Namibia
-
నమీబియాకు తొలి అధ్యక్షురాలు
నమీబియా ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించింది. నెటుంబో నండీ ఎండైట్వా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పీఠం అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. నమీబియా స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి 30 ఏళ్లుగా స్వాపో పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. నమీబియాలో అధ్యక్ష పదవికి, నేషనల్ అసెంబ్లీకి విడిగా ఓటింగ్ జరుగుతుంది. 72 ఎండైట్వా 57 శాతం ఓట్లు సాధించారు. శాంతి, సుస్థిరత కోసం దేశం ఓటేసిందని ఫలితాల అనంతరం ఆమె అన్నారు. 1960ల్లో దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్వాపో పార్టీలో చేరిన ఎండైట్వా విదేశాంగ శాఖ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. 96 స్థానాలకు స్వాపో పార్టీ 51 స్థానాలు గెలిచి మెజారిటీ సాధించింది. ఇండిపెండెంట్ పేట్రియాట్స్ ఫర్ ఛేంజ్ (ఐపీసీ) పార్టీ 20 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఎన్నికల ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందని, ఫలితాలను కోర్టులో సవాలు చేస్తామని ఆ పార్టీ తెలిపింది. నిష్కళంక నేత ఎన్ఎన్ఎన్ అని పిలుచుకునే ఎండైట్వా పార్టీలో దిగ్గజ నేత. ఆఫ్రికా ఖండంలోని అతి కొద్ది నాయకురాళ్లలో ఒకరు. దేశ స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి ఏదో ఒక పదవిలో ఉంటూ వస్తున్నారు. పాస్టర్ కూతురు అయిన ఆమె గొప్ప రాజనీతిజ్ఞురాలిగా ఎదిగారు. గత ఫిబ్రవరిలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆర్థిక దౌత్యాన్ని ఉపయోగించి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగాలను సృష్టిస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. పార్టీలోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగారు. నిష్కళంక నేతగా ఆమెకున్న ప్రతిష్ట ఎన్నికల్లో గెలుపు వైపు నడిపించింది. బలమైన గ్రామీణ మూలాలతో 30 లక్షల మంది జనాభా ఉన్న నమీబియా ప్రధానంగా యురేనియం, వజ్రాల ఎగుమతిదారు. దేశంలో మెరుగైన మౌలిక సదుపాయాలు లేవు. నిరుద్యోగం అధికం. దేశ సంపద స్థానికులకు ఉపయోగపడటం లేదు. 15–34 ఏళ్ల మధ్య వయసు్కల్లో నిరుద్యోగం 46 శాతముంది. ఇది జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. అధిక నిరుద్యోగం, అసమానతల కారణంగా స్వాపో పార్టీ గెలుపు కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బలమైన మూలాలు స్వాపోకు కలిసొచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీస్ మెరుపు బ్యాటింగ్.. లూసియా కింగ్స్ ఘన విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్తో ఇవాళ (సెప్టెంబర్ 16) జరిగిన మ్యాచ్లో సెయింట్ లూసియా కింగ్స్ 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. డేవిడ్ వీస్ మెరుపు ఇన్నింగ్స్తో (26 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించగా.. అకీమ్ అగస్ట్ (35), జాన్సన్ చార్లెస్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డుప్లెసిస్ (14), రోస్టన్ ఛేజ్ (0), టిమ్ సీఫర్ట్ (13), భానుక రాజపక్స (1) తక్కువ స్కోర్లకే ఓటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో క్రిస్ గ్రీన్ 4, షమార్ స్ప్రింగర్ 3, కోఫి జేమ్స్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్ను కింగ్స్ స్పిన్నర్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఖారీ పియెర్ (4-1-24-3), రోస్టన్ ఛేజ్ (3-1-15-1), నూర్ అహ్మద్ (4-0-13-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఫాల్కన్స్ పతనాన్ని శాశించారు. వీరి ధాటికి ఫాల్కన్స్ 28 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, 8 వికెట్ల నష్టానికి 125 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను ముగించింది. ఆఖర్లో క్రిస్ గ్రీన్ (48).. షమార్ స్ప్రింగర్ (24), రోషన్ ప్రైమస్ (17 నాటౌట్) సహకారంతో ఫాల్కన్స్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. చదవండి: ఇంగ్లండ్పై ఐర్లాండ్ సంచలన విజయం -
Namibia's drought crisis: నాడు ఆహ్లాదం..నేడు ఆహారం
సాక్షి, అమరావతి: నమీబియాలో కరువు విజృంభిస్తోంది. గడిచిన శతాబ్దంలో ఎన్నడూ లేనంతగా దుర్భిక్షం తాండవిస్తోంది. ఇది మనుషుల నుంచి వన్య ప్రాణులకు వరకు కబళిస్తోంది. నైరుతి ఆఫ్రికాలోని నమీబియా..వన్యప్రాణులతో కూడిన ఉద్యానవనాలు, సఫారీలకు పెట్టింది పేరు. ఒకప్పుడు స్వేచ్ఛగా విహరిస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచిన వన్యప్రాణులు ఇప్పుడు కరువు కారణంగా మనుషులకు ఆహారంగా మారుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో మేత, నీళ్లు లభించక వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. దీనిని అరికట్టేందుకు అధిక వన్యప్రాణి జనాభా కలిగిన ఉద్యానవనాల్లోని జీవులను అక్కడి ప్రభుత్వం వధిస్తోంది. వాటిని చంపడం ద్వారా ఉద్యానవనాల్లో మేత, నీళ్ల సమస్యలను తగ్గించి పేద ప్రజలకు ఆహారంగా వినియోగిస్తున్నట్లు ప్రకటించింది. సంఖ్యను తగ్గిస్తూ..జంతువులను వధిస్తూ నమీబియాలో ఏటా వచ్చే కరువు ఈసారి మరింత తీవ్రంగా మారింది. గతంలో కరువు ముప్పు నుంచి ఉద్యానవనాలను తప్పించేందుకు జంతువులను ప్రభుత్వం వేలం వేసేది. వచి్చన సొమ్ముతో ఉద్యానవనాలను నిర్వహించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి చేయిదాటిపోవడంతో ఏనుగులు, హిప్పోలు, జీబ్రాలతో సహా అనేక జంతువులను వధించేలా నమీబియా లైవ్లీహుడ్ వల్నెరబిలిటీ అసెస్మెంట్ అండ్ ఎనాలిసిస్ రిపోర్ట్ను అక్కడి ప్రభుత్వం తీసుకువచి్చంది. దీంతో 83 ఏనుగులు, 30 హిప్పోలు, 100 ఎలాండ్స్, 300 జీబ్రాలతో సహా సుమారు 700కు పైగా జంతువులను వధించడానికి చర్యలు తీసుకుంది. జంతువుల సంఖ్య అధికంగా ఉన్న నేషనల్ పార్కులలో మేత, నీరు సరిపోవడం లేదు. మేత కరువును, నీటి లభ్యతను నివారించడంలో ఈ వన్యప్రాణుల సంఖ్యను తగ్గించే విధానం తమకు సహాయపడుతుందని నమీబియా ప్రభుత్వం భావిస్తోంది. హెచ్చరికలు..ఆంక్షలు నమీబియాలో దుర్భిక్షంతో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. దేశంలో మే నెలలో అత్యవసర పరిస్థితిని విధించారు. 30 లక్షల మంది జనాభాలో దాదాపు సగం మంది ప్రజలు తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఆహారం దొరక్క ఏనుగులు, ఇతర వన్యప్రాణులు మనుషులపై దాడులు చేసే పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే వన్య ప్రాణులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. రాత్రిపూట ఆయా ప్రదేశాల్లో తిరగడం, నదుల్లో ఈత కొట్టడం, స్నానాలు చేయడం, పశువులను విచ్చలవిడిగా వదిలిపెట్టడం చేయవద్దని హెచ్చరికలు జారీ చేస్తోంది. నమీబ్ నౌక్లఫ్ట్ పార్క్, మంగెట్టి నేషనల్ పార్క్, బ్వాబ్వాటా నేషనల్ పార్క్, ముడుమో నేషనల్ పార్క్, న్కాసా రూపారా నేషనల్ పార్కుల్లోని వన్యప్రాణులను తీసుకువచ్చి వధించి..పేదలకు ఆహారంగా అందిస్తోంది. -
నమీబియా ఓపెనర్ అరుదైన ఫీట్.. టీ20 వరల్డ్కప్ చరిత్రలోనే
నమీబియా ఓపెనర్ నికోలాస్ డేవిన్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. టీ20 వరల్డ్కప్ చరిత్రలో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా డేవిన్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా శనివారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన డేవిన్.. ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అనంతరం 123 పరుగుల లక్ష్యచేధనలో నమీబియా ఓపెనర్గా వచ్చిన డేవిన్ తడబడ్డాడు. ఇంగ్లీష్ పేసర్లను ఎదుర్కొనేందుకు డేవిన్ తీవ్రంగా శ్రమించాడు. తన ఆడిన 16 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్.. డెవిన్ వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో డెవిన్ రిటైర్ట్ ఔట్గా డగౌట్కు చేరాడు. అతడి తన స్ధానంలో డేవిడ్ వైస్ క్రీజులోకి వచ్చాడు. అయితే 17 ఏళ్ల టీ20 వరల్డ్కప్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇలా రిటైర్డ్ అవుట్గా వెనుదిరగలేదు. ఇక ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నమీబియాపై 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. -
T20 World Cup 2024: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్రౌండర్
నమీబియా స్టార్ ఆల్రౌండర్ డేవిడ్ వీస్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్కప్ 2024లో ఇంగ్లండ్ చేతిలో తన జట్టు ఓటమి అనంతరం వీస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 39 ఏళ్ల వీస్.. 2013లో సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేసి 2016 వరకు ఆ జట్టు తరఫున ఆడాడు. అనంతరం వీస్ తన తండ్రి జన్మస్థలమైన నమీబియాకు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు (2021 ఆగస్ట్ నుంచి). 2016 టీ20 వరల్డ్కప్లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన వీస్.. 2021, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో నమీబియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. వీస్ నమీబియా తరఫున ఆడుతూ ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఐసీసీ టోర్నీల్లో నమీబియా సాధించిన మొట్టమొదటి విజయంలో (2021 టీ20 వరల్డ్కప్లో నెదర్లాండ్స్పై) వీస్ కీలకపాత్ర పోషించాడు.రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన వీస్ తన 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 15 వన్డేలు, 51 టీ20లు ఆడి 73 వికెట్లు పడొట్టాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన వీస్ తన అంతర్జాతీయ కెరీర్లో దాదాపు 1000 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ద సెంచరీలు ఉన్నాయి.అంతర్జాతీయ కెరీర్తో పోలిస్తే ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ కెరీర్లో ఘనమైన రికార్డు కలిగిన వీస్.. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 162 లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడి దాదాపు 10000 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 54 అర్దసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్లో వీస్ ఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లలో కలిపి 490 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లోనూ వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన వీస్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్ల్లో ఆడుతున్నాడు. -
T20 World Cup 2024: చెలరేగిన బ్రూక్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపు
టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8 అవకాశాలను ఇంగ్లండ్ సజీవంగా ఉంచుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్.. నమీబియాను ఓడించింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో 10 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ను హ్యారీ బ్రూక్ (20 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్స్టో (18 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో సాల్ట్ (8 బంతుల్లో 11; 2 ఫోర్లు), మొయిన్ అలీ (6 బంతుల్లో 16; 2 సిక్సర్లు), లివింగ్స్టోన్ (4 బంతుల్లో 13; 2 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. జోస్ బట్లర్ డకౌటయ్యాడు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మన్ 2, డేవిడ్ వీస్, బెర్నాల్డ్ స్కోల్జ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 123 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. ఇంగ్లండ్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇంగ్లండ్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.నమీబియా ఇన్నింగ్స్లో వాన్ లింగెన్ 33, నికోలాస్ 18 (రిటైర్డ్ హర్ట్), డేవిడ్ వీస్ 27 (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సూపర్-8 అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. నమీబియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ సూపర్-8కు చేరాలంటే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో స్కాట్లాండ్ భారీ తేడాతో ఓడాల్సి ఉంది. -
చరిత్ర సృష్టించిన ఆడమ్ జంపా.. తొలి ఆసీస్ ప్లేయర్గా రికార్డు
టీ20 వరల్డ్కప్-2024లో ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అదరగొడుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం పసికూన నమీబియాతో జరిగిన మ్యాచ్లో జంపా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో నమీబియా బ్యాటర్లను జంపా తన మయాజాలంతో ముప్పుతిప్పులు పెట్టాడు. జంపా తన 4 ఓవర్ల కోటాలో 12 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో జంపా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి ఆస్ట్రేలియా బౌలర్గా జంపా రికార్డులకెక్కాడు. నమీబియా బ్యాటర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ను అవుట్ చేయడంతో జంపా ఈ అరుదైన ఫీట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 83 మ్యాచ్లు ఆడిన జంపా.. 100 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన జంపా 8 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నమీబియాను 9 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 73 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 5.4 ఓవర్లలో ఛేదించింది. -
నమీబియాను చిత్తు చేసిన ఆసీస్.. సూపర్-8కు అర్హత
టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్-బిలో ఉన్న కంగారూ జట్టు ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో ఒమన్ను ఓడించిన మార్ష్ బృందం.. మరుసటి మ్యాచ్లో ఇంగ్లండ్ను 36 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తాజాగా బుధవారం(భారత కాలమానం ప్రకారం) నాటి మ్యాచ్లో నమీబియాను మట్టికరిపించింది. తద్వారా గ్రూప్-బి టాపర్గా నిలిచి.. సూపర్-8కు అర్హత సాధించింది ఆస్ట్రేలియా.వెస్టిండీస్లోని ఆంటిగ్వా వేదికగా నమీబియా- ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, కంగారూ జట్టు బౌలర్ల ధాటికి నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది.జోష్ హాజిల్వుడ్ దెబ్బకు ఓపెనర్లు మైకేల్ వాన్ లింగెన్ 10, నికో డెవిన్ 2 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్డౌన్ బ్యాటర్ జాన్ ఫ్రిలింక్(1) ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో వెనుదిరిగాడు.ఈ క్రమంలో గెర్హార్డ్ ఎరాస్మస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 43 బంతుల్లో 36 పరుగులతో ఉన్న అతడిని మార్కస్ స్టొయినిస్ అవుట్ చేయడంతో నమీబియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం తారస్థాయికి చేరింది.తర్వాతి స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు వరుసగా 3, 1, 1, 7, 0, 2(నాటౌట్), 0 పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా దెబ్బకు పెవిలియన్కు క్యూ కట్టేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో 17 ఓవర్లలో కేవలం 72 పరుగులకే ఆలౌట్ అయింది నమీబియా.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఒక వికెట్ మాత్రమే కోల్పోయి పని పూర్తి చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లోనే 20 పరుగులతో దుమ్ములేపాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 17 బంతుల్లో 34, కెప్టెన్ మిచెల్ మార్ష్ 9 బంతుల్లో 18 రన్స్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఈ క్రమంలో 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్.. నమీబియాను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి.. నెట్ రన్రేటును భారీగా మెరుగుపరుచుకుంది. వరల్డ్కప్-2024 ఎడిషన్ గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా తర్వాత.. సూపర్-8కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
స్కాట్లాండ్ బోణీ
బార్బడోస్: టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో స్కాట్లాండ్ తొలి విజయం నమోదు చేసింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్లో స్కాట్లాండ్ ఐదు వికెట్ల తేడాతో నమీబియాపై నెగ్గింది. ఇంగ్లండ్–స్కాట్లాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... ఈ గెలుపుతో స్కాట్లాండ్ మూడు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానంలోకి వెళ్లింది.స్కాట్లాండ్ తో పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. కెపె్టన్ ఎరాస్మస్ (31 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. బ్రాడ్ వీల్ 3, బ్రాడ్ కరీ 2 వికెట్లు తీశారు. అనంతరం స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ బెరింగ్టన్ (35 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మైకేల్ లీస్క్ (17 బంతుల్లో 35; 4 సిక్స్లు) దూకుడుగా ఆడి స్కా ట్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. టి20 ప్రపంచకప్లో నేడున్యూజిలాండ్ X అఫ్గానిస్తాన్వేదిక: గయానా; ఉదయం గం. 5 నుంచిబంగ్లాదేశ్ X శ్రీలంక వేదిక: డాలస్; ఉదయం గం. 6 నుంచిదక్షిణాఫ్రికా X నెదర్లాండ్స్వేదిక: న్యూయార్క్; రాత్రి గం. 8 నుంచిఆ్రస్టేలియా X ఇంగ్లండ్ వేదిక: బ్రిడ్జ్టౌన్; రాత్రి గం. 10:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2024: నమీబియాను చిత్తు చేసిన స్కాట్లాండ్..
టీ20 వరల్డ్కప్-2024లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బార్బోడస్ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్(52) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. గ్రీన్(28), డావిన్(20) పరుగులతో రాణించారు. స్కాట్లాండ్ బౌలర్లలో వీల్ 3 వికెట్లు పడగొట్టగా.. కుర్రీ రెండు, సోలే, గ్రీవ్స్, లీస్క్ తలా వికెట్ సాధించారు.రాణించిన కెప్టెన్, లీస్క్..అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్కాటీష్ కెప్టెన్ బెర్రింగ్టన్(47) ఆఖరి వరకు క్రీజులో నిలబడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ఆల్రౌండర్ మైఖేల్ లీస్క్(35) పరుగులతో రాణించాడు. ఇక నమీబియా బౌలర్లలో కెప్టెన్ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్కోల్జ్, రుబీన్, లుంగమినీ తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన మైఖేల్ లీస్క్కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దగ్గింది. -
ప్రపంచకప్ 2024లో నేటి (జూన్ 6) మ్యాచ్లు.. తొలి మ్యాచ్ ఆడనున్న పాక్
టీ20 వరల్డ్కప్ 2024లో ఇవాళ (జూన్ 6) రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. డల్లాస్ వేదికగా జరుగనున్న తొలి మ్యాచ్లో యూఎస్ఏ, పాకిస్తాన్.. బార్బడోస్లో జరుగునున్న రెండో మ్యాచ్లో నమీబియా, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి. పాకిస్తాన్-యూఎస్ఏ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు.. నమీబియా-స్కాట్లాండ్ మ్యాచ్ మధ్య రాత్రి 12:30 గంటలకు మొదలవుతాయి. ఈ ప్రపంచకప్లో పాకిస్తాన్కు ఇవాళ ఆడబోయే మ్యాచ్ తొలి మ్యాచ్ కాగా.. యూఎస్ఏ ఇదివరకే ఓ మ్యాచ్ ఆడింది. కెనడాతో జరిగిన మ్యాచ్లో యూఎస్ఏ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.నమీబియా-స్కాట్లాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-బిలో పోటీపడుతున్న ఈ ఇరు జట్లు ఇదివరకే తలో మ్యాచ్ ఆడాయి. నమీబియా తమ తొలి మ్యాచ్లో ఒమన్పై సూపర్ ఓవర్లో విజయం సాధించగా.. స్కాట్లాండ్-ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం నమీబియా గ్రూప్-బి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. స్కాట్లాండ్ నాలుగో స్థానంలో ఉంది. -
T20 World Cup 2024: ఉత్కం‘టై’న పోరులో నమీబియా ‘సూపర్’ గెలుపు
సూపర్ ఓవర్కు ముందు... నమీబియా గెలిచేందుకు 6 బంతుల్లో 5 పరుగులు కావాలి. క్రీజులో పాతుకుపోయిన ఫ్రయ్లింక్ (48 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఉండటంతో నమీబియా గెలుపు లాంఛనం. కానీ మెహ్రాన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ వల్ల ఆఖరి బంతి బౌల్ అయ్యేసరికి ఒమన్ గెలవాలి! ఫ్రయ్లింక్, గ్రీన్ వికెట్లు తీసిన మెహ్రాన్ 4 పరుగులే ఇచ్చాడు. చివరి బంతికి 2 పరుగులపుడు మెహ్రాన్ చక్కని బంతి వేయగా... వికెట్ కీపర్ మిస్ ఫీల్డింగ్, మిస్ త్రో వల్ల ఒక పరుగు వచ్చి స్కోరు ‘టై’ అయింది. తుది ఫలితం కోసం మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో... ఒమన్ బౌలర్ బిలాల్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో నమీబియా బ్యాటర్లు డేవిడ్ వీస్ తొలి నాలుగు బంతుల్లో 4, 6, 2, 1 కొట్టగా... చివరి రెండు బంతులు ఆడిన ఎరాస్మస్ 4, 4 బాదడంతో ఆ జట్టు వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. విజయం సాధించేందుకు 22 పరుగులు చేయాల్సిన ఒమన్ జట్టు నసీమ్ (2) వికెట్ కోల్పోయి 10 పరుగులే చేయడంతో నమీబియా ‘సూపర్’ విక్టరీ నమోదు చేసింది. బ్రిడ్జ్టౌన్: లాంఛనమైన (ఆఖరి ఓవర్ 6 బంతుల్లో 5 పరుగులు) విజయానికి దూరమైన నమీబియా ‘సూపర్ ఓవర్’తో చేజారిన విజయాన్ని చేజిక్కించుకుంది. ఒమన్ పేసర్ మెహ్రాన్ (3–1–7–3) అసాధారణ బౌలింగ్ను... డేవిడ్ వీస్ ‘షో’ సూపర్ ఓవర్లో మాయం చేసింది. ‘సూపర్ ఓవర్’లో 13 పరుగులు చేసిన వీస్ వెంటనే బౌలింగ్కు దిగి వికెట్ కూడా తీసి 10 పరుగులిచ్చాడు. 20 జట్లు బరిలో ఉన్న ఈ టి20 ప్రపంచకప్లో ‘బోర్’ మ్యాచ్లే బోలెడనుకున్న క్రికెట్ ప్రేక్షకులు, విశ్లేషకుల అంచనాల్ని గ్రూప్ ‘బి’లోని ఈ మ్యాచ్ తారుమారు చేసింది. ఔరా అనిపించేలా ఈ కూనల తక్కువ స్కోర్ల మ్యాచ్ వరల్డ్కప్కే వన్నె తెచ్చింది. సూపర్ ఓవర్లో నమీబియా గెలిచినా... మ్యాచ్ చూసిన ప్రతి మదిని ఒమన్ పోరాటం తాకింది. మొదట బ్యాటింగ్కు దిగిన ఒమన్ జట్టు 19.4 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. ఖాలిద్ కైల్ (39 బంతుల్లో 34; 1 ఫోర్, 1 సిక్స్), జీషాన్ (20 బంతుల్లో 22; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపుల్మన్ (4/21), వీస్ (3/28), కెపె్టన్ గెరార్డ్ ఎరాస్మస్ (2/20) అదరగొట్టారు. తర్వాత నమీబియా కూడా నిరీ్ణత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 109 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. జాన్ ఫ్రయ్లింక్తో పాటు నికోలస్ డేవిన్ (31 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. 3: టి20 ప్రపంచకప్ చరిత్రలో ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలిన మ్యాచ్లు. శ్రీలంక ఆతిథ్యమిచ్చిన 2012 ప్రపంచకప్లో సెప్టెంబర్ 27న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక జట్టు.. అక్టోబర్ 1న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించాయి. -
T20 World Cup 2024: లేటు వయసులోనూ ఇరగదీస్తున్న వీస్
నమీబియా వెటరన్ ఆల్రౌండర్ డేవిడ్ వీస్ (39) లేటు వయసులో అదిరిపోయే ప్రదర్శనలతో ఇరదీస్తున్నాడు. గత కొంతకాలంగా నమీబియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వీస్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్ 2024లోనూ చెలరేగిపోతున్నాడు. వరల్డ్కప్ గ్రూప్-బి పోటీల్లో భాగంగా ఒమన్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో వీస్ ఆల్రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి నమీబియాను గెలిపించాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్లో నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. రెగ్యులర్ మ్యాచ్లో బ్యాట్తో బంతితో సత్తా చాటిన వీస్.. సూపర్ ఓవర్లోనూ ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు.రెగ్యులర్ మ్యాచ్లో తొలుత బంతితో (3.4-0-28-3) రాణించిన వీస్.. ఆ తర్వాత బ్యాట్తోనూ (8 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్) పర్వాలేదనిపించాడు. అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయగా.. సూపర్ ఓవర్లోనూ వీస్ ఇరగదీశాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాట్తో (4 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్, సిక్స్) చెలరేగిన వీస్.. ఆతర్వాత బంతితోనూ (1-0-10-1) రాణించి నమీబియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసినందుకు గాను వీస్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. నమీబియా బౌలర్లలో వీస్తో పాటు ట్రంపెల్మన్ (4-0-21-4), ఎరాస్మస్ (4-0-20-2), స్కోల్జ్ (4-0-20-1) సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్లో ఖలీద్ కైల్ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఒమన్ చేసినన్ని పరుగులే (109) చేయగలిగింది. ఒమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ (3-1-7-3), కెప్టెన్ ఆకిబ్ ఇలియాస్ (4-1-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. బిలాల్ ఖాన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. నమీబియాను విజయతీరాలకు చేర్చేందుకు ఫ్రైలింక్ (45) పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.సూపర్ ఓవర్ విషయానికొస్తే.. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా వీస్, ఎరాస్మస్ (2 బంతుల్లో 8 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. వీస్ ధాటికి 10 పరుగలకే పరిమితమై ఓటమిపాలైంది. -
12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్.. నమీబియా వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్కప్-2024 టోర్నీలోని మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్లోనే 195 పరుగులను ఛేదించి అందరని షాక్కు గురిచేసింది. ఆ తర్వాతి మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్ను పసికూన పపువా న్యూ గినియా ఓడించే అంతా పనిచేసింది.ఇక రెండు మ్యాచ్లు ఒక ఎత్తు. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు. ఒమన్-నమీబియా మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇరు జట్లు సమాన స్ధాయిలో పోరాడడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. సూపర్ ఓవర్లో ఒమన్పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లోలో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 109 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఒమన్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నమీబియా కూడా సరిగ్గా నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సూపర్ ఓవర్లో ఫలితం తేల్చాల్సి వచ్చింది.దంచి కొట్టిన డేవిడ్ వీస్, ఎరాస్మస్..ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగుల చేసింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్ వీస్ 13 పరుగులు చేయగా.. ఎరాస్మస్ 8 పరుగులు చేశాడు. సూపర్ ఓవర్లో బ్యాటింగ్లో అదరగొట్టిన డేవిడ్ వీస్.. బౌలింగ్లో కూడా సత్తాచాటాడు.తొలి రెండు బంతులకు 2, 0 రాగా.. మూడో బంతికి నమీస్ కుషిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండు బంతులకు ఒక్కో పరుగు చొప్పున ఇచ్చి వీస్ జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ ఇచ్చినప్పటికి ఒమన్కు చేయాల్సిన నష్టం వీస్ చేసేశాడు.12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్..కాగా టీ20 వరల్డ్కప్లో సూపర్ ఓవర్ జరగడం ఇది మూడో సారి. చివరగా 2012 టీ20 వరల్డ్కప్లో సూపర్ ఓవర్ జరిగింది. 2012 పొట్టి ప్రపంచకప్లో కాండీ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం తేలింది. అదే వరల్డ్కప్లో వెస్టిండీస్, కివీస్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దారితీసింది. కాగా 2007 టీ20 వరల్డ్కప్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టై అయినప్పటికి సూపర్ ఓవర్ ద్వారా కాకుండా బాల్ అవుట్ ద్వారా ఫలితం తేల్చారు.నమీబియా అరుదైన రికార్డు..ఇక సూపర్ ఓవర్లో విజయం సాధించిన నమీబియా అరుదైన రికార్డు సాధించింది. టీ20 వరల్డ్కప్ టోర్నీలో సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నమీబియా రికార్డులకెక్కింది. ఒమన్తో మ్యాచ్లో సూపర్ ఓవర్లో నమీబియా ఏకంగా 21 పరుగులు సాధించింది.అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2012 టీ20 ప్రపంచకప్లో కివీస్పై సూపర్ ఓవర్లో విండీస్ 19 పరుగులు చేసింది. తాజా మ్యాచ్తో విండీస్ రికార్డును నమీబియా బ్రేక్ చేసింది. -
ప్రపంచకప్లో సంచలనం.. టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్గా
టీ20 వరల్డ్కప్-2024ను నమీబియా విజయంతో ఆరంభించింది. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్తో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది.దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది.దీంతో నమీబియా విజయభేరి మ్రోగించింది. నమీబియా విజయంలో ఆల్రౌండర్ డేవిడ్ వీస్ కీలక పాత్ర పోషించాడు.టీ20 క్రికెట్ చరిత్రలో..ఇక ఈ మ్యాచ్లో నమీబియా పేసర్ ట్రంపెల్మన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఒమన్ బ్యాటర్లకు ట్రంపెల్మన్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆది నుంచే ఒమన్ బ్యాటర్లకు ఈ నమీబియన్ ముప్పుతిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ట్రంపెల్మన్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు.ఈ క్రమంలో ట్రంపెల్మన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా ట్రంపెల్మన్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు జరిగిన 2633 అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఒమన్తో జరిగిన మ్యాచ్లో మొదటి ఓవర్ వేసిన ట్రంపెల్మన్.. వరుసగా ప్రజాపతి, ఇలియాస్ను ఔట్ చేసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్లో ఫలితం! నమీబియా విజయం
టీ20 వరల్డ్కప్-2024లో బార్బడోస్ వేదికగా ఒమాన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. ఒమాన్పై సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం1 0 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన డేవిస్ వీస్ ఒమన్ బ్యాటర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు.చెలరేగిన నమీబియా బౌలర్లు..ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమాన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.వారెవ్వా మెహ్రాన్ ఖాన్..110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. కాగా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు రావడంలో ఒమన్ ఆల్రౌండర్ మెహ్రాన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.ఆఖరి ఓవర్లో నమీబియా విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమవ్వగా.. ఒమన్ బౌలర్ మెహ్రాన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును పోటీలో ఉంచాడు. కానీ దురదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో ఒమన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన మెహ్రాన్ ఖాన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. -
చెలరేగిన నమీబియా బౌలర్లు.. 109 పరుగులకే ఒమన్ ఆలౌట్
టీ20 వరల్డ్కప్-2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఒమన్తో జరుగుతున్న మ్యాచ్లో నమీబియా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. మరి 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒమన్ బౌలర్లు కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. -
T20 World Cup 2024: పసికూనల సమరం.. గట్టెక్కిన నమీబియా
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా నిన్న (మే 30) పసికూనల మధ్య సమరం జరిగింది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా, నమీబియా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో నమీబియా డక్వర్త్ లూయిస్ పద్దతిన 3 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి గినియాను కట్టడి చేశారు. ట్రంపెల్మన్, వీస్. టంగెని లుంగనమెనీ తలో 2 వికెట్లు పడగొట్టగా..బెర్నాల్డ్ స్కోల్జ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. గినియా ఇన్నింగ్స్లో సెసె బౌ (29) టాప్ స్కోరర్గా నిలిచాడు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. తొలుత గినియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో (9/3) ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో మ్యాచ్కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిన నమీబియాకు 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఫ్రైలింక్ (36), జీన్ పియెర్ కొట్జీ (30) బాధ్యతాయుతంగా ఆడటంతో నమీబియా అతి కష్టం మీద 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సవరించిన లక్ష్యాన్ని చేరుకుంది. గినియా బౌలర్లలో అస్సద్ వలా, అలెయ్ నావ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కబువా మొరియా, నార్మన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరగాల్సిన మరో మూడు వార్మప్ మ్యాచ్లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి. -
T20 World Cup 2024: ఫీల్డర్గా మారిన ఆసీస్ చీఫ్ సెలెక్టర్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఫీల్డర్ అవతారమెత్తాడు. నమీబియాతో జరిగిన టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో బెయిలీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఐపీఎల్ విధుల కారణంగా ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు (కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్వెల్, గ్రీన్, స్టోయినిస్) మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు. అతి త్వరలో వీరు జట్టుతో కలుస్తారని సమాచారం. నబీమియాతో మ్యాచ్లో బెయిలీతో పాటు ఆసీస్ ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ కూడా బరిలోకి దిగాల్సి వచ్చింది. వీరిద్దరే కాక ఆసీస్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ కూడా కాసేపు ఫీల్డింగ్ చేశారు. మిచెల్ మార్ష్, హాజిల్వుడ్ విరామం తీసుకున్న సమయంలో వీరు బరిలోకి దిగారు.ఇదిలా ఉంటే, ఆటగాళ్ల కొరత ఉన్నా నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. -
పసికూనపై ప్రతాపం.. రెచ్చిపోయిన హాజిల్వుడ్, వార్నర్
టీ20 వరల్డ్కప్ 2024 వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా నమీబియాతో నిన్న (మే 28) జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు. హాజిల్వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం. హాజిల్వుడ్తో పాటు ఆడమ్ జంపా (4-0-25-3), నాథన్ ఇల్లిస్ (4-0-17-1), టిమ్ డేవిడ్ (4-0-39-1) కూడా సత్తా చాటడంతో పసికూన నమీబియా విలవిలలాడిపోయింది. నమీబియా ఇన్నింగ్స్లో వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (38) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. కెప్టెన్ మార్ష్ 18, ఇంగ్లిస్ 5, టిమ్ డేవిడ్ 23, వేడ్ 12 (నాటౌట్) పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో బెర్నల్డ్ స్కోల్జ్కు రెండు వికెట్లు దక్కగా.. మార్ష్ రనౌటయ్యాడు. బంగ్లాదేశ్, యూఎస్ఏ మధ్య నిన్ననే జరగాల్సిన మరో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైంది. -
నమీబియాపై ప్రతీకారం తీర్చుకున్న నేపాల్
స్థానికంగా జరుగుతున్న టీ20 ట్రై సిరీస్లో నేపాల్ జట్టు బోణీ కొట్టింది. నమీబియాతో ఇవాళ (మార్చి 1) జరిగిన మ్యాచ్లో 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీ తొలి మ్యాచ్లో నమీబియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ (55 నాటౌట్) మెరుపు అర్దసెంచరీతో రాణించాడు. ఆరిఫ్ షేక్ (31), అనిల్ షా (23), గుల్షన్ షా (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. నమీబియా బౌలర్లలో బెన్ షికోంగొ 3, జాక్ బ్రస్సెల్ 2, ట్రంపల్మెన్, లాఫ్టీ ఈటన్, బెర్నాల్డ్ తలో వికెట్ పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. స్మిట్ (50) అర్దసెంచరీతో చెలరేగినా నమీబియాను గెలిపించలేకపోయాడు. ఆఖర్లో జేన్ గ్రీన్ (23), బెర్నాల్డ్ (4 నాటౌట్) సైతం నమీబియాను గెలిపించేందుకు శతవిధాల ప్రయత్నించారు. నేపాల్ బౌలర్లలో కరణ్, సోమ్పాల్, దీపేంద్ర సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అభినాశ్ బొహారా ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
T20I: స్ట్రైక్రేటు ఏకంగా 600..? అంతలోనే..
నమీబియాతో టీ20 మ్యాచ్లో నెదర్లాండ్స్ బ్యాటర్, తెలుగు మూలాలున్న తేజ నిడమనూరు చేసిన పరుగులు కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేదు. అయినా.. అతడి పేరు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఎందుకంటే...?! నేపాల్- నమీబియా- నెదర్లాండ్స్ మధ్య నేపాల్ వేదికగా టీ20 ట్రై సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా నమీబియా- నెదర్లాండ్స్ కీర్తిపూర్ వేదికగా గురువారం తలపడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మైకేల్ లెవిట్ మెరుపు శతకం(62 బంతుల్లో 135 రన్స్) బాదగా.. వన్డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ సూపర్ హాఫ్ సెంచరీ(40 బంతుల్లో 75 పరుగులు) చేశాడు. LEVITT! Maiden T20I century for Michael Levitt! He's only 20 years old and he's just the 2nd Dutcman to acheive the milestone!#NAMvNED | #TheNetherlandsCricket | #KNCB pic.twitter.com/AetJhyZzyo — Netherlands Cricket Insider (@KNCBInsider) February 29, 2024 చిచ్చరపిడుగు పరుగుల విధ్వంసం ఈ క్రమంలో లెవిట్ స్ట్రైక్రేటు 217.74గా నమోదు కాగా.. సైబ్రండ్ స్ట్రైక్రేటు 187.50. మరి తేజ నిడమనూరు స్ట్రైక్రేటు ఎంతో తెలుసా?!.. సరిగ్గా 600. నిజమే.. నమీబియాతో మ్యాచ్లో మూడు బంతులు ఎదుర్కొన్న అతడు మూడు సిక్సర్ల సాయంతో 18 పరుగులు చేశాడు. నెట్టింట చర్చ ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టీ20లలో 600 స్ట్రైక్రేటు వద్ద ఉండగా అవుటైన మొదటి బ్యాటర్ తేజ నిడమనూరేనా అంటూ ఓ నెటిజన్ చర్చకు దారితీశారు. ఇందుకు స్పందనగా మిగతా యూజర్లు తమకు తోచిన సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా వన్డేల్లో ఆండీ మెక్బ్రైన్ అనే క్రికెటర్ ఒక బంతి ఎదుర్కొని సిక్సర్ కొట్టాడని ఓ నెటిజన్ ప్రస్తావించారు. మొత్తానికి అలా తేజ స్ట్రైక్రేటు గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సాధారణంగా ఓ బ్యాటర్ మ్యాచ్లో మొత్తంగా చేసిన పరుగులను వందతో గుణించి, అతడు ఎదుర్కొన్న బంతులతో భాగించి స్ట్రైక్రేటును నిర్ణయిస్తారు. అలా తేజ స్ట్రైక్రేటు 600 అయింది. అదీ సంగతి!! భారీ స్కోరుతో సత్తా చాటి ఇదిలా ఉంటే నమీబియాతో మ్యాచ్లో లెవిట్, సైబ్రండ్ కలిసి రెండో వికెట్కు ఏకంగా 178 పరుగులు జోడించడం విశేషం. నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ టీ20లలో ఇదే అత్యధిక భాగస్వామ్యం. వీరిద్దరి సునామీ ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది. మరోవైపు.. తేజ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగాడు. కాగా 1994లో విజయవాడలో జన్మించిన తేజ నిడమనూరు 2022లో నెదర్లాండ్స్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 30 వన్డేలు, 8 టీ20లు ఆడి వరుసగా 679, 79 పరుగులు చేశాడు. Is Teja Nidamanuru the first batter to be out with a strike rate of 600 in T20 International cricket? @ZaltzCricket — DB Kate (@DutchBKate) February 29, 2024 -
సిక్సర్ల వర్షం.. యువ బ్యాటర్ విధ్వంసకర సెంచరీ
నమీబియాతో టీ20 మ్యాచ్లో నెదర్లాండ్స్ యువ క్రికెటర్ మైకేల్ లెవిట్ దుమ్ములేపాడు. ఇరవై ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎనిమిది సిక్సర్లు, ఏడు బౌండరీల సాయంతో వంద పరుగుల మార్కును అందుకున్నాడు లెవిట్. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఇదే తొలి శతకం. కాగా నేపాల్ వేదికగా నమీబియా- నెదర్లాండ్స్- నేపాల్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా తొలి టీ20లో నేపాల్పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలవగా.. రెండో మ్యాచ్లో నెదర్లాండ్స్ ఆతిథ్య నేపాల్ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఓపెనింగ్ బ్యాటర్ మైకేల్ లెవిట్.. నేపాల్పై అర్ధ శతకం(54) బాదాడు. తాజాగా నెదర్లాండ్స్తో గురువారం నాటి మ్యాచ్లోనూ బ్యాట్ ఝులిపించిన లెవిట్.. 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 62 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. లెవిట్కు తోడు వన్డౌన్ బ్యాటర్ సైబ్రండ్ ఎంగెల్బ్రెట్ అద్భుత అర్థ శతకం(40 బంతుల్లో 75)తో రాణించాడు. ఇద్దరూ కలిసి ఏకంగా రెండో వికెట్కు ఏకంగా 178 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ నేపథ్యంలో లెవిట్, సైబ్రండ్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 247 పరుగులు సాధించింది. కాగా కీర్తిపూర్లో నమీబియాతో జరుగుతున్న ఈ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. ఈ మేరకు భారీ స్కోరు సాధించింది. ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్ తరఫున టీ20లలో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా మైకేల్ లెవిట్ చరిత్రకెక్కాడు. మాక్స్ ఒడౌడ్ లెవిట్ కంటే ముందు పొట్టి ఫార్మాట్లో సెంచరీ సాధించాడు. -
Namibia: చిన్న జట్టే అయినా ఇరగదీసింది.. ఆస్ట్రేలియాకు సైతం సాధ్యం కాలేదు..!
అంతర్జాతీయ టీ20ల్లో పసికూన నమీబియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. పొట్టి ఫార్మాట్లో ఈ జట్టు వరుసగా తొమ్మిది మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. తాజాగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా మాజీ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సైతం సాధ్యంకాని తొమ్మిది వరస విజయాల రికార్డును సాధించింది. తద్వారా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 18వ జట్టుగా రికార్డుల్లోకెక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాల రికార్డు మలేసియా పేరిట ఉంది. ఈ జట్టు జూన్ 2022-డిసెంబర్ 2022 మధ్యలో వరుసగా 13 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లు.. మలేసియా (13 వరుస విజయాలు) బెర్ముడా (13) ఆఫ్ఘనిస్తాన్ (12) రొమేనియా (12) ఇండియా (12) ఆఫ్ఘనిస్తాన్ (11) ఉగాండ (11) పపువా న్యూ గినియా (11) నైజీరియా (11) జెర్సీ (10) టాంజానియా (10) ఉగాండ (10) ఉగాండ (10) పాకిస్తాన్ (10) న్యూజిలాండ్ (10) పోర్చుగల్ (9) సౌదీ అరేబియా (9) నమీబియా (9*) కాగా, ట్రై సిరీస్లో భాగంగా నేపాల్తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్లో నమీబియా 20 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. లాఫ్టీ ఈటన్ (36 బంతుల్లో 101; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఫాస్టెస్ట్ సెంచరీతో (33 బంతుల్లో) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్స్లో ఈటన్తో పాటు మలాన్ క్రుగెర్ (59 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే పరిమితమై 20 పరగుల తేడాతో ఓటమిపాలైంది. రూబెన్ ట్రంపల్మెన్ (4/29) నేపాల్ను దెబ్బకొట్టాడు. నేపాల్ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (42) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ టోర్నీలో రెండో మ్యాచ్ రేపు నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరుగనుంది. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ టోర్నీలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరింది. మస్కట్లో నమీబియాతో జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 7–2తో గెలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్తో భారత్ తలపడుతుంది. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రజని భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. -
3 పిల్లలకు జన్మనిచ్చిన ‘జ్వాల’.. కునోలో చీతా కూనల సందడి
మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో చీతాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా ‘జ్వాల’ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేంధ్ర యాదవ్ పేర్కొన్నారు. ‘కునోలోకి కూన చీతాలు వచ్చేశాయ్..జ్వాల అనే నమీబియా చీతా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆశ అనే చీతా రెండు కూనలకు జన్మనిచ్చిన కొద్ది వారాలకే ఈ సంఘటన జరిగింది. దేశంలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసేవారు, జంతు ప్రేమికులకు ఇది గుడ్ న్యూస్. భారత వన్యప్రాణులు వృద్ది చెందుతున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. తల్లి వద్ద ఆడుకుంటున్న కూన చీతలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియోను షేర్ చేశారు. 2023 మార్చిలో జ్వాలా చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది. కునో నేషనల్ పార్క్లో చీతాల మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా తీసుకొచ్చిన శౌర్య అనే చీత జనవరి 16న మృతిచెందిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు శౌర్య అస్వస్థతకు గురవ్వడం గమనించినట్లు అదనపు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, కునోలోని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. వెంటనే దానికి వైద్యం అందించగా కుదుటపడిందని చెప్పారు, కానీ కాసేపటికే మళ్లీ బలహీనపడి వైద్యానికి స్పందించలేదని, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. చదవండి: విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్’ Kuno’s new cubs! Namibian Cheetah named Jwala has given birth to three cubs. This comes just weeks after Namibian Cheetah Aasha gave birth to her cubs. Congratulations to all wildlife frontline warriors and wildlife lovers across the country. May Bharat’s wildlife thrive… pic.twitter.com/aasusRiXtG — Bhupender Yadav (@byadavbjp) January 23, 2024 ఇక 2022 సెప్టెంబరు 17న ప్రాజెక్టు చీతా’లో భాగంగా మొదటి బ్యాచ్లో ఎనిమిది నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను కునో నేషనల్ పార్క్లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండో బ్యాచ్లో 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునోకు తీసుకొచ్చారు. అయితే మొత్తం 20 చీతాల్లో 8 చనిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 10 చీతాలు( ఏడు పెద్దవి, మూడు కూనలు) మరణించాయి. ఇదిలా ఉండగా గత 75 ఏళ్ల తర్వాత చీతాలు తిరిగి భారత్ గడ్డపై అడుగు పెట్టాయి. -
కునో నేషనల్ పార్క్లో మరో నమిబియా చీతా మృతి
భోపాల్: ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమిబియా దేశం నుంచి తీసుకువచ్చిన మరో చితా ‘శౌర్య’ మధ్య ప్రదేశలోని కునో నేషనల్ పార్క్లో మృతి చెందింది. మంగళవారం 3.17 నిమిషాలకు ‘శౌర్య’ చీతా మరణించినట్లు ప్రాజెక్టు చీతా డైరెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీతా మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని అన్నారు. చీతాకు పోస్ట్ మార్టం చేసి మరణించడాకి గల కారణాన్ని చెబుతామని అన్నారు. ఈరోజు(మంగవారం) ఉదయం నుంచి శౌర్య చీతా చాలా తీవ్ర ఆందోళనకరంగా అస్వస్థతతో ఉన్నట్లు కునో నేషనల్ పార్క్ సిబ్బంది గమనించింది. వెంటనే అధికారులు, పార్క్ సిబ్బంది స్పందించి చీతాకు చికిత్స అందిస్తూ పర్యవేక్షించారు. చీతాకు సీపీఆర్ కూడా అందించారు. కానీ, దురదృష్టవశాత్తు చీతా ‘శౌర్య’ మరణించిందని తెలిపారు. Today, on 16th January, 2024 around 3:17 PM, Namibian Cheetah Shaurya passed away...Cause of death can be ascertained after Post Mortem: Director Lion Project pic.twitter.com/ISc2AlCNcy — ANI (@ANI) January 16, 2024 ప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా సెప్టెంబర్ 17, 2022న నమిబియా నుంచి 8 చీతాలు తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్లో వదిలిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఫిబ్రవరి 18, 2023న మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి కునో పార్క్లో విడిచిపెట్టారు. ఇప్పటివరకు ‘శౌర్య’తో మొత్తం 10 చీతాలు మృతి చెందటం గమనార్హం. చదవండి: ఆప్ మంత్రి వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు -
ప్రపంచకప్కు నమీబియా క్వాలిఫై
-
2024 టీ20 వరల్డ్కప్లో పాల్గొననున్న 20 జట్లు ఇవే..
2024 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోయే 20 జట్లు ఏవేవో నిన్నటితో తేలిపోయాయి. ఆఫ్రికా క్వాలిఫయర్ 2023 పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన నమీబియా, ఉగాండ వరల్డ్కప్కు అర్హత సాధించాయి. టోర్నీలో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన మ్యాచ్లో రువాండపై విజయం సాధించడం ద్వారా ఉగాండ తొలిసారి ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్కప్కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. ఇదే టోర్నీలో నమీబియా టేబుల్ టాపర్గా నిలిచి ప్రపంచకప్కు అర్హత సాధించింది. కాగా 2024 టీ20 వరల్డ్కప్ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికలుగా వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న విషయం తెలిసిందే. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా,సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాల్లో .. యూఎస్ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ ప్రపంచకప్లో పాల్గొనే 20 జట్లలో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్లో టాప్-8లో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్.. టీ20 ర్యాంకింగ్స్లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్కప్కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, ఓమన్, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్కప్కు క్వాలిఫై అయ్యాయి. -
ప్రపంచకప్కు నమీబియా క్వాలిఫై
వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్కు నమీబియా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియన్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్లలో విజయం సాధించి అగ్ర స్థానం ఖాయం చేసుకోవడంతో ఆ జట్టు వరల్డ్ కప్కు క్వాలిఫై అయింది. మంగళవారం జరిగిన పోరులో నమీబియా 58 పరుగుల తేడాతో టాంజానియాను ఓడించింది. నమీబియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. జేజే స్మిట్ (40), మైకేల్ లింజెన్ (30) రాణించారు. అనంతరం టాంజానియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 99 పరుగులే చేయగలిగింది. అమాల్ రాజీవన్ (41 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. వరుసగా మూడో టి20 ప్రపంచకప్కు (2021, 2022, 2024) నమీబియా అర్హత సాధించడం విశేషం. ఇదే టోర్నీలో జరిగిన మరో మ్యాచ్లో రువాండాపై 144 పరుగులతో గెలిచిన జింబాబ్వే తాము కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. 2024 జూన్లో వెస్టిండీస్, అమెరికా ఈ టి20 ప్రపంచకప్కు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. -
జింబాబ్వేకు షాక్.. మరో పసికూన చేతిలో ఘోర పరాభవం
ఐసీసీ సభ్య దేశమైన జింబాబ్వేకు ఊహించని పరాభవం ఎదురైంది. తమ కంటే చిన్న జట్టైన నమీబియా చేతిలో టీ20 సిరీస్ కోల్పోయింది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న నమీబియా.. మూడుసార్లు వన్డే ప్రపంచకప్ ఆడిన జింబాబ్వేను ఓడించి సంచలన సృష్టించింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను నమీబియా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్లో భాగంగా నిన్న జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో నమీబియన్లు 8 పరుగులు తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 18.4 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ కాగా.. జింబాబ్వే 19.2 ఓవర్లలో 93 పరుగులకు చాపచుట్టేసి పరాజయంపాలైంది. రాణించిన సికందర్ రజా.. ఇటీవలికాలంలో ఆల్రౌండర్గా రాణిస్తున్న సికందర్ రజా (జింబాబ్వే) నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్లో బంతితో మెరిశాడు. రజా 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి నమీబియా పతనాన్ని శాశించాడు. రజాతో పాటు చటారా (3/7), నగరవ (2/6), ర్యాన్ బర్ల్ (1/33) కూడా రాణించడంతో నమీబియా 101 పరుగులకే చాపచుట్టేసింది. బ్యాటింగ్లో తేలిపోయిన జింబాబ్వే.. 102 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే ఆది నుంచే తడబుడతూ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 93 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లు బెర్నార్డ్, స్మిట్ చెరో 3 వికెట్లు.. లుంగమెని, ఎరాస్మస్, ఫ్రైలింక్ తలో వికెట్ తీసి జింబాబ్వేను మట్టికరిపించారు. జింబాబ్వే ఇన్నింగ్స్లో లూక్ జాంగ్వే (24) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా, ఈ సిరీస్లో తొలి టీ20 గెలిచిన నమీబియా ఆతర్వాత నాలుగు, ఐదు మ్యాచ్లను గెలిచి సిరీస్ చేజిక్కించుకుంది. -
కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృత్యువాత..
-
కునో నేషనల్ పార్కులోని 6 చీతాలకు రేడియో కాలర్ల తొలగింపు
భోపాల్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు(కేఎన్పీ)లో ఉన్న చీతాల్లో ఆరింటికి రేడియో కాలర్లను తొలగించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. కేఎన్పీ వైద్యులు, నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన నిపుణులు వీటి ఆరోగ్య పరిస్థితిపై పరిశీలన జరుపుతారని వెల్లడించారు. కేఎన్పీలో ప్రస్తుతం 11 చీతాలున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి 5 పెద్ద చీతాలు, 3 కూనలు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేఎన్పీలో ఉన్న ఆరు చీతాల ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని, మరో నాలుగు చీతాలకు ఏర్పాటు చేసిన రేడియో కాలర్లను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. రేడియో కాలర్ల వల్లే చీతాలు మృతి చెంది ఉంటాయనే అనుమానాలున్నాయా అన్న ప్రశ్నకు.. అటువంటిదేమీ లేదని ఆ అధికారి అన్నారు. ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే అవసరమున్న చీతాలకు మాత్రమే రేడియో కాలర్లను తొలగిస్తున్నామని వివరించారు. -
Kuno cheetah deaths: రేడియో కాలర్ మృత్యుపాశమై!
కేంద్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటి ప్రాణాలు కోల్పోతున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా ఎనిమిది చీతాలు మరణించాయి. భారత్లో చీతా ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ఆయన పుట్టిన రోజు నాడు నమీబియా నుంచి తీసుకువచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్క్లో ప్రవేశపెట్టారు. రెండో విడతలో భాగంగా ఈ ఏడాది దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు తీసుకువచ్చారు. మార్చిలో జ్వాల అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. అయితే ఏడాది తిరక్కుండానే ఎనిమిది చీతాలు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల తేజస్, సూరజ్ అనే రెండు చీతాలు మరణించాయి. ఆ చిరుతల రేడియో కాలర్ల కింద గాయాలన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ గాయాల్లో పురుగులు కూడా ఉన్నట్టు వారు నిర్ధారించారు. ఇదే తరహా గాయాలు మరో రెండు చీతాల్లో కూడా ఉండడంతో వాటికి రేడియో కాలర్లు తొలగించి చికిత్స అందిస్తున్నారు. వాటి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రేడియో కాలర్లే చీతాల మృతికి కారణం కావచ్చునన్న అనుమానాలు బలపడ్డాయి. రేడియో కాలర్లలో ఉండే చిప్ ఉపగ్రహాల ద్వారా జంతువులకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. చీతాల భద్రత, సంరక్షణ కోసం వీటి అవసరం చాలా ఉంది. రేడియో కాలర్స్ ఎలా కబళించాయి? ► చీతాల కదలికల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం వాటి మెడకి రేడియో కాలర్స్ కట్టారు. వేసవి కాలంలో చెమట, దురద వల్ల చీతాలు తరచుగా మెడపై గీరుకోవడం వల్ల చీతాలకు గాయాలై అది చర్మ సంబంధితమైన ఇన్ఫెక్షన్కు దారితీసి ప్రాణాలు కోల్పోయి ఉండే అవకాశాలున్నట్టు మధ్యప్రదేశ్ అటవీ సంరక్షణ మాజీ అధికారి అలోక్కుమార్ అభిప్రాయపడ్డారు. ► వర్షాకాలం వచ్చాక వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రేడియో కాలర్స్ కట్టిన మెడ చుట్టూ ఒరుసుకొని పోయి చీతాలకు గాయాలయ్యాయి. ఆ గాయాల మీద క్రిమి కీటకాదులు ముసిరి ఇన్ఫెక్షన్గా మారుతోంది. దీనివల్ల రక్త ప్రసరణకు సంబంధించిన సెప్టిసీమియా అనే పరిస్థితి తలెత్తి చీతాల మరణానికి దారితీసింది. ► ఏదైనా ఒక వస్తువుని సుదీర్ఘకాలం శరీరంపై ఉంచడం వల్ల బ్యాక్టీరీయా సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని జర్నల్ ఆఫ్ క్లినికల్ డయాగ్నస్టిక్ రీసెర్చ్లో తేలింది. ముఖ్యంగా చీతాల మెడ చుట్టూ ఉండే జుట్టు మృదువుగా ఉండడం వల్ల రేడియో కాలర్తో వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ► జంతువులకి వాడే రేడియో కాలర్ బరువు ఆ జంతువు అసలు బరువులో 3% మాత్రమే ఉండాలి. సాధారణంగా రేడియో కాలర్ల బరువు 400 గ్రాముల వరకు ఉంటుంది. 20 నుంచి 60 కేజీల బరువు ఉండే చీతాలకు ఇది సరిపోతుంది. అయితే చీతా మెడ కంటే తల పెద్దది కాదు. దీని వల్ల రేడియో కాలర్ వాటికి అత్యంత బరువుగా అనిపిస్తాయి. చిన్న జంతువులన్నింటిలోనూ ఈ సమస్య ఉంటుంది. రేడియో కాలర్ కట్టడం వల్ల సమస్యలు ఎక్కవయిపోతాయని లండన్లోని రాయల్ వెటర్నరీ కాలేజీ ప్రొఫెసర్ అలన్ విల్సన్ చెప్పారు. ► చీతాలకు గత కొన్ని నెలలుగా రేడియో కాలర్ కట్టే ఉంచారు. కానీ వేసవిలో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. వానలు కురవడం ప్రారంభమయ్యాక చర్మం నిరంతరం తడిగా ఉండడం వల్ల రేడియో కాలర్ గాయాలు మరింత పెద్దవై చీతాలు మృత్యువాత పడ్డాయి. అన్నీ ఒక్క చోటే ఎందుకు ? : సుప్రీం దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో 40% మృత్యువాత పడడం ఆందోళనకంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. చీతాల ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక్కచోటే ఎందుకు ఉంచుతున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్ కునో నుంచి వేరే రాష్ట్రాల్లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు చీతాలను తరలించే మార్గాలను అన్వేషించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్ బి.ఆర్.గవాయ్. జె.బి. పర్దివాలా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్ చెప్పింది. ‘‘చీతాలు మరణించడానికి కారణాలేంటి ? అసలు ఏమిటి సమస్య ? వాతావరణం చీతాలకు అనుకూలంగా లేదా ? ఇంకా ఏమైనా కారణాలున్నాయా ? గత వారంలో రెండు చీతాలు మరణించాయి ? అలాంటప్పుడు అన్ని చీతాలను మధ్యప్రదేశ్ కునోలో ఎందుకు ఉంచాలి ? వాటిని వేరే కేంద్రాలకు ఎందుకు తరలించకూడదు ? అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్రం తరఫున కోర్టుకి హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి త్వరలోనే చీతాల మృతికి గల కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. జులై 29లోగా దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాలు: 8 దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాలు: 12 మార్చిలో పుట్టిన చీతాలు : 4 మృతి చెందిన చీతాలు: 3 కూనలు సహా 8 మిగిలిన చీతాలు :16 – సాక్షి, నేషనల్ డెస్క్ -
చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్కులో చీతాల వరుస మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుండటంతో వాటి పరిరక్షణకు సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు జడ్జీలు.. బీఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్రంపై న్యాయస్తానం పలు ప్రశ్నలు సంధించింది. కాగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి రెండు విడతల్లో మొత్తం 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఓ చీత నాలుగు పిల్లలకుజన్మనివ్వడంతో వీటి సంఖ్య 24కు చేరింది. వీటిలో గత నాలుగు నెల్లలో మూడు కూన చీతాలు సహా 8 మరణించాయి. ప్రస్తుతం 18 చీతాలు ఉండగా వీటిలో మరో రెండిటి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గత వారం రోజుల్లో రెండు చీతాలు మరణించడంపై ధర్మాసనం స్పందిస్తూ.. దీన్ని ఎందుకు ప్రతిష్టాత్మక అంశంగా మారుస్తున్నారని అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించింది. అయితే చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని ఇంకా కునో నేషనల్ పార్క్లోనే ఎందుకు ఉంచారని.. వేరే చోటుకు తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. చదవండి: వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి 20 చీతాల్లో 8 మరణించాయి.. అంటే ఏడాదిలో 40శాతం చీతాలు మృత్యువాత పడ్డాయి. ఇది మంచి సంకేతం కాదు. ఎందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించింది. వాటిని రాజస్థాన్కు తరలించే మార్గాలను పరిశీలించాలని సూచించింది. అయితే వాతావరణ పరిస్థితులు (ట్రాన్స్లోకేషన్) కారణంగా 50 శాతం మరణాలు సాధారణమేనని కేంద్రం ముందుగానే ఊహించిందని కేంద్రం తరఫున ఏసీజీ వాదనలు వినిపించారు. దీనిపై జస్టిస్ పార్దివాలా స్పందిస్తూ.. మరి సమస్య ఏంటి? ఇక్కడి వాతావరణం వాటికి అనుకూలంగా లేదా? కిడ్నీ,శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయా అని ప్రశ్నించారు. అయితే ఇన్ఫెక్షన్లు చీతాల మణాలకు దారి తీస్తున్నాన్నాయని ASG ధర్మాసనానికి తెలియజేశారు. లాగే ప్రతీ చీతా మరణంపై వివరణాత్మక విశ్లేషణ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే రాజస్థాన్లోని అభయారణ్యాలలో ఒకటి చిరుతపులికి ప్రసిద్ధి చెందిందని.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది. చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కు వాయిదా వేసింది. -
Intresting Facts: పేరుకు మాత్రమే చెట్లు.. కానీ అవి చెట్ల సమాధులు
నమ్మలేని నిజాలు.. ఇది మీకు తెలుసా? ► నమీబియాలోని ‘డెడ్ వ్లయ్’లో 900 ఏళ్ల వయసు ఉన్న చెట్లు ఉన్నాయి. అయితే అవి పేరుకు మాత్రమే చెట్లు. పచ్చదనం లేకుండా ఎండిపోయిన చెట్లు! అందుకే దీన్ని ‘చెట్ల ఎడారి’ ‘చెట్ల సమాధులు’ అని పిలుస్తారు. ► చిలకలలో ‘డ్రాకూన్ చిలకలు వేరయా’ అని చెప్పుకోవచ్చు. పపువా న్యూ గినియాలోని రెయిన్ ఫారెస్ట్లో కనిపించే డ్రాకూల ప్యారట్స్ నలుపు, చార్కోల్ గ్రే రంగుల్లో ఉండి కొంచెంచెం భయపెట్టేలా ఉంటాయి. ► నార్వేలో ‘హెల్’ పేరుతో ఒక విలేజ్ ఉంది. టూరిస్ట్ ఎట్రాక్షన్లో భాగంగా ఆ పేరు పెట్టారు! -
ప్రాజెక్ట్ చీతా.. కొత్త పరేషాన్
మధ్యప్రదేశ్లోని ష్యోపూర్లోని కూనో నేషనల్ పార్క్కు సంబంధించిన ఒక వార్త కలకలం రేపుతోంది. కూనో అభయారణ్యంలో చీతాలను స్వేచ్ఛగా విడిచిపెట్టిన తరువాత.. ఆధిపత్యం కోసం, అవి ఉండే స్థల నిర్థారణ కోసం వాటి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అభయారణ్యంలోని పాల్పుర్ బీట్ సమీపంలో నమీబియా, సౌతాఫ్రికా చీతాల మధ్య పోరాటం జరిగింది. ఈ దాడులలో ‘అగ్ని’ అనే చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. దానికి కూనో పాల్పుర్ పశువైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది. కూనో నేషనల్ పార్కులో సౌత్ ఆఫ్రికా,నమీబియాకు చెందిన చిరుతలు ఉన్నాయి. వీటిని ఈ అభయారణ్యంలో విడిచిపెట్టారు. వీటిని వేర్వేరు దిశలలో రిలీజ్ చేశారు. అయితే ఈ విశాల అరణ్యంలో ఉంటున్న ఈ చీతాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు పరస్పరం తలపడుతున్నాయి. ‘అగ్ని’కి ప్రత్యేక వైద్యం.. తాజాగా ఇటువంటి ఘటనే జరిగింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలతో నమీబియాకు చెందిన ‘శౌర్య’, ‘గౌరవ్’లకు మధ్య పోరాటం జరిగింది. ఈ భీకర పోరాటంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘అగ్ని’ తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ చిరుతను మానిటరింగ్ చేస్తున్న టీమ్ దీనిని గమనించి వాటిని వేరుచేసి, వాటిని పాల్పుర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాటికి చికిత్స కొనసాగుతోంది. ఈ చిరుతలో తీవ్రంగా గాయపడిన ‘అగ్ని’కి పశువైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఆగని పోరాటాలు.. కూనో నేషనల్ పార్క్ డీఎఫ్ఓ ప్రకాశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అభయారణ్యంలోని ‘అగ్ని’ అనే ఆడ చీతా గాయపడిందని, దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దాని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కాగా నమీబియా నుంచి కూనో పార్కుకు తీసుకు వచ్చిన ‘శౌర్య’, ‘గౌరవ్’ చిరుతలు కవలలు. అవి భారత్కు వచ్చినప్పటి నుంచి కలివిడిగానే ఉంటున్నాయి. సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలు వేర్వేరుగా మసలుతున్నాయి. ఇరుప్రాంతాలకు చెందిన ఈ చీతాల మధ్య అస్థిత్వం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: అమ్మో..! కుంభకర్ణుడిలా ఏడాదిలో 300 రోజులు నిద్రపోతాడు.. -
చీతాలు.. చింతలు.. కాపాడుకోవడం ఎలా? మూడు నెలల్లో మూడు..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లోనే అంతరించిపోయిన జాబితాలో చేరిపోయిన చీతాల సంతతిని తిరిగి భారత్లో పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీతాల ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మొత్తం 20 చీతాలను తీసుకువచ్చాము. గత మూడు నెలల్లోనే మూడు చీతాలు మరణించడంపై జంతు ప్రేమికుల్లో ఆందోళన నెలకొంది. మూడు చీతాలను మనం కోల్పోయినప్పటికీ మార్చి నెలలో సియాయా అనే చీతా నాలుగు పిల్లలకి జన్మనివ్వడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకెళుతుందన్న ఆశలు ఇంకా అందరిలోనూ ఉన్నాయి. చీతాలను కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందనే చర్చ మొదలైంది. చీతాలను కాపాడుకోవడం ఎలా? ఆఫ్రికా నుంచి తెచ్చిన చీతాల సంతతి పెరగడానికి చాలా ఏళ్లు ఎదురు చూడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. చీతాలకు రేడియో కాలర్ ఏర్పాటు చేసి శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ప్రతీ క్షణం వాటి భద్రతని పర్యవేక్షించడం సంక్లిష్టంగా మారింది. అందుకే వాటిని ఎన్క్లోజర్లకే పరిమితం చేయడంపై వన్యప్రాణుల నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిమితమైన స్థలంలో వాటిని బంధించి ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని వరల్డ్లైఫ్ బయోలజిస్ట్ రవి చెల్లం అభిప్రాయపడ్డారు. మగ, ఆడ చీతాలను ఎన్క్లోజర్ల నుంచి బయటకి తరచూ వదులుతూ ఉండాలని అప్పుడే వాటి సంతతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక వాతావరణపరమైన అడ్డంకుల్ని అధిగమించాలంటే మరిన్ని ఏళ్లు గడవడం తప్ప మరో మార్గం లేదన్నది వన్యప్రాణ నిపుణుల అభిప్రాయంగా ఉంది. రుతుపవనాల సీజన్ ముగిసిన తర్వాత చీతాలను వేరే అడవులకి కూడా తరలించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఎదురవుతున్న సవాళ్లు ► చీతాల మనుగడుకు ఎదురవుతున్న అతి పెద్ద సవాల్ వాతావరణం. మధ్యప్రదేశ్లో కునో జాతీయ ఉద్యానవనంలో వాతావరణం ఆఫ్రికా వాతావరణం కంటే చాలా విభిన్నమైనది. కునోలో వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకు రాల్చే అడవులుంటాయి. ఆఫ్రికాలో గడ్డి మైదానాలు, దట్టమైన వృక్షాలు ఎక్కువ. ఇన్నాళ్లూ అక్కడ వాతావరణానికి అలవాటు పడిన చీతాలకు ఒకేసారి మార్పు రావడం తట్టుకోలేకుండా ఉన్నాయి. మన దేశంలో ఉద్యానవనాలు చీతాలకు నివాసయోగ్యాలుగా మారగలవో లేదోనన్న సందేహాలు కూడా నిపుణుల్లో ఉన్నాయి. ప్రభుత్వం చీతాల ప్రాజెక్టు ప్రారంభించడానికే ముందే జంతు పరిరక్షణ నిపుణులు భారత పర్యావరణ వ్యవస్థకి చీతాలు అలవాటు పడడానికి చాలా ఏళ్లు పడుతుందని హెచ్చరించారు. ► ఇక రెండో పెద్ద సవాల్ స్థలం. కునో జాతీయ పార్క్లో చీతాలు ఉంచిన వాటికి ఎన్క్లోజర్ సరిపోదు. అవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత దట్టమైన అటవీ ప్రాంతం అవసరముంది. వచ్చే అయిదేళ్లలో మరో 30 చీతాలను తెచ్చే ప్రణాళికలు ఉండడంతో వాటిని ఎక్కడ ఉంచుతారో కూడా ముందుగానే చూడాల్సిన అవసరం ఉంది. ► కునోలో జంతువుల మధ్య ఘర్షణ జరుగుతూ ఉండడం అధికమే. చీతా కంటే దూకుడుగా వ్యవహరించే పులులు, చిరుతుపులులు పోటాపోటీగా కొట్టుకుంటాయి. ఒక్కోసారి చీతాలను ఉద్యానవనం గేటు వరకు తీసుకొస్తూ ఉంటాయి. అక్కడ మనుషులే వాటికి శత్రువులుగా మారుతుంటారు. ఇక మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణలతో ఎంతో విలువైన జంతు సంపదని కోల్పోతున్నాం. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు కలుగుతోంది. ► చీతాల సంరక్షణకి నియమించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికాకి పంపించి శిక్షణ ఇచ్చింది. కానీ ఆ శిక్షణ సరిపోలేదు. రెండు చీతాలు అనారోగ్య కారణాలతో మరణించాయంటేనే సంరక్షకులకు వాటిపై పూర్తి స్థాయి అవగాహన లేదన్న విషయం తెలుస్తోంది. ► భారత్లో చీతాలు ప్రధానంగా కృష్ణజింకలు, చింకారాలను వేటాడి తింటాయి. ప్రస్తుతం కునో జాతీయ ఉద్యానవనంలో ఈ జంతువులు అంతగా లేవు. దీంతో చీతాల కడుపు నిండడం కూడా సమస్యగానే మారింది. మార్చి 27: నమీబియా నుంచి తీసుకువచ్చిన శష అనే చీతా కిడ్నీపరమైన వ్యాధితో మరణించింది. ఏప్రిల్ 13: దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన ఉదయ్ అనే చీతా అనారోగ్య కారణాలతో మృతి చెందింది మే 9: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన చీతాల్లో దక్ష అనే ఆడ చీతాను మేటింగ్ సమయంలో మగ చీతాలు క్రూరంగా వ్యవహరించి మీద పడి చంపేశాయి. -
అడవి దాటి గ్రామంలో చొరబడ్డ నమీబియా చీతా.. స్థానికులు హడల్..
భోపాల్: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కులో ఉన్న నమీబియాలో చీతాల్లో ఒకటి అడవి దాటి బయటకు వెళ్లింది. ఫారెస్ట్ ఏరియా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జార్ బరోడా గ్రామంలో చొరబడింది. దీంతో చీతాను చూసి గ్రామస్థులు హడలిపోతున్నారు. ఈ చీతా పేరు ఒబాన్. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు వెంటనే ప్రత్యేక బృందంతో రంగంలోకి దిగారు. చీతా జాడ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని తిరిగి అడవికి తరలించేందుకు శ్రమిస్తున్నారు. అయితే చీతా తమ ఊర్లోకి చొరబడిన దృశ్యాలను గ్రామస్థుడు ఒకరు వీడియో తీశాడు. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్గా మారింది. Sheopur, Madhya Pradesh | Cheetah Oban, one of the cheetahs brought from Namibia, entered Jhar Baroda village of Vijaypur which is 20 kms away from Kuno National Park. Monitoring team has also reached the village. Efforts are underway to bring the cheetah back: DFO (Video… pic.twitter.com/4iQAoB6tcz — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 2, 2023 కాగా.. భారత్లో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికాతో భారత్ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే గతేడాది ప్రధాని మోదీ జన్మదినం సందర్బంగా 8 చీతాలను నమీబియా నుంచి తీసుకొచ్చి కునో జాతీయ పార్కులో విడుదల చేశారు. అయితే వీటిలో ఒకటి ఇటీవలే కిడ్నీ సమస్యతో చనిపోయింది. ఆ తర్వాత రెండు మూడు రోజులకే మరో చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలను కూడా భారత్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి కూడా అడవిలోనే క్వారంటైన్ కేంద్రంలో ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత వీటిని స్వేచ్ఛగా విడిచిపెడతారు. చదవండి: రెండో పెళ్లి కావలి అంటూ పోలీస్టేషన్లో వధువు హల్చల్! మద్యంమత్తులో ఊగిపోయి.. -
పసికూనల మధ్య పరుగుల వరద.. అనుభవమే గెలిచింది
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో భాగంగా నమీబియా, పపువా న్యూ గినియాల మధ్య జరిగిన మ్యాచ్లో పరుగుల వరద పారింది. పేరుకు పసికూనలైనప్పటికి ఆటలో మాత్రం పోటాపోటీని ప్రదర్శించారు. అయితే పపువా కంటే ఎప్పుడో క్రికెట్లో అడుగుపెట్టిన నమీబియానే 48 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 381 పరుగులు చేసింది. కెప్టెన్ గెర్హార్ ఎరాస్మస్ (113 బంతుల్లో 125 పరుగులు), నికో డేవిన్(79 బంతుల్లో 90 పరుగులు), లోప్టీ ఈటన్(59 బంతుల్లో 61 పరుగులు) రాణించారు. పపువా న్యూ గినియా బౌలర్లలో సెమో కామియా ఐదు వికెట్లతో రాణించగా.. కాబువా మోరియా రెండు వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 46.2 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. ఆరంభం నుంచి దూకుడుగానే ఆడిన పపువా న్యూ గినియా 282/4తో పటిష్టంగా కనిపించినప్పటికి చివర్లో ఒత్తికి లోనై వికెట్లు చేజార్చుకుంది. చార్ల్స్ అమిని(75 బంతుల్లో 109 పరుగులు, 8 ఫోర్లు, 8 సిక్సర్లు) వీరవిహారం సరిపోలేదు. సీస్ బహు(44 బంతుల్లో 54 పరుగులు), కెప్టెన్ అసద్ వాలా(61 బంతుల్లో 57 పరుగులు), కిప్లిన్ డొరిగా(47 పరుగులు) ఆకట్టుకున్నారు. నమీబియా బౌలర్లలో బెర్నాడ్ స్కొల్ట్జ్, రూబెన్ ట్రంపెల్మన్ చెరో మూడు వికెట్లు తీయగా.. గెర్హాడ్ ఎరాస్మస్ రెండు వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన గెర్హాడ్ ఎరాస్మస్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. An all-round show from Gerhard Erasmus gives Namibia a win against PNG in a high-scoring game 🙌 Watch the @cricketworldcup Qualifier Play-off LIVE and for FREE on https://t.co/vphAWWBUVe (in select regions) 📺 📝 https://t.co/5KxcH6LbW5 pic.twitter.com/6cj4yP2QNs — ICC Cricket World Cup (@cricketworldcup) March 30, 2023 -
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. ఫొటోలు వైరల్..
భోపాల్: గతేడాది నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కీడ్ని సమస్యతో ఈ పార్కులోని సషా అనే చీతా చనిపోయిన మూడు రోజులకే మరో చీతా ప్రసవించడం గమనార్హం. తల్లి, నాలుగు చీతా కూనలకు సంబంధించిన ఫోటో, వీడియోను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్లో షేర్ చేశారు. Congratulations 🇮🇳 A momentous event in our wildlife conservation history during Amrit Kaal! I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt — Bhupender Yadav (@byadavbjp) March 29, 2023 దేశంలో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి 8 చీతాలను గతేడాది సెప్టెంబర్లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తీసుకొచ్చారు. వీటీలోనే ఒకటి చనిపోయింది. మిగతావి ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ 8 చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కూడా భారత్కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి క్వారంటైన్లో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తారు. చదవండి: రాజస్థాన్ హై కోర్టు కీలక తీర్పు.. 71 మంది చనిపోయిన పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులుగా విడుదల.. -
అయ్యో సాషా.. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటి మృతి
నమీబియా నుంచి తీసుకువచ్చి గతేడాది మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఉంచిన 8 చీతాల్లో ఒక చీతా మృతి చెందింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సాషా అనే చీతా సోమవారం మరణించినట్లు అధికారులు తెలిపారు. సాషా భారత్కు తీసుకురాకముందే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. జనవరి 23న ఈ చీతాలో అలసట, బలహీనత వంటి అనారోగ్య లక్షణాలు కనిపించాయని, దీంతో చికిత్స కోసం క్వారంటైన్ ఎన్క్లోజర్కు తరలించామని తెలిపారు. కాగా సాషా వయసు మూడేళ్లు. ఇది క్యాప్టివ్ బ్రీడ్ జాతికి చెందినది భారత్లో అంతరించిపోతున్న చీతాలను తిరిగి పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా (సెప్టెంబర్ 17) 8 ఆఫ్రీకన్ చీతాలను కునో నేషనల్ పార్కు క్వారంటైన్ జోన్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో మూడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. నమీబియా నుంచి భారత్లో అడుగుపెట్టిన చీతాలను కొన్ని నెలల పాటు గడ్డి మైదానంతో ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లో క్వారంటైన్ చేశారు. భారతీయ వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడిన తర్వాత నవంబర్లో పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షించారు తరువాత స్వేచ్ఛగా జాతీయ పార్కులో విడిచిపెట్టారు. అంతేగాక త్వరలోనే భారత్కు మరో 12 చీతాలు కూడా రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. -
నమీబియా నుంచి మరో 12 చీతాలు వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: భారత్లో చీతాల సంఖ్యను పెంచే లక్ష్యంతో వాటిని దక్షిణాఫ్రికా ఖండం నుంచి రప్పిస్తున్న మోదీ సర్కార్ ఈ దఫాలో 12 చీతాలను వాయుమార్గంలో తీసుకొస్తోంది. నమీబియా దేశం నుంచి 12 చీతాలను ఫిబ్రవరి 18వ తేదీన తీసుకొస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం చెప్పారు. ‘ నమీబియా నుంచి వాటిని తెచ్చేందుకు సీ–17 విమానం గురువారం బయల్దేరింది. భారత్కు తెచ్చాక వాటిని ఉంచేందుకు మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కులో 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లను సిద్ధంచేశాం’ అని మంత్రి చెప్పారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ తన పుట్టినరోజున కూనో పార్కులోకి ఐదు ఆడ, మూడు మగ చీతాలను విడిచిపెట్టిన విషయం విదితమే. భారత్లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు భారత సర్కార్ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తున్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు నిజర్వ్.. -
గుడ్న్యూస్.. భారత్కు మరో 12 చీతాలు వస్తున్నాయ్..!
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు త్వరలో భారత్కు రానున్నాయి. రెండో విడతలో భాగంగా వీటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు తరలించనున్నారు. ఇప్పటికే మొదటి విడతలో 8 చీతాలను నమీబియా నుంచి భారత్కు తీసుకువచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఆయన వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు. భారత్లో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు దక్షిణాఫ్రికాతో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మొదటి విడతలో 8 చీతాలు నమీబియా నుంచి భారత్కు వచ్చాయి. జనవరిలో మరో 12 రానున్నాయి. చదవండి: విమానాన్ని ఢీకొట్టిన పక్షి.. అర్థాంతరంగా నిలిపివేత.. -
క్వారంటైన్ ముగిసింది.. 24 గంటల్లోనే మట్టుపెట్టాయ్
షియోపూర్: నమీబియా నుంచి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు తీసుకువచ్చిన చీతాలు వేట మొదలుపెట్టాయి. క్వారంటైన్ నుంచి పెద్ద ఎన్క్లోజర్లోకి విడుదల చేసిన ఫ్రెడ్డీ, ఆల్టన్ అనే రెండు మగ చీతాలు 24 గంటల్లోనే మచ్చల జింకను విజయవంతంగా వేటాడాయి. ఆదివారం రాత్రి లేదా సోమవారం వేకువ జామున వేటాడి ఉంటాయని అధికారులు చెప్పారు. అనంతరం రెండు గంటల్లోనే ఆహారాన్ని తినేశాయని చెప్పారు. వేటలోనూ ఇవి సత్తా చాటాయని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఉత్తమ్ కుమార్ శర్మ సోమవారం చెప్పారు. సెప్టెంబర్ 17న నమీబియా నుంచి భారత్కు తీసుకు వచ్చిన 8 చీతాల మొట్టమొదటి వేట ఇదేనన్నారు. ఫ్రెడ్డీ, ఆల్టన్లను వదిలిన ఎన్క్లోజర్ విస్తీర్ణం 98 హెక్టార్ల వరకు ఉంటుందని చెప్పారు. మిగతా వాటిని కూడా దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఎంతో ఉల్లాసంగా ఉన్నాయ్- ప్రధాని మోదీ -
SA Vs NED: పాపం.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి అవుట్! ఇందుకు కారణం యూఏఈ!
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో ఫేవరెట్గా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మరోసారి చేదు అనుభవమే ఎదురైంది. మేజర్ ఈవెంట్లలో కీలక సమయంలో ప్రొటిస్ చేతులెత్తేస్తుందన్న అపవాదును నిజం చేస్తూ కనీసం సెమీస్ చేరకుండానే బవుమా బృందం వరల్డ్కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అది కూడా పసికూన చేతిలో ఓటమి పాలై సఫారీ జట్టు ఇలా ఇంటిబాట పట్టడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మరీ ఇంత ఘోరంగా ఎలాంటి సమీకరణాలతో సెమీస్కు చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్లో సౌతాఫ్రికా ఆదివారం అడిలైడ్ వేదికగా నెదర్లాండ్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ప్రొటిస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లకు అనుకూలించే పిచ్లపై దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాటర్లే సవాలు ఎదుర్కొన్న వేళ.. డచ్ జట్టు ఏ మేరకు రాణిస్తుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్ అయితే, అంచనాలను తలకిందులు చేస్తూ నెదర్లాండ్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో నెదర్లాండ్స్ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగలిగింది. అయినా సౌతాఫ్రికాకు ఇదేమీ పెద్ద లక్ష్యం కాబోదని ఫ్యాన్స్ భావించారు. కానీ డచ్ బౌలర్ల ధాటికి ప్రొటిస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. ఈ ఎడిషన్లో తొలి సెంచరీ నమోదు చేసిన రిలీ రోసో 25 పరుగులతో సఫారీ ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడంటే ప్రొటిస్ బ్యాటింగ్ వైఫల్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డికాక్ 13, కెప్టెన్ తెంబా బవుమా 20, మార్కరమ్ 17, డేవిడ్ మిల్లర్ 17, క్లాసెన్ 21, కేశవ్ మహరాజ్ 13 పరుగులు చేశారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 13 పరుగుల తేడాతో గెలుపొందిన నెదర్లాండ్స్.. సౌతాఫ్రికా సెమీస్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆ రోజు అలా నిజానికి సూపర్-12లో జింబాబ్వేతో మ్యాచ్లో వర్షం అంతరాయం కలిగించకపోతే సౌతాఫ్రికా ఈ ఓటమి తర్వాత కూడా సెమీస్ రేసులో నిలిచేదే! కానీ దురదృష్టం వెంటాడింది. ఆ మ్యాచ్ రద్దు కావడంతో ప్రొటిస్కు ఒక్క పాయింట్ మాత్రమే వచ్చింది. తాజా పరాజయంతో పట్టికలో ఐదు పాయింట్లకే పరిమితమైన బవుమా బృందం భారంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఏఈ వల్లే ఇదంతా ఇదిలా ఉంటే.. అనూహ్య పరిస్థితుల్లో సూపర్-12కు చేరుకున్న ‘పసికూన’ నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాను ఎలిమినేట్ చేసి సంచలనం చేసింది. కాగా క్వాలిపైయర్స్(గ్రూప్-ఎ)లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక పోరులో నమీబియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో అనూహ్యంగా యూఏఈ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీస్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒకరికి మోదం.. మరొకరికి ఖేదం అన్నట్లుగా నమీబియా ఓటమితో నెదర్లాండ్స్ సూపర్-12కు అర్హత సాధించింది. సూపర్-12 రేసులో పోటీపడిన నమీబియాను ఓడించిన యూఏఈ దగ్గరుండి మరీ డచ్ జట్టును ముందుకు నడిపినట్లయింది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సౌతాఫ్రికా ఇంటికి వెళ్లడానికి పరోక్షంగా వర్షం, యూఏఈ కారణం.. ఆరోజు వర్షం రాకపోయినా.. యూఏఈ గెలవకపోయినా పాపం ప్రొటిస్ సెమీస్ చేరేదేమో అంటూ తోచిన రీతిలో విశ్లేషిస్తున్నారు. చదవండి: T20 WC 2022: సెమీస్కు టీమిండియా.. ఆశల పల్లకీలో పాకిస్తాన్, అనూహ్యంగా రేసులోకి బంగ్లా టీ20 వరల్డ్కప్లో ఆ జట్టుకు షాక్.. అత్యాచారం కేసులో క్రికెటర్ అరెస్ట్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2022: నరాలు తెగే ఉత్కంఠ.. టాప్- 5 బెస్ట్ మ్యాచ్లు ఇవేనన్న ఐసీసీ
T20 World Cup 2022- 5 Best Matches So Far: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్లు చూశాం. తొలి రౌండ్ నుంచి సూపర్-12 దశలో ఇప్పటి వరకు ఐర్లాండ్, జింబాబ్వే సంచలనాలు నమోదు చేయగా.. ఇంగ్లండ్, పాకిస్తాన్ వంటి మేటి జట్లు కుదేలైన తీరును గమనించాం. మరికొన్ని మ్యాచ్లలో జట్ల కంటే వరణుడే హైలెట్ అయ్యాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా గ్రూప్-1లో కీలక జట్లైన ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ వర్షార్పణం కావడం ఫ్యాన్స్ను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో.. ఇప్పటి దాకా ఫైనల్ ఓవర్ థ్రిల్లర్లలో టాప్-5 మ్యాచ్లను ఐసీసీ తాజాగా వెల్లడించింది. అవేమిటో ఓసారి పరిశీలిద్దాం. 1. ఇండియా వర్సెస్ పాకిస్తాన్(గ్రూప్-2) సూపర్-12లో చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ అక్టోబరు 23న మెల్బోర్న్ వేదికగా అక్టోబరు 23న తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్లో టీమిండియా పాక్పై 4 వికెట్ల తేడాతో గెలిచి గత ప్రపంచకప్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది. 2. పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే(గ్రూప్-2) టీమిండియా చేతిలో దెబ్బతిన్న పాకిస్తాన్కు జింబాబ్వే కూడా కోలుకోని షాకిచ్చింది. టీ20లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేమన్న మాటను నిజం చేస్తూ ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే గెలుపొందింది. పాక్ మూలాలున్న సికందర్ రజా కీలక సమయంలో రాణించి బాబర్ ఆజం బృందానికి ఊహించని షాకిచ్చాడు. దీంతో సూపర్-12లో పాకిస్తాన్కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. కాగా జింబాబ్వే చేతిలో అక్టోబరు 27న పాక్ పరాభవానికి పెర్త్ స్టేడియం వేదికైంది. 3. స్కాట్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ ఫస్ట్ రౌండ్లో భాగంగా బెలెరివ్ ఓవల్ మైదానంలో స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య అక్టోబరు 19న మ్యాచ్ జరిగింది. ఒకానొక దశలో 61/4తో కష్టాల్లో కూరుకుపోయిన ఐర్లాండ్.. కర్టిస్ కాంఫర్ అద్భుత ఇన్నింగ్స్తో(72- నాటౌట్) తిరిగి పుంజుకుంది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే స్కాట్లాండ్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 4. యూఏఈ వర్సెస్ నెదర్లాండ్స్ టోర్నీ ఆరంభ తేదీ అక్టోబరు 16న నెదర్లాండ్స్, యూఏఈ మధ్య మ్యాచ్ సైతం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్ ఐదో బంతికి కెప్టెన్ ఎడ్వర్డ్స్ సింగిల్ తీయడంతో డచ్ జట్టు విజయం ఖరారైంది. 3 వికెట్ల తేడాతో యూఏఈపై నెదర్లాండ్స్ గెలుపొందింది. 5. నమీబియా వర్సెస్ యూఏఈ జీలాంగ్ వేదికగా అక్టోబరు 20న గ్రూప్-ఏలో ఉన్న నమీబియా- యూఏఈ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. సూపర్-12 చేరాలన్న నమీబియా ఆశలపై నీళ్లు చల్లిన యూఏఈ జట్టు.. నెదర్లాండ్స్కు సూపర్-12 బెర్త్ను ఖరారు చేసింది. ఈ మ్యాచ్లో యూఏఈ .. నమీబియాపై 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో ఫస్ట్ రౌండ్లోనే నమీబియా కథ ముగిసింది. చదవండి: T20 WC 2022 NZ Vs SL: కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్ T20 WC 2022: టీమిండియా గెలవాలని పాక్ అభిమానుల ప్రార్ధనలు -
నమీబియాపై యూఏఈ విజయం.. నెదర్లాండ్స్ సెలబ్రేషన్స్ అదుర్స్
టీ20 ప్రపంచకప్-2022 తొలి రౌండ్(గ్రూప్-ఎ) పోటీలు ముగిశాయి. గ్రూప్-ఎ నుంచి నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు సూపర్-12 అర్హత సాధించాయి. జీలాంగ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో నమీబియా పరాజయం పాలవ్వడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ కీలక మ్యాచ్లో నమీబియా ఓటమి చెందడంతో నెదర్లాండ్స్ సూపర్-12కు అర్హత సాధించింది. నెదర్లాండ్స్ రెండు విజయాలతో ఈ ప్రధాన టోర్నీలో అడుగు పెట్టింది. ఒక వేళ యూఏఈపై నమీబియా విజయం సాధించింటే రన్రేట్ పరంగా సూపర్-12లో అడుగుపెట్టేది. ఇక ఇది ఇలా ఉండగా.. గురువారం ఉదయం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 16 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ ఓటమి పాలైంది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత నెదర్లాండ్స్ ఆటగాళ్లు తమ హోటల్ గదులకు వెళ్లకుండా తమ భవితవ్యం తేల్చే యూఏఈ-నమీబియా మ్యాచ్ను వీక్షించారు. కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో యూఏఈ విజయం సాధించగానే డచ్ ఆటగాళ్ళు సెలబ్రేషన్లో మునిగితేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక గ్రూప్-బి నుంచి ఏ జట్లు సూపర్-12లో అడుగుపెడతాయో శుక్రవారం తేలిపోనుంది. గ్రూప్-బి స్కాట్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లన్నీ రెండు మ్యాచ్ల్లో ఒక్కో గెలుపోటములతో రేసులో ఉన్నాయి. శుక్రవారం(ఆక్టోబర్21) ఆఖరి లీగ్ మ్యాచ్ల్లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్తో ఐర్లాండ్... స్కాట్లాండ్తో జింబాబ్వే తలపడతాయి. గెలిస్తే చాలు... ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండా గెలిచిన రెండు జట్లు ‘సూపర్–12’ దశకు అర్హత సాధిస్తాయి. Celebration by the Dutch cricket team, having just qualified for the follow-up by the narrow defeat of Namibia by UAE. Yet another nail biting experience. #ICCT20WC2022 #ICCT20WC @T20Worldcup #Australia #CricketNL @KNCBcricket pic.twitter.com/pVNjMVYgUG — VRA Cricket Amsterdam (@VRA_Cricket_AMS) October 20, 2022 చదవండి: T20 WC 2022: 'అతడు ఒంటి చేత్తో భారత్కు టీ20 ప్రపంచకప్ను అందిస్తాడు' -
కంటతడి పెట్టిన డేవిడ్ వీస్.. అద్భుత పోరాటం అంటూ నెటిజన్ల కితాబు
రసవత్తరంగా సాగిన టీ20 వరల్డ్కప్ గ్రూప్-ఏ క్వాలిఫయర్స్ పోటీలు ఇవాల్టితో ముగిశాయి. ఈ గ్రూప్ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు సూపర్-12కు అర్హత సాధించాయి. ఇవాళ (అక్టోబర్ 20) జరిగిన మ్యాచ్ల్లో శ్రీలంక.. నెదర్లాండ్స్పై, యూఏఈ.. నమీబియాపై విజయం సాధించి సూపర్-12 బెర్త్లు ఖరారు చేసుకున్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లో ఇద్దరు ఆటగాళ్లు కనబర్చిన అద్భుత పోరాటపటిమ యావత్ క్రీడా ప్రపంచాన్ని కదిలించింది. శ్రీలంకతో మ్యాచ్లో నెదర్లాండ్స్ ఆటగాడు వాన్ డెర్ మెర్వ్ భరించలేని నొప్పితో బరిలోకి దిగి అందరి మన్ననలు అందుకోగా.. యూఏఈతో మ్యాచ్లో నబీమియా ఆటగాడు డేవిడ్ వీస్ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి.. అభిమానులచే శభాష్ యోధుడా అనిపించుకున్నాడు. అయితే డేవిడ్ వీస్ వీరోచిత పోరాట పటిమ కనబర్చినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం అతను తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టాడు. ఈ దృశ్యాలు అందరినీ కలచి వేశాయి. వీస్ తన జట్టును గెలిపించేందుకు చివరి వరకు పోరాడి ఆఖరి ఓవర్లో వెనుదిరిగాడు. ఫలితంగా నమీబియా మ్యాచ్ ఓడటంతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది. 37 ఏళ్ల వీస్కు ప్రస్తుత ప్రపంచకప్లో తన జట్టును ఎలాగైనా సూపర్ 12 దశకు చేర్చాలని దృడ నిశ్చయంతో ఉన్నాడు. ఈ క్రమంలో నమీబియా తమ తొలి మ్యాచ్లో ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకిచ్చింది. ఈ గెలుపులో వీస్ కీలకపాత్ర పోషించాడు. వయసు పైబడిన రిత్యా వీస్కు ఇదే చివరి ప్రపంచకప్ కావడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వీస్ కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే, నమీబియాతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఫలితంగా నమీబియా 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. యూఏఈ ఇన్నింగ్స్లో ముహ్మద్ వసీమ్ (50), రిజ్వాన్ (43 నాటౌట్), బాసిల్ హమీద్ (25 నాటౌట్) రాణించగా.. నమీబియా ఇన్నింగ్స్లో డేవిడ్ వీస్ (55) ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. -
నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్-12కు నెదర్లాండ్స్
టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్(గ్రూప్-ఎ)లో భాగంగా యూఏఈతో జరిగిన కీలక మ్యాచ్లో 7 పరుగుల తేడాతో నమీబియా పరాజయం పాలైంది. తద్వారా టీ20 ప్రపంచకప్-2022 నుంచి నమీబియా ఇంటిముఖం పట్టింది. ఈ మ్యాచ్లో నమీబియా ఓటమి పాలవ్వడంతో.. గ్రూప్-ఎ నుంచి నెదర్లాండ్స్ సూపర్-12లో అడుగుపెట్టింది. కాగా నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీస్ అఖరి వరకు పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 13 ఓవర్లు ముగిసే సరికి 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వీస్(36 బంతుల్లో 55 పరుగులు) అద్భుతమైన ఇన్నింగ్స్తో నమీబియా గెలుపు ఆశలను పెంచాడు. అయితే అఖరి ఓవర్లో నమీబియా విజయానికి 14 పరుగులు అవసరమైన క్రమంలో వీస్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ యూఏఈ వైపు మలుపు తిరిగింది. అఖరి ఓవర్లో నమీబియా కేవలం 7 పరుగులు మాత్రమే చేసి టోర్నీ నుంచి నిష్క్రమించింది. యూఏఈ బౌలర్లలో హమిద్, జహూర్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించగా.. వసీం, జునైద్ సిద్ధిక్, మెయ్యప్పన్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. యూఏఈ బ్యాటర్లలో మహ్మద్ వసీం(50), రిజ్వాన్(43) పరుగులతో రాణించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: Predicted Playing XI: పాక్తో తొలి మ్యాచ్.. తుది జట్టు ఇదే! పంత్, అశ్విన్, హుడాకు నో ఛాన్స్! -
నమీబియాతో మ్యాచ్.. నెదర్లాండ్స్ భవితవ్యం యూఏఈ చేతిలో
టి20 ప్రపంచకప్లో భాగంగా గ్రూఫ్-ఏ క్వాలిఫయింగ్ పోరులో గురువారం నమీబియా, యూఏఈ మధ్య ఆసక్తికర మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన యూఏఈ బ్యాటింగ్ ఏంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన నమీబియా ఫేవరెట్గా కనిపిస్తుంటే.. రెండు మ్యాచ్ల్లో ఓడిన యూఏఈ ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా చూడాలి. అయితే నమీబియాతో పోరు యూఏఈ కంటే నెదర్లాండ్స్కు చాలా ముఖ్యం. ఎందుకంటే యూఏఈ గెలుపుపైనే నెదర్లాండ్స్ భవితవ్యం ఆధారపడి ఉంది. అది కూడా కష్టమే(నెట్ రన్రేట్ ఆధారంగా). శ్రీలంకతో మ్యాచ్లో 16 పరుగుల తేడాతో ఓడిన నెదర్లాండ్స్ దాదాపు ఇంటి బాట పట్టినట్లే. అయితే యూఏఈ నమీబియాను చిత్తుగా ఓడిస్తేనే నెదర్లాండ్స్కు సూపర్-12 చాన్స్ ఉంటుంది. ఎందుకంటే నమీబియా రన్రేట్ (+1.277) కాగా.. నెదర్లాండ్స్ రన్రేట్(0.162)గా ఉంది. ఒకవేళ యూఏఈ చేతిలో నమీబియా దగ్గరగా ఓడిపోయినా నెదర్లాండ్స్ ఇంటికి వెళ్లాల్సిందే. అయితే వరుసగా రెండు విజయాలు సాధించిన నమీబియా జోరును యూఏఈ ఏ మాత్రం అడ్డుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ముహమ్మద్ వసీమ్, వృత్య అరవింద్(వికెట్ కీపర్), చుండంగపోయిల్ రిజ్వాన్(కెప్టెన్), అలీషాన్ షరాఫు, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, కార్తీక్ మెయ్యప్పన్, ఫహద్ నవాజ్, అహ్మద్ రజా, జునైద్ సిద్దిక్, జహూర్ ఖాన్ నమీబియా: స్టీఫన్ బార్డ్, మైఖేల్ వాన్ లింగెన్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జాన్ ఫ్రైలింక్, జెజె స్మిత్, డేవిడ్ వైస్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), రూబెన్ ట్రంపెల్మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో చదవండి: సూపర్-12కు శ్రీలంక.. నెదర్లాండ్స్ ఇంటికి -
ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ విజయం.. సూపర్-12కు అర్హత!
టి20 ప్రపంచకప్లో భాగంగా నెదర్లాండ్స్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ను తలపించింది. ఆఖరివరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 122 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఒక దశలో సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. . కానీ నమీబియా బౌలర్లు పోరాడిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. అయితే నెదర్లాండ్స్ ఆటగాళ్లు బాస్ డీ లీడే 30, విక్రమ్జిత్ సింగ్ 39, మాక్స్ డౌడ్ 35 పరుగులు చేశారు. నమీబియా బౌలర్లలో జెజె స్మిత్ 2 వికెట్లు తీయగా.. బెర్నార్డ్ స్కోల్జ్, ఫ్రై లింక్లు చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ 43 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మైకెల్ వాన్ లింగెన్ 20 పరుగులు చేశాడు. ఆరంభం నుంచి నెమ్మదిగా సాగిన నమీబియా ఇన్నింగ్స్లో చివరి ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 2 వికెట్లు తీయగా.. టిమ్ ప్రింగిల్, కోలిన్ అకెర్మన్, పాల్ వాన్ మెక్రీన్, వాండర్మెర్వ్లు తలా ఒక వికెట్ తీశారు. ఇక గ్రూఫ్-ఏలో ఉన్న నెదర్లాండ్స్ వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేసింది. దీంతో డచ్ జట్టు సూపర్-12 దశకు దాదాపు అర్హత సాధించినట్లే. క్వాలిఫయింగ్ దశలో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నెదర్లాండ్స్ రెండు విజయాలు సాధించింది. ఇక డచ్ జట్టు తమ చివరి మ్యాచ్ను శ్రీలంకతో ఆడనుంది. గతేడాది టి20 ప్రపంచకప్లో సూపర్-12 దశకు అర్హత సాధించడంలో విఫలమైన నెదర్లాండ్స్ ఈసారి మాత్రం తమ పట్టు విడవలేదు. ఒకవేళ ఇవాళ శ్రీలంక పొరపాటున యూఏఈ చేతిల ఓడిందో ఇంటిదారి పట్టాల్సిందే. మరోవైపు నమీబియా మాత్రం రెండు మ్యాచ్ల్లో ఒక ఓటమి, ఒక విజయం సాధించి రెండో స్థానంలో ఉంది. చదవండి: 40 పరుగులకే ఆలౌట్.. టోర్నీ చరిత్రలో చెత్త రికార్డు -
తక్కువ స్కోరుకే పరిమితం.. నెదర్లాండ్స్ టార్గెట్ 122
టి20 ప్రపంచకప్లో భాగంగా గ్రూఫ్-ఏలో మంగళవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో నమీబియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. తమ తొలి మ్యాచ్లో లంకను చిత్తు చేసిన నమీబియా డచ్ బౌలర్ల దాటికి పరుగులు చేయడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ 43 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మైకెల్ వాన్ లింగెన్ 20 పరుగులు చేశాడు. ఆరంభం నుంచి నెమ్మదిగా సాగిన నమీబియా ఇన్నింగ్స్లో చివరి ఐదు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 40 పరుగులు చేయడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 2 వికెట్లు తీయగా.. టిమ్ ప్రింగిల్, కోలిన్ అకెర్మన్, పాల్ వాన్ మెక్రీన్, వాండర్మెర్వ్లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: సహనం కోల్పోయిన షాదాబ్ ఖాన్.. 'కెప్టెన్గా పనికిరావు' -
గెలిస్తే నిలుస్తారు.. యూఏఈతో అమీతుమీకి సిద్ధమైన శ్రీలంక
టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్స్ రౌండ్లో (గ్రూప్-ఏ) రేపు (అక్టోబర్ 18) అత్యంత కీలక మ్యాచ్ జరుగనుంది. టోర్నీ తొలి మ్యాచ్లో నమీబియా చేతిలో ఓడి సూపర్-12కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న ఆసియా ఛాంపియన్ శ్రీలంక.. రేపు యూఏఈతో అమీతుమీకి సిద్ధమైంది. ఒకవేళ శ్రీలంక ఈ మ్యాచ్లోనూ ఓడితే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. కాబట్టి లంకేయులు ఈ మ్యాచ్ను చాలా సీరియస్గా తీసుకోనున్నారు. ప్రత్యర్ధి యూఏఈని తక్కువ అంచనా వేయకుండా సర్వశక్తులు ఒడ్డేందుకు ప్రయత్నిస్తారు. యూఏఈ సైతం తొలి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. నెదర్లాండ్స్తో నువ్వానేనా అన్నట్లు సాగిన లో స్కోరింగ్ గేమ్లో దాదాపు గెలిచినంత పని చేసింది. శ్రీలంక.. యూఏఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. గ్రూప్-ఏలో రేపు మరో మ్యాచ్ జరుగనుంది. టేబుల్ టాపర్లుగా ఉన్న నమీబియా, నెదర్లాండ్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్ల్లో బలమైన ప్రత్యర్ధులపై గెలిచి ఉత్సాహంగా ఉన్నాయి. నమీబియా.. తమకంటే చాలా మెరుగైన శ్రీలంకకు షాకిస్తే, నెదర్లాండ్స్.. ఉత్కంఠ పోరులో యూఏఈని ఖంగుతినిపించి మరో గెలుపు కోసం ఉరకలేస్తుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుండగా.. శ్రీలంక-యూఏఈ మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు.. ఒకవేళ పుంజుకుంటే!
టి20 ప్రపంచకప్ 2022 ఆరంభమైన తొలిరోజునే సంచలనం నమోదైంది. శ్రీలంక క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడుతున్నప్పటికి ఫేవరెట్గానే బరిలోకి దిగింది. అలాంటి లంక జట్టుకు పసికూన నమీబియా షాక్ ఇచ్చింది. ఫేలవ బ్యాటింగ్తో నిరాశపరిచిన లంక 55 పరుగుల తేడాతో నమీబియా చేతిలో ఓడింది. దీంతో లంక జట్టును టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కొద్దిరోజుల క్రితం ఆసియా ఛాంపియన్లుగా అవతరించిన శ్రీలంక.. నెల రోజులు కూడా తిరగకముందే చెత్త ఆట తీరుతో మళ్లీ మొదటికే వచ్చిందంటూ కామెంట్స్ చేశారు. ఆసియా కప్ లో లంకేయులు చేసిన 'నాగిని'డాన్సులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. 'ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్సులు' అంటూ వాటికి కామెంట్స్ పెట్టారు. మరికొందరు లంక హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఫోటోను పెట్టి.. 'ఇవాళ రాత్రి మీ అందరికీ బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటది మీరు రండ్రా..'అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మీమ్స్ చేశారు. 'ఆసియా చాంపియన్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడారు. ఆ జట్టు తర్వాత నెదర్లాండ్స్, యూఏఈతో మ్యాచ్ లు ఆడాలి. ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఓడినా ఇక అంతే సంగతులు' అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే క్రికెట్ ఫ్యాన్స్ లంక జట్టును ట్రోల్ చేయడంపై క్రీడా పండితులు తప్పుబట్టారు. ''ఒక్క మ్యాచ్ ఓడినంత మాత్రానా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. మ్యాచ్ ఓటమి పాలైనప్పటికి తర్వాతి మ్యాచ్ల్లో ఫుంజుకుంటే మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా.. ఎప్పుడు ఒక జట్టును తక్కువ అంచనా వేయకూడదు.. రెండు మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోతే అప్పుడు ట్రోల్ చేసినా ఒక అర్థముంటుంది. అంతేకానీ కేవలం ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు ఇలా అవమానించడం తగదు'' అంటూ పేర్కొన్నారు. నమీబియా చేతిలో లంక ఓడిపోయాక సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేస్తూ.. ''ఈరోజు క్రికెట్ ప్రపంచానికి నమీబియా తన పేరును ఘనంగా చాటింది'' అని ట్వీట్ చేశాడు. ఇదిలాఉండగా అనామక జట్టుగా బరిలోకి దిగి అగ్రశ్రేణి జట్టుగా ఉన్న టీమ్ ను ఓడించిన సందర్భాలలో నమీబియా కూడా చేరింది. ఇదివరకు ఈ జాబితాలో జింబాబ్వే (2007 టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను ఓడించింది), నెదర్లాండ్స్ (2009 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై గెలిచింది), హాంకాంగ్ (2014 టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై), అఫ్గానిస్తాన్ (2016 టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ పై) ఉన్నాయి. తాజాగా నమీబియా కూడా లంకను ఓడించి ఆ జాబితాలో చేరింది. -
లంకకు నమీబియా షాక్
గిలాంగ్: ఆసియా టి20 చాంపియన్ శ్రీలంకకు క్రికెట్ కూన నమీబియా పెద్ద షాకే ఇచ్చింది. టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’ తొలి రౌండ్ (క్వాలిఫయర్స్) మ్యాచ్లో నమీబియా 55 పరుగుల తేడాతో 2014 టి20 ప్రపంచకప్ విజేత లంకను చిత్తు చేసింది. గతేడాది యూఏఈలో జరిగిన పొట్టి ప్రపంచకప్లో ఆకట్టుకున్న నమీబియా ఇక్కడ తొలి మ్యాచ్తోనే శుభారంభం చేసింది. మొదట నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జాన్ ఫ్రయ్లింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిట్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. ఒకదశలో 14.2 ఓవర్లలో 93 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన నమీబియాను ఫ్రయ్లింక్, స్మిట్ ధాటిగా ఆడి ఆదుకున్నారు. ఇద్దరు చివరి 5.4 ఓవర్లలోనే ఏడో వికెట్కు 70 పరుగులు జోడించారు. లంక బౌలర్లలో మదుషాన్ 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ దాసున్ షనక (23 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), రాజపక్స (21 బంతుల్లో 20; 2 ఫోర్లు) తప్ప ఇంకెవరూ ఎంతోసేపు క్రీజులో నిలువలేకపోయారు. ఫ్రయ్లింక్ (2/26), స్మిట్ (1/16) బంతితోనూ ఆకట్టుకున్నారు. వీస్, బెర్నార్డ్, షికొంగో తలా 2 వికెట్లు తీశారు. నెదర్లాండ్స్ బోణీ ఇదే గ్రూప్లో జరిగిన మరో మ్యాచ్లో యూఏఈపై నెదర్లాండ్స్ ఆఖరిదాకా చెమటోడ్చి నెగ్గింది. తక్కువ స్కోర్ల ఈ మ్యాచ్ ఆఖర్లో కాస్త ఉత్కంఠ రేపినా... నెదర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో గట్టెక్కింది. తొలుత యూఏఈ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులు చేసింది. ఓపెనర్ వసీమ్ (47 బంతుల్లో 41; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించాడు. బస్ డి లీడే (3/19) ఒక్క ఓవర్తో మలుపు తిప్పాడు. 91/2 స్కోరుతో ఒకదశలో పటిష్టంగానే కనిపించిన యూఏఈకు అదేస్కోరుపై వసీమ్ వికెట్ను కోల్పోయాక కష్టాలు మొదలయ్యాయి. 18వ ఓవర్లో ఫరీద్ (2) రనౌటయ్యాడు. ధనాధన్ ఆడే డెత్ ఓవర్లలో పరుగులకు బదులు వికెట్లు రాలడంతో యూఏఈ ఊహించనిరీతిలో కట్టడి అయ్యింది. 19వ ఓవర్ వేసిన డి లీడే మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. అరవింద్ (18), బాసిల్ హమీద్ (4), కెప్టెన్ రిజ్వాన్ (1)లను లీడే అవుట్ చేశాడు. ఆఖరి ఓవర్లో అఫ్జల్ ఖాన్ (5)ను క్లాసెన్ పెవిలియన్ చేర్చడంతో... కేవలం 19 పరుగుల వ్యవధిలోనే యూఏఈ 6 వికెట్లను కోల్పోయింది. తర్వాత నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ఓడోడ్ (23; 3 ఫోర్లు, 1 సిక్స్), ఆఖర్లో కెప్టెన్ ఎడ్వర్డ్స్ (16 నాటౌట్), ప్రింగిల్ (5) కుదురుగా ఆడి గెలిపించారు. జునైద్ సిద్ధిఖ్ 3 వికెట్లు తీశాడు. చివరి 12 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన దశలో 19 ఓవర్లో ప్రింగిల్ను జహూర్ ఖాన్ అవుట్ చేయగా 4 పరుగులే వచ్చాయి. 6 బంతుల్లో 6 పరుగుల విజయ సమీకరణం యూఏఈని ఊరించినప్పటికీ ఎడ్వర్డ్స్, వాన్ బిక్ (4) షాట్ల జోలికి వెళ్లకుండా ఒకట్రెండు పరుగులు తీసి జట్టును గెలిపించారు. గ్రూప్ ‘బి’లో నేటి మ్యాచ్లు స్కాట్లాండ్ vs వెస్టిండీస్ (ఉదయం గం. 9:30 నుంచి) ఐర్లాండ్ vs జింబాబ్వే (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
లంకపై నమీబియా చారిత్రక విజయం.. పేరు గుర్తు పెట్టుకోవాలంటూ సచిన్ హెచ్చరిక
టీ20 ప్రపంచకప్ ఆరంభంలోనే పెను సంచలనం నమోదైంది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో ఆసియా ఛాంపియన్ శ్రీలంకపై పసికూన నమీబియా చారిత్రక విజయం సాధించి, క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. 2021 టీ20 వరల్డ్కప్లోనూ సంచలన విజయాలు సాధించి సూపర్-12కు అర్హత సాధించిన నమీబియా.. ఈసారి కూడా అదే తరహా ప్రదర్శనను రిపీట్ చేస్తుంది. తమ కంటే పటిష్టమైన జట్టుపై నమీబియా గెలుపు అనంతరం క్రికెట్ ప్రపంచం పసికూనలపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అభిమానులు, విశ్లేషకులు నమీబియాను ఆకాశానికెత్తుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా నమీబియా ప్రదర్శనను కొనియాడాడు. ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. పేరు గుర్తు పెట్టుకోండి (నామ్ యాద్ రఖ్నా).. ఈ రోజు నమీబియా క్రికెట్ ప్రపంచానికి తనేంటో రుజువు చేసిందంటూ టీమిండియాను పరోక్షంగా హెచ్చరించాడు. సచిన్ ట్విట్పై నమీబిమా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ స్పందించాడు. పేరు గుర్తు పెట్టుకోండి అంటూ సచిన్ ట్వీట్ను రీ ట్వీట్ చేశాడు. Namibia 🇳🇦 has told the cricketing world today… “Nam” yaad rakhna! 👏🏻 — Sachin Tendulkar (@sachin_rt) October 16, 2022 ఇదిలా ఉంటే, క్వాలిఫయర్స్ గ్రూప్-ఏలో జరిగిన తొలి మ్యాచ్లో నమీబియా.. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆఖర్లో జాన్ ఫ్రైలింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిట్ ( 16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో నమీబియా ఈ స్కోర్ సాధించగలిగింది. Nam yaad rakhna! 🇳🇦🙌 https://t.co/Y5QKFifoTg — Gerhard Erasmus (@gerharderasmus) October 16, 2022 అనంతరం ఛేదనలో నమీబియా బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. డేవిడ్ వీస్ (2/16), బెర్నార్డ్ స్కోల్జ్ (2/18), బెన్ షికొంగో (2/22), జాన్ ఫ్రైలింక్ (2/26), స్మిట్ (1/16) మూకుమ్మడిగా లంక నడ్డి విడిచారు. ఫలితంగా ఆ జట్టు 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో కెప్టెన్ షనక (29) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్తో మెరిశాడు. నమీబియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో కరుణరత్నే వేసిన ఓ ఆఫ్ సైడ్ బంతిని బ్యాటర్ జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ వైపుకు వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ డైవ్ చేసి ఒంటి చేత్తో అద్భతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో నమీబియా బ్యాటర్ కూడా ఒక్క సారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్(31) పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 World Cup 2022: శ్రీలంకకు భారీ షాక్.. యువ బౌలర్ దూరం -
శ్రీలంకపై నమీబియా సంచలన విజయం (ఫొటోలు)
-
శ్రీలంకకు బిగ్ షాకిచ్చిన నమీబియా.. 55 పరుగుల తేడాతో ఘన విజయం
టీ20 వరల్డ్కప్-2022 రౌండ్-1లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంకకు నమీబియా గట్టి షాకిచ్చింది. గీలాంగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో నమీబియా 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ శనక(29) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్(31) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మధుషాన్ రెండు వికెట్లు, తీక్షణ, కరుణ రత్నే,చమీరా, హాసరంగా తలా వికెట్ సాధించారు. పీకల్లోతు కష్టాల్లో శ్రీలంక 88 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. శ్రీలంక విజయానికి 36 బంతుల్లో 76 పరుగులు కావాలి. ఐదో వికెట్ కోల్పోయిన శ్రీలంక 75 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రాజపాక్స్.. బెర్నార్డ్ స్కోల్ట్జ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. 10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 72/4 10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. క్రీజులో భానుక రాజపాక్స(19), శనక(22) పరుగులతో ఉన్నారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయిన శ్రీలంక శ్రీలంక వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. బెన్ షికోంగో వేసిన నాలుగో ఓవర్లో నిస్సాంక, గుణతిలక వరుస బంతుల్లో పెవిలియన్కు చేరారు. 4 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 22/3 తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. డేవిడ్ వైస్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. రాణించిన నమీబియా బ్యాటర్లు.. శ్రీలంక టార్గెట్ 163 పరుగులు శ్రీలంకతో జరుగుతోన్న మ్యాచ్లో నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్(31) పరుగులతో రాణించారు. లంక బౌలర్లలో మధుషాన్ రెండు వికెట్లు, తీక్షణ, కరుణ రత్నే,చమీరా, హాసరంగా తలా వికెట్ సాధించారు. 15 ఓవర్లకు నమీబియా స్కోర్: 95/6 15 ఓవర్లు ముగిసే సరికి నమీబియా 6 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. క్రీజులో జాన్ ఫ్రైలింక్(14), జేజే స్మిత్(1) క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు నమీబియా స్కోర్: 59/3 10 ఓవర్లు ముగిసే సరికి నమీబియా మూడు వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. క్రీజులో గెర్హార్డ్ ఎరాస్మస్(11),స్టీఫన్ బార్డ్(15) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన నమీబియా 16 పరుగుల వద్ద నమీబియా రెండో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన దివాన్ లా కాక్.. ప్రమోద్ మధుషాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు నమీబియా స్కోర్: 24/2 తొలి వికెట్ కోల్పోయిన నమీబియా 3 పరుగుల వద్ద నమీబియా తొలి వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన మైఖేల్ వాన్ లింగేన్.. చమీరా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. టీ20 ప్రపంచకప్-2022కు రంగం సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్ రౌండ్-1(గ్రూప్-ఎ)లో భాగంగా తొలి మ్యాచ్లో గీలాంగ్ వేదికగా శ్రీలంక-నమిబీయా జట్లు తలపడుతోన్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్సే, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్ మధుషాన్, మహేశ్ తీక్షణ నమీబియా: స్టీఫన్ బార్డ్, డేవిడ్ వైస్, గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, జేజే స్మిట్, జాన్ ఫ్రైలింక్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), దివాన్ లా కాక్, మైఖేల్ వాన్ లింగేన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో -
పద పద పరుగుల పండగ వైపు...
మెల్బోర్న్: టి20 ప్రపంచకప్–2021 ఫైనల్ నవంబర్ 14న జరిగింది. క్యాలెండర్లో సంవత్సరం కూడా పూర్తి కాకుండానే మరోసారి ధనాధన్ ఆటలో విశ్వ సమరానికి సమయం వచ్చేసింది. డిఫెండింగ్ చాంపియన్, మాజీ చాంపియన్లు, కొత్త చాంపియన్గా నిలవాలని పట్టుదలగా ఉన్న జట్లన్నీ మరోసారి సత్తా చాటేందుకు బరిలోకి దిగబోతున్నాయి. వన్డే వరల్డ్ కప్లను రెండు సార్లు దిగ్విజయంగా నిర్వహించిన ఆస్ట్రేలియా తొలిసారి పొట్టి ప్రపంచకప్నకు ఆతిథ్యం ఇస్తుండగా, కొత్తగా అమల్లోకి వచ్చిన ఐసీసీ నిబంధనలతో మెగా ఈవెంట్ మరింత ఆసక్తికరంగా మారనుంది. తొలి రౌండ్లో 8 జట్ల మధ్య జరిగే 12 మ్యాచ్ల పోరు తర్వాత 12 జట్ల రెండో దశ సమరంతో మొదలు పెట్టి మరో 33 మ్యాచ్లు ఆసాంతం వినోదాన్ని పంచడం ఖాయం. మొత్తంగా 29 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు పరుగుల పండగే. ఏడాది వ్యవధిలోనే... ఐసీసీ లెక్కల ప్రకారం 2010 నుంచి ప్రతీ రెండేళ్లకు ఒకసారి టి20 వరల్డ్ కప్ జరగాలి. అయితే 2016 తర్వాత ఏకంగా ఐదేళ్ల విరామం వచ్చింది. 2018లో పెద్ద సంఖ్యలో ద్వైపాక్షిక సిరీస్లు ఖరారు కావడంతో టోర్నీ సాధ్యం కాలేదు. ఆ ఏడాది దక్షిణాఫ్రికాలో జరిపేందుకు ప్రయత్నించినా... ‘నల్లజాతీయుల రిజర్వేషన్’ సమస్యలతో అక్కడి ప్రభుత్వం అదే సమయంలో దక్షిణాఫ్రికా బోర్డుపై నిషేధం విధించింది. 2019లో వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి దానిని 2020కి మార్చారు. అయితే కరోనా కారణంగా వాయిదా తప్పలేదు. 2021లో భారత్లో చాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉండగా, దానిని రద్దు చేసి టి20 ప్రపంచకప్గా మార్చారు. అయితే తమ హక్కులను వదులుకునేందుకు భారత్ ఇష్టపడకపోవడంతో అదే ఏడాది భారత్ (యూఏఈలో) నిర్వహించింది. 2020లో నిర్వహించాల్సిన ఆస్ట్రేలియా దానిని 2022కు మార్చుకోవాల్సి వచ్చింది. గతంలోనూ చాంపియన్స్ ట్రోఫీ సమస్యలతోనే 2009, 2010లో వరుసగా రెండు ప్రపంచకప్లు జరిగాయి. గత రికార్డు ఇప్పటి వరకు 7 టి20 ప్రపంచకప్లు జరగ్గా... వెస్టిండీస్ రెండు సార్లు (2012, 2016), భారత్ (2007), పాక్ (2009), ఇంగ్లండ్ (2010), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి విజేతగా నిలిచాయి. ఫార్మాట్ గత వరల్డ్ కప్ తరహాలోనే ఎలాంటి మార్పూ లేదు. తొలి రౌండ్లో 8 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. ప్రతీ టీమ్ తన గ్రూప్లోని మిగిలిన 3 టీమ్లతో తలపడుతుంది. గ్రూప్లో టాప్–2 జట్లు తర్వాతి దశకు అర్హత సాధిస్తాయి. ► గ్రూప్ ‘ఎ’లో మాజీ చాంపియన్ శ్రీలంక, నమీబియా, నెదర్లాండ్స్, యూఏఈ ఉండగా... ► గ్రూప్ ‘బి’లో రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే ఉన్నాయి. ఇక్కడ ముందంజలో నిలిచిన నాలుగు టీమ్లతో పాటు ర్యాంకింగ్ ద్వారా నేరుగా అర్హత సాధించిన భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లు కలిసి ‘సూపర్ 12’ మ్యాచ్లు ఆడతాయి. ‘సూపర్ 12’ మ్యాచ్లు ఈనెల 22 నుంచి మొదలవుతాయి. ► ‘సూపర్ 12’ గ్రూప్–1లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్... గ్రూప్–2లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ► ‘సూపర్ 12’లోని రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్ నవంబర్ 9న... రెండో సెమీఫైనల్ నవంబర్ 10న జరుగుతాయి. ఫైనల్ నవంబర్ 13న నిర్వహిస్తారు. నేటి మ్యాచ్లు శ్రీలంక vs నమీబియా (ఉదయం గం. 9:30 నుంచి) నెదర్లాండ్స్ vs యూఏఈ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–1,2లో ప్రత్యక్ష ప్రసారం -
చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీతాల పర్యవేక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. పార్క్తోపాటు సమీప ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాల్లో చీతాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. మధ్యప్రదేశ్ అటవీ, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఈ తొమ్మిది మంది సభ్యుల బృందానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సహకరిస్తుంది. కొత్త ప్రాంతాన్ని చీతాలు ఏ మేరకు సొంతస్థలంగా భావిస్తాయి, చీతా ఆరోగ్య స్థితి సమీక్షించడం, వేట నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా ఈ టాస్క్ఫోర్స్ ఏర్పాటైంది. బృందం చేపట్టాల్సిన ఇతరత్రా పనులను మంత్రిత్వశాఖ నిర్ధేశించింది. రెండేళ్లపాటు టాస్క్ఫోర్స్ ఈ ప్రత్యేక విధుల్లో నిమగ్నమై ఉంటుంది. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్లైన్ -
చీతాలకు లంపీ డిసీజ్కు ముడిపెట్టిన నానా పటోలే.. ఏకిపారేసిన బీజేపీ
ముంబై: దేశంలోని పశువుల్లో ప్రబలుతున్న లంపీ డిసీజ్కు, గత నెలలో కేంద్రం విదేశం నుంచి తీసుకొచ్చిన చీతాలతో ముడిపెడ్డారు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే. నైజీరియా నుంచి వచ్చిన చీతాల కరాణంగానే లంపీ డిసీజ్ దేశంలో వ్యాపించి వేలాది పశువులు మృత్యువాతపడ్డాయని ఆరోపించారు. దేశంలోని రైతులకు నష్టం చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం ఈ చీతాలను తీసుకొచ్చిందని అన్నారు. 'వేరే దేశం నుంచి చీతాలను తీసుకొస్తే దేశంలోని రైతులు, నిరుద్యోగం, ధరలపెరుగుదల వంటి సమస్యలు పరిష్కారం కావు. ఇవి చాలవన్నట్లు చీతాలు దేశంలోకి వచ్చాక లంపీ డిసీజ్ ప్రబలింది. గతేడాది నష్టానికి పరిహారంగా రైతులకు కేంద్రం రూ.700 చెల్లించాలి. ఈ ఏడాది బోనస్గా మరో రూ.1000 ఇవ్వాలి అని పటోలే డిమాండ్ చేశారు. బీజేపీ గట్టి కౌంటర్.. అయితే పటోలే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయనకు కనీసం నైజీరియాకు నమీబియాకు తేడా తెలియదని ఎద్దేవా చేసింది. నానా పటోలే మహారాష్ట్ర రాహుల్ గాంధీ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తప్పుడు వార్తలు, అబద్దాల ప్రచారం కాంగ్రెస్కు అలవాటే అని ఏకిపారేసింది. ఈమేరకు బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ట్వీట్ చేశారు. Nana Patole who is Rahul Gandhi of Maharashtra says Lumpy Virus originated in Nigeria & it came because Modi ji brought Cheetahs! Cheetahs came from Namibia Does he know Nigeria & Namibia are different nations? Congress has always spread such lies & rumours 1/n — Shehzad Jai Hind (@Shehzad_Ind) October 3, 2022 కరోనా సమయంలోనూ వ్యాక్సిన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసిందనని షహ్జాద్ విమర్శించారు. ఫేక్ వార్తలను సృష్టిస్తున్న పటోలేపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న నమీబియా నుంచి 8 చీతాలు భారత్కు వచ్చాయి. వీటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. అయితే పటోలే నైజీరియా నుంచి చీతాలను తీసుకొచ్చారని చెప్పడంతో బీజేపీకి మంచి అవకాశం దక్కినట్లయింది. దీన్నే అదనుగా తీసుకుని విమర్శలు గుప్పించింది. చదవండి: కాంగ్రెస్ జీ-23 గ్రూప్పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు -
చీతా ప్రాజెక్టు: లక్ష్యం ఫలించనుందా?.. త్వరలో మరో...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తన 72వ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకు వచ్చిన ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్ గాల్వియర్ కునో నేషన్ పార్క్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడూ అందులోని ఒక చీతా ప్రెగ్నెంట్ అయి ఉండోచ్చని చీతా కన్జర్వేషన్ ఫండ్(సీసీఎఫ్)కి చెందిన డాక్టర్ లారీ మార్కర్ అనుమానం వ్యక్తం చేశారు. ఐతే తాను ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పలేను గానీ, తాము మాత్రం ఈ చీతాలు వచ్చినప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఒక వేళ త్వరలో ఒక చిన్న చీతా కూన వచ్చినట్లయితే అది మనకు నమీబియా నుంచి లభించిన మరో అద్భుతమైన గిఫ్ట్ అనే చెప్పాలి. ఒక వేళ ఆశా అనే పేరు గల ఈ చీతా గనుక ప్రగ్నెంట్ అయితే అదే తొలి చిట్టి చీతా అవుతుందని అన్నారు. అంతేగాదు ఆ చీతాకు(ఆశా) కాస్త స్పేస్ ఇచ్చేలా ఎవరూ దాని వైపుకు రాకుండా చూడాలి, పైగా ఒక బోన్లో చాలా జాగ్రత్తగా ఉంచాలని చెప్పారు. (చదవండి: కునా పార్క్లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫోటోలు తీస్తూ..) -
ఆ అతిథులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఏనుగులు!
భోపాల్: సుమారు 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అరుదైన వన్యప్రాణులైన 8 చీతాలు భారత్లో అడుగుపెట్టాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఈ చిరుతలను.. మధ్యప్రదేశ్లోని షియోపూర్ కునో నేషనల్ పార్క్లో ఈనెల 17వ తేదీన విడిచిపెట్టారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడటానికి మరో రెండు నుంచి నాలుగు నెలల పాట చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. ఆ తర్వాతే స్వేచ్ఛగా జాతీయ పార్క్లో విడిచిపెడతారు. మరోవైపు.. ఈ చీతాల భద్రతకు అన్ని ఏర్పాటు చేప్టటారు కునో పార్క్ నిర్వహణ అధికారులు. చీతాల రక్షణ కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. రెండు ఏనుగులను రంగంలోకి దింపారు. నర్మదాపురంలోని సత్పురా టైగర్ రిజర్వ్కు చెందిన రెండు గజరాజులను కునో పార్క్కు తీసుకొచ్చారు. వాటికి ఉన్న అనుభవం ఆధారంగా గజరాజులు లక్ష్మి, సిద్ధనాథ్లను గత నెలలోనే పార్క్కు తీసుకొచ్చారు అధికారులు. నమీబియా నుంచి తీసుకొచ్చిన చీతాల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లోకి ప్రవేశించిన 5 చిరుతలను బయటకి తరిమేసే ఆపరేషన్లో ఈ రెండు ఏనుగులు కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ రెండు గజరాజులు నేషనల్ పార్క్ సెక్యూరిటీ బృందాలతో కలిసి రేయింబవళ్లు గస్తీ కాస్తున్నాయి. ఏనుగులతో తిరుగుతూ చీతాలను పరిశీలిస్తున్నారు అధికారులు. ఏనుగులు ఉండటం ద్వారా ఏ వన్యప్రాణులు చీతాలు ఉన్న ఎన్క్లోజర్ వైపు రావని చెబుతున్నారు. ‘పులుల రెష్యూ ఆపరేషన్లో 30 ఏళ్ల సిద్ధనాథ్ మంచి గుర్తింపు పొందాడు. అయితే, సిద్ధనాథ్కు టెంపర్ సమస్య ఉంది. 2010లో ఈ ఏనుగు కోపానికి ఇద్దరు బలయ్యారు. అలాగే..2021, జనవరిలో ఓ టైగర్ను నియంత్రించటంలో సిద్ధనాథ్ కీలక పాత్ర పోషించింది. 25 ఏళ్ల లక్ష్మి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, తన పనిలో చాలా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది’ అని తెలిపారు కునో నేషనల్ పార్క్ డీఎఫ్ఓ ప్రకాశ్ కుమార్ వర్మ. ఇదీ చదవండి: 70 ఏళ్ల తర్వాత భారత్లోకి 8 చీతాలు.. వాటిలో ఒకదానికి పేరు పెట్టిన ప్రధాని మోదీ -
అతిథులతో అంతా ఓకేనా?
దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి మన దేశానికి వచ్చిన 8 ఆఫ్రికన్ చీతాలు ఇక్కడ అంతరించిన వన్యప్రాణి జాతిని పునరుద్ధరించడానికి పనికొస్తాయా? భారత ప్రధాని మోదీ తన జన్మదినం సందర్భంగా శనివారం మధ్యప్రదేశ్లోని కూనో జాతీయోద్యానంలోకి వదిలిపెట్టిన ఈ ‘అతిథుల’ గురించి అంతటా ఆసక్తిగా సాగుతున్న చర్చ ఇది. భారత భూభాగంపై ఆసియా ప్రాంత చీతాలు అంతరించిన 70 ఏళ్ళ పైచిలుకు తర్వాత జరుగుతున్న ఈ సాహసోపేత ప్రయోగంపై సహజంగానే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఖండాంతర చీతాల దిగుమతిని పలువురు సానుకూల ప్రయత్నంగా భావిస్తుంటే, కొందరు దీనిలోని ప్రతికూల అంశాలు, ప్రభావాలను ప్రస్తావిస్తున్నారు. గత శతాబ్దపు మొదట్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష చీతాలుంటే, 2016లో చివరిసారిగా లెక్కలు వేసినప్పుడు 7100 వన్యప్రాణులే మిగిలాయి. వాటిలోనూ అధిక భాగం ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో, అతి కొద్దిగా వందలోపు చీతాలు ఇరాన్లో ఉన్నాయి. ఒకప్పుడు మన దేశంలో తమిళనాడులోని తిరునల్వేలి నుంచి సువిశాల ఉత్తరాది పచ్చిక మైదానాల దాకా చీతాలు వేలల్లో ఉండేవట. మహా రాజుల మృగయా వినోదం, జనాభా విస్ఫోటనంతో తగ్గిన పచ్చిక బయళ్ళ లాంటి కారణాలతో అవి కనుమరుగయ్యాయి. అంతరించిన వన్యప్రాణి జాతిగా 1952లో భారత అధికారిక ప్రకటన నుంచి మన దేశంలో వీటి కథ ఓ గత చరిత్ర. ఒకానొక కాలంలో 6 నుంచి 18 రూపాయలకు వేటాడిన చీతాలను మళ్ళీ పెంచి పోషించి, శతాబ్దాల విధ్వంసాన్ని చక్కదిద్దే యత్నమే ‘ప్రాజెక్ట్ చీతా’. ఈ ప్రయోగానికి తగ్గ అటవీ ప్రాంతం కోసం ఏళ్ళ తరబడి అన్వేషించి, చివరకు కూనోను ఎంపిక చేశారు. వాయవ్య మధ్యప్రదేశ్లోని కూనో జాతీయోద్యానం ఒకప్పుడు సమీప గ్వాలియర్ సింధియా మహారాజులకు ఇష్టమైన వేటస్థలం. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా చీతాలున్న నమీబియా నుంచి తెచ్చినవాటిని సెప్టెంబర్ 17న ప్రాథమికంగా ప్రధాని కూనోలోనే విడుదల చేశారు. నెల రోజుల ఏకాంతం తర్వాత 750 చదరపు కి.మీ.ల కూనో సవన్నా అటవీ భూముల్లోకి స్వేచ్ఛగా వదిలేస్తారు. అయితే, ఒకప్పుడు మన దేశంలో సంచరించిన ఏషియాటిక్ రకం చీతాలకు భిన్నమైనవి ఈ ఆఫ్రికన్ చీతాలు. వీటిని ఇలా తమ సహజ ఆవాసాల నుంచి భారత్కు తరలించడం సరైనది కాదని కొందరు నిపుణుల భావన. అయిదేళ్ళకు రూ. 39 కోట్ల ఖర్చుతో కూడిన ఈ చీతాల తరలింపు, నూతన ఆవాస ప్రక్రియ ఆకర్షణీయమే తప్ప, ఆశించిన ఫలితాలివ్వదన్నది వారి వాదన. గంటకు 120 కి.మీ.ల వేగంతో, భూతలంపై అత్యంత వేగవంతమైన ప్రాణి అయిన చీతా స్వేచ్ఛగా సంచరించాలంటే సువిశాల ప్రాంతం కావాలి. అలా ఆఫ్రికన్ చీతాలకు తగిన ఆవాసం కానీ, అవి ఆహారంగా తినే రకం ప్రాణులు కానీ భారత్లో లేవు. గడ్డిభూములు పెంచాలనే లక్ష్యమూ దీనితో సాధ్యం కాదనేది విమర్శకుల అభిప్రాయం. మరికొందరు మాత్రం ఎక్కడ ఉంటే అక్కడ అలవాటు పడే స్వభావం చీతాలది గనక అతి నిరాశ అవసరం లేదంటున్నారు. నిజానికి, ఇండియన్ టైగర్లు, సింహాల పరిరక్షణ కోసం స్వాతంత్య్రానంతరం భారత్లో చేసిన రెండు ప్రధాన వన్యప్రాణి సంరక్షణ పథకాలూ విజయవంతమయ్యాయి. అయితే, అప్పటికే మన దగ్గరున్న పులులు, సింహాల సంతతిని పెంచడంతో అది సాధ్యమైంది. కానీ, ఈసారి ప్రపంచంలో మునుపెన్నడూ లేని విధంగా ఖండాంతర వన్యప్రాణి దిగుమతి చేపట్టాం. అందుకే, ప్రపంచవ్యాప్త జీవ్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. వన్యప్రాణి పరిరక్షణ సాగాలంటే, వాటి సంఖ్య కన్నా ముందు పెరగాల్సింది అటవీ ప్రాంతం. దేశంలో ప్రస్తుత జాతీయోద్యానాలు, వన్యప్రాణి కేంద్రాలు ఏ మేరకు జీవకోటి పరిరక్షణకు సరిపోతు న్నాయో తెలుసుకొనే అధ్యయనాలు ఈమధ్యే మొదలయ్యాయి. హైవేల నిర్మాణం సహా అనేకం వన్యప్రాణి ఆవాసాల పరిధిని కుదించేస్తున్నాయి. తగినంత ఆహారం దొరకక దగ్గరలో ఉన్న జనావాసాలపై అటవీ మృగాల దాడులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. వన్యప్రాణుల కోసమంటూ ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేయిస్తున్న ప్రభువులు, వారి పరివారం తీరా తమ హెలిప్యాడ్, గుడారాల కోసం కూనో ఉద్యానంలో పెద్ద సంఖ్యలో చెట్లు కొట్టేశారు. ప్రకృతిపై ప్రేమతోనే చీతాలు తెచ్చామన్న పాలకుల మాటలకూ, ఈ చేతలకూ పొంతన లేదు. మనుషులకూ, వన్యప్రాణులకూ మధ్య ఘర్షణకు దారి తీస్తున్న ఈ జీవ్యావరణ అసమతౌల్యంపై తక్షణం దృష్టి పెట్టాలి. దేశంలోని గడ్డిభూముల్లో 2005 –15 మధ్య దశాబ్దిలోనే 31 శాతాన్నీ, ఇప్పటికి మొత్తం 95 శాతాన్నీ నాశనం చేసుకున్న భారత్లో చీతాలు ఎక్కడ స్వేచ్ఛగా తిరుగుతాయి? విదేశీ చీతాలను తెచ్చుకొని సాకే కన్నా ఇక్కడ అంతరిస్తున్న అడవి పిల్లి జాతులనూ, బట్టమేక పక్షులనూ పరిరక్షించడం మేలు. అసలైతే గుజరాత్ గిర్ అడవి సింహాల తరలింపునకు కూనో జాతీయోద్యానం సరైనది. లెక్కకు మించి సింహాలున్నా వాటిని తరలించడానికీ, సదరు ఆసియా సింహాలున్న ఏకైక ప్రాంతమనే కీర్తి కిరీటాన్ని పోగొట్టుకోవడానికీ గుజరాత్ నిరాకరిస్తోంది. ఆ సింహాల తరలింపునకు అడ్డుకట్టగానే ఇక్కడ చీతాలు పెట్టారనే ఆరోపణలూ లేకపోలేదు. ఇలాంటి అశాస్త్రీయ ధోరణులే వన్యప్రాణి సంరక్షణకు కీడు. ప్రాణులన్నిటినీ ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తే, ఏదైనా మహమ్మారి తలెత్తితే మొదటికే మోసం వస్తుందని నిపుణుల హెచ్చరిక. నిపుణుల సూచనలు ప్రభుత్వం పట్టించుకోకుంటే ఏ ‘ప్రాజెక్ట్ చీతా’ వల్ల ఏం ప్రయోజనం? -
70 ఏళ్ల తర్వాత భారత్లోకి 8 చీతాలు.. పేరు పెట్టిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్లో చీతాలు మనుగడ మొదలుపెట్టాయి. 1952లో దేశంలో అంతరించిపోయాయని ప్రకటించిన చీతాలు తాజాగా భారత్ గడ్డపై అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు నాడు నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్కు తీసుకువచ్చారు. వీటిలో రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలు ఉన్నాయి. నమీబియా నుంచి వీటిని తీసుకురావడానికి బీ 747 జంబో జెట్కు మార్పులు చేశారు. దీని ముందు భాగంలో చీతా బొమ్మను పెయింట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. Photo Courtesy : Cheetah Conservation Fund ప్రధాని స్వయంగా మధ్యప్రదేశ్లోని కునో–పాల్పూర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి శనివారం ఉదయం 11 గంటలకు చీతాలను విడుదల చేశారు. నమీబియా నుంచి భారత్లో అడుగుపెట్టిన చీతాలను నెల రోజుల పాటు గడ్డి మైదానంతో ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లో క్వారంటైన్ చేశారు. అనంతరం భారతీయ వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడటానికి మరో రెండు నుంచి నాలుగు నెలల పాటు చీతాలను పెద్ద ఎన్క్లోజర్లలో ఉంచి పర్యవేక్షిస్తారు. ఆ తర్వాత స్వేచ్ఛగా జాతీయ పార్కులో విడిచిపెడతారు. చదవండి: చీతాల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు Photo Courtesy : Cheetah Conservation Fund చీతాకు పేరు పెట్టిన మోదీ కునో నేషనల్ పార్క్లో మొదటి రోజు చీతాలు గడ్డిపై ఆడుతూ, పరుగెత్తుకుంటూ, పరిసరాలను గమనిస్తూ గడిపాయి. అయిదు ఆడ చీతాల్లో ఒకదానికి ప్రధాని నరేంద్రమోదీ పేరు పెట్టారు. దాదాపు నాలుగేళ్ల వయసున్న ఈ చీతాను నమీబియాలోని సీసీఎఫ్కు (చిరుత సంరక్షణ నిధి) తీసుకొచ్చిన తర్వాత పేరు పెట్టలేదు. తరువాత ప్రధాని తన పుట్టిన రోజు కానుకగా దీనికి ‘ఆశా’ అనే పేరును సూచించారు. ఆడ చీతాల పేర్లు ఆడ చిరుతలల్లో ఒకదాని పేరు సియాయా. దీని వయసు రెండేళ్లు. ఇది సెప్టెంబర్ 2020 నుంచి సీసీఎఫ్లో ఉంది. మరో చీతా ‘టిబిలిసి’ కాగా దీని వయసు రెండున్నర సంవత్సరాలు. ఇది 2020 ఏప్రిల్ నెలలో నమీబియాలోని ఆగ్నేయ నగరం ఒమరూరులోని ఎరిండి ప్రైవేట్ గేమ్ రిజర్వ్లో జన్మించింది. ఆడ చీతల్లో పెద్దదైనది ‘సాషా’. మరో ఆడ చీతా సవన్నా.. వీటిని వాయువ్య నమీబియా నుంచి తీసుకొచ్చారు. Photo Courtesy : Cheetah Conservation Fund మగ చీతాల పేర్లు ఇవే మగ చీతాలు మూడు ఉండగా అందులో మొదటిది ఐదేళ్ల ‘ఫ్రెడ్డీ’. దాని సోదరుడు ఎల్టన్. దీని వయసు అయిదున్నర సంవత్సరాలు. ఇవి 2021 జూలై నుంచి సీసీఎఫ్ ప్రైవేట్ రిజర్వ్లో ఉంటున్నాయి. ఇక మూడో మగ చీతా నాలుగున్నర ఏళ్ల వయసున్న ‘ఓబాన్’. ఇది మార్చి 2018లో ఎరిండి ప్రైవేట్ గేమ్ రిజర్వ్లో జన్మించింది. కాగా చిరుతలు ఎన్క్లోజర్లో విడుదలైన క్షణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోన్ మీదుగా ఏర్పాటు చేసిన ఎత్తైన వేదికపై నుంచి అత్యాధునిక డీఎస్ఎల్ఆర్ కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవి మన అతిథులని, కొద్ది నెలల్లో కునో పార్కును తమ నివాసంగా మార్చుకుంటాయని హర్షం వెలిబుచ్చారు. చదవండి: కోతి తెలివి సల్లగుండ.. ఇలా కూడా చేస్తాయా!.. వైరలవుతున్న వీడియో Photo Courtesy : Cheetah Conservation Fund -
కునో పార్క్లోకి చీతాలను వదిలిన ప్రధాని మోదీ (ఫొటోలు)
-
చీతా ప్రాజెక్టు: చీతాలను వదిలిన ప్రధాని మోదీ
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మరో చరిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. చీతా ప్రాజక్టులో భాగంగా.. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను శనివారం ఉదయం ప్రధాని మోదీ స్వయంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ కునో నేషనల్ పార్క్లోకి విడుదల చేశారు. తన 72వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేం. సుమారు 74 ఏళ్ల తర్వాత అరుదైన వన్యప్రాణులైన చీతాలు భారత్లో అడుగుపెట్టాయి. మొత్తం ఎనిమిది చీతాలను ప్రత్యేక పరిస్థితుల నడుమ భారత్కు తీసుకొచ్చారు. వాటిని నమీబియా పరిస్థితులకు దగ్గరగా ఉండే షియోపూర్ ప్రాంతంలో కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా మోదీ వెంట ఉన్నారు. మోదీ స్వయంగా వాటిని ఫొటోలు తీస్తూ కనిపించారు. Prime Minister Narendra Modi releases the cheetahs that were brought from Namibia this morning, at Kuno National Park in Madhya Pradesh. pic.twitter.com/dtW01xzElV — ANI (@ANI) September 17, 2022 చీతా ప్రాజెక్టులో భాగంగా.. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో బోయింగ్ విమానంలో వాటిని శనివారం గ్వాలియర్లోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దించారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆ విమానానికి స్వాగతం పలికారు. ఆపై ఆ చీతాలను వైమానిక విమానంలో కునో నేషనల్ పారర్క్కు తరలించారు. మూడు మగ, ఐదు ఆడ చీతాలతో జనాభా పెంచే ప్రయత్నం చేయనుంది ప్రభుత్వం. -
మోదీకి ఇంతకు మించి గొప్ప గిఫ్ట్ మరొకటి లేదు!
న్యూఢిల్లీ: మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఎనిమిది చిరుతలు నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్కి రానున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై మధ్యప్రదేశ్ ముఖ్యమత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ... మోదీకి తాము ఇంతకు మించి గొప్ప బహుమతి ఇవ్వలేమని అన్నారు. అతిపెద్ద వన్యప్రాణులను జంబో జెట్ ద్వారా తరలించడం అనేది చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. దీని వల్ల కునో పాల్పూర్ ప్రాంతం పర్యాటకంగా వేగంగా వృద్ధి చెందుతుందని అన్నారు. భారత్ గతంలో ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉంది. ఐతే 1952 నాటికి ఈ జాతులు అంతరించిపోయాయి. ప్రాజెక్ట్ చీతా అనే ఖండాంతర ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్టులో భాగంగా ఈ చిరుతలను నమీబియా నుంచి భారత్కి తీసుకువస్తున్నారు. ఇది ప్రపంచంలోనే తొలి అంతర్ ఖండాంతర భారీ వైల్డ్ మాంసాహార ట్రాన్స్ లోకేషన్ ప్రాజెక్ట్ అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ చిరుతలు భారత్లోని ఓపెన్ ఫారెస్ట్ గడ్డి భూములు, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణలో సహాయపడతాయని పేర్కొంది. అంతేగాదు ఇది జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి, నీటి భద్రత, కార్బన్ సీక్వెస్ట్రేషన్, నేల తేమ సంరక్షణ వంటి పర్యావరణ వ్యవస్థ సేవలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని వెల్లడించింది. నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో వస్తున్న 8 చిరుతలు మధ్యప్రదేశ్లోని గాల్వియర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాయి. అక్కడ నుంచి కునో నేషనల్ పార్క్కి హెలికాప్టర్లో తరలిస్తారు.ఈ చిరుతల్లో ఐదు ఆడ చిరుతలు రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసుస్సు గలవి, మూడు మగ చిరుతలు 4 నుంచి 5 ఏళ్ల మధ్య వయసు గలవి ఉన్నాయి. (చదవండి: మోదీ పుట్టిన రోజు ప్రత్యేకం: ఆయన ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?) డెబ్భై ఏళ్ల తర్వాత స్పెషల్ జర్నీతో భారత్లో అడుగు.. చీతాల కోసం ఆ ప్లేస్ ఎందుకంటే.. -
70 ఏళ్ల తర్వాత.. స్పెషల్ జర్నీతో భారత్లో అడుగు
దాదాపు ఏడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత చీతాల మెరుపు కదలికల్ని దేశంలో చూడబోతున్నాం. అంతరించిపోయిన వన్యప్రాణుల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో భాగంగా నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్కు తీసుకువస్తున్నారు. ప్రధాని మోదీ తన పుట్టిన రోజునాడు మధ్యప్రదేశ్లోని కునో–పాల్పూర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోకి చీతాలను విడుదల చేస్తారు. రెండు నుంచి ఆరేళ్ల మధ్య వయసున్న మూడు మగ, అయిదు ఆడ చీతాలను తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారు. నమీబియా రాజధాని విండ్హెక్ నుంచి శుక్రవారం రాత్రి ప్రత్యేక విమానం బయల్దేరి రాజస్తాన్లోని జైపూర్కి శనివారం ఉదయం చేరుకుంటుంది. అక్కడ్నుంచి హెలికాప్టర్లో మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్కి తరలిస్తారు. వీటిని తీసుకురావడానికి బీ747 జంబో జెట్కు మార్పులు చేశారు. దీని ముందు భాగంలో చీతా బొమ్మను పెయింట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. చీతాల క్షేమమే లక్ష్యంగా ప్రయాణంలో చీతాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విమానాల్లో ప్రయాణించేటప్పుడు జంతువులకి కడుపులో తిప్పడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వాటికి ఆహారం ఇవ్వకుండా ఖాళీ కడుపుతో తీసుకువస్తారు. విమానంలో చీతాలను ఉంచడానికి 114సెం.మీ గీ8సెం.మీ గీ84సెం.మీ బోనుల్ని ఏర్పాటు చేశారు. ప్రయాణంలో చీతాల బాగోగుల్ని చూడడానికి ముగ్గురు సంరక్షకులు వెంట ఉంటారు. ప్రత్యేక శ్రద్ధ వన్యప్రాణుల్ని ఖండాంతరాలకు తరలించాల్సి వస్తే ప్రయాణానికి ముందు తర్వాత నెల రోజులు క్వారంటైన్లో ఉంచాలి. ఆ నిబంధనలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. కునో జాతీయ పార్కులో చీతాలను ఉంచడానికి భారీ ఎన్క్లోజర్ను ఏర్పాటు చేశారు. చీతాల నుంచి ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా ఇప్పటికే వాటికి వ్యాక్సిన్లు ఇచ్చారు. క్వారంటైన్ సమయం పూర్తయ్యాక కొత్త వాతావరణానికి చీతాలు అలవాటు పడడం కోసం కొన్నాళ్లు అవి స్వేచ్ఛగా విహరించడానికి వీలుగా వదిలేస్తారు. అందుకే కునో నేషనల్ పార్కు చుట్టుపక్కల ఉన్న 24 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు తరలించారు. నమీబియాలో వాతావరణానికి దగ్గరగా కునో పార్క్ ఉంటుంది. అందుకే అక్కడే వాటిని ఉంచాలని నిర్ణయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చిరుతల కోసం 'పులి విమానం'.. ఫోటోలు వైరల్..
న్యూఢిల్లీ: భారత్కు 8 చీతాలను(చిరుతలు) తీసుకొచ్చేందుకు ప్రత్యేక జంబో జెట్ నమీబియా రాజధాని విండ్హోక్కు వెళ్లింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ కస్టమైజ్డ్ విమానం ముందు భాగాన్ని పులి ఫోటోతో తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ విమానం ఫోటోలను నమీబియాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. చిరుతలను భారత్కు తీసుకొచ్చేందు 'టైగర్ విమానం' విండ్హోక్లో ల్యాండ్ అయిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. A special bird touches down in the Land of the Brave to carry goodwill ambassadors to the Land of the Tiger.#AmritMahotsav #IndiaNamibia pic.twitter.com/vmV0ffBncO — India In Namibia (@IndiainNamibia) September 14, 2022 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ 8 చిరుతలు సెప్టెంబర్ 17న భారత్కు రానున్నాయి. మొదట రాజస్థాన్లో ల్యాండ్ అయి, ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో వీటిని విడుదల చేస్తారు. మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 8 చిరుతల్లో ఐదు మగవి కాగా.. మూడు ఆడవి. అంతరించిపోయిన జాతి.. ఈ అరుదైన చిరుతలు దేశంలో అంతరించిపోయినట్లు 1952లోనే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వీటిని పునరుత్పత్తి చేసేందుకు ఇతర దేశాల నుంచి చిరుతలను భారత్కు తీసుకురావడానికి 1970 నుంచి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ఈ ఏడాది జులైలో నమీబియాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్ ప్రభుత్వం. ఇంటర్కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్టులో భాగంగా 8 చిరుతలను నమీబియా నుంచి తీసుకొస్తోంది. ఈ ప్రాజెక్టు కోసమే పులి విమానాన్ని తయారు చేశారు. ఇందులో చిరుతల కోసం ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. అంతేకాదు 16 గంటల పాటు ఈ విమానం నిర్విరామంగా ప్రయాణించి భారత్కు చేరుకోనుంది. మధ్యలో ఎక్కడా ఇంధనం కోసం కూడా ఆగాల్సిన అవసరం లేకుండా దీన్ని రూపొందించారు. ఈ 16 గంటలు చిరుతలకు ఎలాంటి ఆహారం అందించరు. గాల్లోనే ప్రయాణిస్తున్నందున వాటికి న్యూయేసియా వంటి సమస్యలు రాకుండా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: నితీశ్ కుమార్తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు -
టీ20 ప్రపంచకప్కు జట్టును ప్రకటించిన నమీబియా
టీ20 ప్రపంచకప్-2022కు 16 మంది సభ్యలతో కూడిన తమ జట్టును నమీబియా క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు గెర్హార్డ్ ఎరాస్మస్ సారథ్యం వహించనున్నాడు. నమీబియా యువ బ్యాటర్లు లోహన్ లౌరెన్స్, దివాన్ లా కాక్, పేసర్ తంగేని లుంగమేని తొలిసారిగా టీ20 ప్రపంచకప్లో పాల్గొనున్నారు. కాగా గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో నమీబియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి జట్లును ఓడించి టీ20 ప్రపంచకప్-2021లో సూపర్ 12 దశకు నమీబియా చేరుకుంది. సూపర్-12లో తమ పోరాట పటమతో అందరినీ నమీబియా అకట్టుకుంది. ఇక టీ20 ప్రపంచకప్-2022 రౌండ్-1లో గ్రూప్ Aలో శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ వంటి జట్లతో నమీబియా తలపడనుంది. కాగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్కు నమీబియా జట్టు: గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జెజె స్మిత్, దివాన్ లా కాక్, స్టీఫెన్ బార్డ్, నికోల్ లాఫ్టీ ఈటన్, జాన్ ఫ్రైలింక్, డేవిడ్ వైస్, రూబెన్ ట్రంపెల్మాన్, జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, టాంగెని లుంగమేని, మైఖేల్ వాన్ లింగేన్, బెన్ షికోన్గోస్ట్, బెన్ షికోన్గోస్ట్, , లోహన్ లౌరెన్స్, హెలావో యా ఫ్రాన్స్. చదవండి: Urvashi Rautela: లైట్ తీసుకున్న పంత్.. చేతులు జోడించి సారీ చెప్పిన ఊర్వశి.. వీడియో వైరల్! -
జపాన్లో తొలి ఒమిక్రాన్ కేసు
Japan confirms first Omicron Covid Case: జపాన్ కొత్త కరోనా వైరస్ వేరియంట్ దృష్ట్యా విదేశీయులను నిషేధించిన తర్వాత రోజే తొలి ఒమిక్రాన్ వైరస్ కేసును గుర్తించనట్లు ప్రకటించింది. అయితే నమీబియా నుంచి వచ్చిన 30 ఏళ్ల ప్రయాణికుడిని ప్రభుత్వ నిబంధన మేరకు చేసిని కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. దీంతో అతనిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్లో ఉంచి చేసిన పలు పరీక్షలో ఓమిక్రాన్ కేసుగా నిర్ధారించబడిందని ప్రభుత్వ ప్రతినిధి హిరోకాజు మట్సున్ అన్నారు. (చదవండి: బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!) అంతేకాదు హిరోకాజు జపాన్లో ధృవీకరించిన తొలి కేసుగా పేర్కొన్నారు. ఇటీవలే జపాన్ కొంత మంది విద్యార్థులకు, వ్యాపార నిమిత్తం విదేశాలు ప్రయాణించే వారికి కొన్ని నిబంధనలు సడలించింది. అయితే దక్షణాఫ్రికా ఒమిక్రాన్ కొత్త కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో జపాన్ ఈ కరోనా ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు జపాన్ కొత్త నిబంధనలు ప్రకారం జపాన్ పౌరులు, ఇప్పటికే ఉన్న విదేశీ నివాసితులు మాత్రమే దేశంలోకి ప్రవేశిగలరని అధికారులు అన్నారు. పైగా జపాన్ దాదాపు 77 శాతం వ్యాక్సినేషన్ ప్రకియను విజయవంతంగా పూర్తి చేసింది. (చదవండి: ఆ వైరస్ని చూసి భయపడుతూ.. తిట్టుకుంటూ కూర్చోవద్దు!!) -
T20 WC: పసికూన నమీబియా.. టీమిండియాతో సమానంగా...
T20 World Cup 2021: Do You Know India Get As Much Money As Namibia: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ముగిసి రెండు వారాలు కావొస్తున్నా మెగా ఈవెంట్కు సంబంధించిన విశేషాలు ఇప్పటికీ అభిమానుల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. సుదీర్ఘకాలంగా అందన్ని ద్రాక్షగా ఉన్న పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా... ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియాకు మాత్రం చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. తొలుత పాకిస్తాన్.. ఆ తర్వాత న్యూజిలాండ్తో కీలక మ్యాచ్లలో ఓడి కనీసం సెమీస్ చేరకుండానే కోహ్లి సేన వెనుదిరగడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అదే సమయంలో ఈ మెగా టోర్నీకి తొలిసారి అర్హత సాధించిన నమీబియా... ఏకంగా రౌండ్ 12కు చేరడం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు... పసికూన నమీబియా.. అత్యంత సంపన్న బోర్డుకు చెందిన టీమిండియాతో సమానంగా ప్రైజ్ మనీ గెలుచుకుంది తెలుసా! ప్రైజ్ మనీ 1.42 కోట్లు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో తొలిసారిగా నిర్వహించిన సూపర్ 12 రౌండ్కు అర్హత సాధించిన జట్లకు 52 లక్షల రూపాయాలతో పాటు టోర్నీలో విజయాల ఆధారంగా అదనంగా ఒక్కో మ్యాచ్కు 30 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా దక్కింది. ఇక గ్రూపు-2లో ఉన్న భారత్.. పాకిస్తాన్, కివీస్ చేతిలో ఓడినా.. అఫ్గనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ 12కు నేరుగా అర్హత సాధించిన కోహ్లి సేనకు 52 లక్షల రూపాయలు సహా... మూడు విజయాలకు గానూ 90 లక్షలు... అంటే మొత్తంగా 1.42 కోట్ల రూపాయలు ముట్టాయి. నమీబియా సైతం టీమిండియా మాదిరిగానే 1.42 కోట్లు దక్కించుకుంది. స్కాట్లాండ్కు కూడా కోటి నలభై రెండు లక్షలు గెలుచుకుంది. ఈ రెండు జట్లు సూపర్ 12లో భారీ స్థాయిలో రాణించకపోయినా... క్వాలిఫైయర్స్లో విజయాలు సాధించినందుకు ఈ మొత్తం అందుకున్నాయి. మరి.. క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న బోర్డు అయిన టీమిండియా.. మెగా ఈవెంట్లో ఈ చిన్న జట్ల మాదిరిగానే అదే స్థాయి ప్రైజ్ మనీ గెలుచుకోవడం గమనార్హం. టీ20 వరల్డ్కప్-2022 ఎప్పుడంటే! ఈ ఏడాది చాంపియన్ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్కప్-2022 ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది అక్టోబరు 16 నుంచి పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానుంది. నవంబరు 13న ఫైనల్ నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. టీ20 వరల్డ్కప్ 2021 విజేత ఆస్ట్రేలియా, రన్నరప్ న్యూజిలాండ్ సహా ఇండియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సూపర్ 12 దశకు నేరుగా అర్హత సాధించాయి. నమీబియా, స్కాట్లాండ్, రెండుసార్లు చాంపియన్ వెస్టిండీస్, మాజీ చాంపియన్ శ్రీలంక క్వాలిఫయర్స్ ఆడనున్నాయి. ఇక ఈ ఏడాది టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియా సారథి కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో రన్నరప్ న్యూజిలాండ్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసి భారత్ సత్తా చాటింది. ఈ నేపథ్యంలో ఇలాగే విజయపరంపర కొనసాగించడమే గాక.. 2022 వరల్డ్కప్ గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: IPL 2022 Mega Auction: ఎటూ తేల్చుకోలేకపోతున్న సన్రైజర్స్.. రషీద్ ఖాన్కు గుడ్బై.. అదే జరిగితే! -
Virat Kohli: ఆరోజే గనుక వస్తే క్రికెట్ ఆడటం మానేస్తాను.. కోహ్లి ఉద్వేగం
T20 WC 2021 Virat Kohli Comments After Playing His Last T20 Match As Captain: ‘‘చాలా రిలీఫ్గా ఫీలవుతున్నా. కెప్టెన్గా ఉండటం నిజంగా గొప్ప గౌరవం. అయితే, పని భారాన్ని తగ్గించుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నాను. దాదాపు గత ఆరేడేళ్లుగా అధిక పనిభారం, ఒత్తిడి ఉంది. అయినా.. మా వాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఈ టోర్నీలో మాకు అనుకున్న ఫలితాలు రాలేదని తెలుసు. కానీ.. బాగానే ఆడాము అనుకుంటున్నాం. టీ20 క్రికెట్ భిన్నమైంది. మొదటి రెండు ఓవర్లలో ఎవరు పైచేయి సాధిస్తారో వారి అధిపత్యం కొనసాగుతుంది. తొలి రెండు మ్యాచ్లలో మేం ఇదే మిస్సయ్యాం. ఇది వరకు చెప్పినట్లుగానే.. ఆ మ్యాచ్లలో మేము తెగించి ఆడలేకపోయాం. అది నిజంగా కఠిన సమయం. రవి భాయ్... సహాయక సిబ్బందికి ధన్యవాదాలు. సుదీర్ఘకాలంగా వారు గొప్పగా పనిచేస్తున్నారు. ఆటగాళ్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా కృషి చేశారు. ఇంకో మాట.. ఇకపై కూడా మునుపటి దూకుడు కొనసాగుతుంది. ఆ దూకుడే గనుక చూపనినాడు నేను క్రికెట్ ఆడటం మానేస్తాను. కెప్టెన్ కాకముందు కూడా జట్టు విజయాలలో నా వంతు పాత్ర పోషించాను. అలాగే ముందుకు సాగుతాను’’ అంటూ నమీబియాపై టీమిండియా విజయం అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మేరకు ఉద్వేగపూరితంగా మాట్లాడాడు. భారత జట్టు టీ20 సారథిగా తనకు ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఇన్నాళ్లు తనకు అండగా నిలిచిన కోచ్లు, సహాయక సిబ్బంది, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై పూర్తిస్థాయిలో బ్యాటర్గా తన సేవలు అందిస్తానని చెప్పుకొచ్చాడు. కాగా టీ20 వరల్డ్కప్-2021 టోర్నీలో భాగంగా టీమిండియా నవంబరు 8న తమ చివరి మ్యాచ్ ఆడింది. టీ20 ప్రపంచకప్లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన కోహ్లి సేన.. కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నమీబియాతో నామమాత్రపు మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా మరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. స్కోర్లు: నమీబియా- 132/8 (20) ఇండియా- 136/1 (15.2) చదవండి: T20 World Cup 2021: టీమిండియా నిష్క్రమణపై పాక్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు.. కౌంటరిచ్చిన వసీం జాఫర్ .@ImRo45 & @klrahul11 score fifties as #TeamIndia seal a clinical 9⃣-wicket win over Namibia. 👏 👏#T20WorldCup #INDvNAM Scorecard ▶️ https://t.co/kTHtj7LdAF pic.twitter.com/4HgbvFAyWJ — BCCI (@BCCI) November 8, 2021 -
IND Vs NAM: రాణించిన రోహిత్, రాహుల్.. నమీబియాపై టీమిండియా ఘన విజయం
రాణించిన రోహిత్, రాహుల్.. నమీబియాపై టీమిండియా ఘన విజయం సమయం 22:28.. నామమాత్రపు మ్యాచ్లో నమీబియా నిర్ధేశించిన 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా.. రోహిత్ శర్మ(37 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్(36 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో రాణించడంతో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాహుల్, సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 25; 4 ఫోర్లు)లు 15.2 ఓవర్లలో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. నమీబియా బౌలర్లలో ఫ్రైలింక్కు ఏకైక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా ఆటగాళ్లు.. టీ20 కెప్టెన్గా విరాట్ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలికారు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ(56) ఔట్ సమయం 22:00.. నమీబియా బౌలర్లను ఊచకోత కోసిన రోహిత్ శర్మ(37 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎట్టకేలకు ఔటయ్యాడు. జాన్ ఫ్రైలింక్ వేసిన 10వ ఓవర్ ఐదో బంతికి రోహిత్ పెవిలియన్ బాట పట్టాడు. 10 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 87/1. క్రీజ్లో కేఎల్ రాహుల్(31), సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. రాణించిన భారత స్పిన్నర్లు.. నమీబియా గౌరవప్రదమైన స్కోర్ సమయం 20:59.. టీమిండియా స్పిన్నర్లు అశ్విన్(3/20), జడేజా(3/16), పేసర్ బుమ్రా(2/19) రాణించడంతో నమీబియా గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. షమీ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ట్రంపెల్మెన్(13).. ఫోర్, సిక్సర్ సహా 13 పరుగులు రాబట్టడంతో నమీబియా ఈ స్కోర్ సాధించగలిగింది. నమీబియా ఇన్నింగ్స్లో డేవిడ్ వీస్(26) టాప్ స్కోరర్గా నిలిచాడు. 94 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన నబీమియా అశ్విన్(3/20), జడేజా(3/16) తమ స్పిన్ మాయాజాలంతో పసికూన నమీబియాను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఫలితంగా నమీబియా 94 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. 18 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 114/7. క్రీజ్లో డేవిడ్ వీస్(25), జాన్ ఫ్రైలింక్(12) ఉన్నారు. జడ్డూ మాయాజాలం.. మూడో వికెట్ కోల్పోయిన నమీబియా సమయం 20:03.. రవీంద్ర జడేజా మరోసారి మాయ చేశాడు. నమీబియా ఆటగాడు స్టీఫెన్ బార్డ్(21 బంతుల్లో 21; ఫోర్, సిక్స్)ను బోల్తా కొట్టించాడు. 7.4వ ఓవర్లో బార్డ్.. జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఫలితంగా నమీబియా 39 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. క్రీజ్లో గెర్హార్డ్ ఎరాస్మస్(2), లాఫ్టీ ఈటన్ ఉన్నారు. జడ్డూ కమాల్.. రెండో వికెట్ కోల్పోయిన నమీబియా సమయం 19:57.. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా మాయ చేశాడు. అద్భతమైన బంతితో క్రెయిగ్ విలియమ్స్(0)ను బోల్తా కొట్టించాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ సూపర్ స్టంపింగ్తో నమీబియా రెండో వికెట్ కోల్పోయింది. 6 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 34/2. క్రీజ్లో స్టీఫెన్ బార్డ్(15),గెర్హార్డ్ ఎరాస్మస్ ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన నమీబియా..వాన్ లింగెన్(14) ఔట్ సమయం 19:51.. టాస్ ఓడి టీమిండియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన నమీబియా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరగులు చేసింది. అయితే, 5వ ఓవర్లో బుమ్రా నమీబియాను దెబ్బకొట్టాడు. వాన్ లింగెన్(15 బంతుల్లో 14; 2 ఫోర్లు)ను ఔట్ చేశాడు. 5 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 33/1. క్రీజ్లో స్టీఫెన్ బార్డ్(15), క్రెయిగ్ విలియమ్స్ ఉన్నారు. దుబాయ్: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. సెమీస్ ఆశలు ఆవిరైన నేపథ్యంలో నామమాత్రపు పోరులో నేడు(నవంబర్ 8) పసికూన నమీబియాతో తలపడనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. టీ20 సారథిగా విరాట్ కోహ్లికి ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఈ నామమాత్రపు పోరుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించి టీ20 సారధిగా విరాట్ కోహ్లికి ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా చూస్తుండగా.. కోహ్లి సేనకు కనీస పోటీనైనా ఇవ్వాలని నమీబియా భావిస్తుంది. కోహ్లి సహా రవిశాస్త్రి నేతృత్వంలోని శిక్షణా బృందానికి సైతం ఇదే చివరి మ్యాచ్ కావడంతో భారత డ్రెసింగ్ రూమ్లో తీవ్ర భావోద్వేగం నెలకొంది. తుది జట్లు: భారత్: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లి(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా నమీబియా: స్టీఫెన్ బార్డ్, క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), డేవిడ్ వీస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిట్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, జాన్ ఫ్రైలింక్ -
Nz Vs Nam: కివీస్ హ్యాట్రిక్.. సెమీస్కు చేరువలో విలియమ్సన్ బృందం!
New Zealand Beat Namibia By 52 Runs Close To Semis: ఆల్రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం సాధించింది. నమీబియాను భారీ తేడాతో ఓడించింది. గ్రూప్–2 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్లో టాపార్డర్ నిరాశపరిచినా మిడిలార్డర్ న్యూజిలాండ్ను నిలబెట్టింది. బౌలింగ్లో బౌల్ట్, సౌతీ దెబ్బతీయడంతో నమీబియా ఏ దశలోనూ లక్ష్యంవైపు నడవలేకపోయింది. వరుస విజయాలతో జోరుమీదున్న న్యూజిలాండ్ రేపు అఫ్గానిస్తాన్తో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా దర్జాగా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. షార్జా: టి20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ వరుస విజయాలు సెమీస్ అవకాశాల్ని మెరుగు పరుస్తున్నాయి. శుక్రవారం గ్రూప్–2లో జరిగిన లీగ్ మ్యాచ్లో కివీస్ 52 పరుగులతో నమీబియాపై నెగ్గింది. మొదట న్యూజిలాండ్ నిరీ్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (21 బంతుల్లో 39 నాటౌట్; ఫోర్, 3 సిక్స్లు), నీషమ్ (23 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 2 సిక్స్లు) మెరిపించారు. తర్వాత నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులే చేయగలిగింది. కివీస్ బౌలర్లు సౌతీ (2/15), బౌల్ట్ (2/20) నిప్పులు చెరిగారు. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన నీషమ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. కివీస్ ఆరంభం చెదిరింది... టాస్ నెగ్గిన నమీబియా బౌలింగ్ ఎంచుకోగా... బౌలర్లు వీస్, బెర్నార్డ్ ఇందుకు తగ్గట్లే న్యూజి లాండ్ను ఆరంభంలో వణికించారు. దీంతో ఓపెనర్లు గప్టిల్ (18; ఫోర్, సిక్స్), మిచెల్ (19; 2 ఫోర్లు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. 43 పరుగులకే 2 కీలక వికెట్లు నేలకూలాయి. ఈ దశలో కెప్టెన్ విలియమ్సన్ (25 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్), కాన్వే (17; ఫోర్)తో కలిసి జట్టును నడిపించాడు. తొలి 10 ఓవర్లలో కివీస్ 62/2 స్కోరు చేసింది. తర్వాత విలియమ్సన్... ఎరాస్మస్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ కాగా... స్వల్ప వ్యవధిలో కాన్వే రనౌటయ్యాడు. ఫిలిప్స్, నీషమ్ క్రీజులోకి రాగా 16 ఓవర్లు పూర్తయినా కివీస్ స్కోరు (96/4) వంద దాటలేదు. కానీ ఇద్దరూ ఆఖరి 4 ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. భారీ సిక్సర్లతో విరుచకుపడటంతో 24 బంతుల్లోనే 67 పరుగులు వచ్చాయి. స్కోరు వాయువేగంతో దూసుకెళ్లింది. క్రికెట్ కూన నమీబియాకు 164 పరుగుల లక్ష్యం కష్టసాధ్యమైంది. కష్టంగా పవర్ ప్లే వరకు వికెట్లు కాపాడుకున్నారు. ఓపెనర్లు బార్డ్ (21; 2 ఫోర్లు), వాన్ లింగెన్ అవుటయ్యాక వచ్చిన వారిలో గ్రీన్ (23; ఫోర్, సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాట్స్మెన్ ఏటికి ఎదురీదలేక, కొండలా మారిన లక్ష్యాన్ని కరిగించలేక చేతులెత్తేశారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) రూబెన్ (బి) వీస్ 18; మిచెల్ (సి) లింగెన్ (బి) స్కాట్జ్ 19; విలియమ్సన్ (బి) ఎరాస్మస్ 28; కాన్వే (రనౌట్) 17; ఫిలిప్స్ (నాటౌట్) 39; నీషమ్ (నాటౌట్) 35; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–30, 2–43, 3–81, 4–87. బౌలింగ్: స్కాట్జ్ 3–0–15–1, రూబెన్ 3–0–25–0, వీస్ 4–0–40–1, స్మిట్ 2–0–27–0, నికోల్ లోఫ్టి 2–0–24–0, ఎరాస్మస్ 4–0–22–1, బిర్కెన్స్టాక్ 2–0–9–0. నమీబియా ఇన్నింగ్స్: బార్డ్ (బి) సాన్ట్నర్ 21; లింగెన్ (బి) నీషమ్ 25; ఎరాస్మస్ (సి) కాన్వే (బి) సోధి 3; గ్రీన్ (సి) బౌల్ట్ (బి) సౌతీ 23; వీస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సౌతీ 16; స్మిట్ (నాటౌట్) 9; నికోల్ లోఫ్టి (సి) గప్టిల్ (బి) బౌల్ట్ 0; క్రెయిగ్ విలియమ్స్ (సి) ఫిలిప్స్ (బి) బౌల్ట్ 0; రూబెన్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 111. వికెట్ల పతనం: 1–47, 2–51, 3–55, 4–86, 5–102, 6–103, 7–105. బౌలింగ్: సౌతీ 4–0–15–2, బౌల్ట్ 4–0–20–2, మిల్నే 4–0–25–0, సాన్ట్నర్ 4–0–20–1, నీషమ్ 1–0–6–1, సోధి 3–0–22–1. చదవండి: Virat Kohli: పుట్టినరోజున సంతోషం.. జడ్డూ సూపర్.. నవంబరు 7న ఏం జరుగుతుందో మరి! New Zealand edge closer to the semis 📈#T20WorldCup | #NZvNAM | https://t.co/Jkn8Z7ProZ pic.twitter.com/lM6BHLrLa2 — T20 World Cup (@T20WorldCup) November 5, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
NZ Vs NAM: పసికూనపై న్యూజిలాండ్ ప్రతాపం.. 52 పరుగుల తేడాతో ఘన విజయం
పసికూనపై న్యూజిలాండ్ ప్రతాపం.. 52 పరుగుల తేడాతో ఘన విజయం సమయం 18: 52.. 164 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. న్యూజిలాండ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి కేవలం 111 పరుగుల మాత్రమే చేయగలిగింది. ఫలితంగా న్యూజిలాండ్ పసికూన నమీబియాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. నమీబియా ఇన్నింగ్స్లో వాన్ లింగెన్(22), స్టీఫెన్ బార్డ్(21), జేన్ గ్రీన్(23), డేవిడ్ వీస్(17) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. కివీస్ బౌలర్లలో సౌథీ, బౌల్ట్ చెరో రెండు వికెట్లు సాధించగా.. సాంట్నర్, నీషమ్, సోధీ తలో వికెట్ పడగొట్టారు. ఓటమి దిశగా నమీబియా సమయం 18:38.. 18వ ఓవర్ ఐదో బంతికి నమీబియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్లో బౌల్ట్కు క్యాచ్ ఇచ్చి జేన్ గ్రీన్ 27 బంతుల్లో 23; ఫోర్, సిక్స్) ఔటయ్యాడు. 18 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 102/5. నాలుగో వికెట్ కోల్పోయిన నమీబియా.. డేవిడ్ వీస్(16) ఔట్ ఇన్నింగ్స్ 15వ ఓవర్లో నమీబియా నాలుగో వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్లో డేవిడ్ వీస్(17 బంతుల్లో 16; ఫోర్, సిక్స్) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 86/4. క్రీజ్లో జేన్ గ్రీన్(16), జెజె స్మిట్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన నమీబియా సమయం 17:59.. కివీస్ స్పిన్నర్లు నమీబియా బ్యాటింగ్ లయను దెబ్బ కొట్టారు. వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టారు. సాంట్నర్ వేసిన 8.1వ ఓవర్లో బార్డ్(22 బంతుల్లో 21; 2 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ కాగా.. 10వ ఓవర్ రెండో బంతికి సోధి బౌలింగ్లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి ఎరాస్మస్(4 బంతుల్లో 3) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 56/3. క్రీజ్లో గ్రీన్(3), వీస్(1) ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన నమీబియా.. 7.2 ఓవర్ల తర్వాత 47/1 సమయం 17:48.. 164 పరుగుల లక్ష్య ఛేదనలో నమీబియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు వాన్ లింగెన్(25 బంతుల్లో 25; 2 ఫోర్లు, సిక్స్), స్టీఫెన్ బార్డ్(19 బంతుల్లో 19; 2 ఫోర్లు) తొలి వికెట్కు 47 పరుగులు జోడించారు. అయితే, 7.2వ ఓవర్లో నీషమ్ బౌలింగ్లో వాన్ లింగెన్ ఔట్ కావడంతో నమీబియా తొలి వికెట్ కోల్పోయింది. 8 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 51/1. రాణించిన నీషమ్, ఫిలిప్స్.. నమీబియా టార్గెట్ 164 సమయం 17:07.. జిమ్మీ నీషమ్(23 బంతుల్లో 35 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్(21 బంతుల్లో 39 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) ఆఖర్లో చెలరేగడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గప్తిల్(18), డారిల్ మిచెల్(19), డెవాన్ కాన్వే(17) నిరాశపరచినా.. నీషమ్, ఫిలిప్స్, విలిమయ్సన్(25 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తారుగా రాణించడంతో న్యూజిలాండ్ ఈ స్కోర్ను చేయగలిగింది. నమీబియా బౌలర్లలో స్కోల్జ్, వీస్, ఎరాస్మస్ తలో వికెట్ పడగొట్టారు. నాలుగో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. కాన్వే(17) రనౌట్ సమయం 16:30.. న్యూజిలాండ్కు 14వ ఓవర్ ఆఖరి బంతికి మరో షాక్ తగిలింది. అనవసర పరుగుకు ప్రయత్నించి డెవాన్ కాన్వే(18 బంతుల్లో 17; ఫోర్) రనౌటయ్యాడు. 14 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 87/4. క్రీజ్లో గ్లెన్ ఫిలిప్(4), నీషమ్ ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. విలియమ్సన్(28) ఔట్ నమీబియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతుంది. జట్టు స్కోర్ 81 పరుగుల వద్ద ఉండగా.. ఎరాస్మస్ బౌలింగ్లో విలియమ్సన్(25 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా న్యూజిలాండ్ మూడో వికెట్ను కోల్పోయింది. 13 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్ స్కోర్ 82/3. క్రీజ్లో డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్ ఉన్నారు. న్యూజిలాండ్కు మరో షాక్.. డారిల్ మిచెల్(19) ఔట్ సమయం 15:57.. ఇన్నింగ్స్ 7వ ఓవర్ రెండో బంతికి న్యూజిలాండ్కు మరో షాక్ తగిలింది. బెర్నార్డ్ స్కోల్జ్ బౌలింగ్లో డారిల్ మిచెల్(15 బంతుల్లో 19; 2 ఫోర్లు) ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్ 43 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది. క్రీజ్లో కేన్ విలియమ్సన్(6), కాన్వే ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. గప్తిల్(18) ఔట్ సమయం 15:48.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్.. ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. అయితే డేవిడ్ వీస్ వేసిన 5వ ఓవర్లో న్యూజిలాండ్కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. వీస్ 4.1వ ఓవర్లో మార్టిన్ గప్తిల్(18 బంతుల్లో 18; ఫోర్, సిక్స్)ను పెవిలియన్కు పంపాడు. దీంతో న్యూజిలాండ్ 30 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. క్రీజ్లో డారిల్ మిచెల్(12), కేన్ విలియమ్సన్ ఉన్నారు. షార్జా: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-2లో భాగంగా శుక్రవారం(నవంబర్ 5) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్లో న్యూజిలాండ్, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన నమీబియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రస్తుత మెగా టోర్నీలో న్యూజిలాండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, ఓ పరాజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. నమీబియా సూపర్-12లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓ విజయం, 2 పరాజయాలతో సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఇక పొట్టి ఫార్మాట్లో ఇరు జట్ల మధ్య ముఖాముఖి పోరు విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. తుది జట్లు: న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), జేమ్స్ నీషమ్, డెవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్ నమీబియా: స్టీఫెన్ బార్డ్, క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్(వికెట్ కీపర్), గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), డేవిడ్ వీస్, మైఖేల్ వాన్ లింగెన్, జెజె స్మిట్, కార్ల్ బిర్కెన్స్టాక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్ -
'ఓడిపోయామని బాధపడకండి.. బాగా ఆడారు'
Pakistan Win Hearts Visiting Namibia Dressing Room After Win Match.. టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. నమీబియాతో జరిగిన మ్యాచ్లో 45 పరుగుల తేడాతో గెలిచిన పాకిస్తాన్ ఐదోసారి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. ఓపెనర్లు బాబర్ అజమ్(70), మహ్మద్ రిజ్వాన్(79 నాటౌట్) వీరవిహారంతో 189 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన నమీబియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పాకిస్తాన్ కట్టుదిట్టమైన బౌలింగ్ను ఎదుర్కొని నమీబియా ఆడిన తీరును క్రికెట్ అభిమానులు ప్రశంసించారు. చదవండి: T20 WC 2021 PAK Vs NAM: దుమ్మురేపిన ఓపెనర్లు.. ఐదోసారి సెమీస్కు పాకిస్తాన్ తాజాగా పాకిస్తాన్ జట్టు కూడా మ్యాచ్ ముగిసిన అనంతరం బాధలో ఉన్న నమీబియాను వారి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లి ఓదార్చి క్రీడాస్పూర్తి ప్రదర్శించి అభిమానుల మనసు గెలుచుకున్నారు. సెలక్షన్ మేనేజర్ సహా మహ్మద్ హపీజ్, హసన్ అలీ, షాహిన్ అఫ్రిది, షాబాద్ ఖాన్, ఫఖర్ జమాన్లు కలిసి నమీబియా డ్రెస్సింగ్రూమ్కు వచ్చి వారిని అభినందించారు. '' మ్యాచ్లో ఓడిపోయామని బాధపడకండి.. చాలా మంచి ప్రదర్శన ఇచ్చారు. మాకు పోటీగా పరుగులు సాధిస్తూ మమ్మల్ని కాసేపు ఆందోళన పడేలా చేశారు. అయితే మ్యాచ్లో గెలుపోటములు సహజం. మ్యాచ్లో డేవిడ్ వీస్ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మిగతా మ్యాచ్ల్లో గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.. ఆల్ ది బెస్ట్'' అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం పాక్ క్రికెటర్లు నమీబియా క్రికెటర్లను హగ్ చేసుకొని అభినందించారు. చదవండి: IND VS NZ: వార్నీ ఇది ధోని ఐడియానా.. అందుకే రవిశాస్త్రి?! కాగా ఈ వీడియోనూ పీసీబీ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఇక పాకిస్తాన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన తీరుకు క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ''ఓడిన జట్టు బాధలో ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్పడం ధర్మం.. ఈరోజు పాకిస్తాన్ దానిని చేసి చూపించింది'' అంటూ కామెంట్స్ చేశారు. #SpiritofCricket - Pakistan team visited Namibia dressing room to congratulate them on their journey in the @T20WorldCup#WeHaveWeWill | #T20WorldCup pic.twitter.com/4PQwfn3PII — Pakistan Cricket (@TheRealPCB) November 2, 2021