-
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మహిళకు ఐదేళ్ల తరువాత న్యాయం లభించింది. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన నాగపూర్ కోర్టు ప్రభుత్వ వైద్యశాల డీన్ రాజ్ గజ్భియేతో సహా 11 మంది వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాగ్పూర్లోని అజ్ని పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే 2019లో నాగపూర్కు చెందిన కేవల్రామ్ పాండురంగ్ పటోలే భార్య పుష్ప తన గొంతులో చిన్నపాటి గడ్డకు చికిత్స కోసం నాగ్పూర్లోని మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. ఈ సమయంలో సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ గజ్భియే బాధిత మహిళ భర్త కేవల్రామ్ పాండురంగ్ పటోలేతో శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గడ్డను తొలగించవచ్చని తెలిపారు. ఆ వైద్యుని సలహా మేరకు పటోలే తన భార్య పుష్పను 2019 జూలై 5న ఆసుపత్రిలో చేర్చారు. 6న ఉదయం 8 గంటలకు ఆమెకు ఆపరేషన్ జరిగింది.ఈ ఆపరేషన్ తర్వాత పుష్ఫ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఆమెకు చికిత్సనందించారు. అయితే జూలై 7న ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పుష్ఫ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆపరేషన్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పటోలే 2020 జూన్ 30న డాక్టర్ గజ్భియేతో పాటు ఇతర వైద్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వైద్యాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేసి, కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికలో బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిందని కమిటీ పేర్కొంది.అయితే పటోలే దీనిపై రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వైద్యశాఖ ఈ ఉదంతంపై విచారణకు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధితురాలికి ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా పటోలే నాగపూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఆ వైద్యులపై కేసు నమోదు చేయాలని అజ్ని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!
కొందరూ తల్లులు పేదరికం, దారుణమైన కుటుంబ పరిస్థితులు వంటి కారణాల రీత్యా చారిటీ సంస్థల వద్ద లేదా దత్తత కింద తమ పిల్లలను ఇచ్చేయడం జరుగుతుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లై.. తమను పెంచిన వాళ్లు అసలైన తల్లిదండ్రులు కాదని తెలిస్తే.. ఆ బాధ మాములుగా ఉండదు. అక్కడ నుంచి మొదలవుతాయి తమ తల్లిదండ్రులు ఎవరూ, ఎక్కడ ఉంటారనే ఆలోచనలు. వాళ్లు అసలు బతికే ఉన్నారా? ఒకవేళ బతికే ఉంటే ఒక్కసారి వాళ్లను తమ కళ్లతో చూసుకోవాలనే ఆరాటం, ఆత్రం మాటలకందని విధంగా ఉంటాయి. అలాంటి భావోద్వేగపు కథ ఈ స్విడిష్ యువతి గాథ! అసలేం జరిగిందంటే..స్వీడన్కి చెందిన 41 ఏళ్ల ప్యాట్రిసియా ఎరిక్సన్ ఫిబ్రవరి 1983లో నాగాపూర్లోని డాగా హాస్పిటల్లో జన్మించింది. ఒక ఏడాది తర్వాత స్వీడిష్ దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారు. తనన పెంచి పెద్ద చేసిన తల్లి తన కన్నతల్లి కాదని తెలుసుకుని భావోద్వేగానికి గురవ్వుతుంది. అయినప్పటికీ ఇన్నేళ్లు తనను ఎంతో ప్రేమగా పెంచిన పెంపుడు తల్లి పట్ల అపారమైన కృజ్ఞత ఉన్నప్పటికీ ఒక్కసారి తన తల్లిని తనవితీరా చూడాలని కోరుకుంటుంది. అందుకోసం ఆమె తన తల్లి ఎక్కడ ఉండేది అనే దిశగా ఆమె ఆచూకీకై వెతకడం ప్రారంభించింది. అలా ఆమె తన తల్లిని వెతుక్కుంటూ నాగ్పూర్కి చేరుకుంది. అక్కడ తన తల్లి ఆచూకీకి సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించడం మొదలు పెట్టింది. ఆ భావోద్వేగపూరిత అన్వేషణలో ఎరిక్సన్కి అంజలా పవార్ అనే న్యాయవాది సాయం అందిస్తున్నారు. ఇలా జీవ సంబంధమైన తల్లుల కోసం వేరే దేశ యువతలు భారతదేశానికి వచ్చి కోరడం అనేది తొలిసారి కాదు. ఇంతకుమునుపు స్విస్ మహిళ విద్యా ఫిలిప్పన్ కూడా ముంబైలో తన జీవసంబంధమైన తల్లి కోసం ఒక దశాబ్దంగా వెతుకుతూ ఉంది. అయితే ఆ కేసులో ఆమె తల్లి చిరునామా, ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఆ యువతి ప్రధాన సవాలుగా మారింది. దీంతో ఆమె తల్లి ఎక్కడకు వెళ్లి ఉంటుందనేది చిక్కముడి వీడని మిస్టరీలా మారిపోయింది. #WATCH | Nagpur, Maharashtra: Swedish National Patricia Eriksson comes to Nagpur to search for her biological mother. She says, "The kids in school started to explain that they have their mother's hair and father's nose. Then I realised I couldn't do the same... From a child's… pic.twitter.com/bcyXL4se6o — ANI (@ANI) April 3, 2024 (చదవండి: హెయిర్ స్ట్రైయిట్నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్) -
తూర్పు విదర్భలో హోరాహోరీ!
మహారాష్ట్రలో లోకసభ ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. బరిలోకి దిగిన పార్టీలు తమ సత్తాను చాటేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని తూర్పు విదర్భలో ఎన్నికల పోరు ఆసక్తికరంగామారింది. ఇక్కడి ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, శివసేన, బీఎస్పీతో సహా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రామ్టెక్ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన పార్టీల నుండి ముగ్గురు అభ్యర్థులు రాజు పర్వే (శివసేన), శ్యాంకుమార్ బార్వే (కాంగ్రెస్), సందీప్ మెష్రామ్ (బీఎస్పీ) ఉన్నారు. అయితే అంతగా గుర్తింపు లేని పార్టీల నుండి 13 మంది, 12 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. రామ్టెక్లో కాంగ్రెస్ తన అభ్యర్థిగా రష్మీ బార్వేని నిలబెట్టింది. అయితే ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లదు. దీంతో ఆమె భర్త ఎన్నికల రంగంలో నిలిచారు. నాగ్పూర్ విషయానికొస్తే బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ, వికాస్ థాకరే (కాంగ్రెస్), యోగేష్ లాంజేవార్ (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీల నుండి 13 మంది, 10 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. భండారా-గోండియా నియోజకవర్గంలోని 18 మంది అభ్యర్థులలో, సునీల్ మెంధే (బీజేపీ), ప్రశాంత్ పడోలే (కాంగ్రెస్), సంజయ్ కుంభాల్కర్ (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారు కాగా, నలుగురు గుర్తింపు పొందనివారున్నారు. 11 మంది స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. అశోక్ నేతే (బీజేపీ), కర్సన్ నామ్దేవ్ (కాంగ్రెస్), యోగేష్ హొన్నాడే (బీఎస్పీ) మధ్య త్రిముఖ పోటీ ఉండనుందని భావిస్తున్నారు. చంద్రాపూర్లో 15 మంది అభ్యర్థుల్లో ప్రతిభా ధనోర్కర్ (కాంగ్రెస్), సుధీర్ ముంగంటివార్ (బీజేపీ), రాజేంద్ర రామ్టేకే (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీల నుంచి, 9 మంది గుర్తింపు లేని అభ్యర్థులు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్. చొక్కలింగం తెలిపారు. ఈ నియోజకవర్గాల్లోని 10,652 పోలింగ్ కేంద్రాల ద్వారా 95,54,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
Nitin Gadkari: 5 లక్షలకుపైగా ఓట్లతో గెలుస్తా
రానున్న లోక్సభ ఎన్నికల్లో నాగ్పూర్ నుంచి 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశ్వాసం వ్యక్తం చేశారు. తాను నాగ్పూర్ను ఎప్పుడూ మరచిపోలేదని, ఇకపైనా ఎప్పుడూ మరచిపోనని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో నేను 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. మీరందరూ నన్ను ఎంతో ప్రేమించారు. నేను ఏ పని చేసినా అది మీ ప్రేమ, ఆదరణ వల్లే చేయగలిగాను. ఆ ఘనత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకే చెందుతుంది. నేను నాగ్పూర్ను ఎప్పుడూ మరచిపోలేదు. ఇకపైనా ఎప్పుడూ మరచిపోను’ అని నితిన్ గడ్కరీ వివరించారు. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా తాను ఏ పని చేసినా ఆ ఘనత తనను అధికారంలోకి తెచ్చిన ఓటర్లకే దక్కుతుందన్నారు. గత పదేళ్లలో నాగ్పూర్లో రూ. లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశానని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తన రాజకీయ వారసత్వంపై బీజేపీ కార్యకర్తలకే హక్కు ఉందని నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కొడుకులు ఎవరూ రాజకీయాల్లో లేరన, రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా గోడలపై పోస్టర్లు అతికించి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని వారికి చెప్పినట్లుగా తెలిపారు. కాగా నాగ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పోటీకి దింపాలని బీజేపీ నిర్ణయించింది. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాలకు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
ఆర్ఎస్ఎస్ పురిటి గడ్డలో బీజేపీ గెలిచింది మూడుసార్లే!
మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో నాగ్పూర్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నాగ్పూర్ విదర్భ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. నాగ్పూర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు పురిటి గడ్డగా చెబుతారు. మహారాష్ట్రలోని ఐదు కీలక స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో నాగ్పూర్ కూడా ఉంది. ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నాగ్పూర్ స్థానానికి ఎంపీగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. నాడు కాంగ్రెస్ అభ్యర్థి అనసూయాబాయి కాలే ఇక్కడి నుంచి గెలిచారు. నాగ్పూర్ సీటు కొన్నాళ్లు కాంగ్రెస్ ఖాతాలోనే ఉంది. 1996లో బీజేపీ తొలిసారి ఇక్కడ నుంచి గెలుపొందింది. నాగ్పూర్ ఎన్నికల చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి. 1952లో మొదటి సాధారణ ఎన్నికల్లో నాగ్పూర్ స్థానం కాంగ్రెస్కు దక్కింది. 1962లో రాజకీయ నేత మాధవ్ శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఆర్ దేవ్ఘరే విజయం సాధించారు. 1971లో నాగ్పూర్లో కాంగ్రెస్కు తొలి పరాజయం ఎదురైంది. ఈసారి సుభాష్ చంద్రబోస్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ నాగ్పూర్ స్థానాన్ని కైవసం చేసుకోగా, భోటే జంబువంతరావు ఎంపీ అయ్యారు. 1977లో కాంగ్రెస్ ఇక్కడ తిరిగి అధికారం చేజిక్కించుకుంది. 1980 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత భోటే జంబువంతరావు విజయం సాధించారు. 1984లో కాంగ్రెస్ నేత బన్వరీలాల్ భగవాన్దాస్ విజయం సాధించారు. బన్వరీలాల్ 1989 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ను విజయపథంలో నడిపించారు. 1991 సార్వత్రిక ఎన్నికల్లో బన్వరీలాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అయితే ఈసారి బన్వరీలాల్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాజీ రఘోబ్జీ మేఘే ఎంపీగా ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ మరోసారి బన్వరీలాల్కు టికెట్ ఇచ్చింది. అప్పుడు తొలిసారిగా నాగ్పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్ పార్టీ నాగ్పూర్ సీటును సొంతం చేసుకుంది. విలాస్ ముత్తెంవార్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009లలో వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014లో మోదీ వేవ్ కారణంగా చాలా విరామం తర్వాత బీజేపీ తిరిగి నాగ్పూర్ సీటును సొంతం చేసుకుంది. ఈసారి నితిన్ గడ్కరీ ఎంపీ అయ్యారు. నితిన్ గడ్కరీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ నాగ్పూర్ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. సంఘ్కు బలమైన కోటగా ఉన్నప్పటికీ నాగ్పూర్లో బీజేపీ మూడు లోక్సభ ఎన్నికల్లో(1996,2014,2019) మాత్రమే విజయం సాధించగలిగింది. -
బిల్గేట్స్కు చాయ్, ప్రధాని మోదీకి కూడా చాయ్ : డాలీ చాయ్వాలా
భారత్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్గేట్స్ సోషల్ మీడియా స్టార్, డాలీ చాయ్వాలా వద్దకు వెళ్లి చాయ్ తాగిన వీడియో వైరల్ అయింది. దీంతో మరోసారి మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సునీల్ పాటిల్ వార్తల్లోకి వచ్చేశాడు. ఈ సందర్భంగా చాయ్వాలా చేసిన కమెంట్స్ విశషంగా నిలుస్తున్నాయి. బిల్ గేట్స్ డాలీ చాయ్వాలా మీట్పై మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశాడు. విదేశం నుంచి వ్యక్తి అని మాత్రం అనుకున్నా.. కానీ ఆయన బిట్ గేట్స్ అని అస్సలు తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అందరికీ ఇచ్చినట్టే అతనికీ టీ ఇచ్చాను. తరువాత నాగ్పూర్కి తిరిగి వచ్చాక తాను ఎవరకి టీ ఇచ్చిందీ గుర్తించానని తెలిపాడు. బిల్ గేట్స్ తన దగ్గరికి వచ్చి 'వావ్, డాలీకి చాయ్' అన్నారని గుర్తు చేసుకున్నారు. పనిలో బిజీగా ఉండి, ఆయన తన పక్కనే ఉన్నా, తాను అస్సలు మాట్లాడలేక పోయానని చెప్పాడు. దక్షిణాది సినిమాలు చూస్తా.. వాటినుంచే స్టైల్స్ నేర్చుకున్నా.. వెరైటీ టీ అందిస్తూ ‘నాగ్పూర్ కా డాలీ చాయ్గా మారా’ అంటూ తన స్టయిల్ గురించి వెల్లడించాడు. అంతేకాదు 'భవిష్యత్తులో ప్రధాని నరేంద్రమోదీకి కూడా టీ అందించాలనుకుంటున్నా అంటూ తన మనసులోని కోరికను బైట పెట్టాడు. కాగా సునీల్ పాటిల్ టీస్టాల్తో ఉపాధిని వెదుక్కోవడమే కాదు, తన డ్రెస్సింగ్ స్టైల్, టీ తయారీలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ను అనుకరిస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ‘డాలీ చాయ్ వాలా’ పేరుతో ఇన్ స్టాగ్రామ్లో కూడాసెలబ్రెటీగా మారిపోయిన సంగతి తెలిసిందే. #WATCH | Nagpur (Maharashtra): Microsoft Co-founder Bill Gates posted a video, in which he can be seen enjoying Dolly's tea. Dolly Chaiwala says, "I was not aware at all I thought that he was a guy from a foreign country so I should serve him tea. The next day when I came back… pic.twitter.com/hicI3vY31y — ANI (@ANI) February 29, 2024 -
డాలీ చాయ్వాలాతో బిల్ గేట్స్: ఏఐ వీడియోనా? ఇంటర్నెట్ ఫిదా
మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్గేట్స్ భారత పర్యటనలో మరోసారి తన స్పెషాల్టీని చాటుకున్నారు. భారత దేశ ఆవిష్కరణలపై ఎప్పటిలాగానే ప్రశంసలు కురిపించారు. పాపులర్ నాగ్పూర్ డాలీ చాయ్ వాలా టీ స్టాల్ను సందర్శించిన ఆయన ఇక్కడి టీకి ఫాదా అయిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన డాలీ చాయ్ వాలా ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ బిల్గేట్స్ టీ అడిగి మరీ తాగారు. అంతే చాయ్వాలా టీకి బిల్ గేట్స్ ఫిదా అయిపోయారు. ఈ క్రమంలో ‘‘ఇండియాలో ఎక్కడికెళ్లినా అక్కడ ఆవిష్కరణలను కనుగొనవచ్చు- సాధారణ కప్పు టీ తయారీలో కూడా!’’ అంటూ ఒక వీడియోషేర్ చేశారు. బిల్గేట్స్ సింప్లిసిటీకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇది ఏఐ సృష్టి కాదు కదా అని ఒక యూజర్, "ఇది డీప్ఫేకా’’ అని కూడా ఒక వినియోగదారు ఆశ్చర్యపోవడం విశేషం. దీనికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా సరదాగా కమెంట్ చేశాయి. జొమాటో బిల్ గేట్స్కి స్పెషల్ ఆఫర్ కూడా ఇచ్చేసింది. అలాగే బిల్ ఎంత స్విగ్గీ స్పందించింది. నాగ్పూర్లో వెరైటీ, స్టయిలిష్ టీతో డాలీ చాయ్వాలా బాగా ఫ్యామస్. 10వేల మందికి పైగా ఫాలోవర్లున్నారంటేఈ చాయ్వాలా స్పెషల్ ఎంటో అర్థం చేసుకోవచ్చు. కాగా బిల్ గేట్స్ తన పర్యటనలో భాగంగా ఒడిశాలోని భువనేశ్వర్లో బిల్గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్లోని ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bill Gates (@thisisbillgates) -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్తోపాటు పశ్చిమ బెంగాల్లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
Arati Kadav: సాఫ్ట్వేర్ టు సైన్స్–ఫిక్షన్ డైరెక్టర్
మల్టీ టాలెంట్ అంటే మాటలు కాదు. ఎంచుకున్న రంగాల్లో సమాన ప్రతిభ చాటాలి. తేడా జరిగితే అన్నిట్లో ‘జీరో’ తప్ప ఏమీ మిగలదు. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా తన ప్రతిభను చాటుకున్న ఆరతి కదవ్ గురించి.... చిన్నప్పటి నుంచి ఆరతికి ఫాంటసీ జానర్ అంటే ఇష్టం. ‘పంచతంత్ర’ ‘మహాభారత’ కథల పుస్తకాలు చదువుతున్నప్పుడు వాటికి తన ఊహాలోకంలో తనదైన ఫాంటసీ జోడించేది. ఆ తరువాత సైన్స్–ఫిక్షన్ తన ఆసక్తిగా మారింది. ‘ఈ జీవితానికి అర్థం ఏమిటి? పుట్టడం, గిట్టడమేనా ఇంకేదైనా పరమావధి ఉందా?’ ఇలాంటి ప్రశ్నలతో చావుపుట్టుకల గురించి ఎన్నో కోణాలలో ఆలోచించేది. మరణానంతర జీవితం గురించి కథలు రాసేది. సైన్స్–ఫిక్షన్ ఫిల్మ్మేకర్గా ఆరతి గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ ఊహలే పునాదిగా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్గా తనకు ఎంతో పేరు తెచ్చిన ఫిలసాఫికల్ సైన్స్ ఫిక్షన్, బ్లాక్కామెడీ ఫిల్మ్ ‘కార్గో’కు ముందు రోబోలను దృష్టిలో పెట్టుకొని ‘టైమ్ మెషిన్’ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది ఆరతి. ఈ చిన్న చిత్రం తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మన పురాణాలలో నుంచి ఊహాజనితమైన కథలతో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీయాలనే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునేలా చేసింది., మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన ఆరతి కదవ్ అమెరికాలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేసింది. సాంకేతిక విషయాలకు తప్ప కాల్పనిక ఊహలకు బుర్రలో కాసింత చోటు దొరకనంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ‘ఫాంటసీ’ కోసం కొంత స్థలం రిజర్వ్ చేసుకునేది. కొంతకాలం తరువాత ఉద్యోగాన్ని వదిలి ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరింది. కాల్పనిక విషయాల మీద ఆసక్తి ఆరతిని సైన్స్కు దూరం చేయలేదు. సందర్భాన్ని బట్టి శాస్త్రీయ విషయాలపై రచనలు చేస్తుంటుంది. చిత్రరంగంలో కృత్రిమ మేథ(ఏఐ)కి సంబంధించి ‘విల్ ఏఐ మీన్ ది డెత్ ఆఫ్ క్రియేటివిటీ’ పేరుతో రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. రచయిత్రిగా కలం పట్టినప్పుడు తనలోని సాఫ్ట్వేర్ ఇంజినీర్ బయటకు వచ్చి ‘రిసెర్చ్’ చేయమంటూ సలహా ఇస్తుంది. దీంతో ఊహలకు విరామం ఇచ్చి తాను ఏ సబ్జెక్ట్ గురించి అయితే రాస్తుందో ఆ సబ్జెక్ట్కు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి సాధికారమైన సమాచారాన్ని పోగు చేస్తుంది. దీని ఆధారంగా మళ్లీ రచన చేస్తుంది. డైరెక్టర్గా ఉన్నప్పుడు తనలోని రచయిత్రి బయటకు వచ్చి సీన్–డైలాగ్లను ఇంకా ఎలా మెరుగుపెట్టవచ్చో సలహా ఇస్తుంది. ఇక ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు బడ్టెట్ను సమర్థవంతంగా వాడుకోవాలనే విషయంలో సలహాలు ఇవ్వడానికి తనలోని సాప్ట్వేర్ ఇంజినీర్, రైటర్, డైరెక్టర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ‘కార్గో’ సినిమా అయిదుగురు నిర్మాతలలో ఆరతి ఒకరు. ‘నేర్చుకున్న విద్య ఏదీ వృథా పోదు’ అని చెప్పడానికి ఆరతి బహుముఖ ప్రజ్ఞ సాక్ష్యంగా నిలుస్తుంది. -
బీజేపీలో గులాంగిరీ నడుస్తోందని ఆ పార్టీ ఎంపీనే చెప్పారు: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ బీజేపీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో గులాంగిరీ నడుస్తుందని( గతంలో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తిం) ఆ పార్టీ ఎంపీనే తనతో చెప్పారని పేర్కొన్నారు. అయితే ఆ ఎంపీ హృదయం ఇప్పటికీ కాంగ్రెస్తోనే ఉందని రాహుల్ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ర్యాలీలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో కాంగ్రెస్ ఉన్న ప్రస్తుత బీజేపీ ఎంపీ ఒకరు ఆ పార్టీలో(బీజేపీ) గులాంగిరీ నడుస్తుందని నాతో చెప్పి వాపోయారు. ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసి ఈ మాటలు చెప్పారు. ఆయన మనస్సంతా కాంగ్రెస్పైనే ఉంది. హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలు పాటించాలి. పార్టీ కార్యకర్తల గోడును వినే వారుండరు. పార్టీ హైకమాండ్ సూచనలు తమకు నచ్చినా నచ్చకపోయినా మరో అవకాశం ఉండదు. బీజేపీలో అలాగే ఉంటుంది’ అని ఆ ఎంపీ తనతో చెప్పారని రాహుల్ పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్ధలన్నీ ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిళ్లతో పనిచేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. కాగా కాంగ్రెస్ పార్టీ 139వ వ్యవస్ధాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మహారాష్ట్రలోని నాగపూర్లో భారీ ర్యాలీ ప్రదర్శించారు. దీంతో మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. చదవండి: ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట.. #WATCH | At Congress' 'Hain Taiyyar Hum' rally in Nagpur, Rahul Gandhi says, "A BJP MP, who was previously in Congress, told me that 'ghulami' works in BJP..." pic.twitter.com/AD7kxzvvJR — ANI (@ANI) December 28, 2023 -
సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి!
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నాగ్పూర్లోని బజార్గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడివారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగ్పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగ్పూర్లోని బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పఖాలే మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. ఇది కూడా చదవండి: లోక్సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె? -
97 నుంచి 77 కట్ చేస్తే... ఆ కరేజ్ ఇలా ఉంటుంది!
97 సంవత్సరాల వయసులో రెండు అడుగులు వేగంగా వేయాలంటేనే కష్టం. అలాంటిది ‘పారా మోటరింగ్ అడ్వెంచర్’ చేస్తే... మహారాష్ట్రలోని నాగ్పుర్కు చెందిన ఉషా తూసే 97 సంవత్సరాల వయసులో పారామోటరింగ్ సాహసం చేసి నెటిజనులు ‘వావ్’ అనేలా చేసింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో 1.2 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఆర్మీ పారా–కమాండో పైలట్స్, ఎయిర్ ఫోర్సు వెటరన్స్ ఆపరేట్ చేసే ఫ్లైయింగ్ రైనో పారామోటరింగ్ విభాగం బామ్మ చేత ఈ సాహసాన్ని చేయించింది. ‘97 ఇయర్ వోల్డ్ కరేజ్ అండ్ 20 ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్’ అనే కాప్షన్తో ‘ఎక్స్’లో ఈ వీడియో క్లిప్ను పోస్ట్ చేసింది. ‘సాహసంలో జీవనోత్సాహం కూడా ఉంటుంది అనే వాస్తవాన్ని ఆవిష్కరించే వీడియో ఇది’. ‘ఎంతోమందిని ఇన్స్పైర్ చేసే వీడియో’.... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి నిజానికి ఉషాకు సాహసం కొత్త కాదు. భర్త ఆకస్మిక మరణం, పిల్లల బరువు బాధ్యతల సమయంలో కూడా ఆమె డీలా పడిపోలేదు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ధైర్యంగా పోషించింది. -
మళ్లీ పెరుగుతున్న టమాటా రేట్లు
దీపావళి అనంతరం మార్కెట్లో టమాటా ధర ప్రతి ఏటా రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, ఈ ఏడాది వర్షాభావంతో టమోటా పంట దెబ్బతింది. ఫలితంగా మహారాష్ట్రలోని నాగ్పూర్తో సహా విదర్భలోని రిటైల్ మార్కెట్లో టమోటాలు కిలోకు రూ.55 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. పెరుగుతున్న టమాట ధరలు ఉల్లి ధరలతో పోటీపడుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి టమాటాలను విక్రయించేందుకు నాగ్పూర్లోని కలమన మండీకి తీసుకువస్తుంటారు. అయితే ఈసారి చాలా తక్కువగా టమాటాలు వస్తుండటంతో వీటి ధరలు మళ్లీ పెరిగాయి. టమాటా వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో పెద్ద ఎత్తున టమోటాలు కలమన మండీకి వస్తుంటాయి. ఫలితంగా ధరలు తక్కువగా ఉంటాయి. కాగా పొలంలో టమోటాలు పండించిన రైతులు వాటిని మార్కెట్కు తీసుకురావాలంటే రవాణా ఖర్చులు భారీగా అవుతుంటాయి. ఈ కారణంగా రైతులు టమోటాలను రోడ్లపై పారవేస్తుంటారు. అయితే ఈసారి పరిస్థితి అలా లేదు. టమాటాలు డిమాండ్కు తగ్గట్టుగానే సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర, బెంగళూరు నుంచి టమోటాలు నాగపూర్కు విక్రయానికి వస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లో టమాటా ధర నాణ్యతను బట్టి రూ. 40 నుండి 45 వరకు ఉంటుంది. నాగపూర్ పట్టణానికి ప్రతీరోజు 15 నుండి 16 ట్రక్కుల టమాటాలు వస్తున్నాయి. పెరుగుతున్న టమాటా ధరలు ఉల్లికి గట్టి పోటీనిస్తున్నాయి. ఇప్పటికే రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.65 నుంచి రూ.70 పలుకుతోంది. మార్కెట్లో ఉల్లి రాక పెరగడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లిలో రసగుల్లా కోసం కొట్లాట.. ఆరుగురికి తీవ్రగాయాలు! -
షాకింగ్: టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్
ముంబై: వైద్యులను దేవుడితో పోలుస్తున్నారు. ఆ దేవుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటుంటారు. కేవలం డబ్బుల కోసమే కాకుండా, మానవతా హృదయంతో తన వద్దకు వచ్చిన వారి ప్రాణాలను రక్షిస్తున్న ఘనత వైద్యులకే దక్కుతుంది. అయితే ఇటీవల పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులనే తేడా లేకుండా వైద్యవవస్థ వ్యాపారంగా మారింది. అలాంటి ఓ షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వృత్తి ధర్మం మరిచిన ఓ వైద్యుడు రోగిపట్ల నిర్లక్ష్యంగా వ్యహరించాడు. డ్యూటీ చేస్తుండగా తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలో వెళ్లిపోయాడు సదరు వైద్యుడు. నాగ్పూర్లోని మౌడ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్ 3న జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మౌడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఎనిమిది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నలుగురు మహిళలకు ఆపరేషన్ చేసిన వైద్యుడు తేజ్రంగ్ భలవి.. మిగిలిన వారికి కూడా సర్జరీ చేసేందుకు ముందుగా అనస్తీషియా ఇచ్చాడు. అయితే ఆసుపత్రి సిబ్బందిని ఓ కప్ చాయ్ తీసుకురావాలని వైద్యుడు కోరాడు. కానీ ఎవరూ అతనికి టీ తీసుకోని రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన డాక్టర్ భల్వాయి.. మిగతా నలుగురికి కు.ని శస్త్రచికిత్స చేయకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై వెంటనే ఆసుపత్రి సిబ్బంది జిల్లా వైద్యాధికారికి ఈ విషయం తెలపగా.. ఉన్నపళంగా మరో వైద్యుడిని మహిళలకు సర్జరీలు చేసేందుకు పంపించారు. అనంతరం క్టర్ భలవి ప్రవర్తనపై జిల్లా యంత్రాంగం సీరియస్ అయ్యింది. ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసి వైద్యుడిపై విచారణ చేపట్టినట్లు నాగ్పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్య శర్మ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నివేదిక వచ్చిన తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు -
ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు
ఈరోజు (మంగళవారం) విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దసరా ర్యాలీ నిర్వహించింది. సంఘ్ సభ్యులు నాగ్పూర్లో ‘పథ సంచాలన్’ (రూట్ మార్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. #WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6 — ANI (@ANI) October 24, 2023 సంఘ్ ప్రధాన కార్యాలయంలో భగవత్ గాయకుడు మహదేవన్కు స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ దసరా వేడుకల కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్కు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించారు. -
కుండపోత వర్షం.. నీటమునిగిన నాగ్పూర్
నాగ్పూర్: కుండపోత వర్షంతో నాగ్పూర్ నీటమునిగింది. శుక్రవారం ఒక్కరాత్రిలోనే 106 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 'అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో నాగ్పూర్లోని అంబజారీ సరస్సు పొంగిపొర్లింది. సమీప ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.' అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. వర్షంలో నీటమునిగిన ప్రాంతాలకు సహాయక బృందాలను ప్రభుత్వం పంపింది. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ను అప్రమత్తం చేసింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ దళాలు నాగ్పూర్ చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. అవసరం ఉంటే తప్పా ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రజలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో నగరంలో రోడ్లు కొట్టుకుపోయాయి. నాలాలు దెబ్బతిన్నాయి. రానున్న 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న డెంగీ -
నాగ్పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్
నాగ్పూర్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నాగ్పూర్ పోలీస్ శాఖ తాజాగా మరో ఆసక్తికరమైన పోస్ట్తో ముందుకొచ్చింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని ఉదాహరణగా చూపిస్తూ సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రియేటివ్ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్గా మారింది. దేశవ్యాప్తంగా ఈరోజు విడుదలై కలెక్షన్ల ప్రవాహాన్ని సృష్టించిన షారుఖ్ ఖాన్ 'జవాన్' చిత్రాన్ని ప్రమోషనల్ యాడ్గా మార్చి సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు నాగ్పూర్ సిటీ పోలీసులు. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ వివిధ గెటప్లను వివిధ రకాల పాస్వర్డ్లుగా ఉదహరిస్తూ ఒక్కో సోషల్ మీడియా అకౌంట్కు ఒక్కో పాస్వర్డ్ పెట్టుకుంటే సైబర్ నేరగాళ్లు ఏమీ చేయలేరని తెలిపింది. ఇంకేముంది ఈ ట్వీట్ అతి తక్కువ వ్యవధిలోనే ఇంటర్నెట్లో స్వైరవిహారం చేయడం మొదలుపెట్టింది. Jab aap aise passwords rakhte ho na, toh koi bhi fraudster tik nahi sakta.#KingKhanPasswords #CyberSafety #NagpurCityPolice pic.twitter.com/lby0zr3ixJ — Nagpur City Police (@NagpurPolice) September 6, 2023 ఇది కూడా చదవండి: అడ్డగుట్ట విషాదం.. నిబంధనలకు విరుద్ధంగా పనులు -
తెలంగాణ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఎక్స్ప్రెస్కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. మహారాష్ట్ర నాగ్పూర్ వద్ద రైల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన సిబ్బంది రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆగష్టు 18వ తేదీ ఢిల్లీ నుంచి రైలు బయల్దేరింది. 19వ తేదీ ఉదయం ఎస్ 2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో రైలును వెంటనే నాగ్పూర్లో ఆపేశారు. దీంతో ప్రయాణికులు బోగి దిగి బయటకు పరిగెత్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి కారణాలు దర్యాప్తు తర్వాతే వెల్లడిస్తామని అంటున్నారు. ఉద్యావన్ ఎక్స్ప్రెస్లోనూ.. బెంగళూరులోనూ ఓ రైలుకు ప్రమాదం తప్పింది. కేఎస్ఆర్ స్టేషన్లో ఆగి ఉన్న ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్వే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఘటనలో ఎవరికీ ఏం కాలేదని అధికారులు ప్రకటించారు. Fire broke out at banglore railway station in #UdyanExpress at KSR #Bengaluru #FireAccident Train no - 11301 Route - CSMT to SBC (KSR Bengaluru) pic.twitter.com/ldvjAXg1O5 — Pune Pulse (@pulse_pune) August 19, 2023 -
వరుసగా మృతిచెందుతున్న పైలట్లు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్ బాత్రూమ్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు. ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. -
బీజేపీ నాయకురాలు సనాఖాన్ హత్య.. భర్తే చంపి, నదిలో పడేసి!
మహారాష్ట్ర బీజేపీ మైనారిటీ సెల్ నాయకురాలు అదృశ్యం కేసు విషాదంతంగా మారింది. పది రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె మధ్యప్రదేశ్లోని దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అయితే సనాను ఆమె భర్త అంతమొందించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు అమిత్ అలియాస్ పప్పు సాహుని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాం కోసం గాలిస్తున్నారు. నాగ్పూర్ నివాసి, బీజేపీ మైనారిటీ సెల్ సభ్యురాలు సనా ఖాన్ ఇటీవల భర్త అమిత్ సాహును కలిసేందుకు జబల్పూర్కు వెళ్లారు. రెండు రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా రాలేదు. సనాఖాన్ నాగ్పూర్ నుంచి ప్రైవేట్ బస్సులో బయలుదేరి, మరుసటి రోజు జబల్పూర్ చేరుకున్న తర్వాత తన తల్లికి ఫోన్ చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు జబల్పూర్ వెళ్లి వెతికినా ఆమె ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సనా చివరి లొకేషన్ ఆధారంగా ఆచూకీ కోసం నాగ్పూర్, జబల్పూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. చదవండి: పెళ్లి కుదిరింది.. 9 రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పిన వినిపించుకోకుండా.. అయితే జబల్పూర్లో భర్త సాహూను కలవడానికి వెళ్లిన్నట్లు తల్లికి చెప్పగా.. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు తెలియజేసింది. నాగ్పూర్ పోలీసులకు భర్తపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో సనా ఖాన్ను హత్య చేసినట్లు వెల్లడించాడు. తన ఇంట్లోనే సనా తలపై తీవ్రంగా కొట్టి చంపేసినట్లు చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని జబల్పూర్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరాన్ నదిలో పడేసినట్లు తెలిపాడు. బాధితురాలి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. జబల్పూర్లోని ఘోరా బజార్ ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అమిత్ షా లిక్కర్ స్మగ్లింగ్ వ్యాపారంలో భాగస్వామిగా ఉంటూ.. రోడ్డు పక్కన ఫుడ్ కోర్టును కూడా నడుపుతున్నాడని పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో సనా, పప్పుల మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
నాగ్పూర్: డ్రైవర్ తప్పిదం 25 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ కోచ్ బస్సు, విద్యుత్ స్తంభాన్ని, ఆపై డివైడర్ను ఢీకొట్టి పడిపోవడంతో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు 25 మంది మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సు డ్రైవర్, క్లీనర్ మరో ఆరుగురు ప్రయాణికులు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని బయటపడ్డారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్ప్రెస్వేపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం చోటుచేసుకుంది. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదర్భ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుణె నుంచి నాగ్పూర్కు 33 మందితో బయలుదేరింది. యావత్మాల్ జిల్లా కరంజా వద్ద భోజనం కోసం ఆగింది. ఆ తర్వాత సిండ్ఖెద్రజాకు సమీపంలోని పింపల్ఖుటా గ్రామం వద్ద 1.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైందని బుల్దానా ఎస్పీ సునీల్ కడాస్నే చెప్పారు. బస్సు రోడ్డు కుడి పక్కన ఇనుప స్తంభాన్ని, ఆపై డివైడర్ను ఢీకొట్టి కుడివైపునకు అంటే ఎంట్రీ డోర్ పైవైపు ఉండేలా పడిపోయింది. డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు అంతటికీ వ్యాపించాయి. ‘ఈ ఘటనకు డ్రైవర్ తప్పిదమే కారణమని భావిస్తున్నాం. నిద్రమత్తులో ఉండటం వల్లే బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు కనిపిస్తోంది. డ్రైవర్ చెబుతున్న విధంగా ఘటనకు టైర్ పేలడం కారణం కాదు. అందుకు తగిన ఆధారాలేవీ రోడ్డుపై కనిపించలేదు’ అని అమరావతి రీజినల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంతెలిపింది. పోలీసులు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. వాహనదారులు సాయం చేసుంటే.. బస్సు కిటికీ అద్దాలు పగులగొట్టి బయటకు వచి్చన ప్రయాణికులు తమ అనుభవాలను వివరించారు. బస్సు నుంచి బయటపడ్డాక అటుగా వెళ్తున్న వాహనదారులను మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని కోరామన్నారు. ఎవరూ పట్టించుకోలేదని, ఆగకుండానే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా స్పందించి ఉంటే కొన్ని ప్రాణాలనైనా కాపాడి ఉండేవారమని చెప్పారు. మంటలు ఎగిసిపడుతుండటంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడలేక నిస్సహాయతతో చూస్తుండి పోవాల్సి వచి్చందని సమీప గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను బుల్దానా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులు గుర్తుపడితే వారికి అప్పగిస్తాం. లేనిపక్షంలో డీఎన్ఏ పరీక్షలు జరిపిస్తామని అధికారులు అన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘటనాస్థలిని సందర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. Maharashtra | At least 25 people feared dead and several injured after a bus carrying 32 passengers burst into flames on Samruddhi Mahamarg expressway in Buldhana. The injured are being shifted to Buldhana Civil Hospital: Dy SP Baburao Mahamuni, Buldhana (Warning: Disturbing… pic.twitter.com/NLo8pcqpz3 — ANI (@ANI) July 1, 2023 ఇది కూడా చదవండి: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి -
36 ఏళ్లు పురుషుడు ప్రెగ్నెంట్? 36 ఏళ్లుగా కవలలు కడుపులోనే..!
నాగ్పూర్: మహారాష్ట్రకు చెందిన ఓ పురుషుడు ప్రెగ్నెంట్ అయ్యాడు. అతని కడుపులో ఏకంగా కవలలు ఉన్నారు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? ఓ అరుదైన వ్యాధి కారణంగా నాగ్పూర్కు చెందిన ఓ వ్యక్తి గత 36 ఏళ్లుగా ఇద్దరు కవలలను కడుపులో మోస్తున్నాడు. అతని పేరు భగత్(60). నాగ్పూర్లో నివాసం ఉంటున్నాడు. జీవన పోషణకు ఏదో పని చేసుకుంటూ ఉండే మధ్యతరగతి వ్యక్తి. కొన్నేళ్ల క్రితం నుంచి అతని కడుపు పెరగడం ప్రారంభించింది. ఎంతగా అంటే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేంతలా పెరిగిపోయింది. కడుపు లావుగా ఉండటంతో చుట్టుపక్కల వాళ్లు హేళన చేసేవారు. అందరూ అతన్ని ప్రెగ్నెంట్ మ్యాన్ అంటుండేవారు. భగత్ చివరికి 1999లో ముంబయిలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. డా. అజయ్ మెహతా ఆ కండీషన్ ట్యూమర్ అనుకున్నారు. కానీ ఆపరేషన్లో ఓ పెద్ద క్యాన్సర్ కణితి అని భావించారు. పూర్తిగా చూస్తే అతని కడుపులో మానవ దేహానికి సంబంధించిన భాగాలు ఉండే సరికి షాక్కు గురయ్యారు. అయితే.. ఈ కేసులో తాను అనుకోని దృశ్యాలను చూశానని డాక్టర్ మెహతా చెప్పారు. కడుపులో ఎముకలు, వెంట్రుకలు, దవడ వంటి శరీర భాగాలు బయటపడ్డాయని వెల్లడించారు. ఈ వ్యాధిని ఫోయిటస్ ఇన్ ఫోయిటస్(పిండంలో పిండం) అంటారని తెలిపారు. ఫోయిటస్ ఇన్ ఫోయిటస్ అనగా పిండంలో మళ్లీ ఓ పిండం పెరగడం అంటారని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇది ఓ అరుదైన వ్యాధి అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఇకపై బస్సు డ్రైవర్, కండక్టర్ల ఫోన్లు చెకింగ్.. ఎందుకంటే..? -
మోదీ మంచి మిత్రుడు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, నీతి ఆయోగ్ వంటి సమావేశాల్లో తాము ఆలోచనలు పంచుకోవడంలో వింతేమీ లేదని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కేంద్రం మీ పథకాలు కాపీ కొడుతోందని నాగ్పూర్లో కొందరు మీడియా ప్రతినిధులు అనడంతో కేసీఆర్ పై విధంగా స్పందించారు. మా ఎజెండాతో కలిసి వచ్చే వారితో కలిసి పనిచేస్తామని, విపక్షాల ఐక్యతపై సందర్భాన్ని బట్టి ఆలోచిస్తామని తెలిపారు. మహారాష్ట్రలోని నాగపూర్లో గురువారం బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. గతంలో ఫ్రంట్లతో ఫలితం సాధించలేక పోయాం.. ‘గతంలో యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ లాంటివి అనేకం చూసినా ఫలితం సాధించలేకపోయాం. మాది ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీగా మారాం. ఓట్ల చీలిక బీజేపీకి అనుకూలిస్తుందనే వాదనతో మాకు సంబంధం లేదు. ఎవరికో బీ టీమ్, సీ టీమ్ అనే విమర్శలు మాకు అక్కరలేదు. దేశ ప్రజల కోసమే మా పార్టీ పనిచేస్తుంది. మహారాష్ట్రలోనూ పొత్తుల గురించి మేము ఆలోచించడం లేదు. అవసరమవుతుందని అనుకోవడం లేదు. మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం. గెలుపోటములతో సంబంధం లేకుండా సంపూర్ణ లక్ష్యం చేరుకునే వరకు మా ప్రయాణం సాగుతుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. నాగ్పూర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అభివాదం చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో బాల్కసుమన్, తోట చంద్రశేఖర్, కేకే, బీబీ పాటిల్, జీవన్రెడ్డి విపక్ష నేతలపై ఐటీ దాడులు సరికాదు ‘దేశంలో అనేక చోట్ల ప్రత్యేక రాష్ట్రాల కోరిక ఉంది. మిథిలాంచల్ ఏర్పాటుకు ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతున్నాయి. రాష్ట్రాల ఏర్పాటులో శాస్త్రీయ విధానం కావాలి. దేశంలో మరో పది పన్నెండు రాష్ట్రాలు ఏర్పడితే ఏమవుతుంది? కొత్త రాష్ట్రాలు ఏర్పడితే విదర్భ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుంది. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టే మా పార్టీ కార్యకలాపాలు మహారాష్ట్ర నుంచి ప్రారంభించాం. గతంలో తెలంగాణ రైతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు 14 రాష్ట్రాల వారు తెలంగాణలో పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ తరహాలో మహారాష్ట్రలోనూ అభివృద్ధి జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో విపక్ష నేతలపై ఐటీ దాడులు సరికాదు. పార్టీలు బ్రతికి ఉంటేనే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది. అప్పుడే మోదీ సహా పార్టీలకు అవకాశాలు లభిస్తాయి. పార్టీలను వేధించకుండా బ్రతకనివ్వాలి. ఐటీ దాడులను ఖండిస్తున్నాం..’ అని అన్నారు. విమానాలు అందరికీ అందుబాటులోకి రావాలి.. ‘మహిళల భాగస్వామ్యంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడాదిలోపే పార్లమెంటుతోపాటు అసెంబ్లీల్లోనూ స్త్రీలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేస్తాం. రైతులను అసెంబ్లీ, పార్లమెంటుకు పంపిస్తాం. పార్టీలో చేర్చుకునేందుకు మహారాష్ట్రకు ప్రైవేటు విమానం పంపడం తప్పేమీ లేదు. అది మా పార్టీ విమానం. నేను అందులోనే వెళ్తున్నా. అమెరికాలో రైతుల వద్ద కూడా విమానాలు ఉన్నాయి. ఇక్కడా అందరికీ విమానాలు అందుబాటులోకి రావాలి. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని బీజేపీ నేతలు (బండి సంజయ్) చెప్పడం పెద్ద బక్వాస్’ అని సీఎం అన్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి... ‘మనకంటే అభివృద్ధి చెందిన యూరోపియన్ దేశాలు, అమెరికా గతంలో ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించినా తిరిగి బ్యాలెట్ విధానం పాటిస్తున్నాయి. ఇక్కడా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నందున బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి. భారత్ పనితీరులో మార్పు కోసం రాజ్యాంగంతో పాటు ఆర్థిక, న్యాయ, పాలన, ఎన్నికల రంగాల్లో వ్యవస్థాగత మార్పులు రావాలి. మూస విధానాల నుంచి బయట పడకుంటే ప్రపంచంతో పోటీ పడలేం. దేశ జల, విద్యుత్ విధానాల్లోనూ మార్పులు రావాల్సిన అవసరముంది. ఎయిర్ పోర్టులు, పోర్టులు, రోడ్లు, రైల్వే వ్యవస్థల్లో మౌలిక వసతులు పెరుగుదల.. దేశంలో గుణాత్మక మార్పుతోనే సాధ్యం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ రంగాలను మెరుగు పరుస్తాం. త్వరలో ఢిల్లీలో మా మేనిఫెస్టోను ప్రకటిస్తాం. దేశంలో దళితుల అభ్యున్నతి, ఉచిత విద్య వంటివి ఇందులో ఉంటాయి. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ సరికాదు, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా ప్రభుత్వ రంగంలోనే కొత్త ప్లాంట్లు నిర్మిస్తున్నాం. లోపాలు సరిదిద్దితే ఆర్థిక రంగం మెరుగవుతుందనే భావనతో మేము తీసుకున్న నిర్ణయాలు తెలంగాణలో ఆర్థిక వృద్ధికి దోహదం చేశాయి. దేశంలో మార్పులకు గడువేమీ పెట్టుకోలేదు, మా లక్ష్యం సాధించే వరకు పోరాటం కొనసాగుతుంది..’ అని కేసీఆర్ వెల్లడించారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపు చేయనందు వల్లే ధరలు పెరుగుతున్నాయని, చట్ట సభల్లో చర్చ లేకుండా బిల్లులు ఆమోదం జరగడం వంటి అంశాల్లో మార్పులు రావాలని అన్నారు. -
పార్టీలు కాదు.. ప్రజలు గెలవాలి: సీఎం కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, నాగపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీడ్ పెంచారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్లాన్స్ చేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాగపూర్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఇక, గత నెల 22న మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాగా, బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభోతవ్సం అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. మరో 6 నెలల్లో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడమే పార్టీల లక్ష్యమైపోయింది. కర్ణాటకలో ప్రభుత్వం మారినా ఏమైనా మార్పు జరిగిందా?. పరివర్తన లేనప్పుడు ఎవరు గెలిస్తే ఏంటి?. మహారాష్ట్రలో ఎన్నో నదులున్నా వ్యవసాయానికి నీళ్లు లేవు. లక్ష్యం లేని సమాజం, దేశం ఏ దిశగా పయనిస్తాయి. 75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా ప్రజలకు కూడు, గూడు కరువే అయ్యింది. ఈ దేశంలో ఏం జరుగుతోంది?.. అసలు భారత్ లక్ష్యమేంటి?. ఆదివాసీలు తమ హక్కుల కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి. దేశ రాజకీయాల్లో మార్పు కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు. ఆలోచన విధానం మారనంత వరకు దేశంలో మార్పు రాదు. దేశంలో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించే వనరులున్నాయి. ఇన్ని వనరులు ఉన్నా దేశంలో ఇంకా విద్యుత్ సంక్షోభం ఎందుకు అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంట్లో ఐటీ సోదాలు.. రంగంలోకి ఈడీ -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, ముంబై: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఎన్హెచ్-44పై ఎద్దులను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో జోగు రామన్న స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పండ్రకవడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్హెచ్-44పై ఎద్దులను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రామన్నకు స్వల్పగాయాలయ్యాయి. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎమ్మెల్యే రామన్న, మాజీ ఎంపీ నగేష్ ఉన్నారు. అయితే, వీరు నాగపూర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం, ఎమ్మెల్యే జోగు రామన్న మరొక వాహనంలో నాగపూర్ వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఎస్బీఎమ్ బ్యాంక్కు రూ.88.70 లక్షలు ఫైన్: ఎందుకంటే?
మొన్నే భర్తను తిట్టింది.. ఇప్పుడేమో పెళ్లి వీడియో.. అంతలోనే..
రింకూ సెలక్ట్ కాకపోవడానికి కారణం అదే: ఆర్పీ సింగ్
ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..
Telangana Lok Sabha Elections Exit Poll 2024: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్: ఊహించని ఫలితాలు
నో డౌట్ పక్కా సీఎం జగన్
ఢిల్లీ పీఠం ఎవరిది..? ఎగ్జిట్ పోల్స్ సంచలనం..
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఏపీలో మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనమే
దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ దూరం.. రేవంత్కు బహిరంగ లేఖ
సోనియా వల్లే ఆత్మహత్యలు.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
Advertisement