stock markets rally
-
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:21 సమయానికి నిఫ్టీ(Nifty) 231 పాయింట్లు నష్టపోయి 23,253కు చేరింది. సెన్సెక్స్(Sensex) 682 పాయింట్లు దిగజారి 76,802 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(US Index) 109.7 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.12 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.51 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.5 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.28 శాతం దిగజారింది.7న పాలసీ నిర్ణయాలు కొత్త ఏడాదిలో తొలిసారి పరపతి సమీక్షను చేపట్టనున్న రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం(7న) విధాన నిర్ణయాలను ప్రకటించనుంది. దాదాపు ఐదేళ్ల తదుపరి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 11 సమావేశాలలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 6.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి కాలంలో రెపో రేటులో 2.5 శాతం కోతను అమలు చేసింది. రిటైల్ ధరల ఇండెక్స్(సీపీఐ) డిసెంబర్లో 4 నెలల కనిష్టం 5.22 శాతానికి దిగివచి్చంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పరిమితంకానున్న అంచనాల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ వడ్డీరేట్లు యథాతథం.. స్వల్ప లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:46 సమయానికి నిఫ్టీ(Nifty) 41 పాయింట్లు లాభపడి 23,204కు చేరింది. సెన్సెక్స్(Sensex) 49 పాయింట్లు ఎగబాకి 76,581 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.85 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 76.56 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.53 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.47 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.51 శాతం దిగజారింది.అమెరికా ఫెడరల్ రిజర్వ్ బుధవారం రాత్రి వడ్డీ రేట్ల కోతపై నిర్ణయం వెలువరించింది. ఈ ధఫా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బడ్జెట్ శనివారం రోజున వెలువడుతుండడంతో ఆరోజు మార్కెట్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని సెబీ తెలిపింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
23 వేల మార్కు కిందకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:39 సమయానికి నిఫ్టీ(Nifty) 93 పాయింట్లు నష్టపోయి 22,993కు చేరింది. సెన్సెక్స్(Sensex) 305 పాయింట్లు దిగజారి 75,905 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 107.74 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.5 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 0.29 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.5 శాతం దిగజారింది.డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి కొత్త ఏడాదిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ల నడకను పలు దేశ, విదేశీ అంశాలు ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.శనివారం ట్రేడింగ్కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 1) స్టాక్ మార్కెట్లు పనిచేయనున్నాయి. పూర్తిస్థాయిలో ట్రేడింగ్ను నిర్వహించనుండటంతో ఈ వారం స్టాక్ ఎక్స్ఛేంజీలు ఆరు రోజులపాటు లావాదేవీలకు వేదిక కానున్నాయి. అయితే బడ్జెట్ సెంటిమెంటుపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి మార్కెట్ల ట్రెండ్కు దిక్సూచిగా నిలవనున్నట్లు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పుంజుకుంటున్న మార్కెట్లు.. లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:47 సమయానికి నిఫ్టీ(Nifty) 107 పాయింట్లు లాభపడి 23,320కు చేరింది. సెన్సెక్స్(Sensex) 285 పాయింట్లు ఎగబాకి 77,006 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ కనిపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.అమెరికా డాలర్ ఇండెక్స్ 109.04 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 82.34 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.65 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.83 శాతం లాభపడింది. నాస్డాక్ 2.45 శాతం ఎగబాకింది.రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపునకు పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ ద్రవ్యోల్బణం నుంచి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని నమ్ముతున్నారు. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:55 సమయానికి నిఫ్టీ(Nifty) 109 పాయింట్లు లాభపడి 23,855కు చేరింది. సెన్సెక్స్(Sensex) 373 పాయింట్లు ఎగబాకి 78,873 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.29 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్(Barrel Crude) ధర 74.92 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.57 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం నష్టపోయింది. నాస్డాక్(Nasdaq) 0.9 శాతం దిగజారింది.కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో స్వాగతం పలికింది. మెటల్, రియల్టీ(Realty) మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం ఇండెక్సులు అరశాతం మేర లాభపడ్డాయి. కొత్త సంవత్సరం రోజున ఆసియా, యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. వినియోగ ధోరణులు, సేవల వృద్ధి, ఎగుమతుల్లో తయారీ రంగం వాటా పెరగడం, పెట్టుబడులకు సంబంధించి మూలధన మార్కెట్ల స్థిరత్వం వంటి కొన్ని ముఖ్య అంశాల్లో భారత్ ఇప్పటికీ పటిష్టంగా ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పట్టిందల్లా బంగారమే!
మురిపించిన బంగారం.. రోలర్ కోస్టర్ రైడ్ను తలపించిన స్టాక్ మార్కెట్లు. డాలర్ విలువతో బక్కచిక్కిన రూపాయి.. 2024లో ఇన్వెస్టర్ల అంచనాలకు అందని విధంగా వీటి ప్రయాణం సాగిపోయింది. రష్యా–ఉక్రెయిన్; ఇజ్రాయెల్–హమాస్–పాలస్తీనా–ఇరాన్ మధ్య ఘర్షణలు; కొండెక్కిన ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడ్ రేట్ల కోతలు, డోనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో టారిఫ్ల భయాలు.. ఇలాంటి ఎన్నో పరిణామాలు, అనిశ్చితులు బంగారానికి డిమాండ్ పెంచాయి. దీంతో ఈ ఏడాది ఈక్విటీ, డెట్కు మించి బంగారం సూపర్ ర్యాలీ చేసింది. డాలర్ బలోపేతం, అమెరికా డెట్లో మెరుగైన రాబడులతో విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యం చూపించారు. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపించింది. ఈ ఏడాది 3 శాతం వరకు క్షీణించింది. స్థానిక రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోళ్లు ఒకింత ఈక్విటీ మార్కెట్లను ఆదుకున్నాయి. దీంతో ఈ ఏడాది మొత్తం మీద ఈక్విటీలు నికర రాబడులను అందించాయి. బంగారం తర్వాత ఇన్వెస్టర్లు వెండికి ప్రాధాన్యం ఇచ్చారు. పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాల నుంచి పెరిగిన డిమాండ్తో వెండి కూడా ర్యాలీ చేసింది. స్టాక్ మార్కెట్లు రికార్డులే రికార్డులుఅంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, (ఎఫ్ఐఐలు), విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారీ అమ్మకాలు చేపట్టినప్పటికీ భారత ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది రికార్డుల మీద రికార్డులు సృష్టించాయి. దీనికి దేశీ పెట్టుబడులే అండగా నిలిచాయని చెప్పుకోవాలి. ఏడాది చివర్లో స్టాక్స్ మరోసారి దిద్దుబాటులోకి వెళ్లినప్పటికీ.. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 9 శాతం (6,459 పాయింట్లు), ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.58 శాతం (2,082 పాయింట్లు) మేర లాభాలను (డిసెంబర్ 27 నాటికి) ఇచ్చాయి. ‘‘దేశీ, అంతర్జాతీయ పరిణామాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అసాధారణ అమ్మకాలకు దిగడంతో గత రెండు నెలల్లో ఈక్విటీ మార్కెట్ ఆల్టైమ్ గరిష్ట స్థాయి నుంచి దిద్దుబాటుకు గురైంది. 2020 కరోనా విపత్తు తర్వాత ఇది మూడో గరిష్ట దిద్దుబాటు’’అని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ వెల్లడించింది. రెండు అంతర్జాతీయ భౌగోళిక పరిణామాలను ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్–ఇరాన్ నేరుగా దాడులకు దిగాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అన్న ఆందోళన ఇన్వెస్టర్లను కలవరపాటుకు గురి చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా సమసిపోలేదు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కార్పొరేట్ ఫలితాలు బలంగా ఉండడం, దేశీ పెట్టుబడుల ప్రవాహం, జీడీపీ పటిష్ట వృద్ధితో.. బీఎస్ఈ సెన్సెక్స్ 85,978 పాయింట్ల ఆల్టైమ్ గరిష్ట రికార్డును సెపె్టంబర్ 27న నమోదు చేసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ అదే రోజున 26,277 గరిష్టాన్ని తాకింది. ఈ స్థాయిల నుంచి చూస్తే సెన్సెక్స్ డిసెంబర్ 27 నాటికి 8.46 శాతం, నిఫ్టీ 9.37 శాతం చొప్పున నష్టపోయాయి. → నిఫ్టీ ఆల్టైమ్ రికార్డు: 26,277 (సెప్టెంబర్ 27) → ఈ ఏడాది నికర రాబడి: 2,082 పాయింట్లు (9.58%) → సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డు: 85,978 (సెపె్టంబర్ 27) → ఈ ఏడాది నికర రాబడి: 6,459 పాయింట్లు (9%) → విదేశీ ఇన్వెస్టర్ల నికర ఈక్విటీ పెట్టుబడులు: రూ.1,655 కోట్లు (ప్రైమరీ, సెకండరీ) → విదేశీ ఇన్వెస్టర్ల నికర డెట్ పెట్టుబడులు: రూ.1,12,409 కోట్లుడిసెంబర్ 27 చివరికి సెన్సెక్స్ ముగింపు 78,699 కాగా, నిఫ్టీ ముగింపు 23,813 పాయింట్లు. ‘‘2024 బుల్స్, బేర్స్ మధ్య నువ్వా–నేనా అన్నట్టుగా యుద్ధం నడిచింది అంతర్జాతీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఈ ఒత్తిళ్లను తట్టుకుని మరీ భారత మార్కెట్లు చక్కని రాబడులు ఇచ్చాయి. దీంతో మన మార్కెట్ల విలువ ప్రపంచంలోనే అత్యంత ఖరీదుగా మారింది. దీనికితోడు అధిక లిక్విడిటీ (నిధుల ప్రవాహం) మార్కెట్ల వ్యాల్యూషన్ను గరిష్టాలకు చేర్చింది. దీంతో ఫండమెంటల్స్ కూడా పక్కకుపోయాయి. ఇదే అంతిమంగా మార్కెట్లో కరెక్షన్ను ఆహా్వనించినట్టయింది’’అని మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తాప్సే వివరించారు. జీడీపీ వృద్ధి రేటు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయి అయిన 5.4 శాతానికి సెపె్టంబర్ త్రైమాసికంలో క్షీణించడం, ఇదే త్రైమాసికానికి సంబంధించి బలహీన కార్పొరేట్ ఫలితాలు, ఖరీదైన వ్యాల్యూషన్ల వద్ద విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం చివరికి మార్కెట్లో దిద్దుబాటుకు దారితీశాయి. ద్రవ్యోల్బణం 6 శాతం దాటిపోవడంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత కట్టడి దిశగా ఆర్బీఐ తీసుకున్న చర్యలు కూడా వినియోగం క్షీణించి, వృద్ధిపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాదిలో అధిక భాగం ద్రవ్యోల్బణం 5 శాతానికి పైనే చలించింది. వరుసగా 9వ ఏట భారత ఈక్విటీలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచగా, స్మాల్క్యాప్, మిడ్క్యాప్ అయితే మరింత రాబడులతో మురిపించాయి.పసిడి మెరుపులు ఈ ఏడాది ఇన్వెస్టర్లు ఊహించినదానికి మించి బంగారం రాబడులు పంచింది. వెండి కూడా మెరిసింది. ఈ ఏడాది ఆరంభంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.63,000 స్థాయిలో ఉండగా, రూ.78,000–79000కు వృద్ధి చెందింది. రూపాయి మారకంలో 24 శాతం ర్యాలీ చేసింది. డాలర్ మారకంలో అయితే 29 శాతం పెరిగింది. ఇక వెండి కిలో ధర రూ.78,600 స్థాయి నుంచి 16 శాతానికి పైగా పెరిగి రూ.91,000కు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు, అంతకంతకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఈ ఏడాది పసిడికి బలాన్నిచ్చాయి. బంగారం అంతర్జాతీయంగా చూస్తే అక్టోబర్లో నమోదైన 2,670 డాలర్ల (ఔన్స్కు) నుంచి 4 శాతం నష్టపోయింది. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, డాలర్ ర్యాలీ, ద్రవ్యోల్బణం ఆందోళనలు కొంత శాంతించడం పసిడి చల్లబడడానికి కారణాలుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో ప్రస్తావించింది. అయినప్పటికి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ కొనసాగడం, ఆర్బీఐ సహా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్లు పసిడి నిల్వలను పెంచుకుంటూ పోవడం ధరలకు మద్దతునిచ్చాయి. పండుగల సీజన్లో తప్పించి ఈ ఏడాది బంగారం ఆభరణాల కొనుగోళ్లు సాధారణంగానే ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టాలకు చేరడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అనుసరించారు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం కొనుగోళ్లు మాత్రం వృద్ధి చెందాయి. ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా బంగారానికి ఉన్న గుర్తింపు సానుకూల సెంటిమెంట్కు దారితీసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు), సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (సిల్వర్ ఈటీఎఫ్లు) ఈ ఏడాది 20 శాతం వరకు నికర రాబడిని అందించాయి. బంగారం ఈటీఎఫ్లు సగటున 20 శాతం పెరగ్గా, సిల్వర్ ఈటీఎఫ్ల ధర 19.66 శాతంగా పెరిగింది. ఈ రెండు విభాగాల్లోనూ మొత్తం 31 ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. 2023లో గోల్డ్ ఈటీఎఫ్లు 13 శాతం రాబడిని, సిల్వర్ ఈటీఎఫ్లు సగటున 4 శాతం రాబడిని అందించాయి. భారత గోల్డ్ ఈటీఎఫ్ల నిర్వహణలోని మొత్తం భౌతిక బంగారం గడిచిన నాలుగేళ్లలో రెట్టింపై 2024 అక్టోబర్ చివరికి 54.5 టన్నులకు చేరినట్టు డబ్ల్యూజీసీ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికే గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు గతేడాదితో పోలి్చతే రెట్టింపై రూ.7367 కోట్లకు చేరాయి. 2023లో 2,919 కోట్లను గోల్డ్ ఈటీఎఫ్లు ఆకర్షించాయి. ఆర్బీఐ కొనుగోళ్లు.. ఈ ఏడాది బంగారం ధరల ర్యాలీకి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు సైతం ప్రేరణగా నిలిచాయి. ఈ ఏడాది నవంబర్ వరకు 11 నెలల్లో ఆర్బీఐ 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 9 శాతం పెరిగి 876 టన్నులకు చేరాయి. 2023లో 16 టన్నులు, 2022లో 33 టన్నుల చొప్పున ఆర్బీఐ బంగారం నిల్వలు పెంచుకున్నట్టు డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది మొదటి 11 నెలల్లో భారత్ దిగుమతి చేసుకున్న బంగారం 800 టన్నులను మించి ఉంటుందని అంచనా వేసింది. 2023 ఏడాది మొత్తం దిగుమతులు 689 టన్నులుగా ఉన్నట్టు.. విలువ పరంగా చూస్తే దిగుమతులు 48 శాతం పెరిగినట్టు (ధరల పెరుగుదలతో) డబ్ల్యూజీసీ తెలిపింది. సావరీన్ గోల్డ్ బాండ్లు కనుమరుగు! బంగారంపై పెట్టుబడులను ఎల్రక్టానిక్ రూపంలోకి మళ్లించే ఉద్దేశ్యంతో 2015లో మోదీ సర్కారు సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఏటా నాలుగు విడతలుగా వీటిని జారీ చేయడం ద్వారా నిధులు సమకరిస్తూ వచ్చింది. ఇన్వెస్టర్లకు ఇవి మెరుగైన రాబడులు ఇచ్చాయి. ‘‘2024లో కేవలం ఒక్క విడతే ఎస్జీబీని ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేసింది. 2023లో నాలుగు ఇష్యూలు చేపట్టింది. 2.5 శాతం వడ్డీ హామీకితోడు పన్ను మినహాయింపు ప్రయోజనాలతో బంగారంపై పెట్టుబడులకు ప్రాధాన్య సాధనంగా ఇది మారిపోయింది. దీంతో డిమాండ్–సరఫరా మధ్య తీవ్ర అంతరానికి దారితీసింది. ఫలితంగా ఇన్వెస్టర్ల ఆసక్తి గోల్డ్ ఈటీఎఫ్ల వైపు మళ్లింది’’ అని ఫిన్ఎడ్జ్ కో ఫౌండర్ మయాంక్ భటా్నగర్ తెలిపారు. పసిడి బలమైన ర్యాలీ, దీనికితోడు వడ్డీ చెల్లింపులు భారంగా మారడంతో ఎస్బీజీలను కేంద్రం నిలిపివేసినట్టు తెలుస్తోంది. → గోల్డ్ ఈ ఏడాది ఆల్టైమ్ గరిష్టం: 82,000 (అక్టోబర్ 30న హైదరాబాద్) → వెండి ఈ ఏడాది ఆల్టైమ్ గరిష్టం: రూ.1,01,900 (అక్టోబర్ 30) → ఆర్బీఐ బంగారం కొనుగోళ్లు: 73 టన్నులు (నవంబర్ నాటికి) → బంగారం దిగుమతులు: 800 టన్నులు (నవంబర్ నాటికి) → గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు: 7,367 కోట్లు (అక్టోబర్ నాటికి) ఎఫ్ఐఐలు నికర పెట్టుబడిదారులేఅక్టోబర్, నవంబర్ నెలల్లోనే విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో రూ.1.4 లక్షల కోట్ల అమ్మకాలకు పాల్పడడం గమనార్హం. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వాటా 16 శాతానికి దిగొచ్చింది. 12 ఏళ్ల కనిష్ట స్థాయి ఇది. రిటైల్, దేశీ ఇనిస్టిట్యూషన్లు, హెచ్ఎన్ఐల వాటా 32 శాతానికి చేరింది. ఈ ఏడాది డిసెంబర్ 27 నాటికి ఎఫ్ఐఐలు నికరంగా రూ.1,19,277 కోట్ల మేర స్టాక్ ఎక్సే్ఛంజ్ల ద్వారా (సెకండరీ మార్కెట్) అమ్మకాలు నిర్వహించారు. అదే సమయంలో ప్రైమరీ మార్కెట్ ద్వారా (ఐపీవోలు) వీరు రూ.1,20,932 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు ఎన్ఎస్డీఎల్ డేటా స్పష్టం చేస్తోంది. అంటే ఈక్విటీల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ.1,655 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ‘‘ఈ ప్రకారం ఎఫ్ఐఐలు ఈ ఏడాది ఇంత వరకు నికర పెట్టుబడిదారులుగానే ఉన్నారు. ఎక్సే్ఛంజ్ల ద్వారా అమ్మకాలన్నవి అధిక వ్యాల్యూషన్ల వల్లే. అదే సమయంలో సహేతుక విలువలు ఉండడంతో ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డీకే విజయ్కుమార్ తెలిపారు. డెట్ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఈ ఏడాది మొత్తం మీద రూ.1,12,409 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్టు ఎన్ఎస్డీఎల్ డేటా ఆధారంగా తెలుస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్టాక్ మార్కెట్ మన్మోహనుడు
దశాబ్దకాలంపాటు దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ హయాంలో స్టాక్ మార్కెట్లు లాభాల దుమ్మురేపాయి. మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ దాదాపు 400 శాతం దూసుకెళ్లింది. వెరసి 10 ఏళ్లలో 8 సంవత్సరాలు లాభాలు పంచింది. 2006–07లో 47 శాతం జంప్చేయగా.. 2009లో మరింత జోరు చూపుతూ 81 శాతం ఎగసింది. వివరాలు చూద్దాం.. పలు కీలక నిర్ణయాలుఆర్థిక మంత్రిగా (1991–96) ఉన్నప్పటి నుంచే క్యాపిటల్ మార్కెట్లలో సంస్కరణలకు బీజం వేశారు మన్మోహన్ సింగ్. భారతీయ ఆర్థిక వ్యవస్థలను ఆధునీకరించడం, అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేసే విధానాలకు రూపకల్పన చేసారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 1988లోనే ఏర్పాటైనప్పటికీ 1992లో సెబీ చట్టం ద్వారా దానికి చట్టబద్ధమైన అధికారాలు అందించారు. దేశీ క్యాపిటల్ మార్కెట్లలో పారదర్శకతను పెంపొందించేందుకు, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సెబీ ఒక పటిష్టమైన నియంత్రణ సంస్థగా మారేందుకు ఇది తోడ్పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రవేశం కలి్పంచడం ద్వారా మార్కెట్లో లిక్విడిటీకి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి మన్మోహన్ సంస్కరణలు దోహదపడ్డాయి.బుల్ పరుగుకు దన్ను మన్మోహన్ సింగ్ దేశానికి ఆర్థిక స్వేచ్చను కలి్పంచిన గొప్ప శిల్పి. 1991లో సంస్కరణలతో దేశీ స్టాక్ మార్కెట్లలో బుల్ రన్కు తెరతీశారు. వ్యాపారాలు భారీగా విస్తరించాయి. దీంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 1,000 పాయింట్ల స్థాయి నుంచి జోరందుకుంది. 780 రెట్లు ఎగసి ప్రస్తుతం 78,000 పాయింట్లకు చేరుకుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రిటర్నులు అందించింది. – వీకే విజయకుమార్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్సంస్కరణల జోష్ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ 1991లో చేపట్టిన సంస్కరణలు దేశీ క్యాపిటల్ మార్కెట్లలో చెప్పుకోదగ్గ మార్పులకు కారణమయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్నిచ్చాయి. ఆధునిక భారత్కు బాటలు వేశాయి. లైసెన్స్ రాజ్కు చెక్ పెట్టడంతోపాటు, స్వేచ్చా వాణిజ్యం, స్టాక్ మార్కెట్లలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఆయన దారి చూపారు. విదేశీ ఇన్వెస్టర్లకు భారత్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. – పల్కా అరోరా చోప్రా, డైరెక్టర్, మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ 4,961 నుంచి 24,693కు మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదవిలో ఉన్న 2004 నుంచి 2014వరకూ పరిగణిస్తే సెన్సెక్స్ 4,961 పాయింట్ల నుంచి 24,693 వరకూ దూసుకెళ్లింది. ఈ కాలంలో మూడేళ్లు మినహా ప్రతీ ఏటా ఇండెక్స్ లాభాల బాటలో నే సాగడం గమనార్హం! ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో ఇండెక్సులు పతనంకాగా.. 2011, 2014లోనూ మార్కెట్లు వెనకడుగు వేశాయి. 2011లో సెన్సెక్స్ అత్యధికంగా 27% క్షీణించింది. ఆరి్థక మంత్రిగా మన్మోహన్ 1991లో చేపట్టిన సంస్కరణలు ఆరి్థక వ్యవస్థకు జోష్నివ్వడంతో టర్న్అరౌండ్ అయ్యింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. బక్కచిక్కిన రూపాయి బలోపేతమైంది. ప్రధానంగా విదేశీ మారక నిల్వలు భారీగా ఎగశాయి.సెన్సెక్స్ పరుగు ఏడాది లాభం(%) 2004 33 2005 42 2006 47 2007 47 2009 81 2010 17 2012 26 2013 9 -
మిశ్రమ ఫలితాల్లో స్టాక్ మార్కెట్లు
గురువారం ఉదయం లాభాల్లో లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. సెన్సెక్స్ 0.39 పాయింట్లు లేదా 0.00050 శాతం నష్టంతో 78,472.48 వద్ద, నిఫ్టీ 22.55 పాయింట్లు లేదా 0.095 శాతం లాభంతో 23,750.20 వద్ద నిలిచాయి.అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, JSW స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, నెస్లే ఇండియా వంటి సంస్థలు నష్టాలను చవి చూశాయి.స్థిరమైన గ్లోబల్ సూచనలు, ఆసియా మార్కెట్ల ఉత్తేజం నేపథ్యంలో ఇండియన్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ 50 (Nifty) గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయానికి, సెన్సెక్స్ 238.27 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 78,711 వద్ద, నిఫ్టీ 56.45 పాయింట్లు లేదా 0.24 శాతం లాభంతో 23,784.10 వద్ద ఉన్నాయి.ఓపెనింగ్ బెల్ తర్వాత ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా స్టాక్లు మాత్రమే నష్టాల్లో ట్రేడవుతుండగా, మిగిలినవి లాభాల్లో పయనిస్తున్నాయి. వీటిలో బ్యాంక్ స్టాక్లు ముందు వరుసలో ఉన్నాయి. లాభాల్లో అగ్రగామిగా ఎస్బీఐ (SBI) ఉండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.నిఫ్టీ50లో ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ట్రెంట్, టీసీఎస్లతో సహా ఐదు స్టాక్లు మాత్రమే దిగువన ట్రేడింగ్లో ఉన్నాయి. బిపిసిఎల్, ఎస్బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) మారుతీ సుజుకి ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్ గెయినర్స్.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market).. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 85.93 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో.. 78,454.24 వద్ద, నిఫ్టీ 23.85 పాయింట్లు లేదా 0.10 శాతం నష్టంతో 23,729.60 వద్ద నిలిచాయి.టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఐషర్ మోటార్స్, ఐటీసీ కంపెనీ వంటివి టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జేఎస్డబ్ల్యు స్టీల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టైటాన్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటివి నష్టాలను చవిచూశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:24 సమయానికి నిఫ్టీ 21 పాయింట్లు లాభపడి 23,775కు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు పుంజుకుని 78,611 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 108.08 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.9 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.59 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.43 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.92 శాతం దిగజారింది.ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలివ్వడంతో ఈక్విటీ మార్కెట్లు ఇటీవల కాలంలో ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. రేపు క్రిస్మస్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు. తిరిగి గురువారం యథావిధిగా స్టాక్మార్కెట్లు పని చేస్తాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 165 పాయింట్లు లాభపడి 23,735 వద్దకు చేరింది. సెన్సెక్స్ 498 పాయింట్లు పుంజుకుని 78,540 వద్దకు చేరింది. ఇటీవల భారీగా పడిపోయిన మార్కెట్లు సోమవారం కాస్త పుంజుకోవడంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల మార్కెట్ నుంచి భారీగా అమ్మకాలు చేస్తున్న విదేశీ సంస్థగత పెట్టుబడిదారుల సరళిని గమనించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: జనవరి 1 నుంచి వాట్సప్ పని చేయదు! కారణం..సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ కంపెనీ స్టాక్లు లాభాల్లోకి చేరుకున్నాయి. జొమాటో, మారుతీసుజుకీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, నెస్లే కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 705.11 పాయింట్లు లేదా 0.89 శాతం లాభంతో.. 79,748.85 వద్ద, నిఫ్టీ 208.20 పాయింట్లు లేదా 0.87 శాతం లాభంతో 24,122.35 పాయింట్ల వద్ద నిలిచాయి.భారతి ఎయిర్టెల్, సిప్లా, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ వంటి సంస్థలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, అపోలో హాస్పిటల్, నెస్లే వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:19 సమయానికి నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 23,973కు చేరింది. సెన్సెక్స్ 154 పాయింట్లు ఎగబాకి 79,177 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 106.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.38 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.6 శాతం దిగజారింది.మార్కెట్ ఒడిదొడుకులకు కొన్ని కారణాలుఅమెరికాలో అక్టోబర్ వినియోగదారుల వ్యయం అంచనాలకు (0.3%) మించి 0.4% పెరిగింది. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ దిగుమతులపై అధిక సుంకాల విధింపు హెచ్చరికల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని రెండుశాతం దిగువకు తీసుకొచ్చే లక్ష్యానికి ఆటంకం నెలకొంది.డిసెంబర్లో మూడో దఫా వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఫెడ్ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ఇటీవలి ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశ వివరాల్లో వెల్లడైంది. దీంతో 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లపై కోతపై ఆశలు పెట్టుకున్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు.అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు అనూహ్యంగా పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 106.39 స్థాయికి చేరింది. బాండ్లపై రాబడులు పెరగడంతో భారత్లాంటి వర్ధమాన దేశాల నుంచి అమెరికాకు పెట్టుబడులు తరలిపోతున్నాయి. డాలర్ బలంతో విదేశీ పెట్టుబడుదారులకు వ్యయాలు పెరుగుతాయి. ఇది మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఒక్కరోజులో రూ.7.5 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీగా పడుతున్నాయి. ఉదయం 11:25 నిమిషాల సమయం వరకు ఏకంగా సుమారు రూ.7.5 లక్షల కోట్ల ముదుపర్ల సంపద ఆవిరైనట్లు తెలిసింది. మార్కెట్లు పడిపోతుండడంపై నిపుణులు కొన్ని అంతర్జాతీయ అంశాలు కారణమని విశ్లేషిస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం.అమెరికా ఎన్నికలుఅమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు(మంగళవారం 5న) జరగనున్నాయి. గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్ధిని కమలా హారిస్ హోరాహోరీగా తలపడుతున్నారు. అభ్యర్ధులు విభిన్న పాలసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాజా ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది.యూఎస్ ఫెడ్ సమావేశంమరోపక్క ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షను చేపట్టనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను ప్రధానంగా విదేశీ అంశాలే నిర్ధేశించనున్నాయి. ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) బుధ, గురువారాల్లో(6–7వ తేదీన) మానిటరీ పాలసీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నాయి. 7న యూఎస్ ఆర్థిక వ్యవస్థ తీరు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. సెప్టెంబర్ ద్రవ్యోల్బణం(2.4 శాతం), అక్టోబర్ ఉపాధి గణాంకాల ఆధారంగా వడ్డీ రేట్లలో సవరణలకు తెరతీయనుంది. గత సమావేశంలో నాలుగేళ్ల తదుపరి ఎఫ్వోఎంసీ తొలిసారి 0.5 శాతం తగ్గింపును ప్రకటించింది. ఫలితంగా ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతంగా అమలవుతున్నాయి.క్యూ2 ఫలితాలుఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ వేడెక్కింది. పలు దిగ్గజాలు పనితీరును వెల్లడిస్తున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మార్కెట్లు కింది చూపులు చూస్తున్నాయి. ఈ వారం ఫలితాలు ప్రకటించనున్న దిగ్గజాల జాబితాలో డాక్టర్ రెడ్డీస్, టైటన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితరాలున్నాయి. దేశీయంగా తయారీ, సర్వీసుల రంగ పీఎంఐ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. దేశ, విదేశీ గణాంకాలను ఈ వారం స్టాక్ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నాయి.ఇదీ చదవండి: కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?ఎఫ్పీఐల అమ్మకాల రికార్డ్దేశీ స్టాక్స్లో ఉన్నట్టుండి గత నెలలో అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కొత్త చరిత్రకు తెరతీశారు. అక్టోబర్లో నికరంగా రూ.94,000 కోట్ల(11.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నెలవారీగా దేశీ స్టాక్ మార్కెట్లలో ఇవి అత్యధిక అమ్మకాలుకాగా..కొవిడ్–19 ప్రభావంతో ఇంతక్రితం 2020 మార్చిలో ఎఫ్పీఐలు రూ.61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీయంగా ఒక నెలలో ఇవి అత్యధిక విక్రయాలుగా నమోదయ్యాయి. ఎఫ్పీఐలు సెప్టెంబర్లో రూ.57,724 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇవి గత 9 నెలల్లోనే గరిష్టంకావడం గమనార్హం. అయితే చైనాలో ఆకర్షణీయ ఈక్విటీ విలువలు, ప్రభుత్వ సహాయక ప్యాకేజీలు ఎఫ్పీఐలను అమ్మకాలవైపు ఆకర్షిస్తున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. -
గ్లోబల్ ట్రెండ్, గణాంకాలపై కన్ను
ముంబై: ప్రపంచ పరిణామాలు, ఆర్థిక గణాంకాలు తదితర అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం(అక్టోబర్ 2న) మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ఆటోరంగ అమ్మకాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేశారు. ఇవికాకుండా అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక అనిశి్చతులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. త్రైమాసికవారీగా కంపెనీలు వెల్లడించే తాజా వార్తలు వివిధ కౌంటర్లలో యాక్టివిటీకి కారణంకానున్నట్లు తెలియజేశారు. బ్లూచిప్ కంపెనీలలో నెలకొన్న సానుకూల పరిస్థితులు మార్కెట్లను మరింత ముందుకు నడిపించనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ్ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. దేశీ గణాంకాలు ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించే తయారీ, సరీ్వసుల రంగాలకు చెందిన హెచ్ఎస్బీసీ ఇండియా పీఎంఐ ఇండెక్స్ గణాంకాలు వెలువడనున్నాయి. వీటితోపాటు విదేశీ ఇన్వెస్టర్ల తీరును ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. అయితే దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ పరిణామాలే మార్కెట్లకు కీలకంకానున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. కాగా.. ఇకపై రెండో త్రైమాసిక(జులై–సెపె్టంబర్) కార్పొరేట్ ఫలితాలవైపు ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. ఇన్వెస్టర్లలో కంపెనీల లాభార్జన మెరుగుపడనున్న అంచనాలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 0.5 శాతం వడ్డీ రేటు తగ్గింపు కారణంగా గత వారం మార్కెట్లు బలపడ్డాయి. ఆర్థిక గణాంకాలలో స్థిరత్వం, విదేశీ పెట్టుబడులు దేశీయంగా స్టాక్ మార్కెట్లకు జోష్నిస్తున్నట్లు నాయిర్ వివరించారు. చైనా ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రకటన సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచి్చనట్లు పేర్కొన్నారు. ఇది ఆసియా మార్కెట్లలో మరిన్ని పెట్టుబడులకు దారి చూపవచ్చని అంచనా వేశారు. కమోడిటీల ధరలు, యూఎస్ డాలర్ ఇండెక్స్, కీలక గణాంకాలు మార్కెట్లలో ట్రెండ్ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2020 మార్చి తదుపరి యూఎస్ ఫెడ్ తొలిసారి వడ్డీ రేటును తగ్గించింది. దీంతో ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి చేరాయి. సోమవారం(30న) ఫెడ్ చీఫ్ జెరోమీ పావెల్ ప్రసగించనున్నారు. గత వారం రికార్డ్స్ గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,028 పాయింట్లు ఎగసింది. 85,572 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో గరిష్టంగా 85,978కు చేరింది. నిఫ్టీ 388 పాయింట్లు జమ చేసుకుని 26,179 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో గరిష్టంగా 26,277ను తాకింది. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో సరికొత్త గరిష్ట రికార్డులను సాధించాయి. మార్కెట్ విలువరీత్యా బీఎస్ఈలో టాప్–10 కంపెనీలలో 8 కౌంటర్లు లాభపడ్డాయి. దీంతో టాప్–10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) ఉమ్మడిగా రూ.1.21 లక్షల కోట్లకుపైగా బలపడింది. వీటిలో ప్రధానంగా ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.53,653 కోట్లు పెరిగి రూ. 20,65,198 కోట్లయ్యింది. ఎస్బీఐ విలువ రూ.18,519 కోట్లు పుంజుకుని రూ. 7,16,334 కోట్లను తాకింది. ఎయిర్టెల్ విలువ రూ. 13,095 కోట్లు బలపడి రూ.9,87,905 కోట్లకు, ఐటీసీ విలువకు రూ.9,927 కోట్లు జమయ్యి రూ. 6,53,835 కోట్లకు చేరింది. ఈ బాటలో టీసీఎస్ విలువ రూ. 8,593 కోట్ల వృద్ధితో రూ. 15,59,052 కోట్లుగా నమోదైంది. పెట్టుబడులు @ 9 నెలల గరిష్టం సెపె్టంబర్లో ఎఫ్పీఐల స్పీడ్ ఇటీవల దేశీ ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటి(27)వరకూ నికరంగా రూ. 57,359 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఇది గత 9 నెలల్లో అత్యధికంకాగా.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇందుకు ప్రధాన కారణ మైంది. దీంతో 2024లో దేశీ స్టాక్స్లో ఎఫ్పీఐల పెట్టుబడులు రూ. లక్ష కోట్ల మార్క్ను అధిగమించాయి. ఇంతక్రితం 2023 డిసెంబర్లో ఎఫ్పీఐలు రూ. 66,135 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ జూన్ నుంచి చూస్తే ఎఫ్పీఐలు నెలవారీగా నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. -
పుంజుకున్న మార్కెట్లు.. కొత్త గరిష్టాలకు సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం పుంజుకున్నాయి. బెంచ్మార్క్ సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 ప్రారంభ నష్టాలను తిప్పికొట్టాయి. ట్రేడింగ్ సెషన్ను రికార్డ్ హై ముగింపు స్థాయిలలో ముగించే ముందు కొత్త గరిష్టాలను తాకాయి.సెన్సెక్స్ 255.83 పాయింట్లు లేదా 0.30 శాతం పుంజుకుని 85,169.87 వద్ద స్థిరపడింది. ఇంట్రాడే ట్రేడింగ్లో ఇండెక్స్ రికార్డు గరిష్ట స్థాయి 85,247.42కి చేరుకుంది. అలాగే నిఫ్టీ కూడా 63.75 పాయింట్లు లేదా 0.25 శాతం లాభంతో 26,004.15 వద్ద సెషన్ను ముగించే ముందు 26,032.80 ఆల్టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.నిఫ్టీ లిస్టింగ్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, గ్రాసిమ్, బజాజ్ ఫిన్సర్వ్ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఎల్టీఐమైండ్ట్రీ, టెక్ మహీంద్రా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా మోటర్స్, టైటాన్ టాప్ లూజర్స్ జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నిన్నటి ముగింపు వద్దే ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 25,947కు చేరింది. సెన్సెక్స్ 26 పాయింట్లు లాభపడి 84,927 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.49 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 75 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.74 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.25 శాతం, నాస్డాక్ 0.56 శాతం లాభపడ్డాయి.ఇదీ చదవండి: రూ.8,357 కోట్లతో అసెంబ్లింగ్ యూనిట్!ఫెడ్ కీలక వడ్డీరేట్లను కట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు గరిష్ఠాల్లో ట్రేడవుతున్నాయి. దేశీయంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నవారిలో దాదాపు 93 శాతం మంది నష్టాల్లోనే ఉంటున్నట్లు పలు సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి ఈ ట్రేడింగ్ చేస్తున్నవారు అప్రమత్తంగా ఉండాలని, కొత్తగా ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నవారు ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎంచుకోకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10:11 సమయానికి నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 25,907కు చేరింది. సెన్సెక్స్ 273 పాయింట్లు లాభపడి 84,817 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.72 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.74 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్పల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.19 శాతం, నాస్డాక్ 0.36 శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: కస్టమర్లకు సకల సౌకర్యాలు!ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు, దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా ఈ సెప్టెంబర్లో ఇప్పటి వరకు (1– 21 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు రూ.33,700 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఈ గురువారం (22న) నిఫ్టీ సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు.రెండు ఐపీఓలు, మూడు లిస్టింగులు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన మన్బా ఫైనాన్స్ రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది. సెప్టెంబర్ 23న ప్రారంభమై 25న ముగుస్తుంది. కేఆర్ఎన్ హీట్ ఎక్స్ఛేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్ ఇష్యూ 25–27 తేదీల మధ్య ఉంటుంది. తద్వారా రూ.342 కోట్లు సమీకరించనుంది. ఎస్ఎంఈ విభాగంలో కంపెనీలతో కలిసి మొత్తం 11 సంస్థలు మార్కెట్ నుంచి రూ.900 కోట్లను సమీకరించనున్నాయి. అలాగే ఇటీవల పబ్లిక్ ఇష్యూను పూర్తి చేసుకున్న వెస్ట్రన్ క్యారియర్స్ ఇండియా, ఆర్కేడ్ డెవలపర్స్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ షేర్లు ఒకేరోజున మంగళవారం (24న) స్టాక్ లిస్ట్ కానున్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 25,471కు చేరింది. సెన్సెక్స్ 179 పాయింట్లు లాభపడి 83,378 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.69 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 74.7 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.72 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 1.7 శాతం, నాస్డాక్ 2.51 శాతం లాభపడ్డాయి.ఫెడ్ వడ్డీ తగ్గింపుతో భారత్కు మరిన్ని విదేశీ పెట్టుబడులు తరలిరానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, ఇటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మార్గంలోనూ విదేశీ నిధులు పెరగనున్నట్లు చెబుతున్నారు. ఇది దేశీ కరెన్సీ రూపాయికి బలాన్నిస్తుందని తెలియజేస్తున్నారు. ఆర్బీఐ సైతం వడ్డీ రేట్లను తగ్గించేందుకు వీలు చిక్కుతుందని అభిప్రాయపడుతున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 6.5 శాతంవద్దే కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కఠిన పరపతి విధానాలను అవలంబిస్తోంది. వచ్చే నెల(అక్టోబర్) 7–9 మధ్య ఆర్బీఐ పాలసీ సమీక్షను చేపట్టనుంది.ఇదీ చదవండి: టెలికాం కంపెనీల పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఫెడ్ నిర్ణయాలపై దృష్టి.. స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు తగ్గి 25,398కు చేరింది. సెన్సెక్స్ 92 పాయింట్లు నష్టపోయి 82,995 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 100.93 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 73.64 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.63 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.03 శాతం, నాస్డాక్ 0.2 శాతం లాభపడ్డాయి.ఇదీ చదవండి: విండ్ఫాల్ ట్యాక్స్ రద్దుకీలకంగా మారనున్న ఫెడ్ నిర్ణయాలువడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపైనే భారత్తో సహా అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీరేట్లను 25 లేదా 50 బేసిస్ పాయింట్లు మేర ఫెడ్ తగ్గించవచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు సెప్టెంబర్ 17న మొదలయ్యాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం(18న) రాత్రి ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య విధాన నిర్ణయాలు వెల్లడించనున్నారు. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ద్రవ్య కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ@25,388
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 31 పాయింట్లు పెరిగి 25,388కు చేరింది. సెన్సెక్స్ 122 పాయింట్లు లాభపడి 83,002 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్ 101.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 72.06 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 3.66 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.54 శాతం, నాస్డాక్ 0.65 శాతం లాభపడ్డాయి.క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్ను ప్రభావితం చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ పాలసీ కమిటీ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడికి ముందు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చని అంటున్నారు. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 25,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 25,500 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 26,000 వద్ద మరో నిరోధం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటు(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఎన్ఎస్ఈ నిఫ్టీ.. భళా
మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 58 పాయింట్లు బలపడి 23,323 వద్ద నిలిచింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ఇంట్రాడేలోనూ 177 పాయింట్లు పురోగమించి 23,442 వద్ద సరికొత్త రికార్డును సాధించింది. ఇక ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో తొలి సెషన్లో సెన్సెక్స్ 594 పాయింట్లు జంప్ చేసింది. ఇంట్రాడే రికార్డ్ 77,079కు చేరువగా 77,050ను అధిగమించింది. చివరికి 150 పాయింట్లు జమ చేసుకుని 76,607 వద్ద ముగిసింది. ముంబై: ఎంపిక చేసిన బ్లూచిప్ షేర్లకు డిమాండ్ నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు మళ్లీ జోరందుకున్నాయి. రోజంతా ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో లాభాలమధ్యే కదిలాయి. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్(విలువ) మరోసారి కొత్త రికార్డును లిఖించింది. రూ. 429.32 లక్షల కోట్లను(5.14 ట్రిలియన్ డాలర్లు) అధిగమించింది. కాగా.. ఎన్ఎస్ఈలో మీడియా, పీఎస్యూ బ్యాంక్స్, హెల్త్కేర్ రంగాలు 2–1 శాతం మధ్య పుంజుకున్నాయి. చిన్న షేర్లు జూమ్ బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతానికిపైగా బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,518 లాభపడితే.. 1,376 మాత్రమే డీలాపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్పీఐలు రూ. 427 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 234 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. ఫెడ్పై దృష్టి దేశీయంగా జీడీపీ పురోగతిపై ఆర్బీఐ ఆశావహ అంచనాలు సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురానున్న తుది బడ్జెట్ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇవికాకుండా యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు బలహీనపడినట్లు తెలియజేశారు. విదేశీ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 83 డాలర్లకు చేరగా, డాలరుతో మారకంలో రూపాయి నామమాత్రంగా 3 పైసలు బలపడి 83.56(ప్రొవిజినల్) వద్ద ముగిసింది. ఇక్సిగో ఐపీవో బంపర్ సక్సెస్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఇక్సిగో మాతృ సంస్థలే ట్రావెన్యూస్ టెక్నాలజీ చేపట్టిన పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్ను సాధించింది. షేరుకి రూ. 88–93 ధరలో బుధవారం ముగిసిన ఇష్యూ 98 రెట్లు అధిక సబ్్రస్కిప్షన్ను అందుకుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 740 కోట్లు సమీకరించింది.డీ డెవలప్మెంట్ @ రూ. 193–203పైపింగ్ సొల్యూషన్స్ కంపెనీ డీ డెవలప్మెంట్ ఇంజనీర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 193–203 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవో ఈ నెల 19న ప్రారంభమై 21న ముగియనుంది. ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 418 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు ఈ నిధులను వినియోగించుకోవాలన్నది సంస్థ ప్రణాళిక. -
Stock market: మార్కెట్ యూటర్న్..
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఖరారు కావడంతో నేలక్కొట్టిన బంతిలా దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్బ్యాక్ను సాధించాయి. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రా డేలో 2,456 పాయింట్ల ‘పోల్’వాల్ట్ చేసింది. నిఫ్టీ సైతం 786 పాయింట్లు జంప్చేసింది. దీంతో సెన్సెక్స్ తిరిగి 74,530 పాయింట్లను అధిగమించగా.. నిఫ్టీ 22,670ను దాటేసింది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 13 లక్షల కోట్లకుపైగా బలపడింది! ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున గత నాలుగేళ్లలోనే అత్యధిక స్థాయి పతనాన్ని చవిచూసిన స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టే వీలుండటంతో సెంటిమెంటు బలపడింది. ఒక్కసారిగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉపక్రమించడంతో ఇండెక్సులు లాభాల పరుగు అందుకున్నాయి. సెన్సెక్స్ 2,303 పాయింట్లు జంప్చేసి 74,382 వద్ద నిలిచింది. నిఫ్టీ 736 పాయింట్లు పురోగమించి 22,620 వద్ద ముగిసింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్కు రూ. 13.22 లక్షల కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 408 లక్షల కోట్ల(4.89 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది!ఎఫ్పీఐ అమ్మకాలు బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 4.4%, 3% చొప్పున ఎగశా యి. కాగా.. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) తాజాగా రూ. 5,656 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 4,555 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. మంగళవారం ఎఫ్పీఐలు రూ. 12,436 కోట్లు, దేశీ ఫండ్స్ రూ. 3,319 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. దీంతో బీఎస్ఈ మా ర్కెట్ విలువలో రూ. 31 లక్షల కోట్లకుపైగా తగ్గింది. బ్లూ చిప్స్ దన్ను...ఎన్ఎస్ఈలో అన్ని రంగాలూ 6–2 శాతం మధ్య ఎగశాయంటే కొనుగోళ్ల జోరును అర్ధం చేసుకోవచ్చు! ప్రధానంగా మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, కన్జూమర్ డ్యురబుల్స్ 4 శాతంపైగా బలపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీ దిగ్గజాలలో దాదాపు అన్ని షేర్లూ లాభపడ్డాయి. అదానీ షేర్లు అప్మార్కెట్ల బౌన్స్బ్యాక్తో ఒక్క అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మినహా (–2.6%) అదానీ గ్రూప్లోని లిస్టెడ్ కంపెనీలలో అత్యధికం మళ్లీ లాభపడ్డాయి. దీంతో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 15.57 లక్షల కోట్లను అధిగమించింది. మేలో ‘సేవలు’ పేలవంన్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మేనెల్లో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ నెల్లో 60.8 వద్ద ఉన్న హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మే లో 60.2కు తగ్గింది. కాగా, కొత్త ఎగుమతుల ఆర్డర్లు 10 సంవత్సరాల గరిష్టానికి చేరడం హర్షణీయ పరిణామం. -
మార్కెట్ అల్లకల్లోలం
లోక్సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్యూ బ్యాంక్స్లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
Stock Market: 75,000 @ రూ. 400 లక్షల కోట్లు
ఒక్క రోజు గ్యాప్లో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దుమ్మురేపాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 75,000 పాయింట్లపైన నిలవగా.. నిఫ్టీ 22,754 వద్ద ముగిసింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మళ్లీ రూ. 400 లక్షల కోట్లను అధిగమించింది. తాజా ట్రేడింగ్లో చిన్న షేర్లకు సైతం కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి కట్టుతప్పడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలోచనకు చెక్పడే వీలుంది. దీంతో యూఎస్ మార్కెట్లు 1.3 శాతం డీలాపడి ట్రేడవుతున్నాయి. ముంబై: ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండోసారి సరికొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు జంప్చేసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 75,038 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల వృద్ధితో కొత్త గరిష్టం 22,754 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 75,105 వద్ద, నిఫ్టీ 22,776 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ప్రభావంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1–0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 2,27,025 కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 402 లక్షల కోట్ల(4.83 ట్రిలియన్ డాలర్లు) ఎగువకు చేరింది. ఫార్మా మినహా.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్, చమురు, ఎఫ్ఎంసీజీ, మెటల్ 1.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, హిందాల్కో, ఎయిర్టెల్, ఎస్బీఐ, అదానీ ఎంటర్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐషర్, టెక్ఎం, ఆర్ఐఎల్ 3.6–1% మధ్య లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, మారుతీ, దివీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–1% మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మొత్తం ట్రేడైన షేర్లలో 1,904 లాభపడితే.. 1,939 బలహీనపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్పీఐలు రూ. 2,778 కోట్లు, దేశీ ఫండ్స్ సైతం రూ. 163 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మూడోరోజూ మెరిసిన పసిడి, వెండి పసిడి, వెండి ధరలు న్యూఢిల్లీలో వరుసగా మూడవ రోజు బుధవారం కూడా రికార్డుల ర్యాలీ చేశాయి. పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒక దశలో లైఫ్టైమ్ హై రూ.72,000 తాకింది. అటు తర్వాత క్రితం ముగింపుతో పోలి్చతే రూ.200 లాభంతో రికార్డు స్థాయి రూ.71,840 వద్ద ముగిసింది. వెండి కూడా కేజీకి రూ.200 ఎగసి రూ.84,700 వద్ద ముగిసింది. పసిడి ధర గడచిన మూడు రోజుల్లో రూ.690 పెరగ్గా, వెండి ధర ఇదే కాలంలో రూ.1,500 పెరిగింది. కాగా, అంతర్జాతీయ బులిష్ ధోరణులు ఈ రెండు మెటల్స్ తాజా పెరుగుదలకు కారణంకాగా, బుధవారం వెలువడిన అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్లు తగ్గకపోవచ్చని భయాలతో బంగారం, వెండి తక్షణ ర్యాలీకి బ్రేక్ పడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లు క్రితం ముగింపుతో పోల్చితే మైనస్లో ట్రేడవుతుండడం ఇక్కడ గమనార్హం. నకిలీ వీడియోలతో తస్మాత్ జాగ్రత్త! ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్టాక్ రికమండేషన్లు ఇస్తున్నట్లు అవాస్తవ(డీప్ఫేక్) వీడియోల సృష్టి జరిగినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం తాజాగా పేర్కొంది. ఆధునిక సాంకేతికతను తప్పుడు మార్గంలో వినియోగించడం ద్వారా ఎన్ఎస్ఈ లోగోసహా.. ఆశిష్కుమార్ ముఖం లేదా గొంతుతో షేర్ల సిఫారసులు చేస్తున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దని హెచ్చరించింది. -
సాక్షి మనీ మంత్ర: ఫ్లాట్గా ట్రేడవుతున్న మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గురువారం మునుపటి ముంగింపు దగ్గరే ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 వరకు నిఫ్టీ 8 పాయింట్లు పుంజుకుని 22,064కు చేరింది. సెన్సెక్స్ 4 పాయింట్లు లాభపడి 72.602 వద్ద ట్రేడవుతోంది. అమెరికాలోని నాస్డాక్ 0.3శాతం నష్టాల్లో ముగిసింది. వరుసగా మూడోరోజు ఈ సూచీ నష్టాలభాట పట్టినట్లు తెలిసింది. ఫెడ్ మినట్స్ మీటింగ్లో ప్రధానంగా మార్చి 2024లో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అందుకు సెంట్రల్ బ్యాంక్లు అచితూచి వ్యవహరించనున్నాయని తెలుస్తుంది. యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్లు 4.8 పాయింట్లు పెరిగి 4.32 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.08శాతం నష్టపోయి 103.97కు చేరింది. ఎఫ్ఐఐలు బుధవారం ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.284.66 కోట్ల విలువ చేసే స్టాక్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ.411.57 కోట్లు విలువైన స్టాక్లను విక్రయించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ర్యాలీతో రికార్డుల మోత
ముంబై: ప్రధానంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ దిగ్గజాలలో కొనుగోళ్ల మార్కెట్లకు జోష్నిచ్చాయి. దీంతో మరోసారి మార్కెట్లు లాభపడ్డాయి. నిఫ్టీ 75 పాయింట్లు ఎగసి 22,197 వద్ద ముగిసింది. దీంతోపాటు ఇంట్రాడేలో 22,216కు చేరడం ద్వారా మళ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. మరోపక్క సెన్సెక్స్ 349 పాయింట్లు జంప్చేసి 73,057 వద్ద నిలిచింది. తద్వారా 73,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించడంతోపాటు.. చరిత్రాత్మక గరిష్టం 73,328ను అధిగమించే బాటలో సాగుతోంది. సోమవారం సైతం నిఫ్టీ 22,122 వద్ద రికార్డ్ సృష్టించిన విషయం విదితమే. అయితే మార్కెట్లు తొలుత వెనకడుగుతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 22,046 దిగువన, సెన్సెక్స్ 72,510 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. తిరిగి మిడ్ సెషన్ నుంచీ జోరందుకున్నాయి. దీంతో ఆరు రోజుల్లో నిఫ్టీ 580 పాయింట్లు, సెన్సెక్స్ 1,984 పాయింట్లు జమ చేసుకున్నాయి. ప్రయివేట్ స్పీడ్ ఎన్ఎస్ఈలో ప్రధానంగా ప్రయివేట్ బ్యాంక్స్(1%) జోరు చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో పవర్గ్రిడ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎన్టీపీసీ, కొటక్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, ఇండస్ఇండ్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్, నెస్లే, హెచ్యూఎల్ 4.4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే హీరోమోటో, బజాజ్ ఆటో, ఐషర్, కోల్ ఇండియా, టీసీఎస్, సిప్లా, బజాజ్ ఫిన్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్ 4–1% మధ్య క్షీణించాయి. చిన్న షేర్లు వీక్ అధిక విలువల కారణంగా ఇన్వెస్టర్లు చిన్న షేర్లలో అమ్మకాలు చేపట్టారు. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.2 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,967 నీరసించగా.. 1,876 బలపడ్డాయి. ఇక నగదు విభాగంలో ఎఫ్పీఐలు రూ. 1,336 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్ రూ. 1,491 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్.. ► ఇష్యూ ధర రూ. 151తో పోలిస్తే వి¿ోర్ స్టీల్ ట్యూబ్స్ 179% లాభంతో రూ. 421 వద్ద లిస్టయ్యింది. 193% (రూ.291) బలపడి రూ. 442 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 838 కోట్లను దాటింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 23.3 లక్షలకుపైగా షేర్లు ట్రేడయ్యాయి. ఈ ఐపీవో భారీ స్థాయిలో 300 రెట్లు సబ్్రస్కయిబ్ అయ్యింది. ► ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుల్లో రూ. 656 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించడంతో పవర్గ్రిడ్ షేరు 4.2% ఎగసి రూ. 288 వద్ద క్లోజైంది. వరుసగా ఆరో రోజూ ర్యాలీతో దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డును సాధించగా.. సెన్సెక్స్ 73,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. త ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకునే బాట లో సాగుతోంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 391.5 లక్షల కోట్ల(4.72 ట్రిలియన్ డాలర్లు)ను తాకింది. వర్ల్పూల్ వాటా విక్రయం.. రూ. 4,090 కోట్ల సమీకరణ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రమోటర్ సంస్థ వర్ల్పూల్ మారిషస్ బ్లాక్డీల్స్ ద్వారా దేశీ అనుబంధ కంపెనీ వర్ల్పూల్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించింది. యూఎస్ హోమ్ అప్లయెన్సెస్ దిగ్గజం వర్ల్పూల్ కార్పొరేషన్ మారిషస్ సంస్థ ద్వారా 75 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. బ్లాక్డీల్స్ ద్వారా రూ. 4,090 కోట్ల విలువైన 3.13 కోట్ల షేర్లు విక్రయించినట్లు బీఎస్ఈకి వర్ల్పూల్ ఇండియా వెల్లడించింది. రుణ చెల్లింపుల కోసం వర్ల్పూల్ ఇండియాలో 24 శాతం వాటాను విక్రయించనున్నట్లు గతేడాది వర్ల్పూల్ కార్ప్ వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో వర్ల్పూల్ ఇండియా షేరు 3.25 శాతం క్షీణించి రూ. 1,288 వద్ద ముగిసింది. -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. నిఫ్టీ 211 పాయింట్ల నష్టంతో 21,527కు చేరింది. సెన్సెక్స్ 786 పాయింట్లు తగ్గి 71,183 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, ఎస్బీఐ, హెచ్యూఎల్, టెక్ మహీంద్రా పవర్గ్రిడ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, సన్ఫార్మా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర గత 24 గంటల్లో 0.15 శాతం పెరిగి 82.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ‘విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ)’ సోమవారం రూ.110 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. ‘దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ)’ సైతం రూ.3,221.34 కోట్ల విలువ చేసే షేర్లను కొన్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: శనివారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. సోమవారం సెలవు
దేశీయ స్టాక్ ఎక్ఛేంజీలు శనివారం ఓపెన్లోనే ఉన్నాయి. ముందుగా ఈరోజు కొద్ది సమయమే మార్కెట్లు పని చేస్తాయని ప్రకటించిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు రోజంతా మార్కెట్ ఓపెన్లోనే ఉండనున్నట్లు తెలిపాయి. అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపనకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో జనవరి 22న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ జరగదని ఒక అధికారి తెలిపారు. దేశీయ మార్కెట్లు శనివారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 68 పాయింట్లు లాభపడి 21698కు చేరింది. సెన్సెక్స్ 754 పాయింట్లు పుంజుకుని 71,941 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్ఐఐలు శుక్రవారం రూ.3689.68 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.2638.46 కోట్లు షేర్లు కొనుగోలు చేశారు. అమెరికాలోని నాస్డాక్ 1.7 శాతం లాభాల్లో ముగిసింది. పదేళ్ల కాలపరిమితి ఉన్న యూఎస్ బాండ్ఈల్డ్ 2 బేసిస్పాయింట్లు తగ్గి 4.13 శాతానికి చేరాయి. డాలర్ ఇండెక్స్ 0.29 శాతం తగ్గి 103.24 వద్దకు చేరింది. క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 78.88 యూఎస్ డాలర్ల వద్ద ఉంది. మిచిగాన్ యూనివర్సిటీ చేసిన సర్వేలో ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు వెల్లడైంది. ఇది మార్కెట్లకు కొంత ఊరట కలిగించే అంశంగా ఉంది. మార్కెట్లో ఇప్పటికే ఐటీస్టాక్ల ర్యాలీ కనబతుతోంది. దీనికితోడు బ్యాంకింగ్రంగ స్టాక్లు తోడ్పాటునందిస్తే మరింత దూసుకుపోయే అవకాశం ఉంది. కానీ ఇటీవల విడుదలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు మదుపర్లకు కొంత నిరాశ కలిగించాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇవాళ రాబోయే ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఫలితాలను అనుసరించి మార్కెట్ ర్యాలీ ఉండనుందని సమాచారం. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు గడిచిన మూడు రోజుల నష్టాలకు బ్రేక్ వేస్తూ శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 21,614కు చేరింది. సెన్సెక్స్ 580 పాయింట్లు పుంజుకుని 71,766 వద్ద ట్రేడవుతోంది. ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐలు గడిచిన రెండురోజుల్లో భారీగా షేర్లను విక్రయించారు. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి రూ.9,901.56 కోట్లు విలువైన షేర్లు విక్రయించారు. డీఐఐలు రూ.5,977.12 కోట్లు విలువ చేసే షేర్లు కొనుగోలు చేశారు. డాలర్ ఇండెక్స్ 103.38కు చేరింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ 79.01 డాలర్లుగా ఉంది. అమెరికా మార్కెట్లోని నాస్డాక్ గురువారం 1.35 శాతం పెరిగింది. 10 కాలవ్యవధి ఉన్న యూఎస్ బాండ్ ఈల్డ్లు 3 బేసిస్ పాయింట్లు పెరిగి 4.14 శాతానికి చేరాయి. అమెరికాలోని జాబ్స్ డేటా ఆశించిన దానికంటే తక్కువగా నమోదైంది. పాకిస్థాన్ ఇరాన్ వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఎర్ర సముద్రంలో చేలరేగుతున్న అల్లర్లతో అంతర్జాతీయంగా వాణిజ్యంపరంగా కొంత అనిశ్చితులు నెలకొన్నాయి. దానికితోడు పాకిస్థాన్ అంశం తోడైతే మార్కెట్లు మరింత దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇరుదేశాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా నార్త్ కొరియా, సౌత్ కొరియా మధ్య సంబంధాలపై కొమ్జాంగ్ఉన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల సంబంధాలపై కిమ్ భిన్న వైఖరి అవలంబించబోతున్నట్లు చెప్పారు. మిస్సైల్ల్ల పరీక్ష, లైఫ్ ఫైర్ ఎక్సర్సైజ్లను చేయబోతున్నట్లు తెలిపారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: దేశీయ మార్కెట్లో బుల్రన్
దేశీయ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. దేశీయ మార్కెట్ సూచీలైన నిఫ్టీ ఉదయం 9:20 వరకు 88 పాయింట్లు లాభపడి 21,739 వద్దకు చేరింది. సెన్సెక్స్ 332 పాయింట్లు పుంజుకుని 72,050 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ అండ్ టీ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. భారతిఎయిర్టెల్, ఎం అండ్ ఎం, నెస్లే, పవర్గ్రిడ్, టైటాన్, సన్ఫార్మా షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి డిసెంబర్ నెలకు సంబంధించి అమెరికా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్(సీపీఐ) డేటా విడుదలైంది. మార్కెట్ భావించిన దానికంటే కొంత అధికంగా సీపీఐ సూచీలున్నాయి. మార్కెట్లు 0.2 శాతంగా ఉంటుందని భావించాయి. కానీ 0.3శాతంగా నమోదైంది. క్రూడ్ఆయిల్ ధర స్వల్పంగా పెరిగి బ్యారెల్కు 78 డాలర్లుగా ఉంది. ఎర్రసముద్రం అనిశ్చితుల నేపథ్యంలో ఇరాన్ ఒమన్ కోస్ట్కు చెందిన ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లపై దాని ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ 102.3కు చేరింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఐపీవో రష్.. లాభాల జాతర
గత క్యాలండర్ ఏడాది(2023)లో పబ్లిక్ ఇష్యూల హవా నడిచింది. ఓవైపు స్టాక్ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తే.. మరోపక్క ప్రైమరీ మార్కెట్లు పలు కొత్త కంపెనీల లిస్టింగ్స్తో కళకళలాడాయి. వీటిలో అత్యధిక శాతం ఇష్యూలు ఇన్వెస్టర్లను మెప్పించడం విశేషం! ముంబై: స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్సులలో సెన్సెక్స్(బీఎస్ఈ) 72,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నూతన చరిత్రకు తెరతీసింది. ఈ బాటలో నిఫ్టీ(ఎన్ఎస్ఈ) సైతం తొలిసారి 22,000 పాయింట్ల మార్క్కు చేరువైంది. ఈ ప్రభావంతో 2023లో పలు అన్లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు తెరతీశాయి. ఇందుకు అనుగుణంగా కొద్ది నెలలనుంచి పెట్టుబడుల దూకుడు చూపుతున్న రిటైల్ ఇన్వెస్టర్లు పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేయడంలో క్యూ కట్టారు. వెరసి 2023లో మార్కెట్లను తాకిన 59 ఐపీవోలలో ఏకంగా 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం ద్వారా రికార్డు నెలకొల్పాయి. 4 కంపెనీలు మాత్రమే పబ్లిక్ ఇష్యూ ధరలకంటే దిగువన కదులుతున్నాయి. రూ. 82 లక్షల కోట్లు గతేడాది(జనవరి–డిసెంబర్) దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు 20 శాతం ర్యాలీ చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ. 82 లక్షల కోట్లమేర(ఒక ట్రిలియన్ డాలర్లు) బలపడింది. ఫలితంగా లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 370 లక్షల కోట్లకు(4.3 ట్రిలియన్ డాలర్లు) చేరింది. 2022తో పోలిస్తే 30 శాతం వృద్ధి! తద్వారా గ్లోబల్ టాప్–5 విలువైన మార్కెట్ల జాబితాలో భారత్ చోటు సాధించింది. సగటున 45 శాతం ప్లస్ గతేడాది స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన 59 కంపెనీలు ఉమ్మడిగా రూ. 54,000 కోట్లు సమీకరించాయి. వీటిలో 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచాయి. ఇవి సగటున 45 శాతం బలపడ్డాయి. అయితే 4 కంపెనీలు ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడవుతున్నాయి. 59 ఇష్యూలలో లిస్టింగ్ రోజు లాభాలు సగటున 26 శాతంకాగా.. డిసెంబర్ 29కల్లా సగటున 45 శాతం పురోగమించాయి. 4 ఇష్యూలు మాత్రమే బలహీనంగా ట్రేడవుతున్నాయి. లిస్టింగ్ నుంచి 23 కంపెనీలు 50 శాతానికిపైగా రిటర్నులు అందించాయి! 9 ఇష్యూలు రెట్టింపునకుపైగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) నుంచి 182 ఐపీవోలు నమోదయ్యాయి. ఇది 56 శాతం వృద్ధికాగా.. ప్రపంచంలోనే అత్యధికం!! టాప్లో పీఎస్యూ ఐపీవోలలో ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రెనెవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఇరెడా) అత్యధికంగా 205 శాతం దూసుకెళ్లి రిటర్నుల జాబితాలో టాప్ ర్యాంకును అందుకుంది. ఈ బాటలో సైయెంట్ డీఎల్ఎమ్ 155 శాతం, నెట్వెబ్ టెక్నాలజీస్ 141 శాతం చొప్పున జంప్చేసి తదుపరి స్థానాల్లో నిలిచాయి. టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ లిస్టింగ్లో మూడు రెట్లు ఎగసి ప్రస్తుతం 136 శాతం లాభంతో కదులుతోంది. ఇక రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ 128 శాతం ర్యాలీ చేసింది. ఈ నేపథ్యంలో 240 ఇష్యూల ద్వారా 60 బిలియన్ డాలర్లు సమీకరించిన చైనా తదుపరి భారత్ అత్యధిక ఐపీవోల మార్కెట్గా నిలిచింది. కారణాలున్నాయ్ బలమైన స్థూల ఆర్థిక మూలాలు, రాజకీయ నిలకడ, ఆశావహ కార్పొరేట్ ఫలితాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ పెంపు నిలుపుదల తదితర అంశాలు స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కారణమైనట్లు పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి రూ. 1.7 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు దేశీ మార్కెట్లలోకి ప్రవహించాయి. మరోపక్క గతేడాది సుమారు 2.7 కోట్లమంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలో ప్రవేశించడం గమనార్హం! మధ్య, చిన్నతరహా కంపెనీలు దూకుడు చూపడంతో ఐపీవో ఇండెక్స్ 41 శాతం జంప్చేసింది. గతేడాది మార్చిలో నమోదైన కనిష్టం 57,085 పాయింట్ల నుంచి సెన్సెక్స్ డిసెంబర్ 28కల్లా 72,484 పాయింట్లకు పురోగమించింది! -
ఆర్బీఐ పాలసీ, ప్రపంచ పరిణామాలు కీలకం
న్యూఢిల్లీ: వడ్డీరేట్లపై ఆర్బీఐ వెల్లడించే పాలసీ నిర్ణయం, స్థూల ఆర్థిక గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం మార్కెట్ల గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) ట్రేడింగ్ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. కాగా, బుధవారం మహావీర్ జయంతి అలాగే శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లు పని చేయవు. ట్రేడింగ్ మూడు రోజులకు మాత్రమే పరిమితం కానుంది. ఆర్బీఐ పాలసీపై ఫోకస్... ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఏప్రిల్ 6న వెలువడనుంది. దీనిపై ఈ వారం మార్కెట్ ప్రధానంగా దృష్టి పెడుతుందని స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. మళ్లీ నికర కొనుగోలుదారులుగా మారుతున్న ఎఫ్పీఐల పెట్టుబడులపై అలాగే దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐ)పై కూడా ఫోకస్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇక గతేడాది రికార్డు స్థాయి వాహన విక్రయాలను సాధించిన ఆటోమొబైల్ రంగంపైగా మార్కెట్ దృష్టి సారిస్తుందన్నారు. ఈసారి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పీఎంఐ గణాంకాలు.. ఆర్బీఐ చర్యలతో పాటు ఏప్రిల్3న ఎస్అండ్పీ గ్లోబల్ తయారీ రంగ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్ 5న సేవల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ‘దేశీయ అంశాలకు తోడు ప్రపంచ పరిణామాలు, విదేశీ నిధుల ప్రవాహ ధోరణులు కూడా మార్కెట్పై ప్రభావం చూపుతాయి’ అని రెలిగేర్ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. సమీప కాలంలో చూస్తే మార్కెట్ దృష్టి అంతా ఆర్బీఐ పాలసీపైనే ఉంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ఆర్బీఐ నిర్ణయం, పీఎంఐ డేటా కోసం ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,462 పాయింట్లు (2.54%) దూసుకెళ్లింది. శుక్రవారం ఒక్కరోజే 1,031 పాయింట్లు ఎగబాకడం విశేషం. బ్యాంకింగ్ సంక్షోభ భయాలు నెమ్మదిగా సద్దుమణుగుతుండటంతో ఆసియా, యూరప్, అమెరికా సూచీలు సైతం గత శుక్రవారం సానుకూలంగా ముగిశాయి. -
బడ్జెట్ ఎఫెక్ట్ : నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
పలు జాతీయ అంతర్జాతీయ అంశాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా సింగపూర్ స్టాక్ ఎక్ఛేంజ్ నిఫ్టీ (ఎస్జీఎక్స్) నిరాశజనకంగా కొనసాగుతుంటే..వచ్చే వారం ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలతో యూఎస్ మార్కెట్లో ఓవర్నైట్ ట్రేడ్లో మిక్స్డ్ ఫలితాలు వెలువరించాయి. దీనికి తోడు దేశీయంగా ప్రస్తుత నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ గడువు ఈరోజు ముగియనుండడంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను మార్చుకునేందుకు మక్కువ చూపడం, 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత మోదీ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడంతో దేశ ప్రజల చూపంతా ఈ బడ్జెట్ వైపే ఉండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతున్నారు. బుధవారం ఉదయం 9.37గంటలకు సెన్సెక్స్ 281 పాయింట్లు నష్టపోయి 60697 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95.25 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్,హిందాల్కో,బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం,టాటా మోటార్స్,హెచ్యూఎస్,ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..అదానీ పోర్ట్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్,అపోలో హాస్పిటల్స్,ఎస్బీఐ, దివిస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ ఇండ్ షేర్లు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు!
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది ప్రారంభ రోజు ఫ్లాటుగా ట్రేడింగ్ను మొదలు పెట్టాయి. నిఫ్టీ 18100 పాయింట్లకు పైకి ఎగబాకింది.సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 60,959 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 18,145 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. కానీ కొద్ది సేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. దీంతో సోమవారం ఉదయం 9.30గంటల సమయానికి సెన్సెక్స్ 42 పాయింట్ల స్వల్ప నష్టంతో 60798 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ అత్యల్పంగా 9 పాయింట్లు నష్టాలవైపు పయనమవుతున్నాయి. నిఫ్టీ -50లో టాటా స్టీల్, హిందాల్కో, టాటామోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఎస్బీఐలు నష్టాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ -50లో టాటా స్టీల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్,ఓఎన్జీసీ,బీపీసీఎల్ షేర్లు లాభాల వైపు మొగ్గుచూపుతున్నాయి. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ఐరోపాలో తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభం, ఐరోపా కేంద్ర బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయం,అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి. అయినప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9.35గంటల సమయంలో సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 59138 వద్ద, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో 17629 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. హిందాల్కో,జేఎస్డబ్ల్యూ స్టీల్,ఐసీఐసీఐ బ్యాంక్,అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెసీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. దివిస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే, శ్రీ సిమెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అథేర్ మోటార్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్,అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పొ, బ్రిటానియా, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవున్నాయి. -
స్టాక్ మార్కెట్: ఆరో రోజుల ర్యాలీకి ‘రిలయన్స్’ బ్రేక్
ముంబై: ఇంధన, ఆటో, టెలికం షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బుల్స్ ఆరురోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మూడుశాతానికి పైగా క్షీణించి స్టాక్ సూచీల పతనాన్ని శాసించింది. సెన్సెక్స్ 306 పాయింట్ల తగ్గుదలతో 56వేల దిగువన 55,766 వద్ద స్థిరపడింది. ఈ సూచీ కోల్పోయిన మొత్తం పాయింట్లలో ఒక్క రిలయన్స్ షేరు వాటాయే 252 పాయింట్లు కావడం గమనార్హం. నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 16,631 వద్ద నిలిచింది. మరోవైపు మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.845 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.72 కోట్ల షేర్లను అమ్మేశారు. అమెరికా ఫెడ్ రిజర్వ్ రేపు (బుధవారం) ద్రవ్య పరపతి విధానాలను వెల్లడించనున్న నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు నీరసంగా ట్రేడింగ్ను ప్రారంభించాయి. గడచిన ఆరు సెషన్ల నుంచి సూచీల భారీ ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొలి సెషన్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 535 పాయింట్లు క్షీణించి 55,537 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 16,564 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మిడ్సెషన్ నుంచి మెటల్, ఐటీ షేర్లు రాణించడంతో సూచీలు కొంతమేర నష్టాలను తగ్గించుకోగలిగాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► రిలయన్స్ ఇండస్ట్రీస్ జూన్ క్వార్టర్ ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. బీఎస్ఈలో కంపెనీ షేరు మూడు శాతం క్షీణించి రూ.2,420 వద్ద నిలిచింది. ట్రేడింగ్లో 4% పతనమై రూ.2,404 ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ రూ.55,981 కోట్ల మార్కెట్ క్యాప్ను కోల్పోయింది. ఎక్సే్ఛంజీలో 4.66 లక్షల షేర్లు చేతులు మారాయి. ► ప్రమోటర్లు, ఇన్వెస్టర్ల ఏడాది లాక్–ఇన్ పీరియడ్ గడువు(జూలై 23న) ముగియడంతో జొమాటో షేరు భారీ పతనాన్ని చవిచూసింది. 14%కి పైగా క్షీణించి రూ.46 వద్ద కొత్త జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 11% నష్టంతో రూ.47.55 వద్ద నిలిచింది. ►క్యూ1 ఫలితాలు నిరాశపరచడంతో ఇన్ఫీ షేరుకు డిమాండ్ కరువైంది. అరశాతం క్షీణించి రూ.1,502 వద్ద నిలిచింది. చదవండి: Income Tax Day 2022: రూ.14 లక్షల కోట్లు వసూళ్లు చేశాం: నిర్మలా సీతారామన్ -
ఈ వారం స్టాక్ మార్కెట్లు: ఇన్వెస్టర్లు జాక్పాట్ కొడతారా? లేదంటే నష్టపోతారా?
ముంబై: స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో స్థిరీకరణ దిశగా సాగొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, క్రూడాయిల్ ధరలపై దృష్టి పెట్టొచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల నుంచి సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ క్వార్టర్ త్రైమాసిక ఫలితాల సీజన్ ఆరంభం నేపథ్యంలో అప్రమత్తతకు అవకాశం లేకపోలేదంటున్నారు. జూన్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా షార్ట్స్ కవర్ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 179 పాయింట్లు, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయ మార్కెట్లు స్థిరమైన ప్రదర్శన కనబరిచినట్లైయితే బుల్స్ రిలీఫ్ ర్యాలీకి అవకాశం ఉంది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతున్నా.., గతవారంలో అమ్మకాల ఉధృతి తగ్గడం శుభసూచకం. క్రూడాయిల్ ధరలు, డాలర్ ఇండెక్స్, రూపాయి కదలికలు ట్రెండ్ను ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయి. చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ నష్టాల్లో ముగిసినా.., సాంకేతికంగా కీలకమైన మద్దతు 15,750 స్థాయిని నిలుపుకొంది. అమ్మకాలు కొనసాగితే నిఫ్టీకి 15,700 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 15,500 వద్ద మద్దతు లభించొచ్చు. ఎగువస్థాయిలో కొనుగోళ్ల జరిగితే 15,900 వద్ద నిరోధాన్ని ఎదుర్కోనుంది. అటు పిదప 16,170–16,200 శ్రేణిలో మరో కీలక నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ స్వస్తిక్ ఇన్వెస్ట్మార్ట్ హెడ్ రీసెర్చ్ సంతోష్ మీనా తెలిపారు. 1. ఆర్థిక ఫలితాల సీజన్ ఆరంభం టీసీఎస్ శుక్రవారం జూన్(8న) క్వార్టర్ ఆర్థిక గణాంకాలను వెల్లడించి కార్పొరేట్ ఫలితాల సీజన్కు తెరతీయనుంది. ‘‘అట్రిషన్ రేటు పెరగడంతో ఐటీ రంగం, మందగమనంతో మౌలికరంగం., సైక్లికల్స్ సెక్టార్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశ కలిగించవచ్చు. అయితే ఆటో, ఎఫ్ఎంసీజీ కంపెనీల గణాంకాలు మెప్పించవచ్చు. కార్పొరేట్ ఫలితాల ప్రకటనకు ముందు స్టాక్ ఆధారిత ట్రేడింగ్కు అవకాశం ఉంది’’ అని నిపుణులు చెబుతున్నారు. టీసీఎస్తో పాటు పీటీసీ ఇండియా, జీఎం బేవరీజెస్, మైసూర్ పేపర్ మిల్స్, వక్రంజీ, కోహినూర్ ఫుడ్స్ తదితర కంపెనీలు ఈ వారంలో ఆర్థిక పలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. 2. ప్రపంచ పరిణామాలు, స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా ఫెడ్ రిజర్వ్ మినిట్స్(బుధవారం)తో పాటు జూన్ ఎస్అండ్పీ గ్లోబల్ తయారీ, సేవారంగ పీఎంఐ డేటా విడుదల కానుంది. ఇదేవారంలో మంగళవారం యూరోజోన్ ఎస్అండ్పీ గ్లోబల్ సర్వీసెస్ కాంపోసైట్ పీఎంఐ, బుధవారం కన్స్ట్రక్షన్ పీఎంఐ, మే మాసపు రిటైల్ అమ్మకాలు వెల్లడి కానున్నాయి. వీటి నుంచి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేసే ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక స్థితిగతులు అంశాలపై ఒక అంచనాకు రావచ్చు. రష్యా – ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. -
దూకుడుకు బ్రేకులు.. నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్ల దూకుడుకు బ్రేకులు పడ్డాయి. బుధవారం మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.డాలర్ స్థిరపడటంతో బంగారం ధరలు తగ్గాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా కొనసాగినా..పెట్టుబడి దారులు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. దీంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. బుధవారం ఉదయం 9.50 గంటలకు సెన్సెక్స్ 553 పాయింట్లు నష్టపోయి 51979 వద్ద నిఫ్టీ 174 పాయింట్లు నష్ట పోయి 15464 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక మారుతి సుజుకి, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పొ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, హిందాల్కో,ఓఎన్సీజీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
కోలుకునేది ఎప్పుడో, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. ఆర్బీఐ ఆకస్మిక రెపోరేటు పెంపుతో ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో శుక్రవారం ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్ 927 పాయింట్లు భారీగా నష్టపోయి 54774 వద్ద నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 16401 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి.బ్లూడార్ట్, టీవీ 18 బ్రాడ్ కాస్ట్, అంబీర్ ఎంటర్ ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజికీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్, హెచ్సీఎల్ టెక్నాలజీ, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. -
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు భారీ షాక్!
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్కు భారీ షాక్ తగిలింది. గురువారం ప్రకటించిన అమెజాన్ క్యూ1 ఫలితాలతో గంటల వ్యవధిలో బెజోస్ బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గురువారం అమెజాన్ క్యూ1 ఫలితాల్ని ప్రకటించింది. ఈ ఫలితాల్లో 2015 తర్వాత ఈ ఏడాదిలో అత్యధికంగా 3.84 బిలియన్ డాలర్ల నష్టాల్ని చవిచూసింది. దీంతో అప్రమత్తమైన షేర్ హోల్డర్లు అమ్మకాలు జరిపారు. ఫలితంగా గంటల వ్యవధిలో ఆ సంస్థ బిలియన్ డాలర్లు నష్టపోగా.. ఒక్క మార్చి నెలలోనే అత్యంత దారుణంగా ట్రేడింగ్ జరిగిన టెక్నాలజీ షేర్ల విభాగంగా అమెజాన్ షేర్లు ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. బ్లూం బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అమెజాన్ క్యూ1 ఫలితాలు ఆ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ సంపదపై ప్రభావం చూపాయి. గురువారం రోజు అమెజాన్ 14.05 శాతం నష్టపోవడంతో జెఫ్ బెజోస్ గంటల వ్యవధిలో 20.5 బిలియన్ డాలర్లు (మన కరెన్సీలో రూ.1.56లక్షల కోట్లు) నష్టపోయారు. కాగా, బ్లూం బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో బెజోస్ సంపద తగ్గి 148.4 బిలియన్ డాలర్లతో సరిపెట్టుకున్నారు. చదవండి👉ఫెస్టివల్ సీజన్: ఆన్లైన్ షాపింగ్లో ఆఫర్లే ఆఫర్లు! ఇక 'పండగ' చేస్కోండి! -
మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే!
మార్కెట్ పతనంలో పెట్టుబడులకు అనుకూలమైన స్టాక్స్ను గుర్తించడం ఎలా? – శ్వేత మార్కెట్లలో కరెక్షన్ మొదలైన తర్వాత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలను అన్వేషించకూడదు. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ముందు ఎంతో విస్తృతమైన పరిశోధన, కసరత్తు కావాలి. కంపెనీ ఎప్పటికప్పుడు వ్యాపారంలో వృద్ధి నమోదు చేస్తోందా? అని చూడాలి. రిటర్న్ ఆన్ ఈక్విటీ మంచి రేషియోలో ఉందా? అని చూడాలి. రుణభారంతో నెట్టుకొస్తూ ఉండకూడదు. అంటే ఎక్కువ రుణాలు తీసుకుని ఉండకూడదు. కంపెనీని నడిపించే యాజమాన్యం నిధులు పక్కదారి పట్టించకుండా నిజాయతీగా, సమర్థవంతంగా పనిచేసేదై ఉండాలి. కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీ డబ్బులను వేరే వారికి అప్పగిస్తున్నట్టుగా భావించాలి. అందుకే కంపెనీని నడిపించే వ్యక్తులు విశ్వసనీయత కలిగి ఉండాలి. ఇవన్నీ ఒక కంపెనీలో గుర్తిస్తే ఆకర్షణీయమైన ధర వద్ద షేరులో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీరు గుర్తించింది గొప్ప కంపెనీ అవుతుంది. అయితే, సహేతుక ధర వద్దే కానీ, ఖరీదైన ధరలో కొనుగోలు చేస్తే రాబడులు కష్టం కావచ్చు. ఇలాంటి నాణ్యత అంశాలతో కూడిన కంపెనీలను గుర్తించినప్పుడు వాటిని వాచ్ లిస్ట్ (పరిశీలన జాబితా)లో పెట్టుకోవాలి. వాల్యూరీసెర్చ్ పోర్టల్పై వాచ్లిస్ట్ పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే మంచి ఫలితాలనిస్తుందని నేను భావిస్తున్నాను. విజయవంతమైన ఇన్వెస్టర్లలో నేను గుర్తించిన అసాధారణ అంశం ఇది. కానీ, ఇందుకు ఎంతో ఓపిక ఉండాలి. మీరు గుర్తించిన కంపెనీలు ఖరీదైన వ్యాల్యూషన్లలోనే ఎక్కవ రోజుల పాటు ట్రేడ్ కావచ్చు. కానీ, మీరు అనుకున్న ధరకు దిగొచ్చే వరకు వేచి చూడాలి. మార్కెట్లు అస్థిరతంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను ఇన్వెస్టర్లు ఎలా ఎదుర్కోవాలి? – నవీన్ మార్కెట్లలో ఇప్పుడు అస్థిరతలు కనిపిస్తున్నాయి. ముందు కూడా అస్థిరతలు ఉన్నాయి. భవిష్యత్తులో మరింత ఎక్కువగానూ ఉండొచ్చు. గడిచిన ఐదు, పదేళ్ల కాలంలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టొచ్చు. ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్తో రక్షణ కల్పించుకోవాలి. సమీప కాలంలో మార్కెట్లపై ఆధారపడకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులు కనీసం ఐదు, ఏడేళ్ల వరకు అవసరం కానివి అయి ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ అమల్లో పెట్టిన తర్వాత, క్రమం తప్పకుండా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వారు అయి ఉండి, పెట్టుబడులు పెట్టాలనుకునే సమయంలో మార్కెట్లలో అస్థిరతలు ఉంటే వాటిని అనుకూలంగా మలుచుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి?– రేవతి మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమాకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విషయానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే విషయంలో ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి?– రేవతి మీ అవసరాలకు అనుగుణమైన ప్రణాళికను రూపొందించుకోవడమే ప్రాథమిక కర్తవ్యంగా ఉండాలి. చేతిలో అవసరాలకు కొంత నగదు, అత్యవసర నిధి ఏర్పాటు, జీవిత బీమా, ఆరోగ్య బీమాకు చోటు ఇవ్వాలి. ఆ తర్వాత మీ ఆకాంక్షల విషయానికి రావాలి. మీ పొదుపు, పెట్టుబడులకు స్థాయికి తగ్గట్టు వీటిని మార్చుకోవచ్చు. ఆర్థిక ప్రణాళిక రూపొందించుకునేందుకు కచ్చితమైన సూచనలు అంటూ ఉండవు. ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసుకోవాలి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పడిపోతున్న విదేశీ ఇన్వెస్టర్ల వాటా
ముంబై: విదేశీ ఇనిస్టిట్యూషన్స్ భారత స్టాక్స్లో పెట్టుబడులను గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గించుకున్నాయి. 2020–21లో 23 బిలియన్ డాలర్లు (రూ.1.72 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయగా.. 2021–22లో కేవలం 3.7 బిలియన్ డాలర్లు (రూ.27,750 కోట్లు) పెట్టుబడులకే పరిమితమయ్యాయి. దీంతో ఎన్ఎస్ఈ 500 కంపెనీల్లో వాటి మొత్తం మొత్తం వాటాలు 19.9 శాతానికి, 582 బిలియన్ డాలర్ల విలువకు (రూ.43.65 లక్షల కోట్లు) పరిమితమయ్యాయి. ఈ వివరాలను బ్యాంకు ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ వారం ఆరంభం వరకు చూస్తే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) పెట్టుబడుల ఉపసంహరణ 14.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో మార్చి నెలలోనే 5.4 బిలియన్ డాలర్లు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఫిబ్రవరిలో 4.7 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు. మరింత వివరంగా.. ► 2022 మార్చి 15 నాటికి ఎఫ్పీఐల హోల్డింగ్స్ విలువ 582 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021 సెప్టెంబర్లో ఇది 667 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించాలి. ► ఐటీ రంగంలో ఎఫ్పీఐల వాటాలు 0.87 శాతం పెరిగి 15 శాతానికి, ఇంధన రంగ కంపెనీల్లో 0.44 శాతం పెరిగి 15.5 శాతానికి, హెల్త్కేర్ రంగంలో 0.22 శాతం పెరిగి 4.9 శాతానికి చేరాయి. ► ఫైనాన్షియల్ కంపెనీల్లో ఎఫ్ఫీఐల పెట్టుబడులు 1.07 శాతం తగ్గి 31.5 శాతానికి పరిమితం అయ్యాయి. డిస్క్రీషనరీ కంపెనీల్లో 0.49 శాతం తగ్గి 9.1 శాతం మేర ఉన్నాయి. ► దేశీ ఇనిస్టిట్యూషన్స్ ఎన్ఎస్ఈ కంపెనీల్లో 2022 ఫిబ్రవరి నాటికి 265 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కలిగి ఉన్నాయి. 13.1 బిలియన్ డాలర్లను తాజాగా కేటాయించాయి. ► ఎఫ్పీఐల వాటాల విలువ 2021–22 మొదటి త్రైమాసికం నాటికి 667 బిలియన్ డాలర్లుగా ఉంటే, అక్కడి నుంచి 112 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. ► దేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు చురుగ్గా పెట్టుబడులు పెడుతుండడం వల్లే మార్కెట్లు మరీ పతనాన్ని చూడలేదని బ్యాంకు ఆప్ అమెరికా సెక్యూరిటీస్ పేర్కొంది. ► 2022 మార్చిలో ఎఫ్పీఐలు భారత ఈక్విటీల నుంచి 5.4 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. వరుసగా ఆరో నెలలోనూ వారు పెట్టుబడుల ఉపసంహరణను కొనసాగించారు. దీంతో మొత్తం మీద ఆరు నెలల్లో 14.6 బిలియన్ డాలర్లు వెనక్కి తీసుకెళ్లిపోయారు. ► దేశీ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్పీఐల వాటాలు 2020 డిసెంబర్లో 21.4 శాతం స్థాయిలో ఉన్నాయి. అక్కడి నుంచి 19.9 శాతానికి దిగొచ్చాయి. -
కనక వర్షం కురిపిస్తున్న ఆ టాటా కంపెనీ షేర్లు..!
స్టాక్ మార్కెట్ అనేది ఇన్వెస్టర్లకు ఒక స్వర్గధామం. కలలో కూడా ఊహించని లాభాలని నిజజీవితంలో తెచ్చిపెడతాయి. ఓపిక, తెలివి ఉండాలగానే కొద్ది కాలంలోనే కరోడ్ పతి కావచ్చు. అయితే, ఇలాంటి స్టాక్ మార్కెట్ ప్రపంచంలో కొన్ని స్టాక్స్ సమ్థింగ్ స్పెషల్గా నిలుస్తున్నాయి. ఊహించని రీతిలో రిటర్నులను అందిస్తూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో చెప్పినట్టు ఒక్క ఏడాదిలో కోటీశ్వరుడు కావడానికి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం స్టాక్ మార్కెట్. అయితే, ఇందులో ఏదైనా తేడా జరిగిన కూడా బికారి అవ్వడం కూడా ఖాయం. ఇది అలా ఉంటే.. ఒక కంపెనీ షేర్లు మాత్రం ప్రస్తుతం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. వాళ్లు ఊహించని రీతిలో లాభాలు తెచ్చిపెడుతుంది. ఆ కంపెనీ పేరు వచ్చేసి టాటా ఎలెక్సి లిమిటెడ్(Tata Elxsi stock). ఈ కంపెనీ షేరు ధర నేడు బీఎస్ఈలో 7.55 శాతం పెరిగి రూ.9,078 వద్ద తాజా గరిష్టాన్ని తాకింది. గత రెండు రోజుల్లో లార్జ్ క్యాప్ స్టాక్ 17.18 శాతం లాభపడింది. కేవలం ఇవ్వాళ ఒక్కరోజే ఈ షేర్ విలువ రూ.571 పైగా లాభపడింది. టాటా ఎలెక్సి నేడు రూ.9,010 వద్ద ఉంది. అయితే, కరోనా వచ్చిన ఏడాది మార్చి నెలలో దీని స్టాక్ ధర మీరు షాక్ అవ్వాల్సిందే. 2020 మార్చి 27 తేదీన దీని ధర అప్పుడు రూ.639.10లుగా ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ కంపెనీ షేర్ విలువ 14 రేట్లకు పైగా పెరగడం విశేషం. అంటే.. 2020 మార్చిలో ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.14 లక్షలుగా మారనుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు విలువ 52.19 శాతం లాభపడగా, ఏడాదిలో 237.07 శాతం పెరిగింది. బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.55,812 కోట్లకు పెరిగింది. (చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. పెరగనున్న గృహ ధరలు!) -
ఉక్రెయిన్- రష్యా యుద్ధం: ఈ వారం స్టాక్ మార్కెట్ల దారెటు?
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారమూ దిద్దుబాటు (కరెక్షన్) కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ ముగింపు తేదీ, మార్చి వాహన విక్రయాలు గణాంకాలు, కీలక ఆర్థిక గణాంకాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించవచ్చు. ఇక అంతర్జాతీయంగా ఉక్రెయిన్–రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం, నిరంతర పెరుగుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంట్పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్పైనా మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. ‘‘గత కొన్ని ట్రేడింగ్ సెషన్ల నిఫ్టీ 17,000–17,450 పాయింట్ల రేంజ్లో కదలాడుతోంది. ఈ శ్రేణిని చేధిస్తేనే తదుపరి స్థాయిలను అంచనా వేయవచ్చు’’ అని నిపుణులు చెబుతున్నారు. ఆటో, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో గతవారంలో సెన్సెక్స్ 502 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్లను నష్టాలను చవిచూశాయి. దీంతో సూచీల రెండువారాల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఈ వారం మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలు.... రష్యా ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్, రష్యాల యుద్ధం ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. శాంతి చర్చలు క్లిష్టం గా సాగుతున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. రష్యా దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. జీ–20 కూటమి నుండి రష్యాను బహిష్కరించేందుకు ఆయా దేశాలతో చర్చలు జరుపుతామని యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. కాల్పుల విరమణ చర్చల సఫలవంతం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కీలకంగా ఆర్థిక, ఆటో అమ్మక గణాంకాలు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఫిబ్రవరి ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయాలు, వ్యయాల మధ్య బేధం) గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. అదేరోజున మౌలిక రంగాల వృద్ధిగా పిలిచే ఎనిమిది రంగాల ఉత్పత్తి(ఫిబ్రవరి)డేటా వెల్లడి అవుతుంది. దేశీయ ఆటో కంపెనీలు శుక్రవారం మార్చి నెలతో గతేడాది పాటు 2021 ఆర్థిక సంవత్సరపు వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. ఈ కీలకమైన ఈ గణాంకాల విడుదలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. గురువారం ఎఫ్అండ్ఓ ముగింపు ఈ గురువారం(మార్చి 31న) నిఫ్టీ సూచీకి చెందిన మార్చి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ పరిణామాలు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్పై ప్రభావాన్ని చూపవచ్చు. అంతర్జాతీయంగా కోవిడ్ కేసులు తిరిగి పెరుగుతున్నాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు ఆటంకం కలుగవచ్చనే అంచనాల నడుమ ఇప్పటికే క్రూడాయిల్ ధర భారీ పెరిగాయి. చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వినియోగ విశ్వాస, నిరుద్యోగ, చమురు నిల్వల డేటాతో పాటు కీలకమైన క్యూ4 జీడీపీ గణాంకాలు ఈ వారంలో విడుదల అవుతాయి. జపాన్ నిరుద్యోగ గణాంకాలు మంగవారం, యూరోజోన్ పారిశ్రామిక డేటా బుధవారం వెల్లడికానున్నాయి. వీటితో పాటు ఆయా దేశాలు విడుదల చేసే కీలక ఆర్థిక గణాంకాల ఆధారంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కదలాడవచ్చు. మూడు నెలల్లో రూ.లక్ష కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కి.. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలతో భారత మూలధన మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు గడిచిన మూడునెలల్లో రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎఫ్ఐఐలు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా రూ.28,526 కోట్లు, రూ.38,068 కోట్లు, రూ.48,261 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాం కాలు వెల్లడించాయి. ‘‘ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతులు తక్కువగా ఉంటడంతో యుద్ధ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పరిమితంగానే ఉంది. అయితే అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఇంధన, మెటల్స్, వ్యవసాయ తదితర కమోడిటీ ఉత్పత్తుల ధరలు దేశీయ కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయి’’ కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ సుబానీ కురియన్ తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు పదిశాతం పెరిగితే దేశీయ కరెంట్ అకౌంట్ ద్రవ్యలోటు 30 బేసిస్ పాయింట్ల, సీపీఐ ద్రవ్యోల్బణం 40 బేసిస్ పాయింట్లు మేర పెరగవచ్చని కురియన్ పేర్కొన్నారు. -
యుద్ధం, కోవిడ్–19పై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ అంశాలపై అధికంగా ఆధారపడనున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా మరోసారి ఆటుపోట్లను చవిచూడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అధిక శాతం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశమున్నట్లు అత్యధికులు అంచనా వేశారు. దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలు లేకపోవడం దీనికి కారణంకాగా.. రష్యా– ఉక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న యుద్ధం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మరోపక్క ఇటీవల చైనాలో తలెత్తిన కోవిడ్–19 కొత్త వేరియంట్ కొన్ని యూరోపియన్ దేశాలకూ విస్తరించనున్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేయవచ్చని తెలియజేశారు. ఈ నెల 14న ప్రారంభమైన బడ్డెట్ రెండో దశ చర్చలకూ ప్రాధన్యమున్నట్లు తెలియజేశారు. ఎఫ్పీఐల ఎఫెక్ట్ గత కొద్ది రోజులుగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపనున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ వారం మార్కెట్లు ర్యాలీ బాటలో సాగవచ్చని చెబుతున్నారు. దేశీయంగా ప్రధాన అంశాలు కొరవడిన నేపథ్యంలో ప్రపంచ సంకేతాలే మార్కెట్లను నడిపించవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, చైనాలో కరోనా పరిస్థితులు, చమురు ధరల కదలికలు వంటివి కీలకమని వ్యాఖ్యానించారు. యుద్ధ పరిస్థితులు ముదరడం, కోవిడ్–19 సవాళ్లు పెరగడం వంటి అంశాలు సెంటిమెంటును దెబ్బతీయవచ్చని తెలియజేశారు. చమురు కీలకం రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరాయి. ఈ నెల మొదటి వారంలో 130 డాలర్లను అధిగమించి 2008 తదుపరి గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీనికితోడు డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. 75.5–76 స్థాయిలో కదులుతోంది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లను దేశీ ఇండెక్సులు అనుసరించవచ్చని శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యెషా షా పేర్కొన్నారు. దేశీ ఆర్థిక పరిస్థితులను చమురు ధరలు ప్రభావితం చేయగలవని, దీంతో వీటి కదలికలను ఇన్వెస్టర్లు సునిశితంగా పరిశీలించే వీలున్నదని వివరించారు. భారత్ భేష్ వర్థమాన మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ఇప్పటికే కనిష్ట స్థాయిల నుంచి పటిష్ట ర్యాలీ చేశాయని, దీంతో ఎఫ్పీఐలు తిరిగి కొనుగోళ్లవైపు దృష్టిపెట్టే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లు మరింత పురోగమించేందుకు దారిచూపవచ్చని విశ్లేషించారు. అంతేకాకుండా మార్కెట్లు ఇప్పటికే యుద్ధ భయాలను డిస్కౌంట్ చేశాయన్నారు.. కాగా.. సమీపకాలంలో దేశీ మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చన్నది కొటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ ఈక్విటీ హెడ్ హేమంత్ అంచనా. గత వారం స్పీడ్ గత శుకవ్రారం(18న) హోలీ సందర్భంగా సెలవుకావడంతో 17తో ముగిసిన వారంలో దేశీ స్టాక్ మార్కెట్లు 4 శాతం జంప్చేశాయి. సెన్సెక్స్ 2,314 పాయింట్లు దూసుకెళ్లి 57,864 వద్ద ముగిసింది. నిఫ్టీ 657 పాయింట్లు జంప్చేసి 17,287 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 2 శాతంపైగా ఎగశాయి. -
ఆరంభం అదిరింది
ముంబై: కొత్త ఏడాది తొలిరోజు కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్ కళకళలాడింది. దీంతో సూచీలు ఈ ఏడాది(2022)కి లాభాలతో స్వాగతం పలికాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి మన మార్కెట్లు సానుకూలతలను అందిపుచ్చుకున్నాయి. క్రిస్మస్, నూతన సంవత్సర సెలవుల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. దేశీయంగా డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు, నెలవారీ వాహన విక్రయ గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి రికవరీ కలిసొచ్చింది. దేశంలో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఈ పరిణామాలతో ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నా.., ఇన్వెస్టర్లు రిస్క్ వైఖరి ప్రదర్శిస్తూ కొనుగోళ్లకే మొగ్గుచూపారు. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 929 పాయింట్లు పెరిగి డిసెంబర్ 13వ తేదీ తర్వాత తొలిసారి 59వేల స్థాయి పైన 59,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 271 పాయింట్లు ర్యాలీ చేసి 17,626 వద్ద నిలిచింది. తద్వారా మూడు వారాల్లో సూచీలు అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. అలాగే సూచీలకిది రెండో రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. ఫార్మా షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ రంగ షేర్లు మాత్రమే అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో ఐదు షేర్లు మాత్రమే నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న బ్యాంకింగ్ షేర్లలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగాయి. చిప్ కొరత కష్టాలను అధిగమిస్తూ వాహన కంపెనీలు పరిశ్రమ అంచనాలకు మించి అమ్మకాలను సాధించడంతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.903 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను కొన్నారు. ఇంట్రాడే నష్టాలను రికవరీ చేసుకొని రూపాయి మూడు పైసలు బలపడి 74.26 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఆర్థిక రివకరీ ఆశలతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఏడాది తొలి సెషన్లో లాభాల బాటపట్టాయి. బ్రిటన్, చైనా, జపాన్ ఆస్ట్రేలియా మార్కెట్లకు సెలవు. గతేడాదిలో 27 శాతం లాభాల్ని పంచిన అమెరికా మార్కెట్లు అదే జోష్ను కనబరుస్తూ లాభాలతో కదలాడుతున్నాయి. రోజంతా లాభాలే... స్టాక్ సూచీలు 2022 ఏడాది తొలి రోజు ట్రేడింగ్ను లాభాలతో మొదలుపెట్టాయి. సెన్సెక్స్ 56 పాయింట్ల లాభంతో 58,310 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 17,387 వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి విస్తృత కొనుగోళ్లు జరగడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,012 పాయింట్లు ర్యాలీ చేసి 59,266 వద్ద, నిఫ్టీ 293 పాయింట్లు దూసుకెళ్లి 17,647 వద్ద గరిష్టాల తాకాయి. ఇవి సూచీలకు ఆరు వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చివరిదాకా కొనుగోళ్లకే కట్టబడటంతో సూచీలు ఏ దశలో వెనకడుగు వేయలేదు. రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో కొత్త ఏడాది తొలి రోజు రూ.3.49 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.269 లక్షల కోట్లుగా నమోదైంది. ‘వ్యాక్సిన్ వేగవంతం చర్యల నుంచి బుల్ జోష్ను అందిపుచ్చుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. కోవిడ్ సంబంధిత వార్తలు, ప్రపంచ మార్కెట్ల తీరు రానున్న రోజుల్లో సూచీ ల గమనాన్ని నిర్దేశిస్తాయి. మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్ ఇండెక్స్ వరుసగా మూడో రోజూ బలపడటం ఆందోళన కలిగిస్తోంది. నిఫ్టీ సాంకేతికంగా అప్ట్రెండ్లో 17,750 స్థాయి వద్ద కీలక నిరోధం ఉండొచ్చు’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్ రంగనాథన్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు n డిసెంబర్లో ఉత్పత్తి పెరిగిందనే కంపెనీ ప్రకటనతో కోల్ ఇండియా షేరు ఆరు శాతానికి పైగా లాభపడి రూ.155 వద్ద స్థిరపడింది. n ఎన్సీడీల ద్వారా రూ.456 కోట్లను సమీకరించడంతో ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ షేరు ఐదుశాతం పెరిగి రూ.75 వద్ద ముగిసింది. n ఐటీ షేర్లలో భాగంగా టీసీఎస్ షేరు రాణించింది. బీఎస్ఈలో రెండు శాతం లాభపడి రూ.3,818 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రెండున్నర ర్యాలీ చేసి రూ.3829 వద్ద 13 వారాల గరిష్టాన్ని అందుకుంది. -
షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు
ముంబై: స్టాక్ సూచీలు నవంబర్ సిరీస్కు లాభాలతో వీడ్కోలు పలికాయి. డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల జరగడంతో గురువారం సెన్సెక్స్ 454 పాయింట్లు పెరిగి 58,795 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 17,536 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు ఆరుశాతం రాణించి సూచీల ర్యాలీకి అండగా నిలిచింది. మూడీస్తో సహా పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవుట్లుక్ను అప్గ్రేడ్ రేటింగ్కు సవరించడంతో సెంటిమెంట్ మరింత బలపడింది. ఇంధన, ఫార్మా, ఐటీ, మీడియా, మెటల్, రియల్టీ, షేర్లు లాభపడ్డాయి. నవంబర్ ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు సందర్భంగా ట్రేడర్లు తమ పొజిషన్లను మార్చుకోనే (స్క్యేయర్ ఆఫ్, రోలోవర్) క్రమంలో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2300 కోట్ల షేర్లను విక్రయించారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1368 కోట్ల షేర్లను కొన్నారు. బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో షేర్లు నష్టపోయాయి. వీలైనంత తొందర్లో ఉద్దీపన ఉపసంహరణ చర్యలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫెడ్ రిజర్వ్ తన మినిట్స్లో తెలపడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 12 పైసలు బలపడి 74.52 వద్ద స్థిరపడింది. తడబడినా.., నిలబడ్డాయ్..! ఒకరోజు నష్టం తర్వాత స్టాక్ మార్కెట్ ఉదయం స్వల్ప లాభంతో మొదలైంది. సెన్సెక్స్ ఉదయం 23 పాయింట్ల లాభంతో 58,364 వద్ద, నిఫ్టీ రెండు పాయింట్ల పెరిగి 17,417 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని బలహీనతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాల మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీయడంతో తొలి అరగంటలోనే సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 198 పాయింట్లును కోల్పోయి 58,143 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు పతనమైన 17,352 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. మిడ్సెషన్ నుంచి రిలయన్స్ షేరు జోరు కనబరచడంతో పాటు ట్రేడర్లు షార్ట్ కవరింగ్ చేపట్టడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మార్కెట్ ముగిసే వరకు ట్రేడర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో సూచీలు లాభాల్లో ముగించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు... సౌదీ ఆరాంకో ఒప్పంద రద్దుతో ఈ వారం ఆరంభం నుంచి నష్టాలను చవిచూస్తున్న రిలయన్స్ షేరు గురువారం భారీగా పెరిగింది. షార్ట్ కవరింగ్ జరగడంతో షేరు ఇంట్రాడేలో ఆరున్నర శాతం ర్యాలీ చేసి రూ.2503 స్థాయిని అందుకుంది. చివరికి 6% లాభపడి రూ.2,494 వద్ద ముగిసింది. గ్యాసిఫికేషన్ అండర్టేకింగ్ను పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థకి బదిలీ చేసేందుకు బోర్డు నిర్ణయించుకోవడం కూడా షేరు ర్యాలీకి కలిసొచ్చినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► యాంకర్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో పేటీఎం షేరు మూడోరోజూ ర్యాలీ చేసింది. బీఎస్ఈలో రెండుశాతం ర్యాలీ చేసి రూ.1797 వద్ద ముగిసింది. ► బైబ్యాక్ ప్రణాళికకు బోర్డు ఓకే చెప్పొచ్చనే అంచనాలతో వేదాంత షేరు ఆరుశాతం లాభపడి రూ.368 వద్ద స్థిరపడింది. ► సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడంతో సీమైన్స్ షేరు ఐదున్నర శాతం నష్టంతో రూ.2152 వద్ద నిలిచింది. -
7వ రోజూ భలే దూకుడు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో అలుపెరుగకుండా రంకెలేస్తున్న బుల్ మరోసారి విజృంభించింది. సూచీలు వరుసగా 7వ రోజూ హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు ఎగసి 61,766 వద్ద నిలవగా.. నిఫ్టీ 139 పాయింట్లు ఎగసి 18,477 వద్ద ముగిసింది. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఐటీలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మిడ్సెషన్కల్లా సెన్సెక్స్ 61,963కు చేరగా.. నిఫ్టీ 18,543 పాయింట్లను అధిగమించింది. వెరసి అటు ముగింపు, ఇటు ఇంట్రాడేలోనూ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి! విదేశీ మార్కెట్లలో కనిపిస్తున్న నిరుత్సాహకర ట్రెండ్ను సైతం లెక్కచేయకుండా సరికొత్త గరిష్టాలను చేరాయి. ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 4 శాతం జంప్చేయగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ నేపథ్యంలో ఫార్మా, హెల్త్కేర్, మీడియా ఇండెక్సులు 0.7% బలహీనపడ్డాయి. ఇన్ఫోసిస్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఇన్ఫోసిస్ 5 శాతం స్థాయిలో జంప్చేయగా.. టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, మారుతీ, యాక్సిస్, ఎస్బీఐ 3.3–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ఎంఅండ్ఎం, హెచ్సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, హీరో మోటో, సిప్లా, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా 2–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. ఈ ఏడాది క్యూ3(జులై–సెప్టెంబర్)లో చైనా జీడీపీ గణాంకాలు నిరాశపరచినప్పటికీ ఎంపిక చేసిన రంగాలలోని బ్లూచిప్ కౌంటర్లలో పెట్టుబడులు సెంటిమెంటుకు బలాన్నిచి్చనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. క్యూ3లో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతమే పుంజుకుంది. ఇందుకు పారిశ్రామికోత్పత్తి అంచనాలను అందుకోకపోవడం ప్రభావం చూపింది. బేస్ మెటల్ ధరలు బలపడటంతో మెటల్ షేర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. చిన్న షేర్లు ఓకే... బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం స్మాల్ క్యాప్ 0.7 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,758 లాభపడగా.. 1,696 నీరసించాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నికరంగా రూ. 512 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,704 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ఇతర విశేషాలు.. ► పారస్ డిఫెన్స్ షేరు టీ గ్రూప్ నుంచి రోలింగ్ విభాగంలోకి బదిలీ కావడంతో 20% అప్పర్ సర్క్యూట్ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 125 జమ చేసుకుని రూ. 750 వద్ద ముగిసింది. ► ఈ ఏడాది క్యూ2లో రెట్టింపు నికర లాభం ప్రకటించిన ఎవెన్యూ సూపర్మార్ట్స్(డీమార్ట్) షేరు తొలుత 11 శాతం దూసుకెళ్లి రూ. 5,900ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివర్లో లాభాల స్వీకరణ ఊపందుకుని చతికిలపడింది. 7.6% పతనమై రూ. 4,920 వద్ద స్థిరపడింది. ► కార్లయిల్ గ్రూప్నకు ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చుకునే ప్రతిపాదనను విరమించుకోవడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్కు చేరింది. ఎన్ఎస్ఈలో రూ. 32 కోల్పోయి రూ. 607 వద్ద నిలిచింది. ► ఏడు వరుస సెషన్లలో మార్కెట్లు బలపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 12.49 లక్షల కోట్లమేర ఎగసింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,74,69,607 కోట్లకు చేరింది. ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం! ► గత ఏడు రోజుల్లో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2,576 పాయింట్లు(4.4 శాతం) దూసుకెళ్లింది. -
9 నెలల్లో రెండు దశాబ్దాల రికార్డ్
న్యూఢిల్లీ: బుల్లిష్గా ఉన్న ఇన్వెస్టర్ల సెంటిమెంటును ప్రతిబింబిస్తూ దేశీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. ఈ కేలండర్ ఏడాది(2021) తొలి 9 నెలల్లో 72 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. తద్వారా జనవరి– సెపె్టంబర్ మధ్య కాలంలో 970 కోట్ల డాలర్ల(రూ. 72,500 కోట్లు)ను సమీకరించాయి. వెరసి రెండు దశాబ్దాల తదుపరి అత్యధిక పెట్టుబడులను సమకూర్చుకున్నాయి. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ప్రోత్సాహకర పరిస్థితులు దోహదం చేసినట్లు కన్సలి్టంగ్ కంపెనీ ఈవై తాజాగా రూపొందించిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం గ్లోబల్ ట్రెండ్ మద్దతుతో దేశీయంగా క్యూ3(జులై–సెపె్టంబర్)లో లావాదేవీల సంఖ్య మరింత జోరందుకుంది. 72 ఐపీవోలలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల విభాగం నుంచి 15, కన్జూమర్ ప్రొడక్ట్స్ రిటైల్ విభాగం నుంచి 11 చొప్పున కంపెనీలు నిధులను సమీకరించాయి. 31 ఐపీవోలు సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో 31 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. తద్వారా 5 బిలియన్ డాలర్లను సమకూర్చుకున్నాయి. వీటిలో డైవర్సిఫైడ్ ఇండ్రస్టియల్ ప్రొడక్టుల నుంచి 8 కంపెనీలు, టెక్నాలజీ విభాగం నుంచి 5 సంస్థలు పెట్టుబడులను సమీకరించాయి. ఈ రంగాల నుంచి జొమాటో, నువోకో విస్టాస్ కార్ప్, కెమ్ప్లాస్ట్ సన్మార్ భారీ ఇష్యూలను చేపట్టాయి. 2017 నాలుగో త్రైమాసికం తదుపరి దేశీ మార్కెట్లో ఈ క్యూ3 అత్యధిక లావాదేవీలకు నెలవైనట్లు ఈవై నిపుణులు ప్రశాంత్ సింఘాల్ తెలియజేశారు. కాగా.. ఇంతక్రితం 2018 తొలి 9 నెలల్లో ప్రైమరీ మార్కెట్ ద్వారా 130 కంపెనీలు నిధులను అందుకున్నాయి. అక్టోబర్–డిసెంబర్(క్యూ4)లోనూ కొత్తతరం, టెక్నాలజీ ఆధారిత కంపెనీలు ఐపీవోలకు రానున్నట్లు సింఘాల్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల సెన్సెక్స్ 60,000 పాయింట్ల మార్క్ను సైతం అధిగమించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా జులై–సెపె్టంబర్లో 2020 క్యూ3తో పోలిస్తే డీల్స్ 11 శాతం అధికమయ్యాయి. 2007లో నమోదైన గరిష్ట డీల్స్తో పోలిస్తే మరింత అధికంగా 18 శాతం పుంజుకున్నాయి. 2021 క్యూ3లో 547 ఐపీవోల ద్వారా కంపెనీలు 106.3 బిలియన్ డాలర్లు సమకూర్చుకున్నాయి. తొలి 9 నెలల్లో చూస్తే 1,635 కంపెనీలు 331 బిలియన్ డాలర్ల విలువైన పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఇది కంపెనీలలో 87 శాతం, పెట్టుబడుల సమీకరణలో 99 శాతం వృద్ధి. తొలి 9 నెలల్లో ప్రపంచవ్యాప్త ఐపీవో సమీకరణ నిధుల్లో 3 శాతం(9.7 బిలియన్ డాలర్లు) వాటాను దేశ మార్కెట్ ఆక్రమించింది. ఐపీవోల సంఖ్యలో అయితే 4.4 శాతానికి చేరింది. ఇక గ్లోబల్ మార్కెట్లలోనూ 2020 పూర్తి ఏడాదితో పోలిస్తే క్యూ3లో డీల్స్తోపాటు, నిధుల సమీకరణ అత్యధికంగా నమోదుకావడం విశేషం! -
ఆర్బీఐ అండతో 60 వేల పైకి..
ముంబై: ఆర్థిక వృద్ధికి కట్టుబడుతూ ఆర్బీఐ కమిటీ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు స్టాక్ మార్కెట్ను మెప్పించాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 381 పాయింట్లు పెరిగి 60 వేల స్థాయిపైన 60,059 వద్ద ముగిసింది. నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 17,895 వద్ద నిలిచింది. తాజా ముగింపు నిఫ్టీ సూచీకి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. అధిక వెయిటేజీ రిలయన్స్ షేరు నాలుగు శాతానికి పైగా రాణించి సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచింది. దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ క్యూ2 ఆర్థిక ఫలితాల ప్రకటనకు ముందు టెక్నాలజీ షేర్లు దుమ్ములేపాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఆయిల్అండ్గ్యాస్, ఆటో షేర్ల కౌంటర్లూ కొనుగోళ్లతో కళకళలాడాయి. అయితే ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.64 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు 168 కోట్ల షేర్లను అమ్మారు. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1293 పాయింట్లు, నిఫ్టీ 363 పాయింట్లు పెరిగాయి. అమెరికా ఉద్యోగ గణాంకాల వెల్లడికి ముందు(శుక్రవారం) అంతర్జాతీయ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్నాయి. రెండు రోజుల్లో రూ.4.16 లక్షల కోట్లు... స్టాక్ మార్కెట్లో గడిచిన రెండో రోజుల్లో రూ.4.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.266.36 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరినట్లైంది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 869 పాయింట్లు, నిఫ్టీ 249 పాయింట్లు పెరిగింది. రిలయన్స్ నాలుగు శాతం జంప్... అమెరికాకు చెందిన 7–లెవెన్ కనీ్వనియెన్స్ తొలి స్టోర్ను అక్టోబర్ 9న ముంబైలో ప్రారంభించనున్నట్లు అనుబంధ సంస్థ ఆర్ఆర్వీఎల్ ప్రకటనతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు నాలుగు శాతం లాభపడి రూ.2,671 వద్ద ముగిసింది. -
కంపెనీల్లో మోసాలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయ్
ముంబై: ఇటీవల ఓవైపు ఈక్విటీలలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుంటే.. మరోపక్క కంపెనీలలో మోసాలు సైతం అధికంగా బయటపడుతున్నట్లు సెబీ అధికారి ఎస్కే మొహంతీ పేర్కొన్నారు. ఇది ప్రమాదకర ట్రెండ్ అంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్టైమ్ డైరెక్టర్ మొహంతీ వ్యాఖ్యానించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో భాగంగా ప్రసంగిస్తూ వీటికి చెక్ పెట్టవలసిన అవసరమున్నదని స్పష్టం చేశారు. క్రోల్ పాయింట్స్ నిర్వహించిన ఒక సర్వేను ప్రస్తావిస్తూ ఈ ఏడాది 65 శాతం కంపెనీలలో మోసాలు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లలో 1.5 కోట్లమంది కొత్త రిటైల్ ఇన్వెస్టర్లు ప్రవేశించినట్లు తెలియజేశారు. రిటైలర్లు పెట్టుబడుల కొనసాగింపులో సహనంతో వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే మోసాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు చాలా చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. దీంతో ఇన్వెస్టర్లలో చైతన్యం, అవగాహన, విజ్ఞానం వంటి అంశాలను పెంపొందించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. మోసాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ముచేయడంతోపాటు, పెట్టుబడుల విలువనూ దెబ్బతీస్తాయని మొహంతీ వివరించారు. షేర్ల ధరలపై ప్రభావం చూపగల సమాచారాన్ని పొందడం ద్వారా కొంతమంది తమకు సంబంధించిన వ్యక్తులు లబ్ది పొందేందుకు సహకరిస్తుంటారని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు ఇకముందు మరింత పెరిగే వీలున్నదని అభిప్రాయపడ్డారు. అయితే మోసాలకు పాల్పడేవారికి చెక్ పెట్టే బాటలో సెబీ నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు తెలియజేశారు. దీనిలో భాగంగానే సాధారణ దర్యాప్తు విభాగం నుంచి గతేడాది కార్పొరేట్ మోసాల పరిశోధన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఐబీ వెంచర్స్కు జరిమానా ఇండియాబుల్స్ వెంచర్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఒక సంస్థతోపాటు.. కంపెనీ సీఈవోసహా నలుగురికి సెబీ జరిమానా విధించింది. కంపెనీ షేర్లకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణల కేసు సెటిల్మెంట్ చార్జీల కింద రూ. 5 కోట్ల జరిమానా చెల్లించమంటూ ఆదేశించింది. సెటిల్మెంట్కు దరఖాస్తు చేసుకున్నవారిలో కంపెనీ సీఈవో దివ్యేష్ బి.షాతోపాటు మరో ముగ్గురు బంధువులున్నారు. అంతేకాకుండా విక్రమ్ ఎల్ దేశాయ్ హెచ్యూఎఫ్ సైతం దరఖాస్తు చేసింది. 2018 ఏప్రిల్ 2–23 మధ్య కంపెనీ ఆర్థిక ఫలితాలు, డివిడెండ్ అంశంలో సమాచారాన్ని దుర్వినియోగ పరచినట్లు దర్యాప్తు వెల్లడించింది. సెలిబ్రస్ కమోడిటీస్కు షాక్ జాతీయ స్పాట్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈఎల్)లో చట్ట విరుద్ధంగా కాంట్రాక్టులు చేపట్టేందుకు క్లయింట్లను అనుమతించిన కేసులో సెలిబ్రస్ కమోడిటీస్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు సెబీ ప్రకటించింది. కాంట్రాక్టులను అనుమతించడంలో నిబంధనలకు నీళ్లొదిలి అవకతవకలకు పాల్పడటంతో రిజిస్ట్రేషన్ రద్దు నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్ఎస్ఈలో సభ్యత్వం కలిగిన బ్రోకింగ్ సంస్థ సెలిబ్రస్ కమోడిటీస్ పెయిర్డ్ కాంట్రాక్టుల నిర్వహణకు అనుమతులు పొందింది. -
మరో సంచలనం.. బాహుబుల్ 60000
ముంబై: స్టాక్ మార్కెట్లో శుక్రవారం మరో సంచలనం చోటుచేసుకుంది. సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్లలో సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 60 వేల మైలురాయిని అధిగమించింది. కొంతకాలంగా దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. ఆర్బీఐ సరళతర ద్రవ్య విధానానికి కట్టుబడింది. ప్రపంచ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు అందుతున్నాయి. కోవిడ్తో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం అన్ని రంగాలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. దీంతో దలాల్ స్ట్రీట్ కొన్ని వారాలుగా కొనుగోళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ కొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. మార్కెట్లో పండుగ వాతావరణం... దేశీయ మార్కెట్లోని సానుకూలతలతో స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 60 వేలపైన 60,159 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 17,897 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. సూచీలు ఆరంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించడంతో స్టాక్ మార్కెట్లలో పండుగ వాతావరణం కనిపించింది. ఆటో, ఆర్థిక, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ మిడ్సెషన్లో కొంతసేపు మినహా రోజంతా 60 వేల స్థాయిపైనే ఉంది. ఇంట్రాడేలో 448 పాయిం ట్లు పెరిగి వద్ద 60,315 జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. చివరికి 163 పాయింట్ల లాభంతో 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 వేల స్థాయిని అందుకునే ప్రయత్నం చేసినా... గరిష్టాల వద్ద నిరోధం ఎదురవడంతో ఈ స్థాయిని అందుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్లో 125 పాయింట్లు పెరిగి 17,948 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలు ఆరంభలాభాల్ని కోల్పో యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.422 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.516 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సూచీలకు ఐదోవారామూ లాభాలే... బుల్ రన్లో భాగంగా సూచీలు ఐదోవారమూ లాభాలను గడించాయి. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు 1.5% చొప్పున ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1033 పాయింట్లు, నిఫ్టీ 268 పాయింట్లు ఎగిశాయి. సెన్సెక్స్ 60,000 స్థాయిని అందుకోవడమనేది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోంది. కోవిడ్ సమయంలో సంపన్న దేశాలు అనుసరించిన సరళీకృత ద్రవ్యపాలసీ విధాన వైఖరి, వడ్డీరేట్ల సడలింపు తదితర అవకాశాలను అందిపుచ్చుకున్న భారత్ ప్రపంచంలో ఆర్థిక అగ్రగామి రాజ్యంగా ఎదుగుతోంది. – అశిష్కుమార్ చౌహాన్, బీఎస్ఈ ఎండీ, సీఈవో -
మార్కెట్కు ఫెడ్ బూస్ట్
ముంబై: దలాల్ స్ట్రీట్ గురువారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొనుగోళ్ల అండతో ట్రేడింగ్ ఆద్యంతం ఉత్సాహాంగా ఉరకలేసింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో స్టాక్ సూచీలు నాలుగు నెలల్లో అత్యధిక లాభాల్ని ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి రికవరీ 23 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఒక్క మీడియా మినహా అన్ని రంగాల కౌంటర్లకు డిమాండ్ నెలకొనడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 1030 పాయింట్లు పెరిగి 59,957 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 958 పాయింట్ల లాభంతో 59,885 వద్ద ముగిసింది. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఆరు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ 297 పాయింట్లు ఎగసి 17,844 వద్ద కొత్త ఆల్టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 276 పాయింట్ల లాభంతో 17,823 వద్ద స్థిరపడింది. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ షేర్లు వంటి లార్జ్క్యాప్ షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.358 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,173 కోట్ల షేర్లను కొన్నారు. డాలరు మారకంలో రూపాయి విలువ 73.64 వద్ద నిలిచింది. రాకెట్లా దూసుకెళ్లిన సూచీలు... ఆసియా మార్కెట్ల నుంచి సానకూల సంకేతాలు అందుకున్న దేశీయ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 431 పాయింట్ల లాభంతో 59,358 వద్ద, నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 17,671 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం నుంచీ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బుల్ ఏ దశలోనూ తన పట్టు కోల్పోలేదు. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్, ఐటీ వంటి కీలక రంగాల షేర్లకు డిమాండ్ లభించడంతో సూచీలు రాకెట్లా దూసుకెళ్లాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1030 పాయింట్లు, నిఫ్టీ 297 పాయింట్లను ఆర్జించగలిగాయి. అయితే ట్రేడింగ్ చివర్లో సూచీలు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సూచీల లాభాలకు కారణాలివే... చైనా ఎవర్ గ్రాండే సంక్షోభంపై గ్రూప్ చైర్మన్ హుయి కా యువాన్ వివరణ ఇచ్చారు. ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి చైనా పీపుల్స్ బ్యాంక్ 17 బిలియన్ డాలర్లను చొప్పించింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లే యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. బాండ్ల కొనుగోళ్లను నవంబర్ నుంచి తగ్గిస్తామనే ఫెడ్ నిర్ణయాన్ని ఈక్విటీ మార్కెట్లు అప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితిని తొలగించి సానుకూలతలను నెలకొల్పాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఇటీవల కేంద్రం పలు రంగాల్లో సంస్కరణల పర్వానికి తెరతీయడం మార్కెట్కు జోష్ నిచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపుతుండటం మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతుంది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► జీ ఎంటర్టైన్మెంట్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. బీఎస్ఈలో ఐదున్నర శాతం నష్టపోయి రూ.318 వద్ద ముగిసింది. ► యూఎస్ సంస్థ బ్లింక్ను కొనుగోలు చేయడంతో ఎంఫసిస్ షేరు మూడు శాతం ర్యాలీ చేసి రూ.3,339 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.3392 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ► వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి 500 సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సుల తయారీకి ఆర్డర్లను దక్కించుకోవడంతో జేఎంబీ ఆటో షేరు 12 శాతం లాభపడి రూ.516 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 17 శాతం ర్యాలీ చేసి రూ.537 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ఒక్క రోజులో రూ.3.16 లక్షల కోట్లు ప్లస్ సూచీలు నాలుగునెలల్లో అతిపెద్ద ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. స్టాక్ మార్కెట్లో ఒక్కరోజులోనే రూ.3.16 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.261.73 లక్షల కోట్లకు చేరింది. -
ఈ వారం స్టాక్ మార్కెట్.. ప్రపంచ పరిణామాలే కీలకం
ముంబై: దేశీయంగా స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం సూచీలకు ప్రపంచ పరిణామాలే దిశా నిర్ధేశం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశం మంగళవారం(సెప్టెంబర్ 21న) మొదలై బుధవారం ముగిస్తుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల వైపు నుంచి చూస్తే ఎఫ్ఓఎంసీ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. అలాగే బ్యాంక్ జపాన్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఈ బుధవారమే వెల్లడికానున్నాయి. దేశంలో కోవిడ్ మూడో దశకు సంబంధించిన వార్తలను మార్కెట్ వర్గాలు పరిశీలించవచ్చు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్లు తీరుతెన్నులు తదితర సాదారణ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గత వారంలో కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం స్టాక్ మార్కెట్పై ఈ వారమూ కొనసాగే అవకాశం ఉంది. బ్యాడ్బ్యాంక్ రూపకల్పనకు కేబినేట్ ఆమోదం తెలపడంతో బ్యాంకింగ్ షేర్ల ర్యాలీ కొనసాగవచ్చు. ఆటో రంగానికి రూ.26,058 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) కేటాయింపుతో కొంతకాలంగా స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్న ఆటో షేర్లు లాభాల బాట పట్టొచ్చు. అలాగే ప్రభుత్వ కంపెనీలకు చెందిన షేర్లు రాణించే వీలుంది. ‘‘స్టాక్ సూచీలు అధిక విలువ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ వారాన్ని లాభాల స్వీకరణతో ప్రారంభించవచ్చు. స్థిరీకరణ కోసం జరిగే ప్రయత్నంలో భాగంగా ఒడిదుడుకులతో పరిమిత శ్రేణిలో కదలాడవచ్చు. సాంకేతికంగా నిఫ్టీకి తక్షణ నిరోధ స్థాయి 17,900 వద్ద ఉంది. ఒకవేళ లాభాల స్వీకరణ చోటుచేసుకుంటే 17,400 తక్షణ మద్దతు స్థాయికి దిగిరావచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 17,200 వద్ద మరో కీలక తక్షణ మద్దతు ఉంది’’ అని సామ్కో రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. పీఎల్ఐ పథకం, బ్యాడ్బ్యాంక్, టెలికాం రంగానికి ప్రోత్సాహకాల కేటాయింపుతో గతవారంలో సెన్సెక్స్ 710 పాయింట్లు, నిఫ్టీ 216 పాయింట్లు లాభపడ్డాయి. 21న పరాస్ ఐపీఓ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ మంగళవారం(సెప్టెంబర్ 21) మొదలై గురువారం ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణిని రూ.165 – 175 గా నిర్ణయించారు. అప్పర్ బ్యాండ్ ధర ప్రకారం పబ్లిక్ ఇష్యూ ద్వారా సంస్థ రూ.170.70 కోట్లు సమీకరించనుంది. గురువారం సన్సార్ ఇంజనీరింగ్ లిస్టింగ్... బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఆటో ఉపకరణల తయారీ సంస్థ సన్సార్ ఇంజనీరింగ్ షేర్లు గురువారం ఎక్సే్చంజ్ల్లో లిస్ట్ కానున్నాయి. గతవారంలో రూ.1283 కోట్ల నిధుల సమీకరణకు వచ్చిన ఈ ఐపీఓ మొత్తం 11.47 రెట్ల సబ్స్క్రైబ్షన్ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.21 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. నికర కొనుగోలుదారులుగా ఎఫ్ఐఐలు దేశంలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. సెప్టెంబర్ 1–17 తేదిల్లో ఎఫ్ఐఐలు నికరంగా రూ.16,305 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.5,018 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.16,305 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దేశీయ ఈక్విటీలపై ఎఫ్ఐఐల బుల్లిష్ ట్రెండ్ కొనసాగితే రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చు. ఎన్ఆర్ఎల్ రికార్డ్ ప్రభుత్వ రంగ సంస్థ నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్(ఎన్ఆర్ఎల్) చరిత్రలోనే అత్యధికంగా 375 శాతం డివిడెండును ప్రకటించింది. అంటే రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరుకీ రూ. 37.5 చొప్పున మధ్యంతర డివిడెండుగా ఇప్పటికే చెల్లించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్సీ మిశ్రా తెలియజేశారు. 2020–21లో నికర లాభాల్లో సైతం 120 శాతం పురోగతి సాధించింది. ఈ విలువ రూ. 3,036 కోట్లు. ఆదాయం 32 శాతం వద్ధితో రూ. 18,544 కోట్లకు చేరింది. çకంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ప్రభుత్వానికి రికార్డు డివిడెండ్ అందించినట్లు ఆయన వెల్లడించారు. చదవండి: స్టాక్ మార్కెట్, ఇకపైనా టెక్ కంపెనీల ఐపీవోల జోరు -
సెన్సెక్స్ @ 59,000
స్టాక్ మార్కెట్లో బుల్ దూకుడు కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇంధన రంగాల షేర్లు రాణించడంతో గురువారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఆయా రంగాలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఐటీసీ, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర లార్జ్క్యాప్ షేర్లు లాభపడి సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. సెన్సెక్స్ తొలిసారి 59,000 శిఖరాన్ని అధిరోహించి 417 పాయింట్ల లాభంతో 59,141 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 481 పాయింట్లు ర్యాలీ చేసి 59,204 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 125 పాయింట్లు ర్యాలీ చేసి 17,645 వద్ద కొత్త తాజా గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 110 పాయింట్ల లాభంతో 17,629 వద్ద నిలిచింది. గడచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 963 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్లను ఆర్జించాయి. ఐటీ, మెటల్, మీడియా షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1622 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.168 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండు పైసలు బలహీనపడి 73.52 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించిన వార్తతో బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లు రాణించడంతో ఎన్ఎస్ఈలోని నిఫ్టీ పీఎస్యూ ఇండెక్స్ ఐదున్నర శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3%, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రెండుశాతం ర్యాలీ చేశాయి. రెండోరోజూ టెలికం షేర్ల లాభాల మోత టెలికాం రంగానికి చేయూతనిచ్చేందుకు కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలతో ఈ రంగ షేర్లు రెండురోజూ రాణించాయి. వోడాఫోన్ ఇంట్రాడేలో 28 శాతం లాభపడి రూ.11.47 స్థాయికి చేరింది. చివరికి 26 శాతం లాభంతో రూ.11.25 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ షేరు ట్రేడింగ్లో రెండున్నర శాతం ర్యాలీ చేసి రూ.744 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి ఒకశాతం శాతంతో రూ.718 వద్ద స్థిరపడింది. మార్కెట్ క్యాప్లో ఐదో స్థానానికి భారత్ సూచీలు వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.4.46 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టస్థాయి రూ.260 లక్షల కోట్లకు చేరింది. విలువపరంగా భారత స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే ఐదోస్థానానికి చేరినట్లు బీఎస్ఈ సీఈవో అశిష్ చౌహాన్ తెలిపారు. సన్సార్ ఐపీఓకు మంచి స్పందన... ఆటో ఉపకరణాల తయారీ సంస్థ సన్సార్ ఇంజనీరింగ్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరిరోజు నాటికి 11.47 రెట్ల సబ్స్రై్కబ్షన్ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.21 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా... 13.88 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 26.47 రెట్లు, నాన్ – ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 11.37 రెట్లు, రిటైల్ విభాగంలో 3.15 రెట్లు సబ్స్క్రైబ్ అయినట్లు ఎక్చ్సేంజీ గణాంకాలు తెలిపాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.382 కోట్లను సమీకరించింది. సెపె్టంబర్ 21న పరాస్ డిఫెన్స్ ఐపీఓ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ సెపె్టంబర్ 21న ప్రారంభం కానుంది. ఇదే నెల 23న ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణిని రూ.165 – 175 గా నిర్ణయించారు. సెన్సెక్స్ 57వేల నుంచి 58వేల స్థాయికి చేరేందుకు మూడురోజుల ట్రేడింగ్ సమయాన్ని తీసుకోగా.., 58 వేల నుంచి 59 వేల స్థాయికి చేరుకొనేందుకు ఎనిమిది ట్రేడింగ్ సమయాన్ని తీసుకుంది. -
నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.సోమవారం ఉదయం 9.38గంటల సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు నష్టపోయి 58,115 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుండగా.. నిఫ్టీ 56.70 పాయింట్లతో స్వల్పంగా నష్టపోయి 17,312 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్, టీసీఎస్,హెచ్డీఎఫ్సీ, మారుతీ, టీసీఎస్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. రిలయన్స్,ఇండస్ఇండ్ బ్యాంక్,బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. -
మళ్లీ బుల్ పరుగులు
ముంబై: ఒకరోజు నష్టాల ముగింపు తర్వాత స్టాక్ సూచీలు గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లలో చెప్పుకోదగ్గ కొనుగోళ్లు జరిగాయి. లార్జ్క్యాప్ షేర్లైన టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ షేర్లు మూడు శాతం వరకు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. ఫలితంగా సెన్సెక్స్ 514 పాయింట్లు ఎగసి 57,853 వద్ద ముగిసింది. ఒక దశలో 554 పాయింట్ల వరకు ర్యాలీ చేసి 57,892 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 17,234 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో నిఫ్టీ 169 పాయింట్లు ర్యాలీ చేసి 17,246 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ముగింపు స్థాయి ఇరు సూచీలకు ఆల్టైం హై ముగింపులు కావడం విశేషం. అంతకు ముందు(బుధవారం) ట్రేడింగ్లో పతనమైన షేర్లకు అధిక డిమాండ్ నెలకొంది. సూచీలు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాలైన ఎఫ్ఎమ్సీజీ, ఐటీ షేర్లను కొనేందుకు అధికాసక్తి చూపారు. సెమికండక్టర్ కొరతతో ఆగస్టు అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆటో రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.349 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.382 కోట్ల ఈక్విటీలను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లోనూ రూపాయి 2 పైసలు బలపడి 73.06 వద్ద స్థిరపడింది. అమెరికా ఉద్యోగ గణాంకాల విడుదలకు ముందు అప్రమత్తతతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బుల్ జోరుతో ఇన్వెస్టర్లకు రూ.2.5 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.252.66 లక్షల కోట్లకు చేరింది. ‘‘జీడీపీతో సహా ఇటీవల విడుదలైన దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ వర్గాలను మెప్పించగలిగాయి. భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతుందనే ఆశావాదంతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) దేశీయ ఈక్విటీ మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 17100 కీలక నిరోధాన్ని ఛేదించిన తర్వాత మరింత దూసుకెళ్లింది. ప్రస్తుత ట్రేడింగ్ స్థాయి(17200–17250)ని నిలుపుకోగలిగితే మూమెంటమ్ కొనసాగి 17,400 – 17450 శ్రేణిని పరీక్షించవచ్చు’’ అని ఆనంద్ రాఠి ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేందర్ సోలంకీ తెలిపారు. మార్కెట్లో మరిన్ని విశేషాలు ► నిధుల సమీకరణ అంశంపై బోర్డు సమావేశాని(శుక్రవారం)కి ముందు హెచ్డీఎఫ్సీ లైఫ్ షేరు ఎనిమిది శాతం ఎగసి రూ.776 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 6% లాభంతో రూ.759 వద్ద ముగిసింది. ► మధ్యంతర డివిడెండ్ ప్రకటన తర్వాత వేదాంత షేరుకు డిమాండ్ నెలకొంది. మూడు శాతం ర్యాలీ చేసి రూ. 306 వద్ద స్థిరపడింది. ► కెనడా దేశంలోని స్థానిక ఫార్మా మార్కెట్లోకి రెవెలిమిడ్ జనరిక్ ఔషధాన్ని విడుదల చేయడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేరు రెండు శాతం లాభపడి రూ.4,857 వద్ద నిలిచింది. ► రూ.1000 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వడంతో కైటెక్స్ గార్మెంట్స్ షేరు పదిశాతం లాభంతో రూ.164 వద్ద ముగిసింది. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి.ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విడిచిపెట్టనప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లు సరికొత్త రికార్డ్ లను కొనసాగిస్తున్నాయి. ఆ రికార్డ్ల పరంపర కొనసాగిస్తూ గురువారం ఉదయం మార్కెట్లు 9.38 గంటల సమాయానికి నిఫ్టీ 54.05 పాయింట్ల లాభంతో 17,125.10 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 144.77 పాయింట్ల లాభంతో 57,482.98 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. కాగా, మారుతి సుజికి,డీఆర్ఎల్,బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్ మార్కెట్లు లాభాల్ని గడిస్తుండగా.. వోల్టాస్,బాటా ఇండియా, గోద్రెజ్,ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకుంటున్నాయి. -
అదే జోరు, లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా భారీ లాభాల్ని మూటగట్టుకుంటున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు, క్యూ1లో జీడీపీ ఫలితాల ప్రభావంతో బుధవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9.30గంటల సమయానికి నిఫ్టీ 47.65 పాయింట్లు లాభపడి 17,179 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తున్నాయి. ఇక సెన్సెక్స్ 159.67 పాయింట్లు లాభపడి 57,712.06 వద్ద అదే జోరును కంటిన్యూ చేస్తున్నాయి. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్యాస్, అదానీ పవర్, యాక్సెస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, బజాస్ ఫైనాన్స్, జేకే సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. టాటా స్టీల్, మారుతి సుజికి, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
బుల్ పరుగులు..3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి
లాభాల జడివానతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. సూచీల వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.3.58 లక్షల కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.247 లక్షల కోట్లకు చేరింది. ముంబై: దలాల్ స్ట్రీట్ సోమవారం బుల్ రంకెలతో దద్దరిల్లిపోయింది. కొంతకాలంగా పరిమిత శ్రేణిలో కదలాడుతున్న పావెల్ వ్యాఖ్యలతో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. ఇంట్రాడేలో 833 పాయింట్లు పెరిగి 56,958 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 765 పాయింట్ల లాభంతో 56,890 వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఈ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్ సూచీ 247 పాయింట్లు ఎగసి 16,952 వద్ద కొత్త ఆల్టైం హైని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 226 పాయింట్ల లాభంతో 16,931 వద్ద స్థిరపడింది. గడిచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో నిఫ్టీ సూచీ ఐదు కొత్త రికార్డు ముగింపులను నమోదుచేసింది. ధరల నియంత్రణకు చైనా నిల్వల విక్రయానికి సిద్ధమవడంతో మెటల్ షేర్ల ర్యాలీ కొనసాగింది. ఎన్ఎస్ఈలోని సెక్టార్ ఇండెక్స్ల్లోకెల్లా నిఫ్టీ మెటల్ సూచీ అత్యధికంగా రెండున్నర శాతం లాభపడింది. కొంతకాలంగా స్తబ్ధుగా ట్రేడవుతున్న ఆర్థిక, బ్యాంకింగ్ కౌంటర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. ఆగస్ట్లో వాహన విక్రయాలు ఊపందుకొని ఉండొచ్చనే అంచనాలతో ఆటో షేర్లు రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,208 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.689 కోట్ల షేర్లను కొన్నారు. సూచీల దూకుడుకు కారణాలివే... అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెరోమ్ పావెల్ శుక్రవారం జాక్సన్ హోల్ సదస్సులో మాట్లాడుతూ.., వడ్డీ రేట్ల పెంపు 2023 ఏడాది నుంచి ఉండొచ్చన్నారు. బాండ్ల కొనుగోళ్ల కోత ఈ సంవత్సరాంతం ప్రారంభం అవుతుందని స్పష్టతనిచ్చారు. ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికాతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల బాటపట్టా యి. అలాగే పావెల్ ప్రకటనతో యూఎస్ డాలర్ బలహీనపడడంతో, ట్రెజరీ ఈల్డ్స్ కూడా తగ్గాయి. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 1.312 శాతం నుంచి 1.305 శాతానికి దిగింది. డాలర్ ఇండెక్స్ కూడా రెండు వారాల కనిష్టానికి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 40 పైసలు బలపడటం కలిసొచ్చింది. ఈ వారంలో వెలువడనున్న దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా నమోదుకావచ్చనే అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఆర్థిక వ్యవస్థ రికవరీకి కేంద్రం చేపట్టిన సంస్కరణలతో క్యూ1లో రికార్డు స్థాయిలో 17.57 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్లోకి వచ్చాయి. నాలుగు నెలల వరుస అమ్మకాల తర్వాత ఈ ఆగస్టులో ఎఫ్ఐఐ నికర కొనుగోలుదారులుగా నిలిచారు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మరిన్ని విశేషాలు... భారతీ ఎయిర్టెల్ బీఎస్ఈలో నాలుగున్నర శాతం లాభపడి రూ.620 వద్ద ముగిసింది. కంపెనీ బోర్డు రూ.21వేల కోట్ల నిధుల సమీకరణకు ఆమోదం తెలపడం షేరు ర్యాలీకి కారణం. పలు కార్ల రేట్లు ఈ సెప్టెంబర్ నుంచి పెంచనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించడంతో బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు మూడు శాతం పెరిగి రూ.6,797 వద్ద ముగిసింది. భారత్లో టెస్లా కంపెనీకి విడిభాగాలను సరఫరా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో సోనా కామ్స్టార్, సంధార్ టెక్, భారత్ ఫోర్జ్ షేర్లు తొమ్మిదిశాతం ర్యాలీ చేశాయి. -
రికార్డ్ల వేట, భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతుంది. ప్రధాన సూచీలు గరిష్టస్థాయిలో సరికొత్త రికార్డ్ లను క్రియేట్ చేస్తున్నాయి. బుధవారం ఉదయం 9.36 గంటల సమయానికి సెన్సెక్స్ సరికొత్త రికార్డ్ లను నమోదు చేసింది. సెన్సెక్స్ 97 పాయింట్ల లాభంతో 56119 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో 16683 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్,హిందాల్కో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కాగా,మౌలిక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన రూ.6 లక్షల కోట్ల జాతీయ మానిటైజేషన్ పైప్లైన్(ఎన్ఎంపీ) కార్యక్రమం మార్కెట్ సెంటిమెంట్ను బలపరచడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
మంగళవారం మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.భారత్, రష్యా ద్వైపాక్షిక ఇంధన సహకార బలోపేతంపై దృష్టి సారించడంతో పాటు..రష్యాలోని ఆయిల్, గ్యాస్ ప్రాజెక్టులపై భారత్ పెట్టుబడులు 15 బిలియన్ డాలర్లను మించడం వంటి అంశాలు మార్కెట్పై ప్రభావాన్ని చూపాయి. దీంతో మంగళవారం ఉదయం 9.34 గంటల సమయంలో సెన్సెక్సె 71.30 పాయింట్ల లాభంతో 55,653 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 10.50 స్వల్ప లాభంతో 16,573 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. మాస్ ఫిన్ సర్వీస్, డీసీఎం శ్రీరామ్, అపోలో హాస్పిటల్, eClerx సర్వీసెస్, పెట్రో నెట్ ఎల్ఎన్జీ స్టాక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
కొనసాగిన రికార్డులు
ముంబై: స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర సోమవారమూ కొనసాగింది. మెటల్, ఆర్థిక షేర్లతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు రాణించడంతో సూచీలు మూడోరోజూ ఇంట్రాడే, ముగింపులో సరికొత్త గరిష్టాలను నమోదుచేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 244 పాయింట్లు ఎగసి 55,681 వద్ద ఆల్టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 145 పాయింట్ల లాభంతో 55,583 వద్ద ముగిసింది. నిఫ్టీ ట్రేడింగ్లో 60 పాయింట్లు పెరిగి 16,589 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదుచేసింది. మార్కెట్ ముగిసే సరికి 34 పాయింట్ల లాభంతో 16,563 వద్ద స్థిరపడింది. నిఫ్టీకిది ఆరోరోజూ, సెన్సెక్స్ మూడోరోజూ లాభాల ముగింపు. చిన్న, మధ్య తరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్ ఇండెక్స్లు అరశాతానికి పైగా నష్టపోయాయి. జూన్ త్రైమాసికపు ఫలితాలు మెప్పించడంతో పాటు ప్రపంచ మార్కెట్లోనూ ధరలు స్థిరంగా ఉండటంతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ లాభపడింది. ఆటో, ఐటీ, మెటల్, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ప్రభుత్వరంగ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ గణాంకాలు నిరాశపరచడంతో పాటు కోవిడ్ వైరస్ విజృంభణతో అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పార్శీ నూతన సంవత్సరం సందర్భంగా ఫారెక్స్ మార్కెట్ పని చేయలేదు ఆరంభ నష్టాలు రికవరీ... దేశీయ మార్కెట్ ఉదయం మిశ్రమంగా మొదలైంది. సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో 55,480, నిఫ్టీ 11 పాయింట్ల పతనంతో 16,518 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకోవడంతో పాటు రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు మరింత అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి. ఒకదశలో సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లను కోల్పోయాయి. ఈ సమయంలో జూన్ టోకు ధరల ద్రవ్యోల్బణ దిగివచ్చినట్లు కేంద్ర గణాంకాల శాఖ ప్రకటనతో సూ చీల నష్టాలకు అడ్డుకట్ట పడింది. మిడ్సెషన్ నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు ఆరంభ నష్టాలను పూడ్చుకొని క్రమంగా లాభాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► రిలయన్స్ – సౌదీ ఆరామ్కో వ్యాపార ఒప్పంద చర్చలు సఫలవంతం దిశగా సాగుతున్నట్లు వార్తలు వెలుగులోకి రావడంతో ఆర్ఐఎల్ షేరు ఒకటిన్నర శాతం లాభంతో రూ.2174 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రెండున్నర శాతం ర్యాలీ చేసి రూ.2203 వద్ద గరిష్టాన్ని తాకింది. ► ఆర్థిక రంగ షేర్ల ర్యాలీ భాగంగా హెచ్డీఎఫ్సీ ద్వయం షేర్లు రాణించాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు అరశాతం లాభంతో రూ.1529 వద్ద, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ షేరు ఒకశాతం పెరిగి రూ.2,733 వద్ద స్థిరపడ్డాయి. ► వొడాఫోన్ ఐడియా షేరు ఆరుశాతం క్షీణించి రూ.6 వద్ద ముగిసింది. కంపెనీ రెండో త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేయడం షేరు పతనానికి కారణమైంది. ► పలు బ్రోకరేజ్ సంస్థలు షేరు టార్గెట్ ధరను పెంచడంతో టాటా స్టీల్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.1519 వద్ద ముగిసింది. ► జూన్ క్వార్టర్లో రూ.729 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించడంతో స్పైస్జెట్ షేరు నాలుగు శాతం నష్టంతో రూ.69 వద్ద స్థిరపడింది. -
NSE NIFTY 50: మళ్లీ రికార్డుల బాట
ముంబై: ఒకరోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ కదంతొక్కాయి. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గురువారం ఇంట్రాడే, ముగింపుల్లో సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో కాస్త ఒడిదుడుకులకు లోనైన సూచీలు.., వెంటనే తేరుకొని మార్కెట్ ముగిసే వరకు ఎలాంటి తడబాటు లేకుండా స్థిరమైన ర్యాలీ చేశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 348 పాయింట్లు ఎగసి 54,874 వద్ద ఆల్టైం హై స్థాయిని అందుకుంది. చివరికి 318 పాయింట్ల లాభంతో 54,845 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 93 పాయింట్లు పెరిగి 16,375 వద్ద సరికొత్త గరిష్టాన్ని లిఖించింది. మార్కెట్ ముగిసే సరికి 82 పాయింట్ల లాభంతో 16,364 వద్ద స్థిరపడింది. నిఫ్టీకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. ఒక్క ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్లు రాణించి సూచీల ర్యాలీకి ప్రాతినిధ్యం వహించాయి. ఈ వారం ఆరంభం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లలో విరివిగా కొనుగోళ్లు జరిగాయి. ఫలితంగా బీఎస్ఈ స్మాల్, మిడ్క్యాప్ ఇండెక్స్లు రెండుశాతం వరకు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో తొమ్మిది షేర్లు మాత్రమే నష్టపోయాయి. సూచీల రికార్డు ర్యాలీతో ఒకేరోజులో ఇన్వెస్టర్లు రూ.2 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్క్యాప్ రూ.239 లక్షల కోట్లకు చేరింది. రికార్డు ర్యాలీ ఎందుకంటే..? అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెలువడటంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను ఇప్పట్లో పెంచకపోవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. డిమాండ్ ఊపందుకోవడంతో రెండో క్వార్టర్లో బ్రిటన్ మెరుగైన జీడీపీ వృద్ధిని సాధించింది. దీంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఇక జాతీయంగా ఫారెక్స్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలు అందాయి. డాలర్ మారకంలో రూపాయి 19 పైసలు ఎగసి 74.25 వద్ద స్థిరపడింది. గత మూడురోజుల ఒడిదుడుకుల ట్రేడింగ్లో భాగంగా పతనాన్ని చవిచూసిన నాణ్యమైన మిడ్, స్మాల్ క్యాప్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ప్యాసింజర్ వాహన విక్రయాలకు సంబంధించి జూలైలో వార్షిక ప్రాతిపదికన 45% వృద్ధి నమోదైనట్లు ఆటో పరిశ్రమ సంఘం సియామ్ తెలిపింది. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు రిస్క్ అసెట్స్ భావించే ఈక్విటీల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ‘మార్కెట్ ముందుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ జరగవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్ మంచిది. గురు వారం విడుదలైన జూలై రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించనున్నాయి. సాంకేతికంగా నిఫ్టీ 16300 స్థాయిపై ముగిసింది. తదుపరి 16500 వద్ద నిరోధాన్ని ఎదుర్కోనుంది. దిగువ స్థాయిలో 16250 వద్ద తక్షణ మద్దతు ఉంది’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఆప్టాస్ అదుర్స్.. కెమ్ప్లాస్ట్ ఓకే ముంబై: చెన్నైకి చెందిన ప్రత్యేక రసాయనాల కంపెనీ కెమ్ప్లాస్ట్ సన్మార్ ఐపీఓకు ఓ మోస్తరు స్పందన లభించింది. చివరి రోజు నాటికి 2.17 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3.99 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టగా.. మొత్తం 8.66 కోట్లు బిడ్లు దాఖలైనట్లు ఎక్సే్చంజీ గణాంకాలు తెలిపాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 2.29 రెట్లు ఎక్కువ దరఖాస్తులు లభించాయి. ఆప్టాస్ వేల్యూ 17 రెట్లు... ఆప్టాస్ వేల్యూ హౌసింగ్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. మూడో రోజు నాటికి 17.20 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 5.51 కోట్ల షేర్లను జారీ చేసింది. మొత్తం 94.82 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 71.35 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు లభించాయి. -
ఆర్థిక, ఐటీ షేర్ల అండతో లాభాలు
ముంబై: మిడ్సెషన్ నుంచి ఆర్థిక, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు వారం ప్రారంభంలోనే లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 125 పాయింట్ల లాభంతో 54,403 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 16,258 వద్ద ముగిసింది. ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, మీడియా షేర్లూ స్వల్పంగా లాభపడ్డాయి. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్స్, రియలీ్ట, ఆయిల్అండ్గ్యాస్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 460 పాయింట్ల పరిధిలో, నిఫ్టీ 142 పాయింట్ల శ్రేణిలో కదలాడాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్క్యాప్ ఇండెక్స్లు ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అయితే లార్జ్క్యాప్ షేర్లు రాణించి సూచీలకు అండగా నిలిచాయి. డెల్టా కేసుల పెరుగుదల భయాలు, కమోడిటీ ధరల పతనంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ నాలుగు గరిష్టానికి చేరుకుంది. ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు పతమైన 74.26 వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా... దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 108 పాయింట్ల లాభంతో 54,386 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 16,281 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆస్తకి చూపడంతో మార్కెట్ మొదలైన అరగంటకే సెన్సెక్స్ 312 పాయింట్లు ఎగసి 54,585 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లు ర్యాలీ చేసి 16,321 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. రోలెక్స్ రింగ్స్ లిస్టింగ్ సూపర్... ఆటో విడిభాగాల తయారీ సంస్థ రోలెక్స్ రింగ్స్ ఐపీఓ లిస్టింగ్లో అదరగొట్టాయి. ఇష్యూ ధర రూ.900తో పోలిస్తే ఈ షేరు బీఎస్ఈలో 39% ప్రీమియంతో రూ.1250 వద్ద లిస్ట్ అయింది. ఒకదశలో 40% లాభపడి రూ.1263 వద్ద గరిష్టాన్ని అందుకుంది. చివరికి 30% లా భంతో రూ.1167 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,176.90 కోట్లుగా ఉంది. అమెరికా స్టాక్స్లో పెట్టుబడులు! ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ద్వారా సాకారం న్యూఢిల్లీ: ఎంపిక చేసిన అమెరికన్ స్టాక్స్లో ట్రేడింగ్ చేసే సదుపాయాన్ని తమ ప్లాట్ఫాం ద్వారా అందుబాటులోకి తేనున్నట్లు ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్సే్చంజీ (ఐఎఫ్ఎస్సీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడి సాధనాన్ని దేశీ ఇన్వెస్టర్లకు అందించే దిశగా డిపాజిటరీలు, బ్యాంకులు, బ్రోకర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొంది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్–సిటీ (గిఫ్ట్ సిటీ)లో తీసుకున్న డీమ్యాట్ ఖాతాల్లో వీటిని హోల్డ్ చేయొచ్చని పేర్కొంది. ఈ విధానంతో దేశీ రిటైల్ ఇన్వెస్టర్లకు అమెరికన్ స్టాక్స్ లభించగలవని ఎన్ఎస్ఈ ఎండీ విక్రమ్ లిమాయే తెలిపారు. -
బుల్ జోరు, భారీ లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లో బుల్రన్ కొనసాగుతుంది. బుధవారం మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజీలో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం 9.40 నిమిషాల సమయంలో 422.36 పాయింట్ల లాభంతో 54246 పాయింట్లతో ట్రేడింగ్ కొనసాగుతుండగా.. నిఫ్టీ 115.95 పాయింట్ల లాభాలతో 16246 వద్ద ట్రేడ్ అవుతుంది. కాగా, కరోనా మహమ్మారితో కుంటుపడ్డ ఆర్ధిక వ్యవవస్థ వేగంగా కోలుకునేలా సంకేతాలివ్వడం, కార్పొరేట్ తొలి త్రైమాసిక ఆర్థిక పలితాలు,ఐపీఓల సందడి, జీఎస్టీ వసూళ్లు పెరగడం, తయారీ రంగం ఊపందుకోవడం వంటి సానుకూల అంశాలు మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో మార్కెట్లు భారీ లాభాల్ని చవి చూస్తున్నాయి. -
లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో మంగళవారం ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 213 పాయింట్ల లాభంతో 53,264.33 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుండగా..నిఫ్టీ 66 పాయింట్లతో 15,963.85 వద్ద లాభాలతో ట్రేడింగ్ కొనసాగుతుంది. కాగా, టాప్ టెన్ స్టాక్స్ లో ఏషియన్ పెయింట్స్, హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్, అదానీ పోర్ట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్ కో లిమిటెడ్, టెక్ మహీంద్రా, బ్రిటానియా ఇండస్ట్రీస్, విప్రో లిమిటెడ్, బజాస్ ఫిన్ సర్వ్, టాటా కన్సెల్టెన్సీ సర్వీస్లు లాభాల్ని మూటగట్టుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియా లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్సీఎల్,శ్రీ సిమెంట్, బజాజ్ ఆటో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రసీమ్ ఇండస్ట్రీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మిశ్రమ పరిస్థితుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రం సెన్సెక్స్ 52,653 పాయింట్లతో క్లోజవగా ఈ రోజు ఉదయం 52,792 పాయింట్లతో ప్రారంభమయ్యింది. ఉదయం 9:45 గంటల సమయంలో కేవలం పది పాయింట్ల లాభపడి 52,663 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ ఉదయం 9:45 గంటల సమయానికి ఏడు పాయింట్లు లాభపడి 15,785 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. టెక్ మహీంద్రా షేర్లు ఏకంగా 7 శాతం పెరిగాయి. ఈ రోజు మార్కెట్లో అధిక లాభాలు అందించిన షేర్గా టెక్మహీంద్రా నిలిచింది. ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా, పీఎస్యూ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం చూపడంతో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 252 పాయింట్ల లాభాలతో 52,695.58 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుండగా నిఫ్టీ 74 పాయింట్లను నమోదు చేసి 15783.80 వద్ద ట్రేడ్ అవుతోంది. టాటా మోటార్స్, టెక్ మహేంద్ర, బ్లూ చిప్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. వచ్చే వారం నుంచి టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఆ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా నెస్ట్లే, ఐచర్ మోటార్స్, బజాజ్ ఆటో, బ్రిటానియా షేర్లు నష్టాల బాట పట్టాయి. -
స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. మదుపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గుచూపడం,అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపడంతో సెన్సెక్స్ 130.66 పాయింట్ల స్వల్ప లాభాలతో 52,9067 పాయింట్లతో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 32.80 పాయింట్ల లాభంతో 15,856 వద్ద ట్రేడింగ్ కొనసాగుతుంది. ఇక, ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, ఫెడరల్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, ఎస్ బ్యాంక్, ఆర్ట్సన్ ఇంజనీరింగ్ లాభాల్లో కొనసాగుతున్నాయి. -
లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు
దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్ల కొనుగోలుతో పాటు, రిలయన్స్ ఇండిస్ట్రీస్ 44వ యాన్యువల్ జనరల్ మీటింగ్ మార్కెట్పై అనుకూల ప్రభావం పడింది. ఐపీఓ తర్వాత తొలిసారి రిలయన్స్ నిర్వహిస్తున్న మీటింగ్లో కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ఏం చెబుతారా' అని షేర్ హోల్డర్లు ఆసక్తిగా ఎదురు చూస్తుడడంతో 9.24గంటల సమయానికి మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్ ప్రారంభంలో సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 52,472 వద్ద ట్రేడ్ అవ్వగా నిఫ్టీ 36 పాయింట్లతో 15,722 కొనసాగుతుంది. ఐటీ స్టాక్స్ జోరు సెన్సెక్స్ సూచీల్లో ఐటీ స్టాక్స్ జోరందుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా తో పాటు ఎల్ అండ్ టీ, యాక్సిక్ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్స్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక అత్యధికంగా జేఎస్డబ్ల్యూస్టీల్ స్టాక్ ప్రైస్ 1.34శాతం పెరిగింది. జాతీయస్థాయిలో పలు ఆటో మొబైల్ సంస్థలు వాహనాల ధరల్ని పెంచడంతో వాటి ప్రభావం మార్కెట్పై ప్రభావం చూపి 0.6శాతం తగ్గింది.హీరో మోటర్ కార్ప్,టాటా మోటార్స్ నష్టపోయాయి. చదవండి: మళ్లీ పెరిగిన పెట్రో ధరలు -
ఆదాయం 40వేల కోట్లు, పవర్ గ్రిడ్ లాభం 6% ప్లస్
న్యూఢిల్లీ: పీఎస్యూ దిగ్గజం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(పీజీసీఐఎల్) గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 6% పుంజుకుని రూ. 3,526 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో దాదాపు రూ. 3,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,508 కోట్ల నుంచి రూ. 10,816 కోట్లకు బలపడింది. వాటాదారులకు షేరుకి రూ. 3 చొప్పున తుది డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రకటించింది. మధ్యంతర డివిడెండు కింద ఈ ఏడాది జనవరి 8న రూ. 5, తిరిగి మార్చి 30న రూ. 4 చొప్పున చెల్లించిన సంగతి తెలిసిందే. పూర్తి ఏడాదికి: మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి పవర్ గ్రిడ్ రూ. 12,036 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2019–20లో రూ. 11,059 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 38,671 కోట్ల నుంచి దాదాపు రూ. 40,824 కోట్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. కాగా.. తుది డివిడెండుతోపాటు 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను సైతం జారీ చేసేందుకు బోర్డు నిర్ణయించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 3 షేర్లకుగాను 1 షేరుని ఉచితంగా కేటాయించనుంది. ఫలితాల నేపథ్యంలో పవర్ గ్రిడ్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం క్షీణించి రూ. 240 వద్ద ముగిసింది. చదవండి: మార్కెట్కు ‘ఫెడ్’ పోటు -
మార్కెట్లో రికార్డుల మోత
ముంబై: జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం తమ పాత రికార్డుల్ని తిరగరాశాయి. మెటల్, ఐటీ, ఫార్మా, ఆటో షేర్లు రాణించడంతో ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 324 పాయింట్లు పెరిగి 52,642 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. దీంతో ఈ ఏడాదిలో ఫిబ్రవరి 16న నమోదైన 52,517 ఆల్టైం హై స్థాయి కనుమరుగైంది. చివరికి 174 పాయింట్ల లాభంతో 52,475 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు కూడా సూచీకి కొత్త ఆల్టైం హై కావడం విశేషం. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 96 పాయింట్లు ర్యాలీ చేసి 15,836 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. 62 పాయింట్ల్ల లాభంతో 15,799 వద్ద ముగిసింది. సూచీలకిది వరుసగా రెండోరోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో ఈ రంగ షేర్లు నష్టాలను చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన గంటలోపే రికార్డు స్థాయిలను అందుకున్న సూచీలు తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్సెషన్లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో తిరిగి లాభాల బాటపట్టాయి. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు అరశాతం చొప్పున ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.18 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.666 కోట్ల షేర్లను కొన్నారు. ఇక వారం మొత్తం మీద సెన్సెక్స్ 375 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లను ఆర్జించాయి. సూచీలకిది నాలుగో వారమూ లాభాల ముగింపు. యూఎస్ సూచీలు జీవితకాల గరిష్టస్థాయిని అందుకోవంతో సహా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు రిస్క్కు అధిక ప్రాధాన్యత ఉంటే ఈక్విటీల్లో పెట్టుబడులకు మొగ్గుచూపారు. ఇన్వెస్టర్ల సంపద@రూ.213 లక్షల కోట్లు సూచీల రికార్డులతో ఇన్వెస్టర్ల సంపద కూడా కొత్త గరిష్టానికి ఎగసింది. ఇన్వెస్టర్లు సంపద భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం గురు, శుక్రవారాల్లో రూ.3.26 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్ మైలురాళ్లు ఈ 2021 ఏడాదిలో ఇప్పటి వరకు సెన్సెక్స్ మొత్తం 4,723 పాయింట్ల(9.89%)ను ఆర్జించింది. ఇదే ఏడాదిలో మొత్తం 18 సార్లు కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేసింది. తేదీ సాధించిన ఘనత జనవరి 21 తొలిసారి 50వేల స్థాయిని అందుకుంది. ఫిబ్రవరి 3 తొలిసారి 50వేల పైన ముగిసింది ఫిబ్రవరి 5 తొలిసారి 51వేల స్థాయిని అందుకుంది. ఫిబ్రవరి 8 తొలిసారి 51 వేల స్థాయి పైన ముగిసింది ఫిబ్రవరి 15 తొలిసారి 52 స్థాయిని అందుకుంది. జూన్ 11 52,641 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు జూన్ 11 52,474 వద్ద ఆల్టైం హై ముగింపు -
మళ్లీ రికార్డుల ర్యాలీ..!
ముంబై: ఒకరోజు విరామం తర్వాత స్టాక్ మార్కెట్లో మళ్లీ కొత్త రికార్డులు నమోదయ్యాయి. మిడ్సెషన్ నుంచి ఇంధన, ఐటీ, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారం సూచీలు సరికొత్త రికార్డులను లిఖించాయి. సెన్సెక్స్ 228 పాయింట్లు లాభపడి 52,328 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి జీవితకాల గరిష్టస్థాయి. అంతకు ముందు సెన్సెక్స్కు (జూన్ 03న) జీవితకాల గరిష్ట ముగింపు స్థాయి 52,232గా ఉంది. ఇక నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 15,752 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 103 పాయింట్లు ర్యాలీ చేసి 15,773 స్థాయిని అందుకుంది. ముగింపు, ఇంట్రాడే స్థాయిలు నిఫ్టీకి జీవితకాల గరిష్టాలు కావడం విశేషం. చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దీంతో మూడేళ్ల తర్వాత నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్టైం హైని నమోదు చేయగా, నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ మరోసారి జీవితకాల గరిష్టం వద్ద ముగిసింది. మెటల్, ఫార్మా, ఆర్థిక, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. సూచీల రికార్డు ర్యాలీ తిరిగి మొదలవడంతో సోమవారం ఒక్కరోజే రూ.1.81 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రికార్డు స్థాయి రూ.229 లక్షల కోట్లకు చేరింది. గత శుక్రవారం విడుదలైన అమెరికా నిరుద్యోగ గణాంకాలు మార్కెట్ వర్గాలను నిరుత్సాహపరచడంతో ప్రపంచ మార్కెట్లు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నాయి. ‘‘దేశంలో కరోనా కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను సడలించడం కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ర్యాలీ కూడా సెంటిమెంట్ను బలపరిచింది. నిఫ్టీకి 15,500–15,600 స్థాయిలో బలమైన మద్దతు ఉంది. అందుకే ట్రేడింగ్ ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి కలిగినా తట్టుకోగలిగింది. మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉన్నందున నిఫ్టీ 16,000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు’’ అని దీన్ దయాళ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ నిపుణుడు మనీష్ హతీరమణి తెలిపారు. ఇంట్రాడేలో ట్రేడింగ్ జరిగిందిలా! ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 131 పాయింట్ల లాభంతో 52,231 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 15,725 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. భారీ ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఉదయం లాభాలన్నీ కోల్పోయాయి. అయితే మిడ్ సెషన్లో యూరో మార్కెట్ల లాభాల ప్రారంభం సూచీలకు ఉత్సాహాన్నిచ్చింది. అలాగే సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుందని వార్తలు వెలువడటంతో తిరిగి కొనుగోళ్లు మొదలయ్యాయి. ద్వితీయార్థంలో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో ఒక దశలో నిఫ్టీ 103 పాయింట్లు ర్యాలీ చేసి 15,773 స్థాయిని అందుకుంది. సెన్సెక్స్ 279 పాయింట్లు లాభపడి 52,379 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. -
రికవరీ ఆశలతో.. రికార్డులు
ముంబై: ఆర్థిక వ్యవస్థలో రికవరీ ఆశలతో స్టాక్ మార్కెట్ సోమవారం ఒక శాతం లాభంతో ముగిసింది. మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ రికార్డుల పర్వం కొనసాగింది. ఇంట్రాడేలో 268 పాయింట్లు ఎగసి 15,606 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టస్థాయిని నమోదుచేసింది. చివరికి 147 పాయింట్ల లాభంతో 15,583 వద్ద ముగిసింది. ఈ ముగింపు స్థాయి నిఫ్టీకి ఆల్టైం హై కావడం విశేషం. మరో సూచీ సెన్సెక్స్ 515 పాయింట్లు లాభపడి 51,937 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 52 వేల మార్కును అధిగమించి 52,013 స్థాయిని తాకింది. సెన్సెక్స్కిది నాలుగోరోజూ లాభాల ముగింపు కాగా నిఫ్టీ సైతం ఏడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. ఆసియా మార్కెట్లలో ప్రతికూలతతో ఉదయం సూచీలు కొంత అమ్మకాల ఒత్తిడికిలోనైనా.., దేశీయంగా నెలకొన్న సానుకూలతలతో తిరిగి లాభాల బాటపట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంక్, మీడియా, ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,412 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.180 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. ‘‘కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో ఆశావాదం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచీ తగినంత మద్దతు లభించింది. ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికపు జీడీపీ గణాంకాలు మెప్పించకపోయినా.., లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో వేగవంతమైన రికవరీ జరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోదగిన వృద్ధి జరగవచ్చు. ఆర్థిక వృద్ధి ఆశలతో మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, ఇంధన రంగాలకు చెందిన హెవీ వెయిట్స్ షేర్లు రాణించడంతో సూచీలు భారీ లాభాల్ని ఆర్జించగలిగాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 4 రోజుల్లో రూ.3.93 లక్షల కోట్లు అప్... నాలుగు రోజుల వరుస ర్యాలీలో బీఎస్ఈలో రూ.3.93 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.223 లక్షల కోట్లకు చేరుకుంది. సోమవారం సూచీల 1% ర్యాలీతో రూ.1.82 లక్షల కోట్ల సంపదను సొంతం చేసుకున్నారు. రూపాయి మూడురోజుల ర్యాలీకి బ్రేక్..! రూపాయి విలువ సోమవారం 17 పైసలు నష్టపోయి 72.62 వద్ద స్థిరపడింది. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలతో పాటు డాలర్ ఇండెక్స్ బలపడటం రూపాయి కరిగిపోయేందుకు కారణమైనట్లు ఫారెక్స్ నిపుణులు తెలిపారు. రూపాయి పతనంతో మూడురోజుల ర్యాలీకి ముగింపుపడినట్లైంది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 72.38 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72.65 – 72.34 శ్రేణిలో కదలాడింది. ఈ మే నెలలో డాలర్ మారకంలో రూపాయి 149 పైసలు(2.01 శాతం) బలపడింది. మార్కెట్లో మరిన్ని విశేషాలు... ► అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు 3% లాభంతో రూ.2,160 వద్ద స్థిరపడింది. గత 4 రోజుల్లో ఈ షేరు 10% ర్యాలీ చేయడం విశేషం. ► నాలుగో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో ఫార్మా దిగ్గజం దివిస్ ల్యాబ్ షేరు 4% లాభపడి రూ.4,284 వద్ద ముగిసింది. ► మార్కెట్ ర్యాలీలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 6% నష్టపోయి రూ.79 వద్ద స్థిరపడింది. -
Nifty: సరికొత్త శిఖరాలకు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో పాటు అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేరు రాణించడంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభంతో ముగిసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడటం కూడా కలిసొచ్చింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 308 పాయింట్లు లాభపడి 51,423 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 51,259 – 51,529 పాయింట్ల మధ్యలో ట్రేడైంది. మరో ఇండెక్స్ నిఫ్టీ మూడు నెలల విరామం తర్వాత ఇంట్రాడేలో 15,469 వద్ద సరికొత్త రికార్డును లిఖించింది. చివరకు 97 పాయింట్ల లాభంతో 15,436 వద్ద ముగిసింది. ఈ ముగింపు స్థాయి కూడా నిఫ్టీకి రికార్డు గరిష్టం. అలాగే ఆరోరోజూ లాభాలను గడించినట్లైంది. దేశీయ ఇన్వెస్టర్లు రూ.914 కోట్ల షేర్లను, విదేశీ ఇన్వెస్టర్లు రూ.661 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్ 882 పాయింట్లు, నిఫ్టీ 260 పాయింట్లు పెరిగాయి. ‘‘దేశంలో కోవిడ్ వ్యాధి సంక్రమణ రేటు క్షీణించడంతో పాటు డాలర్ ఇండెక్స్ పతనం భారత ఈక్విటీ మార్కెట్కు కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి బలపడుతూ ర్యాలీకి మద్దతుగా నిలుస్తోంది. ఆర్థిక రికవరీ ఆశలు, మెరుగైన క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో మార్కెట్ మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ మోదీ తెలిపారు. సూచీలకు మద్దతుగా రిలయన్స్ ర్యాలీ... అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు చాలాకాలం తరువాత లాభాల బాట పట్టింది. జెఫ్పారీస్తో సహా బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుకు బుల్లిష్ రేటింగ్ను కేటాయించాయి. ఇన్వెస్టర్లు ఈ షేరును కొనేందుకు ఆసక్తి చూపారు. ఎన్ఎస్ఈలో 6% లాభంతో రూ. 2,095 వద్ద స్థిరపడింది. -
Nifty: నాలుగో రోజూ లాభాలే
ముంబై: కరోనా సంబంధిత ప్రతికూలతలను విస్మరిస్తూ స్టాక్ మార్కెట్ నాలుగోరోజూ ముందడుగేసింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు అండగా నిలిచాయి. ఫలితంగా దేశీయ మార్కెట్ సోమవారం లాభాలను మూటగట్టుకుంది. అన్ని రంగాలకు షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సెన్సెక్స్ 296 పాయింట్లు ఎగసి 49,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు ర్యాలీ చేసి 14,942 వద్ద నిలిచింది. కార్పొరేట్ కంపెనీల మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పిస్తున్నాయి. కోవిడ్ వేళ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చాయి. ప్రపంచ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలు అందా యి. ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా రంగాల షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్లు రెండూ ఒక శాతం ర్యాలీ చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 49,412– 49,617 పరిధిలో కదలాడింది. నిఫ్టీ 14,892 – 14,967 శ్రేణిలో ట్రేడైంది. గతవారంలో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ.584 కోట్ల విలువైన షేర్లను కొ న్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.476 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 4 రోజుల్లో రూ.6.4 లక్షల కోట్లు అప్... మార్కెట్ వరుస ర్యాలీతో గడిచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,249 పాయింట్లు, నిఫ్టీ 446 పాయింట్లను ఆర్జించాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగింది. నాలుగు రోజుల్లో ఏకంగా రూ.6.44 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేష¯Œ రూ. 213 లక్షల కోట్లను తాకింది. ఇంట్రాడేలో ట్రేడింగ్ జరిగిందిలా.., ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న మన మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 49,496 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 14,928 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో బలహీనత కారణంగా సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయాయి. అయితే దేశీయ మార్కెట్లో నెలకొని ఉన్న సానుకూలతో సూచీలు వెంటనే రికవరీ అయ్యి తిరిగి ఆరంభ లాభాల్ని పొందగలిగాయి. మిడ్సెషన్లో మరోసారి అమ్మకాల ఒత్తిడికి లోనప్పటికీ.., యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభంతో మళ్లీ కొనుగోళ్లు జరిగాయి. ఇలా పతనమైన ప్రతిసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► కోవిడ్ ఔషధ తయారీకి అనుమతులు లభిం చడంతో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు మూడు శాతం లాభపడి రూ.5328 వద్ద ముగిసింది. ► మార్చి క్వార్టర్లో నికర లాభం 17 రెట్లు పెరగడంతో సీఎస్బీ బ్యాంక్ షేరు ఆరు శాతం ర్యాలీ చేసి రూ.272 వద్ద స్థిరపడింది. ► 2020–21 క్యూ4లో రిలయన్స్ పవర్ టర్న్అరౌండ్ సాధించడంతో కంపెనీ షేరు రూ.6.65 వద్ద అప్పర్ సర్క్యూట్ను తాకి ఫ్రీజ్ అయ్యింది. ► ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో అల్ట్రాటెక్ షేరు ఒక శాతం నష్టపోయి రూ.6403 వద్ద నిలిచింది. -
Stock Market: నష్టాల్లోంచి.. లాభాల్లోకి..!
ముంబై: దిగువ స్థాయిలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు గురువారం ఆరంభ నష్టాలను పూడ్చుకొని లాభాల్లో ముగిశాయి. కరోనా కేసుల కట్టడికి వచ్చే నెల(మే) ఒకటవ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ను ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మార్కెట్ వర్గాలను మెప్పించింది. ప్రపంచ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు అందాయి. ఫలితంగా ఉదయం సెషన్లో 501 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 375 పాయింట్ల లాభంతో 48,081 వద్ద ముగిసింది. నిఫ్టీ 144 పాయింట్ల పతనం నుంచి తేరుకొని 110 పాయింట్ల లాభాన్ని మూటగట్టుకొని 14,406 వద్ద నిలిచింది. ఇటీవల మార్కెట్ పతనంతో కనిష్ట స్థాయిలకు దిగివచ్చిన బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లకు కొనేందుకు ఇన్వెస్టర్లు అధిక ఆసక్తిని చూపారు. మెటల్ షేర్లు కూడా రాణించి సూచీల ర్యాలీకి సహకరించాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటం, ఆర్థిక వ్యవస్థలు రికవరీ బాట పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభా ల్లో కదలాడుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 909 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.850 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఆరుపైసలు క్షీణించి 74.94 వద్ద స్థిరపడింది. ఆరంభంలో అమ్మకాల ఒత్తిడి... కరోనా కేసుల సంఖ్య మూడు లక్షలను దాటడంతో పాటు అనేక రాష్ట్రాలు లాక్డౌన్కు మొగ్గు చూపడంతో మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది.సెన్సెక్స్ 204 పాయింట్ల నష్టంతో 47,502 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లను కోల్పోయి 14,219 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు దూకుడు మీదున్నా.., దేశీయంగా పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో విక్రయాల ఉధృతి మరింత పెరిగింది. దీంతో సెన్సెక్స్ 501 పాయింట్లు మేర నష్టపోయి 47,204 వద్ద, నిఫ్టీ 144 పాయింట్లను కోల్పోయి 14,424 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఆర్థిక, బ్యాంకింగ్, మెటల్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు మిడ్సెషన్ కల్లా నష్టాలను పూడ్చుకోగలిగాయి. యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో సూచీలు క్రమంగా లాభాలను ఆర్జించుకోగలిగాయి. ► హెచ్డీఎఫ్సీతో వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 7% లాభంతో రూ.176 వద్ద ముగిసింది. ► నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మార్కెట్ను మెప్పించడంతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ షేరు ఏడు శాతం పెరిగి రూ.453 వద్ద స్థిరపడింది. ► మార్చి త్రైమాసికపు ఆర్థిక ఫలితాల విడుదల ముందు ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 4% లాభపడి రూ.579 వద్ద నిలిచింది. నిఫ్టీ @ సిల్వర్ జూబ్లీ ... ఎన్ఎస్ఈలోని ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ గురువారం అరుదైన ఘనతను సాధించింది. 1995 బేస్ ఇయర్ ప్రతిపాదికన 1996 ఏప్రిల్ 22 తేదీన 1,107 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను ప్రారంభించిన నిఫ్టీ దిగ్విజయంగా 25 వసంతాలను పూర్తి చేసుకుంది. కాంపౌండెడ్గా ప్రతి ఏటా 11 శాతం వృద్ధి చెందుతూ గడిచిన పాతికేళ్లలో 14 రెట్లు పెరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న 15 వేల మార్కును అధిగమించింది. ఈ పాతికేళ్ల ప్రయాణంలో నిఫ్టీ ఇండెక్స్లో అనేక మార్పులు, చేర్పులు జరిగినప్పటికీ.., హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, హెచ్యూఎల్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, గ్రాసీం, హీరో మోటోకార్ప్, హిందాల్కో షేర్లు మాత్రం ఈ రోజుకు కొనసాగుతున్నాయి. -
స్టాక్ మార్కెట్లో ‘ఆక్సిజన్’ పరుగులు...!
ముంబై: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఆర్థిక రంగంపై మరోసారి తన ప్రభావాన్ని కచ్చితంగా చూపిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా స్టాక్ మార్కెట్లో పలు కంపెనీల షేర్లు నేలకేసి చూస్తున్నాయి. కరోనా కేసుల పెరుగుదల భయంతో స్టాక్ మార్కెట్లో కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. కోవిడ్ ఉధృతి, లాక్డౌన్ విధింపు చర్యలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. కరోనా కేసుల కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ను ప్రకటిస్తుండగా, ఇప్పటికే ముంబై, ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. నిన్న ఒక్కరోజే సూచీల రెండు శాతం పతనమవ్వడంతో రూ.3.53 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయాయి. ప్రముఖ ఫార్మా కంపెనీల షేర్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లోని కొన్ని కంపెనీలు ఇందుకు విరుద్ధంగా లాభాలను గడిస్తున్నాయి. ఆక్సిజన్ను సరఫరా చేసే కంపెనీల షేర్లు ఏప్రిల్ మొదటి వారం నుంచి గణనీయంగా పెరిగాయి. బాంబే ఆక్సిజన్, నేషనల్ ఆక్సిజన్ లిమిటెడ్, భాగవతి ఆక్సిజన్ లిమిటెడ్ కంపెనీల షేర్లు ఏప్రిల్ నెలలో సుమారు 47 శాతం కంటే ఎక్కువగా లాభాలను గడించాయి. దీనికి కారణం కోవిడ్-19 దృష్ట్యా దేశంలో ఆక్సిజన్ ఉపయోగం గణనీయంగా పెరగడంతో కంపెనీల షేర్లు పెరిగాయి. కాగా దేశంలో ఆక్సిజన్ సిలిండర్ ధరలు రెట్టింపయ్యాయి. విచిత్రమేమిటంటే కంపెనీ పేరులో ఆక్సిజన్ ఉన్న కంపెనీల షేర్లు అమాంతం నింగికేగిసాయి. నేషనల్ ఆక్సిజన్ లిమిటెడ్, భాగవతి ఆక్సిజన్ లిమిటెడ్ కంపెనీలు ఆక్సిజన్, ఇతర వాయువులను ఉత్పత్తి చేస్తున్నాయి. బాంబే ఆక్సిజన్ లిమిటెడ్ ఆక్సిజన్ ఉత్పత్తిని 2019లో నిలిపివేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ గా తన పేరు మార్చింది. ఈ కంపెనీ షేర్లు ఏప్రిల్ నెలలో సుమారు 112 శాతం వరకు ఎగబాకాయి. కాగా కొవిడ్-19 తీవ్రత తగ్గిన వెంటనే కంపెనీల షేర్లు సాధారణ స్థాయికి వస్తాయని కోటక్ సెక్యురిటిస్ సీనియర్ వైస్ప్రెసిడెంట్ రుస్మిక్ ఓజా తెలిపారు. చదవండి: మార్కెట్.. లాక్‘డౌన్’! -
మార్కెట్కు మూడోరోజూ లాభాలే..
ముంబై: ఆరంభ లాభాలను కోల్పోయినా.., మార్కెట్ మూడురోజూ లాభంతో ముగిసింది. ఇంట్రాడేలో 456 పాయింట్లు ర్యాలీ చేసిన సెన్సెక్స్ చివరికి 84 పాయింట్ల లాభంతో 49,746 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 165 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 55 పాయింట్లకు పరిమితమై 14,873 వద్ద నిలిచింది. ఇన్వెస్టర్లు మెటల్ షేర్లను కొనేందుకు అధిక ఆసక్తి చూపారు. ఉక్కు ఉత్పత్తితో పాటు ధరలు కూడా పెరుగుతుండటంతో ఈ రంగ షేర్లకు డిమాండ్ నెలకొంది. దీంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నాలుగుశాతం ర్యాలీ చేసింది. రూపాయి 11 పైసల పతనం కావడం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. వీటితో పాటు రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు కూడా రాణించాయి. మరోవైపు బ్యాంకింగ్ షేర్లతో పాటు ఆర్థిక, ఫార్మా రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆర్బీఐ సర్దుబాటు వైఖరికి మద్దతుగా ఉదయం సెషన్లో కొనుగోళ్లు జరిగాయి. అయితే మిడ్సెషన్ నుంచి బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ. 111 కోట్ల పెట్టుబడులు పెట్టగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.553 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. వడ్డీరేట్లపై మరిన్ని రోజులు సానుకూల వైఖరినే ప్రదర్శించాల్సి ఉంటుందని ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశపు మినిట్స్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు పరిమితి లాభాలతో కదలాడుతున్నాయి. మిడ్సెషన్ నుంచి అమ్మకాలు... ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 223 పాయింట్ల లాభంతో 49,885 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగిన 14,875 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. మెటల్, ఐటీ, రియల్టీ రంగాల షేర్లు రాణించాయి. ఒక దశలో సెన్సెక్స్ 50 వేల స్థాయి అందుకుంది. గరిష్టంగా 456 పాయింట్లు ఎగసి 50,118 స్థాయిని అందుకుంది. నిఫ్టీ 165 పాయింట్లు పెరిగి 14,984 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మిడ్ సెషన్ సమయంలో యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో కదలాడటం సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లలో అనూహ్యంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సూచీలు కొంతమేర ఉదయం లాభాల్ని కోల్పోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► రేటింగ్ అప్గ్రేడ్తో టాటా స్టీల్ షేరు రూ.956 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 5% లాభంతో రూ.918 వద్ద ముగిసింది. ► క్రితం ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మెరుగైన ఉత్పత్తిని సాధించడంతో జేఎస్డబ్ల్యూ స్టీల్ షేరు తొమ్మిది శాతం లాభంతో రూ.614 వద్ద స్థిరపడింది. ► బార్బెక్యూ నేషన్ హాస్పిటాలిటీ షేరు వరుసగా రెండోరోజూ 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ను తాకి రూ.705 వద్ద ముగిసింది. -
తొలుత జూమ్.. తుదకు ఫ్లాట్
ముంబై: రెండు రోజుల నష్టాలకు చెక్ పెడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమయ్యాయి. అయితే విదేశీ మార్కెట్ల ప్రభావంతో చివర్లో అమ్మకాలు తలెత్తడంతో స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 36 పాయింట్లు బలపడి 50,441 వద్ద నిలవగా.. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకుని 14,956 వద్ద స్థిరపడింది. రోజంతా స్వల్ప ఒడిదొడుకుల మధ్య మార్కెట్లు కదిలాయి. తొలి గంటలో సెన్సెక్స్ 667 పాయింట్లు జంప్చేసి 50,986ను తాకింది. తదుపరి ఆసియా మార్కెట్లు, యూఎస్ ఫ్యూచర్స్ బలహీనపడటంతో వెనకడుగు వేసింది. చివరి అర్ధగంటలో నష్టాలలోకి సైతం ప్రవేశించింది. 50,318 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 15,111–14,920 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు మండుతుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. కాగా.. 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి యూఎస్ సెనేట్ ఆమోదముద్ర వేయడంతో తొలుత సెంటిమెంటుకు జోష్వచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. ఎఫ్ఎంసీజీ డీలా ఎన్ఎస్ఈలో పీఎస్యూ బ్యాంక్స్, మీడియా, మెటల్, ఐటీ, ఫార్మా రంగాలు 1.6–0.4 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే రియల్టీ 1 శాతం, ఎఫ్ఎంసీజీ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో యూపీఎల్, గెయిల్, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్సీఎల్ టెక్, ఐవోసీ, యాక్సిస్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్ 7–1.5 శాతం మధ్య ఎగిశాయి. ఈ బాటలో పవర్గ్రిడ్, బీపీసీఎల్, ఎంఅండ్ఎం, టెక్ మహీంద్రా, ఆర్ఐఎల్, సిప్లా సైతం 1.2–0.5 శాతం మధ్య బలపడ్డాయి. అయితే ఇండస్ఇండ్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, బజాజ్ ఆటో, ఎయిర్టెల్, హెచ్యూఎల్, బజాజ్ ఫిన్, టైటన్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, బ్రిటానియా, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.2–0.5 శాతం మధ్య క్షీణించాయి. ఎఫ్అండ్వో ఇలా... డెరివేటివ్ విభాగంలో పీఎఫ్సీ, ఐఆర్సీటీసీ, గ్లెన్మార్క్, ఎన్ఎండీసీ, నాల్కో, భెల్, టొరంట్ పవర్, సెయిల్, ఎల్అండ్టీ టెక్నాలజీ, జీ, కమిన్స్ ఇండియా 4.6–3 శాతం మధ్య జంప్చేశాయి. అయితే మరోపక్క అపోలో టైర్, టీవీఎస్ మోటార్, ముత్తూట్ ఫైనాన్స్, బెర్జర్ పెయింట్స్, పిడిలైట్, జూబిలెంట్ ఫుడ్, ఇండిగో, పేజ్, ఎంఫసిస్, బాటా 3.2–1.8 శాతం మధ్య నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.3–0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఎఫ్పీఐల అమ్మకాలు నగదు విభాగంలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,494 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 484 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. వారాంతాన సైతం ఎఫ్పీఐలు రూ. 2,014 కోట్ల అమ్మకాలు చేపట్టడం గమనార్హం!