతలు అలుముకున్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత ఘట్టాలతో రాసిన ఒక చరిత్రాత్మక నవల ఆధారంగా నిర్మించిన ‘ఛావా’ సినిమా చుట్టూ తొలుత వివాదం రాజుకుంది. అందులోని ఉదంతాలకు చారిత్రక ఆధారాలు లేవని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే అబూ అసిమ్ అజ్మీ అనడంతోపాటు ఔరంగజేబు క్రూరుడు కాడన్నారు. ఆపై మరిన్ని మలుపులు తిరిగింది. మరాఠా వారసత్వాన్ని అవమానించిన ‘ద్రోహి’ అజ్మీని వెంటనే అసెంబ్లీనుంచి బహిష్కరించాలని అధికార మహాయుతి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ ఘటనల వెనక ముందస్తు పథకం ఉన్నదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అంటున్న మాటలు వాస్తవం. కానీ ఈనెల మొదటివారంలో సమస్య రాజుకున్నప్పటి నుంచి ఇంటె లిజెన్స్ వర్గాలు, పోలీసులు ఏం చేశారు? దుండగుల కదలికలను అంచనా వేయటంలో ఎందుకు విఫలమయ్యారు? పెట్టుబడుల కోసం, అభివృద్ధి సాధించామని చూపటం కోసం ప్రభుత్వాలన్నీ పోటీపడుతున్న కాలంలో శాంతిభద్రతలను దెబ్బతీసే ఇలాంటి ఘటనల వల్ల అప్రదిష్టపాలవుతా మన్న స్పృహ కూడా లేదా? హింసకు ఆద్యులెవరన్నది తేలడం తర్వాత సంగతి. ముందు పౌర జీవనం అస్తవ్యస్తమైంది. ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన స్థితి. నాగ్పూర్ ఆ రాష్ట్రానికి రెండో రాజధాని. జనాభారీత్యా ముంబై, పుణేల తర్వాత మూడో స్థానంలో ఉంటుంది. 300 ఏళ్ల చరిత్రగల ఈ నగరంలో దేశంలోనే తొలి బట్టలమిల్లును టాటాలు స్థాపించారు. 1920 నాటి నాగ్పూర్ కాంగ్రెస్ జాతీయ సదస్సులోనే సహాయ నిరాకరణ ఉద్యమం పురుడు పోసుకుంది. ఇక్కడే హెడ్గేవార్ ఆరెస్సెస్ను స్థాపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న బౌద్ధమతాన్ని స్వీకరించి దళిత బుద్ధిస్ట్ ఉద్యమానికి అంకురార్పణ చేసింది ఇక్కడే. ఇది చదువుల తల్లి నిలయం. 1923లో మొదలైన నాగ్పూర్ యూనివర్సిటీ సహా ఇక్కడ అయిదు విశ్వ విద్యాలయాలున్నాయి. అయిదు వైద్య కళాశాలలున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమతోపాటు ఇక్కడ ఎన్నో తయారీరంగ పరిశ్రమలున్నాయి. పుణే తర్వాత ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఎక్కువ.చరిత్రను మలుపుతిప్పిన అనేకులు ఆనాటి అవగాహన, పరిమితుల మేరకు తమ పాత్ర నిర్వహించి నిష్క్రమించారు. వారి చర్యల వెనకున్న ఆంతర్యమేమిటో, అందువల్ల వివిధ వర్గాలకు కలి గిన ఖేదం లేదా మోదం ఏమిటో...వాటి పర్యవసానాలేమిటో విశ్లేషించి చెప్పటం చరిత్రకారులు చేసే పని. అయితే అలా వెలువడే చరిత్రలు నూరు శాతం వాస్తవమని భావించటానికి వీలుండదు. ఎందుకంటే చరిత్రను వక్రీకరించటం మొదలెట్టి చాన్నాళ్లయింది. ఇక సృజనాత్మకత జోడించి రాసే కాల్పనిక రచనల గురించి చెప్పేదేముంది? శంభాజీ తీరుతెన్నులను నిశితంగా విమర్శించేవీ ఉన్నాయి. ఆయన్ను ఆకాశానికెత్తేవీ ఉన్నాయి. అయితే నేరుగా శంభాజీని కలిసి, సంభాషించిన నికొ లాయ్ మానుచ్చి అనే ఇటాలియన్ తన యాత్రా రచన ‘స్టోరియా దొ మొగర్’లో అనేక అంశాలు రాశాడు. అవి కల్పితం అయ్యే చాన్సు తక్కువ. ఔరంగజేబు 49 ఏళ్లపాటు పాలించి తన 88వ యేట 1707లో మరణించాడు. అతని హయాంలో దాదాపు 25 యేళ్లపాటు యుద్ధాలే సాగాయి. ముఖ్యంగా మరాఠాలకూ, మొగల్ సైన్యానికీ మధ్య తీవ్ర వైరం ఉండేది. ఆ క్రమంలో శంభాజీని హత మార్చి, అతని ఏడేళ్ల కుమారుడు సాహూను ఖైదు చేయటం చరిత్రలో చోటుచేసుకున్న వాస్తవిక అంశాలు. పద్దెనిమిదేళ్ల కారాగారవాసం తర్వాత ఔరంగజేబు మరణానంతరం సాహూ విడుదల కావటం, ఆ తర్వాత రాజ్యాధికారం చేపట్టడం, మరాఠాల ప్రాభవం మరింత పెరిగి, ఉపఖండంలో వారు తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకోవటం చరిత్ర. క్రూరత్వమే వీరత్వంగా చలామణి అయిన మధ్యయుగాల్లో ఔరంగజేబు వంటి పాలకుల్లో మంచిని వెదకటంవల్ల కలిగే ప్రయోజనమేమిటో అజ్మీ వంటివారు చెప్పాలి. మహారాష్ట్ర ప్రజలకూ, ముఖ్యంగా మరాఠాలకూ శివాజీతో, ఆయన వారసత్వంతో భావోద్వేగాలతో ముడిపడిన అనుబంధం ఉంటుంది. దాన్ని గాయపరిచి, వివాదాన్ని సృష్టించి ఆయన సాధించదల్చుకున్నదేమిటో అర్థంకాని విషయం. రాజకీయంగా అజ్మీ ఏ పార్టీతో ఉన్నా, ఎంతగా వివాదాస్పదుడైనా బీజేపీ, శివసేనలతోసహా అన్ని పార్టీలతోనూ ఆయనకు సాన్నిహిత్యం వుంది. హత్య కేసు వివాదంలో ఇరుక్కుని మంత్రి పదవి కోల్పోయిన ధనంజయ్ ముండా ఉదంతం నుంచి అధికార కూటమిని కాపాడటానికే ఉద్దేశపూర్వకంగా అజ్మీ ఈ వివాదం రెచ్చగొట్టారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపణ. ఆ మాటెలావున్నా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న వారు నోరు అదుపులో ఉంచుకోవటం అవసరం. నాగ్పూర్ హింస ఈ సంగతినే తెలియజెబుతోంది. -
అంతా ఛావా వల్లే.. అసెంబ్లీలో సీఎం ఫడ్నవిస్ ప్రకటన
ముంబై: నాగపూర్లో గత రాత్రి నుంచి నెలకొన్న ఉద్రిక్తతలకు ఒక రకంగా ‘ఛావా’ సినిమానే కారణమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు సమాధి(Aurangzeb Tomb)ని తొలగించాలనే డిమాండ్తో మొదలైన ఆందోళన కాస్త హింసాత్మకంగా మారడం.. ఆపై నెలకొన్న కర్ఫ్యూ పరిస్థితులపై ఆయన ఇవాళ అసెంబ్లీలో కీలక విషయాలు వెల్లడించారు.ఇక్కడ నేను కేవలం ఒక సినిమాను మాత్రమే తప్పుపట్టాలని అనుకోవడం లేదు. కానీ, ఇలా మాట్లాడక తప్పడం లేదు. శంభాజీ మహరాజ్ చరిత్రను ఛావా చిత్రం ప్రజల ముందు ఉంచింది. అదే సమయంలో పలువురి మనోభావాలు రగిలిపోయాయి. అందుకే ఔరంగజేబు మీద వ్యతిరేకత అంశం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. అయితే..ఇదంతా పక్కా ప్రణాళిక బద్ధంగా జరిగిన కుట్ర అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఔరంగజేబు సమాధి తొలగించాలనే డిమాండ్తో సోమవారం సాయంత్రం వీహెచ్పీ, బజరంగ్ దళ్ ధర్నా చేపట్టాయి. కర్రలతో ఔరంగజేబు నకిలీ సమాధి ఒకదానిని ఏర్పాటు చేసి తగలపెట్టారు. కాసేపటికే మతపరమైన ప్రతులు తగలబెట్టారని ప్రచారం రేగింది. ఇది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాబట్టి ఇందులో కుట్రకోణం కూడా దాగి ఉండొచ్చు అని అన్నారాయన.#NagpurViolence: Maharashtra Chief Minister DevendraFadnavis says #Chhaava brought the history of Chhatrapati Sambhaji Maharaj to the fore and ignited public anger against Mughal ruler Aurangzeb. Read: https://t.co/hLrV0crgkG pic.twitter.com/RrUt0qPfJ2— NDTV Profit (@NDTVProfitIndia) March 18, 2025VIDEO Credits: NDTV Profit X Accountఅయితే చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా సహించేది లేదని.. కులం, మతం ఏదైనా సరే ప్రజలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలని సూచించారాయన. అదే సమయంలో ఉద్రిక్తతలకు కారణమయ్యేవాళ్లపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలంతా సమన్వయంతో పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.ఇదిలా ఉంటే.. గత రాత్రి నాగ్పూర్(Nagpur)లో భారీ ఎత్తున విధ్వంస కాండ జరిగింది. రాళ్లు రువ్వుకుంటూ.. పలు వాహనాలకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు.. పోలీసుపైకి రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో.. కేవలం పోలీసులకే 33 మందికి గాయాలైనట్లు సమాచారం. అయితే సాధారణ పౌరులు ఎంత మంది గాయపడ్డారనేదిపై అక్కడి మీడియా ఛానెల్స్ తలా ఓ ఫిగర్ చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రంలో లీడ్ రోల్ శంభాజీగా విక్కీ కౌశల్(Vicky Kaushal), శంభాజీ భార్య యేసుబాయిగా రష్మిక, జౌరంగజేబుగా అక్షయ్ ఖన్నా(Akshay Khanna As Aurangzeb) తమ ఫెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నారు. అయితే సినిమా రిలీజ్ టైంలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తారు. మరాఠా యోధుడు శంభాజీ పోరాటాన్ని, త్యాగాన్ని ఇప్పటి తరానికి తెలియజేసిన ఈ చిత్రం నిజంగా ఓ అద్భుతమంటూ కొనియాడారు. -
‘నాగపూర్ ప్లాన్’ అంగీకరించం
చెన్నై: జాతీయ విద్యా విధా నం అనేది విధ్వంసకర నాగ పూర్ ప్లాన్ అని తమి ళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ పరోక్షంగా ఆర్ ఎస్ఎస్పై మండిపడ్డారు. దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పా రు. హిందీ, సంస్కృత భాషలను ఆమోదిస్తే రూ.2 వేల కోట్లు ఇస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు ఇచ్చినా జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్టాలిన్ స్పష్టంచేశారు.మంగళవారం చెంగల్పేటలో ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యా విధానం తమిళనాడులో విద్యాభివృద్ధిని పూర్తిగా దెబ్బతీస్తుందని తెలిపారు. విద్యార్థులను విద్య నుంచి దూరం చేసేలా ఈ విధానం తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా రంగంపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటని నిలదీశారు.విద్యలో మతతత్వాన్ని పెంచడం, ప్రైవేటీకరణను ప్రోత్సహించడం సరైంది కాదని స్పష్టం చేశారు. కేవలం సంపన్న వర్గాల పిల్లలే ఉన్నత విద్య అభ్యసించాలా? పేదలకు చదువుకొనే అవకా శాలు లభించకూడదా? అని ప్రశ్నించారు. తమిళ నా డు ప్రయో జనాల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాడుతూనే ఉంటామని స్టాలిన్ పునరుద్ఘాటించారు. -
తొమ్మిది సెంచరీలు.. సిగ్గుతో తలదించుకోండి!.. వీడియో వైరల్
విదర్భ బ్యాటర్ కరుణ్ నాయర్(Karun Nair) మరోసారి శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) ఎలైట్ 2024-25 సీజన్ ఫైనల్లో భాగంగా కేరళపై సెంచరీ సాధించాడు. ఈ సందర్భంగా అతడు సెలబ్రేట్ చేసుకున్న విధానం నెటిజన్లను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భీకర ఫామ్లో ఉన్న ఆటగాడి పట్ల వివక్ష చూపిస్తున్న టీమిండియా సెలక్టర్లు సిగ్గుతో తలదించుకోవాలంటూ అతడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాగా దేశవాళీ క్రికెట్ తాజా ఎడిషన్లో ఫార్మాట్లకు అతీతంగా కరుణ్ నాయర్ దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. దేశీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ(Vidarbha) కెప్టెన్గా వ్యవహరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కేవలం ఎనిమిది ఇన్నింగ్స్లోనే 779 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా ఐదు శతకాలు ఉండటం విశేషం.ఈ నేపథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంపిక చేసిన జట్టులో కరుణ్ నాయర్కు స్థానం దక్కాలని భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతడి అత్యద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోలేదు.ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న వాళ్లను జట్టులోకి తీసుకోలేమని వ్యాఖ్యానించాడు. అతడు ఫామ్లో ఉన్నప్పటికీ ప్రస్తుత జట్టులో చోటు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టాడు.23వ శతకంఈ క్రమంలో నిరాశకు గురైనప్పటికీ కరుణ్ నాయర్ ఆ ప్రభావాన్ని తన ఆట మీద పడనీయలేదు. రంజీ రెండో దశ పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై శతకం(122) బాదిన అతడు.. తాజాగా ఫైనల్లోనూ సెంచరీతో మెరిశాడు. నాగ్పూర్ వేదికగా కేరళ జట్టుతో జరుగుతున్న తుదిపోరులో నాలుగో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 184 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడికి ఇది 23వ శతకం.సెలబ్రేషన్స్తో సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్!ఈ నేపథ్యంలో హెల్మెట్ తీసి బ్యాట్ను ఆకాశం వైపు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్న కరుణ్ నాయర్... ఆ తర్వాత బ్యాట్, హెల్మెట్ను కింద పెట్టేసి.. తన చేతి వేళ్లలో తొమ్మిదింటిని ఎత్తి చూపాడు. దేశీ తాజా సీజన్లో తాను తొమ్మిది సెంచరీలు సాధించానని.. ఇకనైనా టీమిండియాలో చోట ఇవ్వండి అన్నట్లుగా సెలక్టర్లకు సందేశం పంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కరుణ్ నాయర్ ఇప్పటి వరకు కేవలం ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో త్రిబుల్ సెంచరీ సాయంతో 374 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో 46 రన్స్ చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. కేరళతో శనివారం నాటి ఆట ముగిసే సరికి కరుణ్ నాయర్ 280 బంతులు ఎదుర్కొని 132 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు.. ఈ మ్యాచ్లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగో రోజు ఆట పూర్తయ్యే సరికి కేరళ కంటే 286 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.చదవండి: 'భారత్దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం 💯 for Karun Nair 👏A splendid knock on the big stage under pressure 💪It's his 9⃣th 1⃣0⃣0⃣ in all formats combined this season, and the celebration says it all👌🙌#RanjiTrophy | @IDFCFIRSTBank | #FinalScorecard ▶️ https://t.co/up5GVaflpp pic.twitter.com/9MvZSHKKMY— BCCI Domestic (@BCCIdomestic) March 1, 2025 -
ట్రక్కులోనే పదేళ్లుగా జీవనం..కారణం తెలిస్తే విస్తుపోతారు..!
ట్రక్లోనే పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. తినడం పడుకోవడం అన్ని అందులోనే. ఇలా ఎందుకు చేస్తున్నాడో వింటే విస్తుపోతారు. బడుగు జీవులు వెతలు ఇలానే ఉంటాయోమో కథ అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే..నాగ్పూర్ బుల్ధానా జిల్లాలోని సింద్ఖేడ్ రాజా తాలూకాలోని జానునా గ్రామానికి చెందిన ఏక్నాథ్ తుకారాం పవార్, అతని భార్య లలితా పవార్ గత పదేళ్లుగా తమ కుటుంబంతో కలిసి ట్రక్కులో ప్రయాణించడం, నివశించడం వంటివి చేస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. అయితే ఒక కుమార్తె మాత్రం గామ్రంలో బంధువుల వద్ద ఉంటున్నట్లు తెలిపాడు పవార్. విశేషం ఏంటంటే అతని భార్య కూడా ట్రక్కు నడపడంలో సహాయపడుతుంది. ఆ దంపతులు పూణే-నాగ్పూర్ మధ్య వస్తువులను రవాణా చేస్తుంది. కానీ ఆ ఆదాయంలో సగం డబ్బులు RTO, ట్రాఫిక్ పోలీసులకు ముట్టచెప్పాల్సిందే. అందువల్లే పవార్ కుటుంబం ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు వాపోయాడు పవార్. తన కుటుంబానికి రోజుకు రెండు పూటలా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నట్లు వెల్లడించాడు పవార్. ఇక తాను ఈ ట్రక్ని 2023లో మహీంద్రా నుంచి రుణంపై కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక ఆ రుణం నిమిత్తం ప్రతి నెల రూ. 68,500 దాక చెల్లించాల్సి ఉందని, అవన్నీ పోగా మిగిలేది ఏం ఉండదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ నేపథ్యంలోనే తాను ఇలా ట్రక్లోనే నివాసం ఏర్పరుచుకున్నట్లు బాధగా చెప్పుకొచ్చాడు. దీనివల్ల కొద్దో గొప్పో డబ్బు ఆదా అవుతుందని చెప్పుకొచ్చాడు పవార్. (చదవండి: ఢిల్లీ మాజీ సీఎం లవ్ స్టోరీ..! కాబోయే అత్తగారి అంగీకారం కోసం..) -
నేమ్ ప్లేట్: ఇంటిపేరు ఆడపిల్ల
మన దేశంలో ఇంటి పేరు, ఇంటి వాకిలి పేరు నాన్నదే ఉంటుంది. అమ్మ పేరు దాదాపుగా ఉండదు. కూతురి పేరు అసలే కనిపించదు. కూతురూ ఇంటి సభ్యురాలే అనే భావన ఆమెకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది. అబ్బాయిల వైఖరిలో మార్పు తెస్తుంది. అందుకే నార్త్లో చాలాచోట్ల కుమార్తె నేమ్ప్లేట్ పెట్టే ఆనవాయితీ మొదలైంది. ఇటీవల నాగ్పూర్ చుట్టుపక్క పల్లెల్లో 2100 ఇళ్లకు అమ్మాయిల పేర్లు సగౌరవంగా అమర్చారు. ఇంకా ఈ ఆనవాయితీ దక్షణాదికి రాలేదు. వివరాలుమన ఇళ్లల్లో ఆడపిల్లలు ఉన్నారో లేరో అన్నట్టుగా ఎందుకు ఉండాలి... వారు తమ అస్తిత్వంతో ఎందుకు ఉండకూడదు.. ఆత్మవిశ్వాసంతో ఎందుకు ఉండకూడదు... గుర్తింపుతో ఎందుకు ఉండకూడదు... ఈ ప్రశ్నలు‘మేజిక్ బస్ ఫౌండేషన్’ బా«ధ్యురాలు ధనశ్రీ బ్రహ్మేకు వచ్చాయి. ఐక్యరాజ్య సమితిలో చాలా కాలం పని చేశాక భారతదేశంలో పారిశ్రామికప్రాంతాల్లోని బస్తీల్లో, వెనుకబడిన పల్లెల్లో లైంగిక వివక్షను రూపుమాపి టీనేజ్ ఆడపిల్లల వికాసానికి కృషి చేయాలని ధనశ్రీ ‘మేజిక్ బస్ ఫౌండేషన్’ను స్థాపించారు. ఆడపిల్ల తను ఎదిగే వయసులో వెనుకబడితే జీవితాంతం వెనుకబడుతుందని ఆమెకు ఆత్మవిశ్వాసం అవసరమని భావించారు. అందుకే ‘నేమ్స్ ఆన్ డోర్స్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఆడపిల్ల గురించి ఆలోచించరుమన దేశంలో ఇంట్లో అమ్మాయి, అబ్బాయి ఉంటేప్రాముఖ్యత అంతా అబ్బాయికే ఉంటుంది. అమ్మాయిని మామూలు బడిలో... అబ్బాయిని మంచి బడిలో వేయడం, సౌకర్యాలు, చదువు కొనసాగింపు... ఇవన్నీ అమ్మాయి పట్ల వివక్షను చూపుతాయి. బడి మాన్పించి పెళ్లి చేసే బెడద ఎలాగూ ఉంటుంది. ఆస్తిలో భాగం గురించిన ఆలోచన ఉండదు. వీటన్నింటి దృష్ట్యా పూర్తిగా ఆత్మవిశ్వాసం కోల్పోవడం తప్ప ఆడపిల్ల వికాసం సంపూర్ణం కాదు. ‘నేనూ ఇంటిలో సమాజంలో భాగమే. నాకంటూ ఒక స్థానం ఉంది. నా బాధ్యతలు నాకున్నా నాకంటూ కొన్ని కలలు ఉంటాయి అని అమ్మాయిలకు అనిపించాలి’ అంటారు ధనశ్రీ. ‘ఇంటికి అమ్మాయి నేమ్ప్లేట్ పెడితే కొద్ది మార్పు సాధ్యమే’ అనుకున్నారామె.ఎందుకు పెట్టాలి?మహారాష్ట్రలోని నాగపూర్ శివార్లలో ఉన్న కలమేశ్వర్ పారిశ్రామిక వాడను ఆనుకుని 108 గ్రామాలు ఉన్నాయి. వాటన్నింటిలో రోజు కూలీలు, కార్మికులే ఉంటారు. వీరికి ఆదాయం చాలా తక్కువ. అందువల్ల ఆర్థిక దృష్టికోణంలో అబ్బాయికి ఇచ్చేప్రాధాన్యం అమ్మాయికి ఇవ్వరు. అందుకే అమ్మాయిలు తెర వెనుకే ఉండిపోతారు. వారికి ఆత్మవిశ్వాసం కల్పించేందుకు 12 నుంచి 16 ఏళ్లు వయసున్న అందరు అమ్మాయిల డేటా తీసుకుని వారి ఇళ్లకు వెళ్లి మీ అమ్మాయి నేమ్ప్లేట్ ఇంటికి పెట్టండి అని ఫౌండేషన్ కార్యకర్తలు అడిగితే అందరి నుంచి ఎదురైన ప్రశ్న ‘ఎందుకు పెట్టాలి’ అని. ఎందుకంటే ఇంటికి నేమ్ప్లేట్ తండ్రిదే ఉంటుంది. లేదంటే కొడుకుది. కూతురిది ఉండదు. ‘అయితే ఇంటికి కూతురు కూడా హక్కుదారని... ఆమె పెరిగే ఇంటికి ఆమె పేరు పెట్టుకునే హక్కు ఉంటుందని కార్యకర్తలు గట్టిగా చెప్తారు’ అని తెలిపారు ధనశ్రీ. అంతేకాదు ఊరి పెద్దలతో, పంచాయితీ పెద్దలతో, స్కూలు టీచర్లతో చెప్పించి ఒప్పించారు.పెనుమార్పుకలమేశ్వర్ చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల్లో 12 నుంచి 16 ఏళ్లు ఉన్న ప్రతి అమ్మాయి ఇంటికి ఆ అమ్మాయి పేరుతో నేమ్ప్లేట్ తయారు చేయించి వాటిని ఇంటి వాకిలికి అమర్చే ఏర్పాటు చేశాక ఆడపిల్లల్లో వచ్చిన ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇదో కొత్త గుర్తింపు గౌరవం అయ్యింది. ‘మా అన్నయ్య నాతో నీ పేరు ఎందుకు పెట్టాలి అనడిగాడు... నీ పేరు నువ్వు పెద్దయ్యాక నీ ఇంటికి ఎలాగూ పెట్టుకుంటావు... ఇప్పుడు నా పేరు పెట్టకపోతే ఎక్కడా ఎప్పుడూ పెట్టరు అని సమాధానం ఇచ్చాను’ అని 9వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి అంది. ఈ 18 పల్లెల్లో 2100 గడపలకు అమ్మాయిల నేమ్ప్లేట్లు ఇవాళ కళకళలాడుతూ కనపడుతున్నాయి. ‘ఈ నేమ్ప్లేట్లు పెట్టాక తల్లిదండ్రులు మమ్మల్ని చదివించాలని, మా మాటకు విలువ ఇవ్వాలని, మాకూ గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు’ అన్నారు అమ్మాయిలంతా. ‘చుట్టుపక్కల పల్లెల వాళ్లు ఈ పల్లెలకు వచ్చి నేమ్ప్లేట్లు చూసి మేమూ పెట్టిస్తాం అని వెళుతున్నారు’ అని వారు తెలిపారు. అదే అమ్మాయి... కాని ఒక చిన్న గుర్తింపుతో అడుగున నిలబడే దశ నుంచి సమాన దశకు వచ్చి నిలబడేలా చేసింది ఈ నేమ్ప్లేట్.దక్షిణాదిలో ఇవాళ్టికీ జరుగుతున్న కొన్ని వివక్షలను గమనిస్తే ‘నేమ్స్ ఆన్ డోర్స్’ ఎక్కువ అవసరం అని భావించడంలో తప్పు లేదు. -
Ranji Trophy: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
నాగ్పూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ కీలక ఘట్టానికి చేరింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్ మ్యాచ్ల్లో మాజీ చాంపియన్ గుజరాత్తో కేరళ జట్టు... విదర్భతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు తలపడుతున్నాయి. గత ఏడాది టైటిల్ కోసం తుదిపోరులో పోటీపడిన విదర్భ, ముంబై ఈసారి సెమీఫైనల్లోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి. రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై మరోసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని చూస్తుంటే... ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్న విదర్భ ముంబైకి చెక్ పెట్టాలని భావిస్తోంది. అజింక్య రహానే, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి టీమిండియా ఆటగాళ్లు ఉన్న ముంబై ఫేవరెట్గా బరిలోకి దిగనుండగా... విదర్భ జట్టు సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్పై ఎక్కువ ఆధార పడుతోంది. ఈ సీజన్లో పరుగుల వరద పారిస్తున్న కరుణ్ నాయర్ సెమీఫైనల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ‘నాన్ ట్రావెలింగ్ రిజర్వ్’గా ఎంపికైన యశస్వి జైస్వాల్ ముంబై జట్టు తరఫున బరిలోకి దిగుతాడనుకుంటే... గాయం కారణంగా అతడు ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. జైస్వాల్ ప్రస్తుతం బీసీసీఐ పర్యవేక్షణలో బెంగళూరులో ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నాడు. జైస్వాల్ అందుబాటులో లేకపోయినా... ముంబై జట్టు బ్యాటింగ్ విభాగానికి వచి్చన ఇబ్బందేమీ లేదు. ఆయుశ్ మాత్రే, ఆకాశ్ ఆనంద్, సిద్ధేశ్ లాడ్, రహానే, సూర్యకుమార్, దూబే, షమ్స్ ములానీ, శార్దుల్, తనుశ్ రూపంలో ముంబై జట్టుకు తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది. తాజా సీజన్లో అత్యధిక మ్యాచ్ల్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లే ముంబై జట్టును ఆదుకున్నారు. హరియాణాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ ఎనిమిదో వికెట్కు 183 పరుగులు జోడించి పటిష్ట స్థితికి చేర్చారు. ఈ సీజన్లో వీరిద్దరితో పాటు శార్దుల్ బ్యాటింగ్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ నేపథ్యంలో టాపార్డర్ కూడా రాణిస్తే ముంబైకి తిరుగుండదు. జోరు మీదున్న కరుణ్ నాయర్.. ఫార్మాట్తో సంబంధం లేకుండా మైదానంలో అడుగు పెడితే సెంచరీ చేయడమే తన కర్తవ్యం అన్నట్లు విదర్భ ఆటగాడు కరుణ్ నాయర్ దూసుకెళ్తున్నాడు. విజయ్ హజారే టోర్నీలో వరుస సెంచరీలతో హోరెత్తించిన ఈ సీనియర్ బ్యాటర్ రంజీ క్వార్టర్ ఫైనల్లో తమిళనాడుపై కూడా భారీ శతకం నమోదు చేశాడు. నాయర్ మినహా విదర్భ జట్టులో స్టార్లు లేకపోయినా... సమష్టి ప్రదర్శనతో ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తోంది. అథర్వ తైడె, ధ్రువ్ షోరే, ఆదిత్య ఠాక్రె, యశ్ రాథోడ్, కెపె్టన్ అక్షయ్ వాడ్కర్తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఈ సీజన్లో 728 పరుగులు చేసిన యశ్ రాథోడ్ విదర్భ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. కరుణ్ నాయర్ (591), అక్షయ్ వాడ్కర్ (588) కూడా భారీగా పరుగులు సాధించి మంచి ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో హర్ష్ దూబే, యశ్ ఠాకూర్, ఆదిత్య ఠాక్రె, నచికేత్ భట్ కీలకం కానున్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్ష్ దూబే తాజా సీజన్లో 59 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై టాపార్డర్ నిలకడలేమిని సొమ్ము చేసుకుంటూ డిఫెండింగ్ చాంపియన్పై పైచేయి సాధించాలని విదర్భ యోచిస్తోంది.కేరళ నిరీక్షణ ముగిసేనా!అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానున్న మరో సెమీఫైనల్లో గుజరాత్తో కేరళ తలపడనుంది. జమ్మూ కశీ్మర్తో క్వార్టర్ ఫైనల్లో ఒక్క పరుగు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ద్వారా కేరళ జట్టు ముందంజ వేయగా... సౌరాష్ట్రతో ఏకపక్షంగా సాగిన క్వార్టర్స్ మ్యాచ్లో గెలిచి గుజరాత్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 2016–17లో చాంపియన్గా నిలిచిన గుజరాత్ జట్టు ఆ తర్వాత 2019–20 సీజన్లో మాత్రమే సెమీస్కు చేరింది. మరోవైపు కేరళ జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రంజీ ట్రోఫీలో ఫైనల్కు చేరుకోలేకపోయింది. గుజరాత్ జట్టు తరఫున కెపె్టన్ చింతన్ గాజా, ప్రియాంక్ పంచాల్, ఆర్య దేశాయ్, సిద్ధార్థ్ దేశాయ్, మనన్ హింగ్రాజియా, జైమీత్ పటేల్, ఉర్విల్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా మిడిలార్డర్లో జైమీత్, ఉర్విల్, మనన్ కీలక ఇన్నింగ్స్లతో గుజరాత్ జట్టు సునాయాసంగా సెమీస్కు చేరింది. ఈ సీజన్లో 582 పరుగులు చేసిన జైమీత్ గుజరాత్ తరఫున ‘టాప్’ స్కారర్గా కొనసాగుతున్నాడు. మనన్ 570 పరుగులు చేశాడు. బౌలింగ్లో అర్జాన్ నాగ్వస్వల్లా, చింతన్ గాజా, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు. మరోవైపు సచిన్ బేబీ సారథ్యంలోని కేరళ జట్టు... క్వార్టర్స్లో జమ్మూకశ్మీర్పై చూపిన తెగింపే సెమీస్లోనూ కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్లో సల్మాన్ నిజార్, మొహమ్మద్ అజహరుద్దీన్, జలజ్ సక్సేనా, సచిన్ బేబీ, రోహన్ కున్నుమ్మల్ కీలకం కానున్నారు. క్వార్టర్స్లో నిజార్, అజహరుద్దీన్ పోరాటం వల్లే కేరళ జట్టు సెమీస్కు చేరగలిగింది. ని«దీశ్, బాసిల్ థంపి, జలజ్, ఆదిత్య, అక్షయ్ బౌలింగ్ భారం మోయనున్నారు.48 తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీలో ముంబై జట్టు ఇప్పటి వరకు 48 సార్లు ఫైనల్లోకి ప్రవేశించింది. ఇందులో 42 సార్లు విజేతగా నిలువగా... 6 సార్లు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. -
మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి
ముంబై: అన్ని రకాల వివాదాలను కోర్టురూమ్ల దాకా తీసుకురావాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. కొన్ని వివాదాలు కోర్టురూమ్ల్లో విచారణకు సరిపడవని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తులతో చాలాసార్లు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో సృజనాత్మక పరిష్కారాలు లభిస్తాయని, మనుషుల మధ్య బంధాలు బలపడతాయని వెల్లడించారు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం కూడా ఒక చక్కటి మార్గమని పేర్కొన్నారు. శనివారం నాగపూర్లో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ(ఎంఎన్ఎల్యూ) మూడో స్నాతకోత్సవంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడారు. ప్రతి కేసునూ చట్టపరమైన అంశం అనే కోణంలో చూడొద్దని, వాటిని మానవీయ కథనాలుగా పరిగణించాలని చెప్పారు. మన దేశంలో కక్షిదారులకు న్యాయ సహాయం అందించే వ్యవస్థ చాలా బలంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇలాంటిది బహుశా ఎక్కడా లేకపోవచ్చని వ్యాఖ్యానించారు. మన దగ్గర కక్షిదారులందరికీ ఏదోరకంగా న్యాయ సహాయం లభిస్తోందన్నారు. ఏవైనా వివాదాలు తలెత్తగానే కోర్టుల్లో వ్యాజ్యాలు, విచారణల వరకూ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం అని వివరించారు. అక్కడ కొన్నిసార్లు అవును లేదా కాదు అనే మాటలతోనే వివాదాలు పరిష్కారమవుతుంటాయని గుర్తుచేశారు. మధ్యవర్తిత్వం అనే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా మనుషుల మధ్య, వ్యాపార సంస్థల మధ్య సంబంధాలు బలపడతాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉద్ఘాటించారు. -
ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం
భారత టెస్టు, వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు కోపం వచ్చింది. తన ఫామ్ గురించి ప్రశ్నించిన విలేకర్ల తీరుపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటి పనికిరాని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని అతడు అసహనానికి లోనయ్యాడు . అదే విధంగా.. తన రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలపై కూడా రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు.టెస్టుల్లో విఫలంగత కొంతకాలంగా టెస్టుల్లో రోహిత్ శర్మ విఫలమవుతున్న విషయం తెలిసిందే. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్లో.. అనంతరం ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి వైఫల్యాల పరంపర కొనసాగింది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో ఈ ముంబైకర్ ఐదు ఇన్నింగ్స్ ఆడి కేవలం 31 పరుగులే చేశాడు.ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తగా ఇటీవల ముంబై ఓపెనర్గా రంజీ ట్రోఫీ(Ranji Trophy) బరిలో దిగాడు రోహిత్ శర్మ. అయితే, అక్కడా ‘హిట్మ్యాన్’కు చేదు అనుభవమే ఎదురైంది. జమ్మూ కశ్మీర్తో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో మూడు, రెండో ఇన్నింగ్స్లో 28 పరుగులకే అతడు పరిమితమయ్యాడు.అసలు ఇదెలాంటి ప్రశ్న?ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇంగ్లండ్తో వన్డే సిరీస్(India vs England)కు సిద్ధమయ్యాడు. ఇరుజట్ల మధ్య గురువారం నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకు తన పేలవ ఫామ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు ఇదెలాంటి ప్రశ్న?.. ఆ ఫార్మాట్(టెస్టు) వేరు.. ఇది వేరు.దానికీ.. దీనికీ పోలిక ఎందుకు తెస్తున్నారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ‘‘క్రికెటర్లుగా మా కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజం. నా ప్రయాణంలో ఇలాంటివెన్నో చూశాను. నాకు ఇదేమీ కొత్త కాదు. ప్రతిరోజూ సరికొత్తదే. అలాగే ఆటగాడిగా నాకు ప్రతి సిరీస్ ఒక తాజా ఆరంభాన్ని ఇస్తుంది’’ అని రోహిత్ శర్మ సానుకూల దృక్పథంతో మాట్లాడాడు.ఇలాంటి సమయంలో ఇక చాంపియన్స్ ట్రోఫీ తర్వాత తాను రిటైర్ కాబోతున్నట్లు వస్తున్న వార్తలపై కూడా రోహిత్ శర్మ ఈ సందర్భంగా స్పందించాడు. ‘‘ఇంగ్లండ్తో మూడు వన్డేలు.. ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఇలాంటి సమయంలో నా భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడటం సరైందేనా?నా గురించి ఎన్నో వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటన్నింటికి సమాధానం ఇచ్చేందుకు నేను ఇక్కడ కూర్చోలేదు. నాకు ప్రస్తుతం ఈ మూడు వన్డేలు.. అనంతరం చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ మాత్రమే ముఖ్యమే.ప్రస్తుతం నా దృష్టి మొత్తం ఈ మ్యాచ్ల మీదే ఉంది. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’’ అని రోహిత్ శర్మ ఘాటుగా సమాధానమిచ్చాడు. కాగా రోహిత్ చివరగా శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలో దిగాడు. గతేడాది లంకతో మూడు వన్డే మ్యాచ్లు ఆడి వరుసగా 58, 64, 35 పరుగులు చేశాడు.చదవండి: Ind vs Eng: తొలి వన్డేకు ఇంగ్లండ్ తుదిజట్టు ప్రకటన.. వెటరన్ ప్లేయర్ రీఎంట్రీ📍 NagpurGearing up for the #INDvENG ODI series opener....in Ro-Ko style 😎#TeamIndia | @IDFCFIRSTBank | @ImRo45 | @imVkohli pic.twitter.com/gR2An4tTk0— BCCI (@BCCI) February 5, 2025 -
నిజమైన ప్రేమ అంటూ ఫొటోలు షేర్ చేసిన చహల్ భార్య.. ఫొటోలు వైరల్
-
రూ. 25 లక్షల చైనీస్ మాంజా స్వాధీనం.. బుల్డోజర్తో ధ్వంసం
నేడు దేశవ్యాప్తంగా సంక్రాంతి సందడి నెలకొంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ రీతుల్లో సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వీటిలో గంగా స్నానం, గాలిపటాలు ఎగురవేడం లాంటివి ఉన్నాయి. మరోవైపు యూపీలోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది.మకర సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలాచోట్ల గాలిపటాలను ఎగురవేస్తారు. అయితే ఈ గాలిపటాలను ఎగురవేసేందుకు వినియోగించే చైనా మాంజా కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు పోయిన సందర్బాలు కూడా ఉన్నాయి.మకర సంక్రాంతి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో భారీఎత్తున గాలిపటాలను ఎగురవేసే సంప్రదాయం ఉంది. గాలిపటాలు ఎగురవేసే వారు నైలాన్ దారం లేదా చైనా మాంజాను ఉపయోగిస్తుంటారు. వీటి కారణంగా ప్రాణహాని జరుగుతున్న నేపధ్యంలో నాగ్పూర్ పోలీసులు చైనీస్ థ్రెడ్ వినియోగం, విక్రయాలపై ఓ కన్నేసి ఉంచారు. లక్షల రూపాయల విలువైన చైనీస్ మంజాను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల సాయంతో.. గాలిపటాలు ఎగురవేసేవారిపై నాగపూర్ పోలీసులు నిఘా సారించారు. అదేవిధంగా నగరంలోని ప్రతీవీధివీధినా తిరుగుతూ చైనీస్ దారాన్ని ఉపయోగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.తాజాగా నాగ్పూర్ పోలీసులు రూ.25 లక్షల విలువైన చైనీస్ దారాన్ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేశారు. ఇండోర్ మైదానంలో 2,599 బండిళ్లు కలిగిన దాదాపు రూ.25 లక్షల విలువైన నిషేధిత నైలాన్ మాంజాను రోడ్ రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఆ ప్రాంత పౌరుల సమక్షంలో పోలీసులు ఈ విధమైన చర్యలు చేపట్టారు. చైనామాంజా వినియోగిస్తూ ఎవరైనా పట్టుబడితే వారిని నేరుగా కస్టడీకి పంపుతామని పోలీసులు హెచ్చరించారు. చైనీస్ థ్రెడ్ కారణంగా బైక్ రైడర్లు ప్రమాదాల బారిన పడుతున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: పతంగులకు ఎంత గాలి అవసరం? ఎందుకు తెగిపోతాయి? -
బర్డ్ ఫ్లూతో పులులు, చిరుత మృతి
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. -
‘ఈవీఎంలను ఊరేగించి గుడి కట్టండి’
ముంబై: ఈవీఎంల చుట్టూ వివాదాలు నడుస్తున్న వేళ.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలని ఎంవీఏ కూటమి భావిస్తోంది. ఈలోపు.. మహాయుతి ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతోంది. సీఎం ఎన్నిక జాప్యంపై ఎద్దేవా చేసిన థాక్రే సేన.. ఇప్పుడు ఈవీఎంలకు గుడి కట్టండంటూ అధికార కూటమికి సలహా ఇస్తోంది.ముంబైలో కాకుండా నాగ్పూర్లో మంత్రి వర్గ విస్తరణకు మహాయుతి ఏర్పాట్లు చేసింది. ఈ పరిణామంపై థాక్రే శివసేన నేత సంజయ్రౌత్ స్పందించారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం ముందు ఈవీఎంలకు గుడి కట్టుకోండంటూ సలహా ఇచ్చారాయన.‘‘సీఎం ఉరేగింపు కంటే ముందు.. వాళ్లు ఈవీఎంలను ఊరేగిస్తే బాగుంటుంది. ఆపై నాగ్పూర్లోని ఆరెస్సెస్ కార్యాలయం ఎదుట ఈవీఎంలకు వాళ్లు గుడి కట్టుకుంటే బాగుంటుంది. ఈ మేరకు కేబినెట్ తొలిభేటీలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ సెటైర్లు వేశారు. #WATCH | Mumbai: Shiv Sena (UBT) MP Sanjay Raut says, "...First of all, the procession of the Chief Minister will be taken out there (in Nagpur). I think that before taking out the procession of the CM, they should take out a procession of EVMs and in the first cabinet they… pic.twitter.com/0ue8Labe5v— ANI (@ANI) December 14, 2024 ‘‘ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర నెలకావొస్తోంది. ఇప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొలువు దీరలేకపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది. అయినా కొత్త ప్రభుత్వానికి పట్టనట్లు ఉంది. కనీసం సీఎం అయినా దీనికి సమాధానం ఇస్తారేమో’’ అని రౌత్ అన్నారు.1991 తర్వాత నాగ్పూర్లో మహా కేబినెట్ విస్తరణ జరుగుతుండడం ఇదే. ఆ టైంలో రాజకీయ సంక్షోభం ఏర్పడ్డ తర్వాత.. డిసెంబర్లో ఛగన్ భుజ్బల్, మరికొందరితో గవర్నర్ సుబ్రహ్మణ్యం మంత్రులుగా ప్రమాణం చేయించారు.ఇదీ చదవండి: బ్యాలెట్ కోసం చైతన్యం.. వారిని వణికిస్తోందిగా! -
సీఎంగా హ్యాట్రిక్ కొడుతున్న బ్యాక్ బెంచర్
ముంబై: ఏబీవీపీ కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం ఆరంభించిన దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పట్ల విధేయత, అంకితభావం, పట్టుదలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన 1970 జూలై 22న మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించారు. తండ్రి దివంగత గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. దేవేంద్ర 1989లో ఏబీవీపీలో చేరారు. 22 ఏళ్ల వయసులో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్గా గెలిచారు. 1997లో 27 ఏళ్ల పిన్న వయసులోనే నాగపూర్ మేయర్గా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నాగపూర్ సౌత్వెస్ట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం విశేషం. మహారాష్ట్రలో మనోహర్ జోషీ తర్వాత రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఫడ్నవీస్ నిరుత్సాహపడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని విజయపథంలో నడిపించారు. సున్నిత మనస్కుడు ఫడ్నవీస్ పాఠశాలలో చదువుకునేటప్పుడు బ్యాక్ బెంచర్ అని ఆయన గురువు సావిత్రి సుబ్రమణియం చెప్పారు. ఫడ్నవీస్ ఎనిమిది నుంచి పదో తరగతి దాకా సరస్వతి విద్యాలయలో చదువుకున్నారు. తన విద్యార్థి అయిన ఫడ్నవీస్ చిన్నప్పుడు సున్నిత మనస్కుడిగా ఉండేవాడని, అందరినీ చక్కగా గౌరవించేవాడని, ఇతరులకు చేతనైన సహాయం చేసేవాడని, చాలా మర్యాదస్తుడని సావిత్రి సుబ్రమణియం తెలిపారు. చదువులో సగటు విద్యారి్థగానే ఉండేవాడని అన్నారు. అసాధారణమైన విద్యార్థి కానప్పటికీ బాగానే చదివేవాడనని వెల్లడించారు. బాగా పొడగరి కావడంతో తరగతిలో చివర వరుసలో కూర్చొనేవాడని పేర్కొన్నారు. -
వీధి వ్యాపారి కాస్త స్టార్ చాయ్వాలాగా మారి ఏకంగా ..!
ఓ సామాన్య వీధి టీ వ్యాపారి తన అసాధారణ టాలెంట్తో ఒక్కసారిగా స్టార్ చాయవాలాగా మారి శెభాష్ అనిపించుకున్నాడు. రోజు చూసే చిన్న వ్యాపారమైన కాస్త విభిన్నంగా చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని చాటి చెప్పాడు. ఒకప్పుడు వీధుల్లో ఏడు రూపాయల టీతో మొదలైన ప్రస్థానం నేడు ఏకంగా రూ. 5 లక్షలు వసూలు చేసే స్థాయికి చేరుకుందంటే..అది ఊహకే అందని విజయంగా చెప్పొచ్చు. ఇంతకీ ఎవరా ఆ స్టార్ చాయ్వాలా అంటే..?అతడే డాలీ చాయ్వాలాగా పేరుగాంచిన సునీల్ పాటిల్. నాగ్పూర్ వీధుల్లో రూ. 7ల కప్పు చాయ్తో అతడి టీ వ్యాపారం మొదలయ్యింది. అయితే అందరూ చాయ్వాళ్లలా కాకుండా కాస్త విభిన్నంగా కస్టమర్లను ఆకర్షించేలా టీని తయారు చేయడం, సర్వ్ చేయడం అతడి స్పెషాల్టీ. వ్యాపారానికి కీలకమైన సూత్రం కూడా ఇదే. దాన్నే మనోడు ఎలాంటి బిజినెస్ స్కూల్లో చదవకుండానే జీవన పోరాటంతో తెలుసుకున్నాడు. దాన్ని అప్లై చేసి తన టీ షాపు వద్దకే జనాలు వచ్చేలా చేసుకున్నాడు. దీంతోపాటు తన విలక్షణమైన టీ సర్వీంగ్కి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఫిబ్రవరి 2024లో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ప్రసిద్ధ చాయ్ సర్వీంగ్ కోసం వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా డాలీ ఓవర్నైట్ స్టార్గా మారిపోయాడు. ఆ ఒక్క వీడియో అతడి దశనే మార్చేసింది. ఏకంగా దుబాయ్లో కార్యాలయాన్ని తెరిచే స్థాయికి చేరుకున్నాడు. అతడు సర్వ్ చేసే విధానమే కాదు వేషధారణ కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది. అత్యంత స్టైలిష్గా..ఫంకీ గోల్డెన్ గాగుల్స్, గోల్డెన్ చైన్ తోపాటు వెరైటీ హెయిర్ స్టైల్తో ఫ్యాషన్ లుక్లో ఉంటాడు. ఒక రకంగా వ్యాపారాన్ని విజయవంతం చేసుకునేలా హంగు ఆర్భాటాలతో స్టైలిష్గా సర్వ్ చేస్తాడు. అదే అతడిని ఫేమస్ అయ్యేలా చేసింది. ఇంత స్టార్డమ్ వచ్చిన తన మూలాలను మరిచిపోకుండా తన టీ స్టాల్ సామాన్యుడి వలే పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం అతడు దుబాయ్ నుంచి కువైట్ల వరకు పలు ఈవెంట్లలో డాలీ టీ సర్వీస్ కోసం బుక్ చేసుకుంటారట. అందుకు చాయ్వాలా ఏకంగా రూ. 5 లక్షలు దాక వసూలు చేస్తున్నాడు. కానీ జనాలు కూడా లెక్క చేయకుండా అతడి సేవల కోసం ఎంత డభైన వెచ్చించడం విశేషం. ఇంత క్రేజ్ పెరిగినా డాలీ తన దుకాణం వద్ద మాత్రం టీని ఇంకా రూ. 7లకే కస్టమర్లకు అందిస్తుండటం గ్రేట్. View this post on Instagram A post shared by Dolly Ki Tapri Nagpur (@dolly_ki_tapri_nagpur) (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ! యుద్ధం కారణంగా..) -
Peruri Jyoti Varma: పవర్ ఫుల్
విరామం అంటే వెనక్కి తగ్గడం కాదు, పరాజయం అంతకంటే కాదు. విత్తనం నాటిన రోజు నుంచి అది పచ్చగా మొలకెత్తడానికి మధ్య కూడా విరామం ఉంటుంది. ఒకప్పుడు హ్యాండ్బాల్ గేమ్ నేషనల్ ప్లేయర్ అయిన జ్యోతి పెళ్లి తరువాత కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. విరామం తర్వాత మళ్లీ ఆటల ప్రపంచంలోకి అడుగుపెట్టిన పేరూరి జ్యోతి పవర్ లిఫ్టింగ్లో తక్కువ సమయలోనే సాధన చేసి గోవాలో జరిగిన బెంచ్ప్రెస్ నేషనల్ చాంపియన్షిప్లో 45 కిలోల బరువు ఎత్తి కాంస్యం సాధించింది. నిజానికి అది పతకం కాదు... అపూర్వమైన ఆత్మవిశ్వాసం...జ్యోతి స్వస్థలం మహారాష్ట్రలోని నాగ్పూర్. పెళ్లికిముందు హ్యాండ్బాల్ గేమ్లో నేషనల్ ప్లేయర్. 1994లో ‘విజ్ఞాన్ యూనివర్శిటీ’లో ప్రొఫెసర్గా చేస్తున్న డాక్టర్ పిఎల్ఎన్ వర్మతో వివాహం జరగడంతో గుంటూరుకు వచ్చింది. కుటుంబ బాధ్యతల వల్ల ఆటలకు దూరంగా ఉండక తప్పలేదు. అయితే వ్యాయామాలకు, యోగ సాధనకు విరామం ఇవ్వలేదు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, మగ్గం పని... వంటి అభిరుచుల పట్ల మక్కువను విడవలేదు. మనం అడుగుపెట్టే స్థలాలు కూడా భవిష్యత్ను నిర్ణయిస్తాయి అంటారు. జ్యోతి విషయంలో అలాగే జరిగింది.ఏడాది క్రితం స్థానిక ‘ఇన్ఫినిటీ జిమ్’లో చేరి రకరకాల వ్యాయామాలు చేసేది. ఆమె ఉత్సాహం, పట్టుదల చూసి కోచ్ రమేష్ శర్మ ‘మీరు పవర్ లిఫ్టింగ్లో అద్భుతాలు సాధించగలరు’ అన్నారు. ఆమె నవ్వుతూ ఊరుకుంటే ఆ కథ అక్కడితో ముగిసేది. కోచ్ మాటలను ఆమె సీరియస్గా తీసుకుంది. ‘ఒకసారి ఎందుకు ప్రయత్నించకూడదు’ అనుకున్నది. అలా అనుకోవడంలో పతకాలు సాధించాలనే ఆశయం కంటే... ఆటల పట్ల చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టమే కారణం. ఆరు నెలల క్రితం పవర్ లిఫ్టింగ్లో సాధన మొదలుపెట్టింది. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది. ‘ఇంకా నువ్వు కాలేజీ స్టూడెంటే అని అనుకుంటున్నావా’ లాంటి వెటకారాలు వినిపించాయి. అయితే ఈ వెటకారాలు, మిరియాలు ఆమె సాధన ముందు నిలవలేకపోయాయి. మరింత దీక్షతో సాధన చేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్లో కొద్దితేడాతో పతకం మిస్ అయింది. ‘పతకంతో తిరిగి వస్తావనుకున్నాం’ అన్నారు మిత్రులు. ‘వంద పతకాలతో తిరిగి వచ్చాను’ అన్నది జ్యోతి నవ్వుతూ. ఆమె చెప్పిన వంద పతకాలు... ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసంతోనే గోవాలో జరిగిన బెంచ్ప్రెస్ నేషనల్స్ చాంపియన్ షిప్లో రికార్డు స్థాయిలో 45 కేజీలు బరువు ఎత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. నిజానికి ఇదిప్రారంభం మాత్రమే. ఆమె ఉత్సాహం, పట్టుదల చూస్తుంటే మరిన్ని విజయాలు ఆమె ఖాతాలో పడతాయని నిశ్చయంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే...ఏదైనా సాధించాలంటే మన విలువ మనం ముందుగా గుర్తించాలి. నిత్య వ్యాయామంతోనే ఆరోగ్యం సాధ్యం అవుతుంది. నాకు ఆరోగ్య సమస్యలున్నాయి. హైపో థైరాయిడ్, స్పాండిలైటిస్ నన్ను ఇబ్బంది పెట్టినా వాటిని అధిగమించి ముందుకు వెళ్తున్నాను. రోజూ యోగ, జిమ్, మెడిటేషన్, గార్డెనింగ్ చేస్తాను.– పేరూరి జ్యోతి– దాళా రమేష్బాబు, సాక్షి, గుంటూరుఫొటోలు: మురమళ్ల శ్రీనివాసరావు. -
బాంబు బెదిరింపుల వెనక నాగ్పూర్కు చెందిన పుస్తక రచయిత..
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలు ఎక్కువగా వస్తుండటంతో పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది.ఈనేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్రలోని నాగ్పూర్ పోలీసులు గుర్తించారు.ఈ బూటకపు బెదిరింపుల వెనక గోండియాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. అయితే నిందితుడు గతంలో ఉగ్రవాదంపై ఓ పుస్తకాన్ని రచించడం గమనార్హం. నిందితుడిని జగదీష్ యూకీగా గుర్తించామని, ఓ కేసులో 2021లో అరెస్ట్ కూడా అయినట్లు నాగ్పూర్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని. అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు.జగదీశ్ యూకీ అనే వ్యక్తి ఇ-మెయిల్ ద్వారా పలు ఎయిర్లైన్స్లకు నకిలీ బాంబు బెదిరింపులు పంపించాడు. దీని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం కార్యాలయాలతోపాటు పలు ఎయిర్లైన్స్ కార్యాలయాలకు, డీజీపీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)తో సహా వివిధ ప్రభుత్వ సంస్థలకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు డీసీపీ శ్వేతా ఖేద్కర్ వెల్లడించారు. సోమవారం నాగ్పూర్ పోలీసులు ముంబైలోని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు సైతం బెదిరింపులు రావడంతో ఆయన నివాసం వెలుపల భద్రతను పెంచారు. తాను తెలుసుకున్న రహస్య ఉగ్రవాద కోడ్పై సమాచారం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలుపుతానంటూ నిందితుడు బెదిరింపు మెయిల్లో పేర్కొన్నాడు. ఉగ్రవాద బెదిరింపులపై తనకున్న అవగాహన గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాలని కూడా అభ్యర్థించారు. -
మనుమలకు టపాసులు కొనిచ్చిన కేంద్ర మంత్రి గడ్కరీ
నాగ్పూర్: దేశంలో దీపావళి సందడి నెలకొంది. మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీపావళి షాపింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది.ఈ వీడియోలో నితిన్ గడ్కరి తన మనుమడు, మనుమరాలితో దీపావళి షాపింగ్ చేయడాన్ని చూడవచ్చు. గడ్కరీ ఒక బాణసంచా దుకాణంలో తన మనుమలకు బాణసంచా కొనిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను నితిన్ గడ్కరీ కార్యాలయం విడుదల చేసింది.ఇదిలావుండగా పాన్ మసాలా, గుట్కా తిని రోడ్డుపై ఉమ్మివేసే వారికి బుద్ధి చెప్పేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక వినూత్న ఆలోచన వెలిబుచ్చారు. అటువంటివారి ఫొటోలు తీసి పత్రికల్లో ప్రచురించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. దేశ ప్రజలు రోడ్లు మురికిగా మారకుండా కాపాడుకోవాలని మంత్రి సూచించారు.ఇది కూడా చదవండి: ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు -
నాగ్పూర్లో పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్ప్రెస్
ముంబై: మహారాష్ట్రలోని నాగ్పూర్లో లోకమాన్య తిలక్-షాలిమార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సుభాష్ చంద్రబోస్ రైల్వేషన్ సమీపంలో మూడు కోచ్లు పట్టాలు తప్పాయి. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బయలుదేరిన ఈ రైలు షాలిమార్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.రైలులోని S1, S2 కోచ్లు, గూడ్స్ కోచ్ పట్టాలు తప్పాయి. అయితే ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
సికింద్రాబాద్-నాగ్పూర్ వందేభారత్కు బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్-నాగ్పూర్ వందేభారత్ రైలుకు బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వందేభారత్లో బాంబు ఉందని ఓ ఆగంతుకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే స్పందించిన పోలీసులు బాంబు, డాగ్ స్క్వాడ్తో తనిఖీ చేశారు. అయితే రైలులో బాంబు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు ఉందని సమాచారంచ్చినక్తిని లింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి మధుసూదన్గా గుర్తించారు, దీంతో అతడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.కాగా సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఇటీవల వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ట్రైన్ ప్రారంభించగా.. సెప్టెంబర్ 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించడానికి ఈ కొత్త రైలు ఏర్పాటు చేశారు.అయితే ఈ ట్రైన్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి 80 శాతం ఖాళీతో నడుస్తోంది. ట్రైన్ మొత్తం సామర్థ్యం 1,440 కాగా.. దాదాపు 1200 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ ట్రైన్ బోగీల సంఖ్యను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 బోగీలతో నడుస్తుండగా.. 10 బోగీలకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. -
తొలి నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రారంభం
న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటి నమో భారత్ ర్యాపిడ్ రైలును ప్రధాని మోదీ సోమవారం(సెప్టెంబర్16) ప్రారంభించారు. భుజ్-అహ్మదాబాద్ మధ్య నడిచే వందేభారత్ మెట్రో రైలు సర్వీసుల పేరును నమోభారత్ ర్యాపిడ్ రైలుగా మార్చారు. ఈ రైలుతో మరిన్ని వందేభారత్ రైళ్లను మోదీ వర్చువల్గా ప్రారంభించారు.దుర్గ్-విశాఖపట్నం,వందేభారత్,నాగ్పుర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను కూడా మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-నాగ్పుర్ వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. వందేభారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు తన పట్ల ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయన్నారు. అయితే, ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి.. ఈ టర్ములోనే ఒకే దేశం-ఒకే ఎన్నికలు -
తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే వ్యవస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లు అనేక రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైలులో ఛార్జీలు కొంచెం ఎక్కువైనా సరే, అత్యాధునిక టెక్నాలజీతోపాటు అనేక సౌకర్యాలు ఉండటంతో ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని రూట్లలో మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్, చత్తీస్ఘడ్లోని దుర్గ్ జంక్షన్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ రైళ్ల అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.చదవండి: తొలిసారి పరుగులు పెట్టనున్న వందే భారత్ మెట్రో రైలు -
సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే
భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపధ్యంలో రైల్వేశాఖ కొత్తగా మరికొన్ని రూట్లలో వందే భారత్ రైళ్లనుప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు వందే భారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది.సికింద్రాబాద్నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్కు కొత్తగా వందే భారత్ రైలు నడవనుంది. ఈ రెండు నగరాల మధ్య 578 కి.మీ దూరం ఉండగా.. కేవలం 7 గంటల 20 నిమిషాల్లోనే గమ్య స్థానాలకు చేర్చనుంది. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుంచి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.ఇక ఈ రైలు సేవాగ్రామ్, చంద్రాపూర్, రామగుండం, కాజీపే స్టేషన్లలో మాత్రమే ఆగనుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే నాగ్పూర నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా.. ఇప్పుడు నాగ్పూర్- సికింద్రాబాద్ రైలుతోపాటు నాగ్పూర్- పుణె రైలు కూడా సెప్టెంబర్ 15న ప్రారంభం కానుంది.#Secunderabad - #Nagpur VandeBharat Express will be introduced very soonTentative launch date: 📅 15th September pic.twitter.com/K43a6Eu1an— TechChaitu (@techchaituu) September 9, 2024హైదరాబాద్ నగరం నుంచి ప్రస్తుతం ఏపీలోని తిరుపతి, విశాఖ, కర్ణాటకలోని యశ్వంత్పుర (బెంగళూరు) నగరాలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖ, తిరుపతి నగరాలకు రైల్లు నడుస్తుండగా.. కాచిగూడ స్టేషన్ నుంచి యశ్వంత్పురకు ట్రైన్ పరుగులు పెడుతోంది. దీంతో నాగపూర్ ప్రాంతానికి మరో ట్రైన్ ప్రతిపాదించారు. -
‘కోల్కతాలో జరిగినట్లు...’ బాలికలను బెదిరించిన ఆటో డ్రైవర్
దేశంలో తరచూ అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భాల్లో జనం ఆగ్రహం వ్యక్తంచేస్తూ, నిందితులపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఒక ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్కూల్కు వెళుతున్న ఇద్దరు బాలికలను ఓ ఆటో డ్రైవర్ బెదిరించాడు. పైగా కోల్కతాలో ట్రైనీ మహిళా డాక్టర్కు జరిగినట్టే మీపైన కూడా దాడి చేస్తానని నిందితుడు బెదిరించాడని ఆ బాలికలు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్ను చావబాదడాన్ని వీడియోలో చూడవచ్చు. మరోవైపు కొందరు ఆ బాధిత బాలికలకు ధైర్యం చెప్పడం కూడా కనిపిస్తుంది. తరువాత బాధితురాలు ఆ నిందితుడిని చెప్పుతో కొట్టింది.దీనికిముందు ఆటో డ్రైవర్ ఆ బాలికలను వెనుక సీట్లో కూర్చోవాలని, బిగ్గరగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. ఈ నేపధ్యంలో ఆ బాలికలకు డ్రైవర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సమయంలోనే ఆ డ్రైవర్ కోల్కతా ఉదంతాన్ని గుర్తుచేస్తూ వారిని బెదిరించాడు. దీంతో ఆ బాలికలు ఆటోను ఆపాలని కేకలు పెట్టారు. దీనిని విన్న స్థానికులు ఆ ఆటో డ్రైవర్ను ఆటోలో నుంచి బయటకు లాగి చావబాదారు. "I will do the same to you as happened in Kolkata!" An auto driver threatened a girl. Public caught him and serviced him properly before handing him over to police. pic.twitter.com/BfNvNakZj6— Megh Updates 🚨™ (@MeghUpdates) August 23, 2024 -
అంబానీ ‘పవర్’ను కొంటున్న అదానీ పవర్!
దేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్తో సహా అనేక రంగాలలో ఉన్న అదానీ గ్రూప్కు నాయకత్వం వహిస్తున్న ఆయన విద్యుత్ రంగంలో మరో ముందడుగు వేసే యోచనలో ఉన్నారు.రూ. 2.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కలిగిన అతని అదానీ పవర్.. నాగ్పూర్లో ఉన్న బుటిబోరి థర్మల్ పవర్ ప్లాంట్ను కొనుగోలు చేయాలని యోచిస్తోందని ‘మింట్’ నివేదిక పేర్కొంది. ఈ పవర్ ప్రాజెక్ట్కు రుణదాతగా ఉన్న సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీతో అదానీ గ్రూప్ మాట్లాడుతోందని, ఈ డీల్ విలువ రూ.2,400 కోట్ల నుంచి రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది.ఈ పవర్ ప్లాంట్ ఒకప్పుడు అనిల్ అంబానీకి చెందిన దివాలా తీసిన రిలయన్స్ పవర్ ఆధీనంలో ఉండేది. ఇది ఇప్పుడు రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ అయిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ కింద ఉంది. ఈ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 600 మెగావాట్లు. ఈ వార్తల తర్వాత సోమవారం (ఆగస్టు 19) రిలయన్స్ పవర్ షేర్లు 5 శాతం ఎగువ సర్క్యూట్ను తాకాయి. ఎన్ఎస్ఈలో ఈ షేరు రూ.32.79 వద్ద ముగిసింది. -
Divya Deshmukh: ప్రపంచ చాంపియన్.. ఈ విషయాలు తెలుసా?
గాంధీనగర్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత యువ చెస్ తార దివ్య దేశ్ముఖ్ తన కెరీర్లో గొప్ప ఘనత సాధించింది. ప్రపంచ జూనియర్ మహిళల అండర్–20 చెస్ చాంపియన్షిప్లో విజేతగా అవతరించింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 18 ఏళ్ల దివ్య 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.చివరిదైన 11వ రౌండ్లో దివ్య 57 ఎత్తుల్లో క్రస్తెవా బెలోస్లావా (బల్గేరియా)పై గెలిచింది. నాగపూర్కు చెందిన దివ్య ఈ టోర్నీలో తొమ్మిది గేముల్లో నెగ్గి, రెండు గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది.క్రచ్యాన్ మరియం (అర్మేనియా; 9.5 పాయింట్లు) రెండో స్థానాన్ని దక్కించుకోగా... అలవెర్దియెవా అయాన్ (అజర్బైజాన్; 8.5 పాయింట్లు) మూడో స్థానాన్ని సంపాదించింది. విజేతగా నిలిచిన దివ్యకు 2000 యూరోల (రూ. 1 లక్షా 79 వేలు) ప్రైజ్మనీతోపాటు స్వర్ణ పతకం, విన్నర్స్ ట్రోఫీ లభించాయి. విజయానంతరం దివ్య మాట్లాడుతూ.. ‘‘ఒత్తిడిని ఎలా అధిగమించాలో నాకు తెలుసు. ఆటను ఎలా ఆడాలో కూడా పూర్తిగా నేర్చుకున్న తర్వాతే నేను రంగంలోకి దిగాను’’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.18 ఏళ్ల ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య సాధించిన విజయాలు2020- ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్(టీమ్)- స్వర్ణం2022- వుమెన్స్ ఇండియన్ చెస్ చాంపియన్షిప్- విజేత2022- చెస్ ఒలింపియాడ్(వ్యక్తిగత విభాగం)- కాంస్యం2023- ఆసియా మహిళా చెస్ చాంపియన్షిప్- విజేత2023- టాటా స్టీల్ ఇండియా చెస్ టోర్నమెంట్(వుమెన్స్ రాపిడ్)- ప్రథమ స్థానం2024- ఫిడే వరల్డ్ అండర్ 20 గర్ల్స్ చెస్ చాంపియన్షిప్- చాంపియన్. -
‘ఖతర్నాక్ కోడలు’.. చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే
ముంబై : రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో అత్యంత సాధారణ రకాలు హిట్ అండ్ రన్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక వ్యక్తిని ఢీ కొట్టి అతని పరిస్థితి ఎలా ఉందో? పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయినప్పుడు దాన్ని హిట్-అండ్-రన్గా పరిగణిస్తారు. తాజాగా, హిట్-అండ్-రన్ ప్రమాదంలో మృతి చెందిన 82 ఏళ్ల పురుషోత్తం కేసులో విస్తు పోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం..నాగపూర్ సిటీలో అర్చనా మనీష్ పుట్టేవార్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆమె భర్త మనీష్ పేరున్న డాక్టర్. టౌన్ ప్లానింగ్ అధికారిణిగా నగరంలో తనకున్న పేరు పలుకుబడితో భారీ ఎత్తున ఆస్తుల్ని పోగేశారు. అయినప్పటికీ మామ పూరుషోత్తం పుట్టేవార్ ఆస్తిపై కన్నేసింది. ఆయనకున్న రూ.300 కోట్ల ఆస్తిని కాజేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం అర్చన తన క్రిమినల్ మైండ్కు పదును పెట్టింది. తన మామను కారుతో ఢీకొట్టి అది ప్రమాద మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. హత్య చేయించేందుకు ఆమె భర్త డ్రైవర్ బాగ్డే, నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్లకు కోటి రూపాయిలకు సుపారీ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే?అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసేందుకు పురుషోత్తం ఆస్ప్రత్రికి వెళ్లారు. తిరిగి వస్తున్న ఆయనను ప్లాన్లో భాగంగా కారుతో ఢీకొట్టిచ్చింది.రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడడంతో స్థానికుల్ని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పురుషోత్తంకు రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీటీవీపుటేజీని నిశితంగా పరిశీలించగా..అందులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పురుషోత్తంకు జరిగింది రోడ్డు ప్రమాదం కాదని, హిట్-అండ్-రన్ కేసుగా అనుమానం వ్యక్తం చేశారు. ఆ కారులో ప్రయాణిస్తున్న బాగ్డే, నీరజ్,సచిన్లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా.. కోడలు అర్చన భాగోతం బట్ట బయలైంది. ఆస్తి కోసమే అర్చన తన మామ పురుషోత్తంను హతమార్చేందుకు సిద్దపడినట్లు తేలడంతో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పురుషోత్తం 15 రోజుల పాటు పోరాడి చివరికి ప్రాణాలొదిలినట్లు పోలీసులు తెలిపారు. -
మణిపూర్లో సమస్యకు గన్ పరిష్కారం కాదు: సుప్రియా సూలే
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్.. మణిపూర్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే స్వాగతించారు. మణిపూర్లోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అన్నారామె.‘‘ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మణిపూర్పై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా స్వాగతిస్తున్నా. ఎందుకంటే మణిపూర్ భారత్లో భాగం. అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనందరినీ చాలా తీవ్రంగా కలచివేస్తోంది. మణిపూర్ విషయంపై చర్చ జరగాలి. మణిపూర్లో నెలకొన్న అశాంతిపై చర్చ జరపాలని ఇండియా కూటమి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది’’ అని అన్నారు.#WATCH | Pune, Maharashtra: On RSS chief Mohan Bhagwat's statement, NCP-SCP MP Supriya Sule says, "I welcome his statement because Manipur is part of India. And when we see our people suffering so much, it is extremely disturbing for all of us. This is something we have been… pic.twitter.com/JgRvnDET6y— ANI (@ANI) June 11, 2024 ‘‘ ఇప్పటికైనా అన్ని పార్టీల నేతలతో ఒక మంచి కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ద్వారా మణిపూర్ ప్రజలకు పూర్తి విశ్వాసాన్ని కలిగించాలి. ప్రతి సమస్యకు గన్తో పరిష్కారం లభించదు’’ అని సుప్రియా సూలే అన్నారు. మణిపూర్లో శాంతి, ఎన్నికలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన ఓ కార్యక్రమంలో తొలిసారి మాట్లాడారు. మాటల చాతుర్యంతో ఎన్నికల్లో గెలిచిన అనంతరం మణిపూర్లో చోటు చేసుకుంటున్న ఘర్షణల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘‘మణిపూర్లో అల్లర్లు చెలరేగి ఏడాది అవుతోంది. అయినా అక్కడ శాంతి నెలకొనటం లేదు. గత పదేళ్లలో శాంతంగా ఉన్న మణిపూర్లో ఒక్కసారిగా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇక్కడి సమస్యను పరిష్కరించటమే తొలి ప్రాన్యంగా భావించాలి. ఎన్నికల్లో చూపించిన మాటల చాతుర్యం వదిలేసి.. దేశంలోని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి’’ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.‘‘ ఎన్నికల ఫలితాల కంటే ప్రజాస్వామ్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా సమాజం మారుతోంది. అదే ప్రజాస్వామ్యానికి నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో ఎకరినొకరు దూషించుకోవటం, సాంకేతికతను తప్పుదారి పట్టించటం, నకిలీ వార్తలు సృష్టించటం సరికాదు. ఎన్నికలు, ఫలితాలు వాటి నుంచి బయటకువచ్చి దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి’’ అని మోహన్ భగవత్ అన్నారు. -
గూఢచర్యం కేసు.. ‘బ్రహ్మోస్’ మాజీ ఇంజినీర్కు జీవిత ఖైదు
నాగ్పూర్: బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్కు నాగ్పూర్ సెషన్స్కోర్టు జీవిత ఖైదు విధించింది. నాగ్పూర్లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ టెక్నికల్ రీసెర్చ్ విభాగంలో నాలుగేళ్లు పనిచేసిన నిషాంత్ అగర్వాల్ పాకిస్థాన్కు ప్రాజెక్టు కీలక రహస్యాలను చేరవేశాడని కోర్టులో రుజువైంది. దీంతో కోర్టు నిషాంత్కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించింది. పాక్ గూడఛారి సంస్థ ఐఎస్ఐకి రహస్యాలు చేరవేస్తున్న నిషాంత్ను మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2018లో అరెస్టు చేశాయి. అనంతరం నిషాంత్పై ఐపీసీతో పాటు అఫీషియల్స్ సీక్రెట్ యాక్ట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2018 నుంచి జైలులో ఉన్న నిషాంత్కు ఈ ఏడాది ఏప్రిల్లోనే మహారాష్ట్ర హైకోర్టు నాగ్పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. డీఆర్డీవో, మిలిటరీ పారిశ్రామిక కన్సార్టియం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాయి. -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మహిళకు ఐదేళ్ల తరువాత న్యాయం లభించింది. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన నాగపూర్ కోర్టు ప్రభుత్వ వైద్యశాల డీన్ రాజ్ గజ్భియేతో సహా 11 మంది వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాగ్పూర్లోని అజ్ని పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే 2019లో నాగపూర్కు చెందిన కేవల్రామ్ పాండురంగ్ పటోలే భార్య పుష్ప తన గొంతులో చిన్నపాటి గడ్డకు చికిత్స కోసం నాగ్పూర్లోని మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. ఈ సమయంలో సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ గజ్భియే బాధిత మహిళ భర్త కేవల్రామ్ పాండురంగ్ పటోలేతో శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గడ్డను తొలగించవచ్చని తెలిపారు. ఆ వైద్యుని సలహా మేరకు పటోలే తన భార్య పుష్పను 2019 జూలై 5న ఆసుపత్రిలో చేర్చారు. 6న ఉదయం 8 గంటలకు ఆమెకు ఆపరేషన్ జరిగింది.ఈ ఆపరేషన్ తర్వాత పుష్ఫ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఆమెకు చికిత్సనందించారు. అయితే జూలై 7న ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పుష్ఫ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆపరేషన్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పటోలే 2020 జూన్ 30న డాక్టర్ గజ్భియేతో పాటు ఇతర వైద్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వైద్యాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేసి, కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికలో బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిందని కమిటీ పేర్కొంది.అయితే పటోలే దీనిపై రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వైద్యశాఖ ఈ ఉదంతంపై విచారణకు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధితురాలికి ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా పటోలే నాగపూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఆ వైద్యులపై కేసు నమోదు చేయాలని అజ్ని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!
కొందరూ తల్లులు పేదరికం, దారుణమైన కుటుంబ పరిస్థితులు వంటి కారణాల రీత్యా చారిటీ సంస్థల వద్ద లేదా దత్తత కింద తమ పిల్లలను ఇచ్చేయడం జరుగుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లై.. తమను పెంచిన వాళ్లు అసలైన తల్లిదండ్రులు కాదని తెలిస్తే.. ఆ బాధ మాములుగా ఉండదు. అక్కడ నుంచి మొదలవుతాయి తమ తల్లిదండ్రులు ఎవరూ, ఎక్కడ ఉంటారనే ఆలోచనలు. వాళ్లు అసలు బతికే ఉన్నారా? ఒకవేళ బతికే ఉంటే ఒక్కసారి వాళ్లను తమ కళ్లతో చూసుకోవాలనే ఆరాటం, ఆత్రం మాటలకందని విధంగా ఉంటాయి. అలాంటి భావోద్వేగపు కథ ఈ స్విడిష్ యువతి గాథ! అసలేం జరిగిందంటే..స్వీడన్కి చెందిన 41 ఏళ్ల ప్యాట్రిసియా ఎరిక్సన్ ఫిబ్రవరి 1983లో నాగాపూర్లోని డాగా హాస్పిటల్లో జన్మించింది. ఒక ఏడాది తర్వాత స్వీడిష్ దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారు. తనన పెంచి పెద్ద చేసిన తల్లి తన కన్నతల్లి కాదని తెలుసుకుని భావోద్వేగానికి గురవ్వుతుంది. అయినప్పటికీ ఇన్నేళ్లు తనను ఎంతో ప్రేమగా పెంచిన పెంపుడు తల్లి పట్ల అపారమైన కృజ్ఞత ఉన్నప్పటికీ ఒక్కసారి తన తల్లిని తనవితీరా చూడాలని కోరుకుంటుంది. అందుకోసం ఆమె తన తల్లి ఎక్కడ ఉండేది అనే దిశగా ఆమె ఆచూకీకై వెతకడం ప్రారంభించింది. అలా ఆమె తన తల్లిని వెతుక్కుంటూ నాగ్పూర్కి చేరుకుంది. అక్కడ తన తల్లి ఆచూకీకి సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించడం మొదలు పెట్టింది. ఆ భావోద్వేగపూరిత అన్వేషణలో ఎరిక్సన్కి అంజలా పవార్ అనే న్యాయవాది సాయం అందిస్తున్నారు. ఇలా జీవ సంబంధమైన తల్లుల కోసం వేరే దేశ యువతలు భారతదేశానికి వచ్చి కోరడం అనేది తొలిసారి కాదు. ఇంతకుమునుపు స్విస్ మహిళ విద్యా ఫిలిప్పన్ కూడా ముంబైలో తన జీవసంబంధమైన తల్లి కోసం ఒక దశాబ్దంగా వెతుకుతూ ఉంది. అయితే ఆ కేసులో ఆమె తల్లి చిరునామా, ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఆ యువతి ప్రధాన సవాలుగా మారింది. దీంతో ఆమె తల్లి ఎక్కడకు వెళ్లి ఉంటుందనేది చిక్కముడి వీడని మిస్టరీలా మారిపోయింది. #WATCH | Nagpur, Maharashtra: Swedish National Patricia Eriksson comes to Nagpur to search for her biological mother. She says, "The kids in school started to explain that they have their mother's hair and father's nose. Then I realised I couldn't do the same... From a child's… pic.twitter.com/bcyXL4se6o — ANI (@ANI) April 3, 2024 (చదవండి: హెయిర్ స్ట్రైయిట్నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్) -
తూర్పు విదర్భలో హోరాహోరీ!
మహారాష్ట్రలో లోకసభ ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. బరిలోకి దిగిన పార్టీలు తమ సత్తాను చాటేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని తూర్పు విదర్భలో ఎన్నికల పోరు ఆసక్తికరంగామారింది. ఇక్కడి ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, శివసేన, బీఎస్పీతో సహా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రామ్టెక్ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన పార్టీల నుండి ముగ్గురు అభ్యర్థులు రాజు పర్వే (శివసేన), శ్యాంకుమార్ బార్వే (కాంగ్రెస్), సందీప్ మెష్రామ్ (బీఎస్పీ) ఉన్నారు. అయితే అంతగా గుర్తింపు లేని పార్టీల నుండి 13 మంది, 12 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. రామ్టెక్లో కాంగ్రెస్ తన అభ్యర్థిగా రష్మీ బార్వేని నిలబెట్టింది. అయితే ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లదు. దీంతో ఆమె భర్త ఎన్నికల రంగంలో నిలిచారు. నాగ్పూర్ విషయానికొస్తే బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ, వికాస్ థాకరే (కాంగ్రెస్), యోగేష్ లాంజేవార్ (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీల నుండి 13 మంది, 10 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. భండారా-గోండియా నియోజకవర్గంలోని 18 మంది అభ్యర్థులలో, సునీల్ మెంధే (బీజేపీ), ప్రశాంత్ పడోలే (కాంగ్రెస్), సంజయ్ కుంభాల్కర్ (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారు కాగా, నలుగురు గుర్తింపు పొందనివారున్నారు. 11 మంది స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. అశోక్ నేతే (బీజేపీ), కర్సన్ నామ్దేవ్ (కాంగ్రెస్), యోగేష్ హొన్నాడే (బీఎస్పీ) మధ్య త్రిముఖ పోటీ ఉండనుందని భావిస్తున్నారు. చంద్రాపూర్లో 15 మంది అభ్యర్థుల్లో ప్రతిభా ధనోర్కర్ (కాంగ్రెస్), సుధీర్ ముంగంటివార్ (బీజేపీ), రాజేంద్ర రామ్టేకే (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీల నుంచి, 9 మంది గుర్తింపు లేని అభ్యర్థులు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్. చొక్కలింగం తెలిపారు. ఈ నియోజకవర్గాల్లోని 10,652 పోలింగ్ కేంద్రాల ద్వారా 95,54,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
Nitin Gadkari: 5 లక్షలకుపైగా ఓట్లతో గెలుస్తా
రానున్న లోక్సభ ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను నాగ్పూర్ను ఎప్పుడూ మరచిపోలేదని, ఇకపైనా ఎప్పుడూ మరచిపోనని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో నేను 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. మీరందరూ నన్ను ఎంతో ప్రేమించారు. నేను ఏ పని చేసినా అది మీ ప్రేమ, ఆదరణ వల్లే చేయగలిగాను. ఆ ఘనత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకే చెందుతుంది. నేను నాగ్పూర్ను ఎప్పుడూ మరచిపోలేదు. ఇకపైనా ఎప్పుడూ మరచిపోను’ అని నితిన్ గడ్కరీ వివరించారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా తాను ఏ పని చేసినా ఆ ఘనత తనను అధికారంలోకి తెచ్చిన ఓటర్లకే దక్కుతుందన్నారు. గత పదేళ్లలో నాగ్పూర్లో రూ. లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశానని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తన రాజకీయ వారసత్వంపై బీజేపీ కార్యకర్తలకే హక్కు ఉందని నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకులు ఎవరూ రాజకీయాల్లో లేరన, రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా గోడలపై పోస్టర్లు అతికించి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని వారికి చెప్పినట్లుగా తెలిపారు. కాగా నాగ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాలకు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
ఆర్ఎస్ఎస్ పురిటి గడ్డలో బీజేపీ గెలిచింది మూడుసార్లే!
మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో నాగ్పూర్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నాగ్పూర్ విదర్భ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. నాగ్పూర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు పురిటి గడ్డగా చెబుతారు. మహారాష్ట్రలోని ఐదు కీలక స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో నాగ్పూర్ కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నాగ్పూర్ స్థానానికి ఎంపీగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. నాడు కాంగ్రెస్ అభ్యర్థి అనసూయాబాయి కాలే ఇక్కడి నుంచి గెలిచారు. నాగ్పూర్ సీటు కొన్నాళ్లు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. 1996లో బీజేపీ తొలిసారి ఇక్కడ నుంచి గెలుపొందింది. నాగ్పూర్ ఎన్నికల చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి. 1952లో మొదటి సాధారణ ఎన్నికల్లో నాగ్పూర్ స్థానం కాంగ్రెస్కు దక్కింది. 1962లో రాజకీయ నేత మాధవ్ శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఆర్ దేవ్ఘరే విజయం సాధించారు. 1971లో నాగ్పూర్లో కాంగ్రెస్కు తొలి పరాజయం ఎదురైంది. ఈసారి సుభాష్ చంద్రబోస్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ నాగ్పూర్ స్థానాన్ని కైవసం చేసుకోగా, భోటే జంబువంతరావు ఎంపీ అయ్యారు. 1977లో కాంగ్రెస్ ఇక్కడ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 1980 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత భోటే జంబువంతరావు విజయం సాధించారు. 1984లో కాంగ్రెస్ నేత బన్వరీలాల్ భగవాన్దాస్ విజయం సాధించారు. బన్వరీలాల్ 1989 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను విజయపథంలో నడిపించారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో బన్వరీలాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అయితే ఈసారి బన్వరీలాల్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాజీ రఘోబ్జీ మేఘే ఎంపీగా ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ మరోసారి బన్వరీలాల్కు టికెట్ ఇచ్చింది. అప్పుడు తొలిసారిగా నాగ్పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్ పార్టీ నాగ్పూర్ సీటును సొంతం చేసుకుంది. విలాస్ ముత్తెంవార్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009లలో వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో మోదీ వేవ్ కారణంగా చాలా విరామం తర్వాత బీజేపీ తిరిగి నాగ్పూర్ సీటును సొంతం చేసుకుంది. ఈసారి నితిన్ గడ్కరీ ఎంపీ అయ్యారు. నితిన్ గడ్కరీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ నాగ్పూర్ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. సంఘ్కు బలమైన కోటగా ఉన్నప్పటికీ నాగ్పూర్లో బీజేపీ మూడు లోక్సభ ఎన్నికల్లో(1996,2014,2019) మాత్రమే విజయం సాధించగలిగింది. -
బిల్గేట్స్కు చాయ్, ప్రధాని మోదీకి కూడా చాయ్ : డాలీ చాయ్వాలా
భారత్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్ సోషల్ మీడియా స్టార్, డాలీ చాయ్వాలా వద్దకు వెళ్లి చాయ్ తాగిన వీడియో వైరల్ అయింది. దీంతో మరోసారి మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సునీల్ పాటిల్ వార్తల్లోకి వచ్చేశాడు. ఈ సందర్భంగా చాయ్వాలా చేసిన కమెంట్స్ విశషంగా నిలుస్తున్నాయి. బిల్ గేట్స్ డాలీ చాయ్వాలా మీట్పై మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. విదేశం నుంచి వ్యక్తి అని మాత్రం అనుకున్నా.. కానీ ఆయన బిట్ గేట్స్ అని అస్సలు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అందరికీ ఇచ్చినట్టే అతనికీ టీ ఇచ్చాను. తరువాత నాగ్పూర్కి తిరిగి వచ్చాక తాను ఎవరకి టీ ఇచ్చిందీ గుర్తించానని తెలిపాడు. బిల్ గేట్స్ తన దగ్గరికి వచ్చి 'వావ్, డాలీకి చాయ్' అన్నారని గుర్తు చేసుకున్నారు. పనిలో బిజీగా ఉండి, ఆయన తన పక్కనే ఉన్నా, తాను అస్సలు మాట్లాడలేక పోయానని చెప్పాడు. దక్షిణాది సినిమాలు చూస్తా.. వాటినుంచే స్టైల్స్ నేర్చుకున్నా.. వెరైటీ టీ అందిస్తూ ‘నాగ్పూర్ కా డాలీ చాయ్గా మారా’ అంటూ తన స్టయిల్ గురించి వెల్లడించాడు. అంతేకాదు 'భవిష్యత్తులో ప్రధాని నరేంద్రమోదీకి కూడా టీ అందించాలనుకుంటున్నా అంటూ తన మనసులోని కోరికను బైట పెట్టాడు. కాగా సునీల్ పాటిల్ టీస్టాల్తో ఉపాధిని వెదుక్కోవడమే కాదు, తన డ్రెస్సింగ్ స్టైల్, టీ తయారీలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ‘డాలీ చాయ్ వాలా’ పేరుతో ఇన్ స్టాగ్రామ్లో కూడాసెలబ్రెటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. #WATCH | Nagpur (Maharashtra): Microsoft Co-founder Bill Gates posted a video, in which he can be seen enjoying Dolly's tea. Dolly Chaiwala says, "I was not aware at all I thought that he was a guy from a foreign country so I should serve him tea. The next day when I came back… pic.twitter.com/hicI3vY31y — ANI (@ANI) February 29, 2024 -
డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్ ఫిదా
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్గేట్స్ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్ నాగ్పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్గేట్స్ టీ అడిగి మరీ తాగారు. అంతే చాయ్వాలా టీకి బిల్ గేట్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!’’ అంటూ ఒక వీడియోషేర్ చేశారు. బిల్గేట్స్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్, "ఇది డీప్ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం. దీనికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్ చేశాయి. జొమాటో బిల్ గేట్స్కి స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్ ఎంత స్విగ్గీ స్పందించింది. నాగ్పూర్లో వెరైటీ, స్టయిలిష్ టీతో డాలీ చాయ్వాలా బాగా ఫ్యామస్. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్వాలా స్పెషల్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్లో బిల్గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్తోపాటు పశ్చిమ బెంగాల్లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
Arati Kadav: సాఫ్ట్వేర్ టు సైన్స్–ఫిక్షన్ డైరెక్టర్
మల్టీ టాలెంట్ అంటే మాటలు కాదు. ఎంచుకున్న రంగాల్లో సమాన ప్రతిభ చాటాలి. తేడా జరిగితే అన్నిట్లో ‘జీరో’ తప్ప ఏమీ మిగలదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా తన ప్రతిభను చాటుకున్న ఆరతి కదవ్ గురించి.... చిన్నప్పటి నుంచి ఆరతికి ఫాంటసీ జానర్ అంటే ఇష్టం. ‘పంచతంత్ర’ ‘మహాభారత’ కథల పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటికి తన ఊహాలోకంలో తనదైన ఫాంటసీ జోడించేది. ఆ తరువాత సైన్స్–ఫిక్షన్ తన ఆసక్తిగా మారింది. ‘ఈ జీవితానికి అర్థం ఏమిటి? పుట్టడం, గిట్టడమేనా ఇంకేదైనా పరమావధి ఉందా?’ ఇలాంటి ప్రశ్నలతో చావుపుట్టుకల గురించి ఎన్నో కోణాలలో ఆలోచించేది. మరణానంతర జీవితం గురించి కథలు రాసేది. సైన్స్–ఫిక్షన్ ఫిల్మ్మేకర్గా ఆరతి గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ ఊహలే పునాదిగా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్గా తనకు ఎంతో పేరు తెచ్చిన ఫిలసాఫికల్ సైన్స్ ఫిక్షన్, బ్లాక్కామెడీ ఫిల్మ్ ‘కార్గో’కు ముందు రోబోలను దృష్టిలో పెట్టుకొని ‘టైమ్ మెషిన్’ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది ఆరతి. ఈ చిన్న చిత్రం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మన పురాణాలలో నుంచి ఊహాజనితమైన కథలతో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది., మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన ఆరతి కదవ్ అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేసింది. సాంకేతిక విషయాలకు తప్ప కాల్పనిక ఊహలకు బుర్రలో కాసింత చోటు దొరకనంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‘ఫాంటసీ’ కోసం కొంత స్థలం రిజర్వ్ చేసుకునేది. కొంతకాలం తరువాత ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. కాల్పనిక విషయాల మీద ఆసక్తి ఆరతిని సైన్స్కు దూరం చేయలేదు. సందర్భాన్ని బట్టి శాస్త్రీయ విషయాలపై రచనలు చేస్తుంటుంది. చిత్రరంగంలో కృత్రిమ మేథ(ఏఐ)కి సంబంధించి ‘విల్ ఏఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ’ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. రచయిత్రిగా కలం పట్టినప్పుడు తనలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ బయటకు వచ్చి ‘రిసెర్చ్’ చేయమంటూ సలహా ఇస్తుంది. దీంతో ఊహలకు విరామం ఇచ్చి తాను ఏ సబ్జెక్ట్ గురించి అయితే రాస్తుందో ఆ సబ్జెక్ట్కు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సాధికారమైన సమాచారాన్ని పోగు చేస్తుంది. దీని ఆధారంగా మళ్లీ రచన చేస్తుంది. డైరెక్టర్గా ఉన్నప్పుడు తనలోని రచయిత్రి బయటకు వచ్చి సీన్–డైలాగ్లను ఇంకా ఎలా మెరుగుపెట్టవచ్చో సలహా ఇస్తుంది. ఇక ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు బడ్టెట్ను సమర్థవంతంగా వాడుకోవాలనే విషయంలో సలహాలు ఇవ్వడానికి తనలోని సాప్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ‘కార్గో’ సినిమా అయిదుగురు నిర్మాతలలో ఆరతి ఒకరు. ‘నేర్చుకున్న విద్య ఏదీ వృథా పోదు’ అని చెప్పడానికి ఆరతి బహుముఖ ప్రజ్ఞ సాక్ష్యంగా నిలుస్తుంది. -
బీజేపీలో గులాంగిరీ నడుస్తోందని ఆ పార్టీ ఎంపీనే చెప్పారు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో గులాంగిరీ నడుస్తుందని( గతంలో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తిం) ఆ పార్టీ ఎంపీనే తనతో చెప్పారని పేర్కొన్నారు. అయితే ఆ ఎంపీ హృదయం ఇప్పటికీ కాంగ్రెస్తోనే ఉందని రాహుల్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో కాంగ్రెస్ ఉన్న ప్రస్తుత బీజేపీ ఎంపీ ఒకరు ఆ పార్టీలో(బీజేపీ) గులాంగిరీ నడుస్తుందని నాతో చెప్పి వాపోయారు. ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసి ఈ మాటలు చెప్పారు. ఆయన మనస్సంతా కాంగ్రెస్పైనే ఉంది. హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలు పాటించాలి. పార్టీ కార్యకర్తల గోడును వినే వారుండరు. పార్టీ హైకమాండ్ సూచనలు తమకు నచ్చినా నచ్చకపోయినా మరో అవకాశం ఉండదు. బీజేపీలో అలాగే ఉంటుంది’ అని ఆ ఎంపీ తనతో చెప్పారని రాహుల్ పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్ధలన్నీ ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిళ్లతో పనిచేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. కాగా కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్ధాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మహారాష్ట్రలోని నాగపూర్లో భారీ ర్యాలీ ప్రదర్శించారు. దీంతో మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. చదవండి: ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట.. #WATCH | At Congress' 'Hain Taiyyar Hum' rally in Nagpur, Rahul Gandhi says, "A BJP MP, who was previously in Congress, told me that 'ghulami' works in BJP..." pic.twitter.com/AD7kxzvvJR — ANI (@ANI) December 28, 2023 -
సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి!
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నాగ్పూర్లోని బజార్గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడివారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగ్పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగ్పూర్లోని బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పఖాలే మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. ఇది కూడా చదవండి: లోక్సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె? -
97 నుంచి 77 కట్ చేస్తే... ఆ కరేజ్ ఇలా ఉంటుంది!
97 సంవత్సరాల వయసులో రెండు అడుగులు వేగంగా వేయాలంటేనే కష్టం. అలాంటిది ‘పారా మోటరింగ్ అడ్వెంచర్’ చేస్తే... మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన ఉషా తూసే 97 సంవత్సరాల వయసులో పారామోటరింగ్ సాహసం చేసి నెటిజనులు ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఆర్మీ పారా–కమాండో పైలట్స్, ఎయిర్ ఫోర్సు వెటరన్స్ ఆపరేట్ చేసే ఫ్లైయింగ్ రైనో పారామోటరింగ్ విభాగం బామ్మ చేత ఈ సాహసాన్ని చేయించింది. ‘97 ఇయర్ వోల్డ్ కరేజ్ అండ్ 20 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్’ అనే కాప్షన్తో ‘ఎక్స్’లో ఈ వీడియో క్లిప్ను పోస్ట్ చేసింది. ‘సాహసంలో జీవనోత్సాహం కూడా ఉంటుంది అనే వాస్తవాన్ని ఆవిష్కరించే వీడియో ఇది’. ‘ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే వీడియో’.... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి నిజానికి ఉషాకు సాహసం కొత్త కాదు. భర్త ఆకస్మిక మరణం, పిల్లల బరువు బాధ్యతల సమయంలో కూడా ఆమె డీలా పడిపోలేదు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ధైర్యంగా పోషించింది. -
మళ్లీ పెరుగుతున్న టమాటా రేట్లు
దీపావళి అనంతరం మార్కెట్లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, ఈ ఏడాది వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. ఫలితంగా మహారాష్ట్రలోని నాగ్పూర్తో సహా విదర్భలోని రిటైల్ మార్కెట్లో టమోటాలు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న టమాట ధరలు ఉల్లి ధరలతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి టమాటాలను విక్రయించేందుకు నాగ్పూర్లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి. టమాటా వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద ఎత్తున టమోటాలు కలమన మండీకి వస్తుంటాయి. ఫలితంగా ధరలు తక్కువగా ఉంటాయి. కాగా పొలంలో టమోటాలు పండించిన రైతులు వాటిని మార్కెట్కు తీసుకురావాలంటే రవాణా ఖర్చులు భారీగా అవుతుంటాయి. ఈ కారణంగా రైతులు టమోటాలను రోడ్లపై పారవేస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదు. టమాటాలు డిమాండ్కు తగ్గట్టుగానే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర, బెంగళూరు నుంచి టమోటాలు నాగపూర్కు విక్రయానికి వస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర నాణ్యతను బట్టి రూ. 40 నుండి 45 వరకు ఉంటుంది. నాగపూర్ పట్టణానికి ప్రతీరోజు 15 నుండి 16 ట్రక్కుల టమాటాలు వస్తున్నాయి. పెరుగుతున్న టమాటా ధరలు ఉల్లికి గట్టి పోటీనిస్తున్నాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. మార్కెట్లో ఉల్లి రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు! -
షాకింగ్: టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్
ముంబై: వైద్యులను దేవుడితో పోలుస్తున్నారు. ఆ దేవుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటుంటారు. కేవలం డబ్బుల కోసమే కాకుండా, మానవతా హృదయంతో తన వద్దకు వచ్చిన వారి ప్రాణాలను రక్షిస్తున్న ఘనత వైద్యులకే దక్కుతుంది. అయితే ఇటీవల పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులనే తేడా లేకుండా వైద్యవవస్థ వ్యాపారంగా మారింది. అలాంటి ఓ షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వృత్తి ధర్మం మరిచిన ఓ వైద్యుడు రోగిపట్ల నిర్లక్ష్యంగా వ్యహరించాడు. డ్యూటీ చేస్తుండగా తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలో వెళ్లిపోయాడు సదరు వైద్యుడు. నాగ్పూర్లోని మౌడ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్ 3న జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మౌడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఎనిమిది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నలుగురు మహిళలకు ఆపరేషన్ చేసిన వైద్యుడు తేజ్రంగ్ భలవి.. మిగిలిన వారికి కూడా సర్జరీ చేసేందుకు ముందుగా అనస్తీషియా ఇచ్చాడు. అయితే ఆసుపత్రి సిబ్బందిని ఓ కప్ చాయ్ తీసుకురావాలని వైద్యుడు కోరాడు. కానీ ఎవరూ అతనికి టీ తీసుకోని రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన డాక్టర్ భల్వాయి.. మిగతా నలుగురికి కు.ని శస్త్రచికిత్స చేయకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై వెంటనే ఆసుపత్రి సిబ్బంది జిల్లా వైద్యాధికారికి ఈ విషయం తెలపగా.. ఉన్నపళంగా మరో వైద్యుడిని మహిళలకు సర్జరీలు చేసేందుకు పంపించారు. అనంతరం క్టర్ భలవి ప్రవర్తనపై జిల్లా యంత్రాంగం సీరియస్ అయ్యింది. ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసి వైద్యుడిపై విచారణ చేపట్టినట్లు నాగ్పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్య శర్మ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నివేదిక వచ్చిన తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు -
ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు
ఈరోజు (మంగళవారం) విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దసరా ర్యాలీ నిర్వహించింది. సంఘ్ సభ్యులు నాగ్పూర్లో ‘పథ సంచాలన్’ (రూట్ మార్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. #WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6 — ANI (@ANI) October 24, 2023 సంఘ్ ప్రధాన కార్యాలయంలో భగవత్ గాయకుడు మహదేవన్కు స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ దసరా వేడుకల కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్కు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించారు. -
కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్పూర్
నాగ్పూర్: కుండపోత వర్షంతో నాగ్పూర్ నీటమునిగింది. శుక్రవారం ఒక్కరాత్రిలోనే 106 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 'అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో నాగ్పూర్లోని అంబజారీ సరస్సు పొంగిపొర్లింది. సమీప ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.' అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. వర్షంలో నీటమునిగిన ప్రాంతాలకు సహాయక బృందాలను ప్రభుత్వం పంపింది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను అప్రమత్తం చేసింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ దళాలు నాగ్పూర్ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అవసరం ఉంటే తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో నగరంలో రోడ్లు కొట్టుకుపోయాయి. నాలాలు దెబ్బతిన్నాయి. రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న డెంగీ -
నాగ్పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్
నాగ్పూర్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నాగ్పూర్ పోలీస్ శాఖ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్తో ముందుకొచ్చింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రియేటివ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్గా మారింది. దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలై కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని ప్రమోషనల్ యాడ్గా మార్చి సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు నాగ్పూర్ సిటీ పోలీసులు. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ వివిధ గెటప్లను వివిధ రకాల పాస్వర్డ్లుగా ఉదహరిస్తూ ఒక్కో సోషల్ మీడియా అకౌంట్కు ఒక్కో పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్లు ఏమీ చేయలేరని తెలిపింది. ఇంకేముంది ఈ ట్వీట్ అతి తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్లో స్వైరవిహారం చేయడం మొదలుపెట్టింది. Jab aap aise passwords rakhte ho na, toh koi bhi fraudster tik nahi sakta.#KingKhanPasswords #CyberSafety #NagpurCityPolice pic.twitter.com/lby0zr3ixJ — Nagpur City Police (@NagpurPolice) September 6, 2023 ఇది కూడా చదవండి: అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు -
తెలంగాణ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఎక్స్ప్రెస్కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. మహారాష్ట్ర నాగ్పూర్ వద్ద రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆగష్టు 18వ తేదీ ఢిల్లీ నుంచి రైలు బయల్దేరింది. 19వ తేదీ ఉదయం ఎస్ 2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును వెంటనే నాగ్పూర్లో ఆపేశారు. దీంతో ప్రయాణికులు బోగి దిగి బయటకు పరిగెత్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి కారణాలు దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని అంటున్నారు. ఉద్యావన్ ఎక్స్ప్రెస్లోనూ.. బెంగళూరులోనూ ఓ రైలుకు ప్రమాదం తప్పింది. కేఎస్ఆర్ స్టేషన్లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనలో ఎవరికీ ఏం కాలేదని అధికారులు ప్రకటించారు. Fire broke out at banglore railway station in #UdyanExpress at KSR #Bengaluru #FireAccident Train no - 11301 Route - CSMT to SBC (KSR Bengaluru) pic.twitter.com/ldvjAXg1O5 — Pune Pulse (@pulse_pune) August 19, 2023 -
వరుసగా మృతిచెందుతున్న పైలట్లు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్ బాత్రూమ్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు. ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. -
బీజేపీ నాయకురాలు సనాఖాన్ హత్య.. భర్తే చంపి, నదిలో పడేసి!
మహారాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ నాయకురాలు అదృశ్యం కేసు విషాదంతంగా మారింది. పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె మధ్యప్రదేశ్లోని దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే సనాను ఆమె భర్త అంతమొందించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు అమిత్ అలియాస్ పప్పు సాహుని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాం కోసం గాలిస్తున్నారు. నాగ్పూర్ నివాసి, బీజేపీ మైనారిటీ సెల్ సభ్యురాలు సనా ఖాన్ ఇటీవల భర్త అమిత్ సాహును కలిసేందుకు జబల్పూర్కు వెళ్లారు. రెండు రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా రాలేదు. సనాఖాన్ నాగ్పూర్ నుంచి ప్రైవేట్ బస్సులో బయలుదేరి, మరుసటి రోజు జబల్పూర్ చేరుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు జబల్పూర్ వెళ్లి వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సనా చివరి లొకేషన్ ఆధారంగా ఆచూకీ కోసం నాగ్పూర్, జబల్పూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. చదవండి: పెళ్లి కుదిరింది.. 9 రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పిన వినిపించుకోకుండా.. అయితే జబల్పూర్లో భర్త సాహూను కలవడానికి వెళ్లిన్నట్లు తల్లికి చెప్పగా.. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు తెలియజేసింది. నాగ్పూర్ పోలీసులకు భర్తపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో సనా ఖాన్ను హత్య చేసినట్లు వెల్లడించాడు. తన ఇంట్లోనే సనా తలపై తీవ్రంగా కొట్టి చంపేసినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని జబల్పూర్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరాన్ నదిలో పడేసినట్లు తెలిపాడు. బాధితురాలి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. జబల్పూర్లోని ఘోరా బజార్ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అమిత్ షా లిక్కర్ స్మగ్లింగ్ వ్యాపారంలో భాగస్వామిగా ఉంటూ.. రోడ్డు పక్కన ఫుడ్ కోర్టును కూడా నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో సనా, పప్పుల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
నాగ్పూర్: డ్రైవర్ తప్పిదం 25 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు, విద్యుత్ స్తంభాన్ని, ఆపై డివైడర్ను ఢీకొట్టి పడిపోవడంతో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు 25 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సు డ్రైవర్, క్లీనర్ మరో ఆరుగురు ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం చోటుచేసుకుంది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదర్భ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుణె నుంచి నాగ్పూర్కు 33 మందితో బయలుదేరింది. యావత్మాల్ జిల్లా కరంజా వద్ద భోజనం కోసం ఆగింది. ఆ తర్వాత సిండ్ఖెద్రజాకు సమీపంలోని పింపల్ఖుటా గ్రామం వద్ద 1.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైందని బుల్దానా ఎస్పీ సునీల్ కడాస్నే చెప్పారు. బస్సు రోడ్డు కుడి పక్కన ఇనుప స్తంభాన్ని, ఆపై డివైడర్ను ఢీకొట్టి కుడివైపునకు అంటే ఎంట్రీ డోర్ పైవైపు ఉండేలా పడిపోయింది. డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు అంతటికీ వ్యాపించాయి. ‘ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమని భావిస్తున్నాం. నిద్రమత్తులో ఉండటం వల్లే బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు కనిపిస్తోంది. డ్రైవర్ చెబుతున్న విధంగా ఘటనకు టైర్ పేలడం కారణం కాదు. అందుకు తగిన ఆధారాలేవీ రోడ్డుపై కనిపించలేదు’ అని అమరావతి రీజినల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంతెలిపింది. పోలీసులు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. వాహనదారులు సాయం చేసుంటే.. బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టి బయటకు వచి్చన ప్రయాణికులు తమ అనుభవాలను వివరించారు. బస్సు నుంచి బయటపడ్డాక అటుగా వెళ్తున్న వాహనదారులను మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని కోరామన్నారు. ఎవరూ పట్టించుకోలేదని, ఆగకుండానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా స్పందించి ఉంటే కొన్ని ప్రాణాలనైనా కాపాడి ఉండేవారమని చెప్పారు. మంటలు ఎగిసిపడుతుండటంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడలేక నిస్సహాయతతో చూస్తుండి పోవాల్సి వచి్చందని సమీప గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులు గుర్తుపడితే వారికి అప్పగిస్తాం. లేనిపక్షంలో డీఎన్ఏ పరీక్షలు జరిపిస్తామని అధికారులు అన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనాస్థలిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. Maharashtra | At least 25 people feared dead and several injured after a bus carrying 32 passengers burst into flames on Samruddhi Mahamarg expressway in Buldhana. The injured are being shifted to Buldhana Civil Hospital: Dy SP Baburao Mahamuni, Buldhana (Warning: Disturbing… pic.twitter.com/NLo8pcqpz3 — ANI (@ANI) July 1, 2023 ఇది కూడా చదవండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి -
36 ఏళ్లు పురుషుడు ప్రెగ్నెంట్? 36 ఏళ్లుగా కవలలు కడుపులోనే..!
నాగ్పూర్: మహారాష్ట్రకు చెందిన ఓ పురుషుడు ప్రెగ్నెంట్ అయ్యాడు. అతని కడుపులో ఏకంగా కవలలు ఉన్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ఓ అరుదైన వ్యాధి కారణంగా నాగ్పూర్కు చెందిన ఓ వ్యక్తి గత 36 ఏళ్లుగా ఇద్దరు కవలలను కడుపులో మోస్తున్నాడు. అతని పేరు భగత్(60). నాగ్పూర్లో నివాసం ఉంటున్నాడు. జీవన పోషణకు ఏదో పని చేసుకుంటూ ఉండే మధ్యతరగతి వ్యక్తి. కొన్నేళ్ల క్రితం నుంచి అతని కడుపు పెరగడం ప్రారంభించింది. ఎంతగా అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేంతలా పెరిగిపోయింది. కడుపు లావుగా ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు హేళన చేసేవారు. అందరూ అతన్ని ప్రెగ్నెంట్ మ్యాన్ అంటుండేవారు. భగత్ చివరికి 1999లో ముంబయిలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. డా. అజయ్ మెహతా ఆ కండీషన్ ట్యూమర్ అనుకున్నారు. కానీ ఆపరేషన్లో ఓ పెద్ద క్యాన్సర్ కణితి అని భావించారు. పూర్తిగా చూస్తే అతని కడుపులో మానవ దేహానికి సంబంధించిన భాగాలు ఉండే సరికి షాక్కు గురయ్యారు. అయితే.. ఈ కేసులో తాను అనుకోని దృశ్యాలను చూశానని డాక్టర్ మెహతా చెప్పారు. కడుపులో ఎముకలు, వెంట్రుకలు, దవడ వంటి శరీర భాగాలు బయటపడ్డాయని వెల్లడించారు. ఈ వ్యాధిని ఫోయిటస్ ఇన్ ఫోయిటస్(పిండంలో పిండం) అంటారని తెలిపారు. ఫోయిటస్ ఇన్ ఫోయిటస్ అనగా పిండంలో మళ్లీ ఓ పిండం పెరగడం అంటారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇది ఓ అరుదైన వ్యాధి అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇకపై బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్లు చెకింగ్.. ఎందుకంటే..? -
మోదీ మంచి మిత్రుడు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, నీతి ఆయోగ్ వంటి సమావేశాల్లో తాము ఆలోచనలు పంచుకోవడంలో వింతేమీ లేదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కేంద్రం మీ పథకాలు కాపీ కొడుతోందని నాగ్పూర్లో కొందరు మీడియా ప్రతినిధులు అనడంతో కేసీఆర్ పై విధంగా స్పందించారు. మా ఎజెండాతో కలిసి వచ్చే వారితో కలిసి పనిచేస్తామని, విపక్షాల ఐక్యతపై సందర్భాన్ని బట్టి ఆలోచిస్తామని తెలిపారు. మహారాష్ట్రలోని నాగపూర్లో గురువారం బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. గతంలో ఫ్రంట్లతో ఫలితం సాధించలేక పోయాం.. ‘గతంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లాంటివి అనేకం చూసినా ఫలితం సాధించలేకపోయాం. మాది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీగా మారాం. ఓట్ల చీలిక బీజేపీకి అనుకూలిస్తుందనే వాదనతో మాకు సంబంధం లేదు. ఎవరికో బీ టీమ్, సీ టీమ్ అనే విమర్శలు మాకు అక్కరలేదు. దేశ ప్రజల కోసమే మా పార్టీ పనిచేస్తుంది. మహారాష్ట్రలోనూ పొత్తుల గురించి మేము ఆలోచించడం లేదు. అవసరమవుతుందని అనుకోవడం లేదు. మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. గెలుపోటములతో సంబంధం లేకుండా సంపూర్ణ లక్ష్యం చేరుకునే వరకు మా ప్రయాణం సాగుతుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నాగ్పూర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో బాల్కసుమన్, తోట చంద్రశేఖర్, కేకే, బీబీ పాటిల్, జీవన్రెడ్డి విపక్ష నేతలపై ఐటీ దాడులు సరికాదు ‘దేశంలో అనేక చోట్ల ప్రత్యేక రాష్ట్రాల కోరిక ఉంది. మిథిలాంచల్ ఏర్పాటుకు ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నాయి. రాష్ట్రాల ఏర్పాటులో శాస్త్రీయ విధానం కావాలి. దేశంలో మరో పది పన్నెండు రాష్ట్రాలు ఏర్పడితే ఏమవుతుంది? కొత్త రాష్ట్రాలు ఏర్పడితే విదర్భ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుంది. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే మా పార్టీ కార్యకలాపాలు మహారాష్ట్ర నుంచి ప్రారంభించాం. గతంలో తెలంగాణ రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు 14 రాష్ట్రాల వారు తెలంగాణలో పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ తరహాలో మహారాష్ట్రలోనూ అభివృద్ధి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో విపక్ష నేతలపై ఐటీ దాడులు సరికాదు. పార్టీలు బ్రతికి ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. అప్పుడే మోదీ సహా పార్టీలకు అవకాశాలు లభిస్తాయి. పార్టీలను వేధించకుండా బ్రతకనివ్వాలి. ఐటీ దాడులను ఖండిస్తున్నాం..’ అని అన్నారు. విమానాలు అందరికీ అందుబాటులోకి రావాలి.. ‘మహిళల భాగస్వామ్యంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదిలోపే పార్లమెంటుతోపాటు అసెంబ్లీల్లోనూ స్త్రీలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తాం. రైతులను అసెంబ్లీ, పార్లమెంటుకు పంపిస్తాం. పార్టీలో చేర్చుకునేందుకు మహారాష్ట్రకు ప్రైవేటు విమానం పంపడం తప్పేమీ లేదు. అది మా పార్టీ విమానం. నేను అందులోనే వెళ్తున్నా. అమెరికాలో రైతుల వద్ద కూడా విమానాలు ఉన్నాయి. ఇక్కడా అందరికీ విమానాలు అందుబాటులోకి రావాలి. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు (బండి సంజయ్) చెప్పడం పెద్ద బక్వాస్’ అని సీఎం అన్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి... ‘మనకంటే అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలు, అమెరికా గతంలో ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినా తిరిగి బ్యాలెట్ విధానం పాటిస్తున్నాయి. ఇక్కడా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నందున బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి. భారత్ పనితీరులో మార్పు కోసం రాజ్యాంగంతో పాటు ఆర్థిక, న్యాయ, పాలన, ఎన్నికల రంగాల్లో వ్యవస్థాగత మార్పులు రావాలి. మూస విధానాల నుంచి బయట పడకుంటే ప్రపంచంతో పోటీ పడలేం. దేశ జల, విద్యుత్ విధానాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరముంది. ఎయిర్ పోర్టులు, పోర్టులు, రోడ్లు, రైల్వే వ్యవస్థల్లో మౌలిక వసతులు పెరుగుదల.. దేశంలో గుణాత్మక మార్పుతోనే సాధ్యం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ రంగాలను మెరుగు పరుస్తాం. త్వరలో ఢిల్లీలో మా మేనిఫెస్టోను ప్రకటిస్తాం. దేశంలో దళితుల అభ్యున్నతి, ఉచిత విద్య వంటివి ఇందులో ఉంటాయి. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ సరికాదు, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ప్రభుత్వ రంగంలోనే కొత్త ప్లాంట్లు నిర్మిస్తున్నాం. లోపాలు సరిదిద్దితే ఆర్థిక రంగం మెరుగవుతుందనే భావనతో మేము తీసుకున్న నిర్ణయాలు తెలంగాణలో ఆర్థిక వృద్ధికి దోహదం చేశాయి. దేశంలో మార్పులకు గడువేమీ పెట్టుకోలేదు, మా లక్ష్యం సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది..’ అని కేసీఆర్ వెల్లడించారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపు చేయనందు వల్లే ధరలు పెరుగుతున్నాయని, చట్ట సభల్లో చర్చ లేకుండా బిల్లులు ఆమోదం జరగడం వంటి అంశాల్లో మార్పులు రావాలని అన్నారు. -
పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి: సీఎం కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, నాగపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్లాన్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాగపూర్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఇక, గత నెల 22న మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాగా, బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోతవ్సం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. మరో 6 నెలల్లో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమే పార్టీల లక్ష్యమైపోయింది. కర్ణాటకలో ప్రభుత్వం మారినా ఏమైనా మార్పు జరిగిందా?. పరివర్తన లేనప్పుడు ఎవరు గెలిస్తే ఏంటి?. మహారాష్ట్రలో ఎన్నో నదులున్నా వ్యవసాయానికి నీళ్లు లేవు. లక్ష్యం లేని సమాజం, దేశం ఏ దిశగా పయనిస్తాయి. 75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రజలకు కూడు, గూడు కరువే అయ్యింది. ఈ దేశంలో ఏం జరుగుతోంది?.. అసలు భారత్ లక్ష్యమేంటి?. ఆదివాసీలు తమ హక్కుల కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి. దేశ రాజకీయాల్లో మార్పు కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు. ఆలోచన విధానం మారనంత వరకు దేశంలో మార్పు రాదు. దేశంలో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించే వనరులున్నాయి. ఇన్ని వనరులు ఉన్నా దేశంలో ఇంకా విద్యుత్ సంక్షోభం ఎందుకు అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంట్లో ఐటీ సోదాలు.. రంగంలోకి ఈడీ -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, ముంబై: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఎన్హెచ్-44పై ఎద్దులను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో జోగు రామన్న స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పండ్రకవడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్హెచ్-44పై ఎద్దులను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రామన్నకు స్వల్పగాయాలయ్యాయి. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎమ్మెల్యే రామన్న, మాజీ ఎంపీ నగేష్ ఉన్నారు. అయితే, వీరు నాగపూర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం, ఎమ్మెల్యే జోగు రామన్న మరొక వాహనంలో నాగపూర్ వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ -
త్వరలో సికింద్రాబాద్ – నాగ్పూర్ మధ్య.. వందేభారత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు త్వరలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రాబోతోంది. హైదరాబాద్–నాగ్పూర్ మధ్య ఈ రైలు ప్రారంభం కానుంది. ఈ సంవత్సరారంభంలో దక్షిణమధ్య రైల్వేకు మూడు వందేభారత్ ఎక్స్ప్రెస్లను రైల్వే బోర్డు మంజూరు చేసింది. అందులో తొలి రైలు సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య సంక్రాంతి రోజున ప్రారంభమవగా ఏప్రిల్లో సికింద్రాబాద్–తిరుపతి మధ్య రెండో వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. మూడో వందేభారత్ రైలు హైదరాబాద్–పుణే మధ్య ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇప్పుడు దానికంటే ముందు నాగ్పూర్తో అనుసంధానం తెరపైకి వచ్చింది. దీనికి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా సానుకూలత వ్యక్తం చేశారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వందేభారత్ ఎక్స్ప్రెస్ నడపాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. తగ్గనున్న ప్రయాణ సమయం.. నాగ్పూర్–హైదరాబాద్ మధ్య ఇప్పటివరకు శతాబ్ది, రాజధాని లాంటి ప్రీమియర్ కేటగిరీ రైళ్లు లేవు. సాధారణ రైళ్లు ఆ ప్రాంతం మీదుగా రాకపోకలు సాగిస్తున్నా ఇరు నగరాల మధ్య 581 కి.మీ. దూరం ఉండటంతో ప్రయాణ సమయం 11 గంటలుగా ఉంటోంది. దీంతో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తే వ్యాపార బంధం మరింత దృఢంగా మారుతుందన్న ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుదీర్ ముంగంటివార్ ఇటీవల రైల్వే మంత్రిని కలిసి వందేభారత్ రైలును కోరారు. విదర్భలోని వార్ధా ఎంపీ రామ్దాస్ కూడా ఈ మేరకు విన్నవించారు. వాటికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలిక టైంటేబుల్ ఇలా... ప్రతిపాదిత వందేభారత్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక టైంటేబుల్ను అధికారులు రూపొందించారు. దీని ప్రకా రం రైలు నాగ్పూర్లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30కు సికింద్రాబాద్ చేరుకోనుంది. మళ్లీ మధ్యాహ్నం 1:30కు సికింద్రాబాద్లో బయలుదేరి రాత్రి 8 గంటలకు నాగ్పూర్ చేరుకుంటుంది. వారంలో ఆరు రోజులు ఈ రైలు తిరగనుంది. బల్లార్షా, సిర్పూర్, కాగజ్నగర్, రామగుండం, కాజీపేటల్లో ఈ రైలుకు తాత్కాలిక స్టాప్లను కేటాయించారు. ఎకానమీలో రూ.1,450– రూ.1,550, ఎగ్జిక్యూటివ్లో రూ.2,750–రూ.2,850 వరకు చార్జీలను ఖరారు చేసే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్.. హత్య చేస్తామంటూ..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. హత్య చేస్తామంటూ దుండగులు కాల్ చేసి బెదిరించారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. నాగ్పూర్లోని గడ్కరీ నివాసానికి వచ్చిన ఈ కాల్స్కు ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాతో సంబంధం ఉన్నాయని అనుమానిస్తున్నారు. కాగా జనవరి 14నే గడ్కరీ ఆఫీస్ ల్యాండలైన్కు మొదటి బెదిరింపు కాల్ వచ్చింది. నిందితున్ని జయేష్ పుజారి అలియాస్ కాంత అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మొదటికాల్స్లో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్గా పేర్కొంటూ రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మార్చి 21న మరో బెదిరింపు కాల్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. లష్క్ర్ ఏ తోయిబాతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితున్ని మార్చి 28న ఊపా చట్టం కింద కేసు నమోదు చేసి నాగ్పూర్ జైలుకు తరలించారు. అతను జైళ్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం మరో బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఎన్ఐఏ టీం నాగ్పుర్ చేరింది. దర్యాప్తును ప్రారంభించింది. చదవండి: విద్యార్థిగా మారిన మోస్ట్ వాంటెడ్ నక్సల్.. చరిత్ర సృష్టించింది -
నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్.. 10లక్షలు ఇవ్వకపోతే..
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి నితిన్ గడ్కరీ కార్యాలయానికి మూడుసార్లు బెదిరింపు కాల్స్ చేశాడు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు గడ్కరీ ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బెదిరింపు కాల్లో నిందితుడు.. గడ్కరీని రూ. 10కోట్లు డిమాండ్ చేసినట్టు సమాచారం. డబ్బు ఇవ్వకపోతే ఆయన్ను చంపేస్తామని వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే, గడ్కరీ మంగళవారం సాయంత్రం నాగపూర్కు వస్తున్న క్రమంలో ఇలా జరగడం హాట్ టాపిక్గా మారింది. దీనిపై నాగపూర్ రెండో జోన్ డిప్యూటీ సీపీ రాహు మాడన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్న నితిన్ గడ్కరీ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. సదరు వ్యక్తి మూడుసార్లు కాల్ చేసి తనని తాను జయేశ్ పూజారిగా చెప్పుకున్నాడు. అనంతరం.. ఫోన్కాల్లో రూ. 10 కోట్లు డిమాండ్ చేశాడని.. ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఆ కాల్స్ చేసిన వ్యక్తి ఎవరు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో గడ్కరీ ఆఫీసు, ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. మరోవైపు.. నిందితుడు కాల్ చేసిన నంబర్ను పోలీసులు ట్రేస్ చేయగా మంగళూరులోని ఓ మహిళకు చెందినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో బెదిరింపు కాల్పై ఉత్కంఠ నెలకొంది. కాల్ సదరు మహిళ చేసిందా? లేక పూజారి జయేశ్ చేశాడా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. అంతుకుముందు కూడా గడ్కరీకి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్పుడు కూడా నిందితుడు.. ఇలాగే రూ.10కోట్లు డిమాండ్ చేయడం గమనార్హం. -
నాగ్పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్కు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న తొలి ఎకనమిక్ కారిడార్కు పూర్తిగా లైన్ క్లియర్ అయింది. నాగ్పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించే ఈ కారిడార్ తెలంగాణ – ఏపీ మధ్య 306 కి.మీ మేర కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.10 వేల కోట్ల ని«ధులకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ఆదీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) పచ్చజెండా ఊపింది. ఈ రోడ్డును తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే తొలి ఆరు ప్యాకేజీలకు మార్గం సుగమం కావటంతో టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తికాగా, చివరి మూడు ప్యాకేజీలకు తాజాగా ఎస్ఎఫ్సీ ఓకే చెప్పి నిధులు మంజూరు చేసింది. దీంతో తెలంగాణ (మంచిర్యాల) నుంచి విజయవాడకు పూర్తిగా కొత్త (గ్రీన్ఫీల్డ్) యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రెండున్నరేళ్లలో ఈ జాతీ య రహదారి రెడీ అవుతుందని జాతీయ రహదారు ల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పేర్కొంటోంది. మహారాష్ట్ర–తెలంగాణ–ఆంధ్ర: ఓవైపు పర్యావ రణ అభ్యంతరాలు, మరోవైపు భూసేకరణపై ప్రజల నిరసనలు, అలైన్మెంట్ మార్చాలంటూ రాజకీయ నేతల ఒత్తిళ్లు.. వెరసి ఈ ఎకనమిక్ కారిడార్పై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఇప్పుడు ఎన్హెచ్ఏఐ రోడ్డు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ కొత్త జాతీయ రహదారి మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో మొదలై తెలంగాణలోని ఆసిఫాబాద్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మంల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు కొనసాగుతుంది. నాగ్పూర్ నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్ మీదుగా మంచిర్యాల వరకు ఇప్పటికే ఉన్న రోడ్డును నాలుగు వరసలకు విస్తరిస్తున్నారు. ఇక్కడివరకు పాత రోడ్డు (బ్రౌన్ఫీల్డ్ హైవే) కొత్తగా మారుతుందన్నమాట. మంచిర్యాల నుంచి కొత్తగా భూసేకరణ జరిపి పూర్తి కొత్త రోడ్డుగా నిర్మిస్తారు. 45 మీటర్ల వెడల్పుతో నాలుగు వరసలుగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విజయవాడకు ఉన్న రోడ్డు పైనే ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ఈ రోడ్డు బాగా రద్దీగా మారింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి రానున్నందున.. నాగ్పూర్ నుంచి వచే ట్రాఫిక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వాహనాలు దీని మీదుగానే ముందుకు సాగేందుకు వీలవుతుంది. ఈ కొత్త జాతీయ రహదారి కోసం 1,550 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇదీ ప్యాకేజీల స్వరూపం ప్యాకేజీ 1,2,3 మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 108.406 కి. మీ నిడివి. వ్యయం రూ.3,440.94 కోట్లు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కు పనులు దక్కాయి. అనుసంధానమయ్యే ప్రధాన పట్టణాలు.. మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పర్కాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర. ప్యాకేజీ 4, 5, 6 వరంగల్ నుంచి ఖమ్మం వరకు 108.24 కి.మీ నిడివి. వ్యయం రూ.3,397.01 కోట్లు. ప్రస్తుతం టెక్నికల్ బిడ్ మదింపు జరుగుతోంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం. ప్యాకేజీ 7, 8, 9 ఖమ్మం నుంచి విజయవాడ వరకు 89.42 కి.మీ నిడివి. వ్యయం రూ.3,007 కోట్లు. స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఈ ప్యాకేజీకే నిధులు మంజూరు చేసింది. ఇక టెండర్లు పిలవాల్సి ఉంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి. -
యూట్యూబ్ చూస్తూ ఇంట్లోనే డెలివరీ చేసుకున్న బాలిక.. తల్లి రావడంతో
ముంబై: సోషల్మీడియా పరిచయాలు ఊహించని ప్రమాదంలో పడేయడంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేసిన ఘటనలు చూస్తునే ఉన్నాం. తెలిసిన వాళ్లే మోసం చేస్తున్న రోజులివి, అలాంటిది కొందరు ఆన్లైన్ స్నేహాలను నమ్మి ఘోరంగా మోసపోతున్నారు. ప్రత్యేకంగా యువత కాలక్షేపం కోసం నెట్టింట్లోకి వెళ్లి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఈ తరహాలోనే 15 ఏళ్ల బాలిక ఇంటర్నెట్లో పరిచయమైన వ్యక్తని నమ్మి గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా యూట్యూబ్లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకొంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు చేసుకుంది. యూట్యూబ్ చూసి... పోలీసుల వివరాల ప్రకారం..నాగ్పూర్లోని అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి బాలికకు లైంగికంగా దగ్గరవ్వడంతో ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో కూడా చెప్పలేదు. ఓ దశలో పొట్ట పెద్దగా ఉందని బాలిక తల్లి ప్రశ్నించగా.. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే కడుపు ఉబ్బందని అబద్దం చెప్పింది. అలా బాలిక గర్భవతినన్న విషయాన్ని తన తల్లి నుండి దాచి పెట్టగలిగింది. అనంతరం డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్ వీడియోలను చూసి తెలుసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును గొంతునులిమి చంపేసి ఇంట్లోనే ఓ బాక్స్లో దాచిపెట్టింది. తల్లి ఇంటికి తిరిగి రాగానే బాలిక తీవ్ర అనారోగ్యంతో నీరసంగా కనిపించింది. దీంతో బాలికను గట్టిగా నిలదీయగా విషయాన్ని మొత్తం తల్లికి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శిశువు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. -
BGT 2023: భారత పిచ్లపై ఆసీస్ నిందలు.. ఐసీసీ రేటింగ్ ఎలా ఉందంటే!
India vs Australia Test Series: టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో పిచ్ గురించి ఆస్ట్రేలియా క్రికెటర్లు, మాజీలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా నాగ్పూర్లోని మొదటి టెస్టుకు ముందు పిచ్ను పరీక్షిస్తూ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తదితరులు చేసిన ఓవరాక్షన్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అంతేగాక మ్యాచ్ ఆరంభానికి ముందు ఆసీస్ క్రికెట్.. ‘‘డాక్టర్డ్ పిచ్’’ అంటూ టీమిండియాను తక్కువ చేసే విధంగా వ్యాఖ్యలు చేసింది. రెండున్నరోజుల్లో ముగిసిన టెస్టులు భారత జట్టు తమకు అత్యంత అనూకూల పిచ్ను రూపొందించుకుందని నిందలు వేసింది. ఈ క్రమంలో మొదటి మ్యాచ్ రెండున్నర రోజుల్లోనే ముగిసిపోగా.. ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు కూడా ఇదే తరహాలో ముగిసింది. ఈ రెండింటిలోనూ గెలుపొందిన టీమిండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో పర్యాటక కంగారూ జట్టు అసహనం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి నాగ్పూర్, ఢిల్లీ పిచ్లకు యావరేజ్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ విషయాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ గురువారం వెల్లడించింది. మ్యాచ్ రిఫరీ, జింబాబ్వేకు చెందిన ఆండీ పైక్రాఫ్ట్ ఈ మేరకు రేటింగ్ ఇచ్చినట్లు పేర్కొంది. దీంతో కొంతమంది ఆసీస్ క్రికెటర్లు ఆరోపించినట్లుగా పిచ్ మరీ అంత చెత్తగా ఏమీ లేదని స్పష్టమైంది. కాగా ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా భారత్కు వచ్చిన సంగతి తెలిసిందే. జడ్డూ, అక్షర్ హిట్.. ఆసీస్ బ్యాటర్లు తుస్ ఈ క్రమంలో నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ స్టేడియంలో తొలి, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్టు జరిగాయి. సాధారణంగానే స్పిన్కు అనుకూలించే ఉపఖండ పిచ్లపై ఇరు జట్ల స్పిన్నర్లు చెలరేగారు. భారత స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బ్యాట్తోనూ మ్యాజిక్ చేశారు. వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఈ సిరీస్లో 254 పరుగులు చేశారు. ఇప్పటికైనా.. ఆస్ట్రేలియా లెఫ్టాండర్లు ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ, డేవిడ్ వార్నర్, మ్యాట్ కుహ్నెమన్, మ్యాట్ రెన్షా, టాడ్ మర్ఫీ చేసిన 242 పరుగుల కంటే జడ్డూ, అక్షర్ సంయుక్త స్కోరే ఎక్కువ. జడ్డూ, అక్షర్ ఇలా చెలరేగితే ఆసీస్ బ్యాటర్లు మాత్రం చేతులెత్తేయడం వారి వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది. కాబట్టి పిచ్పై నిందలు వేసే బదులు ఓటమిని హుందాగా అంగీకరిస్తే బాగుండేదని టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: T20 WC: 'మ్యాచ్కు అదే టర్నింగ్ పాయింట్.. లేదంటే విజయం మాదే' IND vs AUS: టీమిండియాతో మూడో టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్! కెప్టెన్గా స్మిత్ -
Ind Vs Aus: ఆసీస్తో సిరీస్.. టీమిండియా క్రికెటర్ తండ్రి కన్నుమూత
నాగ్పూర్/ముంబై: టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఉమేశ్ తండ్రి తిలక్ యాదవ్(74) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. కానీ, పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం కాపర్ఖెడాలోని మిలన్ చౌక్లో గల నివాసానికి తీసుకురాగా.. బుధవారం సాయంత్రం తిలక్ యాదవ్ తుదిశ్వాస విడిచారు. కాగా ఉత్తర్ప్రదేశ్కు చెందిన తిలక్ ఉద్యోగరీత్యా మహారాష్ట్రలో నాగ్పూర్లో స్థిరపడ్డారు. వాల్నీ కోల్ మైన్లో పని చేసి రిటైర్ అయ్యారాయన. రెజ్లింగ్ పట్ల ఆయనకు అమితాసక్తి. అయితే, కొడుకును పోలీస్గా చూడాలని తిలక్ యాదవ్ భావించారు. అందుకు తగ్గట్లుగా ఉమేశ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో క్రికెటర్ అవుతానని తండ్రిని ఒప్పించిన ఉమేశ్ యాదవ్.. టీమిండియా పేసర్గా ఎదిగాడు. ప్రస్తుతం అతడు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న జట్టుతో ఉన్నాడు. అయితే, తొలి రెండు మ్యాచ్లలోనూ అతడు బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్లకు వరుస అవకాశాలు ఇచ్చిన మేనేజ్మెంట్ ఉమేశ్కు మొండిచేయి చూపింది. తదుపరి మ్యాచ్లలోనైనా తనకు ఆడే అవకాశం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న ఉమేశ్కు.. ఇంతలోనే తండ్రి మరణించాడనే ఈ విషాదకర వార్త తెలిసింది. కాగా మార్చి 1 నుంచి ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇక మొత్తంగా ఉమేశ్ యాదవ్ ఇప్పటి వరకు.. టీమిండియా తరఫున 54 టెస్టులాడి 164 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, ఏడు టీ20 మ్యాచ్లతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. కాగా గతేడాది చివరిసారిగా బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడాడు ఉమేశ్ యాదవ్. చదవండి: IPL 2023: సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త సారధి పేరు ప్రకటన -
ప్రాక్టీస్ చేయనీకుండా అడ్డుకున్నారు.. ఆసీస్ ఓటమిపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటడంతో ప్రపంచ నంబర్ వన్ జట్టుకు ఘోర పరాభవం తప్పలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ (120).. జడేజా (5/47, 70, 2/34), అశ్విన్ (3/42, 23, 5/37) అత్యుత్తమ ఆల్రౌండ్ ప్రదర్శన కారణంగా టీమిండియా చారిత్రక విజయాన్ని నమోదు చేయగా, ఆసీస్ చెత్త రికార్డులను మూటగట్టుకుంది. అయితే, ఈ మ్యాచ్లో టీమిండియా సాధించిన ఘన విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్న ఆసీస్ మాజీ ఆటగాళ్లు పిచ్పై విషప్రచారం చేస్తూ ఓటమిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత జట్టు తమ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ను ప్రత్యేకంగా తయారు చేయించుకుందని బురదజల్లుతున్నారు. మ్యాచ్ పూర్తై నేటికి రెండ్రోజులవుతన్నా ఆసీస్ మాజీల వాగుడకు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు. ఆసీస్ ఓటమిని ఆ దేశ మీడియా సైతం అంగీకరించినప్పటికీ కొందరు మాత్రం ఇంకా పేలుతూనే ఉన్నారు. తాజాగా ఆ దేశ దిగ్గజ వికెట్కీపర్ ఇయాన్ హీలీ నాగ్పూర్ పిచ్పై, అక్కడి గ్రౌండ్ సిబ్బందిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ ఆటగాళ్లను ప్రాక్టీస్ చేయనీకుండా గ్రౌండ్ సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపణలు గుప్పించాడు. సిబ్బంది పిచ్పై అసందర్భంగా నీళ్లు చల్లి, ప్రాక్టీస్ చేసుకోకుండా అడ్డుకున్నారని ఆరోపించాడు. తద్వారా తమ ప్లాన్లపై, విజయావకాశాలపై నాగ్పూర్ గ్రౌండ్ సిబ్బంది నీళ్లు చల్లారని వాపోయాడు. తమ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకుంటామని అడిగినప్పుడే స్టాఫ్ ఇలా చేశారని పేర్కొన్నాడు. ఇది మంచి సంప్రదాయం కాదని, ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలని కోరాడు. హీలీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ విషయంలో నిజానిజాలు నిగ్గుతేల్చాలని విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. -
BGT- 2023: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే..
India vs Australia, 1st Test- Nagpur: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా జట్టుపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఇప్పటికైనా పర్యాటక జట్టుకు అశ్విన్ డూప్లికేట్కు.. అసలైన అశ్విన్కు ఉన్న తేడా ఏమిటో అర్థమై ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. స్పిన్నర్ల దెబ్బకు విలవిల కాగా నాగ్పూర్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆసీస్పై టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్ల దెబ్బకు పర్యాటక జట్టుబ్యాటర్లు విలవిల్లాడిపోయారు. దీంతో.. ఏకంగా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో కంగారూలను మట్టికరిపించిన రోహిత్ సేన.. నాలుగు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అశూ, జడ్డూ అద్భుతం ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్వరూపం చూపించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 12 ఓవర్లలో 37 పరుగులిచ్చిన అశూ.. ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగిన మరో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా రెండు వికెట్లతో రాణించాడు. వీరిద్దరి దెబ్బకు ఆసీస్ 91 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగించి భారీ ఓటమిని మూటగట్టుకుంది. మహేశ్ పితియాతో ప్రాక్టీస్ ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా నాగ్పూర్ టెస్టుకు వారం రోజుల ముందే ప్రాక్టీసు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అంతేగాక అశ్విన్ మాదిరి బౌలింగ్ చేస్తాడని పేరొందిన గుజరాత్ బౌలర్ మహేశ్ పితియాతో ప్రాక్టీసు చేసింది. అయినప్పటికీ అసలైన పోరులో అశ్విన్ స్పిన్ ధాటికి తట్టుకోలేక చేతులెత్తేశారు ఆసీస్ బ్యాటర్లు. అశ్విన్తో మహేశ్ పితియా ఈసారి జడ్డూ డూప్లికేట్ కోసం ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసీస్ జట్టుకు చురకలు అంటించాడు. ‘‘ఇప్పటికైనా డూప్లికేట్ అశ్విన్ బౌలింగ్లో ఆడటానికి.. నిజమైన అశ్విన్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఉన్న తేడా ఆస్ట్రేలియా తెలుసుకుని ఉంటుంది. ఆల్టైట్ గ్రేటెస్ట్ను ఎదుర్కొనేందుకు.. ఫస్ట్క్లాస్లో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టిన యువ బౌలర్తో ప్రాక్టీసు చేస్తే పూర్తిస్థాయిలో సన్నద్ధమవలేరన్న వాస్తవం గ్రహించాలి. విషయం అర్థమైంది కదా! ఇక ఢిల్లీ మ్యాచ్ కోసం వాళ్లు జడేజా డూప్లికేట్ను వెదుకుతారని మాత్రం నేను అనుకోవడం లేదు’’ అని కైఫ్ ట్విటర్ వేదికగా ట్రోల్ చేశాడు. Australia now know the difference between facing duplicate Ashwin and real Ashwin. You can't prepare to face one of all-time great by facing a young first-class player. Hope they not searching for a Jadeja duplicate in Delhi. — Mohammad Kaif (@MohammadKaif) February 12, 2023 కాగా తొలి టెస్టులో 70 పరుగులు చేయడంతో పాటు మొత్తంగా 7 వికెట్లు పడగొట్టిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ వేదికగా టీమిండియా- ఆసీస్ మధ్య ఫిబ్రవరి 17న రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Pak: ప్రపంచకప్లో పాక్పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు SA20 2023: తొట్టతొలి మినీ ఐపీఎల్ టైటిల్ను హస్తగతం చేసుకున్న సన్రైజర్స్ BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. మన ‘అశ్విన్ డూప్లికేట్’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు? -
BGT 2023: ఆస్ట్రేలియా అత్యంత చెత్త రికార్డు.. అప్పుడలా.. ఇప్పుడిలా
India vs Australia, 1st Test: తొలి టెస్టులో టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది ఆస్ట్రేలియా. ప్రతిష్టాత్మక బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్లో జరిగిన మొదటి మ్యాచ్లో ఏకంగా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. స్పిన్నర్ల ధాటికి చేతులెత్తేశారు భారత స్పిన్నర్ల మాయాజాలానికి చిక్కిన ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. మూడో రోజైన శనివారం నాటి ఆటలో అశ్విన్, జడేజా ధాటికి ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలబడలేకపోయారు. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు స్కోరు చేయలేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో 91 పరుగులకే రెండో ఇన్నింగ్స్లో ఆలౌట్ అయిన కంగారూ జట్టుకు ఈ మేరకు పరాభవం తప్పలేదు. 2017లో నాటి తొలి టెస్టులో అనూహ్య విజయంతో టీమిండియాకు షాకిచ్చిన ఆసీస్కు ఈసారి ఘోర అవమానం తప్పలేదు. నాడు అలా.. నేడు ఇలా నాడు పుణేలో స్పిన్ పిచ్ సిద్ధం చేస్తే భారత జట్టు కంటే సమర్థవంతంగా దానిని వాడుకుని పైచేయి సాధించిన ఆస్ట్రేలియా.. ఈసారి కనీస పోరాటపటిమ కనబరచలేకపోయింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో 91 పరుగులకే ఆలౌట్ కావడం వారి వైఫల్యానికి నిదర్శనం. చెత్త రికార్డు ఈ క్రమంలో నాగ్పూర్ టెస్టులో ఘోర ఓటమితో ఆస్ట్రేలియా ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. టెస్టుల్లో భారత గడ్డపై ఓ ఇన్నింగ్స్లో ఆసీస్కిదే అత్యల్ప స్కోరు. 2004లో ముంబై మ్యాచ్లో 93 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ఇక అంతకుముందు.. 1981లో సొంతగడ్డపై మెల్బోర్న్లో టీమిండియాతో టెస్టులో 83 పరుగులకే ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా. నాటి మ్యాచ్లో భారత ఆల్రౌండర్ కపిల్ దేవ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. సెంచరీ వీరుడు గుండప్ప విశ్వనాథ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఆ టెస్టులో టీమిండియా ఆస్ట్రేలియాపై 59 పరుగుల తేడాతో గెలిచింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీ-2023- తొలి టెస్టు మ్యాచ్ స్కోర్లు భారత్- 400 ఆస్ట్రేలియా- 177 & 91 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రవీంద్ర జడేజా -
Ind Vs Aus: రోహిత్ శర్మ రికార్డు.. రితికా పోస్ట్ వైరల్
Rohit Sharma- Rithika Sajdeh: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే తన భర్త అద్భుత ఇన్నింగ్స్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘లవ్ యూ రోహిత్’’ అంటూ ప్రేమను కురిపించారు. కాగా రితికా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన వృత్తిగత, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అప్డేట్లు పంచుకోవడంతో పాటు ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మొదటి టెస్టులో రోహిత్ శర్మ బ్యాట్ ఝులిపించిన విషయం తెలిసిందే. కెప్టెన్ రికార్డు భారత్ తొలి ఇన్నింగ్స్లో 212 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్.. 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. టెస్టు కెప్టెన్గా రోహిత్కు ఇది తొలి శతకం. అదే విధంగా ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో తన ఇన్స్టా స్టోరీలో రోహిత్ శర్మ ఫొటో పంచుకున్న రితికా.. ఫింగర్స్ క్రాస్డ్ ఎమోజీని జత చేశారు. వీటికి రీప్లేస్మెంట్ పంపించు అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న ప్రతిసారి రితికా ఫింగర్స్ క్రాస్ చేసి.. తమకు అనుకూల ఫలితం రావాలంటూ ప్రార్థించిన దృశ్యాలు గతంలో వైరల్ అయ్యాయి. ఇక తన మేనేజర్గా పనిచేసిన రితికాతో ప్రేమలో పడ్డ రోహిత్ 2015లో ఆమెను పెళ్లాడాడు. వారికి కూతురు సమైరా శర్మ సంతానం. చదవండి: Axar Patel: 'మాకు మాత్రమే సహకరిస్తుంది'.. అక్షర్ అదిరిపోయే పంచ్ T20 WC: పాకిస్తాన్తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! -
'అందమైన భార్య ఉన్నా ఇదే చెప్తావా?'
నాగ్పూర్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చూడడానికి వచ్చిన ఒక అభిమాని తన చర్యతో అందరిని ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లి అంటే విపరీతమైన అభిమానం అనుకుంటా. కట్టుకున్న భార్య కంటే విరాట్ కోహ్లినే ఎక్కువ ఇష్టపడుతాను అంటూ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి కలిగించింది. అయితే దీనిపై కొందరు అభిమానులు ఫన్నీ సెటైర్లు వేశారు.. ''బాగానే ఉంది సంబరం.. ఒకవేళ నీకు అందమైన భార్య ఉంటే అప్పుడు కూడా ఇలాగే చెప్తావా''.. ''ఇంటికెళ్లిన తర్వాత నీకు బడితపూజ ఖాయం భయ్యా''.. కోహ్లి మీద అభిమానంతో కట్టుకున్న భార్యను అవమానిస్తావా'' అంటూ కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం గతంలో కోహ్లి సెంచరీ సాధించేంతవరకు పెళ్లి చేసుకోనని భీష్మించి కూర్చొన్న ఒక అభిమాని ఫోటోను రీట్వీట్ చేశారు. ఎంతైనా అభిమానం వెర్రిగానే ఉంటుంది. ముఖ్యంగా మన టీమిండియా ఫ్యాన్స్ అభిమానించడంలో ముందు వరుసలో ఉంటారు. సదరు క్రికెటర్ బాగా ఆడితే చప్పట్లు.. ఆడకపోతే చివాట్లు పెట్టడం సహజం. ఇక తొలి టెస్టు రసవత్తరంగా సాగుతుంది. తొలిరోజు టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాటర్ల పని పడితే.. రెండోరోజు ఆటలో ఆసీస్ బౌలర్లు ఆధిపత్యం చూపిస్తున్నారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో మెరవడం కాస్త ఊరటనిచ్చే అంశం. తన ఫామ్మై వస్తున్న విమర్శలకు సెంచరీతో సమాధానమిచ్చాడు రోహిత్. జట్టులో అంతా విఫలమైనప్పుడు ఆడడం తన స్పెషాలిటీ అని రోహిత్ మరోసారి నిరూపించాడు. 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు రీఎంట్రీ టెస్టులో మొదట బౌలింగ్తో అదరగొట్టి ఐదు వికెట్లతో రాణించిన జడేజా.. బ్యాటింగ్లోనూ ఫిఫ్టీతో మెరిశాడు. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. జడేజా 51, అక్షర్ పటేల్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో చెలరేగాడు. And yes, that’s his wife next to him. #INDvAUS #BGT2023 pic.twitter.com/FHv8GlA1uS — Adam Collins (@collinsadam) February 10, 2023 చదవండి: లియోన్ అనుకుంటే డెబ్యూ బౌలర్ ఇరగదీశాడు -
BGT 2023: అక్కడ ఆడటం ఈజీ కాదన్న షంసీ! చెత్త వాగకు అంటూ కౌంటర్
India vs Australia, 1st Test: చెత్త మాటలు మాట్లాడితే సహించేది లేదంటూ నెటిజన్కు చురకలంటించాడు సౌతాఫ్రికా బౌలర్ తబ్రేజ్ షంసీ. ఏదైనా మాట్లాడేటపుడు కాస్త ముందూ వెనుక ఆలోచించాలని సూచించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో క్రికెట్ ప్రపంచమంతా టెస్టు క్రికెట్ ఫీవర్లో మునిగిపోయిందనడంలో సందేహం లేదు. ప్రపంచ టెస్టు చాంపియన్షిన్ ఫైనలిస్టులను ఖరారు చేసే టీమిండియా- ఆస్ట్రేలియా సిరీస్పైనే అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో పిచ్, ఆటగాళ్ల బలాబలాలు తదితర అంశాలపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా తొలి టెస్టుకు వేదికైన నాగ్పూర్ పిచ్ను డాక్టర్డ్ పిచ్ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది. భారత జట్టు తమకు అనుకూలంగా(స్పిన్నర్లకు) పిచ్ తయారు చేయించుకుందని ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా మాజీలు సీఏకు గట్టి కౌంటర్ ఇచ్చారు. షంసీ ఆసక్తికర ట్వీట్ ఇక గురువారం భారత్- ఆసీస్ తొలి టెస్టు ఆరంభం కాగా తొలి రోజు టీమిండియానే పైచేయి సాధించింది. టీమిండియా స్పిన్నింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా ఐదు, రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీసి కంగారూ జట్టు పతనాన్ని శాసించారు. వీరి బౌలింగ్ను ఎదుర్కోలేక ఆసీస్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో.. సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రేజ్ షంసీ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘ఇండియాలో ఇండియాతో మ్యాచ్ ఆడటం అంత సులువేమీ కాదు’’ అంటూ ఫన్నీ ఎమోజీని జతచేశాడు. ఇక ఇందుకు స్పందించిన ఓ నెటిజన్.. ‘‘నీకు ఐపీఎల్ కాంట్రాక్ట్ కచ్చితంగా వస్తుంది.. కంగ్రాట్యులేషన్స్ బ్రో’’ అంటూ వెటకారం ప్రదర్శించాడు. అయితే, షంసీ సదరు ట్విటిజెన్కు ఘాటుగానే బదులిచ్చాడు. చెత్త వాగకు.. ‘‘నేను ఇండియాలో ఇండియాతో మ్యాచ్లు ఆడాను. బహుశా నువ్వు ఆ మ్యాచ్లు చూసి ఉండవు. నేను అక్కడ ఆడిన నా వ్యక్తిగత అనుభవం గురించి పంచుకున్నాను. నువ్వు మాత్రం ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెత్త వాగుతున్నావు. మన ఇద్దరి అభిప్రాయాల మధ్య చాలా తేడా ఉంది. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు.. థాంక్స్’’ అంటూ షంసీ కౌంటర్ ఇచ్చాడు. కాగా టీమిండియాతో పలు మ్యాచ్లు ఆడిన చైనామన్ స్పిన్నర్ షంసీ.. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్-2023 వేలం నేపథ్యంలో కోటి రూపాయల కనీస ధరతో పేరు నమోదు చేసుకోగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. దీంతో సదరు నెటిజన్ ఈ మేరకు కామెంట్ చేయగా.. షంసీ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. చదవండి: IND VS AUS 1st Test: భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు IND vs AUS: ఆసీస్ స్పిన్నర్ దెబ్బకు సూర్యకు మైండ్ బ్లాంక్.. అయ్యో ఇలా జరిగిందే!! I've played against India in India and you havnt...... I'm speaking about something from personal experience and you are speaking nonsense just for the sake of speaking nonsense There is a huge difference between the two No need to throw rubbish comments around... thanks https://t.co/SfNHmHY8yh — Tabraiz Shamsi (@shamsi90) February 9, 2023 -
అమ్మను హత్తుకున్న మధురజ్ఞాపకం! ఆయన వల్లే ఇదంతా అంటూ భావోద్వేగం
India vs Australia, 1st Test- KS Bharat: ‘‘నేను ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి వరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. సుదీర్ఘ ప్రయాణంలో.. ఇప్పుడిలా.. నా టెస్టు జెర్సీని చూసిన క్షణాలు అత్యంత విలువైనవి. నాకిది గర్వకారణం! ఈ ప్రయాణం భావోద్వేగాలతో కూడుకున్నది’’ అంటూ వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ ఉద్వేగానికి లోనయ్యాడు. దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు సందర్భంగా అరంగేట్రం చేశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యుల నడుమ టీమిండియా క్యాప్ అందుకున్న భరత్.. తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఆయన వల్లే ఇదంతా.. ఈ నేపథ్యంలో భరత్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ‘‘నేనిక్కడివరకు వచ్చానంటే అందుకు కారణం మా కోచ్ జై క్రిష్ణారావు. నాపై నాకు నమ్మకం లేని సమయంలో ఆయన నాపై విశ్వాసం ఉంచారు. నిజానికి నాపై నాకంటే ఆయనకే ఎక్కువ నమ్మకం. ఆయన వల్లే ఇదంతా! ఒక్కరోజులో ఇదేమీ సాధ్యం కాలేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను. 2018లో ఇంగ్లండ్తో ఇండియా-ఏ తరఫున ఆడినపుడు రాహుల్ సర్ నన్ను మొదటిసారి చూశారు. చాలా సేపు మేము మాట్లాడుకున్నాం. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా ఆడటమే నాకు ముఖ్యం. నేనెప్పుడూ అలాగే ఆలోచించాలని ఆయన నాతో చెబుతూ ఉంటారు’’ అని 29 ఏళ్ల కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: IND vs AUS: తొలి బంతికే సిరాజ్ వికెట్.. రోహిత్, ద్రవిడ్ రియాక్షన్ మామూలుగా లేదుగా! వీడియో వైరల్ KS Bharat: కేఎస్ భరత్ అరంగేట్రం.. సీఎం జగన్ శుభాకాంక్షలు View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
Ind Vs Aus: కేఎస్ భరత్ అరంగేట్రం.. సీఎం జగన్ ట్వీట్
CM YS Jagan Tweet On KS Bharat Debut: భారత క్రికెట్ జట్టులో కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా భరత్ ఫొటో షేర్ చేస్తూ అభినందనలు తెలియజేశారు. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఆస్ట్రేలియాతో నాగ్పూర్లో గురువారం ఆరంభమైన తొలి టెస్టుతో ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. భరత్తో పాటు టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున తొలి టెస్టు ఆడుతున్నాడు. Our very own @KonaBharat is debuting today with the Indian Cricket Team in the ongoing test against Australia. My congratulations and best wishes to him. The Telugu flag continues to fly high!#TeluguPride pic.twitter.com/KlDACbHBhF — YS Jagan Mohan Reddy (@ysjagan) February 9, 2023 శ్రీకర్ భరత్ గురించి ఆసక్తికర విషయాలు ►ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన శ్రీకర్ భరత్ 1993, అక్టోబరు 3న జన్మించాడు. ►2012లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో అతడు అరంగేట్రం చేశాడు. ►29 ఏళ్ల శ్రీకర్ భరత్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉంటున్నాడు. ►2015లో గోవాతో జరిగిన రంజీ మ్యాచ్లో భరత్ 308 పరుగులు చేసి రంజీల్లో ట్రిపుల్ సెంచరీ సాధించి.. రంజీల్లో ఈ ఘనత సాధించిన తొలి కీపర్గా నిలిచాడు. ఐపీఎల్లో.. ►దూకుడైన బ్యాటర్గా పేరొందిన శ్రీకర్ భరత్ను ఐపీఎల్ మినీ వేలం-2021లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. 20 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. అంతకుముందు అతడు ఢిల్లీ డేర్డెవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్)కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. ►ఐపీఎల్-2021 సీజన్లో కోహ్లి కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భరత్ 191 పరుగులు సాధించాడు. ►ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి బెంగళూరు జట్టును గెలిపించాడు. ►ఐపీఎల్-2023 వేలంలో గుజరాత్ టైటాన్స్ భరత్ను కొనుగోలు చేసింది. 1.2 కోట్ల రూపాయలు వెచ్చించి అతడిని సొంతం చేసుకుంది. అప్పుడు ఎంపికైనా.. 2021లో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో భరత్కు మొదటిసారి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అయితే తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. రెండో మ్యాచ్లో సబ్స్టిట్యూట్గా వచ్చిన భరత్.. తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్నాడు. అదే విధంగా.. ఇటీవల బంగ్లాదేశ్తో పర్యటన సందర్భంగా టెస్టు జట్టుకు ఎంపికైనా.. రెండు మ్యాచ్లలోనూ బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో అద్భుత రికార్డు ఉన్న భరత్.. ఎట్టకేలకు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టెస్టుతో జాతీయ జట్టు తరపున ఆడుతుండటం విశేషం. చదవండి: T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం Debut in international cricket for @KonaBharat 👍 👍 A special moment for him as he receives his Test cap from @cheteshwar1 👌 👌#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/dRxQy8IRvZ — BCCI (@BCCI) February 9, 2023 -
KS Bharat: కల ఫలించింది.. టెస్టుల్లో అరంగేట్రం.. సూర్య, భరత్ ఉద్విగ్న క్షణాలు
Ind Vs Aus 1st Test Playing XI: టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలన్న టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు ఫలించింది. అదే విధంగా జాతీయ జట్టుకు ఆడాలన్న ఆంధ్ర రంజీ ప్లేయర్ కోన శ్రీకర్ భరత్ చిరకాల ఆకాంక్ష నెరవేరింది. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా వీరిద్దరు అరంగేట్రం చేశారు. గిల్కు మొండిచేయి.. ఓపెనర్గా రాహుల్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాగ్పూర్లో గురువారం ఆరంభమైన తొలి టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. సహచరుల కరతాళ ధ్వనుల నడుమ టీమిండియా క్యాప్ అందుకుని మురిసిపోతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఇక తొలి టెస్టులో ఇక కేఎస్ భరత్ వికెట్ కీపర్గా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. కేఎల్ రాహుల్.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనింగ్ చేయనున్నాడు. అద్భుత ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ శుబ్మన్ గిల్కు మొండిచేయే ఎదురైంది. టాస్ ఓడి ఈ మ్యాచ్లో టీమిండియా ముగ్గురు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. ఇద్దరు పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్తో బరిలోకి దిగింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడిన భారత్ ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత ఫీల్డింగ్ చేయనుంది. ఈ సిరీస్ మాకు అత్యంత ముఖ్యమైనది ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము టాస్ గెలిస్తే కచ్చితంగా బ్యాటింగే ఎంచుకునే వాళ్లం. పిచ్ కాస్త పొడిగా అనిపిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందనిపిస్తోంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ స్వభావం బోధపడుతుంది. ఈ సిరీస్ మాకు అత్యంత ముఖ్యమైనది.. గత ఐదారురోజులుగా మేము నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చాం. పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాం. ఈ మ్యాచ్లో మేము ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతున్నాం. భరత్, సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేస్తున్నారు’’ అని వెల్లడించాడు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు తుది జట్లు: టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్, మాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్కాంబ్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్ Debut in international cricket for @KonaBharat 👍 👍 A special moment for him as he receives his Test cap from @cheteshwar1 👌 👌#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/dRxQy8IRvZ — BCCI (@BCCI) February 9, 2023 As @KonaBharat gets set for the biggest day in his life, the Test debutant recalls his long journey to the top 👍 👍 - By @RajalArora FULL INTERVIEW 🎥 🔽 #TeamIndia | #INDvAUS https://t.co/BLCpG0eOns pic.twitter.com/mih3f2AdIk — BCCI (@BCCI) February 9, 2023 SKY makes his TEST DEBUT as he receives the Test cap from former Head Coach @RaviShastriOfc 👏 👏 Good luck @surya_14kumar 👍 👍#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/JVRyK0Vh4u — BCCI (@BCCI) February 9, 2023 -
గతం అనవసరం... మా జట్టు బలంగా ఉంది! మరి ఇవేం మాటలు?
India Vs Australia 2023 - 1st Test: ‘‘భారత గడ్డపై ఆసీస్ పాత రికార్డు గురించి మాట్లాడటం అనవసరం. అప్పుడు వారు ఎలా ఆడినా, ఇప్పటి మా టీమ్ చాలా బాగుంది. కఠిన పరిస్థితులకు, ఎలాంటి సవాళ్లకైనా మేం సిద్ధం’’ అని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఏ తరహా పిచ్ ఉన్నా దానికి తగ్గట్టు తమ ఆటను మార్చుకుంటామని పేర్కొన్నాడు. కాగా నాగ్పూర్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య గురువారం (ఫిబ్రవరి 9) టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కమిన్స్.. తమ జట్టు ప్రస్తుతం పటిష్టంగా ఉందని, ఎలాంటి పిచ్పై అయినా సమర్థవంతంగా ఆడగలమని చెప్పుకొచ్చాడు. కాగా తమకు అనుకూలించేలా భారత జట్టు పిచ్ తయారు చేయించుకుందంటూ('డాక్టర్డ్ పిచ్(Doctored Pitch) క్రికెట్ ఆస్ట్రేలియా అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కమిన్స్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాంటి వాళ్లు ఇలా ఆలోచించరు ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘‘టాస్ సమయంలోనే అన్ని పరిస్థితులను అంచనా వేసి దానికి తగినట్లుగానే తుది జట్టును ఎంపిక చేస్తాం. మేం పిచ్ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బాగా ఆడటంపైనే మా దృష్టి. గతంలోనూ ఇలాంటి చర్చ జరిగింది. 22 మంది కూడా నాణ్యమైన ఆటగాళ్లే బరిలోకి దిగుతారు. వారు బంతి ఎంత టర్న్ అవుతుంది, స్వింగ్ అవుతుంది ఇలాంటివి ఆలోచించరు’’ అని కంగారూ ఆటగాళ్లకు చురకలు అంటించాడు. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్టు ఫిబ్రవరి 09, గురువారం- ఫిబ్రవరి 13, సోమవారం- విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్పూర్, మహారాష్ట్ర పిచ్, వాతావరణం సందేహం లేకుండా స్పిన్కు అనుకూలమైన పిచ్. మ్యాచ్ ఆరంభమయ్యాక ఎంత తొందరగా టర్న్ కావడం మొదలవుతుందనేది ఆసక్తికరం. అనుకూల వాతావరణం. వర్షం సమస్య లేదు. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, ఛతేశ్వర్ పుజారా, కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎస్ భరత్, అక్షర్పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియా: ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, హ్యాండ్స్కోంబ్/రెన్షా, అలెక్స్ క్యారీ, అష్టన్ అగర్/మర్ఫీ, నాథన్ లియోన్, స్కాట్ బోలండ్. చదవండి: Gary Ballance: రెండు దేశాల తరఫున సెంచరీలు.. ఎన్నో ఆసక్తికర విశేషాలు ICC T20I Rankings: దుమ్మురేపిన శుభ్మన్ గిల్.. సత్తా చాటిన హార్ధిక్ పాండ్యా 𝐓𝐡𝐞 𝐝𝐚𝐲 𝐰𝐞 𝐡𝐚𝐯𝐞 𝐛𝐞𝐞𝐧 𝐰𝐚𝐢𝐭𝐢𝐧𝐠 𝐟𝐨𝐫 𝐚𝐧𝐝 𝐭𝐡𝐞 𝐬𝐞𝐫𝐢𝐞𝐬 𝐰𝐞 𝐡𝐚𝐯𝐞 𝐛𝐞𝐞𝐧 𝐩𝐫𝐞𝐩𝐚𝐫𝐢𝐧𝐠 𝐟𝐨𝐫! The Border-Gavaskar Trophy is upon us! Let's get this rolling!#INDvAUS @mastercardindia pic.twitter.com/a8awUcQOqh — BCCI (@BCCI) February 8, 2023 Lights 💡 Camera 📷 Action ⏳ 🎥 Snippets from #TeamIndia's headshots session ahead of the #INDvAUS Test series! 👌 👌 pic.twitter.com/sQ6QIxSLjm — BCCI (@BCCI) February 7, 2023 -
Border-Gavaskar Trophy 2023: అసలు సిసలు ‘పరీక్ష’
సమయం వచ్చేసింది... ధనాధన్ క్రికెట్ తరంలో టెస్టు క్రికెట్ను సజీవంగా నిలబెడుతూ అంతా ఎదురు చూస్తున్న పోరుకు రంగం సిద్ధమైంది... హోరాహోరీ సమరాలు, పోటాపోటీ మాటల తూటాలు, అగ్రశ్రేణి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనలు, అనూహ్య మలుపులు, చిరస్మరణీయ ఫలితాలు... ఒకటేమిటి భారత్, ఆస్ట్రేలియా మధ్య పోరు అంటే అన్ని రకాల దినుసులతో కూడిన సంపూర్ణ భోజనం... గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లతో ‘యాషెస్’ను మించి అభిమానులను అలరిస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ కోసం ఇరు జట్లు సమస్త అస్త్రాలు, సర్వ సన్నాహాలతో బరిలోకి దిగబోతున్నాయి. 33 రోజుల వ్యవధిలో సాగే ఈ నాలుగు టెస్టుల్లో తుది విజేతగా ఎవరు నిలిచినా... అభిమానులకు ఫుల్ వినోదం మాత్రం గ్యారంటీ! నాగ్పూర్: తొలి వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో రన్నరప్గా నిలిచిన భారత జట్టు మరోసారి ఫైనల్కు అర్హత సాధించే లక్ష్యంతో సొంతగడ్డపై అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా కనీసం మూడు మ్యాచ్లు గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ బృందం భారత గడ్డపై సిరీస్ గెలిచే ‘అత్యంత కఠిన ఆపరేషన్’ కోసం తమ సర్వశక్తులూ ఒడ్డనుంది. తమ దేశంలోనే వరుసగా రెండుసార్లు టీమిండియాకు సిరీస్లు కోల్పోయిన కంగారూ బృందం ఇక్కడ సత్తా చాటి ప్రతీకారం తీర్చుకోగలదా అనేది ఆసక్తికరం. స్వదేశంలో అసమాన రికార్డు, తాజా ఫామ్ చూస్తే భారత్దే పైచేయిగా కనిపిస్తున్నా... ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టును తక్కువగా అంచనా వేస్తే భంగపాటు తప్పదు. కేఎస్ భరత్ అరంగేట్రం? తుది జట్టులో కచ్చితంగా ఉండే ఆరుగురు కాకుండా మిగతా ఐదు స్థానాలకు జట్టులో పోటీ నెలకొని ఉంది. చివరి నిమిషంలో టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరం. రోహిత్, పుజారా, కోహ్లి, అశ్విన్, జడేజా, షమీ ఆడటం ఖాయం కాగా, వైస్ కెప్టెన్గా ఇప్పటికే రెండుసార్లు మీడియా సమావేశాలకు వచ్చిన కేఎల్ రాహుల్ స్థానానికి కూడా ఢోకా ఉండకపోవచ్చు. రోహిత్కు ఓపెనింగ్ భాగస్వామిగా రాహులే బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే గాయంతో దూరమైన శ్రేయస్కు బదులుగా మిడిలార్డర్లో గిల్, సూర్యకుమార్లలో ఒకరినే ఎంచుకోవాల్సి ఉంటుంది. వన్డేలు, టి20ల్లో కలిపి గత ఏడు ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు చేసిన గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతనికే తొలి ప్రాధాన్యత. సూర్యకుమార్ ప్రధానంగా టి20 ఫామ్తోనే టీమ్లోకి వచ్చాడు. అతని ఫస్ట్ క్లాస్ రికార్డు (45.93 సగటు) మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే పంత్ లేకపోవడంతో అతని తరహాలో తక్కువ సమయంలో ఎదురుదాడికి దిగి ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసే దూకుడు సూర్యలో ఉందని మేనేజ్మెంట్ భావిస్తోంది. అలా చూస్తే సూర్య కీలకమవుతాడు. కీపర్ స్థానం కోసం ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్ మధ్య పోటీ ఉంది. ఎడంచేతి వాటం, ధాటి ఇషాన్ సొంతమైనా... ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని కీపింగ్ సామర్థ్యంపై సందేహాలు ఉన్నాయి. మరోవైపు మూడో స్పిన్నర్గా అక్షర్ పటేల్ను ఆడిస్తారా లేక వైవిధ్యం కోసం కుల్దీప్ను తీసుకుంటారా చూడాలి. ఎంత స్పిన్ పిచ్ అయినా సరే నాలుగో స్పిన్నర్ ఆలోచన లేకపోవచ్చు. షమీతో పాటు సిరాజ్ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువ. అశ్విన్, జడేజా చెలరేగితే ఆసీస్ బెంబేలెత్తిపోవడం ఖాయం. రెండో స్పిన్నర్ ఎవరు? ఆస్ట్రేలియా టాప్–5 బ్యాటింగ్ లైనప్ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. భారత గడ్డపై టెస్టుల్లో పేలవమైన రికార్డు ఉన్న వార్నర్ ఈసారి దానిని చక్కదిద్దుకుంటాడా అనేది చూడాలి. ఎప్పటిలాగే స్మిత్ అసమాన బ్యాటింగ్పై ఆసీస్ ఆధారపడుతోంది. నాటి సిరీస్లో అతనికి మరే బ్యాటర్ నుంచి సహకారం లభించలేదు. ఈసారి ఆ పాత్రను పోషించేందుకు దాదాపు స్మిత్లాంటి సామర్థ్యం ఉన్న లబుషేన్ సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్లో హాజల్వుడ్ దూరం కావడంతో కెప్టెన్ కమిన్స్పై బాధ్యత పెరిగింది. ప్రధాన స్పిన్నర్ నాథన్ లయన్ ఆ జట్టు కీలక అస్త్రం కాగా, అతనికి అండగా ఎవరు నిలుస్తారో చూడాలి. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ యాష్టన్ అగర్కంటే కొత్త ఆటగాడు మర్ఫీకి ఎక్కువ సానుకూలతలు ఉన్నాయి. తుది జట్లు (అంచనా): భారత్: రోహిత్ (కెప్టెన్), రాహుల్, పుజారా, కోహ్లి, గిల్/సూర్యకుమార్, జడేజా, అశ్విన్, భరత్, అక్షర్/కుల్దీప్, షమీ, సిరాజ్. ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), వార్నర్, ఖాజా, లబుషేన్, స్మిత్, హెడ్, హ్యాండ్స్కోంబ్/రెన్షా, క్యారీ, అగర్/మర్ఫీ, లయన్, బోలండ్. -
'పిచ్పై ఏడ్వడం మానేసి ఆటపై ఫోకస్ పెట్టండి'
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్తో కఠినమైన సవాల్ను ఎదుర్కోనున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. వన్డే, టి20ల్లో టాప్ ర్యాంక్లో ఉన్న టీమిండియా టెస్టుల్లో కూడా నెంబర్వన్ కావాలంటే సిరీస్ విజయం తప్పనిసరి. ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేది లేనిది కూడా సిరీస్ విజయంతోనే ముడిపడి ఉంది. ఒక రకంగా రోహిత్కు ఇది సవాల్ అని చెప్పొచ్చు. అంతేకాదు ఒకవేళ ఆసీస్తో సిరీస్ను ఓడిపోతే రోహిత్ కెప్టెన్సీతో పాటు టెస్టు కెరీర్కు ముగింపు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రోహిత్ ఎంత జాగ్రత్తగా ఆడితే అంత మంచిది. ఇదిలా ఉంటే తొలిటెస్టు జరగనున్న నాగ్పూర్ పిచ్ను ఆస్ట్రేలియా క్రికెట్ 'డాక్టర్డ్ పిచ్(Doctored Pitch)' అని పేర్కొనడం ఆసక్తి రేపింది. అంతేకాదు జట్టు వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు పిచ్ను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. స్మిత్ వ్యవహారంపై క్రికెట్ అభిమానులు ట్రోల్స్, మీమ్స్తో రెచ్చిపోయారు. అయితే మ్యాచ్కు రెండురోజుల ముందు క్యురేటర్ రోలింగ్కు ముందు.. పిచ్ సెంటర్లో వాటర్ కొట్టడంతో సమస్య మొదలైంది. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేసే లెగ్స్టంప్వైపు మరోసారి నీళ్లు కొట్టి రోలింగ్ చేశారు. దీనిని ఆస్ట్రేలియా క్రికెట్ తప్పుబట్టింది. భారత్ తమకు అనుకూలంగా పిచ్ తయారు చేసుకోవడం మంచిదే.. కానీ ఇలా పదే పదే పిచ్ను నీళ్లతో తడపడం మాకు నచ్చలేదని.. ఇదొక 'డాక్టర్డ్ పిచ్(Doctored Pitch)'లాగా తయారైందంటూ కామెంట్ చేశారు. ఇక స్మిత్ కూడా పిచ్పై లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్కు బ్యాటింగ్ చేయడం కాస్త కఠినంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా క్రికెట్ సహా స్టీవ్ స్మిత్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. 'డాక్టర్డ్ పిచ్(Doctored Pitch)' అని పేర్కొన్న ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ''నాగ్పూర్ పిచ్పై ఆస్ట్రేలియా క్రికెట్ చేస్తున్న ఆరోపణలు వింతగా అనిపిస్తున్నాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడం కోసమే వాటర్ కొట్టి పిచ్ను ఎక్కువసార్లు రోలింగ్ చేశారు. అనవసరంగా దీనిని పెద్ద విషయం చేస్తున్నారు. పిచ్పై మాట్లాడడం మానేసి ఆటపై ఫోకస్ చేయడం మంచిది.'' అని పేర్కొన్నాడు. ''టెస్టు క్రికెట్ టైమ్ అయిపోయిందని చాలా మంది అంటున్నారు. అయితే నాగ్పూర్ టెస్టు మొదటి రోజు మ్యాచ్కే 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది టెస్టు క్రికెట్కి ఉన్న క్రేజ్.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడానికి నాలుగు సాలిడ్ మ్యాచులు ఉన్నాయి. ఈ సిరీస్ మాకు ఛాలెంజింగ్గా ఉంటుందని తెలుసు. అయితే గెలవడానికి ఏం చేయాలో, ఎలా చేయాలో మాకు పక్కాగా తెలుసు. ఏ మ్యాచ్కి అయిన సన్నద్ధత చాలా ముఖ్యం. రేపు ఆడబోయే 22 మంది క్రికెటర్లు కూడా క్వాలిటీ క్రికెట్ ఆడతారు.ఎవరైతే బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తారో వాళ్లకే విజయం వరిస్తుంది. రిషబ్ పంత్ ఈ సిరీస్లో లేకపోవడం తీరని లోటే. అయితే అతని రోల్ని భర్తీ చేయగల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. శుబ్మన్ గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. భారీ సెంచరీలు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఏం చేయగలడో అందరికీ తెలుసు. ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనేది ఇంకా డిసైడ్ చేయలేదు. మ్యాచ్ సమయానికి ఈ విషయంలో క్లారిటీ రానుంది.'' అని చెప్పుకొచ్చాడు. Picture Perfect 📸 🏆 CAN. NOT. WAIT ⌛️#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/OqvopNKbHd — BCCI (@BCCI) February 8, 2023 The Nagpur pitch could prove testy for the Aussie left-handers....#INDvAUS pic.twitter.com/fbmN0nFsbX — SEN Cricket (@SEN_Cricket) February 8, 2023 Steve Smith thinks left-handers could have it particularly tough in Nagpur #INDvAUS pic.twitter.com/EudwrlHIRu — cricket.com.au (@cricketcomau) February 7, 2023 చదవండి: 'ఓరి మీ వేశాలో.. కాస్త ఎక్కువైనట్టుంది!' ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో -
ఆసీస్తో తొలి టెస్టు.. నాగ్పూర్ చేరుకున్న టీమిండియా
నాగ్పూర్: కివీస్తో సిరీస్ తర్వాత టీమిండియా సంప్రదాయ క్రికెట్కు సమాయత్తమవుతోంది. పటిష్టమైన ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు నాగ్పుర్ వేదిక కానుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్స్ ఫైనల్స్లో టీమిండియా అవకాశాలు సన్నగిల్లకుండా ఉండాలంటే ఈ సిరీస్ తప్పకుండా గెలవాలి. ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్కు చేరుకుంది. ఆసీస్తో సిరీస్ను టీమిండియా 3-1తో గెలిస్తే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 10 టెస్టుల్లో గెలుపు, ఒక ఓటమి, నాలుగు డ్రాలతో కలిపి 75.56 పర్సంటైల్ పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. ఐదు టెస్టుల్లో గెలుపు, నాలుగింటిలో ఓటమి, ఒక డ్రాతో కలిపి 58.93 పర్సంటైల్ పాయింట్లతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. దీంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా భారత జట్టు తొలి టెస్టు కోసం నాగ్పుర్ చేరుకుంది. మహమ్మద్ సిరాజ్ సహా పలువురు ఆటగాళ్లు నాగ్పుర్ చేరుకున్నారు. రవీంద్ర జడేజాతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ నాగ్పుర్ విమానాశ్రయంలో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ టెస్టుకు రవీంద్ర జడేజా పునరాగమనం చేసే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత అతడు జట్టులోకి రానున్నాడు. ఇటీవల రంజీ సీజన్లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్లతో రాణించాడు. విరాట్ కోహ్లీ, శుబ్మన్ గిల్, కేఎల్ రాహుల్తో పాటు జడేజా చేరిక కూడా భారత జట్టుకు మరింత బలం చేకూరనుంది. ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ లాంటి పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా.. భారత్తో టెస్టు మ్యాచ్ల్లో రాణించలేకపోయింది. గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను చేజార్చుకుంది. దీంతో ఈ సిరీస్తో పుంజుకోవాలని చూస్తున్నారు. ఆస్ట్రేలియా భారత పర్యటన షెడ్యూల్: ఫిబ్రవరి 09- మార్చి 22.. టెస్టు సిరీస్తో ప్రారంభం- వన్డే సిరీస్తో ముగింపు నాలుగు టెస్టుల సిరీస్ ► ఫిబ్రవరి 9- 13: నాగ్పూర్ ► ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ ► మార్చి 1-5: ధర్మశాల ► మార్చి 9- 13: అహ్మదాబాద్ మూడు వన్డేల సిరీస్ ► మార్చి 17- ముంబై ► మార్చి 19- వైజాగ్ ► మార్చి 22- చెన్నై చదవండి: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు.. పఠాన్ను ఉతికారేసిన విండీస్ స్టార్ -
మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్.. గడ్కరీ, ఫడ్నవీస్కు భంగపాటు!
ముంబై: మహారాష్ట్రలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల్లో మహావికాస్ అగాడీ (ఎంవీఏ) కూటమి మద్దతు అభ్యర్థి సుధాకర్ అద్బాలే ఘన విజయం సాధించారు. వివరాల ప్రకారం.. నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నాగో గనార్పై మహావికాస్ అగాడీ కూటమి అభ్యర్థి సుధాకర్ అద్బాలే గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 34,360 ఓట్ల పోల్ అవగా.. సుధాకర్ అద్బాలే 16,700 ఓట్లు సాధించగా, నాగో గనార్కు 8,211 ఓట్లు మాత్రమే పడ్డాయి. కాగా, నాగపూర్ బీజేపీ కీలక నేతలైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు సొంత ప్రాంతం కావడం గమనార్హం. అంతేకాకుండా ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయం కూడా నాగ్పుర్లోనే ఉండటం విశేషం. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థి ఓడిపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. మరోవైపు.. ప్రస్తుతం నాగపూర్ ఎంపీగా గడ్కరీ ఉండగా, నాగపూర్ (సౌత్ వెస్ట్) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫడ్నవీస్ గత 3 దఫాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ నాగ్పుర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిలో బీజేపీ ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం. కాగా, జనవరి 30న మూడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇక, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం జరిగింది. -
అట్టహాసంగా ముగిసిన ఫార్మసీ కాంగ్రెస్.. హైదరాబాద్లో నెక్స్ట్
సాక్షి, నాగ్పూర్: కోవిడ్ మహమ్మారి సమయంలో డాక్టర్లు, నర్సులతో సమానంగా ఫార్మసిస్టులు తమ బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. నాగ్పూర్లో ఇటీవలే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ మహాసభలు జరగ్గా.. కొద్ది రోజులకే ఇండియన్ ఫార్మసీ కాంగ్రెస్ మహాసభలు ఇంత పెద్ద ఎత్తున జరగడం అభినందనీయమన్నారు గడ్కరీ. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోషియేషన్ తరపున 72వ భారతీయ ఫార్మస్యూటికల్ కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. జనవరి 20వ తేదీన ప్రారంభం కాగా, కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభోపన్యాసం చేశారు. ఇవాళ్టితో( 22 తేదీతో) మహాసభలు ముగిశాయి. ముగింపు సమావేశాలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరయ్యారు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ VG సోమాని అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో "యాక్సెస్ టు క్వాలిటీ అండ్ అఫర్డబుల్ మెడికల్ ప్రోడక్ట్స్" అన్న అంశంపై చర్చ జరిగింది. ఈ సభలకు దేశవ్యాప్తంగా పదివేల మంది ఫార్మసీ విద్యార్థులు, రెండున్నర వేల మంది శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, ఫార్మసీ పరిశ్రమల యజమానులు హాజరయ్యారు. ఈ సభల వేదికగా తమ వార్షిక నివేదికను సమర్పించారు ఐపీసీఏ సెక్రటరీ జనరల్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసొసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టీవీ నారాయణ. భారతీయ ఫార్మసీ రంగ పరిణామ క్రమాన్ని తన నివేదికలో సవివరంగా తెలిపారు. కోవిడ్ సమయంలో మన దేశం ప్రపంచానికి కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్లను అందించిందని, దాని వెనక ఇండియన్ ఫార్మసీల ఘనత ఉందని కొనియాడారు టీవీ నారాయణ. తెలంగాణ నుంచి హాజరైన ఫార్మా ప్రతినిధులు ఈ మహాసభల్లో భారత్ బయోటెక్ అధినేత, పద్మభూషణ్ కృష్ణ ఎల్లా, ప్రపంచ ఫార్మసీ సమాఖ్య అధ్యక్షులు డామ్నిక్ జోర్డాన్, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ మోంటు పటేల్, కామన్ వెల్త్ దేశాల ఫార్మసీ సంఘ పూర్వ అధ్యక్షులు డాక్టర్ రావు వడ్లమూడి, నాగ్పూర్ సభల ఫార్మసీ కాంగ్రెస్ నిర్వహణ ఛైర్మన్ అతుల్ మండ్లేకర్, మహాసభల కార్యదర్శి ప్రొఫెసర్ మిలింద్ ఉమేకర్, ఐపీసీఏ కోశాధికారి డాక్టర్ సి.రమేష్, ఇతర ఫార్మసీ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఫార్మసీ అభ్యసిస్తోన్న వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమ ముఖ్యఅతిథి ఫడ్నవీస్ నాగ్పూర్ వేదికగా మూడు రోజులుగా జరిగిన ఫార్మసీ కాంగ్రెస్ సభల్లో ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. వంద సంవత్సరాల నాగ్పూర్ యూనివర్సిటీ ఫార్మసీ డిపార్ట్మెంట్ పూర్వ విద్యార్థులు వెలువరించిన ప్రత్యేక సంచికను ఫడ్నవీస్ ఆవిష్కరించారు. వచ్చే ఏడాది మహాసభలకు వేదిక హైదరాబాద్ జనవరి 2024లో జరగనున్న 73వ భారతీయ ఫార్మసీ కాంగ్రెస్ మహాసభలను హైదరాబాద్లో నిర్వహించాలని ఈ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్టు ఐపీఏ అధ్యక్షులు టీవీ నారాయణ ప్రకటించారు. తెలంగాణ ఐపీఏ అధ్యక్షులు డాక్టర్ బి.ప్రభాశంకర్ అధ్వర్యంలో జరిగే ఈ మహా సభలకు దేశవ్యాప్తంగా 15 వేల మంది ఫార్మసీ విద్యార్థులు, ఫార్మసీ రంగ ప్రముఖులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఫార్మసీ కళాశాలల సంఘ నాయకులు డాక్టర్ కె.రామదాసు, టి. జైపాల్రెడ్డి, పుల్లా రమేష్ బాబు, ఏ.ప్రభాకర్రెడ్డి, మొలుగు నరసింహారెడ్డి, బొమ్మా శ్రీధర్, మధుసూధన్రెడ్డి, ఇతర ఫార్మసీ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. -
భారత క్రికెటర్కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు
టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడని నమ్మి పని ఇస్తే నట్టేట ముంచాడు. ఫ్లాట్ కొనుగోలు పేరిట ఉమేశ్ యాదవ్ను బురిడీ కొట్టించి రూ. 44 లక్షలు ఎగనామం పెట్టాడు. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్పూర్లోని కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రే (37)తో ఉమేశ్ యాదవ్కు ఎంతోకాలంగా స్నేహం ఉంది. శైలేష్ కు ఉద్యోగం లేపోవడంతో ఉమేశ్ తన మేనేజర్ గా జూలై 2014లో నియమించుకున్నాడు.ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించాడు. ఉమేశ్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు. ఈ క్రమంలో రూ.44లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేశ్ ను నమ్మించి ఆ ఫ్లాట్ ను తన పేరిట రిజిస్ట్రర్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకుని క్రికెటర్ ఉమేశ్ యాదవ్ నివ్వెరపోయాడు. నమ్మిన స్నేహితుడే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని శైలేష్ను కోరాడు. అయితే డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించడంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు.ఉమేశ్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసుల రంగంలోకి దిగారు. ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఇక 2011లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఉమేశ్ యాదవ్ కొంతకాలంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. 12 ఏళ్ల కెరీర్లో ఉమేశ్ యాదవ్ 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'భారీ స్కోర్లు రావడం లేవని తెలుసు.. కచ్చితంగా సెంచరీ కొడతా' -
రూట్లు రెడీ.. నాగ్పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందే భారత్ రైలు?
సాక్షి, కరీంనగర్: దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్ రైలు’ను పూర్తిస్థాయిలో నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. జనవరి 15వ తేదీన సికింద్రాబాద్– విశాఖపట్నం రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పట్టాలపైనా వందేభారత్ పరుగులు తీస్తుందా? అన్న సామాన్యుల అనుమానాలకు దక్షిణ మధ్య రైల్వే తెరదించింది. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో రైల్వే లైను ఉంది. సిరిసిల్లకు రూటు ప్రగతిలో ఉంది. ఇటీవల దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందేభారత్కు అనుగుణంగా ఈ రూట్లలో వేగాన్ని పెంచారు. పెద్దపల్లి– కరీంనగర్, కరీంనగర్– జగిత్యాల, జగిత్యాల–నిజామాబాద్ రూట్లలో ఈ రైలును నడపగలిగితే.. పొరుగున ఉన్న మహారాష్ట్రకు కేవలం మూడు నాలుగు గంటల్లోనే చేరుకునే వీలుంది. ముఖ్యంగా సిరిసిల్ల, జగిత్యాలలోని నేత, వలస కార్మికులకు ఇది ఎంతో అనువుగా ఉంటుంది. అన్ని డివిజన్లలో.. దక్షిణ మధ్యరైల్వే పరిధిలో మొత్తం ఆరు డివిజన్లు సికింద్రాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, హైదరాబాద్ ఉన్నాయి. అన్ని రూట్లలోనూ గరిష్ట వేగంతో వెళ్లేలా ఇటీవలే రైల్వేలైన్లను ఆధునీకరించారు. విభజన అనంతరం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు తెలంగాణలో ఉన్నాయి. వందేభారత్ రైలు గరిష్ట వేగం 160 నుంచి 180 కి.మీలతో ప్రయాణించగలదు. అందుకు అనుగుణంగా రైలు పట్టాల సామర్థ్యం పెరగాలి. దక్షిణ మధ్య రైల్వే ఇటీవల చేపట్టిన అప్గ్రేడేషన్ పనులతో ఇక్కడ గరిష్ట వేగం 130 కి.మీలకు చేరుకుంది. తెలంగాణలోని మూడు డివిజన్లలో వందే భారత్ రైలును నడపాల్సి వస్తే.. చాలా సెక్షన్లలో 130 కి.మీ గరిష్ట వేగంతో నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గరిష్ట వేగం 130 కి.మీ.. కనిష్టవేగం 30.కి.మీ ఈ రైలును మూడు డివిజన్లలోని పలు సెక్షన్లను పరిశీలిస్తే.. సామర్థ్యాన్ని బట్టి వేగం మారుతోంది. ఖాజీపేట– బల్లార్షా సెక్షన్లో 130 కి.మీ గరిష్ట వేగంతో దూసుకెళ్లగలదని అధికారులు తెలిపారు. అదే సమయంలో అతి తక్కువగా మల్కాజిగిరి– మౌలాలి సెక్షన్లో కేవలం 30.కి.మీ స్పీడుకే పరిమితం కావడం గమనార్హం. అయితే, వేగంపై లైన్ అప్గ్రేడేషన్తోపాటు లెవెల్ క్రాసింగ్స్, రైల్ ట్రాఫిక్ కూడా ప్రభావం చూపుతుంది. అత్యాధునిక సౌకర్యాలు.. ఆటోమేటిక్ డోర్స్, స్మోక్ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్ టాయ్లెట్స్, సెన్సార్తో పనిచేసే నల్లాలు, ఫుట్రెస్ట్లు వంటి ఆధునిక సదుపాయాలున్నాయి. మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నం. తొలి వందే భారత్ రైలు సర్వీసు 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ– వారణాసి మధ్య ప్రారంభమైంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు సర్వీసులు నడుస్తుండగా.. సికింద్రాబాద్– విజయవాడ మధ్య సర్వీసు ప్రారంభమైతే ఆ సంఖ్య ఎనిమిదికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు 20కిపైగా ప్రాంతాల నడుమ వందేభారత్ ఎక్స్ప్రెస్ నడపాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో హైదరాబాద్– తిరుపతి, హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– నాగ్పూర్ మార్గాలు ఉండటం విశేషం. రూటు స్పీడు ►సికింద్రాబాద్– బల్లార్షా 130 కి.మీ. ►ఖాజీపేట–కొండపల్లి 130 కి.మీ. ►సికింద్రాబాద్– ఖాజీపేట 130 కి.మీ. ►మానిక్నగర్– విరూర్ (3వలైన్) 110 కి.మీ. ►మందమర్రి– మంచిర్యాల కి.మీ(3వలైన్) 110 కి.మీ. ►మంచిర్యాల– పెద్దంపేట (3వలైన్) 100 కి.మీ. ►పెద్దంపేట– రాఘవపురం (3వ లైన్) 110 కి.మీ. ►రాఘవపురం– కొలనూరు–పొత్కపల్లి (3వలైన్) 90 కి.మీ. ►బిజిగిరి షరీఫ్– ఉప్పల్ (3వలైన్) 100 కి.మీ. ►పెద్దపల్లి– కరీంనగర్ 100 కి.మీ. ►కరీంనగర్– జగిత్యాల(లింగంపేట) 90 కి.మీ. ►జగిత్యాల(లింగంపేట)– నిజామాబాద్ 100 కి.మీ మేడ్చల్– మనోహరాబాద్ 110 కి.మీ మల్కాజిగిరి– మౌలాలి కార్డ్లైన్ సెక్షన్లలో 30 కి.మీ. ఈ ప్రాంతానికి ఎంతో మేలు ‘వందేభారత్’ రైలును బల్లార్షా– కాజీపేట మార్గంలో నడపాలి. నాగ్పూర్– సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్ రైలు ప్రస్తుతం ప్రతిపాదనలో ఉంది. ఈ మార్గంలో రైలు వస్తే.. రామగుండం లేదా మంచిర్యా లకు హాల్టింగ్ కల్పిస్తే.. కోల్బెల్ట్ పారిశ్రామిక ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. – కామని శ్రీనివాస్, సామాజిక కార్యకర్త రవాణా సదుపాయాలకు పెద్దపీట కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రవాణా సదుపాయాలకు, మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుందనడానికి వందేభారత్ రైలే పెద్ద ఉదాహరణ. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రైలు దేశంలోనే అత్యధిక వేగంతో వెళ్లడం విశేషం. భవిష్యత్తులో దేశంలోని ముఖ్యప్రాంతాలకు దీని సేవలు అందుబాటులోకి వస్తాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు సైతం త్వరలో దీని సేవలు అందుతాయి. – బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ -
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్..
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆయన కార్యాలయానికి ఫోన్ చేసిన దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. 10 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు ఫోన్ చేశారు. శనివారం ఉదయం 11.30, 11.40 గంటలకు దుండగుల నుంచి ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇది ఆకతాయి పని అయి ఉంటుందా? లేక ఎవరైనా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుండగుడు ఉపయోగించిన ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: 900 కిమీ దూరం.. గంటల వ్యవధిలోనే చనిపోయిన కవల సోదరులు.. -
గ్లోబల్ లీడర్లుగా ఎదగండి
నాగపూర్: భారత్ను స్వావలంబన దేశంగా తీర్చిదిద్దడానికి సైంటిస్టులు కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వారు తమ పరిజ్ఞానాన్ని ప్రజల రోజువారీ జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఉపయోగించాలని కోరారు. మహారాష్ట్రలోని నాగపూర్లో 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఐదు రోజులపాటు ఈ సదస్సు జరుగనుంది. శాస్త్రీయ విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సైన్స్తోపాటు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు సూచించారు. కొత్తగా పుట్టకొచ్చే వ్యాధులపై నిఘా పెట్టే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ ఆదరణ పొందుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విశేష కృషి చేయడం ద్వారా గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సైంటిస్టులకు ఉద్బోధించారు. సెమి కండక్టర్ల రంగంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు రావాలని కోరారు. పరిశోధకులు తమ ప్రాధాన్యతల జాబితాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీని చేర్చుకోవాలని చెప్పారు. ఇన్నోవేషన్ ఇండెక్స్లో 40వ స్థానం సైంటిస్టులు ప్రయోగశాలల నుంచి క్షేత్రస్థాయికి రావాలని, అప్పుడే వారి ప్రయత్నాలు గొప్ప ఘనతలుగా కీర్తి పొందుతాయని ప్రధానమంత్రి వెల్లడించారు. సైన్స్ ప్రయోగాల ఫలితాలను సామాన్య ప్రజలకు అందించాలన్నారు. టాలెంట్ హంట్, హ్యాకథాన్లతో యువతను సైన్స్ వైపు ఆకర్షితులను చేయాలని కోరారు. ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్లను రీసెర్చ్ ల్యాబ్లు, విద్యాసంస్థలతో అనుసంధానిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేశారు. క్వాంటమ్ కంప్యూటర్స్, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్, సెన్సార్స్, క్రిప్టోగ్రఫీ, న్యూ మెటీరియల్స్ దిశగా మన దేశం వేగంగా ముందుకు సాగుతోందని మోదీ వివరించారు. మన దేశంలో ఇంధన, విద్యుత్ అవసరాలు రోజురోజుకీ భారీగా పెరుగుతున్నాయని, ఈ రంగంలో కొత్త ఆవిష్కరణ ద్వారా దేశానికి లబ్ధి చేకూర్చాలని సైంటిఫిక్ సమాజానికి పిలుపునిచ్చారు. దేశంలో అభివృద్ధి కోసం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించుకుంటున్నామని తెలియజేశారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనదేశం 2015లో 81వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు 40వ స్థానానికి చేరిందని అన్నారు. -
ఛాంపియన్ అవ్వాలని వచ్చింది.. అనుమానాస్పద మృతి
కేరళకు చెందిన పదేళ్ల చిన్నారి ఫాతిమా నైదా షిహాబుద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జాతీయ సైక్లింగ్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఛాంపియన్గా నిలవాలన్న తన కోరిక తీరకుండానే మృతి చెందడం విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ వేదికగా జాతీయ సైక్లింగ్ పోలో చాంపియన్షిప్ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఫాతిమా బుధవారం నాగ్పూర్కు చేరుకుంది. అయితే గత రెండు రోజుల నుంచి విరేచనాలతో ఇబ్బంది పడుతున్న ఫాతిమా గురువారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో నిర్వాహకులు ఆమెను దంతోలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఎం-సెట్ అనే ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా చనిపోవడానికి వైద్యులు చేసిన ఇంజెక్షన్ కారణమా లేక వేరే ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే జాతీయ సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ఛాంపియన్గా నిలవాలనుకున్న 10 ఏళ్ల ఫాతిమా ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. కూతురి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
సీఎం షిండేకు ఎదురుదెబ్బ.. ఆ కేసులో హైకోర్టు మొట్టికాయలు!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నాగ్పూర్ ల్యాండ్ కేసులో బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంవీఏ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. కోర్టులో కేసు ఉన్నప్పటికీ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నాగ్పూర్ అభివృద్ధి ట్రస్టును ఎలా ఆదేశించారని ప్రశ్నించింది. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అగాడీ(ఎంవీఏ) ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు ఏక్నాథ్ షిండే. 2021లో మురికివాడల పేదల కోసం కేటాయించిన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే 16 మంది బిల్డర్స్కు కేటాయించారు షిండే. దీనిపై ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ షిండే ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. రూ.83 కోట్లు విలువ చేసే భూమికి నాగ్పూర్ అభివృద్ధి ట్రస్టుకు కేవలం రూ.2 కోట్ల లోపే దక్కాయని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ చేస్తున్న బాంబే హైకోర్టు.. ఆ 5 ఎకరాలు భూమి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. ఈ కేసుపై సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను 2023, జనవరి 4కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: చేతిలో చంటి బిడ్డతో ఆ ఎమ్మెల్యే.. ఆమె సమాధానం వింటే అభినందించకుండా ఉండలేరు -
భర్తతో రిలేషన్.. ప్రశ్నించిన భార్యపై యువతి యాసిడ్ దాడి
నాగ్పూర్: ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదేమోనన్న కోపంతో యాసిడ్ దాడి చేసిన సంఘటనలు చూసే ఉంటాం. కానీ, ఓ 25 ఏళ్ల యువతి తన ప్రియుడి భార్యపై యాసిడ్ దాడి చేసింది. ఈ క్రూరమైన చర్య మహారాష్ట్రలోని నాగపూర్లో గత శనివారం ఉదయం జరిగింది. ఈ యాసిడ్ దాడిలో తల్లి, రెండునరేళ్ల కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు స్కూటీపై బాధితుల వద్దకు వచ్చారు. ఒక్కసారిగా వారిపై యాసిడ్ దాడి చేశారు. మహిళతో పాటు తన ఒడిలో బాలుడిపైనా యాసిడ్ పడి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసి క్షణాల్లోనే అక్కడి నుంచి పరారయ్యాను నిందితులు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ‘వివాహేతర సంబంధంపై బాధితురాలు, నిందితురాలి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన స్నేహితురాలితో కలిసి బాధితురాలు, ఆమె కుమారుడిపై యాసిడ్ దాడి చేసింది. బాధితులను ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.’ అని యశోద నగర్ పోలీస్లు తెలిపారు. మొబైల్ ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నట్లు చెప్పారు. ఆమెపై సెక్షన్ 326ఏ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. SHOCKER - ACID ATTACK ON WOMAN & HER CHILD Horrific attack in Nagpur; acid attack on a woman & her child. Reportedly, the attacker had affair with the woman's husband | @Aruneel_S reports #acidattack #BREAKING_NEWS #Nagpur pic.twitter.com/LuLqEhv6gG — Mirror Now (@MirrorNow) December 6, 2022 ఇదీ చదవండి: Bharat Jodo Yatra: బీజేపీ కార్యకర్తలపై రాహుల్ గాంధీ ముద్దుల వర్షం!.. వీడియో వైరల్ -
ఎమ్మెల్యేలకు దేవేంద్ర ఫడ్నవీస్ తీపి కబురు
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుభవార్త ఆందించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని నాగ్పూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ ముహూర్తం ఖరారుచేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా అసంతృప్తితో బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న శిందే వర్గం ఎమ్మెల్యేల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా నాగ్పూర్లో జరగాల్సిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముంబైలో చాలా తక్కువ రోజులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి నాగ్పూర్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు వారాలపాటు కచ్చితంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలకు అభ్యంతరం లేకుంటే నూతన సంవత్సర వేడుకలు నాగ్పూర్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఉద్ధవ్తో కలవం.. రాజ్ ఠాక్రే సత్సంబంధాలు ఇదిలాఉండగా భవిష్యత్తులో ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే సమస్యే లేదని విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ స్పష్టం చేశారు. ఉద్ధవ్ తన మనసుకు చాలా బాధ కల్గించారని, ఆయనతో ఇకపై చేతులు కలిపే ప్రసక్తేలేదని అన్నారు. ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీలు వేరైన అనేక ఏళ్లుగా రాజ్ ఠాక్రేతో తమకు సత్సంబంధాలున్నాయి. ఆయన తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా కాకపోయిన మంచి మిత్రులుగా కలిసే ఉంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. మూడునెలలుగా పెండింగ్లోనూ.. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజులకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయినప్పటికీ రెండో దశ విస్తరణకు ఇంకా ముహూర్తం లభించకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదు. మహిళలకు దక్కని ప్రాధాన్యం అప్పట్లో ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నెల రోజులకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతావారికి ఆవకాశం దొరక్కపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి సొంత గూటిలోకి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) చేరే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఫడ్నవీస్ ప్రకటించి ఈ అంశానికితెరదించారు. (క్లిక్ చేయండి: మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు పావులు) -
14 ఏళ్ల బాలిక కిడ్నాప్ డ్రామా.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ముంబై: చదువుకోమని తల్లి మందలించటంతో ఓ 14 ఏళ్ల బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగింది. నాగ్పూర్ నుంచి పక్క జిల్లా చంద్రాపూర్కు వెళ్లిన బాలిక తాను కిడ్నాప్కు గురయ్యానని ఓ కట్టుకథ అల్లింది. పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి అసలు విషయం బయటపెట్టింది. కేసు వివరాలను ఆదివారం వెల్లడించారు పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగ్పూర్ జిల్లాలోని నందన్వన్ ప్రాంతానికి చెందిన బాలిక గత శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. బస్సులో 150 కిలోమీటర్ల దూరంలోని చంద్రాపూర్కు సాయంత్రానికి చేరుకుంది. తమ కూతురు కనిపించకపోవటంతో ఆమె కోసం వెతకటం ప్రారంభించారు కుటుంబ సభ్యులు. ఆచూకీ లభించకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోవైపు.. చంద్రాపూర్ చేరుకున్న బాలిక నేరుగా రామ్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తనను ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి కారులో చంద్రాపూర్కు తీసుకొచ్చినట్లు చెప్పింది. వారి నుంచి తప్పించుకుని వచ్చినట్లు కట్టుకథ అల్లింది. బాలిక తెలిపిన వివరాలతో నాగ్పూర్లోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు చంద్రాపూర్ పోలీసులు. ఆ తర్వాత వారికి అప్పగించారు. నాగ్పూర్లోని నందన్వన్ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం తెలిసింది. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. బాలిక తానే బస్సు ఎక్కి చంద్రాపూర్ వెళ్లినట్లు తేలింది. ఈ వీడియోను చూపించి ప్రశ్నించగా.. తన తల్లి చదువుకోవాలని మందలించటం వల్లే ఇలా చేశానని అంగీకరించింది. ఇదీ చదవండి: ‘సూపర్ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్ ట్వీట్కు బీజేపీ కౌంటర్ -
సాయిబాబాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.‘‘ సాయిబాబాపై మోపిన నేరాలు చాలా తీవ్రమైనవి. సమాజ ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేవి. నేర తీవ్రత తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సాంకేతికాంశాల ఆధారంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది’’ అంటూ తప్పుబట్టింది. అంగవైకల్యం, అనారోగ్య కారణాల రీత్యా తనను కనీసం గృహ నిర్భంధంలో ఉంచాలన్న సాయిబాబా విజ్ఞప్తినీ తిరస్కరించింది. బెయిల్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దాంతో సాయిబాబా తదితరులు నాగపూర్ సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనను 2014 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును దురదృష్టకరంగా వామపక్ష కార్యకర్తలు, సానుభూతిపరులు అభివర్ణించారు. తీర్పును నిరసిస్తూ సాయిబాబా విడుదల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో ధర్నా చేసిన 40 మంది విద్యార్థులు, అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు సాయిబాబాతో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఈ నెల 14న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శనివారం సెలవు దినమైనా న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం దీనిపై అత్యవసరంగా విచారణ జరిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ‘‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణంతో నిర్దోషిగా ప్రకటించడం సరికాదు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా హైకోర్టు తీర్పు చెప్పింది. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడాన్ని ట్రయల్ కోర్టులో గానీ, ఇతర కోర్టుల్లో గానీ సాయిబాబా సవాల్ చేయలేదు. కస్టడీలోకి తీసుకున్నాక ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేస్తే కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు యూఏపీఏ సెక్షన్ 43(సీ)ని వర్తింపజేసిన దృష్ట్యా సెక్షన్ 465 ప్రకారం సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేయడం సరికాదు’’ అన్నారు. సాయిబాబా తరఫు న్యాయవాది ఆర్.బసంత్ దీనిపై అభ్యంతరం తెలిపారు. ‘‘సాయిబాబాకు 52 ఏళ్లు. 90 శాతం శారీరక వైకల్యముంది. పెళ్లి కాని 23 ఏళ్ల కూతురుంది. అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ఆయనకు నేర చరిత్ర లేదు. ఏడేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నారు. షరతులతోనైనా ఇంటి వద్దే ఉండేందుకు అనుమతివ్వాలి’’ అని కోరారు. మెదడు చాలా డేంజరస్: ధర్మాసనం ఈ వాదనలపై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఇటీవల అర్బన్ నక్సల్స్ ఎక్కువగా గృహ నిర్భంధాలు కోరుతున్నారు. వారు ఇంట్లో ఉండే మెదడు సాయంతో ప్రతిదీ చేస్తారు. ఫోన్లు కూడా వాడుకుంటారు. కాబట్టి గృహ నిర్బంధానికి అవకాశం ఇవ్వొద్దు’’ అని కోరారు. ‘‘జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమంతోనూ సాయిబాబాకు సంబంధముంది. మావోయిస్టు కమాండర్ల భేటీలను ఏర్పాటు చేయడం వంటి పనులతో దేశ ప్రజాస్వామిక వ్యవస్థపై యుద్ధానికి తోడ్పాటునందించారు. మావోయిస్టులకు ఆయన మేధో శక్తిగా ఉంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు’’ అని ఆరోపించారు. మెదడు చాలా ప్రమాదకరమైనదని జస్టిస్ షా అన్నారు. ఉగ్రవాద లేక మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినంతవరకు మెదడే సర్వస్వమని అభిప్రాయపడ్డారు. గృహ నిర్బంధం విజ్ఞప్తిని తిరస్కరించారు. సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నిందితులను దోషులుగా నిర్ధారించారన్నారు. ‘‘హైకోర్టు కూడా సాయిబాబా తదితరులపై కేసులను కొట్టేయలేదు. కింది కోర్టు నిర్ధారించిన అంశాలను తోసిపుచ్చలేదు. కేవలం వారి విడుదలకు మాత్రమే ఆదేశించింది’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. -
ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట
సాక్షి, ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన బాంబే హైకోర్టు.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని మహారాష్ట్ర జైళ్ల శాఖను శుక్రవారం ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2017లో సాయిబాబాను దోషిగా తేల్చింది ట్రయల్ కోర్టు. ఆ కేసులో జీవిత ఖైదు విధించింది. అయితే ఆ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఇప్పుడు కొట్టేసింది. ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్ను న్యాయమూర్తులు రోహిత్ దియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించారు. ఈ మేరకు వాదనలు విన్న అనంతరం ట్రయల్కోర్టు తీర్పును కొట్టేస్తూ.. తక్షణమే ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శారీరక వైకల్యం కారణంగా వీల్చైర్కి పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగ్పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. ఇక కోర్టు తీర్పుపై సాయిబాబా భార్య వసంత కుమారి స్పందించారు. మేధావి అయిన తన భర్తను కావాలనే కేసులో ఇరికించారని, జైల్లో ఏడేళ్లు గడిపారని, ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం -
Dussehra 2022: సమగ్ర జనాభా విధానం కావాలి
నాగపూర్: దేశంలో అన్ని వర్గాలకు సమానంగా వర్తించే ఒక సమగ్ర జనాభా విధానాన్ని (పాపులేషన్ పాలసీ) రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ అన్నారు. విస్తృతమైన చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ విధానాన్ని తయారు చేయాలని చెప్పారు. నాగపూర్లో బుధవారం నిర్వహించిన దసరా వేడుకల్లో మోహన్ భగవత్ మాట్లాడారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది చాలా కీలకమైన అంశమని, దీన్ని విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనాభా అసమతుల్యత అనేది దేశ భౌగోళిక సరిహద్దులను సైతం మార్చేస్తుందని వ్యాఖ్యానించారు. వివిధ వర్గాల జనాభా మధ్య సమతుల్యత కోసం అన్ని వర్గాలకు సమానంగా వర్తించే నూతన జనాభా విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. దేశంలో వర్గాల మధ్య సమతుల్యత ఉండాలన్నారు. ‘‘జననాల రేటులో భేదాలు, బలవంతపు మత మార్పిడులు, ప్రలోభాలు, అత్యాశ కారణంగా మతాలు మారడం, దేశంలోకి అక్రమ చొరబాట్లు.. ఇలాంటివన్నీ ముఖ్యమైన అంశాలు. వీటిని కచ్చితంగా అరికట్టాలి’’ అని మోహన్ భగవత్ సూచించారు. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఆంగ్ల భాష ఒక్కటే ముఖ్యం కాదని తెలిపారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాతృభాషను ప్రభుత్వమే ప్రోత్సహించాలని మనం ఆశిస్తున్నామని, అదే సమయంలో మనం సంతకం మాతృభాషలోనే చేస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలని హితవు పలికారు. మన ఇళ్లపై నేమ్ప్లేట్లు మాతృభాషలోనే ఉంటున్నాయా? అని ఏదైనా ఆహ్వానం పంపేటప్పుడు మాతృభాషలోనే పంపిస్తున్నామా? అని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలని ప్రయత్నించేటప్పుడు చైనాలో ఏం జరుగుతోందో చూడాలని చెప్పారు. ‘ఒక కుటుంబం, ఒక బిడ్డ’ విధానం వల్ల చైనా వృద్ధ దేశంగా మారుతోందన్నారు. భారతదేశ జనాభాలో 57 శాతం మంది యువతే ఉన్నారని, మరో 30 ఏళ్లపాటు మన దేశం యువదేశంగానే కొనసాగుతుందని మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. 50 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి? ఇప్పటి యువత వృద్ధులుగా మారుతారు, వారందరి ఆకలి తీర్చేటంత ఆహారం మనవద్ద ఉంటుందా? అని ఆన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలు ప్రారంభించాలని, స్వయం ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. అందరికీ ఉద్యోగాలిచ్చే శక్తి ప్రభుత్వాలకు ఉండదన్నారు. -
బ్రౌన్ కాటన్ సాగు.. పర్యావరణానికి ఎంతో మేలు
కృత్రిమ రంగులద్దే అవసరం లేనందున బ్రౌన్ కాటన్ సాగుతో పర్యావరణానికి మేలు. జన్యుమార్పిడి చేయని బ్రౌన్ కాటన్ సూటి వంగడాలకు సిఐసిఆర్ రూపకల్పన. ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడినిచ్చే బ్రౌన్ కాటన్ వంగడాలు 3 రకాల్లో రెండు దక్షిణాది రాష్ట్రాల్లో సాగుకు అనువైనవి సేంద్రియ, ప్రకృతి సేద్యానికి.. తిరిగి విత్తుకోవడానికి కూడా అనువైనవి అక్టోబర్ 7న ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ జరుపుకోనున్న సందర్భంగా ప్రత్యేక కథనం పత్తి అంటే ఎవరికైనా చప్పున గుర్తొచ్చేది తెల్ల బంగారమే. వేరే రంగులో ఉండే దూది కనిపిస్తే దానికి కృత్రిమంగా రంగులద్ది ఉంటారనే భావిస్తాం. అయితే, గోధుమ రంగు దూదిని పండించే పత్తి రకాలు సహజసిద్ధంగానే ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీటినే నాచురల్లీ కలర్డ్ కాటన్ రకాలు అని, బ్రౌన్ కాటన్ రకాలు అని పిలుస్తుంటారు. సహజసిద్ధమైన బ్రౌన్ కాటన అటవీ రకాలను అభివృద్ధి పరచి మహారాష్ట్ర నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానం (ఐసిఏఆర్– సిఐసిఆర్) శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే 3 సరికొత్త బ్రౌన్ కాటన్ సూటి వంగడాలను అభివృద్ధి చేశారు. వైదేహి–1, సిఎన్హెచ్ 17395 అనే రకాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు ఉపయోగపడతాయి. వీటితో పాటు మహారాష్ట్ర తదితర సెంట్రల్ జోన్ రాష్ట్రాలకు ఉపయోగపడే మరో రకాన్ని కూడా అధికారికంగా విడుదల చేశారు. జన్యుమార్పిడి చేయకుండా రూపొందించిన నాన్బీటీ రకాలు ఈ బ్రౌన్ పత్తి సూటి రకాలు. ఇతర పత్తితో కలిసిపోకుండా దూరం పాటిస్తూ సాగు చేసుకుంటే.. ఈ పత్తి నుంచి వేరు చేసిన గింజలనే తదుపరి పంటకు విత్తనాలుగా వాడుకోవచ్చు. విత్తనాన్ని ప్రతి ఏటా కొనాల్సిన అవసరం ఉండదు. ప్రధాన శాస్త్రవేత్త డా. వినితా గొట్మరె తదితర శాస్త్రవేత్తలు 15 ఏళ్ల పాటు కొనసాగించిన పరిశోధనల ఫలితంగా రూపుదాల్చిన ఈ వంగడాలు చీడపీడలకు తట్టుకొని రైతులకు మంచి దిగుబడులనివ్వగలవని సిఐసిఆర్ సంచాలకులు డాక్టర్ వై.జి. ప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. బ్రౌన్ కాటన్తో ప్రయోజనాలేమిటి? బ్రౌన్ కాటన్ రకాలు అనేక చీడ పీడలను తట్టుకొని వర్షాధారంగా కూడా మంచి దిగుబడులను ఇవ్వగలవు. కాబట్టి ఈ రకం పత్తి సాగు వల్ల ప్రకృతి వనరులపై, పర్యావరణంపై దుష్ప్రభావం తక్కువగా ఉంటుంది. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా చైతన్యవంతులైన వినియోగదారులు ఆర్గానిక్ కాటన్ మాదిరే బ్రౌన్ కాటన్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. తెల్ల దూదితో రంగు వస్త్రాలను ఉత్పత్తి చేసే క్రమంలో జౌళి పరిశ్రమదారులు కృత్రిమ రసాయన రంగులద్దుతూ ఉంటారు. వాషింగ్, బ్లీచింగ్, డైయింగ్ ప్రక్రియల కారణంగా భారీగా మురుగు నీరు విడుదలవుతుంది. చాలా సందర్భాల్లో పూర్తిగా శుద్ధి చేయకుండానే విడుదల చేసే ఈ కలుషిత జలాల వల్ల పర్యావరణంతో పాటు భూమిని, నీటి వనరులను కలుషితం చేస్తున్నాయి. ఫలితంగా మనుషులతోపాటు పశువులకు, జలచరాలకు తీరని హాని జరుగుతోంది. పర్యవసానంగా ఆ పరిసర ప్రాంత ప్రజలు కేన్సర్, చర్మవ్యాధులు, పనిసంబంధమైన ఆస్మా లేదా అలర్జీలు, జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ జబ్బుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రంగులద్దే ప్రక్రియలో రసాయనాల వాడకాన్ని తగ్గించడానికి సహజసిద్ధమైన గోధుమ రంగు పత్తి ఉత్పత్తి ఉపకరిస్తుంది. గతంలో అందుబాటులో ఉన్న దేశవాళీ బ్రౌన్ కాటన్ రకాల్లో దూది పటుత్వ లోపం తదితర సమస్యలను అధిగమించే విధంగా ఈ వంగడాలను సిఐసిఆర్ అభివృద్ధి పరచటం విశేషం. సిఐసిఆర్–హెచ్ కాటన్ 58 సిఐసిఆర్–హెచ్ కాటన్ 58 (సిఎన్హెచ్ 17395) రకం బ్రౌన్ కాటన్ వంగడం ఈ ఏడాదే విడుదలైంది. ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వాణిజ్య స్థాయిలో సాగుకు అనువైనది. ఈ రకం కూడా హెక్టారుకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడినివ్వగలదు. పింజ పొడవు 23.7 ఎం.ఎం. ఉంటుంది. బ్యాక్టీరియా తెగులుతోపాటు ఆల్టెర్నేరియా ఆకు మచ్చ, గ్రే మిల్డ్యూ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. సెర్కోస్పొర ఆకుమచ్చ, తుప్పు తెగుళ్లను మోస్తరుగా తట్టుకుంటుంది. మొలక శాతం బాగుంటుంది. చీడపీడలను దీటుగా తట్టుకునే ఈ సూటి రకం బ్రౌన్ కాటన్ సాగు దక్షిణాది రైతులకు మంచి ఆదాయాన్ని ఇవ్వగలుగుతుందని సిఐసిఆర్ ఆశిస్తోంది. వైదేహి–1 రకం సిఐసిఆర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బ్రౌన్ కాటన్ రకాల వరుసలో వైదేహి–1 మొదటిది. దక్షిణాది రాష్ట్రాల్లో వాణిజ్యస్థాయి లో సాగుకు అనువైనది. ప్రభుత్వ ఆమోదంతో గత ఏడాది నోటిఫై అయ్యింది. ముదురు గోధుమ రంగు దూదిని అందిస్తుంది. 3 అటవీ రకాల్లోని సుగుణాలతో రూపొందిన అమెరికన్ కాటన్ (గాస్పిం హిర్సుటం) సూటి రకం వంగడం ఇది. బెట్టను తట్టుకునే లక్షణం ఉండటం వల్ల ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తే వర్షాధారంగా హెక్టారుకు 14–15 క్వింటాళ్ల వరకు, నీటిపారుదలతో 20 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుందని సిఐసిఆర్ చెబుతోంది. వైదేహి–1 రకం ముదురు గోదుమ రంగు దూది పింజ పొడవు 22.5 ఎం.ఎం. ఉంటుంది. పటుత్వం 3.95. సూర్యరశ్మి బాగా సోకే విధంగా మొక్క నిర్మాణం ఉంటుంది. కాబట్టి, కాయతొలిచే పురుగు ను తట్టుకుంటుంది. పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక వంటి రసంపీల్చే పురుగులను తట్టుకుంటుంది. అటవీ రకాల మాదిరిగా బాక్టీరియా తెగులుతో పాటు అల్టర్నేరియా ఆకుమచ్చ, గ్రే మిల్డ్యూ, సెర్కోస్పొర ఆకుమచ్చ, తుప్పు తెగులు వంటి శిలీంద్రపు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. విత్తన మొలక శాతం బాగుంటుంది. స్పిన్నింగ్కు అనువైన రకం. అధిక దిగుబడినిచ్చే ఈ ముదురు గోధుమ రంగు పత్తి రకం రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుందని డా. ప్రసాద్ తెలిపారు. సాధారణంగా బీటీ పత్తిరకాల పింజ 28–31 ఎం.ఎం. మధ్యలో ఉంటుంది. ఈ రెండు మధ్యస్థ పింజ రకాలు. పింజ పొడవు 22.8–23.7 ఎం.ఎం. ఉంటుంది. అయినా, వీటి జిన్నింగ్కు సమస్యలు ఉండవని డా. ప్రసాద్ తెలిపారు. సహజమైన రంగు పత్తి కావటం వల్ల ఒనగూడే పర్యావరణ, ఆరోగ్య ప్రయోజనాల రీత్యా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో బ్రౌన్ కాటన్కు ప్రాధాన్యం పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు బ్రౌన్ కాటన్ ఒప్పంద సాగుకు శ్రీకారం చుట్టాయి. ఈ నేపథ్యంలో సిఐసిఆర్ నాన్బీటీ రకాలు రైతులకు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిద్దాం. ఇతర పత్తి రకాలతో ఈ విలక్షణ వంగడాలు కలుషితం కాకుండా రైతులు జాగ్రత్తపడాలి. పత్తి కోసం సాగు చేసినా, విత్తనం కోసం సాగు చేసినా ఇతర రకాల పత్తి పొలాల నుంచి 50 మీటర్ల దూరం పాటించటం తప్పనిసరి. కంచె పంటగా జొన్న/ సజ్జ/ మొక్కజొన్నను పొలం చుట్టూ 4 సాళ్లు వేసుకోవటం ద్వారా తెల్ల బీటీ పత్తితో బ్రౌన్ కాటన్ కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ బ్రౌన్ కాటన్ నాన్–బీటీ రకాలు సేంద్రియ సేద్యానికి అనువైనవి గోధుమ రంగు పత్తి(బ్రౌన్ కాటన్)ని ఉత్పత్తి చేసే నాన్బీటీ (జన్యుమార్పిడి చేసినవి కాదు) సూటి వంగడాలను 15 ఏళ్ల పాటు శ్రమించి రూపొందించాం. సాధారణ పద్ధతితో పాటు సేంద్రియ / ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూడా సాగు చేసుకోవడానికి అనువైన సూటి రకాలు ఇవి. పత్తి నుంచి విత్తనాలు తీసి తిరిగి మళ్లీ విత్తుకోవచ్చు. అయితే, ఇతర తెల్ల రకం పత్తి పొలాలకు కనీసం 50 మీటర్ల దూరంలో బ్రౌన్ కాటన్ రకాలను సాగు చెయ్యాల్సి ఉంటుంది. రైతులు ఈ జాగ్రత్త పాటించాలి. ఈ రకం పత్తి కాయలు పగిలిన మొదట్లో కాయ లోపలి దూది తెల్లగానే ఉంటుంది. అయితే, ఎండ తగిలిన తర్వాత దూది క్రమంగా గోధుమ లేదా ముదురు గోధుమ రంగులోకి మారుతుందని రైతులు గమనించాలి. 60/75“30 సెం.మీ. దూరంలో (అంటే.. సాళ్ల మధ్య 2/రెండున్నర అడుగుల దూరం, మొక్కల మధ్య అడుగు దూరంలో) విత్తుకోవచ్చు. ఎకరానికి 2 నుంచి 2.5 కేజీల విత్తనం అవసరమవుతుంది. బ్రౌన్ కాటన్ నాన్బీటీ రకాల విత్తనాల కోసం రైతులు ఈ క్రింది ఈ–మెయిల్ ద్వారా సంప్రదింవచచ్చు. – డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్, నాగపూర్–440010, మహారాష్ట్ర. CICRNAGAPUR@gmail.com చదవండి: పండగ కళ పదింతలు.. ఆదుర్దా వద్దు.. ఇలా చేయండి! -
రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఆసీస్ పై భారత్ ఘన విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(46) పరుగులతో అఖరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా ఔట్ ఫీల్డ్ చిత్తడి కారణంగా మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 8ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఆరోన్ ఫించ్(31), మాథ్యూ వేడ్(43) పరుగులతో రాణించారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 55 పరుగులు వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన కోహ్లి.. జంపా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. మూడు ఓవర్లకు భారత్ స్కోర్: 40/1 91 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లి(1),రోహిత్(27) పరుగులతో ఉన్నారు. భారత్ టార్గెట్ 91 పరుగులు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో ఆరోన్ ఫించ్(31), మాథ్యూ వేడ్(43) పరుగులతో రాణించారు. మూడో వికెట్ కీల్పోయిన ఆసీస్ 31 పరుగులు వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన డేవిడ్.. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్లో గ్రీన్(5) రనౌట్ కాగా.. మ్యాక్స్వెల్ క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 19/2 తొలి ఓవర్కు ఆసీస్ స్కోర్: 10/0 తొలి ఓవర్ ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో గ్రీన్(1),ఫించ్(9) పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించారు. 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి టీ20కు దూరమైన బుమ్రా, పంత్.. ఈ మ్యాచ్ తుది జట్టులోకి వచ్చారు. తుది జట్లు ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, డేనియల్ సామ్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్వుడ్ భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్ టాస్ ఆలస్యం మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడేందకు టీమిండియా సిద్దమైంది. అయితే భారత్-ఆస్ట్రేలియా రెండో టీ20 ఆలస్యంగా ప్రారంభం కానుంది. గత రెండు రోజులుగా నాగ్పూర్లో వర్షం కురస్తుండండంతో.. స్టేడియం ఔట్ ఫీల్డ్ కాస్త చిత్తడిగా మారింది. దీంతో 6:30 గంటలకి పడాల్సిన మ్యాచ్ టాస్ కూడా ఆలస్యంకానుంది. కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఓటమి పాలైన టీమిండియా.. ఈ మ్యాచ్లో ఎలాగైన విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని భావిస్తోంది చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు -
IND vs AUS 2nd T20: సిరీస్ కాపాడుకునేందుకు...
నాగ్పూర్: రేసులో నిలవాలంటే... హైదరాబాద్లో సిరీస్ను తేల్చుకోవాలంటే... టీమిండియా ఇక్కడ ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. తొలి మ్యాచ్ ఓటమితో వెనుకబడిన రోహిత్ సేన శుక్రవారం జరిగే రెండో టి20లో ఆస్ట్రేలియాపై గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సిరీస్లో శుభారంభం చేసిన కంగారూ సేన వరుస విజయాలతో ఏకంగా సిరీస్పైనే కన్నేసింది. ఈ నేపథ్యంలో నాగపూర్లో సమరం ఆసక్తికరంగా మారింది. పొట్టి ఫార్మాట్లో కచ్చితమైన ఫేవరెట్, సొంతగడ్డ అనుకూలతలేవీ ఉండవు. ఎవరు మెరిపిస్తే ఆ జట్టే గెలుస్తుంది. ఇక్కడ బంతికంటే బ్యాట్ ఆధిపత్యమే కొనసాగుతుంది. గత మ్యాచ్లో 200 పైచిలుకు పరుగులు చేసినా భారత్కు ఓటమి తప్పలేదు. కారణం చేజింగ్లో మనకన్న ప్రత్యర్థి మెరుపులే మెరిశాయి. డెత్ ఓవర్లపైనే దృష్టి ఒత్తిడంతా ఆతిథ్య భారత జట్టుపైనే ఉంది. బ్యాటింగ్ బాగున్నా... బౌలింగ్ ఆందోళన పెంచుతోంది. డెత్ ఓవర్లు మన భారీ స్కోరును సులభంగా ఛేదించేలా చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 33 మంది బౌలర్లు 20 డెత్ ఓవర్లు వేశారు. సగటున ప్రతి ఒక్కరు ఓవర్కు 10 పరుగులకంటే ఎక్కువే ఇచ్చారు. కలవరపెడుతున్న గణాంకాల నేపథ్యంలో జట్టు మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకించి బౌలింగ్ విభాగంపైనే దృష్టి సారించింది. పూర్తి ఫిట్నెస్గా ఉన్న బుమ్రాను ఈ మ్యాచ్లో ఆడించే ప్రయత్నం చేయొచ్చు. బ్యాటింగ్ దళం పటిష్టంగానే ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కోహ్లి గత మ్యాచ్లో విఫలమైనప్పటికీ ఆసియా కప్తో ఫామ్లోకి వచ్చారు. సూర్యకుమార్ తన పాత్రకు న్యాయం చేయగా, హార్దిక్ పాండ్యా తన బ్యాటింగ్ సత్తాను చుక్కలతో చూపించాడు. ఇదే జోరు నాగ్పూర్లోనూ కొనసాగితే భారత్ భారీస్కోరుకు తిరుగుండదు. ఉత్సాహంగా కంగారూ సేన శుభారంభం తాలుకు ఉత్సాహం పర్యాటక జట్టులో తొణికిసలాడుతోంది. టి20 ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా సొంతగడ్డపై జరిగే మెగా ఈవెంట్కు ముందు ఈ సిరీస్ను తీసుకెళ్లాలని ఆశిస్తోంది. మొహాలిలో ఆసీస్ బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ క్రీజులోకి దిగిన బ్యాట్స్మెన్లో ఒక్క మ్యాక్స్వెల్ (1) మినహా అందరు వేగంగానే పరుగులు చేశారు. ఫించ్ (13 బంతుల్లో 22), గ్రీన్ (30 బంతుల్లో 61), ఇంగ్లిస్ (10 బంతుల్లో 17), వేడ్ (21 బంతుల్లో 45 నాటౌట్) ఇలా అందరూ బ్యాట్కు పనిచెప్పడంతో ఆతిథ్య బౌలింగ్ చెదిరింది. కొండంత లక్ష్యం చకచకా కరిగిపోయింది. అయితే బౌలింగ్కు సహకరించే నాగ్పూర్ పిచ్పై పరుగుల మోత ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వేదికపై 12 టి20 మ్యాచ్లు జరిగితే మొదట బ్యాటింగ్ జట్టు చేసిన సగటు స్కోరు 151 పరుగులే! ఈ నేపథ్యంలో ఇక్కడ బ్యాటే కాదు బంతి కూడా ప్రభావం చూపుతుంది. -
Ind Vs Aus: ‘ఆరెంజ్ సిటీ’లో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం.. వీడియో వైరల్
India Vs Australia T20 Series- 2nd T20: ఆస్ట్రేలియాతో రెండో టీ20 నేపథ్యంలో టీమిండియా నాగ్పూర్కు చేరుకుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్డు నుంచి హోటల్కు చేరుకోగానే అక్కడి సిబ్బంది టీమిండియా క్రికెటర్ల మెడలో పూల మాలలు వేసి చప్పట్లతో ఆహ్వానం పలికారు. మరోవైపు.. తమ అభిమాన ఆటగాళ్ల కోసం వేచి ఉన్న ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్లు తీసుకున్నారు. ఇక ఆరెంజ్ సిటీలో టీమిండియా ఆటగాళ్లకు లభించిన ఈ గ్రాండ్ వెల్కమ్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, బౌలర్ యజువేంద్ర చహల్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ముందుగా ఎంట్రీ ఇవ్వగా.. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్కు ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపించారు. కాగా శుక్రవారం(సెప్టెంబరు 23) భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 జరుగనుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో గల విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ ఇందుకు వేదిక కానుంది. ఇక మొహాలీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆతిథ్య భారత్ పర్యాటక ఆసీస్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో టీ20 భారత్కు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే టీమిండియా సిరీస్ రేసులో నిలుస్తుంది. టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆస్ట్రేలియా భారత పర్యటనకు వచ్చింది. చదవండి: LLC 2022: జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం Pro Kabaddi League 2022: ప్రొ కబడ్డీ లీగ్ మొదటి దశ షెడ్యూల్ విడుదల! వేదికలు, ఇతర వివరాలు Touchdown Nagpur 📍🧡#TeamIndia | #INDvAUS pic.twitter.com/Odt7nFjlTe — BCCI (@BCCI) September 21, 2022 -
India Maharashtra International Challenge 2022: ఫైనల్లో రుత్విక శివాని
సాక్షి, హైదరాబాద్: ఇండియా మహారాష్ట్ర ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి దూసుకెళ్లింది. నాగ్పూర్లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక శివాని 24–22, 21–17తో ఇషారాణి బారువా (భారత్)పై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో రుత్విక 25–23, 21–16తో మాన్సి సింగ్ (భారత్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో 18–21, 23–21, 21–9తో తారా షా (భారత్)పై, రెండో రౌండ్లో 21–14, 21–9తో ప్రణవి (భారత్)పై గెలుపొందింది. నేడు జరిగే ఫైనల్లో జపాన్ ప్లేయర్ మిహో కయామతో రుత్విక శివాని తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మిహో కయామ 21–14, 21–15తో తస్నీమ్ మీర్ (భారత్)పై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కె.మనీషా–షేక్ గౌస్ (భారత్) జోడీ ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో మనీషా–షేక్ గౌస్ ద్వయం 21–12, 19–21, 21–17తో బొక్కా నవనీత్–ప్రియా కొంజెంగ్బమ్ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్లో మైస్నమ్ మెరాబా (భారత్), మిథున్ మంజునాథ్ (భారత్) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్స్లో మైస్నమ్ మెరాబా 22–20, 21–14తో టాప్ సీడ్ కిరణ్ జార్జి (భారత్)పై, మిథున్ 22–24, 21–7, 21–18తో రవి (భారత్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణ ప్రసాద్ (భారత్) ద్వయం 12–21, 15–21తో చోలెంపన్–నాంథకర్న్ (థాయ్లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు!
Australia tour of India, 2022- India Vs Australia T20 Series: టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ కోసం కంగారూ జట్టు గురువారం భారత్కు చేరుకుంది. ఐసీసీ మెగా ఈవెంట్కు ముందు జరుగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక డేవిడ్ వార్నర్ మినహా.. ప్రపంచకప్ జట్టులోని మిగతా ఆసీస్ ఆటగాళ్లంతా రోహిత్ సేనతో సిరీస్లో పాల్గొననున్న విషయం తెలిసిందే. అయితే, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. నాథన్ ఎలిస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్లు వారి స్థానాలను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో భారత్- ఆసీస్ పోరు ఎప్పుడు ఆరంభం కానుంది? పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు, జట్ల వివరాల తాజా అప్డేట్లు, తదితర అంశాలు పరిశీలిద్దాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా- మూడు టీ20 మ్యాచ్లు మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం మొదటి టీ20 సెప్టెంబరు 20- మంగళవారం- పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం, మొహాలి రెండో టీ20 సెప్టెంబరు 23- శుక్రవారం, విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్పూర్ మూడో టీ20 సెప్టెంబరు 25- ఆదివారం- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ మ్యాచ్ ప్రసారాలు, లైవ్ స్ట్రీమింగ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రసారం డిస్నీ+హాట్స్టార్లో లైవ్స్ట్రీమింగ్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. అప్డేట్: షమీకి కరోనా పాజిటివ్గా తేలడంతో అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. టీమిండియాతో సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడం జంపా. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ -
వీడియో తీయొద్దు అన్నందుకు.... డ్యూటీలో ఉన్న పోలీస్ని గట్టిగా కరిచి పరార్..
ముంబై: మహారాష్ట్రలో ఒక వ్యక్తి డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ని గట్టిగా కరిచి గాయపరిచాడు. తమను వీడియో తీస్తున్నాడని ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలో నాగ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మకర్ధోక్డా గ్రామానికి చెందిన రాకేష్ పురుషోత్తం గజ్భియే అనే 30 ఏళ్ల వ్యక్తి తనతో వివాదం పెట్టుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయమంటూ పోలిస్టేషన్కి వెళ్లాడు. ఐతే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆగ్రహం చెందిన వ్యక్తి ఆ పోలిస్టేష్న్ ఆవరణలో ఉన్న పోలీసులందర్నీ ఫోన్లో వీడియో తీయడం ప్రారంభించాడు. దీన్ని గమనించిన ఒక పోలీసు జోక్యం చేసుకుని అడ్డుకున్నందుకు అతన్ని గట్టిగా కరిచి ద్విచక్ర వాహనం పై పారిపోయాడని పోలీసులు తెలిపారు. డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకుని గాయపరిచినందుకు సదరు వ్యక్తి గజ్భియేపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్) -
Online Fraud: ఒక్క క్లిక్తో రూ.1.68 లక్షలు మాయం
ముంబై: ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయి. సైబర్ నేరాలపై పోలీసులు ఎన్ని విధాల ప్రజలకు అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. రోజుకో కొత్త రూపంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు దుండగులు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగు చూసింది. విద్యుత్తు బిల్ గురించి వచ్చిన ఓ ఫేక్ మెసేజ్పై ఒక్క క్లిక్తో ఓ వ్యక్తి రూ.1.68 లక్షలు పోగొట్టుకున్నారని నాగ్పూర్ పోలీసులు శనివారం వెల్లడించారు. మహారాష్ట్ర ఆధ్వర్యంలోని ఓ బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న రాజేశ్ కుమార్ ఆవధియా(46)కు ఆగస్టు 29న మొబైల్కు ఓ మెసేజ్ వచ్చింది. విద్యుత్తు బిల్ చెల్లించనందున మీ పవర్ సప్లయ్ నిలిపేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. బిల్ కట్టేందుకు కింది యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని అందులో సూచించారు నేరగాళ్లు. దాంతో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ‘మెసేజ్లో సూచించిన లింక్పై క్లిక్ చేయగానే రెండు బ్యాంకు ఖాతాల్లోని రూ.1.68 లక్షలు మాయమయ్యాయి. ఐపీసీలోని చీటింగ్, ఐటీ యాక్ట్లు సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.’ అని ఖపెర్ఖేడా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: రూ.6 కోట్ల దోపిడీ కేసు.. రూ.100 పేటీఎం బదిలీతో దొరికిపోయారు! -
కిమ్స్ ఖాతాలో మరో ఆసుపత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉన్న కింగ్స్వే హాస్పిటల్స్లో 51 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఈ కొనుగోలు ప్రక్రియలో భాగంగా కింగ్స్వే ఆసుపత్రికి రూ.80 కోట్లను కిమ్స్ పెట్టుబడి రూపంలో అందించనుంది. ఈ మొత్తాన్ని రుణ భారం తగ్గించుకోవడానికి, బ్యాలెన్స్ షీట్ బలోపేతానికి వినియోగిస్తారు. కింగ్స్వే హాస్పిటల్స్కు 300లకుపైగా పడకల సామర్థ్యం ఉంది. మహారాష్ట్రలో నాసిక్ తర్వాత సంస్థకు ఇది రెండవ కేంద్రం అని కిమ్స్ ఎండీ భాస్కర రావు తెలిపారు. -
బెలూన్లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి
నాగ్పూర్: బెలూన్లలో గాలిని నింపేందుకు ఉపయోగించే సిలిండర్ పేలి రెండేళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ఆ చిన్నారి వ్యవసాయంలో ఉపయోగించే ఎద్దుల ప్రాముఖ్యతను తెలియజేసే తాన్హాపోలా పండుగ వేడుకలకు తన తాతాతో కలిసి వెళ్లింది. అక్కడ ఆ చిన్నారికి తాతా ఒక బెలూన్ని కొనివ్వబోతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నాగ్పూర్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచల్పూర్ తాలుకాలోని షిండే గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. అక్కడ బెలూన్లో గాలిని నింపుతుండగా గ్యాస్ సిలిండర్ పేలి ఆ చిన్నారి కాలిపై పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు అచల్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసికందును ఎత్తుకుపోయిన దుండగుడు) -
నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలు వదిలేయాలనుంది...
ముంబై: పౌరసమాజం అభ్యున్నతికి రాజకీయాలు అక్కరకురావాలిగానీ ప్రస్తుత సమాజంలో రాజకీయాలు అధికారం చేజిక్కించుకునేందుకు వినియోగిస్తున్నారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. శనివారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో గడ్కరీ ప్రసంగించారు. ‘రాజకీయాలకు మించిన జీవితం ఉందని నాకనిపిస్తోంది. రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోంది. దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తేచ్చేందుకే రాజకీయాలను ఒక సాధనంగా వాడుకోవాలి. సంక్షేమం కోసం పాటుపడాలి. కానీ ప్రస్తుతం అధికారకాంక్షతో రాజకీయాలు చేస్తున్నారు’ అని అన్నారు. -
టెన్త్ క్లాస్ కుర్రాడికి అమెరికా బంపరాఫర్,భారీ ప్యాకేజ్తో పిలుపు..అంతలోనే
అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్. పైసా ఖర్చులేకుండా భారత్ నుంచి అమెరికా వచ్చేందుకు ఫ్రీగా ఫ్లైట్ టికెట్. కళ్లు చెదిరే ప్యాకేజీ ఇస్తామంటూ పిలుపు అందింది. కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ అంతలోనే సదరు సంస్థ ఆ కుర్రాడికి భారీ షాకిచ్చింది. నాగపూర్కు చెందిన రాజేష్, అశ్వనీ దంపతుల కుమారుడు వేదాంత్ డియోకటే (15) 10వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే టెన్త్ క్లాస్ చదివే వేదాంత్ ఆన్లైన్ క్లాసులతో పాటు ఆన్లైన్లో డజన్ల కొద్ది కోడింగ్ కోర్స్లు నేర్చుకున్నాడు. రెండు రోజుల్లో ఈ తరుణంలో తల్లీ అశ్వినీకి చెందిన ల్యాప్ట్యాప్లో వేదాంత్ ఇన్స్ట్రాగ్రామ్ బ్రౌజ్ చేస్తుండగా..వెబ్సైట్ డెవలప్మెంట్ కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరైనా పాల్గొన వచ్చంటూ ఓ లింక్ కంట పడింది. అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ 15ఏళ్ల కుర్రాడు కోడింగ్ కాపింటీషన్లో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో హెచ్టీఎంఎల్,జావా స్క్రిప్ట్,వర్చువల్ స్టూడియో కోడ్ (2022) 2,066 రాశాడు. దేశ వ్యాప్తంగా 1000మంది పాల్గొన్న ఈ కోడింగ్ కాంపిటీషన్లో వేదాంత్ తనకిచ్చిన టార్గెట్ను విజయవంతంగా పూర్తిచేశాడు. ఖండాంతరాలు దాటిన ప్రతిభ ఈ కాంపిటీషన్లో వేదాంత్ చూపించిన ప్రతిభ ఖండాంతరాలు దాటింది. అమెరికా న్యూజెర్సీకి చెందిన యాడ్ ఏజెన్సీ సంస్థ ఆర్ అండ్ డి డిపార్ట్మెంట్లో జాబ్ ఇస్తామని, సంవత్సరానికి రూ.33లక్షల ప్యాకేజీ ఇస్తామని పిలిచింది. తీరా వేదాంత్ ఎడ్యుకేషన్తో పాటు వయస్సు చాలా చిన్నది కావడంతో తాము ఇస్తామన్న ఆఫర్ను విరమించుకుంటున్నామని.. విద్యార్ధిగా సాధించిన విజయాలు ఇంకా ఉన్నాయంటూ యూఎస్ కంపెనీ తెలిపింది. వేదాంత్ ప్రతిభ అమోఘం ఈ కుర్రాడి ప్రతిభ అమోఘం, అనుభవం, ప్రొఫెషనలిజం, అప్రోచ్ అయ్యే విధానం చాలా బాగుంది. వేదాంత్కు జాబ్ ఇప్పుడు ఇవ్వలేకున్నా.. ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత అతను కోరుకున్న జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించవచ్చంటూ అమెరికన్ యాడ్ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. -
అయ్యో పాపం.. అంతా చూస్తుండగానే కొట్టుకు పోయారు
నాగ్పూర్: చుట్టు ముట్టేసిన వరద నీరు. మునిగిపోయిన వాహనం. ప్రాణాల కోసం హాహాకారాలు. చేతులు బయటకు పెట్టి వాహనపు పైభాగాన్ని పట్టుకుని రక్షించుకునే ప్రయత్నం. కాపాడండని కేకలు. చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నా.. వరద ఉధృతిని చూసి సాహసం చేసి రక్షించలేని పరిస్థితి. వెరసి.. వాహనంతో పాటే కొట్టుకుని పోయి ప్రాణాలు వదిలారు. మహారాష్ట్ర నాగ్పూర్ సావ్నెర్ మండలం కేల్వాద్ దగ్గర నందా నదిలో ఈ విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్పూర్కు వచ్చింది. తిరిగి ఊరికి వెళ్తున్న క్రమంలో వాళ్ల వాహనం బ్రిడ్జిపై వెళ్తుండగా.. హఠాత్తుగా వరద ముంచెత్తి ఇలా నదిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. #BREAKING #News #Monsoon2022 #Maharashtra 3 died and about 3 trapped after a scorpio car washed away in Nanda river of Kelwad, Tahsil Saoner, District #Nagpur amid heavy flow of water induced by rains, confirms @SPNagpurrural@CMOMaharashtra@Dev_Fadnavis@Deve #MaharashtraRains pic.twitter.com/gJ0HQIzOrz — Ketan Sojitra (@Public_Affairs7) July 12, 2022 అంతా చూస్తుండగానే.. వాహనం మునిగి కొట్టుకుపోగా.. నిస్సహాయంగా చూస్తూ రక్షించే ప్రయత్నాలు చేయలేకపోయారు గ్రామస్తులు. ఉన్నతాధికారులకు సమాచారం అందించినా.. వాళ్లు వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. కొందరు మొబైల్స్లో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ముగ్గురు మృతి చెందగా.. అందులో ఒక మహిళ కూడా ఉంది. మరో ముగ్గురు వాహనంతో పాటు గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు పెట్టారు అధికారులు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో వర్ష ప్రభావంతో ఇప్పటిదాకా(జూన్ 1 నుంచి జులై 10 దాకా) 83 మంది మృతి చెందారని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. -
ఆ ఏటీఎం మిషీన్ వద్దకే క్యూ కడుతున్న జనాలు! ఎందుకో తెలుసా!
ATM was dispensing extra cash: మహారాష్ట్రాలోని ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన ఏటీఎం మెషీన్ ఉంది. ఇందులో ఎక్కువ శాతం వంద రూపాయల(రూ.100) నోట్లను మిత్రమే ఉంచుతారు.. ఐతే ఒక అతను రూ.500లు డ్రా చేద్దామని వెళ్తే ఏకంగా రూ.500ల నోట్లు ఐదు వచ్చాయి. అంటే అతను రూ.500లు డ్రా చేస్తే ఏటీఏం మెషీన్ ప్రకారం వంద రూపాయల(రూ.100) నోట్లు ఐదు రావడానికి బదులు ఐదు ఐదువందల రూపాయల(రూ.500) నోటులే వచ్చాయి. దీంతో అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇక అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అంతేకాదు అతను మళ్లీ ఇంకోసారి ఇలానే డబ్బలు డ్రా చేసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన నాగ్పూర్కి సుమారు 30 కి.మీ దూరంలో ఉన్న ఖపర్ఖేడా పట్టణంలో ఒక ప్రైవేట్ ఏటీఎం మెషీన్లో చోటు చేసుకుంది. ఈ వార్త దావానలంలా పట్టణమంతా వ్యాపించింది. దీంతో జనాలు ఆ ఏటీఎం మిషీన్ వద్దకు క్యూ కట్టారు. ఐతే సదరు బ్యాక్ ఖాతాదారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ ఏటీఎం మిషీన్ని మూసేంతవరకు ఈ తంతు జరిగింది. ఏటీఎంలో తలెత్తిన సాంకేతికలోపం కారణంగా ఇలా జరిగిందని పోలీసు అధికారి చెబుతున్నారు. ఈ ఏటీఎంని రూ.100/-ల డినామానేషన్ నోట్లను పంపిణీ చేయడానికి ఉద్దేశిస్తే...బదులుగా అనుకోకుండా పొరపాటున రూ.500/- డినామినేషన్ కరెన్సీ నోట్లను తప్పుగా ఉంచినట్లు అధికారి వెల్లడించారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. (చదవండి: టిఫిన్ ప్లేట్లో బల్లి...కస్టమర్కి ఎదురైన చేదు అనుభవం) -
తెలంగాణలో కొత్తగా మరో 10 హైవేలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల విషయంలో గత కొన్నేళ్లుగా దూసుకుపోతున్న తెలంగాణ, కొత్త ఆర్థిక సంవత్సరంలో మరో 10 కొత్త రహదారుల (ప్యాకేజీల ప్రకారం) పనులు ప్రారంభించనుంది. 715 కి.మీ. నిడివి ఉండే ఈ రోడ్ల నిర్మాణానికి రూ.28,615 కోట్లు ఖర్చు కానుందని అంచనా. కొద్దిరోజుల క్రితమే కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 258 కి.మీ. నిడివి గల కొత్త రోడ్డుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వీటికి రూ.4,927 కోట్ల వ్యయం కానుంది. ఈ పనులు ప్రారంభం కాగా కొత్తగా మరో 10 రోడ్ల పనులు ప్రారంభించేందుకు వీలుగా అవార్డులు పాస్ చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఏర్పాట్లు చేస్తోంది. కీలకమైన హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డులోని ఉత్తరభాగంతో పాటు నాగ్పూర్–విజయవాడ మధ్య కొత్తగా నిర్మించబోయే గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే కూడా ఇందులో ఉంది. ఈ 2 రోడ్లు పూర్తిగా గ్రీన్ఫీల్డ్ కావడం విశేషం. వీటితో కలుపుకొంటే గత ఎనిమిదేళ్ల కాలంలో 2,251 కి.మీ. నిడివి గల కొత్త జాతీయ రహదారులు అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. భూసేకరణే కీలకం.. : రీజినల్ రింగురోడ్డు, నాగ్పూర్–విజయవాడ కారి డార్లో భాగంగా తెలంగాణ పరిధిలో మంచిర్యాల నుంచి వరంగల్, ఖమ్మం మీదుగా ఏపీ సరిహద్దు వరకు 311 కి.మీ. మేర నిర్మించే గ్రీన్ఫీల్డ్ హైవేలలో భూసేకరణే కీలకంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కానీ ఈ రోడ్ల వల్ల పారిశ్రామిక పురోగతికి గొప్ప అవకాశం ఉన్నందున, భూసేకరణ సాఫీగా సాగేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంచిర్యాల–ఖమ్మం మీదుగా విజయవాడకు నిర్మించే గ్రీన్ఫీల్డ్ హైవేతో నాగపూర్–విజయవాడ మధ్య దూరం 180 కి.మీ.మేర తగ్గనుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా వెళ్లే ట్రాఫిక్ చాలావరకు ఈ కొత్త రోడ్డుమీదుగా డైవర్ట్ అవుతుంది. ఇది కొత్త ప్రాంతాల్లో పారిశ్రామిక పురోగతికి దోహదపడటమే కాకుండా,దూరం తగ్గడంతో ఇంధనం, సమయం ఆదా అవుతుంది. -
విజయవాడ–నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేకి పచ్చజెండా
సాక్షి, అమరావతి: ఏపీ నుంచి మరో జాతీయ రహదారి మహారాష్ట్రను అనుసంధానించనుంది. విజయవాడ–నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణానికి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కార్యాచరణకు ఉపక్రమించింది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఈ గ్రీన్ఫీల్డ్–బ్రౌన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించనున్నారు. రూ.14 వేల కోట్లతో మొత్తం 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించే ప్రణాళికను ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. చదవండి: AP: ఎగుమతులపై ‘పుష్’ పాలసీ ఈమేరకు ఫీజబులిటీ నివేదిక, డీపీఆర్లను ఖరారు చేసింది. విజయవాడ–నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను అయిదు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. వాటిలో విజయవాడ–ఖమ్మం, ఖమ్మం–వరంగల్, వరంగల్–మంచిర్యాల ప్యాకేజీలను గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలుగా.. మంచిర్యాల–రేపల్లెవాడ, రేపల్లెవాడ–చంద్రాపూర్ ప్యాకేజీలను బ్రౌన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలుగా నిర్మించాలని నిర్ణయించారు. చంద్రాపూర్ నుంచి నాగ్పూర్కు ఇప్పటికే ఉన్న 4 లేన్ల ఎక్స్ప్రెస్ హైవేకి ఈ రహదారిని అనుసంధానిస్తారు. మొత్తం మీద 310 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్, 147 కిలోమీటర్ల బ్రౌన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రూపుదిద్దుకోనుంది. తగ్గనున్న వ్యయ, ప్రయాసలు ఈ హైవేతో విజయవాడ–నాగ్పూర్ మధ్య ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు బాగా తగ్గుతాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి నాగ్పూర్ వెళ్లాలంటే హైదరాబాద్, అదిలాబాద్ మీదుగా 770 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దాదాపు 13 గంటల సమయం పడుతోంది. కొత్త ఎక్స్ప్రెస్ హైవేను విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, మంచిర్యాల మీదుగా నిర్మించన్నారు. దీంతో విజయవాడ–నాగ్పూర్ మధ్య దూరం 163 కిలోమీటర్లు తగ్గి ఐదుగంటల సమయం కలసివస్తుంది. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కావడంతో భూసేకరణ ప్రక్రియపై ఎన్హెచ్ఏఐ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు వేగవంతం చేసింది. విజయవాడ రూరల్, జి.కొండూరు, గంపలగూడెం మండలాల్లో దాదాపు 1.65 లక్షల చదరపు మీటర్ల భూసేకరణకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి 2025నాటికి ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. -
సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా
నాగపూర్: జైలులో తాను కాలకృత్యాలు తీర్చుకొనేచోట, స్నానం చేసే చోట అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా డిమాండ్ చేశారు. లేదంటే జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అధికారులు అతనికి వాటర్ బాటిల్ ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా సాయిబాబా మంచం పక్కన స్టీల్ బాటిల్ను ఉంచారని, అతని ఆరోగ్య పరిస్థితి కారణంగా బాటల్ను ఎత్తలేడని, దీని ఫలితంగా తీవ్రమైన వేడిలో తరచుగా నీరు త్రాగడానికి అతని వద్ద బాటిల్ లేదని వారు పేర్కొన్నారు. -
ప్రియుడితో షికార్లు.. గర్భం దాల్చడంతో యూట్యూబ్ చూసి.. ఆ తర్వాత
సాక్షి, ముంబై: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ మైకంలో వారిద్దరూ ఒకరోజు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. టెన్షన్కు గురైన ఆమె ప్రియుడి సలహాతో గర్భాన్ని తొలగించుకునేందుకు యూట్యాబ్ చూసి తనకు తానే వైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నాగ్పుర్లోని నార్ఖేడ్కు చెందిన యువతి.. ఆరు నెలల క్రితం తన బాయ్ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా కలవడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతడు ఏవో మందు వేసుకుంటే అబార్షన్ అవుతుందని సూచించాడు. దీంతీ ఆమె ఆ మందులు వేసుకుంది. అయినప్పటికీ అబార్షన్ కాకపోవడంతో ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలుస్తుందని టెన్షన్ పడింది. అబార్షన్ మందుల కోసం యూ ట్యూబ్లో సెర్చ్ చేసింది. ఓ మందును కొనుగోలు చేసి వాటిని వేసుకుంది. దీంతో అనారోగ్యానికి గురైంది. అనుమానం వచ్చి తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. అనంతరం వెంటనే ఆమెను వైద్యం కోసం నాగపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి బాయ్ఫ్రెండ్ వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పండుగ వేళ ఆకాశంలో అద్భుతం.. వీడియో వైరల్
ఉగాది పండుగ వేళ ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. రాత్రి వేళ ఆకాశంలో పదుల సంఖ్యలో ఉల్కలు భూమి మీదకు పడిపోతూ చూపరులను ఆకట్టుకున్నాయి. శనివారం రాత్రి.. మహారాష్ట్రలోని నాగపూర్, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన కొమురం భీమ్ ఆసిఫాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉల్కలు పడిపోతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ప్రజలు సెల్ఫోన్లతో వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. #WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R — ANI (@ANI) April 2, 2022 -
అర్ధరాత్రి సగం కాలిపోయిన డెడ్ బాడీ కలకలం.. నికితా చౌదరికి ఏమైంది..?
సాక్షి, ముంబై: దేశంలో రోజురోజుకు యువతులు, మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలను తీసుకువచ్చినా కొందరు మృగాలు మాత్రం మారడం లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. నాగపూర్లో సగం కాలిపోయిన యువతి నికితా చౌదరి(22) మృతదేహం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుబర్డి ప్రాంతంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో బుధవారం రాత్రి మంటల్లో సగం కాలిపోయిన నికితా చౌదరి మృతదేహాన్ని గుర్తించినట్టు తెలిపారు. కాగా, సదరు యువతి కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం వాడి పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. అయితే నికితా చౌదరి మృతదేహంలో లభ్యమైన ప్రాంతంలో ఖాళీ పెట్రోల్ సీసాలు కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, రాణాప్రతాప్నగర్కు చెందిన నికితా చౌదరి.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రోజు వారీ లాగే ఆమె మంగళవారం ఆఫీసుకు వెళ్లి తిరిగిరాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో ఆమె మృతదేహం ఇలా బయట పడింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. బాధితురాలిపై లైంగిక దాడి చేసిన అనంతరం ఇలా చేశారా లేక ఇక్కడే ఆమెను చంపేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
ఈ పిల్లలు మన పిల్లలు కాదా?
మన పిల్లలు స్కూళ్లకు వెళతారు. ఆపై ఉద్యోగాలకు వెళతారు. ఆపై జీవితాల్లో స్థిరపడతారు. కాని సమాజం ఒక కుటుంబం అనుకుంటే ఇవన్నీ దక్కని పిల్లలున్న భారతదేశం ఒకటి ఉంది. అది మురికివాడల భారతదేశం. ‘వాళ్లూ మన పిల్లలే. వాళ్లను ఇలాగే వదిలేస్తామా?’ అంటాడు అమితాబ్ ‘ఝండ్’లో. వ్యసనాలతో బాధ పడుతూ నేరాలు చేస్తూ జైళ్ల పాలవుతూ వీరు పడే సలపరింతకు సమాజానిదే బాధ్యత. వారి కోసం పట్టించుకుందాం అని గట్టిగా చెప్పిన ఝండ్ ఈవారం సండే సినిమా. ‘ప్రపంచ మురికివాడల సాకర్ కప్’కి ఇండియా టీమ్కు ఆహ్వానం అందుతుంది. ఆ టీమ్లో ఉన్నది ఎవరు? చెత్త ఏరుకుని జీవించే మురికివాడల పిల్లలు, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం వల్ల చదువుకోలేకపోయిన ఆడపిల్లలు, కుటుంబ కష్టాల్లో ఉన్న మైనారిటీలు, రైళ్లలో బొగ్గు దొంగతనం చేసే దొంగలు, సారాయి బానిసలు, వైటనర్ను పీల్చే వ్యసనపరులు... వీళ్లంతా మహా అయితే 20 ఏళ్ల లోపు వారు. ఒక రకంగా వారి జీవితం నాశనమైపోయింది. కాని వారికి ఒక్క చాన్స్ ఇవ్వదలిస్తే? ఆ ఒక్క చాన్సే ‘వరల్డ్ హోమ్లెస్ సాకర్ కప్’లో పాల్గొనడమే అయితే... ఆహ్వానం అందింది కాని మరి అందుకు పాస్పోర్ట్లు? పాస్పోర్ట్ పొందడం ఈ దేశంలో కొంతమందికి ఎంత కష్టమో దర్శకుడు ఈ సినిమా లో వివరంగా చూపిస్తాడు. కొందరి దగ్గర పాస్పోర్ట్కు అప్లై చేయడానికి ఏ కాగితమూ ఉండదు. ఒకడికి పాస్పోర్ట్ ఇవ్వడానికి వాడి మీద ఉండే పోలీస్కేసు అడ్డంకిగా మారుతుంది. ఆ వంకతో వాడికి పాస్పోర్ట్ ఇవ్వడం మానేస్తే వాడు సమాజం మీద మరింత ద్వేషం పెంచుకుంటాడు. తనను తాను మరింతగా ధ్వంసం చేసుకుంటాడు. అందుకే వాడికి పా‹స్పోర్ట్ ఇప్పించేందుకు తానే జడ్జి ముందు మొరపెట్టుకుంటాడు ఫుట్బాల్ కోచ్ అయిన అమితాబ్. ‘మన కళ్లెదురుగా ఉన్నదే మనకు తెలిసిన భారతదేశం కాదు. మనం చూడని భారతదేశం ఒకటి ఉంది. దానిని చూడకుండా మన కళ్లకు అడ్డుగా ఒక పెద్ద గోడ ఉంది. ఆ గోడ అవతల ఎంతోమంది బాల బాలికలు దీనమైన బతుకులు బతుకుతున్నారు. సమాజం పట్టించుకోకపోవడం వల్ల అరాచకంగా మారి సమాజం దృష్టిలో మరింత చెడ్డ అవుతున్నారు. ఈ పిల్లలు అద్భుతంగా ఫుట్బాల్ ఆడుతున్నారు. వీరు ఇలాంటి ఆటల్లో పడితే, వ్యసనాల నుంచి బయటపడి ఒక అర్థవంతమైన బతుకు బతుకుతారు’ అంటాడు అమితాబ్. ఝండ్ (గొడ్ల గుంపు. స్లమ్ పిల్లల ఫుట్బాల్ టీమ్ను కనీసం టీమ్ అనైనా పిలవకుండా గొడ్లగుంపు అని పిలుస్తారు డబ్బున్నవాళ్లు ఈ సినిమాలో) మార్చి 4న విడుదలైంది. అమితాబ్ ప్రధాన పాత్రలో నటించాడు. మిగిలిన వాళ్లలో చాలామంది స్లమ్ కుర్రాళ్లు నటించారు. మరాఠీలో ‘సైరాట్’ తీసి భారీ పేరు గడించిన దర్శకుడు నాగరాజ్ మంజులే ఈ సినిమాతో కూడా ప్రశంస లు అందుకుంటున్నాడు. ఈ సినిమాను నాగ్పూర్కు చెందిన విజయ్ బర్సే అనే టీచర్ జీవితం ఆధారంగా తీశారు. ఆ పాత్రనే అమితాబ్ పోషించాడు. నాగ్పూర్లో ఒక కాలేజ్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా పని చేసిన విజయ్ బర్సే ఆ పక్కనే ఉండే మురికివాడల్లోని పిల్లలు అద్భుతంగా ఫుట్బాల్ ఆడటం చూసి వారికోసం ‘స్లమ్ సాకర్ క్లబ్’లను స్థాపించాడు. వారికి కొత్త జీవితం ప్రసాదించాడు. అందుకు తగ్గట్టుగా ‘ఝండ్’ మొత్తం సినిమాను నాగ్పూర్లో తీశారు. అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఇది నాగ్పూర్కు చెందినది మాత్రమే కాదని, దేశంలో ఉన్న ఏ మురికివాడకు చెందిన కథేనేమోనని అనిపిస్తుంది. ముఖ్యంగా పాత్రలను మురికివాడల నుంచే తీసుకోవడం వల్ల వారి బతుకు తీవ్రమైన వేదన కలిగిస్తుంది. మర్యాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న మధ్యతరగతి, ధనిక వర్గాలతో పోలిస్తే వారి జీవితంఘోరంగా ఉంటుంది. సమాజపు ఫలాలకు వారూ హక్కుదారులే. వారూ దేశం బిడ్డలే. వారూ అందరిలాంటి పిల్లలే. వారి కోసం ఎందుకు సమాజం ఆలోచించదు? ఎందుకు వారిని ఈసడించుకుని పదే పదే వారిని మరింత నిరాశలోకి తిరుగుబాటులోకి నెడుతుంది అనిపిస్తుంది. ఈ కథలో నాగ్పూర్లోని ఒక మధ్యతరగతి కాలనీని ఆనుకుని ఉండే మురికివాడలోని పిల్లలకు ఆ మధ్యతరగతి కాలనీలో నివసించే అమితాబ్ దగ్గర అవుతాడు. అప్పటికే వాళ్లు అరాచకంగా ఉంటారు. వారికి జీవితం మీద ఏ ఆశా లేదు. వారికి ఫుట్బాల్ ఆడితే డబ్బు ఇస్తూ ఆ ఆట మీద మోజు కలిగిస్తాడు. మెల్లమెల్లగా వారికి ఆ ఆట నిజమైన నషాగా మారుతుంది. అందరూ ఆటగాళ్లు అవుతారు. అప్పుడు అమితాబ్ తన కాలేజీలో దేశంలోని అన్ని మురికివాడల టీమ్లను పిలిపించి జాతీయ టోర్నమెంట్ ఆడిస్తాడు. ఆ తర్వాత ఈ టీమ్లన్నింటి నుంచి ఒక టీమ్ తయారు చేసి వరల్డ్కప్కు తీసుకువెళతాడు. అయితే ఆ మొదలు నుంచి ఈ చివరకు మధ్య ఎన్నో బరువెక్కే సన్నివేశాలు. కన్నీటి గాధలు. నిస్సహాయ క్షణాలు. సామాజిక చైతన్యం కలిగించే ఇటువంటి కథలకు హిందీలో పెద్ద పెద్ద స్టార్లు మద్దతు ఇస్తున్నారు. రణ్వీర్ సింగ్ ‘గల్లీ బాయ్’ చేశాడు. అమితాబ్ ‘ఝండ్’ చేశాడు. దక్షిణాదిలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరగాలి. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పిల్లలు బిచ్చమెత్తుతూ కనిపిస్తే తప్పక ‘ఝండ్’ సినిమా గుర్తుకొస్తుంది. ఎందుకంటే అది చూపే ప్రభావం అలా ఉంటుంది. చూడండి. -
బీహెచ్ఈఎల్, నాగ్పూర్లో ఇంజనీరింగ్ ఉద్యోగాలు
నాగ్పూర్లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్), పవర్ సెక్టర్ వెస్టర్న్ రీజియన్ నిర్ణీత కాల ప్రాతిపదికన ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 36 ► పోస్టుల వివరాలు: ఇంజనీర్లు(సివిల్)–10, సూపర్వైజర్లు(సివిల్)–26. ► ఇంజనీర్లు(సివిల్): అర్హత: సివిల్ ఇంజనీరింగ్లో నాలుగేళ్ల ఫుల్టైం బ్యాచిలర్స్ డిగ్రీ/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.71,040 చెల్లిస్తారు. ► సూపర్వైజర్లు(సివిల్): అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.01.2022 నాటికి 40 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.39,670 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: బీఈ/బీటెక్, డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్ఆర్) బీహెచ్ఈఎల్, పవర్ సెక్టార్ వెస్ట్రన్ రీజియన్, శ్రీ మోహిని కాంప్లెక్స్, 345 కింగ్స్వయ్, నాగ్పూర్–440001 చిరునామకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 11.01.2022 ► దరఖాస్తు హార్డ్కాపీలను పంపడానికి చివరి తేది: 14.01.2022 ► వెబ్సైట్: pswr.bhel.com -
అక్కడ తెలుగోడి నల్ల ఇడ్లీ ఎంత ఫేమసో..!!
-
ఆరు గంటలపాటు పోలీసులను పరుగులు పెట్టించింది.. అంతా ఫేక్!
నాగ్ఫూర్: బాయ్ ఫ్రెండ్ను పెళ్లాడటానికి 19 యేళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురయ్యానంటూ కట్టుకథ అల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు మంగళవారం నాగ్పూర్ అధికారులు మీడియాకు తెలిపారు. సదరు యువతి సోమవారం ఉదయం 11 గంటలకు కలమ్నా పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో నాగ్పూర్ పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్తో సహా, ఇతర సీనియర్ అధికారులతో కూడిన సుమారు వెయ్యి మంది భద్రతా సిబ్బందిఈ కేసును విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా సిటీలోని 250కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ఇదంతా కట్టుకథని పోలీసధికారులు ధృవీకరించారు. ఐతే ఇదంతా ఎందుకు చేసిందో ఖచ్చితమైన కారణం తెలియచేయలేదని పోలీసులు తెలిపారు. కాగా ఆమె ఇచ్చిన పిర్యాదులో నాగ్పూర్ చిఖ్కలిలో నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసినట్లు తెల్పింది. ఉదయం మ్యూజిక్ క్లాస్కు వెళ్తుండగా మార్గం మధ్యలో వైట్ కలర్ వ్యాన్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డు డైరెక్షన్లడిగే నెపంతో మాట్లాడుతూ, వ్యాన్లోకి బలవంతంగా లాగి, ముఖాన్ని గుడ్డతో కప్పారని తెల్పింది. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పిర్యాదులో పేర్కొంది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ చేసిన తర్వాత పోలీస్ కమీషనర్ అమితేష్ కుమార్, అడీషనల్ సీపీ సునీల్ ఫులారీ, ఇతర సీనియర్ అధికారులు సీతాబుల్దీ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. కమీషనర్ కుమార్ దాదాపుగా వెయ్యి మంది పోలీసులతో 40 స్పెషల్ టీమ్లను ఏర్పాటుచేసి, సిటీలోని వ్యాన్లను, సీసీటీవీలను పరిశీలిండానికి, యువతి స్నేహితులను ప్రశ్నించడానికి హుటాహుటీన పంపారు. యువతిని మెడికల్ పరీక్షల నిమిత్తం మేయో హాస్పిటల్కు తరలించారు. ఈ ఉదంతంపై పోలీసధికారులు ప్రశ్నించగా తన బాయ్ఫ్రెండ్ను వివాహమడటానికి చేశానని చెప్పినట్లు తెల్పింది. ఆరు గంటలపాటు సీసీటీవీ ఫుటేజీల పరిశీలన, దాదాపు 50 మందిని విచారించిన తర్వాత అనుమానం వచ్చిన పోలీసులు యువతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన బాయ్ ఫ్రెండ్ను వివాహం చేసుకోవడానికే ఈ నాటకమంతాడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. చదవండి: జంక్ సామ్రాజ్యం ‘సోటిగంజ్’.. చోర్ మాల్తో 30 ఏళ్ల దందా.. కోట్లకు కోట్లు వెనకేశారు -
రూ. 5కే పోహా.. 65 ఏళ్ల వయసులో బామ్మ బతుకు పోరాటం .. హాట్సాఫ్ దాదీ
ముంబై: కష్టపడే తత్వం ఉంటే ఏ పని చేసుకోనైనా బతికేయచ్చు.. కాళ్లు చేతులు అన్నీ సరిగా ఉన్నప్పటికీ కొంతమందికి పనిచేసుకోడానికి బద్ధకేసి భిక్షాటన చేస్తూ జీవిస్తుంటారు. మరికొంత మందికి వేరే వాళ్ల మీద ఆధారపడి బతకడం నచ్చదు. తమ ఒట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడుతుంటారు. అచ్చం అలాగే ఆలోచించిన మహారాష్ట్రకు చెందిన 65 ఏళ్ల వృద్ధ మహిళ బామ్మ కేవలం అయిదు రూపాయలకే స్నాక్స్ అమ్ముతూ పొట్ట పోషించుకుంటుంది. 5 రూపాయలకే ఆహారం అంటే నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇదే నిజం. నాగ్పూర్లోని భారత్ మాతా చౌక్లోని టీబీ హాస్పిటల్ ముందు 65 ఏళ్ల బామ్మ కేవలం 5 రూపాయలకు తర్రి పోహాను విక్రయిస్తూ తన కాళ్ల మీద తను బతుకుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పోహాను అమ్ముతూ బతుకు దెరువు సాగిస్తోంది. తన భర్త చనిపోవడంతో గత 15 ఏళ్లుగా పోహా విక్రయిస్తోంది. ఆమెకు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఎవరూ లేదు. భార్య మరణంతో డబ్బు సంపాదించడానికి ఆమె ఏకైక మార్గం ఇదే. బామ్మ గురించి తెలిసిన అక్కడి స్థానికులు ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. చదవండి: ప్రియాంక గాంధీ డ్యాన్స్ వీడియో వైరల్ అయితే ఆమె కష్టాన్ని చూసిన ఓ ఫుడ్ వ్లాగర్ తన స్టోరీని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ.. బామ్మకు సాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వృద్ధ మహిళను చూసి నెటిజన్లు శభాష్ అంటున్నారు. కొంతమంది ఆమెకు ఏదైనా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ల ఫుడ్ స్టాల్ బాగా నడిచేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. చదవండి: బాప్రే!...ఒంటెల అందాల పోటీలు.. రూ. 500 కోట్ల ప్రైజ్మనీ!! View this post on Instagram A post shared by Dhir And Tauqeer (@food_o_logy_nagpur) -
బాలుడి ప్రాణం తీసిన బెలూన్
ముంబై: గొంతులో బెలూన్ ఇరుక్కోవడంతో ఊపిరాడక ఓ అరేళ్ల బాలుడు మృతి చెందాడు. నాగ్పూర్కు చెందిన విజయ్ పటేల్(6)కు అతని తల్లిదండ్రులు బుధవారం ఉదయం అడుకునేందుకు కొన్ని ఆటవస్తువులు, బెలూన్లు ఇచ్చారు. విజయ్ వాటితో ఆడుకుంటుండగా ఓ బెలూన్లోంచి గాలి పోయింది. దీంతో ఆ బెలూన్ను నోటిలో పెట్టుకుని గాలిఊదే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తూ అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతనికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే తల్లిదండ్రులు పరుగున వచ్చి సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీపావళి వేడుకలతో సంతోషాలు నిండాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: (అమెరికా బ్లాక్లిస్ట్లో పెగాసస్) -
Mohan Bhagwat: 80 శాతం నిధులు రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్లేవి
నాగ్పూర్: ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కశ్మీర్కు కేటాయించిన నిధుల్లో 80 శాతం రాజకీయ నాయకులు తమ జేబుల్లో వేసుకున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా ఆరోపించారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు, కాశ్మీర్ లోయ కోసం కేటాయించిన 80 శాతం నిధులు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. కేటాయించిన నిధులు ప్రజలకు చేరలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని ప్రజలు అభివృద్ధిని ప్రత్యక్షంగా పొందుతున్నారని తెలిపారు. తాను జమ్మూ కాశ్మీర్ను సందర్శించి ప్రస్తుత అక్కడ ఉన్న పరిస్థితిని చూశానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. గతంలో జమ్మూ, లడఖ్పై తీవ్రమైన వివక్ష ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఎటువంటి వివక్ష లేదని పేర్కొన్నారు. ఆగస్టు 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను అందించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
నాగ్పూర్: ఎన్ని చట్టాలు తీసుకువస్తున్న మహిళలపై సామూహిక అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ భారతదేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలకు అంతం లేదనిపిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఘటనే నాగ్పూర్లో చోటు చేసుకుంది. ఈ మేరకు నాగపూర్లోని మాదవ్ నగరి ప్రాంతానిక చెందిన ఒక మైనర్ బాలిక్ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి రాత్రి 8 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా నలుగురు యువకులు వచ్చి వారిపై దాడి చేశారు. (చదవండి: "అనుకోని అరుదైన వ్యాధి జీవితాన్నే మార్చేసింది") ఈ క్రమంలో ఆ యువకులు ఆ బాలుడుని కొట్టి ఆ అమ్మాయిని ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకువెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు ఒక నిందుతుడిని అరెస్ట్ చేయగా మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. అయితే థానేలోని డోంబివ్లి, సకినాకాలో జరిగిన వరుస అత్యాచార ఘటనలన మరువక మునుపే మరి కొద్ది రోజులకే మళ్లీ ఇలాంటి ఘటనే చోటు చేసుకోవటం అత్యంత బాధాకరం. (చదవండి: వరద ఉధృతిని నేరుగా వీక్షిస్తూ ఆస్వాదించచ్చు!) -
Sumukhi Suresh: 30 వేల జీతం.. జీవితం బాగానే సాగేది.. కానీ నవ్వించడంలో..
చూడగానే ఆకర్షించే రూపం లేదు గానీ తను ఏడ్చినా, కోప్పడి కన్నెర్ర చేసినా చూసినవారు శెభాష్ అనకుండా ఉండలేరు. ఆకృతి కాస్త భారీగా ఉన్నప్పటికీ అనర్గళంగా మాట్లాడుతూ .. వీక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తు్తంది. హాస్యనటులు అనగానే దాదాపు పురుషుల పేర్లు వినపడే ఈ రోజుల్లో స్టాండప్ కామెడీతో ఆడియన్స్ను ఆకట్టుకుని వెబ్ సిరీస్, యూట్యూబ్ సిరీస్తో కడుపుబ్బా నవ్విస్తోంది పుష్పవల్లి అలియాస్ సుముఖి సురేష్. సుముఖి సురేష్ కంటే పుష్పవల్లిగా బాగా పాపులర్ అయిన సుముఖి ప్రముఖ డిజిటల్ కమేడియన్. నాగపూర్లో పుట్టి పెరిగిన సుముఖి చెన్నైలోని ఎమ్ఓపీ వైష్ణవ్ కాలేజీ ఫర్ ఉమెన్స్లో మైక్రోబయాలజీ, ఫుడ్ సేఫ్టీలో డిగ్రీ చదివింది. డిగ్రీ అయ్యాక 2009లో బెంగుళూరు వెళ్లి అక్కడ పిల్లల లైబ్రరీలో కొన్నాళ్లు పనిచేసింది. తరువాత ఐటీసీ రాయల్ గార్డెనియాలో చెఫ్గా పనిచేసింది. ఫుడ్ లేబొరేటరీలో పనిచేస్తున్న సమయంలో జోక్స్ వేస్తూ అందరినీ అలరిస్తుండేది. నెలకు 30 వేలరూపాయల జీతం, ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పనివేళలతో జీవితం హాయిగానే సాగుతోంది. ఈ క్రమంలో సుముఖి అప్పుడప్పుడు సరదాగా యూ ట్యూబ్లో కామెడీ స్కెచెస్ చేసేది. వీటికి మంచి స్పందన లభించడంతో మరిన్ని వీడియోలు చేస్తుండేది. అయితే ఒకపక్క ఉద్యోగం... మరోపక్క కామెడీ వీడియోలతో కష్టంగా ఉండేది. దీంతో ఉద్యోగం వదిలి కామెడీనే ఫుల్ టైమ్ కెరియర్గా మార్చుకుంది. స్టాండప్ కమేడియన్ సుముఖి తన మొత్తం సమయాన్ని హాస్యానికే కేటాయించి 2013 నుంచి పలు షోలలో కామెడీ చేయడం ప్రారంభించింది. తన టీమ్తో కలిసి బెంగళూరు, దుబాయ్, ముంబై, హైదరాబాద్, స్వీడన్లలో వంద షోలను చేసింది. ఇండియాలోనే తొలిసారి మాక్యుమెంటరీ యూట్యూబ్ సిరీస్ను ప్రారంభించిన ఎన్జీవో ‘‘బెటర్ లైఫ్ ఫౌండేషన్’’ నిర్వహించే.. షోలలో పాల్గొని అనేక ఎపిసోడ్లలో కామెడీని పండించి సుముఖి మంచి పాపులారిటీని పొందింది. దీని తరువాత ‘బేథీనాక్’ సిరీస్ బాగా పాపులర్ అయ్యింది. కామెడీని కెరియర్గా మార్చుకున్న సుముఖి అను ఆంటీ, సుముఖీ చావ్లా క్యారెక్టర్తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పుష్పవల్లి బేథీనాక్, బెటర్ లైఫ్ ఫౌండేషన్ కామెడీ తరువాత తనే స్వయంగా ‘‘డిస్గస్ట్ మి’’ పేరిట స్టాండప్ కామెడీ షోను చేయడం ప్రారంభించింది. అమేజాన్ ప్రైమ్లో విడుదలైన ‘పుష్పవల్లి’ సీజన్ 1, 2లను సుముఖియే స్వయంగా రాసి, పుష్పవల్లి క్యారెక్టర్లో జీవించేయడంతో బాగా పాపులర్ అయ్యింది. సీజన్ వన్లో పుష్పవల్లి ప్రేమలో పడడం అది ఎలా బ్రేకప్ అయిందో ఉంటుంది. రెండో సీజన్లో పుష్పవల్లి తన లవర్పై పగతీర్చుకునే తీరును వర్ణించిన తీరు అద్భుతం. రెండు సీజన్లలో పుష్పవల్లి పాత్ర కనిపిస్తే చాలు నవ్వు ఆపుకోలేకపోయినంతగా ఆకట్టుకుంది. ఇదేగాకుండా కన్నడ సినిమా ‘హంబుల్ పొలిటీషియన్ నొగరాజ్లో కూడా నటించింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విడుదలైన ‘‘బ్యూటీ అండ్ ది ఫీస్ట్’’, ‘‘బనాకే దిఖా’’, ‘‘లస్ట్ స్టోరీస్’’ వంటివాటిని క్రియేట్ చేసి దానిలో సుముఖి నటించింది. వీటితోపాటు అమెజాన్ ఒరిజినల్ ‘‘కామిక్స్థాన్’’లో అతిథిగా, జడ్జిగా పాల్గొంది. ఈ మధ్యకాలంలో ‘‘డోంట్ టెల్ అమ్మా’’ స్టాండప్ కామెడీని విడుదల చేసింది. ‘‘నోటరీ’ అనే షార్ట్ ఫిల్మ్ను నిర్మిస్తోంది. అంతేగాక ‘ఇస్తాంబుల్ ఫిల్మ్ అవార్డ్స్’లో పుష్పవల్లి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిమేల్ యాక్టర్ అవార్డులను గెలుచుకుంది. ‘‘మనం అందంగా లేమని, మనం ఎవరికీ నచ్చమని బాధపడేకంటే మనకున్న గుణాలు, తెలివితేటలతో కష్టపడి పనిచేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుంది. కామెడీ ఎవరి సొంతం కాదు. వీక్షకులను హాస్యంతో ఆకట్టుకోవడమే ముఖ్యం’’ అని సుముఖి చెబుతోంది. ఇండియాలో ఉన్న ప్రముఖ కమేడియన్లలో ఫాలోవర్స్తోపాటు అధిక మొత్తంలో ఆదాయాన్ని ఆర్జిస్తోన్న జాబితాలో ఆమె ఉండడం విశేషం. ఒకపక్క వెబ్సిరీస్లో కామెడీని పండిస్తూనే, మరోపక్క స్టాండప్ కామెడీ, యూ ట్యూబ్, ఇన్స్టాగామ్లలో కామెడీ వీడియోలతో లక్షల మందిని అలరిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చదవండి: ఇళ్లు లేని విద్యార్థులకు ఏకంగా 150 ఇళ్లు కట్టించన టీచర్.. ఎక్కడంటే.. -
‘కరోనా థర్డ్ వేవ్ వచ్చేసిందని అనలేదు’: ముంబై మేయర్
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ మళ్లీ దేశంలో కలకలం రేపుతోంది. తాజాగా మహారాష్ట్రలో కూడా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని ముంబై, నాగ్పూర్లో కేసుల నమోదు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి, ఓ మేయర్ థర్డ్ వేవ్ వచ్చేసిందని ప్రకటించారు. ఇదిగోండి మీ ఇళ్ల ముందే ఉందని పేర్కొన్నారు. వారిద్దరి ప్రకటనలు ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉందనేది స్పష్టం చేస్తోంది. చదవండి: జైలులో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన ఖైదీలు ఆ రాష్ట్ర మంత్రి నితిన్ రౌత్ ‘నాగ్పూర్లో థర్డ్ వేవ్ వచ్చేసింది’ అని మంగళవారం తెలిపారు. తాజాగా ముంబై మేయర్ కిశోరీ పడ్నేకర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ‘మూడో దశ రావడం కాదు. వచ్చేసింది! మన ఇంటి ముందరే ముప్పు పొంచి ఉంది. జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం’ అని ఆమె తెలిపారు. ‘నాగ్పూర్లో వచ్చేసింది అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబైవాసులు జాగ్రత్తలు పాటించాలి’ అని సూచించారు. ‘గత రెండు దశల అనుభవంతో ఇప్పుడు మూడో దశ రాకుండా అడ్డుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది’ అని విలేకరుల సమావేశంలో ఆమె చెప్పారు. అయితే ఆ ప్రకటనపై ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా ఆమె బుధవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ‘నేను అలా అనలేదు’ అని చెప్పారు. ముంబైలో థర్డ్ వేవ్ ఉందని తాను అనలేదని స్పష్టం చేశారు. మంత్రి నితిన్ రౌత్ థర్డ్ వేవ్ ఉన్నట్టు చెప్పడంతో థర్డ్ వేవ్ ఇంటి ముందరే ఉందని చెప్పినట్లు వివరణ ఇచ్చారు. జాగ్రత్తలు అవసరం అని మాత్రమే తాను చెప్పినట్లు వివరించారు. కరోనాపై మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా స్పందించారు. కరోనా ఉందనే విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. ‘12-18 ఏళ్ల వారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదనే విషయాన్ని గుర్తించాలి. ముంబైతో పాటు మహారాష్ట్రలో మూడో దశ రాకుండా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. జాగ్రత్తలు పాటిస్తే థర్డ్ వేవ్ను అడ్డుకోగలం’ అని ఆదిత్య తెలిపారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో వినాయక చవితి వేడుకలపై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే వేడుకలు చేసుకోవాలని సూచించింది. చదవండి: ఉత్తరాఖండ్ గవర్నర్ రాజీనామా -
బుల్లెట్ రైలు.. మరో కొత్త మార్గంలో ?
జాల్నా (మహారాష్ట్ర) : అవసరం అనుకుంటే ముంబై- నాగ్పూర్ మార్గంలో బుల్లెట్ రైలు నిర్మించే అవకాశాలను పరిశీలిస్తామని రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ దన్వే అన్నారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతుండగా దాన్ని నాగ్పూర్ వరకు పొడిగించే అంశాన్ని మంత్రి స్వయంగా ప్రస్తావించారు. భారీ నష్టాల్లో రైల్వే కరోనా కారణంగా రూ. 36,000 కోట్ల నష్టం వాటిల్లిందంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే అన్నారు. ముఖ్యంగా ప్యాసింజర్ రైళ్ల నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందంటూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని జాల్నా స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను రైల్వేశాఖ సహాయ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాసింజర్ రైళ్ల వల్లే తక్కువ టిక్కెట్ చార్జీలతో ప్యాసింజర్ రైళ్లు నడిపించడం ద్వారా రైల్వే ఎక్కువగా నష్టపోతుందన్నారు. టిక్కెట్ చార్జీలు పెంచితే ప్రజలపై భారం పడుతుందని ఆ పని చేయడం లేదన్నారు. కేవలం గూడ్సు రవాణా ద్వారానే రైల్వేకా ఆదాయం సమకూరుతోందని మంత్రి అన్నారు. దేశ సరకు రవాణాలో గూడ్సు రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇదేం చోద్యం ప్యాసిజంర్ రైళ్ల వల్లే నష్టాలు అంటూ రైల్వేశాఖ సహాయ మంత్రి రావు సాహేబ్ మాటలపై విస్మయం వ్యక్తం అవుతోంది. కరోనా సంక్షోభం తలెత్తిన తర్వాత రైల్వేశాఖ గూడ్సు రవాణాలో వేగం పెరిగిందని చెబుతూనే మళ్లీ నష్టాలేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో పట్టాలెక్కిన రైళ్లన్నింటీలో సబ్సీడీలు ఎత్తేయడమే కాకుండా స్పెషల్ పేరుతో అధిక ఛార్జీలు బాదుతున్న విషయం రైల్వే మంత్రి మర్చిపోయారా అంటూ నిలదీస్తున్నారు. వేగం పెంచారనే నెపంతో ఆఖరికి ఆర్డినరీ ప్యాసింజర్ రైళ్లకు కూడా ఎక్స్ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తూ ఇప్పుడు నష్టాల పాట పాడటమేంటని రైల్వే ఉద్యోగులు అంటున్నారు. చదవండి : స్థిరాస్తి కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.. -
ఒకరి భార్యకు ‘ఐ లవ్ యూ’ అని రాసి చిట్టి విసరడం నేరమే
ముంబై: పెళ్లయిన మహిళకు ప్రేమలేఖ ఇవ్వడం కూడా తప్పేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ప్రేమపేరుతో ఆమెకు లేఖ పంపడమంటే ఆమెను అవమానించినట్లే అని న్యాయస్థానం పేర్కొంది. ఈ విధంగా చేయడం ఆమె పాతివ్రత్యాన్ని శంకించడం కిందకు వస్తుందని ధర్మాసనం తెలిపింది. పదేళ్ల కేసుపై బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆసక్తికరంగా ఉన్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి... 2011లో ఓ కిరాణ దుకాణ యజమాని ఒక్కడ పనిచేసే వివాహితకు ప్రేమలేఖ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో ఓ చిట్టిపై ‘ఐ లవ్ యూ’ అని రాసి పడేసి వెళ్లాడు. అంతటితో ఆగకుండా రోజు వింత ప్రవర్తనతో ఆమెకు విసుగు తెప్పించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆమె అకోలాలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో 2018 జూన్ 21వ తేదీన సెషన్స్ కోర్టు ఆ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.40 వేల జరిమానా విధించింది. అయితే ఈ తీర్పును అతడు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తోందని న్యాయస్థానానికి తెలిపాడు. తన దుకాణంలో సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా ఇలా ఆరోపణలు చేసిందని వాపోయాడు. అయితే అతడి వాదనను న్యాయస్థానం నమ్మశక్యంగా లేదని గ్రహించింది. పైగా బాధితురాలి వైపు బలంగా సాక్ష్యాలు ఉండడంతో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును కొనసాగించింది. నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ.90 వేల జరిమానా విధించింది. -
చిన్న గొడవ.. ప్రాణం తీసి.. రూంలో ప్రశాంతంగా పడుకున్నాడు
ముంబై: ఇద్దరి వ్యక్తుల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారి క్షణికావేశంలో ఓ వ్యక్తి ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్ (35), దేవాన్ష్ వఘోడే (26) మేకానిక్లుగా గతకొంత కాలం నుంచి పనిచేస్తున్నారు. వీరిద్దరు ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే గత శనివారం రాత్రి ఎదో విషయమై వీరి మధ్య చిన్న పాటి వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా పెద్దదిగా మారడంతో దేవాన్ష్ చేతికి దొరికిన ఓ పదునైన వస్తువుతో రాజును బలంగా కొట్టాడు. దీంతో రాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాసేపు అనంతరం అతడు చనిపోయినట్లు తెలుసుకున్న దేవాన్ష్ ఆ మృతదేహాన్ని మాయం చేయడానికి ప్లాన్ వేశాడు. తాను అనుకున్న ప్రకారం ఓ బహిరంగా ప్రదేశంలో ఆ మృతదేహాన్ని పాతిపెట్టాడు. అనంతరం తిరిగి వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా గదినంతా శుభ్రం చేసి ఏమీ జరగనట్లు ప్రశాంతంగా పడుకున్నాడు. అయితే కొందరు స్థానికులు ఆ మృతదేహాన్ని గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు దేవాన్ష్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. -
మళ్లీ కట్టెల పొయ్యి దగ్గరికి..
ముంబై సెంట్రల్: కరోనా ప్రజల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయగా మరోవైపు పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నాయి. దీంతో అనేక కుటుంబాల ఆర్థిక స్థితి దయనీయంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఏడాది రూ.640గా ఉన్న 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఈ ఏడాది జూలైలో రూ. 886.50గా ఉంది. 2014లో సిలిండర్ ధర రూ.410 ఉండగా ఏడేళ్లలో అదే సిలిండర్ ధర రెట్టింపవడం గమనార్హం. సిలిండర్ ధరల్ని భరించలేక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు తిరిగి కట్టెలు, బొగ్గులతో మండే పొయ్యిల వైపు మళ్లుతున్నారు. మహిళలు జీవితాంతం కట్టెల పొయ్యిలతో, పొగతో గడిపి, కొంత కాలం నుంచి గ్యాస్ సిలిండర్లపై వంటలు చేస్తూ కాస్త ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుకోవడంతో జీవితాలు తలకిందులయ్యాయి. కరోనా వల్ల ఉపాధి పోగొట్టుకోవడం వల్ల సిలిండర్లు వాడే స్థోమత లేకుండా పోయింది. అందుకే మళ్లీ మేం కట్టెలు, బొగ్గులతో వంటిల్లును నడిపిస్తున్నామని ఓ మహిళా సంఘం సభ్యురాలు రుక్మిణి నాగ్పురే వాపోయారు. ఎట్లా బతికేది..? కరోనా వల్ల మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి జీవితాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఒకవైపు లాక్డౌన్ వల్ల ఆర్థిక ఆదాయం తగ్గడం, మరోవైపు ధరలు పెరగడం, అత్యవసరమైన గ్యాస్ ధరలు కూడా పెంచడం వల్ల పలు కుటుంబాలు తిరోగమ న బాట పట్టి మట్టి పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రభుత్వం కనీసం గ్యాస్ సిలిండర్ ధరలపై కూడా దయ చూపకపోవడం వల్ల జీవితాలు నిత్యం కాలుతున్న కుంపటిలా తయారయ్యాయని హాత్కణంగ్లే తాలూకా హెర్లే గ్రామానికి చెందిన ఊర్మిళా కుర్ణే ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదిన్నర నుంచి కుటుంబ పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని చేసేందుకు పనే లేకుంటే డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయని కరాడ్కు చెందిన ప్రతిజ్ఞా పవార్ అన్నారు. కరోనా వల్ల ఉన్న ఉద్యోగాలు పోయాయ ని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నచిన్న పనులు చేసుకొని బతుకుదామంటే వంట నూనె, పప్పులు, గ్యాస్ ధరలన్నీ బాగా పెరిగిపోవడంతో జీవితాలు ఘోరంగా తయారయ్యాయని, ఎట్లా బతికేదని బోరుమన్నారు. ఇంత కాలం గ్యాస్పై వండుకున్నామని, ఇప్పుడు మళ్లీ కట్టెల పొయ్యే శరణ్యమైందని ప్రతిజ్ఞా పవార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. బుల్డాణాకు చెందిన మహిళా మండలి ప్రతినిధి ఉషా నర్వాడే మాట్లాడుతూ.. ‘‘ఇంతకాలం మహిళల ఆరోగ్యం బాగుండాలని గ్యాస్ సిలిండర్లు వాడాలని మేం చెబుతూ వచ్చాం. కానీ, ఇప్పుడు చేసేందుకు పను లు లేవు. ఇంటికి చిల్లిగవ్వ రావడం లేదు. గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పరిస్థితులు తారుమారయ్యాయి. ఆర్థికంగా చితికిపోవడం వల్ల కట్టెల పొయ్యిలే ఇప్పుడు దిక్కయ్యాయి. మళ్లీ కష్టాల రోజులు వచ్చాయి’’ అంటూ బాధపడ్డారు. -
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్, హైదరాబాద్లో అమ్మకాలు ఎప్పుడంటే ?
హైదరాబాద్ : హైదరాబాద్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రవేశ పెట్టేందుకు బజాజ్ ఆటో లిమిటెడ్ సిద్ధమైంది. ఇప్పటికే నాగ్పూర్లో చేతక్ ఈవీ షోరూమ్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నాగ్పూర్ తర్వాత చెన్నై, హైదరాబాద్లలో తమ స్కూటర్ తెచ్చేలా బజాజ్ ప్లాన్ చేస్తోంది. రెండు వేరియంట్లు ప్రస్తుతం బజాజ్ చేతక్ అర్బన్, ప్రీమియం వేరియంట్లలో లభిస్తోంది. షోరూమ్ ప్రకారం అర్బన్ ధర రూ. 1.42,620 ఉండగా ప్రీమియం ధర రూ. 1,44,620గా ఉంది. ఇందులో 2 కిలోవీట్ బ్యాటరీలు అమర్చారు.బ్యాటరీలకు 3 ఏళ్లు లేదా 50,000 కి,మీ వారంటీ అందిస్తున్నారు.ఒకసారి ఛార్జింగ్ చేస్తే మోడ్ను బట్టి 85 నుంచి 95 కి.మీ వరకు ప్రయాణం చేయవచ్చు. సోల్డ్ అవుట్ బజాజ్ ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో మంచి స్పందన వస్తోంది. మార్కెట్లోకి రాకముందే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లోనే బైకులన్నీ అమ్ముడై పోతున్నాయి. తాజాగా నాగ్పూర్కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది. 90వ దశకంలో 90వ దశకంలో స్కూటర్ విభాగంలో చేతక్ ఒక ప్రభంజనం సృష్టించింది. ఆ తర్వాత బైకుల అమ్మకాలు పెరగగా చేతక్ స్కూటర్ అమ్మకాలు పడిపోయాయి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు క్రమంగా ఊపందుకోవడంతో చేతక్ ఈవీని మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది బజాజ్. 2021 మార్చిలో ఒకేసారి 30 నగరాల్లో చేతక్ అమ్మకాలు ప్రారంభించాలని నిర్ణయించినా... తర్వాత ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. క్రమంగా ఒక్కో సిటీలో బజాజ్ షోరూమ్స్ ప్రారంభిస్తూ పోతుంది. ఇక్కడే ప్రస్తుతం పూనే, బెంగళూరు, మైసూరు, మంగళూరు, ఔరంగాబాద్ నగరాల్లో చేతక్ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్మకాలు సాగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో నాగ్పూర్ చేరనుంది. మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్లో కూడా పరుగులు పెట్టనుంది చేతక్. -
మరదలిపై కన్ను.. కాదనడంతో మొత్తం కుటుంబమే ఖతం
నాగ్పూర్: మహరాష్ట్రలోని నాగ్పూర్లో ఓ వ్యక్తి మరదలిపై కన్నేసి తీవ్ర దారుణానికి ఒడి కట్టాడు. నాగ్పూర్కు చెందిన 36 ఏళ్ల అలోక్ మాతుర్కర్ ఆదివారం రాత్రి తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త, మరదలి చంపి తానూ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగ్పూర్లోని గోలాబార్ చౌక్ సమీపంలో జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. అలోక్ గత కొన్ని రోజులుగా తన భార్య చెల్లెలిపై కన్నేశాడు. అంతేకాకుండా గతంలో ఆమెపై పలుమార్లు లైగింక దాడి చేశాడు. అలోక్ తన భార్య చెల్లెలు తనకే సొంతమని చెప్పి కుటుంబసభ్యులను తీవ్ర చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ విషయంపై కుటుంబంలో వివాదం చెలరేగడంతో ఆగ్రహానికి గురైన అలోక్ ఆదివారం రోజున తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త, మరదలిని పొడిచి చంపి ఉరి వేసుకున్నాడు. ఇంటి చుట్టు పక్క వాళ్లు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. కాపలాదారుడిగా పనిచేసే నిందితుడి మామ విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి కుటుంబసభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. అలోక్ మాతుర్కర్కు విజయతో వివాహం జరిగింది. వీరికి ఇరువురు సంతానం. పారి, సాహిల్. టైలరింగ్ పని చేసే తన భార్య చెల్లెలు అమీషాకు అలోక్ సహాయం చేసేవాడు. అయితే, ఆమె ఇతర వ్యక్తులతో స్నేహంగా ఉంటే అలోక్.. అమీషాను వేధించేవాడని తెలిసింది.స్నేహితుడితో ఫోన్లో మాట్లాడినందుకు అలోక్ తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ అమీషా దగ్గరలో ఉన్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. అతడికి బుద్ది చెప్పి విడుదల చేశారు. దీంతో అలోక్ తన కుటుంబసభ్యులను చంపడానికి ప్రణాళిక వేశాడు. అందుకోసం ముందుగానే ఆన్లైన్లో కత్తులను ఆర్డర్ చేశాడు. ఆదివారం రాత్రి తన భార్య విజయతో, అమీషాతో గొడవ పడ్డాడు. గొడవ పెద్దదిగా మారటంతో విచక్షణ కోల్పోయిన అలోక్ ముందుగా సిద్ధం చేసుకున్న కత్తులతో తన భార్యను, మరదలిని, అత్తను తీవ్రంగా పొడిచి హత్య చేశాడు. తన పిల్లలను బండతో మోది హతమార్చాడు. చివరగా అలోక్ కూడా ఉరి వేసుకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో పేర్కొన్నారు. చదవండి: ప్రేమ పెళ్లి.. మాట్లాడుకుందామని పిలిచి ఒక్కసారిగా.. -
ఆన్లైన్లో చూసి బాంబు తయారు చేశాడు.. అనంతరం
ముంబై: ఈ మధ్యన యూట్యూబ్లో చూసి రకరకాల ప్రయోగాలు చేయడం అలవాటుగా మారిపోయింది. ఒక్కోసారి కొంతమంది శృతిమించిపోతుంటారు. తాజాగా నాగ్పూర్కు చెందిన రాహుల్ పగాడే (25) ఆన్లైన్లో పేలుడు పదార్థాలు ఎలా తయారు చేస్తారో చూసి ఒక బాంబ్ తయారు చేశాడు. అనంతరం ఆ బాంబ్తో ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కలకలం సృష్టించాడు. అయితే తొలుత బాంబ్ తనకు నాగ్పూర్లోని ఓ కాలేజీ వద్ద దొరికిందని బుకాయించాడు. అయితే పోలీసులకు అతని మాటలు నమ్మశక్యం కాకపోవడంతో విచారణ చేశారు. అనంతరం బాంబ్ తానే తయారు చేశానని ఒప్పుకున్నాడు. ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘‘కొన్ని ట్యుటోరియల్స్ చూసి బాంబ్ తయారు చేశాడు. అయితే అది తయారు చేసిన అనంతరం దాన్ని ఏం చేయాలో తెలియక భయపడ్డాడు. వెంటనే బాంబ్ వైర్లను కట్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చాడు. బాంబ్ తానే తయారు చేశానని చెప్పడానికి భయపడి కాలేజీ వద్ద దొరికిందని అబద్దం చెప్పాడు. విచారణ చేస్తే ఒప్పుకున్నాడు. అతడిపై మహారాష్ట్ర పోలీస్ చట్టం సెక్షన్ 123 కింద కేసు నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు. చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు -
వెంటిలేటర్ నుంచి.. కూతురి కౌగిలికి చేరిన స్వప్న
కరోనాతో చనిపోయిన కథనాలు, చనిపోయినవాళ్లను అంత్యక్రియలు చేసే వార్తలు జనాలకు భయాన్ని పుట్టిస్తున్నాయి. కానీ, ధైర్యంగా పోరాడి చావును జయించిన స్వప్న తరహా కథనాలు అందరికీ తెలియాలని ఆమె భర్త అశిష్ కోరుకుంటున్నాడు. ముంబై: నెలన్నరపాటు ఆస్పత్రిలో బెడ్పై.. పూర్తిగా చెడిపోయిన ఊపిరితిత్తులు.. ఇరవై ఐదు రోజులపాటు వెంటిలేటర్ పై.. అది కూడా 100 శాతం కెపాసిటీతో ట్రీట్మెంట్ తీసుకుంది నాగ్పూర్ కు చెందిన 35 ఏళ్ల స్వప్న. ఆమె బతకడం కష్టమని డాక్టర్లు తేల్చడంతో ఆశలు వదులుకున్నారు అంతా. కానీ, ఆమె మాత్రం పోరాడింది. కరోనాను ఓడించి నవ్వుతూ కూతురి కౌగిలికి చేరుకుంది. నాగ్పూర్కు చెందిన గృహిణి స్వప్న ఏప్రిల్ 19న కరోనాతో క్రిమ్స్ హాస్పిటల్లో చేరింది. ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమంగా తయారైంది. ఇరవై ఐదు రోజులపాటు వెంటిలేటర్పై ట్రీట్మెంట్ తీసుకుంది. బతకడం ఇక కష్టమనుకున్న టైంలో అనుహ్యాంగా ఆమె కోలుకుంది. ‘ ఐదేళ్ల నా కూతురు లోరినానే నా ప్రేరణ. ఆమే నాకు బలానిచ్చింది. చావును జయించాలని పదే పదే గుర్తు చేస్తూ ఆమె నాకు ధైర్యాన్ని పంచింది’ అని చెప్తోంది స్వప్న రసిక్. కచ్చితంగా ఇదొక అరుదైన కేసు. అన్ని రోజులు వెంటిలేటర్పై ఉండి బతకడం నిజంగా అద్భుతం. కూతురి మీద ప్రేమే ఆమెను బతికించింది అని స్వప్నకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ పరిమల్ దేశ్పాండే చెప్తున్నారు. -
Period Time: ఐదు రోజుల నరకం.. వరిగడ్డిని చుట్టచుట్టి!
మహారాష్ట్రలోని ఆ ప్రాంత స్త్రీలు నెలకు ఐదు రోజులు నరకం చూస్తారు. ఎందుకంటే బహిష్టు సమయంలో ఊరికి దూరంగా ఉండే బహిష్టు గదుల్లో గడపాలి కాబట్టి. ఈ మూఢాచారాన్ని రూపుమాపడం అక్కడ కష్టంగా మారింది. కనీసం కరెంటు, టాయిలెట్, తలుపులు లేని ఆ దారుణమైన బహిష్టు గదుల నుంచి వారిని బయటపడేయడానికి అక్కడ కొత్త బహిష్టు గదుల నిర్మాణం జరుగుతోంది. దీని వల్ల మార్పు మెల్లగా వస్తుందని భావిస్తున్నారు. 21 ఏళ్ల శీతల్ నరోటేకి నిద్ర పట్టడం లేదు. చీకటి గది అది. ఎత్తు తక్కువ ఉంది. గడప లేదు. దోమలు. చలి. దానికి తోడు మరో ఇద్దరు పెద్దగా పరిచయం లేని స్త్రీలు. ఆమె ఆ చీకటి గదిలో మరో నాలుగు రాత్రులు గడపాలి... క్షేమంగా ఈ రాత్రి తెల్లారితే. ఎందుకంటే శీతల్ బహిష్టులో ఉంది. ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు మహిళ లు కూడా బహిష్టులో ఉన్నారు. ఆ ఊళ్లో బహిష్టు అయిన ఆడవాళ్లు ఇళ్లల్లో ఉండటానికి వీలు లేదు. అలా ఉంటే దేవతల ఆగ్రహానికి గురవుతారని ఊరి నమ్మకం. అందుకే ఇలాంటి ‘బహిష్టు గదు’ల్లో ఉంటారు. ఆ గదుల్లో ఎటువంటి సౌకర్యాలు ఉండవు. అసలు వాటిని గది అనడానికి కూడా లేదు. అయినప్పటికీ అక్కడే ఉండాలి. శీతల్ ఇల్లు ఆ గది నుంచి 100 మీటర్ల దూరం ఉంటుంది. రాత్రి వెళ్లి ఆ ఇంటి వరండాలో పడుకుందామన్నా ఒప్పుకోరు. శీతల్ పడుతున్న బాధ ఆ ప్రాంతంలో ప్రతి స్త్రీ తరాలుగా పడుతోంది. మహరాష్ట్ర గడ్చిరౌలీలో... నాగ్పూర్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గడ్చిరౌలీ గిరిజన ప్రాంతం. ఇక్కడ గోండులు, మడియాలు ఎక్కువగా జీవిస్తుంటారు. గ్రామాల్లోని స్త్రీలు బహిష్టు అయితే వారు అపవిత్రం అవుతారని తరాలుగా వీరు నమ్ముతారు. వీరు ఇళ్లల్లో ఉండకూడదు. ఊళ్లోని ‘బహిష్టు గదు’ల్లో ఉండాలి. వీరు వంట చేయడానికి, నీళ్లు చేదడానికి కూడా అర్హులు కారు. కుటుంబీకులలోని స్త్రీలు ఎవరైనా వీరికి ఆహారం, నీరు ఇవ్వాలి. బహిష్టులో ఉన్న స్త్రీలను మగవారు పొరపాటున తాకితే వెంటనే వారు తలస్నానం చేయాలి. ఈ గిరిజనులలో ఈ ఆచారం చాలా తీవ్రంగా నాటుకు పోయి ఉంది. ‘దీనిని మానేస్తే దేవతలు మా ఊరి మీద ఇళ్ల మీద ఆగ్రహిస్తారని మాకు భయం’ అని వారు అంటారు. మగవారు, గిరిజన పెద్దలు దీనికి పొరపాటున అంగీకరించరు. ఫలితం... స్త్రీలకు కలిగే తీవ్రమైన అసౌకర్యం. శిథిల గుడిసెల్లో గ్రామాల్లో శిథిల గుడిసెలను బహిష్టు గదులుగా గ్రామపెద్దలు కేటాయిస్తారు. వీటికి తలుపులు ఉండవు. కరెంటు ఉండదు. నీటి సౌకర్యం ఉండదు. బహిష్టు అయిన స్త్రీ ఇందులో ఉండాల్సిందే. ఎండ, వాన, చలి నుంచి ఏ రక్షణా ఉండదు లోపల. ‘దీనికి తోడు ఈ స్త్రీలు గుడ్డను కాని, శానిటరీ నాప్కిన్ని కూడా వాడరు (వాటి అందుబాటు ఉండదు). వరిగడ్డిని చుట్టచుట్టి పెట్టుకుంటారు. దానివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి’ అని అక్కడ పని చేసే కార్యకర్తలు అంటారు. రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఒక మహిళ దోమల నుంచి కాపాడుకోవడానికి బహిష్టు గదిలో ఒక మూల మంట వేసింది. ఆ పొగకు ఊపిరాడక మరణించింది. పాములు కాటేసిన ఘటనలు... అక్కడ ఉండటం వల్ల అనారోగ్యం వచ్చిన ఘటనలు మరింత ఎక్కువయ్యాయి. ఈ అనాచారం నుంచి వీరిని బయటపడేసే బదులు ముందు ఈ ఆచారాన్ని గౌరవించి ఈ స్త్రీలకు సాయం చేద్దాం అని ముంబైకి చెందిన ‘ఖేర్వాడీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్’ భావించింది. ఈ గిరిజన గ్రామాల్లో సౌకర్యవంతమైన బహిష్టు గదులను నిర్మించాలని తలపెట్టింది. ఈ గదులు ఆ ప్రాంత స్త్రీల కళ్లలో ఆనందబాష్పాలు తెస్తున్నాయి. సేఫ్ రెస్టింగ్ హోమ్ లేదా పిరియడ్ హోమ్ బహిష్టు గదులను ఈ ప్రాంతంలో ‘కుర్మా’ అంటారు. ఈ కుర్మాలను మెరుగైన వసతుల ‘సేఫ్ రెస్టింగ్ హోమ్’, లేదా ‘పిరియడ్ హోమ్’ పేరుతో ఖేర్వాడి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్మించ తలపెట్టింది. గాలి వెలుతురు ఉండే విధంగా హోమ్ను నిర్మించి, విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి, నీటి వసతి, అటాచ్డ్ బాత్రూమ్లు కల్పించి, మంచాలు ఏర్పాటు చేసి స్త్రీలకు ఆ ఐదు రోజులు ఇబ్బంది లేకుండా గడిచే ఏర్పాటు చేస్తోంది. ‘మాకు ఈ హోమ్లలో నచ్చిన విషయం తలుపు ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఉండటం’ అని స్త్రీలు సంతోషపడుతున్నారు. టీనేజ్ అమ్మాయిలకు కష్టం ‘12 లేదా 13 సంవత్సరాలకు పెద్దవారైన ఆడపిల్లలు కూడా హటాత్తుగా ఇంటిని విడిచి ఐదురోజుల పాటు బహిష్టు గదుల్లో ఉండాలి. భయానకంగా ఉండే ఊరి పాత బహిష్టు గదుల్లో ఉండి వారు తీవ్రమైన వొత్తిడికి లోనవుతున్నారు. అసలు బహిష్టు సమయంలో స్త్రీలకు భౌతికంగా మానసికంగా చాలా ఓదార్పు కావాలి. అది వారికి ఇంటి నుంచే లభిస్తుంది. బహిష్టు అయినందుకు నింద భరించడం ఒకమాటైతే ఇలా ఇంటికి దూరం కావడం మరోమాట. దూరమైన ఆ ఐదు రోజులు వారికి సౌకర్యవంతమైన గది ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత’ అంటారు అక్కడ పని చేస్తున్న సామాజిక కార్యకర్తలు. మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశంలోనే కాదు దక్షిణ భారతదేశంలో కూడా ఇంకా కొన్ని ప్రాంతాలలో కొన్ని వర్గాలలో బహిష్టుకు సంబంధించిన కట్టుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ స్త్రీలను అగౌరవపరిచేవే. వీటన్నింటిని సమాజం తక్షణం వదిలించుకోవాలి. – సాక్షి ఫ్యామిలీ చదవండి: Shradha Sharma: మీ కథే.. ఆమె కథ.. -
కడుపులో కత్తితోనే పోలీస్స్టేషన్కు పరుగు
నాగపూర్: తనపై కత్తితో దాడి చేసిన వారి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి తీవ్రంగా ప్రయత్నించాడు. కడుపులో కత్తి దిగి తీవ్రంగా రక్తం కారుతున్నప్పటికీ అలాగే పోలీస్ స్టేషన్ వైపు వేగంగా పరిగెత్తాడు. సినిమా సీన్ను తలపించే ఈ ఘటనలో ఆ వ్యక్తి చివరికి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. నాగ్పూర్ పోలీస్ స్టేషన్కు అర కిలో మీటర్ దూరంలో ఉన్న బహిరంగ మైదానంలో ఆదివారం రాత్రి పాత కక్ష్యల నేపథ్యంలో ఓ 20 ఏళ్ల వ్యక్తిని కొందరు కడుపులో కత్తితో పొడిచారు. దాంతో బాధితుడు కడుపులో ఉన్న కత్తితోనే పోలీస్ స్టేషన్ వైపు పరుగుపెట్టాడు. కొంతదూరం పరుగెత్తిన తర్వాత స్నేహితుడు లిఫ్ట్ ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. బాధితుడిని పోలీసులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నారు. దాడి ఘటనకు సంబంధించి తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: అధికారి భార్య ఆత్మహత్య -
నితిన్ గడ్కరీని కలిసిన సంజయ్ దత్
నాగ్పూర్: కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య కాంచన్ గడ్కరీని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆదివారం నాగపూర్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. సంజయ్ దత్ ఏ కారణంగా గడ్కరీతో భేటీ అయ్యారన్నది తెలియదు. ఇరువరి మధ్య ఏ విషయంపై చర్చలు జరిగాయన్నది తెలియరాలేదు. ఈ సందర్భంగా సంజయ్తో సమావేశాన్ని నితిన్ గడ్కరీ తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. కాగా సంజయ్ దత్ గతేడాది క్యాన్సర్ గురయ్యారు. లండన్కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్న సంజయ్ దత్ క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు అక్టోబరులో ప్రకటించారు.ఇక సంజయ్ దత్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదలకు సిద్ధమౌతుంది. ఈ చిత్రంలో సంజయ్ నెగటివ్ రోల్లో కనిపించనున్నాడు. బ్లాక్ బస్టర్ ''కేజీఎఫ్ చాప్టర్ 1'' కు సీక్వెల్గా ఈ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే విధంగా “పృథ్వీరాజ్”, “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” లలో కూడా సంజయ్ కనిపించనున్నాడు. -
కరోనా పేషెంట్లకు రూ.10 లక్షలు చెల్లించండి
ముంబై: కరోనా వైరస్ పేరు చెప్పి కార్పొరేట్ ఆస్పత్రులు కాసులు సంపాదించుకుంటున్నాయి.దీంతో ఆయా రాష్ట్రప్రభుత్వాలు కరోనావైద్యం పేరుతో డబ్బులు దండుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కొరడాను ఝులిపిస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న 92 మంది బాధితులకు రూ.10 లక్షలు తిరిగి చెల్లించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహరాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం బాధితులకు కరోనా టెస్ట్ లు చేసి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో నాగ్పూర్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి) అధికారులు ట్రీట్మెంట్ చేసినందుకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని అన్నీ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించలేదు. ఆస్పత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్ఎంసి అదనపు కమిషనర్ జలాజ్ శర్మ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ అధారంగా రేడియన్స్ ఆస్పత్రి యాజమాన్యం అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. దీంతో మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లో రేడియన్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకున్న కరోనా బాధితులు, లేదంటే వారి బంధువులకు రూ .10,32,243 తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు శర్మ ఈ సందర్భంగా తెలిపారు. బాధితులకు డబ్బు చెల్లించే విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఉపేక్షించేది లేదని అన్నారు. అంటువ్యాధి మరియు విపత్తు నిర్వహణ చట్టం కింద ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జలాజ్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నువ్వు గ్రేట్ గురు! వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ
ముంబై: కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభణ కారణంగా దేశంలో ఇప్పటికే అధిక రాష్ట్రాలు లాక్డౌన్ను అమలుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కరోనా వల్ల ఆరోగ్యపరంగానే కాదు ఆర్థికంగాను తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కొంత మంది ఇతరులకు సహాయం చేస్తూ మానవత్వానికి మరో పేరులా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సుమారు 200 వీధి కుక్కల ఆకలి తీరుస్తున్నాడు. అది కూడా చికెన్ బిర్యానీతో వాటి కడుపు నింపడం విశేషం. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన రంజిత్ నాథ్ రోజూ దాదాపు 40 కిలోల బిర్యానీ వండుకుని నగరంలోని పలు ప్రాంతాల్లోని కుక్కలకు ఆహారాన్ని అందిస్తున్నాడు. లాక్డౌన్ మొదలయిన తర్వాత జంతువులకు ఆహారం దొరకడం కష్టమైంది. వాటిని చూసి ఎంతో చలించిపోయారు రంజిత్. అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాడు. నాగ్పూర్లో వీధి కుక్కలు, పిల్లులకు ప్రతి రోజు అన్నం పెట్టేందుకు ముందుకొచ్చారు. అలా అప్పటి నుంచి ప్రతి రోజు దాదాపు 200 వరకు వీధి కుక్కలకు చికెన్ బిర్యానీ పెడుతూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు. బుధవారం ఓ పత్రిక సంస్థతో రంజిత్ మాట్లాడుతూ.. ‘నేను ఈ కుక్కల కోసం ప్రతీ రోజు 30-40 కిలోల చికెన్ బిర్యానీని సిద్ధం చేసుకుంటాను. వీధి జంతువులను నా పిల్లల్లాగే భావిస్తాను. నేను జీవించి ఉన్నంత వరకు ఈ పని చేస్తుంటాను. పైగా ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపాడు. నా పని మధ్యాహ్నం వంటతో మొదలై.. ఇలా ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకు బైక్ మీద నగరం చుట్టూ తిరిగి పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు భోజనం పెట్టి వాటి ఆకలిని తీర్చడంతో నా పని పూర్తి అవుతుంద’ని అన్నాడు. చదవండి: మహిళను కాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ Ranjeet Nath from Nagpur feeds more than 150 strays 🐶 “They’re like my kids now & I will do this till I am alive. It makes me happy” He’s a true inspiration 🙇 If anyone has his contact details, do share. Would like to contribute a bit from my end 🙏 📸: IG/abhinavjeswani pic.twitter.com/DDm2sTDXf7 — Nigel D'Souza (@Nigel__DSouza) May 20, 2021 -
మహిళ డాక్టర్పై ఐటీ కమిషనర్ లైంగిక దాడి.. బెదిరింపులు
ముంబై : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా డాక్టర్పై ఐటీ కమిషనర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి మహిళ గర్భం దాల్చి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె అశ్లీల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరికి చెందిన 33 ఏళ్ల మహిళ నాగ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. నేషనల్ అకాడమీ ఆఫ్ డెరెక్ట్ ట్యాక్సెస్లో శిక్షణ కోసం 2019లో నాగ్పూర్ వెళ్లాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పనిచేసే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. తాను యూపీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పడంతో వైద్యురాలికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఈ స్నేహం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని భరోసా ఇచ్చి మహిళతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడి.. మహిళ అశ్లీల ఫోటోలను తీసుకొని భద్రంగా దాచుకున్నాడు. ఇటీవల ఆ మహిళ గర్భవతి అవ్వడంతో నిందితుడు ఆమెకు అబార్షన్ చేయించాడు. బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమె అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని నిందితుడు బెదిరించాడు. తనను మోసం చేశాడని సదరు మహిళ నాగ్పూర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్ 376 (2) కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు బెంగళూర్లో విధులు నిర్వహిస్తున్నాడని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీస్ అధికారి తెలిపారు. విచారణ కొనసాగుతుందన్నారు. -
Air Ambulance: టైర్ ఊడినా విమానం క్షేమంగా దిగింది!
ముంబై: అది గుర్గావ్లోని జెట్ సర్వ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఎయిర్ అంబులెన్స్. గురువారం సాయంత్రం మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ముంబైకి బయలుదేరింది. అందులో ఒక రోగి, అతడి బంధువు, ఒక వైద్యుడు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మొత్తం ఐదుగురు. విమానం నాగపూర్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక టైర్ ఊడిపోయింది. ఈ విషయాన్ని సిబ్బంది గుర్తించారు. ముంబై ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం చేరవేశారు. విమానాన్ని రన్వేపై క్షేమంగా ఎలా దించాలన్నదే సమస్య. నేరుగా దిగితే మంటలు వ్యాపించడం ఖాయం. అందులోని ఐదుగురు ప్రాణాలతో మిగులుతారన్న గ్యారంటీ లేదు. చురుగ్గా ఆలోచించారు. విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. రన్వేపై నురగతో కూడిన నీళ్లు చల్లారు. టైర్లు పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి విమానం కడుపు భాగం రన్వేపై సురక్షితంగా దిగింది. అందులోని ఐదుగురు నిక్షేపంగా బయటికొచ్చారు. ఇంకేముంది కథ సుఖాంతమయ్యింది. ఇతర విమానాలు యథావిధిగా రాకపోకలు సాగించాయి. ముంబై ఎయిర్పోర్టులో ఈ విమానం దిగిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: 'థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం' -
మినీ బస్సులను అంబులెన్స్లుగా..
-
సలాం సోనూ సూద్...మీరో గొప్ప వరం!
సాక్షి, ముంబై: ప్రముఖ నటుడు సోనూసూద్ సేవా నిరతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా సంక్షోభం ఆరంభమైంది మొదలు.. తనకు కరోనా సోకిన సమయంలో సేవా కార్యక్రమాలనుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు నెగిటివ్ వచ్చిందని ట్విటర్లో షేర్ చేసిన సోనూ.. తాజాగా మరో ఘటనతో వార్తల్లో సంచలన వ్యక్తిగా నిలిచాడు. కరోనా బారినపడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ(25)ను చికిత్స కోసం నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు ఏకంగా ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించి తన మానవత్వానికి ఎల్లలు లేవని చాటుకున్నారు. దీంతో కనిపించే దైవం అంటూ అభిమానులు సోనూసూద్ను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నారు. (శుభవార్త చెప్పిన సోనూసూద్) వివరాల్లోకి వెళ్లితే రిటైర్డ్ రైల్వే అధికారి కుమార్తె భారతి కోవిడ్-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైనారు. ఆమె ఊపిరితిత్తులు దాదాపు 85 నుండి 90శాతం పాడైపోయాయి. మొదట ఆమెను నాగ్పూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేశాడు సోనూ సూద్. అయితే ఆమెకు ఊపిరితిత్తుల మార్పడి అవసరమని వైద్యులు ప్రకటించారు. అయినా 20 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయని కూడా వైద్యులు చెప్పారు. పైగా ఆ అవకాశం ఒక్క అపోలోలో మాత్రమే ఉంది. అయినా సోనూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. క్షణం ఆలస్యం చేయకుండా చివరివరకు ప్రయత్నిద్దాం అంటూ అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్లతో సంప్రదించి, ప్రత్యేకమైన ఎక్మో సపోర్టు ద్వారా హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించేందుకు సాయపడ్డారు. అంతేకాదు శరీరానికి కృత్రిమంగా రక్తం పంప్ చేసే ఎక్మో చికిత్సలో నిపుణులైన వైద్యబృందాన్ని రప్పించి మరీ ఎయిర్ అంబులెన్స్లో ఆమెను హైదరాబాద్కు తరలించారు. సోనూ ప్రత్యేకత అదే కదా. ప్రస్తుతం భారతి చికిత్స పొందుతున్నారు. కరోనా పోరులో ఆమె నిలిచి గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న అభిమానులు, ఇతర నెటిజనులు రియల్ హీరోను ప్రశంసిస్తున్నారు. గ్రేట్ సోనూజీ.. అంచనాలకు అందని మీ మానవత్వం, ఔదార్యం.. మీ మాతృమూర్తి భారతీయులకు అందించిన గొప్పవరం మీరు అంటూ కమెంట్ చేస్తున్నారు. -
సీఎం వైఎస్ జగన్కు గడ్కరీ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: అడిగిన వెంటనే నాగపూర్కు వారం రోజుల్లో 300 వెంటిలేటర్లు సరఫరా చేసినందుకుగాను సీఎం వైఎస్ జగన్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి నితిన్ గడ్కరీ ఫోన్ చేసి సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: (నేడు అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ నగదు) -
ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడం హక్కుల ఉల్లంఘనే!
హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగ్పూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. కేసు విచారణలో ఉండగానే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంలాల్ ఆనంద్ కాలేజీ.. సాయిబాబా సర్వీసులను టెర్మినేట్ చేయడం సరికాదన్నారు. గతంలో కోర్టు కేసుల్లో నిర్దోషులుగా బయటపడి తమ ఉద్యోగాల్లో యథావిధిగా చేరిన ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు. సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని స్పష్టంచేశారు. ఆయన అంగ వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో జైలు నుంచి విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రికి గతంలోనే లేఖ రాశానని తెలిపారు. -
జాబ్ నుంచి సాయిబాబా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నాగ్పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంలాల్ ఆనంద్ కళాశాల తొలగించింది. మార్చి 31 నుంచి సాయిబాబా సేవలను రద్దు చేస్తున్నట్లు, ప్రతిగా 3నెలల జీతాన్ని సాయిబాబా బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు సాయిబాబా భార్యకు ఇచ్చిన మెమొరాండంలో కాలేజీ ప్రిన్సిపల్ రాకేశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన సాయిబాబాను 2014లో పుప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో సహా చట్టవిరుద్ధమైన సీపీఐ(మావోయిస్ట్) అగ్ర నాయకులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం సాయిబాబాను వెంటనే సస్పెండ్ చేసింది. 2017 మార్చిలో వామపక్ష ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపా లు (నివారణ) చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేలా ప్రోత్సహించి నందుకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారందరికీ జీవిత ఖైదు విధించింది. సాయిబాబాను 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 120బీ(క్రిమినల్ కుట్ర)లోని 13, 18, 20, 38, 39 సెక్షన్ల ప్రకారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. గిలానీ సేవలను ఇలా రద్దుచేయలేదు అయితే సాయిబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి సాయిబాబా కుటుంబం సగం జీతాన్ని పొందుతోంది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సాయిబాబా భార్య ఖండించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్తానని సాయిబాబా భార్య వసంత తెలిపారు. సాయిబాబాకు వేసిన శిక్షకు వ్యతిరేకంగా తమ అప్పీల్ బొంబాయి హైకోర్టులో పెండింగ్లో ఉందని, ఈ సమయంలో తొలగిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా నిర్ధారించబడిన గిలాని, తరువాత అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా బయటికొచ్చారన్నారు. అప్పుడు అతని సేవలను ఈ విధంగా రద్దు చేయలేదని, ఇప్పుడు సాయిబాబా సేవలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. -
ఆస్పత్రి బాత్రూమ్లో కరోనా బాధితుడి ఆత్మహత్య
నాగ్పూర్: మహమ్మారి కరోనా వైరస్ రెండోసారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి ప్రజలను మళ్లీ భయాందోళనలకు నెట్టుతోంది. కరోనాతో మళ్లీ ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చాయి. తాజాగా కరోనా సోకిందని భయంతో ఓ వృద్ధుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రిలోని బాత్రూమ్లోకి వెళ్లి ఆక్సిజన్ పైప్తో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. చదవండి: ఇన్స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి 81 ఏళ్ల వృద్ధుడు. కరోనా పాజిటివ్ రావడంతో ఆయన మార్చి 26వ తేదీన నాగ్పూర్లోని బోధన ఆస్పత్రి (జీఎంసీహెచ్)లో చేర్చారు. అయితే అకస్మాత్తుగా మంగళవారం ఆయన బాత్రూమ్లోకి వెళ్లి ఆక్సిజన్ పైప్కు ఆత్మహత్య చేసుకున్నారు. శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది పైప్కు వేలాడుతున్న అతడిని చూసి షాక్కు గురయ్యారు. వెంటనే అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిశీలించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులు భయాందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తితో వృద్ధులను కుటుంబసభ్యులు ఆదరించడం లేదు. ఒకవేళ కరోనా సోకితే ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్తున్నారు. వారి ఆరోగ్యం కుదుటపడిన కూడా ఇళ్లకు తీసుకెళ్లని ఘటనలు మనం చూస్తునే ఉన్నాం. అలాంటి బాధతోనే ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది. కాగా ఇదే ఆస్పత్రిలో ఒకే బెడ్పై ఇద్దరు కరోనా బాధితులను పడుకోబెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని చెబుతున్నారు. చదవండి: కిటికీలోంచి వాంతులు.. తెగిపడిన తల చదవండి: కంకులు తినాల్సిన చిన్నారులు బొగ్గుల్లా -
ఆక్సిజన్ పైప్తో ఉరివేసుకుని..
సాక్షి,ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో 81 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య ఆందోళన రేపింది. బాత్రూం లోపల ఆక్సిజన్ పైపుతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ (ఇన్ఛార్జ్) డాక్టర్ కాంచన్ వాంఖడే తెలిపారు. సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుడిని పురుషోత్తం అప్పాజీ గజ్భీగా గుర్తించామని అజ్న పోలీసు అధికారి తెలిపారు. కరోనా బారిన పడటంతో మార్చి 26న పురుషోత్తం ఆసుపత్రిలో చేరారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా సెకండ్వేవ్లో దేశంలో పలు స్టేట్స్లో కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా మహారాష్ట 3 లక్షల 37 వేలకుపైగా కేసులు, 54 వేలకు పైగా మరణాలతో ఎక్కువ ప్రభావితమైన రాష్ట్రంగా నిలిచింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రులలో (360 ఐసీయులతో సహా) ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3000 పడకలకు అదనంగా మరో 2269 పడకలను తక్షణమే అందుబాటులోకి తీసుకు రానున్నామని బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తాజాగా ప్రకటించారు. మరోవైపు కరోనా జాగ్రత్తలు పాటించని పక్షంలో మళ్లీ లాక్డౌన్ విధించక తప్పదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
‘లేడీ సింగమ్’ ఆత్మహత్య..
-
‘లేడీ సింగమ్’ ఆత్మహత్య.. మహారాష్ట్రలో ప్రకంపనలు
ముంబై: అటవీ శాఖ అధికారిణి బలవన్మరణానికి పాల్పడడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఆమె ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం ఉన్నతాధికారి వేధింపులేనని తేలింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఆమె తన సూసైడ్ నోట్లో తాను బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలను వివరించింది. ఆ వ్యక్తెవరో కూడా పేర్కొనడంతో అతడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఘటన అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె అటవీ మాఫియాకు ముచ్చెమటలు పట్టించిన ఆమె ఆత్మహత్యకు పాల్పడడం కలచివేస్తోంది. మహారాష్ట్రలో యంగ్ అండ్ డైనమిక్గా అధికారిణిగా దీపాలి చవాన్ మొహితే (28) గుర్తింపు పొందింది. లేడీ సింగమ్గా పేరు పొందారు. అయితే ఆమె అమరావతి జిల్లాలోని టైగర్ రిజర్వ్ సమీపంలోని హరిసాల్ గ్రామంలో ఉన్న అధికారిక నివాసంలో గురువారం సాయంత్రం దీపాలి తన సర్వీస్ రివాలర్వ్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. అంతకుముందు ఆమె రాసిన లేఖ లభ్యమైంది. అందులో శివకుమార్ తనతో గడపాలని, అలా చేయకపోతే అదనపు డ్యూటీలు వేయడం.. వేధించడం చేసేవాడని వాపోయింది. దీంతోపాటు తాను గర్భిణిగా ఉన్న సమయంలో కొండల్లోకి లాక్కెళ్లాడని ఆరోపించింది. అతడి వలన తనకు గర్భస్రావం అయ్యిందని లేఖలో కన్నీటి పర్యంతమైంది. తనను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి తీవ్రంగా వేధించారని ఆరోపించింది. ఆయనే ఐఎఫ్ఎస్ అధికారి, అటవీ శాఖ డిప్యూటీ కన్జర్వేటర్ వినోద్ శివకుమార్ అని తెలిపింది. కొన్ని నెలలుగా ఆయన లైంగికంగా వేధించిన విషయాన్ని పూసగుచ్చినట్టు లేఖలో రాసింది. మానసికంగా కూడా చిత్రహింసలకు గురి చేశాడని వాపోయింది. అతడు తన అధికారాన్ని దుర్వినియోగంతో చేసిన కార్యాలను వివరించింది. ఆమె ఆత్మహత్య విషయం తెలుసుకున్న వినోద్ శివకుమార్ పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నాగ్పూర్ రైల్వే స్టేషన్లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: 10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి.. చదవండి: వివాహేతర సంబంధం: మంచం కింద దాక్కొని హత్య -
కరోనా ఎఫెక్ట్.. అక్కడ మళ్లీ మొదలైన లాక్డౌన్
ఔరంగబాద్: కరోనా కేసుల సంఖ్య ఆకస్మికంగా పెరగడంతో మహరాష్ట్ర ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్డౌన్ విధించింది. కేసుల పెరుగుదల ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. గత ఏడాది మాదిరిగా పలు జిల్లాల్లో కఠినమైన లాక్డౌన్ చర్యలను తిరిగి విధించవలసి వచ్చింది. దీంతో జిల్లాలోని ప్రాంతాల్లో నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వారాంతాల్లో కూడా పూర్తి లాక్డౌన్ ను విధించాలని ఔరంగాబాద్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.ప్రస్తుతం ఔరంగాబాద్ జిల్లాలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 57,755 నమోదవ్వగా, నిన్నటి వరకు 5,569 యాక్టివ్ కేసులు ఉన్నాయని జిల్లా అధికారులు వెల్లడించారు. మార్చి 15-21 వరకు నాగ్పూర్లో కూడా పూర్తి లాక్డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించిన విషయం తెలిసిందే.ఏప్రిల్ 4 వరకు వారాంతపు రోజులలో కూడా జిల్లాలో పాక్షిక లాక్డౌన్ అమలుచేస్తామని జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, అత్యవసర సేవలు, కూరగాయలు, పండ్ల దుకాణాలు, పాల బూత్లు వంటి అవసరమైన సేవలు మాత్రమే తెరిచి ఉంటాయి. రాష్ట్రంలో శుక్రవారం వరుసగా మూడో రోజు ఈ ఏడాదిలో అత్యధికంగా 15,817 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసులు సంఖ్య 22,82,191 కు పెరిగింది, అయితే మరణాల సంఖ్య 56గా నమోదవడంతో ,మొత్తం కరోనా మరణాల సంఖ్య 52,723కు చేరింది. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల పట్ల చాలా ఆందోళనగా ఉందన్నారు. ఇది తీవ్రమైన పరిణామంగా భావించాలని, కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలన్నారు. (చదవండి: అలా చేస్తే విమానం దిగాల్సిందే: డీజీసీఏ) Maharashtra: Complete lockdown imposed in Aurangabad on weekends, due to a rise in COVID19 cases The total number of COVID19 cases in Aurangabad district is 57,755 including 5,569 active cases, till yesterday. pic.twitter.com/ODXyEff1UW — ANI (@ANI) March 13, 2021 -
ఒక్కరోజే 1,710 కేసులు.. మరోసారి లాక్డౌన్
ముంబై: కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి.. మరో సారి పంజా విసురుతోంది. నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించగా.. తాజాగా మరోసారి లాక్డౌన్ విధేంచేందుకు సిద్ధమైంది. నాగ్పూర్లో వారం రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 15-21 వరకు నగరంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సేవలు అయిన పాలు, పండ్లు, కూరగాయలు, కిరాణ వస్తువులు లభించే దుకాణాలను తెరవడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. మార్చి 15 నుంచి నాగపూర్లోని అన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ అమల్లోకి వస్తుందని.. ప్రజలందరూ సహకరించాలని పోలీసు ఉన్నతాధికారి కోరారు. మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘రానున్న రోజుల్లో మరి కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాలని భావిస్తున్నాం. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాము’’ అని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని జలగావ్ జిల్లాలో ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. మార్చి 8 నుంచి జలగావ్లో రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇక తాజాగా మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే అత్యధికంగా 13,659 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచే 60 శాతం కేసులుండటం గమనార్హం. నాగపూర్లో కూడా 1,710 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ విధేంచేందుకు సిద్ధమయ్యింది. చదవండి: కరోనా : మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లకు మహీంద్రా షాక్ వారియర్స్కు వ్యాక్సిన్; చాలా బాధగా ఉంది.. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
కరోనా ప్రభావం రైల్వే శాఖపై అధికంగా పడిన సంగతి తెలిసిందే. దేశంలో లాక్ డౌన్ విధించే సమయంలో రైళ్ల రాక పోకలను పూర్తిగా నిలిపివేశారు. అయితే, అన్ లాక్ అనంతరం కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే అధికారులు నడుపుతున్నారు. మొదట కేవలం కొన్ని రైళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చిన అధికారులు క్రమంగా వాటి సంఖ్యను పెంచుతూ పోతున్నారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక ప్రకటన చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. సోమ, శుక్రవారాల్లో నడిచే కొల్హాపూర్-నాగ్పూర్ రైలు ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు కొల్హాపూర్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నాగ్పూర్కు చేరుకుంటుందని తెలిపారు. గురు, శనివారాల్లో నడిచే నాగ్పూర్-కొల్హాపూర్ రైలును ఈ నెల 13న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైలు నాగ్పూర్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరుతుందని వివరించారు. ఈ రైలు కొల్హాపూర్కు మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. చదవండి: ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ! భారీగా పడిపోయిన బంగారం ధరలు -
ప్రియుడిని హత్య చేస్తే.. ఓ రాత్రి నీతో గడిపేందుకు ఓకే
ముంబై : సుపారి ఇచ్చి ప్రియుడిని అతి కిరాతకంగా హత్య చేయించింది ఓ యువతి. ఈ దారుణ ఘటన మహారాష్ష్ర్టలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..నాగ్పూర్కు చెందిన చందూ మహాపూర్ అనే వ్యక్తి 20 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని కోరగా అతడు ఒప్పుకోలేదు. ఇదివరకే పెళ్లయి, పిల్లలు కూడా ఉండటంతో రెండో పెళ్లి చేసుకోలేనని తెగేసి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ఆ యువతి ప్రియుడిని పథకం ప్రకారం హత్య చేయించింది. ఇందుకోసం ప్రియుడి స్నేహితుడు, దూరపు బందువైన భరత్ గుర్జార్ అనే వ్యక్తిని నియమించుకుంది. తన ప్రియుడిని హత్య చేస్తే రూ.1.5 లక్షల సుపారీతో పాటు ఓ రాత్రి నీతో గడుపుతానంటూ బంపర్ ఆఫర్ చేసింది. దీనికి అంగీకరించిన నిందితుడు..పార్టీ ఇస్తానని చెప్పి యువతి ప్రియుడిని తీసుకెళ్లాడు. ఫుల్లుగా మద్యం తాగించి తలపై బండరాయి మోది అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని క్రషింగ్ మెషిన్లో పడేసి పారిపోయాడు. నిందితుడికి ఇదివరకే చందూతో డబ్బు విషయంలో వివాదం ఉందని, అది కూడా మనసులో పెట్టుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజి ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మర్డర్ ప్లాన్లో యువతికి సహకరించిన ఆమె తల్లిదండ్రులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి : (వివాహేతర సంబంధం: ప్రియుడు, ప్రియురాలు మృతి) (మద్యం మత్తు: భర్త ముందే భార్యతో అసభ్య ప్రవర్తన) -
భార్య పొగాకు నములుతోంది.. విడాకులు కావాలి
ముంబై: బాంబే హై కోర్టు నాగ్పూర్ బెంచ్ ముందుకు వెరైటీ కేసు ఒకటి వచ్చింది. ‘‘నా భార్య పొగాకు నములుతుంది.. అది నాకు నచ్చడం లేదు. మాకు విడాకులు ఇప్పించండి’’ అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోదన్న కోర్టు.. అతడి అభ్యర్థనను తోసి పుచ్చింది. కేసు వివరాలు.. నాగపూర్కు చెందిన ఈ దంపతులకు 2003 జూన్ 15న వివాహం అయ్యింది. వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్ది కాలం తర్వాత ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడంతో భార్యభర్తలిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. కూతురు తండ్రి దగ్గర ఉండగా.. కొడుకు తల్లి దగ్గర ఉంటున్నాడు. ఈ క్రమంలో భర్త తన భార్యకు విడాకులు ఇవ్వాలని భావించాడు. ఈ నేపథ్యంలో ‘‘నా భార్య ఇంటి పని ఏది సరిగా చేయదు.. కారణం లేకుండానే చీటికి మాటికి నన్ను, నా కుటుంబ సభ్యులను దూషిస్తోంది. నా మాట వినదు.. నా అనుమతి లేకుండానే పుట్టింటికి వెళ్లి 15-30 రోజుల పాటు అక్కడే ఉంటుంది. అన్నింటికి మించి ఆమెకు పొగాకు నమిలే అలవాటు ఉంది. ఫలితంగా ఆమె కడుపులో సిస్ట్ ఏర్పడింది. తన వైద్య ఖర్చుల్ని భరించడం నా వల్ల కాదు. కనుక నాకు విడాకులు ఇప్పించండి’’ అని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. భార్య వాదన.. భర్త తనపై చేసినవన్ని అసత్యపు ఆరోపణలే అని భార్య వెల్లడించింది. భర్త తన తల్లి మాటలు విని తనను దారుణంగా హింసిస్తాడని తెలిపింది. భర్త, అతడికి బైక్ కావాలని.. తన పుట్టింటి నుంచి దాన్ని తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడని సదరు భార్య కోర్టుకి తెలిపింది. ఈ క్రమంలో తల్లి మాటలు విని తనను దారుణంగా హింసిస్తున్నాడని వెల్లడించింది. అత్తింటి వారి ఆగడాల మీద గతంలోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. ఇందుకు సంబంధించిన రిపోర్టులను కోర్టులో సమర్పించింది. కోర్టు తీర్పు ఈ కేసుకు సంబంధించి నాగపూర్ ఫ్యామిలీ కోర్టు 2015లోనే తీర్పు వెల్లడించింది. భార్య, భర్తలిద్దరి వాదనలు విన్న కోర్టు.. విడాకుల పిటిషన్ని రద్దు చేసింది. దాంతో అతడు బాంబే హై కోర్టు నాగపూర్ బెంచ్ను ఆశ్రయించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకులు కోరుతూ భర్త సమర్పించిన ఆధారాలు సరిగా లేవని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సమస్యలు ప్రతి సంసారంలోనూ ఉంటాయని తెలిపింది. అన్నింటికి కన్నా ముఖ్యంగా భార్య పొగాకు నములుతుందనే కారణం మీద విడాకులు మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అంతేకాక విడాకులు కోరుతున్న భర్తకు 2008లో హెచ్ఐవీ పాజిటివ్గా తేలినప్పటికి అతడి భార్య రెండేళ్ల పాటు అతడితోనే ఉందని.. పైగా శారీరక, మానసిక హింసకు సంబంధించి అతడి భార్య కోర్టుకు సమర్పించిన ఆధారాలు చాలా బలంగా ఉన్నాయిని కోర్టు స్పష్టం చేసింది. చదవండి: విడాకుల వివాదం.. మోడల్ దారుణ హత్య నేను ‘గే’ని.. విడాకులు తీసుకుంటున్నాం: నటుడు -
బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ముంబై: లైంగికదాడి కేసులో బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ జడ్జి జస్టిస్ పుష్ప గనేడివాలా ఇచ్చిన మరో సంచలన తీర్పు తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి పద్దెమినిదేళ్లు నిండలేదని ఆమె తల్లి చెబుతున్న మాటలకు, జన్మధ్రువీకరణ పత్రానికి పొంతన లేదని, కాబట్టి నిందితుడికి పదేళ్ల శిక్ష విధించడం అన్యాయం అంటూ అతడిని నిర్దోషిగా ప్రకటించారు. ‘‘ఓ వ్యక్తి బాధితురాలిని బలవంతంగా బంధించి, ఆమె నోట్లో వస్త్రాలు కుక్కి, ఒకేసారి ఇరువురి దుస్తులు విప్పదీయడం.. అది కూడా ఎలాంటి ఘర్షణ లేకుండానా? ఇది అసాధ్యం’’అని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వివరాలు... సూరజ్ కసార్కర్(26) అనే వ్యక్తి తన పదిహేనేళ్ల కుమార్తెపై లైంగిక దాడి చేశాడని అతడి పొరుగింటి మహిళ 2013, జూలై 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. యావత్మల్కు చెందిన అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో స్పెషల్ ట్రయల్ కోర్టు అతడు నేరానికి పాల్పడ్డట్లు రుజువుకావడంతో శిక్ష ఖరారు చేసింది. అయితే బాధితురాలు మేజర్ అని, ఇద్దరి అంగీకారంతోనే శారీరకంగా ఒక్కటయ్యారని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. బాధితురాలు మాత్రం.. ‘‘ఆరోజు రాత్రి 9.30 గంటల సమయంలో నేను ఇంట్లో ఉన్న సమయంలో సూరజ్ లోపలికి వచ్చి బలత్కారం చేశాడు. అప్పటికే బాగా తాగి ఉన్నాడు. నా తమ్ముడేమో నిద్రపోతున్నాడు. మా అమ్మ కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లింది. అరవడానికి ప్రయత్నించగా.. నా నోటిని గట్టిగా మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ విషయం అమ్మకు చెప్పాను. తర్వాత ఇద్దరం పోలీస్ స్టేషనుకు వెళ్లి ఫిర్యాదు చేశాం’’ అని కోర్టుకు చెప్పింది. ఈ నేపథ్యంలో అనేక విచారణల అనంతరం కేసు హైకోర్టుకు చేరింది.(చదవండి: సంచలన తీర్పులు: జస్టిస్ పుష్ప గనేడివాలా నేపథ్యం?!) ఈ క్రమంలో ఇటీవల దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ పుష్ప గనేడివాలా.. ‘‘బాధితురాలు వర్ణించిన విధానం సహజంగా లేదు. ఒకవేళ ఆమె చెప్పినట్లు బలవంతం జరిగి ఉంటే ఇరువురి మధ్య గొడవ జరగాలి. కానీ మెడికల్ రిపోర్టులో, బాధితురాలికి గాయాలు అయినట్లు గానీ, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవు. పరస్పర అంగీకారంతోనే జరిగిందని డిఫెన్స్ లాయర్ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బాధితురాలు సైతం.. ‘‘మా అమ్మ రాకపోయి ఉంటే, నేను ఫిర్యాదు చేసేదాన్ని కాదని క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా చెప్పింది’’ అని చెప్పింది.(చదవండి: ‘పోక్సో’ చట్టం కింద అది నేరం కాదు) చట్టానికి బలమైన సాక్షాధారాలు అవసరం. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలమే నిందితుడికి శిక్ష వేయించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇక్కడ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే అప్పీలు చేసుకున్న వ్యక్తిని 10 ఏళ్లపాటు జైలుకు పంపడం అన్యాయమే అవుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు. కాగా శరీరానికి శరీరం తగిలితేనే పోక్సో చట్టం కింద నేరంగా పరిగణిస్తామని, అదే విధంగా ఐదేళ్ల బాలిక చేతులు పట్టుకుని, ప్యాంటు జిప్ తెరచినంత మాత్రాన దానిని లైంగిక చర్యగా పేర్కొనలేమంటూ జస్టిస్ పుష్ప ఇటీవల తీర్పులు వెలువరించిన విషయం తెలిసిందే.