Scanning Centre
-
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
Paragamanjari: పుప్పొడి నేత..పరాగ మంజరి
పూల అందాలను చూసి మైమరచిపోవడం మనకు తెలిసిందే! వాటిలో దాగున్న పరాగ రేణువుల అందం చూస్తే... ప్రకృతి ఒడిలో మనకు తెలియని ఇన్ని అద్భుతాలు దాగున్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత సంక్లిష్టంగా ఉండే ఆ పరాగ రేణువుల నిర్మాణపు అందాన్ని చూడటమే కాదు, వాటిని టెక్స్టైల్ డిజైన్స్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్శిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని శివాని నేత చిలుకూరి. అత్యంత సూక్ష్మంగా కనిపించే ఈ అద్భుతాలను ‘పరాగ మంజరి’గా మనకు పరిచయం చేస్తున్నది. ‘దేశానికి గుర్తింపు తెచ్చే లక్షలాది యునిక్ డిజైన్స్ని పరిచయం చేయబోతున్న ఆనందంలో ఉన్నాను’ అంటున్న శివాని నేత తనప్రాజెక్ట్ విశేషాలను ఇలా మన ముందుంచింది..‘‘పరాగ అంటే పుప్పొడి – మంజరి అంటే డిజైన్. సంస్కృతం నుంచి తీసుకున్న ఈ పదాలను మాప్రాజెక్ట్కు పెట్టాం. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుని, కుదరక బోటనీ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బోటనీ చేస్తున్నాను. నాకు డ్రాయింగ్ కూడా తెలుసు అని మా బోటనీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి సర్ నాకు ఈ డిజైనింగ్ టాపిక్ ఇచ్చారు. దానిని ఇలా మీ ముందుకు తీసుకు రాగలిగాను.లక్షలాది మోడల్స్పరాగ రేణువులను రెండు విధాలుగా మైక్రోస్కోప్ చేశాను. లైట్ మైక్రోస్కోపీలో ఫ్లవర్ స్ట్రక్చర్, సెమ్(స్కానింగ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్)లో పుప్పొడి రేణువులను స్కాన్ చేశాను. భూమిపైన లక్షలాది మొక్కలు, వాటి పువ్వులు వేటికవి భిన్నంగా ఉంటాయి. ఇక వాటిలోని పరాగ రేణువులు మరింత భిన్నంగా ఉంటాయి. మందార, వేప, తులసి, తిప్పతీగ, తుమ్మ, అర్జున, ఉల్లిపాయ, కాకర, ఆరెంజ్, జొన్న, మొక్కజొన్న, ఖర్జూరం, దోస పువ్వు... ఇలా దాదాపు 70 రకాల పుప్పొడి రేణువులను స్కాన్ చేసి, ఆ స్కెలిటిన్ నుంచి మోటిఫ్స్ను వెలుగులోకి తీసుకువచ్చాను. ఈ అందమైన పరాగ రేణువుల నుంచి మోటిఫ్స్ డిజైన్స్గా తీసుకు రావడానికి నాలుగు నెలల సమయం పట్టింది.పేటెంట్ హక్కుఇప్పటి వరకు సాఫ్ట్వేర్లోనే టెక్స్టైల్ ΄్యాటర్న్ని తీసుకున్నాను. క్లాత్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మాది నేత కుటుంబమే. నేను చేసిన ఈ ప్రింట్స్ క్లాత్స్ మీదకు తీసుకురావచ్చని నిర్ధారణ చేసుకున్నాం. కాటన్, పట్టు, సీకో మెటీరియల్ మీదకు మోటిఫ్స్ ప్రింట్స్ చేయచ్చు. నేతలోనూ డిజైన్స్ తీసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ కూడా చేయచ్చు. మేం ముందు టీ షర్ట్ పైన ప్రింటింగ్ ప్రయత్నం చేశాం. ఇంకా మిగతా వాటి మీదకు ప్రింట్స్ చేయాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మద్దతు అవసరం అవుతుంది. బ్లాక్ ప్రింట్ చేయాలన్నా .. అందుకు తగిన వనరులన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా పేటెంట్ హక్కు ΄÷ందేవరకు వెళ్లింది. దీనిని ఒక స్టార్టప్గా త్వరలోప్రారంభించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.టెక్స్టైల్ రంగం మద్దతుతో...ప్రకృతిలో కళ్లకు కనిపించేవి లైట్ మైక్రోస్కోపిక్ ద్వారా నలభై వరకు పిక్చర్స్ తీసుకుంటే, స్టెమ్ ద్వారా మరికొన్ని సాధించాం. కంప్యూటర్లో వియానా దేశం నుంచి పోలెన్ గ్రెయిన్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ నుంచి కొన్ని తీసుకున్నాం. మన దేశానికి వేల సంవత్సరాల నుంచి అద్భుతమైన టెక్స్టైల్ డిజైనింగ్ కల్చర్ ఉంది. కలంకారీ, ఇకత్ పోచం పల్లి, గొల్లభామ, రాజస్థాన్లో బాందినీ, గుజరాతీలో లెహెరియా, కాశ్మీర్ ఎంబ్రాయిడరీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ‘పరాగ మంజరి’ మన దేశానికే వన్నె తెచ్చేలా తీసుకురావాలన్నది నా ప్రయత్నం. దీనిని తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ శాఖకు అందించి, వారి సపోర్ట్ తీసుకొని, ఈ వర్క్ను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని శివాని నేత చిలుకూరి తెలియజేశారు. లక్ష ΄్యాటర్న్స్ఒక్కో చెట్టు పువ్వుకు ఒక్కో ప్రత్యేకమైన పరాగ రేణువులు ఉంటాయి. ఈ పరాగ రేణువుల మోడల్స్ నుంచి కొన్ని లక్షల ΄్యాటర్న్స్ టెక్స్టైల్ రంగంలోకి తీసుకురావచ్చు. వీటిని పట్టు, కాటన్, సిల్క్, బెడ్ షీట్స్.. ఇలా ప్రతి క్లాత్ మీదకు తీసుకురావచ్చు. ఈప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఇలా చేశారా.. అని శోధించాను. కానీ, ఎక్కడా మాకు ఆ సమాచారం లభించలేదు. అందుకే, పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశాం. ఈ ΄్యాటర్న్స్ వస్త్ర డిజై¯Œ పరిశ్రమల్లో గణనీయమైన ప్రభావం చూపుతాయి. – డాక్టర్ అల్లం విజయ భాస్కర్రెడ్డి, అసోసియేట్ప్రొఫెసర్, బోటనీ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్శిటీ – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్లోని ఓ స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ అకృత్యాలు వెలుగు చూశాయి. స్కానింగ్ వచ్చే మహిళలు న్యూడ్ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అనేక మంది ఆ కామాంధుని అకృత్యాలకు బలయ్యారు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది.స్కానింగ్ సెంటర్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేసి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. విచారణ ప్రారంభించారు.నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యజమాని డాక్టర్ చంద్రశేఖర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.. ఆపరేటర్ ప్రశాంత్ స్పై కెమెరాతో ఫొటోస్ వీడియో తీసినట్లు తెలిసిందని బాధితుల ఫిర్యాదుతో ప్రశాంత్ను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ప్రశాంత్ను ఉద్యోగం నుంచి తొలగించామని కూడా చెప్పారు. ప్రశాంత్ అమ్మాయిలతో చాట్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్ చంద్రశేఖర్. -
ఎన్టీ స్కాన్ అంటే ఏంటీ? దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది?
నాకిప్పుడు 3వ నెల. రొటీన్ స్కాన్లో బేబీ NT థికనెస్ 3.5 సెం.మీ ఉంది అని డాక్టర్ చెప్పారు. అది మంచిది కాదన్నారు. స్కాన్ మెషిన్ తప్పేమో అని నాకు అనిపిస్తోంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? మళ్లీ ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి? – డి. అమరజ, బళ్లారి NT(న్యూకల్ ట్రాన్స్లుసెన్సీ) స్కాన్ అనేది టైమ్ బౌండ్తో ఉంటుంది. అంటే 11–13 వారాల ప్రెగ్నెన్సీ మధ్యలోనే చేయించుకోవాలి. సమయం తక్కువ కాబట్టి సెకండ్ ఒపీనియన్గా వెంటనే వేరే చోట అంటే ఫీటల్ మెడిసిన్ యూనిట్లో పనిచేసే డాక్టర్తో చేయించండి. పుట్టబోయే బిడ్డకు మెడ వెనుక చర్మం కింద నార్మల్గానే కొంచెం ఫ్లూయిడ్ ఉంటుంది. సాధారణంగా దీనిని మూడవ నెల ప్రెగ్నెన్సీలో NT స్కాన్లో చెక్ చేస్తారు. అది 3.5 సెం.మీలోపు ఉంటే ఏ సమస్యా ఉండదు. NT థిక్నెస్ బేబీది 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉంటే ‘Icreased NT’ అంటారు. ఈ కేసులో గర్భస్రావం అయ్యే చాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. బిడ్డ గుండెకు సంబంధించి ఏదైనా అబ్నార్మాలిటీ ఉండొచ్చు. లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటే డౌన్స్ సిండ్రోమ్(Down Syndrome) లాంటివి ఉండొచ్చు. కానీ ఒక్క NT థిక్నెస్ పైనే డయాగ్నసిస్ చేయరు. మీ బ్లడ్ టెస్ట్ కూడా చెక్ చేసి రెండిటినీ కలిపి చేసే టెస్ట్ని కంబైడ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటారు. ఆ టెస్ట్ చేయించుకోండి. ఇందులో ‘లో రిస్క్’ అని వస్తే ప్రమాదం తక్కువ అని అర్థం. ‘హై రిస్క్’ అని వస్తే ఫీటస్ మెడిసిన్ కన్సల్టెంట్ని కలిస్తే వాళ్లు కౌన్సెలింగ్ చేస్తారు. ఈ రెండు పరీక్షల ఫలితాలు సాధారణంగా వారంలో వచ్చేస్తాయి. ఈ పరీక్షల రిపోర్ట్ని బట్టే తర్వాత స్కాన్ ఉంటుంది. హై రిస్క్ కేసెస్లో నాల్గవ నెలలో ఉమ్మనీరు చెక్ చెస్తారు. దీనిని Amniocentesis అంటారు. ఈ టెస్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఏదైనా మేజర్గా క్రోమోజోమ్ ప్రాబ్లమ్కి సంబంధించి ఉంటుంది. ఈ రిపోర్ట్ రిజల్ట్ని బట్టే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా అనేది నిర్ధారిస్తారు. చాలాసార్లు NT ఒక్కటి 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉన్నా బయాకెమిస్ట్రీ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్ని కూడా కలిపి రిస్క్ అసెస్మెంట్ చేస్తారు. లో రిస్క్ వస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవచ్చు.. ఏ ప్రాబ్లం లేదని అర్థం. అప్పుడు 5, 7, 9వ నెలల్లో స్కాన్స్ ఉంటాయి. కానీ కొంతమంది గర్భిణీల్లో అంటే మేనరికం పెళ్లిళ్లు అయిన కుటుంబంలో జెనెటిక్ లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా.. డయాబెటిస్.. ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నా.. ఫీటస్ మెడిసిన్ కౌన్సెలర్ని కలిస్తే ఈ పరీక్షలన్నీ ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెల మొదట్లోనే చేసి కౌన్సెలింగ్ ఇస్తారు. (చదవండి: ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?) -
జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. మూలుగుతున్న అప్లికేషన్లు..
వరంగల్: వరంగల్ సన్షైన్ ఆస్పత్రిలోని లింగ నిర్ధారణ పరీక్షల మిషన్ పనిచేయక రెన్యూవల్కు దరఖాస్తు ఇచ్చారు. అలాగే, ఆ మిషన్ను క్రాష్ (పగులగొట్టడానికి) చేయడానికి అనుమతివ్వాలని వైద్యారోగ్యశాఖకు అర్జీపెట్టుకున్నారు. ► వరంగల్ బాలాజీ ఆస్పత్రిలో 2001 నుంచి స్కానింగ్ ఉంది. ప్రస్తుతం వారు వాడుతున్నది మూడో మిషన్. రన్నింగ్లో లేని రెండు మిషన్లను ధ్వంసం చేస్తామని దరఖాస్తు పెట్టుకోగా.. పెండింగ్లోనే ఉంది. ► వరంగల్లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి లింగ నిర్ధారణ చేసే మిషన్ ఉంది. ఆస్పత్రిని హనుమకొండకు మార్చిన సమయంలో పాత ఆస్పత్రిని మూసివేశామని, మిషన్ వాడలేము.. క్రాష్ చేయాలని వేడుకున్నారు. ► వరంగల్, హనుమకొండ జిల్లాల విభజనలో భాగంగా వరంగల్ జిల్లాకు రెండు కోర్టు కేసులతో ఉన్న ఆస్పత్రులు వచ్చాయి. వీటిలోని స్కానింగ్ మిషన్లు ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉన్నాయి. ఇలా వివిధ కారణాలతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే మిషన్లను పగులగొట్టేందుకు అనుమతివ్వాలని కొందరు దరఖాస్తు చేసుకుంటే.. ఇంకొందరు తమ వద్దకు ఏ కేసులు వస్తలేవని ప్రతి నెలా జిల్లా వైద్యారోగ్యశాఖకు పంపే ఎఫ్ ఆడిట్ ఫాంలో విన్నవిస్తున్నారు. అయితే ఏడాదిన్నర నుంచి వినతులు ఇస్తున్నా చర్యలు తీసుకోవడంలో అడుగు ముందుకు వేయడంలేదు. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద రన్నింగ్లో లేని మిషన్లపై చర్య తీసుకునే విషయమై ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్టేట్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఆ మిషన్ల ఫంక్షనింగ్ ఉండడంతో జిల్లాస్థాయిలో అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులకు విన్నవించినా చట్టంలో స్పష్టత లేక ఈ మిషన్లను ఏం చేయాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి. జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద 2001 నుంచి అల్ట్రా సౌండ్ స్కానింగ్ క్లినిక్లు, ఇమేజింగ్ సెంటర్లు ఇప్పటివరకు 102 రిజిస్టర్ అయి ఉండగా.. 68 మాత్రమే నడుస్తున్నాయి. మిగిలినవి 34 రన్నింగ్లో లేవు. అయితే వీటిలో జిల్లా విభజనలో వరంగల్ అర్బన్ నుంచి కొత్త వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్ మండలాలకు చెందినవే 22 ఉన్నాయి. ప్రతి నెలా ఐదో తేదీన జిల్లా వైద్యారోగ్య విభాగానికి వచ్చే ఎఫ్ ఆడిట్ ఫాంలో పనిచేయని మిషన్ల వివరాలు వస్తున్నాయి. వీటిపై వైద్యవిభాగాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అవి వాస్తవంగా పనిచేయడం లేదా.. ఏమైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే అవకాశం ఉందా అన్న దిశగా దృష్టి సారించాలని ఇటీవల కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ కోసమే అక్కడ మిషన్లు.. ఆప్తమాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ వైద్యం అందించే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించాలంటే పీసీ పీఎన్డీటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో ఆ మిషన్లు తీసుకుంటున్నారు. ఇలా దాదాపు 10లోపు మిషన్లు ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలు అవి రన్నింగ్లో లేవని చెబుతున్నాయి. ఇలాంటివి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో పాలసీ తేవాలి.. నిర్వహణలో లేని స్కానింగ్ మిషన్ల సెంటర్ల లైసెన్స్ రద్దు చేయాలి. ఆ మిషన్ను సీజ్ చేసి పరిశ్రమకు లేదా.. ఇతరులు ఎవరైనా కొనుగోలు చేసుకుంటే ఇచ్చేలా డీఎంహెచ్ఓ ద్వారా జరిగేలా చూడాలి. దీనిపై రాష్ట్రస్థాయిలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ పాలసీ తీసుకురావాలి. తిరిగి లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. స్కానింగ్ మిషన్లు తయారు చేసే పరిశ్రమలను కూడా పీసీ పీఎన్డీటీ చట్టంలోకి తేవాలి. – మండల పరశురాములు, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు -
AP: ఉచితంగా అల్ట్రా, టిఫా స్కానింగ్
గుంటూరుమెడికల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో గర్భిణులకు అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను మంత్రి రజిని శుక్రవారం గుంటూరులోని వేదాంతం హాస్పిటల్లో లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణులకు సీమంతం చేసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏటా 64వేల మందికిపైగా టిఫా స్కానింగ్ అవసరం ఉంటుందని, అందుకు దాదాపు రూ.7 కోట్ల ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రతి గర్భిణికి రెండుసార్లు చేయాల్సి ఉంటుందని, వీటిని కూడా పూర్తి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చేసేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2022–23లో రూ.3,400 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. 2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.32 లక్షల కాన్పులు ఉచితంగా చేశామని, కేవలం గర్భిణుల చికిత్సకు రూ.247 కోట్లు వెచ్చించామని వివరించారు. ఆరోగ్య ఆసరా పథకం కింద రోగి కోలుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 17,54,000 మందికి పైగా ఆర్థిక ఆసరా అమలు చేశామని, అందుకోసం రూ.1,075 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధిరప్రసాద్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, వేదాంత హాస్పిటల్ ఎండీ డాక్టర్ చింతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్లో లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్లు చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ముఠాకు చెందిన 18 మంది అరెస్టు చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి లింగనిర్ధారణకు వినియోగించే మూడు స్కానర్లు, రూ. 73 వేల నగదు, 18 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా వరంగల్లో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని రోజులుగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి అబార్షన్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ దీనిపై దృష్టి సారించారు. దీన్ని చేదించేందుకు టాస్క్ఫోర్స్ పోలీసులు, జిల్లా వైద్యారోగ్యశాఖ విభాగాలను రంగంలోకి దించి దర్యాప్తు చేయించారు. ‘ఆపరేషన్ దేశాయ్’ ద్వారా అక్రమంగా లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ‘ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ పాత నేరస్తుడిగా గుర్తించారు. ‘గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియన్ గా పనిచేసి నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్థారణ పరీక్షలు చేసి అరెస్టయ్యాడు.గత అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్ఎంపీలు, పీఆర్ఓలు, హాస్పిటల్ మెనెజ్మెంట్, డాక్టర్లతో కలిసి అక్రమ దందా పాల్పడుతున్నాడు. ప్రవీణ్ భార్య సంధ్యారాణితో కలిసిగోపాల్ పూర్ వెంకటేశ్వర కాలనీలో పోర్టబుల్ స్కానర్ల సహయంతో స్కానింగ్ ఏర్పాటు. ఇప్పటి వరకు వందకు పైగా అబార్షన్లు చేసిన ముఠా. స్కానింగ్ అయితే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారని చెప్పారు. మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: నిజామాబాద్: సినిమా రేంజ్లో పోలీసుల ఛేజింగ్.. దొంగలపై కాల్పులు -
గర్భిణులకు అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్
సాక్షి, అమరావతి: గర్భిణులు, తల్లీ బిడ్డల సంరక్షణకు ఇప్పటికే పలు రకాల కార్యక్రమాలను చేపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు గర్భిణులకు అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఈ పరీక్ష దోహద పడుతుంది. ఖరీదైన ఈ స్కాన్ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా నిర్వహించనుంది. ఒక్కో టిఫా స్కాన్కు రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ లోపాలున్న వారికి టిఫా స్కాన్ మేనరికం వివాహాలు చేసుకున్న వారికి, బ్యాడ్ అబ్స్ట్రెటిక్ హిస్టరీ (గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలుండటం), క్రోమోజోమ్స్, మానసిక లోపాలు (మెంటల్ డిజెబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వంటి సమస్యలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి లోపాలన్నింటినీ టిఫా స్కాన్తో గుర్తించే అవకాశం ఉంది. శిశువు గర్భంలో ఏ పొజిషన్లో ఉంది? జరాయువు/మావి (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉంది? ఉమ్మ నీరు స్థితి, శిశువులో ఇతరత్రా లోపాలను దీని ద్వారా గుర్తించి, వెంటనే సరిదిద్దడానికి వీలుంటుంది. జరాయువు, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ/సిజేరియన్ ప్రసవం అవసరం అవుతుందా అన్నది కూడా అంచనా వేయవచ్చు. 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో ఈ స్కానింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణులకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలేమీ లేని వారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్లు చేస్తారు. ఇప్పటికే పలు రకాలుగా అండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తల్లీ బిడ్డల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేంత వరకు అండగా ఉంటోంది. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా గ్రామాల్లోనే గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య సేవలు చేయిస్తోంది. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను 108 అంబులెన్స్ల ద్వారా నిమిషాల్లో ఆస్పత్రులకు చేరుస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డెలివరీ సేవలు పొందిన మహిళలకు ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న వారిలో గర్భిణులు రెండో స్థానంలో ఉన్నారు. 2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.31 లక్షల మంది గర్భిణులు ప్రసవం సేవలు పొందారు. మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవానంతరం గర్భిణులను వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ద్వారా క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తూ టిఫా స్కాన్ను ఉచితంగా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్ను సైతం ఏర్పాటు చేశాం. హై రిస్క్ గర్భిణులను డెలివరీ డేట్కు ముందే ఆస్పత్రికి తరలిస్తున్నాం. తద్వారా వారికి మెరుగైన వైద్య సంరక్షణ అందించి తల్లి, బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రసవానికి అవకాశం ఉంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శిక్షణ పూర్తయింది గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్ చేయడానికి వీలుగా ప్రొసీజర్లను ఆన్లైన్లో పొందుపరిచాం. ఏ విధంగా ఆన్లైన్లో నమోదు చేయాలనే విషయంపై నెట్వర్క్ ఆస్పత్రుల మెడికోలు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులైన మహిళలు అందరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. – ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
మరణించిన శిశువు బతికుందని..
సూర్యాపేట క్రైం: శిశువుకు హార్ట్ బీట్ లేకున్నా బతికుందని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు రిపోర్టు ఇచ్చారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి ప్రాణం లేని శిశువును బయటకు తీశారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని హాస్పిటల్పై బంధువులు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన మరిపెద్ది లావణ్యకు పురిటినొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని మాధవి ఆస్పత్రికి ఆదివారం ఉదయం తీసుకొచ్చారు. డాక్టర్ సలహా మేరకు లావణ్యకు దగ్గర్లోని స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. భర్త శ్రీకాంత్గౌడ్ మరోసారి ఆపిల్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్లు మృత శిశువును బయటికి తీశారు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్పై దాడి చేశారు. జన్యు సంబంధిత వ్యాధితో శిశువు మృతి చెందినట్లు డాక్టర్ మాధవి వివరణ ఇచ్చారు. -
15 నిమిషాల్లోనే స్కానింగ్ రిపోర్ట్
తిరుపతి (తుడా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన గుండె చికిత్సాలయం ఆదరణ పొందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బర్డ్ పాత భవనంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 11న ప్రారంభించిన ఈ సెంటర్ రుయాకు వరంగా మారింది. ఇందులోని చిన్నపిల్లల ఆస్పత్రికి రోజుకు 200కు పైగా ఓపీలు నమోదవుతున్నాయి. వీరిలో రోజుకు 15 మంది చిన్నపిల్లలకు ఎకో కార్డియోగ్రామ్ (గుండె స్కానింగ్) అవసరమవుతోంది. కార్డియాక్ సెంటర్లో ఐసీయూ వార్డు మూడు నెలల క్రితం వరకు గుండె స్కానింగ్ కోసం స్విమ్స్, ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం కొత్తగా కార్డియాలజిస్టును నియమించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. కేవలం 15 నిమిషాల్లోనే ఎకో కార్డియోగ్రామ్ (గుండె స్కానింగ్) రిపోర్టును అందజేస్తున్నారు. ఓపీ సేవలు ముగిసేలోపే రిపోర్టు వస్తుండటంతో వైద్యులు పరిశీలించి వెంటనే సూచనలు చేస్తున్నారు. గతంలో ఈ పరీక్ష చేయించుకుని నివేదిక తీసుకోవాలంటే రోజంతా నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. గుండె సంబంధిత సమస్యలున్న పిల్లలను బయటి ప్రాంతాలకు తీసుకెళ్లే పనిలేకుండా స్థానికంగానే అత్యున్నత వైద్యం అందుతుండటంపై బాధితుల కుటుంబీకులతోపాటు వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గర్భధారణ సమయంలో టిఫా స్కానింగ్ ఎందుకు చేస్తారు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా వేలాది మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో పుడుతున్నారు. ఈ సమస్యను అధిగమించి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అవసరమైన వారికి ‘టిఫా’ స్కానింగ్ చేయించాలని నిర్ణయించింది. ఈ టెస్ట్ ద్వారా బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించేందుకు, తద్వారా తగు వైద్యం అందించేందుకు వీలుంటుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇక టిఫా స్కానింగ్లు చేయనున్నారు. టిఫా అంటే.. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్. టిఫా’ స్కానింగ్ దీని ద్వారా 18 నుంచి 22 వారాల మధ్య పిండాన్ని స్కాన్ చేస్తారు. శిశువు అవయవ క్రమం ఏర్పడే దశలోనే లోపాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గుర్తించిన సమస్యలకు మందులు వాడొచ్చు. లేదా అవకాశముంటే అబార్షన్ చేయించుకునేందుకు వీలుంటుంది. ఒక్కో స్కానింగ్కు రూ.వెయ్యి ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా లేకుంటే.. ప్రైవేట్ డయాగ్నిస్టిక్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వమే ఉచితంగా చేయిస్తుంది. 7 శాతం మందిలో లోపాలు.. ప్రతి వంద మంది గర్భిణుల్లో 7 శాతం మందిలో లోపాలుండే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లందరికీ టిఫా స్కానింగ్ చేసి ఆ లోపాలను సరిదిద్దుతారు. ఎక్కువగా మేనరికం వివాహాల వల్ల, క్రోమోజోమ్స్ లోపం వల్ల, మానసిక లోపాలు(మెంటల్ డిజబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భిణి అవడం వల్ల, బ్యాడ్ అబ్స్ట్రెటిక్ హిస్టరీ(గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలు తలెత్తడం), కన్సాగ్యుయస్ మ్యారేజెస్(రక్త సంబంధీకులను పెళ్లి చేసుకోవడం), సెక్స్ లింక్డ్ డిజార్డర్స్(శృంగార సంబంధిత వ్యాధులు).. ఇలా రకరకాల కారణాలతో లోపాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే రాష్ట్రంలో ఏటా 8.96 లక్షల ప్రసవాలు జరుగుతాయని కుటుంబ సంక్షేమ శాఖ చెబుతోంది. వీటిలో 7 శాతం మందికి.. అంటే 62 వేల మందికి పైగా గర్భిణులకు టిఫా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. తల్లి ఆరోగ్య పరిస్థితులు, రక్త సంబంధీకులను వివాహం చేసుకున్నారా? గర్భం దాల్చాక పరిస్థితులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాకే వైద్యాధికారి, లేదా గైనకాలజిస్ట్ టిఫా స్కానింగ్కు రిఫర్ చేస్తారు. -
రూ .150 కే స్కానింగ్, రూ. 50 కే ఎంఆర్ఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే అతి చౌక డయాగ్నొస్టిక్ సెంటర్ను అందుబాటులోకి తీసుకురానుంది. తక్కువ ఖర్చుతో స్కానింగ్, ఎంఆర్ఐ లాంటి సదుపాయాలను కల్పించనుంది. అలాగే కిడ్నీ రోగులకోసం త్వరలోనే ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు మాసంనుంచి తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ, స్కానింగ్ లాంటి సదుపాయాలను కల్పించనున్నామని మేదాంతా చైర్మన్, గురుహరికిషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరవిందర్ సింగ్ సోనీ వెల్లడించారు. అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్రే కోసం 150 రూపాయలు, ఎంఆర్ఐ కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. తద్వారా అల్పాదాయ ఆదాయ వర్గాల ప్రజలకు సహాయపడాలని నిర్ణయించామన్నారు. అలాగే గురుద్వార ప్రాంగణంలో మూత్రపిండాల రోగుల కోసం హరికిషన్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నట్లు సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డిఎస్జిఎంసి) మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇది వచ్చే వారంనుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ ప్రక్రియకు 600 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తామన్నారు. అవసరమైన ఇతర రోగులకు ఎంఆర్ఐ స్కాన్కు 800 రూపాయలు (ప్రైవేటు కేంద్రాల్లోఎంఆర్ఐకి ఖరీదు రూ.2,500) ధరకే అందించినున్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ రాయితీ ఎవరికివ్వాలనే విషయాన్ని ఆసుపత్రి కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం 6 కోట్ల విలువైన డయాగ్నొస్టిక్ యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చామన్నారు. వీటిలో నాలుగు డయాలసిస్ మెషీన్స్, ఒక్కో అల్ట్రాసౌండ్, ఎక్స్-రే,ఎంఆర్ఐ యంత్రాలు చొప్పున ఉన్నట్టు ప్రకటించారు. After a low-cost dispensary, Gurudwara Bangla Sahib is now slated to open a cheap diagnostic facility. An ultrasound will cost Rs. 150 & an MRI Scan Rs. 50! 🙏 pic.twitter.com/oZLKQblUTa — Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 5, 2020 -
‘మెడాల్’ మాయ.. టెస్టులు పేరుతో దందా
ఒంగోలు: వైద్యో నారాయణో హరి.. అని ప్రపంచం మొత్తం కొనియాడుతున్న వేళ కొందరు అక్రమార్కుల చేష్టలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని కోవిడ్ వణికిస్తున్న వేళ కనిపించని శత్రువుపై జనం సామూహిక పోరాటం సాగిస్తున్న తరుణంలో కొన్ని ఆస్పత్రులు, ల్యాబ్ల నిర్వాహకులు కాసుల వేట ప్రారంభించారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు రోగి వ్యాధి తీవ్రతను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగాలు సంయుక్తంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని మెడాల్ కేంద్రంపై దాడులు జరిపాయి. కేవలం ఒక్క సిటీ స్కాన్కే రూ.2,000 అదనంగా వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. కోవిడ్ పరీక్షల పేరుతో అటు ఆసుపత్రులు, ఇటు ప్రైవేటు ల్యాబ్లు డబ్బులు దండుకుంటున్నాయన్న విమర్శలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. అయిన దానికి, కాని దానికి సిటీ స్కాన్ పేరుతో అనవసర పరీక్షలు చేయిస్తున్నారు. తద్వారా వ్యాధి నిర్థారణకే ప్రజలు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సిటీ స్కాన్కు ప్రభుత్వం రూ.2500 మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వులు జారీచేయగా కొన్ని ల్యాబ్లు రూ.4వేల నుంచి రూ.4500 వరకు వసూలు చేస్తున్నాయి. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు, ప్రైమరీ లేదా సెకండరీ కాంటాక్టులు ఉన్నవారు ప్రైవేటు ల్యాబ్లు, ఆసుపత్రులను ఆశ్రయిస్తుండటంతో నిర్ధారణ పరీక్షకు 1400లు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా అవసరాన్ని బట్టి అధిక దోపిడీ చేస్తున్నారు. ఇక రూ.800కు గతంలో చేసే రక్త పరీక్షలు ఇప్పుడు రూ.1500కు పెంచేశారు. ఇలా పలు విధాలుగా ప్రజానీకం దోపిడీకి గురవుతున్న వేళ మెడాల్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారింది. తనిఖీ ఇలా.. కోవిడ్తో బాధపడుతున్న ఒక పేషెంటుకు సిటీ స్కానింగ్ చేయించుకోవాల్సి వచ్చింది. అతను ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కన్నా అధిక మొత్తం వసూలు చేస్తున్నారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ కార్యాలయంలో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో విజిలెన్స్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఒక వైద్యుడు సంయుక్తంగా గురువారం మెడాల్ ల్యాబ్కు వెళ్లారు. ఫిర్యాదుదారు నుంచి సిటీ స్కాన్కు రూ.4500 వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా గుర్తించారు. అనంతరం మెడాల్ కేంద్రంలోని పరీక్షల యంత్రాలను పరిశీలించారు. ఇన్స్ట్రుమెంటల్ సర్టిఫికేట్లు కావాలని కోరగా కొన్ని చూపించలేకపోయారు. రిసెప్షన్ కౌంటర్ వద్ద ఏయే పరీక్షకు ఎంతెంత వసూలు చేస్తున్నారో బోర్డు ప్రదర్శించాల్సి ఉన్నా అది కూడా లేనట్లు గుర్తించారు. దీంతో మెడాల్ ఒంగోలు బ్రాంచి మేనేజర్ సాయికిరణ్కు వారంరోజుల్లోగా అన్ని పత్రాలను సమర్పించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. హార్డ్డిస్్కలలో లభించే సమాచారం ఆధారంగా జిలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు విజిలెన్స్ అధికారులు మెడాల్ ఒంగోలు కేంద్రంపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన స్కానింగ్ సెంటర్ సీజ్
పీలేరు (చిత్తూరు): చిత్తూరు జిల్లా పీలేరులో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఆస్పత్రిని పీసీపీఎన్డీటీ (గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం) కమిటీ మంగళవారం సీజ్ చేసింది. కమిటీ సభ్యురాలు డాక్టర్ రమాదేవి మీడియాకు వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన హైరిస్క్ మానిటరింగ్ టీమ్ నుంచి తమకు అందిన సమాచారం మేరకు అగ్రహారానికి చెందిన కవిత (వివాహిత) గర్భస్రావంతో తిరుపతి రుయాలో చేరిందన్నారు. ఈ మహిళ కుటుంబసభ్యులను విచారించగా పీలేరు నోబుల్ నర్సింగ్ హోమ్లో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యామని, అక్కడ డాక్టర్ గాలేటి బాషా తమకు గర్భవిచ్ఛిత్తి నిమిత్తం చేసిన చికిత్స ఫలితంగా ఆరోగ్యం విషమించడంతో ఇక్కడికి పంపారని తెలిపారన్నారు. పీసీపీఎన్డీటీ కమిటీ సభ్యురాలు డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పూజారి లోకవర్ధన్ ఆధ్వర్యంలో సాధారణ విచారణ నిమిత్తం పీలేరులోని నోబుల్ నర్శింగ్ హోమ్కు వచ్చారు. అక్కడ తమ ఎదుటే పీలేరుకు చెందిన మస్తాన్ భార్య సునీర్ (27)అనే మహిళకు స్కానింగ్ చేసి లింగనిర్ధారణ పరీక్షలు పూర్తి చేసుకుందని, గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లు వారికి తెలియజేయడం తమ కళ్లెదుటే జరిగిందన్నారు. దీంతో తాము వచ్చిన విచారణకు తోడు ఇక్కడ ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలపై జిల్లా కలెక్టర్కు నివేదిక మర్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీలేరు తహసీల్దారు నేతృత్వంలో నర్శింగ్ హోమ్లో నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటరును సీజ్ చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం అక్కడి డాక్టర్ గాలేటి బాషాపై చర్యలుంటాయని వివరించారు. నర్శింగ్ హోమ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తేలిందన్నారు. -
జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ
జిల్లాలో భ్రూణహత్యలు కొనసాగుతున్నాయి. 20 వారాలు దాటిన తర్వాత గర్భస్రావం చేయకూడదని నిబంధనలు ఉన్నా పలు ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా పెద్దగా çస్పందించడం లేదు. కర్నూలులోని కొత్త బస్టాండ్, ఎన్ఆర్ పేట, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉండే పలు ఆసుపత్రులలో యథేచ్ఛగా భ్రూణహత్యలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి నెలా 60కి పైగానే చేస్తున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, డోన్, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. కర్నూలు(హాస్పిటల్):జిల్లాలో 260కి పైగా స్కానింగ్ కేంద్రాలకు అనుమతులు ఉన్నాయి. అయితే అనధికారికంగా మరో 400కు పైగానే నిర్వహిస్తున్నారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం లింగనిర్ధారణ నేరం. దీనికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో పలువురు వైద్యులు యథేచ్ఛగా లింగనిర్ధారణ చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే చాలు అధిక శాతం అబార్షన్కు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాల సమ్మతి మేరకు జరుగుతున్న ఈ తంతులో అటు గర్భిణి కుటుంబసభ్యులు, ఇటు వైద్యవర్గాలు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. లింగనిర్ధారణ, భ్రూణహత్యలో ఇద్దరికీ శిక్ష పడుతుందని భావించి గుట్టుగా ఉంచుతున్నారు. 930కి తగ్గిన బాలికల సంఖ్య జిల్లాలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం రోజురోజుకూ పెరుగుతోంది. 2011 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు గాను జిల్లాలో సగటున 930 మందిమాత్రమే మహిళలు ఉన్నారు. డోన్లో 889, ప్యాపిలి 894, గడివేముల 899, శ్రీశైలం 892, ఆదోని డివిజన్లో 900 మాత్రమే స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 920లోపు స్త్రీలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సైతం సీరియస్గా పరిగణించినట్లు సమాచారం. జిల్లాలో బాలికల సంఖ్య ఎందుకు తగ్గుతుందో తెలుసుకునేందుకు త్వరలో ఓ బృందం జిల్లాకు రానున్నట్లు తెలిసింది. అధికారులంటే భయం లేదు లింగనిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ పీఎన్డీటీ చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ఉన్నట్లు ఆయా స్కానింగ్ కేంద్రాల్లో పోస్టర్లు అతికించి, లోపల మాత్రం యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ శిక్షలు అమలు కాలేదు. స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను అధికారులు తరచూ తనిఖీ చేస్తున్నారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారా, లేదా అని పరిశీలిస్తున్నాం. నిబంధనల మేరకు లేని కేంద్రాలకు నోటీసులు ఇస్తున్నాం. –డాక్టర్ కె.వెంకటరమణ, ఇన్చార్జ్ డీఎంహెచ్వో -
టీనేజర్ కడుపులో దెయ్యం పిల్ల!
వర్జీనియా దేశంలోని రిచ్మండ్ నగరానికి చెందిన ఐయన్నా కారింగ్టన్ (17) అనే టీనేజర్ తొలిసారి తల్లి కాబోతోంది. కడుపులో ఉన్న 24 వారాల బేబీ ఎలా ఉందో తెలుసుకునేందుకు సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకుంది. స్కానింగ్లో కనిపించిన తన బేబీ దశ్యాన్ని చూసి ఆమెకు గుండె ఆగిపోయినంత పనయింది. జుట్టంతా విరబూసుకొని గుడ్లు తెరచి చూస్తున్నట్లు ఉన్న బేబీ స్కానింగ్ చిత్రం అచ్చం దెయ్యం పిల్లలా ఉంది. మిడ్ నర్సు నచ్చచెప్పాక తేరుకున్న ఐయన్నా తన బేబీ స్కానింగ్ చిత్రాన్ని సోషల్ మీడియా మిత్రులకు షేర్ చేసింది. కొందరు ఐయన్నా లాగా భయాందోళనలు వ్యక్తం చేయగా, మిగతా వారు మార్ఫింగ్ ఫొటో అంటూ కొట్టివేశారు. తనకు పుట్టబోతున్న బిడ్డ ఆడో, మగో కూడా తెలియదని ఐయన్నా చెప్పారు. అయితే స్కానింగ్ అప్పుడు ఆమె పక్కనే ఉన్న మిడ్ నర్సు మాత్రం ఆడ శిశువే అని తెలిపింది. సాధారణంగా కడుపులోని శిశువులు కళ్లు మూసుకొని ఉంటారని, కళ్లు తెరచి చూడరని, ఐయన్నా బిడ్డను స్కానింగ్ చేసినప్పుడు ఆపాప కళ్లు బాగా తెరచి కెమేరా వైపు చూడడం వల్ల స్కానింగ్లో ఆ పాప దెయ్యంలా కనిపిస్తోందని చెప్పారు. కొందరు గర్భస్త్ర శిశువులు స్కానింగ్ అప్పుడు అలా కనిపిస్తారుగానీ, అందరి పిల్లల్లానే ఉంటారని హెడ్ నర్సు చెప్పడంతో ఐయన్నా స్థిమిత పడింది. అయినా ఏదో కోశాన అనుమానం ఉన్నట్లు ఐయన్నా కాస్త భయపడుతోంది. అయినా మొదటిసారి తల్లి అవుతున్న ఆనందం వేరులే! అంటూ సరదాగానే ఉంటోంది. -
గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొన్ని స్కానింగ్ సెంటర్లు గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. పీసీపీఎన్డీటీ జాతీయ తనిఖీ బృందం గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ విషయం మరోసారి బయటపడింది. మూడు జిల్లాల్లోనూ పది సెంటర్లను తనిఖీ చేయగా వీటిలో ఐదు సెంటర్లు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. ఆయా సెంటర్లకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఒక కార్పొరేట్ ఆస్పత్రి సహా శివారులోని పలు స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 800పైగా స్కానింగ్ సెంటర్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాల్లో 522, మేడ్చల్ జిల్లాలో 600పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే వీటిల్లో తనిఖీలు నిర్వహించి, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్యులతో పాటు రేడియాలజిస్టులు లేని, రికార్డులు సరిగా నిర్వహించని స్కానింగ్ సెంటర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. గతంలో 30పైగా సెంటర్లను సీజ్ చేసిన అధికారులు తాజాగా మరో ఐదు సెంటర్లపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్రవీడక పోవడం వల్లే జాతీయస్థాయి బృందాలు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఈ దాడుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూపలు కేంద్రాలు అడ్డంగా దొరికిపోతున్నాయి. -
లక్ష్మీదేవిని చూపితే ‘పాప’మే
లింగ నిర్ధారణ కొత్త పుంతలు తొక్కుతోంది. గర్భస్థ శిశువు ఆడ లేక మగ అని చెప్పడానికి స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గతంలో రాతలు, మాటల ద్వారా చెప్పేవారు. ఇప్పుడు మొబైల్ఫోన్ రికార్డింగ్స్ నేపథ్యంలో గర్భస్థ శిశువు పాప అయితే లక్ష్మీదేవి ఫొటో చూపిస్తున్నారు. మగ అయితే వెంకటేశ్వరస్వామి ఫొటో చూపిస్తున్నారు. అంతేకానీ లింగ నిర్ధారణ మాత్రం ఆపడం లేదు. ఇంత జరుగుతున్నా స్పందించని జిల్లా అధికారులు భ్రూణ హత్యలు ఎలా నివారిస్తారో వారికే తెలియాలి. సాక్షి, తిరుపతి తుడా: కొత్త చట్టాలు చేసే కొద్దీ స్కానింగ్ సెంటర్లకు వసూళ్లు పెరుగుతున్నాయి కానీ చట్టాలు మాత్రం సక్రమంగా అమలు కావడం లేదు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో నమోదు చేసుకున్న స్కానింగ్ సెంటర్లు దాదాపుగా 186 వరకు ఉన్నాయి. అను మతులు లేనివి, అనుమతులను పునరుద్ధరణ చేసుకోనివి మరో 50 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో తిరుపతి, చిత్తూరు నగరాల్లోని కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ జరుగుతోంది. స్కానింగ్కు వచ్చే వారి స్థాయిని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రూ.20 వేలు నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాపరేట్ అథారిటీలో కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, ఎస్పీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఎన్జీఓ సభ్యుడు మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా అడ్వయిజరీ కమిటీ 15 మంది సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుంది. ఈ రెండు కమిటీలు మూడు నెలలకోసారి సమావేశమై ప్రజల వైద్యారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. అయితే అలాంటి సమావేశాలు సకాలంలో నిర్వహించిన దాఖలాల్లేవు. దీంతో స్కానింగ్ సెంటర్ల ఆగడాలు మితిమీరిపోయాయి. ఇదీ గుర్తు స్కానింగ్ సెంటర్లు ఆడ.. మగ బిడ్డలను సంబంధిత తల్లిదండ్రులకు ఫొటోలతో చెప్పే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నేరుగా కానీ, మరోలా చెప్పేందుకు భయపడుతున్నారు. ఎవరైనా మొబైల్తో రికార్డు చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్కానింగ్ సెంటర్లలో లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏర్పాటు చేసుకుని, ఆడ బిడ్డ అయితే లక్ష్మీదేవి ఫొటో చూపిస్తారు. మగ బిడ్డ అయితే వెంటేశ్వర స్వామి ఫొటోవైపు కళ్లతో సైగ చేస్తారు. ఇలా స్కానింగ్ సెంటర్ల దందా కొనసాగుతోంది. భ్రూణ హత్యలూ జరుగుతు న్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం శోచనీయం. నిబంధనలు ఇవి ►ఈ చట్టం అనుసరించి అన్ని జన్యు సంబంధిత పరీక్షలు నిర్వహించే వ్యక్తులు, సంస్థలు (ప్రభుత్వ, ప్రయివేటు) వైద్యులు సంబంధిత జిల్లా ప్రత్యేక నిర్దేశిత అధికారి వద్ద తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. ►అన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేసేది లేదని సందర్శకులందరికీ కనిపించేలా తప్పకుండా పెద్ద సైజు అక్షరాల్లో బోర్డు ఏర్పాటు చేయాలి. ► ఈ బోర్డులను ఆంగ్లం, తెలుగు తదితర ప్రాంతీయ భాషల్లోబాగా కనిపించేలా ఉంచాలి. ►అన్ని అల్ట్రా స్కానింగ్ యంత్రాలు, పరికరాలు, లింగ నిర్ధారణ చేసేయంత్రాలు, ప్రదేశాలు నమోదు చేయించాలి. ►సుప్రీం కోర్టు ఆదేశానుసారంగా ఉత్పత్తి దారులు, పంపిణీ దారులు, అమ్మకం దారులు ఈ యంత్రాలు, పరికరాలు నమోదు పత్రం (సంస్థ రిజిస్ట్రేషన్ పత్రం) సమర్పించనిదే వీటిని విక్రయించకూడదు, పంపిణీ చేయకూడదు. ►ఈ నమోదు పత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరణ చేసుకోవాలి. ►స్కానింగ్ సెంటర్లలో ఫారం ఎఫ్ను విధిగా వినియోగించి, ఆ వివరాలు జిల్లా వైద్యారోగ్యశాఖకు ప్రతి నెలా ఐదవ తేదీలోగా అందించాలి. ►స్కానింగ్కు సూచించిన వైద్యుల ధ్రువీకరణ పత్రం విధిగా ఉండాలి. ఈ పత్రాన్ని ఫారం– ఎఫ్ తో జతపరచి, భద్రపరచాలి. దాన్ని తనిఖీ సమయంలో అధికారులకు చూపించాలి. అయితే ఈ నిబంధనలు చాలావాటిల్లో అమలు చేయడంలేదు. -
గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు
సాక్షి, నల్లగొండ టౌన్: జిల్లా కేంద్రంలో లింగనిర్ధారణ పరీక్షల దందా మూడు పూలు..ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డులోనే అధికారుల కళ్లు గప్పి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లింగనిర్ధారణ పరీక్షలను కొనసాగిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను పెంచుకుందామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించి ఆడపిల్ల అని తేలితే తల్లికడుపులోనే చిదిమేస్తున్న తీరు బాధాకరం. ఇప్పటికే ప్రతి వెయ్యిమంది బాలురకు కేవలం 922 మంది బాలికలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖగణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొందరు వైద్యులు సిండికేట్గా ఏర్పడి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ స్కానింగ్ సెంటర్ను ప్రోత్సహిస్తూ లింగనిర్ధారణ పరీక్షల కోసం కేసులను రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లో భాగస్వాములుగా ఉన్న వైద్యులతోపాటు మరికొంత మంది వైద్యులు స్కానింగ్ల పేరుతో గర్భిణులను పంపించి గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలను చేయిస్తున్నారన్నది విశ్వసనీయ సమాచారం. గర్భిణి వెంట వచ్చిన వారిని మాటల్లో కలిపి.. ప్రతి గర్భిణి నెలనెలా వైద్య పరీక్షల కోసం వైద్యుల వద్దకు వెళ్తుంటారు. బిడ్డ ఎదుగుదలకు వెళ్లిన సమయంలో డాక్టర్లు వారి అమాయకత్వాన్ని, బిడ్డ ఆడ, మగ తెలుసుకోవాలన్న ఆతృతను గమనిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని టార్గెట్గా చేసుకుని స్కానింగ్ తీయించుకోమని ఉచిత సలహా ఇవ్వడంతోపాటు నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రం నడిబొడ్డులో గల స్కానింగ్ సెంటర్కు రెఫర్ చేస్తున్నారు. చెకప్కు వచ్చే వారి తల్లినో, అత్తనో మాటలలో కలిపి ఆడపిల్ల, మగబిడ్డ అని తెలుసుకోవాలని ఉందా అని అడిగి..వారు ఒకే అన్న వెంటనే సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫోన్ద్వారా సమాచారం ఇచ్చి స్కానింగ్లో లింగనిర్ధారణ చేసి తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు గర్భిణులకు విషయం తెలియజేయకుండా కేవలం రెఫర్ చేసిన వైద్యులకే లింగనిర్ధారణ రిజల్ట్ను వెల్లడిస్తారు. దీంతో అడపిల్ల అని తేలిందని, ఆడపిల్లకావాలా వద్దా అని వారిని అడిగి వద్దు అని సమాధానం వచ్చిన వెంటనే అబార్షన్ చేయించుకోవాలని, దానికి రూ.10 నుంచి రూ15 వేల వరకు, లింగనిర్ధారణలో ఆడ, మగ అని చెప్పినందుకు రూ. 6 నుంచి రూ.10 వేల వరకు వారి వారి స్థాయిని బట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారిపై ఉన్న పట్టణాలలో మొబైల్ స్కానింగ్ వాహనాలను తీసుకువచ్చి లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించడం విశేషం. ప్రతి నిత్యం పదుల సంఖ్యలో లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నప్పటికి సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అంతరించి పోతున్న ఆడపిల్లలను రక్షించుకోవాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు , లింగనిర్ధారణ పరీక్షలను నివారించకపోతే ఆడపిల్లలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. ఆర్ఎంపీలు కూడా అక్కడికే.. ఇప్పటికే ఒక ఆడపిల్ల ఉండి మరోమారు గర్భం దాల్చిన మహిళలు మగపిల్లాడు కావాలని కోరుకుంటారు. అలాంటి వారిని గ్రామాల్లోని ఆర్ఎంపీలు గుర్తించి వారికున్న పరిచయంతో ఆ స్కానింగ్ సెంటర్కే రెఫర్ చేస్తుండడం గమనార్హం. ఇలా ప్రతి కేసుకు సదరు ఆర్ఎంపీలకు కమీషన్ వెళ్తుంది. -
ఆడపిల్ల అని తేలితే అబార్షనే
సాక్షి, మహబూబాబాద్: వైద్యసేవల నిమిత్తం కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అవసరం లేకున్నా అబార్షన్ చేయటం చట్టరీత్యానేరం. ఈ విషయం సామాన్యులకు తెలుసో, తెలియదో కానీ ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వైద్యులకు తెలియదని అనుకోవటం పొరపాటే. కానీ నిబంధనలు, చట్టాలు ఇవేమీ తమకు పట్టవంటూ కొందరు వైద్యులు అబార్షన్లు చేస్తూ నిబంధనలను కాలరాస్తున్నారు. వీరికి తోడుగా గ్రామాల్లో ప్రాథమిక చికిత్స అందించే ఆర్ఎంపీలు సైతం ఇటువంటి ఆబార్షన్లనే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఖమ్మంలో ఈ తరహా దందా రహస్యంగా సాగుతోంది. ఈ దందాలో గ్రామీణ ప్రాంతాలలోని ఆర్ఎంపీ, పీఎంపీలే కీలకంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సామాజిక చైతన్యం లేకపోవటమే నిరక్షరాస్యత, సామాజిక చైతన్యం లేని వాళ్లల్లో చాలా మంది ఆడ పిల్లలు వద్దనుకుంటున్నారు. పేదరికం తదితర కారణాలతో ఇక్కడి తల్లిదండ్రులు తమకు మగపిల్లాడు కావాలని కోరుకుంటున్నారు. దీని కోసం తమకు పుట్టబోయే సంతానం ఆడ, మగ తెలుసుకోవాలని ఆర్ఎంపీ డాక్డర్లను సంప్రదిస్తున్నారు. తమ దగ్గరికి వచ్చిన వారికి అవగహన కల్పించాల్సిన ఆర్ఎంపీలు డబ్బే ధ్యేయంగా, తమకు తెలిసిన స్కానింగ్ కేంద్రాల్లో రహస్యంగా పరీక్షలు చేయిస్తూ, ఆడపిల్ల అని తేలితే సొంతగా వారే ఆబార్షన్లు చేస్తున్నారు. అలాగే జిల్లాలో కొంతమంది అవాహితలు గర్భందాల్చిన సందర్భాల్లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవడానికి వీరిని సంప్రదిస్తున్నారు. ఇదే ఆసరాగా వారి దగ్గర నుంచి డబ్బు దండుకోవటంతో పాటు, వారిని బెదిరించి అన్ని రకాలుగా వాడుకుంటున్నా సంఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా వైద్యధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గ్రామాల్లో అనాధికారికంగా కొనసాగుతున్నా పాలీ క్లీనిక్లను తరుచూ తనిఖీలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. భవిష్యత్... భయానకం జిల్లాలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు 996 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు. సకుటుం బ సమగ్ర సర్వే ప్రకారం 986 మంది మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్లో ఎదుర య్యే ప్రమాద ఘంటికల్ని తెలియజేస్తున్నాయి. చట్టరీత్యా చర్యలు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పై ప్రజలకు విస్తృతంగా అవగహన కల్పిస్తున్నాం. ముందుగా ప్రజల ఆలోచనలో మార్పు రావాలి. ఆడపిల్ల మనజాతికి పునాది అని గ్రహించాలి. అలాగే ఎవరైన లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం గాని, అబార్షన్లు చేస్తున్నట్లు తేలితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నాం. చట్టవ్యతిరేఖ పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ధనసరి శ్రీరాం, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
అడ్డగోలు దోపిడీ
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలోని సీటీ స్కాన్ నిర్వాహకులు అడ్డగో లు దోపిడీకి తెరలేపారు. 2017లో స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యుత్ వినియోగాన్ని తెలిపే మీ టర్ను ఏర్పాటు చేయించుకోలేదు. ఇ ప్పటి వరకు ఆస్పత్రి యాజమాన్యంపై రూ 25 లక్షల నుంచి రూ 30 లక్షల భారం పడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రూ లక్షల్లో సీటీ స్కాన్ నిర్వాహకులు లబ్ధిపొం దారని చెప్పాలి. అయినా ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంఓయూ బుట్టదాఖలు ఎస్ఎల్ డయాగ్నస్టిక్ సెంటర్ ఒప్పంద నియమాలను (ఎంఓయూ) బుట్ట దా ఖలు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఎంఓయూలో సీటీ స్కాన్ నిర్వాహకులు ప్రత్యేకంగా కరెంటు మీటర్ వేసుకోవాలి. దీని ద్వారా ప్రతి నెలా కరెంటు బిల్లు వారే చెల్లిం చాలి. కానీ ఇంతవరకు మీటర్ బిగించలేదు. సర్వజనాస్పత్రిలో రోగులకు సంబంధించి రోజూ 25 నుంచి 30 సీటీ స్కాన్లు చేస్తారు. ప్రభుత్వం ఒక్కో స్కాన్కి రూ 899 చెల్లిస్తుంది. ఇలా ప్రతి నెలా సీటీ స్కాన్ నిర్వాహకులు 900 నుంచి వెయ్యి స్కానింగ్ తీస్తారు. ఇలా స్కాన్ నిర్వాహకులకు ప్రతి నెలా రూ 8 లక్షల నుంచి రూ 9 లక్షల వరకు బిజినెస్ జరుగుతుంది. రూ 30 లక్షల భారం సాధారణంగా ఏదేనీ సీటీ స్కాన్ నిర్వహణలో ప్రతి నెలా రూ లక్షకుపైగానే కరెం టు బిల్లు వస్తుంది. ఆస్పత్రిలో వినియోగించే స్కాన్కు రూ లక్షల్లోనే కరెంటు బిల్లు వస్తుందని పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా రూ లక్షల్లో లబ్ధిపొందుతున్నా..ఎందుకు కరెంటు మీటర్ వేయించుకోలేదో అర్థం కావడం లేదు. ఆస్పత్రిలోని ఓ కీలక అధికారి అండదండలతోనే ఈ అడ్డగోలు వ్యవహారం సాగుతోందని సమాచారం. ప్రతి పైసా చెల్లించాల్సిందే విద్యుత్ వినియోగానికి సంబంధించి సీటీ స్కాన్ నిర్వాహకులు ప్రతిపైసా చెల్లించాల్సి ందే. స్కానింగ్ యూనిట్లో ప్రత్యేకంగా మీటర్ బిగించుకోని విషయం నిజమే. అందుకు సంబంధించి మీటర్ బిగించుకోవాలని చెప్పాం. త్వరలో వేయిస్తామన్నారు. మీటర్ అమర్చాక వచ్చే మొదటి మూడు నెలల సగటు తీసుకొని బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
స్కానింగ్ కేంద్రాల ‘కనికట్టు’!
సాక్షి,మహబూబ్నగర్: ‘ప్రతి గర్భిణికి ఐదోనెలలో చేసే స్కానింగ్ అతి ముఖ్యమైంది.అయితే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు దీనిని విస్మరిస్తున్నారు..శిశువు ఆరోగ్య పరిస్థితిపై విభిన్న నివేదికలు(రిపోర్టులు) ఇస్తూ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేస్తున్నారు.’ తప్పుడు నివేదికలపై అధికారుల దృష్టి తప్పుడు నివేదికలు ఇవ్వడంతో పాటు లింగ నిర్దారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. గత 15రోజుల నుంచి జిల్లాలో ఉన్న పీహెచ్సీల వారీగా, జిల్లా కేంద్రంలో పలు స్కానింగ్ సెంటర్లలో పరీక్షలు చేసుకున్న పలువురు మహిళలను ఎంపిక చేసుకొని వారితో మాట్లాడానికి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. బాధితులు ఏం స్కానింగ్ చేయాలని అడిగితే నిర్వాహకులు ఏం చేశారు?, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చారు, ప్రస్తుతం గర్భిణులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశాలపై ప్రత్యేక టీం అధికారులు క్షేత్రస్థాయి పర్యటణ చేసి గర్భిణులు, వారి కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. గత 15రోజుల నుంచి జిల్లా కేంద్రంలో 15మంది గర్భిణుల నుంచి వివరాలు సేకరించారు. డీఎంహెచ్వో అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆర్ఎంలు అబార్షన్ చేసినట్లు, లింగ నిర్ధారణ పరీక్షలు, లీగల్ అబార్షన్లు చేసినట్లు, జన్యుపరమైన లోపాలు ఉన్న స్కానింగ్ నిర్వాహకులు బాధితులకు చెప్పకుండా దాచడం వంటి ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. స్కానింగ్ కేంద్రం నిర్వహణకు అవసరమైన కీలక డాక్యుమెంట్ ఫాం–ఎఫ్లో సరైన వివరాలు నమోదు చేయకపోవడం, రికార్డులలో ఎవరికి ఎలాంటి స్కానింగ్ చేశారు అనే వివరాలను పూర్తిగా తప్పుగా రాయడం బయటపడింది. మొక్కుబడిగా పరీక్షలు.. జిల్లాలో చాలా స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గర్భిణులకు మొక్కుబడిగా పరీక్షలు చేస్తున్నారు. నివేదికలో స్పష్టత లేకపోవడం వల్ల తల్లీ బిడ్డ ప్రాణాలకు ఆపద కల్గుతుంది. జిల్లాలో గర్భిణులకు స్కానింగ్ చేసే కేంద్రాలు 67(రేడియాలజిస్టుతో కూడినవి) వరకు ఉన్నాయి. ప్రతి గర్భిణికి సంబంధించి ఐదో నెలలో రేడియాలజిస్టు క్షుణంగా స్కానింగ్ చేయాలి. శిశువు ఎదుగుదల, అవయవాల తీరు ఇలా ప్రతీది పరిశీలించాలి. వారిచ్చే నివేదికను గైనకాలజిస్టులు చూసి వైద్యం అందించాలి. శిశువు ఎదుగుదలలో ఉన్న లోపం చికిత్స పరంగా మెరుగుకాదనుకొంటే అబార్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో బాలికల నిష్పత్తి రోజు రోజుకు తీవ్రంగా తగ్గిపోతున్న క్రమంలో రాష్ట్ర ప్రజా ఆరోగ్య– కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖలోని మాస్ మీడియా విభాగం అధికారులు జిల్లాలో ప్రత్యేకంగా క్షేత్రస్థాయి పర్యటనను చేస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో ఉన్న స్కానింగ్ కేంద్రాల ద్వారా అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వాటిపై విచారణ జరుగుతుంది. దీనికితోడు పట్టణంలో కొందరు దళారి వ్యవస్థ ద్వారా పక్క రాష్ట్రాల్లో జోరుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేపిస్తున్నారు.లింగ నిర్ధారణను ప్రభుత్వం నిషేధించింది. ఒక వేళ అలా చేస్తే వారిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా పరీక్షల పేరిట పుట్టబోయేది ఆడ, మగ అని తెలుపుతూ అందినంత దోచుకునే తంతు జిల్లాలో కొనసాగుతుంది. చట్టాలు, నిబంధనలను కాలరాస్తూ గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడే కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కలిసి ఆడ శిశువులకు మరణ శాసనం రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత పదేళ్ల కిందట 40మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 178కి చేరింది. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. దీంట్లో మహబూబ్నగర్లో 67, వనపర్తిలో 38, నాగర్కర్నూల్లో 40, గద్వాలలో 25స్కానింగ్ కేంద్రాలు పని చేస్తున్నాయి. బాలికల సంఖ్య తగ్గుముఖం ఓ వైపు భ్రూణహత్యలు.. మరోవైపు శిశు విక్రయాలు ఇంకో వైపు మూఢనమ్మకాలు వెరసి ఆడపిల్ల బతుకు దిక్కుతోచని పరిస్థితి అవుతుంది. తాజా జనాభా లెక్కలను పరిశీలిస్తే జిల్లాలోని గ్రామీణా ప్రాంతాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పరిణామంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉంది. 2001లో వెయ్యి మందికి 952మంది ఆడపిల్లలున్నారు. 2011లో ఆ సంఖ్య 900కి తగ్గింది. ప్రస్తుతం ప్రతి వెయ్యి మందికి 850మంది ఆడపిల్లలు ఉన్నారు. జిల్లాలోని పది మండలాల్లో మహిళల జనాభా గణనీయంగా పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పది మండలాల్లో ఆడపిల్లల నిష్పత్తి 800లోపు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి జిల్లాలోని తలకొండపల్లి, తిమ్మాజిపేట, ఆమనగల్లు, ఖిల్లఘనపురం, దేవరకద్ర, బాలానగర్, కొత్తూర్, దామరగిద్ద, వెల్దండ, అలంపూర్ మండలాల్లో మరింత ప్రమాదరకంగా స్త్రీ పురుష నిష్ఫతి 1000:800లోపు ఉంది. గత పదేళ్లలో జిల్లాలో గ్రామాల్లో ఆడపిల్లల సంఖ్య38శాతం తగ్గింది. జిల్లాలో 800వరకు ఆడపిల్లలు ఉన్న మండలాలు 10ఉన్నాయి. నిబంధనలకు నీళ్లు లింగ నిర్ధారణను ప్రభుత్వం నిషేధించింది. ఒక వేళ అలా చేస్తే వారిపై నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా పరీక్షల పేరిట పుట్టబోయేది ఆడ, మగ అని తెలుపుతూ అందినంత దోచుకునే తంతు జిల్లాలో కొనసాగుతుంది. చట్టాలు, నిబంధనలను కాలరాస్తూ గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడే కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కలిసి ఆడ శిశువులకు మరణ శాసనం రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత పదేళ్ల కిందట 40మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 178కి చేరింది. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. దీంట్లో మహబూబ్నగర్లో 67, వనపర్తిలో 38, నాగర్కర్నూల్లో 40, గద్వాలలో 25స్కానింగ్ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఫాం ఎఫ్లో అన్ని వివరాలు నమోదు చేయాలి జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలు ఫాం–ఎఫ్లో స్కానింగ్ చేసిన వివరాలు అన్నింటిని నమోదు చేయాలి. ఫాం–ఎఫ్ అనేది కీలక డాక్యుమెంట్గా భావించాలి. దాంట్లో అన్ని రకాల వివరాలు ఉండాలి. కొన్ని రకాల వివరాలు దాచిపెట్టడం మానుకోవాలి. లేకపోతే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. పీసీపీఎన్డీటీ యాక్టులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన జరుగుతుంది. ఇప్పటి వరకు 15మంది గర్భిణుల ద్వారా వివరాలు సేకరించి వాటిని ఇటీవలే హైదరాబాద్లో ఉన్నత అధికారులకు ఇవ్వడం జరిగింది. వేణుగోపాల్రెడ్డి, మాస్ మీడియా అధికారి -
గుట్టుగా లింగ నిర్ధారణ!
సాక్షి, అచ్చంపేట రూరల్: మహిళలు పురుషులతో సమానంగా అన్నింటా ముందుంటున్న రోజులివి.. చదువు, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనూ వారిదే అగ్రస్థానం.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు గుట్టుగా సాగిపోతున్నాయి. ఆడ శిశువు భూమి మీద పడగానే కొందరు మొగ్గ దశలోనే తుంచేస్తుండగా.. మరికొందరు కడుపులోనే చిదిమేస్తున్నారు.. ఇలాంటివే అచ్చంపేటలోనూ చోటుచేసుకుంటున్నాయి.. కానీ ఈ విషయం గురించి పట్టించుకొనే నాథుడే కరువయ్యారు.. ఈ క్రమంలో ఆడపిల్లల కోసం ఎన్ని చట్టాలు వస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నీరుగారిపోతున్నాయి.. అనుమతి ఒకరిది.. నిర్వహణ? అచ్చంపేట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. గతంలో కొన్నింటికి అనుమతి ఇవ్వగా రెన్యువల్ చేసుకోకుండా అవే పాత మిషన్లతో స్కానింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టుగా లింగ నిర్ధారణ చేస్తూ డబ్బులను దండుకుంటున్నారు. అనర్హులు సైతం స్కానింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఒకరి పేరు మీద అనుమతి తీసుకుని మరొకరు నిర్వహిస్తున్నారు. ఇదంతా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే స్కానింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహిస్తే ఇలా జరగడానికి వీలుండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తనిఖీల జాడేదీ? జిల్లాస్థాయి అధికారులు మొదట్లో అక్కడక్కడ తనిఖీలు చేసి హల్చల్ చేసి పోతారు. పెద్దగా పేరులేని స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసి తమ పని అయిపోయిందన్నట్లు ఊరుకుంటున్నారు. అసలు దొంగలను మాత్రం విడిచి పెడుతున్నారు. వారు అప్పుడప్పుడు అమ్యామ్యాలు పంపిస్తారని బహిరంగంగానే చర్చ జరుగుతుంది. ఫిర్యాదులు అందితే తప్ప తనిఖీ చేయరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులపై రాత పూర్వకంగా ఫిర్యాదు అందించినా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. చట్టాలు ఏం చెబుతున్నాయి.. సుప్రీంకోర్టు 2001లో పీసీ, పీఎన్డీటీ యాక్టు కింద లింగ నిర్ధారణ నేరమని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. పీసీపీఅండ్డీటీ యాక్టు 1994, రూల్స్ 1996 ప్రకారం ఆస్పత్రుల్లో జిల్లా వైద్యాధికారి అనుమతితో ఆల్ట్రాస్కానింగ్ యంత్రాలను ఉపయోగించాలి. అయినప్పటికీ ప్రైవేటు క్లీనిక్లు నిబంధనలు పాటించడం లేదు. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహిస్తూ ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అచ్చంపేటలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆస్పత్రులు ఇదే తీరును కనబరుస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. స్కానింగ్ సెంటర్ సీజ్ అచ్చంపేటలోని లింగాల రోడ్డుకు సమీపంలో ఉన్న శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలో గత కొన్నేళ్లుగా స్కానింగ్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. 2012లో స్కానింగ్ సెంటర్ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకోగా 2017 వరకు అనుమతి ఇచ్చారు. 2017లో మళ్లీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటి అధికారులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఈ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని అధికారుల దృష్టిలో ఉండటంతో తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని గతంలో 2014 అక్టోబర్ 4న శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్ను సీజ్ చేశారు. అయినప్పటికీ అప్పటి నుంచి మళ్లీ యథేచ్ఛగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. స్కానింగ్ను సోనాలజిస్టు, రేడియాలజిస్టు, గైనిక్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. కాగా ఈ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ వైద్యురాలు బుచ్చమ్మ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం జిల్లా వైద్యాధికారులు ఆకస్మికంగా దాడి చేసి స్కానింగ్ సెంటర్ను సీజ్ చేశారు. స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి అచ్చంపేట రూరల్: నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి దశరథ్ అన్నారు. మంగళవారం అచ్చంపేట సివిల్ కోర్టులో జడ్జి ముందు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అచ్చంపేటలోని శ్రీరాం (సర్రాం) ఆస్పత్రి గురించి లాయర్ ద్వారా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. సెక్షన్–18 ఆర్/23 ఆఫ్ పీసీ అండ్ పీఎన్డీటీ కేసు నమోదు చేశామన్నారు. నల్లమల ప్రాంతంలో అనుమతి లేని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, లింగ నిర్ధారణ చేస్తే కఠినంగా శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. చర్యలు తీసుకుంటాం జిల్లాలో అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. అచ్చంపేటలోని శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్ను అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని తెలుసుకుని కలెక్టర్ అనుమతితో సీజ్ చేశాం. అలాగే జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటాం. - దశరథ్, జిల్లా వైద్యాధికారి, నాగర్కర్నూల్ -
మొగ్గలోనే.. తుంచేస్తున్నారు
నర్సంపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన 5 నెలల గర్భిణినిఈనెల 12వ తేదీ రాత్రి చెకింగ్ కోసం నెక్కొండకు వెళ్లింది. కాసులకు కక్కు ర్తిపడిన సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఆడ శిశువని అబార్షన్ చేశారు. తీవ్ర గర్భస్రావమైన తర్వాత ఆమె గర్భంలో మగ శిశువు ఉందని తేలింది. ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వర్గాలను నిలదీయగా బాధితులకు రూ.2 లక్షలు ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నెక్కొండ మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజన వివాహిత లింగ నిర్ధారణ పరీక్ష కోసం మండల కేంద్రానికి వచ్చింది. సదరు వైద్యుడు పరీక్షలు చేసి ఆడ శిశువు ఉందని చెప్పారు. ఆమె నర్సంపేటలోని ఓ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుంది. గర్భంలో ఉంది మగ శిశువు అని తేలడంతో ఆ గర్భిణి లబోదిబోమంది. తప్పుడు సమాచారం ఇచ్చిన సదరు వైద్యుడిని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు నిలదీశారు. ఈ నేప«థ్యంలో ఇరువర్గాల నుంచి మధ్యవర్తుల ప్రమేయంతో రూ.1.5 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. చెన్నారావుపేట మండలం సూరిపల్లికి చెందిన ఓ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం ఉన్నారు. సదరు మహిళ మళ్లీ గర్భం దాల్చింది. కాగా నర్సంపేటలోని ఓ స్కానింగ్ సెంటర్లో పరీక్షలు చేయించడంతో ఆడపిల్ల అని తేలింది. వెంటనే ఆ మహిళను మహబూబాబాద్కు తీసుకువెళ్లి అబార్షన్ చేయించినట్లు సమాచారం. సాక్షి, వరంగల్ రూరల్: బాలికలపై వివక్ష కొనసాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ మొగ్గలోనే తుంచేస్తున్నారు. మరికొందరు భువిపైకి చేరిన గంటల వ్యవధిలోనే ముళ్ల కంపలు, చెత్త కుండీలు, కాల్వల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడడమో, ఊపిరి ఆగిపోవడమో నిత్యం జరుగుతోంది. జిల్లాలో వెయ్యి మంది బాలురుంటే 988 మంది బాలికలు ఉంటున్నారు. ఏటేటా లింగ నిష్పత్తిలో వ్యత్యాసం.. ఏటేటా బాలబాలికల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం పెరుగుతూ వస్తోంది. స్కానింగ్ సెంటర్ల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించినా కాసుల కక్కుర్తికి స్కానింగ్ పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతి పొందిన 25 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ప్రతి మండలం కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో బాలబాలికల నిష్పత్తి బాలురు 1000 బాలికలు 988 ఇవే కాక మొబైల్ స్కానింగ్లు సైతం చేపడుతున్నారు. మహబూబాబాద్కు చెందిన ఓ వైద్యుడు మొబైల్ స్కానింగ్ చేస్తున్నారు. ఇద్దరు నుంచి ముగ్గురు గర్భిణులు స్కానింగ్ కోసం వస్తే వారి పేర్లను నమోదు చేసుకుని సదరు డాక్టర్ను పిలిపించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆడ పిల్ల అని తెలియగానే వెంటనే అబార్షన్ చేసి డాక్టర్ వెళ్లి పోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. మగ శిశువు అయితే సోమవారం.. ఆడ అయితే శుక్రవారం తల్లి గర్భంలో ఉన్నంది మగ శిశువు అయితే సోమవారం అని.. ఆడ శిశువు అయితే శుక్రవారం అని కోడ్ భాషలను స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు వినియోగిస్తున్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీలతో లింక్ పెట్టుకుంటున్నట్లు తెలసుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలకు గర్భిణులకు తీసుకువస్తే వారికి కమీషన్ చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆడ శిశువు అయితే తొలగించేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో వారి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం.. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరిత్యా నేరం. పరీక్షలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. స్కానింగ్ సెంటర్ల పై ప్రత్యేక నిఘూ పెట్టాం. ఇద్దరు డిప్యూటీ డీఎంహెచ్ఓలు పర్యవేక్షిస్తున్నారు. – మధుసూదన్, జిల్లా వైద్యాధికారి -
మెడికల్ ఉత్పత్తుల అడ్డా ‘ఆర్కే’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కానింగ్, ఈసీజీ వంటి వైద్య ఉత్పత్తులను సమీకరించుకోవటం కార్పొరేట్ ఆసుపత్రులకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, గ్రామాల్లోని ఆసుపత్రులకు కాస్త ఇబ్బందే. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది ఆర్కే ఎంటర్ప్రైజెస్. బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం చేసుకొని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మెడికల్ ఉత్పత్తులను విక్రయించడమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ రవి కిరణ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది నెల్లూరు. బీ–ఫార్మసీ పూర్తయ్యాక.. విప్రో జీఈలో ఆంధ్రప్రదేశ్ బిజినెస్ మేనేజర్గా చేరా. తర్వాత శామ్సంగ్ మెడికల్ ఎక్విప్మెంట్లో సేల్స్ మేనేజర్గా పనిచేశా. అప్పుడు గమనించింది ఏంటంటే? గ్రామాల్లోని ఆసుపత్రుల్లో మెడికల్, డయాగ్నస్టిక్ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో దగ్గర్లోని నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని! దీనికి పరిష్కారం చూపించేందుకు 2017 డిసెంబర్లో నెల్లూరు కేంద్రంగా ఆర్కే ఎంటర్ప్రైజెస్ను ప్రారంభించాం. అందుబాటు ధరల్లో మెడికల్ ఉత్పత్తులు, మెడి కన్జ్యూమబుల్స్ని విక్రయించడం మా ప్రత్యేకత. 40కి పైగా వైద్య ఉత్పత్తులు.. స్కానింగ్ మిషన్స్, ఈసీజీ, ఫెటల్ మానిటర్స్, కార్డియో కేర్ వంటి 40 రకాలకు పైగా వైద్య ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. కేబుల్స్, ప్రింటర్స్, పేపర్స్ వంటి మెడి కన్జ్యూమబుల్స్ కూడా ఉంటాయి. ఉత్పత్తుల కోసం బయోనెట్, ఫెటల్, వాటెక్ ఇండియా, డాల్ఫిన్, ఫిలిప్స్, క్రౌన్డెంట్, ఆట్రియం వంటి 12 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే సోనీ, సియామ్స్, సీమెన్స్తోనూ ఒప్పందం చేసుకోనున్నాం. నెలకు రూ.50 లక్షలు.. వైద్య ఉత్పత్తుల విక్రయంతో పాటూ ఇన్స్టలేషన్, సర్వీసింగ్ కూడా కంపెనీయే చూసుకుంటుంది. ప్రస్తుతం నెలకు రూ.50 లక్షల వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటివరకు వందకు పైగా ఇన్స్టలేషన్ చేశాం. కర్నూల్, నెల్లూరులోని 6 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 14 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఆర్కేమెడిసాల్స్.కామ్ వెబ్సైట్ను అందుబాటులోకి తెస్తాం. ఈ ఏడాదిలో రూ.20 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. మెడికల్ ఉత్పత్తుల నిల్వ కోసం నెల్లూరులో గిడ్డంగి ఏర్పాటు చేశాం. రూ.5 లక్షల లోపు ధర ఉంటే వైద్య ఉత్పత్తులను నిల్వ చేస్తాం’’ అని రవి కిరణ్ తెలిపారు. -
ఓవరీలో సిస్ట్ ఉన్నవాళ్లకి సంతాన అవకాశం ఉండదా?
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్స్ నా వయసు 33 ఏళ్లు. పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. ఇంతవరకు పిల్లలు లేరు. కొన్నాళ్ల క్రితం స్కానింగ్ తీయిచాం. నా ఓవరీలలో సిస్ట్ ఉందని ఆ పరీక్షలో తేలింది. ఆ సిస్ట్ భవిష్యత్తులో క్యాన్సర్గా మారే అవకాశం ఉందని కొందరు అంటుంటే నాకు ఆందోళనగా ఉంది. అలాగే సిస్ట్ ఉన్నవారికి సంతానం పొందే అవకాశాలు ఎలా ఉంటాయి. ఈ విషయాలపై నాకు సలహా ఇవ్వండి. – శ్రీలత, కందుకూరు ఓవేరియన్ సిస్ట్ (అండాశయాల్లో నీటితిత్తులు) చాలామందిలో కనిపిస్తుంటాయి. ఇది చాలా సాధారణ సమస్య. ఈ నీటితిత్తులు క్యాన్సర్ కణాలుగా మారవు. మీ వయసులో ఉన్న వాళ్లలో చాలామందిలో అవి కొద్దికాలం తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి మీరు వీటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీలా ఒవేరియన్ సిస్ట్స్ ఉన్న మహిళలు డాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు అవి ఏ తరహాకు చెందినవో గుర్తించేందుకు వారు ప్రయత్నిస్తారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా వాటి పరిమాణం, సంఖ్య, వాటిలోకి జరిగే రక్తసరఫరా వంటి అంశాలను తెలుసుకుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటి ఇతర పరీక్షలనూ చేయించాల్సి వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకొని అలా వాళ్ల కుటుంబ చరిత్రలో క్యాన్సర్లు వచ్చి ఉంటే వారికి మరికొన్ని అదనపు పరీక్షలు సైతం చేయించాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒవేరియన్ సిస్ట్లు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే వాటి పరిమాణం పెరుగుపోతున్నా లేదా ట్విస్ట్ అవుతున్నా, అవి చీరుకుపోయి రక్తస్రావం అవుతున్నా, వాటి వల్ల నొప్పి కలుగుతుంటే మాత్రం వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఈ శస్త్రచికిత్స సైతం లాపరోస్కోపీ ప్రక్రియ ద్వారా చాలా మందికి సాధ్యపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలా సిస్ట్లు రావడం అన్నది ఎండోమెట్రియాసిస్ కారణంగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు రుతుస్రావం, కలయిక సమయంలో నొప్పి, గర్భధారణకు అడ్డంకిగా ఉంటుంది. ఇక మీరు అడిగినట్లుగా మీ గర్భధారణ అవకాశాల విషయానికి వస్తే మీకు ఇంకా గర్భధారణ జరగకపోవడానికి ఏయే అంశాలు కారణమో పూర్తిగా తెలుసుకోవాలి. దాంతోపాటు మీలో వచ్చే సిస్ట్లు ఏ తరహాకు చెందినవి అని తెలుసుకోవడం కూడా అవసరం. పైగా వయసు పెరుగుతున్న కొద్దీ గర్భధారణకు అవకాశాలు తగ్గిపోతాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు వీలైనంత త్వరగా వైద్య నిపుణులను కలవండి. ఎండో మెట్రియాసిస్ వస్తే పిల్లలు పుట్టే అవకాశాలుఉన్నాయా? నా వయసు 36 ఏళ్లు. ఉద్యోగం చేస్తున్నాను. పెళ్లయి ఎమినిదేళ్లు అవుతోంది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి వస్తుంటే ఇటీవలే డాక్టర్ను కలిశాను. డాక్టర్గారు నాకు ‘ఎండోమెట్రియాసిస్’ ఉందని నిర్ధారణ చేసి, లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. నాకు పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా? అలాగే నాకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశాలు ఉన్నాయా? – ఒక సోదరి, హైదరాబాద్ ఎండోమెట్రియాసిస్ చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇది రావడం అన్నది చాలామంది మహిళల్లో చాలా సందర్భాల్లో కనిపించేదే. కొంతమందిలో ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత ఈ నొప్పి పూర్తిగా తగ్గుతుంది. ఇక కొంతమందిలో మళ్లీ రావచ్చు. నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే లైఫ్స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా... అంటే... తేలికపాటి వ్యాయామాలు చేయడం, యోగా వంటి రిలాక్సేషన్ ప్రక్రియలతో పాటు చాలా తక్కువ మోతాదుల్లో నొప్పినివారణమాత్రలు వాడుతుండటం వంటి చర్యలతో నొప్పిని చాలావరకు నియంత్రణలో ఉంచవచ్చు. కానీ కొందరిలో నొప్పి తీవ్రత చాల ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిలో మళ్లీ గర్భధారణను కోరుకోని వారికి హార్మోన్లలో మార్పులు తీసుకువచ్చే మందులను డాక్టర్లు సూచిస్తారు. అయితే నొప్పి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. అయితే దాదాపు 60 శాతం నుంచి 80 శాతం మందిలో మళ్లీ గర్భధారణ వచ్చేలాగే శస్త్రచికిత్స చేసి, నొప్పిని నియంత్రించవచ్చు. మీ లేఖలో మీరు రాసినదాన్ని బట్టి మీరు గర్భధారణను కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ మీరు గర్భధారణను కోరుకుంటుంటే మాత్రం ‘ఫెర్టిలిటీ ఇవాల్యుయేషన్’ (అంటే గర్భధారణకు గల అవకాశాలను పరీక్షించే కొన్ని రకాల పరీక్షలు) చేయించాల్సి ఉంటుంది. మీరు రాసినదాన్ని బట్టి మీకు మినిమల్/మైల్డ్ ఎండోమెట్రియాసిస్ ఉండటం వల్ల లాపరోస్కోపిక్ చికిత్స జరిగినట్లు తెలిపారు. కాబట్టి కొన్ని రకాల మందులతో మీలో అండం విడుదల అయ్యేలా (ఒవ్యులేషన్)/ ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) వంటి ప్రక్రియలతో గర్భధారణకు తగిన అవకాశాలే ఉంటాయని చెప్పవచ్చు. కాకపోతే తీవ్రమైన ఎండోమెట్రియాసిస్ (సివియర్ ఎండోమెట్రియాసిస్) కేసుల్లో మాత్రం ఐవీఎఫ్ వంటి ఆధునిక ప్రక్రియలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజుల్లో సంతానసఫల్యానికి తగిన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. çమీరొకసారి ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి. స్పెర్మ్ కౌంట్ జీరో అయితే పిల్లలు పుట్టే అవకాశాలే ఉండవా? నా వయసు 33 ఏళ్లు. నాకు పెళ్లయి ఆరేళ్లు అవుతోంది. పిల్లలకోసం ప్రయత్నిస్తున్నాం. ఇటీవల నేను వీర్య పరీక్ష చేయించుకుంటే అందులో శుక్రకణాలు లేవని తెలిసింది. ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశమే లేదా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వడండి. – ఎమ్. సురేశ్బాబు, కోదాడ పురుషుల వీర్యంలో శుక్రకణాలు లేని కండిషన్ను అజూస్పెర్మియా అంటారు. దీనికి శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా లేకపోవడం లేదా ఉత్పత్తి అయిన శుక్రకణాలు ప్రయాణం చేసే దారిలో ఏదైనా అడ్డంకి ఉండటం కారణాలు కావచ్చు. అయితే మీలాంటి కేసుల్లో మారుమారు ఇదే పరీక్షను నిర్వహించాలి. ఆ తర్వాత మీరు కొన్ని వైద్య పరీక్షలు... అంటే హార్మోనల్ అల్ట్రాసౌండ్, క్యారియోటైపింగ్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. మీ కండిషన్కు తగిన కారణాన్ని నిర్ధారణ చేసుకోవాలి. హార్మోనల్ సప్లిమెంట్స్ ద్వారా శుక్రకణాలు సంఖ్య పెంచవచ్చు. అప్పటికీ సాధ్యంకాకపోతే ఐవీఎఫ్ (టెస్ట్ట్యూబ్) విత్ టెస్టిక్యులార్ స్పెర్మ్ యాస్పిరేషన్తో చికిత్స చేయవచ్చు. అంటే ఈ ప్రొసిజర్లో నేరుగా టెస్టిస్ నుంచి శుక్రకణాలు సేకరిస్తారు. అయితే అన్ని కేసుల్లో ఇలా శుక్రకణాల సేకరణ సాధ్యం కాకపోవచ్చు. అయినప్పటికీ మరికొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. వాటి పూర్తి వివరాల కోసం మీరు ఒకసారి ఫెర్టిలిటీ నిపుణులను సంప్రదించండి. డాక్టర్ రత్న దూర్వాసుల, సీనియర్ ఇన్ఫెర్టిలిటీ కన్సల్టెంట్, బర్త్ రైట్ బై రెయిన్బో, హైదరాబాద్ -
సెకన్లలో త్రీడీ బాడీ స్కాన్...
ఇప్పటివరకూ శరీరం లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే... ముక్కలు ముక్కలుగా మాత్రమే సాధ్యం. పీఈటీ, సీటీ, ఎక్స్రే వంటి టెక్నాలజీల్లోని లోటుపాట్లు దీనికి కారణం. ఇలా కాకుండా కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే మొత్తం శరీరాన్ని స్పష్టంగా స్కాన్ చేయగలిగితే వైద్యంలో, రోగులను కాపాడటంలో ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయి. కాలిఫోర్నియా యూనివర్సిటీ, షాంఘైలోని యునైటెడ్ ఇమేజింగ్ హెల్త్కేర్లు ఇప్పుడు ఈ అద్భుతాన్ని సాధ్యం చేశాయి. ఎక్స్ప్లోరర్ పేరుతో వీరు తయారు చేసిన పరికరం అటు పీఈటీ, ఇటు సీటీస్కాన్లు రెండింటిలోని మేలురకమైన లక్షణాలను కలబోసుకుని బాడీ స్కాన్లు చేస్తుంది. కేవలం 20 – 30 సెకన్లలో అవయవాలన్నింటి త్రీడీ చిత్రాలను అందివ్వగలదు. ఈ రకమైన పరికరం కోసం పదేళ్ల క్రితమే ఆలోచన చేయగా తొలి నమూనా పరికరం 2016లో సిద్ధమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని విస్తృతంగా పరిశీలించిన తరువాత ఈ ఏడాది మొదట్లో వాణిజ్యస్థాయి ఎక్స్ప్లోరర్ను సిద్ధం చేశారు. పీఈటీ స్కాన్లలో కూడా కనపించని అంశాలు దీంట్లో కనిపిస్తాయని.. పైగా వాటికంటే 40 రెట్లు ఎక్కువ స్పష్టత కలిగి ఉండటం ఎక్స్ప్లోరర్ విశేషమని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రామ్సే బడావీ తెలిపారు. ఫలితంగా అతితక్కువ రేడియోధార్మిక పదార్థాన్ని శరీరంలోకి పంపటం ద్వారా కూడా అత్యంత స్పష్టమైన చిత్రాలు పొందవచ్చునన్నమాట. మరికొన్ని పరిశోధనల తరువాత దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తామని అంటున్నారు శాస్త్రవేత్తలు. -
స్త్రీలోక సంచారం
డాక్టర్ కోర్సు పూర్తి చేసిన అమ్మాయిలు పెళ్లయ్యాక ఉద్యోగాలు మానేస్తుండడంతో ఆసుపత్రులలో వైద్యుల కొరత ఏర్పడుతోందన్న కారణంగా, అసలు వాళ్లను ఈ కోర్సులోకే రానీయకుండా చేసేందుకు మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ దశలోనే వారిని ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణల మీద టోక్యో మెడికల్ యూనివర్సిటీపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంచి మార్కులతో డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాలకు వెళితే.. వేతనాలు తక్కువగా, పనిగంటలు ఎక్కువగా ఉండడం, ఇంట్లో కూడా పిల్లల పోషణ, సంరక్షణ బాధ్యతల్లో వారికి భర్త సహకారం లేకపోవడంతో జపాన్లో చాలామంది అమ్మాయిలు ప్రతిభాసామర్థ్యాలు ఉండి కూడా, తమకెంతో ఇష్టమైన కెరీర్ను విధి లేక మధ్యలోనే వదులుకోవలసి వస్తోంది. రోడ్డు మీద ఆడపిల్లలను, మహిళలను.. పిల్లి కూతలతో, వికృతచేష్టలతో వేధిస్తే అక్కడికక్కడ 750 యూరోల జరిమానా (సుమారు 69 వేల రూపాయలు) విధించే కఠినమైన చట్టాన్ని ఫ్రాన్సు పార్లమెంటు ఆమోదించింది. ప్యారిస్లోని ఒక కేఫ్ బయట ఇటీవల మేరీ లాగ్యుర్ అనే యువతి.. వీధి వేధింపులకు ఎదురు తిరిగి, దాడికి గురైన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేపడంతో.. ఇప్పటి వరకు శిక్షార్హం కాకుండా ఉన్న ఈ స్ట్రీట్ టీజింగ్ను నేరంగా పరిగణించి, శిక్ష విధించేందుకు వీలుగా ఫ్రెంచి ‘జెండర్ ఈక్వాలిటీ’ మినిస్టర్ మార్లిన్ షియప్ప పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, తక్షణం అమలయ్యేలా చట్టాన్ని తెచ్చారు. సిక్కింలో 9 నుంచి 14 ఏళ్ల వయసున్న 32 వేల మంది బాలికలకు రానున్న రెండు వారాల్లో తొలి విడతగా, మళ్లీ వీరికే పూర్తిస్థాయి సంరక్షణ కోసం వచ్చే ఆర్నెల్లలో తుది విడతగా హెచ్.పి.వి. (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సిన్ను ఇచ్చే కార్యక్రమం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో మొదలైంది. చర్మవ్యాధికి, జననావయవాల ఇన్ఫెక్షన్కు కారణం అయ్యే ఈ వైరస్కు ఇచ్చే వ్యాక్సిన్ ధర మార్కెట్లో డోసు 3 వేల రూపాయల వరకు ఉండగా, ‘యునిసెఫ్’ సంస్థ కేవలం 400 రూపాయలకే సిక్కిం ప్రభుత్వానికి అందిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఉంటున్న భారతీయ సంతతి రచయిత్రి షబ్నమ్ ఖాన్ ఫొటో ఆమెకు తెలియకుండానే కొన్నేళ్లుగా అనేక అంతర్జాతీయ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్లలో, వెబ్ సైట్లలో.. (న్యూయార్క్లో కార్పెట్లు అమ్ముతున్నట్లుగా, కాంబోడియాలో ట్రెక్కింగ్ను నిర్వహిస్తున్నట్లుగా, ఫ్రాన్స్లో డేటింగ్ కోసం అబ్బాయిల వేటలో ఉన్న అమ్మాయిగా.. ఇలా అనేక విధాలుగా) ప్రత్యక్షం అవుతూ ఉండడం ఇప్పుడు ఆసక్తికరమైన వార్తగా వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికాలోని ముగ్గురు భారతీయ ముస్లిం మహిళ గురించి ‘ఆనియన్ టియర్స్’ అనే పేరుతో నవల రాసి ప్రసిద్ధురాలైన షబ్నమ్.. తన స్నేహితురాలి ద్వారా విషయం తెలుసుకుని.. వివిధ దేశాల వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తున్న ఆ ఫొటో.. యూనివర్సిటీలో చదువుతుండగా ఓ ఫ్రెండ్ తీసినదేనని గుర్తు చేసుకుంటూ.. ఫొటోలు దిగేటప్పుడు అమ్మాయిలు జాగ్రత్త వహించాలని, తెలిసినవాళ్లయితే పర్వాలేదు కానీ, తెలియని వ్యక్తులు ఫొటో తీస్తున్నప్పుడు కచ్చితంగా అభ్యంతరం చెప్పి తీరాలని సూచించారు. -
జిల్లాకేది ‘మార్పు’..?
కామారెడ్డి టౌన్: బీబీపెటకు చెందిన లలిత అనే గర్భిణీ కడుపులో పిండం బాగా లేదని వైద్యులు తెలపడంతో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్కు వారానికి ఒకసారి చొప్పున మూన్నెళ్లపాటు తిరిగి రూ.వేలాదిగా ఖర్చు చేసుకున్నారు. లింగంపేటకు ఎల్లారెడ్డి మండలానికి చెందిన సరస్వతి అనే మహిళలకు సాధారణ కడుపు నొప్పి రావడంతో వైద్యుల స్కానింగ్ చేయించుకోవాలనడంతో ప్రైవేట్లో రూ.800 పెట్టి స్కానింగ్ చేయించుకుంది. దోమకొండకు చెందిన ఎల్లయ్య కడుపు నొప్పి ఉండటంతో కడుపులో స్టోన్స్ ఉన్నాయని భావించిన వైద్యుడు స్కానింగ్ చేయించుకోవాలని సూచిండంతో రూ.వెయ్యి చెల్లించి ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో చేయించుకున్నాడు. ఇలా జిల్లాలో చాలా మంది ప్రజలు ప్రైవేట్లను ఆశ్రయిస్తూ జేబులు ఖాళీ చేయించుకుంటున్నారు. అయితే మార్పు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఆస్పత్రులు, సీహెచ్సీలలో స్కానింగ్ సేవలు ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టింది. పక్క జిల్లా పాత జిల్లా నిజామాబాద్లోని ప్రభుత్వ సీహెచ్సీలకు ప్రభుత్వం స్కానింగ్ యంత్రాలను మంజూరు చేసి ఇటీవలే ఆస్పత్రులకు పంపించారు. అయితే నూతన జిల్లాకు మాత్రం ఇప్పటి వరకు ఊసే లేదు. నిజామాబాద్ జిల్లాలో ఆరు సెంటర్లకు.. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, మోర్తాడ్, ధర్పల్లి, నవీపేట్, వర్ని, బాల్కొండ ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)కు ఇటీవల స్కానింగ్ యంత్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. 6 యంత్రాలు సైతం జిల్లాకు చేరుకున్నాయి. సీహెచ్సీలో ఏర్పాటు చేసి గర్భిణులకు ప్రజలకు సేవలిందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీహెచ్సీల పరిధిలోని గర్భిణులకు, రోగులకు, ప్రజలకు ఇక ఉచితంగా స్కానింగ్ సేవలు అందనున్నాయి. మన జిల్లాపై వివక్ష ఏల? కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, బాన్స్వాడలలో ఏరియా ఆస్పత్రులు, ఎల్లారెడ్డి, మద్నూర్, దోమకొండ, పిట్లం, గాంధారిలలో సీహెచ్సీలు ఉన్నాయి. వీటితో పాటు జిల్లాలో 19 పీహెచ్సీలు ఉన్నాయి. అయితే మొదట అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్కానింగ్ సేవలను ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం రెడియాలజిస్టుల పోస్టులు, స్కానింగ్ చేసే వారు లేక ప్రస్తుతం సీహెచ్సీలలోనే స్కానింగ్ సేవలు ప్రారంభించాలని అన్ని జిల్లాలలోని సీహెచ్సీలకు స్కానింగ్ యంత్రాలను మంజూరు చేసింది. అయితే మన జిల్లాలోని 5 సీహెచ్సీలకు ఇప్పటి వరకు యంత్రాలు రాలేవు. అధికారులు సైతం తమకేమి పట్టనట్లు సమాధానాలిస్తున్నారు. ఇక్కడ ఎందుకు రాలేవని ప్రశ్నించేవారు కరువయ్యారు. వైద్యశాఖ అధికారులు కనీసం చర్యలు కూడా తీసుకోవడంలేదు. ప్రైవేట్ సెంటర్స్లో వేలాదిగా ఫీజులు కామారెడ్డి జిల్లాలో 28 వరకు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. బాన్స్వాడ, కామారెడ్డి ఏరియా ఆస్పత్రుల్లో మాత్రం ఉచితంగా ప్రభుత్వం స్కానింగ్ సేవలు అందిస్తున్నారు. ఇక అన్ని సీహెచ్సీల పరిధిలో ప్రభుత్వ స్కానింగ్ సేవలు లేక ప్రజలు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లనే ఆశ్రయిస్తున్నారు. చిన్నపాటి కడుపు నొప్పి వస్తే రూ.600 నుంచి రూ.వేయి వరకు వసూలు చేస్తున్నారు. గర్భిణులైతే ప్రతినెలా వేలాదిగా ప్రైవేట్ సెంటర్లకు అప్పజెప్పుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్కానింగ్ సేవలు ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు. -
గింజ గుట్టు విప్పేస్తుంది
సాక్షి, హైదరాబాద్: ఎంఆర్ఐ స్కానింగ్ చేయ డం ద్వారా శరీర అంతర్భాగంలోని లోపాలను గుర్తించినట్లుగానే, ఇప్పుడు ఆహార ధాన్యాల నాణ్యతను గుర్తించేలా కొత్త స్కానింగ్ పరిజ్ఞా నం వచ్చింది. ఎంఆర్ఐ రిపోర్టు ఇచ్చినట్లుగానే ఇది కూడా ధాన్యం గింజలోని లోపాలను గుర్తిం చి రిపోర్టు ఇస్తుంది. అటువంటి పరికరాన్ని ఇద్ద రు ఐఐటీయన్లు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా మహబూబ్నగర్, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్టు విజయవంతమవడంతో ఇతర మార్కెట్లలోనూ ప్రవేశ పెట్టాలని మార్కెటింగ్శాఖ నిర్ణయించింది. త్వరలో టెండ ర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తుంది. సేంద్రీయ లక్షణాలను గుర్తించవచ్చు రైతులు పండించిన ఆహార పంటల్లో నాణ్యతను గుర్తించడానికి ప్రస్తుతం సాధారణ పద్ధతులనే ఉపయోగిస్తున్నారు. తేమ శాతం, వాటిలోని నాణ్యతను సక్రమంగా నిర్ధారించకపోవడంతో సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారు. పూర్తిస్థాయి శాస్త్రీయ పద్ధతులు లేకపోవడంతో దళారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. దీనికి చెక్ పెట్టే పరిజ్ఞానాన్ని మార్కెటింగ్ శాఖ ప్రవేశపెట్టింది. ‘మ్యాట్’ అనే ఈ పరికరం ద్వారా వరి, పప్పులు సహా ఇతర అన్ని ధాన్యాల నాణ్యతను గుర్తించవచ్చు. ధాన్యం రాశిలోని నమూనా గింజలను ఈ పరికరంలోని స్కానర్పై పెడితే కంప్యూటర్ మానిటర్పై గింజలోని లక్షణాలు, లోపాలు ప్రత్యక్షమవుతాయి. ఆ ధాన్యంలో పురుగు మందులు, తేమ శాతం, సేంద్రీయ లక్షణాలు, ప్రొటీన్లు, విటమిన్లూ ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తుంది. నిముషాల్లో స్కానింగ్ చేసి రిపోర్టు ఇస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా దాని నాణ్యతను నిర్ధారించి, దానికి తగ్గట్లు గ్రేడింగ్ చేసి ధరను నిర్ణయిస్తారు. అంతేకాదు సేంద్రీయ లక్షణాలు, నాణ్యత సరిగా ఉంటే అటువంటి ధాన్యాన్ని పెద్ద పెద్ద కంపెనీలు కొనుగోలు చేసే అవకాశముంది. వాటి ధర కూడా గణనీయంగా పెరిగి రైతుకు లబ్ధి చేకూరనుందని అధికారులు చెబుతున్నారు. ధర ఎక్కువే అయినా... ఈ పరికరం ద్వారా ధాన్యం నాణ్యతను గుర్తించేందుకు ఖర్చు అధికంగానే ఉందని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి ‘సాక్షి’కి చెప్పారు. ‘ఒక నమూనాను స్కానింగ్ చేయాలంటే రూ.180 వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ పద్ధతులకంటే ఇది ఖరీదైనది. అయినా ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకో వాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. టెండ ర్లు పిలిచి ఈ పరిజ్ఞానాన్ని ఇతర మార్కెట్లలో ప్రవేశపెడతామన్నారు. సమగ్రమైన నాణ్యత రిపోర్టు వస్తున్నందున ఖరీదైనప్పటికీ రైతుకు లాభం చేకూర్చుతుందన్నారు. పత్తి, మిరప, పసుపు, పండ్లను స్కానింగ్ చేసే పరిస్థితి లేకపోవడం ఇందులో ప్రధాన లోపం. -
‘ఆడ’నే అంతం!
‘నేను..ఆడ బిడ్డని. అందరికీ అండగా నిలిచేదాన్ని. కష్టసుఖాల్లో పాలుపంచుకునేదాన్ని. ఈ లోకం నన్ను చిన్నచూపు చూస్తోంది. అమ్మతనంతో ఆనందపడే కొందరి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుంటోంది. కొడుకుపై మోజుతో, మాపై కక్ష పెంచుకుంటోంది. కళ్లు తెరవకముందే కాటికి పంపేస్తోంది. కాల‘గర్భం’లో కలిపేస్తోంది. ప్రాణంపోసే బ్రహ్మ కూడా కనికరించడంలేదు. కాసుల కోసం కొందరు వైద్యులు కత్తులు దూస్తున్నారు. ‘ఆడ’నే విచ్ఛిన్నం చేసి ఇంటి వెలుగును దూరం చేస్తున్నారు. భవిష్యత్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. మీరైనా చెప్పండి. ఆడబిడ్డ ప్రాణాలు నిలపండి’. చిత్తూరు అర్బన్ :జిల్లాలో భ్రూణ హత్యలు పెచ్చుమీరుతున్నాయి. కొందరు విచ్చలవిడిగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడబిడ్డ అని తెలియగానే అబార్షణలు చేసేస్తున్నారు. రెండు రోజుల కిందట చిత్తూరు నగరంలో కేంద్ర బృందం సభ్యులు కొన్ని స్కానింగ్ సెంటర్ల నిర్వాకాన్ని బట్టబయలు చేయడం జిల్లాలో సంచలనం రేపుతోంది. భవిష్యత్.. భయానకం జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 872 మంది మాత్రమే (6 సంవత్సరాల్లోపు వయసున్న వాళ్లు) ఆడపిల్లలు ఉన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్లో ఎదురయ్యే ప్రమాద ఘంటికల్ని తెలియజేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న 15 ఏళ్లలో ప్రతి పది మంది మగాళ్లలో ఆరుగురికి మాత్రమే పెళ్లిళ్లు జరుగుతాయి. నిద్దరోతున్న నిఘా అమ్మకడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా..? ఎదుగుదల ఎలా ఉందో చెప్పాల్సిన స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గర్భంలో ఉన్న బిడ్డ ఆడో మగో చెప్పి.. ఆడపిల్ల అయితే నిర్దాక్షిణ్యంగా అబార్షన్లు చేసేస్తున్నారు. దీనిపై నిత్యం నిఘా ఉంచాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ నిద్దరోతోంది. కేంద్ర బృంద సభ్యులు చిత్తూరు లాంటి నగరంలో దాడులు చేసి ఇక్కడ జరుగుతున్న భ్రూణహత్యల (అబార్షన్లు) బాగోతాన్ని బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది. చట్టం వాళ్లకు చుట్టం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం–1994 ప్రకారం మహిళ కడుపులో ఏ బిడ్డ పెరుగుతోం దో చెప్పడం నేరం. పిల్లల్లో ఎదుగుదల, జన్యుపరమైన ఇబ్బందులు, గర్భస్థ శిశు సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే స్కానింగ్ చేయాలి. దీన్ని పర్యవేక్షించడానికి కలెక్టర్ చైర్మన్గా, డీఎంఅండ్హెచ్ఓ కార్యదర్శిగా పది మందితో కూడిన ఓ కమిటీ పనిచేస్తోంది. స్కానింగ్ సెం టర్లు నిర్వహిస్తున్న ప్రైవేటు నర్సింగ్ హోమ్లు, ఆస్పత్రులు విధిగా జిల్లా వైద్యశాఖ వద్ద అనుమతి పత్రం తీసుకుని, ప్రతి ఐదేళ్లకోసారి లైసెన్సును రెన్యూవల్ చేసుకోవాలి. పీజీ చేసిన వైద్యులు, గైనకాలజిస్టులు, రేడియోలజిస్టులు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషినర్స్ మాత్రమే స్కానిం గ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసినా, భ్రూణ హత్యలు చేసినా స్కానింగ్ సెంటర్ను సీజ్ చేయడంతో పాటు వైద్యుల్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించాలి. నేరం రుజువైతే మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది. జిల్లాలోని మదనపల్లె, తిరుపతి, చిత్తూరు లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు ఈ చట్టాన్ని తమ చుట్టంగా మార్చేసుకున్నారు. రాజకీయ పలుకుబడి అండగా పెట్టుకుని పబ్లిక్గానే లింగ నిర్ధారణ చేయడం, ఆడపిల్ల వద్దనుకునేవాళ్లకు అబార్షన్లు చేయడమే వృత్తిగా కొందరు వైద్యులు వ్యాపారం చేస్తున్నారు. ఇదో వ్యాపారం సామాజిక చైతన్యంలేని వాళ్లల్లో చాలా మంది ఆడపిల్లలు వద్దనుకుంటున్నారు. ప్రధానంగా జిల్లాకు ఆనుకుని ఉన్న తమిళనాడులోని పొన్నై, తంగాల్, పళ్లిపట్టు, తిరుత్తణి లాంటి ప్రాంతాల నుంచి పలువురు గర్భిణులు లింగ నిర్ధారణ కోసం చిత్తూరు, తిరుపతిలాంటి ప్రాం తాలను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడున్న మధ్యవర్తుల ద్వారా లింగ నిర్ధారణ కోసం రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు చెల్లిస్తూ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వచ్చే ఫీజులో వైద్యులు 20 శాతం మధ్యవర్తికి చెల్లిస్తున్నారు. తీరా కడుపులో ఉన్నది ఆడ బిడ్డ అని తెలియగానే అక్కడికక్కడే అబార్షన్ చేయించుకుంటున్నారు. ఇందుకు మరో రూ.10 వేల వరకు చెల్లిస్తున్నారు. చట్టరీత్యా చర్యలు గర్భస్థ పిండ లింగ నిర్ధారణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ముందుగా ప్రజల ఆలోచనలో మార్పురావాలి. ఆడపిల్ల మనజాతికి పునాది అని గ్రహించాలి. అనుమతుల్లేని స్కానింగ్ సెంటర్లను గుర్తించేందుకు కలెక్టర్తో మాట్లాడి టాస్క్ఫోర్సును ఏర్పాటుచేస్తాం. నిర్వాహకులపై కేసులు పెట్టి చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ స్వర్ణ విజయగౌరి,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి -
ఇద్దరు వైద్యులపై కేసులు..!
చిత్తూరు అర్బన్: చిత్తూరులో కలకలం రేపిన లింగ నిర్దారణ స్కానింగ్ కేంద్రాలు, భ్రూణ హత్యలకు పాల్పడే వైద్యులపై కేసులు నమో దు చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధి కారి(డీఎంఅండ్హెచ్ఓ) డాక్టర్ స్వర్ణ విజయగౌరి తెలిపారు. నగరంలోని నాయుడు బిల్డింగ్స్లో డాక్టర్ శోభ, ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తూ.. సుందరయ్యవీధిలో స్కానింగ్ సెంటర్ నడుపుతున్న మరో మహిళా డాక్టర్లను ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం గురువారం లింగ నిర్దారణలో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న విషయం తెలిసిందే. తిరుచానూరుకు చెందిన సునీత చిత్తూరు హైరోడ్డులో ఓ గదిని అద్దెకు తీసుకుని లింగ నిర్ధారణ, అబార్షన్లకు గర్భిణులను పలు ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళుతుండగా రహస్య కెమెరాల్లో చిత్రీకరించిన కేంద్ర బృందం దాడులు చేసింది. ఈ రెండు ఆస్పత్రులతో పాటు నగరంలోని పలు ప్రైవేటు నర్సింగ్హోమ్లు లింగ నిర్ధా్దరణ చేస్తూ అబార్షన్లు చేస్తున్నట్టు సునీత అధికారులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో మరికొన్ని ఆస్పత్రులపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు జిల్లా వైద్యశాఖ అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. మరోవైపు కేంద్ర బృందం ఆధ్వర్యంలో చేపట్టిన డెకాయ్ ఆపరేషన్లో పట్టుబడ్డ ఇద్దరు వైద్యాధికారుల లైసెన్సులు రద్దు చేసేందుకు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు నివేదిక పంపనున్నట్లు డీఎంఅండ్హెచ్ఓ పేర్కొన్నారు గర్భస్థ పిండ లింగ నిర్ధా్దరణ నిషేధ చట్టం జిల్లా చైర్మన్గా ఉన్న కలెక్టర్కు నివేదించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్యకు ఫిర్యా దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన వైద్యుల్లో ఒకరు ఏపీ వైద్యవిధాన్ పరిషత్లో ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తుండంతో ప్రిన్స్పల్ కార్యదర్శి చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. -
8 కిలోల కణితి తొలగింపు
సాక్షి,తణుకు : తణుకులోని సాయిశ్వేత సూపర్స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి సుమారు 8 కిలోల బరువున్న కణితిని తొలగించారు. తాడేపల్లిగూడెంకు చెందిన మహిళ అనారోగ్యంగా ఉండటంతో వైద్యురాలు డాక్టర్ ఉషారాణిని సంప్రదించింది. స్కానింగ్ చేసి కడుపులో కణితి ఉందని గుర్తించారు. డాక్టర్ ఉషారాణి, సత్యనారాయణలతో పాటు మత్తు వైద్యనిపుణులు నారాయణరావు పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. 15 ఏళ్ల క్రితమే గర్భసంచిని తొలగించే ఆపరేషన్ జరిగిందని, అప్పటి నుంచి శరీరం పెరుగుతోందనే ఉద్దేశంతోనే రోగి నిర్లక్ష్యం వహించిందని వైద్యురాలు చెప్పారు. -
మన ఫీలింగ్స్ చెప్పేస్తాయ్!
సాధారణంగా ఎవరైనా తక్కువగా మాట్లాడితే.. వాడి మనసులో మాట తెలుసుకోవడం చాలా కష్టం రా బాబూ అంటుంటాం. అయితే అలాంటి వారి మనసులో మాట కూడా బయటపెట్టొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.. ఎలా అంటే కేవలం శరీరాన్ని స్కాన్ చేయడం ద్వారా మనసులో మనం ఏం ఆలోచిస్తున్నాం.. మన ఫీలింగ్స్ను కూడా తెలుసుకోవచ్చట. భవిష్యత్తులో రాబోయే కెమెరాలు.. చిన్న చిన్న పరికరాల ద్వారా ఇది సాధ్యపడుతుందని డాల్బీ ల్యాబ్స్ అధినేత, న్యూరో శాస్త్రవేత్త పాపీ క్రమ్ చెబుతున్నారు. థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, మనసును చదివే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్ అనే పరికరాలను ఉపయోగించి మనసును చదివేయొచ్చంటున్నారు. గుండె కొట్టుకునే వేగం.. చర్మానికి అతికించే సెన్సర్ల నుంచి అందే సమాచారం ద్వారా మనసులో ఏం అనుకుంటున్నారో వలంటీర్లను పరీక్షించడం ద్వారా తెలుసుకున్నట్లు వివరించారు. ‘వేరే వ్యక్తికి ఏం తెలుసు.. ఏం చూస్తున్నాడు.. ఏం అర్థం చేసుకున్నాడు.. ఇలా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే సంతోషం.. బాధ.. ఇలా మనసులో ఉన్న భావాలన్నింటినీ గుర్తించొచ్చు’ అని పేర్కొన్నారు. ‘ఇప్పటికే సాంకేతికత ద్వారా నిజం నవ్వుకు.. అబద్ధపు నవ్వుకు మధ్య తేడాను గుర్తించాయి.. ఇదే సాధ్యం అయినప్పుడు భావాలను గుర్తిస్తామనడంలో సందేహం లేదు’ అని స్పష్టం చేశారు. అతి త్వరలో మనసును చదివే పరికరాలు పుష్కలంగా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. అంటే మన వ్యక్తిగత సమాచారానికే భద్రత లేదని ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో మన మనసులో భావాలకు కూడా రక్షణ కరువయ్యే రోజులు దగ్గర పడ్డాయన్న మాట. -
స్కానింగ్..కిల్లింగ్
తల్లి కడుపులో ఉన్నది ఆడా.. మగా అని తెలుసుకోవడం చట్ట విరుద్ధం. ఇదేవిషయాన్ని పీసీ– పీఎస్డీటీ చట్టం –2003 స్పష్టం చేస్తోంది. వైద్య ఆరోగ్య శాఖఅధికారుల పర్యవేక్షణ లేమిని ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేట్, డయాగ్నస్టిక్,స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలుచేస్తున్నారు. దీంతో బలవంత అబార్షన్లు, భ్రూణహత్యలు పెరిగిపోతున్నాయి. ⇔ ప్రొద్దుటూరులోని గాంధీరోడ్డులో ఉన్న ఓ స్కానింగ్ కేంద్రంలో ఇప్పటికి యదాతథంగా తీస్తున్నారు. చాలా ఏళ్లుగా స్కానింగ్ విషయంలో ఆ కేంద్రానికి పెద్దపేరు కూడా ఉంది. ⇔ మైదుకూరు, రాయచోటి ప్రాంతంలోని ఒకటి, రెండు కేంద్రాల్లోస్కానింగ్ సాగుతోంది. ⇔ జనవరి 18న కడపలోని ఓ వీధిలో నెలలు నిండని పసిగుడ్డును కాలువలో పడ వేశారు. ⇔ అదే నెలలో జమ్మలమడుగు సమీపంలో ముళ్లపొదల్లో పసిగుడ్డును వదిలి వెళ్లారు. ఆడపిల్ల కావడంతోనే అలా చేశారని చూసిన వారందరూ అంటున్నారు. సాక్షి, కడప : పసిగుడ్డులతో కొంతమంది పరిహాసాలు ఆడుతున్నారు.. లింగ నిర్ధారణపై నిషేధం ఉన్నా....అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని కేంద్రాలు గుట్టుచప్పుడు కాకుండా స్కానింగ్ చేస్తున్నాయి. ఒక్కో స్కానింగ్కు రూ. 3–5 వేలు వసూలు చేస్తూ ఊడ్చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు పరీక్షల ద్వారా తెలుసుకుని గర్భంలోనే శిశువును చిదిమేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకా తప్పని పరిస్థితి తలెత్తిన సమయంలో బిడ్డ జన్మించిన కొన్ని గంటల్లోనే చెత్తకుప్పల్లో పడేస్తున్న ఘటనలు కూడా ఇటీవల జిల్లాలో కనిపించాయి. జిల్లాలో రోజు రోజుకు ఆడపిల్లల సంఖ్య గణనీయంగా క్షీణిస్తోంది. ప్రతి వెయ్యి మంది మగబిడ్డలకు 918 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నట్లు 2011 జనాభా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో పెరుగుతున్న స్కానింగ్ కేంద్రాలు జిల్లాలో పుట్ట గొడుగుల్లా డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. నగరం మొదలుకొని నియోజకవర్గ కేంద్రాల్లోనూ వీటిని నెలకొల్పుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు నమ్మకంగా వచ్చే వారికి స్కానింగ్ నిజాన్ని బయటపెడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో అధికారుల నుంచి సమస్య ఉంటుందని భావించి కొందరు వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలో సుమారు 345 డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్లకు మాత్రమే గుర్తింపు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని పిండ లింగ నిర్థారణ పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. నిర్దారణ చేసినట్లు నిరూపణ అయితే శిక్ష స్కానింగ్ సెంటర్కు అనుమతులు ఉన్నా లేకున్నా గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు చేయడం తీవ్రమైన నేరం. చట్టాన్ని ఉల్లంఘించినట్లు నిరూపితమైన మూడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. కానీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించడంలేదు. దీంతో కొన్ని సెంటర్లలో ఇష్టానుసారంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. పరీక్షలు గైనకాలజిస్టు, రేడియాలజిస్టు లాంటి ఇతర కీలక వైద్యులు మాత్రమే నిర్వహించాలి. కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో ఉన్న వారే చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అంతంత మాత్రమే గర్భంలోఉండగా కొందరు..జన్మించిన తర్వాత మరికొందరు చిన్నారులను చిదిమేస్తుండడంతో పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. పుడుతున్న ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుండడం ఆందోళన కలిగించే పరిణామం. 2015–16లో 1000కి 900 మాత్రమే ఆడపిల్లల సంఖ్య నమోదైంది. ఇప్పటికీ వీరి నిష్పత్తి అంతంత మాత్రంగానే ఉందని గణంకాలు తెలుపుతున్నాయి.జిల్లాలోని 20 గ్రామాల్లో కౌన్సెలర్లను నియమించి ఆడపిల్లల సంఖ్య పెంపునకు కృషి జరుగుతోంది. తాజా ఘటనలు.. కడప నగరంలోని బీకేఎం స్ట్రీట్ సమీపంలోని మురుగు కాలువలో కనిపిస్తున్న ఈ పసిగుడ్డు ఎవరో... ఎందుకు వేశారో తెలియదు. కానీ తెలిసిందల్లా ఒక్కటే... పసిగుడ్డును వదిలించుకోవడం. అందుకే కాబోలు కాలువలో విసిరేసి వెళ్లిపోయారు. జనవరి మూడో వారంలో మురికి కాలువలో తేలుతూ కనిపించిన ఆ పసిగుడ్డును చూసిన అందరూ అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.జమ్మలమడుగులో కూడా పురిటిబిడ్డను ఇలానే కంపచెట్ల మధ్య వదిలేశారు.ఇవి బయటపడినవి. ఇంకా తెలియనివి ఎన్నో ఉంటాయి. లింగ నిర్దారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు చట్టరీత్యా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం. అందుకు వ్యతిరేకంగా వ్యవహారిస్తే అలాంటి కేంద్రాలను మూసివేస్తాం. వారిపై కఠిన చర్యలను చేపడతాం. అలాగే ఆడ శిశువు ఉందని అబార్షన్లు చేయడం కూడా నేరం. ఈ విషయంలో పెద్దలు కూడా ఆలోచించాలి. లింగ నిర్దారణ పరీక్షలకు దూరంగా ఉండాలి. స్కానింగ్ కేంద్రాలు, వైద్యులు కేవలం గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు మాత్రమే కృషి చేయాలి. – డాక్టర్ ఉమాసుందరి,- జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, వైఎస్సార్ కడపజిల్లా -
మహిళా రోగిని స్కానింగ్కు తీసుకెళ్లి ..
సాక్షి, విశాఖపట్నం: అత్యవసర వైద్యం కోసం అపస్మారక స్థితిలో ఆస్పత్రికి వచ్చిన మహిళా రోగిపై స్ర్టెచర్ బాయ్ లైంగిక దాడికి యత్నించిన సంఘటన విశాఖ కేజీహెచ్లో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సి.సి. కెమెరాలో రికార్డు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. గాజువాక సమీపంలోని వికాస్ నగర్కు చెందిన 43 ఏళ్ల మహిళకు రాత్రి 12 గంటల సమయంలో ఫిట్స్ వచ్చాయి. ఆమె చిన్నకుమారుడు క్యాబ్లో సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో కేజీహెచ్కు తరలించారు. ఆమెకు తలలో నరాల సమస్య తలెత్తినట్టు అనుమానించిన వైద్యులు బ్రెయిన్ స్కానింగ్ చేయించాలని సూచించారు. ఆస్పత్రి ఆవరణలోనే పీపీపీ విధానంలో నడుస్తున్న మెడాల్ డయాగ్నస్టిక్ సెంటర్కు చెందిన స్ర్టెచర్ బాయ్ మాడుగుల కిరణ్కుమార్ ఆమెను వీల్చైర్లో స్కానింగ్కు తీసుకువెళ్లాడు. ఆమె వెంట చిన్నకుమారుడు కూడా వెళ్లినా స్కానింగ్ సమయంలో బయటే ఉండిపోయాడు. స్కానింగ్ అయ్యాక కిరణ్కుమార్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భయంతో కేకలు వేయడంతో అతడు పారిపోయాడు. దీంతో రోగి భర్త శేషగిరిరావు ఈ విషయాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున్ దృష్టికి తీసుకెళ్లి అనంతరం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిరణ్కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
గాల్బ్లాడర్లో రాళ్లు... ఆపరేషన్ తప్పదా?
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నేను నెల రోజుల కిందట జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అందులో కడుపు స్కానింగ్ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్బ్లాడర్లో రాళ్లు ఉన్నాయని చెప్పారు. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. సలహా ఇవ్వండి. – సందీప్తి, వరంగల్లు గాల్బ్లాడర్లో రాళ్లు ఉన్నవారందరికీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదనేది వాస్తవం. కానీ మీ స్థితిగతులను బట్టి, మీ అవగాహన బట్టి, మీరు ఉండే ప్రాంతంలోని ఆరోగ్య వ్యవస్థ... అంటే స్కిల్డ్ సర్జన్, హాస్పిటల్ ఉందా లేదా అనే అనేక విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ విషయంలో రోగికి సలహా లేదా సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా దూరప్రయాణాలు చేయాలనుకునేవారికి, హైరిస్క్ పేషెంట్స్కీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి... నొప్పి వంటి ఇతరత్రా ఇబ్బందులు లేకపోయినా ఆపరేషన్ చేయాల్సి రావచ్చు. పేగుల్లో టీబీ... తగ్గుతుందా? నా వయసు 28 ఏళ్లు. కడుపునొప్పి వస్తోంది. బరువు కూడా తగ్గుతున్నాను. దాంతో వైద్యపరీక్షలు చేయించుకున్నాను. చిన్నపేగుల్లో టీబీ ఉందని డాక్టర్ అన్నారు. ఆరు నెలలుగా మందులు వాడుతున్నాను. ఇది పూర్తిగా నయమవుతుందా? తెలియజేయండి. – నితీష్, నరసరావుపేట చిన్నపేగులో టీబీ వచ్చినా మందుల ద్వారా తగ్గించవచ్చు. దానికి ఆరునెలల పాటు మందులు తీసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా అందరికీ తగ్గిపోతుంది. కొంతమందిలో టీబీకి సంబంధించి బ్యాక్టీరియా రెసిస్టెన్స్ పెరగడం వల్ల తగ్గకపోవచ్చు. ఇటువంటివారికి ఇప్పటివరకూ ఇస్తున్న మందులు మార్చి, మరో స్థాయి మందులు (సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్) చాలాకాలం పాటు కొనసాగిస్తారు. ఈ మందులు వేసుకున్నవారిలో కొంతమందికి చిన్నపేగులో ఉన్న పూత దెబ్బతినడం వల్ల కడుపునొప్పి పెరిగే అవకాశం ఉంది. వీరికి సర్జరీ ద్వారా చిన్నపేగులోని కొంతభాగాన్ని తీసివేసి మళ్లీ పేగును సరిదిద్దాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్ను ల్యాపరోస్కోపీ పద్ధతి ద్వారా చేయవచ్చు. డాక్టర్ పవన్ కుమార్ అడ్డాల కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ సంజీవని పెబెల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్, గుంటూరు -
మేమేం పాపం చేశాం..
మెంటాడకు చెందిన ఓ దంపతులకు మొదటి కాన్పులో పాప పుట్టింది. రెండో కాన్పులో కూడా ఆడబిడ్డ పుడుతుందని తెలుసుకుని అబార్షన్ చేయించారు. గంట్యాడకు చెందిన ఓ కుటుంబం కూడా రెండో కాన్పులో ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని అబార్షన్ చేయించుకున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లా వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి. ఆడపిల్ల అని తెలుసుకుని చాలామంది గర్భస్థ హత్యలకు సిద్ధపడుతున్నారు. విజయనగరం ఫోర్ట్: గతంలో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి మనంటికి వచ్చిందనుకునే వారు. కాని నేటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆడపిల్ల అంటేనే భారం అనుకుంటున్నారు. కొంతమంది వైద్యుల కాసుల కక్కుర్తి కారణంగా ఆడ శిశువులు తల్లి గర్భంలోనే హతమవుతున్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఆడ, మగ అనే వివక్ష ఇంకా పోలేదు. 72 మంది.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కాలంలో 72 మంది శిశువులు గర్భంలోనే మృతువాత పడ్డారు. ఇందులో ఎక్కువగా అబార్షన్లే ఉన్నాయని సమాచారం. మగపిల్లలైతే ప్రసవానికి సిద్ధపడడం.. ఆడపిల్ల అయితే బ్రూణహత్యలకు సిద్ధపడడం దారుణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలు వద్దనుకుంటే భవిష్యత్ ఏమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఉదాశీనతే కారణం స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ లేకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించి భ్రూణహత్యలు జరగకుండా చూడాల్సిన వైద్య ఆరోగ్యశాఖాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కొంతమంది స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కాసులకు కక్కుర్తిపడి లింగనిర్ధారణ చేపడుతున్నారు. ఈ విషయంలో అధికారులకు కూడా మామూళ్లు అందుతున్నాయని సమాచారం. లింగనిర్ధారణ చేయడానికి రూ. 15 వేల నుంచి 20 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వివరాలు తెప్పిస్తున్నాం.. స్టిల్ బరŠత్స్ (గర్భంలో చనిపోయిన శిశువులు) నివేదిక తెప్పించుకుంటున్నాం. ఏ తేదిన గర్భం దాల్చింది.. ఏ కారణం చేత అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.. తదితర వివరాలు తెలుసుకుంటున్నాం. ఎవరైనా కావాలని అబార్షన్ చేయించుకున్నా.. లింగ నిర్ధారణ చేసినా కఠిన చర్యలు తప్పవు. – డాక్టర్ సి. పద్మజ, డీఎంహెచ్ఓ -
స్కానింగ్ సేవలు మెరుగుపరుస్తాం
సాక్షి ఎఫెక్ట్ అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో స్కానింగ్ సేవలు మెరుగుపరుస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్ తెలిపారు. రేడియాలజిస్టుల కొరత, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులు పడుతున్న కష్టాలపై ‘నిరీక్షణ..ఓ పరీక్ష’ శీర్షికతో శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. గైనిక్ విభాగం ఇన్చార్జ్ హెచ్ఓడీ డాక్టర్ సంధ్య, రేడియాలజిస్ట్ డాక్టర్ దీపను తన చాంబర్కు పిలిపించి పరిస్థితిపై ఆరా తీశారు. లిఖిత పూర్వకంగా సంజాయిషీ కోరారు. స్కానింగ్ సేవల్లో జాప్యం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. ఇదే సమయంలో అనధికారికరంగా సెలవులో వెళ్లిన డాక్టర్ వసుంధర, డాక్టర్ పద్మలపై చర్యలకు డీఎంఈకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్కానింగ్ గదిలో ప్రత్యేక బెంచీలు : అల్ట్రాసౌండ్ స్కానింగ్ గది వద్ద నిత్యం పెద్ద సంఖ్యలో గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్తులు నిరీక్షిస్తుండటాన్ని సీరియస్గా పరిగణించిన డాక్టర్ జగన్నాథ్ తక్షణ చర్యలు చేపట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మన్నను పిలిపించి అల్ట్రాసౌండ్ గదిలో ప్రత్యేకంగా బెంచీలు ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకున్నారు. సెక్యూరిటీ సూపర్వైజర్ ఫరూక్ను పిలిపించి స్కానింగ్ గది వద్ద రోగుల బంధువులు కూర్చోకుండా చూడాలని ఆదేశించారు. స్కానింగ్కు వచ్చే వారికి ప్రత్యేకంగా టోకెన్ పద్ధతిని అమల్లోకి తెచ్చారు. దీంతో శనివారం పరీక్షల కోసం వచ్చిన వారికి టోకన్లు ఇచ్చి గది బయట వేచి చూడకుండా లోపల కూర్చునే ఏర్పాట్లు చేశారు. -
అక్రమాలకు స్కానింగ్తో బ్రేక్!
⇒ వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల అడ్డుకట్టకు చర్యలు ⇒ వాహనం నమోదు సమయంలోనే స్కానింగ్ ⇒ ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక అందజేత సాక్షి, హైదరాబాద్: వాహనం ఒక చోట. ఆర్టీఏ కార్యాలయం మరో చోట. ఆ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసే అధికారి ఇంకో చోట. కొత్త వాహనాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయ్యే వాహనాల్లో తర చుగా చోటుచేసుకునే నిబంధనల ఉల్లంఘన ఇదీ. ఏజెంట్లు, మధ్యవర్తులపై ఆధారపడి కార్యకలాపాలు సాగించే కొందరు ఆర్టీఏ అధికారులు వాహనాల భౌతిక స్థితిని ఏ మాత్రం పరిశీలించకుండా అక్రమ రిజిస్ట్రేష న్లకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు డాక్యుమెంట్లను పరిశీలించకుండానే ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు, బదిలీల్లో భారీగా డబ్బులు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇటీవల విజయవాడలో నిర్మాణ దశలో ఉన్న కొన్ని ఆయిల్ ట్యాంకర్లకు హైదరాబాద్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనాల అక్రమాలకు చెక్ పెట్టేందుకు వాహనాలను, వాటి ఇంజిన్, చాసిస్ నంబర్లను స్కానింగ్ చేయాలని విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. తెల్ల కాగితంపై ఇంజిన్ నంబర్ నమోదు ప్రస్తుతం రవాణా శాఖ అందజేసే సేవలన్నీ ఆన్లైన్ ద్వారానే లభిస్తున్నాయి. కానీ వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో మాత్రం ఇంకా పాత పద్ధతులనే అనుసరిస్తున్నారు. ఒక తెల్లకాగితంపై వాహనం ఇంజన్ నంబర్, చాసిస్ నంబర్లను పెన్సిల్(రుద్దడం ద్వారా)తో నమోదు చేస్తున్నారు. వాహనాలను ఆర్టీఏ కార్యాలయానికి తరలించకుండా ఎక్కడో ఉన్న వాటి నంబర్లను ఏజెంట్లే పెన్సిల్ ద్వారా నమోదు చేసుకుని వస్తున్నారు. విజయవాడలో బాడీ నిర్మాణ దశలో ఉన్న ఆయిల్ ట్యాంకర్లకు అక్కడే ఇంజన్ నంబర్లు, చాసీస్ నంబర్లను పెన్సిల్తో కాగితంపై రుద్దుకుని తెచ్చారు. వాహనాలను పరిశీలించకుండా కేవలం ఏజెంట్లు అందజేసిన కాగితాల ఆధారంగానే కొందరు ఎంవీఐలు వాహనాలను నమోదు చేసినట్లు ఈ ఉదంతంపై ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ప్రవీణ్రావు కమిటీ అభిప్రాయపడింది. అక్రమాలకు చెక్ పెట్టాలంటే.. తెల్లకాగితంపై పెన్సిల్తో రుద్దే పద్ధతిని రద్దు చేసి.. దాని స్థానంలో వాహనాల ఇంజన్ నంబర్లు, చాసీస్ నంబర్లను స్కానింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది. నివేదికలోని అంశాలివే.. పెట్రోల్, డీజిల్ తదితర చమురు ఉత్పత్తుల సరఫరా కోసం సివిల్ సప్లైస్ విభాగం గత ఏప్రిల్లో ఆయిల్ ట్యాంకర్లకు టెండర్లను ఆహ్వానించింది. తమ వద్ద వాహనాలు లేక పోయినా కొందరు కాంట్రాక్టర్లు ఆఘమేఘాల మీద టెండర్లకు సన్నద్ధమయ్యారు. ఆయిల్ ట్యాంకర్లకు ఆర్డర్లు ఇచ్చారు. కానీ టెండర్ గడువు సమీపించినప్పటికీ వాహనాలు చేతికి రాలేదు. విజయవాడలో బాడీ బిల్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎలాగైనా టెండర్లలో పాల్గొనాలనే లక్ష్యంతో ఏజెంట్ల సాయంతో కొందరు మోటారు వాహన అధికా రులను, రవాణా ఉద్యోగులను తమకు అను కూలంగా మార్చుకొన్నారు. విజయవాడలో అసంపూర్తిగా ఉన్న వాహనాలకు హైదరాబా ద్లో రిజిస్ట్రేషన్లు చేశారు. కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు అనుగుణంగా డాక్యుమెంట్లను సిద్ధం చేసి ఇచ్చారు. త్వరలో చర్యలు.. కమిటీ నివేదిక నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. త్వరలో సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరనున్నట్లు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా.. నియంత్రించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అసలేం జరిగింది.. నగరానికి చెందిన సుమారు 50కి పైగా ఆయిల్ ట్యాంకర్లకు అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. విజయవాడ ఆటోనగర్లో బాడీ బిల్డింగ్ యూనిట్లో ఉన్న వాహనాలకు హైదరాబాద్లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రి యను పూర్తి చేశారు. ఈ క్రమంలో వాహ నాలను పరిశీలించకుండా, వాటి వివరాలు తెలియకుండా కొన్ని డాక్యుమెంట్ల ఆధారం గా ఈ పని చేశారు. ఏప్రిల్, మే నెలల్లో చోటు చేసుకున్న ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్రావు నేతృత్వంలో గత నెలలో విచా రణ కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్రస్థాయి లో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన కమిటీ ప్రతినిధులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం లో 21, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో 15 ఆయిల్ ట్యాంకర్లకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు కమిటీ గుర్తించింది. బండ్లగూడ, వికారాబాద్, ఖమ్మం ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ఇదే తరహా అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగు చూశాయి. -
అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై గూఢచర్యం
కాకినాడ సిటీ: జిల్లాలోని అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య గూఢచర్య కార్యకలాపాలు నిర్వహించి పిండలింగ నిర్ధారణ వెల్లడిచేసిన సెంటర్లపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలుపై కలెక్టరేట్ కోర్టుహాలులో శుక్రవారం రాత్రి జిల్లాస్థాయి సలహా కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఆరు అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు, 19 సెంటర్లకు లైసెన్స్ రెన్యూవల్, 10 సెంటర్లకు అడ్రసు మార్పు అనుమతులు రాటిఫికేషన్లు జారీ చేశారు. జిల్లాలో రిజిస్టర్ అయిన 328 అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై రహస్య నిఘా ఉంచి డెకోయ్, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. స్కానింగ్ చేసే ముందు గర్భిణి అనుమతి సంతకాన్ని తప్పనిసరిగా సేకరించాలన్నారు. ఈ అనుమతి పత్రాలు కేంద్రం రిజిష్ట్రేషన్ లైసెన్స్, స్కానర్ వివరాలు, పరీక్షలు నిర్వహించే వైద్యులు, నిపుణుల వివరాలు విధిగా ఆన్లైన్లో పరిశీలనకు అందుబాటులో ఉండాలన్నారు. ఆర్డీఓలు, ప్రోగ్రామ్ అధికారులు తమ పరిధిలో అల్ట్రాసౌండ్ స్కానర్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు. 6వ అదనపు జిల్లా జడ్జి ఎం.శ్రీనివాసాచారి, ఐటీడీఏ పీఓ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఎంహెచ్ఓ కె.చంద్రయ్య, ఆర్డీఓలు రఘుబాబు, విశ్వేశ్వరరావు, గణేష్కుమార్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాళిక జిల్లాలో ఆరు నెలల నుంచి 15 నెలలలోపు పిల్లలందరికీ మీజెల్స్, రూబెల్లా వైరస్ల నివారణ వ్యాక్సిన్ పంపిణీకి పటిష్ట ప్రణాలిక చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో ఐసీడీఎస్, విద్యా, వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆగష్టు నెలలో పిల్లలందరికీ నూరుశాతం వ్యాక్సిన్ పంపిణీకి ప్రత్యేక ఎంఆర్ కాంపెయిన్ నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారు. సబ్కా సాత్–సబ్కా వికాస్కు సమగ్ర ఏర్పాట్లు: ఈనెల13న కాకినాడలో నిర్వహించే సబ్కా సాత్–సబ్కా వికాస్కు సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి స్ధానిక రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో ఈకార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమాలపై ఎగ్జిబిషన్ స్టాల్స్ను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
అనుమతిలేని ఆస్పత్రి సీజ్
కోడుమూరు రూరల్ : ఎలాంటి అనుమతుల్లేకుండా కోడుమూరు పట్టణంలో వైద్యం, స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న బాషా నర్సింగ్ హోమ్ను డీఎంఅండ్హెచ్ఓ మీనాక్షి మహాదేవ్ బుధవారం సాయంత్రం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుమతుల్లేకుండా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈనెల 19వతేదీ కోడుమూరులోని బాషా నర్సింగ్ హోమ్ తనిఖీ చేయగా, స్కానింగ్ మిషన్తో పాటు, వైద్యుడు పరారయ్యాడన్నారు. అస్పత్రిలోని రోగులను విచారించగా స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారన్న విషయం రుజువైందన్నారు. ఎలాంటి అర్హత పొందిన డాక్టర్లు, సిబ్బంది లేకుండానే ఆస్పత్రిని నిర్వహిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దీంతో బాషా నర్సింగ్ హోమ్ను సీజ్ చేసి, అస్పత్రిలోని రోగులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు మీనాక్షిమహాదేవ్ వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ హెచ్ఓ ఎర్రంరెడ్డి, హెచ్ఈఓ సత్యనారాయణ, లీగల్ కన్సల్టెంట్ మాధవి, కోడుమూరు ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి ప్రకాశం, వీఆర్వో వెంకట్రాముడు తదితరులున్నారు. -
ఎస్బీఐకి నకిలీ నోట్ల సెగ..ఈసారి ఎలా అంటే..
షాజహాన్ పూర్: ఒకవైపు అసోసియేటెడ్ బ్యాంకుల విలీనంతో అతిపెద్ద బ్యాంకు గా అవతరించనున్న దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నకిలీ నోట్ల సెగ గట్టిగా తాకు తోంది. ఎస్బీఐ ఏటీఎంలలో ఈ నకిలీ నోట్లు దర్శనమివ్వడం ఆందోళన రేకెత్తించింది. మొన్నఢిల్లీ ఎస్బీఐ ఏటీంలో నకిటీ నోట్లు కలవరం రేపగా, తాజాగా ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్ లోని ఎస్బీఐ ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. స్కాన్ చేసిన నకిలీ రూ.2 వేల నోటు దర్శనిమిచ్చిన ఘటన గురువారం చోటుచేసుకుంది. షాజహాన్పూర్ నివాసి పునీత్ గుప్తా స్థానిక ఎస్బీఐ ఏటీఎంలో రూ. 10 వేలు డ్రా చేశాడు. ఇందులో ఐదు రూ.2 వేల నోట్లు వచ్చాయి. అయితేవీటిలో నాలుగు సక్రమైనవిరాగా.. ఒకటి స్కాన్ చేసిన నోటు కావడంతో గుప్తా షాకయ్యాడు. ఆయనతో పాటు అక్కడ క్యూలో ఉన్న వారంతా దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల కుట్ర ఉందని వారంతా ఆరోపిచారు. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పెద్ద గందరగోళమే చెలరేగింది. చివరికి పోలీసులు వచ్చిపరిస్థితిన చక్కదిద్దారు. సంబంధిత బ్యాంకు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఎస్బీఐ స్పందించింది. నోట్ల నాణ్యత పర్యవేక్షణ కోసం చాలా బలమైన వ్యవస్థలను ఏర్పాటు చేశామని తెలిపింది. బ్యాంక్ నుంచి పంపిణీ చేయడానికి స్వీకరించబడిన నోట్లు, ఏటీఎంలు లేదా దాని శాఖల ద్వారా నోట్ సార్టింగ్ మెషీన్స్ద్వారా ప్రాసెస్ చేయబడతాయని.. కనుక నకిలీ నోట్లను పంపిణీ చేసే అవకాశం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు సదరు ఏటీఎం లో ఆఖరుసారి నగదు నింపిన వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. -
గర్భస్థ స్కానింగ్ల దుర్వినియోగానికి చెక్
నిఘాకు నోడల్ అధికారి నియామకానికి ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గర్భస్థ స్కానింగ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని, ఇందుకోసం కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం గర్భిణిల ఆయా స్కానింగ్ల నివేదికలను తప్పనిసరిగా జిల్లా వైద్యాధికారికి పంపాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఈ నిబంధనను పాటించాల్సి ఉన్నా రాష్ట్రంలో ఇది ఎక్కడా అమలు కావట్లేదు. దీంతో సర్కారు తాజాగా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థకు రూపకల్పన చేయాలని నిర్ణయించింది. ఆన్లైన్లో స్కానింగ్ నివేదికలు పంపాలని తాజాగా ఆదేశాలు ఇచ్చింది. లింగ నిర్ధారణ కోసం స్కానింగ్లు...: రాష్ట్రంలో ఏటా 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిల్లో 91 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకుంటుండగా మిగిలిన వారు ఇళ్ల వద్ద ఏఎన్ఎంలు, ఇతరుల సమక్షంలో కాన్పులు చేయించుకుంటున్నారు. ప్రతి గర్భిణీకి మూడు సార్లు స్కానింగ్ చేస్తారనుకుంటే ఆ ప్రకారం ఏటా సుమారు 20 లక్షల స్కానింగ్లు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. చాలా మంది తల్లిదండ్రులు స్కానింగ్ కేంద్రాల్లో వైద్యులకు డబ్బు ఆశజూపి తమకు పుట్టబోయేది ఆడ బిడ్డో, మగ బిడ్డో తెలుసుకుంటున్నారు. కొన్ని స్కానింగ్ సెంటర్లు దాన్నో వ్యాపారంగా మార్చుకున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. పుట్టేది ఆడ బిడ్డయితే కొందరు అబార్షన్ చేయిస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ చర్యల వల్ల స్త్రీ, పురుష నిష్పత్తిలో గణనీయమైన తేడా కనిపిస్తోంది. దీంతో నిబంధనలను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న 100, ప్రైవేటు రంగంలో ఉన్న 2,900 అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాలు ఇకపై గర్భస్థ స్కానింగ్లు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా దరఖాస్తు నింపి ప్రతి నెలా వాటిని జిల్లా వైద్యాధికారికి పంపాలి. ఇక నుంచి దీన్ని ఆన్లైన్ చేయనున్నారు. -
ఫ్యాటీ లివర్ ఉంటే...
గ్యాస్ట్రో కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. తగిన సలహా ఇవ్వండి. – ఎల్. కృష్ణారెడ్డి, విశాఖపట్నం లివర్... కొవ్వు పదార్థాలను గ్రహించి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. అది కొన్ని రకాల కొవ్వుపదార్థాలను స్వయంగా ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించేది. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్కు దారితీయవచ్చు. సాధారణంగా ఇది 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదమూ కలిగించకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు. మీకు స్కానింగ్లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ∙మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి. ∙ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు. ∙తరచూ చేపలు తినడం మేలు. అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది. ∙మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఒకే స్ట్రెచ్లో పనిచేస్తుంటే... స్లీప్ కౌన్సెలింగ్ వాస్తవానికి మా వర్కింగ్ షిఫ్ట్ వ్యవధి ఎనిమిది గంటలు. అయితే మరో ఆరు గంటలు అదనంగా పనిచేస్తే మాకు ఇచ్చే వేతనం డబుల్ ఉంటుంది. అందుకే మేం సాధారణంగా డబుల్ డ్యూటీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటాం. నాకు తీవ్రమైన ఒళ్లునొప్పులు వస్తున్నాయి. తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరుడు, హైదరాబాద్ అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్లో) పనిచేసేవారికి తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో ఎక్కువ అలసటతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. మీలాంటి వారిలో అలసటతోపాటు, ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు చేస్తుంది. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ∙చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా ఎక్కువ. కంటి నిండా నిద్ర అవసరం. ∙కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. ∙రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. ∙భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగ్గొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ∙ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచండి
పెద్దపల్లి: గర్భిణులకు ఆరోగ్య పరీక్షల పేరిట చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై నిఘా ఉంచాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్రెడ్డి వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. బ్రూణ హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో స్కానింగ్ సెంటర్ల పూర్తి వివరాలను సేకరించి భద్రంగా ఉంచాలని సూచించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహణపై అనుమానం కలిగితే పోలీసుల సహకారంతో ఆ సెంటర్లను తనిఖీ చేయాల్సిందిగా డీఎంఅండ్హెచ్ఓ భిక్షపతిని కోరారు. జిల్లాలోని ప్రతి స్కానింగ్ సెంటర్లో ఎంతమంది గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, వారికి సంబంధించిన వివరాలను సేకరించాలన్నారు. ప్రసవం తర్వాత కూడా విధిగా మహిళల వివరాలు నమోదు చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్ యజమాని విధిగా ట్రాకింగ్ చిప్ టెక్నాలజీ విధానాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక జేసీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశానికి జిల్లాలోని వైద్యాధికారులు అబ్ధుల్బాబా, వై. సూర్యశ్రీరావు, బి. మల్లేశం, న్యాయసలహాదారు శంతన్ కుమార్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కవిత, స్థానిక ఎంపీపీ సందనవేని సునిత, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
లింగనిర్ధారణ నేరం
జిల్లా జాయింట్ కలెక్టర్–2 రామస్వామి కర్నూలు(హాస్పిటల్): లింగనిర్ధారణ నేరమని జిల్లా జాయింట్ కలెక్టర్–2 రామస్వామి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో స్కానింగ్ సెంటర్ల యజమానులు, అప్రాప్రియేట్ కమిటీ సభ్యులతో పీసీ పీఎన్డీటీ యాక్ట్పై జిల్లా స్థాయి, డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ–2 రామస్వామి మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించామన్నారు. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోక్ అదాలత్ న్యాయమూర్తి సోమశేఖర్, డీఎస్పీ కృష్ణమూర్తి , ప్రైవేటు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడారు. సమావేశంలో ఆదోని ఆర్డీవో ఓబులేసు, ఐఎంఏ కర్నూలు శాఖ అధ్యక్షుడు డాక్టర్ బి. శంకరశర్మ, ఎన్జీవో రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
గర్భస్థ శిశువుకు ఆధునిక వైద్యం
కర్నూలు(హాస్పిటల్): గర్భస్థ శిశువుకు ఉండే లోపాలను ఆధునిక వైద్యం ద్వారా నయం చేయవచ్చని ఫీటల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ గాయత్రి ఇండ్ల చెప్పారు. ఫాగ్సీ కర్నూలు, లోటస్ అల్ట్రాసౌండ్, ఫీటల్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఓ హోటల్లో గర్భస్థ శిశువు లోపాలపై వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రి ఇండ్ల మాట్లాడుతూ స్కానింగ్, స్క్రీనింగ్ ద్వారా జన్యులోపాలను, ఇతర అవయవలోపాలను, బిడ్డ ఎదుగుదలను గుర్తించి చికిత్స చేయవచ్చన్నారు. గర్భస్థ శిశువుకు సైతం మల్టీస్పెషాలిటీ స్థాయిలో కేర్ అవసరమన్నారు. ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్టు, పీడియాట్రిస్ట్, పీడియాట్రిక్ సర్జన్లు కలిసి గర్భస్థ శిశువుకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందన్నారు. ఇదే అంశంపై డాక్టర్ ఉమారామ్(చెన్నై), డాక్టర్ చిన్మయి, డాక్టర్ అమిత(హైదరాబాద్) ప్రసంగించారు. కార్యక్రమంలో ఫాగ్సీ సెక్రటరీ డాక్టర్ మాణిక్యరావు, చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ చలపతి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ నవీద్ తదితరులు పాల్గొన్నారు. -
లింగనిర్ధరణ అడిగేవారూ నేరస్తులే..
లీగల్ పాయింట్ ఆడపిల్ల భారమని భావించే కొందరు కడుపులో ఉండగానే లింగ నిర్ధరణ పరీక్షలు చేయిస్తుంటారు. ఇందుకోసం స్కానింగ్ సెంటర్ల వైపు పరుగులు పెడుతుంటారు. అందులో ఆడపిల్ల అని తేలగానేభ్రూణహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి హత్యలను ఆపడానికి ప్రభుత్వం 1994లో పీఎన్డీటీ(గర్భస్థ పిండ పరీక్ష నివారణ) చట్టాన్ని తెచ్చింది. ఆ చట్టం వివరాలను వివరించారు జగిత్యాల బార్ అసోసియేషన్ న్యాయవాది పులిశెట్టి శ్రీనివాస్. జగిత్యాల జోన్ : గర్భిణికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వైద్యులు గర్భస్థ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. గర్భవతి అయిన మహిళ 35 ఏళ్లు దాటి ఉంటే శారీరక మార్పుల దృష్ట్యా గర్భస్థ పరీక్షలు చేయవచ్చు. అలాగే గర్భవతి అయిన మహిళకు అంతకుముందు రెండు లేక అంతకన్న ఎక్కువసార్లు ఎటువంటి కారణమూ లేకుండానే గర్భస్రావం జరిగి ఉండాలి. లేదంటే గర్భంలోనే పిండం మృతిచెంది ఉండాలి. అలాగే తీవ్ర అనారోగ్యం కలిగినప్పుడు, పిండంపై తీవ్ర ప్రభావం గల మందులను వాడినప్పుడు మాత్రమే గర్భిణికి పరీక్షలు చేయొచ్చు. గర్భవతి లేదా ఆమె భర్తకు జన్యు సంబంధ రోగాలు ఉన్నప్పుడు గర్భిణికి స్కానింగ్ చేయించొచ్చు. సెక్స్ సంబంధ జన్యు రోగాలు, రక్తం సరఫరా తక్కువగా ఉండటం, క్రోమోజోమ్ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు మాత్రమే గర్భిణికి స్కానింగ్ పరీక్షలు చేయాలి. మాటల ద్వారానే కాదు.. సైగల ద్వారా చెప్పొద్దు అవసరం ఉన్నా.. లేకున్నా వైద్యులు స్కానింగ్ చేసి శిశువు లింగాన్ని నిర్ధరించడం ఎంత తప్పో.. శిశువు లింగ నిర్ధరణ కోసం వైద్యులపై ఒత్తిడి తెచ్చి స్కానింగ్ పరీక్ష చేయించుకోవడం కూడా అంతే తప్పు. కాబట్టి వైద్యులకు ఏ విధమైన శిక్షలు వేస్తారో.. కోరిన వారికీ అవే శిక్షలు ఉంటాయి. సాధారణంగా స్కానింగ్ వైద్య పరీక్షలు చేయించుకున్న మహిళ ఆమె భర్త బలవంతంపైనే అలా చేసిందని చట్టం భావిస్తుంది. కనుక ఈ చట్టం ప్రకారం ఆమెకాకుండా పరీక్ష చేయించుకోవాలని బలవంతపెట్టిన భర్త నేరస్తుడవుతారు. కడుపులో పెరుగుతున్న పిండం ఆడా.. మగా అనే విషయాన్ని సదరు మహిళకు గానీ, వారి బంధువులకు గానీ మాటల ద్వారా, సైగల ద్వారా చెప్పొద్దు. పిండం ఎదుగుదల సరిగ్గా లేక తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయాల దృష్ట్యా పరీక్షలు జరపాల్సి వస్తే.. ఆ విషయాలను వైద్యులు ఆమెకు అర్థమయ్యే భాషలో వివరించి, ఆమె నుంచి రాతపూర్వకమైన హామీని తీసుకున్న తర్వాతే స్కానింగ్ చేయాలి. ఎలాంటి శిక్ష విధిస్తారు.. లింగ నిర్ధరణ పరీక్షలు నిర్వహించిన డాక్టర్కు.. పరీక్షలు జరిపిన ఇతర వైద్య సిబ్బందికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, అదే నేరాన్ని మళ్లీ చేస్తే ఐదేళ్ల వరకు జైలు, రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. వైద్యులు జైలు శిక్షను అనుభవిస్తే వారి గుర్తింపును రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నుంచి రెండేళ్ల వరకూ తొలగించొచ్చు. తద్వారా డాక్టర్లు ఇతర చోట వైద్య వృత్తిని చేపట్టడానికి వీలులేదు. రెండో పర్యాయం కూడా శిక్ష పడితే మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నుంచి అతని పేరు శాశ్వతంగా తొలగించొచ్చు. గర్భంతో ఉన్న మహిళకు ఇష్టం లేకుండా గర్భస్రావం చేస్తే అందుకు బాధ్యులైనవారికి జీవితకాలం శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. స్కానింగ్ చేపడుతూ పుట్టబోయే శిశువు ఎవరో ముందుగానే చెప్పే ఆసుపత్రుల, జెనెటిక్ లాబోరేటరీల గుర్తింపును రద్దు చేస్తారు. ఫిర్యాదు ఇలా చేయొచ్చు గర్భస్థ శిశువు లింగ నిర్ధరణ పరీక్షలను ఆపడానికి కేంద్ర, రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ మండళ్లను ఏర్పాటు చేసింది. జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎస్పీలు పర్యవేక్షక అధికారులుగా ఉంటారు. వీరికి ఫిర్యాదు చేయవచ్చు. స్వతంత్ర వ్యక్తులు, స్వచ్చంధ సంస్థలు తమకు తెలిసిన సమాచారాన్ని ముం దుగా పర్యవేక్షణ మండలికి తెలియజేయాలి. 15 రోజుల తర్వాత ఫిర్యాదు అందించొచ్చు. పరీక్షలు చేస్తామని ప్రచారం చేయడమూ నేరమే.. లింగ నిర్థరణ పరికరాలు తమ వద్ద ఉన్నట్లు వ్యక్తిగానీ, సంస్థగానీ, జన్యు సలహా కేంద్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేసుకోరాదు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే మూడేళ్లవరకు జైలు, రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. సంబంధిత అథారిటీ వద్ద రిజిస్ట్రేషన్ పొందనిదే గర్భస్థ పరీక్షలు, లింగ నిర్ధరణకు ఉపయోగించే పరికరాలు స్కానర్, అల్ట్రాసౌండ్, ఇమేజింగ్ తదితర పరికరాలను ఎవరు కలిగి ఉండరాదు, ఉపయోగించరాదు. ప్రతి జెనెటిక్ ల్యాబోరేటర్ ఈ చట్టం కింద రిజిష్టర్ అయి ఉండాలి. చట్టం సూచించిన నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దుతో పాటు సస్పెండ్ చేయొచ్చు. -
రీడింగ్ లెక్క.. ఇక పక్కా!
– విద్యుత్ వినియోగం నమోదుకు స్కానింగ్ పరికరాలు – అక్రమ రీడింగ్లకు కళ్లెం వేసేందుకు యత్నం నల్లజర్ల : విద్యుత్ వినియోగం నమోదు వివరాలు తీసే రీడర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యుత్ శాఖ నడుం బిగించింది. విద్యుత్ బిల్లుల రీడింగ్ తీసేందుకు స్కాన్ పరికరం ఏర్పాటు చేసింది. దీంతో వినియోగదారుడు వాడిన ప్రతి యూనిట్కు పక్కగా బిల్లు వస్తుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఇలా.. విద్యుత్ మీటర్ రీడింగ్ను విద్యుత్ శాఖ నియమించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు తీస్తున్నారు. ఆయా తేదీలను బట్టి ప్రతి ఇంటికీ, దుకాణాలు, సంస్థలకు వెళ్లి మీటర్ రీడింగ్ యూనిట్ల సంఖ్యను ట్యాబ్లో నమోదు చేయడం ద్వారా బిల్లు ఇస్తున్నారు. ఈ సమయంలో ఒక్కోసారి కటి, రెండు యూనిట్ల అటుఇటు జరిగితే ధరల శ్లాబులు మారిపోతున్నాయి. ఉదాహరణకు ఒక ఇంటికి నెలలో విద్యుత్ వినియోగం 101 యూనిట్లు ఉంటే 99 యూనిట్లుగా నమోదు చేస్తే బిల్లులో దాదాపు రూ.50 వరకు తేడా వస్తుంది. 99 యూనిట్లు ఉన్న వారికి పొరపాటున ఎక్కువ నమోదు చేసినా బిల్లులో తేడా వస్తుంది. ఒకటి, రెండు యూనిట్ల తేడాలో ధరల్లో వ్యత్యాసం వస్తోంది. దీంతో సంస్థతో పాటు వినియోగదారుడూ నష్టపోతున్నారు. కొందరు వ్యక్తులు, సంస్థలకు చెందిన వారు రీడింగ్ తీసే సిబ్బందితో ‘మామూలు’గా పరిచయాలు పెంచుకుని మీటర్ రీడింగ్లో వ్యత్యాసాలు చూపిస్తున్నట్టు విద్యుత్ అధికారులు గుర్తించారు. చాలా చోట్ల ఈ పరిస్థితులు ఉండడంతో ఇందుకు పరిష్కారంగా స్కానింగ్ యంత్రాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఇక నుంచి ఇలా.. ఇప్పటి వరకు రీడింగ్లో తలెత్తుతున్న లోపాలను గ్రహించిన విద్యుత్ సంస్థ అన్ని గ్రామాల్లో ఐఆర్ఫోర్టు మీటర్లు అమర్చారు. విద్యుత్ రీడింగ్ తీసే రీడర్ స్కానర్ పరికరాన్ని మీటరు ముందు పెడితే ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగించారన్న విషయాన్ని స్కాన్ చేస్తుంది. వినియోగించిన యూనిట్లకు బిల్లు వస్తుంది. ఈ స్కానింగ్ రిపోర్టు అధికారులతో పాటు ఆన్లైన్లో నమోదవడంతో రీడర్ల అక్రమాలకు చెక్ పడుతుంది. యూనిట్లలో తేడాకు అవకాశం ఉండదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రీడింగ్కు స్కానర్ ఉపయోగించడం ద్వారా అటు సంస్థకు, ఇటు వినియోగదారుడికి నష్టం వచ్చే అవకాశం ఉండదని ఆ శాఖ అధికారులు తెలిపారు. -
యాహూ సీక్రెట్ స్కానింగ్ సంచలనం?
శాన్ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్ దిగ్గజం యాహూ ఇంక్ మరోసారి చిక్కుల్లో పడింది. అమెరికా ప్రభుత్వ నిఘా అధికారులతో కలిసి కస్టమర్ ఇ-మెయిల్స్ ను స్కాన్ చేసిన యాహూ గూఢచర్యం చేసిందనే వార్తలు గుప్పుమన్నాయి. దీని కోసం ఏకంగా ఒక సాఫ్ట్ వేర్ ను తయారు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారుల ఆదేశాల మేరకు, వినియోగాదారుల ఈ-మెయిల్ ఖాతాలకు వచ్చే సమాచారాన్ని తస్కరించేందుకు యాహూ గత సంవత్సరం ఓ సాఫ్ట్ వేర్ ను తయారుచేసిందని, దీని సాయంతో రహస్యంగా అన్ని యాహూ మెయిల్ ఖాతాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం డిమాండ్ కు కట్టుబడి వందల మిలియన్ల యాహూ మెయిల్స్ స్కానింగ్ చేసినట్టు సమాచారం. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ఆదేశం మేరకు ఖాతాలను హ్యాక్ చేస్తోందని ముగ్గురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. సందేశాలను శోధించడం కోసం నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ, ఎఫ్బీఐ అధికారుల కోసం యాహూ ఈ పని చేస్తోందని సంస్థను వీడిన ఈ ముగ్గురు ఉద్యోగులు వెల్లడించారు. అధికారులు చెప్పిన కొన్ని పదాలు, సంకేతాల కోసం యాహూ యూజర్లకు వస్తున్న మెయిల్స్ మాత్రమే ఈ సాఫ్ట్ వేర్ సాయంతో స్కాన్ అవుతున్నాయని, అప్పటికే స్టోర్ అయివున్న మెసేజ్ లను స్కానింగ్ చేయడం లేదని వివరించారు. అలాగే కొన్ని ఎంపిక చేసిన ఖాతాలపై పూర్తి నిఘా ఉంచేందుకూ యాహూ అంగీకరించలేదని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ అధికారి వెల్లడించారు. వీరు అందించిన సమాచారం ప్రకారం, యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మరిస్సా మేయర్ ఈ నిర్ణయాన్ని కొందరు సీనియర్ అధికారులు వ్యతిరేకించారనీ, ప్రస్తుతం ఫేస్ బుక్ టాప్ భద్రతా ఉద్యోగిగా వున్న , యాహూ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ అలెక్స్ స్టామోస్ జూన్ 2015 సం.రంలో సంస్థ నుంచి నిష్క్రమణకు దారితీసింది. అయితే, యాహూ దీనిపై స్పందించడానికి నిరాకరించిందింది. అలాగే సంస్థ మాజీ అధికారి స్టామోస్ కూడా ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి ఇష్టపడలేదు. మరోవైపు ఎన్ఎస్ఏ , ఎఫ్ బీఐ ఇదే డిమాండ్ పై గతంలో ఇంటర్నెట్ కంపెనీలు ఆశ్రయించిందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే సాధారణంగా ఎన్ఎస్ఏ , ఎఫ్ బీఐ ద్వారా దేశీయ నిఘా కోసం కొన్ని అభ్యర్ధనలు చేస్తుందని, ఏ ఏజెన్సీ సమాచారాన్ని కోరి ఉంటుందనేది తెలుసుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ అధికారులకు ఉపకరించేలా యాహూ రహస్యంగా సదరు సమాచారం సేకరించిందా? గూగుల్, రెడిఫ్ లాంటి ఇతర ఈ-మెయిల్ సేవల సంస్థలనూ ఇలాగే నిఘా వర్గాలు కోరాయా? అన్నది తెలియాల్సివుందని అభిప్రాయపడుతున్నారు. -
వేలి ముద్రల స్కాన్తో జీవితాలనే రక్షించవచ్చు
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3,53,000 శిశువులు జన్మిస్తున్నారు. వీరు ఎక్కువగా వర్ధమాన దేశాల్లోనే పుడుతున్నారు. ఈ దేశాల్లో సరైన వైద్య సౌకర్యాలు అందక, పౌష్టికాహార లోపం వల్ల ఏడాదికి ఐదేళ్ల లోపు పిల్లలు 50 లక్షల మంది మరణిస్తున్నారు. వీరిలో కూడా ఎక్కువ మంది అందుబాటులోవున్న వ్యాక్సిన్ల తీసుకోక పోవడం వల్లనే మృత్యువాత పడుతున్నారు. పిల్లల్లో ఇలాంటి మరణాలను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలతోపాటు పలు స్వచ్ఛంధ సంస్థలు కృషి చేస్తున్నా ఆశించిన ఫలితం ఉండడం లేదు. పిల్లలకు సంబంధించిన మెడికల్ డాటాను అందుబాటులో లేకపోవడం, ఎవరు వ్యాక్సిన్లు తీసుకున్నారో, ఎవరు తీసుకోలేదో, వారెక్కడున్నారో తెలియకపోవడమే అందుకు కారణం. పిల్లల వేలి ముద్రలను స్కాన్ చేయడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి ఇట్టే బయట పడవచ్చని మిచిగాన్ యూనివర్శిటీలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అనిల్ జైన్ తెలిపారు. ఏడాది నిండిన పిల్లల వేలి ముద్రలను స్కాన్ చేసినట్లయితే వాటి ద్వారా వారిని జీవితాంతం నూటికి నూరు శాతం కచ్చితంగా గుర్తుపట్టవచ్చని ఆయన చెప్పారు. ఏడాది లోపు, ఆరు నెలలపైబడిన పిల్లల వేలి ముద్రలను స్కాన్చేస్తే అవి నూటికి 99 శాతం ట్యాలీ అవుతాయని చెప్పారు. పిల్లల వేలి ముద్రలను చిన్పప్పుడే స్కాన్ చేయడం వల్ల వైద్య ప్రయోజనమే కాకుండా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలు మానవ అక్రమ రవాణాకు గురైనా, తప్పిపోయినా, కిడ్నాపైనా వేలి ముద్రల స్కానింగ్ ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత్లో అమలు చేస్తున్న ఆధార్ కార్డుల్లాగా కూడా ఓ జాతీయ గుర్తింపుగా పిల్లల వేలి ముద్రల స్కాన్ డాటా ఉపయోగపడుతుంది. ‘శరణు ఆశ్రమం ఆస్పత్రి’లో ఎన్జీవో సంస్థ ఆశ ఇటీవల 309 మంది పిల్లల వేలి ముద్రలను స్కాన్ చేసి భద్రపర్చిందని ఎన్జీవో సీఈవో సందీప్ అహూజా తెలిపారు. పిల్లల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, వారి వద్దకు ఆరోగ్య కార్యకర్తలను పంపించేందుకు ఈ డాటా తమకు ఎంతో ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. టీకాలు వేయించక పోవడం వల్ల, పౌష్టికాహార లోపం వల్ల మృత్యువాత పడే పిల్లలను ఈ డేటాను ట్రాక్ చేయడం వల్ల రక్షించవచ్చని ఆయన తెలిపారు. ‘బిల్ అండ్ మిలిండ గేట్ ఫౌండేషన్’ సహకారంతో తాము ఈ వేలి ముద్రల డేటాను సేకరిస్తున్నామని ఆయన చెప్పారు. -
‘స్కానింగ్’ తిప్పలు
వందలకొద్దీ ఫైళ్లు గంటల తరబడి నిరీక్షిస్తున్న ఉద్యోగులు ఇందూరు : జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా మొన్నటి వరకు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు ఫైళ్లతో కుస్తీ పడితే... ఇప్పుడు వాటిని స్కానింగ్ చేయించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. జిల్లాల విభజన గడువు సమీపిస్తుండడంతో ఉరుకులు పరుగుల మీద పనులు చేస్తున్నారు. అయితే కలెక్టరేట్ పరిపాలన విభాగంలో మాత్రమే స్కానింగ్ యంత్రాలున్నాయి. ఇతర కార్యాలయాల్లో సరైన పరికరాలు లేకపోవడంతో.. వారం క్రితం కలెక్టర్ కార్యాలయంలోని అక్షర ప్రణాళిక భవన్ వద్ద రెండు స్కానింగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్ల నిర్వహణ బాధ్యతలను కలెక్టరేట్ అధికారులు టెండర్లు నిర్వహించి ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులు ఫైళ్లను తీసుకుని వచ్చి ఆయా కౌంటర్ల వద్ద స్కానింగ్ చేయిస్తున్నారు. అయితే రెండే కౌంటర్లు ఉండడంతో పని వేగంగా జరగడం లేదు. దీంతో ఉద్యోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఒక్కో శాఖలో వందల ఫైళ్లు సుమారు వారం రోజుల పాటు ఆయా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు శ్రమించి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వారీగా ఫైళ్లను విభజించారు. సుమారు నాలుగు దశాబ్దాల ఫైళ్లను స్కానింగ్ చేయిస్తున్నారు. ఒక్కో శాఖలో వందల సంఖ్యలో ఫైళ్లున్నాయి. వాటిని అన్నింటినీ స్కానింగ్ చేసి ఆన్లైన్లో నమోదు చేయడం ఉద్యోగులకు కత్తిమీద సాములా తయారయ్యింది. రెండే కౌంటర్లు ఉండడంతో గంటలకొద్దీ సమయం స్కానింగ్ కౌంటర్ వద్దే గడిచిపోతోందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు జిల్లాల విభజన గడువు సమీపించడంతో ఒత్తిడి పెరుగుతోందంటున్నారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తే పనిలో వేగం పెరుగుతుందంటున్నారు. -
నేడు స్కాన్ సెంటర్ల బంద్
స్తంభించనున్న రేడియాలజీ సేవలు అమలాపురం టౌన్ : లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించేందుకు ఏర్పాౖటెన ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటర్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ (పీసీ అండ్ పీఎన్డీటీ) నిబంధనలు మార్పు చేయాలని డిమాండు చేస్తూ ఇండియన్ రేడియాలాజికల్, ఇమేజింగ్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో గురువారం స్కాన్ సెంటర్లు బంద్ పాటిస్తున్నాయి. దీంతో రేడియాలజీ సేవలు ఒక్క రోజు పాటు స్తంభించనున్నాయి. ఈ బంద్లో భాగంగా కోనసీమ కేంద్రం అమలాపురంలోని రేడియాలజీ సేవలను గురువారం నిలుపుదల చేసి స్కాన్ సెంటర్లు మూసివేసి బంద్ పాటిస్తున్నట్లు పట్టణానికి చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్లు డాక్టర్ నిమ్మకాయల రామమూర్తి, డాక్టర్ యెనుముల నరసింహరావు, డాక్టర్ వైటీ నాయుడు, డాక్టర్ వి.శారద విలేకరులకు తెలిపారు. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్లో ఉన్న చిన్న చిన్న తప్పిదాలకు జైలు శిక్ష విధించే నిబంధనలు మార్పు చేయాలని వారు డిమాండు చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తాము వ్యతిరేకం కాదన్నారు. చట్టంలో అవసరం లేని నిబంధనలు చేర్చి ఇబ్బందులకు గురి చేయటం తగదని స్పష్టం చేశారు. -
కడుపులోనే కరిగిపోతోంది!
భ్రూణ హత్యలు – రెండేళ్లలో 30 ఘటనలు వెలుగులోకి.. – యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు – అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు – పట్టనట్లుగా వైద్య ఆరోగ్య శాఖ – నాలుగేళ్ల కాలంలో నాలుగే కేసులు – తనిఖీలు నామమాత్రం ఇంటికి వెలుగునిచ్చే బంగారుతల్లి భూమ్మీదకు రాకుండానే చీకట్లో కలిసిపోతోంది. అంతరిక్షంలోకి వెళ్లొస్తున్నా సమాజం ఇప్పటికీ ఆడ..పిల్లగానే పరిగణిస్తోంది. క్రీడా పతకాల్లో సాటి లేదని చాటుతున్నా.. చదువులో పోటీ పడుతున్నా.. రాణించని రంగం అంటూ లేదని నిరూపిస్తున్నా.. ఎదిగిన కొద్దీ ఆమె గుండెలపై కుంపటిగానే మిగిలిపోతోంది. పున్నామ నరకం తప్పిస్తాడనుకునే కుమారుడు.. నిర్దయగా వీధిన నిలబెడుతున్నా గారాల బిడ్డడే. అదే అమ్మానాన్నకు చిన్న కష్టమొచ్చినా కన్నీరు పెట్టుకునే కూతురు మాత్రం కడుపులోనే కరిగిపోతోంది. కర్నూలు(హాస్పిటల్): ఆడపిల్ల కడుపున పడిందని తెలిస్తే చాలు.. నిర్దాక్షిణ్యంగా కడతేరుస్తున్నారు. కొందరు వైద్యులు.. ఆర్ఎంపీలు.. ఆశా వర్కర్లు.. ఏఎన్ఎంలు ఈ ఘాతుకాన్ని ప్రోత్సహిస్తున్నారు. రెండు రోజుల క్రితం మంత్రాలయం మండలంలోని మాధవరంలో ఓ గర్భస్థ ఆడ శిశువు చెత్తకుప్ప పాలైన ఘటన ఇందుకు తాజా ఉదాహరణ. జిల్లాలో 190 పైగా అధికారింగా అనుమతి పొందిన స్కానింగ్ సెంటర్లు ఉండగా.. అనుమతి లేకుండా రెట్టింపు సంఖ్యలో వైద్యులు, ఆర్ఎంపీలు ఇలాంటి సెంటర్లను నిర్వహిస్తున్నారు. పాతబడిన స్కానింగ్ యంత్రాలను వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించకుండా ఆర్ఎంపీలకు అమ్ముకుంటున్నారు. దీనికి తోడు కొత్త వాటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వైద్య ఆరోగ్యశాఖలో పెద్దతంతుగా భావించి.. అనుమతి లేకుండానే స్కానింగ్ చేసేస్తున్నారు. ఈ విషయం సంబంధిత శాఖాధికారులకు తెలిసినా మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 400 దాకా స్కానింగ్ సెంటర్లు ఉన్నా అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీలు చేసినా స్కానింగ్ నిర్వాహకులకు అనుకూలంగా నివేదికలు రాస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కాలంలో జిల్లాలో 4 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ శిక్ష పడలేదు. భ్రూణహత్యలు జరిగాయనే సమాచారం తెలియగానే అక్కడికి వెళ్లి విచారణ చేసి, నివేదికను జిల్లా కలెక్టర్కు పంపించాలి. కానీ ఈ తంతు తూతూమంత్రంగా సాగుతోంది. నామమాత్రంగా కమిటీల నిర్వహణ 2012 సంవత్సరానికి ముందు పీసీ పీఎన్డీటీ యాక్ట్ను అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్గా కమిటీ ఉండేది. అందులో అధిక భాగం వైద్యులే ఉండేవారు. ఆ తర్వాత అప్రాప్రియేట్ కమిటీలు ఏర్పాటు చేశారు. జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఈ కమిటీలు రూపుదిద్దుకున్నాయి. ఇందులో రెవెన్యూ, పోలీస్, న్యాయాధికారులు, వైద్యాధికారులతో పాటు ఎన్జీఓలు ఉంటారు. ఆరు నెలల క్రితం స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలని నోడల్ అధికారులకు ఆదేశించారు. వీరు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 30 మంది శిశువులు చెత్తకుప్పల పాలు జిల్లాలో రెండేళ్ల కాలంలో 30 మందికి పైగా గర్భస్త శిశువులు చెత్తకుప్పల పాలైనట్లు సమాచారం. 2015 అక్టోబర్ 12న మద్దికెరలో, జులై 18న కర్నూలులోని హంద్రీబ్రిడ్జి వద్ద, జూన్ 26న అశోక్నగర్లోని రైల్వేబ్రిడ్జి వద్ద, అదే నెల 19న కేసీ కెనాల్లో, 9న జొహరాపురం రోడ్డులో, మే 30న ఆదోనిలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద, ఫిబ్రవరి 21న కర్నూలులోని మద్దూర్నగర్ వద్ద ఒకటి, నంద్యాలలో జనవరి 17న రెండు, అదేరోజు కలెక్టరేట్ సమీపంలో ఒకటి శిశువుల మతదేహాలు లభించాయి. 2016లో జనవరి 23న కోడుమూరులో ఒకటి, ఫిబ్రవరి 10న కర్నూలులోని కల్లూరు బ్రిడ్జి వద్ద నాలుగు మతదేహాలను గుర్తించారు. ఇంకా వెలుగులోకి రాని ఎన్నో గర్భశిశువులు కుక్కలు, పందుల పాలయ్యాయి. గర్భవతికి స్కానింగ్ చేసే పరిస్థితులు జన్యు జనితమైన జీవకణాల్లో కలిగే అసాధారణ మార్పు గుర్తింపు, చికిత్స అసాధారణ జన్యు పరిస్థితి గుర్తింపు, చికిత్స ఎర్రకణాల్లో అసాధారణ స్థితి గుర్తింపు, చికిత్స లింగ సంబంధిత వ్యాధుల గుర్తింపు, చికిత్స స్కానింగ్కు చట్టం ఆమోదించే పరిస్థితులు గర్భధారణ జన్యు సంబంధమైన పిండానికి వ్యాధులు కనుగొనేందుకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తారు. గర్భిణిల వయస్సు 35 సంవత్సరాలు మించరాదు. ఆమెకు రెండు, అంతకన్నా ఎక్కువసార్లు గర్భస్రావం, పిండ నష్టం జరిగినప్పుడు. గర్భిణిలు హానికారక మందులు, అణుధార్మికశక్తి, రసాయనాల భారిన పడినప్పుడు, దాని ప్రభావం కలిగినప్పుడు. గర్భిణి, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మానసిక బుద్ధిమాంధ్యం, శారీరక వైకల్యాలు, జన్యుసంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు. లింగ నిర్ధారణ చేస్తే జైలుకే.. భ్రూణహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో పీసీ పీఎన్డీటీ యాక్ట్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగనిర్ధారణ చేసినా, గర్భస్రావాలు చేయించినా ఇరువర్గాలను శిక్షించే వీలుంది. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్ల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారు. స్కానింగ్, అబార్షన్ చేసిన సదరు వైద్యుల పేరును భారత వైద్యవిధాన మండలి నుంచి తాత్కాలికంగా, కొన్నిసార్లు శాశ్వతంగా తొలగిస్తారు. భ్రూణ హత్యలు చేస్తే కఠిన చర్యలు లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయడం, లింగనిర్ధారణలో కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తేలితే భ్రూణ హత్యలు చేయడం నేరం. పీసీ పీఎన్డీటీ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్ ప్రకారం కూడా ఇది నేరం. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిపై రెండు కేసులనూ నమోదు చేస్తాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారం కోరితే భ్రూణ హత్యలు చేసే ఆస్పత్రులపై దాడులు చేసేందుకు ఏ క్షణంలోనైనా సిద్ధం. – ఆకె రవికృష్ణ, జిల్లా ఎస్పీ -
‘లింగ నిర్ధారణ’పై విచారణ పూర్తి!
వైద్య ఆరోగ్య శాఖాధికారులపై ఒత్తిళ్లు కేసును నీరుగార్చేందుకు కుట్ర కలెక్టర్ నిర్ణయం మేరకే చర్యలు అనంతపురం సిటీ : నగరంలోని లింగ నిర్ధారణ చేస్తూ పట్టుబడిన ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం కేసు విచారణ పూర్తయినట్లు తెలిసింది. విచారణ నివేదిక బుధవారం కలెక్టర్ కార్యాలయానికి చేరినట్లు సమాచారం. అయితే అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నది ఇక కలెక్టర్దే అంతిమ నిర్ణయం. వివరాల్లోకెళితే.. అనంతపురం రూరల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ మొదటి కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రెండోసారి గర్భం దాల్చిన ఆమె తనకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని నిర్థారించుకునేందుకు ఏప్రిల్ ఒకటో తేదీన నగరంలోని అహ్మద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులను ఆశ్రయించింది. కాగా అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యురాలు లక్ష్మీకాంతం సూచనల మేరకు రెండో తేదీన లింగనిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో గర్భంలో ఉన్నది ఆడ శిశువని తేలింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. మూడో తేదీన గర్భస్రావం (అబార్షన్) చేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఇదే సమయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ ఆకస్మిక తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘించడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో నలుగురు ప్రముఖ వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయించారు. ఈ విచారణలో వైద్యురాలు ‘ఆక్సీటోసిన్’ని అనే గర్భస్రావం జరిగేందుకు వినియోగించినట్లు తెలిసింది. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలన్న జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు దర్యాప్తుని ముమ్మరం చేశారు. సరిగ్గా మూడు నెలల్లో విచారణను పూర్తి చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేత ఒకరు రంగంలోకి దిగి వైద్యాధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలిసింది. -
హైటెక్ పెన్ వచ్చేసింది!
వర్చువల్ రియాల్టీ కెమెరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా సహజంగా దృశ్యాలను సాక్షాత్కరింపజేసే ఎన్నో ఆధునిక పరికరాలూ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. అయితే మనం అనుకున్న, కనిపించిన రంగును స్కాన్ చేసి తనలో నింపుకునే ఆధునిక పరిజ్ఞానంతో కూడిన స్మార్ట్ పెన్ ఇప్పుడు మనముందుకొచ్చేసింది. చిత్రకారులు, డిజైనర్లు తమకు కావలసిన రంగులను ఎలాంటి మిక్సింగ్ లేకుండానే రూపొందించుకొని, కాన్వాస్ పై కళారూపాలను చిత్రించే అవకాశం దగ్గరలోనే ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి కలర్ పికింగ్ పెన్ అందుబాటులోకి వచ్చేసింది. కుంచె, రంగుల అవసరం లేకుండానే ప్రకృతి చిత్రాలను, కళారూపాలను ఆవిర్భవింపచేసే అవకాశం కనిపిస్తోంది. మనకు దగ్గరలో కనిపించిన ఏ వస్తువునైనా స్కాన్ చేసి, దాని రంగును తనలోకి తీసుకోగలిగే ఈ హైటెక్ పెన్ ఇప్పుడు కళాకారులకు సైతం ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ పెన్ లో పొందుపరచిన కలర్ సెన్సార్, మైక్రో ప్రాసెసర్లు మనం అనుకున్న రంగులను గుర్తించి స్కాన్ చేస్తాయి. ఆకులు, పూలు, పళ్ళు వంటి రంగురంగుల ప్రకృతి దృశ్యాలతోపాటు ఎటువంటి వస్తువు పైన పెట్టినా.. పెన్ లోని సెన్సార్ ఆ వస్తువులోని రంగును స్కాన్ చేసి, అదే రంగును షేడ్ తో సహా మనకు అందిస్తుంది. చిత్రాన్ని స్కాన్ చేసుకున్న అనంతరం పిక్చర్ లోని కలర్ కు అనుగుణంగా పెన్ లోని స్మార్ట్ ఇంక్ కాట్రిజ్ రంగులను మార్చుకుంటుంది. ఈ కాట్రిజ్ లో ఉండే ఇంకుతో మైళ్ళకొద్దీ రాసేందుకు వీలవుతుందని సృష్టికర్తలు చెప్తున్నారు. అంతేకాదు ఈ స్క్రిబుల్ పెన్ ఇంక్.. నీటిని పీల్చదని, వెలిసిపోదని చెప్తున్నారు. ఈ స్మార్ట్ పెన్ కూడ రెండు రకాలుగా మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని, ఒకటి.. నిజమైన ఇంకుతో పేపర్ మీద రాసుకునేందుకు వీలుగానూ, మరోటి చిత్రాలను స్కాన్ చేసి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లలో వాడుకునేందుకు గాను వీలుంటుందంటున్నారు. యూఎస్బీ కేబుల్ తో ఒకసారి ఛార్జింగ్ పెడితే ఏడు గంటల పాటు పని చేస్తుందని చెప్తున్నారు. 249 డాలర్లతో అంటే సుమారు 17 వేల రూపాయలతో ఈ స్మార్ట్ పెన్ ను ఆన్ లైన్లో ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉన్నట్లు వెబ్ సైట్లో వివరించారు. -
నకిలీ నోట్ల కేసులో ఇద్దరి అరెస్ట్
స్కానర్, నకిలీ నోట్లు స్వాధీనం కేకే.నగర్: తిరునెల్వేలి మేల్పాళయంలో నకిలీ నోట్లను ముద్రించి చ లామణికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారి నుంచి స్కానర్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. తిరునెల్వేలి మేలపాళయం, కొత్త బస్టాండు ప్రాంతంలో సోమవారం పోలీసులు గస్తీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో అనుమానాస్పద రీతిలో నిలబడి ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. వారి వద్ద గల బ్యాగును పోలీసులు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆ బ్యాగులో వంద రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకుని తిరునెల్వేలి నగర నేర విభాగ పోలీసు సహాయ కమిషనర్ మారిముత్తు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తరువాత వారిద్దరి వద్ద పోలీసులు విచారణ జరిపారు. విచారణలో వారు మేల్పాళయం ఆమ్ పురం 5వ వీధికి చెందిన కాశిమే బషీర్ కుమారుడు తమిమ్ అన్సారి (34) పేటై టీచర్స్ కాలనీకి చెందిన రహమతుల్లా (31) అని తెలిసింది. ఈ ఇద్దరూ మేలపాళయంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ నకిలీ నోట్లు ముద్రించి వాటిని చలామణి చేయడానికి వెళుతున్న సమయంలో పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. దీంతో పోలీసులు మేలపాళయం ఫాతిమానగర్కు వారిని పిలుచుకుని వెళ్లి వాళ్లు అద్దెకు తీసుకున్న ఇంట్లో సోదా చేశారు. ఆ ఇంట్లో రూ.500ల విలువైన 300ల నోట్ల కట్టలు కనిపించాయి. ఇంకనూ నకిలీనోట్ల తయారీకి ఉపయోగించిన స్కాన్, ప్రింటర్ మిషన్, పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్సారి, రహమతుల్లాలను అరెస్టు చేసిన పోలీసులు వారివద్ద గల రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నెల్లై నగర పోలీసు కమిషనర్ తిరుజ్ఞానం మాట్లాడుతూ నకిలీ నోట్లు చలామణి అవుతున్నట్లు తమకు అందిన రహస్య సమాచారం మేరకు పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి లక్షా 50వేల రూపాయలు విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా స్కాన్, ప్రింటర్, పేపర్లను రెండు మోటారు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
తిప్పి.. తిప్పి చంపేస్తారు
నిమ్స్ ట్రామా సెంటర్లో అవస్థలు అందుబాటులో లేని స్కానింగ్ పరికరాలు టెస్టుల పేరుతో క్షతగాత్రులను తిప్పుతున్న వైద్యులు గగ్గోలు పెడుతున్న రోగులు సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నిమ్స్కు వస్తున్న క్షతగాత్రులకు ప్రాణాలతో ఉండగానే నరకం కనిపిస్తోంది. గాయపడిన వారితో పాటు వారి వెంట ఉండే బంధువులకు సైతం ఈ పాట్లు తప్ప డం లేదు. ప్రమాదంలో గాయపడి ఇక్కడి అత్యవసర విభాగానికి చేరుకోగానే శరీరంలో ఏయే భాగాల్లో గాయాలయ్యాయో తెలుసుకునేందుకు వైద్యులు సీటీస్కాన్, ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు. పొత్తికడుపులో తగిలి న దెబ్బలను గుర్తించేందుకు అల్ట్రాసౌండ్ టెస్టుకు సిఫా ర్సు చేస్తారు. కానీ ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (నిమ్స్)లో సకాలంలో ఈ సేవలు అందక క్షతగాత్రులు మృత్యవాత పడుతున్నారు. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ ట్రామా సెంటర్లో సీటీస్కాన్, ఎంఆర్ఐ, ఆల్ట్రా సౌండ్ యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. అత్యవసర సెంటర్లో ఉండాల్సిన పరికరాలు పాత భవనంలో ఉన్నాయి. దీంతో వచ్చిన క్షతగాత్రులను ఇటూ అటూ తిప్పుతున్నారు. ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 70-80 కేసులు వస్తుంటాయి. వీరిలో వివిధ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారే ఎక్కువ. గాయాల తీవ్రతను గుర్తించాకే వైద్యం చేస్తారు. అందుకోసం బాధితులకు సీటీస్కాన్, ఎంఆర్ఐ విధిగా చేస్తారు. బతికుండగానే నరకం.. నిమ్స్ ట్రామా సెంటర్లో ఉండాల్సిన సీటీ, ఎంఆర్ఐ, ఆల్ట్రా సౌండ్ మిషన్లు పాత భవనంలోని రేడియాలజీ విభాగంలో ఉన్నాయి. తీసుకొచ్చిన క్షతగాత్రులను టెస్టుల కోసం ట్రామా సెంటర్ నుంచి పాత భవనానికి పంపుతున్నారు. అసలే విరిగి వేలాడుతున్న ఎముకలు, ఆపై భరించలేనినొప్పితో బాధపడుతున్నవారు అత్యవసర విభాగం నుంచి పాత భవనంలోని రేడియాలజీ విభాగానికి పదేపదే తరలించాల్సి రావడంతో గగ్గోలు పెడుతున్నారు. వారితో పాటు వెంట వచ్చిన బంధువులు సైతం తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా హెడ్, స్పైన్ ఇంజ్యురీతో బాధపడుతున్న బాధితులు చిత్రవధ అనుభవిస్తున్నారు. పుష్కలంగా నిధులున్నా.. స్వయం ప్రతిపత్తి కలిగిన నిమ్స్కు నిధులకు కొదవ లేదు. ప్రభుత్వం ఏటా బడ్జెట్లో భారీగానే కేటాయిస్తోంది. దీనికి తోడు రోగుల నుంచి కోట్ల రూపాయాల ఆదాయం సమకూరుతోంది. ఈ నిధులు ఖర్చు చేసి ట్రామా సెంటర్లోని బాధితుల కోసం సీటీ, ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ మిషన్లు కొనుగోలు చేయవచ్చు. ఎంఆర్ఐ మిషన్కు రూ.13 కోట్ల వరకు ఖర్చు అవుతుండగా సింగరేణి యాజమాన్యం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆ మేరకు ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. టెండర్ కాల్ఫర్ చేసే సమయంలో డెరైక్టర్ ఇందుకు నిరాకరించడంతో దాతలనుంచి వచ్చిన విరాళాలు కూడా వెనక్కు వెళ్లిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే రూ.27 కోట్ల విలువైన యంత్రాలకు టెండర్ పిలిచామని, మరో రూ.36 కోట్లతో మరిన్ని వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నట్లు నిమ్స్ యాజమాన్యం చెబుతుండడం కొసమెరుపు. -
కొవ్వును గుర్తించే కొత్త సాధనం!
ప్రస్తుత కాలంలో ఫిట్నెస్ పై ధ్యాస పెరుగుతోంది. మరోవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో శరీరంలో కొవ్వును తగ్గించుకొని, ఆరోగ్యంగా మార్చుకొనేందుకు ఉపయోగపడే అనేక రకాల యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. నాజూకైన శరీరాకృతికి తోడు.. ఆరోగ్యాన్ని సమకూర్చుకునేందుకు అన్నిరకాలుగానూ సహకరిస్తామంటూ అనేక రకాల పరికరాలు హామీలు కూడ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలెస్టరాల్ తో బాధడుతున్న వారికోసం కొత్తగా స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఇది శరీరంలోని కొవ్వును ఇట్టే పసిగట్టేస్తుంది. ఎంతటి వ్యాయామం చేసినా శరీరంలో కొవ్వు తగ్గడం లేదని బాధపడేవారికి మార్కెట్లో ఓ కొత్త గాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు ఇంతకు ముందే మార్కెట్లో ఉన్న ఎన్నో గాడ్జెట్లకు భిన్నంగా కొత్తగా అభివృద్ధి పరచిన ఈ గాడ్జెట్ పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. మన శరీరంలో ఉన్న కొవ్వును ఇట్టే పసిగట్టే ఈ సాధనం వెంటనే మొబైల్ కు మెసేజ్ పంపిస్తుంది. చిన్న చిన్న ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సహాయంతో శరీరంలోని కొవ్వును అంచనా వేసి, కండరాల సామర్థ్యాన్ని కూడ తెలుపుతుంది. ఈ గాడ్జెట్ ఉపయోగించి, దీని ఫలితాలకు అనుగుణంగా ప్రతిరోజూ నిర్వహించే వ్యాయామంలో మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాధారణ మొబైల్ ఫోన్లు, గాడ్జెట్ల వలె కాక ఒక్కసారి రీ ఛార్జ్ చేస్తే చాలు స్కల్స్ట్ చిసెల్ గాడ్జెట్ రెండు వారాల వరకూ పనిచేస్తుంది. అంతేకాక ప్రతిరోజూ వ్యాయామం కోసం జిమ్ లకు, ఫిట్నెస్ ట్రైనర్లకు చెల్లించే ఫీజుతో పోలిస్తే దీని ఖరీదు కూడ చాలా తక్కువగానే ఉంటుంది. సుమారు 89 యూరోల వరకూ ఖరీదు ఉండే ఈ ఎలక్ట్రిక్ పరికరం, ఒరిజినల్ ఐపాడ్ సైజులో ఉంటుంది. -
ఆ పరీక్ష పాసవ్వాల్సిందే..
గర్భిణులకు స్కానింగ్పై వైద్యులకు ప్రభుత్వం నిబంధన సాక్షి, హైదరాబాద్: ఇకపై గర్భిణులకు ఎవరు పడితే వాళ్లు స్కానింగ్ చేయకూడదని, దీనికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇష్టారాజ్యంగా స్కానింగ్ చేయడం, లింగ నిర్ధారణ జరిపి మగబిడ్డా, ఆడబిడ్డా అనేది ముందే చెప్పేస్తుండటంతో.. ఇకపై అల్ట్రాసోనాలజీ (స్కానింగ్) చేయాలంటే ఆయా డాక్టర్లు కచ్చితంగా తాము నిర్వహించే ప్రత్యేక పరీక్షలో పాసవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది. ఒకవేళ పరీక్షలో ఫెయిల్ అయితే 6 నెలల ప్రత్యేక శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ శిక్షణకు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది. వీటి ప్రకారం శిక్షణ పూర్తి చేసుకున్న వైద్యులే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
► కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరిక ► స్కానింగ్ సెంటర్లపై స్పెషల్ డ్రైవ్కు ఆదేశం కర్నూలు(హాస్పిటల్): నింబంధనలను అతిక్రమిస్తున్న స్కానింగ్ సెంటర్స్ నిర్వాహకులపై కఠినంగా వ్యవ హరిం చాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. పీసీ పీఎన్డీటీ చట్టంపై శనివారం ప్రాంతీయ శిక్షణా కేం ద్రం(మేల్)లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుట్టబోయే ఆడబిడ్డను గర్భంలోనే చంపడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పీసీ పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం లింగనిర్ధారణ తీవ్రమైన నేరమని, ఇలాంటి ఉదంతాలను ఉపేక్షించకూడదన్నారు. సోమవారం నుంచి వారం పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి తనకు రహస్యంగా నివేదిక ఇవ్వాలని నోడల్ అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలున్నారన్నారు. ఏపీలో ఈ నిష్పత్తి 1000ః943, జిల్లాలో 1000ః 930గా ఉండడం ఆందోళన కల్గిస్తోందన్నారు. అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ యు. రాజాసుబ్బారావు, సీపీఓ, జెడ్పీ సీఈఓపాల్గొన్నారు. సమావేశం నిర్వహించే పద్ధతి ఇదేనా.. ముందస్తు వివరాలు, చట్టానికి సంబంధించిన కాపీలు, ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా పీసీ పీఎన్డీటీ చట్టంపై నోడల్ ఆఫీసర్లుగా ఉన్న జిల్లా అధికారులకు అవగాహన కార్యక్రమం ఎలా ఏర్పాటు చేశారంటూ జిల్లా కలెక్టర్ మండిపడ్డారు. వారికి ప్రొసీడింగ్స్, జాబ్చార్ట్, పీసీ పీఎన్డీటీ చట్టానికి సంబంధించిన వివరాలు సోమవారంలోగా అందించాలని కోరారు. -
బ్రహ్మాండ మోసం
మనిషిని దోచుకోవడానికి లక్షమార్గాలున్నాయంటారు.. ఇదిగో మహిళను దోచుకోవడానికి కోటి ఉన్నాయని నిరూపిస్తున్నారు! ఒళ్లు అమ్ముకునేలా చేశారు... ఆ తర్వాత గర్భాన్ని అద్దెకిచ్చేలా చేశారు.. ఇప్పుడు ఏకంగా అండాలనే అమ్ముకునేలా చేస్తున్నారు! ఈ బ్రహ్మాండమోసంపై అవగాహన తెచ్చుకోవడమే కాక నలుగురికీ తెలియజేయడం అవసరమని సాక్షి నమ్ముతోంది! కొన్ని ఆంగ్లపత్రికల్లో మన రాష్ట్రంలో కూడా ఈ వ్యాపారం జరుగుతోందని తరచూ వార్తలు వస్తున్నాయి.. పేదరికం, అజ్ఞానమే ఈ బ్రహ్మాండమోసానికి విత్తులవుతున్నాయి! ఎలా చేస్తారు? ఆరోగ్యకరమైన మహిళ అండాశయం నెలకు ఒక అండాన్నే విడుదల చేస్తుంది. కానీ ఎగ్ డోనర్స్కు గొనాడోట్రాఫిన్స్ అనే హర్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి ఎక్కువ అండాలు విడుదలయ్యేలా చేస్తారు. తర్వాత డోనర్కు అనెస్తీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సహాయంతో నీడిల్ ద్వారా ఈ అండాలను సేకరిస్తారు. ‘పిల్లలు లేని వాళ్లకోసం మందులు, ఇతర అన్నిరకాల సాధారణ పద్ధతులను అవలంబించాక.. అవి ఫలితం చూపించని పక్షంలో చివరి ప్రత్యమ్నాయ ప్రయత్నంగా మాత్రమే ఎగ్ డొనేషన్, సరోగసీ పద్ధతులకు వెళ్లాలి. కానీ మన దేశంలోని చాలా ఐవీఎఫ్ సెంటర్లు కేవలం ఈ రెండు పద్ధతుల మీదనే నడుస్తున్నాయి. వీటి డబ్బు ఆశకు సుష్మలాంటి మైనర్ పిల్లలు బలవుతున్నారు.’ - డాక్టర్ తాన్యా బి. రోహత్గి, మ్యాక్ సూపర్స్పెషాలిటీ హాస్పిటల్, ఢిల్లీ. సరైన మార్గదర్శకాలు లేవు ‘గొనడోట్రోఫిన్ హార్మోన్ ఇంజక్షన్ల మోతాదు విషయంలో పాశ్చాత్యా దేశాల్లోలాగా మన దగ్గర కచ్చితమైన నియమనిబంధనలు లేవు. పైగా ఐసిఎమ్ఆరే ఒక్క సైకిల్లో 14 అండాలను సేకరించవచ్చనే సూచననిస్తోంది. దాంతో వీటి మోతాదు డాక్టర్ల విచక్షణ, నైతికతమీదనే ఆధారపడి సాగుతోంది. అందుకే చాలా ఐవీఎఫ్ సెంటర్లలో ఒక్కసారికే 18 అండాలను సేకరిస్తున్నారు. ఇంకొన్ని సెంటర్లలో అయితే ఈ ఇంజక్షన్ల మోతాదును డేంజర్ లెవెల్స్కి పెంచి ఒకేసారి 50 అండాలను సేకరించే సాహసం కూడా చేస్తున్నారు. ఇదే ఒవేరియన్ హైపర్ స్టిములేషన్కు దారితీస్తుంది. దీనివల్ల డోనర్లో హార్మోన్లు ఇంబాలెన్స్ అయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. - సునీత మిత్తల్, ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్లో ఐవీఎఫ్ యూనిట్ హెడ్ కళ్లను, కాలేయాన్ని దానమివ్వడం రొటీన్ అయింది. తన గర్భంలో శిశువును మోసే భాగ్యంలేని అమ్మకు బిడ్డను మోసిచ్చే అద్దె అమ్మలూ సర్వసాధారణమయ్యారు. విక్కి డోనర్లు.. ఆ ప్రభావంతో ఇప్పుడు ఎగ్ డోనర్లు... దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అండాలను దానం చేసే ప్రక్రియలో మైనర్ బాలికల ఉనికీ ఉలికిపాటుకు గురిచేస్తోంది. బిడ్డలు కావాలని కోరుకుంటున్న అమ్మలకు సంతాన ఆశను ఎంత కల్పిస్తుందో బిడ్డలున్న తల్లులకు గర్భశోకాన్నీ అంతే మిగులుస్తోంది. అండాన్ని దానం చేసే అమ్మాయిల కోసం గాలింపు గ్రామాల్లోనూ మొదలైంది. గాలం పేదరికమే. సరోగసీలో పెళ్లయి, ఓ బిడ్డను కన్న అమ్మలను మాత్రమే అదీ ఇష్టపూర్వకంగా వస్తేనే వాళ్ల గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. ఇదే నియమం ఎగ్ డొనేషన్కూ వర్తిస్తుంది. కానీ పేదరికం పదిహేనేళ్లు నిండిన అమ్మాయిలనూ ఈ ప్రక్రియకు బలిపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లూ ... ఏజెంట్లను ఊరిస్తున్నాయి. అంతగా చదువు, ఆర్థిక స్థోమతలేని కుటుంబాలను కదిలించి.. డబ్బాశ చూపించి ఆ ఇంటి అమ్మాయిలకు ఐవీఎఫ్ సెంటర్ల దారి చూపిస్తున్నారు. ఇలా టీనేజ్ అమ్మాయిలను పావులుగా చేయడం.. వాళ్ల ఆరోగ్యానికి హానికరం.. ఒక్కోసారి ప్రాణంమీదకూ రావచ్చు అని వైద్యులు, సామాజిక కార్యకర్తలూ హెచ్చరిస్తున్నా... ఏజంట్ల మాయ యథేచ్చగా సాగుతూనే ఉంది. ఎగ్ డొనేషన్తో ప్రాణం పోగొట్టుకున్న ఓ ఆడకూతురి ఉదంతమూ ఉంది. ఆ అమ్మాయి పేరు సుష్మపాండే. ఊరు ముంబై. 2010లో జరిగిన ఆ సంఘటన ఏంటంటే... సుష్మ ఒక సాధారణ అమ్మాయి. దిగువ మధ్యతరగతి కుటుంబంలోని అయిదుగురు సంతానంలో మూడవది. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ వాళ్ల సొంతూరు. బతకడానికి ముంబై వచ్చారు. సాకినాకలో మకాం పెట్టారు. తండ్రి టాక్సీ డ్రైవర్. నెలకు నాలుగు వేలకు మించి సంపాదించలేడు. చదువంటే ప్రాణం ఆ పిల్లకు. ఒక్కసారి చెప్తే ఇట్టే గ్రహించేది పాఠాలను. స్కూల్లో టీచర్స్ కూడా చాలా ఇష్టపడేవారు చురుకైన పిల్ల అని. కానీ కుటుంబ అవసరాలు తీర్చడంలో తండ్రికి సహాయపడక తప్పలేదు. అందుకే ఎనిమిదవ తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చింది. అంధేరీలో ఉన్న చౌమాల్స్ డిపోలో పనికి కుదరింది. తండ్రితో సమానంగా జీతం తెచ్చేది. తన జీతంతోనే తమ్ముళ్లను చదివించసాగింది. ఇంకొన్ని గంటలు ఎక్కువ కష్టపడి తానూ చదువు కొనసాగించాలని ఆమె తపన. కానీ సాకినాక, అంధేరిల మధ్య తిరగడానికే సరిపోతోంది. కొత్త పనికి టైమే దొరకట్లేదు. ఆ నిరాశలో ఉన్నప్పుడే .. 2009లో కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు ఆమెకు. వాళ్ల ద్వారే ఆమెకు రొతుండా ది సెంటర్ ఫర్ హ్యుమన్ రిప్రొడక్షన్’ గురించి తెలిసింది. ఆ స్నేహితుల సహాయంతో 2009, ఫిబ్రవరిలో మొదటిసారి ఆ ఆసుపత్రికి వెళ్లింది. మత్తు మందు ఇచ్చి పొట్టలోంచి ఏదో తీసుకుంటామన్నారు వైద్యులు. దాంతో పిల్లలు లేని వాళ్లకు పిల్లల్ని పుట్టిస్తాం అని చెప్పారు. ఆ మాట వినగానే బెదిరిపోయింది సుష్మ. ‘నాకెందుకో భయమేస్తోంది..నేను వెళ్తాను నన్ను వదిలేయండి’ అంది అక్కడికి తీసుకొచ్చిన స్నేహితులతో. ‘ఊరికే ఏం కాదు.. డబ్బులిస్తారు. నొప్పి కూడా ఏం ఉండదు’అని సర్ది చెప్పారు వాళ్లు. ‘పాతికవేలిస్తారు’ నొక్కిపలికారు. ‘పాతికవేలా?’ఒక్క రోజులో అంత డబ్బు. అంటే దాదాపు నా అయిదున్నర నెలల జీతం. ఈ డబ్బంతా దాచుకొని చదువుకోవచ్చు..’ సుష్మలో ఆశ.. ఆమెను ఆ పనికి ఒప్పుకునేలా ప్రేరేపించింది. ‘సరే’ అంది సుష్మ. ఏవో టెస్ట్లు చేశారు. ఇంజక్షన్స్ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆసుపత్రిలో ఉంచుకున్నారు. అన్నట్టుగానే పాతికవేలు చేతిలో పెట్టారు. ఆ డబ్బుల్ని చూసుకుంటే ఆనందం మనసులో పట్టలేదు సుష్మకి. అందుకే మళ్లీ అక్టోబర్లో వెళ్లింది. అదే విధానం. మళ్లీ పాతికవేలు. ఇదిగో ఈ సారి.. ఆగస్ట్లో వచ్చింది. అయితే ఈసారి ఎప్పటిలా సాఫీగా సాగలేదు. హుషారుగా లేదు ప్రాణం. తెలియని సుస్తీ.. తెల్లవారి నుంచి కడుపునొప్పి చివరకు ప్రాణాన్ని తీసేసింది. ది మర్డరర్... ఆ హంతకురాలి పేరు ఎగ్ డొనేషన్. పదిహేడేళ్ల వయసులో చేయకూడని తప్పిదం.. జరగకూడని అనర్థం! కూతురు చనిపోయాక తెలిసింది ఆమె చేసిన పని గురించి తల్లి ప్రమీలకు.. ‘మీ అమ్మాయి ఎగ్ డొనేట్ చేసింది. అండాశయం నుంచి ఒకేసారి ఎక్కువ మొత్తంలో అండాలు ఉత్పత్తి కావడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి చూపించిన దుష్ర్పభావం వల్ల మెదడులో, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయి మీ అమ్మాయి చనిపోయింది!’ అని. హతాశురాలైంది ప్రమీల. అప్పుడు రొతుండా ఆసుపత్రి మీద సాకినాక స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోస్ట్మార్టమ్ ఆ నివేదికలూ ఆ సత్యాన్నే వెల్లడి చేశాయి. సుష్మకు ఎదురైన పరిస్థితిని వైద్యపరిభాషలో ఒవేరియన్ హైపర్ స్టిములేషన్ షాక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎక్కువ మొత్తంలో అండాలు ఉత్పత్తి కావడానికి చేసిన ఇంజెక్షన్ చూపించే దుష్ఫలతం అన్నమాట. షాక్... ఈ సంఘటన ప్రమీలకే కాదు దేశానికే అశనిపాతమైంది. సమాజం వెన్నులో వణుకు పుట్టింది. నిరసనలు... ధర్నాలు.. ర్యాలీలు మొదలయ్యాయి. ఇలా మైనర్ ఆడపిల్లల నుంచి అండాలు సేకరించడమేంటి? అసలు ఐసీఎమ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏం అంటోంది? దీనికి సంబంధించి ప్రత్యేకమైన చట్టం ఎందుకు తేకూడదు? అనే చర్చలు,వాదనలు మిన్నంటాయి. అప్పుడు.. అలా వచ్చిందే ఏఆర్టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) బిల్, 2010. ఆరేళ్లు అవుతున్నా ఈ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించలేదు. అయితే సుష్మ మరణం తర్వాత ఎగ్ డొనేషన్కు సంబంధించి ఐసీఎమ్ఆర్ కొన్ని నింబంధనలను మాత్రం ఖాయం చేసింది. అవేంటంటే... 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల నుంచే అండాలను సేకరించాలి డోనర్ బ్లడ్గ్రూపే కాకుండా శారీరక దారుఢ్యం, ఎత్తు, బరువుతోపాటు విద్యార్హతలు, వృత్తినీ నమోదు చేయాలి ఒకే డోనర్ దగ్గర వెంటవెంటనే కాకుండా కనీసం మూడు నెలల వ్యవధిని పాటించి అండ సేకరణ చేయాలి ఒక డోనర్ దగ్గర్నుంచి ఆమె జీవితకాలంలో ఆరుసార్లు మాత్రమే అండాలను తీసుకోవాలి. జాగ్రత్త: పెద్ద నగరాల్లోని సంతాన సాఫల్యకేంద్రాల సక్సెస్ రహస్యం చిన్న ఊళ్లలోని పేదింటి అమ్మాయిలే! ఏజెంట్ల ద్వారా సాఫీగా సాగుతున్న ఈ వ్యాపారం ఒకరింట సంతోషాన్ని పంచితే ఇంకొకరి ఇంట విషాదాన్ని నింపుతోంది. ఆ గాలానికి మనింటి అమ్మాయిలూ చిక్కొచ్చు! తస్మాత్ జాగ్రత్త. రెగ్యులర్ అండ్ దివా ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఎగ్ డోనర్స్ను రెండురకాలుగా వర్గీకరించారు. ఒకటి.. సాధారణ దాతలు, రెండు.. దివా. వీళ్లు పేరున్న కుటుంబ నేపథ్యం, ఉన్నత చదువు, హోదా, చక్కటి రూపు, రంగు, మంచి ఆరోగ్యం, జన్యుపర వ్యాధుల చరిత్రలేని వారై ఉంటారు. ఈ దివా కేటగిరి డోనర్స్ సాధారణంగా ఒక్క డొనేషన్కు లక్ష నుంచి మూడు లక్షల రూపాయాల దాకా డిమాండ్ చేస్తారు. ఇక సాధారణ దాతలు ఒక్క డొనేషన్కు 25 వేల నుంచి 35 వేల రూపాయలు తీసుకుంటారు. పరస్పర విరుద్ధం ముంబైలో సుష్మపాండే మరణం తర్వాత ఏఆర్టీ బిల్ వచ్చింది. అయితే ఇది మెడికల్ యాక్ట్కి క్లాష్ అవుతోంది కూడా. కారణం ఆర్గాన్ డొనేషన్కి, ఏఆర్టీ బిల్కి పరస్పర వైరుద్ధ్యం ఉండడమే. ఆర్గాన్ డొనేషన్బిల్ ప్రకారం అవయవాలను దానం చేసేవారు రక్తసంబంధీకులై ఉండాలి. అదే ఎగ్ డొనేషన్కి సంబంధించి ఇలాంటి నియమేమీ లేదు. ఇది ఏజంట్లకు మంచి అవకాశంగా మారింది. పేదరికంలో ఉన్న ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి జరగకూడదనే ఇప్పుడు ఏఆర్టీని కూడా మెడికల్యాక్ట్ కిందకి తేవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. - ఎ.రమ్య కుమారి, హైకోర్ట్ అడ్వకేట్వివరించిన తర్వాతే... ఏ ఐవీఎఫ్ సెంటర్ అయినా ఐసీఎమ్మార్ గైడ్లైన్స్ను స్ట్రిక్ట్గా ఫాలో కావాల్సిందే. దానిప్రకారం ఎగ్ డొనేషన్కి కూడా 21 ఏళ్లు నిండిన అమ్మాయిలనే ప్రిఫర్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే పెళ్లయి, ఒక బిడ్డకు తల్లయిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తాం. ఎగ్ డొనేషన్ ప్రాసెస్ ఏంటో కూడా డోనర్కి, ఆమె హజ్బెండ్కి వివరిస్తాం. అన్నీ విని వాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే తీసుకుంటాం. ఏజెంట్లు ప్రిఫర్ చేసిన అమ్మాయిల ఏజ్ గ్రూప్నూ వాళ్ల ఆధార్కార్డ్ ద్వారా నిర్ధారించుకుంటాం. మైనర్ పిల్లలను ఎగ్డొనేషన్కు అనుమతించం. అనుమతించకూడదు కూడా - డాక్టర్ సరోజా కప్పాలా, నోవా ఫెర్టిలిటీ సెంటర్ -
బాడీ ఫిట్నెస్ స్కానర్ వచ్చేసింది!
న్యూయార్క్: బాడీ ఫిట్నెస్ కోసం జిమ్కెళ్లే ఔత్సాహికులు పొట్ట ఎంత తగ్గిందీ, నడుమెంత తగ్గిందీ, ఛాతి ఎంత పెరిగిందీ, తొడలు పెరిగాయా, తగ్గాయా? అన్న అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు టేప్ పట్టుకొని నానా హైరానా పడిపోతుంటారు. అంత చేసినా పొట్టపైగానీ, ఛాతిపైగానీ ఏ కండరం ఎంత పెరిగిందో కచ్చితంగా అంచనా వేయలేరు. అలాంటి వారి కోసం అమెరికాకు చెందిన నేకెడ్ ల్యాబ్స్ అచ్చం అద్దం లాంటి ‘నేకెడ్ 3డి బాడీ స్కానర్’ను కనిపెట్టింది. మొత్తంగా మన శరీరాకృతి ఎలా ఉందో 360 డిగ్రీల కోణంలో 3డీ స్కాన్ చేసి ఈ పరికరం మనకు చూపిస్తుంది. మనం చేయాల్సిందల్లా స్కానర్కు అనుసంధానించిన గుడ్రటి చట్రంపై బట్టలు విప్పేసి కేవలం 20 సెకడ్లు నిలబడాలి. గుడ్రటి చట్రం 360 డిగ్రీలు తిరుగుతుంటే మన శరీర ఆకృతిని పూర్తిగా పరికరం స్కాన్ చేస్తుంది. పొట్టపైనా, ఛాతిపైనే కాకుండా బాడీ మొత్తంగా ఏ ప్రాంతంలో ఏ కండరం ఎంత పెరిగిందో, ఎంత తగ్గిందో ఈ స్కానింగ్లో తెలిసిపోతుంది. నిన్నటికి, ఈ రోజుకు బాడీలో ఎంత తేడా వచ్చిందో, వారం రోజుల్లో, నెల రోజుల్లో ఎంత తేడా వచ్చిందో కూడా పాత స్కానింగ్ చిత్రాలతో అదే పోల్చి చెబుతుంది. ఇవన్ని పనులను కచ్చితంగా లెక్కేసి చెప్పడానికి ఈ స్కానింగ్ అద్దంలో క్వాడ్ కోర్ ఇంటెల్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ పరికరం ఎప్పటికప్పుడు స్కానింగ్ మ్యాప్లను నిక్షిప్తం చేయడమే కాకుండా యాప్ ద్వారా మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్పై డిస్ప్లే చేస్తుంది. ఎంత శాతం కొవ్వు కరిగిందో, పెరిగిందో కూడా చూపిస్తుంది. హెచ్చు తగ్గులను సులభంగా గుర్తించేందుకు వాటిని రంగుల్లో డిస్ప్లే చేస్తుంది. ఈ స్కానింగ్ ద్వారా మనం ఏ వ్యాయామం ఎక్కువ చేయాలో, ఏదీ తక్కువ చేయాలో కచ్చితమైన అంచనాకు రావచ్చు. ఈ పరికరాన్ని అమెరికాలో 499 డాలర్లకు విక్రయించాలని నిర్ణయించామని, ఇప్పుడు బుక్ చేసుకుంటే షిప్పింగ్ మాత్రం 2017లోనే జరుగుతుందని నేకెడ్ ల్యాబ్స్ ప్రకటించింది. -
రేడియాలజీ... సో లేజీ..!
► జీజీహెచ్లో అందుబాటులో ఉండని వైద్యులు ► పీజీ వైద్య విద్యార్థులతో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ► స్కానింగ్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి సాక్షి, గుంటూరు : అక్కడ వ్యాధి నిర్ధారణ చేయాలంటే గర్భిణులు, రోగులైనా రోజుల తరబడి స్కానింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిందే.. వైద్యుల సిఫార్సు లెటర్లు తీసుకెళ్లినా అక్కడి వారికి లెక్కలేదు.. మధ్యాహ్నం దాటిందంటే వైద్యులు అందుబాటులో ఉండరు.. సొంత క్లీనిక్లకు వెళ్లిపోతుంటారు... ఇక రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలంటే పీజీ విద్యార్థులే దిక్కు. గుంటూరు జీజీహెచ్లోని రేడియాలజీ విభాగంలో నిత్యం జరుగుతున్న తంతు. గుంటూరు జీజీహెచ్కు నవ్యాంధ్రప్రదేశ్లోని ఆరు జిల్లాల నుంచి రోగులు పరీక్షలు, వైద్య సేవల కోసం వస్తుంటారు. ముందుగా వైద్యుల వద్ద చూపించుకుని వ్యాధి నిర్ధారణ కోసం ఆల్ట్రాసౌండ్స్కాన్, సిటీస్కాన్ల వద్దకు రోగులు బారులు తీరుతుంటారు. సుదూర ప్రాంతాల నుంచి అక్కడకు వచ్చే రోగులకు స్కానింగ్ కేంద్రాల వద్ద వైద్యులు, సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. అసలే అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులు స్కానింగ్ల కోసం రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడకు వచ్చే రోగులకు మూడు నుంచి ఐదు రోజులు గడువు విధిస్తున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గడువు తేదీకి వచ్చి స్కానింగ్ చేయించుకున్న మళ్లి ఆ రిపోర్టు వారికందాలంటే మరో రెండురోజులు వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడి వైద్యాధికారులు స్థానికంగా ఉండకపోవడంతో వారు వచ్చి రిపోర్టులు ఇచ్చే వరకు వీరు వేచి ఉండాల్సిందే. జీజీహెచ్లో అనేక సందర్భాల్లో దీనిపై రోగులు అధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఓపీ సమయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు అందుబాటులో ఉండే రేడియాలజీ విభాగం వైద్యులు మధ్యాహ్నం తరువాత కంటికి కనిపించరు. స్కానింగ్ సెంటర్లో పీజీ వైద్యులు, సిబ్బంది మాత్రమే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. స్కానింగ్ సెంటర్ల వద్ద ప్రసవ వేదనలు ఓ పక్క ప్రభుత్వం ఆస్పత్రి ప్రసవాల రేటును పెంచాలని ప్రయత్నాలు సాగిస్తుంటే జీజీహెచ్లో కొన్ని విభాగాల వైద్యుల నిర్లక్ష్యం వలన ఇది నీరుగారుతోంది. జీజీహెచ్లో ప్రస వం కోసం వచ్చే గర్భిణులు ప్రసూతి విభాగంలో వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు ఆల్ట్రాస్కాన్ చేయించుకునేందుకు రేడియాలజీ విభాగానికి వెళ్లడం అక్కడ గంటల తరబడి వైద్యుల కోసం వేచి చూడడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది మేలో పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గర్భిణి దోమరవరపు లావణ్య, ప్రసూతి విభాగంలో చేరింది. పురిటి నొప్పులు రావడంతో ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోమని ప్రసూతివిభాగం వైద్యులు ఆమెకు సూచిం చారు. అక్కడకు లావణ్య గంటల పాటు వైద్యుల కోసం వేచి చూసి నొప్పులు అధికమై స్కానింగ్ గది ముందు నేలపై ప్రసవించింది. తాజాగా గుంటూరు నగరంలోని అరండల్పేటకు చెందిన సంధ్యారాణి స్కానింగ్ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు స్కానింగ్ సెంటర్ వద్ద పడిగాపులు కాసి వైద్యుల నిర్లక్ష్యంపై జీజీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపేందుకు జీజీహెచ్ అధికారులు కమిటీని నియమించారు. ఇప్పటికైనా రేడియాలజీ విభాగం వైద్యులు నిర్లక్ష్యం వీడి వ్యాధి నిర్ధారణ పరీక్షలను త్వరితగతిన నిర్వహించి రోగులకు ఇబ్బందులు తొలగించాలని పలువురు కోరుతున్నారు. -
ఉసురు తీస్తున్నారు..!
జిల్లాలో ఆగని భ్రూణహత్యలు మురుగుకాల్వలు, ముళ్లపొదలపాలవుతున్న ఆడశిశువులు స్కానింగ్ కేంద్రాల ఇష్టారాజ్యం ఆడ మైనస్.. మగ ప్లస్ సంకేతాలు! పట్టించుకోని వైద్యారోగ్యశాఖ మహబూబ్నగర్ క్రైం: ఆడబిడ్డను కడుపులోనే తుంచేస్తున్నారు.. పొత్తిళ్లలో పొదిగిన శిశువును మురుగునీటి కాల్వల్లో విసిరేస్తున్నారు.. లేదంటే ముళ్లపొదల పాలుచేస్తున్నారు.. కాదంటే బస్టాండ్ ప్రాంతాల్లో వదిలివెళ్తున్నారు.. ఇదీ జిల్లాలో ఆడశిశువులకు రాస్తున్న మరణశాసనం. కాసులకు కక్కుర్తిపడుతున్న కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు, వైద్యారోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణలోపంతో ఆ పసిమొగ్గలు ఆదిలోనే రాలిపోతున్నాయి. జిల్లాలో రోజుకు సగటున రెండొందల ప్రసవాలు జరుగుతున్నట్లు అంచనా. వారిలో ముగ్గురికి పైగా చిన్నారులు మృతి చెందుతున్నట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ మరణాల సంఖ్య కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనివే.. ప్రైవేట్ ఆస్పత్రులు, ఇళ్లవద్ద ప్రసవాల్లో చనిపోతున్న చిన్నారుల సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందకపోవడం, ఆక్సిజన్, వెంటిలేటర్లు నెల తక్కువగా పుట్టడం, ఊపిరితిత్తుల సమస్యలు, బరువు తక్కువ వంటి కారణాలతో ఎక్కువ మంది చిన్నారులు పుట్టగానే మరణిస్తున్నారు. వీరిలో 65శాతం ఆడ శిశువులే ఉండడం గమనార్హం. యథేచ్ఛగా లింగనిర్ధారణ జిల్లాలో 85ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 12ప్రాంతీయ ఆస్పత్రులతో పాటు జిల్లాసుపత్రిలో ప్రసవాలు జరుగుతున్నాయి. వైద్యుల కొరత, పరికరాలు లేకపోవడం, సంరక్షణ తదితర కారణాలతో ఎక్కువమంది ప్రైవేట్ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. పదేళ్ల క్రితం 40 మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాలు ప్రస్తుతం 140 ఉన్నాయి. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. అయితే స్కానింగ్ కేంద్రాల్లో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేస్తారు. మహిళలు గర్భం దాల్చినప్పుడు పిండం ఎదుగుదల, గర్భసంచి పరిణామం, వ్యాధులు, సమస్యలు మాత్రమే చెప్పాలి. కానీ కొందరు లింగ నిర్ధారణ ఫలితాలు చెప్పేస్తున్నారు. ఆడ మైనస్.. మగ ప్లస్! జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు నడుపుతున్న కొందరు తల్లిగర్భంలోనే మరణ శాసనం లిఖిస్తున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణంతో పాటు నారాయణపేట, వనపర్తి, కొత్తకోట, నాగర్కర్నూల్, షాద్నగర్, కల్వకుర్తి ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు గ్రామీణవైద్యులు, వారి వద్ద పనిచేసే సిబ్బంది డబ్బులు ఆశపడి నిర్వాహకులతో కుమ్మక్కై పుట్టబోయే వారి వివరాలు వెల్లడిస్తున్నారు. అయితే స్కానింగ్ కేంద్రాలకు వెళ్లిన వారికి పుట్టబోయేది ఆడ శిశువు అయితే ‘మైనస్’ అని, మగబిడ్డ అయితే ‘ప్లస్’ అని ప్రత్యేకంగా సూచికలు ఇస్తున్నారు. ఇందుకోసం రూ.3 నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ కమీషన్లతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఇటీవల వైద్యారోగ్యశాఖతో జరిపిన పలు సమీక్ష సమావేశాల్లో కలెక్టర్ టీకే శ్రీదేవి ఆవేదన వ్యక్తంచేశారు. పడిపోతున్న లింగనిష్పత్తి తాజా జనాభా లెక్కలను పరిశీలిస్తే జిల్లాలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పరిణామంలో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. 2001లో వెయ్యి మందికి 952మంది ఆడపిల్లలు ఉన్నారు. 2011లో ఆ సంఖ్య 900కి తగ్గింది. ప్రస్తుతం ప్రతి వెయ్యిమందికి 850మంది ఆడపిల్లలు ఉన్నారు. జిల్లాలోని పది మండలాల్లో మహిళల జనాభా గణనీయంగా పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 10 మండలాల్లో ఆడపిల్లల నిష్పత్తి 800లోపే ఉండడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలోని తలకొండపల్లి, తిమ్మాజిపేట, ఆమనగల్లు, ఖిల్లాఘనపురం, దేవరకద్ర, బాలానగర్, కొత్తూర్, దామరగిద్ద, వెల్దండ, అలంపూర్ మండలాల్లో స్త్రీ, పురుష నిష్పత్తి 1000:800గా నమోదైంది. గత పదేళ్లలో గ్రామాల్లో ఆడపిల్లల సంఖ్య 38శాతానికి తగ్గింది. ఇవీ ఘటనలు వారం రోజుల క్రితం జిల్లాకేంద్రంలోని పద్మావతి కాలనీలో మురుగు కాల్వలో అప్పుడే పుట్టిన ఆడశిశువు పడేశారు.మహబూబ్నగర్ మండలం ధర్మపూర్లో ముళ్లపొదల్లో ఆడ శిశువును వదిలేసి వెళ్లారు. ఎదిర శివారులో చెత్తకుప్పల్లో మూడు రోజుల క్రితం పుట్టిన ఆడబిడ్డను వదిలేశారు. అచ్చంపేట శివారులో దోరికిన ఆడ శిశువును స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. లింగనిర్ధారణ పరీక్షలు నేరం జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిపేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తున్నాం. స్కానింగ్ కేంద్రాల నిర్వహణపై ప్రత్యేకనిఘా ఏర్పాటు చేశాం. అనుమానం వచ్చిన ప్రతి స్కానింగ్ కేంద్రాన్ని తనిఖీచేస్తాం. కొంతమంది డాక్టర్లు వారిపేర్ల మీద స్కానింగ్ కేంద్రాలు నడిపిస్తున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచాం. గర్భంలో ఉన్న శిశువు ఎవరు అనే విషయం చెబుతున్న స్కానింగ్ కేంద్రాలు ఉంటే మాకు సమాచారం ఇస్తే కఠినచర్యలు తీసుకుంటాం. - పార్వతి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ -
అమ్మను దోషిని చేస్తారా!?
అభిప్రాయం దేశంలోని 50 వేల స్కాన్ సెంటర్ల రికార్డు సక్రమంగా నిర్వహించేలా పర్యవేక్షించటం చేతకావటం లేదు. కానీ ప్రతి ఏటా 2 కోట్ల 90 లక్షల మంది గర్భవతుల గర్భాలలో ఉన్నది ఆడో, మగో స్కాన్ చేసి, నమోదు చేయించి... ట్రాక్ చేసి ఆడ శిశువుల్ని కాపాడతారట. ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతాననడం అంటే ఇదే కదా! ‘‘డాక్టర్లని ఎంత కాలం శిక్షిస్తాం? ఇకనయినా లింగ నిర్ధారణను చట్టబద్ధం చేసి ఆడ శిశువుల్ని కాపాడాలి’’ అంటూ మన కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మనేకాగాంధీ ఇటీవల మేధోమథనం చేశారు. ఈ దేశంలో ఎవరయినా స్కాన్ సెంటర్కు వెళ్ళి గర్భంలోని బిడ్డ ఆడో, మగో చెప్పమంటే కాదనే ధైర్యం ఎవరికుంటుంది’’ అని పాపం డాక్టర్ల నిస్సహాయత పట్ల చలించిపోయారు. లింగ నిర్ధారణ చట్ట రీత్యా తీవ్ర నేరం అని ప్రతి ఆసుపత్రిలో పెట్టిన బోర్డు కూడా అడిగిన వారికి చూపించలేనంత భయంతో డాక్టర్లు ఈ దేశంలో బతుకుతున్నారు... గర్భవతుల నుండి డాక్టర్లను కాపాడే చట్టం తెస్తే ఇంకా బాగుంటుం దేమోనని సదరు మంత్రి మలివిడతలో ప్రస్తావించ వచ్చు. పురుష వీర్య కణాలలోని ఎక్స్, వై క్రోమోజో ములను వడపోసి కేవలం మగ పిండాన్ని ఏర్పర్చే వై క్రోమోజోము వీర్య కణాలనే స్త్రీ గర్భంలో ప్రవేశ పెట్టడం అంటే అసలు ఆడపిండం ఏర్పడే అవకాశాన్ని లేకుండా చేసే పద్ధతి... డబ్బు, అవకాశంలేని వారు రూ.10 వేలతో లింగ నిర్ధారణ, గర్భస్రావాలకు వెళితే.. ఉన్నత, నయా మధ్యతరగతి లక్షన్నర ఖర్చుతో క్రోమో జోముల వడపోతలకు పాల్పడుతున్నారు. అంటే లింగాన్ని బట్టి గర్భస్రావాలు చేయటం నేరం అంటే మన వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంలోని మరింత ఆధునికతను వాడి ఆడ శిశువులను పుట్ట కుండా చేస్తున్నారన్న మాట... అంటే వైద్యవృత్తిలోని కనీస నైతిక విలువల్ని, చట్టాన్ని రెండింటినీ ఉల్లంఘి స్తున్నారన్న మాట. 2003 చట్ట సవరణ కాలం నుండి 2014 వరకూ దేశంలో కోటి 21 లక్షల మంది ఆడ శిశువులని ముందే తెలియడంతో గర్భస్రావాలు జరిగితే 206 మంది డాక్టర్లకు మాత్రం కనీస శిక్షలు విధించారు. వారి సర్టిఫికెట్లు మాత్రం ఉపసంహరించిన దాఖలాలు లేవు. 15 రాష్ట్రాల్లో అస్సలు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఊపిరి తీయకుండా అమ్మ గర్భంలోనే హతమైనకోటిన్నర మంది పసిపాపల గురించి ఒక కన్నీటి బొట్టు రాలలేదు కాని మనేకాగాంధీ దయార్ద్ర హృదయం నేరస్తులైన ఈ 206 మంది వైద్యుల కోసం మాత్రం ఆక్రోశిస్తోంది. ఇక లింగ నిర్ధారణ చట్టబద్ధం అయితే గర్భాలలో ఉన్నది అంతా మగ శిశువులే అని నమోదు చేస్తారు. ఆడ శిశువుల భ్రూణ హత్య నేరంగాని మగ శిశువుల అబార్షన్ కాదు కదా. రకరకాల వైద్య కారణాలతో మగ శిశువులుగా నమోదైన ఆడ పిండాల్ని యధేచ్ఛగా తొలగిస్తారు. ఆడవాళ్ళకు పిండాలు పెట్టి గర్భస్రావ పరిశ్రమ విరాజిల్లడం ఖాయం. అంతగా వివక్షత అనుకుంటే ఆడ డాక్టర్లు మాత్రమే లింగ నిర్ధారణ చేయాలని నియమం పెడితే సంపూర్ణ సమానత్వం సిద్ధిస్తుంది. ఆడ పిల్లను కనాలా వద్దా? అసలు ఎంత మందిని కనాలి? ఎప్పుడు కనాలి? అసలు కనాలా వద్దా? అనే విషయంలో నోరు మెదిపే అధికారం ఆడవాళ్ళకు ఈ దేశంలో ఉందా? ఎందరికి ఉంది? స్త్రీల శరీరాలపై స్త్రీలకు హక్కు అనడం పాశ్చాత్య సంస్కృతి. అది ఇక్కడ చెల్లదని కుల మతాల గుత్తేదార్లు రంకెలు వేసి కాలు దువ్వుతున్న కాలం ఇది. ప్రతి దేశభక్తి గల స్త్రీ 10 మంది పిల్లల్ని (ఇతర మతాల వారికి మినహారుుంపు) కనాలని, లేదంటే కనీస పక్షం నలుగురు కొడుకుల్ని మాత్రం కనాలని బహి రంగంగా శాసించే పార్లమెంటు బాబాలను ఎన్నుకున్నందుకు స్త్రీలు ఈపాటి మూల్యం చెల్లించాలికదా! త్యాగం చేయటం, అణగి వుండటం ఉగ్గు పాలతో తాగి ఆచరించేవారే మన దేశపు నిజమైన స్త్రీలు కాబట్టి గర్భస్థ శిశువు అడయినా మగయినా నిర్ధారణ జరిగాక దాన్ని కాపాడటం నూటికి రెండొందల పాళ్ళు అమ్మల కర్తవ్యమే... అందుకే కదా మాతృ దేవోభవ అన్నది... ఆ గర్భం చట్టబద్ధంగానో, నాటు పద్ధతితోనో, కొట్టడం, తన్నడం వంటి ఖర్చులేని టెక్నాలజీ వల్లనో లేదా ప్రమాదవశాత్తుగానో లేదా అసలు సహజసిద్ధ కారణాల వల్లనో గర్భస్రావం అయితే ఆమె నేరస్తురాల వుతుందన్న మాట. దీనికి వేరెవరూ బాధ్యులు కాదు. భావజాలం, సమాజం, కుటుంబ, డాక్టర్లు, ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆడ శిశువుల మరణాలకు, భ్రూణ హత్యలకు బాధ్యులనడం దేశ ద్రోహం... అసలు స్త్రీల శరీరాలపై స్త్రీలకు హక్కులుండాలనడం మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే అంతర్జాతీయ కుట్ర. 10 మందిని కనడం, కుటుంబ పోషణకు మాత్రమే సంపాదించడం (ఆర్థిక స్వావ లంబన వల్ల స్త్రీలు విచ్చలవిడి అవుతారట) వంటి పాతివ్రత్య సూత్రాల పునరుద్ధరణతోనే అభివృద్ధి సాధ్యం. ఇప్పటికే ‘‘ఇండియాస్ డాటర్’’ నిషేధం, బాలనేరస్తుల వయస్సు తగ్గింపులతో స్త్రీలపై అత్యాచా రాలు అరికట్టడం జరిగింది. అద్దె గర్భాలు చట్టబద్ధం అయితే ఇల్లు కదలకుండా స్త్రీలు స్వయం ఉపాధి పొంది లక్షలు ఆర్జించవచ్చు. మానవ సమతుల్యం కంటే జంతు సమతుల్య తను ప్రేమించేవారు మంత్రిగా ఉండి ఇటువంటి ఆలో చనలు చేయటం మన జన్మజన్మల కర్మఫలం. కనుక మనం ఒక అగ్రరాజ్యంగా ఎదగడాన్ని భగ్నం చేయ డానికే స్త్రీల హక్కులు, మానవ హక్కులు, దళిత హక్కులని గగ్గోలు పెడుతూ అభివృద్ధి నుండి మనల్ని ప్రక్కదారి పట్టిస్తున్నారని దేశ భక్తులంతా గమనిం చాలని మనవి. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, దేవి pa_devi@rediffmail.com -
వేళ్లు కట్ అయినా... అతికించవచ్చు!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 21. నాకు కొంతకాలంగా నెలసరి సరిగా రాకపోతుండడంతో డాక్టర్ని సంప్రదించాను. స్కానింగ్ తీయించి పీసీఓడీ అని చెప్పారు. మందులు వాడుతున్నంతకాలం నెలసరి సరిగానే వస్తోంది. మానేస్తే మళ్లీ మామూలే. వివాహానంతరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే అది సంతానలేమికి కారణమవుతుందేమోనని మా అమ్మానాన్నా ఆందోళన చెందుతున్నారు. ఈసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? హోమియో చికిత్స ద్వారా దీనికి సరైన పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - ఒక సోదరి, ఆదిలాబాద్ మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఎక్కువ మంది స్త్రీలను వేధిస్తుంటుంది. వివాహితులలో సంతానలేమికీ కారణమవుతుంది. మెచ్యూర్ ఫాలికిల్ (అపరిపక్వమైన అండం) గర్భాశయానికి ఇరువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. సాధారణ రుతుచక్రం ఉన్న మహిళలలో నెలసరి అయిన 11-14 రోజుల మధ్యన రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి ఒక అండం విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ పీసీఓడీ ఉన్న వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా, అపరిపక్వత కలిగిన అండాలు నీటిబుడగలుగా మారి అండాశయపు గోడలపై ఉండిపోతాయి. కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం, పిండి, కొవ్వు పదార్థాలు, జంక్ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, జన్యుపరమైన అంశాలు. లక్షణాలు: నెలసరి రాకపోవడం, ఒకవేళ వచ్చినా అండాశ యం నుండి అండం విడుదల కాకపోవడం, నెలసరిలో నాలుగైదు రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు కొనసాగడం, నెలసరి ఆగి ఆగి రావడం, రెండు రుతుచక్రాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం, ముఖంపై, వీపుపై మొటిమలు రావడం, మెడచుట్టూ, మోచేతి మడతలలో, మోచేయి భాగాలలో చర్మం మందంగా, నల్లగా మారడం, ముఖం, ఛాతీపై మగవారి మాదిరిగా రోమాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జాగ్రత్తలు: జీవన విధానంలో మార్పులు చేసుకుని ఒత్తిడిని తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతులాహారాన్ని తీసుకోవడం వంటి జాగ్రత్తలను పాటించడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. హోమియోకేర్ చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్ అందించే కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా రోగి మానసిక, శరీర తత్వాన్ని బట్టి హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేసి ఎటువంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీ సమస్యను నయం చేయడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్లాస్టిక్ సర్జరీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. ఒక పరిశ్రమలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఏడాది క్రితం మెషిన్లో కుడి చేయి ఇరుక్కోవడంతో నాలుగు వేళ్లు సగానికి పైగా నలిగిపోయాయి. ఇవి మళ్లీ అతికించడానికి పనికిరావనీ, పైగా తీవ్ర రక్తస్రావం కూడా జరగడంతో ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. దాంతో నేను ఉద్యోగం కోల్పోయాను. పనిచేసే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నప్పటికీ చేతివేళ్లు లేకపోవడంతో టెక్నికల్ పని చేయలేకపోతున్నా. నాపై ఆధారపడ్డ కుటుంబసభ్యులను పోషించలేక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మానసిక వేదనతో కుమిలిపోతున్నాను. నాకు తగిన పరిష్కారం చూపండి. - యాదగిరి, బాలానగర్ మన జీవనాధారానికి, రోజువారీ పనులకు చేతులు, వేళ్లు చాలా కీలకం. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చేతులు లేకపోతే మన పని మనమే చేసుకోలేం. ఒకవేళ చేతులు ఉన్నా వాటికి వేళ్లు లేకపోతే జీవనాధారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మీ విషయంలో కూడా అలాగే జరిగింది. అయితే మీరు ఏమాత్రం నిరాశపడవద్దు. మీ కుడిచేతికి సంబంధించి, ఏ వేళ్లుపోయాయో వాటిని మీరు తిరిగి పొందగలరు. ‘రీ కన్స్ట్రక్షన్ సర్జరీ’ ద్వారా మీ చేతివేళ్లను అతికించవచ్చు. అయితే మీ కాళ్లలో ఏది సెట్ అవుతుందో చూసి, దాన్ని తీసి సర్జరీ ద్వారా మీరు కోల్పోయిన చేతి వేళ్లను అమర్చవచ్చు. పనిచేయడానికి చేతులకు కావాల్సిన బొటనవేలు, చూపుడువేలితో పాటు చివరి రెండు వేళ్లూ ముఖ్యమైనవే. వాటిని తిరిగిపొందాలంటే మీరు నిపుణులైన ప్లాస్టిక్, వాస్క్యులార్ సర్జన్ల బృందాన్ని సంప్రదించాలి. వారు యాక్సిడెంట్కు గురైన మీ చేతిని పరీక్షించి శస్త్రచికిత్స చేసే వీలుని పరిశీలిస్తారు. సర్జరీ నిర్వహించిన వేలిని శరీరం స్వీకరించడం, ఎముకకు సరిగ్గా అతకడం, నరాలు, రక్తప్రసరణ వంటి విషయాలనూ డాక్టర్ల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆపరేషన్ చేసిన వేళ్లతో మీరు మునుపటిలాగే పనులు చేసుకోవచ్చు. ఒక్కోసారి మీరు కోల్పోయిన అన్ని వేళ్లకూ ఒకేసారి సర్జరీ చేసే అవకాశాలూ ఉన్నాయి. ఆపరేషన్ తర్వాత ఒక నెలరోజుల పాటు మీరు ఆ వేళ్ల విషయంలో జాగ్రత్తవహిస్తే మీరు మునుపటిలాగానే ఉద్యోగం చేస్తూ, మీ కుటుంబాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించగలుగుతారు. ఒకసారి ప్లాస్టిక్ సర్జన్స్, వాస్క్యులార్ సర్జన్స్ బృందం ఉన్న హాస్పిటల్ను సంప్రదించండి. డాక్టర్ శశికాంత్ మద్దు సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ యశోద హాస్పిటల్స్ సోమాజీగూడ హైదరాబాద్ ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. నాకు రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తోంది. దాదాపుగా ఏడాది నుంచి ఈ నొప్పి ఉంది. ఇది క్రమంగా పెరుగుతోంది. కుడి మోకాలి నొప్పి కాస్త భరించగలిగేట్లు ఉన్నా ఎడమ మోకాలిలో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్ను సంప్రదిస్తే ఎడమ మోకాలిలో తీవ్రమైన ఆర్థరైటిస్ ఉందనీ, కుడి మోకాలిలో దాని తీవ్రత ఒకింత తక్కువగా ఉందని అంటున్నారు. ఈ మోకాళ్లలోకి కందెనలాగా (ల్యూబ్రికెంట్ పనిచేసే) అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. దాంతో ఆర్థరైటిస్ నొప్పులూ, మోకాళ్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయని చెబుతున్నారు. ఒక్కొక్క ఇంజెక్షన్ ఖరీదు దాదాపు రూ. 15,000 ఉంటుందంటున్నారు. అంత ఖరీదైన ఇంజెక్షన్స్ను భరించే స్తోమత నాకు లేదు. అందుకే నాకు తగిన సలహా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - నవనీతరావు, హైదరాబాద్ మీరు చెప్పిన కందెనలా పనిచేసే ల్యూబ్రెకెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అవి ఆధునికమైనవేమీ కాదు. గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాడుతున్నవే. అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి కేవలం లక్షణాల తీవ్రతను తగ్గించడం మాత్రమే చేయగలవు. అంతేకాదు... ఆర్థరైటిస్ పెరగడాన్ని ఒకింత తగ్గిస్తాయి. మిగతా కార్టిలేజ్ను బలం పుంజుకునేలా చూస్తాయి. అంతేగానీ వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. పైగా తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీ విషయానికి వస్తే అది కుడి కాలికి కొంత ప్రయోజనం చేకూర్చవచ్చు. ఎడమకాలికి అంతగా ఉపయోగపడకపోవచ్చు. అందుకే దానివల్లనే అంతా చక్కబడుతుందని అనుకోవద్దు. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ను కలిసి, తగిన వైద్యసహాయం పొందండి. డాక్టర్ కె. సుధీర్రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ ల్యాండ్మార్క్ హాస్పిటల్స్ హైదరాబాద్ -
ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్!
మెడిక్షనరీ మామూలుగా తన యాసలో మాట్లాడే ఓ వ్యక్తి అకస్మాత్తుగా ‘పొరుగు’యాసలో మాట్లాడితే ఎలా ఉంటుంది. తన యాసలో ఉన్న మాటలనే పొరుగుయాసలో పలకబోయి పట్టుబడతాడు. అది అతడి మాతృభాష కాదని, పొరుగు భాషావ్యవహర్తలంతా గుర్తుపడతారు. ఈ రుగ్మత పేరే ‘ఫారిన్ యాక్సెంట్ సిండ్రోమ్’. ఇదొక మానసిక/నరాలకు సంబంధించిన రుగ్మత. ఇలా చేసే కొందరిలో ఎమ్మారై స్కానింగ్ రిపోర్టులను పరిశీలించినప్పుడు మెదడులోని భాష సెంటర్లో బేసల్ గ్యాంగ్లియాన్కు దెబ్బతగిలి ఉండటాన్ని డాక్టర్లు కొంతమందిలో గుర్తించారు. ఇలా మాట్లాడేవారు కేవలం మనదేశంలోనే గాక... జపనీస్ను కొరియా భాషలాగా, ఇంగ్లిష్ను ఫ్రెంచ్లాగా, స్పానిష్ను హంగేరియన్ లాంగ్వేజీలా మాట్లాడతారు. -
లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడితే... జైలు, జరిమానా
కేస్ స్టడీ సరిత, దినేష్ల పెళ్లయ్యి ఆరేళ్లయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. దినేష్ తన తలిదండ్రులకు ఒక్కడే సంతానం. వారి పినతండ్రులకూ, పెద తండ్రులకూ ఎవరికీ మగసంతానం లేదు. వారి ఏకైక వారసుడు దినేష్ ఒకడే. అందరూ వారి వంశంలో ఒక మగపిల్లాడు పుట్టాలని కలలు కంటున్నారు. దినేష్కి గనక మగపిల్లలు పుట్టకపోతే, ఇక అతని తర్వాత వారి వంశం అంతరించి పోతుందని వారి భావన. దాంతో మూడోసారైనా కొడుకు పుట్టాలని సరితని ఆపరేషన్ చేయించుకోకుండా ఆపేశారు. ఇప్పుడు సరిత గర్భవతి. అందరిలోనూ టెన్షన్. ఒకవేళ ఇప్పుడు పాపే పుడితే ..? అందరూ కలిసి ఆమెను బలవంతం చేయసాగారు. తెలిసిన డాక్టర్ దగ్గరకెళ్లి స్కానింగ్ చేయించి చూసి పాపైతే అబార్షన్ చేయిస్తామని తీవ్రంగా వేధించసాగారు. సరితకు ససేమిరా ఇష్టం లేదు. అతికష్టం మీద భర్తను ఒప్పించి ఫ్యామిలీ కౌన్సెలర్ దగ్గరకు తీసుకొని వెళ్లింది. ఆ ఫ్యామిలీ కౌన్సెలర్ న్యాయవాది కూడా: నెమ్మదిగా వారి సమస్య ఏమిటో తెలుసుకుని, గర్భస్థ పిండ పరీక్ష, లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 గురించి ఇలా వివరించారు. హాస్పిటల్స్లో ఎవరైనా డాక్టర్గాని, టెక్నీషియన్ గాని, గైనకాలజిస్ట్ లేక మెడికల్ ప్రాక్టిషనర్ గానీ లింగనిర్థారణ పరీక్షలు నిర్వహించకూడదు. అవసరం లేకుండా గర్భిణులకు స్కానింగ్ చేయరాదు. ఒకవేళ ఆరోగ్య కారణాల దృష్ట్యా చేయవలసి వస్తే గర్భస్థ శిశువు ఎవరైనదీ చెప్పరాదు. అలా చేస్తే చట్టప్రకారం 3 సం. జైలుశిక్ష, జరిమానా పడతాయి. 35 సంవత్సరాలు దాటిన తర్వాత గర్భవతులైన మహిళలకు, ఎక్కువసార్లు గర్భస్రావాలు జరుగుతున్న మహిళలకు, జన్యుసంబంధ, క్రోమోజోమ్ సంబంధ, సెక్స్ సంబంధ రోగాలతో బాధపడుతున్న గర్భిణులకు మాత్రమే గర్భస్థ శిశువు పెరుగుదల, ఆరోగ్యాలను గురించి తెలుసుకునేందుకు పిండపరీక్ష లు చేయవచ్చు. అంతేగాని లింగనిర్ధారణ, ఫీమేల్ ఫీటిసైడ్ కోసం కాదు. న్యాయవాది చెప్పిన విషయాలు విని దినేష్ షాక్ తిన్నాడు. తన కుటుంబ సభ్యులకూ చెప్పాడు. దాంతో సరితపై వేధింపులు తగ్గాయి. అసలు గర్భస్థ శిశువు ఆడామగా అనేది నిర్ణయించేది పురుషునిలోని ్ఠడ క్రోమోజోములే! ఇ.పార్వతి అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
కాలేయంలో కొవ్వు... ప్రమాదమా? నా వయసు 65 ఏళ్లు. నాకు డయాబెటిస్, హైబీపీ ఉన్నాయి. ఒకసారి ఉన్నట్లుండి కడుపులో నొప్పి వస్తే డాక్టర్ను సంప్రదించాను.అప్పుడు డాక్టర్గారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసి ‘కాలేయంలో కొవ్వు చేరింద’ని చెప్పారు. కొవ్వు పేరుకుపోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా? - సురేంద్రనాథ్, వరంగల్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం అనేది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. డయాబెటిస్, హైబీపీతో బాధపడేవారు ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలోనూ లివర్లో కొవ్వు చేరడం సాధారణంగా జరుగుతుంది. కాలేయంలో కొవ్వు ఉన్నంత మాత్రాన పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ కాలేయం పనితీరులో తేడా కనిపిస్తే మాత్రం కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించుకోండి. ఈ పరీక్ష నార్మల్గా ఉన్నట్లయితే మీరు ఆందోళన పడాల్సిందేమీ లేదు. మీరు డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ, బరువును తగ్గించుకుంటే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు అదే తగ్గిపోయే అవకాశం ఉంది. నా వయసు 29 ఏళ్లు. గత ఐదేళ్ల క్రితం నేను చేయించిన రక్తపరీక్షలో హెచ్బీఎస్ఏజీ పాజిటివ్ అని తేలింది. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈ వైరస్ వల్ల ఎలాంటి హాని లేదని తెలిపారు. త్వరలో నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. నాకున్న ఈ సమస్య వల్ల నేను చేసుకోబోయే భార్యకు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? పెళ్లి చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించగలరు. - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు తెలిపిన వివరాలను చూస్తే మీకు ‘హెపటైటిస్-బి’ వైరస్ ఇన్ఫెక్షన్ సోకిందని తెలుస్తోంది. పరీక్షల తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. కాబట్టి మీరు ప్రస్తుతం క్యారియర్ దశలో ఉన్నారు. అంటే ఈ దశలో ఉన్నవారికి వైరస్ శరీరంలో ఉంటుంది. కానీ ఎలాంటి హానీ తలపెట్టదు. అయితే మీ రక్తం, వీర్యం ద్వారా హెపటైటిస్-బి ఇతరులకు సోకే అవకాశం ఉంది. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి ముందుగా మీరు చేసుకోబోయే భాగస్వామికి ఈ విషయం చెప్పండి. ఆమెకూ ‘హెపటైటిస్-బి’ పరీక్షలు నిర్వహించండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ లేనట్లయితే ఆమెకు హెపటైటిస్-బి వ్యాక్సిన్ ఇప్పించండి. మీరు క్రమం తప్పకుండా ప్రతి ఆర్నెల్లకోసారి ‘లివర్ ఫంక్షన్ టెస్ట్’ను చేయించుకోవాలి. ఆ పరీక్షల్లో ఏదైనా తేడా వస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. డాక్టర్ పి. భవానీ రాజు కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గైనకాలజీ కౌన్సెలింగ్
కోపం, చిరాకు పెరుగుతున్నాయి? నా వయసు 60 ఏళ్లు. లైంగిక కలయిక సమయంలో నొప్పిగానూ, యోనిలో మంటగానూ ఉంటోంది. సెక్స్పై ఆసక్తి లేదు. మతిమరపు, కోపం ఎక్కువ. చిరాకుగా ఉంటోంది. దీనివల్ల మావారు రోజూ అన్నిరకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఈ బాధలు చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి నా బాధను అర్థం చేసుకొని, సలహా ఇవ్వగలరు. - పద్మ, ఒంగోలు మీ వయసులో... అంటే అరవై ఏళ్లప్పుడు ఆడవాళ్ల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయి చాలా తగ్గడంతో యోనిలో స్రావాలూ తగ్గిపోతాయి. దాంతో అక్కడి లోపలి పొర పొడిబారిపోవడం వల్ల, యోని రంధ్రం చిన్నగా అవ్వడం వల్ల, కలయిక సమయంలో నొప్పి, మంట వస్తాయి. మొదట మీరు కలయిక సమయంలో కెవై జెల్లీ, ల్యూబిక్ జెల్లీ వంటి లూబ్రికేటింగ్ జెల్స్ వాడి చూడండి. అప్పటికీ ఇబ్బంది ఉంటే రెండువారాల పాటు కొంత ఈస్ట్రోజెన్ క్రీమ్ను వేలి సహాయంలో రోజూ యోనిలో రాసుకోండి. ఇలా వారం, పదిరోజులు ప్రయత్నించి చూడండి. ఇప్పుడు మీ వయసు 60 ఏళ్లు కాబట్టి... బీపీ, షుగర్ సంబంధిత వ్యాధులు లేకపోతే డాక్టర్ పర్యవేక్షణలో ఈస్ట్రోజెన్ మాత్రలు వాడవచ్చు. మీరు సిగ్గుపడకుండా ఒకసారి మీ దగ్గరలోని గైనకాలజిస్ట్ను సంప్రదించండి. మీరు వెలిబుచ్చే సందేహాలకు వారేమీ అనుకోరు. నిజానికి డాక్టర్లు ఉన్నది మీలాంటి వారికి సహాయం చేయడం కోసమే. నా వయసు 28. పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. నాకు తగిన సలహా ఇవ్వగలరు. - ప్రణీత, వరంగల్ మీరు రాసిన లేఖలో మీ బరువు ఎంతో రాయలేదు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడానికి ఎన్నో కారణాలుంటాయి. వాటిలో స్ట్రెస్, టెన్షన్ అధికబరువు పోషకాహార లేమి హార్మోన్లలో అసమతుల్యత పాలిసిస్టిక్ ఓవరీస్ గర్భసంచికి సంబంధించిన కారణాలు - పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియాసిస్ వంటివి కొన్ని. మీ సమస్యకు కారణం తెలుసుకోడానికి కొన్ని వైద్యపరీక్షలతో పాటు థైరాయిడ్, ప్రోలాక్టిన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ వంటి హార్మోన్ టెస్ట్లు, స్కానింగ్ ద్వారా ఓవరీస్లోని సిస్ట్లు, యూటెరస్ పరీక్షలు చేయాలి. పీరియడ్స్ కరెక్ట్గా రావడానికి మందులతోపాటు జీవనశైలిలో మార్పులూ చాలా ముఖ్యం. పోషకాహారం తీసుకోవడం, తగినంత ఎక్సర్సైజ్ చేయడమే లైఫ్స్టైల్ మాడిఫికేషన్లో ప్రధానంగా చేయాల్సిన మార్పులు. పీరియడ్స్ను సరిచేయడంలో హార్మోన్ ట్యాబ్లెట్లు తాత్కాలికంగా సహాయపడినప్పటికీ దీర్ఘకాలంలో జీవనశైలి మార్పులే పూర్తిస్థాయి ఆరోగ్యాన్నిస్తాయి. పీరియడ్స్ సక్రమంగా రానప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కూడా కష్టమే కాబట్టి ఆ పరిస్థితి వచ్చే వరకు ఎదురు చూడకుండా ఇప్పుడే డాక్టర్ని కలిసి తగిన చికిత్స తీసుకోండి. -
ఈ ట్రక్కుకు డ్రైవర్ అక్కరలేదు!
ఇప్పటి వరకు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి విన్నాం.. అక్కడక్కడ అవి హల్చల్ కూడా చేసేస్తున్నాయి. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల కాలం వచ్చేసింది. అమెరికాలోని ఓ కంపెనీ డ్రైవర్ లేకుండా డ్రైవింగ్ చేసే సరికొత్త ట్రక్కులను తయారుచేసింది. ఇది ప్రపంచంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కు. ట్రక్కులో ఉన్న రాడార్లు, స్కానర్లు రోడ్లపై వచ్చే వాహనాలను స్కాన్ చేసి ఎటువంటి ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేసేస్తుందట. ఇటీవలే అమెరికాలోని హూవర్ బ్రిడ్జిపై టెస్ట్ డ్రైవింగ్లో కూడా విజయవంతంగా పాస్ అయిందట. -
రాజధాని భూగర్భంపై పరిశోధన
ముందుకొచ్చిన ఎన్జీఆర్ఐ భూకంపాల ముప్పును పసిగట్టేందుకే విజయవాడ బ్యూరో: నవ్యాంధ్ర రాజధాని పరిధిలో భూపొరల స్థితిగతుల్ని ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్,హైదరాబాద్) పరిశోధించనుంది. ఈ ప్రాంతం భూకంప జోన్-3లో ఉండడంతో భవిష్యత్తులో విపత్తు అవకాశాల్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఎన్జీఆర్ఐని సంప్రదించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భాన్ని స్కాన్ చేయొచ్చని ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు చెప్పడంతో దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్జీఆర్ఐ బృందం ముఖ్యమంత్రిని సైతం కలసి ఈ ప్రాజెక్టుపై చర్చించింది. త్వరలో నిర్ణయం 212 చదరపు కి.మీ పరిధిలోని ప్రతిపాదిత రాజధానిలో భూపొరల్ని స్కానింగ్ చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ డేటాను సేకరించాకే పనుల్ని చేపట్టాలని యోచిస్తోంది. భూగర్భ పొరల స్కానింగ్కు రూ.20 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. -
స్కానింగ్ గది వద్దే ప్రసవించిన గర్భిణి
గుంటూరు జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం ఫలితం గుంటూరు: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఇది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా వేగంగా చికిత్స అందించడంలో వారు చూపిన నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ స్కానింగ్ గది వద్దే కటిక నేలపై ప్రసవించింది. ప్రసవ వేదనతో ఆమె పెట్టిన కేకలు వైద్యుల చెవికెక్కలేదు. పైగా, ప్రసవం అనంతరం నేలపై ఉన్న రక్తాన్ని ఆ మహిళ తల్లి చేతే కడిగించారు. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్)లో జరిగింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన దోమవరపు లావణ్య కాన్పు కోసం సోమవారం ప్రసూతి విభాగంలో చేరింది. పురుటి నొప్పులు రావటంతో స్కానింగ్ చేయించుకు రమ్మని గైనిక్ వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటి అండ్ ట్రామా సెంటర్లోని అల్ట్రా సౌండ్ స్కానింగ్ గది వద్దకు రాత్రి 8.50 గంటలకు తీసుకెళ్లారు. గంటకు పైగా ఉన్నా ఎవరూ రాలేదు. ఈలోగా లావణ్యకు నొప్పులు ఎక్కువయ్యాయి. తట్టుకోలేక రాత్రి 9.50 గంటల సమయంలో ఆమె స్కానింగ్ గది ముందే కూలబడిపోయింది. ఆమె ప్రసవ వేదనను చూసిన కొందరు మహిళలు చీరలు అడ్డుగా పెట్టారు. మరికొందరు ఆమెకు సపర్యలు చేశారు. లావణ్య కటిక నేలపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. -
కడుపులోని బిడ్డ.. కళ్ల ముందు!
ఒక బిడ్డకు జన్మనివ్వడం ద్వారా స్త్రీ అనుభవించే మాతృత్వపు మధురిమను మాటల్లో వర్ణించలేం. కడుపులో బిడ్డ కదిలినప్పుడల్లా ఆనందపడిపోతూ, ఎప్పుడెప్పుడు బుజ్జి ప్రాణాన్ని ఒళ్లో పెట్టుకొని లాలిద్దామా అంటూ తల్లి నవమాసాలూ అపురూపంగా మోస్తుంది. మరి.. కడుపులో ఉండగానే బిడ్డను కళ్లారా చూసుకునే అవకాశం వస్తే? సూపర్ కదూ! అలాగే, గుండెజబ్బుతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి స్కానింగ్లు, పరీక్షలు చేశాక ఎక్స్రే ఫిల్మ్లు పట్టుకొని చూస్తూ.. వైద్యులు అతడి గుండెకు చిల్లు పడింది చూడమంటూ అతడి గుండెను లైవ్లో కళ్లముందు చూపెడితే? లైవ్ హోలోగ్రామ్ (3డీ రూపాన్ని) పాయింటర్తో టచ్ చేస్తూ అటూ ఇటూ తిప్పిచూపిస్తూ వివరిస్తే? ఇది కూడా సూపర్ కదూ! అందుకే వీటిని నిజం చేసే టెక్నాలజీని ఇజ్రాయెల్కు చెందిన రియల్ వ్యూ కంపెనీతో కలసి ఫిలిప్స్ కంపెనీ ఇప్పుడు అభివృద్ధి పరుస్తోంది. ఈ టెక్నాలజీతో కడుపులోని బిడ్డను 3డీ హోలోగ్రామ్ రూపంలో కళ్లముందు కనిపించేలా చేయడమే కాదు.. ఆ బిడ్డను అటూఇటూ తిప్పుతూ అన్ని వైపులా చూపిం చొచ్చు కూడా! ఇదెలా సాధ్యమంటే.. ఫిలిప్స్ పరిశోధకులు తయారుచేసిన ఇంటర్వెన్షనల్ ఎక్స్-రే, కార్డియాక్ అల్ట్రాసౌండ్ సిస్టమ్ల ద్వారా శరీరంలోని అవయవాలను 3డీ చిత్రాలుగా మలుస్తారు. రియల్వ్యూ సిస్టమ్ ద్వారా ఆ 3డీ చిత్రాలను హోలోగ్రాఫిక్ రూపంలో లైవ్లో ప్రదర్శిస్తారు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు సైతం అవయవాలను లైవ్లో నిశితంగా పరిశీలించేందుకూ దీంతో వీలుంది. -
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం
సాక్షి, గుంటూరు: జిల్లాలో వ్యాధి నిర్ధారణకు ఏర్పాటు చేసే రక్త పరీక్ష కేంద్రాలు, ఎక్స్రే, స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుని లెసైన్స్ కలిగి ఉండాలి. పెరుగుతున్న వ్యాధులకు సమానంగా పరీక్ష కేంద్రాలు పుట్టుకొచ్చాయి. మండల కేంద్రాలతోపాటు, గ్రామాల్లో కూడా వెలుస్తున్నాయి. ఇవి రోగులకు అందుబాటులో ఉంటున్నా వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా లెసైన్స్లు లేకుండా నిర్వహించడమే ప్రాణాంతకంగా మారుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్లు, ఎక్స్రే సెంటర్లు ఏర్పాటు చేయాలంటే సంబంధిత పారామెడికల్ కోర్సులు పూర్తిచేసి సర్టిఫికెట్ పొందాలి. ఆ తరువాతే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి లెసైన్స్ మంజూరు చేస్తారు. లెసైన్స్ ఫీజుతోపాటు అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పాల్సి రావడంతో వ్యయం ఎక్కు వ అవుతుందని భావిస్తున్న అనేక మంది అనుమతుల జోలికి వెళ్లడం లేదు. మరి కొందరు వేరొకరి సర్టిఫికెట్తో లెసైన్స్ పొంది అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు చేయిస్తున్నారు. వ్యాధి నిర్ధారణలో వైద్య పరీక్షలు కీలకంగా మారిన తరుణంలో అర్హత లేని వ్యక్తులు ఇస్తున్న రిపోర్టులు ఏ మేరకు వాస్తవమనేది ఆలోచించాల్సిన విషయమే. అర్హత లేకుండా తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల సరైన వైద్యం అందక రోగులు మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయని వైద్యులే అంగీకరిస్తున్నారు. మెడికల్ దుకాణాలు ఇంతే.. మెడికల్ షాపులు సైతం లెసైన్స్ లేకుండా నడుస్తున్నాయి. మరికొందరు వేరేవారి బీఫార్మ్సీ సర్టిఫికెట్తో లెసైన్స్ సంపాదించి ఎలాంటి అర్హత లేని నలుగురు యువకులను నియమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు రాసిన మందులు అర్థంకాక చేతికొచ్చినవి ఇచ్చి పంపుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రోగాలు తగ్గడం మాట అటుంచి కొత్త రోగాలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. మామూళ్లు అందుకుంటూ... జిల్లాలో లెసైన్స్లు లేని ల్యాబ్లు, ఎక్స్రే కేంద్రాలు, మెడికల్ షాపులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదోఒక సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం వీరికి పరిపాటిగా మారిందనే విమర్శలు వినవస్తున్నాయి. నెలనెలా మామూళ్లు వసూలు చేస్తూ వారిపై చర్యలు తీసుకోకుండా మిన్నకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అధికారులే మామూళ్లు తీసుకుంటూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఇక తమగోడు ఎవరికి చెప్పుకోవాలంటూ రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే రోగుల ప్రాణాలు నిలిపిన వారవుతారు. -
‘స్కానింగ్’ నిప్పు
రోగ నిర్ధారణ చేయాల్సిన కొన్ని స్కానింగ్ సెంటర్లు గాడి తప్పాయి. కాసుల కోసం నిండు జీవితాల్లో నిప్పులు పోస్తున్నాయి. పుట్టబోయేది ఏ బిడ్డో చెప్పడం ద్వారా తల్లికి గర్భశోకం మిగిల్చి, కుటుంబాన్ని ఛిద్రం చేస్తున్నాయి. దీంతో ఆ బిడ్డలు గర్భంలోనే కరిగిపోతున్నారు. ఇంకొందరు లోకం వెలుగు చూడకుండానే మట్టిలో కలిసిపోతున్నారు. తిరుపతి కార్పొరేషన్: ‘ఆడపిల్ల పుట్టిందని తిరుపతికి చెందిన ఓ మహిళను అత్తారింటి వారు బయటకు గెంటేశారు. రెండో సారి ఆడపిల్ల అని తెలిసిన ఎంఆర్పల్లెకు చెందిన పుష్పలతకు అత్తా, భర్త కలసి బలవంతంగా అబార్షన్ చేయించారు’ ఇవి మచ్చుకు మాత్రమే. ఇలాంటి సంఘటనలు చెప్పాలంటే చాంతాడంత పొడుగు ఉంటుంది. చట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేస్తున్న స్కానింగ్ సెంటర్లే ఇందుకు ప్రధాన కారణం. లింగనిర్ధారణ చట్టవిరుద్ధమని దీనిని ప్రభుత్వం నిషేధించింది. అయితేనేం కళ్ల ముందు కాసులు చూపిస్తే నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ, పచ్చని కాపురాల్లో కలహాలు పెడుతున్నాయి జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు. గర్భంలోని శిశువు ఎదుగుదల, ఆరోగ్య స్థితి గతుల వివరాలను తెలుసుకునేందుకే స్కానింగ్ సెంటర్లు పనిచేయాలి. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తుండడంతో పుట్టేది ఆడపిల్లేనని ముందుగానే తెలిసిపోతోంది. దీంతో తొలి కాన్పు అనికూడా చూడకుండా భ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన జిల్లా వైద్యాధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో స్కానింగ్ సెంటర్లకు కాసుల పంట కురిపిస్తోంది. చట్టం వీరికి వర్తించదా? భ్రూణ హత్యలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం 1994లో ఒక చట్టాన్ని రూపొందించింది. దీన్ని గర్భస్థ పిండ పరీక్ష ప్రక్రియ చట్టంగా తీసుకొచ్చింది. ఆపై 2003లో సమగ్ర సవరణలతో గ ర్భదారణ పూర్వ, గర్భస్థ పిండ ప్రక్రియ (లింగ ఎంపిక నిషేధం) చట్టంగా ఏర్పాటు చేశారు. అయితే జిల్లాలో ఇష్టారాజ్యంగా స్కానింగ్ సెంటర్లు ఏర్పాటవుతుండడం, ఒక్క తిరుపతిలోనే దాదాపు 250కి పైగా ఉన్నట్టు అధికారులే చెబుతున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. స్కానింగ్ సెంటర్ల వద్దకు వచ్చే వారు తమ అవసరం, పరిస్థితులను బట్టి అధికంగా డబ్బులు ఆశచూపెడుతున్నారు. దీంతో నిబంధనలను పక్కనబెట్టి లింగనిర్ధారణ పరీక్షలను చేస్తూ అధికంగా సంపాదించుకుంటున్నారు. పేరుకే కమిటీలు ! జిల్లా స్థాయి మల్టీ మెంబరు అప్రాపరేట్ అథారిటీలో కలెక్టర్,జిల్లా న్యాయమూర్తి, ఎస్పీ, డీఎంహెచ్వో, ఎన్జీవో సభ్యుడు ఐదుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా అడ్వైజరీ కమిటీ 15 మంది సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుంది. ఈరెండు కమిటీలు ప్రతి రెండు నెలలకు ఒక సారి సమావేశం కావాలి. అలాంటి సమావేశాలు నిర్వహించినట్టు దాఖలాలు లేవు. జిల్లా డెమో విభాగాధికారులు స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులతో ప్రతినెలా సదస్సు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆఊసే లేదు. తాజా నిబంధనల ప్రకారం ప్రతి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు వైద్యులై ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకుండా కేంద్రాలను నిర్వహిస్తే వాటిని సీజ్ చేసి, నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. అయితే అవేమి లేకుండా కేవలం నోటీసులు జారీ చేసి మమ అనిపించేస్తున్నారు. చర్యలు తీసుకుంటున్నాము లింగనిర్ధారణ చట్టపరమైన నేరం. స్కానింగ్ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వస్తున్నాయి. ఇప్పటికే తిరుపతిలో వీణాకు స్కానింగ్ చేసి, లింగనిర్ధారణ పరీక్షలు చేసినందుకు నోటీసులు ఇచ్చాం. నగరంలో అనుమతిలేని కేంద్రాలను గుర్తించాం. ఆలాంటి కేంద్రాలను సీజ్ చేస్తాం. -డాక్టర్ దశరథరామయ్య,జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి -
హెచ్పీ నుంచి కొత్త తరం ప్రింటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ కంపెనీ హ్యూలెట్ ప్యాకర్డ్(హెచ్పీ) నూతన తరం లేజర్ జెట్ మల్టీఫంక్షన్ ప్రింటర్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు రకాల సిరీస్లో తయారైన ఈ ప్రింటర్ల ధరలు రూ.10 వేల నుంచి ప్రారంభమై రూ.3.35 లక్షల వరకు ఉన్నాయి. చిన్న, మధ్యతరహా కంపెనీలు, వాణిజ్య సంస్థలను ల క్ష్యంగా చేసుకుని వీటిని రూపొందించామని హెచ్పీ ఇండియా ప్రింటింగ్ సిస్టమ్స్ కేటగిరీ లీడర్ పరీక్షత్ సింగ్ తోమర్ మంగళవారమిక్కడ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. స్కాన్ చేసిన పీడీఎఫ్ కాపీలను ఎడిట్ చేసుకునే వీలు, సెక్యూరిటీ పిన్ ఇచ్చాకే ముద్రణ రావడం వంటి ఫీచర్లను ప్రింటర్లలో పొందుపరిచారు. ఎం630 సిరీస్ ప్రింటర్ల ధర రూ.2.34-3.35 లక్షల మధ్య ఉంది. ఇందులోని నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్తో ఐఫోన్6, ఆన్డ్రాయిడ్ కిట్క్యాట్ ఓఎస్తో రూపొందిన స్మార్ట్ఫోన్ల నుంచి డాక్యుమెంట్లను ప్రింట్ ఇవ్వొచ్చు. నకిలీ టోనర్ కార్ట్రిడ్జ్లకు అడ్డుకట్ట వేయడానికి కొత్త లేబుల్ను కంపెనీ పరిచయం చేసింది. -
చెకప్ ఎప్పుడెప్పుడంటే..?
ఆరోగ్యం స్త్రీ తొలిసారి గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు డాక్టర్ను ఎప్పుడెప్పుడు సంప్రదించాలో, ఏమేమి పరీక్షలు చేయించుకోవాలో అవగాహనకోసం... గర్భవతి అని నిర్ధారణ అయిన 10- 15 రోజులలో డాక్టర్ను సంప్రదించాలి. వారు రాసిన మందులను వాడుతూ, చెప్పిన జాగ్రత్తలను పాటిస్తుండాలి. ఆ తర్వాత మూడవ నెలలోపు ఒకసారి డాక్టర్ దగ్గరకెళ్లి, వారి సూచ న మేరకు స్కానింగ్ తీయించుకోవాలి. వైద్యులు వారికి సరిపడా రక్తం ఉందో లేదో తెలుసుకుని, తగిన జాగ్రత్తలు చెబుతారు. తర్వాత ఏడవ నెలవరకూ ప్రతినెలా, 8, 9 నెలలో ప్రతి పదిహేనురోజులకూ ఒకసారి, తొమ్మిదవ నెల వచ్చినప్పటినుంచి, కాన్పు అయ్యే వరకు వారానికోసారి డాక్టర్ వద్దకెళ్లి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ప్రతిసారీ డాక్టర్లు బీపీ సరిగా ఉందో లేదో పరీక్షిస్తారు. హెచ్చు తగ్గులుంటే తగిన మందులిస్తారు. అలాగే 3, 7, 9 నెలల్లో షుగర్ వ్యాధి ఉందో లేదో పరీక్షించి, లేదని నిర్ధారించుకున్నాక అది నియంత్రణలోకి వచ్చేందుకు తగిన మందులు ఇస్తారు. ఆహార విహారాల్లో మార్పులు ఏమైనా అవసరమైతే జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెబుతారు. -
పంచాయతీలకు మహర్దశ
రూ.58.44 కోట్లతో 487 పంచాయతీలకు సొంత భవనాలు రూ.25 లక్షలతో మండలానికో ఎమ్మార్సీ భవనం రూ.2 కోట్లతో జిల్లా కేంద్రంలో డీఆర్సీ భవనం రూ.3.76 కోట్లతో 376 పంచాయతీల్లో కంప్యూటరీకరణ 142 పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం చిత్తూరు(టౌన్) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆర్జీపీఎస్ఏ’ (రాజీవ్ గాంధీ పంచాయతీ స్వశక్తీకరణ్ అభియాన్) పథకంతో జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలకు మహర్దశ కలగనుంది. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలనే సదుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 487 పంచాయతీలకు సొంత భవనాలు జిల్లాలో మొత్తం 1,363 పంచాయతీలున్నాయి. వాటిలో 487 పంచాయతీలకుసొంత భవనాలు లేవు. వాటన్నిటికీ రూ.58.44 కోట్లతో సొంత భవనాలను నిర్మించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఐదు వేల మంది జనాభాకులోగా ఉండే పంచాయతీకి రూ.12 లక్షలు, దానికన్నా ఎక్కువగా ఉండే పంచాయతీలకు రూ.13.50 లక్షల చొప్పున మంజూరు చేసింది.మరమ్మతుల కోసం ఒక్కోదానికి రూ.3 లక్షలను మంజూరు చేసింది. వీటిని అంచెలంచెలుగా కంప్యూటరీకరణ చేపట్టనుంది. కంప్యూటర్ ఆపరేటర్లను కూడా ప్రభుత్వమే నియమించి వారికి జీతాలను చెల్లించనుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని రికార్డులను కంప్యూటరైజేషన్ చేయడం, గ్రామసభల నిర్వహణకు సంబంధించిన ఫొటోలు, మినిట్స్బుక్కులను స్కాన్చేసి నెట్లో పెట్టడం తదితర కార్యక్రమాలకు వీటిని ఉపయోగించుకునే వీలుకల్పిస్తోంది. ఫోన్బిల్లులనూ కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుంది. రూ.18.25 కోట్లతో ఎమ్మార్సీ, డీఆర్సీ భవనాలు స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రభుత్వ పథకాలపై ఆవగాహన కల్పించేందుకు అనువుగా ప్రతి మండలంలోనూ ఒక ఎమ్మార్సీ భవనాన్ని నిర్మించనుంది. దీనికోసం ఒక్కోదానికి రూ.25 లక్షలు, జిల్లా కేంద్రంలో నిర్మించే డీఆర్సీ భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేసింది. జిల్లాలోని 65 మండలాల్లో నిర్మించే ఎమ్మార్సీ, జిల్లా కేంద్రంలో నిర్మించే డీఆర్సీ భవనానికి గాను మొత్తం రూ.18.25 కోట్లు ఖర్చు చేయనుంది. కంప్యూటరీకరణలో మనమే ఫస్ట్ జిల్లాలోని 1,363 గ్రామ పంచాయతీల్లో తొలిదశగా 448 కంప్యూటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో మండలానికొకటి చొప్పున 65 మండలాలకు 65 కంప్యూటర్లు, 2 జెడ్పీకి, మరో 2 డీపీవో కార్యాలయానికి, 3 డీఎల్పీవో కార్యాలయానికి, 376 పంచాయతీలకు మంజూరు చేసింది. ప్రతి పంచాయతీకి ఒక కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ అవి పనిచేయడానికి బ్యాటరీతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లును చేపడుతున్నారు. వీటికోసం ప్రతి పంచాయతీకి ఇంచుమించు లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టింది. భవనాలు ఉన్న పంచాయతీల్లో కంప్యూటరీకరణ కోసం రూ.3.76 కోట్లను ఇప్పటికే ఖర్చు పెట్టింది. అయితే ఫోన్ కనెక్షన్ అందుబాటులో ఉండే 142 గ్రామ పంచాయతీలకు బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ కల్పించింది. పంచాయతీల కంప్యూటరీకరణలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. 135 పంచాయతీలకు డంపింగ్ యార్డులు జిల్లాలోని 135 పంచాయతీలకు డంపిం గ్ యార్డుల కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. దీనికోసం ప్రతేకంగా నిధులను మంజూరు చేసింది. చెత్తను సేకరించడానికి ట్రైసైకిళ్లు, యార్డు చుట్టూ ప్రహరీగోడ నిర్మాణం, బోరుబావి తవ్వకం, చెత్తను కత్తిరించే యంత్రాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం తదితరాల కోసం నిధులను విడుదల చేసింది. -
నగర ‘మెట్రో’ భద్రతకు నీళ్లు
సాక్షి, ముంబై : నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరుచూ సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారీ వర్షం కారణంగా మెట్రో బోగీలలోని ఏసీ గ్రిల్ నుంచి వర్షపు నీరు లోపలికి రావడంతో ప్రయాణికులు తడిసి ముద్దవుతున్నారు.. ఇదే సమస్య ఈ నెల ఐదో తేదీన కూడా ఎదురైంది. బోగీల లోపల వర్షపు నిలిచిపోయింది. మరోపక్క కొన్ని మెట్రో స్టేషన్లో బ్యాగులు స్కానింగ్ చేసే యంత్రాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు సరిగా పనిచేయడం లేదు. ముఖ్యంగా ప్రయాణికుల బ్యాగులు కచ్చితంగా స్కానింగ్ చేయాలి. కానీ అప్పుడప్పుడూ సాంకేతిక లోపంతో ఈ యంత్రాలు పనిచేయడం లేదు. మెట్రో భద్రత గాలిల్లో కలిసిపోయింది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మధ్య తరచూ.. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ల మధ్య ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇదివరకే సీరియస్గా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదే సమస్య పునరావృతమైంది. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. వారంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక స్టేషన్లో, ఏదో ఒక రైలు బోగీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ప్రారంభించిన రోజే ఓ స్టేషన్లో రైలు ఆగిపోయింది. ఆ తరువాత వారం, పది రోజుల్లోనే ఓ పక్షి ఓవర్ హెడ్ వైరులో చిక్కుకోవడం, మరో వారంలో ఓ బోగీ డోరు తెర్చుకోలేదు. ఈ ఘటన తరువాత రెండు రోజులకు ఓ వ్యక్తి మెట్రో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా పైలట్ గమనించి కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. తరువాత భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సఘటనతో 20 నిమిషాలపాటు రైలు నిలిపివేయాల్సి వచ్చింది. గత వారంలో మరోల్ స్టేషన్లో రైలు ఆగింది. కానీ రెండు బోగీల డోర్లు తెర్చుకోలేదు. తాజాగా మంగళవారం మళ్లీ ఏసీ గ్రిల్ నుంచి వర్షాపు నీరు లోపలికి రావడం ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. రోజు దాదాపు 16 లక్షల మందిని చేరవేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఐదు లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రవేశపెట్టిన ఈ మెట్రో రైళ్లలో తరుచూ ఎదురవుతున్న సమస్యల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
వైన్ స్కాన్
ఆదిలాబాద్ : నిన్నా మొన్నటి వరకు సూపర్బజార్లు.. ఏదేని పెద్ద పెద్ద షాపుల్లో వస్తువులు కొనుగోలు చేస్తే బార్కోడ్ సాయంతో ధర ప్రింట్ అయ్యేది. హోలోగ్రామ్పై కంప్యూటర్ స్కానర్తో పరిశీలించగానే ఆ వస్తువు ధర కంప్యూటర్లో ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడు ఆ విధా నం ఇక వైన్షాపుల్లోనూ రానుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ విధానాన్ని అమలుపర్చారు. బాటిల్ హోలోగ్రామ్లో కొత్తగా 2డీ బార్కోడ్ను రూపొందిస్తున్నారు. అయితే.. దీన్ని కొత్త వైన్షాప్ హోల్డర్లు వ్యతిరేకిస్తున్నారు. బాటిల్ వివరాలు ప్రత్యక్షం.. పాత ఎక్సైజ్ పాలసీలో మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్కోడ్ ఉండేది. ప్రస్తుతం హోలోగ్రామ్ 2డీ బార్కోడ్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్పీఎఫ్ఎస్) అనే సాఫ్ట్వేర్ను రూపొందిస్తోంది. డిస్టిలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు వైన్షాపులను అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టింది. మద్యం బాటిల్పై స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టిలరీ, డిస్టిలరీ నుంచి డిపో, డిపో నుంచి వైన్స్, ఏ రకం బ్రాండ్, దాని రేటు తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్పై ఉన్న ఎమ్మార్పీ కంటే షాపులో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు. గతంలో జిల్లాలో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తుండేవారు. దీంతో మందుబాబుల జేబులకు చిల్లు పడేది. ఇక బార్కోడ్ విధానం అమలైతే అధిక వసూలుకు బ్రేక్ పడనుంది. జిల్లాలో నాన్డ్యూటీపేడ్ (ఎన్డీపీ) లిక్కర్తోపాటు కల్తీ లిక్కర్ను విస్తృతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బార్కోడ్ అమలైన పక్షంలో నాన్డ్యూటీపేడ్ లిక్కర్కు కూడా చెక్పడే ఆస్కారం ఉంది. అయితే బార్కోడ్ విధానం వైన్షాపు యజమానులకు లాభం చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా ఓనర్ కౌంటర్ మీద ఉన్నా లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్కు అనుసంధానం చేస్తే సంక్షిప్త సమాచారం వస్తుంది. సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్లైన్లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజూ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుంది. ఎన్ని బాటిళ్లు అమ్ముడుపోయాయి.. ఏ బ్రాండ్ లిక్కర్ విక్రయాలు అమ్ముడుపోతున్నాయనే వివరాలు కంప్యూటర్లో తెలుసుకోవచ్చు. అదే సమయంలో తనిఖీల కోసం వెళ్లే అధికారులకు స్కానింగ్ ఆప్లికేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లను ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్ల ద్వారా మద్యం బాటిల్ను స్కాన్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్లో వస్తాయని, తద్వారా అది నాన్డ్యూటీపేడ్ లిక్కరా లేదా డ్యూటీపేడ్ లిక్కరా అని తేలిపోతుంది. ఇదిలా ఉంటే.. మంగళవారం వైన్షాపులను ప్రారంభించిన వైన్ షాపు యజమానులు ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ.50 వేల పైన ఖర్చవుతుందని, దాన్ని ఆపరేట్ చేసేందుకు జీతం ఇచ్చే వ్యక్తిని నియమించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే పర్మిట్ రూమ్ పేరిట రూ.2 లక్షలు, ప్రివిలేజ్ పేరిట ఏడు రెట్లు మద్యం అమ్మిన తర్వాత 13 శాతం ట్యాక్స్ విధిస్తున్నారని, ఈ విధానం అమలుచేస్తే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2డీ బార్కోడ్ విధానం అమలవుతుందా లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్ను వివరణ కోరగా ప్రతి వైన్షాప్లో విధిగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలని, వినియోగదారుడికి బిల్లు జారీ చేయాలని చెప్పారు. సోమవారమే కొత్త పాలసీ ప్రారంభమైనందున వైన్షాప్ యజమానులు తొందరగా ఈ విషయంపై దృష్టి సారించాలని, తప్పనిసరిగా బార్కోడ్ విధానం అమలుచేసి తీరుతామని పేర్కొన్నారు. -
గుండెనొప్పి వస్తే గుంటూరుకే!
పెద్దాస్పత్రిలో సౌకర్యాల లేమి అరకొర వైద్యులు, సిబ్బంది మందుల కొనుగోలుకు నిధుల్లేవ్ నేడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం విజయవాడ : అర్థరాత్రి నిండు గర్భిణీ ప్రసవ వేదనలో ఆస్పత్రికి వస్తే శిశువు ఎలా ఉందో స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. ఆ సమయంలో నొప్పులు పడుతూనే చిమ్మచీకటిలో కిరాయి ఆటోలో ప్రవేటు స్కానింగ్ సెంటర్కు తరలివెళ్లాల్సి వచ్చింది. వారం రోజుల కిందట ఏబై ఏళ్ల వ్యక్తికి గాయాలు కావడంతో 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి తలకు బలమైన గాయం కావడంతో గుంటూరు తీసుకెళ్లాల్సిందిగా రిఫర్ చేశారు. అతన్ని గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో రోగులు నగరం నుంచి గుంటూరుకు తరలివెళ్తుడంగా, మరికొందరు అప్పుచేసైనా చికిత్స చేయించుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. గుండెనొప్పితో నిరుపేద ప్రభుత్వాస్పత్రికి వస్తే వైద్యం అందని దయనీయ స్థితి నెలకొంది. ఆ విభాగంలో వైద్యులు లేకపోవడంతో గుంటూరుకు రిఫర్ చేయడంతో అక్కడకు వళ్లేందుకు అంబులెన్స్కు సైతం డబ్బుల్లేక ఎంతో మంది పేదలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రిఫరల్ ఆస్పత్రిగా ఉన్న పెద్దాస్పత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో సౌకర్యాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల నుంచి రోగులు ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారు. ఆస్పత్రిలో 790 పడకలు వున్నా, ఆ స్థాయిలో వైద్యులు, సిబ్బంది,సౌకర్యాలు లేక పోవడంతో వైద్యం అందని దుస్థితి నెలకొంది. ఆస్పత్రిలో ఎక్స్రే మిషన్ పదిహేనురోజుల కిందట పాడైనప్పటికీ, దానిని మరమ్మతు చేసేందుకు నిధులు లేక చేతులెత్తేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ప్రమాదంలో చేయి విరిగి వచ్చిన వారికి కనీసం ఎక్స్రే తీయలేని దుస్థితిలో ప్రభుత్వాస్పత్రి ఉంది. బర్న్స వార్డులో సౌకర్యాల లేమి... చికిత్స కోసం ఈ వార్డులో చేరిన రోగి, కాలిన గాయాల కన్నా వార్డులో ఉక్కపోతతోనే మృతి చెందడం తధ్యమని పలువురు వైద్య నిపుణులే అంటున్నారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, నిబంధనల ప్రకారం ఏసీలు, ఒక్కోరోగికి నెట్లు అందించాల్సి ఉండగా, పడకలపై బెడ్షీట్లు సైతం వేయలేని దుస్థితి నెలకొన్నట్లు సిబ్బందే చెపుతున్నారు. కాగా 410 పడకల ఆస్పత్రిగా ఉన్నప్పుడు 8 రేడియో గ్రాఫర్స్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 790 పడకలకు ఆస్పత్రి చేరుకున్నపటికీ రేడియో గ్రాఫర్ మాత్రం ఒక్కరే అందుబాటులో ఉండటం విశేషం. ఒక్క రేడియో గ్రాఫర్తో ఎలా ఎక్స్రేలు తీస్తారో ఉన్నతాధికారులకే తెలియాలని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఆరేళ్ల కిందట సీటీ స్కాన్ అందుబాటులోకి వచ్చినా, సీటీ టెక్నీషియన్ పోస్టులు నేటికీ అధికారికంగా కేటాయించలేదు. దీంతో టెంపరరీగా చేసే వారికి సైతం జీతాలు చెల్లించలేని దుస్థితిలో ఆస్పత్రి అధికారులున్నారు. ఆరోగ్యశ్రీ నిధుల నుంచి కొంత మొత్తం చెల్లిస్తుండగా ఇద్దరు టెక్నిషియన్లు మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో సీటీ స్కాన్ అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. ఆరు నెలలుగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో మందులు సైతం కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. సమయపాలన పాటించని సిబ్బంది... అరకొర సౌకర్యాలతో పాటు, సిబ్బంది సైతం సమయ పాలన పాటించకపోవడం రోగులకు మరింత శాపంగా మారుతోంది. మూడేళ్ల కిందట అప్పటి కలెక్టర్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశ పెట్టాలని ఆదేశించినా, నేటికీ అమలుకు నోచుకోని దుస్థితి నెలకొంది. ఈ విషయాలన్నింటిపై నేడు జరుగబోయే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో అమాత్యులు దృష్టి సారిస్తారో లేదో వేచిచూడాల్సిందే. -
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
డీఎంహెచ్ఓ ఆమోస్ మిర్యాలగూడ క్రైం : స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఆమోస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఐఎంఏ భవనంలో స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు, గైనకాలజీ డాక్టర్లకు గర్భస్త పిండ లింగ నిర్ధారణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్త పిండానికి సంబంధించిన వ్యా ధులను కనుగొనడానికి మాత్రమే స్కానింగ్ నిర్వహించాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆడ, మగ అని వివరాలు తెలపకూడదని అన్నారు. స్కానింగ్ సెంటర్లలో నిర్వహించే పరీక్షల వివరాలను ప్రతి నెల క్లస్టర్ కార్యాలయంలో అం దించాలని ఆదేశించారు. లింగనిర్ధారణ పరీ క్షలు చేసి అబార్శన్లు నిర్వహించినట్లు తెలిస్తే సంబంధిత డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. సమాజంలో రోజురోజుకు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్ల అనే వివక్షను ప్రతి ఒక్కరూ విడనాడాలని సూచించారు. సమావేశంలో మాస్ మీడియా అధికారి తిరుపత య్య, లీగల్ అడ్వయిజర్ వెంకట్రెడ్డి, ఎస్పీహెచ్ఓ కృష్ణకుమారి, ఐఎంఏ అధ్యక్షుడు కృష్ణప్రసాద్, డాక్టర్లు జ్యోతి, పారిజాత, శ్వేతారెడ్డి, క్లస్లర్ అధికారులు శ్రీనివాసస్వామి, శ్రీనివాసరావు, భగవాన్నాయక్, తిరుపతయ్య పాల్గొన్నారు. -
ప్రతి సీహెచ్ఎన్సీలోనూ స్కానింగ్ సెంటర్
విజయనగరం ఆరోగ్యం, న్యూస్లైన్ : ప్రతి సీహెచ్ఎన్సీలోనూ స్కానింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ కాంతిలాల్దండే అధికారులను ఆదేశించారు. గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగనిర్ధారణ వ్యతి రేక చట్టం-1994పై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 49 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, సీహెచ్ఎన్సీ ఎస్పీహెచ్ఓకు ఆ ప్రాంత పరిధిలో ఉన్న సెంటర్ల పర్యవేక్షణను అప్పగించామని ఈ సందర్భంగా డీఎం హెచ్ఓ స్వరాజ్యలక్ష్మి కలెక్టర్కు వివరించారు. రెండు కొత్త స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. లింగ నిర్ధారణ ఎక్కడైనా వెల్లడవుతుందా? అని ప్రశ్నిం చారు. ప్రతి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులూ నివేదికలను సకాలంలో ఇస్తున్నారా, లేదా? బాలబాలికల నిష్పత్తి ఏ విధంగా ఉందని డీఎంహెచ్ఓను ప్రశ్నించారు. జిల్లాలో లింగ నిర్ధారణ ఎక్కడా వెల్లడికావడం లేదని ఆమె సమాధానమిచ్చారు. ప్రతి వెరుు్య మంది బాలురకూ 960 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. కొమరాడ, సాలూరు, పాచిపెంట, ఎల్.కోటలలో వెరుు్య మంది బాలురకు వెరుు్యమంది బాలికలు ఉన్నారని తెలిపారు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం, బొబ్బిలి, గరివిడి మండలాల్లో బాలికల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారు. ఆడపిల్లల సంఖ్య తగ్గకుండా చూడాలని, ఈ మేరకు ఆశ వర్క ర్లు, ఏఎన్ఎంల ద్వారా గ్రామస్థారుులో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచిం చారు. చాలా మంది వైద్య సేవల కోసం, లింగ నిర్ధారణ తెలుసుకోవడానికి రాయగడ ప్రాంతానికి వెళ్తున్నారని పార్వతీపురం డిప్యూటీ డీఎంహెచ్ఓ ఉమమహేశ్వరావు చెప్పారు. పార్వతీపురం ప్రాంతంలోనూ మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గంటా హైమావతి, అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి సి.పద్మజ, డీటీసీఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మౌస్ కూడా స్కాన్ చేస్తుంది
తిరువనంతపురం: ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసుకోడానికి స్కానర్ లేదే అని ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు.. ఇకపై మీ ఇబ్బందులను కంప్యూటర్ మౌస్ తీర్చనుంది. స్కానర్లా పనిచేసే కొత్తరకం మౌస్లు వచ్చేస్తున్నాయి. ‘మొబ్స్కాన్’గా పిలిచే ఈ మౌస్లు స్కాన్ చేసిన డాక్యుమెంట్లను ఎడిట్ చేసేలా అభివృద్ధిపరిచారు. ఈ మొబ్స్కాన్ను బుధవారం తిరువనంతపురంలో అధికారికంగా ఆవిష్కరించినట్లు కంపెనీ అధికారి మైఖెల్బార్న్ తెలిపారు. ‘చూడడానికి సాధారణ కంప్యూటర్మౌస్లా ఉన్నా దీనికి అంతర్భాగంలో కెమెరా ఉంటుంది. పదాలను, టేబుల్స్ను, చిత్రాలను ఈ కెమెరా ఆధారంగా మొబ్స్కాన్ ఎడిట్ చేసుకుంటుంది’ అని కంపెనీ ముఖ్యఅధికారి ఏజీ. డక్యుడా వివరించారు. ఈ కొత్తరకం మౌస్ ధర సుమారు రూ. 6 వేలుగా నిర్ణయించారు. -
మౌస్ కూడా స్కాన్ చేస్తుంది
తిరువనంతపురం: ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసుకోడానికి స్కానర్ లేదే అని ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు.. ఇకపై మీ ఇబ్బందులను కంప్యూటర్ మౌస్ తీర్చనుంది. స్కానర్లా పనిచేసే కొత్తరకం మౌస్లు వచ్చేస్తున్నాయి. ‘మొబ్స్కాన్’గా పిలిచే ఈ మౌస్లు స్కాన్ చేసిన డాక్యుమెంట్లను ఎడిట్ చేసేలా అభివృద్ధిపరిచారు. ఈ మొబ్స్కాన్ను బుధవారం తిరువనంతపురంలో అధికారికంగా ఆవిష్కరించినట్లు కంపెనీ అధికారి మైఖెల్బార్న్ తెలిపారు. ‘చూడడానికి సాధారణ కంప్యూటర్మౌస్లా ఉన్నా దీనికి అంతర్భాగంలో కెమెరా ఉంటుంది. పదాలను, టేబుల్స్ను, చిత్రాలను ఈ కెమెరా ఆధారంగా మొబ్స్కాన్ ఎడిట్ చేసుకుంటుంది.’అని కంపెనీ ముఖ్యఅధికారి ఏజీ. డక్యుడా వివరించారు. ఈ కొత్తరకం మౌస్ ధర సుమారు రూ. 6వేలుగా నిర్ణయించారు. -
సామాజిక మాధ్యమానికీ ‘కోడ్’
రాజకీయ ప్రకటనలపై ఈసీ కన్ను వాటి ఖర్చూ అభ్యర్థుల ఖాతాలోకే న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారం కోసం, ముఖ్యంగా యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సోషల్ నెట్వర్కింగ్ సైట్ల (సామాజిక మాధ్యమం)నూ పార్టీలన్నీ పెద్దఎత్తున ఉపయోగిస్తుండటంతో ఎలక్షన్ కమిషన్ (ఈసీ) దృష్టి సారించింది. చెల్లింపు వార్తలను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా సామాజిక మాధ్యమంలో రాజకీయ ప్రకటనలకూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయా ప్రకటనలకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లోని ‘మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ’ నుంచి అనుమతి తీసుకోవడం సహా పలు నిబంధనలు విధించింది. ఆయా ప్రకటనలపై పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఖర్చు లెక్కలనూ తాము అడిగినప్పుడు సమర్పించాల్సి ఉంటుందని సైట్ల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ఈ సైట్లలో రాజకీయ ప్రకటనల వ్యయం అభ్యర్థుల ఎన్నికల ఖాతాలోకే వస్తుందని పేర్కొంది. 48 గంటలు ‘డ్రై డే’: మద్యాన్ని ఎరగా వేసి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగే 48 గంటలను ‘డ్రై డే’గా ప్రకటించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించింది. -
ఆడ పిండానికి అబార్షన్ గండం
నగరంలోని పలు ఆస్పత్రుల్లో కొనసాగుతున్న అమానుషం కాసులకు కక్కుర్తి పడుతున్న స్కానింగ్ సెంటర్లు కన్సల్ట్ వైద్యులతో గుట్టుగా సాగిస్తున్న దందా ఎంజీఎం, న్యూస్లైన్ : తల్లి కడుపులో ఎదుగుతున్న ఆడ పిండాలను అబార్షన్ గండం వెంటాడుతోంది. ఆడ శిశువుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా గర్భస్త ఆడ శిశువుల హననం కొనసాగుతోంది. ప్రాణాలు పోయాల్సిన వైద్యులే తల్లి కడుపులో ఆడ పిండాల ఆయువు తీస్తున్నారు. జిల్లాలో లైంగిక నిష్పత్తిలో సమతుల్యం దెబ్బతింటోందని స్వచ్ఛంద సంస్థలు, మీడియా గగ్గోలు పెడుతున్నా కొందరు వైద్యులకు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహాకులకు పట్టడం లేదు. కాసుల కోసం కక్కుర్తిపడి ఆడపిల్లను వద్దనుకునేవారికి అబార్షన్ చేస్తున్నారు. వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు. హన్మకొండలోని హనుమాన్నగర్(పెగడపల్లి డబ్బాలు)లో బుధవారం రాత్రి ‘సాక్షి’ సమాచారంతో మహాలక్ష్మి క్లినిక్లో వెలుగుచూసిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నగరంలో భ్రూణ హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. స్కానింగ్లో ఆడ పిల్ల అని తేలగానే తల్లిదండ్రులు అబార్షన్ కోసం తాపత్రయపడుతున్నారు. గ్రామాల్లోనైతే కొందరు ఆర్ఎంపీలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ గుట్టుచప్పుడు కాకుండా నగర శివార్లలోని పలు ఆస్పత్రుల్లో అబార్షన్లు చేయిస్తున్నట్లు తెలిసింది. మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆర్ఎంపీలు మగపిల్లలు కావాలనుకునే గర్భిణీలకు హన్మకొండ భీమారంలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించి, ఆడపిల్ల అని తేలితే అబార్షన్లు చేయిస్తున్నట్లు రెండు నెలల క్రితం ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సాక్షిలో డిసెంబర్ 20, 2013న కథనం ప్రచురించినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. లింగ నిర్ధారణతోనే.. కాసులకు కక్కుర్తిపడి నగరంలోని కొన్నిస్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు డాక్టర్లకు సహకరిస్తున్నారు. స్కానింగ్ చేసిన సమయంలో ఆడ, మగా అని లింగ నిర్ధారణ చేయడం నేరమైని తెలిసినా కొంద రు పెడచెవిన పెడుతున్నారు. అక్రమ సంపాదన కోసం అర్రులు చాస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు నిర్వహిస్తున్నారు. వైద్యాధికారుల నిరంతర పర్యవేక్షణ కొరవడడంతో వారు ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. స్కానింగ్ సెంటర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పలువురు పలుకుబడి ఉన్న వ్య క్తులు అడ్డుకోవడంతో అధికారులు కూడా చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న క్లినిక్లు నగర పరిధిలో పుట్టగొడుగుల్లా అనుమతి లేని క్లినిక్లు నడుస్తున్నాయి. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యం చేయడంతోపాటు ఏకంగా శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తుండడం గమనార్హం. అబార్షన్ కేసులో చిక్కిన మ హాలక్ష్మి క్లినిక్ను సదరు వైద్యురాలు 15 ఏళ్లుగా ఎలాం టి అనుమతులు లేకుండా నిర్వహిస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఆయుర్వేద వైద్యురాలైన డాక్టర్ ప్రమీలాకుమార్ ఎలాంటిఅర్హత లేకుండానే గైనకాలజిస్టుగా చెలామణి అవుతూ శస్త్రచికిత్సలు చేస్తున్నా వైద్యాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మహాలక్ష్మి క్లినిక్ సీజ్ చేస్తాం : డీఎంహెచ్ఓ ఆనుమతి లేకుండా క్లినిక్ నిర్వహించడమేగాక భ్రూణ హత్యకు పాల్పడిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ప్రమీల కుమార్ వ్యవహారంపై విచారణ జరుగుతుందని డీఎంఅండ్హెచ్ఓ సాంబశివరావు తెలిపారు. మహాలక్ష్మి క్లినిక్కు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయుర్వేద వైద్యురాలు శస్త్రచికిత్స చేయడానికి వీలు లేదని, ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేసే మెరుగైన సౌకర్యాలు కూడ ఏమీ లేవని స్పష్టం చేశారు. ఆస్పత్రిలో పెషంట్లు డిశ్చార్జ్ అయిన వెంటనే ఆస్పత్రిని సీజ్ చేస్తామని తెలిపారు. -
తల్లి ఒడిలో ప్రాణాలొదిలిన పసికందు
డబ్బులు లేక ఆస్పత్రి నుంచి ఇంటికి మరుసటి రోజు డబ్బులతో ఆస్పత్రికి వెళ్తుండగా ఘటన జ్వరంతో పసికందు మృతి కేసముద్రం,న్యూస్లైన్ : అప్పటిదాక చనుబాలు తాగుతూ.. బోసినవ్వులతో తల్లిని మురిపించిన ఆ బిడ్డ అమ్మఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. అప్పటి వరకు కన్నబిడ్డ నిద్రపోయాడని భావించిన ఆ తల్లికి కొంతసమయం తర్వాత బిడ్డ శాశ్వతంగా నిద్రపోయాడనే భరించలేని విషయాన్ని తెలుసుకుంది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలి గుండెలవిసేలా విలపించింది. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... అమీనాపురం గ్రామ శివారు సప్పిడిగుట్ట తండాకు చెందిన బానోతు సక్రు, స్వప్న దంపతులకు కుమారుడు శివాజీ(4)తోపాటు మరో మూడు నెలల బాబు ఉన్నాడు. నిరుపేద కుటుం బం కావడంతో సక్రు కేసముద్రం విలేజ్లో ఓ రైతుకు వద్ద జీతం ఉంటున్నాడు. మూడు నెలల క్రితం కుమారుడు జన్మించగా వారింట్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ బిడ్డకు జ్వరంతో ఫిట్స్ రావడంతో శుక్రవారం వరంగల్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పరీక్షలు నిర్వహించి, స్కానింగ్ తీయించాలని చెప్పాడు. దీంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చారు. శనివారం మళ్లీ ఫిట్స్ వచ్చింది. ఆ తర్వాత కొడుకు తేరుకున్నాక ఎలాగైనా డాక్టర్కు చూపించాలనుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి *4 వేలు అప్పు తెచ్చి జమ చేసుకున్నారు. తిరిగి మళ్లీ వరంగల్కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో స్వప్న, ఆమె అత్త, మరో బంధువుతో కలిసి తండా నుంచి కేసముద్రం స్టేషన్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. తల్లి ఒడిలో ఉన్న ఆ పసికందు పాలు పట్టించింది. మార్గమధ్యంలోనే ఆ పసికందు తుదిశ్వాస విడిచాడు. కాని ఆ తల్లి బిడ్డ నిద్రపోయాడనుకుని భావించింది. ఇంతలో వరంగల్కు వెళ్లే ప్యాసింజర్ వెళ్లిపోయిన విషయం తెలియడంతో బస్సుకు వెళ్దామని అంబేద్కర్ సెంటర్కు వచ్చారు. ఇంతలో పసి బిడ్డను స్వప్న అత్త ఎత్తుకోవడంతో ఆమెకు తన మనవడు చనిపోయాడని తెలుసుకుంది. కన్నీళ్లు దిగమింగుకుంటూ కోడలితో చెబితే ఏమవుతుందోనని కొంతదూరంలో నిలిచింది. తన బిడ్డను ఇవ్వమని అడగడంతో ఆమె కళ్లల్లో నీళ్లు దుమికాయి. నీ బిడ్డ లేడమ్మా అంటూ రోదించడంతో ఆ తల్లి ఒక్కసారిగా అయోమయానికి గురైంది. నడిరోడ్డుపైనే కుప్పకూలిపోయిన తల్లి కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. నవమాసాలు మోసిన ఆ తల్లి బిడ్డను తలుచుకుంటూ రోదించిన తీరు అక్కడున్న వారిన కలచి వేసింది. -
రాజస్థాన్లో రాబర్ట్ వాద్రా కలకలం
-
పెళ్లిచూపులు...అమ్మాయి ఇంట్లో అబ్బాయికి!
అసలు సమస్య ఇంతదాకా ఎందుకొచ్చిదంటే...కొత్తగా స్కానింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో, కడుపులో ఉన్న బిడ్డని స్కాన్ చేసి... ఆడపిల్ల అయితే పిండాన్ని చిదిమేసేవారు. లింగ నిర్థారణ చట్టం వచ్చేవరకూ ఇది ప్రబలంగా కొనసాగింది. దాంతో అమ్మాయిల కొరత విపరీతంగాఏర్పడింది. ఉన్న అమ్మాయిలేమో... సాఫ్ట్వేర్ వరుళ్లనే కావాలనుకుంటున్నారు. ‘‘మిస్టర్ కిరణ్, ఈరోజు ఆఫీసుకు వస్తారా...?’’ ‘‘తప్పకుండా! ఈరోజే రమ్మంటారా? ఎన్ని గంటలకు?’’ ఒక వ్యక్తి ఆఫీసుకు వెళ్లడానికి ఇంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నాడా అని కాస్త ఆశ్చర్యం వేసింది కదా? అంత ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ పిలుపు వచ్చింది అతడు పనిచేసే ఆఫీసు నుంచి కాదు... మ్యాట్రిమొనీ ఆఫీసు నుంచి! డామిట్... బిడ్డ కథ అడ్డం తిరిగింది. ‘పుత్రోత్సాహం తండ్రికి/పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా/పుత్రుని కనుగొని బొగడగ/పుత్రోత్సాహంబు నాడు పొందురు సుమతీ’ అని బద్దెన రాసిన వాస్తవానికి సమాజం సవరణలు తెచ్చేసింది. పుత్రుడు ప్రయోజకుడవుతున్నాడు. తండ్రి కంటే ఎక్కువ సాధిస్తున్నాడు. కానీ తల్లిదండ్రులకు పుత్రోత్సాహం ఉండటం లేదు. ఎందుకంటే... ఇప్పుడు మెచ్చాల్సింది జనులు కాదు, జనకులు (యువతుల తండ్రులు). ‘మల్లీశ్వరి’ సినిమాలో వెంకటేష్ని చూసి నవ్వుకున్నాంగానీ... గమనిస్తే మన చుట్టూనే బోలెడంతమంది పెళ్లికాని ప్రసాద్లు కనిపిస్తారు. వాళ్ల సంఖ్య ఇంతగా పెరగడానికి కారణమేంటో అమ్మాయిల తల్లిదండ్రుల ‘చిరు కోరికల’ జాబితా చూస్తే తెలుస్తుంది. ‘‘అబ్బాయి విషయంలో మాకు పెద్దగా కోరికలేం లేవండీ.. ఏదో ఒక ఉద్యోగం ఉంటే చాలు. కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజినీరై ఉంటే బావుంటుంది. జీతం కూడా లక్షలు అక్కర్లేదండీ... ఓ అరవై డెబ్భై వేలైనా సరిపోతుంది. అబ్బాయి మహేష్బాబులా ఉండక్కర్లేదు గానీ చూడ్డానికి బాగుంటే చాలు. జమిందారై ఉండాల్సిన పనిలేదు. అలా అని మరీ ఉద్యోగం మీదే ఏం ఆధారపడతాం చెప్పండి! ఎంతో కొంత భూమి/స్థలం ఉంటే ఇద్దరూ భరోసాగా బతకొచ్చు. అబ్బాయి కట్న కానుకలు అడిగేవాడైతే కష్టమండీ. మాకలాంటివి అస్సలు ఇష్టం ఉండదు’’. ఇదీ వరస! కన్యాశుల్కం పోయినా వరకట్నం సమస్య వదల్లేదని అమ్మాయిలంతా కంగారు పడతారు కానీ... ప్రస్తుతం కంగారుపడాల్సింది అబ్బాయిలే. ఎందుకంటే త్వరలోనే వరకట్నం అంతమై, మళ్లీ కన్యాశుల్క కాలం వచ్చేలా ఉంది. ‘‘దగ్గరపడటమేంటి, వచ్చేసింది. మా ఊళ్లో ఓ అమ్మాయికి ఐదు లక్షల ఎదురు కట్నమిచ్చి మరీ పెళ్లి చేసుకున్నారండీ’’ అని కొందరు నొక్కి వక్కాణిస్తున్నారు కూడా. ఎక్కడ చూసినా మావాడికి అమ్మాయి ఉంటే చూడండని అడగడమే. మా అమ్మాయికి అబ్బాయిని చూడండనేవాళ్లు తగ్గిపోతున్నారు. అమ్మాయిల కోసం సంబంధాలు వచ్చిపడుతుంటే.. ఇక అడగడమెందుకులే అని! మ్యాట్రిమొనీలన్నీ పెళ్లికాని ప్రసాదుల పుణ్యమా అని దివ్యంగా నడిచిపోతున్నాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో మాదిరి నిష్పత్తి 1:5కు తగ్గట్లేదు. అసలు సమస్యఇంతదాకా ఎందుకొచ్చిదంటే... కొత్తగా స్కానింగ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో, కడుపులో ఉన్న బిడ్డని స్కాన్ చేసి... ఆడపిల్ల అయితే పిండాన్ని చిదిమేసేవారు. లింగ నిర్థారణ చట్టం వచ్చేవరకూ ఇది ప్రబలంగా కొనసాగింది. దాంతో అమ్మాయిల కొరత విపరీతంగా ఏర్పడింది. ఉన్న అమ్మాయిలేమో... సాఫ్ట్వేర్ వరుళ్లనే కావాలనుకుంటున్నారు. దీంతోపాటు భూముల ధరల పెరగడంతో భూములున్నవారికి డిమాండ్ పెరిగింది. చదువుకున్న అమ్మాయిలేమో నగరాల్లో ఉన్నవారి వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రేమ పెళ్లిళ్లు కూడా పెరిగాయి. వెరసి అబ్బాయిలకు పిల్ల దొరకడమే కష్టమైపోతోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ సంపాదిస్తున్నారు. అంటే సంపాదనకు మించిన అర్హతేదో కావాలి. ఆ అర్హత సంపాదించేసరికి నెత్తిమీద అరెకరం పోవడం ఖాయం. ఇది మరో డిస్క్వాలిఫికేషను! - ప్రకాష్ చిమ్మల -
భ్రూణహత్యల నివారణపై దృష్టి పెట్టండి
ఒంగోలు సెంట్రల్, న్యూస్లైన్ : భ్రూణహత్యల నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అడిషనల్ డెరైక్టర్ కె.సుధాకర్బాబు ఆ శాఖ జిల్లా అధికారులను ఆదేశించారు. భ్రూణహత్యల నివారణ చట్టం అమలుపై అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖాధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి భ్రూణహత్యలను పూర్తిస్థాయిలో నివారించాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని చెప్పారు. రికార్డులు పరిశీలించాలని, అవకతవకలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నకిలీ కస్టమర్లతో స్కానింగ్ సెంటర్లపై ఆపరేషన్లు నిర్వహించి నిఘా పెట్టాలన్నారు. అందుకు సంబంధించి పలు సలహాలు, సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఎంహెచ్ఓ రామతులశమ్మ, జిల్లా వైద్యారోగ్యశాఖ డెమో అధికారి బి.శ్రీనివాసరావు, డీపీహెచ్ఎన్వో పి.నాగరత్నం, డీపీవో సుబ్బలక్ష్మి, లీగల్ కన్సల్టెంట్ ఎంఎల్ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. -
ఆహారాన్ని పరీక్షించేందుకు స్కానర్!
వాషింగ్టన్: ఆహారాన్ని పరీక్షించి అందులో ఉన్న అలర్జీ కారక పదార్థాలు, పురుగుమందుల అవశేషాలు, క్యాలరీలు, అదనంగా ఉన్న కొవ్వు వంటి వాటిని గుర్తించే వినూత్న స్కానర్ను టొరాంటో పరిశోధకులు తయారు చేశారు. ‘టెల్స్పెక్’ అనే ఈ పరికరంపై ఉండే ఓ బటన్ను నొక్కి పళ్లెంలోని ఆహారంపై అలా తిప్పితే చాలు.. స్కానింగ్ అయిపోతుంది. ఈ పరికరం నుంచి ఆహారంపై తక్కువ శక్తితో గల లేజర్ వెలువడుతుంది. లేజర్ ఆహారంపై పడగానే.. ప్రతిబింబించే కాంతి తరంగాలను ఇది రామన్ స్పెక్ట్రోమీటర్ సాయంతో పసిగడుతుంది. ఆ సమాచారాన్ని ఆన్లైన్లో ఉండే డాటాబేస్కు పంపిస్తుంది. దాంతో అక్కడ విశ్లేషణ పూర్తయి, వెంటనే సంబంధిత వివరాలు ఓ అప్లికేషన్ ద్వారా స్మార్ట్ఫోన్కు అందుతాయి. దీనితో ఆహార పదార్థాలను 97.7 శాతం కచ్చితత్వంతో స్కాన్ చేయొచ్చట. ఇప్పటిదాకా 3 వేల ఆహార పదార్థాలను స్కాన్చేసేలా డాటాబేస్ రూపొందించామని, ఇది దాదాపు అన్ని రకాల ఆహార పదార్థాలనూ స్కాన్ చేయగలదని దీన్ని తయారుచేసిన పరిశోధకులు ఇసాబెల్ హాఫ్మన్, స్టీఫెన్ వాట్సన్లు చెబుతున్నారు. షాపులలో ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు, హోటళ్లలో కూడా ఉపయోగపడే ఈ స్కానర్ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయనున్నారు. ధర రూ.19,752 మాత్రమే! -
నిఘా నేత్రం నీడలో మెట్రో!
సాక్షి, ముంబై: మరికొన్ని రోజుల్లో పరుగులు తీయనున్న నగర మొట్టమొదటి మెట్రో రైలు ప్లాట్ఫాంలను భద్రత దృష్ట్యా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దనున్నారు. మెట్రో స్టేషన్లలో పేలుడు పదార్థాల స్కానర్లు ఏర్పాటు చేయనున్నట్లు ముంబై మెట్రోవల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) పేర్కొంది. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ (బీఏసీ) కారిడార్ కోసం భద్రత విషయంలో ప్రపంచ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు వారు వివరించారు. అంతేకాకుండా హ్యాండ్ హెల్డ్ ఎక్స్ప్లోజివ్ డిటెక్టర్లు (హెచ్హెచ్ఈడీ) లను, స్నిఫర్ డాగ్స్, 700 సీసీ టీవీ కెమెరాలను మెట్రో స్టేషన్లలో ఏర్పాటుచేయనున్నారు. దీంతో ప్రయాణికుల 11.4 కి.మీ. ప్రయాణం ఎంతో సురక్షితంగా ఉంటుందని ఎంఎంఓపీల్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ మెట్రో ప్రాజెక్ట్ భద్రత విషయమై సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ను ఆశించవద్దని గతంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు వారు వివరించారు. అంతేకాకుండా రాష్ట్ర పోలీసులు, ఇతర ప్రైవేట్ భద్రతా సిబ్బంది ఈ కారిడార్లో కాపలాదారులుగా విధులు నిర్వహిస్తారు. ఇక్కడ అమర్చనున్న దాదాపు 100 సీసీ కెమెరాలు నిరంతరం నిఘా ఉంచుతూ దృశ్యాలను చిత్రీకరిస్తాయని వారు తెలిపారు. అంతేకాకుండా అన్ని స్టేషన్లలో సెక్యూరిటీ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయనున్నట్లు వారు వివరించారు. పెట్రోలింగ్ నిర్వహించే సిబ్బంది హెచ్హెచ్ఈడీలను కలిగి ఉంటారు. దీంతోపాటు కొంతమంది భద్రతా సిబ్బంది సివిల్ డ్రెస్లో విధులు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపా లు జరగకుండా చూస్తారు. రైళ్ల లోపల ఏర్పాటు చేసే సీసీటీవీ కెమెరాలతోపాటు కారిడార్లో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలను కంట్రోల్ రూంలకు అనుసంధానం చేయనున్నట్లు ఎంఎంఓపీఎల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. -
లింగ నిర్ధారణ నేరం
బొబ్బిలి, న్యూస్లైన్: స్కానింగ్ కేంద్రాల వద్ద పుట్టబోయే బిడ్డ గురించి చెప్పాలని ఒత్తిడి చేసినా, లింగ నిర్ధారణ చేసినా చట్టరీత్యా నేరమని జిల్లా విస్తరణ మాధ్యమికాధికారి జయప్రసాద్ అన్నారు. బొబ్బిలిలోని ఎన్జీఓ హోంలో బొబ్బిలి ఎస్పీహెచ్ఓ ఆధ్వర్యంలో ఉండే అన్ని పీహెచ్సీల సిబ్బందికి గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 65 వేల మంది ఆరేళ్ల లోపు బాల బాలికలు ఉన్నారన్నారు. వీరిలో మగపిల్లలు 54 శాతం మంది ఉన్నారన్నారు. బాలికల నిష్పత్తి తక్కువగా ఉందని, గర్భస్థ దశలోనే ఆడ పిల్లలను తొలగించడమే దీనికి కారణం అన్నారు.జిల్లాలో 48 స్కానింగ్ కేంద్రాలున్నాయని, వాటిలో నాలుగు ప్రభుత్వానికి చెందినవన్నారు. ప్రతి స్కానింగు కేంద్రం వద్ద లింగ నిర్ధారణ గురించి వచ్చే వారికి అవగాహన కల్పిస్తూ హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. కడుపులో ఉండే బిడ్డ గురించి బంధువులు ఎంత ఒత్తిడి చేసినా నిర్ధారించకూడదని, అలాగే ఒత్తిడి చేసే వారిపై కూడా కేసులు నమోదువుతాయన్నారు. స్కానింగు కేంద్రాల రిజిస్ట్రేషను సర్టిఫికెట్ కేంద్రం బయట, మిషన్ వద్ద కచ్చితంగా ఉంచాలన్నారు. నిర్ధారణ గురించి తెలుసుకోవాలన్నా, చెప్పినా రూ.50 వేల నుంచి లక్షరూపాయల వరకూ జరిమానా, 3 ఏళ్ల కారాగార శిక్ష ఉంటుందని హెచ్చరించారు. అలాగే వీరిపై బెయిల్లేని, రాజీ లేని కేసులు నమోదవుతాయన్నారు. వైద్య సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు ఎప్పటికప్పుడు స్కానింగు కేంద్రాలను తనిఖీ చేయాలని, హెచ్చరిక బోర్డులు, లెసైన్స్లు ఉన్నాయో లేదో తెలుసుకోవాలన్నారు. జిల్లా ప్రజలకు ఎక్కడ ఎటువంటి అనుమానాలు వచ్చినా 08922 234553 నంబరును సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంటువ్యాధుల విభాగం ఇన్చార్జి వి చంద్రశేఖరరాజు, ఎస్పీహెచ్ఒ శ్రీహరి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలి
విజయనగరం ఆరోగ్యం,న్యూస్లైన్: స్కానింగ్ సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఎస్పీహెచ్ఓలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్సీ సిబ్బందితో సమావేశం నిర్వహించి, వాటిలో చర్చించిన మినిట్స్ వివరాలను పంపించాలని కోరారు. జనవరి 19నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పారు. ఇటుక బట్టీలు, ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న వలస కుటుంబీకుల పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది పోలియో కేసు నమోదు కాకుండా చూడగలిగితే పోలియో రహిత దేశంగా మన దేశాన్ని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటిస్తుందని చెప్పారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాలన్నారు. ఇంటి ప్రసవాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో డీటీసీఓ రామారావు, డీఐఓ కిషోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దొంగనోట్ల కలకలం
జోగిపేట, న్యూస్లైన్: రూ.500 నోట్లను చూస్తే జోగిపేట వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఎంత దగ్గరి బంధువులు ఇచ్చినా అనుమానంగా చూస్తున్నారు. ఏకంగా వాటిని గుర్తించేందుకు పలువురు వ్యాపారస్తులు స్కానింగ్ యంత్రాలను కొనుగోలుచేస్తున్నారు. దీనికి కారణం ఈ ప్రాంతంలో దొంగనోట్ల చెలామణి అధికంగా ఉండడమే. వివరాల్లోకి వెళ్తే.. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పత్తి కొనుగోలు చేసేం దుకు వచ్చిన వ్యాపారస్తులు రైతులను దొంగనోట్లతో నిలువునా మోసం చేస్తున్నారు. ఇటీవల జోగిపేట ప్రాంతానికి చెందిన రైతు మద్నూర్ ప్రాంతంలో పత్తిని విక్రయించగా వారు ఇచ్చిన డబ్బులతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. అతడు రూ.500 నోటును తీసుకొని కిరాణదుకాణానికి వెళ్లగా అనుమానం వచ్చిన కిరాణదారుడు స్కానింగ్ మిషన్లో పరీక్షిం చాడు. దీంతో అది దొంగనోటుగా తేలింది. ఈ విషయం చెప్పడంతో రైతు తనకు పత్తి విక్రయదారుడు ఇచ్చిన అన్ని నోట్లను స్కాన్ చేయిం చాడు. అందులో రూ.5 వేల వరకు దొంగ నోట్లుగా తేలింది. దీంతో బాధిత రైతు లబోదిబోమన్నాడు. స్థానికంగా ఉన్న దుకాణాలలో రోజుకో చోట రూ.500, రూ.1000 నోట్లు వస్తూనే ఉన్నాయి. దీంతో వ్యాపారస్థులు ఈ నోట్లను చూస్తే చాలు వణికిపోతున్నారు. బ్యాంకుల్లో కూడా వచ్చిన నోట్లను అధికారులు గుర్తించి పెన్నుతో కొట్టేసి తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. గత సంవత్సరం కూడా పుల్కల్ మండలం చౌటకూర్ గ్రామంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులు రూ.15 నుంచి 20 వేల వరకు దొంగనోట్లు వచ్చాయి. తర్వాత గుర్తించిన రైతులంతా వారి వద్దకు పరుగులు తీసిన విషయం పాఠకులకు విదితమే. స్థానిక పెట్రోల్ బంక్లల్లో ఎవరైనా రూ.500 నోటు ఇస్తే వారి వాహనం నంబరును కూడా ఆ నోటుపై రాసి పెడుతున్నారు. ఇటీవల పోసానిపేటకు చెందిన ఒక రైతు టాక్టర్ కిరాయిగా మూడు వెయ్యి రూపాయల నోట్లను ట్రాక్టర్ యజమానికి ఇవ్వగా అవి దొంగనోట్లు అని తేలడంతో ఈ వ్యవహరం పోలీస్స్టేషన్ వరకు వెళ్లినట్లు సమాచారం. దొంగనోట్లు వస్తుండడంతో ఆందోళన చెందుతున్న వ్యాపారస్థులు చేసేదిలేక డబ్బు లు లెక్కించే మిషన్లు కొనుగోలు చేస్తున్నారు. పట్టణంలో ఇప్పటికే 20 నుంచి 30 వరకు మిషన్ల కొనుగోలు చేసినట్లు తెలిసింది. పోలీస్శాఖ దొంగనోట్లకు సంబంధించి ప్రత్యే క నిఘాను ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యాపారస్థులు, ప్రజలు కోరుతున్నారు. -
ఆస్పత్రుల్లో స్కానింగ్యంత్రాలపై పరిమితులు: అజయ్ సహాని
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలోని ప్రైవేటు నర్సింగ్ హోమ్లు, ఆస్పత్రి వర్గాలు సంబంధిత అధికారుల అనుమతి లేకుండా స్కానింగ్యంత్రాలు కొనుగోలు చేయకూడదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహాని ఆదేశించారు. తయారీ దారులు, దిగుమతిదారులు, డీలర్లు, సరఫరాదారులు, ఏజెంట్లు యంత్రాలు సరఫరా చేస్తున్నప్పుడు రాష్ట్ర అధికారుల నుంచి రిజిస్టర్ చేయించుకోవాలని పేర్కొన్నారు. సరఫరాదారులు లేదా డీలర్లు ప్రతి మూడు నెలలకోసారి అమ్మకాలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలా చేయక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా అల్ట్రాసౌండ్ మెషిన్లను విక్రయించడం, నెలకొల్పడం ద్వారా లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, వీటిని నివారించేందుకే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. నర్సింగ్హోమ్ యజమానులు యంత్రాలు కొనుగోలు చేసినప్పుడు అధికారులు విధిగా పరిశీలిస్తారని అన్నారు. స్కానింగ్ పరీక్షలు చేసే ఆస్పత్రులు ప్రతి నెలా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
గర్భంలోనే సమాధి
సాక్షి, కరీంనగర్ : జిల్లావ్యాప్తంగా 228 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. కరీంనగర్తోపాటు అన్ని పట్టణాల్లోనూ ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఎక్కడ కూడా లింగనిర్ధారణ పరీక్షలకు సంబంధించి నియంత్రణలు ఉన్నట్టు కనిపించడంలేదు. లింగనిర్ధారణ నిషేధ చట్టం అమలులోకి వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు అవుతున్నా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, పరీక్షలు చేయించుకున్నవారి మధ్య పరస్పర అంగీకారం వల్ల ఈ అక్రమం వెలుగుచూడడంలేదు. కఠిన శిక్షలున్నా ... ఆడపిల్లల పట్ల వివక్ష పెరగడం, అడ్డగోలుగా భ్రూణహత్యలు జరగడంతో ప్రభుత్వం గర్భధారణపూర్వ, గర్భస్థ పిండ నిర్ధారణ నిషేధ (పీసీ, పీఎన్డీటీ) చట్టాన్ని 1994లో తీసుకొచ్చింది. ఇందులో లోపాలను తొలగిస్తూ, నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ 2003లో చట్టాన్ని సవరించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే మొదటిసారి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదే నేరాన్ని రెండవసారి చేస్తే ఐదేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా విధిస్తారు. భ్రూణహత్యలకు కూడా శిక్షలు కఠినంగానే ఉన్నాయి. ఇలాంటి ఘటనల్లో అబార్షన్ చేయించిన వారి కుటుంబసభ్యులపైనా చర్యలు తీసుకునే వీలుంది. భ్రూణహత్యలకు పాల్పడిన వారికి మొదటి నేరమయితే మూడేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా, అదే నేరం తిరిగి చేస్తే ఐదేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధిస్తారు. వైద్యుల లెసైన్సులను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తాత్కాలికంగా గానీ, శాశ్వతంగా గానీ రద్దు చేయవచ్చు. శిక్షలు ఎంత కఠినంగా ఉన్నా పర్యవేక్షణ కరువు కావడం ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోంది. సమావేశాల ఊసేదీ... లింగనిర్ధారణ నిషేధ చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఉన్నతస్థాయి అధికార కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన పనిచేసే కమిటీలో జిల్లా జడ్జీ, ఎస్పీ, ఒక స్వచ్చంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యదర్శిగా ఉంటారు. డివిజన్ స్థాయిలో ఆర్డీవో అధ్యక్షతన పోలీసు అధికారి, న్యాయవాది, ఎన్జీవో ప్రతి నిధి, ఆరోగ్యశాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ క మిటీ కనీసం నెలకోసారయినా సమావేశం కావాలి. వివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించాలి. జిల్లాస్థాయి కమిటీ సమావేశం మూడు నెలల క్రితం జరిగింది. ఆ తర్వాత దాని ఊసే లేదు. అమ్మాయిలంటే చిన్నచూపు... ఆడపిల్లల పట్ల జిల్లాలో వివక్ష పెరుగుతోంది. ఆడ, మగ పిల్లల సంఖ్యలో పెరుగుతున్న తేడా దీనికి అద్దంపడుతోంది. ఆరేళ్లలోపు పిల్లల్లో బాలురు 51.90 శాతం అయితే, బాలికలది 48.10 శాతమే. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఆరేళ్లలోపు పిల్లలు 3,36,054 మంది కాగా, ఇందులో 1,62,406 మంది బాలికలు. 1,74,647 మంది బాలురు. జిల్లాలో ప్రతి వెయ్యిమంది బాలురకు 914 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. వంశోద్ధారకుల కోసం ఆరాటపడుతున్నవారి చర్యలతో ఈ పరిస్థితి తలెత్తుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆకాశంలో సగం... అన్నింట్లో సగం అని వల్లించడం తప్ప ఆచరణలో ఆడవారిని సమానంగా చూడలేకపోతున్నారు. మగ సంతానం కోసం తాపత్రయపడుతూ ఆడపిల్లలను తల్లిగర్భంలోనే హతమారుస్తున్నారు. మహిళల రక్షణ కోసం, వివక్షను అంతం చేసేందు కోసం తెచ్చిన చట్టాల అమలు విషయంలో అధికారులు ప్రదర్శించే నిర్లక్ష్యం వెనుక ఉన్నది కూడా వివక్షేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పరీక్షలు చేస్తే కఠిన చర్యలు - డిఎంహెచ్వో కొమురం బాలు లింగనిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. జిల్లావ్యాప్తంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహణపై మా అధికారుల పర్యవేక్షణ ఉంది. లింగ నిర్థారణ పరీక్షల నియంత్రణకు సంబంధించి చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాలబాలికల నిష్పత్తిలో తేడాకు లింగనిర్ధారణ మాత్రమే కారణమని భావించలేము. జిల్లాస్థాయి కమిటీ సమావేశం ఈ నెలలోనే జరుగుతుంది. -
చిన్న సమస్యకు అంత పెద్ద చికిత్స అవసరమేనా?
నా వయసు 35. ఈ మధ్య పళ్లు లాగుతున్నట్లు అనిపిస్తే డెంటిస్ట్ దగ్గరకెళ్లాను. ఆయన ఎక్స్రే తీసి చిగుళ్లకు చిన్న సర్జరీ చేయాలని, లేకుంటే పళ్లు ఊడిపోయే ప్రమాదం ఉందన్నారు. నాకైతే సమస్య అంత పెద్దగా అనిపించడం లేదు. డాక్టర్గారేమో ఆపరేషన్ చేస్తానంటున్నారు. ఎందుకో అనుమానంగా ఉంది. ఇది నిజమేనంటారా? సలహా ఇవ్వండి. - బి. లక్ష్మి, కాకినాడ దంత సమస్యల్లో చాలా వరకు నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చేవేనని చెప్పుకోవచ్చు. మనందరికీ ప్రతి ఆరునెలలకోసారి రెగ్యులర్గా డెంటిస్ట్ను కలవడం అనే అలవాటు లేకపోవడం, దంత సమస్యల పట్ల అవగాహన తక్కువగా ఉండటంతోపాటు బాగా నొప్పి ఉంటేనే జబ్బు వచ్చినట్లుగానూ, నొప్పి, బాధ లేకపోతే చిన్న సమస్యగా భావిస్తాం. అందువల్లే చాలా దంత సమస్యలు డాక్టర్ గారు ఎక్స్రే, స్కానింగ్ తీసినప్పుడు బయట పడతాయి. ఇవి కేవలం నోటి ఆరోగ్యానికే కాకుండా శరీర ఆరోగ్యం విషయంలో కూడా వర్తిస్తుంది. బహుశ మీ ఎక్స్రే చూసినప్పుడ డాక్టర్ గారికి చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండటం, పంటికి ఆధారంగా ఉన్న ఎముక అరిగిపోవటం లాంటివి కనిపిస్తే... చిగుళ్లను దృఢంగా చేయడానికి చిన్నపాటి చిగుళ్ల సర్జరీలు చేసుకోమని సలహా ఇస్తుంటారు. ఇప్పటికీ చాలామంది ఇటువంటి సలహా పొందినప్పుడు చికిత్సకు మొగ్గు చూపరు. కారణం వీలైనంత వరకు చికిత్స లేకుండా దానంతట అదే మందులతోనో, ఇంజెక్షన్ల ద్వారానో, వివిధ రకాలైన టూత్ పేస్టుల వంటి వాటితో తగ్గించేసుకుందామనే భావన ఎక్కువగా ఉండటమే. అందుకే మార్కెట్లో దొరికే లేదా అడ్వటైజ్మెంట్లలో కనిపించే ప్రతి టూత్పౌడరునీ, పేస్టునీ కొని ప్రయత్నం చేస్తుంటారు. సమయం గడిచే కొద్దీ సమస్య మరింత ముదిరిపోయి, తర్వాత ఇబ్బంది పడతారు. మీరు కలిసిన స్పెషలిస్టు తీసుకున్న నిర్ణయాలు మీకు అనుమానంగా అనిపిస్తే మరొక డెంటిస్ట్తో సరి చూసుకోవచ్చు. (క్రాస్ వెరిఫికేషన్) ఒకరికి ఇద్దరు డాక్టర్ల అభిప్రాయాలు తీసుకోవడంలో తప్పు లేదు. కాని జబ్బు ఉందని తెలిసినప్పుడు చిన్నదైనా, పెద్దదైనా చికిత్సని ఏదో ఒక వంకతో వాయిదా వేయడం మంచిది కాదు. డాక్టర్ పార్థసారథి, కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్