Shahid Afridi
-
మార్చి పడేయండి.. అంత సీనుందా?.. వసీం అక్రంకు ఆఫ్రిది కౌంటర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో చెత్త ప్రదర్శన కారణంగా రిజ్వాన్ బృందంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విరుచుకుపడుతున్నారు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగి ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడాన్ని తప్పుబడుతున్నారు.కనీసం ఒక్క విజయం కూడా లేకుండానే ఈ వన్డే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడాన్ని తప్పుబడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(PCB) ఇప్పటికైనా ప్రక్షాళన చర్యలు చేపట్టాలని.. ఆటగాళ్ల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ పేస్ బౌలర్ వసీం అక్రం(Wasim Akram) కూడా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.5-6 మార్పులు చేయాల్సి వచ్చినాటెన్ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘‘జరిగిందేదో జరిగింది. ఇదే జట్టుతో గత రెండేళ్లుగా మనం ఎన్నో పరిమిత ఓవర్ల మ్యాచ్లు కోల్పోయాం. ఇప్పటికైనా కఠినమైన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని వకార్ యూనిస్ అంటున్నాడు. ఒకవేళ మన జట్టులో 5-6 మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వెనుకాడకండి.ఇదే జట్టును మాత్రం కొనసాగిస్తే వచ్చే ఆరునెలల్లో మనం మరిన్ని చేదు అనుభవాలు చూస్తాం. టీ20 ప్రపంచకప్-2026కు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయండి’’అని వసీం అక్రం పీసీబీకి సూచించాడు. అయితే, ఈ దిగ్గజ ఫాస్ట్బౌలర్ వ్యాఖ్యలపై పాక్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది అభ్యంతరం వ్యక్తం చేశాడు.‘‘వసీం భాయ్ మాటలు నేను విన్నాను. టీమిండియా చేతిలో ఓటమి తర్వాత మనమంతా భావోద్వేగంలో మునిగిపోయిన మాట వాస్తవం. అయినా.. జట్టు నుంచి 6-7 మంది ఆటగాళ్లను తప్పించాలని వసీం భాయ్ అంటున్నాడు.నిజంగా అంత సీనుందా?ఒకవేళ అదే జరిగితే.. మనకు వారి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐదారుగురు ప్లేయర్లు ఉన్నారా?.. మన బెంచ్ బలమెంతో మీకు తెలియదా వసీం భాయ్! మన దేశవాళీ క్రికెటర్లలో అంతర్జాతీయ స్థాయిలో రాణించగల ఆటగాళ్లు ఎంతమంది?.. ఒకవేళ మీరన్నట్లు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగిస్తే వారిలో ఎంత మందికి సరైన రీప్లేస్మెంట్ దొరుకుతుంది? మీరేమో ప్రపంచకప్నకు ఇప్పటి నుంచి సిద్ధం కావాలని చెబుతున్నారు.కానీ ఒకవేళ మనం ఆ పని మొదలుపెట్టినా.. అప్పుడు కూడా మన మీద ఏడ్చేవాళ్లు చాలా మందే ఉంటారు. పీసీబీ ఎలాంటి చర్యలు తీసుకున్నా మళ్లీ విమర్శలు వస్తూనే ఉంటాయి’’ అని షాహిద్ ఆఫ్రిది సామా టీవీ షోలో వసీం అక్రం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూప్-‘ఎ’లో భాగంగా తొలుత న్యూజిలాండ్ చేతిలో ఓడిన రిజ్వాన్ బృందం.. రెండో మ్యాచ్లో దాయాది భారత్ చేతిలో పరాజయం పాలైంది. అనంతరం బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దు కావడంతో ఒక్క గెలుపు కూడా లేకుండానే ఈ మెగా టోర్నీలో తమ ప్రయాణం ముగించింది. ఇక ఈ ఈవెంట్లో భారత్, న్యూజిలాండ్ , పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో పాటు.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ బరిలో నిలిచాయి.చదవండి: 'భారత్దే ఛాంపియన్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క పరుగు తేడాతో'.. క్లార్క్ జోస్యం -
క్రిస్ గేల్ను అధిగమించిన రోహిత్.. ప్రపంచ రికార్డుకు గురి
తాను బ్యాట్ ఝులిపిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్ల పరిస్థితి ఎలా ఉంటుందో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి నిరూపించాడు. ఇంగ్లండ్తో రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగి.. బౌండరీలు, సిక్స్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రో‘హిట్’.. వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్(Chris Gayle) సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టాడు. అంతేకాదు.. అరుదైన ప్రపంచ రికార్డుకు మరింత చేరువయ్యాడు.కాగా గత కొంతకాలంగా బ్యాటింగ్ కష్టాలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ.. కటక్ వన్డేతో ఫామ్లోకి వచ్చేశాడు. ఇంగ్లండ్(India vs England)తో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో డెబ్బై ఆరు బంతుల్లోనే శతకమార్కును అందుకుని.. తన వన్డే కెరీర్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో పన్నెండు ఫోర్లతో పాటు.. ఏడు సిక్స్లు ఉన్నాయి.రెండో స్థానానికి ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ రెండోస్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ను అధిగమించి షాహిన్ ఆఫ్రిది తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 267 వన్డేలు పూర్తి చేసుకున్న రోహిత్ 338 సిక్స్లు బాదాడు.మరోవైపు.. వెస్టిండీస్ తరఫున 301 వన్డేల్లో గేల్ 331 సిక్సర్లు కొట్టాడు. ఇక పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్లతో వన్డేల్లో అత్యధిక సిక్సర్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. అతడి ప్రపంచ రికార్డుకు రోహిత్ శర్మ ఇంకా కేవలం పదమూడు సిక్స్ల దూరంలో ఉన్నాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో ఓవరాల్గా టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఇప్పటికే అత్యధిక సిక్సర్ల వీరుడిగా అవతరించిన విషయం తెలిసిందే. అతడి ఖాతాలో ఏకంగా 631 సిక్స్లు ఉన్నాయి. రోహిత్ వన్డేల్లో 338, టీ20లలో 205, టెస్టుల్లో 88 సిక్స్లు బాదాడు.సిరీస్ కైవసంకాగా ఇంగ్లండ్తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడుతున్న టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలుత సూర్యకుమార్ బృందం ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో సొంతం చేసుకోగా.. మరో వన్డే మిగిలి ఉండగానే వన్డే సిరీస్ను రోహిత్ సేన 2-0తో కైవసం చేసుకుంది. కటక్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. బట్లర్ బృందాన్ని 304 పరుగులకు ఆలౌట్ చేసింది.ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ... మొత్తంగా తొంభై బంతుల్లో 119 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ మెరుపు అర్ధ శతకం(52 బంతుల్లో 60) రాణించగా.. శ్రేయస్ అయ్యర్(44), అక్షర్ పటేల్(41 నాటౌట్) మరోసారి రాణించారు.ఈ క్రమంలో 44.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. హిట్ షోతో అలరించిన రోహిత్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య బుధవారం ఆఖరి వన్డే జరుగుతుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండుల్కర్ను దాటేసి.. -
బాబర్ కాదు!.. వాళ్ల అసలు టార్గెట్ అతడే: పాక్ మాజీ క్రికెటర్
ఇంగ్లండ్తో మిగిలిన రెండు టెస్టులకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎంపిక చేసిన జట్టుపై దుమారం రేగుతోంది. కొత్త సెలక్షన్ కమిటీ వచ్చీ రాగానే స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేయడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బాబర్కు మద్దతుగా పలువురు కామెంట్లు చేస్తుండగా.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ మాత్రం భిన్నంగా స్పందించాడు.బలిపశువు అతడేపీసీబీ కొత్త సెలక్టర్ల టార్గెట్ బాబర్ కాదన్న బసిత్ అలీ.. షాహిన్ ఆఫ్రిదిని బలిపశువును చేయాలని వాళ్లు ఫిక్సయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. షాహిన్.. షాహిద్ ఆఫ్రిదికి అల్లుడు కావడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టుల్లో వరుస వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాక్ జట్టు.. స్వదేశంలో తాజా ఇంగ్లండ్తో సిరీస్లోనూ అదే పునరావృతం చేస్తోంది.మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ముల్తాన్లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక జట్టు చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన షాన్ మసూద్ బృందం.. మంగళవారం నుంచి రెండో టెస్టు మొదలుపెట్టనుంది. ఇదిలా ఉంటే.. మొదటి టెస్టులో ఓటమి అనంతరం పీసీబీ తమ మాజీ క్రికెటర్లు ఆకిబ్ జావేద్, అసద్ షఫీక్, అజహర్ అలీ తదితరులతో నూతన సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది.అది అతడి దురదృష్టంఈ నేపథ్యంలో బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘స్వప్రయోజనాల కోసం బ్యాటింగ్ పిచ్ను తయారు చేయించుకున్నారు. అలాంటి పిచ్పై బాబర్ ఆడలేకపోవడం, ఫామ్లేమిని కొనసాగించడం అతడి దురదృష్టం. అయితే, సెలక్టర్ల టార్గెట్ ఎల్లప్పుడూ షాహిన్ ఆఫ్రిది మాత్రమే. ఇందుకు కారణం షాహిద్ ఆఫ్రిది.షాహిన్ ఆఫ్రిది ఇప్పటికైనా కళ్లు తెరవాలి. ఎవరు తన స్నేహితులో, ఎవరు శత్రువులో గుర్తించగలగాలి. చిరునవ్వుతో నీతో మాట్లాడినంత మాత్రాన వాళ్లు నీ ఫ్రెండ్స్ అయిపోతారనుకుంటే పొరపాటు పడినట్లే. తమ మనసులోని భావాలు బయటపడకుండా వీళ్లు(సెలక్టర్లు) అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ నువ్వు మాత్రం ఎవరు ఏమిటన్నది తెలుసుకుని మసలుకో షాహిన్’’ అని సందేశం ఇచ్చాడు.అదే విధంగా.. బాబర్ ఆజం విషయంలో అతడి అభిమానులు రచ్చ చేస్తారని.. ఈసారి వాళ్ల పరిస్థితి ఏమిటో అంటూ సెటైర్లు వేశాడు. ఏదేమైనా.. ఇంగ్లండ్తో మిగిలిన టెస్టులకు బాబర్, షాహిన్, నసీం షాలను కొనసాగించాల్సిందని బసిత్ అలీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్తో రెండు, మూడో టెస్టులకు బాబర్ ఆజంతో పాటు పేస్ బౌలర్లు షాహిన్ అఫ్రిది, నసీమ్ షాలను కూడా సెలక్టర్లు తప్పించారు.ముగ్గురు కొత్త ఆటగాళ్లుతొలి టెస్టులో జట్టు మొత్తం విఫలమైనా వీరిపై మాత్రమే వేటు వేయడం అంటే సెలక్టర్లు ప్రదర్శనకంటే కూడా ఒక హెచ్చరిక జారీ చేసేందుకే అనిపిస్తోంది. వీరి స్థానంలో ముగ్గురు కొత్త ఆటగాళ్లు కమ్రాన్ గులామ్, హసీబుల్లా, మెహ్రాన్ ముంతాజ్లను సెలక్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్, నోమాన్ అలీలకు కూడా పాక్ జట్టులో చోటు దక్కింది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్తో టెస్టులకు టీమిండియా ఓపెనర్గా వస్తే! -
IND VS SL 3rd ODI: హిట్మ్యాన్ మరో రెండు సిక్సర్లు కొడితే..!
శ్రీలంకతో మూడో వన్డేకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ మరో రెండు సిక్సర్లు కొడితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్ గేల్ను (294 ఇన్నింగ్స్ల్లో 331 సిక్సర్లు) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 330 సిక్సర్లు (256 ఇన్నింగ్స్ల్లో) ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు పాక్ మాజీ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 369 ఇన్నింగ్స్ల్లో 351 సిక్సర్లు బాదాడు.కాగా, లంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్.. గేల్ పేరిట ఉండిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్లో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్.. ఛేదనలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గేల్ 177 సిక్సర్లు కొడితే.. రోహిత్ 179 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్లో భీకర ఫామ్లో ఉన్న రోహిత్ రెండు మ్యాచ్ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలు చేశాడు.తొలి వన్డేలో 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసిన రోహిత్.. రెండో వన్డేలో 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. రోహిత్ రెండు వన్డేల్లో మెరిసినా భారత్ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది. తొలి వన్డే టైగా ముగియగా.. రెండో వన్డేలో శ్రీలంక సంచలన విజయం సాధించింది. రెండు మ్యాచ్ల్లో భారత్ రోహిత్ అందించిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేక ఓటమిపాలైంది. సిరీస్లో మూడో వన్డే ఆగస్ట్ 7న జరుగనుంది. -
‘పాకిస్తాన్కు టీమిండియా రావాల్సిందే.. మేమైతే’
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్ను విజయంతంగా నిర్వహించాలని పాక్ క్రికెట్ బోర్డు ప్లాన్ చేస్తుంది.ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్ను సైతం పీసీబీ.. ఐసీసీకి పంపింది. అయితే ఈ మెగా టోర్నీలో భారత్ పాల్గోంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టును పాక్కు పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని డిమాండ్ చేస్తోంది. కానీ పీసీబీ మాత్రం ఈ మెగా టోర్నీని తమ దేశంలో నిర్వహించాలని మొండి పట్టు పట్టింది.ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ దేశానికి రావడానికి భారత్కు ఇష్టం లేదని, భద్రతను సాకుగా ఉపయోగించుకుంటుందని అఫ్రిది ఆరోపించాడు. ఇప్పటికే చాలా మంది పాక్ మాజీ క్రికెటర్లు భారత జట్టు తమ దేశానికి రావాలని వాదిస్తున్నారు."మేము క్లిష్లమైన పరిస్ధితుల్లో కూడా ఆడేందుకు భారత్కు చాలాసార్లు వెళ్లాం. మాకు బెదిరింపులు వచ్చిన సందర్భాల్లో కూడా మేము భారత్కు వెళ్లి క్రికెట్ ఆడాము. మమ్మల్ని భారత్కు పంపేందుకు మా దేశ ప్రభుత్వం గానీ, పీసీబీ గానీ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.గతేడాది కూడా మా జట్టు వరల్డ్కప్లో తలపడేందుకు భారత్కు వెళ్లింది. మేము ఎప్పుడూ భారత్కు సపోర్ట్గా ఉంటాము. కాబట్టి వారు కూడా ఇక్కడకు వచ్చి ఆడాలని నేను కోరుకుంటున్నానని" అఫ్రిది ఓ పాక్ జాతీయ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. -
విరాట్ పాకిస్తాన్కు వస్తే ఆ ప్రేమను మర్చిపోతాడు: ఆఫ్రిది
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్కు వెళ్తుందా? లేదంటే హైబ్రిడ్ విధానంలో ఈ టోర్నీ నిర్వహిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు.భారత క్రికెట్ జట్టు తప్పకుండా తమ దేశంలో పర్యటించాలని విజ్ఞప్తి చేశాడు. టీమిండియా పాక్ గడ్డ మీద ఆడితే చూడాలని తామంతా కోరుకుంటున్నట్లు తెలిపాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం టీమిండియాను అక్కడికి పంపేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఆసియా వన్డే కప్-2023 మాదిరిగానే హైబ్రిడ్ విధానం(టీమిండియా మ్యాచ్లకు వేరే వేదిక)లో ముందుకు వెళ్లాలని ఐసీసీని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.టీమిండియా ఇక్కడకు రావాలిఈ నేపథ్యంలో షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ.. రోహిత్ సేన పాకిస్తాన్ పర్యటనకు వస్తే చూడాలని ఉందన్నాడు. రాజకీయాలతో ఆటను ముడిపెట్టకుండా టీమిండియాను పాకిస్తాన్కు పంపించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.ముఖ్యంగా విరాట్ కోహ్లికి తమ దేశంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని.. అతడిని చూడాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని ఆఫ్రిది తెలిపాడు. భారత్లోని అభిమానుల ప్రేమను మరిపించేలా అతడిని తమ ప్రేమలో ముంచెత్తుత్తామని పేర్కొన్నాడు.‘‘భారత క్రికెట్ జట్టు తప్పకుండా ఇక్కడికి రావాలి. మేము ఇండియాలో పర్యటించినపుడు మాకెంతో ఘనంగా స్వాగతం పలకడం పాటు గౌరవమర్యాదలు ఇచ్చారు.ఆ ప్రేమను మరచిపోతాడుఅదే విధంగా మా దేశంలో టీమిండియాను 2005లో ఇలాగే సాదరంగా ఆహ్వానించాం. రాజకీయాలకు అతీతంగా క్రికెట్ను చూడాలి. ఒక్కసారి విరాట్ ఇక్కడికి వచ్చాడంటే భారత్లో తనకు దొరికే ప్రేమను కూడా మరిచిపోతాడు.పాకిస్తాన్లో అతడికి అంతటి క్రేజ్ఉంది. ఇక్కడి ప్రజలకు అతడంటే ఎంతో ఇష్టం’’ అని షాహిద్ ఆఫ్రిది ఓ యూట్యూబ్ చానెల్తో పేర్కొన్నాడు. కాగా వన్డే, టీ20లలో కోహ్లికి పాక్పై మెరుగైన రికార్డు ఉంది. వన్డే, టీ20లలో పాక్పై అతడి పరుగుల సగటు 52.15, 70.29. చదవండి: మిస్టరీ గర్ల్తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్ -
నేటి నుంచి (జులై 3) మరో క్రికెట్ పండుగ.. జులై 6న భారత్-పాక్ మ్యాచ్
టీ20 వరల్డ్కప్ ముగిసి వారం రోజులు కూడా గడవక ముందే మరో క్రికెట్ పండుగ మొదలైంది. దిగ్గజ క్రికెటర్లు పాల్గొంటున్న వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీ ఇంగ్లండ్ వేదికగా ఇవాల్టి నుంచి (జులై 3) ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు (ఇండియా ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటున్నాయి. లెజెండ్స్ క్రికెట్కు సంబంధించి ఈ టోర్నీని వరల్డ్కప్గా పరిగణించవచ్చు. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, కెవిన్ పీటర్సన్, డేల్ స్టెయిన్, హెర్షల్ గిబ్స్, షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్, బ్రెట్ లీ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. సింగిల్ రౌండ్ ఫార్మాట్లో జరిగే (ప్రతి జట్టు మిగతా జట్లతో తలో మ్యాచ్ ఆడుతుంది) ఈ టోర్నీ జులై 13న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. సింగిల్ రౌండ్ తర్వాత టాప్-4లో ఉండే జట్లు సెమీఫైనల్స్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్లు ఫైనల్స్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ జులై 6న జరుగనుంది.జట్ల వివరాలు..భారత్ ఛాంపియన్స్: యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, రాహుల్ శర్మ, నమన్ ఓజా, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్, ధవల్ కులకర్ణి, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, పవన్ నేగిఆస్ట్రేలియా ఛాంపియన్స్: బ్రెట్ లీ, టిమ్ పైన్, షాన్ మార్ష్, బెన్ కట్టింగ్, బెన్ డంక్, డిర్క్ నాన్స్, డాన్ క్రిస్టియన్, బెన్ లాఫ్లిన్, ఆరోన్ ఫించ్, బ్రాడ్ హాడిన్, కల్లమ్ ఫెర్గూసన్, పీటర్ సిడిల్, జేవియర్ డోహెర్టీ, నాథన్ కౌల్టర్ నైల్, జాన్ హేస్టింగ్స్ఇంగ్లండ్ ఛాంపియన్స్: కెవిన్ పీటర్సన్, రవి బొపారా, ఇయాన్ బెల్, సమిత్ పటేల్, ఒవైస్ షా, ఫిలిప్ మస్టర్డ్, క్రిస్ స్కోఫీల్డ్, సాజిద్ మహమూద్, అజ్మల్ షాజాద్, ఉస్మాన్ అఫ్జల్, ర్యాన్ సైడ్బాటమ్, స్టీఫెన్ ప్యారీ, స్టువర్ట్ మీకర్, కెవిన్ ఓ'బ్రియన్వెస్టిండీస్ ఛాంపియన్స్: డారెన్ సామీ, క్రిస్ గేల్, శామ్యూల్ బద్రీ, రవి రాంపాల్, కేస్రిక్ విలియమ్స్, జాసన్ మహమ్మద్, నవిన్ స్టీవర్ట్, డ్వేన్ స్మిత్, యాష్లే నర్స్, సులీమాన్ బెన్, చాడ్విక్ వాల్టన్, జెరోమ్ టేలర్, ఫిడేల్ ఎడ్వర్డ్స్, కిర్క్ ఎడ్వర్డ్స్, జోనాథన్ కార్టర్దక్షిణాఫ్రికా ఛాంపియన్స్: జాక్వెస్ కల్లిస్, హెర్షెల్ గిబ్స్, ఇమ్రాన్ తాహిర్, మఖాయా ంటిని, డేల్ స్టెయిన్, అష్వెల్ ప్రిన్స్, నీల్ మెక్కెంజీ, ర్యాన్ మెక్లారెన్, జస్టిన్ ఒంటాంగ్, రోరీ క్లీన్వెల్ట్, జెపి డుమిని, రిచర్డ్ లెవి, డేన్ విలాస్, వెర్నాన్ ఫిలాండర్,పాకిస్తాన్ ఛాంపియన్స్: యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, అబ్దుల్ రజాక్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సోహైల్ తన్వీర్, సోహైల్ ఖాన్, తన్వీర్ అహ్మద్, ముహమ్మద్ హఫీజ్, అమీర్ యామిన్, షోయబ్ మాలిక్, సోహైబ్ మక్సూద్, ఉమర్జెల్ ఖాన్ అక్మల్,షెడ్యూల్..బుధవారం, జూలై 03ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్గురువారం, జూలై 04సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్ పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్శుక్రవారం, జూలై 05ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఇండియా వర్సెస్ వెస్టిండీస్శనివారం, జూలై 06ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియాఇండియా వర్సెస్ పాకిస్థాన్ఆదివారం, జూలై 07సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్థాన్సోమవారం, జూలై 08ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియామంగళవారం, జూలై 09వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్బుధవారం, జూలై 10వెస్టిండీస్ వర్సెస్ఆస్ట్రేలియా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికాబుధవారం, జూలై 12మొదటి సెమీ ఫైనల్- TBA vs TBAరెండవ సెమీ ఫైనల్- TBA vs TBAశనివారం, జూలై 13ఫైనల్ మ్యాచ్ - TBA vs TBA -
పాక్ పరాభవంపై బంగ్లాదేశ్ ఓపెనర్ ట్వీట్.. షాకివ్వనున్న పీసీబీ
గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. టీ20 ప్రపంచకప్-2024లోనూ ఘోర పరాభవం చవిచూసింది.గ్రూప్-ఏలో టీమిండియా, కెనడా, ఐర్లాండ్, అమెరికాలతో కలిసి ఉన్న పాక్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి టీమిండియాతో పాటు పసికూన, ఆతిథ్య అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది.ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కోచ్లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో తరచూ మార్పుల కారణంగానే తీరూ తెన్నూ లేకుండా పోయిందని.. అందుకు నిదర్శనమే ఈ వరుస వైఫల్యాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అఫ్గన్, బంగ్లాదేశ్ కూడా ఇదిలా ఉంటే.. వరల్డ్కప్-2024లో పాక్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిబాట పట్టగా.. ఆసియా నుంచి టీమిండియాతో పాటు అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సూపర్-8కు చేరుకున్న విషయం తెలిసిందే. నాలుగింట మూడు విజయాలతో గ్రూప్-సి నుంచి అఫ్గన్.. గ్రూప్-డి నుంచి నాలుగింట మూడు గెలిచి బంగ్లా తదుపరి రౌండ్కు అర్హత సాధించాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదే వెటరన్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాక్ వైఫల్యాలపై సానుభూతి వ్యక్తం చేసిన ఈ బంగ్లా బ్యాటర్.. మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వంటి వాళ్లు ప్రస్తుత జట్టుకు మార్గదర్శనం చేస్తే బాగుంటుందని హితవు పలికాడు.‘‘టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం విచారకరం. వచ్చేసారి వాళ్లు గొప్పగా రాణించాలని ఆశిస్తున్నా. షాహిద్ ఆఫ్రిది వంటి సీనియర్లే వారికి సరైన మార్గం చూపాలి’’ అని తమీమ్ ఇక్బాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇక్బాల్ ట్వీట్కు మద్దతుగా, వ్యతిరేకంగా.. ఇలా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.కఠిన చర్యలకు సిద్ధంవన్డే వరల్డ్కప్లో అవమానం తర్వాత పాకిస్తాన్ వరుసగా విఫలమైంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో టీ20 సిరీస్లో పరాజయాలు చవిచూసింది.తాజాగా ప్రపంచకప్ రేసు నుంచి లీగ్ దశలోనే వైదొలిగింది. అంతేగాక సీనియర్లు సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.సెంట్రల్ కాంట్రాక్టులు, జీతాల విషయంలో సమీక్ష నిర్వహించి.. కోతలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల తీరుపై గుర్రుగా ఉన్న పీసీబీ కొత్త చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. -
అతడినే కెప్టెన్గా ఉండనివ్వాల్సింది: బాబర్పై ఆఫ్రిది ఆగ్రహం
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తీరును మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. షాహిన్ ఆఫ్రిది స్థానంలో బాబర్ పగ్గాలు చేపట్టడం సరికాదని పేర్కొన్నాడు. ఒకవేళ బోర్డు ఆఫర్ చేసినా.. షాహిన్నే కెప్టెన్గా కొనసాగించాలని బాబర్.. కోరి ఉంటే బాగుండేదంటూ తన అల్లుడికి మద్దతు పలికాడు.వన్డే ప్రపంచకప్-2023లో పేలవ ప్రదర్శన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజం తప్పుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాటి పాక్ క్రికెట్ బోర్డు టెస్టులకు షాన్ మసూద్, టీ20 ఫార్మాట్కు ప్రధాన పేసర్, షాహిద్ ఆఫ్రిది అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని కెప్టెన్లుగా ప్రకటించింది.షాహిన్పై వేటుఅయితే, మసూద్ సారథ్యంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్ అయిన పాకిస్తాన్.. షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ను 4-1తో ఓడిపోయింది.ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ షాహిన్ ఆఫ్రిది వైఫల్యం కొనసాగింది. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు కొత్త యాజమాన్యం అతడిపై వేటు వేసింది. వన్డే, టీ20లకు బాబర్ ఆజంనే తిరిగి కెప్టెన్గా నియమించింది.అయితే, బాబర్ సారథ్యంలోనూ పాకిస్తాన్కు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తొలుత ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను 0-2తో కోల్పోయిన పాక్.. తాజాగా టీ20 ప్రపంచకప్-2024లో గ్రూప్ దశ దాటకుండానే ఎలిమినేట్ అయింది.ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. షాహిద్ ఆఫ్రిది తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్కప్ వరకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్గా ఉంటాడని ఒకవేళ పీసీబీ చెబితే.. బాబర్ ఆజం అతడికి మద్దతుగా నిలవాల్సింది.‘లేదు. నాకు కెప్టెన్సీ వద్దు. మేమంతా షాహిన్ సారథ్యంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. అతడు నాతో పాటు ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నాడు. అందుకే అతడికే కెప్టెన్సీ అప్పగించండి. నేను అతడికి మద్దతుగా ఉంటూ.. అతడి నాయకత్వంలో ఆడతాను’’ అని బాబర్ ఆజం చెప్పాల్సింది.బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదుఇలా చేసి ఉంటే అతడిపై గౌరవం పెరిగేది. అయినా.. ఇందులో బాబర్ ఒక్కడినే తప్పుబట్టడానికి లేదు. సెలక్షన్ కమిటీకి కూడా ఇందులో భాగం ఉంది.సెలక్షన్ కమిటీలోని కొందరకు వ్యక్తులు.. బాబర్ ఆజంకు కెప్టెన్సీ చేయడమే రాదని డైరెక్ట్గానే చెప్పారు. అయినా మళ్లీ అతడి చేతికే పగ్గాలు వచ్చాయి’’ అని షాహిద్ ఆఫ్రిది ఘాటు విమర్శలు చేశాడు.ఏదేమైనా బాబర్ ఆజం.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదినే కెప్టెన్గా కొనసాగించాలని బోర్డును కోరి ఉండాల్సిందని షాహిద్ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా బాబర్ నాయకత్వంలో 2021 వరల్డ్కప్లో సెమీస్ చేరిన పాకిస్తాన్.. 2022లో రన్నరప్గా నిలిచింది. ఈసారి మాత్రం గ్రూప్ స్టేజిలోనే ఇంటిబాట పట్టింది. చదవండి: WC: ఆస్ట్రేలియా గెలవాలని కోరుకుంటున్నాం: ఇంగ్లండ్ పేసర్ -
Ind vs Pak: పాక్ గెలుస్తుందని చెప్పాను.. కానీ: యువీ
టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోటీ చూడటానికి ఇరు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుందనడం అతిశయోక్తి కాదు.అయితే, ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్పై టీమిండియాదే పైచేయి. తాజాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్లోనూ ఇదే పునరావృతమైంది. న్యూయార్క్లోని నసావూ కౌంటీ స్టేడియంలో జరిగిన దాయాదుల పోరులో భారత్ పాక్పై ఆరు పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది.ఛేదించదగ్గ లక్ష్యానికి పాకిస్తాన్ చేరువవుతున్న వేళ టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. దాయాది ఆశలను ఆవిరి చేశాడు. అద్భుత స్పెల్(3/14)తో భారత జట్టుకు విజయం అందించాడు.ఇక భారత్- పాక్ మ్యాచ్ అంటే కేవలం గణాంకాలే కాదు భావోద్వేగాల సమాహారం అన్న విషయం తెలిసిందే. ఇక గెలుస్తుందనుకున్న మ్యాచ్లో పాక్ ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోయారు.ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది- టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ తెరమీదకు వచ్చింది. పాక్ ఓటమి నేపథ్యంలో ఆఫ్రిది ఉద్వేగానికి లోనుకాగా.. యువీ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.యువీ- ఆఫ్రిది మధ్య సంభాషణ ఇలా..యువీ: లాలా.. ఏమైంది? ఎందుకంత బాధగా ఉన్నావు?ఆఫ్రిది: నేనిలా ఉండటం తప్పా? ఒప్పా? నువ్వే చెప్పు. అసలు ఈ మ్యాచ్ మేము ఓడిపోవాల్సిన మ్యాచ్కానే కాదు కదా!విజయానికి మేము 40 పరుగుల దూరంలో ఉన్నపుడు.. యువరాజ్ నా దగ్గరకు వచ్చి ‘లాలా.. కంగ్రాట్స్! ఇక నేను మ్యాచ్ చూడను. వెళ్లిపోతున్నా’ అని చెప్పాడు.వెంటనే నేను అతడికి బదులిస్తూ.. ‘‘ఈ పిచ్పై 40 పరుగుల అంటే అంత తేలికేమీ కాదు. ఇంత ముందుగానే కంగ్రాట్స్ చెప్పకు’’ అని యువీతో అన్నాను.యువీ: పాకిస్తాన్ గెలుస్తుందని నేను చెప్పినప్పటికీ.. టీమిండియా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే ఉన్నాను. అయినా ఆటలో గెలుపోటములు సహజం. ఏదేమైనా మన మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుంది కదా!కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి యువరాజ్ సింగ్తో పాటు షాహిద్ ఆఫ్రిది అంబాసిడర్లుగా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: అనుకున్నది సాధించలేకపోయాం.. కారణం అదే: బాబర్ ఆజంChit Chat of Shahid Afridi with Yuvraj Singh Regarding #PakvsInd Match pic.twitter.com/tMCfZdCt0Z— TEAM AFRIDI (@TEAM_AFRIDI) June 11, 2024 View this post on Instagram A post shared by ICC (@icc) -
జట్టును నాశనం చేసింది ఎవరో చెప్తా: ఆఫ్రిది
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్పై విమర్శల పర్వం కొనసాగుతోంది. మెగా టోర్నీకి జట్టు ఎంపిక మొదలు.. బాబర్ ఆజం కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శన వరకు ఏ ఒక్కటి సరిగ్గా లేదంటూ ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రాజా సహా వసీం అక్రం, కమ్రన్ అక్మల్, సలీం మాలిక్ తదితరులు భారత్తో మ్యాచ్లో పాక్ ఆట తీరును తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కూడా ఈ జాబితాలో చేరాడు. ప్రపంచకప్ టోర్నీకి ముందు పాకిస్తాన్ కెప్టెన్గా తిరిగి నియమితుడైన బాబర్ ఆజంపై అతడు విమర్శలు ఎక్కుపెట్టాడు.‘‘కెప్టెన్ అనే వాడు జట్టును ఒకే తాటి మీదకు తెస్తాడు. జట్టును నాశనం చేయగల.. లేదంటే నిర్మించగల శక్తి అతడికి ఉంటుంది. ఈ వరల్డ్కప్ టోర్నీ ముగిసిన తర్వాత నేను ఈ విషయంపై ఇంకాస్త స్పష్టంగా మాట్లాడతాను’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు.అదే విధంగా తన అల్లుడు షాహిన్ ఆఫ్రిది కెరీర్లోని ఎత్తుపళ్లాల గురించి ప్రస్తావన రాగా.. ‘‘అతడితో నాకున్న బంధుత్వం కారణంగా.. నేను నా కూతురికి, అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నానని చాలా మంది అనుకుంటారు.నిజానికి నేను ఎప్పుడూ అలా మాట్లాడను. ఒకవేళ నా కూతురైనా.. అల్లుడైనా తప్పు చేస్తే తప్పు చేశారనే చెప్తాను. అంతేతప్ప వెనకేసుకురాను’’ అంటూ షాహిద్ ఆఫ్రిది ట్రోల్స్కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.కాగా భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టు ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు.ఫలితంగా పాకిస్తాన్ టీ20 కెప్టెన్సీ పదవి ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిదిని వరించింది. అయితే, అతడి సారథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 0-4తో కోల్పోయింది.ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో పలు మార్పుల అనంతరం బాబర్ ఆజం తిరిగి వన్డే, టీ20 కెప్టెన్గా నియమితుడయ్యాడు. అతడి నాయకత్వంలో వరల్డ్కప్నకు ముందు ఇంగ్లండ్తో టీ20 సిరీస్ ఆడిన పాకిస్తాన్ 0-2తో ఓడిపోయింది.ఇక వరల్డ్కప్-2024లోనూ బాబర్ బృందం పరాజయాల పరంపర కొనసాగుతోంది. తమ తొలి మ్యాచ్లో యూఎస్ఏ చేతిలో ఓడిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్లో భారత్ చేతిలోనూ పరాజయం పాలైంది. గ్రూపు దశలో మిలిగిన రెండు మ్యాచ్లలో గెలిస్తేనే ఈ టోర్నీలో పాక్ ముందడుగు వేయగలుగుతుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఐక్యత లేనందువల్లే ఈ పరిస్థితి అంటూ షాహిద్ ఆఫ్రిది బాబర్ ఆజంను టార్గెట్ చేయడం గమనార్హం.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్గా పేరొందిన సురేశ్ రైనా ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్లో తనదైన శైలిలో మ్యాచ్లు, ప్లేయర్ల ఆట తీరును విశ్లేషిస్తూ వ్యాఖ్యాతగా ఆకట్టుకుంటున్నాడు.ఇక ఇటీవల ఐపీఎల్-2024 క్వాలిఫయర్-1 మ్యాచ్ సందర్భంగా సురేశ్ రైనా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై సెటైర్లు వేశాడు. కోల్కతా నైట్ రైడర్స్- సన్రైజర్స్ హైదారబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్కు టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో కలిసి హిందీలో కామెంట్రీ చేశాడు రైనా.ఈ సందర్భంగా ఆకాశ్ చోప్రా.. రైనాను ఉద్దేశించి.. ‘‘రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకుంటావా?’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘నేనేమీ షాహిద్ ఆఫ్రిదిని కాదు’’ అని రైనా పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి షాహిద్ ఆఫ్రిదిని అంబాసిడర్గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటన విడుదల చేసింది. టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్, జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్ట్లతో పాటు ఆఫ్రిది కూడా ఈ మెగా ఈవెంట్కు రాయబారిగా ఉంటాడని పేర్కొంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన స్పోర్ట్స్ కంటెంట్ రైటర్ రైనాను ఉద్దేశించి సెటైర్లు వేశాడు. ‘‘ఐసీసీ టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా షాహిద్ ఆఫ్రిది పేరును ఐసీసీ ప్రకటించింది. హలో సురేశ్ రైనా’’ అని ట్రోల్ చేశాడు.I’m not an ICC ambassador, but I have the 2011 World Cup at my house. Remember the game at Mohali? Hope it brings back some unforgettable memories for you. https://t.co/5H3zIGmS33— Suresh Raina🇮🇳 (@ImRaina) May 24, 2024 ఇందుకు రైనా కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ‘‘నేను ఐసీసీ అంబాసిడర్ను కాదు గానీ.. 2011 వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడిని. మొహాలీలో గేమ్ గుర్తుందా?నాకు తెలిసి ఆ మ్యాచ్ నీకు కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేస్తుందనుకుంటా’’ అని కౌంటర్ ఇచ్చాడు. కాగా వన్డే వరల్డ్కప్-2011లో మొహాలీ వేదికగా టీమిండియా- పాకిస్తాన్ సెమీ ఫైనల్లో తలపడ్డాయి.ఈ మ్యాచ్లో టీమిండియా 29 పరుగుల తేడాతో పాక్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. నాటి మ్యాచ్లో సురేశ్ రైనా జట్టుకు అవసరమైన సమయంలో పట్టుదలగా నిలబడి 36 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ధోని సేన షాహిద్ ఆఫ్రిది బృందాన్ని ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ తనను ట్రోల్ చేసిన వ్యక్తికి రివర్స్ సెటైర్ వేశాడు.💥Suresh Raina played one of the most important knocks of his career "OTD in 2011" - India were 205/6 against Pakistan in Semi-Final & he scored 36* runs from 39 balls in tough situation.pic.twitter.com/gGzL5wUm0p— मैं हूँ Sanatani 🇮🇳 🚩🚩 (@DesiSanatani) May 24, 2024 -
'నేనేమి షాహిది అఫ్రిదిని కాను'.. రిటైర్మెంట్ యూటర్న్పై రైనా
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ లెజెండరీ ఆటగాడు సురేష్ రైనా తన రిటైర్మెంట్ యూ టర్న్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్న రైనా.. ప్రస్తుతం ఐపీఎల్-2024లో కామెంటేటర్గా బీజీబీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్కు రైనా భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రాతో కలిసి హిందీ వ్యాఖ్యతగా వ్యవహరించాడు.కోల్కతా బ్యాటింగ్ సందర్భంగా ఎనిమిదో ఓవర్లో ఆకాష్ చోప్రా నుంచి రైనాకు తన రిటైర్మెంట్ యూ టర్న్కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. రిటైర్మెంట్ను ఏమైనా వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నవా అంటూ రైనాను చోప్రా ప్రశ్నించాడు. అందుకు బదులుగా రైనా "నేనేమి షాహిద్ అఫ్రిదిని" కాదు అంటూ నవ్వుతూ సమాధనమిచ్చాడు. కాగా పాకిస్తాన్ మాజీ ఆల్-రౌండర్ షాహిద్ అఫ్రిది తన రిటైర్మెంట్ను మూడు సార్లు వెనక్కి తీసుకున్నాడు.చదవండి: Virat Kohli: కీలక మ్యాచ్కు ముందు ఆర్సీబీకి తలనొప్పి! ఒక రకంగా.. -
Viral Video: బ్యాట్ విరగొట్టుకుని, అదే బంతికి ఔటైన అఫ్రిది
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వినూత్న రీతిలో ఔటైన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. లండన్లో జరిగిన ఓ టీ10 మ్యాచ్ సందర్భంగా అఫ్రిది బ్యాట్ విరగొట్టుకుని, అదే బంతికి ఔటయ్యాడు. వివరాల్లోకి వెళితే.. టీమ్ యూరప్, బ్రిటిష్ అండ్ ఐరిష్ నైట్స్ జట్ల మధ్య జరిగిన ఓ టీ10 మ్యాచ్లో అఫ్రిది పాల్గొన్నాడు. ఈ మ్యాచ్లో టీమ్ యూరప్కు ప్రాతినిథ్యం వహించిన అఫ్రిది.. ఇన్నింగ్స్ మూడో ఓవర్ రెండో బంతికి ఔటయ్యాడు. A 𝘽𝘼𝙏𝘵𝘭𝘦 lost 😄 Have you seen anything like this before? 👀 #EuropeanCricket #StrongerTogether #WestonShield pic.twitter.com/K25AWxN9Qo — European Cricket (@EuropeanCricket) April 7, 2024 ఒలివర్ రిలే బౌలింగ్లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అఫ్రిది పెవిలియన్కు చేరాడు. ఒలివర్ సంధించిన బంతిని అఫ్రిది లెగ్ సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లో లేచింది. బంతి బలంగా తాకడంతో బ్యాట్ రెండు ముక్కలైంది. హ్యాండిల్ అఫ్రిది చేతిలోనే ఉండిపోగా.. మరో ముక్క లెగ్ సైడ్ దిశలో వెళ్లి పడింది. గాల్లోకి లేచిన బంతిని ఒలివర్ క్యాచ్ పట్టుకోవడంతో అఫ్రిది వినూత్న రీతిలో ఔటయ్యాడు. క్రికెట్లో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కాగా, 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన షాహిద్ అఫ్రిది.. నాటి నుంచి విదేశీ లీగ్ల్లో పాల్గొంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ల్లో అఫ్రిది కనిపిస్తూ ఉంటాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలోనూ అఫ్రిది దర్శనమిచ్చాడు. క్రికెట్తో అనునిత్యం టచ్లో ఉండే అఫ్రిది టీవీ డిబేట్లలో పాల్గొంటుంటాడు. 47 ఏళ్ల అఫ్రిది ప్రస్తుత పాక్ క్రికెటర్కు పిల్లనిచ్చిన మామ. అఫ్రిది కుమార్తెను షాహీన్ అఫ్రిది పెళ్లి చేసుకున్నాడు. విధ్వంసకర బ్యాటర్ అయిన అఫ్రిది పేరిట అప్పట్లో వన్డే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉండేది. కెన్యాలోని నైరోబీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో అఫ్రిది 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. చాలాకాలం వరకు ఇది వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. ప్రస్తుతం వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 2015లో వెస్టిండీస్పై 31 బంతుల్లోనే శతక్కొట్టాడు. -
పాక్ కెప్టెన్గా మళ్లీ బాబర్!.. అల్లుడికి అండగా షాహిద్ ఆఫ్రిది
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఆ దేశ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది విమర్శించాడు. బోర్డు పెద్దలు మారినప్పుడల్లా వారికి అనుగుణంగా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయని.. తమ క్రికెట్ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదేనని పేర్కొన్నాడు. కాగా పీసీబీ యాజమాన్యం తరచూ మారుతున్న విషయం తెలిసిందే. ప్రధాని షాబాజ్ జోక్యం నేపథ్యంలో రమీజ్ రాజాను అధ్యక్షుడిగా తప్పించి.. నజమ్ సేథీని తాత్కాలిక చైర్మన్గా నియమించారు. అనంతరం నజమ్ సేథీ కూడా వైదొలగడంతో.. అతడి స్థానంలో జకా అష్రాఫ్ బాధ్యతలు చేపట్టాడు. అతడు కూడా రాజీనామా చేయడంతో సుప్రీం కోర్టు న్యాయవాది షా ఖవార్ నియమితులయ్యారు. తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన పీసీబీ ఎన్నికలు ముగిసే వరకు ఈ పదవిలో కొనసాగుతారని ప్రకటించారు. అనంతరం ఎలక్షన్లో గెలిచిన మొహ్సిన్ నఖ్వీ పీసీబీ బాస్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్కప్-2023లో కనీసం సెమీస్ కూడా చేరుకుండా పాకిస్తాన్ నిష్క్రమించడంతో కెప్టెన్ బాబర్ ఆజంపై వేటు వేశారు. అతడి స్థానంలో టెస్టు కెప్టెన్గా షాన్ మసూద్, టీ20 కెప్టెన్గా షాహిన్ ఆఫ్రిదిని నియమించారు. అయితే, వీరిద్దరి సారథ్యంలో తొలి సిరీస్లలోనే పాకిస్తాన్ ఘోర పరాజయాలు మూటగట్టుకుంది. ఈ క్రమంలో కొత్త సెలక్షన్ కమిటీ బాబర్ ఆజంను తిరిగి కెప్టెన్ చేయాలనే యోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీ20లకు షాహిన్ ఆఫ్రిదిని తప్పించి బాబర్తో భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలపై స్పందించిన షాహిద్ ఆఫ్రిది.. తన అల్లుడు షాహిన్ ఆఫ్రిదికి అండగా నిలిచాడు. ‘‘ఒకరిని కెప్టెన్గా నియమించినపుడు తనను తాను నిరూపించుకునేందుకు కొంత సమయం కూడా ఇవ్వాలి. అంతేగానీ కొత్త వాళ్లు రాగానే మళ్లీ మార్పులు చేస్తాం అంటే.. సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. ఒక ఆటగాడిని సారథిని చేసి వెంటనే తొలగించాలనుకుంటున్నారంటే ఆ నిర్ణయం తప్పుడైది ఉండాలి. లేదంటే మళ్లీ మార్చాలనుకున్న నిర్ణయమైన సరైంది కాకపోయి ఉండాలి’’ అని పీసీబీ తీరును విమర్శించాడు. తన అల్లుడు షాహిన్కు మరికొంత సమయం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. -
46 ఏళ్ల వయసులోనూ ఇరగదీసిన అఫ్రిది.. మెరుపు అర్ధశతకంతో కుర్ర బౌలర్లకు చుక్కలు
పాకిస్తాన్ మాజీ ఆటగాడు, బ్యాటింగ్ చిచ్చరపిడుగు షాహిద్ అఫ్రిది 46 ఏళ్ల వయసులోనూ రెచ్చిపోతున్నాడు. కుర్రాళ్లతో పోటీపడి మరీ బ్యాటింగ్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. చాలాకాలం క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అఫ్రిది ప్రస్తుతం వారి దేశంలో జరుగుతున్న సింధ్ ప్రీమియర్ లీగ్లో ఆడుతున్నాడు. లీగ్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) జరిగిన మ్యాచ్లో అఫ్రిది మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. Shahid Afridi is showing our power-hitters how it's done even in 2024 🇵🇰🔥🔥 pic.twitter.com/vu2lVZGjPU— Farid Khan (@_FaridKhan) February 2, 2024 ఈ లీగ్లో బెనజీరాబాద్ లాల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్రిది.. మీర్పూర్ఖాస్ టైగర్స్తో జరిగిన మ్యాచ్లో 32 బంతుల్లో సుడిగాలి అర్ధశతకం (50) బాదాడు. అఫ్రిది ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అఫ్రిది ఈ స్థాయిలో రెచ్చిపోయినప్పటికీ అతని జట్టు ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్రిది టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అఫ్రిదితో పాటు షోయబ్ మక్సూద్ (57) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్ధి జట్టు కేవలం 12 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్ ఉమర్ ఆమిన్ 37 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా నిలువగా.. వన్డౌన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ 20 బంతుల్లో 50 పరగులు చేశారు. వీరిద్దరూ అఫ్రిది టీమ్ బౌలర్లను ఊచకోత కోశారు. ఆమిన్ 6 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడగా.. అక్రమ్ 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో అఫ్రిది బౌలింగ్ వేయలేదు. -
తప్పిదారి షాహిన్ కెప్టెన్ అయ్యాడు: అల్లుడిపై ఆఫ్రిది విమర్శలు!
పాకిస్తాన్ టీ20 జట్టు కెప్టెన్ ఎంపిక గురించి ఆ దేశ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథి అయ్యాడని సరదాగా వ్యాఖ్యానించాడు. అతడికి బదులు మహ్మద్ రిజ్వాన్కు పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఐసీసీ టోర్నీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజం.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో షాన్ మసూద్ను కెప్టెన్ చేసిన పాక్ క్రికెట్ బోర్డు.. టీ20 సారథ్య బాధ్యతలను పేసర్ షాహిన్ ఆఫ్రిదికి అప్పగించింది. ఈ నేపథ్యంలో మసూద్ నాయకత్వంలో టెస్టు సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన పాక్ జట్టు.. తదుపరి షాహిన్ నేతృత్వంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ ఆఫ్రిది ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఆటగాడిగా రిజ్వాన్ను నేను ఆరాధిస్తాను. కఠిన శ్రమ, ఆట పట్ల నిబద్ధత.. అతడిని అత్యుత్తమ క్రికెటర్గా నిలిపాయి. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించి ఎక్కడ ఎంత వరకు నైపుణ్యాలను వాడుకోవాలో అతడికి బాగా తెలుసు. తనొక గొప్ప యోధుడు’’ అని మహ్మద్ రిజ్వాన్ను ప్రశంసించాడు. అదే విధంగా.. ‘‘రిజ్వాన్ను పాక్ టీ20 కెప్టెన్గా చూడాలనుకున్నాను. కానీ తప్పిదారి షాహిన్ ఆఫ్రిది సారథిగా ఎంపికయ్యాడు’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. ఆ సమయంలో హ్యారిస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్లతో పాటు అక్కడే ఉన్న షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ నవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా షాహిద్ ఆఫ్రిదికి షాహిన్ ఆఫ్రిది సొంత అల్లుడన్న సంగతి తెలిసిందే. షాహిద్ కుమార్తె అన్షాను అతడు వివాహమాడాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టులు ఓడిన పాకిస్తాన్.. జనవరి 3 నుంచి నామమాత్రపు మూడో టెస్టు ఆడనుంది. చదవండి: సౌతాఫ్రికా ఒక్కటే కాదు పాక్ కూడా అలాగే.. ఐసీసీ, బీసీసీఐ జోక్యం చేసుకోవాలి: స్టీవ్ వా Shahid Afridi praised Muhammad Rizwan and said that Rizwan should have been captain of T20 but Shaheen became it by mistake.#Rizwan #PakistanCricket pic.twitter.com/TSECe93ZPM — Ahtasham Riaz 🇵🇰 (@AhtashamRiaz_) December 30, 2023 -
టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్.. పీసీబీతో కూడా చెప్పాను!
Pakistan Cricket Captains: పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ల మార్పుపై మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. టీ20 కెప్టెన్గా షాహిన్ షా ఆఫ్రిది నియామకంలో తన ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశాడు. తన అల్లుడి కోసం ఎలాంటి లాబీయింగ్ చేయలేదని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ వైఫల్యం నేపథ్యంలో బాబర్ ఆజం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. భారత్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీలో దారుణ ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు. షాహిన్ కెప్టెన్ కావాలని కోరుకోలేదు ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిదిని టీ20 కెప్టెన్గా నియమించిన పాక్ క్రికెట్ బోర్డు.. టెస్టు పగ్గాలను షాన్ మసూద్కు అప్పగించింది. ఈ క్రమంలో టీ20 సారథిగా షాహిద్ నియామకంలో మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ప్రమేయం ఉందనే వదంతులు వ్యాపించాయి. తన అల్లుడి కోసం ఆఫ్రిది పీసీబీ పెద్దల వద్ద లాబీయింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై స్పందించిన ఆఫ్రిది.. ‘‘నేను అసలు ఇలాంటి విషయాల్లో తలదూర్చను. షాహిద్తో నాకున్న బంధుత్వం కారణంగా ఇలాంటి మాటలు వినిపిస్తాయని నాకు తెలుసు. ఒకవేళ నేను లాబీయింగ్ చేసే వాడినే అయితే.. పీసీబీ చైర్మన్ను ఎందుకు విమర్శిస్తాను? నేను ఏ రోజూ కూడా షాహిన్ను కెప్టెన్ చేయాలని డిమాండ్ చేయలేదు. మహ్మద్ రిజ్వాన్తో బాబర్ ఆజం నిజానికి అతడు సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండాలనే కోరుకున్నా. అయితే, షాహిన్ను సారథిగా నియమించాలన్నది పూర్తిగా పీసీబీ చైర్మన్, మహ్మద్ హఫీజ్ నిర్ణయం. ఇందులో నా ప్రమేయమేమీ లేదు. టీ20, వన్డేలకు అతడే సరైన కెప్టెన్ బాబర్ ఆజంనే కెప్టెన్గా కొనసాగించాలని పీసీబీ చైర్మన్తో గతంలో చెప్పాను. ఒకవేళ అతడు తప్పుకోవాలని భావిస్తే పరిమిత ఓవర్ల క్రికెట్లో మహ్మద్ రిజ్వాన్ను కెప్టెన్గా చేయాలని.. టెస్టుల్లో మాత్రం బాబర్నే కొనసాగించాలని పీసీబీకి చెప్పాను’’ అని సామా టీవీ షోలో పేర్కొన్నాడు. కాగా షాహిద్ ఆఫ్రిది పెద్ద కుమార్తె అన్షాను షాహిన్ వివాహమాడిన విషయం తెలిసిందే. చదవండి: CWC 2023: ద్రవిడ్తో కలిసి పిచ్ పరిశీలించిన రోహిత్! క్యూరేటర్ చెప్పిందిదే! -
షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి సోదరి మంగళవారం తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని అఫ్రిది సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. "మా సోదరి మమ్మల్ని విడిచిపెట్టి ఆ దేవుడు వద్దకు వెళ్లిపోయింది. ఆమె మరణవార్తను మా బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. ఆమె ఆంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి" అని అఫ్రిది ట్విటర్లో రాసుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ప్రముఖులు, అభిమానులు అఫ్రిదికి సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే "తన చెల్లిని చూసేందుకు వెళ్తున్నాననీ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని శనివారం(ఆక్టోబర్ 16) రాత్రి ఆఫ్రిది ట్విట్ చేశాడు. కానీ అతడు ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే ఆమె మృతి చెందింది. కాగా షాహిద్ అఫ్రిది కుటుంబంలో మొత్తం 11 మంది ఉన్నారు. అందులో ఆరుగురు సోదరులు, అయిదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. షాహిద్ సోదరులు తారిక్ అఫ్రిది, అష్ఫక్ అఫ్రిది కూడా క్రికెటర్లే. ప్రస్తుత పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది.. షాహిద్ అఫ్రిదికి అల్లుడే అన్న విషయం తెలిసిందే. చదవండి: SMAT 2023: 42 బంతుల్లో శతక్కొట్టిన సన్రైజర్స్ బ్యాటర్ (إِنَّا ِلِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ,) Surely we belong to Allah and to him we shall return. With Heavy hearts we inform you that our beloved Sister passed away and her Namaz e Janazah will be at 17.10.2023 after Zuhur prayer at Zakariya masjid main 26th street… https://t.co/Ly4sK6XVGT — Shahid Afridi (@SAfridiOfficial) October 17, 2023 -
షాహిద్ ఆఫ్రిది రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ
Asia Cup, 2023 India vs Sri Lanka, Super 4- Rohit Sharma: శ్రీలంకతో మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో మెరిశాడు. 44 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. బౌండరీ బాది యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా ఫిఫ్టీ పూర్తి చేసుకునేసరికి రోహిత్ ఖాతాలో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. హిట్మ్యాన్ రికార్డు ఈ క్రమంలో హిట్మ్యాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. దెబ్బకొట్టిన వెల్లలగే కాగా ఆసియా కప్-2023 సూపర్ 4 దశలో భాగంగా కొలంబో వేదికగా శ్రీలంకతో టీమిండియా మంగళవారం నాటి మ్యాచ్లో తలపడుతోంది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ 53, గిల్ 19 పరుగులు చేయగా.. వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(3) పూర్తిగా నిరాశపరిచాడు. కాగా టీమిండియా ఇన్నింగ్స్లో తొలి మూడు వికెట్లను లంక యువ బౌలర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలగే తన ఖాతాలో వేసుకోవడం విశేషం. ఆసియా వన్డే కప్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే! ►రోహిత్ శర్మ-28 ►షాహిద్ ఆఫ్రిది- 26 ►సనత్ జయసూర్య- 23 ►సురేశ్ రైనా- 18 . చదవండి: Ind vs SL: నా 15 ఏళ్ల కెరీర్లో ఇదే మొదటిసారి.. అప్పటికి నాకు 35: కోహ్లి SENSATIONAL SHOT! 😍 A touch of finesse from @ImRo45 marks #TeamIndia's first boundary through covers! 👏🏻💪🏻 Tune-in to #AsiaCupOnStar, LIVE NOW on Star Sports Network#INDvSL #Cricket pic.twitter.com/WaQGt3x2GV — Star Sports (@StarSportsIndia) September 12, 2023 -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. షాహిద్ అఫ్రిది రికార్డు సమం
ఆసియాకప్ 2023 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్తో జరగుతున్న మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్గా 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 56 పరుగులు చేశాడు. శుబ్మన్ గిల్తో కలసి తొలి వికెట్కు 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా 24.1 ఓవర్లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ను అంపైర్లు వాయిదా వేశారు. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఉన్నారు. రోహిత్ శర్మ అరుదైన ఘనతలు.. ఇక ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన హిట్మ్యాన్ పలు అరుదైన ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. ఆసియా కప్ వన్డే చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన షాహిద్ అఫ్రిది రికార్డును రోహిత్ సమం చేశాడు. ఇప్పటివరకు రోహిత్ 24 ఇన్నింగ్స్లలో 26 సిక్స్లు కొట్టాడు. అదేవిధంగా అఫ్రిది కూడా 21 ఇన్నింగ్స్లలో 26 సిక్స్లు కొట్టాడు. అదే విధంగా ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో భారత తరపున అత్యధిక హఫ్ సెంచరీల చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా హిట్మ్యాన్ సమం చేశాడు. ఆసియా కప్లో సచిన్ మొత్తం 9 హాఫ్ సెంచరీలు చేయగా.. తాజాగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో ఫిఫ్టి కొట్టడం ద్వారా రోహిత్ మాస్టర్బ్లాస్టర్ సరసన చేరాడు. చదవండి: Asia Cup 2023: రిజర్వ్డే రోజు కూడా వర్షం పడితే.. ఏంటి పరిస్థితి? అలా జరిగితే భారత్కు కష్టమే -
రెండోసారి పెళ్లికి సిద్ధమైన షాహిన్ ఆఫ్రిది.. ఆరోజే బరాత్!
Shaheen Afridi Marriage: పాకిస్తాన్ ఫాస్ట్బౌలర్ షాహిన్ ఆఫ్రిది మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడు. తన భార్య అన్షాను రెండోసారి వైభవంగా నిఖా చేసుకోనున్నాడు. ఆసియా కప్-2023 ఫైనల్ ముగిసిన తర్వాత ఈ వేడుక జరుగనుంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో షాహిన్- అన్షా పెళ్లి బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈసారి అంగరంగ వైభవంగా! పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తమ కుమార్తె అన్షా వివాహాన్ని షాహిన్తో జరిపించాడు. అయితే, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం సహా ఇరు కుటుంబాలకు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని కొత్త జంట భావించినట్లు సమాచారం . ఆరోజు రిసెప్షన్ ఈ నేపథ్యంలో సెప్టెంబరు 19న షాహిన్- అన్షా నిఖా చేసుకోనున్నట్లు పాకిస్తాన్ స్పోర్ట్స్ జర్నలిస్టు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సమాచారం ప్రకారం.. కరాచిలో పెళ్లి జరిగిన తర్వాత.. బరాత్ జరుగనుంది. ఇక సెప్టెంబరు 21న ఇస్లామాబాద్లోని ప్రైవేట్ హోటళ్లో వలిమా(రిసెప్షన్) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆసియా కప్ తర్వాత రోజుల వ్యవధిలోనే భారత్ వేదికగా వన్డే వరల్డ్కప్-2023 ఆరంభం కానున్న నేపథ్యంలో కొత్త జంట హనీమూన్ రద్దు చేసుకున్నట్లు సమాచారం. టీనేజ్లోనే సంచలనంగా మారి కైబర్ ఏజెన్సీలో 2000 సంవత్సరంలో జన్మించిన షాహిన్ ఆఫ్రిది.. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. స్వల్ప కాలంలోనే పాక్ ప్రధాన పేసర్గా ఎదిగిన లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్బౌలర్.. ఇప్పటి వరకు 27 టెస్టులు, 42 వన్డేలు, 52 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో.. వరుసగా 105, 83, 64 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఆసియా కప్-2023తో బిజీగా ఉన్న షాహిన్ ఆఫ్రిది టీమిండియాతో మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. పల్లెకెలె మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను బౌల్డ్ చేసిన షాహిన్.. టాప్ స్కోరర్ హార్దిక్ పాండ్యా(87)తో పాటు జడేజా వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 17న ఆసియా కప్ ఫైనల్ ముగియనుండగా.. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. చదవండి: అవసరం లేదు! సంజూ శాంసన్ను స్వదేశానికి పంపిన బీసీసీఐ Fakhta Told me that national team's star fast bowler Shaheen Shah Afridi will tie the knot after the Asia Cup. Shaheen Afridi's barat ceremony will be held on September 19 in Karachi and Walima ceremony will be held in a private hotel of Islamabad on 21st sep Gud luck… — Qadir Khawaja (@iamqadirkhawaja) September 7, 2023 -
Asia Cup 2023: పసికూనపై ప్రతాపం.. ఐదో వేగవంతమైన సెంచరీ
ఆసియా కప్ 2023లో భాగంగా ముల్తాన్ వేదికగా నేపాల్తో ఇవాళ (ఆగస్ట్ 30) జరుగుతున్న మ్యాచ్లో పాక్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ విధ్వంసకర శతకంతో (71 బంతుల్లో 109 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఇఫ్తికార్.. కేవలం 67 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి, వన్డేల్లో పాక్ తరఫున ఐదో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా బాసిత్ అలీ (67 బంతుల్లో) రికార్డును సమం చేశాడు. వన్డేల్లో పాక్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో) పేరిట ఉంది. ఆతర్వాత రెండు (45), మూడు (53) ఫాస్టెస్ట్ హండ్రెడ్స్ రికార్డులు కూడా అతని ఖాతాలోనే ఉన్నాయి. పాక్ తరఫున వన్డేల్లో నాలుగో వేగవంతమైన శతకం షర్జీల్ ఖాన్ (61) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, ఇఫ్తికార్తో పాటు బాబర్ ఆజమ్ (131 బంతుల్లో 151; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా రికార్డు శతకంతో కదంతొక్కడంతో నేపాల్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ భారీ స్కోర్ (342/6) చేసింది. 109 బంతుల్లో 10 బౌండరీల సాయంతో సెంచరీ పూర్తి చేసిన బాబర్.. కెరీర్లో 19వ శతకాన్ని నమోదు చేసి, వన్డేల్లో అత్యంత వేగంగా (102 ఇన్నింగ్స్ల్లో) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే ఆసియా కప్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్గా (151), వన్డేల్లో డేవిడ్ వార్నర్ సెంచరీల రికార్డును (19) సమం చేసిన ఆటగాడిగా, సయీద్ అన్వర్ (20) తర్వాత పాక్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ క్రమంలో అతను వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 15వ స్థానానికి ఎగబాకాడు. -
అఫ్రిది మెరుపులు వృధా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన జెస్సీ రైడర్
యూఎస్ మాస్టర్స్ టీ10 లీగ్లో వెటరన్ స్టార్ క్రికెటర్లు పోటాపోటీగా రెచ్చిపోతున్నారు. న్యూయార్క్ వారియర్స్-న్యూజెర్సీ లెజెండ్స్ మధ్య నిన్న (ఆగస్ట్ 20) జరిగిన మ్యాచ్లో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వర్షం కారణంగా 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూయార్క్.. 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. నూయార్క్ ఇన్నింగ్స్లో కమ్రాన్ అక్మల్ (12 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రిచర్డ్ లెవి (5 బంతుల్లో 16; ఫోర్, 2 సిక్సర్లు), అఫ్రిది (12 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. న్యూజెర్సీ బౌలర్ ప్లంకెట్ 2 వికెట్లు పడగొట్టాడు. 85 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజెర్సీ.. 4.4 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జెస్సీ రైడర్ (12 బంతుల్లో 38; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), యూసఫ్ పఠాన్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 సిక్సర్లు), క్రిస్ బార్న్వెల్ (10 బంతుల్లో 28 నాటౌట్; 4 సిక్సర్లు) సిక్సర్ల మోత మోగించి న్యూజెర్సీని గెలిపించారు. లెజెండ్స్ కోల్పోయిన ఏకైక వికెట్ జెరోమ్ టేలర్కు దక్కింది. కాగా, టీమిండిమా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ న్యూజెర్సీ జట్టుకు.. పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్ న్యూయార్క్ జట్టుకు నాయకత్వం వహించారు. -
తూచ్! నిర్ణయం వెనక్కి.. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు! స్టోక్స్ ఒక్కడేనా?
Who Reversed Retirement Decision: వరల్డ్ కప్ ఫైనల్-2019 హీరో బెన్ స్టోక్స్ తమ బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ వన్డేలు ఆడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏడాది క్రితం వన్డే క్రికెట్కు గుడ్బై చెప్పిన ఈ స్టార్ ఆల్రౌండర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయడంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సఫలమైంది. దాంతో న్యూజిలాండ్తో వచ్చే నెలలో జరిగే వన్డే సిరీస్కు అతడిని ఎంపిక చేశారు. 15 మందితో కూడిన టీమ్ను ఈ సిరీస్ కోసం ఈసీబీ ప్రకటించింది. వరల్డ్ కప్ కోసం టీమ్ను ప్రకటించేందుకు మరింత సమయం ఉన్నా... సెలక్టర్ ల్యూక్ రైట్ చెప్పిన దాని ప్రకారం మార్పుల్లేకుండా ఇదే బృందం వరల్డ్ కప్కూ కొనసాగే అవకాశం ఉంది. మరి దేశం కోసం.. స్టోక్స్ మాదిరే తమ రిటైర్మెంట్ నిర్ణయాలు వెనక్కి తీసుకున్న ఆటగాళ్ల గురించి తెలుసా? షాహిద్ ఆఫ్రిది పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తన కెరీర్లో ఏకంగా ఐదుసార్లు రిటైర్మెంట్ ప్రకటనలు ఇచ్చాడు. 2006లో టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్తున్నట్లు ప్రకటించాడు. అయితే, రెండు వారాల్లోనే తన నిర్ణయం మార్చుకున్నాడు మరోసారి సంప్రదాయ క్రికెట్లో పాక్ తరఫున బరిలోకి దిగాడు. ఎట్టకేలకు 2010లో టెస్టు కెరీర్కు వీడ్కోలు పలికాడు. అదే విధంగా.. 2011, మేలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఆఫ్రిది.. నెలల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 2015 వన్డే వరల్డ్కప్ తర్వాత వన్డేల నుంచి తప్పుకొన్న ఆఫ్రిది.. 2017లో అంతర్జాతీయ టీ20 కెరీర్కూ స్వస్తి పలికాడు. మొయిన్ అలీ ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ 2021 సెప్టెంబరులో టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సొంతగడ్డపై ఆసీస్తో పోరులో జట్టుకు అండగా నిలిచే క్రమంలో బోర్డు విజ్ఞప్తి మేరకు మళ్లీ మైదానంలో దిగాడు. బజ్బాల్ విధానంతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల యాషెస్ సిరీస్ డ్రాతో గట్టెక్కడంలో తన వంతు సహకారం అందించాడు. ఇక ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత మరోసారి తన రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చాడు. ఇకపై ఇంగ్లండ్ తరఫున సంప్రదాయ క్రికెట్ ఆడబోవడం లేదని స్పష్టం చేశాడు. తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆసియా వన్డే కప్, వన్డే వరల్డ్కప్-2023 వంటి మెగా ఈవెంట్లకు ముందు ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడించి బంగ్లాను సందిగ్దంలో పడేశాడు. అయితే, ప్రధాని షేక్ హసీనా జోక్యంతో రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇకపై కూడా సెలక్షన్కు అందుబాటులో ఉంటానని తమీమ్ చెప్పుకొచ్చాడు. డ్వేన్ బ్రావో వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో 2018, అక్టోబరులో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. అయితే, ఆ మరుసటి ఏడాది డిసెంబరులో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కీరన్ పొలార్డ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బ్రావో తాను సెలక్షన్కు అందుబాటులో ఉంటానని స్వయంగా ప్రకటించాడు. టీ20 వరల్డ్కప్-2021లో విండీస్ తరఫున బరిలోకి దిగిన ఈ స్టార్ ఆల్రౌండర్.. ఈ ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. చదవండి: జట్టులో చోటు లేకున్నా పర్లేదు.. వాటి కారణంగా రిటైర్ అవ్వను: టీమిండియా స్టార్ -
Shahid Afridi-Shaheen Afridi: ఒకే రోజు ఇరగదీసిన మామ అల్లుళ్లు
పాకిస్తాన్ ఆటగాళ్లు, మామ అల్లుళ్లు షాహిద్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలు వేర్వేరు క్రికెట్ లీగ్ల్లో ఒకే రోజు (ఆగస్ట్ 2) బంతితో రాణించారు. మామ షాహిద్ అఫ్రిది గ్లోబల్ టీ20 కెనడా లీగ్లో సత్తా చాటితే.. ఆల్లుడు షాహీన్ అఫ్రిది ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ లీగ్లో ఇరగదీశాడు. మెన్స్ హండ్రెడ్ లీగ్లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్తో జరిగిన మ్యాచ్లో షాహీన్ అఫ్రిది 10 బంతులు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. గ్లోబల్ టీ20 లీగ్లో వాంకోవర్ నైట్స్తో జరిగిన మ్యాచ్లో షాహిద్ అఫ్రిది 4 ఓవర్లు వేసి కేవలం 16 మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు అఫ్రిదిలు వికెట్లు పడగొట్టాక ఒకే తరహాలో చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. షాహిద్, షాహీన్లు వికెట్ పడగొట్టాక రెండు చేతులు పైకి లేపి అచ్చు గుద్దినట్లు సంబురాలు చేసుకున్నారు. కాగా, మామ అల్లుళ్లు ఒకే రోజు ఒకే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ.. ఒక్కరు మాత్రమే జట్టు విజయంలో భాగమయ్యారు. షాహీన్ జట్టు వెల్ష్ఫైర్.. మాంచెస్టర్ ఒరిజినల్స్పై 9 పరుగుల తేడాతో గెలుపొందగా.. షాహిద్ జట్టు టొరొంటో నేషనల్స్.. వాంకోవర్ నైట్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాంచెస్టర్ ఒరిజినల్స్తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లతో రాణించిన షాహీన్.. ఆతర్వాత తాను వేసిన 5, 6, 7, 8, 10 బంతులకు బౌండరీలు సమర్పించుకోవడం విశేషం. -
'హర్మన్ప్రీత్ ప్రవర్తన మరీ ఓవర్గా అనిపించింది'
టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై విమర్శల వేడి తగ్గడం లేదు. బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో అంపైర్పై దురుసు ప్రవర్తనతో ఐసీసీ ఆగ్రహానికి గురైన హర్మన్ రెండు మ్యాచ్ల నిషేధం ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్లో తొలి రెండు మ్యాచ్లకు హర్మన్ స్థానంలో స్మృతి మంధాన జట్టను నడిపించే అవకాశముంది. కాగా హర్మన్ తీరుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ విషయంలో హర్మన్ చేసింది ఓవర్గా అనిపించిందని.. అంత వైల్డ్గా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. "భారత్ విషయంలోనే కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. అయితే వుమెన్స్ క్రికెట్ లో ఇలాంటివి అరుదుగా చూస్తుంటాం. ఇది చాలా ఎక్కువగా అనిపించింది. ఐసీసీ నిర్వహించిన ఒక టోర్నమెంట్లో ఈ సంఘటన జరిగింది. కాగా హర్మన్కు విధించిన శిక్షతో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఓ హెచ్చరిక పంపినట్లు అయింది. క్రికెట్లో దూకుడు సహజమే. అయితే నియంత్రిత దూకుడు మంచిది. హర్మన్ప్రీత్ విషయంలో ఓవర్ అనిపించింది. ఔట్ విషయంలో అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు." అని అఫ్రిది స్పష్టం చేశాడు. కాగా హర్మన్ తీరుపై భారత మాజీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మదన్ లాల్ లాంటి మాజీ క్రికెటర్ స్పందిస్తూ.. బీసీసీఐ కూడా హర్మన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. గత శనివారం మిర్పూర్లో భారత్, బంగ్లాదేశ్ మహిళల మధ్య మూడో వన్డే జరిగింది. ‘టై’గా ముగిసిన ఈ మ్యాచ్లో వేర్వేరు సందర్భాల్లో హర్మన్ దురుసుగా వ్యవహరించింది. ముందుగా తనను అంపైర్ అవుట్గా ప్రకటించడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన బ్యాట్తో స్టంప్స్ను బలంగా కొట్టి పడేయడంతో పాటు వెళుతూ వెళుతూ అంపైర్ను చూస్తూ ఏవో వ్యాఖ్యలు చేసింది. దీనిపై మూడు డీమెరిట్ పాయింట్లు శిక్షగా విధించగా, మ్యాచ్ ముగిసిన తర్వాతా అంపైరింగ్ ప్రమాణాలు బాగా లేవంటూ విమర్శించింది. దీనిపై ఒక డీమెరిట్ పాయింట్ శిక్ష పడింది. అనంతరం వేదికపై బంగ్లాదేశ్ కెప్టెన్ నిగార్ సుల్తానాతో కలిసి ట్రోఫీ అందుకునే సమయంలో ‘మ్యాచ్ టై చేసింది అంపైర్లే తప్ప మీరు కాదు. ఫొటో దిగేందుకు వాళ్లనూ రమ్మనండి’ అంటూ బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఉద్దేశించి చెప్పింది. దీనిపై సుల్తానా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాస్త మర్యాద నేర్చుకోమంటూ సహచరులతో కలిసి వేదిక నుంచి దిగేసింది. 4 డీమెరిట్ పాయింట్లు అంటే 2 సస్పెన్షన్ పాయింట్లతో సమానం. దాంతో రెండు మ్యాచ్ల నిషేధం పడింది. దీంతోపాటు ఆమె మ్యాచ్ ఫీజులో కూడా 75 శాతం కోత పడింది. ఐసీసీ లెవల్–2 నిబంధన ప్రకారం నిషేధానికి గురైన తొలి మహిళా క్రికెటర్ హర్మన్ కావడం గమనార్హం. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 చదవండి: టీమిండియా కెప్టెన్ దురుసు ప్రవర్తన.. ఐసీసీ చర్యలు Asian Games 2023: హర్మన్పై వేటు.. ఆసియా గేమ్స్లో జట్టును నడిపించేది ఎవరు? #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
అహ్మదాబాద్లో ఆడటానికి ఎందుకంత భయం.. దెయ్యం ఏమైనా ఉందా: పీసీబీపై అఫ్రిది ఫైర్
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రంపంచకప్ డ్రాప్ట్ షెడ్యూల్ను బీసీసీఐ ఇప్పటికే ఐసీసీకు సమర్పించిన సంగతి తెలిసిందే. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం.. ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే అహ్మదాబాద్లో ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిరాకరించింది. వన్డే ప్రపంచకప్లో తమ మ్యాచ్లను అహ్మదాబాద్లో కాకుండా వేరే వేదికలో నిర్వహించాలని పట్టు పట్టుకు కూర్చోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరును ఆదేశ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. అహ్మదాబాద్ వేదికగా ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించాడు. "పాకిస్తాన్ జట్టు అహ్మదాబాద్లో ఆడేందుకు పీసీబీ ఎందుకు నిరాకరిస్తుందో నాకు అర్ధం కావడం లేదు. అక్కడ ఏమైనా నిప్పులు వర్షం కురుస్తుందా లేదా దెయ్యం ఎమైనా ఉందా? అక్కడికి వెళ్లి గెలిచి రండి. భారత్ తమకు ఎక్కడ సౌకర్యవంతంగా ఉంటే అక్కడే మ్యాచ్లు నిర్వహిస్తుంది. అది మనకు అనవసరం. వాళ్లు కోరుకున్న పిచ్ పై ఆడి.. భారత అభిమానుల ముందు మ్యాచ్ గెలవాలి. అలా సాధించిన గెలుపే అసలైన విజయం" అని సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు. ఇక ఈడాది ఆసియా కప్ను హైబ్రీడ్ మోడ్లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు శ్రీలంక, పాకిస్తాన్ వేదికలగా ఈ ఏడాది ఆసియాకప్ జరగనుంది. -
నవీన్ ఉల్ హాక్ మామూలోడు కాదు.. అఫ్రిది లాంటి ముదురును కూడా లెక్కచేయలేదు..!
లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (మే 1) జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి-నవీన్ ఉల్ హాక్- గౌతమ్ గంభీర్ల మధ్య వివాదం క్రికెట్ సర్కిల్స్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏ నోట విన్నా, ఏ సోషల్మీడియా ప్లాట్ఫాంపై చూసినా ఇదే టాపిక్పై డిస్కషన్ నడుస్తోంది. ఎవరికి తోచిన విధంగా వారు కోహ్లి-నవీన్-గంభీర్ల క్యారెక్టర్లను అనలైజ్ చేస్తున్నారు. కోహ్లి-గంభీర్ల మధ్య పచ్చిగడ్డి వేయకుండానే భగ్గుమనేది.. కొందరు గొడవ స్టార్ట్ చేసింది కోహ్లి అంటే, మరికొందరు నవీన్ను తప్పుపడుతుంటే, మెజారిటీ శాతం గంభీర్ గొడవను పెద్దది చేసి ఓవరాక్షన్ చేశాడని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా నిజానిజాలు, పూర్వపరాలు తెలుసుకోకుండా కామెంట్లు చేయడం మాత్రం తప్పే. కోహ్లి-గంభీర్ల విషయానికొస్తే.. వీరి మధ్య వైరం ఈనాటిది కాదు. ఇద్దరు కలిసి టీమిండియాకు ఆడే రోజుల నుంచే వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఐపీఎల్లో సైతం వీరు పలు సందర్భాల్లో కొట్టుకునే దాకా వెళ్లారు. ఆట వరకు వీరిద్దరు పర్ఫెక్షనిస్ట్లే అయినప్పటికీ.. వీరి ఆన్ ఫీల్డ్ బిహేవియర్ మాత్రం కెరీర్ ఆరంభం నుంచే బాగోలేదు. భావోద్వేగాలు అదుపు చేసుకోవడంలో వీరిద్దరూ ఫెల్యూర్సే అని చెప్పాలి. అయితే ఉద్దేశపూర్వకంగా గొడవ పడాలని వీరెప్పుడూ అనుకోరని వీరితో పరిచయమున్న ఎవరినడిగినా చెబుతారు. ఆటలో భాగంగా మొదలయ్యే కవ్వింపు కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసింది. అదే నవీన్ ఉల్ హాక్ విషయానికొస్తే.. అమాయకంగా కనిపించే ఈ ఆఫ్ఘానీ పేసర్ చాలా మదురు అని జనాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అతని చిన్నపాటి కెరీర్ మొత్తం వివాదాల మయం. ప్రపంచం నలుమూలలా జరిగే లీగ్ల్లో పాల్గొన్న నవీన్.. దాదాపు ప్రతి చోట ఎవరితో ఒకరితో గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఓసారి అతని ఘనకార్యాల ట్రాక్ రికార్డుపై లుక్కేస్తే ఈ విషయం క్లియర్గా అర్ధమవుతుంది. అమీర్, షాహిద్ అఫ్రిదిలతో గొడవ.. 2020 లంక ప్రీమియర్ లీగ్లో నవీన్ తన కంటే మహామదుర్లైన పాకిస్తాన్ ఆటగాళ్లు షాహిద్ అఫ్రిది, మహ్మద్ అమీర్లతో గొడవపడ్డాడు. ఆతర్వాత బిగ్బాష్ లీగ్-2022లో డి ఆర్కీ షార్ట్తో, 2023 లంక ప్రీమియర్ లీగ్లో తిసార పెరీరాతో, ఐపీఎల్ 2023లో విరాట్తో కయ్యానికి కాలు దువ్వాడు. ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ ప్రాంతానికి చెందిన నవీన్.. దేశవిదేశాల్లో ఆడిన చాలా మ్యాచ్లో ప్రత్యర్ధి జట్ల ఆటగాళ్లతో గొడవలు పడ్డాడు. My advise to the young player was simple, play the game and don't indulge in abusive talk. I have friends in Afghanistan team and we have very cordial relations. Respect for teammates and opponents is the basic spirit of the game. https://t.co/LlVzsfHDEQ — Shahid Afridi (@SAfridiOfficial) December 1, 2020 Naveen-ul-Haq fight between other players in SriLanka Premier League Fight 01 : Naveen Vs Thisara Perera#IPL2023 #RCBvLSG #ViratKohli #naveenulhaq #Gambhir #gambhirvskohli #LPL #SriLanka pic.twitter.com/LLXLmf8qle — விடாமுயற்சியுடன் டேவிட் (@DavidVaasu) May 2, 2023 సహచరుడు రషీద్ ఖాన్ను చూసి నేర్చుకోవాలి.. అడపాదడపా టాలెంట్తో నెట్టుకొస్తున్నాడని కొన్ని ఫ్రాంచైజీలు అక్కున చేర్చుకున్నాయి, లేకపోతే ఇతన్ని దేకేవాడే లేడు. సహచరులు, గుజరాత్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఎంత హుందాగా వ్యవహరిస్తారో, అందుకు ఇతను పూర్తి వ్యతిరేకంగా ప్రవర్తించి తమ దేశ పరువును పోగొట్టుకున్నాడు. వయసులో పెద్దవాడు, క్రికెట్ దిగ్గజం అయిన విరాట్ కోహ్లి ఆవేశంలో ఓ మాట అన్నాడని సర్దుకుపోయి ఉంటే, ఈ వివాదం ఇంత పెద్దదయ్యే కాదు. మంచికో చెడుకో కోహ్లితో వివాదం కారణంగా చాలామందికి తెలియని నవీన్ పేరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతుంది. -
భారత్- పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్లు జరగాలి.. మోడీ సార్నే అడుగుతా?
ఆసియా కప్- 2023 నిర్వహణ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఈ ఏడాది ఆసియాకప్కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే భారత్-పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తల దృష్ట్యా.. పాకిస్తాన్లో పర్యటించడానికి బీసీసీఐ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియాకప్ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ను బీసీసీఐ సూచించింది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆసియాకప్ను తమ దేశంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆసియా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్లను యూఏఈ వేదికగా నిర్వహించాలని, మిగితా మ్యాచ్లను పాక్లోనే జరపాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే క్రికెట్ ఒక్కటే మార్గమని అఫ్రిది సృష్టం చేశాడు. అదే విధంగా ఈ విషయం గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాను త్వరలోనే మాట్లాడుతానని అఫ్రిది చెప్పాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ ఫైనల్ అనంతరం మీడియాతో మాట్లాడిన అఫ్రిది ఈ వాఖ్యలు చేశాడు. అఫ్రిది మాట్లాడుతూ.. "భారత్-పాక్ల మధ్య సంబంధాలు బాగుపడాలంటే ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు, ఇతర టోర్నీలు జరగాలి. రెండు దేశాల మధ్య క్రికెట్ జరగాలని నేను మోడీ సార్నే అభ్యర్థిస్తాను. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్నా.. వారు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేయగలము. బీసీసీఐ చాలా బలమైన క్రికెట్ బోర్డు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు.. బాధ్యత కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు మిత్రులను పెంచుకోవాలి తప్ప శత్రువులను కాదు. మీకు సంభందాలు ఎంత ఎక్కువగా ఉంటే మరింత బలపడతారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బలహీనంగా ఏమీ లేదు. ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్కు ఓ ప్రత్యేకమైన స్ధానం ఉంది. భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి జట్లు కూడా పాకిస్తాన్కు వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. ఇకభారత జట్టులో నాకు ఇప్పటికీ స్నేహితులు ఉన్నారు. మేము కలిసినప్పుడు అన్ని విషయాలు గురించి చర్చించుకుంటాము. లెజెండ్స్ లీగ్ సందర్భంగా రైనాను కలిశాను. అతడి బ్యాట్తో ఓ మ్యాచ్ కూడా నేను ఆడాను" అని పేర్కొన్నాడు. చదవండి: IND Vs AUS: ఆస్ట్రేలియాతో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! సూర్యకు ఆఖరి ఛాన్స్ -
గంభీర్ సేనకు పరాభవం.. అఫ్రిది దండు చేతిలో ఓటమి
దోహా వేదికగా జరుగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. మార్చి 20న జరిగే ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ను ఢీకొట్టేందుకు ఆసియా లయన్స్ అర్హత సాధించింది. నిన్న (మార్చి 18) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో షాహిద్ అఫ్రిది నేతృత్వంలోని ఆసియా లయన్స్.. గౌతమ్ గంభీర్ సారధ్యంలోని ఇండియా మహారాజాస్ను 85 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. The Lions roar their way to the finals! 🦁💥@AsiaLionsLLC won by 85 runs in the ultimate showdown of this season! 🎊#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/ZEyo1I76gC — Legends League Cricket (@llct20) March 18, 2023 ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్.. ఉపుల్ తరంగ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్), తిలకరత్నే దిల్షాన్ (26 బంతుల్లో 27; 2 ఫోర్లు), మహ్మద్ హఫీజ్ (24 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అస్ఘర్ అఫ్ఘాన్ (24 బంతుల్లో 34 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), తిసార పెరీరా (12 బంతుల్లో 24; 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. Tharanga Thriller!🏏👏 Ladies and Gentlemen, @upultharanga44 is the @officialskyexch Legend of the match! 🎉🔥#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/3HhkbPoKd5 — Legends League Cricket (@llct20) March 18, 2023 మహారాజాస్ బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, ప్రజ్ఞాన్ ఓజా తలో 2 వికెట్లు, ప్రవీణ్ తాంబే ఓ వికెట్ పడగొట్టగా.. మహ్మద్ కైఫ్ అత్యద్భుతమైన 3 క్యాచ్లు పట్టి మ్యాచ్ను రక్తి కట్టించాడు. మహారాజాస్ బౌలర్లు ఎక్స్ట్రాల రూపంలో 15 పరుగులు సమర్పించుకున్నారు. Kaif-tastic, Kaif-alicious, Kaif-a-mazing! 💥👑 The legend @MohammadKaif shows how it's done the kaifway! #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain #MohammadKaif pic.twitter.com/GsJm8xAcLN — Legends League Cricket (@llct20) March 18, 2023 అనంతరం ఛేదనకు దిగిన మహారాజాస్.. ఆసియా సింహాల బౌలర్ల ధాటికి 16.4 ఓవర్లలో 106 పరుగులకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మహారాజాస్ ఇన్నింగ్స్లో రాబిన్ ఉతప్ప (15), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (32), మహ్మద్ కైఫ్ (14), సురేశ్ రైనా (18) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. యూసఫ్ పఠాన్ (9), ఇర్ఫాన్ పఠాన్ (3), మన్విందర్ బిస్లా (8), స్టువర్ట్ బిన్నీ (0), అశోక్ దిండా (2), ప్రవీణ్ తాంబే (0) నిరాశపరిచారు. Despite the defeat, @GautamGambhir is the @rariohq Boss Cap Holder for the runs. #LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/II4hvjRxmG — Legends League Cricket (@llct20) March 18, 2023 లయన్స్ బౌలర్లలో సోహైల్ తన్వీర్, అబ్దుర్ రజాక్, మహ్మద్ హఫీజ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఇసురు ఉడాన, షాహిద్ అఫ్రిది, తిలకరత్నే దిల్షాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. .@sohailmalik614 successfully owns the @rariohq Boss Cap for the wickets after today's amazing performance!#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/DXatiJujiI — Legends League Cricket (@llct20) March 18, 2023 -
చెలరేగిన మిస్బా, అఫ్రిది.. వరల్డ్ జెయింట్స్ను చిత్తు చేసిన ఆసియా సింహాలు
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్తో నిన్న (మార్చి 13) జరిగిన మ్యాచ్లో ఆసియా సింహాలు రెచ్చిపోయాయి. వర్షం కారణంగా 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత లయన్స్ బ్యాటర్లు, ఆతర్వాత బౌలర్లు విజృంభించారు. ఫలితంగా ఆ జట్టు 35 పరుగుల తేడాతో వరల్డ్ జెయింట్స్ను చిత్తు చేసింది. Roaring with pride after a victorious night! 🦁🔥@VisitQatar#LegendsLeagueCricket #SkyexchnetLLCMasters #LLCT20 #YahanSabBossHain pic.twitter.com/0kzmqdGPzn — Legends League Cricket (@llct20) March 13, 2023 టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆసియా లయన్స్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. తిలకరత్నే దిల్షన్ (24 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), మిస్బా ఉల్ హాక్ (19 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జెయింట్స్ బౌలర్లను చీల్చిచెండాడారు. తరంగ (1), తిసార పెరీరా (10), షాహిద్ అఫ్రిది (2) విఫలంకాగా.. రికార్డో పావెల్, క్రిస్ గేల్, పాల్ కాలింగ్వుడ్ తలో వికెట్ దక్కించుకున్నారు. Job done! 💪🦁 pic.twitter.com/vSdDOClUae — Legends League Cricket (@llct20) March 13, 2023 అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆసియా లయన్స్.. 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులకు మాత్రమే పరిమితమై లీగ్లో తొలి ఓటమిని నమోదు చేసింది. లెండిల్ సిమన్స్ (14), షేన్ వాట్సన్ (3), ఆరోన్ ఫించ్ (2), రికార్డో పావెల్ (0) విఫలం కాగా.. క్రిస్ గేల్ (16 బంతుల్లో 23; 3 సిక్సర్లు) ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు. Lions Roared Tonight! 🦁🔥 pic.twitter.com/6hy266Swph — Legends League Cricket (@llct20) March 13, 2023 ఆసియా లయన్స్ బౌలర్లలో షాహిద్ అఫ్రిది (2-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-9-1) రాణించగా.. అబ్దుర్ రజాక్ (2-1-2-2) అదరగొట్టాడు. లీగ్లో భాగంగా ఇవాళ (మార్చి 14) ఆసియా లయన్స్, ఇండియా మహరాజాస్లో తలపడనుంది. కాగా, లీగ్లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో రెండింటిలో ఆసియా లయన్స్, ఒక మ్యాచ్లో వరల్డ్ జెయింట్స్ విజయం సాధించగా.. ఇండియా మహరాజాస్ ఆడిన 2 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. లీగ్ తొలి మ్యాచ్లో ఆసియా లయన్స్ చేతిలో ఖంగుతిన్న (9 పరుగుల తేడాతో ఓటమి) మహరాజాస్.. రెండో మ్యాచ్లో వరల్డ్ జెయింట్స్ చేతిలో (2 పరుగుల తేడాతో ఓటమి) ఓటమిపాలయ్యారు. మహరాజాస్ ఓడిన రెండు మ్యాచ్ల్లో ఆ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నాడు. -
LLC 2023: గంభీర్ దగ్గరికి వచ్చి ఆఫ్రిది ఆరా.. వీడియో వైరల్! ఎవరున్నా అంతే!
Legends League Cricket 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్- 2023లో భాగంగా ఇండియా మహరాజాస్- ఆసియా లయన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇండియా కెప్టెన్ గౌతం గంభీర్ పట్ల లయన్స్ సారథి షాహిద్ ఆఫ్రిది వ్యవహరించి తీరు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దోహా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసియా లయన్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. మిస్బా ఉల్ హక్ అద్భుత అర్ధ శతకం(73)కి తోడు ఓపెనర్ ఉపుల్ తరంగ 40 పరుగులతో రాణించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్రిది బృందం 6 వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఇండియా మహరాజాస్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప డకౌట్గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ గౌతం గంభీర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 39 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. కాగా గంభీర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హెల్మెట్కు బంతి తాకింది. ఇండియా ఇన్నింగ్స్ 12వ ఓవర్లో అబ్దుల్ వేసిన బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీకి తరలించేందుకు గౌతీ ప్రయత్నించాడు. అయితే, బాల్ బ్యాట్ ఎడ్జ్ను తాకి తర్వాత హెల్మెట్కు తగిలింది. అయితే, బంతి మరీ అంత బలంగా తాకకపోవడంతో గౌతీ- మహ్మద్ కైఫ్ పరుగు పూర్తి చేసుకున్నారు. ఆ సమయంలో గౌతీ దగ్గరికి వెళ్లిన ఆఫ్రిది.. బాల్ హెల్మెట్కు తాకిన విషయం గురించి ఆరా తీశాడు. సమస్య ఏమీ లేదు కదా! అన్నట్లు గౌతీతో వ్యాఖ్యానించగా.. అదేమీ లేదని అతడు బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ పాకిస్తాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. అయితే, బిగ్ హార్ట్ అంటూ ఆఫ్రిదిని పొగుడుతూ క్యాప్షన్ జతచేయడం పట్ల గంభీర్ ఫ్యాన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘ఓ ఆటగాడిగా క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాడు.. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు కదా!’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మైదానం లోపల, వెలుపలా గంభీర్- ఆఫ్రిది మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ వీడియో నెట్టింట ఇలా చక్కర్లు కొడుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. గంభీర్ తర్వాత వన్డౌన్ బ్యాటర్ మురళీ విజయ్ 25, మహ్మద్ కైఫ్ 22 పరుగులతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 9 పరుగుల తేడాతో ఆసియా లయన్స్ ఇండియా మహరాజాస్పై విజయం సాధించింది. చదవండి: Rohit Sharma: రోహిత్ అరుదైన రికార్డు.. సచిన్, కోహ్లితో పాటు ఆ జాబితాలో! అజారుద్దీన్ తర్వాత.. NZ Vs SL: డ్రా అయితే డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ 'Big-hearted' Shahid Afridi inquires if Gautam Gambhir is ok after that blow ❤️#Cricket pic.twitter.com/EqEodDs52f — Cricket Pakistan (@cricketpakcompk) March 10, 2023 -
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023.. ఇండియా, ఆసియా కెప్టెన్లుగా బద్ద శత్రువులు
మార్చి 10 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో లీగ్లో పాల్గొనబోయే ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్, ఇండియా మహారాజాస్ జట్లు తమ కెప్టెన్ల పేర్లను నిన్న (మార్చి 1) ప్రకటించాయి. ఆసియా లయన్స్కు షాహిద్ అఫ్రిది, వరల్డ్ జెయింట్స్కు ఆరోన్ ఫించ్, ఇండియా మహారాజాస్కు గౌతమ్ గంభీర్ను కెప్టెన్లుగా ఎంపిక చేసినట్లు ఆయా జట్లు అనౌన్స్ చేశాయి. ఈ లీగ్లో ఇర్ఫాన్ పఠాన్, రాబిన్ ఉతప్ప, శ్రీశాంత్, ఆరోన్ ఫించ్, షాహిద్ అఫ్రిది, మహ్మద్ హఫీజ్, తిలకరత్నే దిల్షాన్, క్రిస్ గేల్, బ్రెట్ లీ తదితర లెజెండ్స్ ఆడనున్నారు. ఆసియా లయన్స్కు సారధ్యం వహించనున్న షాహిద్ అఫ్రిది.. ఎల్ఎల్సీలో తొలిసారి ఆడుతుండగా.. ఇండియా మహారాజాస్ సారధి గౌతమ్ గంభీర్ 2022 ఎల్ఎల్సీ సీజన్లో ఇండియా క్యాపిటల్స్ను ఛాంపియన్గా నిలబెట్టాడు. అఫ్రిది-గంభీర్.. వారు క్రికెట్ ఆడుతున్న జమానా నుంచి ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బద్ద శత్రువులుగా ఉన్నారు. కాగా, ఎల్ఎల్సీ 2023 సీజన్ మ్యాచ్లు మార్చి 10 నుంచి 20 వరకు ఖతార్లోని దోహాలో ఉన్న ఏషియన్ టౌన్ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఎల్ఎల్సీ 2022 సీజన్ విజేతగా ఇండియా క్యాపిటల్స్ నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో క్యాపిటల్స్.. బిల్వారా కింగ్స్పై 104 పరుగుల తేడాతో విజయం సాధంచి, టైటిల్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ఇండియా క్యాపిటల్స్ ఆటగాడు రాస్ టేలర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 41 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. టేలర్కు జతగా.. మిచెల్ జాన్సన్ (35 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే నర్స్ (19 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) కూడా రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరంలో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ జట్టు.. 18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయంపాలైంది. -
ఆఫ్రిది కుమార్తెను పెళ్లి చేసుకున్న షాహీన్.. ఫోటోలు వైరల్
-
షాహీన్తో కుమార్తె వివాహం.. ఆఫ్రిది భావోద్వేగం! ట్వీట్ వైరల్
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిది వివాహం శుక్రవారం కరాచీ నగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది కుమార్తె అన్షాను షాహీన్ వివాహమాడాడు. వీరిద్దరి పెళ్లికి కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు హాజరయ్యారు. ఇక తన కూమర్తె నిఖా అనంతరం షాహిద్ ఆఫ్రిది భావోద్వేగానికి లోనయ్యాడు. "దేవుడి ఆశీర్వాదాలతో ఇంటి పూదోటలో వికసించే.. అత్యంత అందమైన పూబోణి కూతురు. తనతో కలిసి మనస్ఫూర్తిగా నవ్వగలం, తన కలలను ప్రేమించగలం. తను ఉంటే చాలంతే! ఓ తండ్రిగా నా బిడ్డ పట్ల నా బాధ్యత నెరవేర్చా. షాహిన్ ఆఫ్రిదిని తనకు భర్తగా ఇచ్చాను. మీ ఇద్దరికీ శుభాభినందనలు’’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఇక 2021 జులైలో శ్రీలంక టూర్ లో గాయపడ్డ షాహీన్.. ఆసియా కప్ ఆడలేదు. టీ20 ప్రపంచకప్ లో ఫిట్నెస్ లేకున్నా ఆడిన అతడు తర్వాత మళ్లీ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆఫ్రిది ప్రస్తుతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. అతడు ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న పాకిస్తాన్ సూపర్ లీగ్లో లాహోర్ ఖలందర్స్ సారథ్యం వహించనున్నాడు.ఇక 22 ఏళ్ల షాహీన్ తన కెరీర్ లో ఇప్పటివరకు 25 టెస్టులు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. టెస్టులలో 99, వన్డేలలో 62, టీ20లలో 58 వికెట్లు పడగొట్టాడు. Daughter is the most beautiful flower of your garden because they blossom with great blessing. A daughter is someone you laugh with, dream with, and love with all your heart. As parent, I gave my daughter in Nikkah to @iShaheenAfridi, congratulations to the two of them😘 pic.twitter.com/ppjcLllk8r — Shahid Afridi (@SAfridiOfficial) February 4, 2023 "Qabool Hai, Qabool Hai"#NewBeginings #ShaheenShahAfridi pic.twitter.com/4kiswYI0iG — Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023 చదవండి: సొంతగడ్డపై భారత జట్టు బలహీనం.. ఆసీస్దే ట్రోఫీ: టీమిండియా మాజీ హెడ్కోచ్ -
పిల్లనిచ్చిన మామకు అల్లుడి బౌలింగ్
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది శుక్రవారం మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూతురు అన్షాను నిఖా చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే.. తాజాగా మరొక వీడియో బయటకొచ్చింది. ఒక పక్కన పెళ్లి సందడి నడుస్తున్న సమయంలోనే మామకు అల్లుడు బౌలింగ్ చేయడం.. ఆ బంతిని మామ సిక్సర్ తరలించడం ఆకట్టుకుంది. ఇదంతా పీఎస్ఎల్ ప్రాక్టీస్ అని వీడియో ద్వారా అర్థమయింది. ఫిబ్రవరి 13 నుంచి పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) ప్రారంభమవనున్న నేపథ్యంలో లీగ్లో పాల్గొనే జట్లు తమ ప్రాక్టీస్ను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో లాహోర్ ఖలండర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న షాహిన్ తన ప్రాక్టీస్లో వేగం పెంచాడు. ఫిట్నెస్ సాధించేందుకు చెమటోడుస్తున్నాడు. ప్రాక్టీస్లో భాగంగా మామ షాహిద్ అఫ్రిదికి.. అల్లుడు షాహిన్ అఫ్రిది బౌలింగ్ చేశాడు. షాహిన్ విసిరిన వేగవంతమైన బంతిని షాహిద్ అంతే వేగంగా భారీ సిక్సర్గా మలిచాడు. దీనికి సంబంధించిన వీడియోనూ క్రికెట్ పాకిస్తాన్ తమ ట్విటర్లో పంచుకుంది. ''వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే.. #PaksitanCricket #ShahidAfridi..'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక గతేడాది లాహోర్ ఖలండర్స్ తొలి పీఎస్ఎల్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయంలో షాహిన్ అఫ్రిది పాత్ర కీలకం.. బ్యాట్తో పాటు బంతితో రాణించిన అఫ్రిది ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టుకు తొలి టైటిల్ అందించాడు. 𝐀𝐠𝐞 𝐢𝐬 𝐣𝐮𝐬𝐭 𝐚 𝐧𝐮𝐦𝐛𝐞𝐫🔥#PakistanCricket #ShahidAfridipic.twitter.com/THeMzEO1Ib — Cricket Pakistan (@cricketpakcompk) February 2, 2023 -
షాహీన్ అఫ్రిది 'నిఖా' హోగయా.. ప్రత్యేక అతిధి ఎవరంటే..?
పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది వివాహం ఇవాళ (ఫిబ్రవరి 3) పాకిస్తాన్లోని కరాచీ నగరంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో షాహీన్.. పాక్ దిగ్గజ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాను నిఖా చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమానికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు. షాహీన్-అన్షా జంటకు పాక్ సహచర క్రికెటర్లు, అలాగే షాహీన్ పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) జట్టు లాహోర్ ఖలందర్స్ జట్టు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. షాహీన్ను అత్యంత సన్నిహితులైన పాక్ క్రికెటర్ హరీస్ రౌఫ్, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీస్ ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ వివాహం కోసం ప్రత్యేకంగా కరాచీకి వచ్చినట్లు సమాచారం. నిఖా తర్వాత జరిగే మెహంది కార్యక్రమం ఇవాళ రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాక్ క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. కాగా, షాహీన్-అన్షాల ఎంగేజ్మెంట్ రెండేళ్ల క్రితమే జరిగింది. నాటి నుంచి వీరి వివాహం అదిగో ఇదిగో అంటూ మీడియాలో పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం పాక్కు అంతర్జాతీయంగా ఎలాంటి షెడ్యూల్ లేకపోవడంతో ఆ దేశ క్రికెటర్లంతా విదేశీ లీగ్ల్లో బిజీగా ఉన్నారు. షాహీన్ అఫ్రిది కూడా వివాహానికి కొద్ది రోజుల ముందు వరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఆడాడు. Skipper is on his way to Karachi to attend Shaheen's wedding 🙌 Photo Courtesy: @mirzaiqbal80 #PakistanCricket #ShaheenAfridi pic.twitter.com/ynJ67vSnv1 — Cricket Pakistan (@cricketpakcompk) February 3, 2023 పాకిస్తాన్ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 13 నుంచి మొదలవుతుంది. 5 టీ20లు, 5 వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. 22 ఏళ్ల షాహీన్ అఫ్రిది ఇప్పటివరకు పాక్ తరఫున 25 టెస్ట్లు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. ఇందులో 99 టెస్ట్ వికెట్లు, 62 వన్డే వికెట్లు, 58 టీ20 వికెట్లు పడగొట్టాడు. 🎉Haris Rauf's reaction on Shaheen ka Nikah🎉#MainHoonQalandar #DilSe pic.twitter.com/CsjIQPxzsS — Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023 🎉Shaheen ka Nikah🎉 "Happy Wife, Happy Life"#MainHoonQalandar #DilSe pic.twitter.com/Zi6WGUNFiP — Lahore Qalandars (@lahoreqalandars) February 2, 2023 -
షాహిద్ అఫ్రిదికి షాకిచ్చిన పీసీబీ.. చీఫ్ సెలెక్టర్ బాధ్యతల నుంచి తొలగింపు
Shahid Afridi: పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు తాత్కాలిక చీఫ్ సెలెక్టర్, ఆ దేశ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాకిచ్చింది. అఫ్రిదిని సెలెక్టర్ పదవి నుంచి తొలిగిస్తున్నట్లు పీసీబీ ఇవాళ (జనవరి 23) ప్రకటించింది. అఫ్రిది స్థానంలో 69 ఏళ్ల హరూన్ రషీద్ను చీఫ్ సెలెక్టర్గా నియమిస్తున్నట్లు పీసీబీ వెల్లడించింది. కమిటీలోని మిగతా సభ్యుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తామని పీసీబీ పేర్కొంది. పీసీబీ చీఫ్గా నజమ్ సేథీ బాధ్యతలు చేపట్టాక నాటి చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వసీంను తొలగించిన పీసీబీ.. ఆ పదవిలో అఫ్రిదిని తాత్కాలికంగా కూర్చోబెట్టింది. తాజాగా పీసీబీ అఫ్రిదికి కూడా ఉద్వాసన పలికి హరూన్ రషీద్కు బాధ్యతలు అప్పజెప్పడం పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ తరఫున 23 టెస్ట్లు, 12 వన్డేలు ఆడిన హరూన్ రషీద్.. 2015 నుంచి 2016 వరకు పాక్ చీఫ్ సెలెక్టర్గా పని చేశాడు. రషీద్.. పీసీబీని నడుపుతున్న 14 మంది సభ్యుల క్రికెట్ మేనేజ్మెంట్ కమిటీలోనూ కీలక మెంబర్గా కొనసాగుతున్నాడు. కాగా, స్వదేశంలో గతకొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాల నేపథ్యంలో జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ను తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీకి కొత్త బాస్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
బాబర్ ఆజమ్పై వేటు, పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నాయకత్వ మార్పు చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న బాబర్ ఆజమ్ను దించేసి, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్కు పట్టం కట్టేందుకు సర్వం సిద్ధమైనట్లు పాక్ మీడియాలో కధనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు వెటరన్ వికెట్కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ను టెస్ట్ కెప్టెన్ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వన్డే, టీ20ల్లో షాన్ మసూద్కు కెప్టెన్సీ అప్పగించినా.. టెస్ట్ల్లో మాత్రం సర్ఫరాజ్కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయంపై నజీం నేథీ నేతృత్వంలోని పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పాక్ క్రికెట్ సర్కిల్స్లో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాక్ మాజీలు, ఆ దేశ క్రికెట్ విశ్లేషకులేమో మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని సమాచారం. ఏదిఏమైనప్పటికీ పీసీబీ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాక్ స్వదేశంలో ఆడిన దాదాపు ప్రతి సిరీస్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరీస్లో 1-2 తేడాతో ఓటమిపాలైన పాక్.. అంతకుముందు అదే జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ అయిన పాక్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్పై వేటు అంశం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే, పీసీబీ కొద్దికాలం క్రితమే బోర్డు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తొలుత అధ్యక్షుడు రమీజ్ రజాపై వేటు వేసి నజీం సేథికి బాధ్యతలు అప్పగించిన పీసీబీ.. ఇటీవలే షాహిద్ అఫ్రిదిని జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా నియమించింది. -
నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు కదా! రమీజ్ రాజాకు సర్ఫరాజ్ కౌంటర్!
Pakistan vs New Zealand, 2nd Test: ‘‘షాహిద్ భాయ్ చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టగానే నన్ను పిలిచి.. నువ్వు ఈ మ్యాచ్ ఆడుబోతున్నావు అని చెప్పాడు. ప్రాక్టీసు చేస్తున్న సమయంలో బాబర్ ఆజం కూడా ఇదే మాట అన్నాడు. నేను షాహిద్ భాయ్తో గతంలో ఆడాను.. తనకు నా గురించి తెలుసు’’ అని పాకిస్తాన్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత న్యూజిలాండ్తో సొంతగడ్డపై టెస్టు సిరీస్తో పునరాగమనం చేశాడు సర్ఫరాజ్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా రమీజ్ రాజా స్థానంలో నజీమ్ సేతీ నియామకంతో పాటు చీఫ్ సెలక్టర్గా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఎంపికైన తర్వాత జరిగిన తొలి సిరీస్ ఇది. నిరూపించుకున్నాడు ఈ క్రమంలో వైస్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్పై వేటు వేసి 35 ఏళ్ల సర్ఫరాజ్కు ఆడే అవకాశం ఇవ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, సర్ఫరాజ్ మాత్రం తనకు ఇచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్లో అర్ధ శతకాలు (86, 53) బాదిన ఈ వికెట్ కీపర్.. రెండో మ్యాచ్లో అద్భుత సెంచరీతో(78, 118) మెరిశాడు. ఈ రెండు మ్యాచ్లలో పాక్ను గట్టెక్కించి ఓటమి నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో రమీజ్ రాజా గతంలో చేసిన వ్యాఖ్యలపై సర్ఫరాజ్కు ప్రశ్న ఎదురైంది. కివీస్తో రెండో టెస్టు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో.. ‘‘ఆటగాడిగా నీ కెరీర్ ముగిసిపోయిందని రమీజ్ రాజా అన్నాడు. అయితే, వచ్చీ రాగానే.. డేరింగ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిది నీకు ఛాన్స్ ఇచ్చాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు సర్ఫరాజ్’’ అని విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు బదులుగా.. రమీజ్ రాజా పేరు ప్రస్తావించకుండానే.. ‘‘దేశవాళీ క్రికెట్లో రాణించాను. సరైన వ్యక్తుల మార్గదర్శనం, మీడియా ప్రోత్సాహం.. నా కుటుంబం, శ్రేయోభిలాషుల మద్దతుతో ఇక్కడి దాకా వచ్చాను’’ అని సర్ఫరాజ్ అహ్మద్ చెప్పుకొచ్చాడు. రమీజ్ రాజా తన గురించి మాట్లాడిన మాటలకు ఆటతోనే సమాధానం చెప్పానని పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. షాహిద్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. ఆఖరి వరకు ఉత్కంఠ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ఉత్కంఠభరిత మలుపులు తిరిగి చివరకు ‘డ్రా’గా ముగిసింది. ఒక దశలో పాక్ ఓటమి ఖాయమనిపించి, ఆపై గెలుపు అవకాశం చిక్కినా వాడుకోలేకపోగా... పేలవ బౌలింగ్తో చివరకు కివీస్ ‘డ్రా’తో సంతృప్తి పడాల్సి వచ్చింది. 319 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 0/2తో ఆట కొనసాగించిన పాక్ శుక్రవారం మ్యాచ్ ముగిసే సమయానికి 90 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ (176 బంతుల్లో 118; 9 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత సెంచరీ సాధించగా...షాన్ మసూద్ (35), సౌద్ షకీల్ (32), ఆగా సల్మాన్ (30) అండగా నిలిచారు. ఒక దశలో 80 పరుగుల వద్దే పాక్ 5 వికెట్లు కోల్పోయింది. అయితే సర్ఫరాజ్, షకీల్ ఆరో వికెట్కు 123 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. సల్మాన్తో కూడా సర్ఫరాజ్ వేగంగా 70 పరుగులు జత చేశాడు. చివరి 15 ఓవర్లలో 70 పరుగులు చేయాల్సి ఉండగా... తక్కువ వ్యవధిలో 3 వికెట్లు తీసి న్యూజిలాండ్ విజయంపై గురి పెట్టింది. అయితే 32 పరుగులు చేయాల్సిన స్థితిలో సర్ఫరాజ్ 9వ వికెట్గా వెనుదిరిగాడు. చివరి వికెట్ తీస్తే కివీస్ గెలుపు అందుకునే అవకాశం ఉండగా...చివరి జోడి నసీమ్ షా (15 నాటౌట్), అబ్రార్ (7 నాటౌట్) వికెట్ పడకుండా 21 బంతులు జాగ్రత్తగా ఆడారు. మిగిలిన 3 ఓవర్లలో పాక్కు 15 పరుగులు అవసరం కాగా... వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో రెండు టెస్టుల సిరీస్ 0–0తో డ్రాగా ముగిసింది. చదవండి: ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం.. డబుల్ సెంచరీ పూర్తి కాకుండానే ఇన్నింగ్స్ డిక్లేర్ Ind VS SL 3rd T20: భారీ స్కోర్లు గ్యారంటీ! అతడికి ఉద్వాసన.. రుతురాజ్ ఎంట్రీ! Sarfaraz Ahmed’s press conference following the drawn Test in Karachi.#PAKvNZ | #TayyariKiwiHai https://t.co/oSRFkM3L2k — Pakistan Cricket (@TheRealPCB) January 6, 2023 -
పీసీబీ చీఫ్ సెలెక్టర్గా అఫ్రిది మంగమ్మ శపథం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇటీవలే షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అఫ్రిదితో పాటు మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ పేసర్ ఇఫ్తికార్ అంజుమ్, హరూన్ రషీద్ లతో కూడిన సెలక్షన్ కమిటీ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో షాహిద్ అఫ్రిది తాను చీఫ్ సెలెక్టర్గా ఎంపికవ్వడంపై తొలిసారి పెదవి విప్పాడు. తాను పదవి నుంచి దిగిపోయేలోపు పాకిస్తాన్ క్రికెట్ లో రెండు పటిష్టమైన జట్లను తయారుచేస్తానని.. ఆ విషయంలో రాజీ పడేది లేదని చెప్పాడు. ఈ మేరకు శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ''చీఫ్ సెలక్టర్ గా నా పదవీ కాలం ముగిసేలోపు పాక్ క్రికెట్ టీమ్ బెంచ్ ను బలోపేతం చేస్తా. నేను పాకిస్తాన్ కోసం ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉండేలా రెండు జట్లను తయారుచేస్తా'' అంటూ మంగమ్మ శపథం చేశాడు . అయితే అఫ్రిది వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు భిన్నంగా స్పందించారు. ప్రధాన జట్టుకు సమాంతరంగా మరో జట్టును తయారుచేయడం పాకిస్తాన్ కు కొత్తగా అనిపిస్తున్నప్పటికీ ప్రపంచ క్రికెట్ లో అది పాత చింతకాయ పచ్చడిలానే ఉంది. ఇంగ్లండ్ (ఈసీబీ), ఇండియా (బీసీసీఐ) ఇవి కొద్దికాలంగా అమలుపరుస్తున్న విధానాలే.ఏకకాలంలో ఆ జట్లు రెండు దేశాలతో ఆడేంత సామర్థ్యం సాధించుకున్నాయి. షాహిన్ అఫ్రిది గాయంతో తప్పుకోవడంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్లో షాహిన్ తో పాటు ఆ జట్టు ప్రధాన పేసర్లు హరీస్ రౌఫ్, నసీమ్ షాలు కూడా చివరి రెండు టెస్టులకు దూరమయ్యారు. దీంతో అంతగా అనుభవం లేని బౌలర్లతో పాకిస్తాన్ బరిలోకి దిగి సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. మరి ఈ ప్రయత్నంలో అఫ్రిది ఏ మేరకు విజయవంతమవుతాడనేది వేచి చూడాల్సిందే. చదవండి: పంత్ను కాపాడిన బస్సు డ్రైవర్కు సత్కారం.. ఎప్పుడంటే? ఇలా చేయడం సిగ్గుచేటు.. రోహిత్ శర్మ భార్య ఆగ్రహం -
ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం (ఫొటోలు)
-
ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె పెళ్లి.. హాజరైన షాహిన్ ఆఫ్రిది
Shahid Afridi Daughter Marriage: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రిది ఇంట పెళ్లి సందడి నెలకొంది. అతడి పెద్ద కుమార్తె అక్సాకు నసీర్ నాసిర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కరాచీలో శుక్రవారం అత్యంత సన్నిహితుల నడుమ నిఖా జరిగింది. ఇక ఈ పెళ్లిలో పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కాబోయే మామ షాహిద్తో కలిసి తోడల్లుడి వెనుకాల నిల్చుని వేడుకను వీక్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. షాహిన్ వివాహం ఎప్పుడంటే! షాహిద్ ఆఫ్రిది రెండో కుమార్తె అన్షా ఆఫ్రిదితో షాహిన్ పెళ్లి జరుగనున్న విషయం తెలిసిందే. కాగా పెద్ద కూతురు అక్సా వివామైన తర్వాత అన్షాకు పెళ్లి చేయాలని షాహిద్ కుటుంబం నిర్ణయించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 3న షాహిన్- అన్షా పెళ్లికి ముహూర్తం ఖరారు చేసింది. వాళ్లు అడిగారు.. ఓకే అన్నా కాగా తన కుమార్తెతో షాహిన్ నిఖా జరిపించే విషయమై అతడి కుటుంబం తమను సంప్రదించిందని షాహిద్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా పాక్ ప్రధాన పేసర్గా షాహిన్ ఎదగగా.. షాహిద్ ఇటీవలే పీసీబీ చీఫ్ సెలక్టర్గా ఎన్నికయ్యాడు. ఇలా మామా- అల్లుడు పాకిస్తాన్ క్రికెట్లో కీలక సభ్యులుగా మారారు. ఇదిలా ఉంటే షాహిద్ ఆఫ్రిదికి ఐదుగురు ఆడపిల్లలు సంతానం అన్న విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం అతడికి ఐదోసారి ఆడబిడ్డ జన్మించింది. కూతుళ్లతో షాహిద్ ఆఫ్రిది చదవండి: Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! Rishabh Pant: తల్లిని సర్ప్రైజ్ చేద్దామనుకుని ఇలా!.. త్వరగా కోలుకో.. కోహ్లి ట్వీట్ Shahid Afridi daughter Aqsa's Nikah in Karachi @SAfridiOfficial @iShaheenAfridi pic.twitter.com/Zd6USavkeB — ٰImran Siddique (@imransiddique89) December 30, 2022 -
Pak Vs NZ: వైస్ కెప్టెన్పై వేటు! సొంతగడ్డపై తొలిసారి.. చీఫ్ సెలక్టర్పై మండిపాటు
Pakistan vs New Zealand, 1st Test- Shahid Afridi- Babar Azam: స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో వైట్వాష్కు గురైన పాకిస్తాన్ మరో పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభించింది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం మొదలైన తొలి టెస్టు ద్వారా దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత సర్ఫరాజ్ అహ్మద్ పునరాగమనం చేశాడు. మహ్మద్ రిజ్వాన్ను తప్పించిన మేనేజ్మెంట్.. అతడి స్థానంలో తుది జట్టుకు సర్ఫరాజ్ను ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్తో సిరీస్లో మూడు టెస్టు మ్యాచ్లు ఆడిన రిజ్వాన్ చేసిన పరుగులు 141(సగటు 23.50). టాప్ స్కోర్ 46. ఈ నేపథ్యంలో కివీస్తో తొలి టెస్టులో అతడికి స్థానం దక్కలేదు. నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలిసారి ఇక 2019లో జనవరిలో జొహన్నస్బర్గ్లో దక్షిణాఫ్రికాతో ఆఖరిసారిగా పాక్ తరఫున ఆడిన సర్ఫరాజ్ అహ్మద్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో దేశవాళీ టోర్నీలో 8 మ్యాచ్లలో ఈ వెటరన్ బ్యాటర్ 394 పరుగులతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. సింధ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 2022-23 ఎడిషన్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లో మూడు అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు కాగా 2010లో అంతర్జాతీయ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన 35 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్కు పాక్ గడ్డపై ఇదే తొలి టెస్టు కావడం మరో విశేషం. ఇక ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున 49 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ అహ్మద్ 2657 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2018లో అరంగేట్రం చేసిన ఫాస్ట్బౌలర్ మిర్ హంజా కూడా కివీస్తో సిరీస్లో పునరాగమనం చేశాడు. తొలుత అతడిని జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే, ఆఖరి నిమిషంలో ఈ పేసర్కు జట్టులో చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్ చేతిలో క్లీన్స్వీప్ చేతిలో ఇప్పటికే ప్రక్షాళన చేపట్టిన పాక్ బోర్డు.. చైర్మన్ రమీజ్రాజాను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో నజమ్ సేతీ వచ్చాడు. ఇక అదే విధంగా చీఫ్ సెలక్టర్గా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. కాగా వైస్ కెప్టెన్ రిజ్వాన్ను తప్పించడం ఫ్యాన్స్కు రుచించడం లేదు. చీఫ్ సెలక్టర్, కెప్టెన్పై విమర్శలు ‘‘కేవలం ఒకటీ రెండు మ్యాచ్లలో స్కోర్ ఆధారంగా రిజ్వాన్ను తప్పిస్తారా? సర్ఫరాజ్ను తీసుకురావడం మంచిదే! కానీ అందుకోసం రిజ్వాన్ను బలిచేస్తారా? రిజ్వాన్ను తప్పించాలనే నిర్ణయం ఆఫ్రిదిదా లేదంటే బాబర్ ఆజందా’’ అంటూ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా ఇంగ్లండ్ చేతిలో పరాభవం నేపథ్యంలో పాక్ డబ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించి విమర్శలు మూటగట్టుకుంది. చదవండి: Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ -
షాహిద్ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ సెలెక్టర్గా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఎంపికయ్యాడు. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 3-0తో వైట్వాష్ అయిన పాకిస్తాన్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్ ఓటమి పీసీబీ ప్రక్షాళనకు దారి తీసింది. పీసీబీ ఛైర్మన్గా ఉన్న రమీజ్ రాజాపై వేటు పడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో నజమ్ సేతీ కొత్త ఛైర్మన్గా ఎంపికయ్యాడు. తాను ఎంపికైన రెండురోజులకే పీసీబీలో కీలక మార్పులు చేపట్టాడు నజమ్ సేతీ. పాక్ క్రికెట్లో కీలకపాత్ర పోషించిన ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదిని చీఫ్ సెలెక్టర్ పదవికి ఎంపిక చేశాడు. అఫ్రిదితో పాటు మాజీ ఆల్రౌండర్ అబ్దుల్ రజాక్, మాజీ క్రికెటర్ ఇఫ్తికార్ అంజుమ్లు ప్యానెల్లో సభ్యులుగా ఎంపికవ్వగా.. హరూన్ రషీద్ కన్వీనర్గా ఎంపికయ్యాడు. ఈ మేరకు పీసీబీ తన ట్విటర్లో ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పీసీబీలో ప్రక్షాళన జరుగుతుంది. త్వరలోనే పాక్ జట్టులోనూ ఆటగాళ్ల ప్రక్షాళన జరిగే అవకాశం ఉంది. బాబర్ ఆజంను త్వరలోనే కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక పీసీబీ చీఫ్ సెలెక్టర్గా ఎంపికైన షాహిద్ అఫ్రిది పాక్ తరపున అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు పొందాడు. 22 ఏళ్ల లాంగ్ కెరీర్లో అఫ్రిది 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టి20 మ్యాచ్లు ఆడాడు. 2009 టి20 వరల్డ్కప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టులో అఫ్రిది సభ్యుడిగా ఉన్నాడు. ఇక అబ్దుల్ రజాక్ కూడా పాక్ తరపున మంచి ఆల్రౌండర్గా గుర్తింపు పొందాడు. 1996 నుంచి 2013 వరకు పాక్కు ప్రాతినిధ్యం వహించిన అబ్దుల్ రజాక్ 46 టెస్టులు, 265 వన్డేలు, 32 టి20 మ్యాచ్లు ఆడాడు. ఇక ఇఫ్తికర్ అంజూమ్ పాక్ తరపున 62 మ్యాచ్ల్లో 77 వికెట్లు పడగొట్టాడు. PCB Management Committee has appointed former Pakistan captain Shahid Afridi as the interim Chair of the Men’s National Selection Committee. Other members of the panel are: Abdul Razzaq and Rao Iftikhar Anjum. Haroon Rashid will be the Convener. — Pakistan Cricket (@TheRealPCB) December 24, 2022 -
52 ఏళ్ల వయసులోనూ ఇంజీ పవర్ఫుల్ సిక్సర్.. ఆశ్చర్యపోయిన ఆఫ్రిది!
Inzamam Ul Haq- Shahid Afridi: విజయవంతమైన కెప్టెన్గా పేరొందిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికి 15 ఏళ్లకు పైనే అవుతోంది. జింబాబ్వేతో 2007లో జరిగిన వన్డే సిరీస్లో భాగంగా పాక్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు ఇంజీ! అయితే, యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులను అలరిస్తున్న ఈ మాజీ సారథి... తాజాగా.. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. అదిరిపోయే షాట్ పాకిస్తాన్లో మెగా స్టార్స్ లీగ్ పేరిట ఆరు జట్ల మధ్య టీ10 లీగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా కరాచీ కింగ్స్ తరఫున బరిలోకి దిగిన ఇంజమామ్.. 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే, క్రీజులో ఉన్నంత సేపు బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు ఇంజీ. ఈ క్రమంలో అతడు కొట్టిన పవర్ఫుల్ సిక్సర్ హైలైట్గా నిలిచింది. 52 ఏళ్ల వయసులోనూ పవర్హిట్టింగ్ చేసిన ఇంజీని అలా చూస్తూ ఉండిపోయారు అభిమానులు. డగౌట్లో కూర్చున్న మరో మాజీ సారథి షాహిద్ ఆఫ్రిది సైతం ఇంజీ భాయ్ షాట్కు ఆశ్చర్యపోయాడు. సోమవారం నాటి మ్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పరుగుల వరద కాగా పాకిస్తాన్ తరఫున ఇంజమామ్ వన్డేల్లో మొత్తంగా 11,701 పరుగులు సాధించాడు. పాక్ తరఫున వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్గా నిలిచాడు. తన కెరీర్లో మొత్తంగా 120 టెస్టులు, 378 వన్డేలు ఆడాడు. 81 వన్డే మ్యాచ్లకు సారథ్యం వహించి 51 గెలిచాడు. చదవండి: Ajinkya Rahane: డబుల్ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ.. Babar Azam: ఒక్క మాటతో రమీజ్ రాజా నోరు మూయించిన బాబర్! అది సాధ్యం కాదు.. ప్రతి వాడూ.. Inzi Bhai scores 29 of just 16 and becomes the cricketainer of the day.#KingdomValleyMSL2022 #MSL #KingdomValleyMSL#MegaStarsLeague #Cricketainment #KingdomValley#CricketLeague #Cricket #ShahidAfridi #mediasniffers#Pakola #Daikin #Pindi #islamabad #InzimamUlHaq pic.twitter.com/EdkQVg6GmL — Mega Stars League (@megastarsleague) December 19, 2022 -
బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మంచిది: అఫ్రిది
టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్ ఫైనల్ చేరినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం అంతగా రాణించలేకపోయాడు. ఈ మెగా టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన బాబర్ కేవలం 124 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో బాబర్ కెప్టెన్సీపై ఆ దేశ మాజీ ఆటగాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. మరికొంత మంది బాబర్ కెప్టెన్గా పనికిరాడని, తప్పుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా బాబర్ను ఉద్దేశించి పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బాబర్ టీ20 కెప్టెన్సీని వదులుకుని వన్డేలు, టెస్టుల్లో జట్టును నడిపించడంపై దృష్టి సారించాలని అఫ్రిది సూచించాడు. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్లో కూడా పెషావర్ జల్మీ కెప్టెన్సీ బాధ్యతలు ఆజం చేపట్టకూడదని ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజన్ వరకు కరాచీ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన బాబర్.. వచ్చే ఏడాది సీజన్లో పెషావర్ జల్మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. "బాబర్ ఆజంను నేను చాలా గౌరవిస్తాను. అందుకే అతడు టీ20 క్రికెట్లో కెప్టెన్సీ ఒత్తిడిని తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. అతడు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని వన్డే, టెస్టు ఫార్మాట్లపై దృష్టిపెట్టాలి. షాదాబ్, రిజ్వాన్, షాన్ మసూద్ వంటి వంటి ఆటగాళ్లకి టీ20 ఫార్మాట్లో జట్టును నడిపించే సత్తా ఉంది. అదే విధంగా పాకిస్తాన్ సూపర్ లీగ్లో కూడా బాబర్ సారథ్య బాధ్యతలు చేపట్టకూడదు. అతడు ప్రస్తుతం తన బ్యాటింగ్పై దృష్టిసారించాలని" సామా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ అఫ్రిది పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: అతడు చాలా డేంజరేస్.. టీమిండియా ఓపెనర్గా రావాలి -
'2009 తర్వాత మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారాయి'
2009లో పాకిస్తాన్లో పర్యటనకు వచ్చిన లంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆరోజు బస్సుపై కురిసిన బులెట్ల వర్షానికి లంక జట్టులో పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు. వీరిలో థిల్లాన్ సమరవీర, తిలకరత్నే దిల్షాన్, అజంతా మెండిస్, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే, సురంగ లక్మల్, చమిందా వాస్ సహా మరికొంత మంది క్రికెటర్లు ఉన్నారు. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు చనిపోగా.. ఇద్దరు పౌరులు బలయ్యారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు మిగతా దేశాలు నిరాకరించాయి. అప్పటినుంచి దాదాపు 2019 వరకు అంటే పదేళ్ల పాటు ఏ జట్టు కూడా పాకిస్తాన్లో పర్యటించడానికి ఇష్టపడలేదు. పాక్ ఏదైనా హోం సిరీస్ ఆడాలంటే యూఏఈకి రావాల్సిందే. దీంతో పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్లు జరగక అక్కడి మైదానాలన్ని వెలవెలబోయాయి. బోర్డు నుంచి సహాయం లేకపోవడంతో క్రికెట్ మైదానాలను మూసే పరిస్థితి కూడా వచ్చింది. తాజా పరిస్థితి చూస్తే పాకిస్తాన్లో కాస్త మార్పు కనిపిస్తుంది. 2019లో శ్రీలంక రెండు టెస్టులు ఆడేందుకు పదేళ్ల తర్వాత పాక్ గడ్డపై అడుగుపెట్టింది. ఫలితం సంగతి పక్కనబెడితే.. పాక్లో ఆడేందుకు జంకిన ఇతర దేశాలు లంకతో సిరీస్ను పాక్ నిర్వహించిన తీరుపై నమ్మకం వచ్చి క్రికెట్ ఆడేందుకు ఒప్పుకున్నాయి. ఇటీవలే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు కూడా పాక్ గడ్డపై పర్యటించాయి. దశాబ్దం నుంచి క్రికెట్ మ్యాచ్లు లేక మూగబోయిన మైదానాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఈ అంశంపై స్పందించాడు. ''2009లో లంక క్రికెటర్లపై దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. మా దేశంలోని మైదానాలన్నీ వెడ్డింగ్ హాల్స్గా మారిపోయాయి. మా మైదానాల్లో క్రికెట్ ఆడాలని మాకున్నప్పటికి పరిస్థితులు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. మైదానాల్లో ప్రేక్షకులు మిస్సయ్యాం. అప్పటి బాధ వర్ణణాతీతం. ఈ పదేళ్లలో దేశంలో ఎంతో మార్పు వచ్చింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో పాటు దేశ ప్రభుత్వం క్రికెట్ను బతికించేందుకు చొరవ తీసుకుంది. మేము కూడా విదేశీ లీగ్ల్లో ఆడే సమయంలో విదేశీ ఆటగాళ్లతో మాట్లాడేవాళ్లం. వాళ్లను క్రికెట్ ఆడేందుకు ఒప్పించే ప్రయత్నం చేశాం. పాక్లో మళ్లీ క్రికెట్ ఆడేందుకు పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లలో పాకిస్తాన్ నుంచి మిగతా దేశాలకు క్రికెట్ సురక్షితంగా ఆడుకోవచ్చు అనే భరోసా కల్పించేలా చేశాం. ఇప్పుడు ఆ ఇబ్బందికర దశ మారింది. పాకిస్తాన్లో పర్యటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లు పర్యటించాయి. రానున్న కాలంలో మరిన్ని జట్లు పర్యటనకు వస్తాయని ఆశిస్తున్నా. ఇక క్రికెట్ గ్రౌండ్స్ ప్రేక్షకులతో నిండిపోతుండడం సంతోషంగా అనిపిస్తుంది. ''అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ ఆఖరిమెట్టుపై బోల్తా పడింది. ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఓటమి పాలయ్యింది. బెన్ స్టోక్స్, సామ్ కరన్లు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ రెండోసారి చాంపియన్గా అవతరించింది. సూపర్-12 దశలోనే ఇంటిముఖం పట్టాల్సిన పాకిస్తాన్ అనూహ్యంగా సెమీస్ చేరడం.. అక్కడ కివీస్ను ఓడించడం.. ఆపై ఫైనల్కు వెళ్లింది. ఇక ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో చిత్తయిన పాక్ రన్నరప్గా నిలిచింది. చదవండి: టీమిండియా ఫేవరెట్ ఏంటి..? ఆ జట్టుకు అంత సీన్ లేదు.. నాన్సెన్స్..! -
టీమిండియాపై ఇంగ్లండ్దే విజయం.. మరోసారి అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది టీమిండియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. టీ20 వరల్డ్కప్-2022లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఇవాళ (నవంబర్ 10) జరుగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు. ఇవాళ సెమీస్లో తలపడే రెండు జట్లు బలంగానే ఉన్నా.. టీమిండియాతో పోలిస్తే, ఇంగ్లండ్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 60 నుంచి 65 శాతం వరకు ఇంగ్లండ్కే గెలిచే అవకాశాలున్నాయని భారతీయ అభిమానులతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. భారత్తో పోలిస్తే ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉందని, అందుకే తన ఓటు ఇంగ్లండ్కు వేస్తున్నానని ఓ టీవీ ఇంటర్వ్యూలో జరిగిన విశ్లేషణ సందర్భంగా పేర్కొన్నాడు. ఒత్తిడి ఎదుర్కోవడంలోనూ భారత్తో పోలిస్తే ఇంగ్లండ్ చాలా బెటరని, ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైందని అన్నాడు. గత రికార్డులు భారత్కే అనుకూలంగా ఉన్నా, ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మునుపెన్నడూ లేని భీకర ఫామ్లో ఉందంటూ భారత అభిమానులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. అంతిమంగా ముందు అనుకున్న వ్యూహాలను వంద శాతం అమల్లో పెట్టగలిగే జట్టుదే విజయమని, ఫీల్డ్లో 11 మంది ఆటగాళ్లు రాణించే జట్టుకే విజయం సొంతమవుతుంది జోస్యం చెప్పాడు. అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్మీడియాలో దుమారం రేపుతున్నాయి. భారతీయ అభిమానులైతే అఫ్రిదిని పిచ్చి కుక్కతో పోలుస్తూ.. అసభ్యపదజాలం వాడుతూ కామెంట్లు చేస్తున్నారు. పిచ్చి కుక్కలు, క్రికెట్ అజ్ఞానులు విశ్లేషణలను పట్టించుకోవాల్సిన పని లేదంటూ లైట్గా తీసుకుంటున్నారు. అఫ్రిదికి టీమిండియాపై విషం చిమ్మడం అలవాటేనని అంటున్నారు. ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. నీకు భారత్ కంటే మెరుగ్గా కనిపిస్తుందా అని ఏకి పారేస్తున్నారు. -
ఇండియా క్రికెట్ పవర్హౌజ్.. అయినా: ఆఫ్రిదికి బీసీసీఐ బాస్ కౌంటర్
ICC Mens T20 World Cup 2022: టీమిండియాను ఉద్దేశించి నిరాధార ఆరోపణలు చేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు రోజర్ బిన్నీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి వ్యాఖ్యలు సరికావని.. ఇష్టారీతిన మాట్లాడితే సహించబోమన్నాడు. క్రికెట్ ప్రపంచంలో భారత్ పవర్హౌజ్ లాంటిదైనప్పటికీ తాము ప్రత్యేక ప్రయోజనాలేమీ పొందడం లేదని స్పష్టం చేశాడు. అక్కసు వెళ్లగక్కిన ఆఫ్రిది టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాన ఆగిన తర్వాత మళ్లీ ఆట కొనసాగించారు అంపైర్లు. ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం భారత్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ఫీల్డ్ తడిగా ఉన్నా మ్యాచ్ ఎలా కొనసాగిస్తారని, భారత్ను సెమీస్ చేర్చాలనే ఉద్దేశంతోనే ఐసీసీ ఇలా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు చేశాడు. అంతేగాకుండా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్కు అంపైర్లుగా వ్యవహరించిన వారినే.. ఇండియా- బంగ్లా మ్యాచ్కు కూడా అసైన్ చేశారని.. ఇవన్నీ చూస్తుంటే ఐసీసీ భారత్కు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తోందంటూ అక్కసు వెళ్లగక్కాడు. అలా ఎలా మాట్లాడతారు? ఆఫ్రిది వ్యాఖ్యలపై బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ స్పందించాడు. ‘‘ఇలా మాట్లాడటం సరికాదు. ఐసీసీ మాకు ఏ రకంగానూ అనుకూలంగా వ్యవహరించడం లేదు. ప్రతి జట్టు పట్ల వాళ్ల వైఖరి ఒకేలా ఉంటుంది. ఏ ప్రాతిపదికన మీరు అలా మాట్లాడతారు? మిగతా జట్ల కంటే మాకు అదనంగా లభించిన ప్రయోజనాలు ఏమిటి? క్రికెట్ ప్రపంచంలో ఇండియా అతిపెద్ద పవర్ హౌజ్. కానీ మాకు కూడా మిగతా జట్లలాంటి ట్రీట్మెంటే లభిస్తుంది’’ అని ఈ పాక్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలను ఖండించాడు. చదవండి: Ind Vs Zim: భారత్తో మ్యాచ్.. అంచనాలు తలకిందులు చేసే ఛాన్స్ ఎలా వదులుకుంటాం: జింబాబ్వే కెప్టెన్ Virat Kohli- Anushka Sharma Love Story: అప్పుడప్పుడు నటించేవాడు కూడా.. ‘బ్యాడ్ జోక్’తో మాట కలిపి! ఇప్పుడేమో ఇలా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీమిండియాపై అక్కసు వెళ్లగక్కిన ఆఫ్రిది.. ఐసీసీ సపోర్టుతోనే అంటూ..
టీ20 ప్రపంచకప్లో భాగంగా నవంబర్ 2న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ తమ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. అయితే టీమిండియా విజయాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం జీర్ణీంచుకోలేకపోతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్పై భారత్ విజయం సాధించడంతో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సంచలన వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్లో ఐసీసీ భారత్కు పరోక్షంగా మద్దతిస్తుంది అని అఫ్రిది ఆరోపించాడు. ఈ వరల్డ్కప్లో ఎలాగైనా టీమిండియాను సెమీఫైనల్కు చేర్చాలని ఐసీసీ భావిస్తోంది అని అతడు అక్కసు వెళ్లగక్కాడు. "వర్షం కారణంగా మైదానం ఎంత చిత్తడిగా మారిందో మనం చూశం. బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ కూడా అంపైర్లుతో ఇదే విషయం చెప్పాడు. అయితే అంపైర్లతో పాటు ఐసీసీ కూడా భారత్కే ఫేవర్ చేసినట్లు నాకు అనిపిస్తోంది. భారత్ను ఎట్టిపరిస్థితుల్లోనూ సెమీఫైనల్కు చేర్చాలని ఐసీసీ భావిస్తోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్లో కూడా అంపైర్లు ఇదే తీరును కనబరిచారు. ఖచ్చితంగా వీరికి ఉత్తమ అంపైర్ అవార్డులు లభిస్తాయి. విరామం తర్వాత మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇందులో ఐసీసీ జోక్యం చేసుకున్నట్లు సృష్టంగా తెలుస్తోంది. ఈ సమయంలో ఐసీసీ, భారత్తో కలిసి బంగ్లాదేశ్ ఆడుతోంది. కాబట్టి కచ్చితంగా బంగ్లాదేశ్పై ఒత్తిడి ఉంటుంది. కానీ లిటన్ దాస్ మాత్రం అద్భుతంగా ఆడాడు. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యాక బంగ్లాదేశ్ మరో రెండు మూడు ఓవర్ల వరకు వికెట్లు కోల్పోకపోతే విజయం సాధిస్తుంది భావించాము. కానీ ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ పోరాటం మాత్రం అద్భుతం" అంటూ సమా టీవీతో ఆఫ్రిది పేర్కొన్నాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: టీమిండియాతో మ్యాచ్లో అదరగొట్టాడు.. లిటన్ దాస్కు కోహ్లి అదిరిపోయే గిఫ్ట్ -
'అతడిని టీ20 ప్రపంచకప్కు ఎంపికచేయాల్సింది.. బాబర్కు సపోర్ట్గా ఉండేవాడు'
టీ20 ప్రపంచకప్-2022కు పాకిస్తాన్ జట్టును పీసీబీ గురువారం ప్రకటించింది. గాయం కారణంగా ఆసియాకప్కు దూరమైన పేసర్ షాహిన్ షా ఆఫ్రిదితో పాటు బ్యాటర్లు షాన్ మసూద్, హైదర్ అలీ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే మరో సారి వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్కు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ ఐసీసీ మెగా ఈవెంట్కు మాలిక్ను ఎంపిక చేయకపోవడాన్ని పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. మాలిక్ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాల్సిందని అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సమా టీవీతో అఫ్రిది మాట్లాడుతూ.. "మాలిక్కు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. అదే విధంగా అతడు ఆడిన ప్రతీ చోట అద్భుతంగా రాణించాడు. మాలిక్ 40 ఏళ్ల వయస్సులోనూ ఫిట్గా ఉన్నాడు. అతడికి మిడిలార్డర్లో తన బ్యాటింగ్తో మ్యాచ్ను మార్చగల సత్తా ఉంది. మాలిక్ను టీ20 ప్రపంచకప్కు ఎంపికచేయాల్సింది. మాలిక్ జట్టులో ఉండి ఉంటే.. కెప్టెన్ బాబర్ ఆజాంకు కూడా అతడి నుంచి ఫీల్డ్లో సపోర్ట్ ఉండేది"పేర్కొన్నాడు. కాగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు మాలిక్ను సెలెక్టర్లు ఎంపికచేయడం లేదు. అతడు చివరి సారిగా పాక్ తరపున గతేడాది టీ20 ప్రపంచకప్లో ఆడాడు. చదవండి: T20 WC: షాహిన్ విషయంలో ఆఫ్రిది చెప్పింది నిజమే అయితే అంతకంటే దారుణం మరొకటి ఉండదు! అతడు.. -
ఆఫ్రిది చెప్పింది నిజమే అయితే అంతకంటే దారుణం మరొకటి ఉండదు!
Shaheen Shah Afridi Treatment- Shahid Afridi Comments On PCB: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. షాహిన్ షా ఆఫ్రిది విషయంలో పీసీబీ వ్యవహరించిన తీరు పట్ల మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ విస్మయం వ్యక్తం చేశాడు. ఒకవేళ షాహిన్ విషయంలో పీసీబీ గురించి షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే.. అంతకంటే దారుణం మరొకటి ఉండదని వసీం వ్యాఖ్యానించాడు. అసలేం జరిగిందంటే... ఆసియా కప్-2022 టోర్నీకి ముందు పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది గాయపడిన విషయం తెలిసిందే. మోకాలి గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్కు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం షాహిన్ను లండన్కు పంపినట్లు పీసీబీ గతంలో ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక గాయం నుంచి కోలుకుంటున్న షాహిన్.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీకి ప్రకటించిన జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ మాజీ సారథి, షాహిన్కు కాబోయే మామగారు షాహిద్ ఆఫ్రిది సామా టీవీతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్లో తన సొంత డబ్బుతో షాహిన్ చికిత్స పొందుతున్నాడని.. తానే అతడి కోసం డాక్టర్ను ఏర్పాటు చేశానని చెప్పుకొచ్చాడు. సొంత డబ్బుతో చికిత్స.. నేనే! ఈ మేరకు.. ‘‘షాహిన్ ఆఫ్రిది తన సొంత డబ్బుతో ఇంగ్లండ్కు వెళ్లాడు. టికెట్కు కూడా తనే డబ్బులు చెల్లించాడు. అక్కడ సొంత ఖర్చులతో కాలం వెళ్లదీస్తున్నాడు. నేను డాక్టర్ పేరును సూచించగా.. అతడిని కలిసి చికిత్స తీసుకుంటున్నాడు. షాహిన్ విషయంలో పీసీబీ అసలు ఎలాంటి చొరవ తీసుకోలేదు. తన సొంత ఖర్చులతో అతడు లండన్లో ఉంటున్నాడు. పీసీబీ డైరెక్టర్ జాకిర్ ఖాన్ బహుశా ఒకటీ రెండుసార్లు తనతో మాట్లాడి ఉంటాడు అంతే’’ అని షాహిద్ ఆఫ్రిది పేర్కొన్నాడు. స్పందించిన పీసీబీ! కానీ ఈ విషయంపై స్పందించిన పీసీబీ.. ‘‘లండన్లో చికిత్స పొందుతున్న షాహిన్ షా ఆఫ్రిది కోలుకుంటున్నాడు. ఐసీసీ టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ ఆరంభం నాటికి అతడు పూర్తిగా కోలుకుంటాడు. ఆటగాళ్లకు కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడం.. వారి పునరావాసం విషయంలో పీసీబీ ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఆటగాళ్లకు ఎలాంటి అవసరాలు ఉన్నా.. వాటిని తీర్చడంలో బోర్డు ముందు ఉంటుంది’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ.. షాహిన్ చికిత్స విషయంలో ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలపై నేరుగా స్పందించలేదు. షాహిద్ ఆఫ్రిది చెప్పింది గనుక నిజమే అయితే! ఈ నేపథ్యంలో.. ఏఆర్వై న్యూస్తో మాట్లాడిన వసీం అక్రమ్.. ‘‘ఒకవేళ షాహిద్ ఆఫ్రిది చెప్పింది గనుక నిజమే అయితే.. అంతకంటే ఘోరమైన విషయం మరొకటి ఉండదు. అతడు(షాహిన్ ఆఫ్రిది) పాకిస్తాన్ మేటి ఆటగాళ్లలో ఒకడు. అలాంటి క్రికెటర్ పట్ల పీసీబీ ఇలా వ్యవహరించడం సరికాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ సర్జన్ వద్ద అతడికి చికిత్స చేయించాలి. కానీ, అతడు సొంతంగా ఖర్చులు భరిస్తున్నాడంటే.. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అని పీసీబీ తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. కాగా షాహిద్ ఆఫ్రిది కుమార్తెతో షాహిన్ వివాహం జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: Ind A vs NZ A: న్యూజిలాండ్తో సిరీస్.. కెప్టెన్గా సంజూ శాంసన్.. బీసీసీఐ ప్రకటన కోహ్లి, రోహిత్లను అవుట్ చేస్తే.. సగం జట్టు పెవిలియన్ చేరినట్లే! అలా అనుకుని.. -
T20 WC 2022: ‘ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు’!
T20 World Cup 2022- Virat Kohli: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్తో మ్యాచ్లో సెంచరీతో సత్తా చాటాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అంతర్జాతీయ కెరీర్లో ఈ రన్మెషీన్కు ఇది 71వ శతకం కాగా.. పొట్టి ఫార్మాట్లో మొదటి సెంచరీ. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తరఫున టాప్ స్కోరర్(274 పరుగులు) కూడా కోహ్లినే కావడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఇదే తరహాలో టీ20 వరల్డ్కప్-2022 ఈవెంట్లోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాలని కింగ్ కోహ్లి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం కోహ్లి రిటైర్మెంట్ గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం ఫ్యాన్స్కు చిరాకు తెప్పిస్తున్నాయి. పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెబుతాడు! పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది.. కోహ్లిని ఉద్దేశించి.. కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్నపుడే ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం ఇదే తరహాలో మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెబుతాడని అంచనా వేశాడు. ఈ మేరకు ఈ మాజీ ఫాస్ట్బౌలర్.. ‘‘టీ20 వరల్డ్కప్ టోర్నీ ముగిసిన తర్వాత ఈ ఫార్మాట్కు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. నేనైతే అలాగే చేస్తాను.. ఎందుకంటే! అయితే, మిగతా ఫార్మాట్లలో మాత్రం అతడు కొనసాగుతాడు. ఒకవేళ నేను గనుక అతడి స్థానంలో ఉండి ఉంటే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకునేవాడిని. మిగిలిన రెండు ఫార్మాట్లపై మరింత ఎక్కువ దృష్టి సారించి.. కెరీర్ను కొనసాగించే అవకాశం దొరుకుతుంది’’ అని ఇండియా డాట్కామ్ సెషన్లో పేర్కొన్నాడు. కాగా గతేడాది ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్కప్-2022 టోర్నీ జరుగనుంది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇక ప్రపంచకప్ కంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన వరుస సిరీస్లు ఆడనుంది. చదవండి: 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్! పవర్ హిట్టర్ రీ ఎంట్రీ.. టి20 ప్రపంచకప్కు విండీస్ జట్టు -
'కోహ్లి రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం'
టీమిండియా రన్మెషిన్ విరాట్ కోహ్లి ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో భారత్ తరపున టాప్ స్కోరర్. ఒక సెంచరీ, రెండు అర్థసెంచరీల సాయంతో 274 పరుగులు సాధించాడు. అఫ్గానిస్తాన్తో మ్యాచ్లో 71వ శతకం సాధించిన కోహ్లి తిరిగి పూర్తిస్థాయి ఫామ్లోకి వచ్చినట్లు అనిపిస్తుంది. రాబోయే టి20 ప్రపంచకప్కు ముందు కోహ్లి ఫామ్లోకి రావడం టీమిండియా ఫ్యాన్స్ను ఉత్సాహపరుస్తోంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లో కెప్టెన్గా ఉన్న కోహ్లికి.. ఈ ఏడాది మాత్రం కెప్టెన్సీ భారం లేకపోవడం ఒక రకంగా మంచిదే. ఈసారి పొట్టి ప్రపంచకప్లో కోహ్లి కచ్చితంగా రాణిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది కోహ్లి రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్లో పీక్ స్టేజీలో ఉన్నప్పుడే ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తే గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ''ఫేలవ ఫామ్తో ఆటకు రిటైర్ ఇస్తే ఎవరు గుర్తించరు. అలా కాకుండా కెరీర్లో పీక్ స్టేజీలో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ఇస్తే దానికి గౌరవం ఉంటుంది. ఇలా కొంతమంది ఆటగాళ్లు మాత్రమే చేస్తారు. అందులో కోహ్లి కూడా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అందునా ఆసియా ఖండం నుంచి ఆడుతున్న క్రికెటర్లు ఇలాంటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. కోహ్లి కూడా కెరీర్ను ఎంత అద్భుతంగా ఆరంభించాడో.. అంతే అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పుడే వైదొలుగుతాడని అనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. కాగా షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అఫ్రిదికి మైండ్ దొబ్బింది.. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు.. ''కెరీర్లో పీక్ స్టేజీలో ఉన్నప్పుడు ఎవరైనా రిటైర్ అవ్వాలనుకుంటారా''.. అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: 'ధోని రికార్డులను రోమన్ రెయిన్స్ బద్దలు కొట్టగలడు' టి20 ప్రపంచకప్కు కొత్త జెర్సీతో బరిలోకి టీమిండియా.. -
భారత జెండాతో ఆఫ్రిది కూతురు.. నిజమేనన్న పాక్ మాజీ ఆల్రౌండర్
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాక్ల మధ్య జరిగిన సూపర్-4 దశ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది చిన్ని కూతురు భారత జెండా ఊపుతూ కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతున్నాయి. ఈ విషయమై ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా అఫ్రిదిని ప్రశ్నించగా అతను చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు. ఈ విషయంపై లైవ్లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అఫ్రిది పెద్దగా నవ్వుతూ సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవును నా కూతురు భారత జెండా పట్టుకుంది.. ఆ వీడియోలు నా దగ్గర కూడా ఉన్నాయి. పాపతో ఉన్న నా భార్య కూడా ఈ విషయాన్ని చెప్పింది. ఆ రోజు (భారత్-పాక్ మ్యాచ్ జరిగిన రోజు) స్టేడియంలో 90 శాతం మంది భారత అభిమానులు, కేవలం 10 శాతం మంది పాక్ ఫ్యాన్స్ ఉన్నారు. స్టేడియం వద్ద పాక్ జాతీయ జెండాలు దొరక్కపోవడంతో మా పాప భారత జెండాను పట్టుకుంది. ఫైనల్లో పాక్పై శ్రీలంక గెలిచిన అనంతరం గంభీర్ కూడా శ్రీలంక జెండా ఊపాడు. అలా చేసినంత మాత్రనా అతను శ్రీలంకన్ అయిపోయాడా.. లేక అతన్ని శ్రీలంక అభిమాని అని అనాలా..? అంటూ ఈ విషయాన్ని రచ్చ చేయవద్దని జర్నలిస్ట్ను కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా, ఆసియా కప్లో భారత్, పాక్లు రెండు సందర్భాల్లో ఎదురెదురు పడగా.. గ్రూప్ దశలో టీమిండియా, సూపర్-4 దశలో పాక్లు గెలుపొందాయి. సూపర్-4 దశలో భారత్.. పాక్, శ్రీలంక చేతుల్లో వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో ఫైనల్కు చేరకుండానే నిష్క్రమించింది. ఫైనల్లో శ్రీలంక, పాక్లు తలపడగా.. లంకేయులు పాక్ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్లుగా నిలిచారు. -
గంభీర్ను ఎవరూ ఇష్టపడే వారు కాదన్న అఫ్రిది.. భజ్జీ రియాక్షన్పై ఫ్యాన్స్ ఫైర్
టీమిండియా మాజీ ఓపెనర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్పై పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది అవకాశం దొరికినప్పుడంతా అక్కసు వెల్లగక్కడం మనం తరుచూ గమనిస్తూనే ఉన్నాం. 2007లో ఓ వన్డే మ్యాచ్ సందర్భంగా జరిగిన గొడవే ఈ ఇద్దరి మధ్య వైరానికి కారణం. నాటి నుంచి ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో అఫ్రిది మరోసారి గంభీర్పై తన విధ్వేషాన్ని బయటపెట్టాడు. తనకు భారత్ ఆటగాళ్లతో ఎలాంటి గొడవలు లేవంటూనే.. గంభీర్ వ్యక్తిత్వంపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. గంభీర్ది భిన్నమైన మనస్తత్వమని.. అతన్ని నాటి భారత జట్టులో ఎవరూ ఇష్టపడేవారు కాదని విషం చిమ్మాడు. This is wrong statement by Afridi 😡@GautamGambhir always will be hero whole india .....Afridi says India team hi pasand nhi karti what nonsense🤬 don't speak anything about gauti sir🌍 We loved ❤️ Gautam gambhir pic.twitter.com/iugWFXPZ91 — AJ (@biharshain) August 28, 2022 అయితే అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు విని చర్చలో పాల్గొన్న టీమిండియా మాజీ స్పిన్నర్, గౌతీ సహచరుడు హర్భజన్ సింగ్ పకపకా నవ్వడం భారత అభిమానులను విస్మయానికి గురి చేసింది. సహచరుడు, తోటీ ఎంపీని ప్రత్యర్ధి దేశానికి చెందిన వ్యక్తి విమర్శిస్తుంటే, ఇలానా నువ్వు ప్రవర్తించేది అంటూ భజ్జీపై జనం మండిపడుతున్నారు. How can @harbhajan_singh laugh on it .Man you have played so much with that guy atleast you should not have laughed on it.#INDvPAK #disappointing https://t.co/LUQa3eg7IO — Aman Kumar Singh (@rajputaman22) August 28, 2022 ఈ విషయమై భజ్జీని సోషల్మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. ఓ పక్క అఫ్రిదికి చురకలంటిస్తూనే.. గంభీర్ను వెనకేసుకొస్తూ, భజ్జీని తప్పుబడుతున్నారు. గంభీర్ గురించి అవాక్కులు చవాక్కులు పేలితే కబడ్దార్ అంటూ అఫ్రిదిని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. కాగా, ఒకనాటి సహచరులైన గంభీర్, హర్భజన్ ప్రస్తుతం వేర్వేరు రాజకీయ పార్టీల తరఫున ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. Really Mr @SAfridiOfficial ? Grow up man you are public figure. Indians are always grateful for what #GautamGambhir did for the country. #INDvPAK https://t.co/8AEGoHkQqY — 𝕊ℍ𝔸ℝ𝔸𝔻 🦁 (@sharad__tweets) August 28, 2022 చదవండి: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్కు మరో భారీ షాక్! -
మరే భారత క్రికెటర్కు సాధ్యం కాని రికార్డుపై కన్నేసిన హిట్మ్యాన్
IND VS PAK: ఆసియా కప్ 2022లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 28) జరుగనున్న హైఓల్టేజీ పోరుకు (భారత్-పాక్ మ్యాచ్) ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను పలు ఆరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. ఇవాళ్టి మ్యాచ్లో హిట్మ్యాన్ మరో 117 పరుగులు చేస్తే ఆసియా కప్లో మరే భారత క్రికెటర్కు సాధ్యం కాని 1000 పరుగుల రికార్డును చేరుకుంటాడు. ప్రస్తుతం రోహిత్ 27 మ్యాచ్ల్లో 883 పరుగులు సాధించాడు. రోహిత్ 1000 పరుగుల రికార్డును సాధించే క్రమంలో (89 పరుగుల వద్ద) భారత దిగ్గజ ఆటగాడు సచిన్ను (23 మ్యాచ్ల్లో 971 పరుగులు) అధిగమిస్తాడు. ఆసియా కప్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (25 మ్యాచ్ల్లో 1220 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. అదే దేశానికి చెందిన మాజీ వికెట్కీపర్ కుమార సంగక్కర (24 మ్యాచ్ల్లో 1075 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. ఆతర్వాతి స్థానాల్లో సచిన్, పాకిస్థాన్కు చెందిన షోయబ్ మాలిక్ (21 మ్యాచ్ల్లో 907), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (16 మ్యాచ్ల్లో 766) వరుసగా ఉన్నారు. ఈ రికార్డుతో పాటు హిట్మ్యాన్ మరో అరుదైన రికార్డుకు కూడా ఎసరు పెట్టాడు. ఆసియాకప్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు మరో 6 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఆసియాకప్లో ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది (26 మ్యాచ్ల్లో 27 సిక్సర్లు) పేరిట ఉంది. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 21 సిక్సర్లు (27 మ్యాచ్ల్లో) ఉన్నాయి. ఈ జాబితాలో శ్రీలంక మాజీ విధ్వంసకర ఆటగాడు జయసూర్య (23 మ్యాచ్ల్లో 25) రెండో స్థానంలో ఉండగా.. రోహిత్ మూడులో, సురేశ్ రైనా (18 మ్యాచ్ల్లో 18), ధోని (24 మ్యాచ్ల్లో 16) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. చదవండి: Asia Cup: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. -
భారత్-పాక్ మ్యాచ్లో విజేత ఎవరు? అఫ్రిది నుంచి ఊహించని ట్విస్ట్
మనం ఎంత కాదన్నా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే హైవోల్టేజ్. ఈ చిరకాల ప్రత్యర్థులు ఎక్కడ తలపడ్డా ఉత్కంఠ మాత్రం తారాస్థాయిలో ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే సాధారణ మ్యాచ్లా చూడరు.. రెండు దేశాల మధ్య యుద్ధంగానే పరిగణిస్తారు. అలాంటి మ్యాచ్ కోసం కోట్ల మంది జనం వెయ్యి కళ్లతో నిరీక్షిస్తున్నారు. మరి బ్లాక్బాస్టర్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతుండడంతో గెలుపు మాదంటే మాదే అని ఎవరికి నచ్చిన జోస్యం వాళ్లు చెప్పుకుంటూ వస్తున్నారు. దుబాయ్లోని షేక్ జాయేద్ స్టేడియంలో భారత్-పాకిస్తాన్ మధ్య పోరు ఆదివారం(ఆగస్టు 28) జరగనుంది. గత అక్టోబర్లో జరిగిన పొట్టి ప్రపంచకప్లో ఇదే వేదికపై పాకిస్తాన్.. భారత్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి అదే వేదికలో ఈ రెండు జట్లు ఎదురుపడుతుండడంతో ఆసక్తిగా మారింది. టి20 ప్రపంచకప్లో తమకు ఎదురైన ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేక పాకిస్తాన్కు మరోసారి దాసోహం అవుతుందా అనేది చూడాలి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదిని ఇద్దరిలో విజేత ఎవరనుకుంటున్నారు అని ప్రశ్నిస్తే.. అతను ఎవరు ఊహించని సమాధానం ఇచ్చాడు. సాధారణంగా భారత్ అభిమాని లేదా మాజీ క్రికెటర్ అయ్యుంటే టీమిండియా అని.. ఒకవేళ పాక్ క్రికెటర్ లేదా అభిమాని అయితే పాకిస్తాన్దే గెలుపు అని పేర్కొనడం సహజం. ట్విటర్ వేదికగా షాహిద్ అఫ్రిదిని కొంతమంది అభిమానులు.. ''పాకిస్తాన్, భారత్లలో ఏ జట్టు బలంగా ఉందని అనుకుంటున్నారు.. ఎవరు మ్యాచ్ గెలుస్తారని అనుకుంటున్నారు?'' అని ప్రశ్నించారు. కచ్చితంగా బాబర్ ఆజం సేన ఫెవరెట్ అని అఫ్రిది పేర్కొంటాడని మనం అనుకుంటాం. కానీ అఫ్రిది ఈసారి మాత్రం ఊహించని సమాధానం ఇచ్చాడు. ''ఎవరు తక్కువ తప్పులు చేస్తే వాళ్లే మ్యాచ్ గెలుస్తారు'' అంటూ సమాధానం ఇచ్చాడు. అఫ్రిది నుంచి ఈ జవాబు వస్తుందని అభిమానులు కూడా ఊహించలేదు. ఎందుకంటే అఫ్రిది.. ఎప్పుడు టీమిండియాపై విమర్శలు కురిపిస్తూనే ఉంటాడు(క్రికెట్ పరంగా మాత్రమే). కాగా ఆసియాకప్లో టీమిండియా జస్ప్రీత్ బుమ్రా రూపంలో.. అటు పాకిస్తాన్ షాహిన్ అఫ్రిది రూపంలో ఇరుజట్లు తమ కీలక బౌలర్ సేవలను కోల్పోయాయి. ఈ ఇద్దరు తమ జట్లకు పెద్ద బలం అని చెప్పొచ్చు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లో భారత్పై పాక్ విజయంలో షాహిన్ అఫ్రిదిదే కీలకపాత్ర. ఇక ఆసియాకప్లో ఇరుజట్లు 14సార్లు తలపడగా.. భారత్ 8 సార్లు.. పాకిస్తాన్ ఐదు సార్లు గెలిచాయి. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం రాలేదు. Depends on who makes the least mistakes. — Shahid Afridi (@SAfridiOfficial) August 21, 2022 చదవండి: IND vs PAK: రోజుకు 100-150 సిక్సర్లు కొడుతున్నా! మ్యాచ్లో కనీసం ఓ నాలుగైనా! 'రోహిత్, రాహుల్, కోహ్లి కాదు.. పాకిస్తాన్కు చుక్కలు చూపించేది అతడే' -
విరాట్ కోహ్లీకి అండగా షాహిద్ ఆఫ్రిది..
-
Asia Cup 2022: కోహ్లి భవితవ్యంపై ఆఫ్రిది కామెంట్.. ఏమన్నాడంటే!
Asia Cup 2022- Ind Vs Pak- Virat Kohli: ఆసియా కప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా.. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఈ మెగా ఈవెంట్లో చెలరేగాలని ఆకాంక్షిస్తున్నారు. పాక్పై మంచి రికార్డు కలిగి ఉన్న కోహ్లి.. చిరకాల ప్రత్యర్థితో తిరిగి ఫామ్లోకి వస్తాడని వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఈ టోర్నీలో గనుక రాణించకపోతే తమ ఆరాధ్య క్రికెటర్ భవిష్యత్తు ఏమవుతుందోననే కలవరపాటుకు గురవుతున్నారు కూడా! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కోహ్లి భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విటర్ వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించిన ఆఫ్రిదికి కోహ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందనగా.. ‘‘ఆ విషయం అతడి చేతుల్లోనే ఉంది’’ అంటూ ఆఫ్రిది సమాధానమిచ్చాడు. ఇక కోహ్లి సెంచరీ చేసి వెయ్యి రోజులు పూర్తైంది కదా అని ఫాలోవర్ అడుగగా.. ‘‘కఠిన సమయాల్లోనే ఆటగాళ్ల గొప్పదనం బయటపడుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఆగష్టు 27న ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభం కానుండగా.. ఆ మరుసటి రోజు టీమిండియా- పాకిస్తాన్ తలపడబోతున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్ సమయంలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక కోహ్లి ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు. కాగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. మరోవైపు.. గాయపడిన కారణంగా పాక్ కీలక బౌలర్ షాహిన్ ఆఫ్రిది కూడా ఈ ఈవెంట్కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో యువ పేసర్ మహ్మద్ హస్నైన్ జట్టులోకి వచ్చాడు. చదవండి: Virat Kohli:'కింగ్ కోహ్లి'.. మొన్న మెచ్చుకున్నారు.. ఇవాళ తిట్టుకుంటున్నారు -
అఫ్రిదిని అధిగమించి, క్రిస్ గేల్కు చేరువైన హిట్మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ప్రపంచ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో హిట్మ్యాన్ రెండో స్థానానికి ఎగబాకాడు. విండీస్తో నాలుగో టీ20లో మూడు సిక్సర్లు బాదిన హిట్మ్యాన్.. అన్ని ఫార్మాట్లలో సిక్సర్ల సంఖ్యను 477కు పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతను పాక్ మాజీ పవర్ హిట్టర్ షాహిద్ అఫ్రిదిని (476 సిక్సర్లు) అధిగమించాడు. ఈ జాబితాలో విండీస్ విధ్వంసకర యోధుడు, యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్ మొత్తంలో 553 సిక్సర్లు బాదిన గేల్ పేరిట అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదై ఉంది. ఇదిలా ఉంటే, విండీస్తో నాలుగో టీ20లో టీమిండియా టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్కు మెరుపు ఆరంభాన్ని అందించినప్పటికీ.. స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్ 96/2గా ఉంది. దీపక్ హుడా (15 బంతుల్లో 19), రిషబ్ పంత్ (15 బంతుల్లో 16) క్రీజ్లో ఉన్నారు. చదవండి: టీమిండియాకు భారీ షాక్... గాయంతో స్టార్ బౌలర్ ఔట్..! -
Ind Vs WI: హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు! టీమిండియా తొలి ఆల్రౌండర్గా..
India Vs West Indies 3rd T20: వెస్టిండీస్తో మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్.. కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రెండో టీ20లో విండీస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ బ్రాండన్ కింగ్ను పెవిలియన్కు పంపాడు. ఇక ఈ కీలక వికెట్ తన ఖాతాలో వేసుకోవడం ద్వారా హార్దిక్ పాండ్యా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అదే విధంగా పొట్టి క్రికెట్లో 800కు పైగా పరుగులు, 50 లేదంటే అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆల్రౌండర్ల జాబితాలో చోటు సంపాదించాడు. ఈ క్రమంలో విండీస్ దిగ్గజం డ్వేన్బ్రావో, బంగ్లాదేశ్ సీనియర్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ వంటి ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఈ ఘనత సాధించిన భారత తొలి ఆల్రౌండర్గా రికార్డు సృష్టించాడు. కాగా విండీస్తో మూడో టీ20లో హార్దిక్ పాండ్యా బ్యాటర్గా మాత్రం విఫలమయ్యాడు. ఆరు బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే రోహిత్ సేన ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. రెట్టించిన ఉత్సాహంతో.. ఫిట్నెస్ సమస్యలు అధిగమించి.. ఐపీఎల్-2022తో ఫామ్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్లీగ్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్కు సారథ్యం వహించి ట్రోఫీ అందించాడు. ఈ క్రమంలో టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్ పర్యటనలో కెప్టెన్గా వ్యవహరించి టీ20 సిరీస్ గెలిపించాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణిస్తూ జట్టులో కీలక ఆటగాడిగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 800కు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఆల్రౌండర్లు: 1. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)- పరుగులు 2010- వికెట్లు 121 2. షాహిద్ ఆఫ్రిది(పాకిస్తాన్)- పరుగులు 1416, వికెట్లు 98 3. డ్వేన్ బ్రావో(వెస్టిండీస్)- పరుగులు 1255, వికెట్లు 78 4. మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 1628 పరుగులు, వికెట్లు 76 5. మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్)- పరుగులు 2514, వికెట్లు 61 6. కెవిన్ ఒబ్రెయిన్(ఐర్లాండ్)- పరుగులు 1973, వికెట్లు 58 7. హార్దిక్ పాండ్యా(ఇండియా)- పరుగులు 806, వికెట్లు 50 చదవండి: Rohit Sharma Retired-Hurt: రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్.. బీసీసీఐ కీలక అప్డేట్.. ఆసియా కప్కు దూరమయ్యే చాన్స్! -
పాక్ కెప్టెన్ ట్వీట్కు బదులిచ్చిన కోహ్లి.. ఏమన్నాడంటే..?
Virat Kohli-Babar Azam: ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి విమర్శలతో పాటు సానూభూతి సందేశాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. విరాట్కు మద్దతుగా నిలబడిన ప్రముఖుల్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఉన్నారు. కోహ్లిని టార్గెట్ చేస్తున్న వారికి హిట్మ్యాన్ తనదైన శైలిలో కౌంటిస్తుండగా, పాక్ కెప్టెన్.. ఫామ్ కోల్పోయిన తన ఆరాధ్య క్రికెటర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. Thank you. Keep shining and rising. Wish you all the best 👏 — Virat Kohli (@imVkohli) July 16, 2022 ఫామ్ కష్టాలు త్వరలో సమసి పోతాయి.. ధైర్యంగా ఉండు అంటూ బాబర్ చేసిన ట్వీట్పై కోహ్లి కొద్దిసేపటి క్రితమే స్పందించాడు. థ్యాంక్యూ.. నువ్వు ఇలాగే రాణిస్తూ, ఎదుగుతూ ఉండాలి.. ఆల్ ది బెస్ట్ బాబర్ అంటూ బదులిచ్చాడు. బాబర్ ట్వీట్పై కోహ్లి స్పందించాల్సి ఉండిందని షాహిద్ అఫ్రిది ట్వీట్ చేసిన నిమిషాల వ్యవధిలోనే కోహ్లి రిప్లై ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే, కెరీర్ ఆరంభంలో బాబార్ ఆజమ్.. కోహ్లిని గురువు అని, రోల్ మోడల్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాబర్ ఫార్మాట్లకతీతంగా రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ కోహ్లినే తన ఆరాధ్య క్రికెటర్గా పేర్కొంటాడు. కోహ్లి బ్యాటింగ్ చూస్తూనే తాను ఎదిగానంటూ బాబర్ పలు సందర్భాల్లో వెల్లడించాడు. బాబర్ ప్రస్తుతం కెరీర్లో అత్యుత్తమ దశలో కొనసాగుతుండగా.. కోహ్లి దుర్భర దశను ఎదుర్కొంటున్నాడు. చదవండి: బాబర్ ట్వీట్కు కోహ్లి తప్పకుండా రిప్లై ఇవ్వాలి: షాహిద్ అఫ్రిది -
బాబర్ ట్వీట్కు కోహ్లి తప్పకుండా రిప్లై ఇవ్వాలి: షాహిద్ అఫ్రిది
ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం అండగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లి.. ఇంగ్లండ్ పర్యటనలో కూడా అదే తీరును కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టులో నిరాశపరిచిన అతడు టీ20, వన్డే సిరీస్లోను రాణించలేకపోతున్నాడు. దీంతో కోహ్లి పై విమర్శలు వర్షం కురుస్తోంది. అయితే కోహ్లిని కొంత మంది విమర్శిస్తుంటే, మరి కొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే కోహ్లికు బాబర్ సపోర్ట్గా నిలిచాడు. లార్డ్స్ వన్డే లో కోహ్లి ఔటయ్యాక.. "కష్టకాలం గడిచి పోతుంది.. ధైర్యంగా ఉండు" అంటూ బాబర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బాబర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక కోహ్లికి మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేసిన బాబర్ను ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రశంసించాడు. కోహ్లి విషయంలో బాబర్ స్పందన అద్భుతమైనది అని అతడు కొనియాడాడు. అదే విధంగా బాబర్ ట్వీట్పై కోహ్లి స్పందించాలని అతడు సూచించాడు. "దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి క్రికెట్ లేదా మరే ఏ ఇతర క్రీడ అయినా ఊపయోగ పడుతుంది. అథెట్లు రాజకీయ నాయకుల కంటే మెరుగ్గా పని చేయగలరు. ఇప్పటికే చాలా మంది క్రీడాకారులు అది చేసి చూపించారు. ఇక విరాట్ విషయంలో బాబర్ తన క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. కాగా విరాట్ నుంచి రిప్లై వచ్చిందో లేదో నాకు తెలియదు. అయితే బాబర్ ట్వీట్కు కోహ్లి తప్పకుండా స్పందించాలి. ఒక వేళ బాబర్ ట్వీట్కు విరాట్ రిప్లే ఇస్తే అది చాలా పెద్ద విషయం అవుతంది. కానీ కోహ్లి స్పందిస్తాడని నేను అనుకోవడం లేదు" అని అఫ్రిది పేర్కొన్నాడు. చదవండి: Chamika Karunaratne: లంక క్రికెటర్ను చుట్టుముట్టిన కష్టాలు.. రెండురోజుల పాటు -
భారత్ మాటే శాసనం.. వాళ్లేం చెబితే అదే జరుగుతుంది: ఆఫ్రిది
BCCI- IPL- ICC’s Future Tours Programme (FTP): క్రికెట్ ప్రపంచంలో సంపన్న బోర్డుగా పేరుగాంచింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). ఇటీవల ముగిసిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలం విషయంలో 2023-27 కాలానికి గానూ 48 వేల కోట్ల రూపాయలు ఆర్జించి మరోసారి తన విలువను చాటుకుంది. ప్రపంచంలోనే అత్యంత విలువ కలిగిన స్పోర్ట్స్ ప్రాపర్టీ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఒక్క విషయం చాలు.. క్యాష్ రిచ్ లీగ్కు ఉన్న క్రేజ్, దీనిని నిర్వహిస్తున్న బీసీసీఐ సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో భాగస్వామ్యమైన క్రికెటర్లు కొన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు కూడా దూరమవుతున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్కు ఉన్న ఆదరణ దృష్ట్యా.. దీని కోసం ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్(ఎఫ్టీపీ) క్యాలెండర్లో భాగంగా రెండున్నర నెలల పాటు ప్రత్యేకంగా ఓ షెడ్యూల్ రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ దేశాల ఆటగాళ్లు ఇందులో భాగమైన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్పై ప్రభావం చూపుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్రికెటేతర కారణాల వల్ల ఐపీఎల్లో పాకిస్తాన్ ఆటగాళ్లపై నిషేధం కొనసాగుతున్న విషయం విదితమే. ఇక ఇప్పుడు ఐసీసీ ఎఫ్టీపీ క్యాలెండర్(మ్యాచ్ షెడ్యూల్స్) విషయంలోనూ ఐపీఎల్ ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఏం చెబితే క్రికెట్ ప్రపంచంలో అదే జరగుతుందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు సామా టీవీ షోలో ఆఫ్రిది మాట్లాడుతూ.. ‘‘మార్కెట్ వ్యూహాలు, ఎకానమీలో ఇదంతా ఒక భాగం. క్రికెట్ ప్రపంచంలో అతి పెద్ద మార్కెట్ ఇండియా. కాబట్టి వాళ్లేం చెబితే అదే ఇక్కడ జరుగుతుంది’’ అని పేర్కొన్నాడు. ఇక గతంలో ఐపీఎల్ను అతి పెద్ద బ్రాండ్ లీగ్గా అభివర్ణించిన ఆఫ్రిది.. ఇలాంటి మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆటగాళ్లకు చోటు లేకపోవడం పెద్ద లోటు అని వ్యాఖ్యానించాడు. చదవండి: Carlos Braithwaite: 'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్ ODI WC 1975: మొట్టమొదటి విజేత విండీస్.. సరిగ్గా ఇదే రోజు.. జట్టును గెలిపించింది ఎవరో తెలుసా? ఇతర విశేషాలు! -
'అందరూ నీలా ఉండరు'.. అఫ్రిదిని ఏకిపారేసిన టీమిండియా వెటరన్ క్రికెటర్
టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యాసిన్ మాలిక్ వ్యవహారంలో వెటకారంగా మాట్లాడిన అఫ్రిదికి అమిత్ మిశ్రా అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. యాసిన్ మాలిక్ నేరాన్ని ఒప్పుకున్నాడని.. నీలాగా అబద్దపు బర్త్ డేట్స్ చెప్పరని దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. విషయంలోకి వెళితే కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ నేరాన్ని అంగీకరించడంతో అతన్ని ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు బుధవారం దోషిగా నిర్దారించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరానికి సంబంధించి యాసిన్పై అభియోగాలు వచ్చాయి. విచారణలో అవన్నీ నిజమని తేలాయి. దీంతో యాసిన్ మాలికు జీవితకాల జైలుశిక్షతోపాటు రూ. పది లక్షల జరిమానా విధిస్తూ ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు తీర్పునిచ్చింది. అంతకముందు యాసిన్ మాలిక్ వ్యవహారంతో పాటు కాశ్మీర్ అంశంపై అఫ్రిది ట్వీట్ చేస్తూ.. ‘భారత్ లో మానవ హక్కుల మీద గొంతెత్తుతున్నవారి గొంతు నొక్కడం కొనసాగుతూనే ఉంది. యాసిన్ మాలిక్ మీద నేరం మోపినంత మాత్రానా కాశ్మీర్ స్వేచ్ఛ కోసం చేసే పోరు ఆగేది కాదు. కాశ్మీరీ లీడర్ల మీద చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోమని ఐక్యరాజ్యసమితిని కోరుతున్నా.’ అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది ట్వీట్ కు అమిత్ మిశ్రా స్పందిస్తూ.. ‘డియర్ షాహిద్ అఫ్రిది.. అతడు (యాసిన్ మాలిక్) స్వయంగా నేరాన్ని అంగీకరించాడు. అందరూ నీలాగా బర్త్ డేట్ ను తప్పు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించరు.'' అంటూ ట్వీట్ చేశాడు. అఫ్రిది బర్త్ డేట్ వివాదం విషయానికొస్తే.. గతంలో అతడు తన బర్త్ డే ను తప్పుగా రాసి క్రికెట్ టోర్నీలలో పాల్గొన్నాడని వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఐసీసీ అధికారులనే అఫ్రిది తప్పుదారి పట్టించాడని అఫ్రిదిపై ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఐసీసీ అధికారులే తన పుట్టినతేదీని తప్పుగా రాసుకున్నారని మాటమార్చాడు. కానీ అతడి మాటలు ఎవరూ నమ్మలేదు. చదవండి: Mohammad Hafeez: చెత్త రాజకీయాలకు సామాన్యులు బలవ్వాలా?.. మాజీ క్రికెటర్ ఆగ్రహం PAK-W Vs SL-W: డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీసింది.. టి20 క్రికెట్లో పాక్ బౌలర్ కొత్త చరిత్ర Dear @safridiofficial he himself has pleaded guilty in court on record. Not everything is misleading like your birthdate. 🇮🇳🙏https://t.co/eSnFLiEd0z — Amit Mishra (@MishiAmit) May 25, 2022 India's continued attempts to silence critical voices against its blatant human right abuses are futile. Fabricated charges against #YasinMalik will not put a hold to #Kashmir's struggle to freedom. Urging the #UN to take notice of unfair & illegal trails against Kashmir leaders. pic.twitter.com/EEJV5jyzmN — Shahid Afridi (@SAfridiOfficial) May 25, 2022 -
'ఏమైనా ఉంటే మీరిద్దరు తేల్చుకోండి.. మా దేశాన్ని ఎందుకు లాగుతారు?'
పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా షాహిద్ అఫ్రిదిపై గత వారం నుంచి వరుస ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. అఫ్రిది ఒక క్యారెక్టర్లెస్.. అబద్దాల కోరు.. జట్టు నుంచి బహిష్కరించడానికి ప్రధాన కారణం అఫ్రిదియేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక గురువారం తనను ఇస్లాం మతంలోకి మారాలంటూ అఫ్రిది ఒత్తిడి చేశాడంటూ.. హిందువులకు ఇక్కడ చోటు లేదంటూ అవమానపరిచాడంటూ పేర్కొన్నాడు. అయితే కనేరియా వరుస ఆరోపణలపై షాహిద్ అఫ్రిది ఎట్టకేలకు స్పందించాడు. కనేరియా కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నాడని.. శత్రు దేశానికి(భారతదేశం) చెందిన మీడియా చానెల్కు ఇంటర్య్వూ ఇచ్చి తనను అవమానపరచాడంటూ పేర్కొన్నాడు. ''కనేరియా ఆరోపించినట్టు తాను అంత చెడ్డవాడినే అయితే అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించాడు. కేవలం తన పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నాడు. కనేరియా నాకు సోదరుడు లాంటివాడు. కొన్నేళ్లపాటు ఇద్దరం కలిసి పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాము. అది మరిచిపోయి పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. నన్ను అబద్దాల కోరు.. క్యారెక్టర్ లేనివాడు అనే ముందు అతడి క్యారెక్టర్ ఏంటో చూసుకుంటే బాగుంటుంది. అతడు మన శత్రు దేశం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి మత చిచ్చు రగిలిస్తున్నాడు. ఇది అంత మంచి పరిణామం కాదు.'' అని ఆగ్రహం వక్తం చేశాడు. అయితే అఫ్రిది ఆరోపణలపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఘాటుగా స్పందించారు. ''కనేరియా నీపై ఆరోపణలు చేశాడు నిజమే.. ఏమైనా ఉంటే మీరిద్దరు తేల్చుకోండి.. మధ్యలో మా దేశాన్ని ఎందుకు లాగుతున్నారు''.. ''ఒక ఆటగాడు ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఆయా మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చే హక్కు ఉంటుంది. ఆ క్రమంలో మా దేశానికి చెందిన ప్రముఖ చానెల్కు ఇంటర్య్వూ ఇచ్చి ఉండొచ్చు''.. ''అసలు మత చిచ్చు రగిలిస్తుంది నువ్వు(అఫ్రిది).. శత్రుదేశం అని సంభోదించినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు : పాక్ మాజీ స్పిన్నర్ -
'షాహిద్ అఫ్రిది ఒక క్యారెక్టర్ లెస్.. అబద్ధాల కోరు'
''నేను పాకిస్తాన్ జట్టు నుంచి బయటికి వెళ్లడానికి షాహిద్ అఫ్రిది ప్రధాన కారకుడు.. అతనికి క్యారెక్టర్ అనేదే లేదు. నా గురించి జట్టు సభ్యులకు తప్పుగా చెప్పి వారి ముందు దోషిని చేశాడు. అతని నమ్మకద్రోహం నేను ఎప్పటికి మరిచిపోనూ'' -పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా 41 ఏళ్ల దానిష్ కనేరియా.. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై నిప్పులు చెరిగాడు. ఏఎన్ఐ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో తాను జట్టు నుంచి బహిష్కరణకు గురవ్వడంలో అఫ్రిది పాత్ర ఉందంటూ తెలిపాడు. ''పాకిస్తాన్కు క్రికెట్ ఆడినంత కాలం షాహిద్ అఫ్రిది నన్ను హేళన చేసేవాడు. తోటి ఆటగాళ్ల ముందు అవమానపరుస్తూ మాట్లాడేవాడు. ఇద్దరం కలిసి చాలా ఏళ్లపాటు పాకిస్తాన్కు ప్రాతినిధ్యం వహించాం. అతను కెప్టెన్గా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా బెంచ్కే పరిమితం చేసేవాడు. దాని మూలంగా చాలా వన్డే మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు నేను హిందువునంటూ.. ఈ దేశంలో అతనికి చోటు లేదని.. జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు నూరిపోసేవాడు. అతనొక అబద్దాల కోరు, అందరిని ప్రభావితం చేసే వ్యక్తి.. ఇంకా చెప్పాలంటే ఒక క్యారెక్టర్ లేని మనిషి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా క్రికెట్పైనే ఫోకస్ చేసేవాడిని. జట్టులో ఉన్నంతకాలం నన్ను ద్వేషించేవాడు. నేనంటే ఎందుకంత అసూయ అనేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒక్కటి చెప్పగలను. పాకిస్తాన్ జట్టుకు ఆడడం నా అదృష్టంగా భావిస్తా.. నా జీవితంలో అది గొప్పది.'' అంటూ చెప్పుకొచ్చాడు. 2009లో ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్షిప్ ప్రో లీగ్లో భాగంగా కనేరియా స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో 2012లో ఇంగ్లీష్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ కూడా సమర్థించింది. కాగా తనపై విధించిన జీవతకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పీసీబీకి మొరపెట్టుకున్నాడు. ''క్రికెట్లో ఫిక్సింగ్ చేసిన ఎంతో మంది బయట యథేచ్చగా తిరుగుతున్నారు. కానీ నాపై ఉన్న నిషేధాన్ని మాత్రం పీసీబీ తొలగించలేదు. ఒక దేశానికి క్రికెట్ ఆడాను.. నిషేధం తొలగిస్తే ప్రైవేట్ లీగ్ల్లో ఆడాలని ఉంది. ఎలాగూ అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం పోయింది. పీసీబీని నేను అడిగేది ఒక్కటే.. నాపై బ్యాన్ ఎత్తేయండి.. నా పనేదో నేను చూసుకుంటా'' అని పేర్కొన్నాడు. కాగా దానిష్ కనేరియా 2000 సంవత్సరం నవంబర్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పాక్ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. -
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త.. కొత్త క్రికెట్ లీగ్ను ప్రారంభించిన షాహిద్ అఫ్రిది
Shahid Afridi Launches Mega Star League: పాకిస్థాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది క్రికెట్ ప్రేమికులకు శుభవార్త చెప్పాడు. మెగా స్టార్ లీగ్ (ఎమ్ఎస్ఎల్) పేరుతో త్వరలో సరికొత్త క్రికెట్ టోర్నీని ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు. ముస్తాక్ అహ్మద్, ఇంజమామ్ ఉల్ హక్, వకార్ యూనిస్ తదితర పాక్ మాజీ క్రికెటర్లను కలుపుకుని లీగ్ను ప్రారంభించేందుకు సన్నాహకాలు మొదలుపెట్డాడు. ఈ లీగ్లో పాకిస్థాన్ మాజీలతో పాటు పలువురు అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు, చలన చిత్ర, సంగీత రంగానికి చెందిన సెలబ్రిటీలు పాల్గొంటారని తెలిపాడు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న మాజీ క్రికెటర్లు, అథ్లెట్లు, జర్నలిస్టులకు చేయూతనిచ్చేందుకు ఈ లీగ్ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించాడు. పాకిస్థాన్లోని రావల్పిండి వేదిగా ఈ ఏడాది సెప్టెంబర్లో మెగా స్టార్ లీగ్ ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని పేర్కొన్నాడు. పాక్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడిన షాహిద్ ఆఫ్రిది 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. అనంతరం అతను కొంతకాలం పాటు పాక్ సూపర్ లీగ్, బిగ్బాష్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, టీ20 బ్లాస్ట్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ వంటి ఫ్రాంఛైజీ లీగ్ల్లో పాల్గొన్నాడు. అఫ్రిది భారత్ వేదికగా జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా ఆడాడు. 2008 ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్లో అతను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించాడు. 37 బంతుల్లోనే వన్డే సెంచరీ సాధించడం ద్వారా అఫ్రిది తొలిసారి వార్తల్లోకెక్కాడు. చదవండి: ధోని తలా, కోహ్లి కింగ్ అయితే శిఖర్ టీ20 ఖలీఫా..! -
Shahid Afridi: అల్లుడూ.. నువ్వు సూపరప్పా, అచ్చం నాలాగే..!
పీఎస్ఎల్ 2022లో భాగంగా పెషావర్ జల్మీతో జరిగిన మ్యాచ్లో లాహోర్ ఖలందర్స్ ఆటగాడు, పాక్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది ఎప్పటిలా బంతితో కాకుండా బ్యాట్తో చెలరేగిపోయి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఖలందర్స్కు ఆఖరి ఓవర్లో విజయానికి 24 పరుగులు అవసరం కాగా, జట్టు కెప్టెన్ షాహీన్ అఫ్రిది (20 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 39) బ్యాట్తో చెలరేగిపోయి 3 భారీ సిక్సర్లు, బౌండరీతో 23 పరుగులు రాబట్టి, మ్యాచ్ను సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లాడు. THAT over. #HBLPSL7 l #LevelHai l #LQvPZ pic.twitter.com/o8AYrxjmNg — PakistanSuperLeague (@thePSLt20) February 21, 2022 అయితే, సూపర్ ఓవర్లో ఖలందర్స్ నిర్ధేశించిన ఆరు పరుగుల టార్గెట్ను పెషావర్ జట్టు తొలి రెండు బంతుల్లోనే ఛేదించి అద్భుత విజయం సాధించింది. పెషావర్ ప్లేయర్ షోయబ్ మాలిక్ వరుసగా రెండు బౌండరీలు సాధించి తన జట్టును గెలిపించాడు. కాగా, ఈ మ్యాచ్లో షాహీన్ అఫ్రిది విధ్వంసకర ఇన్నింగ్స్కు ముగ్దుడైన కాబోయే మామ షాహిద్ అఫ్రిది..అల్లుడూ నువ్వు సూపరప్పా.. అచ్చం నాలాగే ఆడావు అంటూ మురిసిపోయాడు. ట్విటర్ వేదికగా అల్లుడిపై ప్రశంసలు కురిపించాడు. షాహీన్ అఫ్రిది.. యు బ్యూటీ అంటూ కాబోయే అల్లుడిపై ప్రేమను ఒలకబోసాడు. తన ఫోటోతో పోలి ఉన్న షాహీన్ అఫ్రిది చిత్రాన్ని కలిపి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. SHAHEEN AFRIDIIII YOU BEAUTYYY!!! pic.twitter.com/RPv9ui2lNp — Shahid Afridi (@SAfridiOfficial) February 21, 2022 షాహిద్ అఫ్రిది తన జమానాలో మేటి ఆల్రౌండర్గా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తూ, బంతితో మ్యాజిక్ చేయడంలో దిట్ట అయిన షాహిద్ అఫ్రిది తన జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ముఖ్యంగా వన్డేల్లో అతను సాధించిన 37 బంతుల శతకం చాలాకాలం వరకు ఫాస్టెస్ట్ సెంచరీగా చెలామణి అయ్యింది. ఇదిలా ఉంటే, షాహిద్ అఫ్రిది కూతురు అక్సాతో షాహీన్ అఫ్రిది ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ జంట పెళ్లి చేసుకునే అవకాశముంది. చదవండి: మూడు సిక్సర్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. ఫలితం సూపర్ ఓవర్ -
ఇంత దరిద్రమైన ఎంట్రీ ఎప్పుడు చూడలేదు..
4 ఓవర్లలోనే 67 పరుగులు.. అబ్బా ఏం ఆడాడు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకుంటే 67 పరుగులు వచ్చింది బ్యాటింగ్లో కాదు.. బౌలింగ్లో. ఇంతకీ ఎవరా క్రికెటర్ అనుకుంటున్నారా.. పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది అఫ్రిది పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్( పీఎస్ఎల్లో) అడుగుపెట్టాడు. పీఎస్ఎల్లో క్వెటా గ్లాడియేటర్స్ తరపున ఆడుతున్న అఫ్రిది ఇస్లామాబాద్ యునైటెడ్తో మ్యాచ్ ద్వారా ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడాడు. అయితే అఫ్రిదికి తన ఎంట్రీ మ్యాచ్ ఒక పీడకలగా మిగిలిపోయింది. బౌలింగ్లో 4 ఓవర్లు వేసిన అఫ్రిది 67 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. బ్యాటింగ్లోనైనా ఇరగదీశాడా అనుకుంటే అది లేదు. 8 బంతులు మింగి 4 పరుగులు చేసి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. చదవండి: PSL 2022: ఫఖర్ జమాన్ తొందరపడ్డావు.. కాస్త ఆగుంటే బాగుండేది దీంతో అభిమానులు అఫ్రిదిని ట్రోల్ చేస్తూ ఒక ఆట ఆడుకున్నారు. ''అబ్బా ఏం ఎంట్రీ ఇచ్చావ్.. మతి పోయింది.. అఫ్రిది క్రికెట్ ఆడడం ఆపేయ్.. నీ వయసువాళ్లు కామెంటేటరీ చెప్తున్నారు.. ఈ మధ్య కాలంలో ఇంత దరిద్రమైన ఎంట్రీ చూడలేదు'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. కొలిన్ మున్రో(39 బంతుల్లో 72, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), అజమ్ ఖాన్(35 బంతుల్లో 65, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), పాల్ స్టిర్లింగ్(28 బంతుల్లో 58, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన క్వెటా గ్లాడియేటర్స్ 19.3 ఓవర్లలో 186 పరుగులుకు ఆలౌటైంది. ఆషన్ అలీ 50, మహ్మద్ నవాజ్ 47 పరుగులు చేశారు. And again! 🙌🏼 #HBLPSL7 l #LevelHai l #QGvIU pic.twitter.com/DQju1fJuDi — PakistanSuperLeague (@thePSLt20) February 3, 2022 It’s on!!! Munro delivers the 3️⃣rd six to @SAfridiOfficial 🔥 #HBLPSL7 l #LevelHai l #QGvIU pic.twitter.com/KbdvbD1QL7 — PakistanSuperLeague (@thePSLt20) February 3, 2022 -
ఆట ఏదైనా ఆ జెర్సీ అంటే ఎందుకంత క్రేజ్!
Top 11 Players Who Wear Number 10 Jersey In Cricket: క్రీడల్లో నెంబర్ 10 జెర్సీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్క క్రికెట్లోనే కాదు.. ఫుట్బాల్లోనూ నెంబర్ 10 జెర్సీకి వేరే లెవెల్ క్రేజ్ ఉంది. ఫుట్బాల్ దిగ్గజాలుగా పేరు పొందిన పీలే, మారడోనా, జినదిన్ జిదానే, రొనాల్డీనో, డెల్పోరో, వెయిన్ రూనీ, మెస్సీ లాంటి స్టార్స్ ధరించే జెర్సీ నెంబర్ 10 కావడం విశేషం. ఆ జెర్సీ ధరిస్తే స్టార్ హోదా వస్తుందని చాలా మంది నమ్మకం. ఇక క్రికెట్లో నెంబర్ 10 జెర్సీ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది టీమిండియా లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. తన కెరీర్లో ఎక్కువకాలం ఈ జెర్సీతోనే ఆడిన సచిన్ ఎన్నోమైలురాళ్లను అందుకున్నాడు. ఈ విధంగా క్రికెట్ చరిత్రలో 10వ నెంబర్ జెర్సీ ధరించిన కొందరి ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. - సాక్షి, వెబ్డెస్క్ సచిన్ టెండూల్కర్(టీమిండియా) టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మొదట్లో 99 జెర్సీతో బరిలోకి దిగాడు. ఆ తర్వాత 33 జెర్సీ నెంబర్తో ఆడాడు. ఇక చివరగా 10వ నెంబర్ జెర్సీతో రిటైర్మెంట్ వరకు ఆడిన సచిన్ ఎన్నో రికార్డులు, ఘనతలు సాధించాడు. క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలు సాధించి చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టు, వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చదవండి: Abu Dhabi T10 League: సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో.. అయినా ఊచకోతే క్రెయిగ్ మెక్మిలన్(న్యూజిలాండ్) 1997-2007 కాలంలో న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రెయిగ్ మెక్మిలన్ మంచి బ్యాటర్గా గుర్తింపు పొందాడు. తన 10 ఏళ్ల కెరీర్లో ఎక్కువశాతం 10వ నెంబర్ జెర్సీలోనే కనిపించాడు. న్యూజిలాండ్ తరపున 55 టెస్టుల్లో 3116 పరుగులు.. 197 వన్డేల్లో 4707 పరుగులు సాధించాడు. ఇక 8 టి20ల్లో ఆడిన మెక్మిలన్ 187 పరుగులు సాధించాడు. స్టువర్ట్ లా(ఆస్ట్రేలియా) 1994-95 మధ్య కాలంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా గాయంతో వెనుదిరిగిన సమయంలో అతని స్థానంలో టెస్టు జట్టులోకి వచ్చాడు స్టువర్ట్ లా. ఇదే అతను ఆడిన ఒకే ఒక్క టెస్టు మ్యాచ్. ఇక క్రికెట్ ఆడినంత కాలం తన కెరీర్లో 10వ నెంబర్ జెర్సీని ధరించాడు. ఆసీస్ తరపున 54 వన్డేల్లో 1237 పరుగులు.. ఒక్క టెస్టు మ్యాచ్లో 54 పరుగులు సాధించాడు. చదవండి: Joshua da Silva Vs Dhananjaya de Silva: వార్నీ.. ప్రతీకారం ఇలా కూడా తీర్చుకుంటారా! అలెన్ డొనాల్డ్(దక్షిణాఫ్రికా) దక్షిణాఫ్రికా తరపున దిగ్గజ బౌలర్గా పేరు పొందిన అలెన్ డొనాల్డ్ జెర్సీ నెంబర్ 10. దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్గా డొనాల్డ్ చరిత్ర సృష్టించాడు. ఒక ఓవరాల్గా 72 టెస్టులాడిన అలెన్ డొనాల్డ్ 330 వికెట్లతో సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేగాక 164 వన్డేల్లో 272 వికెట్లు తీసిన డొనాల్డ్ రిటైర్మెంట్ తర్వాత అంతర్జాతీయంగా కొన్ని దేశాలకు.. చాలా ప్రైవేట్ లీగ్ల్లో కోచ్గా వ్యవహరించాడు. షాహిద్ అఫ్రిది(పాకిస్తాన్) ఆసియా నుంచి చూస్తే క్రికెట్లో సచిన్ తర్వాత జెర్సీ నెంబర్ 10తో ఫేమస్ అయిన ఆటగాడు షాహిద్ అఫ్రిది మాత్రమే. పాకిస్తాన్ దిగ్గజ ఆల్రౌండర్గా పేరుపొందిన అఫ్రిది వ్యక్తిగత జీవితంలో వివాదాలకు కొదువ లేకపోయిన.. ఆటలో మాత్రం పలు రికార్డులను బద్దలుకొట్టాడు. వన్డే చరిత్రలో 37 బంతుల్లోనే సెంచరీ సాధించిన అఫ్రిది రికార్డు 17 ఏళ్ల పాటు చెక్కుచెదరలేదు. వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక పాకిస్తాన్ తరపున అఫ్రిది 398 వన్డేల్లో 8064 పరుగులు.. 395 వికెట్లు, 99 టి20ల్లో 1416 పరుగులు.. 98 వికెట్లు తీశాడు. చదవండి: Steve Smith: 'ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలను బాత్రూం అద్దానికి అంటించా' డారెన్ లీమన్(ఆస్ట్రేలియా) 1996లో ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన డారెన్ లీమన్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారడానికి ఐదేళ్లు పట్టింది. లీమన్ 2004-05 కాలంలో 10వ నెంబర్ జెర్సీ ధరించి ఆడాడు. ఆస్ట్రలియా తరపున 117 వన్డేల్లో 3078 పరుగులు సాధించాడు. ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియాకు ప్రధాన కోచ్గా సేవలందించిన లీమన్ 2017 బాల్టాంపరింగ్ ఉదంతం తర్వాత పదవి నుంచి వైదొలిగాడు. జెరెయింట్ జోన్స్(ఇంగ్లండ్) ఇంగ్లండ్ వికెట్ కీపర్గా 2004-06 మధ్య కాలంలో సేవలందించిన జెరెయింట్ జోన్స్ తన కెరీర్ మొత్తం జెర్సీ నెంబర్ 10నే ధరించాడు. ఈ కాలంలో అతను ఇంగ్లండ్ తరపున 51 వన్డేల్లో 862 పరుగులు.. 34 టెస్టుల్లో 1172 పరుగులు చేశాడు. పీటర్ సిడిల్(ఆస్ట్రేలియా) 2019లో ఆస్ట్రేలియా క్రికెట్కు గుడ్బై చెప్పిన పీటర్ సిడిల్ .. 2008 అరంగేట్రం నుంచి రిటైర్ అయ్యేవరకు జెర్సీ నెంబర్ 10తోనే ఆడాడు. ఆస్ట్రేలియా తరపున 67 టెస్టుల్లో 217 వికెట్లు.. 20 వన్డేల్లో 17 వికెట్లు తీశాడు. శార్దూల్ ఠాకూర్(టీమిండియా) టీమిండియా నుంచి సచిన్ తర్వాత శార్దూల్ మాత్రమే జెర్సీ నెంబర్ 10 ధరించాడు. అయితే సచిన్ కానుకగా ఉన్న ఆ జెర్సీని ధరించడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారడంతో బీసీసీఐ అనధికారికంగా ఆ జెర్సీ నెంబర్ను తొలగించింది. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న శార్దూల్ 4 టెస్టులు, 15 వన్డేలు, 24 టి 20లు ఆడాడు. డేవిడ్ మిల్లర్(దక్షిణాఫ్రికా) ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న మిల్లర్ కీలక బ్యాటర్గా మారాడు. అలెన్ డొనాల్డ్ తర్వాత జెర్సీ నెంబర్ 10 ధరించిన ఆటగాడిగా మిల్లర్ నిలిచాడు. విధ్వంసకర ఆటకు మారుపేరుగా ఉన్న మిల్లర్ దక్షిణాఫ్రికా తరపున 137 వన్డేలు.. 95 టి20లు ఆడాడు. చదవండి: Tim Paine scandal: క్రికెట్కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్లో నలిగిన ఆటగాళ్లు షాహిన్ అఫ్రిది(పాకిస్తాన్) దిగ్గజ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది ధరించిన 10వ నెంబర్ జెర్సీని ధరించడం సంతోషంగా ఉందంటూ షాహిన్ అఫ్రిది ట్వీట్ చేయడం వైరల్గా మారింది. అయితే క్రికెట్లో అడుగుపెట్టిన మొదట్లో 40వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగిన షాహిన్ ఆ తర్వాత 10వ నెంబర్ జెర్సీతో బరిలోకి దిగి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కీలకబౌలర్గా మారిన షాహిన్ టి20 ప్రపంచకప్లో పాకిస్తాన్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
క్రికెట్కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్ స్కాండల్లో నలిగిన ఆటగాళ్లు
క్రికెట్ చరిత్రలో కొంతమంది ఆటగాళ్లు ఎంతమంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులు కెరీర్కు మాయని మచ్చగా మిగిలిపోతాయి. తాజాగా టిమ్ పైన్ ఉదంతం అందుకు ఉదాహరణ. బాల్ టాంపరింగ్ ఉదంతంతో స్మిత్ కెప్టెన్సీ కోల్పోగా.. అతని నుంచి బాధ్యతలు స్వీకరించిన టిమ్ పైన్ ఆస్ట్రేలియాను బాగానే నడిపించాడు. అయితే కీలకమైన యాషెస్ సిరీస్కు ముందు టిమ్పైన్పై సెక్స్ ఆరోపణలు వచ్చాయి. 2017లో ఒక మహిళతో అసభ్యకరమైన చాటింగ్ చేసినట్లు తేలింది. ఇది నిజమేనని ఒప్పుకున్న పైన్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆటగాడిగా మంచిపేరు తెచ్చుకున్నప్పటికి సెక్స్ స్కాండల్ ఉదంతం అతని కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఈ నేపథ్యంలో గతంలోనూ క్రికెటర్లు సెక్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. - సాక్షి, వెబ్డెస్క్ షాహిద్ అఫ్రిది: మేటి ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది వివాదాల్లోనూ అంతే గుర్తింపు పొందాడు. ఒక దశలో రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వెనక్కి వచ్చిన అఫ్రిది సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించాడు తన కెరీర్లాగే ఆఫ్రిదీ జీవితంలో వివాదాలు చాలా ఎక్కువే. ఓ టోర్నీ కోసం సింగపూర్ వెళ్లిన అఫ్రిది.. అక్కడ మరో క్రికెటర్తో కలిసి ఇద్దరు అమ్మాయిలతో గడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆఫ్రిదీని 2000 ఐసీసీ ఛాంపియన్స్ట్రోఫీ నుంచి తప్పిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా నిలిచింది. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా అబ్దుల్ రజాక్: పెళ్లయిన తర్వాత తనకు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ స్వయంగా వెల్లడించాడు. ఒక టీవీ కార్యక్రమంలో, 39 ఏళ్ల మాజీ క్రికెటర్ తనకు ఆరుగురు మహిళలతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు ఒప్పుకున్నాడు. అందులో ఒక మహిళతో ఒకటిన్నర సంవత్సరాలు డేటింగ్ చేశాడని ఒప్పుకున్నాడు. షాహిన్ అఫ్రిది: ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో షాహిన్ అఫ్రిది ఒక సంచలనం. రోజురోజుకు ఆటలో పదును పెంచుకుంటున్న షాహిన్ అఫ్రిది వ్యక్తిగత జీవితంలో మాత్రం బ్యాడ్బాయ్గా ముద్ర వేసుకున్నాడు. చాలా మంది అమ్మాయిలతో రొమాంటిక్ రిలేషన్షిప్ను ఏర్పరచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయ్. షాహీన్ ప్రైవేట్ చాట్ స్క్రీన్ షాట్ను ఓ బాధితురాలు పోస్ట్ చేసింది. అమ్మాయిల్ని ట్రాప్ చేయడంలో అఫ్రిది ముందుంటాడని ఆమె ఆరోపించింది. షేన్ వార్న్ : సెక్స్ స్కాండల్ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్. క్రికెట్ చరిత్రలో మేటి స్పిన్నర్గా నిలిచిపోయిన వార్న్ కెరీర్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అతను హాంప్షైర్కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కొందరు మోడళ్లతో సరసాలాడడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మెల్బోర్న్లో హోటల్ గదిలో పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఇక యాషెస్ సిరీస్ లో భాగంగా.. బ్రిటిష్ నర్సును లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి హర్షలే గిబ్స్: దక్షిణాఫ్రికా ఓపెనర్గా ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న హర్షలే గిబ్స్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచేవాడు. అమ్మాయిలతో తాను ప్రవర్తించిన తీరును గిబ్స్ తన తన ఆత్మకథ (టు ది పాయింట్) లో స్వయంగా వెల్లడించడం విశేషం. ఆ ఆత్మకథలో తాను మహిళలతో ప్రవర్తించిన తీరును గూర్చి వివరించడం వివాదాలకు దారి తీసింది. క్రిస్ గేల్: యూనివర్సల్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే క్రిస్ గేల్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఎంజాయ్కు కేరాఫ్ అడ్రస్ అయిన గేల్.. 2012లో శ్రీలంక వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ సమయంలో ముగ్గురు బ్రిటిష్ మహిళలను తన హోటల్ గదులకు బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. హోటల్ బాడీగార్డ్ సాయంతో ఆ ముగ్గురు మహిళలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజమనేది తెలియరాలేదు. కెవిన్ పీటర్సన్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్.. కెవిన్ పీటర్సన్ కూడా సెక్స్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికా 'బిగ్ బ్రదర్' సెలబ్రిటీ వెనెస్సా నిమ్మోతో ఎఫైర్ కలిగి ఉన్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇది పీటర్సన్ కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇయాన్ బోథమ్: క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సర్ ఇయాన్ బోథమ్ కూడా సెక్స్ ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం. మైదానంలో హుందాగా ప్రవర్తించే ఈ క్రికెటర్ బయట అపకీర్తిని మూటగట్టుకున్నాడు. భోథమ్ తన భార్యను మోసం చేస్తూ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేగాక బోథమ్కు ఆస్ట్రేలియన్ వెయిట్రెస్తో కూడా ఎఫైర్ ఉంది.ఇక మాజీ మిస్ యునివర్స్ బార్బడోస్ లిండీ ఫీల్డ్తో భోథమ్ నడిపిన అఫైర్ 1980లలో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసింది. మహ్మద్ షమీ: టీమిండియా పేసర్ మహ్మద్ షమీపై ఇలాంటి ఆరోపణలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. స్వయంగా షమీ భార్య హసిన్ జహాన్ .. నా భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ పేర్కొనడం సంచలనం సృష్టించింది. దీంతో షమీ ఇబ్బందుల్లో పడ్డాడు. అతను ఇతర మహిళలతో షమీ చాట్ చేస్తున్న ఫోటోలను జహాన్ మీడియాతో పంచుకుంది. ప్రస్తుతం వీరిద్దరు వేరువేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. చదవండి: Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్గా మరోసారి స్టీవ్ స్మిత్! -
'కోహ్లి అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా తప్పుకుంటే మంచిది'.. లేదంటే..
Shahid Afridi Comments on Virat Kholi: టీ20 ప్రపంచకప్- 2021లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెగా టోర్నీ తర్వాత భారత టీ20 కెప్టన్సీ భాధ్యతల నుంచి తప్పకున్న విరాట్ కోహ్లిపై.. పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి బ్యాటర్గా రాణించాలంటే అన్నిఫార్మాట్లలో కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోవాలని అతడు సూచించాడు. కోహ్లి వారసుడిగా రోహిత్ శర్మను నియమించినందుకు బీసీసీఐని అఫ్రిది ప్రశంసించాడు. "భారత క్రికెట్కు కోహ్లి విలువైన ఆస్తి అని నేను భావిస్తున్నాను. అయితే అతడు ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా తప్పుకుంటే ఉత్తమం అని నేను భావిస్తున్నాను. ఇక రోహిత్ విషయానికి వస్తే.. "నేనుఐపీఎల్ లో (డెక్కన్ ఛార్జర్స్ తరఫున) రోహిత్తో ఏడాది పాటు ఆడాను. అతడు అత్యుత్తమ ఆటగాడు. జట్టు అవసరాల రీత్యా దూకుడుగా ఆడగలడు లేదంటే క్లిష్ట పరిస్థితుల్లో నిలకడగా ఆడతాడు. అతడి షాట్ సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది. అంతకు మించి ఆటగాళ్లకు మంచి నాయకుడిగా ఉండగల ఆర్హత రోహిత్కు ఉంది అని ఆఫ్రిది పేర్కొన్నాడు. చదవండి: టి20 ప్రపంచకప్ 2021: విజేత ఎవరో చెప్పిన పీటర్సన్ -
Shoaib Malik: ఆఫ్రిదికి సెల్యూట్ చేసిన మాలిక్.. ఎందుకో తెలుసా..!
Shoaib Malik salutes Shahid Afridi: టీ20 ప్రపంచకప్2021లో భాగంగా శుక్రవారం ఆప్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో సెమిఫైనల్కు అడుగు దూరంలో నిలిచింది పాకిస్తాన్. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్లో తమ జట్టును సపోర్ట్ చేయడానికి వచ్చిన పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదినూ చూస్తూ.. షోయబ్ మాలిక్ సెల్యూట్ చేశాడు. దీంతో స్టేడియంలో ఉన్న అభిమానులందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విటర్లో షేర్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలికిన ఆఫ్రిది.. ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభంలోనే రిజ్వాన్ (8) వికెట్ను కోల్పోయింది. అయితే బాబర్, ఫఖర్ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. అయితే తక్కువ వ్యవధిలో ఫఖర్తో పాటు హఫీజ్ (10) కూడా నిష్క్రమించాడు. బాబర్ను రషీద్ అవుట్ చేయడంతో ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో నవీన్ ఉల్ హఖ్ 2 పరుగులే ఇచ్చి మాలిక్ (19) వికెట్ తీయడంతో అఫ్గాన్ గెలుపుపై ఆశలు పెంచుకుంది. అయితే ఆసిఫ్ తన మెరుపు బ్యాటింగ్తో పాక్ను గెలిపించాడు. చదవండి: Sarah Taylor: క్రికెట్ చరిత్రలో సంచలనం.. పురుషుల జట్టుకు మహిళా కోచ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Moment of the Day Shoaib Malik comes and Salute to Superstar Shahid Afridi Malik: mere murshad #PakvsAfg #T20WorldCup21 pic.twitter.com/PNOYw10eXW — Malik A Haseeb🇵🇰 (@MalikAHaseeb) October 29, 2021 -
IND Vs PAK: తప్పులు తక్కువ చేసిన జట్టుదే విజయం
India Vs Pakistan T20WC.. టి20 ప్రపంచకప్లో భాగంగా అక్టోబర్ 24న జరగనున్న దాయాదుల పోరు(ఇండియా వర్సెస్ పాకిస్తాన్) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐసీసీ మేజర్ టోర్నీల్లో పాకిస్తన్పై టీమిండియా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ వచ్చింది. అంతేగాక టి20 ప్రపంచకప్లో ఇరుజట్లు ఐదు సార్లు తలపడగా.. ఐదింటిలోనూ టీమిండియానే విజయం వరించడం విశేషం. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. చదవండి: T20WC 2021: డీఆర్ఎస్, డక్వర్త్ లూయిస్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం ''ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒత్తిడితో కూడుకున్నది. ఆరోజు మ్యాచ్లో ఎవరైతే ఒత్తిడిని అధిగమిస్తారో వాళ్లే మ్యాచ్ను గెలుచుకుంటారు. ఇదీగాక మ్యాచ్లో ఎవరు తక్కువ తప్పులు చేస్తారో వారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరుజట్లు మ్యాచ్ ఆడుతున్నాయంటే భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. ఏ చిన్న తప్పు చేసినా అది జీవితకాలం వెంటాడుతుంది. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్లో మిస్బా చేసిన చిన్న పొరపాటు అతనికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేసింది. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడితే మ్యాచ్ను గెలవడం ఈజీ'' అని పేర్కొన్నాడు. ఇక టి20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు పాకిస్తాన్ జట్టులో మూడు మార్పులు చేసింది. సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీ, ఫఖర్ జమాన్లు జట్టులోకి వచ్చారు. ఇక గాయంతో సోహైబ్ మక్సూద్ ప్రపంచకప్కు దూరవమగా.. అతని స్థానంలో సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ఎంపికచేశారు. చదవండి: T20 World Cup 2021: ఉమ్రాన్ మాలిక్కు బంపర్ ఆఫర్! -
Virat Kohli: కోహ్లిపై ఆఫ్రిది ప్రశంసలు.. కన్నుల పండువగా ఉంది!
Shahid Afridi Praises Virat Kohli: ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఇక ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన కోహ్లి సేన.. హైదరాబాద్పై నెగ్గి పాయింట్ల పట్టికలో మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలని పట్టుదలగా ఉంది. అంతేగాక.. గత సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్లో తమను ఓడించి టైటిల్ గెలిచే అవకాశాలకు గండికొట్టిన ఆరెంజ్ ఆర్మీని ఎలాగైనా చిత్తు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఇతర ఆటగాళ్లు నెట్స్లో బాగానే శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రాక్టీసు సెషన్కు సంబంధించిన వీడియోను కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హైదరాబాద్ మ్యాచ్కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ‘‘గొప్ప ఆటగాళ్లు ప్రాక్టీసులో కూడా వందకు వంద శాతం నిబద్ధతతో ఆడతారు. కన్నుల పండుగగా ఉంది’’ అని కోహ్లిని కొనియాడాడు. కాగా ఐపీఎల్ 2021లో ఇప్పటి వరకు 12 మ్యాచ్లలో కోహ్లి 357 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 72(నాటౌట్). చదవండి: పాక్ కోచ్గా చచ్చినా చేయను: వసీం అక్రమ్ Aakash Chopra: వీరిలో ఎవరైనా ఆర్సీబీ కెప్టెన్ కావొచ్చు..? Treat to watch - A great player always gives 100% in practice!! 👏👏 https://t.co/5sxxVaqXYw — Shahid Afridi (@SAfridiOfficial) October 5, 2021 -
టీ20 వరల్డ్కప్: వాళ్లను ఎందుకు సెలక్ట్ చేశారో.. నేనైతే: ఆఫ్రిది
Shahid Afridi on Pakistan’s T20 World Cup selection: వచ్చే నెలలో జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు ఎంపిక చేసిన తమ జట్టు పట్ల పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేశాడు. కనీసం రెండు, మూడు మార్పులైనా చేయాలని, అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని పేర్కొన్నాడు. యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 వరల్డ్కప్ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో... 15 మందితో కూడిన జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. కెప్టెన్ బాబర్ అజమ్ నేతృత్వంలో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్, ఇద్దరు వికెట్ కీపర్స్, నలుగురు ఆల్రౌండర్స్, నలుగురు ఫాస్ట్ బౌలర్స్తో మెగా ఈవెంట్లో బరిలో దిగనున్నట్లు తెలిపింది. అయితే, ఈ నిర్ణయం పట్ల పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్... అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాదీర్, షాహనవాజ్ దహానిలను రిజర్వ్ ఆటగాళ్లుగా ప్రకటించడం పట్ల అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అనుభవం ఉన్న ఆటగాళ్లను అవకాశం ఇస్తే బాగుంటందని సూచించాడు. ఇక అక్టోబరు 10 వరకు జట్లలో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో షాహిద్ ఆఫ్రిది సైతం.. క్రికెట్ పాకిస్తాన్తో మాట్లాడుతూ పలు సూచనలు చేశాడు. జట్టు ఎంపిక సరిగ్గా లేదు.. ‘‘కొంతమందిని ఎందుకు ఎంపిక చేశారో.. మరికొంత మందిని ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు. టీ20 వరల్డ్కప్ ఆరంభానికి ముందే జట్టులో కొన్ని మార్పులు చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. ఇటీవల ప్రకటించిన జట్టు సరిగ్గా లేదు. కచ్చితంగా రెండు, మూడు మార్పులు చేయాలి. సెలక్షన్ కమిటీ అభిప్రాయంతో నేను ఏకీభవించడం లేదు. అయితే, వరల్డ్కప్లో మన జట్టుకు నేను తప్పకుండా మద్దతుగా నిలుస్తాను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, ఆ మార్పులు ఏమిటో మాత్రం వెల్లడించలేదు. ఇక మేజర్ టోర్నీకి ముందు కొత్త కోచ్ల నియామకం గురించి షాహిది చెబుతూ.. ‘‘టీ20 వరల్డ్కప్నకు ముందు కొత్తగా కోచింగ్ సిబ్బంది(హెడెన్, ఫిలాండర్) నియామకం పెద్దగా ప్రభావం చూపుతుందని నేను అనుకోను. టోర్నీ ముగిసిన తర్వాత ఈ నియామకం జరిపితే బాగుండేది’’ అని అభిప్రాయపడ్డాడు. పాత కోచ్లు మిస్బా-ఉల్- హక్, వకార్ యూనిస్ తమంతట తాముగా తప్పుకోవాలనే నిర్ణయం తీసుకుంటే మాత్రం అది పాకిస్తాన్ క్రికెట్కు నష్టం చేకూర్చే అవకాశం ఉందని పేర్కొన్నాడు. కొత్త కోచ్లు కుదురుకోవడానికి సమయం పడుతుందని, ఐసీసీ టోర్నీ సమయంలో ఇలాంటి మార్పులు ప్రభావం చూపుతాయని చెప్పుకొచ్చాడు. కాగా మిస్బా, వకార్ యూనిస్ స్థానంలో ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హెడెన్ను హెడ్ కోచ్గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలాండర్ను బౌలింగ్ కోచ్గా పీసీబీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి: Shoaib Akhtar: ‘ముందు టీమిండియా.. ఆ తర్వాత న్యూజిలాండ్.. వదిలిపెట్టొద్దు’