Sudheer Babu
-
అనంత నిధి కోసం సుధీర్ బాబు ‘జటాధర’.. రంగంలోకి జీ స్టూడియోస్
సుధీర్ బాబు మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన తాజాగా నటిస్తోన్న సినిమా ‘జటాధర’. రుస్తుం తరువాత మళ్లీ ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. సూపన్ నేచురల్ థ్రిల్లర్గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జటాధర చిత్రంలోకి జీ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చింది.ఈ మేరకు జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘జీ స్టూడియోస్లో మేం ఇంకా ఎన్నో కథలను అందించాలని, అవి తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నాం. జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోంది. అందుకే ప్రస్తుతం సుధీర్ బాబు తన బాడీని పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత మరిన్ని అప్డేట్స్ అందించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. మొత్తం మీద, జటాధర సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులకు, అలాగే పాన్ ఇండియా మార్కెట్ లో మంచి హైప్ క్రియేట్ చేయబోతోంది. -
మీర్పేట్ మర్డర్ మిస్టరీ కొత్త టెక్నాలజీతో కేసు విచారణ
-
మంచు ఫ్యామిలీ మెంబర్స్ పై 3 కేసులు : సీపీ సుధీర్ బాబు
-
మహేష్ బాబు మేనల్లుడి పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
కుమారుడి బర్త్ డే.. వీడియో షేర్ చేసిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఇటీవలే మా నాన్న సూపర్ హీరో అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. తండ్రి, కుమారుల కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ణ జోడీగా హీరోయిన్గా నటించింది. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా సుధీర్ బాబు తన కుమారుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఫ్యామిలీ సభ్యులతో కలిసి ఆయన కుమారుడు చరిత్ మానస్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఈ రోజు నాకు ప్రత్యేకమంటూ కుమారుడిపై ప్రేమను చాటుకున్నారు. చరిత్ మానస్ పుట్టినరోజు వేడుకలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా, సోదరి మంజుల కూడా సందడి చేశారు.కాగా.. సూపర్ స్టార్ కృష్ణ, ఇందిరా దేవి కుమార్తె ప్రియదర్శినిని సుధీర్ బాబు పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు చరిత్ మానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని బర్త్ డే వేడుకల్లో సుధీర్ బాబు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంజుల సోషల్ మీడియాలో షేర్ చేసింది. On your special day, I want you to know how much I love and cherish you. You're growing up to be an incredible individual! Happy birthday, cherry ❤️ @Just_Charith pic.twitter.com/7HGrRdno55— Sudheer Babu (@isudheerbabu) November 22, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన తండ్రి సెంటిమెంట్ తెలుగు సినిమా
మరో తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. నాన్న సెంటిమెంట్ స్టోరీతో తీసిన ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించారు. కానీ దానికి రెండు రోజుల ముందే మరో ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ఇంతకీ ఇదే మూవీ? ఎందులో అందుబాటులో ఉందనేది చూద్దాం.సుధీర్ బాబు నటించిన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. దసరాకు థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదే టైంలో నాలుగైదు సినిమాలు రిలీజ్ కావడం, ఇది స్లోగా సాగే ఎమోషనల్ కావడంతో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ జనాలకు సరిగా రీచ్ కాలేదు. ఇప్పుడు నెలరోజులు పూర్తయ్యాయో లేదో ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తొలుత జీ5 ఓటీటీలో నవంబర్ 15న స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లోకి సైలెంట్గా వచ్చేసింది. సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' స్టోరీ గురించి మాట్లాడుకుంటే.. రోజుల వయసులోనే తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), అనుకోని కారణాల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతాడు. ఓరోజు ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ జాని వల్ల దురదృష్టమే అని ఎప్పుడూ ఈసడించుకుంటూ ఉంటాడు. ఓ రోజు ఇతడు జైలుకి వెళ్తాడు. సవతి తండ్రిని విడిచిపించాలంటే జానికి కోటి రూపాయలు అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే మిగతా కథ.(ఇదీ చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు మిథున్ చక్రవర్తి పర్స్ కొట్టేసిన దొంగలు) -
ఓటీటీలో నాన్న సినిమా.. అధికారిక ప్రకటన
యంగ్ హీరో సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా 'మా నాన్న సూపర్ హీరో'. గత నెలలో దసరా సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఎందుకనో ప్రేక్షకులు దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు నెల తిరిగేసరికల్లా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)తండ్రీకొడుకుల అనుబంధం అనే కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమాని నవంబర్ 15 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే ఈ వీకెండ్లో వచ్చేస్తుంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయిచంద్, షాయాజీ షిండే తండ్రి పాత్రల్లో నటించారు. కథంతా వీళ్ల ముగ్గురు మధ్యనే నడుస్తుంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.'మా నాన్న సూపర్ హీరో' విషయానికొస్తే.. చిన్నతనంలో తల్లిని కోల్పియిన జాని (సుధీర్ బాబు), కొన్ని పరిస్థితుల వల్ల సొంత తండ్రి ప్రకాశ్(సాయిచంద్)కి చిన్నప్పుడే దూరమవుతాడు. అనాథశ్రమంలో పెరుగుతున్న ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. కానీ మంచిగా చూసుకోడు. ఓ రోజు పెంచిన తండ్రిని జైలు నుంచి విడిచిపించాలంటే కోటి రూపాయలు జానికి అవసరమవుతాయి. అదే టైంలో ప్రకాష్ (సాయిచంద్)కి కోటిన్నర రూపాయల లాటరీ తగులుతుంది. ఆ డబ్బులు తీసుకురావడానికి తనకు తోడుగా కేరళకు రమ్మని జానిని ప్రకాష్ కోరుతాడు. చివరకు ఏమైంది.. సొంత తండ్రి కొడుకు కలిశారా అనేదే కథ.(ఇదీ చదవండి: నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్) -
'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ
ఈసారి దసరాకి అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్. వీటిలో వైవిధ్యభరిత చిత్రాలున్నాయి. ఇందులో ఓ మూవీనే 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. నాన్న సెంటిమెంట్తో తీసిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరో అనిపించుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ప్రకాశ్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోతుంది. రోజుల పిల్లాడిని అనాథశ్రమంలో ఉంచి, పనికోసం బయటకెళ్తాడు. ఊహించని విధంగా అరెస్ట్ అవుతాడు. 20 ఏళ్లు జైల్లోనే ఉండిపోతాడు. అంతలో పిల్లాడు జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్ద వాడవుతాడు. ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) అనే స్టాక్ బ్రోకర్ దత్తత తీసుకుంటాడు. అయితే జాని రాకతో తన కుటుంబానికి అరిష్టం పట్టుకుందని శ్రీనివాస్కి కోపం. కానీ జానికి మాత్రం నాన్నే సూపర్ హీరో. తండ్రిపై విపరీతమైన ప్రేమ. ఊరంతా అప్పులు చేసే శ్రీనివాస్.. ఓ రాజకీయ నాయకుడికి కోటి రూపాయలు బాకీ పడతాడు. ఇంతకీ ఈ డబ్బు సంగతేంటి? చివరకు సొంత తండ్రి కొడుకులైన జాని-ప్రకాశ్ కలిశారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు.. అరె మన దగ్గర ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదా అని చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోరిక తీర్చడానికి అన్నట్లు వచ్చిన మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా స్ట్రెయిట్గా కథ చెప్పి మెప్పించారు.చేయన నేరానికి పోలీసులకు దొరికిపోయి, కొడుక్కి ప్రకాశ్ దూరమవడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే జాని, శ్రీనివాస్ పాత్రల పరిచయం. పెంపుడు తండ్రి అంటే కొడుకు జానికి ఎంత ఇష్టమో చూపించే సీన్స్. శ్రీనివాస్కి దత్త పుత్రుడు అంటే ఉండే కోపం, అయిష్టత. ఇలా నెమ్మదిగా ఈ రెండు పాత్రలకు అలవాటు పడతాం. ఇంతలో ప్రకాశ్ పాత్ర వస్తుంది. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. చిన్నప్పుడు విడిపోయిన తండ్రి-కొడుకు ఎలా కలుసుకుంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో కోటిన్నర లాటరీ టికెట్ అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ప్రకాశ్ దగ్గరున్న లాటరీ టికెట్ని కొట్టేయడానికి కొన్ని పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరోవైపు తండ్రిని కాపాడుకునేందుకు పెంచిన కొడుకు పడే తాపత్రయం ఇలాంటి అంశాలతో సెకండాఫ్ నడిపించారు.రెండు గంటల సినిమా చూస్తున్నంతసేపు ఓ నవల చదువుతున్నట్లు ఉంటుంది. కానీ హీరోయిన్ సీన్స్, సెకండాఫ్ ప్రారంభంలో రాజు సుందరం ట్రాక్ నిడివి పొగిడించడం కోసం పెట్టారా అనే సందేహం కలుగుతుంది. ఇవి లేకపోయినా సరే సినిమా ఫ్లో దెబ్బతినదు. స్లో నెరేషన్ కూడా కొందరు ప్రేక్షకులకు ల్యాగ్ అనిపించొచ్చు. క్లైమాక్స్లోనూ అసలైన తండ్రి-కొడుకు కలుసుకున్నట్లు డ్రామా-ఎమోషన్స్ వర్కౌట్ చేయొచ్చు. కానీ సింపుల్గా తేల్చేశారా అనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?సుధీర్ బాబు వరకు ఇది డిఫరెంట్ పాత్ర. ఇదివరకు బాడీ చూపిస్తూ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇందులో మాత్రం సెటిల్డ్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే క్యారెక్టర్ బాగుంది కానీ ఈ పాత్రకు ఇంకాస్త డెప్త్, ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. సెకండాఫ్లో తండ్రిగా సాయిచంద్ తనదైన యాక్టింగ్తో జీవించేశాడు. మేజర్ సీన్స్ అన్నీ ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి. దీంతో హీరోయిన్తో పాటు మిగిలిన పాత్రలకు పెద్ద స్కోప్ దొరకలేదు.దర్శకుడు మంచి ఎమోషనల్ కథ అనుకున్నాడు. అందుకు తగ్గ పాత్రధారుల్ని తీసుకున్నాడు. కానీ సినిమా తీసే క్రమంలో కాస్త తడబడ్డాడు. కానీ ఇలాంటి స్టోరీ కూడా తీయొచ్చనే అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎలాంటి కమర్షియల్ వాసనల జోలికి పోకుండా తీసిన డ్రామా సినిమా ఏదైనా చూద్దామనుకుంటే 'మా నాన్న సూపర్ హీరో'పై ఓ లుక్కేయండి. మరీ కాకపోయినా.. నచ్చేస్తుంది!-చందు డొంకాన -
తండ్రీ కొడుకుల ముక్కోణపు ప్రేమకథ: సుధీర్ బాబు
‘‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా యూనివర్సల్ పాయింట్తో రూపొందింది. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు మధ్య నడిచే ముక్కోణపు ప్రేమకథ అని చెప్పాచ్చు. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను’’ అని సుధీర్ బాబు అన్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆర్ణ జోడీగా నటించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సాయి చంద్, సాయాజీ షిండే ఇతర పాత్రల్లో నటించారు. వి సెల్యులాయిడ్స్, కామ్ ఎంటర్టైన్ మెంట్పై సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు పంచుకున్న విశేషాలు...⇒ అభిలాష్ చేసిన ‘లూజర్’ సిరీస్ చూశా.. బాగా నచ్చింది. తను ‘మా నాన్న సూపర్ హీరో’ కథ చెప్పినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది. పూర్తిస్థాయిలో ఫాదర్ ఎమోషన్ ఉన్న సినిమాలు అరుదు. ఇద్దరు తండ్రులు, ఒక కొడుకు కథ ఇంతకుముందెన్నడూ రాలేదు. ‘మా నాన్న సూపర్ హీరో’ మొదటి చిత్రం. నా కెరీర్లో చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. మానవ సంబంధాలపై ఉన్న ఈ పాయింట్ కచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది. మొదటి ఆట నుంచే ఆడియన్ ్స, క్రిటిక్స్ నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వస్తుందనే నమ్మకం ఉంది. ⇒ ‘హరోం హర’ సినిమాకి ముందే ‘మా నాన్న సూపర్ హీరో’ కి ఒప్పుకున్నా. అయితే ఫలానా జోనర్లో సినిమా చేయాలని నేనెప్పుడూ ప్రణాళిక వేసుకోను. ఒక నటుడిగా అన్ని జోనర్ సినిమాలు చేయాలి. నాకు వచ్చిన కథల్లో ఏది బాగుంటే అది చేస్తాను. అలా వచ్చిన కథే ‘మా నాన్న సూపర్ హీరో’. నాన్నపై కొడుకు ప్రేమని ‘యానిమల్’ సినిమాలో అగ్రెసివ్ అండ్ బోల్డ్గా చూపించినా జనాలకి నచ్చింది. కానీ, ‘మా నాన్న సూపర్ హీరో’ లో నాన్నమీద కొడుకుకి ఉన్న లవ్ని ప్రేమతో ప్రాజెక్ట్ చేస్తున్నాం. సన్నివేశాలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. రియల్ లైఫ్లో మా నాన్నగారు చాలా క్రమశిక్షణ గల మనిషి. ఆయన క్రమశిక్షణ మా అక్కకి, నాకు స్ఫూర్తినిచ్చింది. ⇒ మహేశ్ బాబుగారు మా చిత్రం ట్రైలర్ చూసి మనసుని తాకింది అన్నారు. ట్రైలర్ చివర్లో వచ్చే మహేశ్ బాబు పేరు ఉన్న డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ చాలా వినోదాత్మకంగా ఉందని చెప్పారు. నా సినిమాల గురించి ఇంత చెప్పడం ఇదే తొలిసారి. యువీ క్రియేషన్ ్స విక్కీ, వంశీ, సునీల్, నేను కలిసి 2002లో సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్లం. ఇప్పుడు వాళ్ల బ్యానర్లో నేను హీరోగా చేయడం సంతోషంగా ఉంది. అలాగే ఎలాగైనా హిట్ కొట్టాలనే బాధ్యత ఉంది. వందశాతం హిట్ కొడతామనే నమ్మకం వచ్చింది. సాయిచంద్, సాయాజీ షిండేగార్లతో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ చూశాక నా నమ్మకాన్ని అభిలాష్ నిలబెట్టుకున్నాడనిపించింది. తను భవిష్యత్లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.. మంచి సినిమాలు తీస్తాడు. జై క్రిష్ సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది. నా కెరీర్కి ఉపయోగపడే, వైవిధ్యమైన పాత్ర ఉంటే విలన్గా చేస్తాను. నా తర్వాతి సినిమా ‘జటాధరా’ నవంబరులో ్రపారంభం అవుతుంది. ఈ సినిమా తర్వాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 70ఎంఎం బ్యానర్లో మరో చిత్రం చేస్తాను. -
మహేశ్ రిలీజ్ చేసిన 'మా నాన్న సూపర్ హీరో' ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. పేరుకి తగ్గట్లే నాన్న అనే సెంటిమెంట్తో ఈ సినిమా తీశారు. హీరోకి ఇద్దరు నాన్నలు ఉండటం అనే కాన్సెప్ట్తో టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: మెగా హీరో 'మట్కా' టీజర్ ఎలా ఉందంటే?)డబ్బు కోసం కొడుకుని మరొకరి అమ్మేస్తాడు ఓ తండ్రి. పెరిగి పెద్దయిన తర్వాత ఈ విషయం కొడుక్కి తెలుస్తుంది. ఆ తర్వాత కన్న తండ్రి, పెంచిన తండ్రితో ఎలాంటి జర్నీ సాగింది. చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఫుల్ ఆన్ ఎమోషనల్ రైడ్గా ఉండబోతుందని తెలుస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కనెక్ట్ అయ్యేలా ఉంది.సుధీర్ బాబు కొడుకుగా నటించగా.. సాయాజీ షిండే, సాయిచంద్ తండ్రి పాత్రల్లో కనిపించారు. అభిలాష్ కంకర దర్శకుడు. అక్టోబరు 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే దసరా రేసులో వేట్టయిన్, విశ్వం, జనక అయితే గనక సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు సూపర్ హీరో నాన్న పోటీలో ఉన్నాడు. మరి హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: మణికంఠ గాలి తీసేసిన నాగార్జున.. స్ట్రాటజీలన్నీ బయటపెట్టేసి) -
పెళ్లినాటి రేర్ ఫోటోలు పంచుకున్న సుధీర్ బాబు.. సందడిగా స్టార్ హీరోలు
-
సుధీర్ బాబు పెళ్లి వీడియో వైరల్.. మహేశ్ బాబే హైలెట్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి పెళ్లి సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో తన పెళ్లి వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను అభిమానులతో సుధీర్ పంచుకున్నారు. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: హీరోయిన్తో పెళ్లికి రెడీ అవుతున్న శింబుహీరో సుధీర్ బాబు.. సూపర్స్టార్ కృష్ణ కుమార్తె ప్రియదర్శినితో 2006లో వివాహం అయింది. అయితే, నాటి ఫోటోలకు తన కొత్త సినిమా 'మా నాన్న సూపర్ హీరో' నుంచి ఒక పాటను తీసుకుని వీడియో రూపంలో క్రియేట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. అందులో సుధీర్ బాబు,ప్రియదర్శిని దంపతులను ఆశీర్వదిస్తున్న మహేశ్ బాబు ఫోటో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.నాడు పెళ్లిచూపుల ఫోటో షేర్ చేసిన సుధీర్సుధీర్ బాబు గతంలో కూడా వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి ప్రియదర్శిని ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో క్యూట్గా కనిపిస్తుందెరో కాదు అంటూనే.. ప్రియదర్శినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ పిక్ కూడా పెళ్లిచూపుల ఫోటో అని, తన దగ్గర ఉన్న ఆమె మొదటి ఫోటో ఇదేనని ఆయన పేర్కొన్నారు.2010లో ఏ మాయ చేసావే చిత్రంతో ఒక సపోర్టింగ్ రోల్తో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'మా నాన్న సూపర్ హీరో' అనే చిత్రంతో అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు సుధీర్ బాబు రానున్నారు. అభిలాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉండనుంది. ఈ మూవీలో సుధీర్ బాబు తండ్రిగా సాయిచంద్ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) -
లగ్గం రెడీ
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘లగ్గం’. రమేష్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 25న ఏషియన్ సురేష్ సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ రిలీజ్ పోస్టర్ను ఆవిష్కరించి, యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు హీరో సుధీర్బాబు. ‘‘తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నటీనటులు పూర్తి తెలంగాణ యాస మాట్లాడకుండా వాడుక భాషలో మాట్లాడతారు’’ అన్నారు రమేష్ చెప్పాల. ‘‘ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు వేణుగోపాల్ రెడ్డి. -
'మా నాన్న సూపర్ హీరో' నుంచి మరో సాంగ్ విడుదల
'హరోం హర' సినిమా తర్వాత సుధీర్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లూజర్ వెబ్సిరీస్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధాలకు నిజమైన అర్థాన్ని తెలియజేసేలా ‘మా నాన్న సూపర్ హీరో’ ఉంటుంది. 'వేడుకలో..' అంటూ సాగే ఒక సాంగ్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో రాజు సుందరం ఓ కీలక పాత్రలో నటిస్తూనే, కొరియోగ్రాఫర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాయిచంద్, సాయాజీ షిండే, శశాంక్, ఆమని, హర్షిత్ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకు సంగీతం: జై క్రిష్, కెమెరా: సమీర్ కల్యాణి. -
థ్రిల్లింగ్ జటాధర
సుధీర్బాబు హీరోగా రూ΄పొందనున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకుడు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్బాబు ప్రొడక్షన్ బ్యానర్పై శివివన్ నారంగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ నిర్మించనున్న ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘జటాధర’ కథ శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయికలో ఉంటుంది. ఈ రెండు ప్రపంచాలను ప్రేక్షకులు వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త అనుభూతిని ΄అందుతారు. ప్రేరణ అరోరాగారితో కలిసి ఈ సినిమా కోసం ప్రయాణం చేయటం గొప్ప అనుభూతి. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘జటాధర’ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ని హైదరాబాద్లో ప్రారంభిస్తాం. ఈ సినిమాలో హీరోయిన్గా ఓ బాలీవుడ్ స్టార్ నటించనున్నారు. అలాగే ప్రతినాయకిపాత్రలో మరో బాలీవుడ్ నటి నటిస్తారు. 2025 శివరాత్రికిపాన్ ఇండియా ప్రేక్షకులను ఈ మూవీ అలరించనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సుధీర్ బాబు 'జటాధర'.. మరో ఇంట్రెస్టింగ్ లుక్
సుధీర్ బాబు హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా 'జటాధర'. గతంలో ఈ సినిమాకు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో పోస్ట్ రిలీజ్ చేశారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తీస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో మొదలుకానుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: బిగ్బాస్ 8: అభయ్ ఎలిమినేట్ అయ్యాడుగా.. కొత్త చీఫ్ ఎవరంటే?)వచ్చే ఏడాది శివరాత్రికి థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కాంబోలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. కొత్త లుక్లో సుధీర్ బాబు సరికొత్తగా, శక్తివంతంగా కనిపిస్తున్నాడు. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్పై దీన్ని నిర్మిస్తున్నారు. ఇక సుధీర్ బాబు హీరోగా నటించిన 'మా నాన్న సూపర్ హీరో'.. అక్టోబరు 11న థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: ఆలియా కూతురి విషయంలో నెరవేరిన ఎన్టీఆర్ కోరిక!) -
నాన్నను ఇంతవరకు హగ్ చేసుకోలేదు.. సుధీర్ బాబు ఎమోషనల్
-
సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమా టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
ఆ విషయం చెప్పినప్పుడు నాన్న హృదయం ముక్కలైంది: హీరో
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మా నాన్న సూపర్ హీరో. గురువారం (సెప్టెంబర్ 12న) ఈ సినిమా టీజర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా తన తండ్రి పోసాని నాగేశ్వరరావు గురించి చెప్తూ సుధీర్ స్టేజీపై ఎమోషనల్ అయ్యాడు.ఎంత ప్రేమ ఉన్నా..అతడు మాట్లాడుతూ.. 'మా నాన్నపై నాకెంత ప్రేమ ఉన్నా సరే ఇంతవరకు ఐ లవ్యూ చెప్పలేదు. హగ్ కూడా చేసుకోలేదు. లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే బయటకు చూపించుకోలేను. ఇప్పటికీ ఎన్నోసార్లు వెళ్లి ఆయన్ను హత్తుకోవాలనిపిస్తుంటుంది కానీ ఆగిపోతుంటాను. అందుకే నా పిల్లల్ని హగ్ చేసుకుంటాను. ఎక్కువగా గొడవలుమా నాన్న ఎప్పుడూ, ఎవరిపైనా కోప్పడరు. నాకేమో చిన్నదానికే కోపం వచ్చేస్తుంటుంది. బాల్యంలో ఎక్కువగా గొడవలు పెట్టుకునేవాడిని. దాంతో అమ్మానాన్న.. నువ్వు మాకు పుట్టలేదు, అడవిలో దొరికావు అని చెప్పేవారు. 12వ తరగతికి వచ్చేదాకా అదే నిజమని నమ్మాను. మా ఫ్రెండ్స్తో కూడా నేను మా పేరెంట్స్కు పుట్టలేదంట, దొరికాను అని చెప్పేవాడిని.(చదవండి: 'మా నాన్న సూపర్ హీరో'.. ఎమోషనల్ టీజర్ వచ్చేసింది!) ఏడేళ్లపాటు కష్టపడ్డారునాకు ఏడేళ్ల వయసున్నప్పుడు నాన్న అప్పు చేసి మరీ పెస్టిసైడ్ షాప్ పెట్టారు. ఉదయం తొమ్మిదింటికి వెళ్లి రాత్రి 12 గంటలకు వచ్చేవారు. అలా ఏడేళ్లపాటు కష్టపడ్డారు. ఈరోజు ఇండియాలోనే పెద్ద డిస్ట్రిబ్యూటర్గా ఎదిగారు. ఆయన ఏం చేసినా మా సంతోషం కోసమే చేసేవారు. తను కష్టజీవి.సుధీర్ ఎమోషనల్నేను సినిమాల్లోకి వస్తానన్నప్పుడు తన గుండె పగిలినంత పనైంది. అదృష్టవశాత్తూ ఇండస్ట్రీలో నాకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాను' అని సుధీర్బాబు భావోద్వేగానికి లోనయ్యాడు. మా నాన్న సూపర్ హీరో మూవీ అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.చదవండి: ఓడిన సోనియా.. గెలిచి చూపించిన నిఖిల్ -
'మా నాన్న సూపర్ హీరో'.. ఎమోషనల్ టీజర్ వచ్చేసింది!
హరోం హర తర్వాత సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్గా నటిస్తున్నారు. లూజర్ వెబ్సిరీస్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని వీ సెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు.తండ్రీకొడుకుల ప్రేమ, అనుబంధం కథాంశంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చాలా రోజుల తర్వాత పోకిరి నటుడు షాయాజీ షిండే టాలీవుడ్ అభిమానులను అలరించనున్నారు. 'నేను కష్టపడుతున్నాను కదా నాన్న.. ఇక నువ్వేందుకు పనిచేయడం' అన్న డైలాగ్ చూస్తుంటే ఈ మూవీ ఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే 'అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడుక్కున్నట్లు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయినట్టు కాదు!! లాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తండ్రీ, కుమారుల అనుబంధం, ఎమోషన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది దసరా పండుగకు అక్టోబర్ 11న థియేటర్లలో మా నాన్న సూపర్ హీరో సందడి చేయనుంది. ఈ చిత్రంలో సాయిచంద్, రాజు సుందరం, శశాంక్, ఆమని, చంద్ర, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్మని అన్నం పెట్టమని అడిగితే అడ్డుకునట్టు కాదు... నాన్న ముందు తగ్గితే ఓడిపోయాయినట్టు కాదు!!A heartwarming tale coming this Dusshera#MNSHTeaser - https://t.co/ke3FnMyr9w#MaaNannaSuperHero grand release on Oct 11th@abhilashkankara @sayajishinde #SaiChand @jaymkrish… pic.twitter.com/asU6FJtUwe— Sudheer Babu (@isudheerbabu) September 12, 2024 -
దసరా బరిలో సుధీర్ బాబు.. ఈ సారైనా హిట్ కొడతాడా?
ఇటీవలే హరోం హర మూవీతో మెప్పించిన టాలీవుడ్ స్టార్ సుధీర్బాబు. తాజాగా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'మా నాన్న సూపర్ హీరో'. ఇందులో ఆర్ణ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీసెల్యూలాయిడ్స్, క్యామ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.తండ్రీ, తనయులు అనుబంధం నేపథ్యంలో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ మూవీని రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని దసరా సందర్భంగా విడుదల చేయనున్నట్లు పోస్టర్ను పంచుకున్నారు. అయితే రిలీజ్ డేట్ను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం మానాన్న హీరో అని చిత్రయూనిట్ తెలిపింది. కాగా.. చిత్రంలో సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు.#MaaNannaSuperhero post production works underway.The emotional saga will hit the big screens during Dussehra. Release date announcement soon ❤🔥Stay tuned for more exciting updates 💥@isudheerbabu #SaiChand @sayajishinde @abhilashkankara @mahesh_films @vcelluloidsoffl… pic.twitter.com/AZQjpGRPF0— UV Creations (@UV_Creations) August 27, 2024 -
ప్రభాస్ స్థాయి వేరు.. నీలాంటి వారిని పట్టించుకోరు: సుధీర్ బాబు
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి చిత్రంపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ సినిమా తనకు నచ్చలేదని అన్నారు. అంతేకాదు కల్కిలో ప్రభాస్ లుక్ జోకర్లా అనిపించిందని కించపరిచేలా మాట్లాడారు. దీంతో అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి. ప్రభాస్ను ఉద్దేశించిన అతను చేసిన కామెంట్స్పై టాలీవుడ్ ప్రముఖులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు అర్షద్ వార్సీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.తాజాగా టాలీవుడ్ హీరో సుధీర్ బాబు సైతం అర్షద్ కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాస్ విషయంలో మీరు నిర్మాణాత్మకంగా విమర్శించినా ఫర్వాలేదు.. కానీ అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. ప్రొఫెషనలిజం లేని ఇలాంటి కామెంట్స్ నీలాంటి వారి నుంచి వస్తాయని ఊహించలేదని అన్నారు. ఇలా సంకుచిత మైండ్సెట్తో ఆలోచించే నీలాంటి వారిని ఆయన పట్టించుకోరని తెలిపారు. ఎందుకంటే ప్రభాస్ స్థాయి చాలా పెద్దదని సుధీర్ బాబు తన ట్విటర్లో పోస్ట్ చేశారు. కాగా..అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని రెబల్ స్టార్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.It's okay to criticize constructively but it's never okay to bad-mouth. Never expected the absence of professionalism from Arshad Warsi. Prabhas's stature is too big for comments coming from small minds..— Sudheer Babu (@isudheerbabu) August 20, 2024 -
మహాశివరాత్రికి జటాధర
సుధీర్బాబు హీరోగా నటించనున్న ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం ‘జటాధర’. సూపర్ నేచురల్ ఫ్యాంటసీ అంశాలతో వెంకట్ కల్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. హిందీలో ‘రుస్తుమ్, టాయ్లెట్: ఏక్ ప్రేమ్కథ, ప్యాడ్మ్యాన్, పరి’లాంటి చిత్రాలను నిర్మించిన ప్రేరణ అరోరాతో కలిసి శివిన్ నారంగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్లు ఈ సినిమాను నిర్మించనున్నారు.‘జటాధర’ను శనివారం ప్రకటించి, ఫస్ట్ లుక్ను విడుదల చేయడంతో పాటు ఈ సినిమాను వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు మేకర్స్. ‘‘ఈ చిత్రంలో సుధీర్బాబు ఓ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. త్వరలోనే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ట్రెండింగ్లో సుధీర్ బాబు ‘హరోంహర’
సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 14న థియేటర్స్లో విడుదలై మిక్స్డ్ టాక్ని తెచ్చుకుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈ చిత్రం దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో రెండు ఓటీటీ ఫ్లాట్ఫాంల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విశేష ఆదరణ సొంతం చేసుకొని టాప్ 1లో నిలిచింది. దేశవ్యాప్తంగా టాప్1లో ఉన్నట్లు తెలుపుతూ అమెజాన్ ఓ పోస్టర్ను విడుదల చేసింది.హరోంహర కథేంటంటే..ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు.ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
మరో రెండు ఓటీటీల్లోకి తెలుగు యాక్షన్ మూవీ.. ఎక్కడంటే?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'హరోం హర'. జూన్ 14న రిలీజైన ఈ సినిమాకు టాక్ బాగున్నప్పటికీ పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు.తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ మరో ఓటీటీలో రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్షమైంది. అలాగే జియో సినిమాలో హిందీ వర్షన్ విడుదలైంది. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా మెప్పించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా సుమంత్ జి నాయుడు నిర్మించాడు.కథ విషయానికి వస్తే..1989లో కుప్పం ప్రాంతాన్ని తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కుమారుడు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. పొలాల్ని కబ్జా చేస్తూ అడ్డొచ్చినవారిని అంతం చేస్తుంటారు. ఆ ప్రాంతంలోని పాలిటెక్నిక్ కాలేజీలోకి సుబ్రమణ్యం(సుధీర్ బాబు) ల్యాబ్ అసిస్టెంట్గా వస్తాడు. అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)ను ప్రేమిస్తాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. దీని ఎఫెక్ట్ సుబ్రహ్మణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు మూడునెలల్లో తన తండ్రి చేసిన అప్పులు తీర్చాల్సి ఉంటుంది. మరి ఆ సమయంలో హీరో ఏం చేశాడు? అప్పులు తీర్చాడా? తనపై కక్ష సాధించిన విలన్పై ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే! -
ఓటీటీలో 'సుధీర్ బాబు' సినిమా.. నేడు సాయంత్రం నుంచే స్ట్రీమింగ్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం 'హరోం హర'. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా గతనెల 14న విడుదలైంది. అయితే, బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఆగష్టు 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఆహా ప్రకటించి మళ్లీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ ఎక్స్ పేజీ వేదికగా కొత్త తేదీని ప్రకటించింది.'హరోం హర' మూవీని నేడు (జులై 15) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆహా తెలుగు వెల్లడించింది. యాక్షన్ ప్యాక్డ్ మండే మూవీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ తమ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. నేడు సాయంత్రం 5 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న హరోం హర సినిమాను మిస్ కావద్దంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.డార్క్ కామెడీ పేరుతో పలు వీడియోల వల్ల వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కూడా 'హరోం హర' సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు. తన యూట్యూబ్ ఛానల్లో ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ వల్ల అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆహా ఓటీటీ సంస్థ సినిమా విడుదలను ఆపేసింది. అతడు నటించిన సీన్లను తొలగించి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు. -
ఓటీటీలో కనిపించని 'హరోం హర'.. అదే కారణమా?
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ హరోం హర. గతనెల 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్లో సుమంత్ జి.నాయుడు నిర్మించారు.అయితే హరోం హర ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచే ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ముందుగా ప్రకటించినట్లుగా ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. కానీ హరోం హర ఓటీటీకి రాలేదు. అయితే సాంకేతికపరమైన సమస్యతోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. మరి ఈ రోజు ఆలస్యమైనా స్ట్రీమింగ్కు వస్తుందా? లేదా కొత్త తేదీని ప్రకటిస్తారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. -
సుదీర్బాబు పునరాగమనం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఎఫెక్ట్తో ఈ ఏడాది ఫిబ్రవరిలో బదిలీ అయిన రాచకొండ పోలీసు కమిషనర్ జి.సుధీర్బాబు తిరిగి అదే స్థానానికి వచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో ఆయనను మల్టీ జోన్–2 ఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న తరుణ్ జోషిని రాచకొండ సీపీగా తీసుకువచి్చంది. తాజా బదిలీల్లో తరుణ్ జోషి ఏసీబీ డైరెక్టర్గా వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జనవరిలో మార్గదర్శకాల జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఏడాది జూన్ 30ని గడువుగా తీసుకుని.. ఆ తేదీ నుంచి వెనక్కు నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఓ కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తే బదిలీ తప్పనిసరి. ⇒ సుదీర్బాబు 2018 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు రాచకొండ కమిషనరేట్లో సంయుక్త, అదనపు సీపీగా విధులు నిర్వర్తించారు. డీఐజీ హోదాలో సంయుక్త సీపీగా అక్కడ రిపోర్ట్ చేసిన ఆయన ఐజీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా కొనసాగుతూ అదనపు సీపీగా పని చేశారు. ఆపై హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా బదిలీపై వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడా ది డిసెంబర్ 13న రాచకొండ పోలీసు కమిషనర్గా వెళ్లారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 2020 జూలై 1 నుంచి ఒకే కమిషనరేట్లో మూడేళ్లు పని చేసిన జాబితాలో సు«దీర్ బాబు ఉన్నారు. దీంతో ఆయ న్ను బదిలీ చేసిన ప్రభుత్వం తరుణ్ జోషిని నియమించింది. తాజా బదిలీల్లో సు«దీర్ బాబును మళ్లీ రాచకొండ సీపీగా నియమించింది. ⇒ గతంలో రాచకొండ సంయుక్త సీపీగా పని చేసిన అనుభవం ఉన్న సుధీర్బాబు హైదరాబాద్, సైబరాబాద్ల్లో కీలక పోస్టింగ్లతో పాటు వరంగల్ సీపీగానూ పని చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 17 మంది ఐపీఎస్ల బదిలీల్లో భాగంగా నగరానికి సంబంధించిన కొన్ని స్థానాల్లోనూ మార్పుచేర్పులు జరిగాయి. వనపర్తి ఎస్పీగా పని చేస్తున్న రక్షిత కె.మూర్తి డీసీపీ సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీగా వచ్చారు. దీంతో నగరంలో పని చేస్తున్న మహిళా ఉన్నతాధికారుల సంఖ్య ఆరుకు చేరింది. గతంలో సౌత్ వెస్ట్ డీసీపీగా పని చేసి, ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న బి.బాలస్వామి ఈస్ట్ జోన్గా రాగా.. రాచకొండ టాస్్కఫోర్స్ డీసీపీ జి.చంద్ర మోహన్ సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా వచ్చారు. -
ఓటీటీలోకి సుధీర్ బాబు యాక్షన్ మూవీ... స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
యాక్షన్ మూవీ లవర్స్ రెడీ అయిపోండి. ఎందుకంటే మరో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మహేశ్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'హరోం హర'. కొన్ని రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లు కాకుండా మరో ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకీ డీటైల్స్ ఏంటి?సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడికల్ యాక్షన్ సినిమా 'హరోం హర'. కుప్పం బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా జూన్ 14న థియేటర్లలోకి వచ్చింది. 'పుష్ప', 'కేజీఎఫ్' లాంటి చిత్రాలని పోలినట్లు ఉందని టాక్ వల్ల జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ డీల్ సెట్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'హనుమాన్' దర్శకుడికి చేదు అనుభవం.. ఏం జరిగిందంటే?)తొలుత ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఆహా ఓటీటీలో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అంటే ఈ వీకెండ్ ఏదైనా యాక్షన్ మూవీ చూస్తూ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు.అది 1980. కుప్పంలో ముగ్గురు రౌడీలు ఉంటారు. ఈ ఊరిలోనే కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు). ఓ సందర్భంలో రౌడీతో గొడవపడటం వల్ల ఉద్యోగం కోల్పోతాడు. అదే టైంలో డబ్బు అవసరం ఏర్పడుతుంది. దీంతో సొంతంగా తుపాకులు తయారు చేస్తాడు. సస్పెండ్ అయిన పళని స్వామి (సునీల్)తో కలిసి గన్స్ తయారు చేస్తాడు. పోలీసులు-రౌడీలు ఇతడు ఎందురు టార్గెట్ అయ్యాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్లు.. ఎక్కువగా ఆ రోజే!) -
'సాయి ధరమ్ తేజ్ పోస్ట్.. ఇలా జరిగినందుకు క్షమాపణలు': సుధీర్ బాబు
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్కు మద్దతుగా టాలీవుడ్ హీరోలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మంచు మనోజ్ ఇలాంటి వాళ్లను వదిలిపెట్టను అంటూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నపిల్లలు, మహిళలపై అసభ్యకరమైన వీడియోలు చేసేవారిని అస్సలు ఊపేక్షించవద్దని సోషల్ మీడియా వేదికగా కోరారు. దీనిపై ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో రియాక్ట్ అయ్యారు. ఇలా జరిగినందుకు క్షమించాలంటూ ట్వీట్ చేశారు.ఇటీవల హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో సుధీర్ బాబు ఈ అంశంపై ట్విటర్ వేదికగా స్పందించారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రణీత్ హనుమంత్ నా చిత్రం హరోం హరలో నటించినందుకు క్షమాపణలు కోరుతున్నా అని అన్నారు. ప్రణీత్ హనుమంతు నా సినిమాలో నటించడం చాలా అసహ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. అతను ఇలాంటి వ్యక్తి అని తనకు తెలియదన్నారు. సుధీర్ బాబు ట్వీట్లో రాస్తూ..'మంచో, చెడో నేను అయితే సోషల్ మీడియా వ్యక్తిని కాదు. ఇలాంటి విషయాలను అస్సలు క్షమించను. ప్రణీత్ హనుమంతు అనే వ్యక్తి హరోం హార చిత్రంలో నటించడం అసహ్యంగా భావిస్తున్నా. ఈ విషయంలో మా చిత్ర బృందం తరఫున హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నా. ఈ మనిషి ఇలాంటి వాడని నాకు తెలియదు. అతని గురించి సోషల్ మీడియాలో బహిర్గతం చేయడానికి నేను ధైర్యం చేయలేకపోయా. కానీ ఇలాంటి విషయాలపై మనం దృష్టి సారించాలి. ఇది ఏ విధంగానూ వాక్ స్వాతంత్ర్యం కాదు.' అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. For good or bad, I'm not a social media guy nor do I keep up with things. I feel so disgusted by the fact we had #PraneethHanumanthu casted in #HaromHara. Sincere apologies from me and my entire team. We didn't know what a pathetic creature this man is. It wasn't in my knowledge.…— Sudheer Babu (@isudheerbabu) July 8, 2024 -
నవ దళపతి 'సుధీర్ బాబు' పాన్ ఇండియా సినిమా ఫిక్స్
వైవిధ్యమైన చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న కథానా యకుడు సుధీర్ బాబు. నవ దళపతిగా అభిమానుల మన్ననలు అందుకుంటున్న ఈయన ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్లో నటించబోతున్నారు. ఇది భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుంది.ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను ఆడియెన్స్కి అందించేలా ఇంతకు ముందెన్నడూ చూడని డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కబోతున్నఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కి ఎంతో ప్రాధ్యానత ఉంది. వెంట్ కళ్యాణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 14న విడుదలైన హరోంహర చిత్రంతో సుధీర్ బాబు రీసెంట్గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అందులో యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ కథనానికి ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది.రుస్తుం, టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో ఇప్పుడు సుధీర్ బాబు చేయబోతున్ పాన్ ఇండియా సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం రూపొందనుంది. త్వరలోనే చిత్ర యూనిట్తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది. త్వరలోనే మేకర్స్ ఆ వివరాలను తెలియజేస్తారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నారు.లోతైన కథతో రానున్న ఈ చిత్రంలో కుట్ర, పన్నాగాలు కలగలిసిన చెడుకి, మంచి జరిగే యుద్ధంగా ఇండియన్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కనుంది.ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ 'నేను ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చి ఏడాది పాటు టీమ్తో ట్రావెల్ అవుతున్నాను. డిఫరెంట్ కంటెంట్తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్షకల ముందుకు ఎప్పుడెప్పుడు వద్దామా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను ప్రేక్షకులకు అందించటానికి ప్రేరణ అరోరా, ఆమె టీమ్ సభ్యులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇది ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందనే గట్టి నమ్మకం ఉంది'. అని ఆయన అన్నారు.ప్రేరణ అరోరా, శివిన్ నారగ్, నిఖిల్ నంద, ఉజ్వల్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మన పురాణాలతో అనుసంధానం చేయబడిన ఎన్నో రహస్యాలను ఇది వెలికి తీస్తుంది. ప్రేక్షకులకు ఈ సినిమా ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. సినిమా ఫస్ట్ లుక్ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు. -
హీరో సుధీర్ బాబుకి కొత్త ట్యాగ్.. సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్!
తెలుగులో బోలెడు మంది హీరోలు. వీళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఉంటుంది. చిరంజీవికి మెగాస్టార్, మహేశ్ బాబుకి సూపర్ స్టార్, అల్లు అర్జున్కి ఐకాన్ స్టార్.. ఇలా దాదాపు స్టార్ హీరోలు చాలామందికి పేరుకి ముందు ఏదో ఓ ట్యాగ్ ఉంటుంది. కానీ కొందరు యంగ్ హీరోలు కూడా ఇలా ట్యాగ్స్ కోసం తెగ తాపత్రయ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు కూడా అలానే కొత్తగా ట్యాగ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి.(ఇదీ చదవండి: ‘హరోం హర’ మూవీ రివ్యూ)స్టార్ హీరోలు పెట్టుకున్న ట్యాగ్ గురించి పెద్దగా కంప్లైంట్స్ ఉండవు గానీ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఎవరైనా ట్యాగ్స్ పెడితే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మహేశ్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు.. చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా వంక పెట్టడానికేం లేదు. కానీ హిట్ మాత్రం దక్కట్లేదు. ఇప్పుడు పూర్తిగా మాస్ని నమ్ముకుని 'హరోం హర' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. కానీ 'పుష్ప', 'కేజీఎఫ్' సినిమాల పోలికలు మరీ ఎక్కువైపోయావని అంటున్నారు.ఈ సినిమా ముందు వరకు 'నైట్రో స్టార్' అని పెట్టుకున్న సుధీర్ బాబు.. 'హారోంహర' కోసం 'నవ దళపతి' అని ట్యాగ్ మార్చుకున్నాడు. దళపతి అనగానే మనకు తమిళ హీరో విజయ్ గుర్తొస్తాడు. 'లియో' మూవీ టైటిల్ కార్డ్స్ లో విజయ్ కి పడ్డట్లే ఈ చిత్రంలో ఫొటోలు దాదాపు అలానే పడ్డాయి. దీంతో విజయ్-సుధీర్ బాబు ఫొటోలతో సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే 'హరోంహర'లో సుధీర్ బాబుతో పాటు సునీల్, మాళవిక శర్మ కీలక పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)Perfect mass ComeBack Anna🙌🏻🔥After a long waittt🥵NAVA DHALAPATHY🔥🔥🔥@isudheerbabu #Haromhara #Sudheerbabu #Maheshbabu pic.twitter.com/kbLH3zMDw7— KritiSam❤️ (@kritisam7) June 14, 2024 -
‘హరోం హర’ మూవీ రివ్యూ
టైటిల్: హరోం హరనటీనటులు: సుధీర్ బాబు, మాళవిక శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కి లక్ష్మణ్, అక్షర గౌడ, అర్జున్ గౌడ, రవి కాలే తదితరులునిర్మాత : సుమంత్ జి నాయుడురచన, దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారకసంగీతం: చైతన్ భరద్వాజ్ఎడిటర్ : రవితేజ గిరిజాలవిడుదల తేది: జూన్ 14, 2024వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూనే ఉంటాడు. ఈ టాలెంటెడ్ హీరో నటించిన తాజా చిత్రం ‘హరోం హర’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘హరోం హర’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1989లో సాగుతుంది. కుప్పం ప్రాంతాన్ని అంతా తమ్మిరెడ్డి(లక్కి లక్ష్మణ్), అతని కొడుకు శరత్(అర్జున్ గౌడ)తమ గుప్పింట్లో ఉంచుకుంటారు. వ్యవసాయ భూములను కబ్జా చేస్తూ.. అడ్డొచ్చిన వారిని అంతం చేస్తుంటారు. తమ్మిరెడ్డి అరాచకాలకు భయపడి.. చాలా మంది వేరే ప్రాంతానికి వలస వెళ్తారు. ఆ ప్రాంతంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలోకి ల్యాబ్ అసిస్టెంట్గా వస్తాడు సుబ్రమణ్యం(సుధీర్ బాబు). అదే కాలేజీలో పనిచేసే లెక్చరర్(మాళవిక శర్మ)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా తమ్మిరెడ్డి మనుషులతో గొడవపడతాడు. ఆ విషయం శరత్ తెలియడం.. కాజేపీ ప్రిన్సిపల్కి వార్నింగ్ ఇవ్వడంతో సుబ్రమణ్యం ఉద్యోగం పోతుంది. మరోవైపు సొంతూర్లో తండ్రి (జయ ప్రకాశ్) చేసిన అప్పులు మూడు నెలల్లో తీర్చాల్సి ఉంటుంది. (Harom Hara Review) ఇలాంటి సమయంలో స్నేహితుడు పళని(సునీల్) ఇచ్చిన సలహాతో గన్స్ తయారు చేయాలని ఆలోచిస్తాడు సుబ్రమణ్యం. ఆ తర్వాత ఏం జరిగింది? అక్రమ ఆయుధాల సరఫరా మాఫియా సుబ్రమణ్యం జీవితాన్ని ఎలా మార్చేసింది? తమ్మిరెడ్డితో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన శత్రువలను ఎలా ఎదుర్కొన్నాడు? తండ్రి అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? మాఫియా లీడర్కు ఓ ఊరు మొత్తం ఎందుకు అండగా నిలిచింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని కొంతమంది దుర్మార్గులు తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రజలను హింసించడం.. అక్కడకు హీరో సాధారణ వ్యక్తిలా వచ్చి వారిని అంతమొందించి ప్రజలకు విముక్తి కలిగించడం.. ఇలాంటి కథలు టాలీవుడ్లో చాలా వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. హరోం హర మూవీ లైన్ కూడా ఇదే. కేజీయఫ్, పుష్ప సినిమాల మాదిరి హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథనాన్ని నడిపించాడు దర్శకుడు. (Harom Hara Review)సినిమా ప్రారంభం మొదలుకొని క్లైమాక్స్ వరకు ప్రతీ సన్నివేశం.. పుష్ప, కేజీయఫ్, ఛత్రపతి సినిమాలను గుర్తు చేస్తుంది. ఇక విలన్లు చేసే అరాచకాలు చాలా పాత సినిమాలను గుర్తు చేస్తాయి. కేజీయఫ్ స్టైల్లో పళని(సునీల్) హీరోకి ఎలివేషన్స్ ఇస్తూ కథను ప్రారంభిస్తాడు. తమ్మిరెడ్డి, శరత్ పరిచయ సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. హీరో ఎంట్రీ చాలా సింపుల్గా ఉంటుంది. హీరోయిన్తో లవ్ట్రాక్ నడిపిస్తూనే.. ఊర్లో తమ్మిరెడ్డి మనుషుల ఆగడాలను చూపిస్తారు. అయితే అటు లవ్ ట్రాక్తో పాటు రొట్టకొట్టుడు విలనిజం బోర్ కొట్టిస్తుంది. హీరో గన్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యేవరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని ఫైట్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక హీరో తుపాకులు తయారు చేయడం మొదలు పెట్టిన తర్వాత కొత్త పాత్రలు ఎంట్రీ ఇవ్వడం.. యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో ఫస్టాఫ్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం నీరసంగా సాగుతుంది. కేజీయఫ్, విక్రమ్ మాదిరి యాక్షన్స్ సీన్స్ వస్తుంటాయి కానీ ఎక్కడా ఆకట్టుకోలేవు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, అమితాబ్ అంటూ పేర్లు పెట్టి కొత్త తుపాకులను అమ్మడం కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. (Harom Hara Movie Review) ఇక చివర్లో జ్యోతిలక్ష్మి(హీరో ప్రత్యేకంగా తయారు చేసిన పెద్ద గన్)తో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. అయితే ఈ సినిమా నేపథ్యంతో పాటు పాత్రలను తిర్చిదిద్దిన విధానం.. పలికించిన భాష, యాస అన్ని పుష్స సినిమాను గుర్తు చేసేలా ఉంటాయి. మాస్ యాక్షన్ సినిమాలకు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. సుబ్రమణ్యం పాత్రలు సుధీర్ ఒదిగిపోయాడు. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో సుధీర్ నటించలేదు. యాక్షన్ సీన్స్లో చించేశాడు. మాళవిక శర్మ తెరపై కనిపించేదే కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. పోలీసు ఆఫీసర్గా అక్షర గౌడ తన పాత్ర పరిధిమేర నటించింది. సస్పెండ్ అయిన పోలీసు ఆఫీసర్ పళనిస్వామిగా సునీల్, విలన్లుగా రవి కాలే, అర్జున్ గౌడ, లక్కి లక్ష్మణ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. (Harom Hara Movie Review) హీరో తండ్రిగా నటించిన జయప్రకాశ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చేతన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
'ఇక సెప్పెదేం లేదు.. సేసేదే'.. రిలీజ్ టీజర్ అదిరిపోయింది!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన చిత్రం హరోం హర. ఈ సినిమాను జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరెకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హరోం హర ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ హీరోలు విశ్వక్ సేన్, అడివిశేష్ అతిథులుగా హాజరయ్యారు.తాజాగా హరోం హర మూవీకి సంబంధించిన రిలీజ్ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలకు ముందు రోజు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను పంచుకున్నారు. 44 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. చివర్లో ఇక సెప్పెదేం లేదు.. సేసేదే అనే సుధీర్ బాబు చెప్పే డైలాగ్ హైలెట్గా నిలిచింది. కాగా.. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
నమ్మకం ఉంది కాబట్టే ముందే షో వేశారు
‘‘హరోం హర’ ట్రైలర్ చాలా నచ్చింది. సుధీర్బాబు మంచి సినిమా చేశాడని తెలిసి, ఈ వేడుకకి వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సినిమా విడుదలకు నాలుగైదు రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్స్ని పిలిచి షో వేశారంటే సినిమాపై యూనిట్కి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుంది’’ అని హీరో అడివి శేష్ అన్నారు. సుధీర్బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించిన చిత్రం ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్పై సుమంత్ జి. నాయుడు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ (టీజర్, ట్రైలర్, ΄ాటలు...) ్ర΄ామిసింగ్గా ఉంది. సుబ్రహ్మణ్యం, సుమంత్ లాంటి ΄్యాషన్ ఉన్న నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి. ఈ సినిమాని థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ‘హరోం హర’ లాంటి నేపథ్యంలో సినిమా రాలేదు. నాతో ఇంత మంచి సినిమా తీసిన జ్ఞానసాగర్కి థ్యాంక్స్. ఈ సినిమా చూశాక ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం’’ అన్నారు నిర్మాత సుమంత్. ‘‘హరోం హర’లోని తండ్రీ కొడుకుల ఎమోషన్ నాకు చాలా కనెక్ట్ అయ్యింది’’ అన్నారు సుబ్రహ్మణ్యం. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగో΄ాల్, డైరెక్టర్ మారుతి, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. -
నాన్న నటించిన ఆ సినిమా అంటే చాలా ఇష్టం: మహేశ్ బాబు
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం 'హరోం హర' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్ కా దాస్ విశ్వక్ సేన్, అడివి శేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.అయితే ఈ ఈవెంట్లో ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మహేశ్ బాబుతో సుధీర్ బాబు మాట్లాడిన ఫోన్ రికార్డ్ ఆడియోను ప్లే చేశారు. వీరి మధ్య దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. సుధీర్ బాబు అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ బాబు సమాధాలిచ్చారు. మొదటిసారి గన్ వాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? అని సుధీర్ ప్రశ్నించగా.. టక్కరి దొంగ సినిమాలో ఎక్కువసార్లు గన్స్ వాడా.. కానీ గన్ కాల్చేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదని మహేశ్ అన్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మోసగాళ్లకు మోసగాడు గుర్తొచ్చింది.గన్స్ చూపించే సినిమాల్లో మీకు నచ్చిన చిత్రమేది అని సుధీర్ బాబు అడిగాడు. నాన్న గారు నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను వందసార్లు చూశానని మహేశ్ అన్నారు. హరోంహరలో నీకు బాగా నచ్చిన పాట ఏదని అడగ్గా.. టైటిల్ సాంగ్ అని మహేశ్ ఆన్సరిచ్చారు. హరోంహర ట్రైలర్లో నీకు నచ్చిన అంశాలు ఏంటి? అని సుధీర్ ప్రశ్నించాడు. ఈ సినిమాలో నువ్వు చాలా కొత్తగా ఉన్నావ్.. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదనిపించింది.. అని మహేశ్ బాబు అన్నారు. మీరు నటించిన నిజం సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఏమైనా ఉన్నాయా? అని సుధీర్ బాబు అడిగారు. నిజం చాలా నచ్చిన సినిమా అది. అలాంటి గొప్ప చిత్రాన్ని నాకు అందించినందుకు దర్శకుడు తేజకు థ్యాంక్స్. నా సినిమాల్లో నిజం ఒక ఫెవరేట్ ఫిల్మ్ అని మహేశ్ బాబు అన్నారు. కాగా.. సుధీర్ బాబు నటించిన హరోం హర జూన్ 14 థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మహేశ్ బాబు హరోం హర పెద్ద హిట్ అవ్వాలని.. ఆల్ ది బెస్ట్ చెప్పారు. Here we go from the man himself @urstrulyMahesh about #HaromHara#HaromHaraOnJune14th pic.twitter.com/e5iUutn4ML— Sudheer Babu (@isudheerbabu) June 11, 2024 -
నెమలి కనబడటం నాకో పాజిటివ్ సైన్: డైరెక్టర్ జ్ఞానసాగర్
సుధీర్బాబు హీరోగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో సుమంత్ జి. నాయుడు నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘హరోం హర’. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో జ్ఞానశేఖర్ మాట్లాడుతూ –‘‘కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్గా పని చేసే ఓ మామూలు కుర్రాడు సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్ మేకింగ్లో ఇన్వాల్స్ కావాల్సి వచ్చింది? ఆ తర్వాత అతని జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది? అన్నదే ఈ సినిమా కథ. ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. మంచి ఫాదర్ ఎమోషన్ కూడా ఉంది. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుణ్ణి. అందుకే ఈ సినిమాకు ‘హరోం హర’ టైటిల్, హీరోకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టాను. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రతి లొకేషన్లో మాకు నెమలి కనిపించింది. దీన్ని ఓ పాజిటివ్ సైన్గా తీసుకున్నాను. సుధీర్బాబుగారు అద్భుతంగా నటించారు. కథని నమ్మి, గ్రాండ్గా నిర్మించిన నా ఫ్రెండ్ సుమంత్కి ధన్యవాదాలు. ఈ సినిమాను ముందు పాన్ ఇండియాగానే అనుకున్నాం. అయితే ఇతర భాషల్లో డైలాగ్స్ సరిగ్గా కుదరలేదనిపించింది. నాకు నాలుగు భాషలు వచ్చు. నేనే కూర్చుని, పర్ఫెక్ట్గా చేయించాలంటే సినిమా రిలీజ్కు చాలా టైమ్ పడుతుంది. అందుకే ΄ాన్ ఇండియా రిలీజ్ వద్దనుకున్నాం’’ అన్నారు. -
Harom Hara Movie: ‘హరోం హర’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఈ సినిమాతో మేమిచ్చే మెసేజ్ ఇదే..
-
రైనీ డే కావాలి.. రెడ్ అలర్ట్ లో షూట్
-
సుధీర్ గురించి అడగ్గానే హీరోయిన్ ఎలా సిగ్గు పడుతుందో చూడండి
-
'హరోం హర' ట్రైలర్ను విడుదల చేసిన మహేశ్ బాబు
సుధీర్బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ను మేకర్స్ ప్రకటించారు. జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్గా నటిస్తుంది. సుమంత్ జి .నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.‘హరోం హర’ ట్రైలర్ను తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ను చూస్తుంటే ఈసారి సుధీర్బాబు హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా చాలా ఆసక్తిగా ఉంది. ఇందులో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సుధీర్ బాబు కూడా అందుకు తగ్గట్లు రిస్క్తో కూడుకున్న స్టంట్స్ చేసినట్లు కనిపిస్తుంది. ట్రైలర్తో సినిమాపై భారీ అంచనాలను సుధీర్ బాబు పెంచేశాడని చెప్పవచ్చు. జూన్ 14న ‘హరోం హర’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
భార్యకు స్పెషల్గా విష్ చెప్పిన టాలీవుడ్ హీరో.. పోస్ట్ వైరల్!
టాలీవుడ్ యంగ్ హీరో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సుధీర్ బాబు హీరోగా నటించిన చిత్రం హరోం హర. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో మాళవిక శర్మ జంటగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీని మే 31న రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా వేశారు. వచ్చేనెల జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు సుధీర్బాబు ప్రకటించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.అయితే సుధీర్ బాబు.. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ప్రియదర్శినిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే సుధీర్, ప్రియదర్శినిల పెళ్లి మే 29,0 2006లో ఘనంగా జరిగింది. తాజాగా వివాహా వార్షికోత్సవం సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు సుధీర్. తన భార్య ప్రియదర్శిని పెళ్లిచూపుల ఫోటోను ట్విటర్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. నాతో ఉన్నప్పటి తన మొదటి ఫోటో.. అంతేకాదు పెళ్లిచూపుల ఫోటో అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు హీరో జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. Happy Anniversary my love 'Priya' 💐 You complete me 😘🤗…. First pic of hers I have with me. Pellichoopulu photo 😄 pic.twitter.com/005YWnBIzZ— Sudheer Babu (@isudheerbabu) May 29, 2024 -
సుధీర్ బాబు సినిమా.. మిస్డ్ కాల్తో ఐఫోన్, జీప్ గెలుచుకోండి
సుధీర్బాబు హీరోగా నటించిన ‘హరోం హర’ సినిమా విడుదల త్వరలో కానుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్ను మేకర్స్ ప్రకటించారు. జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సుమంత్ జి .నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందుగా మే 31న సినిమా విడుదలకు యూనిట్ ప్లాన్ చేసింది. అయితే, జూన్ 14న రిలీజ్ చేయనున్నట్లు మరోసారి చిత్ర యూనిట్ ప్రకటించి. ఈ క్రమంలో కొత్తపోస్టర్తో పాటు అదిరపోయే గుడ్న్యూస్ను కూడా షేర్ చేసింది.మే 31న ఎక్కువ సినిమాలు విడుదల కానున్నడంతో ‘హరోం హర’ చిత్రాన్ని జూన్ 14కు వాయిదా వేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సుబ్రహ్మణ్యం పాత్రల కనిపించనున్నారు. అయితే, సినిమా ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ ఒక కాంటెస్ట్ను ప్లాన్ చేశారు. ఇందులో పాల్గొనాలనే వారు 08045936069 టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ కాల్ ఇస్తే చాలు. వారి వద్ద మీ నంబర్ సేవ్ అయిపోతుంది. అనంతరం లాటరీ పద్ధతిలో వారు విజేతలను ప్రకటిస్తారు. గెలుపొందిని వారు సుబ్రహ్మణ్యం జీప్ ,ఐ ఫోన్ 15 PRO, చేతక్ బైక్ను సొంతం చేసుకోవచ్చని మేకర్స్ తెలిపారు. దీంతో ఇప్పటికే భారీగా మిస్డ్ కాల్స్ ఇస్తున్నారు. సుధీర్ అభిమానులు కూడా దీనిని భారీగా షేర్ చేస్తున్నారు. మే 30న ‘హరోం హర’ ట్రైలర్ మహేశ్ బాబు చేతులు మీదుగా విడుదల కానుంది. -
మిస్సవుతున్నందుకు బాధగా ఉంది.. సుధీర్ బాబు ట్వీట్!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం హరోం హర. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మూవీని మే 31న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించారు.కానీ ఊహించని విధంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు సుధీర్ బాబు ట్వీట్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల హరోం హర మూవీని వాయిదా వేస్తున్నట్లు రాసుకొచ్చారు. సినిమా వాయిదా వేస్తున్నందుకు బాధగా ఉందన్నారు. స్పెషల్ డేట్ మిస్ అవుతున్నానని సుధీర్ బాబు ట్విటర్ ద్వారా వెల్లడించారు.సుధీర్బాబు తన ట్విటర్లో రాస్తూ..' వివిధ కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేస్తున్నాం. వచ్చేనెల జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తాం. మొదట అనుకున్న ప్రకారం కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నా. కానీ మిస్ అయినందుకు బాధగా ఉంది. అయినప్పటికీ జూన్ ఇప్పటికీ నా లక్కీ నెల. ఈ సమయంలోనే ప్రేమకథా చిత్రం, సమ్మోహనం చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే హరోం హర కూడా మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.' అని పోస్ట్ చేశారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. For various reasons, #HaromHara will now be releasing in theaters worldwide on 14th June. Although I feel sad for missing the release on the occasion of Krishna gari birthday, nevertheless June is still my lucky month. PKC & Sammohanam were both released during this time😎 I… pic.twitter.com/NZvcKA2Fdu— Sudheer Babu (@isudheerbabu) May 21, 2024 -
Sudheer Babu: సుధీర్ బాబు పుట్టినరోజు ప్రత్యేకం.. ఫోటోలు వైరల్
-
‘బండి’ది ఓట్ల రాజకీయం..!
కరీంనగర్: ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఎంపీ బండి సంజయ్కుమార్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓట్ల రాజకీయానికి తెరలేపారని కరీంనగర్, జగిత్యాల, హన్మకొండ జెడ్పీ చైర్మన్లు కనుమల్ల విజయ, దావ వసంత, సుధీర్బాబు ఆరోపించారు. కరీంనగర్లోని ఓ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోని సంజయ్ సర్పంచ్ల పదవీ కాలం ముగిశాక సానుభూతి చూపిస్తూ మొసలి క న్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను అబాసుపాలు చేయడానికే సర్పంచులకు రావాల్సి న బిల్లులపై పోరాటం చేస్తామని ఓట్ల జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ బెస్ట్ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఎంపీగా ఏం చేశావో చెప్పి ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. శ్రీరాముని ఫొటో, అక్షింతలు పంపి సెంటిమెంట్తో ఓట్లు దండుకునే ప్రయత్నం సరికాదన్నారు. ఇప్పటికైనా సంజయ్ అభివృద్ధిపై అబద్ధాలు మాట్లాడడం మానుకోవాల ని హితవు పలికారు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు మారుతి, నయీం పాల్గొన్నారు. ఇవి చదవండి: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు -
కుటుంబంతో తిరుమల సందర్శనలో హీరో సుధీర్ బాబు (ఫొటోలు)
-
Sudheer Babu Family Vacation: ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరో (ఫోటోలు)
-
నా కెరీర్లో గేమ్ చేంజర్ అయ్యే చిత్రమిది: సుధీర్ బాబు
‘‘హరోం హర’ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఒక్కో రోజు సెట్స్లో వెయ్యిమంది ఉండేవారు. మంచి ఎమోషన్స్, హై కమర్షియల్ కంటెంట్ ఉన్న చిత్రమిది. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. ఈ సినిమా నా కెరీర్లో గేమ్ చేంజర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. మాళవికా శర్మ హీరోయిన్. హైదరాబాద్లో యూనిట్ నిర్వహించిన ఈ చిత్రం టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘సుమంత్ జి. నాయుడు వంటి నిర్మాతలు చిత్ర పరిశ్రమకు రావాలి. మైత్రీ, సితార, వైజయంతి.. లాంటి బ్యానర్స్లానే కథని నమ్మి ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాణ సంస్థగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పరిశ్రమలోకి వచ్చినట్లేనని నమ్ముతున్నాను. నా కోసమే ఈ చిత్రకథ రాసుకొచ్చిన సాగర్కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా రెండో చిత్రానికి ఇంత హై బడ్జెట్ ఇస్తారని ఊహించలేదు. మంచి సినిమా చేశాం’’ అన్నారు జ్ఞానసాగర్. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. టీజర్కి వస్తున్న స్పందన చూస్తుంటే ఓ మంచి సినిమా చేశాననే నమ్మకం వచ్చింది’’ అన్నారు సుమంత్ జి. నాయుడు. ఈ వేడుకలో కెమెరామేన్ అరవింద్, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
'మామయ్య.. ఆగిపోలేదు మీ ప్రస్థానం'.. సుధీర్ బాబు ఎమోషనల్!
ఇటీవలే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుధీర్ బాబు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎమోషనలయ్యారు. మామయ్యను తలుచుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా సూపర్ కృష్ణ ఫోటోను పంచుకున్నారు. సుధీర్ బాబు తన ట్వీట్లో రాస్తూ 'మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం హరోం హర అనే పాన్ ఇండియా చిత్రంలో సుధీర్ బాబు నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 22న టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా మరిన్ని సేవ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఎం.బీ ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల చదువు కోసం ఉపకారవేతనాలు కూడా ఇవ్వనున్నారు. మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.#SSKLivesOn pic.twitter.com/lYdFgRIcaa — Sudheer Babu (@isudheerbabu) November 15, 2023 -
14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన మామా మశ్చీంద్ర.. అక్కడే స్ట్రీమింగ్!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం మామా మశ్చీంద్ర. మృణాలినీ రవి, ఈషా రెబ్బ హీరోయిన్లుగా నటించారు. హర్షవర్దన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ముఖ్య పాత్రలు పోషించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన చిత్రం జనాలను ఆకర్షించడంతో విఫలమైంది. దీంతో రెండువారాలకే బాక్సాఫీస్ దగ్గర తట్టాబుట్టా సర్దేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో సినిమా విడుదలైన 14 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్తో పాటు ఆహాలోనూ మామా మశ్చీంద్ర అందుబాటులో ఉంది. సినిమా కథేంటంటే? సుధీర్.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రల్లో నటించాడు. పరశురామ్కు స్వార్థమెక్కువ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నుతాడు. కానీ వాళ్లు బతికిపోతారు. పరశురామ్ కూతురు విశాలాక్షి(ఈషా రెబ్బ), పరశురామ్ దగ్గర పనిచేసే దాసు కూతురు మీనాక్షి(మృణాళిని రవి).. దుర్గ, డీజే అనే కుర్రాళ్లతో లవ్లో పడతారు. వీళ్లిద్దరూ పరశురామ్ పోలికలతో ఉండటంతో వాళ్లు తన మేనల్లుళే అని పరశురామ్కు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ముగ్గురి ప్రేమకు మంచి ముగింపు పడిందా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి.. చదవండి: లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని వందల కోట్లంటే? ఏ ఓటీటీలోకి రానుందంటే? -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్బాబు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే!
ఓటీటీల దెబ్బకు మనం సినిమాలు చూసే విధానమే మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు థియేటర్లో సినిమా రిలీజైన చాన్నాళ్లకు హెచ్డీ ప్రింట్ అందుబాటులోకి వచ్చేది. కానీ ఓటీటీల పుణ్యామా అని కొన్ని డైరెక్ట్గా వీటిలోనే రిలీజ్ అవుతుండగా, మరికొన్ని నెలలోపే స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఓ మూవీ అయితే థియేటర్లలో ఉండగానే ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయిందట. (ఇదీ చదవండి: 'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ) ఆ సినిమా ఏంటి? సుధీర్బాబు మూడు పాత్రల్లో నటించిన సినిమా 'మామా మశ్చీంద్ర'. అక్టోబరు 6న అంటే రెండు రోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ క్రమంలో డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించేసినట్లు తెలుస్తోంది. ఆ రోజే స్ట్రీమింగ్ అక్టోబరు 24న దసరా పండగ. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో సందడి గ్యారంటీ. మరోవైపు ఈ ఫెస్టివల్ సందర్భంగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు అదే పండక్కి అంటే అక్టోబరు 20 నుంచి 'మామా మశ్చీంద్ర' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ అయిపోతున్నట్లే. (ఇదీ చదవండి: ఫారెన్ టూర్లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?) #MaamaMascheendra from October 20. 📸 @PrimeVideoIN #MaamaMaschindra pic.twitter.com/Ptv3HhFio8 — SpreadFLIX (@spreadflix) October 8, 2023 -
'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ
టైటిల్: మామా మశ్చీంద్ర నటీనటులు: సుధీర్ బాబు, ఈషా రెబ్బా, హర్షవర్ధన్, మృణాళిని రవి, అజయ్ తదితరులు నిర్మాత: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ డైరెక్టర్: హర్షవర్ధన్ మ్యూజిక్: చైతన్ భరద్వాజ్, ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: పి.జి. విందా విడుదల తేదీ: అక్టోబర్ 06 నిడివి: 2h 29m కథేంటి? పరశురామ్(సుధీర్ బాబు)కి చాలా స్వార్థం. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపమని తన మనిషి దాసుకి చెప్తాడు. కానీ వాళ్ళు బతికిపోతారు. కట్ చేస్తే పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని రవి).. దుర్గ(సుధీర్ బాబు) డీజే (సుధీర్ బాబు) అనే కుర్రాళ్లతో లవ్ లో పడతారు. వీళ్ళిద్దరూ పరశురామ్ పోలికలతో ఉంటారు. వీళ్లు తన మేనల్లుడ్లే అని పరశురామ్కి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు పరశురామ్ ఏం తెలుసుకున్నాడు అనేది స్టోరీ. ఎలా ఉంది? సినిమా అంటే ఎవరెన్ని చెప్పినా వినోదం మాత్రమే. రెండు లేదా మూడు గంటలా అనేది ఇక్కడ మేటర్ కాదు. నవ్వించవా, థ్రిల్ చేశావా? ఇలాంటి అంశాలు మాత్రమే ఆడియెన్స్ చూస్తారు. ఈ విషయంలో మామ మశ్చీంద్ర పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే కామెడీ, థ్రిల్, డ్రామా.. ఇలా ఏ పార్ట్ లోనూ కనీసం అలరించ లేకపోయింది. ట్విస్టులు ఎక్కువ ఉంటే ప్రేక్షకులు థ్రిల్ అవుతారని డైరెక్టర్ అనుకున్నాడు. అవి రెండున్నర గంటలు బుర్ర గొక్కునేల చేశాయి! ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. జాలి దయలేని తండ్రి వల్ల చిన్నప్పుడే పరశురామ్ తల్లి చనిపోవడం... తల్లికి దక్కాల్సిన ఆస్తిని మేనమామ లాగేసుకోవడం.. ఆ తర్వాత పక్క ప్లాన్ తో మేనమామకు కూతురు వరసైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అస్తినంతా దక్కించుకోవడం.. ఇక వయసు పెరిగిన తర్వాత పరశురామ్.. అతడు కూతురు విశాలాక్షీ.. పరశురామ్ దగ్గర పనిచేసే దాసు.. అతడు కూతురు మీనాక్షి.. వీళ్ళ లైఫ్ లోకి దుర్గ, డీజే అనే వ్యక్తులు రావడం.. అల ఈ పాత్రల మధ్య ఎలాంటి డ్రామా నడిచింది చివరకి ఏమైంది అనేదే తెలియాలంటే సినిమా చూడాలి.. స్టోరీ పరంగా స్వార్థం అనే మంచి పాయింట్ తీసుకున్నారు కానీ దాన్ని చెప్పడంలో ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో చూసే ప్రేక్షకుడికి కూడా అది ఎక్కలేదు. హీరో సుదీర్ బాబు.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రలు చేశాడు. డీజేగా రెగ్యులర్ లుక్ లో కనిపించాడు. ఇది ఓకే. కానీ మిగతా రెండు పాత్రలు డిజైన్ అస్సలు సెట్ కాలేదు. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ తో చాలా చిరాకు పెట్టించారు. పబ్ లో వచ్చే ఆర్జీవీ ఎపిసోడ్ అయితే అనవసరం. ఇక సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చుట్టేశారు. క్వాలిటీ విషయం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే.. క్లైమాక్స్ లో మనిషిలో స్వార్థం గురించి చెప్పే సీన్ మాత్రమే. ఎవరెలా చేశారు? మూడు పాత్రల్లో ఏదో ప్రయోగం చేద్దామని హీరో సుధీర్ బాబు ప్రయత్నించాడు గానీ అది అడ్డంగా బెడిసికొట్టింది. పరశురామ్ కారెక్టర్ ని అయిన మంచిగా రాసుకుని సినిమా తీసుంటే బాగుండేది. ఇక హీరోయిన్స్ గ చేసిన ఈషా రెబ్బ, మృణాళిని రవి ఓకే ఓకే. ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ హర్షవర్ధన్ ఇందులో దాసు పాత్ర చేశాడు అది పర్లేదు. మిగతా కారెక్టర్స్ చేసిన వాళ్ళు మామ అనిపించారు. అజయ్, హరితేజ, రాజీవ్ కనకాల లాంటి వాళ్లని సరిగా వాడుకొలేకపోయారు. టెక్నికల్ విషయాల్లో ఈ సినిమాలోని పాటలు పెద్దగా గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు చాలా పూర్. రైటింగ్ కూడా అస్సలు ఎఫెక్టివ్గా లేదు. ఓవరాల్గా థియేటర్స్లో మామ మశ్చీంద నిలబడటం అంటే చాలా కష్టం. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
పోస్టర్ లో చూసి విజయ్ సేతుపతి అనుకున్నాను..!
-
‘మామా మశ్చీంద్ర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సాయిపల్లవికి అక్కగా వచ్చిన ఛాన్స్ ఈ కారణంతో పోయింది: హరితేజ
సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ . ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. సుధీర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోలు శర్వానంద్, విశ్వక్సేన్, శ్రీవిష్ణు, అశోక్ గల్లా ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు 'గుంటూరు కారం') ఈ సినిమాలో సినీ నటి హరితేజ కూడా ఉంది. ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది.. చెప్పుకోవాలనిపిస్తోంది. మంచి అనుభవం. నేను మీ ఫిలింస్కి ఫ్యాన్ సర్. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్కి రమ్మని పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో తెలుసా.. తెలంగాణ యాస రాలేదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను సర్. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్. మరీ అంత ప్యూర్ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు శేఖర్ ఖమ్మల కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇందులో హరితేజ ఓల్డ్ ఉమెన్ పాత్రలో కనిపించనుంది. -
వైరల్ విశాలాక్షి కొత్తగా అనిపించింది
సుధీర్బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘సుధీర్బాబుగారు చేసిన మూడు పాత్రల్లో దుర్గ పాత్రకు జోడీగా వైరల్ విశాలాక్షి పాత్ర చేశాను. ఏదో ఒకటి చేసి వైరల్ కావాలనుకునే మనస్తత్వం విశాలాక్షిది. ఈ పాత్ర నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమా కథను హర్షవర్ధన్గారు చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ సెట్స్లో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ ప్రభుతో ఓ సినిమా కమిట్ అయ్యాను. అలాగే నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘దయ’ వెబ్ సిరీస్ రెండో భాగం‘దయ 2’ వచ్చే సంవత్సరం ఆరంభమవుతుంది’’ అన్నారు. -
మహేష్ బాబు నా కోసం ఏదైనా చేస్తాడు ఎందుకంటే..
-
Mama Mascheendra Trailer Launch: ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు (ఫోటోలు)
-
ఇలాంటి కథను ఇప్పటి వరకు ఎవరూ రాయలేదు
-
'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, ఈషా రెబ్బా జంటగా నటిస్తోన్న చిత్రం మామ మశ్చీంద్ర. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ సుధీర్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?) ట్రైలర్ చూస్తే.. 'ఈ సృష్టింలో నువ్వొక్కడివే నిజం.. నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు' అనే డైలాగ్లో మొదలైంది. ట్రైలర్లో గమనిస్తే సుధీర్ డబుల్ రోల్తో పాటు విభిన్నమైన పాత్రలో కనిపించున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్లో సుధీర్ బాబు ఫ్యాన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో మీర్నాలిని రవి, హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. -
సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర, గ్లింప్స్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరోం హర. ది రివోల్ట్ అనేది ఉప శీర్షిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్నారు. నేడు(మే 11) సుధీర్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేశారు. అందరూ పవర్ కోసం గన్ పట్టుకుంటారు. కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది అని సుధీర్ బాబు కుప్పం యాసలో చెప్పే డైలాగ్స్ గ్లింప్స్లో ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కథతో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇకపోతే సుధీర్ బాబు మరోపక్క మామా మశ్చీంద్ర సినిమా చేస్తున్నాడు. దర్శకుడు హర్షవర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాలిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చదవండి: హీరోలకే ఎక్కువ పారితోషికం, వ్యత్యాసం ఎందుకు?: రకుల్ ప్రీత్ సింగ్ -
మామా మశ్చీంద్ర: గాలుల్లోన పాట విన్నారా?
సుధీర్ బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు, దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాలినీ రవి, ఈషా రెబ్బా కథానాయికలు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గాలుల్లోన కలలే వాలే...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్, నూతన మోహన్ పాడారు. ‘‘ఈ చిత్రంలో మూడు పాత్రల్లో కనిపించనున్నారు సుధీర్ బాబు. ‘గాలుల్లోన...’ అనే పాటలో దుర్గ, డీజే పాత్రల్లో ఆకట్టుకుంటారాయన. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: ఉగ్రం నా కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్గా నిలుస్తుంది: అల్లరి నరేశ్ -
మొన్న గుర్తుపట్టలేనంతగా.. ఇప్పుడేమో స్టైలిష్గా యంగ్ హీరో!
దుర్గ లావుగా, మాస్గా ఉంటాడు. దుర్గకు పూర్తి భిన్నంగా ఉంటాడు పరశురామ్. చేతిలో తుపాకీ పట్టుకొని ఏజ్డ్ గ్యాంగ్స్టర్లా కనిపిస్తాడు. డ్రెస్సింగ్, సిట్టింగ్.. అంతా ఫుల్ స్టయిల్. ఇక్కడున్న పరశురామ్ లుక్ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పాత్రల్లో సుధీర్బాబు నటిస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇటీవల దుర్గ లుక్ని, శనివారం పరశురామ్ లుక్ని రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం ఇది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా, సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి. We decided one surprise wasn't enough 😁 Meet #Parasuram!!#MaamaMascheendra#SBasParasuram@HARSHAzoomout @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/WNW2PVsWR5— Sudheer Babu (@isudheerbabu) March 4, 2023 -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సుధీర్ బాబు, కొత్తలుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో సుధీర్ బాబు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన యాక్షన్ ఫిలింతో అలరించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన హంట్ బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం ప్లాప్గా నిలిచింది. ఇక సుధీర్ బాబు తన తదుపరి సినిమాను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఆయన మామ మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఇందుకోసం ప్రమోగం చేస్తున్నాడని అప్పట్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్, ఫిట్నెస్ లుక్తో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఈ సినిమా కోసం బొద్దుగా తయారయ్యాడు. ప్రస్తుతం షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో తన లుక్ను తాజాగా విడుదల చేసి ఫ్యాన్స్కి షాకిచ్చాడు. దీనికి ‘బెట్.. ఇలా వస్తానని మీరు అనుకుని ఉండరు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. లావుగా ఉన్న సుధీర్ బాబుని ఇలా చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఇలా ట్విస్ట్ ఇచ్చావేంటి భయ్యా అంటూ నెటిజన్లు అతడి పోస్ట్ కామెంట్స్ చేస్తున్నారు. Bet you didn't see this coming 😉 Meet Durga! #MaamaMascheendra@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/IWhVydn4ie — Sudheer Babu (@isudheerbabu) March 1, 2023 -
సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ చిత్రం బాక్సాపీస్ వద్ద పెద్ద ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో చిత్రంతో అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన హర్షవర్ధన్ డైరెక్షన్లో మామ మశ్చీంద్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరలవుతోంది. మామ మశ్చీంద్ర మూవీలో సుధీర్ బాబు మేక్ ఓవర్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది. అందులో హీరో పూర్తి భిన్నమైన లుక్లో కనిపించారు. అది చూసిన ఆయన అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఆ వీడియోలో సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోయింది. అసలు ఆ వీడియోలో ఉన్నది అతనేనా అన్న అనుమానం కలుగుతోంది. సుధీర్ బాబు, హర్షవర్ధన్ కాంబినేషన్లో మామా మశ్చీంద్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. Leaked Video: @isudheerbabu's Shocking Makeover for #MamaMascheendra pic.twitter.com/VnLpMlTzzb — Gulte (@GulteOfficial) February 27, 2023 -
‘నాన్నకు ప్రేమతో.... ’అంటున్న స్టార్ హీరోలు
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఈ ‘అనుబంధం’ ఎవర్ గ్రీన్. అందుకే ఈ రిలేషన్ చుట్టూ కొత్త కథలు అల్లుకుని సినిమాలు తీస్తుంటారు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఈ అనుబంధం నేపథ్యంలో కొన్ని సినిమాలు రానున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం. కమల్హాసన్ తండ్రీకొడుకుగా రెండు పాత్రలు చేసిన ఓ చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). 1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి, అతని తనయుడు, ప్రభుత్వ ఉద్యోగి చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో కమల్హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. దేశభక్తుడైన సేనాపతి లంచగొండి అయిన తన తనయుడు చంద్రబోస్ను హత్య చేయడం ఈ సినిమాకే ప్రధాన హైలైట్. భారీ ఎత్తున ప్రేక్షకాదరణ పొందిన ఈ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్గా పాతికేళ్ల తర్వాత కమల్హాసన్, శంకర్ ‘ఇండియన్ 2’ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రధానంగా తండ్రీకొడుకుల నేపథ్యంలోనే సాగుతుందని తెలిసింది. ఇండియన్ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లో కూడా కమల్హాసన్ తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని కోలీవుడ్ టాక్. కథలోని కీలక సన్నివేశాలు 1920 నేపథ్యంలో ఉంటాయని తెలిసింది. అంటే కథ.. స్వాతంత్య్రానికి పూర్వం సేనాపతి, అతని తండ్రికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఉంటుందన్నట్లుగా ఈ చిత్రరచయితల్లో ఒకరైన జయ మోహన్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ► ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు లుక్స్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని వినికిడి. అలాగే ఈ సినిమా కథకు తండ్రీకొడుకుల సెంటిమెంట్ను జోడించారట ప్రశాంత్ నీల్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తండ్రి బాధ్యతను కొనసాగించి, సక్సెస్ అయ్యే కొడుకు పాత్రలో ప్రభాస్ కనిపిస్తారన్నది ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. దర్శకుడు శంకర్, హీరో రామ్చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కథాంశం తండ్రీతనయుల అనుబంధమేనట. ఈ రెండు పాత్రలనూ చరణే చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఓ వ్యక్తి శ్రమిస్తాడు. కానీ కొందరు స్వార్థపరుల కారణంగా అతనికి అన్యాయం జరుగుతుంది. ఆ తర్వాతి కాలంలో ఆ వ్యక్తి తనయుడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. తండ్రిని ఇబ్బంది పెట్టినవారిని శిక్షిస్తూనే, డబ్బు, స్వార్థం లేని రాజకీయాల కోసం ప్రజలు ఎలా చైతన్యవంతులై ఉండాలి? ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా విధులు నిర్వర్తించాలి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► సుధీర్బాబు ప్రస్తుతం ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నారు. హర్షవర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధానంగా తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో మూడు డిఫరెంట్స్ లుక్స్లో సుధీర్బాబు కనిపిస్తారని టాక్. ► తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగే చిత్రాలు బాలీవుడ్లోనూ కొన్ని ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తండ్రి కోసం గ్యాంగ్స్టర్గా మారే ఓ యువకుడి కథే ‘యానిమల్’ అని బాలీవుడ్ టాక్. ఇందులో రణ్బీర్ కపూర్ తండ్రిగా అనిల్కపూర్ కనిపిస్తారని సమాచారం. -
ఆఫీషియల్: విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి హాంట్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేం భరత్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ మూవీ ‘ముంబై పోలీస్’కు రీమేక్గా వచ్చిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. అయితే హంట్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద ఈ మూవీ బోల్తా పడింది. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ దీంతో ఈ మూవీ థియేటర్లో విడుదలైన 2 వారాలకే ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్కు అంతా రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తాజాగా ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది. అంటే ఈ శుక్రవారం నుంచి హంట్ ఓటీటీలో సందడి చేయబోతోంది. కాగా ఏ చిత్రమైన థియేటర్లో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుంది. కానీ సుధీర్ భాబు, శ్రీకాంత్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ Get ready for the action-packed #HuntTheMovie thriller movie releasing on Feb 10 on aha.#HuntTheMovieOnAHA Premieres Feb 10@isudheerbabu @_apsara_rani @actorsrikanth @bharathhere @Imaheshh #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @anneravi @adityamusic pic.twitter.com/qGghi97ip0 — ahavideoin (@ahavideoIN) February 9, 2023 -
అప్పుడే ఓటీటీలోకి ‘హంట్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి రావడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం.. ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి చిత్రం దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఆ మధ్య టాలీవుడ్ ఓ రూల్ పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ హంట్ చిత్రం మాత్రం రెండు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. -
నేను అలాంటి సినిమాలు చేయను: సుధీర్ బాబు
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి హిట్ టాక్ లభించింది. తాజాగా చిత్రబృందం సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. సుధీర్ బాబు మాట్లాడుతూ..'సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. ప్రేక్షకులు అందరూ సెకండాఫ్లో 30 నిమిషాలు ఎక్సలెంట్ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను సూపర్బ్ అంటూ పోస్టులు చేశారు. ఆడియన్స్ చాలా థాంక్స్. నేను అయితే రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసినవి అన్నీ డిఫరెంట్ సినిమాలే. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ సినిమా.' అని అన్నారు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..'క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. హీరో సుధీర్ బాబు గారు ధైర్యంగా ఆ రోల్ చేశారు. నేను ఎప్పటికీ గర్వపడే సినిమా. తెలుగులో ఇటువంటి సినిమా చేయడం తొలిసారి. భరత్ మా సినిమాలో నటించినందుకు థాంక్స్. సుధీర్ బాబుకు హ్యాట్సాఫ్. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే తపన ఆయనదే.' అని అన్నారు. భరత్ మాట్లాడుతూ..'తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్నేళ్లు టైమ్ తీసుకున్నా. మంచి సినిమా చేశా. కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్ వ్యాల్యూస్తో తీశాం. మహేష్ కెరీర్లో ఇదొక మంచి సినిమా. సుధీర్ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది.' అని అన్నారు. సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ మాట్లాడుతూ..'సినిమాకు లభిస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాం. కొత్తగా చేయడం నాకు చాలా ఇష్టం. 'పలాస' తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రమిది. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. సినిమాలో హీరోయిన్ లేదనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. రెస్పాన్స్ బాగుంది.' అని అన్నారు. -
‘హంట్’ మూవీ రివ్యూ
టైటిల్ : హంట్ నటీనటులు: సుధీర్బాబు, శ్రీకాంత్, భరత్, చిత్ర శుక్లా తదితరులు నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్ నిర్మాత: వీ ఆనంద్ ప్రసాద్ దర్శకుడు: మహేశ్ సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫి: అరుల్ విన్సెంట్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి విడుదల తేది: జనవరి 26, 2023 కథేంటంటే.. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు), మోహన్ భార్గవ్(శ్రీకాంత్), ఆర్యన్దేవ్(భరత్)ల చుట్టు ఈ కథ సాగుతుంది. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఏ కేసునైనా ఇట్టే సాల్వ్ చేస్తారు. వీరిలో ఆర్యన్ దేవ్ దారుణ హత్యకు గురవుతాడు. ఈ కేసును అర్జున్ ప్రసాద్ విచారిస్తాడు. తన స్నేహితుడిని చంపిదెవరో తెలుసుకునే క్రమంలో అర్జున్కు యాక్సిడెంట్ అవుతుంది. ఈ ప్రమాదం కారణంగా ఆయన గతం మర్చిపోతాడు. ఈ విషయాన్ని దాచి మళ్లీ ఆ కేసును విచారించే బాధ్యతను అర్జున్కే అప్పగిస్తాడు కమిషనర్ మోహన్ భార్గవ్. గతం మర్చిపోయిన అర్జున్ ఈ కేసును ఎలా చేధించాడు? ఈక్రమంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులేంటి? ఇంతకి ఆర్యన్ దేవ్ని హత్యచేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు చివరకు అర్జున్ ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హంట్ ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. గతం మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్..తన గతం తెలుసుకొని ఓ మర్డర్ కేసును ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా కథ. క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్.. అందరికి షాకివ్వడమే కాకుండా అప్పటి వరకు సినిమాపై ఉన్న ఒపీనియన్ని మార్చేస్తుంది. ఆ ఒక్క పాయింట్ మాత్రమే కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్కి ఒప్పుకొని సినిమాను తీసిన సుధీర్ బాబుని కచ్చితంగా అభినందించాల్సిందే. కానీ ఈ సినిమా కథనం మాత్రం ఆసక్తికరంగా సాగదు. మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. సినిమా ప్రారంభం అయిన కొన్ని క్షణాలకే అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. స్టార్టింగ్ కాస్త ఇంట్రెస్టింగ్గా కథనం సాగుతుంది. కానీ ఓ 15 నిమిషాల తర్వాత రొటీన్ సన్నివేశాలు..స్లో నెరేషన్ ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతుంది. దర్శకత్వం లోపం వల్ల కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ మిస్ అయ్యాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్లో కథలో వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆడియన్స్కి గట్టి షాకిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. గతం మర్చిపోయిన పోలీసు అధికారిగా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో సుధీర్ బాబు నటన అందరినీ మెప్పిస్తుంది. మోహన్ భార్గవ్ పాత్రకి శ్రీకాంత్ న్యాయం చేశాడు. కాస్త సీరియస్గా ఉండే పాత్ర తనది. భరత్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మెరిశాడు. ఏసీపీ ఆర్యన్ దేవ్గా ఆయన ఉన్నంతలో చక్కగా నటించారు. కథంతా అతని పాత్ర చుట్టే తిరుగుతుంది. మైమ్ గోపీ, కబీర్ సింగ్ దుల్హన్, మంజుల, సంజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక విషయాలకొస్తే.. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయింది. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
సుధీర్ బాబు హంట్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫోటోలు)
-
కృష్ణగారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను.. సుధీర్ బాబు ఎమోషనల్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు.మహేశ్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ ఏ.ఎమ్.బి. మాల్లో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 'గత ఏడాదిగా మా కుటుంబంలో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ గారి మరణం మాకు పెద్ద లాస్. మావయ్య చనిపోయాక ఇది నా ఫస్ట్ మూవీ. ఆయన లేని వెలితి కనిపిస్తుంది. నా ప్రతి సినిమా ఫస్ట్ షో చూసిన నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు నేను అది మిస్ అవుతా. మావయ్య చనిపోవడానికి 20 రోజుల ముందు సినిమా ఏదైనా చూస్తారా? అని ఆయన్ను అడిగితే... 'నేను ఎవరి సినిమాలు చూడను. మహేష్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామని అనుకుంటున్నా' అని చెప్పారట. ఇది నాకు గర్వకారణం. కెరీర్లో ఎంత దూరం వెళతానో తెలియదు. ఈ ప్రయాణం మావయ్య గారికి అంకితం. జన్మజన్మలు ఆయనకు రుణపడి ఉంటాను' అంటూ సుధీర్ బాబు పేర్కొన్నారు. -
ఆ సినిమా రీమేక్ నేను చేయాల్సింది: భరత్
‘టాలీవుడ్లో అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లో ఆ సినిమా తమిళ రీమేక్ నేను చేయాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను’అని తమిళ హీరో భరత్ అన్నారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన...చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ‘హంట్’లో కీలక పాత్ర పోషించారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మా త వి. ఆనం ద ప్రసాద్ నిర్మిం చారు. మహేష్ దర్శకత్వం వహిం చారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుం ది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టలేదు. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
ఆద్యంతం ఆసక్తికరంగా ‘హంట్’ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేసి, చిత్ర యూనిట్కి ఆల్ది బెస్ట్ చెప్పారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి’ అని శ్రీకాంత్ చెప్పే డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. టీజర్లో కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఆ కేసు ఏమిటన్నది ట్రైలర్లో చూపించారు. పట్టపగలు ఓ అసిస్టెంట్ కమిషనర్ హత్యకు గురవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో హీరోకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ఏం చేశారు? అనేది ఆసక్తికరం. ఈ చిత్రంలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. మెమరీ లాస్కు ముందు జరిగిన ఘటనలు, వ్యక్తులు గుర్తు లేకపోవడంతో అర్జున్ కొత్తగా కేసును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోజుకు ఒక కొత్త అనుమానితుడి పేరు వస్తుంది. దానికి తోడు 18 రోజుల్లో కేసును పరిష్కరించాలని టార్గెట్. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? థ్రిల్లింగ్ జర్నీగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. -
మహేష్ బాబు ఒకప్పటిలా లేడు: సుధీర్ బాబు
-
' హంట్ మూవీ ' హీరో సుధీర్ బాబుతో " స్పెషల్ చిట్ చాట్ "
-
స్పెషల్ ఇంటర్వ్యూ విత్ హీరో సుధీర్ బాబు
-
డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్.. సుధీర్ బాబు యాక్షన్ స్టంట్స్ మేకింగ్ వీడియో రిలీజ్
సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘హంట్’. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సెస్ని ఫ్రాన్స్కి చెందిన క్యాంపస్ యూనివర్స్ కాస్కేడ్స్ టీమ్ డిజైన్ చేసింది. సుధీర్బాబు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలోని రిస్కీ ఫైట్స్కి డూప్ వాడలేదు. రోప్, బెడ్లాంటివి ఏవీ లేకుండానే ఫైట్స్ చేశాం. ఈ సినిమాలో అన్నీ మరపోయే రెండు షేడ్స్ ఉన్న అర్జున్ పాత్ర చేశాను. జ్ఞాపకశక్తి కోల్పోక ముందు కోల్పోయాక.. ఇలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. ‘‘హై వోల్టేజ్యాక్షన్ థ్రిల్లర్గా ఈ త్రాన్ని రూపొందించాం. హాలీవుడ్ వర్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’కి స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘జాన్ విక్ 4’కి చిత్రానికి కూడా వాళ్లే స్టంట్ కొరియోగ్రాఫర్స్. ఈ ముగ్గురికీ తొలి భారతీయ చిత్రం ఇది’’ అన్నారు ఆనందప్రసాద్. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి. -
రిపబ్లిక్ డే కానుకగా ‘హంట్’
సుధీర్బాబు హీరోగా, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘హంట్’. మహేశ్ దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సుధీర్బాబు, శ్రీకాంత్, భరత్ పోలీసాఫీసర్లుగా నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రిపబ్లిక్ డే కానుకగా ‘హంట్’ సినిమాను జనవరి 26న థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియార్ ‘హంట్’ సినిమాకు యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. వాళ్లు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్గా నిలుస్తుంది’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి. -
ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ అల్లుడుగానే పుట్టాలి : సుధీర్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని జేఆర్సీ, ఎన్ కన్వెన్షన్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు భారీగా తరలివచ్చారు. దాదాపు 5వేల మంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభిమానులకు కోసం పాసులు పంపిణీ చేయడంతో పాటు 32 రకాల వంటకాలతో విందు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో సూపర్స్టార్ కృష్ణ విగ్రహాన్ని కూడా ప్రదర్శించనున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు జేఆర్సీ కన్వెన్షన్కు చేరుకున్నారు. ఆయనతో పాటు కృష్ణ కుటుంబసభ్యులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ సుధీర్ బాబు స్టేజ్ పేనే బోరున ఏడ్చేశారు. ఎన్ని జన్మలు ఎత్తినా కృష్ణ అల్లుడుగానే పుట్టాలని కోరుకుంటున్నానంటూ ఎమోషనల్ అయ్యారు. ఈనెల 15న అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సూపర్ స్టార్కృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం కుటుంబసభ్యులకే కాదు, అభిమానులకు సైతం తీరని శోకాన్ని మిగిల్చింది. -
సుధీర్బాబు హంట్కు హాలీవుడ్ యాక్షన్ టచ్
సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'హంట్'. మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు పని చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు. నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "హాలీవుడ్లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. 'హంట్' మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. చదవండి: మరో భాషలో వస్తున్న కాంతార, రిలీజ్ ఎప్పుడంటే? బాలీవుడ్ నటిపై నిఖిల్ ఆగ్రహం -
'ఇంగ సెప్పేదేం లేదో.. చేసేదే..' ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు టైటిల్
యంగ్ హీరో సుధీర్బాబు తాజా చిత్రంపై క్రేజీ అప్డేట్ వచ్చింది. జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి 'హరోం హర’ అనే టైటిల్ను ఖరారు చేసింది. ది రివోల్ట్ అనేది క్యాప్షన్. చిత్రబృందం. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ చిత్ర యూనిట్ విడుదల చేసింది. వైవిధ్య కథలతో మంచి గుర్తింపు సాధించిన నటుడు సుధీర్బాబు. ఇటీవలే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీతో ప్రేక్షకులను అలరించారు. (చదవండి: ప్రముఖ బుల్లితెర నటి మృతి.. సీఎం సంతాపం) తాజాగా మరో ఆసక్తికరమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించారు. ఇవాళ విడుదలైన వీడియోలో ‘ఇక చెప్పేదేం లేదో.. చేసేదే’ అనే డైలాగ్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ఆ వీడియోను చూస్తే ఈ సినిమాలో ఆధ్యాత్మిక అంశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో సాగే కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సుధీర్ మాస్ లుక్లో కనిపించనున్నారు. -
కొత్త సినిమాను ప్రకటించిన సుధీర్ బాబు.. ఇంట్రెస్టింగ్ పోస్టర్
హిట్టు, ప్లాఫులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో సుధీర్బాబు. డిఫరెంట్ జోనర్స్తో ప్రేక్షకులను మెప్పిస్తున్న సుధీర్బాబు ఇటీవలె ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ను వదిలాడు. సుధీర్బాబు కెరీర్లో ఇది 18వ సినిమా. 'సెహరి' ఫేం జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్కి సంబంధించి ఇన్లాండ్ లెటర్తో ఉన్న ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఇందులో అరుణ్ గౌలి ఆఫ్ సౌత్ బాంబే ఫ్రమ్ అడ్రస్తో చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రహ్మణ్యంకు ఈ లేఖను రాసినట్టు అర్థమవుతుంది.1989 కుప్పం నేపథ్యంలో డివైన్ టచ్తో సాగే కథ నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. పిలిసినంక రాకుంటే ఎట్ల సెప్పండ అందికే వస్తా ఉండా!#Sudheer18@gnanasagardwara #SumanthGNaidu @SSCoffl pic.twitter.com/ymoEU9ABFN — Sudheer Babu (@isudheerbabu) October 27, 2022 -
అర్జున్ను ఎవరూ ఆపలేరు.. అంచనాలు పెంచుతున్న 'హంట్' టీజర్
టాలీవుడ్ నటుడు సుధీర్బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హంట్'. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్రబృందం సోషల్మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. పోలీసు పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్గా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం టీజర్ను రిలీజ్ చేసింది. 'అతను అర్జున్ ఏ. ఇక నువ్వు ఇప్పుడు అర్జున్ బీ. అర్జున్ ‘ఏ’కి తెలిసిన మనుషులు, సంఘటనలు ఏమీ కూడా అర్జున్ ‘బీ’కి తెలియవు.. వారిద్దరు విభిన్న వ్యక్తులు' అంటూ మంజుల చెప్పే సంభాషణలతో టీజర్ ప్రారంభమైంది. అర్జున్ 'ఏ'కు తెలిసిన లాంగ్వేజెస్, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ ఇవన్నీ అర్జున్ 'బీ'కి కూడా ఉన్నాయి' అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఏ కేసునైతే ఆ అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అనే శ్రీకాంత్ డైలాగ్ మరింత హైప్ పెంచుతోంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. కానీ అర్జున్ 'ఎ'గా ఉండటమే అతనికి ఇష్టం! మరి అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది 'హంట్' సినిమాలో చూడాల్సిందే. -
నటిగా ఇంతకంటే ఏం కావాలి?
‘‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నా పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది ఫోన్ చేసి, ‘నన్ను నేను స్క్రీన్పై చూసుకున్నట్లు ఉంది’ అని చెప్పడం హ్యాపీ. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?’’ అని కృతీశెట్టి అన్నారు. సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి.మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలైంది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతీశెట్టి మాట్లాడుతూ–‘‘నేను డాక్టర్ కావాలనుకున్నాను. ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ఉప్పెన’ అవకాశం రావడం, ఆ తర్వాత మంచి పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ప్రతి సినిమాకి, పాత్రకి హోమ్ వర్క్ చేస్తాను. కెరీర్ బిగినింగ్లోనే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో ద్విపాత్రాభినయం చేయడం హ్యాపీ. ఇంతమంచి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటిగారికి థ్యాంక్స్. ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం. సుధీర్ బాబుగారు సెట్లో సరదాగా ఉంటూ ఎదుటివారిలో చాలా స్ఫూర్తి నింపుతారు. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో ఓ చిత్రం, తమిళంలో సూర్యగారితో ‘అచలుడు’ అనే సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఉంది : సుధీర్ బాబు
హీరో సుధీర్ బాబు, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్గా నటించారు. గాజులపల్లె సుధీర్బాబు సమర్పణలో మైత్రీమూవీ మేకర్స్తో కలిసి బి. మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుధీర్బాబు మాట్లాడుతూ – ‘‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి గొప్ప సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. తండ్రీకూతుళ్లు కలిసి ఈ సినిమాకు వెళ్తే చాలా ఆనందిస్తారని నమ్ముతున్నాం’’ అని అన్నారు. ‘‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు ఓ కొత్త కోణాన్ని ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. యంగ్స్టర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ‘‘ఇది నాకు స్పెషల్ మూవీ’’ అన్నారు కృతీ శెట్టి . -
Sudheer Babu: అందుకే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ ఆఫర్ వదులుకున్నా
హీరో సుధీర్ బాబు తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 16న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా రీసెంట్గా ఓ చానల్తో ముచ్చటించిన సుధీర్ బాబు ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. చదవండి: ఈ ఒక్కరోజే ఓటీటీలోకి 20 సినిమాలు, ఎక్కడెక్కడంటే.. ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన పాన్ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో నటించే అవకాశం వచ్చిందని, అయితే ఆ ఆఫర్ వదులుకున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాల గురించి చెబుతూ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఆ వెంటనే బ్రహ్మాస్త్ర మూవీ ఆఫర్ వదులుకోవడానికి కారణమేంటి? అని యాంకర్ ప్రశ్నించగా సుధీర్ బాబు ఇలా స్పందించాడు. ‘అవును నాకు బ్రహ్మాస్త్ర మూవీ ఆఫర్ వచ్చింది. అయితే అప్పటికే నేను తెలుగులో పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నాను. అందుకే బ్రహ్మాస్త్రలో చేయలేని చెప్పాను. అదే కారణం అంతకు మించి ఏం లేదు’ అని అన్నాడు. చదవండి: గొప్ప మనసు చాటుకున్న రావు రమేశ్.. అతడి కుటుంబానికి రూ.10 లక్షల సాయం కాగా సుధీర్ బాబు గతంలో టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ చిత్రంలో విలన్గా నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వలో ఆలియా భట్-రణ్బీర్ కపూర్ తొలిసారిగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన మూవీ గత సెప్టెంబర్ 9న విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారం రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం రూ. 200 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మనం సినిమా తీస్తున్నాం!
‘చేస్తాను.. నేను యాక్ట్ చేస్తాను’ అంటూ కృతీ శెట్టి ఫోన్లో సుధీర్బాబుతో మాట్లాతున్న సీన్తో మొదలవుతుంది ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ట్రైలర్. సుధీర్బాబు, కృతీ శెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. గాజులపల్లె సుధీర్బాబు సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకాలపై బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు హీరో మహేశ్బాబు. ‘నేను ఈ సినిమా ఇక చేయలేనేమో అనిపిస్తుంది’ అన్న కృతీ శెట్టి డైలాగ్, ‘మనం సినిమా తీస్తున్నాం అని అనుకుంటుంటాం కానీ అప్పుడప్పుడు సినిమాయే మనల్ని తీస్తుంటుంది’ అనే సుధీర్బాబు డైలాగ్స్తో ట్రైలర్ సాగుతుంది. ‘‘అలేఖ్య (కృతీ పాత్ర)కు నటి కావాలనే ఆశ ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు పూర్తి వ్యతిరేకం. అలేఖ్య ఆశ ఫైనల్గా ఏమైంది? ఇందుకు ఆ సినిమా దర్శకుడు (సుధీర్బాబు పాత్ర) ఏం చేశాడు? అనే అంశాల ఆధారంగా కథ సాగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్. -
ఆకట్టుకుంటున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ట్రైలర్
హీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి మోహన్కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్లుక్, టీజర్, పాటలకు పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక సెప్టెంబర్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. చదవండి: సినీ ప్రియులకు ‘ఐబొమ్మ’ బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా సేవలు బంద్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా మూవీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ ట్రైలర్ను విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. కామెడీ, లవ్, ఎమోషన్స్తో మలిచిన ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేట్టుందన్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ హీరోహీరోహీరోయిన్లు సుధీర్ బాబు, కృతి శెట్టి, డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణలతో పాటు చిత్రబృందానికి మహేశ్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల చిత్రంలో అలనాటి లేడీ సూపర్ స్టార్? Happy to launch the trailer of #AaAmmayiGurinchiMeekuCheppali...looks like an interesting one! All the best to @isudheerbabu @IamKrithiShetty, #MohanaKrishnaIndraganti and the entire team!https://t.co/fGU4r3CraX@MythriOfficial @benchmarkstudi5 — Mahesh Babu (@urstrulyMahesh) September 5, 2022 -
హంట్: కనిపించని శత్రువు కోసం సుధీర్బాబు వేట!
సుధీర్బాబు హీరోగా, శ్రీకాంత్, భరత్(‘ప్రేమిస్తే’ ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ‘హంట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. సుధీర్బాబు, శ్రీకాంత్, భరత్ పోలీసు పాత్రలు పోషించారు. కనిపించని శత్రువు కోసం హీరో జరిపే వేట ఈ చిత్రం ప్రధాన కథాంశం. సుధీర్బాబు గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీలో క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది. శ్రీకాంత్ పాత్ర ఎగ్జైటింగ్గా ఉంటుంది. భరత్ తెలుగులో చేసిన తొలి స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు. మైమ్ గోపీ, కబీర్ దుహాన్ సింగ్, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు సంగీతం: జీబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. చదవండి: ఒకే భవనంలో అపార్ట్మెంట్స్ కొన్న స్టార్ హీరోలు! -
బ్లాక్ డ్రెస్లో ఫిదా చేస్తున్న కృతిశెట్టి, ఫొటోలు చూశారా?
-
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
‘‘కథకు న్యాయం చేసే దర్శకుడు ఇంద్రగంటిగారు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాల్లో బెస్ట్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ప్రేమకథతో పాటు అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఉన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు సుధీర్బాబు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్బాబు, కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. గాజులపల్లె సుధీర్బాబు సమర్పణలో బి. మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘మీరే హీరో లాగ..’ అనే పాటని దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేశారు. హీరో సుధీర్బాబు మాట్లాడుతూ– ‘‘నటీనటులు ఎంత ప్యాషనేట్గా సినిమాలు చేస్తారో జర్నలిస్ట్లు కూడా అంతే ప్యాషన్తో తమ పని చేస్తారు. అందుకే ‘మీరే హీరో లాగ..’ పాటని మీడియాకి అంకితం ఇస్తున్నాం. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారిని మనం మిస్ కాకుండా చూసుకునే బాధ్యత రామజోగయ్య శాస్త్రిగారిపై ఉంది’’ అన్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను కూడా జర్నలిస్ట్గా పని చేశాను. ఒక ఇంటర్వ్యూ తరహాలో హీరో పరిచయ పాట ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి వచ్చిందే ‘మీరే హీరో లాగ..’. ఈ సాంగ్ క్రెడిట్ రామజోగయ్య శాస్త్రి, దినేష్, వివేక్లకు దక్కుతుంది’’ అన్నారు. రచయిత రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, కెమెరామేన్ పీజీ విందా, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ మాట్లాడారు. -
నేనేం స్టార్ కిడ్ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్పుత్
మూడు విభిన్న పాత్రలో ఆది సాయి కుమార్, పాయల్ రాజ్పుత్ జోడిగా నటించిన తాజా చిత్రం తీస్ మార్ ఖాన్. 'నాటకం' వంటి సినిమాను తెరకెక్కించిన కల్యాణ్ జి గోగణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్ట్ 19న విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ.. ''అడగ్గానే వచ్చిన మా మేజర్ (అడివి శేష్)కు సెల్యూట్. మా డీజే (సిద్దు జొన్నలగడ్డ) ఇలా రావడం ఆనందంగా ఉంది. నేను, సుధీర్ బాబు కలిసి మళ్లీ తండ్రీ కొడుకుల్లా నటించబోతోన్నాం. మా అబ్బాయి నటించిన ప్రేమ కావాలి అంటూ వచ్చాడు. ఇప్పుడు తీస్ మార్ ఖాన్ అంటూ ముందుకు రాబోతోన్నాడు. ఈ టీం అందరికీ థాంక్స్. ఇంత మంది మంచి మనుషులు కలిసి ఈ సినిమాను తీశారు. ఈ ఏడాదితో నాకు నటుడిగా 50 ఏళ్లు వస్తాయి. అందరూ బాగుండాలి.. అందులో మనముండాలి.. అన్ని సినిమాలు బాగుండాలి.. అందులో మన సినిమా కూడా ఉండాలి. మీ ఆశీర్వాదంతో తీస్ మార్ ఖాన్ సినిమా కూడా విజయం సాధించాలి'' అని తెలిపారు. ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘పిలవగానే ఈవెంట్కు వచ్చిన అడివి శేష్, సుధీర్ బాబు, సిద్దులకు థాంక్స్. సినిమాలో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి స్క్రిప్ట్. మీకు నచ్చితే ఓ పది మందికి చెప్పండి. పాయల్ మంచి సహనటి. సునీల్ అన్న చేసిన చక్రి అనే పాత్ర అద్భుతంగా ఉంటుంది. అందరూ అద్భుతంగా నటించారు. నన్ను కొత్తగా ప్రజెంట్ చేసిన కల్యాణ్కు థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా మా సినిమాను నిర్మించిన నాగం తిరుపతి రెడ్డి గారికి థాంక్స్. సాయి కార్తిక్ మంచి బీజీఎం ఇచ్చారు. మా కెమెరామెన్ బాలిరెడ్డి, ఫైట్ మాస్టర్ ఇలా పని చేసిన అందరికీ థాంక్స్. సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి’ అని పేర్కొన్నాడు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్కు గాయాలు ! ''నన్ను ఇక్కడకు పిలిచిన సాయి కుమార్ గారికి థాంక్స్. ఇది వరకు ఆది చేసిన సినిమాలు అన్నింట్లో కెల్లా ఈ చిత్రంలో కొత్తగా అనిపిస్తున్నాడు. కారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. డైరెక్టర్ కల్యాణ్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. స్క్రీన్ మీద ఎంతో ఫ్రెష్గా కనిపిస్తుంది'' అని సిద్ధు జొన్నల గడ్డ తెలిపాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ‘తీస్ మార్ ఖాన్ సినిమా కుమ్మేయాలని కోరుకుంటున్నాను. సాయి కుమార్ గారు ఫోన్ చేసి రమ్మన్నారు. మా అమ్మ బర్త్ డే ఆగస్ట్ 19. ఈ చిత్రం సక్సెస్తో మా అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. ట్రైలర్లో ఆది కుమ్మేశాడు. సినిమాలోనూ కుమ్మేస్తాడు. పాయల్ను ఇలా కలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి’ అని అన్నారు. చదవండి: సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! సుధీర్ బాబు మాట్లాడుతూ.. ''తీస్ మార్ ఖాన్ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. పర్ఫెక్ట్ కమర్షియల్ టైటిల్. నేను ఆది కలిసి శమంతకమణి సినిమాను చేశాం. ఆయన అద్భుతమైన నటుడు. ఈ చిత్రం ఆదికి పర్ఫెక్ట్ సినిమా అనిపిస్తోంది. సాయి కుమార్ గారితో నేను భలే మంచిరోజు చిత్రాన్ని చేశాను. నాకు ఆయన ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్లో తండ్రిలాంటి వారు'' అని తెలిపాడు. ‘నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. నా సినిమా రిలీజ్ అయ్యే టైంలో కాస్త నెర్వస్గా ఉంటాను. అది అందరికీ సహజంగానే ఉంటుంది. మా సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నింటికి విశేషమైన స్పందన వచ్చింది. మా సినిమాకు మీ ప్రేమ దక్కినందుకు మాకు సంతోషంగా ఉంది. నేనేం స్టార్ కిడ్ను కాదు. నేను ఏం చేసినా నా సొంతంగానే చేశాను. అది మీ ప్రేమ, అభిమానం వల్లే చేయగలిగాను. ఈ సినిమా నాకెంతో స్పెషల్. మూడేళ్ల తరువాత నా సినిమా థియేటర్లోకి వస్తోంది. ఈ చిత్రంలో ట్విస్ట్లు అద్భుతంగా ఉంటాయి’ అని హాట్ బ్యూటీ పాయల్ రాజ్పుత్ పేర్కొంది. -
సెప్టెంబర్ 16న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిలీజ్
-
ఆ అమ్మాయి గురించి చెప్తానంటున్న హీరో సుధీర్ బాబు
హీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి మోహన్కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో ప్రేమకథా చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్లుక్, టీజర్కు పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 16న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ను వదిలారు.మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్మార్క్ స్డూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. #AaAmmayiGurinchiMeekuCheppali in Theatres from SEP 16 🤩 Get ready to fall in love with a beautiful tale on the Big Screens ❤️ #AAGMConSEP16 @isudheerbabu @IamKrithiShetty #MohanaKrishnaIndraganti @MythriOfficial @mahendra7997 pic.twitter.com/KqZ4X1JkMQ — Benchmark Studios (@benchmarkstudi5) August 10, 2022 -
ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్ అవుతుందా?
‘మీ కాంబినేషన్లో మళ్లీ సినిమా ఎప్పుడు?’ సినిమా ఇండస్ట్రీలో కామన్గా వినిపించే ప్రశ్న ఇది. ‘అన్నీ కుదిరినప్పుడు...’ అనే సమాధానం కూడా కామన్. అలా అన్నీ కుదిరినప్పుడు కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మూడోసారి రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి.. అలా... మూడోసారి కుదిరిన కాంబినేషన్ విశేషాల్లోకి వెళదాం. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో: మహేశ్బాబు మాసీ యాక్షన్ను ‘అతడు’ (2005)లో చూశాం. అలాగే మహేశ్ కామెడీ టైమింగ్ని ‘ఖలేజా’ (2010)లో చూశాం. ఈ రెండు చిత్రాల్లోనూ మహేశ్తో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయించారు దర్శకుడు త్రివిక్రమ్. దాదాపు పన్నెండేళ్ల తర్వాత హీరో మహేశ్.. దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా సెట్స్పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ జూన్లో ప్రారంభం కానుంది. ఇందులో మహేశ్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తారు. ‘మహర్షి’ తర్వాత మహేశ్, పూజా మళ్లీ జోడీ కడుతున్న సినిమా ఇదే. అలాగే ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల.. వైకుంఠపురములో..’ తర్వాత త్రివిక్రమ్తో పూజా హెగ్డే చేయనున్న మూడో చిత్రం కూడా ఇదే. గోపిచంద్-శ్రీవాస్ కాంబినేషన్లో: అలాగే గోపించంద్-శ్రీవాస్ కూడా మూడోసారి జతకట్టబోతున్నారు. గోపీచంద్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కే ఈ సినిమా ఆల్రెడీ సెట్స్లో ఉంది. ‘లక్ష్యం’ (2007) లాంటి మాస్ సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్ తొలిసారి షురూ అయింది. ఆ తర్వాత ‘లౌక్యం’ (2015) చేశారు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ‘లక్ష్యం 2’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. ‘లక్ష్యం 2’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు కానీ ఇది ‘లక్ష్యం’కి సీక్వెల్ అని మాత్రం యూనిట్ స్పష్టం చేయలేదు. ఇందులో డింపుల్ హయతి హీరోయిన్. నాగ చైతన్య-విక్రమ్ కే కుమార్: ఇక అక్కినేని ఫ్యామిలీ మూవీ అంటే ‘మనం’ (2014) అని ఈజీగా చెప్పేస్తారు ఆడియన్స్. ఈ చిత్రంలో ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ (అతిథి పాత్ర) నటించారు. ఈ సినిమాకు విక్రమ్ కె. కుమార్ దర్శకుడు. ‘మనం’ తర్వాత నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ చిత్రం రూపొందింది. ఇందులో రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లు. ఈ సినిమా రిలీజ్కి రెడీ అవుతోంది. అయితే ‘థ్యాంక్యూ’ రిలీజ్ లోపే విక్రమ్ కె. కుమార్తో మరో ప్రాజెక్ట్కి సై అన్నారు నాగచైతన్య. కానీ ఇది ఓటీటీ ప్రాజెక్ట్. ‘దూత’ టైటిల్తో రానున్న ఈ సిరీస్లో నాగచైతన్య జర్నలిస్ట్. సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహన్కృష్ణ: మరోవైపు హీరో సుధీర్బాబు.. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కూడా మూడో సినిమా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే... ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన గత రెండు సినిమాల్లో హీరో సుధీర్బాబే. 2018లో రిలీజైన ‘సమ్మోహనం’, 2020లో ఓటీటీలో వచ్చిన ‘వి’ (ఇందులో హీరో నాని కూడా నటించారు) చిత్రాల తర్వాత ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే చిత్రం కోసం మూడోసారి కలిశారు సుధీర్బాబు – ఇంద్రగంటి ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్. నిఖిల్-సుధీర్ వర్మ: ఇటు నిఖిల్ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తీసిన ఫస్ట్ సినిమా ‘స్వామి రారా’ (2013) మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిఖిల్.. సుధీర్ వర్మ కాంబినేషన్లో 2017లో ‘కేశవ’ సినిమా వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఇద్దరూ కలిసి మళ్లీ సినిమా చేస్తున్నారు. నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్: ఇంకో వైపు ‘ఊహలు గుసగుసలాడే’ (2014), ‘జ్యో అచ్యుతా నంద’ (2016) తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ అనే సినిమా సెట్స్పై ఉంది. ఒక సినిమా చేస్తున్నప్పుడు హీరో.. డైరెక్టర్ మధ్య మంచి అవగాహన కుదిరితే.. కథ కుదిరినప్పుడు మళ్లీ కలిసి సినిమా చేయాలనుకుంటారు. ఇక్కడ చెప్పిన కాంబినేషన్స్ అన్నీ దాదాపు అలాంటివే. ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న ఈ కాంబినేషన్ మళ్లీ ‘హిట్’పై గురి పెట్టింది. ఇటీవల రిపీట్ అయిన ‘థర్డ్’ కాంబినేషన్ మంచి హిట్ని సొంతం చేసుకున్నాయి. అవేంటంటే.. ‘అఖండ’, ‘పుష్ప’, ‘క్రాక్’. ‘సింహా’ (2010), ‘లెజండ్’ (2014) చిత్రాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ’ సూపర్ హిట్గా నిలిచింది. అలాగే ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) తర్వాత హీరో అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రిలీజైన ‘పుష్ప’ సూపర్ హిట్. ‘డాన్ శీను (2010), ‘బలుపు (2013) చిత్రాల తర్వాత హీరో రవితేజ – దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘క్రాక్’ సూపర్ హిట్గా నిలిచింది. ఇటు ‘నేను..శైలజ’ (2016), ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ (2017) చిత్రాల తర్వాత హీరో రామ్ – దర్శకుడు కిశోర్ తిరుమల కలిసి చేసిన ‘రెడ్’ మూవీ కూడా ఫర్వాలేదనిపించింది. మరి.. ఇప్పుడు రిపీట్ అవుతున్న ఈ థర్డ్ కాంబినేషన్ కూడా హిట్ మ్యాజిక్ని రిపీట్ చేస్తుందనే అంచనాలున్నాయి. -
తలకిందులుగా సుధీర్ బాబు.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Sudheer Babu Pre Look Poster From His Action Thriller Sudheer 16: యంగ్ హీరో సుధీర్బాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్బాబు కృతిశెట్టితో కలిసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. దానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ను బుధవారం (మే 11) సుధీర్ బాబు బర్త్డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాకు 'మామా మశ్చీంద్ర' అన్న టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇదే కాకుండా భవ్య క్రియేషన్స్ ఆధ్వర్యంలో సుధీర్ తన 16వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఆకర్షణీయమైన పోస్టర్ను సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆవిష్కరించింది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనుంది. ఈ పోస్టర్లో సుధీర్ బాబు తలికిందులుగా పుష్ అప్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు. పోస్టర్ ద్వారా సూపర్ ఫిట్గా ఉన్న సుధీర్బాబుకు 'హ్యాపీ బర్త్డే నైట్రో స్టార్' అని విష్ చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు మహేశ్ దర్శకత్వం వహించగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల గన్స్ డోంట్ లై అనే ట్యాగ్లైన్తో రిలీజ్ చేసిన పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. చదవండి: మామా మాశ్చీంద్ర: సుధీర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూశారా? Here's the Terrific Pre-Look Poster of 'Nitro Star' @isudheerbabu's #Sudheer16 💥 The Monstrous cop in Action! 🛡️ A @GhibranOfficial Musical 💥 #HBDSudheerBabu @bharathhere @actorsrikanth @Imaheshh #Anandaprasad @BhavyaCreations @anneravi @vincentcinema @PulagamOfficial pic.twitter.com/PU0yYNdLEY — Bhavya Creations (@BhavyaCreations) May 11, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మామా మాశ్చీంద్ర: సుధీర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ చూశారా?
యంగ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు బర్త్డే నేడు (మే 11). ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మామా మశ్చీంద్ర అన్న టైటిల్తో పాటు సుధీర్ లుక్ను సైతం విడుదల చేశారు. ఇందులో హీరో స్టేజీపై సాంగ్ పాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతుండటం విశేషం. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా పని చేస్తుండగా పీజీ వింద సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సుధీర్బాబు కృతిశెట్టితో కలసి నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' త్వరలోనే విడుదల కానుంది. Fun & action have no language barrier 🥳 #MaamaMascheendra!! Also in Hindi this time! 😃 Let's go! 🕺🏻@HARSHAzoomout @chaitanmusic @pgvinda #NarayanDasNarang @puskurrammohan @SVCLLP pic.twitter.com/RIil9JOJYi — Sudheer Babu (@isudheerbabu) May 11, 2022 చదవండి: నా విషయం పక్కనపెట్టు, నీ ముఖం సంగతేంటి?: ట్రోలింగ్కు నటి కౌంటర్ ప్రాణాల కోసం పోరాడుతున్న మాజీ మిస్టర్ యూనివర్స్.. ఆవేదనలో ఫ్యాన్స్ -
స్క్రీన్ ప్లేలో 'ప్లే'.. మరింతగా ఆడనున్న సినిమాలు
సినిమాకి ఓ కథ ఉంటుంది. ఆ కథకు ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. అదే స్క్రీన్ పై ఓ ‘ప్లే’ ఉంటే... స్క్రీన్ పై ఆట ఆడేవారికి ఓ కిక్కు.. చూసేవారికి మరింత కిక్కు. అలాంటి కిక్ ఇవ్వడానికి తెలుగు స్పోర్ట్స్ మూవీస్ కొన్ని రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల విశేషాలేంటో ఓసారి చదివేద్దాం. ప్రొఫెషనల్ బాక్సర్గా.. ఇప్పటివరకూ లవర్ బాయ్గా కనిపించిన విజయ్ దేవరకొండ వెండితెరపై తన పంచ్ పవరేంటో చూపించేందుకు ‘లైగర్’లో బాక్సర్గా మారారు. హీరోలను తనదైన శైలిలో పవర్ఫుల్గా చూపించే పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్లా కనిపించేందుకు విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్తో ఈ సినిమాలో ఢీ కొట్టారు విజయ్. టైసన్ నటించిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. థాయిల్యాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్లను కంపోజ్ చేశారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటు సినీ లవర్స్ అటు బాక్సింగ్ లవర్స్ ఈ స్క్రీన్ ప్లేని ఆగస్ట్ 25న చూడనున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఏప్రిల్లో గని పంచ్ వేసవిలో తన పంచ్ పవర్ చూపించడానికి రెడీ అయ్యాడు గని. బాక్సర్ గని పాత్రలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘గని’. ఇప్పటివరకూ లవ్స్టోరీలు, ఫ్యామిలీ మూవీస్ చేసిన వరుణ్ ‘గని’లోని పాత్ర కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. ‘గని’ పంచ్ పవర్ ఎలా ఉంటుందో చూడాలంటే ఏప్రిల్ 8 వరకూ ఆగాల్సిందే. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఇందులో సునీల్ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రధారులు. ఈసారి గోల్పై గురి ‘మజిలీ’లో క్రికెటర్గా కనిపించి, మంచి కలెక్షన్ల స్కోర్ తెచ్చుకున్న నాగచైతన్య తన తాజా చిత్రం ‘థ్యాంక్యూ’లో గోల్పై గురి పెట్టారు. ఈ చిత్రంలో హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నారు. ‘మనం’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇది. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో చైతూ మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నారని టాక్. వాటిల్లో ఒకటి హాకీ ప్లేయర్ అని తెలుస్తోంది. నాగచైతన్య హాకీ ఆడుతున్న సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ అయింది కూడా. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మిల్కీ బ్యూటీ.. బబ్లీ బౌన్సర్ ఓ వైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘బబ్లీ బౌన్సర్’ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ ఒకటి. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తమన్నా బౌన్సర్ పాత్రలో కనిపిస్తారు. అయితే బాక్సింగ్ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందని టాక్. బౌన్సర్ నుంచి బాక్సర్గా మారే క్యారెక్టర్లో తమన్నా కనిపిస్తారని సమాచారం. తెలుగులోనూ ఈ చిత్రం విడుదల కానుంది. బ్యాడ్మింటన్ నేపథ్యంలో.. సుధీర్బాబు డ్రీమ్ ప్రాజెక్ట్లలో ప్రముఖ బ్యాడ్మింటన్ చాంపియన్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఒకటి. సుధీర్–గోపీచంద్ ఇద్దరూ కలిసి బ్యాడ్మింటన్ ఆడారనే విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ నుంచి సినిమాల్లోకి వచ్చారు సుధీర్. ఇక పుల్లెల బయోపిక్ని ఎప్పుడో ప్రకటించినా ఇంకా పట్టాలెక్కలేదు. అయితే సుధీర్ బ్యాడ్మింటన్ రాకెట్తో షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టే సమయం దగ్గర్లోనే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. -
కొత్త సినిమా అనౌన్స్ చేసిన హీరో సుధీర్బాబు
Hero Sudheer Babu Announces His Next Movie: హీరో సుధీర్బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్బాబు ప్రస్తుతం కృతిశెట్టితో కలసి 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్ చేశాడు. తాజాగా తన 16వ సినిమాకు సంబంధించిన అప్డేట్ని అభిమానులతో పంచుకున్నాడు. మహేష్ సురపనేని దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘గన్స్ డోంట్ లై’ అనే ట్యాగ్లైన్తో పోస్టర్ను రిలీజ్ చేశారు. చుట్టూ తుపాకులు, పోలీస్ స్పెషల్ క్రైమ్స్ డివిజన్ అనే లోగోతో ఇంట్రెస్టింగ్గా పోస్టర్ను వదిలారు. ఈ సినిమాలో హీరోయిన్ సహా మరింత సమాచారం త్వరలోనే తెలియనుంది. Super excited for this one 😊#Sudheer16 Action Unlimited👊🏻@bharathhere @actorsrikanth @imaheshh @vincentcinema @bhavyacreations #anandaprasad @anneravi pic.twitter.com/NZix4covyc — Sudheer Babu (@isudheerbabu) February 12, 2022 -
‘సర్కారువారి పాట’లో జూనియర్ మహేశ్ ఎవరో తెలుసా?
‘‘నటుడిగా ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సినిమా నుంచి ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాను’’ అని సుధీర్బాబు అన్నారు. 2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ (ఎస్ఎమ్ఎస్) చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు సుధీర్బాబు. నేటికి (ఫిబ్రవరి 10) ఈ హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో సుధీర్బాబు చెప్పిన విశేషాలు... ఇండస్ట్రీకి వందమంది వస్తే నలుగురే సక్సెస్ అవుతారు. నా కెరీర్లో నేను ఇప్పటివరకు 14 సినిమాలు చేశాను. నటుడిగా వందశాతం కష్టపడ్డాను. కానీ ఫలితాలు మన చేతుల్లో ఉండవు. రిలీజ్ డేట్, బడ్జెట్, ఆ సమయంలో ఆడియన్స్ మూడ్... ఇలా ఒక సినిమా రిజల్ట్కి చాలా కారణాలుంటాయి. నా కెరీర్లోనూ కొన్ని సినిమాలు ఆడలేదు.. ఆ అనుభవాల నుంచి తప్పులు తెలుసుకుని, వాటిని సరిదిద్దుకున్నాను. ఇప్పటికీ నా ప్రతి సినిమాను చివరి సినిమాలానే భావించి కష్టపడుతుంటాను. నటుడిగా కొంచెం ఆ భయం ఉండాలి. ► నా కెరీర్లో ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ డే షూటింగ్ సమయంలో నాది ఫొటోజెనిక్ ఫేస్ కాదన్నట్లుగా కెమెరామ్యాన్, అతని అసిస్టెంట్ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ విషయం గురించి ఆలోచించి ఆ సినిమా కోసం నా పెర్ఫార్మెన్స్ను మెరుగుపరచుకున్నాను. కానీ అప్పుడు ఆ కెమెరామ్యాన్ను ఆ సినిమా నుంచి తొలగించాను. నెగటివ్ ఫీలింగ్స్ ఉండకూడదని అలా చేశాను. ఆ తర్వాత వేరే సినిమాకి అతనితో పనిచేశాను. స్టార్టింగ్లో నా వాయిస్ విషయంలో కొంత మిశ్రమ స్పందన వచ్చింది. సంగీత దర్శ కుడు ఆర్పీ పట్నాయక్గారి సహకారంతో కొంత ట్యూన్ చేసుకోగలిగాను. ► హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ అవకాశాలు రావాలంటే నటుడిగా నిరూపించుకోవాలని ‘ఏ మాయ చేసావె’, హిందీ చిత్రం ‘బాఘీ’లో నెగటివ్ షేడ్స్ పాత్రలు చేశాను. హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో అవకాశం వచ్చింది. అదే సమయంలో నాకు ‘సమ్మోహనం’ రావడంతో ‘బ్రహ్మాస్త్ర’ చేయలేకపోయాను. ► కెరీర్ పరంగా కృష్ణగారు, మహేశ్ల నుంచి చాలా నేర్చుకున్నాను. షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా వారు ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. నేను కూడా అంతే. నాకు ఫేవర్ చేయమని వారినెప్పుడూ అడగలేదు. మహేశ్కి విలన్గా చేయడానికి అభ్యంతరం లేదు. కానీ మంచి కథ కుదరాలి. మహేశ్తో ఓ సినిమా నిర్మించాలని ఉంది. ► యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. జాకీ చాన్కు పెద్ద అభిమానిని. నేను నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్కు రెడీగా ఉంది. హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను. భవ్య క్రియేషన్స్లో ఓ మూవీ కమిటయ్యాను. ‘లూజర్ 2’ డైరెక్టర్ అభిలాష్ రెడ్డితో ఓ సినిమా ఉంటుంది. ► నా ఇద్దరు కుమారులు చరిత్, దర్శన్ సినిమాల పట్ల ఆసక్తిగానే ఉన్నారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో నేను చేస్తోన్న సినిమాలో చరిత్ నా చిన్ననాటి క్యారెక్టర్ చేశాడు. మహేశ్ ‘సర్కారువారి పాట’ సినిమాలో జూనియర్ మహేశ్గా దర్శన్ కనిపిస్తాడు. -
‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్
హీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇంద్రగంటి మోహన్కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన మూవీ ఫస్ట్లుక్, టీజర్కు మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు(బుధవారం) ఈ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. ‘అల్లంత దూరంగా నువ్వు .. నీ కన్ను నన్నే చూస్తుంటే’ అంటూ ఈ పాట సాగే పాటలో హీరోహీరోయిన్ మధ్య ప్రేమ, అల్లరిని చూపించారు. దీంతో ఈ పాట యూత్ బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్గా మారింది. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, చైత్ర, అభయ్ ఆలపించారు. కాగా ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. -
ఆ అమ్మాయి గురించి చెప్పాడు.. సినిమాలు పడవంటూ
Aa Ammai Gurinchi Meeku Cheppali Movie Teaser Released: యంగ్ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఈ చిత్రానికి భిన్న కథలతో అలరించే మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో ప్రేమకథా చిత్రం ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్మార్క్ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ను శనివారం విడుదల చేశారు మేకర్స్. ఆరు సంవత్సరాల్లో వరుసగా 6 సూపర్ హిట్లు అందించిన కమర్షియల్ ఫిల్మ్ మేకర్గా సుధీర్ బాబుని పరిచయం చేయడంతో టీజర్ ప్రారంభమవుతుంది. 6 సూపర్ హిట్లు అందించిన డైరెక్టర్గా కొంచెం గర్వంతో ఉన్న సుధీర్ బాబుకి అవన్ని రోటీన్ సినిమాలను అతని స్నేహితుడు ఎగతాళి చేయడం బాగుంది. అప్పుడే డాక్టర్ అలేఖ్య పాత్రలో నటిస్తున్న కృతి శెట్టిని హీరో కలుస్తాడు. ఆమె ఒక కళ్ల డాక్టర్. ఆమెకు సినిమాలంటే విరక్తి. అలాంటి అమ్మాయితో సినిమా చేసేందుకు ఒప్పించే ప్రయత్నంగా సినిమా ఉన్నట్లు తెలుస్తోంది. తను అమ్ముకునే సినిమాలు కాకుండా తనను నమ్ముకునే సినిమాలు చేస్తానని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. వివేక్ సాగర్ బీజీఎం అలరించింది. ఓవరాల్గా చూసుకుంటే టీజర్ పర్వాలేదనిపించింది. కానీ మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ అంటే తప్పకుండా అంచనాలు ఉంటాయి. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, కల్యాణి నటరాజన్ తదితరులు సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. -
సుధీర్బాబు-కృతిశెట్టి సినిమా : ఫ్యాన్స్కు బ్యాడ్న్యూస్
Sudheer Babu Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Teaser Postponed: హీరో సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇంద్రగంటి మోహన్కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలె విడుదల చేసిన మూవీ ఫస్ట్లుక్కి మంచి స్పందన వచ్చింది. తాజాగా నేడు(సోమవారం) ఈ సినిమా టీజర్ విడుదల కావాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. కాగా 'ఉప్పెన','శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' వంటి హిట్ సినిమాల అనంతరం కృతిశెట్టి చేస్తున్న నాలుగో చిత్రమిది. దీంతో అంచనాలు మరిన్ని పెరిగాయి. Hold on.. postponement in our teaser date but not in our excitement in showing it to you all.. It's worth the wait😎🤘#AaAmmayiGurinchiMeekuCheppali #AAGMCTeaser pic.twitter.com/J8X5DO6Cde — Sudheer Babu (@isudheerbabu) January 17, 2022 -
కొత్త సినిమా షూటింగ్ను ప్రారంభించిన సుధీర్ బాబు
Sudheer Babu Next Film Directed By Harsha Vardhan Goes On Floors: సుధీర్బాబు కెరీర్లో 15వ సినిమాగా రాబోతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ షురూ అయ్యింది. నటుడు–దర్శకుడు హర్షవర్ధన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ పతాకంపై నారాయణ్ దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభం అంటూ చిత్రయూనిట్ ఓ వర్కింగ్ స్టిల్ను విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. సుధీర్బాబు కోసం భిన్నమైన కథను రెడీ చేశారు హర్షవర్ధన్. ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తారు సుధీర్ బాబు. ఈ చిత్రంలో ఛాలెంజింగ్ పాత్రను పోషిస్తున్నారాయన. ఈ తొలి షెడ్యూల్లో కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా. -
రూ. 3 కోట్ల మోసం, శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన యంగ్ హీరో ఇతడే
Shilpa Choudhary Cheating Case: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ పలువురు సెలబ్రెటీ వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి చీటింగ్ కేసులో రోజురోజుకు కీలక విషయాలు బయట పడుతున్నాయి. ఆమె చేతిలో మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిట్టి పార్టీల పేరుతో శిల్ప తన దగ్గర సుమారు 3 కోట్ల రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. చదవండి: పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని ఈ క్రమంలో శిల్ప చేతిలో మోసపోయానంటూ మరో టాలీవుడ్ సెలబ్రెటీ బయటకు వచ్చాడు. యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి శిల్ప మాయమాటలు నమ్మి నట్టేట మునిగాడు. కిట్టి పార్టీ పేరుతో మాయ మాటలు చెప్పి శిల్ప తన దగ్గర రూ. 3 కోట్లు వసూలు చేసిందట. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తొందంటూ ఈ యంగ్ హీరో పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కాగా ‘సెహరి’ సినిమాతో హర్ష్ కనుమల్లి హీరోగా పరిచయమయ్యాడు. వీరితో పాటు మరో స్టార్ హీరో కూడా శిల్ప బాధితుల్లో ఉన్నట్లు సమాచారం. కాగా కిట్టి పార్టిలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో శిల్పా చౌదరి సెలబ్రెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖుల వద్ద దాదాపు రూ. 200 కోట్లు రూపాయలు వసూలు చేశారు. చదవండి: అన్నయ్యను ఇలా పరిచయం చేస్తాననుకోలేదు: హీరో ఆవేదన ఆమె మాయమాటలకు ప్రముఖ టాలీవుడ్ హీరో కుటుంబం కూడా రూ. 12 కోట్లు మోసపోయినట్లు సమాచారం. వారు టాలీవుడ్ అగ్రహీరోకు అత్యంత ఆప్తులుగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి కోసం ఒక్కొక్కరి వద్ద రూ. 6 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మరో సీనియర్ నటుడు కూడా రూ. 2.4 కోట్లు మోసపోయినట్లు సమాచారం. శిల్పా చౌదరి బాగోతాలు వెలుగులోకి రావడంతో బాధితులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర పోలీస్ స్టేషన్ల్లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: వైరల్ అవుతోన్న కమెడియన్ రఘు షాకింగ్ వీడియో! కాగా యంగ్ హీరో సుధీర్బాబు భార్య ప్రియదర్శిని దగ్గర 2 కోట్ల 90 లక్షల రూపాయలు తీసుకుని మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ష్యూరిటీ కింద ఇచ్చినట్టు బయట పడింది. చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంక్కు వెళ్లిన ప్రియదర్శిని.. మోసపోయినట్టు తెలుసుకుని అవాక్కయింది. దీంతో పోలీసులను ఆశ్రయించింది. శిల్పా చౌదరి 50 కోట్ల రూపాయలు హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిల్పా చౌదరికి చెందిన 6 బ్యాంక్ అకౌంట్స్పై నార్సింగ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. -
పోలీసులను ఆశ్రయించిన మహేశ్ బాబు సోదరి ప్రియదర్శిని
Young Hero Sudheer Babu Wife Priyadarshini Files Complaint Over Rs 2.9 Crore Cheating Case: అధిక వడ్డి ఇప్పిస్తానంటూ ముగ్గురు టాలీవుడ్ హీరోలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం సంచలనం రేపుతోంది. రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మేర శిల్ప పలువురికి కుచ్చు టోపి పెట్టింది. దీంతో ఓ మహిళ చేతిలో అంత ఈ జీగా మోసపోయింది పేరున్న వ్యక్తులు, సెలబ్రెటీలు అని తెలిసి అందరూ షాకవుతున్నారు. చదవండి: ఏపీ వరదలు: బాధితుల కోసం చిరంజీవి, మహేశ్, తారక్ల భారీ విరాళాలు దివ్య రెడ్డి అనే మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శిల్ప ఆమె భర్తను శనివారం (నవంబర్ 27) ఉదయం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్కు తరలించారు. ఇక వారి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. రియల్ ఎస్టెట్ వ్యాపారం పేరుతో శిల్ప మోసాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన 5 రోజుల తర్వాత ఓ అగ్ర హీరో సోదరి, యంగ్ హీరో భార్య మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. చదవండి: Cheating Case: సినీ సెలబ్రిటీలను రూ. 200 కోట్లు మోసం, రిమాండ్లో కీలక విషయాలు వెల్లడి ఆమె ఎవరో కాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు సోదరి, యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని. శిల్ప తన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేసిందంటూ బుధవారం(డిసెంబర్ 1) ప్రియదర్శని పోలీసులను ఆశ్రయించారు. తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకుని శిల్ప మోసం చేసినట్లు ఆమె మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసమే ఆమె ప్రతి వీకెండ్లో కిట్టి పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని డబ్బులు ఎక్కడికి తరలించారనే దానిపై విచారిస్తామని పోలీసులు తెలిపారు. -
దీపావళికి ఓటీటీలో సందడి చేయబోతోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’
ఇటీవల సుధీర్ బాబు, తెలుగమ్మాయి ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదలైంది. ఇదిలా ఉంటే దీపావళి కానుకగా ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తెలుగులో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు. చదవండి: విజయ్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు: చార్మీ కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఒకటి. విలేజ్ బ్యాక్గ్రౌండ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి ఎన్నో అంచనాల మధ్య విడుదలై కొన్ని వర్గాల ప్రేక్ష్కుల బాగా ఆకట్టుకోగా.. మిరికొందరి నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైనమెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మించారు. From bigg screens to ur home screens, coming to make ur diwali more special.. I am sure love for #SrideviSodaCenter will just grow bigger & bigger 🤟🤗 Premiers on 4th November exclusively on @ZEE5Telugu #sridevisodacenterOnZee5 @70mmEntertains @Karunafilmmaker @anandhiactress pic.twitter.com/CxtHg8Put0 — Sudheer Babu (@isudheerbabu) October 21, 2021 చదవండి: పెళ్లిలో కలిసిన మెగా బ్రదర్స్.. నవ్వుతున్న ఫోటోలు వైరల్ -
మహేశ్బాబు చెల్లెలు, సుధీర్ బాబు భార్య బర్త్డే సెలబ్రేషన్స్
Mahesh Babu Sister Sudheer Babu Wife Priya Darshini Birthday Celebrations: సూపర్స్టార్ మహేశ్ బాబు చెల్లెలు, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంట్లోనే కుటుంబసభ్యుల మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి. సూపర్ స్టార్ కృష్ణతో, మంజుల సహా పలువురు కుటుంబ సభ్యుల మధ్య ప్రియదర్శిని కేక్ కట్ చేసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చదవండి: సమంత ఇన్స్టా పోస్ట్.. పర్సనల్ లైఫ్ గురించేనా? సుధీర్బాబు సైతం భార్యకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్లో పోస్టును షేర్చేశారు. 'హ్యాపీ బర్త్డే ప్రియ..నీతో ప్రతీ సంవత్సరం మునుపటి ఏడాది కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రతిరోజూ కుటుంబాన్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ప్రేమను పంచుతున్నందుకు ధన్యవాదాలు' అంటూ శ్రీమతికి ప్రేమగా బర్త్డే విషెస్ను తెలియజేశారు. చదవండి: హీరోయిన్ కాజల్ ముఖ్యమైన ప్రకటన..ఇన్స్టాలో పోస్ట్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) -
ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలో సూపర్స్టార్ ఫ్యామిలీ
-
శ్రీదేవి సోడా సెంటర్.. ఓ తీపి జ్ఞాపకం
సాక్షి,ఏలూరు(ఆర్ఆర్పేట): శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం తన జీవితంలో ఒక తీపి జ్ఞాపకాన్ని ఇచ్చిందని ఆ చిత్ర హీరో సుదీర్ బాబు అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా విజయోత్సవ యాత్రలో భాగంగా మంగళవారం నగరంలో చిత్రం ప్రదర్శిస్తున్న అంబికా థియేటర్కు చిత్ర బృందం విచ్చేసింది. తొలుత చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను ప్రత్యక్షంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం ఎలా ఉంది అని అడిగి వారి నుంచి సానుకూల సమాధానం రాబట్టారు. ఈ సందర్భంగా హీరో సుదీర్బాబు చిత్రంలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో మాట్లాడుతూ చిత్రం తాము ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమైందన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచుతూ వారి ఆదరణ పొందుతోందన్నారు. ఈ విజయం స్ఫూర్తిగా మరిన్ని విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. దర్శకుడు కిరణ్కుమార్ మాట్లాడుతూ తమ చిత్రంలో సుదీర్బాబు నటన హైలెట్గా నిలిచిందన్నారు. కుటుంబంతో కలిసి చూసే విధంగా చిత్రాన్ని వినోదాత్మకంగా నిర్మించామని, విడుదలైన అన్ని సెంటర్లలో చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని, వర్షాలు, కోవిడ్ భయం వెంటాడుతున్నా తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. థియేటర్ మేనేజర్ రఘు, జీఎం వెంకట్, సుదీర్కుమార్ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు. చదవండి: Seetimaarr Trailer: సీటీమార్ ట్రైలర్ చూశారా? -
200 కోట్లు ఇచ్చినా మహేశ్ ఆ పని చేయరు : సుధీర్బాబు
‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులకు సూరిబాబు, శ్రీదేవి పాత్రలు గుర్తుండిపోతాయి. చూసినవాళ్లందరూ బాగుందని అభినందిస్తున్నారు. మహేశ్ (హీరో మహేశ్బాబు) అనే వ్యక్తికి రెండొందల కోట్లు ఇచ్చినా, బెదిరించినా సరే తను నమ్మనిదే తన కెరీర్లో ఏమీ చేయడు. మా ‘శ్రీదేవి సోడా సెంటర్’ని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశాడు’’ అన్నారు సుధీర్బాబు. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్బాబు, ఆనంది జంటగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘శ్రీదేవి సోడా సెంటర్‘ ఆగస్ట్ 27న విడుదలైంది. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి మా సినిమా నిరూపించింది. మహిళలందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్తో తీసిన మా సినిమాకు అభినందనలు దక్కుతున్నాయి. ఇంకా థియేటర్స్ పెంచుతున్నాం’’ అన్నారు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. చదవండి : ‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్ బాబు రివ్యూ Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ -
‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్ బాబు రివ్యూ
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్ట్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. రొటీన కథ అని కొందరంటే, సినిమా అదిరిపోయిందని మరికొంత మంది అంటున్నారు. ఇక ఈ మూవీపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేశ్బాబు. శుక్రవారం తన ఇంట్లోని మినీ థియేటర్లలో సినిమాను వీక్షించిన మహేశ్.. దర్శకుడు కరుణ కుమార్, హీరో సుధీర్ బాబుపై ప్రశంసల జల్లుకురిపించాడు. (చదవండి: శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ) ‘శ్రీదేవీ సోడా సెంటర్ రా అండ్ ఇంటెన్స్ మూవీ.. అంతేకాకుండా అదిరిపోయే క్లైమాక్స్ కూడా ఉంది. ‘పలాస’ తరువాత దర్శకుడు కరుణ కుమార్ అద్భుతమైన బోల్డ్ మూవీతో మన ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇదే తన బెస్ట్ ఫెర్మార్మెన్స్. నరేష్ గారు ఎప్పటిలానే అవలీలగా,అద్భుతంగా చేసి అలరించారు. హీరోయిన్ ఆనంది గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీమ్ అందరికి మరోసారి శుభాకాంక్షలు’అని మహేశ్ వరుస ట్వీట్లు చేశాడు. #SrideviSodaCenter... a raw and intense film with a hard-hitting climax. Director @Karunafilmmaker comes up with yet another bold film after Palasa 1978. @isudheerbabu, is absolutely brilliant!! His finest performance till date 👏👏👏 — Mahesh Babu (@urstrulyMahesh) August 27, 2021 -
Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ
-
శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ
టైటిల్: శ్రీదేవి సోడా సెంటర్ నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, నరేశ్, పావల్ నవగీతమ్, తదితరులు దర్శకత్వం: కరుణ కుమార్ నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణ సంస్థ: 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: శ్యామ్దత్ సైనుద్దీన్ విడుదల తేదీ: 27 ఆగస్టు 2021 Sridevi Soda Center Movie Review: సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్'. అమలాపురం బ్యాక్ డ్రాప్లో రూపొందించిన ఈ సినిమాకు 'పలాస 1978' డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించారు. 'వి' పరాజయం తర్వాత సుధీర్బాబు చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ఎలక్ట్రీషియన్ సూరిబాబుగా నటించిన హీరో తనకు ఇష్టమైన అమ్మలాంటి అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ వీరి ప్రేమ ఎన్నో మలుపులు తిరుగుతూ చివరాఖరకు ఏ తీరానికి చేరుకుందనేది మిగతా కథ. 'చాలామంది మలయాళ సినిమా కథల గురించే మాట్లాడుకుంటారు. కానీ మా సినిమా చూశాక తెలుగు సినిమా కథల గురించి మాట్లాడుకుంటారని ఎంతో ధీమాగా చెప్పాడు సుధీర్ బాబు. మరి ఆగస్టు27న విడుదలైన ఈ సినిమా నిజంగానే జనాలను కట్టిపడేసిందా? లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే! కథ సూరిబాబు (హీరో సుధీర్ బాబు) అమలాపురంలో ఎలక్ట్రీషియన్. ఓ గుడిలో లైట్ సెట్టింగ్ వేస్తున్న సమయంలో అక్కడ సోడాలు అమ్ముకునే శ్రీదేవి(ఆనంది)ని చూసి లవ్లో పడతాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఆ ఊళ్లో పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు కాశీ.. శ్రీదేవిని ఇష్టపడతాడు. దానికితోడు సూరిబాబును తక్కువ కులం అని వారి ప్రేమను భగ్నం చేయాలనుకుంటాడు. మరోపక్క మూడు ముళ్లు వేసేందుకు మనసులు కలిస్తే సరిపోదని, కులం కూడా కలవాలంటూ ఈ ప్రేమజంట పెళ్లికి విముఖత చూపిస్తారు పెద్దలు. ఇంతలో ఆ గ్రామంలో హత్య జరుగుతుంది. దానికి సూరిబాబే కారణమని అతడిని జైల్లో వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? సూరిబాబు జైలు నుంచి విడుదలయ్యాడా? అతడు జైలు నుంచి తిరిగొచ్చేలోపు శ్రీదేవి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉందా? లేదా కులం కట్టుబాట్లను దాటుకుని సూరిబాబుతో ఏడడుగులు నడిచిందా? అదీ కాకుండా పెద్దల మనసు మార్చి వారి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నారా? అసలు సూరిబాబుకు ఆ హత్యకు సంబంధం ఏంటి? విలన్ కాశీ, హీరోయిన్ తండ్రి చావుకు కారణాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్లలో బొమ్మ చూడాల్సిందే! విశ్లేషణ సుధీర్ బాబు సిక్స్ప్యాక్ కోసం పడ్డ కష్టం ఏమాత్రం వృథా కాలేదు. అతడి పర్ఫామెన్స్ను, అప్పియరెన్స్ను అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ఇక కథ స్టార్ట్ అవడమే జైలు సన్నివేశంతో మొదలవుతుంది. తర్వాత వచ్చే బోట్ సీన్లు, ఫైటింగ్, బీజీఎమ్ ఓ లెవల్లో ఉంటాయి. పల్లెటూరి అందాలను తెరపై మనోహరంగా చూపించారు. కామెడీ, ప్రేమ కథతో ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోతుంది. లవ్ స్టోరీ కొంత రొటీన్గా అనిపించక మానదు. పైగా కథలో పలు సన్నివేశాలను ప్రేక్షకుడు ముందే ఊహించేలా ఉండటం నెగెటివ్ అని చెప్పొచ్చు. సెకండాఫ్లో ఊహించని ట్విస్టులు ఎదురవుతుంటాయి. శ్రీదేవిని విలన్కిచ్చి పెళ్లి చేస్తాడు ఆమె తండ్రి. అయినప్పటికీ శ్రీదేవి అతడితో జీవించేందుకు అంగీకరించదు. హీరో రాక కోసం నిరీక్షిస్తుంది. అతడితో వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. ఈ క్రమంలో కథను ఊహించని మలుపు తిప్పుతాడు డైరెక్టర్. ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకులను కంటతడి పెట్టించే ప్రయత్నం చేశాడు. కానీ నత్తనడకన సాగే కథతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. ఇక కథ చివర్లో వచ్చే క్లైమాక్స్ సినిమా మొత్తానికే హైలెట్గా నిలుస్తుంది. సినిమా గురించి స్థూలంగా చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడికే మరికొంత మసాలా వేసి జనాలకు వడ్డించాడు డైరెక్టర్. నటీనటులు సుధీర్ బాబు సినిమా కోసం ప్రాణం పెట్టినట్లు కనిపిస్తుంది. సూరిబాబు పాత్రలో జీవించేశాడు. లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో ఇరగదీశాడు. హీరోయిన్ ఆనంది కూడా సుధీర్తో పోటీపడి మరీ నటించింది. నరేశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్లస్ పాయింట్స్ ♦ క్లైమాక్స్ ♦ సంగీతం ♦ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ♦ రొటీన్ కథ ♦ ఫస్టాఫ్ -
అప్పుడే విలన్ పాత్రల గురించి ఆలోచిస్తా : సుధీర్ బాబు
‘‘సుధీర్ బాబు ఎలాంటి పాత్రలైనా చేయగలడు’ అనే పేరు వచ్చింది. కథలు రాసుకున్న తర్వాత ఆ పాత్రకు నేను సరిపోతాననే నమ్మకంతో నా వద్దకు వస్తున్నారు. అందుకే నాకు ఎక్కువ ఫెయిల్యూర్స్ లేవు. ఇండస్ట్రీలో నాకు లాంగ్ రన్ ఉంటుందనేది నా ఫీలింగ్. నా ప్రతి సినిమా నన్ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తోంది’’ అన్నారు సుధీర్ బాబు. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పిన విశేషాలు. ‘పలాస 1978’ సినిమా చూసి, మంచి లైన్ ఉంటే చెప్పండి, సినిమా చేద్దామని కరుణ కుమార్కి ఫోన్ చేశాను. కొద్ది రోజుల తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’ లైన్ చెప్పారు, బాగుందన్నాను. ఇందులో ఎలక్ట్రీషియన్ సూరిబాబు పాత్రలో కనిపిస్తాను. తనకు ఇష్టమైన అమ్మలాంటి అమ్మాయితో ప్రేమలో పడ్డాక ఏం జరిగిందన్నదే కథ. చాలామంది మలయాళ సినిమా కథల గురించే మాట్లాడుకుంటారు. మా సినిమా చూశాక తెలుగు సినిమా కథల గురించి మాట్లాడుకుంటారు. ఒక గ్రామంలోని మనుషుల స్వభావాలు, అహం, రాజకీయాలను చూపించాం. ♦ కృష్ణగారు, మహేశ్ బాబుల సినిమాలను కేస్ స్టడీస్లా తీసుకుంటాను. అయితే వారిలా కాకుండా నా శైలిలో నటించేందుకు ప్రయత్నిస్తా. కేవలం అభిమానులు చూస్తే సినిమాలు హిట్ అయిపోవు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తేనే హిట్ అవుతాయి.. అందుకు తగ్గట్టే కథలను ఎంచుకుంటున్నాను. ♦హీరోగా చేసేందుకే నా తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే విలన్, ఇతర పాత్రల గురించి ఆలోచిస్తా. ‘భాగీ’ తర్వాత హిందీలో అవకాశాలొచ్చినా తెలుగులో బిజీగా ఉండటంతో హిందీపై దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ సినిమా, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేస్తున్నాను. ఆ తర్వాత పుల్లెల గోపీచంద్ బయోపిక్, హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా, ‘70 ఎంఎం’ బ్యానర్లోనే మరో సినిమా చేస్తాను. చదవండి : 'కథ చెప్పడానికి ఫోన్ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు' హీరో శింబుకు ఊరట.. రెడ్కార్డు రద్దు -
సోడా సెంటర్లో ప్రభాస్
-
'కథ చెప్పడానికి ఫోన్ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు'
‘‘పరభాషా చిత్రాలు చూసి తెలుగులో అలాంటివి రావడం లేదని ఆ చిత్రాలను అభినందిస్తుంటాం. ‘శంకరాభరణం, సిరివెన్నెల, జ్యోతి, విజేత, ఛాలెంజ్’ వంటి లిటరేచర్ బేస్డ్ సినిమాలు తెలుగులో వచ్చినన్ని ఇతర భాషల్లో రాలేదు. ప్రపంచాన్ని షేక్ చేసిన ‘అరుంధతి, బాహుబలి’ వంటి సినిమాలు కూడా తెలుగులోనే వచ్చాయి. కథలు చెబుదామనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను రాసుకునే సినిమా కథల్లో కథలే హీరోలు’’ అన్నారు కరుణ కుమార్. సుధీర్బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ – ‘‘అమలాపురం పక్కన ఉన్న గ్రామాల బ్యాక్డ్రాప్లో సాగే లవ్స్టోరీ ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఓ సోడా సెంటర్ యజమాని కూతుర్ని ఓ ఎలక్ట్రీషియన్ ప్రేమిస్తాడు. అక్కడి ప్రాంతాల్లోని సాంఘిక, ఆర్థిక, సామాజిక పరమైన ఇబ్బందుల వల్ల వీరి ప్రేమకథ ఏమైంది? అన్నదే ఈ సినిమా కంథాంశం. సుధీర్కి రెండు కథలు చెబితే, ‘శ్రీదేవి సోడా సెంటర్’ను సెలక్ట్ చేసుకున్నారు. నిర్మాతలు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాలో మణిశర్మగారి కొత్తరకం బాణీలు వింటారు’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది తెలుగు అమ్మాయిలకు ఫోన్ చేయగా, కొందరు సినిమాలో ‘హీరో ఎవరు?’ అని అడిగారని, మరికొందరు వాళ్ల మేనేజర్కు కథలు చెప్పమన్నారనీ.. అంతేకానీ కథలు ఎవరూ వినలేదనీ అన్నారు కరుణ కుమార్. చదవండి : ‘సర్కారువారి పాట’ : గోవా షెడ్యూల్ పూర్తి అందగత్తెను కాదని ఎగతాళి చేశారు: నటి భావోద్వేగం -
‘షూటింగ్ తొలిరోజే కెమెరా పడిపోయింది.. బ్రదర్ని కోల్పోయా’
‘‘సినిమా సినిమాకు మేం గ్యాప్ తీసుకోవడం లేదు. మంచి కథ కుదిరితేనే సినిమా చేస్తాం. కథలు వినడమే మా పని. కథ నచ్చితే పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి. సుధీర్బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. (చదవండి: ఒక్క రోజు లేట్ అయితే చచ్చిపోయేవాడ్ని.. చిరంజీవి కాపాడాడు : బండ్ల గణేశ్) ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసిన రోజే మెయిన్ కెమెరా పడిపోయింది. లక్కీగా కెమెరాకు ఏం కాలేదు. తర్వాతి రోజు క్యారవ్యాన్ అసిస్టెంట్కు షాక్ కొట్టి గాయపడ్డాడు. ఆ నెక్ట్స్ రోజు క్యారవాన్ ఓ గోతిలో ఇరుక్కుపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా నా బ్రదర్ (విజయ్ చిల్లా సోదరుడు)ను కోల్పోయాను. దాదాపు నెల రోజులు బ్రేక్ తీసుకుని షూట్ను స్టార్ట్ చేశాం. ఈ రూరల్ లవ్స్టోరీలో సుధీర్బాబు, ఆనంది బాగా చేశారు. గ్రామీణ రాజకీయాలు, కులాల ప్రస్తావన వంటి అంశాలను ఎలా డీల్ చేశామన్నది వెండితెరపై చూడాలి. ఈ చిత్రానికి మణిశర్మగారు మంచి సంగీతం అందించారు. మోషన్ పోస్టర్ను రిలీజ్ చేసిన వెంటనే మా సినిమాకు బజ్ స్టార్ట్ అయ్యింది. అలాగే గ్లింప్స్ విడుదల చేశాక బిజినెస్ ఊపందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్లో, ఓవర్సీస్లో 120 థియేటర్స్లో సినిమా రిలీజ్ను ప్లాన్ చేశాం’’ అన్నారు. -
అందుకే చిరంజీవిది లక్కీ హ్యాండ్ : సుధీర్బాబు
‘‘సూపర్స్టార్ మహేశ్బాబుగారి బ్యాగ్రౌండ్ ఉండి కూడా తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారు సుధీర్బాబు. యాక్టింగ్, బ్యాడ్మింటన్, క్రికెటర్, ఫైటర్, డ్యాన్సర్.. ఇలా ప్రతి దాంట్లో నిరూపించుకుంటున్న సుధీర్ని ఆల్ రౌండర్ అంటాను. ‘భలే మంచి రోజు, యాత్ర, ఆనందో బ్రహ్మ’.. ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’.. ఇలా వినూత్న సినిమాలు నిర్మిస్తున్న విజయ్, శశిలకు నా అభినందనలు’’ అని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సుధీర్బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ – ‘‘రిస్క్ తీసుకోవడానికి భయపడని సుధీర్లాంటి వ్యక్తులంటే నాకు ఇష్టం. విజయ్, శశి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్’’ అన్నారు. ‘‘చిరంజీవిగారు ప్రమోట్ చేసిన నా ‘సమ్మోహనం’ హిట్. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ ఆయనతో ఆరంభమైంది. అందుకే చిరంజీవిగారు నాకు లక్కీ హ్యాండ్. ‘సుధీర్కు కరెక్ట్ సినిమా పడితే కెరీర్లో నెక్ట్స్ లెవల్కు వెళతాడు’ అని ఓ సందర్భంలో మహేశ్ అన్నారు. ఆ సినిమా ఇదే అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్బాబు. ‘‘చాన్స్ ఇచ్చిన సుధీర్, విజయ్, శశిలకు థ్యాంక్స్’’ అన్నారు కరుణకుమార్. ‘‘పలాస’ చూసినప్పుడే కరుణకుమార్తో సినిమా చేయాలనుకున్నాం. సినిమా బాగా వచ్చింది. బిజినెస్ బాగా జరిగింది’’ అన్నారు విజయ్, శశి. కార్తికేయ, అజయ్ భూపతి, తమ్మారెడి భరద్వాజ, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు. చదవండి : మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు నా జీవితంలో జరిగినవే సినిమాలో చూపించా: డైరెక్టర్ -
‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ రివ్యూ: సూరిబాబు అదరగొట్టేశాడుగా
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలు మరింత పెంచాయి.ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ‘మంచోడే కానీ.. మనోడు కాదు కదా’, పరువు పోతే ప్రాణం పోయినట్లే’ లాంటి డైలాగ్స్ని బట్టే ఈ సినిమాను కులం, పరువు నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రేమకి పెద్దలు ఎదురుతిరగడం .. కథానాయకుడు తన ప్రేమకోసం ఎంతకైనా తెగించడం ట్రైలర్ లో ఆవిష్కరించారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కంటెంట్ చూస్తుంటే యూత్ను, మాస్ ను ఒక రేంజ్ లోనే ఆకట్టుకునేలా అనిపిస్తోంది. మాస్ కుర్రాడు సూరిబాబుగా సుధీర్ బాబు అదరగొట్టేశాడు. ఆనంది లుక్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. -
‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదలకు డేట్ ఫిక్స్, ఎప్పుడంటే
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలు మరింత పెంచాయి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. ఆగస్ట్ 27న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. గోదావరి జిల్లా బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్య సంగీతం అందిస్తున్నారు. -
Sri Devi Soda Center: శ్రీదేవి, సూరిబాబుల ప్రేమ పాట విన్నారా?
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నాలో ఇన్నాళ్లుగా కనిపించని ఏదో ఇది.. లోలో కొన్నాళ్లుగా నాతో ఏదో అంటున్నది...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను దినకర్, రమ్యా బెహ్రా ఆలపించారు. ‘‘ఈ పాటలో సూరిబాబు (సుధీర్), శ్రీదేవిల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్ చక్కగా కుదిరాయి. అలాగే శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ పాటకి ప్రేక్షకుల నుంచి స్పందన చాలా బాగుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
భయపెట్టిస్తున్న ‘జ’ ట్రైలర్
బిగ్ బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో జై దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా గోవర్థన్ రెడ్డి కందుకూరి నిర్మిస్తోన్న డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ ‘జ’. ఈ చిత్రం ద్వారా సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కాగా ఈరోజు జ మూవీ ట్రైలర్ను యంగ్ హీరో సుధీర్బాబు విడుదలచేసి యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే సాగే ఈ ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ను మరింత పెంచింది. ఈ సందర్భంగా నటి హిమజ మాట్లాడుతూ.. ‘‘ఫుల్ లెంగ్త్ ఫెర్ఫామెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఈ సినిమాను అంగీకరించాను. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే మూవీ ఇది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత గోవర్ధన్ రెడ్డి గారికి, దర్శకుడు సైదిరెడ్డి గారికి కృతజ్ఞతలు" అన్నారు. దర్శకుడు సైదిరెడ్డి చిట్టెపు మాట్లాడుతూ..‘జ’అంటే జన్మ లేదా పుట్టుక అని అర్థం. ఈ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. మంచి కథా బలం ఉన్న మూవీ. మా ప్రొడ్యూసర్ గోవర్ధన్ రెడ్డి నా మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉపేందర్ సహకారం మరువలేనిది’ అన్నారు. -
20న పెనుబల్లిలో షర్మిల దీక్ష
పెనుబల్లి: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలో వైఎస్సార్ టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఈనెల 20న నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గంగదేవిపాడులో ఉద్యోగం రావట్లేదని ఆత్మహత్యకు పాల్పడిన నాగేశ్వర్రావు కుటుంబాన్ని గురువారం వైఎస్సార్ టీపీ నేత లక్కినేని సుధీర్బాబు పరామర్శించారు. అనంతరం ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అదేరోజు నాగేశ్వరరావు కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంబూరి శ్రీనివాసరావు, జెన్నారెడ్డి విజయనరసింహారెడ్డి పాల్గొన్నారు. -
నెక్స్ట్ సినిమాను లైన్లో పెట్టిన సుధీర్బాబు
హీరో సుధీర్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో మూవీని అనౌన్స్ చేశాడు. హర్షవర్ధన్ డైరెక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే నటుడిగా, రచయితగా హర్షవర్థన్ గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. రొమాంటికి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. హీరోయిన్ సహా మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇప్పటికే ఈ బ్యానర్లో లవ్స్టోరీ సినిమాతో పాటు ధనుష్- శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందుతున్నాయి. ప్రస్తుతం సుధీర్బాబు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాతో పాటు కరుణ కుమార్ డైరెక్షన్లో శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు పుల్లెల గోపీచంద్ బయోపిక్ సినిమాకు సైతం సైన్ చేశారు. #Sudheer15 & @SVCLLP #ProdNo5 is in talented hands of #HarshaVardhan ... This is going to be a challenging journey for me and the team ... Safe to say that, it's something that I haven't tried yet 😉#NarayanDasNarang #PuskurRamMohanRoa pic.twitter.com/wx8eQL9f9I — Sudheer Babu (@isudheerbabu) July 12, 2021 -
సుధీర్బాబు గొప్పమనసు, చిన్నారి గుండె ఆపరేషన్కు సాయం
సాక్షి, శ్రీకాకుళం: ఆపదలో ఉన్న చిన్నారికి సినీ నటుడు సుధీర్బాబు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా నిలిచారని జిల్లా సుధీర్బాబు సేవా సమితి గౌరవాధ్యక్షుడు ఉంకిలి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన డి.మోసె, లక్ష్మి దంపతుల కుమార్తె సంస్కృతి జాస్మిన్కు గుండె ఆపరేషన్ కోసం మే నెలలో రూ.1.70లక్షలు చెల్లించారని, తాజాగా చిన్నారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ.1.50 లక్షలను శ్రీకాకుళంలోని హెడ్పోస్టాఫీసులో ఫిక్సిడ్ డిపాజిట్ చేశారని చెప్పారు. ఈ సందర్భంగా సుధీర్బాబుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అద్యక్షుడు మహ్మద్ షాజు తదితరులు పాల్గొన్నారు. -
విడుదలకు ముందే మార్కెట్ చేస్తున్న సుధీర్ బాబు మూవీ
కంటెంట్ పరంగా వస్తున్న చిన్న సినిమాలు ఇటీవల కాలంలో బాక్సాఫీసు వద్ద బ్లాక్బస్టర్ హిట్ అందుకుంటున్నాయి. అన్ని రకాలుగా చిన్న సినిమాలు మంచి మార్కెట్ చేస్తున్నాయి. డిజటల్ రైట్స్, శాటిలైట్, స్ట్రీమింగ్ హక్కులు పరంగా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో హీరో సుధీర్ బాబు లెటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ చేరిపోయింది. ప్రస్తుతం సుధీర్ బాబు ఈ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ మూవీ నిర్మాతలను లాభాల బాట పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ‘శ్రీదేవి సోడా సెంటర్’ శాటిలైట్, డిజిటల్ హక్కులను జీటీవీ గ్రూప్ 9 కోట్ల రూపాలయకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్తో మేకర్స్కు ఈ మూవీకి పెట్టిన పెట్టుబడి వచ్చేసిందని వినికిడి. అదే నిజమైతే సుధీర్ బాబు మూవీ విడుదలకు ముందే నిర్మాతలకు మంచి మార్కెట్ఇస్తున్నాడన్నమాట. ‘పలాస’ మూవీతో తొలి హిట్ అందుకున్న దర్శకుడు కరుణ్ కుమార్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. గోదావరి జిల్లా బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ మూవీని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. మణిశర్య సంగీతం అందిస్తున్నారు. -
డబ్బింగ్ కోసం సుధీర్బాబు ఎంత కష్టపడుతున్నారో చూడండి
సుధీర్బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. . 80ల నాటి అమలాపురం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో సుధీర్బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తయినట్లు హీరో సుధీర్బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఫైట్ సీన్కు డబ్బింగ్ చెబుతున్న వీడియోను షేర్ చేసుకున్నారు. ఇందులో ఫైట్కు తగ్గట్లు సుధీర్బాబు చెప్పిన డబ్బింగ్ తీరు ఆకట్టుకుంటుంది. డబ్బింగ్కే ఇంత కష్టపడుతుంటే, ఇక యాక్టింగ్కి ఇంకెంత కష్టపడతారో..మీ డెడికేషన్కు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. Done with #SrideviSodaCenter dubbing and it ended pretty much this way 😃 😎 #70mmSSC #SSC pic.twitter.com/ypOvKnSfGk — Sudheer Babu (@isudheerbabu) June 26, 2021 చదవండి : నెట్టింట వైరలవుతున్న సుధీర్బాబు ఫ్యామిలీ ఫోటోలు 'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు' -
పెద్ద మనసు చాటుకున్న సుధీర్ బాబు
తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా హీరోననే నిరూపించుకున్నాడు టాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆపరేషన్ చేయించి పెద్ద మనసును చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే.. కొన్నాళ్ల క్రితం బేబీ సంస్కృతి కోసం సోషల్ మీడియా వేదికగా సుధీర్ బాబు ఒక ఫండ్ రైజర్ నిర్వహించాడు. ట్విటర్లో సదరు చిన్నారి హార్ట్ ప్రాబ్లం గురించి చెప్పాడు. ‘ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు అందిస్తున్నా, కానీ ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి’ అంటూ ట్వీట్ చేశారు. EMERGENCY: Baby Samskruti is facing heart complications. I am contributing 1 Lakh for initiating the operation but her family needs 3.5 lakh more to complete the treatment & meet other medical expenses. So, I am raising funds personally. Please contributehttps://t.co/6pyRLdxbAZ — Sudheer Babu (@isudheerbabu) May 14, 2021 సుధీర్ బాబు పిలుపుతో చాలా మంది డబ్బును విరాళంగా ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగా ఉంది. చిన్నారి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం బ్యాంకులో కొంత డబ్బుని డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు సుధీర్ బాబు. పని గుండె కోసం పరితపించిన సుధీర్ బాబుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రియల్ హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు. Happy that I was and I will be helpful. It's some great feeling to see the smiles back on their faces. https://t.co/QX4NVBKvPQ — Sudheer Babu (@isudheerbabu) June 2, 2021 -
హీరో సుధీర్ బాబు ఇంట్లో కృష్ణ పుట్టిన రోజు వేడుకలు, ఫొటోలు వైరల్
అల్లూరి సీతారామ రాజుగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన సూపర్ స్టార్ కృష్ణ నేటితో 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. హీరోగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుని సాహసానికి మారుపేరుగా నిలిచారు ఆయన. నేడు (మే 31) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు బర్త్డే విషెష్ తెలుపుతున్నారు. అలాగే ఆయన తనయుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఇదిలా ఉండగా కృష్ణ చిన్నల్లుడు, హీరో సుధీర్ బాబు ఆయన జన్మదిన వేడుకలను తన ఇంటిలో గ్రాండ్గా ఏర్పాటు చేశాడు. కృష్ణ సతీమణి ఇందిర, మిగతా కుటుంబ సభ్యులు సమక్షంలో ఆయన కేక్ కట్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, పెద్ద అల్లుడు గల్లా జయదేవ్, నటుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు. View this post on Instagram A post shared by Padmini Priyadharshini (@padmini.priyadharshini.5) ఇక మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా కృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశారు. “సాహసానికి మారుపేరు, మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే సార్” అంటూ ట్వీట్లో రాసుకొచ్చాడు. సాహసానికి మారుపేరు,మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వారు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. Happy Birthday Sir! — Chiranjeevi Konidela (@KChiruTweets) May 31, 2021 -
హ్యాపీ బర్త్డే నాన్నా: మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ నేడు(సోమవారం)78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తనయుడు, హీరో మహేష్ బాబు ట్విటర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్డే నాన్న. నేను ముందుకెళ్లడానికి ఎప్పుడూ నాకు అత్యుత్తమైన మార్గాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. మీరు అనుకునేదాని కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తుంటాను నాన్న' అంటూ బర్త్డే విషెస్ను తెలిపారు. ఈ సందర్భంగా తండ్రితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. Happy birthday Nanna.. Thank you for always showing me the best way forward.. Love you more than you'll ever know ♥️♥️♥️ pic.twitter.com/Mm3J0OA8by — Mahesh Babu (@urstrulyMahesh) May 30, 2021 కృష్ణ బర్త్డే సందర్భంగా కూతురు మంజుల ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ 'హ్యాపీ బర్త్డే నాన్న. నా హృదయంలో మీకు చాలా గొప్ప స్థానం ఉంది. నా జీవితంపై మీ ప్రభావం చాలా ఉంది. మీరే నా హీరో, నా రోల్ మోడల్. లవ్ యూ సో మచ్' అంటూ ట్వీట్ చేశారు. Happy birthday day nanna. You have the biggest heart! You are my hero and the greatest influence in my life. You are my role model. I love you soooooo much. pic.twitter.com/WuGTmDVM4B — Manjula Ghattamaneni (@ManjulaOfficial) May 31, 2021 ఇక కృష్ణ అల్లుడు, హీరో సుధీర్బాబు కూడా కృష్ణపై తన అభిమానాన్ని చాటుకున్నారు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు మావయ్య. సూపర్ హ్యూమన్, సూపర్ స్టార్గా రెండు వెర్షన్లలో నేను మీకు పెద్ద అభిమానిని' అంటూ సుధీర్బాబు ఎంతో ప్రేమతో విషెస్ తెలిపారు. Happy Birthday Mavayya ❤️ Biggest fan of your both versions, the super human being and the Superstar 😊 #HBDLegendarySSKgaru pic.twitter.com/Q205qy61lp — Sudheer Babu (@isudheerbabu) May 30, 2021 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘శ్రీదేవి సోడా సెంటర్’తో వస్తున్న సుధీర్ బాబు
-
నెట్టింట వైరలవుతున్న సుధీర్బాబు ఫ్యామిలీ ఫోటోలు
గతేడాది 'వి' చిత్రంతో అలరించిన యంగ్ హీరో సుధీర్బాబు ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగులతో బిజీగా ఉండే సుధీర్బాబు ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్గా మారాయి. అందరూ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో కనిపించారు. సుధీర్బాబు భార్య పద్మిణి ప్రియదర్శిని సూపర్స్టార్ కృష్ణ కూతురన్న సంగతి చాలా మందికి తెలియదు. 2006లో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరికి చరిత్ మానస్ – దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చరిత్ మానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్గా వెండితెర ఆరంగేట్రం చేశారు. ప్రస్తుతం సుధీర్బాబు చేతిలో రెండు సినిమాలున్నాయి. ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘సమ్మోహనం, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందతున్న మూడో చిత్రమిది. ఈ మూవీలో ఉప్పెనలో బేబమ్మగా అలరించిన కృతిశెట్టి సుధీర్బాబుకు జంటగా నటించనుంది. ఈ మూవీతో పాటు 'పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్బాబు నటిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఇటీవలె రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సుధీర్బాబు సూరిబాబుగా నటిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి మరోసారి ఫిట్నెస్పై తనకున్న డెడికకేషన్ను నిరూపించుకున్నారు. ఇక గతంలోనూ సుధీర్బాబు బావ, సూపర్ స్టార్ మహేష్బాబు కూడా సుధీర్బాబు ఫిట్నెస్పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చదవండి : 'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు' ఐదెకరాల పొలంతో పాటు ఓ స్కూటర్ ఉంది..నన్ను పెళ్లిచేసుకుంటావా? -
'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు'
సుధీర్బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'శ్రీదేవి సోడా సెంటర్'. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఇటీవలె రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో సుధీర్బాబు సూరిబాబుగా నటిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి మరోసారి ఫిట్నెస్పై తనకున్న డెడికిషన్ను నిరూపించుకున్నారు. ఇక గతంలోనూ సూపర్ స్టార్ మహేష్బాబు కూడా ఈ విషయంలో సుధీర్బాబును అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధీర్బాబు.. తన సిక్స్ ప్యాక్ గురించి, దాని వెనకున్న సీక్రెట్స్ గురించి తెలుసుకోవడానికి కొందరు హీరోలు కాల్ చేసి కనుక్కోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలిపారు. క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి డైట్తో శరీరాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చని చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందనున్న మరో చిత్రంలోనూ సుధీర్బాబు నటిస్తున్నారు. ఉప్పెనలో బేబమ్మగా అలరించిన కృతిశెట్టి సుధీర్బాబుకు జంటగా నటించనుంది. చదవండి : ఇంట్లో ఉంటే ఆకలి, బయటకు వెళితే కరోనా: నటి భావోద్వేగం శాండల్ వుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు వీళ్లే! -
శ్రీదేవి సోడా సెంటర్: ఇరగదీసిన సుధీర్ బాబు
నేడు(మే 11) టాలెంటెడ్ హీరో సుధీర్బాబు బర్త్డే. ఈ సందర్భంగా అతడు సూరిబాబుగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నదిలో ఏదో పడవ పందెం జరుగుతున్నట్లుగా కపిపిస్తోంది. అయితే ఓడలో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడీ హీరో. పనిలో పనిగా సిక్స్ప్యాక్ బాడీని కూడా చూపించారు. తిరునాళ్లలో హీరో సిగ్గు, ప్రేమ, ఫైటింగ్.. అంతా చూపించారు. కానీ హీరోయిన్ను మాత్రం ఎక్కడా ఫ్రేమ్లో చూపించనేలేదు. కాగా ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా వుంటే సమ్మోహనం, వి చిత్రాల తర్వాత సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతోంది. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను గాజుల పల్లి సుధీర్బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేలా ఉంది
ఎఎస్పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై ప్రొడక్షన్ నెం.1గా అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా `పీనట్ డైమండ్`.. అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటించారు. వెంకటేష్ త్రిపర్ణ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అందించగా `బెంగాల్ టైగర్` ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా ఆ టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఒకేసారి రెండు టైం లైన్స్ లో జరిగే కథగా తెరకెక్కుతుండగా జె. ప్రభాకర రెడ్డి ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. `పీనట్ డైమండ్` సినిమా టైటిల్ చాలా వెరైటీ గా ఉంది.. సినిమా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా..టీజర్ చూశాను.. ఎంతో ఆసక్తికరంగా ఉంది.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేలా ఉంది.. నేను రిలీజ్ చేసిన పాట ఎంతో వినసొంపుగా ఉంది.. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.. ఈ పాట కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. -
పొట్టి గౌనులో పిచ్చెక్కిస్తున్న రష్మీ.. మైండ్ బ్లాక్ చేసిన వాణీ
పొట్టి గౌను వేసుకొని సమ్మర్లో మరింత చెమటలు పట్టిస్తున్న యాంకర్ రష్మీ కన్నుగీటుతో కుర్రకారును కట్టిపడేస్తున్న మోనాల్ జిమ్లో కసరత్తులు చేస్తున్న ఫొటోను నటుడు సుధీర్బాబు షేర్ చేశారు. డ్యాన్స్ వీడియోని ఫ్యాన్స్లో పంచుకుంది అందాల తాల లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Sudheer Babu (@isudheerbabu) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
సినిమా షూటింగ్లో ఎన్నికల ప్రచారం
రామంతాపూర్: రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం జరిగిన తెలుగు సినిమా షూటింగ్కు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని షూటింగ్లో పాల్గొన్న హీరో సుధీర్బాబు, డైరెక్టర్ కర్ణ కుమార్, ప్రొడ్యూసర్ చల్లా విజయ్కుమార్లను ఆయన కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, సుధాకర్, సాంబశివరావు, జేసీబీ రాజు, అంగడి సాయి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ యాసలో అలరించనున్న ‘బేబమ్మ’
నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’తోనే కుర్రాళ్ల హృదయాలను దోచేసుకుంది మంగళూరు బ్యూటీ కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్కు జంటగా బేబమ్మ పాత్రలో తన అమాయకపు నటనతో మంచి మార్కులే కొట్టేసింది. సినిమా డైరెక్టర్, హీరోతో పోలిస్తే కృతి కాస్తా ఎక్కువ ప్రశంసలే అందుకుంది. ఉప్పెనతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నఈ చిన్నది వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా మారింది. ఈ క్రమంలో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో కృతీ శెట్టి ఫీమెయిల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి హైదరాబాదీ అమ్మాయిగా కనిపించనుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో కృతీ తెలంగాణ యాసలో మాట్లాడనుంది. ఉప్పెనలో క్యూట్ లుక్తో అలరించిన కృతిశెట్టి.. మరి తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్తూ తనలోకి మరో యాంగిల్ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయబోతుందన్నమాట. మరి ఎంత వరకు తెలంగాణ యాసలో మెప్పించి.. ఆడియెన్స్కు దగ్గరవుతుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. ఇక ఈ మూవీతోపాటు నేచురల్ స్టార్ నానితో శ్యామ్ సింగరాయ్, రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు ఫిల్మీ దునియాలో టాక్ వినిపిస్తోంది. ఇటు తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కృతికి ఆఫర్లు వస్తున్నాయట. -
సుధీర్ తొలి ప్రేమ కథ తెలుసుకోవాలని ఉందా..
నటుడు సుధీర్బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ఇది. దీనికంటే ముందు సమ్మోహనం, వీ చిత్రాలు రూపొందాయి. ఈ సినిమాలో సుధీర్కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి నటించనుంది. వివేక్ సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా.. పీవీ వింద్యా సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సుధీర్14 సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్ను ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో సుధీర్బాబు శనివారం సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన అప్డేట్ను అందించారు. సుధీర్14గా రూపొందుతున్న ఈసినిమా టైటిల్ను మార్చి 1న ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు 90 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తూ.. ప్రేమ గురించి మాట్లాడుతూ తమ మొదటి ప్రేమ కథను అందరికి ఎలా వివరిస్తామో చెబుతామన్నారు. ‘‘ప్రేమకథలు నచ్చని మనుషులు ఉండరు కదా. ఎందుకంటే ప్రేమ లేని జీవితం ఉండదు కనుక!. అయితే నాలాంటి అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి గురించి మొట్టమొదటిసారి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా మొదలుపెడతాడు. అయితే, ఒక్కసారి అబ్బాయిలందరూ సరదాగా గుర్తుతెచ్చుకోండి. మొదటిసారి మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు ఎలా మొదలుపెట్టారు? కింద కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నాకు తెలిసి చాలామంది నాలాగే మొదలుపెట్టి ఉంటారు. అదేంటో తెలుసుకోవాలని ఉందా? మార్చి ఒకటో తేదీ వరకూ వేచి చూడండి’’ అంటూ ఆ వీడియోలో సుధీర్బాబు పేర్కొన్నారు. ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేగాక టైటిల్ ఖచ్చితంగా తొలి ప్రేమలో ఉండే సహజమైన ఫీలింగ్స్ తెలిపే విధంగా ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. చదవండి:సోషల్ హల్చల్: ఈషా కవ్వింపు..చెమటలు పట్టిస్తున్న జాన్వీ -
మూడో సినిమాకి ముహూర్తం
‘సమ్మోహనం, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందనున్న మూడో చిత్రానికి శ్రీకారం జరిగింది. గాజుల పల్లి సుధీర్బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మించనున్న ఈ సినిమా హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సీన్కి నిర్మాత వై. రవిశంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, డైరెక్టర్ వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించగా, డైరెక్టర్ వెంకీ కుడుముల స్క్రిప్ట్ను చిత్రబృందానికి అందజేశారు. ‘‘రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. మోహనకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. కృతీ శెట్టి హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా: పీజీ విందా. -
శ్రీదేవి సోడా సెంటర్
సుధీర్ బాబు హీరోగా నటించనున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘భలే మంచి రోజు’లో హీరోగా నటించిన సుధీర్ బాబు ఈ ‘శ్రీదేవి సోడా సెంటర్’లోనూ హీరోగా నటించనున్నారు. శుక్రవారం విడుదల చేసిన మోషన్ పోస్టర్లో సుధీర్ బాబు సోడా పట్టుకొని ఉన్న స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్లో మొదలుపెడుతున్నట్లు విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: షామ్దత్ శైనుద్దీన్. -
తుళ్లూరు ఎమ్మార్వో కేసులో ఊహించని పరిణామం
సాక్షి, అమరావతి: అనేక మలుపులు తిరుగుతున్న అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి దాఖలైన కేసులో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్బాబు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్పై సోమవారం వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఆకస్మాత్తుగా ఈ పిటిషన్ను రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) ►రాజధానికి భూములిస్తే పరిహారం రాదంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను అప్పటి అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడంలో అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్బాబు, మరికొందరు సహకరించారంటూ సీఐడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ►ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సుధీర్బాబు మార్చి 23న హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, ఆ మరుసటి రోజే సీఐడీ దర్యాప్తునకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటిపై స్టే విధించింది. ►హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని, దర్యాప్తును కొనసాగనివ్వాలని అభిప్రాయపడింది. ►వారంలో విచారణ జరిపి తేల్చాలని ఈ నెల 1న సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ వ్యాజ్యం రోస్టర్ మేరకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ముందు విచారణకు రాగా, ఈ నెల 12న ఇరుపక్షాల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేశారు. ►అయితే గురువారం ఈ పిటిషన్ జస్టిస్ రాయ్ ముందున్న కేసుల విచారణ జాబితాలో ‘ఫర్ బీయింగ్ మెన్షన్డ్’ శీర్షిక కింద లిస్ట్ అయింది. ఈ పిటిషన్ను తాను రిలీజ్ చేస్తున్నానని, దీనిని మరో న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై పాలనా పరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని పేర్కొన్నారు. తీర్పు రిజర్వ్ చేసిన కేసును రిలీజ్ చేయడానికి గల కారణాలు నిర్దిష్టంగా తెలియరాలేదు. -
ప్రియ బర్త్డే: మహేశ్ ఫ్యామిలీ సందడి
సూపర్ స్టార్ కృష్ణ చిన్న కూతురు, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకను ఘట్టమనేని ఫ్యామిలీ గ్రాండ్గా సెలెబ్రేట్ చేసింది. నాన్న కృష్ణ, బావలు జయదేవ్, సంజయ్ స్వరూప్, సుధీర్లతో కలిసి సందడిగా గడిపారు. ఈ వేడుకల్లో సూపర్స్టార్ కృష్ణ, ఆయన సోదరుడు, నిర్మాత ఆదిశేషగిరిరావు, మహేశ్, నమ్రత, సంజయ్ స్వరూప్, జయదేవ్, సుధీర్బాబు పాల్గొన్నారు. సోదరీమణులు, బావలు, నాన్న కృష్ణతో కలిసి మహేశ్ బాబు-నమ్రత జంట భోజనం చేశారు. ఈ ఫోటోలను సుధీర్ బాబు ట్వీటర్లో పోస్ట్ చేస్తూ ‘ ఈ రోజు నా లైఫ్ పుట్టింది. హ్యాపీ బర్త్డే ప్రియా’అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
నాని.. 'వి' సినిమా రివ్యూ
టైటిల్: వి జానర్: క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తారాగణం: నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు దర్శకుడు: ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత: దిల్ రాజు సంగీతం: అమిత్ త్రివేది నేపథ్య సంగీతం: థమన్ సినిమాటోగ్రఫీ: పి.జి. విందా విడుదల తేదీ: 5-9-2020, అమెజాన్ ప్రైమ్ 'అష్టా చమ్మా' చిత్రంతో హీరో నాని ప్రస్థానం మొదలైంది. తొలి చిత్రంతోనే నానికి బంపర్ హిట్ను అందించారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అయితే అనూహ్యంగా మళ్లీ ఆయన డైరెక్షన్లోనే నాని 25వ సినిమా చేయడం విశేషం. ఇక ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలకే మొగ్గు చూపే నాని ఈ సారి ప్రతినాయక పాత్రలో కనిపించడంతో 'వి' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 5న) అమెజాన్ ప్రైమ్లో విడుదల అయింది. లాక్డౌన్ తర్వాత ఓటీటీలో విడుదలైన భారీ తెలుగు చిత్రం ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో యంగ్ హీరో సుధీర్బాబు, విలన్ ఛాయలున్న పాత్రలో నాని ప్రేక్షకులను మెప్పించారా? లేదా? ఈ ఇద్దరిలో చివరికి ఎవరు హీరో అయ్యారో చూసేద్దాం... కథ: డీసీపీ ఆదిత్య(సుధీర్ బాబు) దమ్మున్మ పోలీసాఫీసర్. గ్యాలంటరీ మెడల్ సహా ఎన్నో అవార్డులు అందుకున్న ఆయనకు అత్యంత కిరాతకంగా హత్యలు చేసే కిల్లర్ విష్ణు(నాని) దమ్ముంటే తననాపమని సవాలు విసురుతాడు. అతని డిపార్ట్మెంట్లోని ఓ పోలీసును ఆయన ఇంట్లోనే హత్య చేస్తాడు. ఆ తరువాత ఒక్కొక్కరిని రకరకాలుగా చంపుతూ నెక్స్ట్ ఏంటి? అనేది క్లూ ఇస్తాడు. ఈ క్లూ తెలుసుకోగలిగితే నేరస్థుడిని పట్టుకోవచ్చని డీసీపీ తన ప్రేయసి అపూర్వ (నివేదా థామస్) సాయం కోరతాడు. కానీ చివరికి అతని మెదడులోనే మెరుపులాంటి ఆలోచన చేరి అతనే పజిల్ విప్పుతాడు. వెంటనే నేరస్థుడిని, అదే నానిని పట్టుకునేందుకు పరుగెత్తుతాడు. కానీ విలన్ అంత వీక్ కాదు.. చిక్కినట్లే చిక్కి తప్పించుకుని మళ్లీ హత్యలు చేస్తుంటాడు. అసలు వీ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు? డీసీపీ ఆదిత్యకు ఎందుకు చాలెంజ్ విసిరాడు? ఆదిత్య కిల్లర్ను పట్టుకున్నాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే! (చదవండి: నేను హ్యాపీ అని ‘దిల్’రాజు అన్నారు) విశ్లేషణ: సుధీర్బాబు ఎంట్రీ సీన్తోనే పోలీస్గా పర్ఫెక్ట్గా సూటయ్యారనిపిస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ హత్యతో కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు దర్శకుడు మోహనకృష్ణ. హంతకుడు ఎంతో సులువుగా ఒక్కొక్కరినీ చంపుకుంటూ వెళ్లడం, అతడి కోసం డీసీపీ గాలించడం వంటి సన్నివేశాలతోనే ఫస్టాఫ్ నడుస్తుంది. డీసీపీకి హంతకుడు కనిపించి, తప్పించుకోవడంతో ప్రథమార్థం ముగుస్తుంది. ద్వితీయార్థం మరింత రక్తికట్టిస్తారనుకుంటే అలా జరగలేదు. ఇక్కడ కథనం నెమ్మదించింది. హత్యల వెనక కారణాన్ని తెలుసుకునేందుకు డీసీపీ ప్రయత్నాలు మొదలు పెడతాడు. (చదవండి: పెంగ్విన్ మూవీ రివ్యూ) అలా విష్ణు ఫ్లాష్బ్యాక్ వస్తుంది.. ఇక్కడ సస్పెన్స్ రివీల్ కావడంతో సినిమా అంత ఆసక్తిగా సాగదు. ఇక హంతకుడి ఒప్పందం ప్రకారం అతడిని పట్టుకోనందుకు డీసీపీ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఆ తర్వాత క్లైమాక్స్లో వస్తుంది అసలు ట్విస్ట్. హత్యల వెనక కారణాన్ని హంతకుడే తెలియజేస్తాడు. కానీ ఈ తరహా కారణాలు చాలా సినిమాల్లో కనిపించాయి. అయితే అన్ని మెడల్స్ సాధించి, పెద్ద పేరు గడించిన డీసీపీ.. నేరస్థుడు క్లూ వదిలినా పట్టుకోలేకపోవడం కొంత లాజిక్గా అనిపించదు. దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉన్నా కథనం అంత బలంగా లేదు. క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కాబట్టి కామెడీ చొప్పించే ప్రయత్నం చేయలేదు. కాకపోతే సీరియల్ కిల్లర్గా భయపెట్టిన నాని అక్కడక్కడా చిలిపి నానిగా కనిపించారు. ప్రతినాయక పాత్రలోనూ నాని సులువుగా నటించారు. హత్యలు చేసేటప్పుడు వచ్చే డైలాగులు బాగున్నాయి. చివరి రెండు హత్యలు వెన్నులో వణుకుపుట్టిస్తాయి. నవలా రచయితగా, డీసీపీ ఆదిత్య ప్రేయసిగా అపూర్వ పాత్రలో నివేదా థామస్ రాణించారు. కథకు మూలమైన సాహెబ్ పాత్రలో అదితిరావు హైదరి బాగా నటించారు. మిగతావారు తమ పాత్రలకు న్యాయం చేశారు. కొన్నిచోట్ల వచ్చే సంగీతం 'రాక్షసుడు' థీమ్ మ్యూజిక్ను గుర్తు చేస్తుంది. పాటలు పర్వాలేదు. పి.జి. విందా సినిమాటోగ్రఫీకి తిరుగులేదు. (చదవండి: ‘వి’ తర్వాత అభిమానులు పెరుగుతారనుకుంటున్నా!) ప్లస్: నాని, సుధీర్బాబుల నటన ఫస్టాఫ్ మైనస్: కథనం బలహీనంగా ఉండటం సెకండాఫ్ నెమ్మదించడం ఒక్కమాటలో: ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవలేదు. -
పీవీ సింధూ బయోపిక్లో దీపిక పదుకొనే!?
సాక్షి, హదరాబాద్: పీవీ సింధు, మిథాలీరాజ్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్... వెండితెరపై సందడి చేయనున్నారు. అదేంటి.. వీరంతా సినిమాల్లో నటిస్తున్నారా..! అని అనుకోకండి. వీరి జీవిత కథలతో సినిమాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు అప్పుడే పట్టాలపై కూడా ఎక్కేశాయి. మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ స్టార్స్ పి.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్లకు సంబంధించిన బయోపిక్లు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మిథాలీరాజ్ బయోపిక్కు ‘శభాష్ మిత్తూ’ అనే టైటిల్ను ఖరారు చేయగా..సైనా నెహ్వాల్, పుల్లెల గోపిచంద్ బయోపిక్లకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు. పీవీ సింధూ బయోపిక్కు సంబంధించి ఇంకా పాత్రల ఎంపికలోనే ఉంది. గల్లీ గ్రౌండ్ నుంచి అంతర్జాతీయ గ్రౌండ్ వరకు తమ సత్తా చాటిన మన హైదరాబాదీ క్రీడాకారుల బయోపిక్లు వెండితెరలపై కనువిందు చేయనున్నాయి. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వారి బయోపిక్లకు సంబంధించిన వివరాలతో గల్లీ గ్రౌండ్ టూ బయోపిక్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారులు మన హైదరాబాద్ నుంచి ఉండటం విశేషం. క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్ దొరై, బ్యాడ్మింటన్ స్టార్స్ పీ.వి.సింధూ, సైనా నెహ్వాల్, కోచ్ పుల్లెల గోపిచంద్ల బయోపిక్లు నిర్మించేందుకు బాలీవుడ్ ముందుకొచ్చింది. ఒకప్పుడు గల్లీ గ్రౌండ్లో మొదలైన వీరి ప్రస్థానం దశల వారీగా అంతర్జాతీయ గ్రౌండ్లపై తమ సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. మారోసారి వీరికి సంబంధించిన బయోపిక్లతో వెండితెరపై కూడా వీరి సత్తాను చూపించడానికి రెడీ అవుతున్నారు. సింధూగా దీపిక? సింధూ బయోపిక్లో నటించే వారి వివరాలను మాత్రం సోనూసూద్ అప్పుడే వెల్లడించట్లేదు. బయోపిక్ నిర్మిస్తున్నట్లు ప్రకటించినప్పుడు సోనుసూద్కు ఎంతోమంది హీరోయిన్లు కాల్స్ చేసి మరీ మేం చేస్తామంటే మేం చేస్తామంటూ పోటీ పడ్డ విషయాన్ని ఆయన వివరించారు. అయితే పీవి ముఖానికి, తన ఎత్తు, పర్సనాలిటికి సంబంధించి సెట్ అయ్యేది ఒకే ఒక్కరు బాలివుడ్ టాప్ స్టార్ దీపిక పదుకొనే. గతంలోనే ఆమెను సోనుసూద్ సంప్రదించగా అంగీకరించారు. అప్పుడు తన కాల్షీట్స్ లేని కారణంగా బయోపిక్ ఇంకా పట్టాలెక్కలేదు. అయితే.. ఇటీవల కాలంలో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్ సమంత.. సింధూగా చేస్తుందనే వార్తలు వచ్చాయి. వీటిలో నిజం లేదని సోనుసూద్ “సాక్షి’కి తెలిపారు. అన్నీ కలిసొస్తే దీపిక నటించే అవకాశం ఉన్నట్లు హింట్ ఇచ్చారు సోనుసూద్.! మిథాలీ, సింధు, సైనాలపై బాలీవుడ్, పుల్లెలపై టాలీవుడ్ ఇటీవల కాలంలో మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్ల ఆటకు యావత్ భారతం ఫిదా అయ్యింది. సింధూని ప్రపంచస్థాయి పోటీల్లో నిలబెట్టిన ఘనతను కోచ్ పుల్లెల గోపిచంద్ సొంతం చేసుకున్నారు. వీరి జీవిత చరిత్రలను బయోపిక్గా తీసేందుకు బాలివుడ్, టాలివుడ్ ముందుకొచ్చింది. సింధూపై బయోపిక్ని నిర్మించేందుకు ప్రముఖ నటుడు సోనుసూద్, మిథాలీరాజ్పై ‘వయోకామ్–18’, సైనా నెహ్వాల్పై సినిమా నిర్మించేందుకు ‘టీ సిరీస్’ సంస్థలు ముందుకు రాగా..కోచ్ పుల్లెల గోపిచంద్పై నిర్మించేందుకు టాలివుడ్కు చెందిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ముందుకొచ్చారు. లాక్డౌన్ ఎఫెక్ట్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కొంత షూటింగ్ జరిగి నిలిచిపోయాయి. లాక్డౌన్ లేకపోతే ఈ ఏడాది దసరా, క్రిస్మస్ టైంకి ఈ మూడు బయోపిక్లు విడుదలయ్యేవి. ఇప్పుడు సినిమా షూటింగ్లకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. వచ్చే ఏడాది దసరా నాటికి ఈ మూడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీ.వి.సింధూ బయోపిక్ మాత్రం వచ్చే ఏడాది ఇచివర్లో కానీ..2022 సమ్మర్లో కానీ విడుదలయ్యే అవాకాశం ఉందని సోనుసూద్ ‘సాక్షి’తో చెప్పారు. శ్రద్థా టు పరిణీతి సైనా నెహ్వాల్ బయోపిక్లో నటించేందుకు 2018లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ కసరత్తులు చేసింది. తన అధికారికి ట్విట్టర్ ఖాతాలో కూడా సైనా బయోపిక్లో నటిస్తున్నట్లు వెల్లడించింది. సరిగ్గా ఏడాది తిరిగేలోపు ఆమె స్థానంలో పరిణీతిచోప్రా చేరి శ్రద్ధ పక్కకు తప్పుకుంది. శ్రద్ధ కపూర్ కంటే పరిణీతి చోప్రానే సైనాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం విశేషం. ప్రొఫెషన్ టూ పర్సనల్ లైఫ్ మిథాలీరాజ్, సింధూ, సైనా నెహ్వాల్లు చిన్నతనం నుంచి వారికి ఆయా ఆటలపై మక్కుల ఎలా వచ్చింది. ఆ సమయాల్లో వీరికి ఎవరెవరు ఏ విధమైన సాయం చేశారు, ఎవరెవరు విమర్శించారు, సంతోషాలు, విచారాలు ఇలా అన్ని అంశాలను పొందుపరుస్తూ ఈ బయోపిక్లు రూపుదిద్దుకుంటున్నాయి. నగరంలోని గల్లీల్లో ఆడుకునే వీరు ప్రపంచస్థాయికి ఎదిగిన వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు దర్శకులు సిద్ధమవుతున్నారు. పుల్లెల గోపీచంద్ చిన్న పాటి గ్రౌండ్ నుంచి అర్జున అవార్డు స్థాయి వరకు ఎలా వచ్చాడు, సింధూను ప్రపంచ పోటీలకు ఎలా తీసికెళ్లగలిగాడు అనే ప్రతి ఒక్క అంశాన్ని బయోపిక్లో చూపించనున్నారు. వారి ప్రొఫెషనల్ ఆటనే కాదు పర్సనల్ లైఫ్ని ఎంతవరకు పక్కన పెట్టారు, చిన్నపాటి సరదాలను కూడా వదులుకున్న సందర్భాలను కూడా ప్రేక్షకులకు ఈ బయోపిక్ల ద్వారా తెలపనున్నారు. తాప్సీ, పరిణీతిచోప్రా, సుధీర్బాబులే యాప్ట్ ఇటీవల విడుదలైన మిథాలీ బయోపిక్ ‘శభాష్ మిత్తూ’లో హీరోయిన్ తాప్సీ పొన్ను అచ్చుగుద్దినట్లు మిథాలీరాజ్లాగానే ఉంది. సైనా నెహ్వాల్తో కలసి నెట్ ప్రాక్టీస్ చేసిన బాలీవుడ్ నటి పరిణీతిచోప్రా సేమ్ సైనాను దించేసింది. ఇక పుల్లెల గోపీచంద్ పాత్రలో మన టాలివుడ్ హీరో సుధీర్బాబు కనువిందు చేయనున్నారు. ఈ ముగ్గురి క్రీడాకారుల ముఖాలకు ఇంచుమించు మ్యాచ్ అవుతున్న తాప్సీ, పరిణీతి, సుధీర్బాబులను సెలెక్ట్ చేసుకోవడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు. వీరికి సంబంధించిన అప్డేట్స్ ఇటీవల కాలంలో ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్లలో రావడంతో నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. చక్కగా యాప్ట్ అయ్యే క్యారెక్టర్లను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో పొగడ్తల వెల్లువెత్తుతున్నాయి. ఆమె చెప్పిన వన్వర్డ్ ఆన్సర్తో ఫిదా అయ్యా మహిళల ప్రపంచ కప్కు ముందు జరిగిన ప్రెస్కాన్ఫరెన్స్లో మీ ఫేవరెట్ మేల్ క్రికెటర్ ఎవరంటూ ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మిథాలీరాజ్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి యావత్ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకుంది. ఇదే క్వశ్చన్ను మీరు మేల్ క్రికెటర్ను ఎందుకడగరంటూ ప్రశ్నించింది. ఆ సన్నివేశం ఇంకా నా కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఆమె డేర్, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ నాకెంతో నచ్చాయి. మిథాలీలా నటించమని నన్ను అడగ్గానే యస్ చెప్పేశా. ఆ ఒక్క ఆన్సర్తో ఫిదా అయ్యాను. శభాష్ మిత్తూలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. – తాప్సీ పొన్ను, బాలీవుడ్ నటి తనలా చేయడం గొప్ప అనుభూతి గ్రౌండ్లో సైనా నెహ్వాల్ ఆడుతున్న ఆటకు బాగా కనెక్ట్ అవుతాను. నేను అసలు ఎప్పుడూ ఉహించలేదు సైనాపై బయోపిక్ వస్తుందని..అందులో నేనే నటిస్తానని. తనతో కలసి ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ, నేర్చుకుంటూ నటించడం చాలా అనుభూతిగా ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా అందర్నీ మెప్పిస్తాననే ధీమా ఉంది. – పరిణీతి చోప్రా, బాలీవుడ్ నటి గోపి.. నా ఇన్స్పిరేషన్ గోపి (గోపీచంద్) నా ఇన్స్పిరేషన్.. ఒక వ్యక్తిగా నేను పరిణితి చెందడంలో గోపి పాత్ర చాలా ఉంది. అతనితో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ గర్వంగా అనిపిస్తుంది. ఆరోజుల్లో ఇద్దరం కలసి ఆడటం, ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాం. అతని బయోపిక్ ద్వారా రాబోయే తరం గోపిని ఆదర్శంగా తీసుకోవాలి. అన్నీ సక్రమంగా ఉంటే వచ్చే ఏడాది చివర్లో బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. – సుధీర్బాబు, సినీ హీరో కలసి ఆడాం.. అతనే చెయ్యడం హ్యాపీ ఒకప్పుడు నేనూ, హీరో సుధీర్బాబు కలసి విజయవాడలో బ్యాడ్మింటన్ ఆడాం. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు అతనే నా బయోపిక్లో నటించడం ఆనందంగా ఉంది. ప్రారంభ దినాల్లో మేం ఎన్నో ఇబ్బందులు పడ్డాము, ఈ స్థాయికి ఎలా వచ్చేమనే విషయాలు ఈనాటి యువతకు బయోపిక్ల ద్వారా తెలపడం ఆనందంగా ఉంది. – పుల్లెల గోపిచంద్, బ్యాడ్మింటన్ కోచ్. చాలా హ్యాపీగా ఉన్నా నా మీద బయోపిక్ రావడం పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పైగా పరిణీతి చోప్రా నాలా నటిస్తుంది. నానుంచి ఆమెకు కావల్సిన టిప్స్ అన్నీ ఇచ్చాను. షూటింగ్ అంతా పూర్తయ్యి రిలీజ్ అయితే ప్రేక్షకులతో కలసి చూడాలనిపిస్తుంది. – సైనా నెహ్వాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కష్టానికి గుర్తింపు బయోపిక్ చిన్నప్పటి నుంచి ప్రపంచస్థాయి వరకు నేను పడిన కష్టం, శ్రమకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, ప్రజల మన్నలను అందుకున్నాను. కానీ నేను పడిన కష్టం, ఆరోజుల్లో ఏ విధమైన వసతులు లేకుండా పట్టుబట్టి మరీ ఆటపై పట్టు సాధించడాన్ని ఇప్పుడు బయోపిక్ ద్వారా యావత్ ప్రపంచానికి చూపించే ప్రయత్నం జరగడం ఆనందంగా ఉంది. విదేశీ గడ్డపై నా గెలుపు అనంతరం మువ్వెన్నెల జెండా రెపరెపలాడిన సమయంలో ఎంత సంతోషంగా ఉందో..ఇప్పుడు బయోపిక్ ద్వారా నా జీవిత చరిత్ర ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా అనిపిస్తుంది. – పీ.వి.సింధూ, బ్యాడ్మింటన్ ప్లేయర్ బయోపిక్ రావడం ఆదర్శమనిపిస్తుంది ఒకప్పుడు క్రికెట్ అంటే అమ్మాయిలకెందుకు అనేవాళ్లు. మేం ప్రపంచకప్ పోటీల్లో ఆడిన ఆటకు తతి ఒక్కరూ ఫిదా అయ్యారు, మమ్మల్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా తమ అమ్మాయిలను క్రికెట్ కెరీర్గా మలుచుకోమని పంపండం సంతోషంగా ఉంది. నా గురించి బయోపిక్ రావడం నిజంగా నేటితరం వారికి ఆదర్శమనిపిస్తుంది. – మిథాలీరాజ్ దొరై, ఇండియన్ క్రికెటర్