Sudheer Babu
-
అనంత నిధి కోసం సుధీర్ బాబు ‘జటాధర’.. రంగంలోకి జీ స్టూడియోస్
సుధీర్ బాబు మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన తాజాగా నటిస్తోన్న సినిమా ‘జటాధర’. రుస్తుం తరువాత మళ్లీ ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. సూపన్ నేచురల్ థ్రిల్లర్గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జటాధర చిత్రంలోకి జీ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చింది.ఈ మేరకు జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘జీ స్టూడియోస్లో మేం ఇంకా ఎన్నో కథలను అందించాలని, అవి తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నాం. జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోంది. అందుకే ప్రస్తుతం సుధీర్ బాబు తన బాడీని పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత మరిన్ని అప్డేట్స్ అందించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. మొత్తం మీద, జటాధర సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులకు, అలాగే పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ క్రియేట్ చేయబోతోంది. -
మీర్పేట్ మర్డర్ మిస్టరీ కొత్త టెక్నాలజీతో కేసు విచారణ
-
మంచు ఫ్యామిలీ మెంబర్స్ పై 3 కేసులు : సీపీ సుధీర్ బాబు
-
మహేష్ బాబు మేనల్లుడి పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
కుమారుడి బర్త్ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్గా నటించింది. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సుధీర్ బాబు తన కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆయన కుమారుడు చరిత్ మానస్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఈ రోజు నాకు ప్రత్యేకమంటూ కుమారుడిపై ప్రేమను చాటుకున్నారు. చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా, సోదరి మంజుల కూడా సందడి చేశారు.కాగా.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని బర్త్ డే వేడుకల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసింది. On your special day, I want you to know how much I love and cherish you. You're growing up to be an incredible individual! Happy birthday, cherry ❤️ @Just_Charith pic.twitter.com/7HGrRdno55— Sudheer Babu (@isudheerbabu) November 22, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నాన్న సెంటిమెంట్ స్టోరీతో తీసిన ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ దానికి రెండు రోజుల ముందే మరో ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ఇంతకీ ఇదే మూవీ? ఎందులో అందుబాటులో ఉందనేది చూద్దాం.సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. దసరాకు థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదే టైంలో నాలుగైదు సినిమాలు రిలీజ్ కావడం, ఇది స్లోగా సాగే ఎమోషనల్ కావడంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు నెలరోజులు పూర్తయ్యాయో లేదో ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తొలుత జీ5 ఓటీటీలో నవంబర్ 15న స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లోకి సైలెంట్గా వచ్చేసింది. సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' స్టోరీ గురించి మాట్లాడుకుంటే.. రోజుల వయసులోనే తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), అనుకోని కారణాల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతాడు. ఓరోజు ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ జాని వల్ల దురదృష్టమే అని ఎప్పుడూ ఈసడించుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఇతడు జైలుకి వెళ్తాడు. సవతి తండ్రిని విడిచిపించాలంటే జానికి కోటి రూపాయలు అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు మిథున్ చక్రవర్తి పర్స్ కొట్టేసిన దొంగలు) -
ఓటీటీలో నాన్న సినిమా.. అధికారిక ప్రకటన
యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. గత నెలలో దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎందుకనో ప్రేక్షకులు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తండ్రీకొడుకుల అనుబంధం అనే కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమాని నవంబర్ 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే ఈ వీకెండ్లో వచ్చేస్తుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' విషయానికొస్తే.. చిన్నతనంలో తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), కొన్ని పరిస్థితుల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి చిన్నప్పుడే దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతున్న ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ మంచిగా చూసుకోడు. ఓ రోజు పెంచిన తండ్రిని జైలు నుంచి విడిచిపించాలంటే కోటి రూపాయలు జానికి అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే కథ.(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ
ఈసారి దసరాకి అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్. వీటిలో వైవిధ్యభరిత చిత్రాలున్నాయి. ఇందులో ఓ మూవీనే 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. నాన్న సెంటిమెంట్తో తీసిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరో అనిపించుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ప్రకాశ్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోతుంది. రోజుల పిల్లాడిని అనాథశ్రమంలో ఉంచి, పనికోసం బయటకెళ్తాడు. ఊహించని విధంగా అరెస్ట్ అవుతాడు. 20 ఏళ్లు జైల్లోనే ఉండిపోతాడు. అంతలో పిల్లాడు జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్ద వాడవుతాడు. ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) అనే స్టాక్ బ్రోకర్ దత్తత తీసుకుంటాడు. అయితే జాని రాకతో తన కుటుంబానికి అరిష్టం పట్టుకుందని శ్రీనివాస్కి కోపం. కానీ జానికి మాత్రం నాన్నే సూపర్ హీరో. తండ్రిపై విపరీతమైన ప్రేమ. ఊరంతా అప్పులు చేసే శ్రీనివాస్.. ఓ రాజకీయ నాయకుడికి కోటి రూపాయలు బాకీ పడతాడు. ఇంతకీ ఈ డబ్బు సంగతేంటి? చివరకు సొంత తండ్రి కొడుకులైన జాని-ప్రకాశ్ కలిశారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు.. అరె మన దగ్గర ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదా అని చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోరిక తీర్చడానికి అన్నట్లు వచ్చిన మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా స్ట్రెయిట్గా కథ చెప్పి మెప్పించారు.చేయన నేరానికి పోలీసులకు దొరికిపోయి, కొడుక్కి ప్రకాశ్ దూరమవడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే జాని, శ్రీనివాస్ పాత్రల పరిచయం. పెంపుడు తండ్రి అంటే కొడుకు జానికి ఎంత ఇష్టమో చూపించే సీన్స్. శ్రీనివాస్కి దత్త పుత్రుడు అంటే ఉండే కోపం, అయిష్టత. ఇలా నెమ్మదిగా ఈ రెండు పాత్రలకు అలవాటు పడతాం. ఇంతలో ప్రకాశ్ పాత్ర వస్తుంది. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. చిన్నప్పుడు విడిపోయిన తండ్రి-కొడుకు ఎలా కలుసుకుంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో కోటిన్నర లాటరీ టికెట్ అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ప్రకాశ్ దగ్గరున్న లాటరీ టికెట్ని కొట్టేయడానికి కొన్ని పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరోవైపు తండ్రిని కాపాడుకునేందుకు పెంచిన కొడుకు పడే తాపత్రయం ఇలాంటి అంశాలతో సెకండాఫ్ నడిపించారు.రెండు గంటల సినిమా చూస్తున్నంతసేపు ఓ నవల చదువుతున్నట్లు ఉంటుంది. కానీ హీరోయిన్ సీన్స్, సెకండాఫ్ ప్రారంభంలో రాజు సుందరం ట్రాక్ నిడివి పొగిడించడం కోసం పెట్టారా అనే సందేహం కలుగుతుంది. ఇవి లేకపోయినా సరే సినిమా ఫ్లో దెబ్బతినదు. స్లో నెరేషన్ కూడా కొందరు ప్రేక్షకులకు ల్యాగ్ అనిపించొచ్చు. క్లైమాక్స్లోనూ అసలైన తండ్రి-కొడుకు కలుసుకున్నట్లు డ్రామా-ఎమోషన్స్ వర్కౌట్ చేయొచ్చు. కానీ సింపుల్గా తేల్చేశారా అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?సుధీర్ బాబు వరకు ఇది డిఫరెంట్ పాత్ర. ఇదివరకు బాడీ చూపిస్తూ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇందులో మాత్రం సెటిల్డ్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే క్యారెక్టర్ బాగుంది కానీ ఈ పాత్రకు ఇంకాస్త డెప్త్, ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. సెకండాఫ్లో తండ్రిగా సాయిచంద్ తనదైన యాక్టింగ్తో జీవించేశాడు. మేజర్ సీన్స్ అన్నీ ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి. దీంతో హీరోయిన్తో పాటు మిగిలిన పాత్రలకు పెద్ద స్కోప్ దొరకలేదు.దర్శకుడు మంచి ఎమోషనల్ కథ అనుకున్నాడు. అందుకు తగ్గ పాత్రధారుల్ని తీసుకున్నాడు. కానీ సినిమా తీసే క్రమంలో కాస్త తడబడ్డాడు. కానీ ఇలాంటి స్టోరీ కూడా తీయొచ్చనే అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎలాంటి కమర్షియల్ వాసనల జోలికి పోకుండా తీసిన డ్రామా సినిమా ఏదైనా చూద్దామనుకుంటే 'మా నాన్న సూపర్ హీరో'పై ఓ లుక్కేయండి. మరీ కాకపోయినా.. నచ్చేస్తుంది!-చందు డొంకాన -
తండ్రీ కొడుకుల ముక్కోణపు ప్రేమకథ: సుధీర్ బాబు
‘‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా యూనివర్సల్ పాయింట్తో రూపొందింది. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు మధ్య నడిచే ముక్కోణపు ప్రేమకథ అని చెప్పాచ్చు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని సుధీర్ బాబు అన్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆర్ణ జోడీగా నటించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. వి సెల్యులాయిడ్స్, కామ్ ఎంటర్టైన్ మెంట్పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు పంచుకున్న విశేషాలు...⇒ అభిలాష్ చేసిన ‘లూజర్’ సిరీస్ చూశా.. బాగా నచ్చింది. తను ‘మా నాన్న సూపర్ హీరో’ కథ చెప్పినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది. పూర్తిస్థాయిలో ఫాదర్ ఎమోషన్ ఉన్న సినిమాలు అరుదు. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు కథ ఇంతకుముందెన్నడూ రాలేదు. ‘మా నాన్న సూపర్ హీరో’ మొదటి చిత్రం. నా కెరీర్లో చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. మానవ సంబంధాలపై ఉన్న ఈ పాయింట్ కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. మొదటి ఆట నుంచే ఆడియన్ ్స, క్రిటిక్స్ నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వస్తుందనే నమ్మకం ఉంది. ⇒ ‘హరోం హర’ సినిమాకి ముందే ‘మా నాన్న సూపర్ హీరో’ కి ఒప్పుకున్నా. అయితే ఫలానా జోనర్లో సినిమా చేయాలని నేనెప్పుడూ ప్రణాళిక వేసుకోను. ఒక నటుడిగా అన్ని జోనర్ సినిమాలు చేయాలి. నాకు వచ్చిన కథల్లో ఏది బాగుంటే అది చేస్తాను. అలా వచ్చిన కథే ‘మా నాన్న సూపర్ హీరో’. నాన్నపై కొడుకు ప్రేమని ‘యానిమల్’ సినిమాలో అగ్రెసివ్ అండ్ బోల్డ్గా చూపించినా జనాలకి నచ్చింది. కానీ, ‘మా నాన్న సూపర్ హీరో’ లో నాన్నమీద కొడుకుకి ఉన్న లవ్ని ప్రేమతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. సన్నివేశాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. రియల్ లైఫ్లో మా నాన్నగారు చాలా క్రమశిక్షణ గల మనిషి. ఆయన క్రమశిక్షణ మా అక్కకి, నాకు స్ఫూర్తినిచ్చింది. ⇒ మహేశ్ బాబుగారు మా చిత్రం ట్రైలర్ చూసి మనసుని తాకింది అన్నారు. ట్రైలర్ చివర్లో వచ్చే మహేశ్ బాబు పేరు ఉన్న డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ చాలా వినోదాత్మకంగా ఉందని చెప్పారు. నా సినిమాల గురించి ఇంత చెప్పడం ఇదే తొలిసారి. యువీ క్రియేషన్ ్స విక్కీ, వంశీ, సునీల్, నేను కలిసి 2002లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. ఇప్పుడు వాళ్ల బ్యానర్లో నేను హీరోగా చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఎలాగైనా హిట్ కొట్టాలనే బాధ్యత ఉంది. వందశాతం హిట్ కొడతామనే నమ్మకం వచ్చింది. సాయిచంద్, సాయాజీ షిండేగార్లతో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ చూశాక నా నమ్మకాన్ని అభిలాష్ నిలబెట్టుకున్నాడనిపించింది. తను భవిష్యత్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.. మంచి సినిమాలు తీస్తాడు. జై క్రిష్ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. నా కెరీర్కి ఉపయోగపడే, వైవిధ్యమైన పాత్ర ఉంటే విలన్గా చేస్తాను. నా తర్వాతి సినిమా ‘జటాధరా’ నవంబరులో ్రపారంభం అవుతుంది. ఈ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 70ఎంఎం బ్యానర్లో మరో చిత్రం చేస్తాను. -
మహేశ్ రిలీజ్ చేసిన 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. పేరుకి తగ్గట్లే నాన్న అనే సెంటిమెంట్తో ఈ సినిమా తీశారు. హీరోకి ఇద్దరు నాన్నలు ఉండటం అనే కాన్సెప్ట్తో టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే?)డబ్బు కోసం కొడుకుని మరొకరి అమ్మేస్తాడు ఓ తండ్రి. పెరిగి పెద్దయిన తర్వాత ఈ విషయం కొడుక్కి తెలుస్తుంది. ఆ తర్వాత కన్న తండ్రి, పెంచిన తండ్రితో ఎలాంటి జర్నీ సాగింది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఫుల్ ఆన్ ఎమోషనల్ రైడ్గా ఉండబోతుందని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కనెక్ట్ అయ్యేలా ఉంది.సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయాజీ షిండే, సాయిచంద్ తండ్రి పాత్రల్లో కనిపించారు. అభిలాష్ కంకర దర్శకుడు. అక్టోబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే దసరా రేసులో వేట్టయిన్, విశ్వం, జనక అయితే గనక సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు సూపర్ హీరో నాన్న పోటీలో ఉన్నాడు. మరి హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి) -
పెళ్లినాటి రేర్ ఫోటోలు పంచుకున్న సుధీర్ బాబు.. సందడిగా స్టార్ హీరోలు
-
సుధీర్ బాబు పెళ్లి వీడియో వైరల్.. మహేశ్ బాబే హైలెట్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో తన పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను అభిమానులతో సుధీర్ పంచుకున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: హీరోయిన్తో పెళ్లికి రెడీ అవుతున్న శింబుహీరో సుధీర్ బాబు.. సూపర్స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శినితో 2006లో వివాహం అయింది. అయితే, నాటి ఫోటోలకు తన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో' నుంచి ఒక పాటను తీసుకుని వీడియో రూపంలో క్రియేట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. అందులో సుధీర్ బాబు,ప్రియదర్శిని దంపతులను ఆశీర్వదిస్తున్న మహేశ్ బాబు ఫోటో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.నాడు పెళ్లిచూపుల ఫోటో షేర్ చేసిన సుధీర్సుధీర్ బాబు గతంలో కూడా వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ప్రియదర్శిని ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో క్యూట్గా కనిపిస్తుందెరో కాదు అంటూనే.. ప్రియదర్శినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పిక్ కూడా పెళ్లిచూపుల ఫోటో అని, తన దగ్గర ఉన్న ఆమె మొదటి ఫోటో ఇదేనని ఆయన పేర్కొన్నారు.2010లో ఏ మాయ చేసావే చిత్రంతో ఒక సపోర్టింగ్ రోల్తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'మా నాన్న సూపర్ హీరో' అనే చిత్రంతో అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు సుధీర్ బాబు రానున్నారు. అభిలాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉండనుంది. ఈ మూవీలో సుధీర్ బాబు తండ్రిగా సాయిచంద్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) -
లగ్గం రెడీ
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 25న ఏషియన్ సురేష్ సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ రిలీజ్ పోస్టర్ను ఆవిష్కరించి, యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు హీరో సుధీర్బాబు. ‘‘తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడతారు’’ అన్నారు రమేష్ చెప్పాల. ‘‘ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు వేణుగోపాల్ రెడ్డి. -
'మా నాన్న సూపర్ హీరో' నుంచి మరో సాంగ్ విడుదల
'హరోం హర' సినిమా తర్వాత సుధీర్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లూజర్ వెబ్సిరీస్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ‘మా నాన్న సూపర్ హీరో’ ఉంటుంది. 'వేడుకలో..' అంటూ సాగే ఒక సాంగ్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజు సుందరం ఓ కీలక పాత్రలో నటిస్తూనే, కొరియోగ్రాఫర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయిచంద్, సాయాజీ షిండే, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకు సంగీతం: జై క్రిష్, కెమెరా: సమీర్ కల్యాణి. -
థ్రిల్లింగ్ జటాధర
సుధీర్బాబు హీరోగా రూ΄పొందనున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకుడు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్బాబు ప్రొడక్షన్ బ్యానర్పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మించనున్న ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘జటాధర’ కథ శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయికలో ఉంటుంది. ఈ రెండు ప్రపంచాలను ప్రేక్షకులు వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త అనుభూతిని ΄అందుతారు. ప్రేరణ అరోరాగారితో కలిసి ఈ సినిమా కోసం ప్రయాణం చేయటం గొప్ప అనుభూతి. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘జటాధర’ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ని హైదరాబాద్లో ప్రారంభిస్తాం. ఈ సినిమాలో హీరోయిన్గా ఓ బాలీవుడ్ స్టార్ నటించనున్నారు. అలాగే ప్రతినాయకిపాత్రలో మరో బాలీవుడ్ నటి నటిస్తారు. 2025 శివరాత్రికిపాన్ ఇండియా ప్రేక్షకులను ఈ మూవీ అలరించనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సుధీర్ బాబు 'జటాధర'.. మరో ఇంట్రెస్టింగ్ లుక్
సుధీర్ బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా 'జటాధర'. గతంలో ఈ సినిమాకు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో పోస్ట్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: అభయ్ ఎలిమినేట్ అయ్యాడుగా.. కొత్త చీఫ్ ఎవరంటే?)వచ్చే ఏడాది శివరాత్రికి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కాంబోలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. కొత్త లుక్లో సుధీర్ బాబు సరికొత్తగా, శక్తివంతంగా కనిపిస్తున్నాడు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్పై దీన్ని నిర్మిస్తున్నారు. ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన 'మా నాన్న సూపర్ హీరో'.. అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!) -
నాన్నను ఇంతవరకు హగ్ చేసుకోలేదు.. సుధీర్ బాబు ఎమోషనల్
-
సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
ఆ విషయం చెప్పినప్పుడు నాన్న హృదయం ముక్కలైంది: హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మా నాన్న సూపర్ హీరో. గురువారం (సెప్టెంబర్ 12న) ఈ సినిమా టీజర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి పోసాని నాగేశ్వరరావు గురించి చెప్తూ సుధీర్ స్టేజీపై ఎమోషనల్ అయ్యాడు.ఎంత ప్రేమ ఉన్నా..అతడు మాట్లాడుతూ.. 'మా నాన్నపై నాకెంత ప్రేమ ఉన్నా సరే ఇంతవరకు ఐ లవ్యూ చెప్పలేదు. హగ్ కూడా చేసుకోలేదు. లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు చూపించుకోలేను. ఇప్పటికీ ఎన్నోసార్లు వెళ్లి ఆయన్ను హత్తుకోవాలనిపిస్తుంటుంది కానీ ఆగిపోతుంటాను. అందుకే నా పిల్లల్ని హగ్ చేసుకుంటాను. ఎక్కువగా గొడవలుమా నాన్న ఎప్పుడూ, ఎవరిపైనా కోప్పడరు. నాకేమో చిన్నదానికే కోపం వచ్చేస్తుంటుంది. బాల్యంలో ఎక్కువగా గొడవలు పెట్టుకునేవాడిని. దాంతో అమ్మానాన్న.. నువ్వు మాకు పుట్టలేదు, అడవిలో దొరికావు అని చెప్పేవారు. 12వ తరగతికి వచ్చేదాకా అదే నిజమని నమ్మాను. మా ఫ్రెండ్స్తో కూడా నేను మా పేరెంట్స్కు పుట్టలేదంట, దొరికాను అని చెప్పేవాడిని.(చదవండి: 'మా నాన్న సూపర్ హీరో'.. ఎమోషనల్ టీజర్ వచ్చేసింది!) ఏడేళ్లపాటు కష్టపడ్డారునాకు ఏడేళ్ల వయసున్నప్పుడు నాన్న అప్పు చేసి మరీ పెస్టిసైడ్ షాప్ పెట్టారు. ఉదయం తొమ్మిదింటికి వెళ్లి రాత్రి 12 గంటలకు వచ్చేవారు. అలా ఏడేళ్లపాటు కష్టపడ్డారు. ఈరోజు ఇండియాలోనే పెద్ద డిస్ట్రిబ్యూటర్గా ఎదిగారు. ఆయన ఏం చేసినా మా సంతోషం కోసమే చేసేవారు. తను కష్టజీవి.సుధీర్ ఎమోషనల్నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు తన గుండె పగిలినంత పనైంది. అదృష్టవశాత్తూ ఇండస్ట్రీలో నాకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాను' అని సుధీర్బాబు భావోద్వేగానికి లోనయ్యాడు. మా నాన్న సూపర్ హీరో మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.చదవండి: ఓడిన సోనియా.. గెలిచి చూపించిన నిఖిల్ -
'మా నాన్న సూపర్ హీరో'.. ఎమోషనల్ టీజర్ వచ్చేసింది!
హరోం హర తర్వాత సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లూజర్ వెబ్సిరీస్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత పోకిరి నటుడు షాయాజీ షిండే టాలీవుడ్ అభిమానులను అలరించనున్నారు. 'నేను కష్టపడుతున్నాను కదా నాన్న.. ఇక నువ్వేందుకు పనిచేయడం' అన్న డైలాగ్ చూస్తుంటే ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే 'అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్లు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు!! లాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తండ్రీ, కుమారుల అనుబంధం, ఎమోషన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దసరా పండుగకు అక్టోబర్ 11న థియేటర్లలో మా నాన్న సూపర్ హీరో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సాయిచంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడ్డుకునట్టు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయాయినట్టు కాదు!!A heartwarming tale coming this Dusshera#MNSHTeaser - https://t.co/ke3FnMyr9w#MaaNannaSuperHero grand release on Oct 11th@abhilashkankara @sayajishinde #SaiChand @jaymkrish… pic.twitter.com/asU6FJtUwe— Sudheer Babu (@isudheerbabu) September 12, 2024 -
దసరా బరిలో సుధీర్ బాబు.. ఈ సారైనా హిట్ కొడతాడా?
ఇటీవలే హరోం హర మూవీతో మెప్పించిన టాలీవుడ్ స్టార్ సుధీర్బాబు. తాజాగా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఇందులో ఆర్ణ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీసెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.తండ్రీ, తనయులు అనుబంధం నేపథ్యంలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీని రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. అయితే రిలీజ్ డేట్ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం మానాన్న హీరో అని చిత్రయూనిట్ తెలిపింది. కాగా.. చిత్రంలో సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు.#MaaNannaSuperhero post production works underway.The emotional saga will hit the big screens during Dussehra. Release date announcement soon ❤🔥Stay tuned for more exciting updates 💥@isudheerbabu #SaiChand @sayajishinde @abhilashkankara @mahesh_films @vcelluloidsoffl… pic.twitter.com/AZQjpGRPF0— UV Creations (@UV_Creations) August 27, 2024 -
ప్రభాస్ స్థాయి వేరు.. నీలాంటి వారిని పట్టించుకోరు: సుధీర్ బాబు
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి చిత్రంపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ సినిమా తనకు నచ్చలేదని అన్నారు. అంతేకాదు కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్లా అనిపించిందని కించపరిచేలా మాట్లాడారు. దీంతో అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ప్రభాస్ను ఉద్దేశించిన అతను చేసిన కామెంట్స్పై టాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు అర్షద్ వార్సీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.తాజాగా టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సైతం అర్షద్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాస్ విషయంలో మీరు నిర్మాణాత్మకంగా విమర్శించినా ఫర్వాలేదు.. కానీ అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్ నీలాంటి వారి నుంచి వస్తాయని ఊహించలేదని అన్నారు. ఇలా సంకుచిత మైండ్సెట్తో ఆలోచించే నీలాంటి వారిని ఆయన పట్టించుకోరని తెలిపారు. ఎందుకంటే ప్రభాస్ స్థాయి చాలా పెద్దదని సుధీర్ బాబు తన ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా..అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని రెబల్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.It's okay to criticize constructively but it's never okay to bad-mouth. Never expected the absence of professionalism from Arshad Warsi. Prabhas's stature is too big for comments coming from small minds..— Sudheer Babu (@isudheerbabu) August 20, 2024 -
మహాశివరాత్రికి జటాధర
సుధీర్బాబు హీరోగా నటించనున్న ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘జటాధర’. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ అంశాలతో వెంకట్ కల్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హిందీలో ‘రుస్తుమ్, టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ, ప్యాడ్మ్యాన్, పరి’లాంటి చిత్రాలను నిర్మించిన ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్లు ఈ సినిమాను నిర్మించనున్నారు.‘జటాధర’ను శనివారం ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేయడంతో పాటు ఈ సినిమాను వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ‘‘ఈ చిత్రంలో సుధీర్బాబు ఓ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. త్వరలోనే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ట్రెండింగ్లో సుధీర్ బాబు ‘హరోంహర’
సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న థియేటర్స్లో విడుదలై మిక్స్డ్ టాక్ని తెచ్చుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రం దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో రెండు ఓటీటీ ఫ్లాట్ఫాంల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విశేష ఆదరణ సొంతం చేసుకొని టాప్ 1లో నిలిచింది. దేశవ్యాప్తంగా టాప్1లో ఉన్నట్లు తెలుపుతూ అమెజాన్ ఓ పోస్టర్ను విడుదల చేసింది.హరోంహర కథేంటంటే..ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు.ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'హరోం హర'. జూన్ 14న రిలీజైన ఈ సినిమాకు టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు.తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. అలాగే జియో సినిమాలో హిందీ వర్షన్ విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా మెప్పించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సుమంత్ జి నాయుడు నిర్మించాడు.కథ విషయానికి వస్తే..1989లో కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కుమారుడు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. పొలాల్ని కబ్జా చేస్తూ అడ్డొచ్చినవారిని అంతం చేస్తుంటారు. ఆ ప్రాంతంలోని పాలిటెక్నిక్ కాలేజీలోకి సుబ్రమణ్యం(సుధీర్ బాబు) ల్యాబ్ అసిస్టెంట్గా వస్తాడు. అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)ను ప్రేమిస్తాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. దీని ఎఫెక్ట్ సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు మూడునెలల్లో తన తండ్రి చేసిన అప్పులు తీర్చాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో హీరో ఏం చేశాడు? అప్పులు తీర్చాడా? తనపై కక్ష సాధించిన విలన్పై ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! -
ఓటీటీలో 'సుధీర్ బాబు' సినిమా.. నేడు సాయంత్రం నుంచే స్ట్రీమింగ్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం 'హరోం హర'. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా గతనెల 14న విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఆగష్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఆహా ప్రకటించి మళ్లీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ ఎక్స్ పేజీ వేదికగా కొత్త తేదీని ప్రకటించింది.'హరోం హర' మూవీని నేడు (జులై 15) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆహా తెలుగు వెల్లడించింది. యాక్షన్ ప్యాక్డ్ మండే మూవీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ తమ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. నేడు సాయంత్రం 5 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న హరోం హర సినిమాను మిస్ కావద్దంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.డార్క్ కామెడీ పేరుతో పలు వీడియోల వల్ల వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కూడా 'హరోం హర' సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు. తన యూట్యూబ్ ఛానల్లో ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ వల్ల అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆహా ఓటీటీ సంస్థ సినిమా విడుదలను ఆపేసింది. అతడు నటించిన సీన్లను తొలగించి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు. -
ఓటీటీలో కనిపించని 'హరోం హర'.. అదే కారణమా?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ హరోం హర. గతనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు.అయితే హరోం హర ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ముందుగా ప్రకటించినట్లుగా ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ హరోం హర ఓటీటీకి రాలేదు. అయితే సాంకేతికపరమైన సమస్యతోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు ఆలస్యమైనా స్ట్రీమింగ్కు వస్తుందా? లేదా కొత్త తేదీని ప్రకటిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. -
సుదీర్బాబు పునరాగమనం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఎఫెక్ట్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ అయిన రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్బాబు తిరిగి అదే స్థానానికి వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో ఆయనను మల్టీ జోన్–2 ఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న తరుణ్ జోషిని రాచకొండ సీపీగా తీసుకువచి్చంది. తాజా బదిలీల్లో తరుణ్ జోషి ఏసీబీ డైరెక్టర్గా వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరిలో మార్గదర్శకాల జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఏడాది జూన్ 30ని గడువుగా తీసుకుని.. ఆ తేదీ నుంచి వెనక్కు నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఓ కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తే బదిలీ తప్పనిసరి. ⇒ సుదీర్బాబు 2018 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు రాచకొండ కమిషనరేట్లో సంయుక్త, అదనపు సీపీగా విధులు నిర్వర్తించారు. డీఐజీ హోదాలో సంయుక్త సీపీగా అక్కడ రిపోర్ట్ చేసిన ఆయన ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కొనసాగుతూ అదనపు సీపీగా పని చేశారు. ఆపై హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా బదిలీపై వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడా ది డిసెంబర్ 13న రాచకొండ పోలీసు కమిషనర్గా వెళ్లారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 2020 జూలై 1 నుంచి ఒకే కమిషనరేట్లో మూడేళ్లు పని చేసిన జాబితాలో సు«దీర్ బాబు ఉన్నారు. దీంతో ఆయ న్ను బదిలీ చేసిన ప్రభుత్వం తరుణ్ జోషిని నియమించింది. తాజా బదిలీల్లో సు«దీర్ బాబును మళ్లీ రాచకొండ సీపీగా నియమించింది. ⇒ గతంలో రాచకొండ సంయుక్త సీపీగా పని చేసిన అనుభవం ఉన్న సుధీర్బాబు హైదరాబాద్, సైబరాబాద్ల్లో కీలక పోస్టింగ్లతో పాటు వరంగల్ సీపీగానూ పని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 17 మంది ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా నగరానికి సంబంధించిన కొన్ని స్థానాల్లోనూ మార్పుచేర్పులు జరిగాయి. వనపర్తి ఎస్పీగా పని చేస్తున్న రక్షిత కె.మూర్తి డీసీపీ సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీగా వచ్చారు. దీంతో నగరంలో పని చేస్తున్న మహిళా ఉన్నతాధికారుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో సౌత్ వెస్ట్ డీసీపీగా పని చేసి, ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న బి.బాలస్వామి ఈస్ట్ జోన్గా రాగా.. రాచకొండ టాస్్కఫోర్స్ డీసీపీ జి.చంద్ర మోహన్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా వచ్చారు. -
ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
యాక్షన్ మూవీ లవర్స్ రెడీ అయిపోండి. ఎందుకంటే మరో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మహేశ్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హరోం హర'. కొన్ని రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లు కాకుండా మరో ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకీ డీటైల్స్ ఏంటి?సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ సినిమా 'హరోం హర'. కుప్పం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా జూన్ 14న థియేటర్లలోకి వచ్చింది. 'పుష్ప', 'కేజీఎఫ్' లాంటి చిత్రాలని పోలినట్లు ఉందని టాక్ వల్ల జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ డీల్ సెట్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?)తొలుత ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అంటే ఈ వీకెండ్ ఏదైనా యాక్షన్ మూవీ చూస్తూ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.అది 1980. కుప్పంలో ముగ్గురు రౌడీలు ఉంటారు. ఈ ఊరిలోనే కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు). ఓ సందర్భంలో రౌడీతో గొడవపడటం వల్ల ఉద్యోగం కోల్పోతాడు. అదే టైంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. దీంతో సొంతంగా తుపాకులు తయారు చేస్తాడు. సస్పెండ్ అయిన పళని స్వామి (సునీల్)తో కలిసి గన్స్ తయారు చేస్తాడు. పోలీసులు-రౌడీలు ఇతడు ఎందురు టార్గెట్ అయ్యాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్లు.. ఎక్కువగా ఆ రోజే!) -
'సాయి ధరమ్ తేజ్ పోస్ట్.. ఇలా జరిగినందుకు క్షమాపణలు': సుధీర్ బాబు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ ఇలాంటి వాళ్లను వదిలిపెట్టను అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నపిల్లలు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు చేసేవారిని అస్సలు ఊపేక్షించవద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో రియాక్ట్ అయ్యారు. ఇలా జరిగినందుకు క్షమించాలంటూ ట్వీట్ చేశారు.ఇటీవల హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో సుధీర్ బాబు ఈ అంశంపై ట్విటర్ వేదికగా స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రణీత్ హనుమంత్ నా చిత్రం హరోం హరలో నటించినందుకు క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. ప్రణీత్ హనుమంతు నా సినిమాలో నటించడం చాలా అసహ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. అతను ఇలాంటి వ్యక్తి అని తనకు తెలియదన్నారు. సుధీర్ బాబు ట్వీట్లో రాస్తూ..'మంచో, చెడో నేను అయితే సోషల్ మీడియా వ్యక్తిని కాదు. ఇలాంటి విషయాలను అస్సలు క్షమించను. ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి హరోం హార చిత్రంలో నటించడం అసహ్యంగా భావిస్తున్నా. ఈ విషయంలో మా చిత్ర బృందం తరఫున హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఈ మనిషి ఇలాంటి వాడని నాకు తెలియదు. అతని గురించి సోషల్ మీడియాలో బహిర్గతం చేయడానికి నేను ధైర్యం చేయలేకపోయా. కానీ ఇలాంటి విషయాలపై మనం దృష్టి సారించాలి. ఇది ఏ విధంగానూ వాక్ స్వాతంత్ర్యం కాదు.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. For good or bad, I'm not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team. We didn't know what a pathetic creature this man is. It wasn't in my knowledge.…— Sudheer Babu (@isudheerbabu) July 8, 2024 -
నవ దళపతి 'సుధీర్ బాబు' పాన్ ఇండియా సినిమా ఫిక్స్
వైవిధ్యమైన చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న కథానా యకుడు సుధీర్ బాబు. నవ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకుంటున్న ఈయన ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్లో నటించబోతున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుంది.ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను ఆడియెన్స్కి అందించేలా ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కబోతున్నఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కి ఎంతో ప్రాధ్యానత ఉంది. వెంట్ కళ్యాణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 14న విడుదలైన హరోంహర చిత్రంతో సుధీర్ బాబు రీసెంట్గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అందులో యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ కథనానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది.రుస్తుం, టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో ఇప్పుడు సుధీర్ బాబు చేయబోతున్ పాన్ ఇండియా సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం రూపొందనుంది. త్వరలోనే చిత్ర యూనిట్తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది. త్వరలోనే మేకర్స్ ఆ వివరాలను తెలియజేస్తారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నారు.లోతైన కథతో రానున్న ఈ చిత్రంలో కుట్ర, పన్నాగాలు కలగలిసిన చెడుకి, మంచి జరిగే యుద్ధంగా ఇండియన్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కనుంది.ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ 'నేను ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చి ఏడాది పాటు టీమ్తో ట్రావెల్ అవుతున్నాను. డిఫరెంట్ కంటెంట్తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్షకల ముందుకు ఎప్పుడెప్పుడు వద్దామా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను ప్రేక్షకులకు అందించటానికి ప్రేరణ అరోరా, ఆమె టీమ్ సభ్యులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇది ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందనే గట్టి నమ్మకం ఉంది'. అని ఆయన అన్నారు.ప్రేరణ అరోరా, శివిన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మన పురాణాలతో అనుసంధానం చేయబడిన ఎన్నో రహస్యాలను ఇది వెలికి తీస్తుంది. ప్రేక్షకులకు ఈ సినిమా ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. -
హీరో సుధీర్ బాబుకి కొత్త ట్యాగ్.. సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్!
తెలుగులో బోలెడు మంది హీరోలు. వీళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఉంటుంది. చిరంజీవికి మెగాస్టార్, మహేశ్ బాబుకి సూపర్ స్టార్, అల్లు అర్జున్కి ఐకాన్ స్టార్.. ఇలా దాదాపు స్టార్ హీరోలు చాలామందికి పేరుకి ముందు ఏదో ఓ ట్యాగ్ ఉంటుంది. కానీ కొందరు యంగ్ హీరోలు కూడా ఇలా ట్యాగ్స్ కోసం తెగ తాపత్రయ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు కూడా అలానే కొత్తగా ట్యాగ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: ‘హరోం హర’ మూవీ రివ్యూ)స్టార్ హీరోలు పెట్టుకున్న ట్యాగ్ గురించి పెద్దగా కంప్లైంట్స్ ఉండవు గానీ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఎవరైనా ట్యాగ్స్ పెడితే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మహేశ్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు.. చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా వంక పెట్టడానికేం లేదు. కానీ హిట్ మాత్రం దక్కట్లేదు. ఇప్పుడు పూర్తిగా మాస్ని నమ్ముకుని 'హరోం హర' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. కానీ 'పుష్ప', 'కేజీఎఫ్' సినిమాల పోలికలు మరీ ఎక్కువైపోయావని అంటున్నారు.ఈ సినిమా ముందు వరకు 'నైట్రో స్టార్' అని పెట్టుకున్న సుధీర్ బాబు.. 'హారోంహర' కోసం 'నవ దళపతి' అని ట్యాగ్ మార్చుకున్నాడు. దళపతి అనగానే మనకు తమిళ హీరో విజయ్ గుర్తొస్తాడు. 'లియో' మూవీ టైటిల్ కార్డ్స్ లో విజయ్ కి పడ్డట్లే ఈ చిత్రంలో ఫొటోలు దాదాపు అలానే పడ్డాయి. దీంతో విజయ్-సుధీర్ బాబు ఫొటోలతో సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే 'హరోంహర'లో సుధీర్ బాబుతో పాటు సునీల్, మాళవిక శర్మ కీలక పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)Perfect mass ComeBack Anna🙌🏻🔥After a long waittt🥵NAVA DHALAPATHY🔥🔥🔥@isudheerbabu #Haromhara #Sudheerbabu #Maheshbabu pic.twitter.com/kbLH3zMDw7— KritiSam❤️ (@kritisam7) June 14, 2024 -
‘హరోం హర’ మూవీ రివ్యూ
టైటిల్: హరోం హరనటీనటులు: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులునిర్మాత : సుమంత్ జి నాయుడురచన, దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారకసంగీతం: చైతన్ భరద్వాజ్ఎడిటర్ : రవితేజ గిరిజాలవిడుదల తేది: జూన్ 14, 2024వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూనే ఉంటాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘హరోం హర’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హరోం హర’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. (Harom Hara Review) ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని కొంతమంది దుర్మార్గులు తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను హింసించడం.. అక్కడకు హీరో సాధారణ వ్యక్తిలా వచ్చి వారిని అంతమొందించి ప్రజలకు విముక్తి కలిగించడం.. ఇలాంటి కథలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. హరోం హర మూవీ లైన్ కూడా ఇదే. కేజీయఫ్, పుష్ప సినిమాల మాదిరి హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. (Harom Hara Review)సినిమా ప్రారంభం మొదలుకొని క్లైమాక్స్ వరకు ప్రతీ సన్నివేశం.. పుష్ప, కేజీయఫ్, ఛత్రపతి సినిమాలను గుర్తు చేస్తుంది. ఇక విలన్లు చేసే అరాచకాలు చాలా పాత సినిమాలను గుర్తు చేస్తాయి. కేజీయఫ్ స్టైల్లో పళని(సునీల్) హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథను ప్రారంభిస్తాడు. తమ్మిరెడ్డి, శరత్ పరిచయ సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. హీరో ఎంట్రీ చాలా సింపుల్గా ఉంటుంది. హీరోయిన్తో లవ్ట్రాక్ నడిపిస్తూనే.. ఊర్లో తమ్మిరెడ్డి మనుషుల ఆగడాలను చూపిస్తారు. అయితే అటు లవ్ ట్రాక్తో పాటు రొట్టకొట్టుడు విలనిజం బోర్ కొట్టిస్తుంది. హీరో గన్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యేవరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని ఫైట్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక హీరో తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడం.. యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో ఫస్టాఫ్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం నీరసంగా సాగుతుంది. కేజీయఫ్, విక్రమ్ మాదిరి యాక్షన్స్ సీన్స్ వస్తుంటాయి కానీ ఎక్కడా ఆకట్టుకోలేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, అమితాబ్ అంటూ పేర్లు పెట్టి కొత్త తుపాకులను అమ్మడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. (Harom Hara Movie Review) ఇక చివర్లో జ్యోతిలక్ష్మి(హీరో ప్రత్యేకంగా తయారు చేసిన పెద్ద గన్)తో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. అయితే ఈ సినిమా నేపథ్యంతో పాటు పాత్రలను తిర్చిదిద్దిన విధానం.. పలికించిన భాష, యాస అన్ని పుష్స సినిమాను గుర్తు చేసేలా ఉంటాయి. మాస్ యాక్షన్ సినిమాలకు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సుబ్రమణ్యం పాత్రలు సుధీర్ ఒదిగిపోయాడు. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో సుధీర్ నటించలేదు. యాక్షన్ సీన్స్లో చించేశాడు. మాళవిక శర్మ తెరపై కనిపించేదే కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. పోలీసు ఆఫీసర్గా అక్షర గౌడ తన పాత్ర పరిధిమేర నటించింది. సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ పళనిస్వామిగా సునీల్, విలన్లుగా రవి కాలే, అర్జున్ గౌడ, లక్కి లక్ష్మణ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. (Harom Hara Movie Review) హీరో తండ్రిగా నటించిన జయప్రకాశ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చేతన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
'ఇక సెప్పెదేం లేదు.. సేసేదే'.. రిలీజ్ టీజర్ అదిరిపోయింది!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం హరోం హర. ఈ సినిమాను జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరెకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హరోం హర ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, అడివిశేష్ అతిథులుగా హాజరయ్యారు.తాజాగా హరోం హర మూవీకి సంబంధించిన రిలీజ్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలకు ముందు రోజు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను పంచుకున్నారు. 44 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. చివర్లో ఇక సెప్పెదేం లేదు.. సేసేదే అనే సుధీర్ బాబు చెప్పే డైలాగ్ హైలెట్గా నిలిచింది. కాగా.. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారు
‘‘హరోం హర’ ట్రైలర్ చాలా నచ్చింది. సుధీర్బాబు మంచి సినిమా చేశాడని తెలిసి, ఈ వేడుకకి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్స్ని పిలిచి షో వేశారంటే సినిమాపై యూనిట్కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుధీర్బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్పై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ (టీజర్, ట్రైలర్, ΄ాటలు...) ్ర΄ామిసింగ్గా ఉంది. సుబ్రహ్మణ్యం, సుమంత్ లాంటి ΄్యాషన్ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ‘హరోం హర’ లాంటి నేపథ్యంలో సినిమా రాలేదు. నాతో ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్కి థ్యాంక్స్. ఈ సినిమా చూశాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం’’ అన్నారు నిర్మాత సుమంత్. ‘‘హరోం హర’లోని తండ్రీ కొడుకుల ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగో΄ాల్, డైరెక్టర్ మారుతి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. -
నాన్న నటించిన ఆ సినిమా అంటే చాలా ఇష్టం: మహేశ్ బాబు
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం 'హరోం హర' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అడివి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అయితే ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మహేశ్ బాబుతో సుధీర్ బాబు మాట్లాడిన ఫోన్ రికార్డ్ ఆడియోను ప్లే చేశారు. వీరి మధ్య దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. సుధీర్ బాబు అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధాలిచ్చారు. మొదటిసారి గన్ వాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? అని సుధీర్ ప్రశ్నించగా.. టక్కరి దొంగ సినిమాలో ఎక్కువసార్లు గన్స్ వాడా.. కానీ గన్ కాల్చేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని మహేశ్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మోసగాళ్లకు మోసగాడు గుర్తొచ్చింది.గన్స్ చూపించే సినిమాల్లో మీకు నచ్చిన చిత్రమేది అని సుధీర్ బాబు అడిగాడు. నాన్న గారు నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను వందసార్లు చూశానని మహేశ్ అన్నారు. హరోంహరలో నీకు బాగా నచ్చిన పాట ఏదని అడగ్గా.. టైటిల్ సాంగ్ అని మహేశ్ ఆన్సరిచ్చారు. హరోంహర ట్రైలర్లో నీకు నచ్చిన అంశాలు ఏంటి? అని సుధీర్ ప్రశ్నించాడు. ఈ సినిమాలో నువ్వు చాలా కొత్తగా ఉన్నావ్.. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదనిపించింది.. అని మహేశ్ బాబు అన్నారు. మీరు నటించిన నిజం సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఏమైనా ఉన్నాయా? అని సుధీర్ బాబు అడిగారు. నిజం చాలా నచ్చిన సినిమా అది. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్. నా సినిమాల్లో నిజం ఒక ఫెవరేట్ ఫిల్మ్ అని మహేశ్ బాబు అన్నారు. కాగా.. సుధీర్ బాబు నటించిన హరోం హర జూన్ 14 థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు హరోం హర పెద్ద హిట్ అవ్వాలని.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. Here we go from the man himself @urstrulyMahesh about #HaromHara#HaromHaraOnJune14th pic.twitter.com/e5iUutn4ML— Sudheer Babu (@isudheerbabu) June 11, 2024 -
నెమలి కనబడటం నాకో పాజిటివ్ సైన్: డైరెక్టర్ జ్ఞానసాగర్
సుధీర్బాబు హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హరోం హర’. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో జ్ఞానశేఖర్ మాట్లాడుతూ –‘‘కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్గా పని చేసే ఓ మామూలు కుర్రాడు సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్ మేకింగ్లో ఇన్వాల్స్ కావాల్సి వచ్చింది? ఆ తర్వాత అతని జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది? అన్నదే ఈ సినిమా కథ. ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. మంచి ఫాదర్ ఎమోషన్ కూడా ఉంది. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుణ్ణి. అందుకే ఈ సినిమాకు ‘హరోం హర’ టైటిల్, హీరోకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టాను. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రతి లొకేషన్లో మాకు నెమలి కనిపించింది. దీన్ని ఓ పాజిటివ్ సైన్గా తీసుకున్నాను. సుధీర్బాబుగారు అద్భుతంగా నటించారు. కథని నమ్మి, గ్రాండ్గా నిర్మించిన నా ఫ్రెండ్ సుమంత్కి ధన్యవాదాలు. ఈ సినిమాను ముందు పాన్ ఇండియాగానే అనుకున్నాం. అయితే ఇతర భాషల్లో డైలాగ్స్ సరిగ్గా కుదరలేదనిపించింది. నాకు నాలుగు భాషలు వచ్చు. నేనే కూర్చుని, పర్ఫెక్ట్గా చేయించాలంటే సినిమా రిలీజ్కు చాలా టైమ్ పడుతుంది. అందుకే ΄ాన్ ఇండియా రిలీజ్ వద్దనుకున్నాం’’ అన్నారు. -
Harom Hara Movie: ‘హరోం హర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఈ సినిమాతో మేమిచ్చే మెసేజ్ ఇదే..
-
రైనీ డే కావాలి.. రెడ్ అలర్ట్ లో షూట్
-
సుధీర్ గురించి అడగ్గానే హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
'హరోం హర' ట్రైలర్ను విడుదల చేసిన మహేశ్ బాబు
సుధీర్బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ను మేకర్స్ ప్రకటించారు. జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తుంది. సుమంత్ జి .నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.‘హరోం హర’ ట్రైలర్ను తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ను చూస్తుంటే ఈసారి సుధీర్బాబు హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సుధీర్ బాబు కూడా అందుకు తగ్గట్లు రిస్క్తో కూడుకున్న స్టంట్స్ చేసినట్లు కనిపిస్తుంది. ట్రైలర్తో సినిమాపై భారీ అంచనాలను సుధీర్ బాబు పెంచేశాడని చెప్పవచ్చు. జూన్ 14న ‘హరోం హర’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
భార్యకు స్పెషల్గా విష్ చెప్పిన టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం హరోం హర. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ జంటగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మే 31న రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. వచ్చేనెల జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు సుధీర్బాబు ప్రకటించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే సుధీర్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శినిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29,0 2006లో ఘనంగా జరిగింది. తాజాగా వివాహా వార్షికోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు సుధీర్. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫోటో అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు హీరో జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. Happy Anniversary my love 'Priya' 💐 You complete me 😘🤗…. First pic of hers I have with me. Pellichoopulu photo 😄 pic.twitter.com/005YWnBIzZ— Sudheer Babu (@isudheerbabu) May 29, 2024 -
సుధీర్ బాబు సినిమా.. మిస్డ్ కాల్తో ఐఫోన్, జీప్ గెలుచుకోండి
సుధీర్బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా విడుదల త్వరలో కానుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ను మేకర్స్ ప్రకటించారు. జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సుమంత్ జి .నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందుగా మే 31న సినిమా విడుదలకు యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు మరోసారి చిత్ర యూనిట్ ప్రకటించి. ఈ క్రమంలో కొత్తపోస్టర్తో పాటు అదిరపోయే గుడ్న్యూస్ను కూడా షేర్ చేసింది.మే 31న ఎక్కువ సినిమాలు విడుదల కానున్నడంతో ‘హరోం హర’ చిత్రాన్ని జూన్ 14కు వాయిదా వేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సుబ్రహ్మణ్యం పాత్రల కనిపించనున్నారు. అయితే, సినిమా ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ ఒక కాంటెస్ట్ను ప్లాన్ చేశారు. ఇందులో పాల్గొనాలనే వారు 08045936069 టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ కాల్ ఇస్తే చాలు. వారి వద్ద మీ నంబర్ సేవ్ అయిపోతుంది. అనంతరం లాటరీ పద్ధతిలో వారు విజేతలను ప్రకటిస్తారు. గెలుపొందిని వారు సుబ్రహ్మణ్యం జీప్ ,ఐ ఫోన్ 15 PRO, చేతక్ బైక్ను సొంతం చేసుకోవచ్చని మేకర్స్ తెలిపారు. దీంతో ఇప్పటికే భారీగా మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. సుధీర్ అభిమానులు కూడా దీనిని భారీగా షేర్ చేస్తున్నారు. మే 30న ‘హరోం హర’ ట్రైలర్ మహేశ్ బాబు చేతులు మీదుగా విడుదల కానుంది. -
మిస్సవుతున్నందుకు బాధగా ఉంది.. సుధీర్ బాబు ట్వీట్!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం హరోం హర. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మూవీని మే 31న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించారు.కానీ ఊహించని విధంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు సుధీర్ బాబు ట్వీట్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల హరోం హర మూవీని వాయిదా వేస్తున్నట్లు రాసుకొచ్చారు. సినిమా వాయిదా వేస్తున్నందుకు బాధగా ఉందన్నారు. స్పెషల్ డేట్ మిస్ అవుతున్నానని సుధీర్ బాబు ట్విటర్ ద్వారా వెల్లడించారు.సుధీర్బాబు తన ట్విటర్లో రాస్తూ..' వివిధ కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేస్తున్నాం. వచ్చేనెల జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తాం. మొదట అనుకున్న ప్రకారం కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నా. కానీ మిస్ అయినందుకు బాధగా ఉంది. అయినప్పటికీ జూన్ ఇప్పటికీ నా లక్కీ నెల. ఈ సమయంలోనే ప్రేమకథా చిత్రం, సమ్మోహనం చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే హరోం హర కూడా మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.' అని పోస్ట్ చేశారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. For various reasons, #HaromHara will now be releasing in theaters worldwide on 14th June. Although I feel sad for missing the release on the occasion of Krishna gari birthday, nevertheless June is still my lucky month. PKC & Sammohanam were both released during this time😎 I… pic.twitter.com/NZvcKA2Fdu— Sudheer Babu (@isudheerbabu) May 21, 2024 -
Sudheer Babu: సుధీర్ బాబు పుట్టినరోజు ప్రత్యేకం.. ఫోటోలు వైరల్
-
‘బండి’ది ఓట్ల రాజకీయం..!
కరీంనగర్: ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఎంపీ బండి సంజయ్కుమార్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓట్ల రాజకీయానికి తెరలేపారని కరీంనగర్, జగిత్యాల, హన్మకొండ జెడ్పీ చైర్మన్లు కనుమల్ల విజయ, దావ వసంత, సుధీర్బాబు ఆరోపించారు. కరీంనగర్లోని ఓ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోని సంజయ్ సర్పంచ్ల పదవీ కాలం ముగిశాక సానుభూతి చూపిస్తూ మొసలి క న్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను అబాసుపాలు చేయడానికే సర్పంచులకు రావాల్సి న బిల్లులపై పోరాటం చేస్తామని ఓట్ల జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ బెస్ట్ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఎంపీగా ఏం చేశావో చెప్పి ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. శ్రీరాముని ఫొటో, అక్షింతలు పంపి సెంటిమెంట్తో ఓట్లు దండుకునే ప్రయత్నం సరికాదన్నారు. ఇప్పటికైనా సంజయ్ అభివృద్ధిపై అబద్ధాలు మాట్లాడడం మానుకోవాల ని హితవు పలికారు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు మారుతి, నయీం పాల్గొన్నారు. ఇవి చదవండి: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు -
కుటుంబంతో తిరుమల సందర్శనలో హీరో సుధీర్ బాబు (ఫొటోలు)
-
Sudheer Babu Family Vacation: ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరో (ఫోటోలు)
-
నా కెరీర్లో గేమ్ చేంజర్ అయ్యే చిత్రమిది: సుధీర్ బాబు
‘‘హరోం హర’ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఒక్కో రోజు సెట్స్లో వెయ్యిమంది ఉండేవారు. మంచి ఎమోషన్స్, హై కమర్షియల్ కంటెంట్ ఉన్న చిత్రమిది. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. ఈ సినిమా నా కెరీర్లో గేమ్ చేంజర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. మాళవికా శర్మ హీరోయిన్. హైదరాబాద్లో యూనిట్ నిర్వహించిన ఈ చిత్రం టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘సుమంత్ జి. నాయుడు వంటి నిర్మాతలు చిత్ర పరిశ్రమకు రావాలి. మైత్రీ, సితార, వైజయంతి.. లాంటి బ్యానర్స్లానే కథని నమ్మి ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాణ సంస్థగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పరిశ్రమలోకి వచ్చినట్లేనని నమ్ముతున్నాను. నా కోసమే ఈ చిత్రకథ రాసుకొచ్చిన సాగర్కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా రెండో చిత్రానికి ఇంత హై బడ్జెట్ ఇస్తారని ఊహించలేదు. మంచి సినిమా చేశాం’’ అన్నారు జ్ఞానసాగర్. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. టీజర్కి వస్తున్న స్పందన చూస్తుంటే ఓ మంచి సినిమా చేశాననే నమ్మకం వచ్చింది’’ అన్నారు సుమంత్ జి. నాయుడు. ఈ వేడుకలో కెమెరామేన్ అరవింద్, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
'మామయ్య.. ఆగిపోలేదు మీ ప్రస్థానం'.. సుధీర్ బాబు ఎమోషనల్!
ఇటీవలే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుధీర్ బాబు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎమోషనలయ్యారు. మామయ్యను తలుచుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా సూపర్ కృష్ణ ఫోటోను పంచుకున్నారు. సుధీర్ బాబు తన ట్వీట్లో రాస్తూ 'మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం హరోం హర అనే పాన్ ఇండియా చిత్రంలో సుధీర్ బాబు నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 22న టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా మరిన్ని సేవ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఎం.బీ ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల చదువు కోసం ఉపకారవేతనాలు కూడా ఇవ్వనున్నారు. మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.#SSKLivesOn pic.twitter.com/lYdFgRIcaa — Sudheer Babu (@isudheerbabu) November 15, 2023 -
14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన మామా మశ్చీంద్ర.. అక్కడే స్ట్రీమింగ్!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం మామా మశ్చీంద్ర. మృణాలినీ రవి, ఈషా రెబ్బ హీరోయిన్లుగా నటించారు. హర్షవర్దన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ముఖ్య పాత్రలు పోషించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన చిత్రం జనాలను ఆకర్షించడంతో విఫలమైంది. దీంతో రెండువారాలకే బాక్సాఫీస్ దగ్గర తట్టాబుట్టా సర్దేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో సినిమా విడుదలైన 14 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్తో పాటు ఆహాలోనూ మామా మశ్చీంద్ర అందుబాటులో ఉంది. సినిమా కథేంటంటే? సుధీర్.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రల్లో నటించాడు. పరశురామ్కు స్వార్థమెక్కువ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నుతాడు. కానీ వాళ్లు బతికిపోతారు. పరశురామ్ కూతురు విశాలాక్షి(ఈషా రెబ్బ), పరశురామ్ దగ్గర పనిచేసే దాసు కూతురు మీనాక్షి(మృణాళిని రవి).. దుర్గ, డీజే అనే కుర్రాళ్లతో లవ్లో పడతారు. వీళ్లిద్దరూ పరశురామ్ పోలికలతో ఉండటంతో వాళ్లు తన మేనల్లుళే అని పరశురామ్కు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ముగ్గురి ప్రేమకు మంచి ముగింపు పడిందా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి.. చదవండి: లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని వందల కోట్లంటే? ఏ ఓటీటీలోకి రానుందంటే? -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్బాబు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే!
ఓటీటీల దెబ్బకు మనం సినిమాలు చూసే విధానమే మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు థియేటర్లో సినిమా రిలీజైన చాన్నాళ్లకు హెచ్డీ ప్రింట్ అందుబాటులోకి వచ్చేది. కానీ ఓటీటీల పుణ్యామా అని కొన్ని డైరెక్ట్గా వీటిలోనే రిలీజ్ అవుతుండగా, మరికొన్ని నెలలోపే స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఓ మూవీ అయితే థియేటర్లలో ఉండగానే ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయిందట. (ఇదీ చదవండి: 'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ) ఆ సినిమా ఏంటి? సుధీర్బాబు మూడు పాత్రల్లో నటించిన సినిమా 'మామా మశ్చీంద్ర'. అక్టోబరు 6న అంటే రెండు రోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ క్రమంలో డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించేసినట్లు తెలుస్తోంది. ఆ రోజే స్ట్రీమింగ్ అక్టోబరు 24న దసరా పండగ. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో సందడి గ్యారంటీ. మరోవైపు ఈ ఫెస్టివల్ సందర్భంగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు అదే పండక్కి అంటే అక్టోబరు 20 నుంచి 'మామా మశ్చీంద్ర' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ అయిపోతున్నట్లే. (ఇదీ చదవండి: ఫారెన్ టూర్లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?) #MaamaMascheendra from October 20. 📸 @PrimeVideoIN #MaamaMaschindra pic.twitter.com/Ptv3HhFio8 — SpreadFLIX (@spreadflix) October 8, 2023 -
'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ
టైటిల్: మామా మశ్చీంద్ర నటీనటులు: సుధీర్ బాబు, ఈషా రెబ్బా, హర్షవర్ధన్, మృణాళిని రవి, అజయ్ తదితరులు నిర్మాత: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ డైరెక్టర్: హర్షవర్ధన్ మ్యూజిక్: చైతన్ భరద్వాజ్, ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: పి.జి. విందా విడుదల తేదీ: అక్టోబర్ 06 నిడివి: 2h 29m కథేంటి? పరశురామ్(సుధీర్ బాబు)కి చాలా స్వార్థం. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపమని తన మనిషి దాసుకి చెప్తాడు. కానీ వాళ్ళు బతికిపోతారు. కట్ చేస్తే పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని రవి).. దుర్గ(సుధీర్ బాబు) డీజే (సుధీర్ బాబు) అనే కుర్రాళ్లతో లవ్ లో పడతారు. వీళ్ళిద్దరూ పరశురామ్ పోలికలతో ఉంటారు. వీళ్లు తన మేనల్లుడ్లే అని పరశురామ్కి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు పరశురామ్ ఏం తెలుసుకున్నాడు అనేది స్టోరీ. ఎలా ఉంది? సినిమా అంటే ఎవరెన్ని చెప్పినా వినోదం మాత్రమే. రెండు లేదా మూడు గంటలా అనేది ఇక్కడ మేటర్ కాదు. నవ్వించవా, థ్రిల్ చేశావా? ఇలాంటి అంశాలు మాత్రమే ఆడియెన్స్ చూస్తారు. ఈ విషయంలో మామ మశ్చీంద్ర పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే కామెడీ, థ్రిల్, డ్రామా.. ఇలా ఏ పార్ట్ లోనూ కనీసం అలరించ లేకపోయింది. ట్విస్టులు ఎక్కువ ఉంటే ప్రేక్షకులు థ్రిల్ అవుతారని డైరెక్టర్ అనుకున్నాడు. అవి రెండున్నర గంటలు బుర్ర గొక్కునేల చేశాయి! ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. జాలి దయలేని తండ్రి వల్ల చిన్నప్పుడే పరశురామ్ తల్లి చనిపోవడం... తల్లికి దక్కాల్సిన ఆస్తిని మేనమామ లాగేసుకోవడం.. ఆ తర్వాత పక్క ప్లాన్ తో మేనమామకు కూతురు వరసైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అస్తినంతా దక్కించుకోవడం.. ఇక వయసు పెరిగిన తర్వాత పరశురామ్.. అతడు కూతురు విశాలాక్షీ.. పరశురామ్ దగ్గర పనిచేసే దాసు.. అతడు కూతురు మీనాక్షి.. వీళ్ళ లైఫ్ లోకి దుర్గ, డీజే అనే వ్యక్తులు రావడం.. అల ఈ పాత్రల మధ్య ఎలాంటి డ్రామా నడిచింది చివరకి ఏమైంది అనేదే తెలియాలంటే సినిమా చూడాలి.. స్టోరీ పరంగా స్వార్థం అనే మంచి పాయింట్ తీసుకున్నారు కానీ దాన్ని చెప్పడంలో ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో చూసే ప్రేక్షకుడికి కూడా అది ఎక్కలేదు. హీరో సుదీర్ బాబు.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రలు చేశాడు. డీజేగా రెగ్యులర్ లుక్ లో కనిపించాడు. ఇది ఓకే. కానీ మిగతా రెండు పాత్రలు డిజైన్ అస్సలు సెట్ కాలేదు. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ తో చాలా చిరాకు పెట్టించారు. పబ్ లో వచ్చే ఆర్జీవీ ఎపిసోడ్ అయితే అనవసరం. ఇక సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చుట్టేశారు. క్వాలిటీ విషయం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే.. క్లైమాక్స్ లో మనిషిలో స్వార్థం గురించి చెప్పే సీన్ మాత్రమే. ఎవరెలా చేశారు? మూడు పాత్రల్లో ఏదో ప్రయోగం చేద్దామని హీరో సుధీర్ బాబు ప్రయత్నించాడు గానీ అది అడ్డంగా బెడిసికొట్టింది. పరశురామ్ కారెక్టర్ ని అయిన మంచిగా రాసుకుని సినిమా తీసుంటే బాగుండేది. ఇక హీరోయిన్స్ గ చేసిన ఈషా రెబ్బ, మృణాళిని రవి ఓకే ఓకే. ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ హర్షవర్ధన్ ఇందులో దాసు పాత్ర చేశాడు అది పర్లేదు. మిగతా కారెక్టర్స్ చేసిన వాళ్ళు మామ అనిపించారు. అజయ్, హరితేజ, రాజీవ్ కనకాల లాంటి వాళ్లని సరిగా వాడుకొలేకపోయారు. టెక్నికల్ విషయాల్లో ఈ సినిమాలోని పాటలు పెద్దగా గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు చాలా పూర్. రైటింగ్ కూడా అస్సలు ఎఫెక్టివ్గా లేదు. ఓవరాల్గా థియేటర్స్లో మామ మశ్చీంద నిలబడటం అంటే చాలా కష్టం. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
పోస్టర్ లో చూసి విజయ్ సేతుపతి అనుకున్నాను..!
-
‘మామా మశ్చీంద్ర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సాయిపల్లవికి అక్కగా వచ్చిన ఛాన్స్ ఈ కారణంతో పోయింది: హరితేజ
సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ . ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. సుధీర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోలు శర్వానంద్, విశ్వక్సేన్, శ్రీవిష్ణు, అశోక్ గల్లా ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు 'గుంటూరు కారం') ఈ సినిమాలో సినీ నటి హరితేజ కూడా ఉంది. ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది.. చెప్పుకోవాలనిపిస్తోంది. మంచి అనుభవం. నేను మీ ఫిలింస్కి ఫ్యాన్ సర్. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్కి రమ్మని పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో తెలుసా.. తెలంగాణ యాస రాలేదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను సర్. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్. మరీ అంత ప్యూర్ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు శేఖర్ ఖమ్మల కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇందులో హరితేజ ఓల్డ్ ఉమెన్ పాత్రలో కనిపించనుంది. -
వైరల్ విశాలాక్షి కొత్తగా అనిపించింది
సుధీర్బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘సుధీర్బాబుగారు చేసిన మూడు పాత్రల్లో దుర్గ పాత్రకు జోడీగా వైరల్ విశాలాక్షి పాత్ర చేశాను. ఏదో ఒకటి చేసి వైరల్ కావాలనుకునే మనస్తత్వం విశాలాక్షిది. ఈ పాత్ర నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమా కథను హర్షవర్ధన్గారు చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ సెట్స్లో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ ప్రభుతో ఓ సినిమా కమిట్ అయ్యాను. అలాగే నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘దయ’ వెబ్ సిరీస్ రెండో భాగం‘దయ 2’ వచ్చే సంవత్సరం ఆరంభమవుతుంది’’ అన్నారు. -
మహేష్ బాబు నా కోసం ఏదైనా చేస్తాడు ఎందుకంటే..
-
Mama Mascheendra Trailer Launch: ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు (ఫోటోలు)
-
ఇలాంటి కథను ఇప్పటి వరకు ఎవరూ రాయలేదు
-
'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, ఈషా రెబ్బా జంటగా నటిస్తోన్న చిత్రం మామ మశ్చీంద్ర. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ సుధీర్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?) ట్రైలర్ చూస్తే.. 'ఈ సృష్టింలో నువ్వొక్కడివే నిజం.. నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు' అనే డైలాగ్లో మొదలైంది. ట్రైలర్లో గమనిస్తే సుధీర్ డబుల్ రోల్తో పాటు విభిన్నమైన పాత్రలో కనిపించున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్లో సుధీర్ బాబు ఫ్యాన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో మీర్నాలిని రవి, హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. -
సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర, గ్లింప్స్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరోం హర. ది రివోల్ట్ అనేది ఉప శీర్షిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్నారు. నేడు(మే 11) సుధీర్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేశారు. అందరూ పవర్ కోసం గన్ పట్టుకుంటారు. కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది అని సుధీర్ బాబు కుప్పం యాసలో చెప్పే డైలాగ్స్ గ్లింప్స్లో ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కథతో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇకపోతే సుధీర్ బాబు మరోపక్క మామా మశ్చీంద్ర సినిమా చేస్తున్నాడు. దర్శకుడు హర్షవర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాలిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చదవండి: హీరోలకే ఎక్కువ పారితోషికం, వ్యత్యాసం ఎందుకు?: రకుల్ ప్రీత్ సింగ్ -
మామా మశ్చీంద్ర: గాలుల్లోన పాట విన్నారా?
సుధీర్ బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు, దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాలినీ రవి, ఈషా రెబ్బా కథానాయికలు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గాలుల్లోన కలలే వాలే...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్, నూతన మోహన్ పాడారు. ‘‘ఈ చిత్రంలో మూడు పాత్రల్లో కనిపించనున్నారు సుధీర్ బాబు. ‘గాలుల్లోన...’ అనే పాటలో దుర్గ, డీజే పాత్రల్లో ఆకట్టుకుంటారాయన. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: ఉగ్రం నా కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్గా నిలుస్తుంది: అల్లరి నరేశ్ -
మొన్న గుర్తుపట్టలేనంతగా.. ఇప్పుడేమో స్టైలిష్గా యంగ్ హీరో!
దుర్గ లావుగా, మాస్గా ఉంటాడు. దుర్గకు పూర్తి భిన్నంగా ఉంటాడు పరశురామ్. చేతిలో తుపాకీ పట్టుకొని ఏజ్డ్ గ్యాంగ్స్టర్లా కనిపిస్తాడు. డ్రెస్సింగ్, సిట్టింగ్.. అంతా ఫుల్ స్టయిల్. ఇక్కడున్న పరశురామ్ లుక్ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పాత్రల్లో సుధీర్బాబు నటిస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇటీవల దుర్గ లుక్ని, శనివారం పరశురామ్ లుక్ని రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం ఇది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా, సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి. We decided one surprise wasn't enough 😁 Meet #Parasuram!!#MaamaMascheendra#SBasParasuram@HARSHAzoomout @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/WNW2PVsWR5— Sudheer Babu (@isudheerbabu) March 4, 2023 -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సుధీర్ బాబు, కొత్తలుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో సుధీర్ బాబు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన యాక్షన్ ఫిలింతో అలరించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన హంట్ బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం ప్లాప్గా నిలిచింది. ఇక సుధీర్ బాబు తన తదుపరి సినిమాను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఆయన మామ మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఇందుకోసం ప్రమోగం చేస్తున్నాడని అప్పట్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్, ఫిట్నెస్ లుక్తో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఈ సినిమా కోసం బొద్దుగా తయారయ్యాడు. ప్రస్తుతం షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో తన లుక్ను తాజాగా విడుదల చేసి ఫ్యాన్స్కి షాకిచ్చాడు. దీనికి ‘బెట్.. ఇలా వస్తానని మీరు అనుకుని ఉండరు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. లావుగా ఉన్న సుధీర్ బాబుని ఇలా చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఇలా ట్విస్ట్ ఇచ్చావేంటి భయ్యా అంటూ నెటిజన్లు అతడి పోస్ట్ కామెంట్స్ చేస్తున్నారు. Bet you didn't see this coming 😉 Meet Durga! #MaamaMascheendra@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/IWhVydn4ie — Sudheer Babu (@isudheerbabu) March 1, 2023 -
సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ చిత్రం బాక్సాపీస్ వద్ద పెద్ద ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో చిత్రంతో అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన హర్షవర్ధన్ డైరెక్షన్లో మామ మశ్చీంద్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరలవుతోంది. మామ మశ్చీంద్ర మూవీలో సుధీర్ బాబు మేక్ ఓవర్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది. అందులో హీరో పూర్తి భిన్నమైన లుక్లో కనిపించారు. అది చూసిన ఆయన అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఆ వీడియోలో సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోయింది. అసలు ఆ వీడియోలో ఉన్నది అతనేనా అన్న అనుమానం కలుగుతోంది. సుధీర్ బాబు, హర్షవర్ధన్ కాంబినేషన్లో మామా మశ్చీంద్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. Leaked Video: @isudheerbabu's Shocking Makeover for #MamaMascheendra pic.twitter.com/VnLpMlTzzb — Gulte (@GulteOfficial) February 27, 2023 -
‘నాన్నకు ప్రేమతో.... ’అంటున్న స్టార్ హీరోలు
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఈ ‘అనుబంధం’ ఎవర్ గ్రీన్. అందుకే ఈ రిలేషన్ చుట్టూ కొత్త కథలు అల్లుకుని సినిమాలు తీస్తుంటారు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఈ అనుబంధం నేపథ్యంలో కొన్ని సినిమాలు రానున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం. కమల్హాసన్ తండ్రీకొడుకుగా రెండు పాత్రలు చేసిన ఓ చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). 1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి, అతని తనయుడు, ప్రభుత్వ ఉద్యోగి చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో కమల్హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. దేశభక్తుడైన సేనాపతి లంచగొండి అయిన తన తనయుడు చంద్రబోస్ను హత్య చేయడం ఈ సినిమాకే ప్రధాన హైలైట్. భారీ ఎత్తున ప్రేక్షకాదరణ పొందిన ఈ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్గా పాతికేళ్ల తర్వాత కమల్హాసన్, శంకర్ ‘ఇండియన్ 2’ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రధానంగా తండ్రీకొడుకుల నేపథ్యంలోనే సాగుతుందని తెలిసింది. ఇండియన్ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లో కూడా కమల్హాసన్ తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని కోలీవుడ్ టాక్. కథలోని కీలక సన్నివేశాలు 1920 నేపథ్యంలో ఉంటాయని తెలిసింది. అంటే కథ.. స్వాతంత్య్రానికి పూర్వం సేనాపతి, అతని తండ్రికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఉంటుందన్నట్లుగా ఈ చిత్రరచయితల్లో ఒకరైన జయ మోహన్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ► ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు లుక్స్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని వినికిడి. అలాగే ఈ సినిమా కథకు తండ్రీకొడుకుల సెంటిమెంట్ను జోడించారట ప్రశాంత్ నీల్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తండ్రి బాధ్యతను కొనసాగించి, సక్సెస్ అయ్యే కొడుకు పాత్రలో ప్రభాస్ కనిపిస్తారన్నది ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. దర్శకుడు శంకర్, హీరో రామ్చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కథాంశం తండ్రీతనయుల అనుబంధమేనట. ఈ రెండు పాత్రలనూ చరణే చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఓ వ్యక్తి శ్రమిస్తాడు. కానీ కొందరు స్వార్థపరుల కారణంగా అతనికి అన్యాయం జరుగుతుంది. ఆ తర్వాతి కాలంలో ఆ వ్యక్తి తనయుడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. తండ్రిని ఇబ్బంది పెట్టినవారిని శిక్షిస్తూనే, డబ్బు, స్వార్థం లేని రాజకీయాల కోసం ప్రజలు ఎలా చైతన్యవంతులై ఉండాలి? ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా విధులు నిర్వర్తించాలి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► సుధీర్బాబు ప్రస్తుతం ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నారు. హర్షవర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధానంగా తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో మూడు డిఫరెంట్స్ లుక్స్లో సుధీర్బాబు కనిపిస్తారని టాక్. ► తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగే చిత్రాలు బాలీవుడ్లోనూ కొన్ని ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తండ్రి కోసం గ్యాంగ్స్టర్గా మారే ఓ యువకుడి కథే ‘యానిమల్’ అని బాలీవుడ్ టాక్. ఇందులో రణ్బీర్ కపూర్ తండ్రిగా అనిల్కపూర్ కనిపిస్తారని సమాచారం. -
ఆఫీషియల్: విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి హాంట్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేం భరత్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ మూవీ ‘ముంబై పోలీస్’కు రీమేక్గా వచ్చిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. అయితే హంట్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద ఈ మూవీ బోల్తా పడింది. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ దీంతో ఈ మూవీ థియేటర్లో విడుదలైన 2 వారాలకే ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్కు అంతా రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తాజాగా ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది. అంటే ఈ శుక్రవారం నుంచి హంట్ ఓటీటీలో సందడి చేయబోతోంది. కాగా ఏ చిత్రమైన థియేటర్లో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుంది. కానీ సుధీర్ భాబు, శ్రీకాంత్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ Get ready for the action-packed #HuntTheMovie thriller movie releasing on Feb 10 on aha.#HuntTheMovieOnAHA Premieres Feb 10@isudheerbabu @_apsara_rani @actorsrikanth @bharathhere @Imaheshh #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @anneravi @adityamusic pic.twitter.com/qGghi97ip0 — ahavideoin (@ahavideoIN) February 9, 2023 -
అప్పుడే ఓటీటీలోకి ‘హంట్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి రావడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం.. ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి చిత్రం దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఆ మధ్య టాలీవుడ్ ఓ రూల్ పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ హంట్ చిత్రం మాత్రం రెండు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. -
నేను అలాంటి సినిమాలు చేయను: సుధీర్ బాబు
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి హిట్ టాక్ లభించింది. తాజాగా చిత్రబృందం సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. సుధీర్ బాబు మాట్లాడుతూ..'సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. ప్రేక్షకులు అందరూ సెకండాఫ్లో 30 నిమిషాలు ఎక్సలెంట్ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను సూపర్బ్ అంటూ పోస్టులు చేశారు. ఆడియన్స్ చాలా థాంక్స్. నేను అయితే రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసినవి అన్నీ డిఫరెంట్ సినిమాలే. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ సినిమా.' అని అన్నారు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..'క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. హీరో సుధీర్ బాబు గారు ధైర్యంగా ఆ రోల్ చేశారు. నేను ఎప్పటికీ గర్వపడే సినిమా. తెలుగులో ఇటువంటి సినిమా చేయడం తొలిసారి. భరత్ మా సినిమాలో నటించినందుకు థాంక్స్. సుధీర్ బాబుకు హ్యాట్సాఫ్. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే తపన ఆయనదే.' అని అన్నారు. భరత్ మాట్లాడుతూ..'తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్నేళ్లు టైమ్ తీసుకున్నా. మంచి సినిమా చేశా. కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్ వ్యాల్యూస్తో తీశాం. మహేష్ కెరీర్లో ఇదొక మంచి సినిమా. సుధీర్ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది.' అని అన్నారు. సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ మాట్లాడుతూ..'సినిమాకు లభిస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాం. కొత్తగా చేయడం నాకు చాలా ఇష్టం. 'పలాస' తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రమిది. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. సినిమాలో హీరోయిన్ లేదనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. రెస్పాన్స్ బాగుంది.' అని అన్నారు. -
‘హంట్’ మూవీ రివ్యూ
టైటిల్ : హంట్ నటీనటులు: సుధీర్బాబు, శ్రీకాంత్, భరత్, చిత్ర శుక్లా తదితరులు నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్ నిర్మాత: వీ ఆనంద్ ప్రసాద్ దర్శకుడు: మహేశ్ సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫి: అరుల్ విన్సెంట్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి విడుదల తేది: జనవరి 26, 2023 కథేంటంటే.. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు), మోహన్ భార్గవ్(శ్రీకాంత్), ఆర్యన్దేవ్(భరత్)ల చుట్టు ఈ కథ సాగుతుంది. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఏ కేసునైనా ఇట్టే సాల్వ్ చేస్తారు. వీరిలో ఆర్యన్ దేవ్ దారుణ హత్యకు గురవుతాడు. ఈ కేసును అర్జున్ ప్రసాద్ విచారిస్తాడు. తన స్నేహితుడిని చంపిదెవరో తెలుసుకునే క్రమంలో అర్జున్కు యాక్సిడెంట్ అవుతుంది. ఈ ప్రమాదం కారణంగా ఆయన గతం మర్చిపోతాడు. ఈ విషయాన్ని దాచి మళ్లీ ఆ కేసును విచారించే బాధ్యతను అర్జున్కే అప్పగిస్తాడు కమిషనర్ మోహన్ భార్గవ్. గతం మర్చిపోయిన అర్జున్ ఈ కేసును ఎలా చేధించాడు? ఈక్రమంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులేంటి? ఇంతకి ఆర్యన్ దేవ్ని హత్యచేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు చివరకు అర్జున్ ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హంట్ ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. గతం మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్..తన గతం తెలుసుకొని ఓ మర్డర్ కేసును ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా కథ. క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్.. అందరికి షాకివ్వడమే కాకుండా అప్పటి వరకు సినిమాపై ఉన్న ఒపీనియన్ని మార్చేస్తుంది. ఆ ఒక్క పాయింట్ మాత్రమే కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్కి ఒప్పుకొని సినిమాను తీసిన సుధీర్ బాబుని కచ్చితంగా అభినందించాల్సిందే. కానీ ఈ సినిమా కథనం మాత్రం ఆసక్తికరంగా సాగదు. మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. సినిమా ప్రారంభం అయిన కొన్ని క్షణాలకే అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. స్టార్టింగ్ కాస్త ఇంట్రెస్టింగ్గా కథనం సాగుతుంది. కానీ ఓ 15 నిమిషాల తర్వాత రొటీన్ సన్నివేశాలు..స్లో నెరేషన్ ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతుంది. దర్శకత్వం లోపం వల్ల కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ మిస్ అయ్యాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్లో కథలో వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆడియన్స్కి గట్టి షాకిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. గతం మర్చిపోయిన పోలీసు అధికారిగా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో సుధీర్ బాబు నటన అందరినీ మెప్పిస్తుంది. మోహన్ భార్గవ్ పాత్రకి శ్రీకాంత్ న్యాయం చేశాడు. కాస్త సీరియస్గా ఉండే పాత్ర తనది. భరత్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మెరిశాడు. ఏసీపీ ఆర్యన్ దేవ్గా ఆయన ఉన్నంతలో చక్కగా నటించారు. కథంతా అతని పాత్ర చుట్టే తిరుగుతుంది. మైమ్ గోపీ, కబీర్ సింగ్ దుల్హన్, మంజుల, సంజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక విషయాలకొస్తే.. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయింది. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
సుధీర్ బాబు హంట్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫోటోలు)
-
కృష్ణగారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను.. సుధీర్ బాబు ఎమోషనల్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు.మహేశ్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ ఏ.ఎమ్.బి. మాల్లో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 'గత ఏడాదిగా మా కుటుంబంలో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ గారి మరణం మాకు పెద్ద లాస్. మావయ్య చనిపోయాక ఇది నా ఫస్ట్ మూవీ. ఆయన లేని వెలితి కనిపిస్తుంది. నా ప్రతి సినిమా ఫస్ట్ షో చూసిన నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు నేను అది మిస్ అవుతా. మావయ్య చనిపోవడానికి 20 రోజుల ముందు సినిమా ఏదైనా చూస్తారా? అని ఆయన్ను అడిగితే... 'నేను ఎవరి సినిమాలు చూడను. మహేష్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామని అనుకుంటున్నా' అని చెప్పారట. ఇది నాకు గర్వకారణం. కెరీర్లో ఎంత దూరం వెళతానో తెలియదు. ఈ ప్రయాణం మావయ్య గారికి అంకితం. జన్మజన్మలు ఆయనకు రుణపడి ఉంటాను' అంటూ సుధీర్ బాబు పేర్కొన్నారు. -
ఆ సినిమా రీమేక్ నేను చేయాల్సింది: భరత్
‘టాలీవుడ్లో అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లో ఆ సినిమా తమిళ రీమేక్ నేను చేయాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను’అని తమిళ హీరో భరత్ అన్నారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన...చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ‘హంట్’లో కీలక పాత్ర పోషించారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మా త వి. ఆనం ద ప్రసాద్ నిర్మిం చారు. మహేష్ దర్శకత్వం వహిం చారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుం ది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టలేదు. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
ఆద్యంతం ఆసక్తికరంగా ‘హంట్’ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేసి, చిత్ర యూనిట్కి ఆల్ది బెస్ట్ చెప్పారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి’ అని శ్రీకాంత్ చెప్పే డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. టీజర్లో కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఆ కేసు ఏమిటన్నది ట్రైలర్లో చూపించారు. పట్టపగలు ఓ అసిస్టెంట్ కమిషనర్ హత్యకు గురవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో హీరోకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ఏం చేశారు? అనేది ఆసక్తికరం. ఈ చిత్రంలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. మెమరీ లాస్కు ముందు జరిగిన ఘటనలు, వ్యక్తులు గుర్తు లేకపోవడంతో అర్జున్ కొత్తగా కేసును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోజుకు ఒక కొత్త అనుమానితుడి పేరు వస్తుంది. దానికి తోడు 18 రోజుల్లో కేసును పరిష్కరించాలని టార్గెట్. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? థ్రిల్లింగ్ జర్నీగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. -
మహేష్ బాబు ఒకప్పటిలా లేడు: సుధీర్ బాబు
-
' హంట్ మూవీ ' హీరో సుధీర్ బాబుతో " స్పెషల్ చిట్ చాట్ "
-
స్పెషల్ ఇంటర్వ్యూ విత్ హీరో సుధీర్ బాబు
-
డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్.. సుధీర్ బాబు యాక్షన్ స్టంట్స్ మేకింగ్ వీడియో రిలీజ్
సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘హంట్’. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సెస్ని ఫ్రాన్స్కి చెందిన క్యాంపస్ యూనివర్స్ కాస్కేడ్స్ టీమ్ డిజైన్ చేసింది. సుధీర్బాబు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలోని రిస్కీ ఫైట్స్కి డూప్ వాడలేదు. రోప్, బెడ్లాంటివి ఏవీ లేకుండానే ఫైట్స్ చేశాం. ఈ సినిమాలో అన్నీ మరపోయే రెండు షేడ్స్ ఉన్న అర్జున్ పాత్ర చేశాను. జ్ఞాపకశక్తి కోల్పోక ముందు కోల్పోయాక.. ఇలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. ‘‘హై వోల్టేజ్యాక్షన్ థ్రిల్లర్గా ఈ త్రాన్ని రూపొందించాం. హాలీవుడ్ వర్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’కి స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘జాన్ విక్ 4’కి చిత్రానికి కూడా వాళ్లే స్టంట్ కొరియోగ్రాఫర్స్. ఈ ముగ్గురికీ తొలి భారతీయ చిత్రం ఇది’’ అన్నారు ఆనందప్రసాద్. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి.