Public issue
-
ఐపీవో రూట్లో ఫోన్పే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యేందుకు ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది పదో వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయి అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోన్పే పోటీ సంస్థలు పేటీఎం, మొబిక్విక్ ఇప్పటికే దేశీ మార్కెట్లలో లిస్టయిన సంగతి తెలిసిందే. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఫోన్పే 2022లో తమ ప్రధాన కార్యాలయాన్ని భారత్కి మార్చుకుంది. 2023లో చివరిసారిగా నిధులు సమీకరించినప్పుడు ఫోన్పే వేల్యుయేషన్ను 12 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఫోన్పేలో వాల్మార్ట్కి చెందిన లక్సెంబర్గ్ సంస్థ ఫిట్ హోల్డింగ్స్ ఎస్ఏఆర్ఎల్కి 83.91 శాతం, జనరల్ అట్లాంటిక్ సింగపూర్కి 5.14 శాతం, ఫోన్పే సింగపూర్ విభాగానికి 6.7 శాతం వాటాలు ఉన్నాయి. -
4 ఐపీవోలకు సెబీ సై
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో డాక్టర్ అగర్వాల్స్ హెల్త్కేర్సహా కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా చేరాయి. గతేడాది సెప్టెంబర్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. అయితే మౌరి టెక్, అమంటా హెల్త్కేర్ ఐపీవో ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గాయి. వివరాలు చూద్దాం.. ఐకేర్ కంపెనీ పీఈ దిగ్గజాలు టెమాసెక్ హోల్డింగ్స్, టీపీజీలకు పెట్టుబడులున్న డాక్టర్ అగర్వాల్స్ హెల్త్కేర్ ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 6.95 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా కంటి పరిరక్షణ(ఐ కేర్) సరీ్వసులు అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలినవాటిని ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. రియల్టీ డెవలపర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మౌలిక రంగ సంస్థ ఈపీసీ ఇన్ఫ్రా, టోల్ వసూళ్ల కంపెనీ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోలో భాగంగా రూ. 105 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 31 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లకు ప్రస్తతం 71.58 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మెషీనరీ తయారీ ఇథనాల్ ప్లాంట్లను రూపొందించే రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. దీనిలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా ఇథనాల్ ప్లాంట్ల డిజైనింగ్, తయారీ, సరఫరా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెనకడుగులో.. ఐటీ సొల్యూషన్ల కంపెనీ మౌరి టెక్, ఆరోగ్య పరిరక్షణ సంస్థ అమంటా హెల్త్కేర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను విరమించుకున్నాయి. గతేడాది సెపె్టంబర్– అక్టోబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. అయితే డిసెంబర్లోనే పత్రాలను వెనక్కి తీసుకున్నాయి. ఇందుకు కారణాలు వెల్లడికాలేదు. ఐపీవోలో భాగంగా హైదరాబాద్ కంపెనీ మౌరి టెక్ రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావించింది. వీటితోపాటు మరో రూ. 1,060 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేశారు. ఇక ఫార్మా రంగ కంపెనీ అమంటా హెల్త్కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయాలని తొలుత భావించింది. కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలు, స్టెరైల్ లిక్విడ్ ప్రొడక్టుల తయారీలో ఉంది. -
ట్రిపుల్ ధమాకా!
గతవారం పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ కంపెనీల షేర్లు బుధవారం స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. ఈ మూడు కంపెనీల షేర్లు భారీ ప్రీమియం ధరతో లిస్టయ్యాయి. ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతున్నా.., వీటికి కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో తొలిరోజే మొబిక్విక్ షేరు అత్యధికంగా 90%, విశాల్ మెగామార్ట్ 44%, సాయి లైఫ్ సైన్సెస్ 42 శాతం లాభాలను ఇన్వెస్టర్లకు పంచాయి. విశాల్ మెగామార్ట్ దేశవ్యాప్తంగా సూపర్మార్ట్లను నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ షేరు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.78)తో పోలిస్తే 33% ప్రీమియంతో రూ.104 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 46% ఎగసి రూ.114 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 44% లాభంతో రూ.112 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.50,444 కోట్లుగా నమోదైంది.మొబిక్విక్ సిస్టమ్స్మొబిక్విక్ పేరుతో ఫిన్టెక్ సేవలు అందించే వన్ మొబిక్విక్ సిస్టమ్స్ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర (రూ.279)తో పోలిస్తే 59% ప్రీమియంతో రూ.442 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 90.21% ఎగసి రూ.531 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి అదే స్థాయి (రూ.530) వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,120 కోట్లుగా నమోదైంది. సాయి లైఫ్ సైన్సెస్ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయి లైఫ్ సైన్సెస్ షేరు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.549)తో పోలిస్తే 18% ప్రీమియంతో రూ.650 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 42% ఎగసి రూ.780 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 40% లాభంతో రూ.768 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,974 కోట్లుగా నమోదైంది. -
వారమంతా.. ఐపీవోల సందడి..
న్యూఢిల్లీ: ఐపీవోల జాతరతో ఈ వారమంతా మార్కెట్ సందడిగా ఉండనుంది. చిన్నా, పెద్దవి కలిపి మొత్తం 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. రూ. 18,500 కోట్లు సమీకరించబోతున్నాయి. విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, ఫిన్టెక్ సంస్థ వన్ మొబిక్విక్ సిస్టమ్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం మీద అయిదు పెద్ద సంస్థల ఇష్యూలు, ఆరు చిన్న–మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) ఇష్యూలు వీటిలో ఉన్నాయి. ఆరు ఎస్ఎంఈలు సుమారు రూ. 150 కోట్లు సమీకరించనున్నాయి. వివిధ రంగాలకు చెందిన సంస్థల ఐపీవోలు.. కొత్త షేర్ల జారీ, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానాల్లో ఉండనున్నాయి. ప్రస్తుత షేర్హోల్డర్లు తమ వాటాలను విక్రయించుకునేందుకు, సంస్థలు విస్తరణ ప్రణాళికల కోసం నిధులను సమీకరించుకునేందుకు, రుణాలను తిరిగి చెల్లించివేసేందుకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకునేందుకు కంపెనీలకు ఈ ఇష్యూలు ఉపయోగపడనున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలు, ఉత్తర్ ప్రదేశ్ లోక్సభ బై–ఎలక్షన్ల ఫలితాలతో మార్కెట్లో సానుకూల సెంటిమెంటు నెలకొందని, ఐపీవోలు విజయవంతమయ్యేందుకు ఇది దోహదపడగలదని ఆన్లైన్ బ్రోకరేజీ సంస్థ ట్రేడ్జినీ సీవోవో డి. త్రివేశ్ తెలిపారు.2024లో ఇప్పటివరకు రూ. 1.4 లక్షల కోట్ల సమీకరణ..ఈ ఏడాది ఇప్పటివరకు 78 మెయిన్ బోర్డ్ కంపెనీలు, పబ్లిక్ ఇష్యూల ద్వారా దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో హ్యుందాయ్ మోటర్ ఇండియా, స్విగ్గీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి దిగ్గజ ఇష్యూలు ఉన్నాయి. 2023లో 57 సంస్థలు రూ. 49,436 కోట్లు సమీకరించాయి. గత కొన్నాళ్లుగా ఇటు ఇష్యూయర్లు అటు ఇన్వెస్టర్లలోను ప్రైమరీ మార్కెట్లపై గణనీయంగా ఆసక్తి పెరిగింది. గడిచిన అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఐపీవో ఇన్వెస్టర్లు భారీగా లాభాలు పొందారు. 2021–2025 ఆర్థిక సంవత్సరాల మధ్యలో వచి్చన 236 ఐపీవోలు .. రిటైల్ ఇన్వెస్టర్లకు సగటున 27 శాతం మేర లిస్టింగ్ లాభాలు అందించాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఇష్యూల వివరాలు..→ విశాల్ మెగా మార్ట్, సాయి లైఫ్ సైన్సెస్, మొబిక్విక్ ఇష్యూలు డిసెంబర్ 11న ప్రారంభమై 13న ముగుస్తాయి. ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్, ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐపీవోలు డిసెంబర్ 12న, 13న ప్రారంభమవుతాయి. → విశాల్ మెగామార్ట్ ఐపీవో ద్వారా రూ. 8,000 కోట్లు సమీకరిస్తోంది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ కేదారా క్యాపిటల్కి చెందిన సమాయత్ సరీ్వసెస్ ఓఎఫ్ఎస్ కింద షేర్లను విక్రయిస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 74–78గా నిర్ణయించారు. → సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోకి సంబంధించి ధర శ్రేణి రూ. 522 నుంచి రూ. 549 వరకు ఉంటుంది. కంపెనీ మొత్తం రూ. 3,043 కోట్లు సమీకరిస్తోంది. ఇందులో రూ. 950 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఓఎఫ్ఎస్ కింద ప్రమోటర్లు, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు, ఇతర షేర్హోల్డర్లు 3.81 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. → మొబిక్విక్ ఐపీవో రూ. 572 కోట్లు సమీకరిస్తోంది. ఇందుకోసం 2.05 కోట్ల షేర్లను తాజాగా జారీ చేస్తోంది. ధర శ్రేణి ఒక్కో షేరుకు రూ. 265–279 వరకు ఉంటుంది. → ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఐపీవో పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది. ఇష్యూ పరిమాణం రూ. 2,500 కోట్లు. → ఇక ఎస్ఎంఈ ఐపీవోల విషయానికొస్తే ధనలక్ష్మి క్రాప్ సైన్స్ (డిసెంబర్ 9–11) టాస్ ది కాయిన్ లిమిటెడ్.. జంగిల్ క్యాంప్స్ ఇండియా (రెండూ డిసెంబర్ 10–12), సుప్రీమ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్.. పర్పుల్ యునైటెడ్ సేల్స్ (డిసెంబర్ 11–13), యశ్ హైవోల్టేజ్ (డిసెంబర్ 12–16) సంస్థలు ఉన్నాయి. -
రెండు కంపెనీలు ఐపీవో బాటలో
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. జాబితాలో ఎల్పీజీ, కెమికల్స్ స్టోరేజీ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్తోపాటు.. సోలార్ ప్యానళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ చేరాయి. వివరాలు చూద్దాం.. రూ. 3,500 కోట్లపై దృష్టి ఏజిస్ లాజిస్టిక్స్ అనుబంధ కంపెనీ ఏజిస్ వొపాక్ టెర్మినల్స్ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 3,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోకంటే ముందుగా షేర్ల జారీ ద్వారా రూ. 700 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. దీంతో ఐపీవో పరిమాణం ఆమేర తగ్గవచ్చు. ఇష్యూ నిధుల్లో రూ. 2,027 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచి్చంచనుంది. వీటితో మంగళూరువద్ద క్రియోజెనిక్ ఎల్పీజీ టెర్మినల్ను ఏర్పాటు చేయనుంది. మిగిలిన నిధులను కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీలో ప్రస్తుతం వొపాక్ ఇండియా బీవీకి 50.1 శాతం, ఏజిస్ లాజిస్టిక్స్కు 47.31 శాతం చొప్పున వాటా ఉంది. 2024 జూన్కల్లా దేశవ్యాప్తంగా 18 స్టోరేజీ ట్యాంకులను నిర్వహిస్తోంది. పెట్రోలియం, వెజిటబుల్ ఆయిల్, లూబ్రికెంట్స్, ఎల్పీజీ, ప్రొపేన్, బ్యుటేన్ తదితరాల నిల్వకు వీటిని వినియోగించవచ్చు. రూ. 1,150 కోట్లకు రెడీ సోలార్ ఫొటో వోల్టాయిక్ మాడ్యూళ్ల తయారీ కంపెనీ సాత్విక్ గ్రీన్ ఎనర్జీ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా రూ. 1,150 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో రూ. 850 కోట్లు తాజా ఈక్విటీ జారీ ద్వారా, మరో రూ. 300 కోట్లు ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకోనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా 90 శాతంగా నమోదైంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 553 కోట్లు ఒడిషాలో 4 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ ప్లాంటు ఏర్పాటుపై వెచి్చంచనుంది. మరో రూ. 96 కోట్లు అనుబంధ సంస్థ సాత్విక్ సోలార్ ఇండస్ట్రీస్ రుణ చెల్లింపులకు కేటాయించనుంది. 2024 జూన్కల్లా 1.8 గిగావాట్ల నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ప్రధానంగా సోలార్ ప్రాజెక్టులకు ఎండ్టు ఎండ్ ఈపీసీ సరీ్వసులను అందిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 246 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
స్విగ్గీ ఐపీవో ‘డెలివరీ’ ఓకే
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూకి మెరుగైన స్పందన లభించింది. చివరి రోజు శుక్రవారానికల్లా 3.6 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీ 16.01 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 57.53 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు అందాయి. క్విబ్ విభాగంలో 6 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.41 రెట్లు చొప్పున బిడ్స్ లభించాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 1.14 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. రూ. 371–390 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 11,327 కోట్లు సమకూర్చుకుంది. మంగళవారం (5న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,085 కోట్లు సమీకరించిన విషయం విదితమే. రూ. 95,000 కోట్ల విలువలో కంపెనీ ఐపీవోకు రావడం గమనార్హం! ఆక్మే సోలార్... 2.75 రెట్లు స్పందన పునరుత్పాదక ఇంధన రంగ కంపెనీ ఏసీఎంఈ (ఆక్మే) సోలార్ పబ్లిక్ ఇష్యూకి బాగానే ఆదరణ దక్కింది. చివరి రోజు శుక్రవారానికల్లా 2.75 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. కంపెనీ 5.82 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 16 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 3.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 0.97 రెట్లు చొప్పున బిడ్స్ నమోదయ్యాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు 3.1 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం గమనార్హం! రూ. 275–289 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 2,900 కోట్లు సమకూర్చుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,300 కోట్లు లభించాయి. -
ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలను అనుమతించింది. ఈ జాబితాలో ఆరోగ్య బీమా సేవలందించే నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఆరోగ్య పరిరక్షణ సర్వీసుల సంస్థ పారస్ హెల్త్కేర్ లిమిటెడ్ ఉన్నాయి. నివా బూపా జులైలోనూ, పారస్ హెల్త్ ఆగస్ట్లోనూ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. వివరాలు చూద్దాం.ఆసుపత్రుల సంస్థ పారస్ హెల్త్ బ్రాండుతో ఆసుపత్రుల చైన్ను నిర్వహిస్తున్న పారస్ హెల్త్కేర్ ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.5 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత వాటాదారు సంస్థ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలు పారస్ హెల్త్కేర్(రాంచీ) ప్రయివేట్, ప్లస్ మెడికేర్ హాస్పిటల్స్ ప్రయివేట్లో పెట్టుబడులకు( రుణ చెల్లింపులు) వెచి్చంచనుంది. హర్యానా, బీహార్, యూపీ, రాజస్తాన్, జేఅండ్కేలలో సంస్థ పారస్ హెల్త్ పేరుతో 8 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. మొత్తం 2,135 పడకలతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. రూ. 3,000 కోట్లపై కన్నుగతంలో మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీగా సేవలందించిన నివా బూపా ఐపీవోలో భాగంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 2,200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్ విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ప్రస్తుతం కంపెనీలో యూకే దిగ్గజం బూపా(సింగపూర్ హోల్డింగ్స్) 62.27 శాతం వాటాను కలిగి ఉంది. ఫెటిల్ టోన్ ఎల్ఎల్పీకు 27.86 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 625 కోట్లు మూలధన పటిష్టతకు వినియోగించనుంది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ తదుపరి రెండో స్టాండెలోన్ హెల్త్ ఇన్సూరర్గా బూపా నివా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానుంది. ఐపీవో బాటలో జారోవిద్యా రంగ సంస్థ జారో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్(జారో ఎడ్యుకేషన్) పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 170 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు కంపెనీలో 85 శాతానికిపైగా వాటా ఉంది. ఐపీవో నిధుల్లో రూ. 81 కోట్లు బ్రాండ్ విస్తరణకు, రూ. 48 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనుంది. -
ఐపీఓ ద్వారా రూ. 5,430 కోట్ల సమీకరణ
ముంబై: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి రూ. 440–463 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 25న ప్రారంభమై 29న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 4,180 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థ గోస్వామి ఇన్ఫ్రాటెక్ విక్రయానికి ఉంచనుంది. వెరసి ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,430 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 32 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 600 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 320 కోట్లు దీర్ఘకాలిక మూలధన అవసరాలకు, మరో రూ. 80 కోట్లు కన్స్ట్రక్షన్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది.కంపెనీ ప్రధానంగా ఐదు విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. ఇవి.. మెరైన్ అండ్ ఇండస్ట్రియల్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైడ్రో, అండర్గ్రౌండ్, ఆయిల్ అండ్ గ్యాస్. 2024 జూన్ 30కల్లా కంపెనీ ఆర్డర్బుక్ విలువ రూ. 31,747 కోట్లకు చేరింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రూ. 3,154 కోట్ల ఆదాయం, దాదాపు రూ. 92 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
స్విగ్గీ ఐపీవో సన్నాహాలు
న్యూఢిల్లీ: ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 18.52 కోట్ల(అంచనా విలువ రూ. 6,665 కోట్ల) షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి రూ. 10,000 కోట్లకుపైగా సమీకరించే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతక్రితం స్విగ్గీ దాఖలు చేసిన రహస్య దరఖాస్తుకు ఈ వారం మొదట్లో సెబీ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కాని్ఫడెన్షియల్ విధానంలో స్విగ్గీ ఏప్రిల్ 30న సెబీకి తొలుత దరఖాస్తు చేసింది. దీని తదుపరి తిరిగి అప్డేటెడ్ ఫైలింగ్ చేయవలసి ఉంటుంది. మూడు వారాలపాటు వీటిపై పబ్లిక్ నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆపై మరోసారి అప్డేటెడ్ సమాచారంతో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈ బాటలో రెండోసారి దరఖాస్తు చేశాక ఐపీవో చేపట్టేందుకు వీలుంటుందని మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. నిధుల వినియోగమిలా ఐపీవో ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 137 కోట్లను అనుబంధ సంస్థ స్కూట్సీ రుణ చెల్లింపులకు, మరో రూ. 982 కోట్లు క్విక్ కామర్స్ విస్తరణలో భాగంగా డార్క్ స్టోర్ నెట్వర్క్ విస్తరణకు స్విగ్గీ వినియోగించనుంది. ఈ బాటలో రూ. 586 కోట్లు టెక్నాలజీ, క్లౌడ్ మౌలికసదుపాయాలకు, రూ. 930 కోట్లు బ్రాండ్ మార్కెటింగ్పైనా వెచి్చంచనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 ఏప్రిల్కల్లా 13 బిలియన్ డాలర్ల విలువను సాధించింది. -
సెబీ కీలక నిర్ణయం.. యూపీఐ తప్పనిసరి
న్యూఢిల్లీ: డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసే దిశగా సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా నిధులను బ్లాక్ (బ్యాంక్ ఖాతాలో స్తంభన) చేసుకునే ఆప్షన్తోనే రూ.5లక్షల వరకు దరఖాస్తు చేసుకోవాలని సెబీ కోరింది.అదే సమయంలో సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్లు లేదా స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ తదితర ప్రత్యామ్నాయ విధానాల్లోనూ ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఈక్విటీ పబ్లిష్ ఇష్యూలకు యూపీఐ బ్లాక్ ఆప్షన్ అవకాశం అందుబాటులో ఉన్న సంగతి విదితమే.‘‘డెట్ సెక్యూరిటీ పబ్లిక్ ఇష్యూలకు మధ్యవర్తుల ద్వారా (స్టాక్ బ్రోకర్లు, డీపీలు, రిజిస్ట్రార్ తదితర) దరఖాస్తు చేసుకునే వ్యక్తిగత ఇన్వెస్టర్లు, దరఖాస్తు రుసుం రూ.5 లక్షల వరకు ఉంటే వారు యూపీఐ బ్లాకింగ్ ఆప్షన్నే ఉపయోగించుకోవాలి’’అని సెబీ తన సర్క్యులర్లో కోరింది. -
సెనోరెస్ ఫార్మా ఐపీవో బాట
న్యూఢిల్లీ: హెల్త్కేర్ రంగ కంపెనీ సెనోరెస్ ఫార్మాస్యూటికల్స్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 27 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రీఐపీవో ప్లేస్మెంట్లో భాగంగా రూ. 100 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. దీంతో ఐపీవో పరిమాణాన్ని కుదించే అవకాశముంది. అర్హతగల కంపెనీ ఉద్యోగులకు కొంతమేర షేర్లను రిజర్వ్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో కొంతమేర అట్లాంటాలోని స్టెరైల్ ఇంజక్షన్ల తయారీ ప్లాంటు ఏర్పాటుకు వెచి్చంచనుంది. ఈ బాటలో అనుబంధ సంస్థల వర్కింగ్ క్యాపిటల్, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు సైతం నిధులు వినియోగించనుంది. -
హ్యుందాయ్ క్రెటా ఈవీ వచ్చేస్తోంది!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్ వెహికల్ను తీసుకొస్తోంది. 2025 జనవరి–మార్చి మధ్య ఈ మోడల్ దేశీ రోడ్లపై పరుగులు తీస్తుందని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్తో 550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో క్రెటా ఈవీ రూపుదిద్దుకుంటోందని సమాచారం. ధర రూ. 22–26 లక్షల మధ్య ఉంటుంది. హ్యుందాయ్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. సెబీకి దాఖలు చేసిన పత్రాల ప్రకారం భారత్లో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ప్రణాళిక. వీటిలో మాస్ మార్కెట్ మోడల్తోపాటు హైఎండ్, ప్రీమియం ఈవీలు సైతం ఉన్నాయి. ఈవీ విభాగంలో కంపెనీ ప్రస్తుతం దేశంలో అయానిక్ 5, కోనా ఎలక్ట్రిక్ విక్రయిస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 17.5 శాతం వాటా విక్రయించాలన్నది సంస్థ లక్ష్యం. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించనుంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్.. బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్ ఈవీ, ప్లగ్–ఇన్ హైబ్రిడ్ ఈవీ, మైల్డ్ హైబ్రిడ్ ఈవీ, ఫ్యూయల్ సెల్ ఈవీలను తయారు చేస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వ్యాపారం కోసం కంపెనీ గతేడాది తమిళనాడులో రూ.20,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. చెన్నై ప్లాంటును ఈవీలు, ఎస్యూవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. -
బడా ఐపీఓల బొనాంజా!
ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో కూడా పబ్లిక్ ఇష్యూల హవా కొనసాగనుంది. అయితే ఈ ఏడాది ప్రత్యేకతేమిటంటే దిగ్గజ కంపెనీలు భారీస్థాయిలో నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ఈ జాబితాలో ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా సహా.. స్విగ్గీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు చేరాయి. రూ.60,000 కోట్లకు పైగా నిధులను సమీకరించేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నాయి.ముంబై: కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు మళ్లీ దూకుడు చూపుతున్నాయి. రోజుకో కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 77,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,500కు చేరాయి. ఈ నేపథ్యంలో పలు అన్లిస్టెడ్ దిగ్గజాలు పబ్లిక్ ఇష్యూలవైపు దృష్టి పెట్టాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు సెబీ తలుపుతడుతున్నాయి. తద్వారా భారీస్థాయిలో నిధుల సమీకరణకు తెరతీయనున్నాయి. వెరసి ఈ ఏడాది ప్రైమరీ మార్కెట్ సరికొత్త రికార్డుకు వేదికకానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది (2023–24) పలు చిన్న, మధ్యతరహా కంపెనీలు ఆసక్తి చూపడంతో సగటున ఐపీవో ఇష్యూ పరిమాణం రూ. 815 కోట్లుగా నమోదైంది. ఇక 2022–23లో ఒక్కో ఇష్యూ సగటు పరిమాణం రూ. 1,409 కోట్లుకాగా.. 2021–22లో రూ. 2,105 కోట్లు. అయితే ఈ ఏడాది వీటికి మించి అంటే రెట్టింపు అంతకంటే ఎక్కువ సగటు పరిమాణం నమోదుకానున్నట్లు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. లిస్టింగ్వైపు చూపు... రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలకు అనుగుణంగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్ బాటలో సాగుతోంది. సెబీ అనుమతితో రూ. 7,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఆఫ్కన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైతం ఐపీవో ద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇక ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ రూ. 8,000 కోట్ల నిధులను సమకూర్చుకోవాలని చూస్తోంది. ఈ బాటలో ఈవీ స్కూటర్ల కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ రూ. 5,500 కోట్లు, ఎన్ఎస్డీఎల్ రూ. 4,500 కోట్లు, వరీ ఎనర్జీస్ రూ. 3,000 కోట్ల, ఎమ్క్యూర్ రూ. 2,300 కోట్ల చొప్పున సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటికే 8 కంపెనీలు ఐపీవోల ద్వారా మొత్తం రూ. 14,600 కోట్లు అందుకున్నాయి.ఎల్ఐసీ రికార్డుకు చెక్!దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ దేశీ విభాగం ఐపీవో అనుమతి కోసం సెబీకి తాజాగా దరఖాస్తు చేసింది. తద్వారా 15–20 శాతం వాటా విక్రయించే వ్యూహంలో ఉంది. దీంతో 3.3–5.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 25,000 కోట్లు) అందుకునే వీలున్నట్లు అంచనా. ఫలితంగా 2022–23లో రూ. 21,000 కోట్లు సమీకరించిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇష్యూని అధిగమించనుంది. దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశముంది. -
ఐపీవోకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవోలో భాగంగా రూ. 4,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను మాతృ సంస్థ బజాజ్ ఫైనాన్స్ విక్రయానికి ఉంచనుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సన్నాహాలు ప్రారంభించింది. ఎగువ స్థాయి(అప్పర్ లేయర్) ఎన్బీఎఫ్సీగా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ 2025 సెపె్టంబర్కల్లా పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంది. కాగా.. భవిష్యత్ అవసరాలరీత్యా ఐపీవో నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వద్ద 2015లోనే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రిజిస్టర్ అయ్యింది. డిపాజిట్లు స్వీకరించని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా కొనసాగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ ఆస్తుల కొనుగోలు, ఆధునీకరణ తదితరాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఆర్బీఐ వద్ద అప్పర్ లేయర్ ఎన్బీఎఫ్సీగా గుర్తింపు పొందింది. గృహ రుణాలు, మారి్టగేజ్, లీజ్ రెంటల్ డిస్కౌంటింగ్ తదితర సేవలు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో 38 శాతం వృద్ధితో రూ. 1,731 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇటీవల గృహ రుణ కంపెనీలు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే. -
వొడాఫోన్ భారీ ఎఫ్పీవో
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) భారీ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీవో)కి తెరతీయనుంది. దీని ద్వారా రూ. 18,000 కోట్లు సమీకరించనుంది. ఏప్రిల్ 18–22 మధ్య ఎఫ్పీవో ఉండనుంది. ఇందుకోసం షేరు ధర రూ. 10–11 శ్రేణిలో ఉంటుంది. ఇటీవల ప్రమోటరు సంస్థకు ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపునకు సంబంధించి నిర్ణయించిన రూ. 14.87 రేటుతో పోలిస్తే ఇది సుమారు 26 శాతం తక్కువ. కనీసం 1,298 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్పీవో ద్వారా సేకరించిన నిధులను 4జీ నెట్వర్క్ విస్తరణ, 5జీ నెట్వర్క్ల ఏర్పాటుతో పాటు పన్నులు, బాకీలు చెల్లించడానికి వొడాఫోన్ ఐడియా వినియోగించుకోనుంది. 2020లో యస్ బ్యాంక్ రూ. 15,000 కోట్ల ఫాలో ఆన్ తర్వాత ఇదే అతి పెద్ద ఎఫ్పీవో కానుంది. బ్రిటన్ టెలికం సంస్థ వొడాఫోన్ గ్రూప్ భారత్లో తన వ్యాపారాన్ని ఐడియా సెల్యులార్తో విలీనం చేయడం ద్వారా 2018లో వొడాఫోన్ ఐడియా ఏర్పడింది. ప్రస్తుతం రూ. 2.1 లక్షల కోట్ల రుణభారంతో మనుగడ కోసం సతమతమవుతోంది. శుక్రవారం వొడాఫోన్–ఐడియా షేరు రూ. 12.96 వద్ద క్లోజయ్యింది. జీక్యూజీ, ఎస్బీఐ ఎంఎఫ్ ఆసక్తి.. ఈ ఎఫ్పీవోలో దాదాపు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వరకు ఇన్వెస్ట్ చేయాలని జీక్యూజీ పార్ట్నర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ రాజీవ్ జైన్ సారథ్యంలోని అమెరికన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ 500 మిలియన్ డాలర్లు, ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్ 200–300 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో సన్నాహాలు
ముంబై: పీఎస్యూ దిగ్గజం ఎన్టీపీసీ అనుబంధ కంపెనీ.. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ల ఎంపికను చేపట్టినట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా పునరుత్పాదక రంగ కంపెనీ రూ. 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తద్వారా 2022లో బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ తదుపరి అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకి తెరతీయనుంది. నిధులను సోలార్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా తదితర భవిష్యత్ ప్రాజెక్టులు, విస్తరణ ప్రణాళికలకు పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఐపీవో కోసం ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్ మేనేజ్మెంట్ను షార్ట్లిస్ట్ చేసింది. -
ఐపీవోవైపు ఎన్ఎస్ఈ చూపు
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించిన తదుపరి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేయనున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వెరసి సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించాక మరోసారి ఐపీవో సన్నాహాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధిక రిస్కులుగల డెరివేటివ్స్లో లావాదేవీలు చేపట్టవద్దంటూ ఈ సందర్భంగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఈ విభాగంలో తగినంత సమాచారమున్న ఇన్వెస్టర్లు మాత్రమే ట్రేడింగ్ చేయగలరని తెలియజేశారు. సెబీ పరిశీలన ప్రకారం 10మంది ట్రేడర్లలో 9మంది నష్టపోయినట్లు ప్రస్తావించారు. ఇప్పటికే బీఎస్ఈ బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ) 2017లోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. అయితే లిస్టింగ్ సమయంలో చౌహాన్ బీఎస్ఈ సీఈవోగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం! ఎక్సే్ఛంజీ సుపరిపాలన విషయంలో కొంతమంది మాజీ ఎగ్జిక్యూటివ్లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలతో ఎన్ఎస్ఈపై సెబీ దర్యాప్తునకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ఎస్ఈ లిస్టింగ్ ప్రణాళికలకు బ్రేక్ పడింది. కోలొకేషన్ సౌకర్యాలను అక్రమంగా వినియోగించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తద్వారా కొంతమంది ట్రేడింగ్ సభ్యులకు ముందస్తు ప్రవేశం కలి్పంచినట్లు ఆరోపణలు తలెత్తాయి. కాగా.. 2016 డిసెంబర్లో ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ వాటాదారులు 22 శాతం ఈక్విటీని విక్రయించేందుకు ఆసక్తి చూపారు. అయితే 2020లోనూ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే సెబీ అనుమతుల తదుపరి ఐపీవో ప్రాసెస్ను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. -
భారతీ హెక్సాకామ్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల 3న ప్రారంభంకానుంది. వెరసి కొత్త ఆరి్థక సంవత్సరం(2024–25)లో వెలువడిన తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఏప్రిల్ 5న ముగియనున్న ఇష్యూలో భాగంగా టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ 7.5 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఫలితంగా ప్రస్తుత వాటాదారు సంస్థకు ఐపీవో నిధులు అందనున్నాయి. ఇవి కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానంకాగా.. గతంలో 10 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని సంకలి్పంచిన సంగతి తెలిసిందే. యాంకర్ ఇన్వెస్టర్లకు 2న షేర్లను కేటాయించనుంది. కంపెనీ లిస్టయ్యేందుకు ఈ నెల రెండోవారంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతిని పొందింది. కంపెనీలో భారతీ ఎయిర్టెల్ వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ రంగ టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా మిగిలిన 30 శాతం వాటాను కలిగి ఉంది. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
వొడా ఐడియా నిధుల బాట
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా నిధుల సమీకరణకు ప్రతిపాదించింది. ఈ అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం కానున్నట్లు కంపెనీ పేర్కొంది. నిధుల సమీకరణకున్న అన్ని అవకాశాలను బోర్డు పరిశీలించనున్నట్లు తెలియజేసింది. రైట్స్, పబ్లిక్ ఆఫర్, ప్రిఫరెన్షియల్ కేటాయింపులు, క్విప్ తదితర మార్గాలతోపాటు.. ఒకేసారి లేదా దశలవారీగా నిధుల సమీకరణకు తెరతీసే అంశంపై నిర్ణయించనున్నట్లు వివరించింది. వెరసి ఈక్విటీ లేదా రుణ మార్గాలలో నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు బీఎస్ఈకి వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. విదేశీ ఇన్వెస్టర్లకు చోటు నగదు సవాళ్లను ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా కంపెనీ బలిమికి కట్టుబడి ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా తాజాగా స్పష్టం చేశారు. బిర్లా గ్రూప్ డెకరేటివ్ పెయింట్ల బిజినెస్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వొడాఫోన్లో విదేశీ ఇన్వెస్టర్లకు చోటు కలి్పంచేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అయితే బోర్డులో విదేశీ ఇన్వెస్టర్లు ఎప్పుడు ప్రవేశిస్తారన్న అంశంపై ఇప్పుడే చెప్పలేమన్నారు. ఇందుకు వ్యూహాత్మకంగా తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియాలో ఆదిత్య బిర్లా గ్రూప్ సహప్రమోటర్గా ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో కంపెనీ రూ. 6,986 కోట్లకు నికర నష్టాన్ని తగ్గించుకుంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 7,990 కోట్ల నష్టం ప్రకటించింది. దాదాపు రూ. 756 కోట్ల అనూహ్య లాభాలు నష్టాలు తగ్గేందుకు సహకరించాయి. భారీ రుణ భారాన్ని మోస్తున్న వొడాఫోన్ ఐడియా మొబైల్ టెలికం రంగంలోని ప్రత్యర్ధి సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. నిధుల సమీకరణ వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 6.3 శాతం జంప్చేసి రూ. 16.30 వద్ద ముగిసింది. -
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
పబ్లిక్ ఇష్యూ యోచనలో ఐఐఎఫ్సీఎల్
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్సీఎల్) పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2024–25)లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ ఎండీ పీఆర్ జైశంకర్ పేర్కొన్నారు. ఇందుకు త్వరలోనే కన్సల్టేషన్ కార్యక్రమానికి తెరతీయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపక రోజు సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో కేంద్రానికి 100% వాటా ఉంది. కంపెనీ ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ 750 ప్రాజెక్టులకు రూ. 2.5 లక్షల కోట్ల రుణాలందించినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 1,076 కోట్ల నికర లాభం ఆర్జించగా.. ఈ ఏడాది(2023–24) రూ. 1,500 కోట్ల లాభం సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. -
ఐపీవో బాటలో మొబిక్విక్
న్యూఢిల్లీ: ఫిన్టెక్ యూనికార్న్ మొబిక్విక్ సిస్టమ్స్ లిమిటెడ్ రెండేళ్ల తర్వాత మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా రూ. 700 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. కంపెనీ ఇంతక్రితం 2021 జూలైలో రూ. 1,900 కోట్ల సమీకరణ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. అయితే ఆపై ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. 2021 నవంబర్లో ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. కాగా.. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం రూ. 700 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ఐపీవోకంటే ముందుగా సెక్యూరిటీల కేటాయింపు ద్వారా రూ. 140 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇది జరిగితే ఆమేరకు ఐపీవో పరిమాణం తగ్గనుంది. కంపెనీలో ప్రధాన వాటాదారు పీక్ ఎక్స్వీ పార్ట్నర్స్తోపాటు.. బజాజ్ ఫైనాన్స్, అబుధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, అమెరికన్ ఎక్స్ప్రెస్కు పెట్టుబడులున్నాయి. -
ఐపీఓకి ఓలా... సెబీకి దరఖాస్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వెరసి రెండు దశాబ్దాల తదుపరి ఆటోరంగ కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కానుంది. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 5,500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 9,51,91,195 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ ఓసీటీ ఏర్పాటు చేస్తున్న ఓలా గిగాఫ్యాక్టరీ కోసం పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనుంది. -
ఇండియా షెల్టర్ ఐపీవో రెండో రోజుకి 4.3 రెట్లు స్పందన
అందుబాటు ధరల గృహ రుణాల కంపెనీ ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పబ్లిక్ ఇష్యూ రెండో రోజుకల్లా విజయవంతమైంది. 4.34 రెట్లు అధిక స్పందనను సాధించింది. కంపెనీ 1.79 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. గురువారాని(14)కల్లా 7.76 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 7.33 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 5 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. అయితే అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 84 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 400 కోట్ల విలువైన షేర్లనుప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచారు. షేరుకి రూ. 469–493 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1200 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. మంగళవారం(12న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 360 కోట్లు అందుకుంది. ప్రధానంగా టైర్–2, టైర్–3 పట్టణాలలో మధ్యాదాయ, తక్కువ ఆదాయ వర్గాల వారికి గృహ రుణాలు సమకూర్చుతోంది. -
ఆజాద్ ఇంజినీరింగ్ @ రూ. 740 కోట్లు సమీకరణ లక్ష్యం
ఇంజినీరింగ్ ప్రొడక్టుల కంపెనీ ఆజాద్ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. లిస్టింగ్ కోసం ఈ హైదరాబాద్ కంపెనీ సెపె్టంబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 740 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ కస్టమర్లలో జనరల్ ఎలక్ట్రిక్, హనీవెల్ ఇంటర్నేషనల్, మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్, సీమెన్స్ ఎనర్జీ, ఈటన్ ఏరోస్పేస్ తదితర గ్లోబల్ దిగ్గజాలున్నాయి. కాగా.. ఇప్పటికే పార్క్ బ్రాండ్ హోటళ్ల కంపెనీ ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, హెల్త్టెక్ సంస్థ మెడీ అసిస్ట్ హెల్త్కేర్ సరీ్వసెస్, క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫరీ్నచర్ తయారీ కంపెనీ స్టాన్లీ లైఫ్స్టైల్స్ ఐపీవోలు చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. -
క్రెడో బ్రాండ్స్ @ రూ. 266–280
మఫ్టీ బ్రాండ్ జీన్స్ తయారీ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.96 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 266–280 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పురుషుల మధ్యస్థాయి ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ వేర్ దుస్తుల తయారీలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా 404 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్స్, 1,807 టచ్పాయింట్స్సహా 71 లార్జ్ ఫార్మాట్, 1332 మల్టీ బ్రాండ్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. గతేడాది(2022–23) ఆదాయం 46 శాతం ఎగసి రూ. 498 కోట్లను అధిగమించింది. నికర లాభం 117 శాతం దూసుకెళ్లి రూ. 77.5 కోట్లను తాకింది. -
హ్యాపీ ఫోర్జింగ్స్ @ రూ. 808–850
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 71.6 లక్షల షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 808– 850 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా దాదాపు రూ. 1,009 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను ఎక్విప్మెంట్, ప్లాంట్లు, మెషీనరీ కొనుగోలుతోపాటు.. రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. లూధియానా కంపెనీ ఆటో విడిభాగాలు, వ్యవసాయ పరికరాలు, ఇండస్ట్రియల్ మెషీనరీ విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్లలో అశోక్ లేలాండ్, జేసీబీ ఇండియా, ఎంఅండ్ఎం, ఎస్ఎంఎల్ ఇసుజు, టాటా కమిన్స్ తదితరాలున్నాయి. గతేడాది(2022–23) ఆదాయం 39 శాతం ఎగసి రూ. 1,197 కోట్లకు చేరగా.. నికర లాభం 47 శాతం జంప్చేసి రూ. 209 కోట్లను తాకింది. -
డోమ్స్ ఐపీవోకు రిటైలర్ల క్యూ..
న్యూఢిల్లీ: పెన్సిళ్ల తయారీ దిగ్గజం డోమ్స్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూకి తొలి రోజే(బుధవారం) ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. కంపెనీ 88 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 5 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 5.7 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు ఏకంగా 19 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం విశేషం! ఈ బాటలో సంస్థాగతేతర ఇన్వెస్టర్లు 8 రెట్లు బిడ్ చేయగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) నుంచి కేవలం 6% మాత్రమే స్పందన నమోదైంది. ఇష్యూ లో భాగంగా కంపెనీ రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 850 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరుకి రూ. 750–790 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించిన కంపెనీ మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 538 కోట్లు సమకూర్చుకుంది. -
IPO: పబ్లిక్ ఇష్యూల జోరు! 5 కంపెనీలు.. రూ. 4,200 కోట్లు
న్యూఢిల్లీ: మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఈ వారం ఏకంగా ఐదు కంపెనీలు ఇన్షీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇండియా షెల్టర్ ఫైనాన్స్, డోమ్స్ ఇండస్ట్రీస్, ఐనాక్స్ ఇండియా, మోతిసన్స్ జ్యుయలర్స్, సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి సుమారు రూ. 4,200 కోట్ల పైచిలుకు సమీకరించనున్నాయి. గత నెల 10 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు విజయవంతమైన నేపథ్యంలో తాజా ఐపీవోలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టాటా గ్రూప్ నుంచి 2004 తర్వాత (టీసీఎస్) దాదాపు ఇరవై ఏళ్లకు వచ్చిన టాటా టెక్నాలజీస్ ఇష్యూకు భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ ఆఖరు వరకు మొత్తం మీద 44 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 35,000 కోట్లు సమీకరించాయి. స్థూల ఆర్థిక పరిస్థితులు, లిస్టింగ్ లాభాలు పటిష్టంగా ఉండటం వంటి అంశాల కారణంగా గత కొద్ది వారాలుగా ఐపీవో మార్కెట్ బాగా సందడిగా ఉందని ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ డైరెక్టర్ వి. ప్రశాంత్ రావు చెప్పారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం కూడా పాలనపరమైన స్థిరత్వాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు, తద్వారా మార్కెట్కు ఉత్సాహాన్ని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఐపీవోలు ఇవీ.. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ (ఐఎస్ఎఫ్), డోమ్స్ ఇండస్ట్రీస్ ఇష్యూలు డిసెంబర్ 13–15 మధ్య ఉండనున్నాయి. ఇవి రెండూ చెరి రూ. 1,200 కోట్లు సమీకరించనున్నాయి. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ కొత్తగా రూ. 800 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ఇన్వెస్టర్ షేర్హోల్డర్లు రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. షేరు ధర శ్రేణి రూ. 469–493గా ఉండనుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార కార్యకలాపాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. మరోవైపు, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, రూ. 850 కోట్ల విలువ చేసే షేర్లను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఐపీవో ధర శ్రేణి రూ. 750–790గా ఉంటుంది. క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంకుల తయారీ సంస్థ ఐనాక్స్ సీవీఏ పూర్తిగా ఓఎఫ్ఎస్ కింద 2.21 కోట్ల షేర్లను విక్రయించి రూ. 1,459 కోట్లు సమీకరించనుంది. షేరు ధర శ్రేణి రూ. 627– 660గా ఉంటుంది. నిధులను కంపెనీతో పాటు అనుబంధ సంస్థలైన ఎకార్డ్ ఎస్టేట్స్, ఐకానిక్ ప్రాపర్టీ డెవలపర్స్, స్కైలైన్ రియల్టీ రుణాల చెల్లింపునకు, స్థల సమీకరణ మొదలైన అవసరాలకు వినియోగించుకోనుంది. ఐనాక్స్ ఇ ష్యూ డిసెంబర్ 14న ప్రారంభమై 18న ముగుస్తుంది. 17 ఏళ్ల క్రితం ఐనాక్స్ లీజర్ (మలీ్టప్లెక్స్ విభాగం) ఐపీవోకి వచ్చాక ఐనాక్స్ గ్రూ ప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రా వడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఐనాక్స్ లీజర్.. పీవీఆర్ గ్రూప్లో భాగంగా ఉంది. 1992లో ఏ ర్పాటైన కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలోరూ. 980 కోట్ల ఆదాయంపై రూ. 152 కోట్ల నికర మార్జిన్ నమోదు చేసింది. మూడు ప్లాంట్లు ఉండగా, నాలుగో ప్లాంటు ఏర్పాటు చేస్తోంది. మోతీసన్స్ జ్యుయలర్స్ 2.74 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ రూ. 400 కోట్ల విలువ చేసే షేర్లను జారీ కొత్తగా జారీ చేయనుంది. ఈ రెండు ఇష్యూలు డిసెంబర్ 18న ప్రారంభమై 20న ముగుస్తాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడులు, రుణాల చెల్లింపు మొదలైన అవసరాల కోసం ఈ సంస్థలు వినియోగించుకోనున్నాయి. -
అయిదు ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇండియా షెల్టర్ ఫైనాన్స్, పెన్సిళ్ల తయారీ సంస్థ డోమ్స్ ఇండస్ట్రీస్ తదితర అయిదు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు (ఐపీవో) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివ ఫార్మాకెమ్, ఒనెస్ట్ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. వీటికి నవంబర్ 7–16 మధ్య సెబీ అబ్జర్వేషన్ లెటర్స్ (ఓఎల్) జారీ చేసింది. ఐపీవోకి సెబీ ఆమోదముద్రగా ఓఎల్ను పరిగణిస్తారు. ఇండియా షెల్టర్ ఫైనాన్స్ రూ. 1,800 కోట్లు సమీకరించనుంది. డోమ్స్ కొత్తగా రూ. 350 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు రూ. 850 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 575 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు, 40,51,516 షేర్లను విక్రయించనున్నారు. శివ ఫార్మాకెమ్ ఐపీవో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు రూ. 900 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్ర యించనున్నారు. ఎఫ్ఎంసీజీ సంస్థ ఒనెస్ట్ రూ. 77 కోట్ల విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ఇతర వాటాదా రులు 32.5 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. -
పబ్లిక్ ఆఫర్.. బంపర్ హిట్!
టాటా టెక్ @ 69 రెట్లు న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సరీ్వసుల కంపెనీ కి భారీ స్పందన లభించింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో చివరి రోజు శుక్రవారానికల్లా 69 రెట్లుపైగా అధిక సబ్ర్స్కిప్షన్ లభించింది. కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 312 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 203 రెట్లు బిడ్స్ దాఖలుకాగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 62 రెట్లు, రిటైలర్ల నుంచి 17 రెట్లు చొప్పున దరఖాస్తులు లభించాయి. టీసీఎస్ (2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లు అందుకుంది. ఫ్లెయిర్ రైటింగ్..@47 రెట్లు పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల కంపెనీ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీవో చివరి రోజు శుక్రవారానికల్లా 47 రెట్లు అధిక సబ్్రస్కిప్షన్ను సాధించింది. కంపెనీ 1,44,13,188 షేర్లను ఆఫర్ చేయగా.. 67 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. క్విబ్ విభాగంలో 116 రెట్లు అధిక బిడ్స్ నమోదుకాగా, రిటైలర్ల నుంచి 13 రెట్లు బిడ్స్ దాఖలయ్యాయి. ఫెడ్ఫినా@ 22 రెట్లు ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఫెడ్ఫినా) ఐపీవోకు మంచి స్పందన లభించింది. 5.59 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 12 కోట్లకుపైగా షేర్లకు (2.2 రెట్లు) బిడ్స్ వచ్చాయి. క్విబ్ విభాగంలో 3.5 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.5 రెట్లు, రిటైలర్ల నుంచి 1.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. గాంధార్ ఆయిల్ @ 64 రెట్లు ప్రైవేట్ రంగ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ (ఇండియా) ఐపీవో చివరి రోజు శుక్రవారానికల్లా 64 రెట్లు అధిక సబ్్రస్కిప్షన్ను సాధించింది. కంపెనీ 2,12,43,940 షేర్లను ఆఫర్ చేయగా.. 136 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల (క్విబ్) విభాగంలో 129 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 62 రెట్లు, రిటైలర్ల నుంచి 29 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. దీంతో షేరుకి రూ. 160–169 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 501 కోట్ల మేర నిధులను సమీకరించింది. ఇష్యూలో భాగంగా రూ. 302 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.17 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. ఈ నాలుగు ఇష్యూలకూ గురువారాని (30)కల్లా షేర్ల కేటాయింపు జరిగే వీలుంది. రిఫండ్స్ శుక్రవారం, షేర్లు సోమవారం (4న) రావచ్చు. వచ్చే నెల 5న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నట్లు తెలుస్తోంది. -
ఇరెడా ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మినీరత్న సంస్థ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ–ఇరెడా) పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు గురువారానికల్లా 39 రెట్లు అధిక స్పందన నమోదైంది. కంపెనీ 47 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 1,827 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 24 రెట్లు, రిటైలర్ల నుంచి దాదాపు 8 రెట్లు అధికంగా బిడ్స్ లభించాయి. అర్హతగల కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో అయితే దాదాపు 105 రెట్లు అధికంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రూ. 30–32 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా సోమవారం(20న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 643 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. ఈక్విటీ వివరాలిలా ఐపీవోలో భాగంగా 40.31 కోట్ల ఈక్విటీ షేర్లను ఇరెడా తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వం 26.88 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. ఈక్విటీ జారీతో రూ. 1,290 కోట్లు, ప్రభుత్వ వాటాకు రూ. 860 కోట్ల చొప్పున లభించనున్నాయి. వెరసి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 2,150 కోట్లు సమకూర్చుకోనుంది. గతేడాది మే నెలలో బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ లిస్టింగ్ తదుపరి మళ్లీ ప్రభుత్వ రంగ సంస్థ పబ్లిక్ ఇష్యూకి రావడం విశేషం! కాగా.. ఈక్విటీ జారీ నిధులను కంపెనీ భవిష్యత్ పెట్టుబడి అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు వినియోగించనుంది. -
సిగ్నేచర్ గ్లోబల్ @ రూ. 366–385
ముంబై: రియల్టీ రంగ కంపెనీ సిగ్నేచర్ గ్లోబల్(ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 366–385 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఐపీవో ఈ నెల 20న ప్రారంభమై 22న ముగియనుంది. ఇష్యూలో భాగంగా రూ. 603 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 127 కోట్ల విలువైన షేర్లను సైతం విక్రయానికి ఉంచనుంది. వెరసి రూ. 730 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 330 కోట్లు సమకూర్చుకునే లక్ష్యంతో ఉంది. కంపెనీ గతేడాది జులైలో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 432 కోట్లు రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు కంపెనీ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. గతేడాది చివరికల్లా రూ. 1,100 కోట్ల నికర రుణ భారం నమోదైనట్లు వెల్లడించారు. మిగిలిన నిధులను ఇతర సంస్థలు, భూముల కొనుగోళ్లకు కేటాయించనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్లకు 78.35 శాతం వాటా ఉంది. ఐఎఫ్సీ 5.38 శాతం వాటాను కలిగి ఉంది. అనుబంధ సంస్థ సిగ్నేచర్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ద్వారా గురుగ్రామ్లోని సోలెరా ప్రాజెక్టుతో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. -
ఐపీవో అక్రమాల నిధుల పంపిణీ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. 2003–05 మధ్య కాలంలో నమోదైన ఐపీవో అవకతవకల నుంచి సమీకరించిన నిధుల పంపిణీని మరోసారి చేపట్టింది. మూడో దశలో భాగంగా దాదాపు రూ. 15 కోట్లను 2.58 లక్షల ఇన్వెస్టర్లకు పంపిణీ చేయనుంది. ఈ బాటలో ఇప్పటికే 2010 ఏప్రిల్లో రూ. 23.28 కోట్లు, 2015 డిసెంబర్లో రూ. 18.06 కోట్లు ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది. పబ్లిక్ ఇష్యూల అక్రమాల కేసులలో భాగంగా సమీకరించిన నిధులను అర్హతగల ఇన్వెస్టర్లకు సెబీ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2003–05 మధ్య కాలంలో మొత్తం 21 ఐపీవోలకు సంబంధించి సెబీ అక్రమాలను గుర్తించింది. వీటిపై దర్యాప్తు పూర్తయ్యాక సంబంధిత వ్యక్తుల నుంచి చట్టవిరుద్ధంగా ఆర్జించిన లాభాలను రాబట్టే చర్యలు చేపట్టింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి డీపీ వాధ్వా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆదేశాల ప్రకారం సంబంధిత ఇన్వెస్టర్లకు నిధుల పంపిణీని చేపడుతోంది. -
ఐపీవోకు మళ్లీ ఫెడ్ఫినా రెడీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ కంపెనీ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సరీ్వసెస్(ఫెడ్ఫినా) మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 7.03 కోట్ల షేర్లను ప్రమోటర్ ఫెడరల్ బ్యాంక్, ప్రస్తుత వాటాదారు ట్రూనార్త్ ఫండ్ వీఐ ఎల్ఎల్పీ.. విక్రయానికి ఉంచనున్నాయి. వీటిలో ఫెడరల్ బ్యాంక్ 1.65 కోట్లు, ట్రూ నార్త్ ఫండ్ 5.38 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు వినియోగించనుంది. కాగా.. ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలోనూ ఫెడ్ఫినా లిస్టింగ్ కోసం ఫెడరల్ బ్యాంక్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 900 కోట్ల ఈక్విటీ జారీతోపాటు ఆఫర్ ఫర్ సేల్కు ప్రణాళికలు వేసిన విషయం విదితమే. -
సూరజ్ ఎస్టేట్ ఐపీవో బాట
న్యూఢిల్లీ: రియల్టీ రంగ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. దీనిలో భాగంగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 400 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. కంపెనీ ఇంతక్రితం 2022 మార్చిలోనూ ఐపీవో చేపట్టేందుకు ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూ నిధుల్లో రూ. 285 కోట్లు అనుబంధ సంస్థల రుణ చెల్లింపులకు, రూ. 35 కోట్లు భూముల కొనుగోలుకి, మిగిలిన నిధులను ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. గతేడాది(2022–23) రూ. 306 కోట్ల ఆదాయం, రూ. 32 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
ఈ నెల 17 నుంచి నెట్వెబ్ ఐపీవో
న్యూఢిల్లీ: దేశీ సర్వర్ల తయారీ సంస్థ నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) జూలై 17న ప్రారంభమై 20న ముగియనునంది. ఇష్యూలో భాగంగా రూ. 206 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 85 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. సంజయ్ లోధా, వివేక్ లోధా, నవీన్ లోధా, నీరజ్ లోధా, అశోకా బజాజ్ ఆటోమొబైల్స్ .. ఓఎఫ్ఎస్ ద్వారా షేర్లను విక్రయించనున్నారు. షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో సుమారు రూ. 33 కోట్లను పెట్టుబడి వ్యయాలకు, రూ. 128 కోట్లను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 22.5 కోట్లను రుణాల చెల్లింపు తదితర అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. దేశీయంగా ఉన్న అతి కొద్ది సర్వర్ల తయారీ సంస్థల్లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్కు చెందిన నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకానికి కూడా ఎంపికైంది. -
సెన్కో గోల్డ్ @ రూ. 301–317
కోల్కతా: జ్యువెలరీ రిటైల్ కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 301–317 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ నేడు(4న) ప్రారంభమై గురువారం(6న) ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు సోమవారం(3న) షేర్లను విక్రయించనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 270 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 135 కోట్ల విలువైన షేర్లను కంపెనీలో ప్రస్తుత వాటాదారు సంస్థ సైఫ్ పార్ట్నర్స్ ఇండియా ఐవీ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం సైఫ్ పార్ట్నర్స్కు కంపెనీలో 19.23 శాతం వాటా ఉంది. దీనిలో 8–9 శాతం వాటాను ఆఫర్ చేయనున్నట్లు సెన్కో ఎండీ, సీఈవో సువంకర్ సేన్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 47 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 196 కోట్లు వర్కింగ్ క్యాపిటల్కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. కంపెనీ 13 రాష్ట్రాలలో మొత్తం 140 షోరూములను నిర్వహిస్తోంది. ఎస్పీసీ లైఫ్ సైన్సెస్ రెడీ ఐపీవోకు సెబీ గ్రీన్సిగ్నల్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రెడియంట్స్ తయా రీ కంపెనీ ఎస్పీసీ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. కంపెనీ ప్రాస్పెక్టస్కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా 89.39 లక్షల షేర్లను ప్రమోటర్ స్నేహల్ రాజీవ్భాయ్ పటేల్ విక్రయానికి ఉంచనున్నారు. మళ్లీ ఐపీవోకు అక్మే ఫిన్.. ప్రాస్పెక్టస్ దాఖలు నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అక్మే ఫిన్ట్రేడ్(ఇండియా) లిమిటెడ్ మరోసారి పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. కంపెనీ తొలుత ఫిబ్రవరి 16న దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ను సెబీ ఏప్రిల్ 27న వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ తిరిగి తాజా ప్రాస్పెక్టస్ను సెబీకి అందించింది. -
ఐఐఎఫ్ఎల్ నిధుల సమీకరణ
ముంబై: బ్యాంకింగేతర సంస్థ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రుణ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువైన సెక్యూర్డ్ రీడీమబుల్ ఎన్సీడీలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. వీటికి 9 శాతంవరకూ రిటర్నులను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 9న వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధులను వ్యాపారాభివృద్ధి, మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇష్యూకి అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో రూ. 1,200 కోట్ల విలువైన ఎన్సీడీలను సైతం కేటాయించేందుకు గ్రీన్ షూ అప్షన్ను ఎంచుకున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,500 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. 60 నెలల కాలానికిగాను ఇన్వెస్టర్లకు 9 శాతం వరకూ రిటర్నులను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 24 నెలలు, 36 నెలల కాలావాధితోనూ బాండ్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. వడ్డీని వార్షికంగా లేదా నెలవారీ చెల్లించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఏప్రిల్లో 40 కోట్ల డాలర్ల విలువైన డాలర్ బాండ్లను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. వీటిని 2020 ఫిబ్రవరిలో జారీ చేసింది. -
బాల్కో లిస్టింగ్పై ప్రభుత్వ దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ సంస్థ భారత్ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో మిగిలిన 49 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. అంతేకాకుండా సంస్థ ప్రమోటర్ గ్రూప్ వేదాంతా చేపట్టిన ఆర్బిట్రేషన్ను ఉపసంహరింప చేయాలని చూస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. ఇందుకు వీలుగా వేదాంతాతో గనుల శాఖ, దీపమ్ ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలియజేశారు. మిగిలిన వాటా విషయంలో అధిక విలువ వివాదంపై 2009లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాల్కో ఆర్బిట్రేషన్ కేసును దాఖలు చేసింది. కాగా.. బాల్కో ప్రమోటర్లతో ప్రాథమిక చర్చలు చేపట్టినట్లు పాండే వెల్లడించారు. ఈ విషయంలో మరింత లోతుగా చర్చించనున్నట్లు తెలియజేశారు. కంపెనీని స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయాలంటే ఆర్బిట్రేషన్ కేసును వెనక్కి తీసుకోవలసి ఉన్నట్లు వివరించారు. ఇందుకు ప్రమోటర్లు ఒప్పుకుంటే పబ్లిక్ ఇష్యూకి సన్నాహాలు ప్రారంభిస్తామని తెలియజేశారు. వాటా విక్రయం ఇలా 2001లో ప్రభుత్వం మెటల్ పీఎస్యూ.. బాల్కోలో 51 శాతం వాటాను స్టెరిలైట్ ఇండస్ట్రీస్కు విక్రయించింది. వేదాంతా గ్రూప్ అనుబంధ కంపెనీ స్టెరిలైట్ ఇందుకు రూ. 551 కోట్లు వెచ్చించింది. మిగిలిన 49 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. ఒప్పందంలోని కాల్ ఆప్షన్ ప్రకారం 2004లో స్టెరిలైట్ మిగిలిన 49 శాతం వాటా కోసం ప్రభుత్వానికి రూ. 1,099 కోట్లు ఆఫర్ చేసింది. అయితే వాటా విలువ అంతకంటే అధికమని కాగ్ నివేదిక పేర్కొనడంతో ప్రభుత్వం ఆఫర్ను తిరస్కరించింది. దీంతో 2009లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్బిట్రేషన్ను ఆశ్రయించింది. బాల్కో ఆర్బిట్రేషన్ అంశం హిందుస్తాన్ జింక్ కేసు(2009)ను పోలి ఉన్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే 2021 నవంబర్లో సుప్రీం కోర్టు ఓపెన్ మార్కెట్ విక్రయానికి ప్రభుత్వాన్ని అనుమతించింది. తద్వారా 29.5 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలు చిక్కింది. 2022లో ప్రమోటర్ సంస్థ వేదాంతా ఆర్బిట్రేషన్ను ఉపసంహరించడంతో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్లో వాటాను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. -
ఐపీవోకి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, విస్తరణ ప్రణాళికలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానుంది. దీని ద్వారా రూ. 2,800 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను (డీఆర్హెచ్పీ) నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఇప్పటికే జేఎస్డబ్ల్యూ గ్రూప్లో భాగమైన జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ స్టీల్.. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయి ఉన్నాయి. దీంతో గ్రూప్ నుంచి జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మూడో లిస్టెడ్ కంపెనీ కానుంది. కంపెనీకి వార్షికంగా 153.43 మిలియన్ టన్నుల కమోడిటీ కార్గో హ్యాండ్లింగ్ స్థాపిత సామర్థ్యం ఉంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థకు నికరంగా రూ. 2,875 కోట్ల రుణాలు ఉన్నాయి. 2022–23 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రూ. 447 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
మళ్లీ ఐపీవోకు టీవీఎస్ సప్లై చైన్
న్యూఢిల్లీ: టీవీఎస్ మొబిలిటీ గ్రూప్ కంపెనీ టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ మరోసారి పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయడంతోపాటు.. ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో 2 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ఇంతక్రితం 2022 ఫిబ్రవరిలో ప్రాథమిక పత్రాలను దాఖలు చేయడం ద్వారా సెబీ నుంచి అదే ఏడాది మే నెలలో లిస్టింగ్కు అనుమతి పొందింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని ప్రణాళికలు వేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఐపీవో యోచనకు స్వస్తి పలికింది. నిబంధనల ప్రకారం అనుమతి పొందాక గడువు(ఏడాది)లోగా పబ్లిక్ ఇష్యూ చేపట్టకుంటే తిరిగి తాజాగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
2 కంపెనీల ఐపీవోలకు సెబీ ఓకే
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రెండు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా నిధుల సమీకరణకు నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ ఎబిక్స్ ఇంక్ అనుబంధ సంస్థ ఎబిక్స్క్యాష్ లిమిటెడ్, స్పెషాలిటీ కెమికల్ తయారీ కంపెనీ సర్వైవల్ టెక్నాలజీస్లను అనుమతించింది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతించమంటూ ఈ రెండు కంపెనీలు 2022 మార్చి, డిసెంబర్ మధ్య కాలంలో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేశాయి. రూ. 6,000 కోట్లపై కన్ను ఐపీవో ద్వారా ఎబిక్స్క్యాష్ లిమిటెడ్ రూ. 6,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా తాజా ఈక్విటీని జారీ చేయనుంది. ఇష్యూ నిధులను అనుబంధ సంస్థలు ఎబిక్స్ ట్రావెల్స్, ఎబిక్స్క్యాష్ వరల్డ్ మనీ.. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. అంతేకాకుండా ఎబిక్స్ మారిషస్ జారీ చేసిన తప్పనిసరిగా మార్పడికి లోనయ్యే డిబెంచర్ల చెల్లింపులతోపాటు.. వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. కంపెనీ పేమెంట్ సొల్యూషన్స్, ట్రావెల్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్, బీపీవో సర్వీసులు, స్టార్టప్ల ఏర్పాటులో టెక్నాలజీ ఆధారిత డిజిటల్ ప్రొడక్టులు, సర్వీసులను అందిస్తోంది. రూ. 1,000 కోట్లకు సై ఐపీవోలో భాగంగా సర్వైవల్ టెక్నాలజీస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 800 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై కన్నేసింది. నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, ఇతర సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్ రీసెర్చ్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసెస్(సీఆర్ఏఎంఎస్– క్రామ్స్) విభాగంలో ప్రధానంగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్ ప్రొడక్ట్ గ్రూప్ల నుంచి ఎంపిక చేసిన ఉత్పత్తులను కంపెనీ రూపొందిస్తోంది. -
నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్స్టోన్కు పెట్టుబడులున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. గతేడాది నవంబర్లో ప్రాస్పెక్టస్ను దాఖలు చేసిన కంపెనీ మే నెలలో ఐపీవో చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా తొలి రిటైల్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రిటైల్ రీట్.. 17 నిర్వహణలోగల షాపింగ్ మాల్స్ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. ఇవి 14 పట్టణాలలో 9.8 మిలియన్ చదరపు అడుగులలో విస్తరించి ఉన్నాయి. వీటి విలువ రూ. 23,000 కోట్లు. బ్లాక్స్టోన్ స్పాన్సర్ చేసిన మూడో రీట్గా ఇది నిలవనుంది. ఇప్పటికే దేశీయంగా సంస్థకు పెట్టుబడులున్న రీట్ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ లిస్టయ్యాయి. మరో కంపెనీ బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కాగా.. ఇవన్నీ ఆఫీస్ ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ రియల్టీ ఆస్తులపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఐపీవో నిధులను కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించే వీలుంది. 2022 జూన్కల్లా రూ. 4,500 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఐపీవో యోచనలో బ్యాంక్ బజార్
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ బ్యాంక్ బజార్.కామ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. రానున్న 12–18 నెలల్లోగా ఐపీవోకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్న ట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. బ్యాంకింగ్ దిగ్గజాలతో భాగస్వామ్యం ద్వారా కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్న కంపెనీ మార్చితో ముగి సి న గతేడాది(2022–23) రూ. 160 కోట్ల ఆదాయం సాధించింది. ఏడాది నుంచి ఏడాదిన్నర లోగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే యోచనలో ఉన్నట్లు ఒక ప్రకటనలో బ్యాంక్ బజార్.కామ్ తెలియజేసింది. -
గో డిజిట్ మళ్లీ ఐపీవో బాట
న్యూఢిల్లీ: సాధారణ బీమా సేవలందించే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ మళ్లీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. కెనడియన్ సంస్థ ఫెయిర్ఫాక్స్ గ్రూప్నకు పెట్టుబడులున్న కంపెనీ ఉద్యోగుల గుర్తింపు ఆధారిత రైట్స్ స్టాక్ పథకంలో తగిన సవరణలు చేసింది. తద్వారా సెబీకి మరోసారి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఏడాది జనవరి 30న సెబీ మరింత సమాచారాన్ని కోరుతూ 2022 ఆగస్ట్లో గో డిజిట్ సమర్పించిన ప్రాస్పెక్టస్ను వెనక్కి పంపింది. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఎప్రిషియేన్ రైట్స్ పథకం నిబంధనల అమలుపై తొలి ప్రాస్పెక్టస్ను సెబీ తిప్పి పంపిన విషయం విదితమే. ఆపై ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ పథకంలో సవరణలకు వాటాదారులు, బోర్డు ఆమోదముద్ర వేశాయి. రూ. 1,250 కోట్ల ఈక్విటీ జారీ ఐపీవో అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ ప్రకారం గో డిజిట్ రూ.1,250 కోట్ల ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి అదనంగా 10.94 కోట్ల షేర్లను ప్రమోటర్ గో డిజిట్ ఇన్ఫోవర్క్స్తోపాటు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య, నటి అనుష్క శర్మ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. -
4 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల నిధుల సమీకరణ ప్రణాళికలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో సైయంట్ డీఎల్ఎం, రాశి పెరిఫెరల్స్, హెల్త్విస్టా ఇండియా, జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ 2022 జూలై– 2023 జనవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. తద్వారా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు మార్చి 29–31 మధ్య అనుమతి పొందాయి. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు దారి ఏర్పడింది. ఐటీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించే రాశి పెరిఫెరల్స్ ఐపీవోలో భాగంగా రూ. 750 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. పూర్తిగా షేర్ల జారీ ద్వారా నిధులను సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 400 కోట్లను రుణ చెల్లింపులు, రూ. 200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల సంస్థ సైయంట్ డీఎల్ఎం సైతం రూ. 740 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీ జారీకి తెరతీయనుంది. ఈ నిధులను మూలధన అవసరాలు, విస్తరణ వ్యయాలు, రుణ చెల్లింపులు, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. హెల్త్కేర్ సేవలు పోర్టీ బ్రాండుతో ఆసుపత్రుల బయట ఆరోగ్య పరిరక్షణ సేవలందించే హెల్త్విస్టా ఇండియా ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 5.62 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ మెడీబిజ్ ఫార్మా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులు, మెడికల్ పరికరాల కొనుగోళ్లు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు వినియోగించనుంది. ఫైనాన్షియల్ సేవలు ఐపీవోలో భాగంగా ఫైనాన్షియల్ సేవలందించే ఫిన్టెక్ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్ రూ. 490 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 1.05 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వినియోగదారులను పెంచుకోవడం, టెక్నాలజీ, ప్రొడక్టుల అభివృద్ధి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఎవలాన్ టెక్ @ 415–436
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రూ. 415–436 ధరల శ్రేణి ప్రకటించింది. ఏప్రిల్ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్రిల్ 18న షేర్లు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నాయి. ఎండ్టుఎండ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్ టెక్ 1999లో ఏర్పాటైంది. యూఎస్తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. -
ఐపీవోకు సెబీతో మామాఎర్త్ చర్చలు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో చర్చలు నిర్వహిస్తున్నట్లు హోనసా కన్జూమర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. బలహీన మార్కెట్ పరిస్థితుల కారణంగా ఐపీవోను పక్కనపెట్టినట్లు మీడియాలో వెలువడిన వార్తల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు మామాఎర్త్, ద డెర్మా కో మాతృ సంస్థ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఐపీవోకు అనుమతి పొందే బాటలో ముసాయిదా ప్రాస్పెక్టస్పై సెబీతో చర్చిస్తున్నట్లు కంపెనీ సీఈవో, సహవ్యవస్థాపకుడు వరుణ్ అలగ్ వెల్లడించారు. నిబంధనల ప్రకారం సెబీ అనుమతి పొందాక ఐపీవో చేపట్టేందుకు 12 నెలల గడువు ఉంటుందని, తదుపరి బ్యాంకర్లతో చర్చిస్తామని తెలియజేశారు. 2022 డిసెంబర్లో కంపెనీ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 4.68 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్లను ఆఫర్ చేయనున్న ప్రమోటర్లు, ఇన్వెస్టర్లలో వరుణ్, ఘజల్ అలగ్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కుంద్రా, రోహిత్ కుమార్ బన్సల్ తదితరులున్నారు. -
ఎవలాన్ టెక్నాలజీస్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఏప్రిల్ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాగా.. తొలుత ఐపీవో ద్వారా రూ. 1,025 కోట్ల సమీకరణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. అయితే ఇష్యూ కంటే ముందుగా షేర్ల ప్లేస్మెంట్ ద్వారా రూ. 160 కోట్లు సమకూర్చుకుంది. రూ. 80 కోట్లు తాజా ఈక్విటీ, మరో రూ. 80 కోట్లు సెకండరీ షేర్ల అమ్మకం ద్వారా ఈ నిధులు అందుకుంది. వీటిలో యూనిఫై ఫైనాన్షియల్ ప్రయివేట్ లిమిటెడ్, అశోకా ఇండియా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ నుంచి రూ. 60 కోట్లు చొప్పున లభించగా.. ఇండియా ఎకార్న్ ఫండ్ నుంచి రూ. 40 కోట్లు సమకూరినట్లు ఎవలాన్ వెల్లడించింది. 1999లో షురూ.. ఎండ్టుఎండ్ ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీస్ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్ 1999లో ఏర్పాటైంది. కంపెనీ క్లయింట్లలో క్యోసన్ ఇండియా, జోనర్ సిస్టమ్స్ ఇంక్, కొలిన్స్ ఏరోస్పేస్, ఈ ఇన్ఫోచిప్స్, యూఎస్ మలబార్ కంపెనీ, మెగ్గిట్, సిస్టెక్ కార్పొరేషన్ తదితరాలున్నాయి. యూఎస్తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. 2022 జూన్కల్లా రూ. 1,039 కోట్ల విలువైన ఆర్డర్బుక్ను కలిగి ఉంది. -
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీవో కుదింపు
ముంబై: ఎన్బీఎఫ్సీ.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ గతేడాది నవంబర్లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది. -
రెండు ఇష్యూలకు సెబీ చెక్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో రెండు కంపెనీలు దాఖలు చేసిన ప్రాస్పెక్టస్లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చెక్ పెట్టింది. ఫైనాన్షియల్ రంగ కంపెనీలు బీవీజీ ఇండియా లిమిటెడ్, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా దరఖాస్తులను సెబీ తిప్పి పంపింది. కాగా.. మౌలిక సదుపాయాల రంగ కంపెనీ ఆర్అండ్బీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్కు సెబీ ఈ నెల 3న గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వెరసి కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ చేపట్టేందుకు దారి ఏర్పడింది. సమీకృత సర్వీసుల కంపెనీ బీవీజీ ఇండియా 2021 సెప్టెంబర్లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, పీఈ ఇన్వెస్టర్ సంస్థ 3ఐ గ్రూప్.. మరో 71.96 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయనున్నారు. అయితే సెబీ ప్రాస్పెక్టస్కు చెక్ పెట్టింది. రూ. 1,330 కోట్ల కోసం ఐపీవో ద్వారా రూ. 1,330 కోట్ల సమీకరణకు ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2021 మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్ దఖలు పరచింది. జులైలో సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇష్యూ చేపట్టలేదు. సెబీ అనుమతి పొందిన తదుపరి ఏడాదిలోగా నిధుల సమీకరణను పూర్తి చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే. ఐపీవో చేపట్టేందుకు లభించిన గడువు 2022 జులైలో ముగియడంతో ఆగస్ట్లో తిరిగి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 1.7 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. అయితే ఈ నెల తొలి వారంలో బీవీజీ ఇండియా, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ ప్రాస్పెక్టస్లను సెబీ తిప్పి పంపింది. ఎయిరాక్స్ నేలచూపు మెడికల్ పరికరాల తయారీ కంపెనీ ఎయిరాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలను విరమించుకుంది. ఐపీవో ద్వారా రూ. 750 కోట్ల సమీకరణ కోసం 2022 సెప్టెంబర్లో సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ప్రమోటర్లు సంజయ్ భరత్ కుమార్ జైస్వాల్, ఆషిమా సంజయ్ జైస్వాల్ షేర్లను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. పీఎక్స్ఏ ఆక్సిజన్ జనరేటర్ తయారీలో ఉన్న కంపెనీ గత నెలలో ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకుంది. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. ఫస్ట్మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, లోహియా కార్ప్ నిధుల సమీకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ కంపెనీలు 2022 సెప్టెంబర్– 2023 జనవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. ఫస్ట్మెరిడియన్ సిబ్బంది నియామక(స్టాఫింగ్) సంస్థ ఫస్ట్మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 690 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్సహా ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా మరో రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ మ్యాన్పవర్ సొల్యూషన్స్ రూ. 615 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఐఆర్ఎం ఎనర్జీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీ ఐఆర్ఎం ఎనర్జీ 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 650–700 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిధులను తమిళనాడులోని నమక్కల్, తిరుచిరాపల్లిలలో బిజినెస్(సిటీ గ్యాస్ పంపిణీ) నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. పీఎన్జీ, సీఎన్జీ పంపిణీ చేసే కంపెనీ గుజరాత్, పంజాబ్లోనూ కార్యకలాపాలు విస్తరించింది. లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తికి వినియోగించే మెషినరీ తయారీ కంపెనీ లోహియా కార్ప్ ఐపీవోలో భాగంగా 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. 2022 మార్చి31కల్లా కంపెనీ 90 దేశాలలో 2,000 మంది కస్టమర్లను కలిగి ఉంది. ప్రధానంగా పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, సేక్స్ తదితర టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీకి వినియోగించే మెషీనరీ, పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది. -
ఫ్యాబిండియా ఐపీవో రద్దు
న్యూఢిల్లీ: కళాత్మక వస్తువులు, లైఫ్స్టైల్ ఉత్పత్తుల రిటైల్ రంగ కంపెనీ ఫ్యాబిండియా పబ్లిక్ ఇష్యూ యోచనను విరమించుకుంది. ప్రస్తుత మార్కెట్ ఆటుపోట్ల నేపథ్యంలో ఐపీవో ద్వారా రూ. 4,000 కోట్ల సమీకరణ ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వెరసి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి ముసాయిదా ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. ఇష్యూ పరిమాణంరీత్యా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేనట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఐపీవో ద్వారా 2.5 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని భావించింది. ప్రాస్పెక్టస్ గడువు 2023 ఏప్రిల్తో ముగియనున్న నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎన్సీడీల స్వచ్చంద చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను వెచ్చించాలని కంపెనీ తొలుత ప్రణాళికలు వేసింది. -
డివ్జీ టార్క్ ఇష్యూ @ రూ. 560–590
న్యూఢిల్లీ: ఆటోమోటివ్ విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ మార్చి 1న ప్రారంభంకానుంది. 3న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 560–590గా నిర్ణయించింది. తద్వారా రూ. 412 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ నేడు(28న) ప్రారంభంకానుంది. ఐపీవోలో భాగంగా రూ. 180 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 39.34 లక్షల షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, తయారీ సౌకర్యాల పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 25 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ లెవెల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్లు అందిస్తోంది. క్లయింట్ల జాబితాలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్ తదితరాలున్నాయి. మార్చి 14న కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ అయ్యే వీలుంది. -
పబ్లిక్ ఇష్యూకి ఐడియాఫోర్జ్
న్యూఢిల్లీ: డ్రోన్ తయారీ కంపెనీ ఐడియాఫోర్జ్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని ఐపీవోలో భాగంగా కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 48,69,712 షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు రూ. 135 కోట్లు, ప్రొడక్ట్ డెవలప్మెంట్కు రూ. 40 కోట్లు చొప్పున వెచ్చించనుంది. 2007లో ఏర్పాటైన కంపెనీ దేశీయంగా మానవరహిత ఏరియల్ వాహనా(యూఏవీ)లను రూపొందిస్తోంది. తద్వారా ఈ విభాగంలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తోంది. కంపెనీ కస్టమర్ల జాబితాలో సాయుధ దళాలు, పోలీసు, అటవీ శాఖలు, విపత్తు నిర్వహణా దళాలు తదితరాలున్నాయి. -
ఐపీవో బాటలో సర్వైవల్ టెక్
న్యూఢిల్లీ: స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ సర్వైవల్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, సంబంధిత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ప్రధానంగా విజయ్ కుమార్ రఘునందన్ ప్రసాద్ అగర్వాల్ రూ. 544 కోట్లకుపైగా విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 175 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కాంట్రాక్ట్ రీసెర్చ్, తయారీ సర్వీసుల(క్రామ్స్) ఈ కంపెనీ ప్రధానంగా స్పెషాలిటీ కెమికల్స్ రూపొందిస్తోంది. దేశీయంగా హెటెరోసైక్లిక్, ఫ్లోరో ఆర్గానిక్ ప్రొడక్ట్ గ్రూప్లకు చెందిన ప్రత్యేకతరహా ఉత్పత్తుల తయారీలోగల కొద్దిపాటి సంస్థలలో ఒకటిగా నిలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) రూ. 312 కోట్ల ఆదాయం, రూ. 73 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. -
ఐపీవో దిశలో రెండు కంపెనీలు
న్యూఢిల్లీ: తాజాగా రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూ బాట పట్టాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ భారత్ హైవేస్ ఇన్విట్, వైట్ ఆయిల్స్ తయారీ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ ఈ జాబితాలో చేరాయి. ఈ రెండు సంస్థలూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. వివరాలు ఇలా.. రూ. 2,000 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా భారత్ హైవేస్ ఇన్విట్ బుక్బిల్డింగ్ ద్వారా రూ. 2,000 కోట్ల విలువైన యూనిట్లను ఆఫర్ చేయనుంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమకూర్చుకోనుంది. నిధులను ప్రాజెక్టŠస్ ఎస్పీవీకి చెందిన కొన్ని రుణాల చెల్లింపుతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎస్పీవీ ప్రాజెక్టŠస్లో.. పోర్బందర్– ద్వారకా ఎక్స్ప్రెస్వే, వారణాశి– సంగమ్ ఎక్స్ప్రెస్వే, జీఆర్ సంగ్లీ– సోలాపూర్ హైవే, జీఆర్ అక్కల్కోట్– సోలాపూర్ హైవే, జీఆర్ ఫగ్వారా ఎక్స్ప్రెస్వే, జీఆర్ గుండుగొలను– దేవరాపల్లి హైవే ఉన్నాయి. 2022 ఆగస్ట్లో ఏర్పాటైన భారత్ హైవేస్ ఇన్విట్ ప్రాజెక్ట్ ఎస్పీవీలో ప్రతీ ప్రాజక్టులోనూ 100 శాతం చొప్పున వాటా కొనుగోలు చేయనుంది. ప్రాథమికంగా 49 శాతం వాటాను సొంతం చేసుకుంటుంది. రూ. 500 కోట్లపై కన్ను పబ్లిక్ ఇష్యూలో భాగంగా గాంధార్ ఆయిల్ రిఫైనరీ రూ. 357 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, ఎక్విప్మెంట్ కొనుగోలుసహా.. సిల్వస్సా ప్లాంటులో ఆటోమోటివ్ ఆయిల్ తయారీ సామర్థ్య విస్తరణకు అవసరమైన సివిల్ వర్క్లకూ వెచ్చించనుంది. అంతేకాకుండా తలోజా ప్లాంటులో పెట్రోలియం జెల్లీతోపాటు.. సంబంధిత కాస్మెటిక్ ప్రొడక్టుల తయారీ విస్తరణకు సైతం వినియోగించనుంది. వైట్ ఆయిల్స్ తయారీకి మరిన్ని బ్లెండింగ్ ట్యాంకులను సైతం ఏర్పాటు చేయనుంది. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు తాజాగా మూడు కంపెనీలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లరీస్, లైడ్ లైటింగ్ సొల్యూషన్ల సంస్థ ఐకియో లైటింగ్, ఆటో విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ చేరాయి. ఈ మూడు సంస్థలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెప్టెంబర్, అక్టోబర్లలో సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. కాగా.. అక్టోబర్లో మోటిసన్స్ జ్యువెలర్స్ దాఖలు చేసిన ముసాయిదా పత్రాలను ఈ నెల 16న రిటర్న్ చేసినట్లు వెబ్సైట్లో సెబీ పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. అలైడ్ బ్లెండర్స్ ఐపీవోలో భాగంగా అలైడ్ బ్లెండర్స్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థ విక్రయానికి ఉంచనున్నాయి. ప్రధానంగా బినా కిషోర్ చాబ్రియా రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ దేశీ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) విభాగంలో 10 బ్రాండ్లు కలిగి ఉంది. ప్రధాన బ్రాండ్లలో ఆఫీసర్స్ చాయిస్ విస్కీ, జాలీ రోజర్ రమ్, క్లాస్ 21 వోడ్కా తదితరాలున్నాయి. డివ్జీ టార్క్ట్రాన్స్ఫర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా డివ్జీ టార్క్ట్రాన్స్ఫర్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 31,46,802 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. తయారీకి వీలుగా ఎక్విప్మెంట్ కొనుగోలు చేయనుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ లెవల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్స్ తదితరాలను అందిస్తోంది. ఐకియో లైటింగ్ ఐపీవోలో భాగంగా ఐకియో లైటింగ్ రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 75 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 237 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న యూనిట్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా లెడ్ లైటింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
పబ్లిక్ ఇష్యూల హవా
న్యూఢిల్లీ: ఈ వారం ప్రైమరీ మార్కెట్ ఊపందుకుంది. బుధవారం(14న) ముగిసిన శూల వైన్యార్డ్స్కు 2.33 రెట్లు అధిక స్పందన లభించగా.. గురువారం(15న) ముగిసిన మరో రెండు ఐపీవోలు విజయవంతమయ్యాయి. ఇవి ల్యాండ్మా ర్క్ కార్స్, అబాన్స్ హోల్డింగ్స్కాగా.. సోమ (21), మంగళ(22)వారాల్లో మరో రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి వస్తున్నాయి. ఈ ప్రభావంతో హెల్త్కేర్ టెక్ సంస్థ ఇండెజీన్ లిమిటెడ్ తాజాగా పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇతర వివరాలు చూద్దాం.. ల్యాండ్మార్క్ కార్స్ చివరి రోజుకల్లా ప్రీమియం ఆటోమొబైల్ డీలర్ షిప్ కంపెనీ ల్యాండ్మార్క్ కార్స్ ఐపీవోకు 3 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 80,41, 805 షేర్లు ఆఫర్ చేయగా.. 2.46 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 8.71 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.32 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 59 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. షేరుకి రూ. 481–506 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 552 కోట్లు సమకూర్చుకుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. అబాన్స్ హోల్డింగ్స్ ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీ అబాన్స్ హోల్డింగ్స్ ఐపీవోకు చివరి రోజుకల్లా కేవలం 1.1 రెట్లు అధికంగా సబ్స్క్రిప్షన్ లభించింది. కంపెనీ 1,28,00,000 షేర్లు ఆఫర్ చేయగా.. 1.40 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగం నుంచి 4.1 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.48 రెట్లు అధికంగా బిడ్స్ నమోదయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కోటాలో మాత్రం 40 శాతానికే దరఖాస్తులు వచ్చాయి. ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 256–270కాగా.. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ అబాన్స్ ఫైనాన్స్ పెట్టుబడులకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎలిన్ ధర ఖరారు ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 234–247 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈ నెల 20–22 మధ్య చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 475 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. తొలుత రూ. 760 కోట్లపై కన్నేసినప్పటికీ టార్గెట్లో కోత పెట్టుకుంది. వెరసి ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, యూపీ, గోవా యూనిట్ల విస్తరణ, ఆధునీకరణసహా ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 60 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్, తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఫ్రాక్షనల్ హెచ్పీ మోటార్స్ తయారీలో పేరొందింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22) ఆదాయం 27 శాతం జంప్చేసి రూ. 1,094 కోట్లకు చేరగా.. నికర లాభం 12 శాతం మెరుగుపడి రూ. 39 కోట్లను తాకింది. ఇండెజీన్ లిమిటెడ్ హెల్త్కేర్ టెక్ కంపెనీ ఇండెజీన్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమపై దృష్టి పెట్టిన కంపెనీ ఐపీవో ద్వారా రూ. 3,200 కోట్లు సమీకరించాలని చూస్తోంది. దీనిలో భాగంగా రూ. 950 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో 3.63 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సోమవారం కేఫిన్.. 19న ప్రారంభంకానున్న పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
వచ్చే వారం 2 ఐపీవోలు
న్యూఢిల్లీ: వచ్చే వారం రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రానున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ ఇష్యూ ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇందుకు షేరుకి రూ. 347–366 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇక ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీ ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో 20న మొదలై 22న ముగియనుంది. వివరాలు చూద్దాం.. రూ. 1,500 కోట్లకు రెడీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా కేఫిన్ ప్రమోటర్ సంస్థ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ రూ. 1,500 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫర్ చేయనుంది. వెరసి ఐపీవో ద్వారా సమీకరించే రూ. 1,500 కోట్లు ప్రమోటర్ సంస్థకు చేరనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ సంస్థకు 74.37 శాతం వాటా ఉంది. కాగా.. 2021లో కొటక్ మహీంద్రా బ్యాంకు కేఫిన్లో 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవోకు రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 40 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 16న షేర్లను కేటాయించనుంది. కంపెనీ ప్రధానంగా దేశీ మ్యూచువల్ ఫండ్స్, ఏఐఎఫ్లు, వెల్త్ మేనేజర్స్ తదితరాలకు ఇన్వెస్టర్ సొల్యూషన్స్ అందిస్తోంది. రూ. 475 కోట్లకు పరిమితం ఎలిన్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో ద్వారా రూ. 475 కోట్లు మాత్రమే సమీకరించనుంది. మొదట్లో రూ. 760 కోట్లను సమకూర్చుకోవాలని భావించినప్పటికీ తదుపరి టార్గెట్లో కోత పెట్టుకుంది. ఇష్యూలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. తద్వారా ఘజియాబాద్(యూపీ), వెర్నా(గోవా)లోని ప్లాంట్ల విస్తరణను చేపట్టనుంది. లైటింగ్, ఫ్యాన్లు, చిన్నతరహా కిచెన్ అప్లయెన్సెస్ తదితర విభాగాలలో ప్రధాన బ్రాండ్లకు ఎండ్టు ఎండ్ ప్రొడక్ట్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
టాటా టెక్నాలజీస్ ఐపీవో
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్లో పాక్షిక వాటాను విక్రయించే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ పేర్కొంది. ఇందుకు పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. సోమవారం(12న) సమావేశమైన ఐపీవో కమిటీ తాజా ప్రతిపాదనకు సూత్రప్రాయ అనుమతినిచ్చినట్లు తెలియజేసింది. అయితే మార్కెట్ పరిస్థితులు, అవసరమైన, సెబీ సహా నియంత్రణ సంస్థల అనుమతులు ఆధారంగా ఐపీవోను చేపట్టనున్నట్లు వివరించింది. టాటా టెక్నాలజీస్ గ్లోబల్ ఇంజినీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసులందిస్తోంది. ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్ హెవీ మెషీనరీ తదితర పరిశ్రమలకు సర్వీసులు సమకూర్చుతోంది. విదేశీ విస్తరణ మార్చితో ముగిసిన గతేడాది(2021–22) 47.35 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,910 కోట్లు) ఆదాయం సాధించింది. ఎయిర్బస్కు వ్యూహాత్మక సరఫరాదారుగా నిలుస్తున్న కంపెనీ ఇటీవలే ఫ్రాన్స్లోని టోలౌజ్లో ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించింది. తద్వారా అంతర్జాతీయ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ప్రొడక్ట్ ఇంజినీరింగ్, డిజిటల్ సర్వీసులను అందించనుంది. సస్టెయినబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ అభివృద్ధికి సహకరించేందుకు ఈ ఏడాది జూన్లో ఫాక్స్కాన్ ప్రారంభించిన ఎంఐహెచ్ కన్సార్షియంలో చేరింది. దీంతో పరిశ్రమలో సహకారానికి ప్రోత్సాహాన్నివ్వనుంది. హార్మనీ కన్సార్షియం మొబిలిటీ(ఎంఐహెచ్)లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, సర్వీసుల రంగాలకు చెందిన 2,300 సభ్య సంస్థలున్నాయి. -
ఫెడ్ పాలసీ, ద్రవ్యోల్బణం దారి చూపొచ్చు!
ముంబై: ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమావేశ నిర్ణయాలు ఈ వారం మార్కెట్లకు దారి చూపొచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇదే వారంలో మూడు కంపెనీల ఐపీఓ లతో పాటు ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న యూనిపార్ట్స్ ఇండియా ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ కానుంది. అంతర్జాతీయంగా బ్యారెల్ బ్రెంట్ క్రూ డాయిల్ ధర 80 డాలర్లకు చేరింది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపొచ్చు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను సమతూకం చేసుకోవాలి. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలు, ఫెడ్ రిజర్వ్ సమావేశానికి ముందు అప్రమత్తత తదితర పరిణామాల నేపథ్యంలో గతవారంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 687 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయాయి. ‘ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ అధిక విలువ వద్ద ట్రేడవుతోంది. ఆదాయాల వృద్ధి మందగించ వచ్చనే అంచనాలు సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చు. ఆర్థిక మాంద్య భయాల తో ఐటీ షేర్లలో అత్యధిక లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానానికే మొగ్గుచూపినప్పట్టికీ.., బ్యాంక్ నిఫ్టీ స్థిరంగా రాణించడం కలిసొచ్చే అంశంగా ఉంది. అయితే గతవారం నిఫ్టీ కీలకమైన 18,500 స్థాయిని కోల్పోయింది. అమ్మకాల ఒత్తిడి కొనసాగితే 18,400– 18,300 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఎగువ స్థాయిలో 18,650–18,700 పరిధిలో నిరోధం ఎదురుకావచ్చు’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు బ్రిటన్ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, నవంబర్ వాణిజ్య లోటు డేటా నేడు(సోమవారం)విడుదల అవుతుంది. రేపు(మంగళవారం) అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటిస్తుంది. ఎల్లుండి(బుధవారం) ఫెడ్ రిజర్వ్ కమిటీ సమావేశ నిర్ణయాలు, యూరోజోన్ నవంబర్ పారిశ్రామికోత్పత్తి డేటా, చైనా నవంబర్ వాహన విక్రయాలు, బ్రిటన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. గురువారం అమెరికా నవంబర్ రిటైల్ అమ్మకాలతో పాటు పారిశ్రామికోత్పత్తి డేటా విడుదల అవుతుంది. అదే రోజున యూరోపియన్ కేంద్ర బ్యాంక్(ఈసీబీ) వడ్డీరేట్ల ప్రకటనతో పాటు జపాన్ వాణిజ్య లోటు గణాంకాలు.., చైనా పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, రిటైల్ అమ్మకాల డేటా..., బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్ నిర్ణయాలు వెల్లడి కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం అమెరికా, యూరోజోన్, బ్రిటన్ తయారీ రంగ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల అవుతాయి. అదేరోజున యూరోజోన్ అక్టోబర్ వాణిజ్య లోటు, నవంబర్ ద్రవ్యోల్బణ డేటాతో పాటు విడుదల కానుంది. స్థూల ఆర్థిక గణాంకాలు నేడు నవంబర్ దేశీయ వినియోగదారుల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం, అక్టోబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానున్నాయి. డబ్ల్యూపీ ద్రవ్యోల్బణ డేటా ఎల్లుండి(బుధవారం), వాణిజ్య లోటు గణాంకాలు(గురువారం) విడుదల అవుతుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ డిసెంబర్ తొమ్మిదో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల రెండో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఇదే వారంలో వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ నవంబర్ వాహన విక్రయ డేటా, ఐఆర్డీఏఐ ఈ ఏడాది ప్రధమార్థం తొలి ప్రీమియం గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్ 13న) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటీ నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగుసార్లు వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు చొప్పున ఫెడ్ ఈసారి మాత్రం 50 బేసిస్ పాయింట్లకు పరిమితం కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ మరుసటి రోజే(గురువారం) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్లు తమ ద్రవ్య విధాన వైఖరిని వెల్లడించనున్నాయి. ఏడు రోజుల్లో రూ.4,500 కోట్ల అమ్మకాలు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ డిసెంబర్ (1–11 తేదీల మధ్య)లో ఇప్పటి వరకు రూ.4500 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ విలువ దిగిరావడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి(బుధవారం)కి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ చివరి మూడు రోజుల్లో నికరంగా రూ.3,300 కోట్లను ఉపసహరించుకున్నారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ సగటు కంటే అధిక విలువ వద్ద ట్రేడవుతుంది. కావున ఎఫ్ఐఐలు చౌక వాల్యూయేషన్లతో ట్రేడవుతున్న చైనా, కొరియా వంటి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపుతున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వరకు భారత ఈక్విటీలపై విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరినే కలిగి ఉండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. కాగా గడిచిన నవంబర్లో రూ. 36,329 కోట్లను కొన్నారు. -
ఐపీవోకు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. తద్వారా 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. వెరసి దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న తొలి రిటైల్ రంగ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. కంపెనీకి 14 నగరాలలో నిర్వహణలోగల 17 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీటిలో 3,000 స్టోర్స్ ఉన్నాయి. కోటి చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తున్న ఈ పోర్ట్ఫోలియో విలువ 300 కోట్ల డాలర్లుగా అంచనా. 2023 క్యాలండర్ ఏడాది తొలి అర్ధభాగంలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మూడో రీట్.. నెక్సస్ సెలెక్ట్ బ్లాక్స్టోన్ పెట్టుబడులు గల మూడో రీట్కాగా.. తొలుత ఎంబసీ ఆఫీస్ పార్క్స్, తదుపరి మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లను వెలువరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన రీట్ను దేశీయంగా కొద్దికాలంక్రితమే అనుమతించారు. వీటి ద్వారా రియల్టీ ఆస్తుల విలువను అన్లాక్ చేయడంతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకూ వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో మూడు రీట్లు ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్, బ్రూక్ఫీల్డ్ ఇండియా లిస్టయ్యాయి. అయితే ఇవి లీజ్డ్ ఆఫీస్ ఆస్తులుకాగా.. నెక్సస్ సెలెక్ట్ రిటైల్ రియల్టీ ఆస్తులతో కూడిన తొలి అద్దె ఆదాయ కంపెనీ కావడం గమనార్హం! -
కళామందిర్కు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: సంప్రదాయ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.80 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, కేఎల్ఎం, మందిర్ బ్రాండ్లతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్విటీ జారీ నిధులను 25 కొత్త స్టోర్లు, 2 వేర్హౌస్ల ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో 50 స్టోర్లను నిర్వహిస్తోంది. రూ. 2,400 కోట్లపై కేఫిన్ కన్ను ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,400 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. కంపెనీ ప్రమోటర్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ లిమిటెడ్ వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కేఫిన్లో జనరల్ అట్లాంటిక్ దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవో దరఖాస్తును కంపెనీ మార్చిలో సెబీకి దాఖలు చేసింది. -
ఈ వారమంతా ఐపీవోల హవా..
న్యూఢిల్లీ: ఇటీవల జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ ఈ వారం మరింత కళకళలాడనుంది. నాలుగు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపడుతున్నాయి. ఈ జాబితాలో మెడంటా బ్రాండుతో ఆసుపత్రులను నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ లిమిటెడ్, సూక్ష్మ రుణాల సంస్థ ఫ్యూజన్ మైక్రోఫైనాన్స్ లిమిటెడ్, కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీస్ తయారీ కంపెనీ డీసీఎక్స్ సిస్టమ్స్, స్నాక్స్ తయారీ కంపెనీ బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఉన్నాయి. ఇవి ఉమ్మడిగా రూ. 4,700 కోట్లు సమీకరించాలని భావిస్తున్నాయి. వీటితోపాటు నవంబర్లోనే యూనిపార్ట్స్ ఇండియా, ఫైవ్ స్టార్ బిజినెస్ ఫైనాన్స్ సైతం ఐపీవోలకు రానున్నాయి. వివరాలు చూద్దాం.. 31 నుంచి షురూ సోమవారం(31) నుంచి ప్రారంభమైన డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ నవంబర్ 2న ముగియనుంది. నవంబర్ 2న మొదలుకానున్న ఫ్యూజన్ మైక్రో ఇష్యూ 4న ముగియనుంది. ఈ బాటలో గ్లోబల్ హెల్త్, బికాజీ ఫుడ్స్ ఐపీవోలు నవంబర్ 3న ప్రారంభమై 7న ముగియనున్నాయి. 2022లో ఇప్పటివరకూ 22 కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 44,000 కోట్లు సమకూర్చుకున్నాయి. 2021లో మొత్తం 63 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టి రూ. 1.19 లక్షల కోట్లను సమీకరించిన విషయం విదితమే. డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవోలో భాగంగా డీసీఎక్స్ సిస్టమ్స్ రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 197–207 ధరలో పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 225 కోట్లు సమకూర్చుకుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సొంత అనుబంధ సంస్థ రేనియల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ ఐపీవోలో భాగంగా ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయ నుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 1,36,95,466 షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 350–368 ధరలో చేపడు తున్న ఇష్యూ ద్వారా రూ. 1,104 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధులను మైక్రోఫైనాన్స్ మూలధన బలిమికి వినియోగించనుంది. గ్లోబల్ హెల్త్ ఐపీవోలో భాగంగా గ్లోబల్ హెల్త్ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రస్తుత వాటాదారులు 5.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 319–336 ధరలో చేపడుతున్న ఇష్యూ ద్వారా రూ. 2,206 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. బికాజీ ఫుడ్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 285–300 ధరల శ్రేణిని బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ తాజాగా ప్రకటించింది. తద్వారా రూ. 881 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 2.94 కోట్ల షేర్ల ను విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ వార్షికంగా 29,380 టన్నుల బికనీర్ భుజియా తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్యాకేజ్డ్ రసగుల్లా, సోన్ పాపి డి, గులాబ్ జామూన్ తదితరాలను సైతం తయా రు చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 50 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. రిటైలర్ల ఆసక్తి సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇకపై ప్రైమరీ మార్కెట్ మందగించే వీలున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. అయితే కొత్త కంపెనీలలో పెట్టుబడి అవకాశాలపట్ల ఇన్వెస్టర్లు ఆసక్తిని ప్రదర్శిస్తుండటంతో ఇష్యూలు సక్సెస్ అవుతున్నట్లు తెలియజేశారు. సంపన్న వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్ల భారీ పెట్టుబడులు ఇందుకు దోహదం చేస్తున్నట్లు వివరించారు. -
ఐపీవోకు ఇండియాఫస్ట్ లైఫ్
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రమోట్ చేసిన ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. బ్యాంకింగ్ వర్గాల సమాచారం ప్రకారం ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,000–2,500 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా దాదాపు 14.13 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ఇతర వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్ సంస్థ బీవోబీ 8.9 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయనుంది. కార్మెల్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా 3.92 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.30 కోట్లకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచనున్నాయి. ఇండియాఫస్ట్ లైఫ్లో బీవోబీ వాటా 65 శాతంకాగా.. కార్మెల్ పాయింట్(వార్బర్గ్ పింకస్)కు 26 శాతం, యూనియన్ బ్యాంక్కు 9 శాతం చొప్పున వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో ఇండియాఫస్ట్ లైఫ్ పేర్కొంది. -
డీసీఎక్స్ సిస్టమ్స్ ఐపీవో @ రూ. 500 కోట్లు
న్యూఢిల్లీ: కేబుళ్లు, వైర్ హార్నెస్ అసెంబ్లీల తయారీ సంస్థ డీసీఎక్స్ సిస్టమ్స్ తాజాగా పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 500 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం షేరు ధర శ్రేణిని రూ. 197–207గా నిర్ణయించింది. ఐపీవో అక్టోబర్ 31న ప్రారంభమై నవంబర్ 2న ముగుస్తుంది. ఐపీవో కింద కొత్తగా జారీ చేసే ఈక్విటీ షేర్ల పరిమాణాన్ని రూ. 500 కోట్ల నుంచి రూ. 400 కోట్లకు సంస్థ తగ్గించింది. ప్రమోటర్లు (ఎన్సీబీజీ హోల్డింగ్స్, వీఎన్జీ టెక్నాలజీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో రూ. 100 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 72 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఇష్యూలో 75 శాతాన్ని క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు (క్యూఐఐ), 15 శాతాన్ని సంస్థాగతయేతర ఇన్వెస్టర్లకు, 10 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 1,102 కోట్లుగా నమోదైంది. ఆర్డరు బుక్ 2020 మార్చి నాటికి రూ. 1,941 కోట్లుగా ఉండగా 2022 మార్చి నాటికి రూ. 2,369 కోట్లకు పెరిగింది. -
భారత్కు మారిన ఫోన్పే ప్రధాన కార్యాలయం
న్యూఢిల్లీ: త్వరలో పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) రానున్న నేపథ్యంలో ఫిన్టెక్ సంస్థ ఫోన్పే తమ కార్యాలయ చిరునామాను సింగపూర్ నుంచి భారత్కు మార్చుకుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది కాలంగా ఫోన్పే సింగపూర్కు చెందిన ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసులు, వెల్త్ బ్రోకింగ్ మొదలైన వ్యాపారాలు, అనుబంధ సంస్థలు అన్నింటిని ఫోన్పే ప్రైవేట్ లిమిటెడ్–ఇండియాకు బదలాయించినట్లు వివరించింది. మరోవైపు, 3,000 మంది ఉద్యోగులకు ఫోన్పే ఇండియా కొత్త ప్లాన్ కింద కొత్త ఎసాప్ (ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్)లను జారీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్లు సమీర్ నిగమ్, రాహుల్ చారి, బుర్జిన్ ఇంజినీర్ కలిసి ఫోన్పేను ప్రారంభించారు. దీన్ని ఫ్లిప్కార్ట్ 2016లో కొనుగోలు చేసింది. అటుపైన 2018లో ఫ్లిప్కార్ట్ను అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ కొనుగోలు చేయడంతో ఫోన్పే కూడా వాల్మార్ట్లో భాగంగా మారింది. ప్రస్తుతం 8–10 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. -
ఐనాక్స్ విండ్ రుణరహితం
ముంబై: పబ్లిక్ ఇష్యూ తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పవన విద్యుత్ సొల్యూషన్స్ సంస్థ ఐనాక్స్ విండ్ తాజాగా పేర్కొంది. ఐపీవో చేపట్టేందుకు సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసిన కంపెనీ అనుమతుల కోసం చూస్తోంది. ప్రమోటర్లు కంపెనీకి పెట్టుబడులు అందించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు.. ఐపీవో నిధులను వెచ్చించడం ద్వారా రుణరహితంగా మారనున్నట్లు వివరించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీకి 2022 జూన్కల్లా రూ. 1,718 కోట్ల స్థూల రుణ భారం నమోదైంది. రూ. 222 కోట్లమేర నగదు నిల్వలున్నాయి. నికరంగా రూ. 1,495 కోట్ల రుణాలను కలిగి ఉంది. అయితే ప్రయివేట్ ప్లేస్మెంట్కింద రెండు ప్రమోటర్ సంస్థలు మార్పిడిరహిత బాండ్ల ద్వారా రూ. 800 కోట్లను కంపెనీకి అందించనున్నట్లు ఐనాక్స్ విండ్ తెలియజేసింది. ఐనాక్స్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ రూ. 600 కోట్లు, ఐనాక్స్ విండ్ ఎనర్జీ రూ. 200 కోట్లు చొప్పున పంప్చేయనున్నాయి. వీటితోపాటు ఐపీవో నిధులను సైతం రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ఐనాక్స్ విండ్ వివరించింది. తద్వారా ఐపీవో తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేసింది. -
ఐపీవోకు బ్లూజెట్ హెల్త్కేర్
న్యూఢిల్లీ: ఫార్మాస్యూటికల్ ఇన్గ్రెడియంట్స్ తయారీ కంపెనీ బ్లూ జెట్ హెల్త్కేర్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు అక్షయ్ భన్సారీలాల్ అరోరా, శివేన్ అక్షయ్ అరోరా దాదాపు 2.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో ద్వారా రూ. రూ. 1,800– 2,100 కోట్ల మధ్య సమీకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. ముంబై కంపెనీ బ్లూ జెట్ ప్రధానంగా స్పెషాలిటీ ఫార్మాస్యూటికల్, హెల్త్కేర్ సంబంధ ఇన్గ్రెడియంట్స్, ఇంటర్మీడియట్లను రూపొందిస్తోంది. ఇన్నోవేటర్ ఫార్మాస్యూటికల్, మల్టీనేషనల్ జనరిక్ కంపెనీలకు ప్రత్యేకతరహా ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. గతేడాది(2021–22) ఆదాయం 37 శాతం ఎగసి రూ. 683 కోట్లను అధిగమించింది. నికర లాభం 34 శాతం జంప్చేసి దాదాపు రూ. 182 కోట్లకు చేరింది. కంపెనీ రుణరహితంకాగా.. మహారాష్ట్రలోని షహద్, అంబర్నాథ్, మహద్లలో మూడు ప్లాంట్లను కలిగి ఉంది. -
డ్రీమ్ఫోక్స్ ఐపీవోకు రిటైలర్ల క్యూ
న్యూఢిల్లీ: విమానాశ్రయ సర్వీసులు పొందేందుకు వీలు కల్పించే అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ డ్రీమ్ఫోక్స్ పబ్లిక్ ఇష్యూకి రిటైలర్ల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. ఇష్యూ తొలి రోజు(బుధవారం) రిటైల్ విభాగంలో 5.4 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. షేరుకి రూ. 308–326 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 94,83,302 షేర్లను విక్రయానికి ఉంచింది. 1.03 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 1.1 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ శుక్రవారం(26న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా రూ. 253 కోట్లు సమకూర్చుకుంది. ఆఫర్లో భాగంగా ప్రమోటర్లు మొత్తం 1.72 కోట్లకుపైగా ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచారు. ఐపీవో తదుపరి చెల్లించిన మూలధనంలో ఇది 33 శాతం వాటాకు సమానం! రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. -
28 ఐపీవోలు .. రూ. 45,000 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)ల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. వీటిలో 11 సంస్థలు ఇప్పటికే రూ. 33,254 కోట్లు సమీకరించాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్దే (రూ. 20,557 కోట్లు) ఉంది. ఏప్రిల్–మే నెలల్లోనే చాలా సంస్థలు ఐపీవోకి వచ్చాయి. మే తర్వాత పబ్లిక్ ఇష్యూలు పూర్తిగా నిల్చిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో తగిన సమయం కోసం పలు సంస్థలు వేచి చూస్తున్నాయని మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు తెలిపాయి. వీటిలో చాలా మటుకు కంపెనీలు రోడ్షోలు కూడా పూర్తి చేశాయని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రావు చెప్పారు. ఐపీవోలకు అనుమతులు పొందిన సంస్థలలో ఫ్యాబ్ఇండియా, భారత్ ఎఫ్ఐహెచ్, టీవీఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్, కిడ్స్ క్లినిక్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. సెంటిమెంట్ డౌన్: గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) 52 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం టెక్నాలజీ స్టార్టప్ల ఇష్యూలపై ఆసక్తి నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పాలుపంచుకోవడం, లిస్టింగ్ లాభాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ప్రస్తుతం సెకండరీ మార్కెట్ భారీగా కరెక్షన్కు లోను కావడం, పేటీఎం.. జొమాటో వంటి డిజిటల్ కంపెనీల పనితీరు ఘోరంగా ఉండటం, ఎల్ఐసీ వంటి దిగ్గజం లిస్టింగ్లో నిరాశపర్చడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ వివరించారు. క్యూలో మరిన్ని కంపెనీలు. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ .. ఐపీవో ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు గత రెండు నెలలుగా కంపెనీలు క్యూ కడుతుండటం గమనార్హం. జూన్–జూలైలో మొత్తం 15 కంపెనీలు సెబీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సూలా విన్యార్డ్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సాయి సిల్క్ కళామందిర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న నగరాల్లో అద్భుతంగా రా>ణించిన వ్యాపార సంస్థల ప్రమోటర్లు ఇప్పుడు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ముందుకు వస్తున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎండీ అభిజిత్ తారే తెలిపారు. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా నమోదవుతుండటం, ఆర్థిక డేటా కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తుండటం తదితర అంశాలు, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సహేతుకమైన ధరతో వచ్చే కంపెనీల ఐపీవోలకు సానుకూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. -
మళ్లీ పబ్లిక్ ఇష్యూల సందడి
న్యూఢిల్లీ: రెండున్నర నెలల తదుపరి మళ్లీ ప్రైమరీ మార్కెట్కు జోష్ రానుంది. ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసుల కంపెనీలలో సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూ నేడు(12న) ప్రారంభంకానుంది. ఎవలాన్ టెక్నాలజీస్ అయితే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. మరోవైపు ఆరోగ్య పరిరక్షణ రంగ సంస్థ యథార్ధ్ హాస్పిటల్ అండ్ ట్రౌమా కేర్ సర్వీసెస్ ఐపీవో దరఖాస్తుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా ఫిన్కేర్ సాŠమ్ల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండోసారి సెబీకి దరఖాస్తు చేసింది. వివరాలు చూద్దాం.. ఎస్జీఎస్ టెక్.. నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానున్న ఐపీవో ద్వారా సిర్మా ఎస్జీఎస్ టెక్నాలజీ రూ. 840 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. 18న ముగియనున్న ఇష్యూకి రూ. 209–220 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇంతక్రితం మే 24–26న ఏథెర్ ఇండస్ట్రీస్ ఐపీవో చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ 11 కంపెనీలు లిస్టింగ్ ద్వారా రూ. 33,254 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. వీటిలో ఎల్ఐసీ వాటా రూ. 20,557 కోట్లు. కాగా.. సిర్మా ఎస్జీఎస్ ఐపీవోలో భాగంగా రూ. 766 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 33.69 లక్షల షేర్లను వీణా కుమారి టాండన్ విక్రయానికి ఉంచనున్నారు. నిధులను పెట్టుబడి వ్యయాలు, ఆర్అండ్డీ విస్తరణ, కార్పొరేట్ అవసరాలు తదితరాలకు వినియోగించనుంది. కంపెనీ కస్టమర్లలో ఏవో స్మిత్, టీవీఎస్ మోటార్, యురేకా ఫోర్బ్స్ తదితరాలున్నాయి. యథార్ధ్.. రెడీ ఢిల్లీ–ఎన్సీఆర్లో మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న యథార్ధ్ హాస్పిటల్ అండ్ ట్రౌమా కేర్ సర్వీసెస్ ఐపీవోకు సెబీ అనుమతించింది. ఇష్యూలో భాగంగా రూ. 610 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 65.51 లక్షల షేర్లను ప్రమోటర్లు, తదితర సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కంపెనీ ఏప్రిల్లో దరఖాస్తు చేసింది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు, కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎవలాన్ టెక్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ సర్వీసుల కంపెనీ ఎవలాన్ టెక్నాలజీస్ ఐపీవోకు వీలుగా సెబీకి దరఖాస్తు చేసింది. తద్వారా రూ. 1,025 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 625 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. ఫిన్కేర్.. మళ్లీ ఐపీవో చేపట్టేందుకు సెబీ నుంచి లభించిన ఏడాది గడువు గత నెలలో ముగియడంతో ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మరోసారి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు మరో 1.7 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు, భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ఇంతక్రితం రూ. 1,330 కోట్ల సమీకరణకు 2021 మే నెలలో ప్రాస్పెక్టస్ దాఖలు చేయగా.. అదే ఏడాది జులైలో సెబీ ఓకే చేసింది. బిబాకు చెక్ ఫ్యాషన్, సంప్రదాయ దుస్తుల కంపెనీ బిబా ఫ్యాషన్ పబ్లిక్ ఇష్యూకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాత్కాలికంగా చెక్ పెట్టింది. వివరాలు వెల్లడికానప్పటికీ దరఖాస్తును పెండింగ్లో ఉంచినట్లు సెబీ వెబ్సైట్ పేర్కొంది. కంపెనీ ఏప్రిల్ 12న ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 90 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేసే యోచనలో ఉంది. వీటికి జతగా మరో 2.77 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. 1986లో ఏర్పాటైన కంపెనీ బిబా బ్రాండుతో మహిళా ఫ్యాషన్ దుస్తులను రూపొందిస్తోంది. -
ఐపీఓ బాటలో ఫోన్పే
న్యూఢిల్లీ: గ్లోబల్ రిటైలింగ్ కంపెనీ వాల్మార్ట్ గ్రూప్లోని యూపీఐ చెల్లింపుల దిగ్గజం ఫోన్పే పబ్లిక్ ఇష్యూ సన్నాహాలు ప్రారంభించింది. ఫ్లిప్కార్ట్కు మెజారిటీ వాటాగల కంపెనీ ఇందుకు బ్యాంకర్లు, న్యాయ సలహాదారు సంస్థలను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా కంపెనీ 8–10 బిలియన్ డాలర్ల(రూ. 62,000– 78,000 కోట్లు) విలువను ఆశిస్తున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. నిధులతో యూపీఐ ఆధారిత చెల్లింపుల నిర్వహణతోపాటు ఫైనాన్షియల్ సర్వీసుల పోర్ట్ఫోలియోను మరింత విస్తరించే ప్రణాళికలున్నట్లు పేర్కొన్నాయి. మేడిన్ ఇండియా సంస్థగా ఆవిర్భవించే బాటలో రిజిస్టర్డ్ హోల్డింగ్ సంస్థను సింగపూర్ నుంచి భారత్కు మార్చే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. ఈ ప్రతిపాదనను ఇప్పటికే ఫోన్పే బోర్డు అనుమతించడం గమనార్హం! దేశీయంగా ఊపిరి ఇటీవల పలు కంపెనీలు విదేశాలలో లిస్టింగ్కు ప్రాధాన్యత ఇస్తుంటే డిజిటల్ చెల్లింపుల కంపెనీ ఫోన్పే మాత్రం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు ఆసక్తి చూపుతోంది. స్నేహపూర్వక వ్యాపార నియంత్రణలు, పన్ను చట్టాలు గల యూఎస్ లేదా సింగపూర్లో లిస్టింగ్కు పలు స్టార్టప్లు చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్పేను నిజానికి ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్స్ సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ ఏర్పాటు చేశారు. తదుపరి 2016లో ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసింది. 2018లో ఫోన్పే సహా ఫ్లిప్కార్ట్ను వాల్మార్ట్ సొంతం చేసుకుంది. 2023కల్లా... ఫోన్పే లాభాల్లోకి ప్రవేశించిన వెంటనే పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని చూస్తున్నట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. 2023కల్లా టర్న్అరౌండ్ కాగలదని అంచనా వేస్తున్నట్లు తెలియజేశాయి. దేశీయంగా యూపీఐ లావాదేవీలు జోరందుకోవడంతో ఈ డిసెంబర్కల్లా సిబ్బంది సంఖ్యను 5,200కు చేర్చుకునే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం 2,600 మంది ఉద్యోగులను కలిగిన ఫోన్పే మరో 2,800 ఉపాధి అవకాశాలకు తెరతీసినట్లు తెలుస్తోంది. భారీ విలువలో ప్రమోటర్లు ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్ల నుంచి ఫోన్పే 70 కోట్ల డాలర్లు సమీకరించింది. దీంతో 2020లో కంపెనీ విలువ 5.5 బిలియన డాలర్లకు చేరింది. ఈ బాటలో టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, టెన్సెంట్ తదితర దిగ్గజాల నుంచి 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించింది. యూపీఐ విభాగంలో నెలవారీ లావాదేవీల్లో కంపెనీ 47 శాతం మార్కెట్ వాటాతో అగ్రపథంలో ఉంది. వెల్త్డెస్క్, ఓపెన్క్యూ, గిగ్ఇండియాలను కొనుగోలు చేసిన కంపెనీ మ్యూచువల్ ఫండ్, ఎన్బీఎఫ్సీలైసెన్సులకు దరఖాస్తు చేసింది. ప్రస్తుతం ఎంఎఫ్ పంపిణీ లైసెన్స్ను కలిగి ఉంది. వెల్త్మేనేజ్మెంట్ ప్రొడక్టుల్లో భాగంగా స్టాక్స్, ఈటీఎఫ్లను జమ చేసుకుంటోంది. బంగారంలో పెట్టుబడులకు వీలు కల్పిస్తూ యూపీఐ సిప్ను ప్రవేశపెట్టింది. -
ఎల్ఐసీ ఐపీవో సక్సెస్
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ సక్సెస్ అయ్యింది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ 9న(సోమవారం) ముగిసింది. చివరి రోజుకల్లా ఇష్యూ మొత్తం 2.95 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లను ప్రభుత్వ ఆఫర్ చేయగా.. 47.83 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. క్విబ్ కోటాలో 2.83 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.91 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ఇక రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 13.77 కోట్ల షేర్ల కోసం(దాదాపు రెట్టింపు) దరఖాస్తులు లభించాయి. పాలసీదారుల నుంచి 6 రెట్లు, ఉద్యోగుల నుంచి 4.4 రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయి. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఐపీవో ధరలో ఎల్ఐసీ రాయితీ ఇచ్చింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకుంది. ఇతర హైలైట్స్ ► ఐపీవోలో భాగంగా దరఖాస్తుదారులకు ఎల్ఐసీ షేర్లను ఈ నెల 12కల్లా కేటాయించనుంది. ► బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో ఎల్ఐసీ ఈ నెల 17న(మంగళవారం) లిస్ట్కానుంది. ► రూ. 20,557 కోట్ల సమీకరణ ద్వారా ఎల్ఐసీ అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పింది. తదుపరి ర్యాంకుల్లో రూ. 18,300 కోట్లతో పేటీఎమ్(2021), రూ. 15,500 కోట్లతో కోల్ ఇండియా(2010), రూ. 11,700 కోట్లతో రిలయన్స్ పవర్(2008) నిలిచాయి. ఆత్మనిర్భర్ భారత్ బీమా రంగ పీఎస్యూ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ అన్ని విభాగాల్లోనూ విజయవంతమైనట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తెలియజేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్కు ఉదాహరణగా పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఆఫర్ను సక్సెస్ చేసినట్లు తెలియజేశారు. తద్వారా విదేశీ ఇన్వెస్టర్లపైనే ఆధారపడిలేమని నిరూపణ అయినట్లు వ్యాఖ్యానించారు. ఇది దేశీ క్యాపిటల్ మార్కెట్లు మరింత బలపడేందుకు దోహదం చేయగలదని అభిప్రాయపడ్డారు. -
నేటితో ఎల్ఐసీ ఐపీవో ముగింపు
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. షేరుకి రూ. 902–949 ధరలో ఈ నెల 4న ప్రారంభమైన ఇష్యూ నేడు(9న) ముగియనుంది. ఆదివారానికల్లా ఇష్యూ మొత్తం 1.8 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. దాదాపు 16.21 కోట్ల షేర్లకుగాను 29 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. రిటైలర్ల విభాగంలో ఆఫర్ చేసిన 6.9 కోట్ల షేర్లకుగాను 10.99 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. పాలసీదారుల నుంచి 5 రెట్లు, ఉద్యోగుల నుంచి 3.8 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇక నాన్ఇన్స్టిట్యూషనల్ విభాగంలో 1.24 రెట్లు బిడ్స్ దాఖలుకాగా.. క్విబ్ కోటాలో మాత్రం 0.67 శాతమే స్పందన కనిపించింది. పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 45 చొప్పున ఎల్ఐసీ ఐపీవో ధరలో రాయితీ ఇస్తోంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 20,600 కోట్లవరకూ సమకూర్చుకోవాలని చూస్తోంది. 5 కోట్ల మార్క్ తొలిసారి 5 కోట్ల అప్లికేషన్ల మైలురాయిని దాటిన ఐపీవోగా ఎల్ఐసీ నిలిచినట్లు పేటీఎమ్ మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి భారీ స్పందన కనిపిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో దరఖాస్తుపై సగటు పెట్టుబడికంటే అధికంగా రూ. 29,000 చొప్పున లభిస్తున్నట్లు తెలియజేశారు. యూపీఐ ద్వారా ఐపీవోకు రూ. 5 లక్షలవరకూ అనుమతించడంతో హెచ్ఎన్ఐ పెట్టుబడులు సైతం తరలివస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎల్ఐసీ అమ్మక పరిమాణం ఓకే
ముంబై: పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయించడమే ప్రస్తుత పరిస్థితుల్లో సరైన పరిమాణమని దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలోకి ఒక్కసారిగా భారీ పెట్టుబడులు తరలి వచ్చేందుకు వీలుండదని తెలియజేశారు. ప్రస్తుత సమస్యాత్మక మార్కెట్ వాతావరణంలో ఎల్ఐసీ వాటా విక్రయాన్ని రూ. 20,557 కోట్లకు పరిమితం చేయడం సరైన చర్యగా పేర్కొన్నారు. ఎల్ఐసీ ఇష్యూ అందరికీ.. ప్రధానంగా రిటైల్ ఇన్వెస్టర్లకు విలువ చేకూర్చగలదని అభిప్రాయపడ్డారు. వెరసి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూపై అధికారికంగా వివరాలు వెలువడ్డాయి. తొలుత 5 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడ్డ ప్రభుత్వం మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా 3.5 శాతానికి తగ్గించుకుంది. 22.13 కోట్ల షేర్ల విక్రయం ద్వారా రూ. 20,557 కోట్లు లభించగలవని భావిస్తోంది. ఇష్యూ మే 4న ప్రారంభమై 9న ముగియనున్నట్లు అంచనా. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 902–949గా నిర్ణయించిన విషయం విదితమే. పాలసీదారులు, ఉద్యోగులు, రిటైలర్లకు ఇష్యూ ధరలో రూ. 60–40 వరకూ రాయితీని ప్రకటించింది. ఎల్ఐసీ.. మే 17న స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.