users
-
5జీ యూజర్లు ఎందరంటే..
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ యూజర్ల సంఖ్య వచ్చే మూడేళ్లలో (2028 నాటికి) 2.65 రెట్లు పెరగనుంది. 77 కోట్లకు చేరనుంది. అలాగే, నెలవారీ డేటా వినియోగం యూజర్కు సగటున 40 జీబీ స్థాయికి చేరుతుందని టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియా ఓ నివేదికలో అంచనా వేసింది. గత అయిదేళ్లలో 2024 నాటికి 4జీ, 5జీ డేటా వినియోగం వార్షికంగా 19.5% పెరిగి 27.5 జీబీకి చేరిందని పేర్కొంది.గతేడాది 5జీ డేటా ట్రాఫిక్ మూడు రెట్లు పెరిగినట్లు వివరించింది. 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ లభ్యత (ఎఫ్డబ్ల్యూఏ) పెరుగుతుండటంతో డేటా వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోందని నోకియా ఇండియా టెక్నాలజీ, సొల్యూషన్స్ హెడ్ సందీప్ సక్సేనా తెలిపారు. యాక్టివ్ 5జీ డివైజ్ల సంఖ్య వార్షికంగా రెట్టింపై 2024లో 27.1 కోట్లకు చేరినట్లు తెలిపారు. -
ఫోన్పే ఎంతమంది వాడుతున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: నమోదిత వినియోగదారుల సంఖ్య 60 కోట్లు దాటిందని ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే తెలిపింది. 4 కోట్ల మందికిపైగా వర్తకులు ఫోన్పే వేదికగా కస్టమర్ల నుంచి డిజిటల్ చెల్లింపులను అందుకుంటున్నారు.10 సంవత్సరాల ప్రయాణంలో కంపెనీ తన కార్యకలాపాలను వెల్త్ మేనేజ్మెంట్, పిన్కోడ్ ద్వారా ఈ–కామర్స్ రంగంలోకి ప్రవేశించింది. 2023లో జరిగిన చివరి నిధుల సమీకరణ రౌండ్లో కంపెనీని 12 బిలియన్ డాలర్లుగా విలువ కట్టారు.ఫోన్పే డిజిటల్ చెల్లింపుల యాప్ 2016 ఆగస్టులో ప్రారంభమైంది. 2024 మార్చి నాటికి సంస్థ ఖాతాలో నమోదిత వినియోగదారులు దాదాపు 53 కోట్ల మంది ఉన్నారు. ఫోన్పే రోజుకు 33 కోట్లకుపైగా లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. వార్షికంగా వీటి మొత్తం చెల్లింపుల విలువ రూ.150 లక్షల కోట్లకుపైగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా -
దేశంలో టెలికాం యూజర్ల సంఖ్య ఎంతో తెలుసా..
న్యూఢిల్లీ: దేశీయంగా డిసెంబర్లో మొత్తం టెలిఫోన్ సబ్స్క్రయిబర్స్ సంఖ్య గతంలో కంటే స్వల్పంగా పెరిగి 118.99 కోట్లకు చేరింది. నవంబర్లో ఇది 118.71 కోట్లుగా నమోదైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఇటు మొబైల్, అటు ఫిక్స్డ్ లైన్ విభాగాల్లో జియో పెద్ద సంఖ్యలో కొత్త యూజర్లను దక్కించుకుంది. వైర్లెస్ యూజర్ల విభాగంలో, రిలయన్స్ జియోకి నికరంగా 39.06 లక్షలు, భారతి ఎయిర్టెల్కు 10.33 లక్షల మంది కొత్తగా జత కాగా వొడాఫోన్ 17.15 లక్షల మందిని కోల్పోయింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వరుసగా 3.16 లక్షలు, 8.96 లక్షల మంది సబ్ర్స్కయిబర్స్ను కోల్పోయాయి. ఈ విభాగంలో ప్రైవేట్ సంస్థల మార్కెట్ వాటా 91.92 శాతంగా ఉండగా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాటా కేవలం 8.08 శాతంగా ఉంది.మరోవైపు, వైర్లైన్ యూజర్ల సంఖ్య నవంబర్లో 3.85 కోట్ల నుంచి డిసెంబర్లో 3.92 కోట్లకు చేరింది. జియోకి 6.56 లక్షల మంది, భారతి ఎయిర్టెల్కు 1.62 లక్షలు, టాటా టెలీకి 9,278 మంది యూజర్లు జతయ్యారు. బీఎస్ఎన్ఎల్ ఏకంగా 33,306 యూజర్లను, ఎంటీఎన్ఎల్ 14,054 మంది సబ్్రస్కయిబర్స్ను కోల్పోయాయి. బ్రాడ్బ్యాండ్ యూజర్లు 94.49 కోట్లు.. మొత్తం బ్రాడ్బ్యాండ్ యూజర్లు నవంబర్లో 94.47 కోట్లుగా ఉండగా, డిసెంబర్లో 94.49 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సబ్స్క్రయిబర్స్ 47.65 కోట్లుగా, భారతి ఎయిర్టెల్ యూజర్లు 28.93 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.63 కోట్లు, భారత్ సంచార్ నిగమ్ 3.53 కోట్లు, ఎట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ యూజర్లు 22.7 లక్షల మంది ఉన్నారు. బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో 50.43 శాతం వాటాతో జియో అగ్రస్థానంలో ఉండగా, భారతి ఎయిర్టెల్ (30.61 శాతం), వొడాఫోన్ ఐడియా (13.37 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఓటీటీ.. బంపర్ హిట్
డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సేవల (ఓటీటీ) ముందు నేడు సినిమా థియేటర్లు, టీవీలు చిన్నవైపోతున్నాయి. ప్రేక్షకుల సందడి లేక థియేటర్లు వెలవెలబోతుంటే.. వీక్షకులను కాపాడుకునేందుకు టీవీ చానళ్లు తంటాలు పడుతున్నాయి. వీటికి అందనన్నట్టుగా ఓటీటీ వేదికలు ఎక్స్ప్రెస్ వేగంతో దూసుకుపోతున్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోస్టార్, యూట్యూబ్, జీ5, సోనీలివ్, ఆహా.. ఇలా ఓటీటీల జాబితా చాలా పెద్దదే. ఓటీటీ సేవలకు 4జీ టెలికం ఊతమిస్తే.. కరోనా విపత్తు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని చెప్పుకోవాలి. బాహుబలుల కుస్తీపట్లకు వేదికైన ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్’ (డబ్ల్యూడబ్ల్యూఈ) షోలకు అమెరికా తర్వాత ఎక్కువ మంది వీక్షకులు ఉన్నది భారత్లోనేనని నెట్ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ వెల్లడించారు. డబ్ల్యూడబ్ల్యూఈకి చెందిన రా, ఎన్ఎక్స్టీ, స్మాక్డౌన్ ఇలా ప్రతి ఫార్మాట్కు సంబంధించి షోలు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 2019లోనే డబ్ల్యూడబ్ల్యూఈ ఫార్మాట్లను భారత్లో 5 కోట్ల మంది యూజర్లు వీక్షించడం గమనార్హం. చేతిలో స్మార్ట్టీవీ మాదిరిగా ఓటీటీ పరిశ్రమ విస్తరిస్తోంది. విస్తరణ వ్యూహాలు.. అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ‘శివరాపల్లి’ వెబ్సిరీస్ అదరగొడుతోంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ షోలలో ‘పంచాయత్’ ఒకటి. మొదట హిందీలో వచ్చిన ఈ షో ఆ తర్వాత తమిళంలోకి ‘తలైవెట్టియాన్ పాళయం’పేరుతో అనువదించగా, అక్కడా దుమ్ము దులుపుతోంది. ఆ తర్వాత శివరాపల్లి పేరుతో గత నెలలో విడుదలై క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 8,500 టైటిళ్లను ఆఫర్ చేస్తోంది. కొత్తగా విడుదలైన సినిమాలను వేగంగా ప్రైమ్లోకి తీసుకొచ్చేందుకు ఎంత చెల్లించడానికైనా వెనుకాడడం లేదు. సెలబ్రిటీ షోల విషయంలోనూ దూకుడు ప్రదర్శిస్తోంది. సోనీ లివ్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’, ‘రాకెట్ బోయ్స్’, షార్క్ ట్యాంక్ ఇండియా, మిలియన్ డాలర్ లిస్టింగ్ తదితర పాపులర్ షోలతో తన యూజర్లను 3.3 కోట్లకు పెంచుకోవడం గమనార్హం. 5.5 కోట్ల యూజర్లు కలిగిన జియోహాట్స్టార్ అయితే.. రిలయన్స్ జియోకి ఉన్న 42 కోట్ల కస్టమర్లకు చేరువయ్యేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. సాధారణంగా ఒక వెబ్సిరీస్లో 6–7 షోలు ఉంటే.. 100 వరకు ఎపిసోడ్లతో సి రీస్ తీసుకురావాలని నిర్మాతలను కోరుతోంది. తద్వారా యూజర్ ఎంగేజ్మెంట్ పెంచుకోవాలని అనుకుంటోంది. విలీనాలు.. కొనుగోళ్లుభారీ మార్కెట్, అదే సమయంలో గణనీయమైన పోటీ నేపథ్యంలో ఓటీటీ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న డిస్నీ హాట్స్టార్.. తనకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరిస్తున్న జియో సినిమాస్తో చేతులు కలపడం పరిశ్రమలో స్థిరీకరణ దిశగా బలమైన అడుగులు పడినట్టయింది. పరిశ్రమలో ఇప్పుడు జియోహాట్స్టార్ నంబర్ 1 ప్లేయర్. జీతో విలీనం అయ్యేందుకు సోనీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. పోటీ పెరగడంతో అమెజాన్ లైట్ పేరుతో ఒక్కరు/ఇద్దరు సభ్యుల కుటుంబం కోసం తక్కువ చార్జీల నమూనాను తీసుకొచ్చింది. అలాగే, 2024లో ఎంఎక్స్ ప్లేయర్ను కొనుగోలు చేసి.. దీనిపై ఉచిత కంటెంట్ను అందుబాటులో ఉంచింది.భారీగా ఆదాయం.. 2024లో ఓటీటీ సంస్థలు రూ.35,600 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులో యూజర్ల సబ్్రస్కిప్షన్ చార్జీలతోపాటు ప్రకటనల ఆదాయం కలిసి ఉంది. ఇందులో 40 శాతం యూట్యూబ్కే రావడం గమనార్హం. 2022లో 11.2 కోట్ల ఓటీటీ యూజర్లు కాస్తా, 2023లో 9.6 కోట్లకు తగ్గారు. దీంతో మరింత కంటెంట్తో, చౌక ప్లాన్లతో ఓటీటీలు 2024లో యూజర్లను 12.5 కోట్లకు పెంచుకున్నాయి. కెనక్టెట్ టీవీల (ఇంటర్నెట్ అనుసంధానం కలిగినవి) కొనుగోళ్లు పెరుగుతుండడం ఓటీటీలకు మరింత డిమాండ్ను తెచ్చి పెడుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్కు బదులు పెద్ద సైజు టీవీ తెరలపై షోలను వీక్షించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పరిశ్రమ ఆదాయం 2022లో రూ.21,600 కోట్లుగా ఉంటే, 2023లో రూ.30,300 కోట్లకు, 2024లో రూ.35,600 కోట్లకు వృద్ధి చెందింది. వృద్ధికి భారీ అవకాశాలు.. 90 కోట్ల టీవీ వీక్షకులతో పోల్చి చూస్తే.. 12.5 కోట్ల వీక్షకులు కలిగిన ఓటీటీ పరిశ్రమకు మరింత మందిని చేరుకునేందుకు గణనీయమైన అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో స్మార్ట్ఫోన్ యూజర్లు 2024 నాటికి 65 కోట్ల మంది ఉంటారని అంచనా. 5 కోట్ల కనెక్టెడ్ టీవీలు కూడా ఉన్నాయి. ఈ పరంగా చూస్తే ఓటీటీల విస్తరణకు దండిగా అవకాశాలున్నాయన్నది విశ్లేషుకుల అభిప్రాయం. తొమ్మిదేళ్ల క్రితం ఫస్ట్ గేర్లోకి ప్రవేశించిన ఓటీటీ పరిశ్రమ ప్రస్తుతం పట్టణ యూజర్లకు వేగంగా చేరువ కాగా, దేశంలోని ఇతర ప్రాంతాల వారికీ తమ కంటెంట్ను చేరువ చేయాల్సి ఉందంటున్నారు. ఇందుకు వీలుగా ప్రకటనలతో కూడిన తక్కువ సబ్్రస్కిప్షన్ ప్యాక్లు సాయపడతాయని చెబుతున్నారు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
సైబర్ వల : ఎంత ప్రచారం చేస్తున్నా, మోసపోతున్న అమాయకులు
గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్, పాన్ కార్డు నంబర్లు, ఓటీపీల వంటి వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అనేక మంది అమాయకులు సైబర్ మోసగాళ్ల చేతిలో సులభంగా మోసపోతున్నారు. ఆ తరువాత అసలు విషయం తెలుసు కుని లబోదిబోమంటున్నారు. గడచిన మూడు నెలల్లో వెలుగుచూసిన సంఘటనలలో రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఏకంగా రూ.1,085 కోట్ల మేర మోసపోయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మూడు నెలల్లో నేషనల్ సైబర్ క్రైం రిపోరి్టంగ్ పోర్టల్ (ఎన్సీసీఆర్పీ) హెల్ప్లైన్ నంబరుకు 64 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని బట్టి సైబర్ మోసగాళ్లు ఏ స్ధాయిలో రెచ్చి పోతున్నారో ఇట్టే అర్ధమవుతోంది. ముంబై మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అప్రమత్తమైన సైబర్ డిపార్టుమెంట్ పోలీసులు మరికొందరని రూ.119 కోట్లు మోసపోకుండా కాపాడడంలో సఫలీకృతమయ్యారు. విస్తృతంగా ప్రచారం చేస్తున్నా... సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దంటూ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా అనునిత్యం ప్రభుత్వం హెచ్చరిస్తోంది.మీ బంధువులు అనారోగ్యంతో అస్పత్రిలో చేరారని, మీ పిల్లల్ని ఏదో కేసులో నేరం కింద పోలీసులు అరెస్టు చేశారని, బ్యాంకు మేనేజర్లు , సీబీఐ, కస్టమ్ డిపార్టుమెంట్ ఇలా రకరకాల శాఖల నుంచి, అలాగే కేవైసీ చేయాలని, ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని ఇలా రకరకాల వంకలతో సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఫోన్లు వస్తే స్పందించవద్దని, ఏ బ్యాంకు సిబ్బందీ ఇలా ఫోన్లో వివరాలు అడగరనే సందేశాలను గత కొద్ది రోజులుగా టెలికామ్ డిపార్టుమెంట్ ద్వారా వినిపిస్తున్నారు. అయినప్పటికీ అనేకమంది అమాయకులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.కొందరు ఆలస్యంగానైనా మేలుకుని 1930 నంబరుకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈమేరకు పోగొట్టుకున్న సొమ్మును పూర్తిగా కాకపోయినా కొంతమేర అయినా పోలీసులు కాపాడగలుగుతున్నారు. లేదంటే బ్యాంక్ ఖాతాలోంచి మొత్తం డబ్బులు ఖాళీ అయ్యే ప్రమా దం ఉంటుంది. ఇలాంటి సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇటీవల న్యూ ముంబైలోని మహాపే ప్రాంతంలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇందులో 150పైగా సిబ్బంది, 24 గంటలు విధులు నిర్వహిస్తారు. 1930 హెల్ప్లైన్ నంబరుకు ప్రతీరోజు సగటున ఏనిమిది వేల వరకూ ఫిర్యాదులు వస్తుంటాయి. కంట్రోల్ రూం సిబ్బంది ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తారని, సా«ధ్యమైనంత వరకు అమాయకులు మోసపోకుండా ప్రయత్నిస్తుంటారని మహారాష్ట్ర సైబర్ డిపార్టుమెంట్ సూపరింటెండెంట్ సంజయ్ లాట్కర్ తెలిపారు. విదేశీ సిమ్కార్డులతో మరింత చిక్కు: సంజయ్ లాట్కర్ ఇదిలాఉండగా సైబర్ మోసగాళ్లు ఒకసారి వినియోగించిన ఫోన్ నంబర్లను మరోసారి వాడరు. వీటిని ఎలాగోలా సంపాదించిన కొందరు నేరగాళ్లు యువతి, యువకులు, మహిళలను మీ ఫోటోలను అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించి డబ్బులు గుంజుతున్నారు. బాధితులు ఈ నంబర్లు గురించి తెలిపేందుకు వీల్లేకపోవడంతో ఏమీతోచక కొందరు, పరువు పోతుందన్న భయంతో కొందరు, ఇలా వేలాది మంది పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఆగిపోతున్నారు. గడచిన మూడు-నెలల్లో 1930 హెల్ప్లైన్ నంబరుకు వచి్చన 28,209 ఫిర్యాదుదారులు కంప్లైంట్ చేసిన 2,713 మొబైల్ నంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. మిగతా నంబర్ల గురించి ఆమాత్రం సమాచారం కూడా లేదు. దీన్ని బట్టి సైబర్ నేరగాళ్లు విదేశీ సిమ్ కార్డుల ద్వారా ఫోన్ చేస్తున్నారని, ఒకసారి వాడిన సిమ్ కార్డును మరోసారి వినియోగించడం లేదని తెలుస్తోంది. దీంతో నేరగాళ్లందరినీ పట్టుకోవడం సాధ్యం కావడం లేదని సంజయ్ లాట్కర్ తెలిపారు. -
తొలి సైబర్ దాడి ఎప్పుడు జరిగింది?
జాతీయ కంప్యూటర్ భద్రతా దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబర్ 30న జరుపుకుంటారు. దీనిని ‘అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ డే’ అని కూడా అంటారు. సైబర్ బెదిరింపుల నుండి తమ కంప్యూటర్లు, వ్యక్తిగత డేటాను రక్షించుకోవడంపై అవగాహన కల్పించడమే కంప్యూటర్ భద్రతా దినోత్సవ లక్ష్యం. కంప్యూటర్ డే ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత, చరిత్రకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటర్నెట్, కంప్యూటర్ నెట్వర్క్లు అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 1988లో కంప్యూటర్ సెక్యూరిటీ డే ప్రారంభమైంది. అదేసమయంలో సైబర్ దాడులు, డేటా చోరీ కేసులు వెలుగు చూశాయి. 1988, నవంబర్ 2న కార్నెల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు కంప్యూటర్ సిస్టమ్లను ప్రభావితం చేసే రహస్య వైరస్ను గమనించారు. ఇది నాలుగు గంటల్లోనే పలు విశ్వవిద్యాలయ కంప్యూటర్ వ్యవస్థలను ప్రభావితం చేసింది. దీనికి 'మోరిస్ వార్మ్' అని పేరు పెట్టారు. అదే ఏడాది నవంబర్ 14న కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఈఐ) కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ)ని ఏర్పాటు చేసింది. అలాగే కంప్యూటర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నవంబర్ 30ని నేషనల్ కంప్యూటర్ సెక్యూరిటీ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు.కంప్యూటర్ సెక్యూరిటీ డే మనకు సైబర్ భద్రతను సీరియస్గా పరిగణించాలని గుర్తు చేస్తుంది. ఆన్లైన్ డేటాను సురక్షితంగా ఉంచడం ప్రతి వ్యక్తి , సంస్థ బాధ్యత. కంప్యూటర్ సెక్యూరిటీ కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలుసురక్షిత పాస్వర్డ్లు: బలమైన, అసాధారణమైన పాస్వర్డ్లను ఉపయోగించాలివైరస్, మాల్వేర్ నుంచి రక్షణ: ఉత్తమ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. దానిని క్రమం తప్పకుండా నవీకరించాలి.డేటా బ్యాకప్: ముఖ్యమైన డేటాను బ్యాకప్ చేయడం తప్పనిసరి.నెట్వర్క్ భద్రత: సురక్షిత నెట్వర్క్ కనెక్షన్, ఫైర్వాల్ని ఉపయోగించాలి.సాఫ్ట్వేర్ అప్డేట్: తాజా భద్రతా ప్యాచ్లతో అన్ని సాఫ్ట్వేర్లను అప్డేట్ చేస్తుండాలి. ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ -
విదేశాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్ఫాం ఇన్స్టామార్ట్లో షాపింగ్ చేసేందుకు, డైన్అవుట్ ద్వారా హోటల్స్లో టేబుల్స్ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. -
భారతీయులు ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్ ఏదంటే..
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. చాలామంది స్మార్ట్ఫోన్ యూజర్లు గంటల కొద్దీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్లలో కాలం గడిపేస్తున్నారు. సోషల్ మీడియా యూజర్లకు ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. అయితే ఇందులో ఎవరి అభిరుచులు వారివనే చెప్పాలి. కొందరు ఫేస్బుక్ ఎక్కువ ఉపయోగిస్తే.. మరికొందరు ఎక్స్ ఉపయోగిస్తారు. ఇలా ఎవరికి నచ్చిన యాప్స్ వారు ఉపయోగించుకుంటున్నారు.భారతదేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు వినోదం కోసం ఎక్కువ వేటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వే (మే-జులై) వెల్లడైంది. ఇందులో ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.►ఇన్స్టాగ్రామ్: 60.5 శాతం►ఫేస్బుక్: 52.1 శాతం►ఎక్స్ (ట్విటర్): 25.3 శాతం►జోష్: 5.7 శాతం►మోజ్: 5.7 శాతం►యూట్యూబ్: 61 శాతం►నెట్ఫ్లిక్స్: 40.2 శాతం►డిస్నీ ప్లస్ హాట్ స్టార్: 38.9 శాతం►ప్రైమ్ వీడియో: 37.1 శాతం►ఎంఎక్స్ ప్లేయర్: 14.9 శాతం►స్పాటిఫై: 31.8శాతం►అమెజాన్ మ్యూజిక్: 18.1 శాతం►జియో సావన్: 12.7 శాతం►గానా: 9.2 శాతం►గూగుల్ ప్లే మ్యూజిక్: 8.4 శాతం -
Turkey: ఇన్స్టాగ్రామ్ను బ్లాక్ చేసిన టర్కీ
ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచే టర్కీ తాజాగా ఇన్స్టాగ్రామ్ను బ్లాక్ చేసి హెడ్లైన్స్లో చోటుదక్కించుకుంది. అమెరికన్ కంపెనీ ఇన్స్టాగ్రామ్పై సెన్సార్షిప్ ఆరోపణలు చేస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నట్లు టర్కీ నేషనల్ కమ్యూనికేషన్స్ అథారిటీ పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ను ఆగస్టు 2 నుంచి బ్లాక్ చేస్తున్నట్లు బీటీకే కమ్యూనికేషన్స్ అథారిటీ తన వెబ్సైట్లో ఒక పోస్ట్లో వెల్లడించింది.టర్కీలోని వినియోగదారులు తమ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ను రిఫ్రెష్ చేయలేకపోయామంటూ ఎక్స్ ప్లాట్ఫారమ్లో ఫిర్యాదు చేశారు. కాగా టర్కీ ప్రెసిడెన్షియల్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఫహ్రెటిన్ ఆల్టున్.. మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్పై పలు ఆరోపణలు చేశారు. ‘హమాస్ అమరవీరుడు హనియాకు సంతాప సందేశాలను పోస్టు చేయకుండా యూజర్స్కు ఇన్స్టా ఇబ్బందులు కలిగించిందని’ పేర్కొన్నారు. కాగా టర్కీ అధికారులు సోషల్ మీడియా సైట్స్కు యాక్సెస్ను బ్లాక్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. దీనికిముందు 2017 ఏప్రిల్, 2020 జనవరి మధ్య దేశ అధ్యక్షుడు- ఉగ్రవాదం మధ్య సంబంధాలపై రాసిన రెండు కథనాల కారణంగా వికీపీడియాను టర్కీ బ్లాక్ చేసింది.హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా టెహ్రాన్లో హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఎవరు చేశారనే దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడికాలేదు. ఇతని మరణానికి 94 రోజుల ముందు, అతని ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు పాలస్తీనాలో హతమయ్యారు. "Turkey’s communications authority blocked access to the social media platform Instagram,” apparently because Instagram had removed "posts by Turkish users that expressed condolences over [Israel's] killing of Hamas political leader Ismail Haniyeh." https://t.co/Mc4pERy9j5— Kenneth Roth (@KenRoth) August 2, 2024 -
Mark Zuckerberg: భారత్లో మెటా థ్రెడ్స్ జోరు
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (ఇప్పుడు ఎక్స్)కు పోటీగా ఏడాది క్రితం ప్రవేశపెట్టిన థ్రెడ్స్ యాప్కి గణనీయంగా ఆదరణ లభిస్తోందని సోషల్ మీడియా దిగ్గజం మెటా తెలిపింది. అంతర్జాతీయంగా నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 17.5 కోట్లుగా ఉందని పేర్కొంది. క్రియాశీలక వినియోగదారులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని మెటా సీఈవో మార్క్ జూకర్బర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్లో ఎక్కువగా సినిమాలు, టీవీ, ఓటీటీ, సెలబ్రిటీలు, స్పోర్ట్స్కి సంబంధించిన కంటెంట్ ఉంటోందని మెటా వివరించింది. క్రికెట్లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఆకాశ్ చోప్రా మొదలైన వారు క్రియాశీలకంగా ఉంటున్నారని పేర్కొంది. టీ20 క్రికెట్ వరల్డ్ కప్, ఐపీఎల్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 మొదలైనవి హాట్ టాపిక్లుగా నిల్చాయని, 200 మంది పైచిలుకు క్రియేటర్లు ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్పై అప్డేట్స్ ఇచ్చారని వివరించింది. 2023 జూలైలో ప్రవేశపెట్టిన వారం రోజులకే 10 కోట్లకు పైగా యూజర్ సైనప్లతో థ్రెడ్స్ ఒక్కసారిగా ప్రాచుర్యంలోకి వచి్చంది. అయితే, క్రమంగా దానిపై యూజర్ల ఆసక్తి తగ్గుతూ వస్తోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
యూట్యూబ్లో అదిరిపోయే మరో ఫీచర్
యూట్యూబ్.. ఈ యాప్ గురించి తెలియనివారెవరూ ఉండరు. వినోదానికి కేరాఫ్ అడ్రస్గా మారిన యూట్యూబ్.. వినియోగదారులకు కావలసిన అన్ని రకాల సమాచారాలకు సంబంధించిన వీడియోలను ముందుకు తీసుకువస్తుంది. తాజాగా యూట్యూబ్లో మరో ఫీచర్ దర్శనవివ్వనుంది. అది యూజర్స్కు సరికొత్త అనుభూతిని అందిస్తుందనడంలో సందేహం లేదు. గూగుల్కు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్ఫారం యూట్యూబ్ ప్రతి స్మార్ట్ఫోన్లోనూ ఇన్స్టాల్ అయి ఉంటుంది. స్మార్ట్ఫోన్ వినియోగదారులు రోజులో కొంతసేపైనా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అత్యధిక వినియోగదారుల బేస్ కలిగిన యూట్యూబ్ మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు తరచూ నూతన ఫీచర్లను అందిస్తుంటుంది.త్వరలో యూట్యూబ్లో గూగుల్ లెన్స్ బటన్ యూజర్స్కు అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్ ఫోను వినియోగదారులు గూగుల్ లెన్స్ బటన్ ఉపయోగించడం ద్వారా టైప్ చేయడానికి బదులు ఏదైనా ఫొటో సాయంతో వీడియోలను శోధించవచ్చు. యూట్యూబ్ యాప్ అప్డేట్లో గూగుల్ లెన్స్ బటన్ కనిపించనుంది. ఇదే విధంగా యూట్యూబ్ యూజర్స్ ఫోనులోని మైక్రోఫోన్ బటన్ సహాయంతో, మాట రూపంలో సూచించడం ద్వారా కూడా తమకు కావలసిన వీడియోలను చూసే అవకాశం ఉంది. -
ఆర్థిక శాఖ ఆదేశాలు: పసిడి రుణాలను సమీక్షించుకోండి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న పసిడి రుణాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుండటంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇలాంటి పలు ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, ఈ నేపథ్యంలో బంగారం రుణాల పోర్ట్ఫోలియోను సమగ్రంగా సమీక్షించుకోవాలని పీఎస్యూ బ్యాంకులన్నింటికీ సూచించింది. ఈ మేరకు బ్యాంకుల చీఫ్లకు లేఖ రాసినట్లు ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. బంగారం రుణాలపై ఫీజులు.. వడ్డీల వసూళ్లు.. ఖాతాల మూసివేతలో అవకతవకలు జరుగుతుండటం, తగినంత విలువ గల బంగారాన్ని తనఖా పెట్టించుకోకుండానే రుణాలివ్వడం, నగదు రూపంలో రీపేమెంట్లు తీసుకోవడం తదితర ఉల్లంఘనలపై డీఎఫ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 31 వరకు మంజూరైన రుణాలపై సమీక్ష జరగనుంది. ఇవి చదవండి: ఈ–స్కూటర్కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్సైట్లోని ఎఫ్ఏక్యూ సెక్షన్ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది?
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక అంశాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఈకోవలో 2023లో అత్యధికంగా డిలీట్ చేసిన సోషల్ మీడియా యాప్ల జాబితా కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2023లో యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ల విషయానికొస్తే.. అమెరికన్ టెక్ సంస్థ టీఆర్జీ డేటాసెంటర్ నివేదిక ప్రకారం... అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే 100 మిలియన్ల (ఒక మిలియన్ అంటే 10 లక్షలు) వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్ యాప్.. ఆ తర్వాతి ఐదు రోజుల్లో 80 శాతం మంది వినియోగదారులను కోల్పోయింది. ఆ నివేదిక ప్రకారం 2023లో చాలా యాప్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది యూజర్స్ ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్స్టాగ్రామ్ యాప్ను 10,20,000 మందికి పైగా వినియోగదారులు డిలీట్ చేశారు. అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ల జాబితాలో రెండవ స్థానంలో స్నాప్చాట్ ఉంది. దీనిని 1,28,500 మంది డిలీట్ చేశారు. దీని తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్), టెలీగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్,యూట్యూబ్, వాట్సాప్, విచాట్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఏడాది 49 వేల మంది ఫేస్బుక్ యాప్ను తొలగించారు. వాట్సాప్ను తొలగించిన వినియోగదారుల సంఖ్య 4,950గా ఉంది. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
తిరుగులేని జియో.. భారీగా పెరిగిన యూజర్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కంపెనీ యూజర్ల సంఖ్య మరో 34.7 లక్షలు పెరిగి మొత్తం 44.92 కోట్లకు చేరింది. అటు పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ 13.2 లక్షలు పెరగ్గా వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.5 లక్షలు తగ్గారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 37.77 కోట్లుగా, వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ సంఖ్య 22.75 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 115 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య 63 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో సబ్స్క్రైబర్స్ సంఖ్య 52 కోట్లకు చేరింది. 88.5 కోట్లకు బ్రాడ్బ్యాండ్ యూజర్లు.. ట్రాయ్ గణాంకాల ప్రకారం మొత్తం బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆగస్టులో 87.65 కోట్లుగా ఉండగా సెప్టెంబర్ ఆఖరు నాటికి 88.5 కోట్లకు చేరింది. టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్ల మార్కెట్ వాటా 98.35 శాతంగా ఉంది. ఇందులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (45.89 కోట్లు), భారతి ఎయిర్టెల్ (25.75 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.65 కోట్లు), బీఎస్ఎన్ఎల్ (2.51 కోట్లు) ఉన్నాయి. -
ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ గురువారం మరోసారి డౌన్ అయింది. దీంతో సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు ఇబ్బందుల నెదుర్కొన్నారు. దీంతో సోషల్మీడియాలో వినియోగదారులు ఐఆర్సీటీసీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఐఆర్సీటీసీ కూడా ట్విటర్ ద్వారా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా తమ వెబ్సైట్ (నవంబర్ 23, గురువారం ) సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. (డీప్ఫేక్లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు) గురువారం ఉదయం 10 గంటల నుంచే సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది.. తత్కాల్ విండో ఓపెన్ కాగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా కేన్సిల్ చేయాల్సిన టికెట్లు కేన్సిల్ కాగా, తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ కాక యూజర్లు నానా అగచాట్లు పడ్డారు. దీంతో అధ్వాన్నమైన వెబ్ సైట్, దారుణమైన సేవలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IRCTC వెబ్సైట్ ద్వారా రేల్వే ప్రయాణికులు టిక్కెట్ల బుకింగ్ రైళ్ల స్థితిని తనిఖీ చేయడం, ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుతారు. E- ticket booking is temporarily affected due to technical reasons. Technical team is working on it and booking will made available soon. — IRCTC (@IRCTCofficial) November 23, 2023 -
వీల్ఛైర్ యూజర్లకు సరికొత్త కారు డిజైన్.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్
వీల్ఛైర్ వినియోగదారులు కారును ఉపయోగించడం ఇబ్బందితో కూడుకుని ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లు వారికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయలేదు కాబట్టి.. మరొకరి సహాయం అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వీల్ ఛైర్ వినియోగదారులు కారు ఉపయోగించే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వీడియో వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించింది. Super smart & super useful design. Would fill me with pride if our vehicles could offer these fitments. But it’s hard for an auto OEM engaged in mass production to do. Need a startup engaged in customisation. I would willingly invest in such a startup https://t.co/uoasAKjaZd — anand mahindra (@anandmahindra) November 10, 2023 "సూపర్ స్మార్ట్. ఉపయోగకరమైన డిజైన్. మా వాహనాలు ఈ ఫిట్మెంట్లను అందించగలిగితే నేను ఎంతో గర్వంగా భావిస్తాను. కానీ భారీ ఉత్పత్తిలో నిమగ్నమైన సంస్థలకు అలా చేయడం కష్టం. ఇందుకు స్టార్టప్ అవసరం. అలాంటి స్టార్టప్లకు నేను తప్పకుండా పెట్టుబడి పెడతాను." అని ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీల్ఛైర్ వాడేవారికి కూడా కొత్త డిజైన్లను తీసుకురావాలనే ఆలోచనపై హర్షం వ్యక్తం చేశారు. వీడియోలో చూపిన కారు డిజైన్ను ప్రశంసించారు. అలాంటి స్టార్టప్లు ముందుకు రావాలని కోరారు. వీల్ఛైర్ వినియోగదారులు కూడా ఎవరి సహాయం లేకుండా కారులో ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్ -
ఆయన చేతుల్లోకి వచ్చాకే ఇలా.. మస్క్ గాలి తీసేసిన సీఈవో!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోకి వచ్చాక డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) ఇటీవల జరిగిన వోక్స్ మీడియా కోడ్ 2023 ఈవెంట్లో పాల్గొన్న ఆమె సీఎన్బీసీ ఇంటర్వ్యూలో కంపెనీ గురించి ఆక్తికర గణాంకాలను తెలియజేశారు. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపూ తాను ఎక్స్లో కేవలం 12 వారాలు మాత్రమే ఉద్యోగంలో ఉన్నానని పదే పదే చెప్పుకొచ్చిన లిండా యాకరినో.. ఎలోన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ట్విటర్ రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు వెల్లడించారు. కంపెనీకి ప్రస్తుతం 225 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు చెప్పారు. మస్క్ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందున్న సంఖ్య కంటే 11.6 శాతం క్షీణించినట్లు తెలిపారు. మరోవైపు ఎలాన్ మస్క్ కూడా గతేడాది తాను టేకోవర్ చేయడానికి వారం ముందు ట్విటర్లో 254.5 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు అప్పట్లో వరుస ట్వీట్లు చేశారు. కాగా ఎక్స్ తమ డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్యను 245 మిలియన్లకు సవరించినట్లు ‘ది ఇన్ఫఫర్మేషన్’ అనే టెక్నాలజీ పబ్లికేషన్ ద్వారా తెలుస్తోంది. ఎక్స్కి ప్రస్తుతం 225 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని చెప్పిన లిండా అంతకుమందుకు నిర్దిష్ట సంఖ్య చెప్పకుండా 200 నుంచి 250 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారంటూ చూచాయిగా చెప్పారు. ‘మ్యాషబుల్’ నివేదిక ప్రకారం చూస్తే ముందు కంటే మస్క్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ట్విటర్ 3.7 శాతం డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. 2022 నవంబర్ మధ్యలో 259.4 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లను కలిగిన ట్విటర్.. ఆ తర్వాత దాదాపు 15 మిలియన్ల యూజర్లను కోల్పోయింది. ఇక మంత్లీ యాక్టివ్ యూజర్ల విషయానికి వస్తే ‘ఎక్స్’కి 550 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు లిండా యాకరినో తెలిపారు. అయితే 2024లో కంపెనీ లాభదాయకంగా ఉంటుందని కోడ్ కాన్ఫరెన్స్ వేదికపై అన్నారు. -
గూగుల్కు బిగ్ షాక్.. రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించాల్సిందే
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్కు భారీ షాక్ తగిలింది. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్, లొకేషన్లను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో.. టెక్ దిగ్గజం 93 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏయే యాప్స్ వాడుతున్నారు. మీకు ఎలాంటి ప్రొడక్ట్లంటే ఇష్టం ఇదిగో ఇలాంటి వివరాల్ని గూగుల్ మనకు తెలియకుండా.. మనల్ని ట్రాక్ చేస్తుంది. ఆ డేటాతో ఆయా ప్రాంతానికి సంబంధించిన సర్వీసుల్ని, కొత్త ప్రొడక్ట్లను, ఫీచర్లను అభివృద్ది చేస్తుంది. గూగుల్ చెప్పినట్లు చేయడం లేదు దీంతో పాటు, మీరేదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ గూగుల్ను ఓపెన్ చేసి అందులో మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారు. ఆ మరుక్షణమే మీరు ఏ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారో? ఆ ప్రొడక్ట్తో పాటు మిగిలిన ఉత్పత్తులు వివరాల్ని సైతం గూగుల్ మీకు అందిస్తుంది. ఇలా యూజర్లకు ఏం కావాలో.. వాటిని అందించి తద్వారా భారీ ఎత్తున లాభాల్ని గడిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గూగుల్ మాత్రం యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్ను డిసేబుల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయలేమని స్పష్టం చేస్తోంది. కానీ అలా చేయడం కుదరదని తెలుస్తోంది. గూగుల్పై రూ.7,000 కోట్ల దావా ఫైల్ ఈ తరుణంలో నిబంధనల్ని ఉల్లంఘించి యూజర్లను ట్రాక్ చేసి.. ఆ డేటా ద్వారా సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా ఫైల్ చేశారు. యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్ను డిసేబుల్ చేసుకోవచ్చని, అలా చేయడం వల్ల వ్యక్తిగత డేటా ను సేకరించకుండా నియంత్రించుకోవచ్చని చెబుతోంది. కానీ గూగుల్ అలా చేయడం లేదని, యూజర్లడేటాను సేకరిస్తుందని ఆరోపించారు. గూగుల్ తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల కదలికల్ని ట్రాక్ చేస్తూనే ఉంద’ని బోంటా తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదని, గూగుల్ అవలంభిస్తున్న తప్పుడు విధానాల కారణంగా పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫలితంగా గూగుల్ త్వరలో ఈ భారీ మొత్తం చెల్లించనుంది. 93 మిలియన్ డాలర్ల చెల్లింపులు తమపై వస్తున్న ఆరోపణల్ని గూగుల్ యాజమాన్యం అంగీకరించినట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆరోపణలకు పరిష్కార మార్గంగా 93 మిలియన్ డాలర్ల చెల్లింపులతో పాటు లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, లొకేషన్ డేటాను ట్రాక్ చేసే ముందు వారికి నోటిఫికేషన్లు ఇవ్వడం వంటి గణనీయ మార్పులు చేసేలా ఓ అంగీకారానికి వచ్చింది. గూగుల్ దారిలో మెటా యూజర్ల డేటాను అనుమతి లేకుండా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నది గూగుల్ మాత్రమే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, మార్క్ జుకర్ బర్గ నేతృత్వంలోని మెటా సైతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఐరోపాలోని ఫేస్బుక్ (మెటా) వినియోగదారుల నుండి సేకరించిన డేటాను యూఎస్కు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా 1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉🏻 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు -
అలా చేస్తే ముప్పే: యూజర్లకు యాపిల్ తీవ్ర హెచ్చరిక
Apple Warning: టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచి చార్జ్ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘైను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్లను ఉపయోగించడం లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్ చేయకూడదని సలహా ఇచ్చింది. కాగా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు చివరికి వాష్ రూంలో కూడా వదలకుండా ఫోన్ వాడటం ఇపుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. అంతేకాదు చార్జింగ్లో ఉన్నపుడు చాలాసార్లు ఫోన్ పేలిన ప్రమాదాల్లోప్రాణాల్లో కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే చూశాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగం ప్రమాదకరమనీ, సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఇప్పటికే పలు అధ్యయనం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఆరంభ శూరత్వం..ట్విటర్ దెబ్బకు చాప చుట్టేసిన ‘థ్రెడ్స్’!
ఆరంభంలో శూరత్వం అన్నట్టు.. ట్విటర్కు పోటీగా ఎదురైన కొన్ని రోజులకే థ్రెడ్స్ యూజర్ల విషయంలో చాప చుట్టేస్తున్నట్లు తెలుస్తోంది. రోజులు గడిచే కొద్ది యాక్టీవ్ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్.. థ్రెడ్స్ను యూజర్లకు పరిచయం చేసిన ప్రారంభంలో దాని రోజూ వారీ యూజర్లు 10 మిలియన్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. కానీ ఇటీవల విడుదలైన నివేదిక మాత్రం పూర్తి భిన్నంగా చూపిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. యాప్లో రోజువారీ యాక్టీవ్ యూజర్ల సంఖ్య వరుసగా రెండవ వారం పడిపోయింది. ఇప్పుడు 13 మిలియన్లకు చేరుకుంది. జూలై ప్రారంభంలో గరిష్ట స్థాయి నుండి 70 శాతం యూజర్లు తగ్గినట్లు సూచిస్తుంది. అదే సమయంలో ట్విటర్ రోజువారీ యాక్టీవ్ యూజర్లు 200 మిలియన్లు ఉన్నారు. దీంతో ట్విటర్కు గట్టి పోటీ ఇవ్వాలంటే థ్రెడ్స్కు భారీ ఎత్తున యూజర్లు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు సైన్ ఆప్ల విషయంలో మార్క్ జుకర్ బెర్గ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నారు. జులై 5న అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్ ప్రారంభం రోజుల్లో.. లాగిన్ అయ్యేందుకు యూజర్లు పోటెత్తేవారు. రాను రాను అలా సైన్ అప్ అయ్యే వారి సంఖ్య సైతం తగ్గింది. వినియోగదారుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తుంది. యూజర్ల సంఖ్య భారీగా పడిపోతున్నప్పటికీ మెటా యాజమాన్యం ట్విటర్కు పోటీ థ్రెడ్సేనన్న సంకేతాలిస్తుంది. యాప్ను పునరుద్ధరిస్తూ కొత్త ఫీచర్లను పరిచయం చేసేలా దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. అయినప్పటికీ, వినియోగదాలు తగ్గిపోకుండా ట్విటర్ ఎలాంటి ఫీచర్లను యూజర్లకు అందిస్తుందో.. థ్రెడ్స్ సైతం అవే ఫీచర్లను ఎనేబుల్ చేయాలని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
వాట్సాప్ కొత్త ఫీచర్ - భద్రతకు పెద్దపీట!
WhatsApp Phone Number Privacy: ఆధునిక కాలంలో కొత్త యాప్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) త్వరలో మరో అప్డేట్ అందుకోనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, వాట్సాప్ త్వరలో 'ఫోన్ నెంబర్ ప్రైవసీ' అనే లేటెస్ట్ ఫీచర్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ప్రైవసీ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే కాకుండా ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులో ఉంటుంది. అయితే వాట్సాప్ అప్డేటెడ్ బీటా యూజర్లకు మాత్రమే ఇది వర్తించే అవకాశం ఉందని సమాచారం. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. ఒక యూజర్ తన ఫోన్ నెంబర్ తెలియనివారికి కనిపించకుండా ఉండాలనుకున్నప్పుడు వాట్సాప్ సెట్టింగ్స్లో ఫోన్ నెంబర్ ప్రైవసీ అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సెలక్ట్ చేసుకున్నప్పుడు యూజర్ మొబైల్లో సేవ్ అయిన కారికి మాత్రమే కనిపిస్తుంది. ఇతరులకు కనిపించే అవకాశం లేదు. ఇది యూజర్ భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. -
ట్విటర్ను షేక్ చేస్తున్న మెటా కొత్త యాప్! గంటల వ్యవధిలో..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లక్షలు దాటుతున్న యూజర్లు.. నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్స్టాగ్రామ్కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు. పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 ఎలాన్ మస్క్ స్పందన.. మెటా థ్రెడ్స్ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్ను ఉద్దేశించి జుకర్బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
ట్విటర్లో సాంకేతిక సమస్యలు.. యూజర్ల గగ్గోలు
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లకు ట్విటర్ మొరాయించినట్లుగా ఆన్లైన్లో సాంకేతిక సమస్యలను సమీక్షించే వేదిక ‘డౌన్ డిటెక్టర్’ నివేదించింది. ‘డౌన్ డిటెక్టర్’ ప్రకారం.. భారత్లో 300 మందికి పైగా ట్విటర్ యూజర్లు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. 7 వేల మందికి పైగా యూజర్లు అవుట్టేజ్ ట్రాకర్ వెబ్సైట్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను నివేదించారు. సాంకేతిక సమస్యలపై యూజర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ట్విటర్లో #TwitterDown హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. యూజర్లు ఎవరికి తోచిన విధంగా వారు ఎలాన్ మస్క్ను తమ కామెంట్లతో ఆడేసుకున్నారు. "ఎలాన్ మస్క్ను ఎవరైనా నిద్రలేపి అతని 44 బిలియన్ డాలర్ల యాప్ పని చేయడం లేదని చెప్పండి!" అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. “ట్విటర్ డౌన్ అయిందా? ఇంకా ఎవరికైనా ఇదే సమస్య వచ్చిందా? కామెంట్ సెక్షన్ తెరవడం సాధ్యం కాలేదు" అని మరొక యూజర్ ట్వీట్ చేశారు. "నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ.... #TwitterDown" ఇంకొక యూజర్ పోస్ట్ చేశారు. “Sorry. You are rate limited. Please try again in a few minutes.” That’s what I’m getting now. 🙃 #TwitterDown — SamanthaM (@Sammy6170) July 1, 2023 Twitter Down now Elon Musk trying to fix the problem be like😅#TwitterDown pic.twitter.com/7OeWprN7CJ — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) March 1, 2023 Live footage of Elon at Twitter HQ trying to fix the rate limit exceeded debacle.#twitterdown pic.twitter.com/KtzqdRj9HH — Em (@emmasaurustex) July 1, 2023 -
గూగుల్ యూజర్లకు చేదు వార్త...
-
వాళ్ళ లక్ష్యం చాట్ GPT యూజర్స్ భయపెడుతున్న కొత్త మాల్ వేర్స్.!
-
యూజర్లకు గుడ్ న్యూస్: అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ వచ్చేసింది!
యూజర్లకు తీపికబురు చెప్పింది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను గురువారం దేశంలో ప్రారంభించింది. ఇప్పటివరకు దేశంలో కొంతమందికి టెస్టింగ్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును ఇపుడిక అందరికీ అందిస్తోంది. అంతేకాదు రెగ్యులర్ అమెజాన ప్రైమ్ వీడియో ప్లాన్ ఫీజు 1499రూపాయలతో పోలిస్తే ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ధర రూ. 999గా ఉండటం గమనార్హం. అంటే రూ. 500 తక్కువ. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్, ప్రయోజనాలు అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు యాక్సెస్ చేయాలనుకునే కస్టమర్లకు ఇది చీపెస్ట్ ఆప్షన్. అమెజాన్ వెబ్సైట్లో లేదా యాప్ ద్వారా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని అమెజాన్ ఆర్డర్లపై 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రైమ్ వీడియో మాదిరిగా గాకుండా ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్లో యాడ్స్ ఉంటాయి. ఈ ప్రకటనల వ్యవధి, ఫ్రీక్వెన్సీ వివరాలను పేర్కొన లేదు. కొన్ని పరిమితులతో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్తో పాటు, అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీల ఆప్షన్ను అందిస్తోంది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) అలాగే ప్రైమ్ లైట్ ప్లాన్లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండవు. అమెజాన్ ప్రైమ్ లైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంది. కాగా ఏడాది ప్రారంభంలో కొంతమంది వినియోగదారులతో ప్లాన్ను పరీక్షించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) -
జియో యూజర్లకు గుడ్న్యూస్: ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్, ఆఫర్లేంటో చూడండి!
సాక్షి, ముంబై: ముఖేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐదు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.269 -రూ. 789మధ్య వీటిని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆప్లాన్లలో జియో సావన్ ప్రో సబ్స్క్రిప్షన్ను కూడా పొందవచ్చు. కొత్త జియో ప్లాన్లలో అపరిమిత డేటా, యాడ్-ఫ్రీ మ్యూజిక్, లిమిట్లెస్ డౌన్లోడ్లు, అత్యుత్తమ ఆఫ్లైన్ మ్యూజిక్ క్వాలిటీ, JioSaavn సబ్స్క్రిప్షన్తో జియో టూన్స్ ఫీచర్లను యాక్సెస్ ఉంటుంది. ప్లాన్లు, ఆఫర్లు రూ. 269 ప్లాన్ :ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. అపరిమిత, ఉచిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5జీబీ డేటా, అలాగే రోజుకు 100SMSలు ఉచితం. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) రూ. 529 ప్లాన్ : రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS అందిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఇంకా Jio సూట్ యాప్లకు యాక్సెస్ ఉచిత Jio Saavn సబ్స్క్రిప్షన్ (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) రూ.589 ప్లాన్: 56 రోజుల వాలిడిటీతో వస్తున్న జియో రూ.589 ప్లాన్లో ప్రతిరోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS Jio సూట్ యాప్లకు ఉచిత యాక్సెస్ రూ.739 ప్లాన్: 84 రోజుల చెల్లుబాటు. రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 126 జీబీ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలు. రూ. 789 ప్లాన్: 84 రోజుల వాలిడిటీ. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. -
వారికి గుడ్న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!
సాక్షి,ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు మస్క్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపులను మొదలు పెడతామని మస్క్ తెలిపారు. అయితే ధృవీకరించబడిన వినియోగదారులను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నామని మస్క్ స్పష్టం చేశారు. ఈ చెల్లింపుల నిమిత్తం సుమారు రూ. 41.2 కోట్లు (5 మిలియన్ డాలర్లు) కేటాయించినట్టు తెలిపారు. మస్క్ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్ మాదిరిగా ట్వీపుల్ కూడా తమ కంటెంట్లో రిప్లై సెక్షన్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు సంపాదించవచ్చు. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) కాగా గత ఏడాది అక్టోబర్లో ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుండి, ప్రకటనదారులనుంచి పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది ట్విటర్. మరోవైపు ట్విటర్ సీఈవోగా అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ లిండా యాకారినో పదవి చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ప్రకటనల పరిశ్రమలో ఆమెకున్న విస్తృతమైన నేపథ్యం , సరికొత్త వ్యూహాలతో భారీ ఆదాయ సమకూరనుందని అంచనా. (డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!) In a few weeks, X/Twitter will start paying creators for ads served in their replies. First block payment totals $5M. Note, the creator must be verified and only ads served to verified users count. — Elon Musk (@elonmusk) June 9, 2023 -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్లు, మినీ గేమ్లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్స్టాల్ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్స్టాల్ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్ని ఇతర సోషల్మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చిన నెట్ ఫ్లెక్స్
-
ఫోన్పే యూజర్లకు బంపరాఫర్.. దేశంలోనే తొలిసారిగా..
Phonepe Link 2 Lakh Rupay Credit Cards To Upi : ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూజర్లు, వ్యాపారస్థులు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు’ అని ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డ్తో యూపీఐ టోటల్ పేమెంట్ వ్యాల్యూ (టీపీవీ) రూ. 150 కోట్ల వరకు చేరుకోగా.. తొలిసారి క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం తొలి సంస్థగా గుర్తింపు పొందింది. చెల్లింపు సమస్యలకు పరిష్కార మార్గంగా యూపీఐ నిర్వహణ సంస్థ ఎన్సీపీఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్ కార్డ్ను అందుబాటులోకి తెచ్చామని ఫోన్పే వెల్లడించింది. యూజర్లు, వ్యాపారులు రూపే క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు సూచించింది. దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చెంట్ అవుట్ లెట్లలో ఆమోదం పొందినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఫోన్పే యూపీఐ ద్వారా రూ.2లక్షల క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో చేతులు కలపడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అటు కస్టమర్లు, ఇటు వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని మరింత సులభతరం చేసేలా క్రెడిట్ కార్డ్ ఈకో సిస్టంను అభివృద్ధి చేయడం శుభపరిణామమని ఫోన్పే కన్జ్యూమర్ ప్లాట్ఫామ్ అండ్ పేమెంట్స్ వైస్ప్రెసిడెంట్ సోనికా చంద్రా తెలిపారు. చదవండి👉 చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
Apple iPhone 15 ప్రో మ్యాక్స్ కెమెరాపై భారీ అంచనాలు, మురిసిపోతున్న యూజర్లు
సాక్షి, ముంబై: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కొత్త ఐఫోన్ను లాంచ్ చేస్తోందటే చాలు.. మార్కెట్లో సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు గణనీయమైనమార్పులతో కొత్త సిరీస్లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ లవర్స్ను ఆకట్టుకుంటున్న యాపిల్ త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేయనుంది. దీంతో ఐఫోన్ సిరీస్ 15 ఫీచర్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. రోజుకొక కొత్త లీక్ ఐఫోన్ లవర్స్ను ఊరిస్తోంది. ముఖ్యంగా కెమెరా విషయంలో యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. తాజా నివేదికల ప్రకారం ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్లో పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్న కొత్త 48ఎంపీ సోనీ సెన్సార్ను వినియోగిస్తోందట. ఐస్ యూనివర్స్ అంచనా ప్రకారం, అధునాతన Sony IMX903 48MP యూనిట్ని ఇందులో ఉపయోగిస్తుంది. ఇటీవల లాంచైన షావోమి 13 అల్ట్రాలోని కెమెరాలానే ప్రధాన సెన్సార్ (సుమారం ఒక అంగుళం) ఉంటుందని టిప్పర్ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా గత ఏడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లు సక్సెస్ అయ్యాయి. యాపిల్ కంపెనీ డైనమిక్ ఐలాండ్ ,కెమెరా ఫీచర్లతో తీసుకొచ్చినట్టుగానే 15 సిరీస్ మోడల్స్లో కీలక మార్పులు ఉంటాయని అంచనాలు భారీగా నెకొలన్నాయి. 6x జూమ్కు మద్దతు ఇచ్చేపెరిస్కోప్ లెన్స్ ఫీచర్తో పవర్ఫుల్ కెమెరాతో వస్తున్న తొలి ఐఫోన్ కానుందని అంచనా. కొత్త టెక్నాలజీతో తీసుకొస్తుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుంది. The iPhone's main camera is improving every year, which is commendable, with 15pm approaching 1 ". iPhone 15 Pro Max :IMX903,≈1” iPhone 14 Pro:48MP, IMX803,1/1.28 iPhone 13 Pro:12MP,IMX703,1/1.63 iPhone 12 Pro:12MP, IMX603,1/1.78 iPhone 11 Pro:12MP, IMX503, 1/2.55 — Ice universe (@UniverseIce) April 23, 2023 -
నెట్ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు డేటా చోరీకి, ఆన్లైన్లో వినియోగదారులను మోసం చేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అధునాతన టెక్నిక్స్తో హ్యాకర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా నెట్ఫ్లిక్స్ స్కామ్ ఒకటి వెలుగులో వచ్చింది. హ్యాకర్లు ఫిషింగ్ ప్రచారం ద్వారా వినియోగదారుల చెల్లింపు వివరాలను చోరీ చేస్తున్నారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) నెట్ఫ్లిక్స్ స్కామ్ 2023 చెక్ పాయింట్ రీసెర్చ్ గుర్తించింది. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్లోని డేటా గ్రూప్ మేనేజర్ ఒమర్ డెంబిన్స్కీ, వీలైనంత ఎక్కువ మంది వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి హ్యాకర్లు ఫిషింగ్ ప్రయత్నాలను ప్లాన్ చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో, నెట్ఫ్లిక్స్ ఫిషింగ్ ప్రచారంలో ఎటాక్ చేసినట్టుగా గుర్తించింది. మరికొన్ని చెల్లింపు వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించాయని తెలిపింది. యూజర్ ఏదైనా ఒక పేమెంట్ చేసినపుడు హ్యాకర్లు చొరబడతారు. తదుపరి బిల్లింగ్ అపుడు నెట్ఫ్లిక్స్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడిందంటూ ఫేక్ ఐడీనుంచి ఇమెయిల్ వస్తుంది. అంతేకాదు సభ్యత్వాన్ని పునరుద్ధరించు కోండంటూ ఒక లింక్ను కూడా షేర్ చేస్తుంది. ఆ లింక్ను నమ్మి వివరాలు అందించారో వారి పని సులువు అవుతుంది. ఈ లింక్ వారి క్రెడిట్ కార్డ్ సమాచారం కోసం ఉద్దేశించిన మోసపూరిత వెబ్సైట్కి మళ్లించి మోసానికి పాల్పడతారు. బ్రాండ్ ఫిషింగ్ దాడులకు గురయ్యే వారిలో ఎక్కువ మంది టెక్-అవగాహన లేని వారేనని చెక్ పాయింట్ తెలిపింది. ఈనేపథ్యంలో అయాచిత ఇమెయిల్స్ లేదా సందేశాలను స్వీకరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ సూచించింది.ముఖ్యంగా అక్షరదోషాలు, తప్పుగా వ్రాసిన వెబ్సైట్లు, సరికాని తేదీలు ,మోసపూరిత ఇమెయిల్ లేదా లింక్ను సూచించే ఇతర కారకాలు వంటి ప్రమాద సంకేతాలను గుర్తించాలని ఇందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని డెంబిన్స్కీ సలహా ఇచ్చారు. డిసెంబర్ 2022లో, ముంబైకి చెందిన 74 ఏళ్ల వ్యక్తి తన నెట్ఫ్లిక్స్ ఖాతాను పునఃప్రారంభించే ప్రయత్నంలో 1,200 డాలర్లను కోల్పోయాడనీ పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి లేదా సబ్స్క్రిప్షన్ను పునరుద్ధరించడానికి వినియోగదారుని అభ్యర్థించే ఇమెయిల్ మూలాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలని హెచ్చరించింది. తాజా పరిణామంపై నెట్ఫ్లిక్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. (Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) ఎలా గుర్తించాలి ఆన్లైన్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఎల్లప్పుడూ పంపినవారి గుర్తింపును ధృవీకచుకోవాలి. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి ముందు వెబ్సైట్ URLని తనిఖీ చేయాలి. యాంటీ-ఫిషింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. తాజా భద్రతా ప్యాచ్లతో అప్డేట్ చేయడం ద్వారా ఫిషింగ్ దాడులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సైబర్ నేరగాళ్లకి అవకాశం ఇవ్వకుండా నిరంతరం అప్రతమత్తంగా ఉండాలి. -
ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!
న్యూఢిల్లీ:సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విటర్ యూజర్లకు మరో ఎదురు దెబ్బ. ఇప్పటికే బ్లూటిక్ పోవడంతో హతాశులైన యూజర్లు చాలామందికి ఇపుడిక ట్విటర్ లోడ్ కూడా కావడం లేదు. ప్రస్తుతం చాలామంది వినియోగదారులకు మైక్రో బ్లాగింగ్ సేవలు అందుబాటులో లేవు. ప్రధానంగా డెస్క్టాప్ యూజర్లకు ‘దిస్ పేజ్ ఈజ్ డౌన్’ అనే సందేశం కనిపిస్తోంది. అయితే తొందరలోనే లోపాన్ని సవరిస్తామనే మెసేజ్ దర్శనమిస్తోంది. దీంతో ట్విటర్ మీకు పనిచేస్తోందా అంటూ నెటిజన్లు తెగ ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్! ట్విటర్-డౌన్ ట్విటర యాప్ లేదా వెబ్సైట్ (డెస్క్టాప్, మొబైల్ రెండూ)చాలావరకు పని చేయలేదు. మొబైల్ సైట్ని యాక్సెస్ చేసినప్పుడు, ప్రస్తుతం ‘మీ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ సైట్ని చేరుకోవడం సాధ్యం కాదు’ అని లాంటి మెసేజెస్ కనిపించింది. ఈ సమస్య ఎంత విస్తృతంగా వ్యాపించిందనే దాని గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు, అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీకి ఎంత సమయం పడుతుంది అనే దానిపై కూడా స్పష్టత లేదు. కాగా శుక్రవారం ఉదయం నుంచి సెలబ్రిటీలకు బ్లూటిక్ తీసివేయడంతో కలకలం రేగింది. దీంతో యూజర్లు జోక్స్, మీమ్స్తో ట్విటర్పై విమర్శలు గుప్పిస్తున్నారు. Elon Musk be like.#BlueTick pic.twitter.com/hlB9NxDKgd — Farhan Khan (@babarazam215) April 21, 2023 ట్విటర్ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత చేసిన పలు మార్పుల్లో భాగంగా బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్లూటిక్ కావాలనుకునే యూజర్లు బ్లూటిక్ కోసం నెలవారీ రుసుము చెల్లించాలి. -
నిలిచిపోయిన నెట్ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ ప్రసారాలు ఆదివారం (ఏప్రిల్ 16) కొంత మంది సబ్స్క్రయిబర్లకు నిలిచిపోయాయి. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ Downdetector.com ప్రకారం.. ఆదివారం సాయంత్రం యునైటెడ్ స్టేట్స్లో 11,000 కంటే ఎక్కువ మంది యూజర్లకు నెట్ఫ్లిక్స్ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడింది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5 గంటలకు తలెత్తిన అంతరాయం 6.49 గంటలకు ముగిసింది. దీంతో ‘లవ్ ఈజ్ బ్లైండ్: ది లైవ్ రీయూనియన్’ స్ట్రీమింగ్ ఆలస్యం అయింది. వెనెస్, నిక్ లాచీ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం లాస్ ఏంజెల్స్ నుంచి సాయంత్రం 5 గంటలకు ( భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30) ప్రారంభం కావాల్సిఉంది. ఈ షో కోసం సబ్స్క్రయిబర్లు ప్రారంభ సమయానికి 10 నిమిషాల ముందే నుంచి వేచిఉన్నారు. ఇంతలో అంతరాయం తలెత్తడంతో ఒక గంటకు పైగా యూజర్లు వేచిఉన్నారు. ఈ కార్యక్రమ ప్రసారం చివరకు సాయంత్రం 6:16 (పసిఫిక్ కాలమానం) గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా మేల్కొన్న నెట్ఫ్లిక్స్ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. లవ్ ఈజ్ బ్లైండ్ లైవ్ రీయూనియన్ షో స్ట్రీమింగ్ ఆలస్యమైనందుకు చింతిస్తున్నామంటూ సాయంత్రం 6:29 గంటల (పసిఫిక్ కాలమానం) సమయంలో ట్వీట్ చేసింది. -
గూగుల్ పే 88 వేల క్యాష్ బ్యాక్...
-
పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్ కొత్త ఫీచర్లు వచ్చేశాయ్...క్యాష్ బ్యాక్ కూడా!
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్ చేసింది పిన్ లేకుండానే చెల్లింపులు చేసేలా పేటీఎం యాప్లో యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. దీంతో పేటీఎం యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చు. తద్వారా పేటీఎం వినియోగ దారులు కేవలం ఒక్క ట్యాప్తో రూ. 200 వరకు వేగంగా లావాదేవీలు చేయవచ్చు. రోజుకు రెండుసార్లు రూ. 2వేల వరకు లావాదేవీచేయవచ్చు. అంటే గరిష్ట పరిమితి రూ. 4 వేలు. నమ్మశక్యం కాని వేగంతో అనేక చిన్న యూపీఐ లావాదేవీలకు వీలు కల్పిస్తుందని, ఇలాంటి సౌకర్యాన్ని అందిస్తున్న ఏకైక ప్లాట్ఫారమ్ తమదేనని పేటీఎం పేర్కొంది. ఏ బ్యాంకుల యూజర్లకు ఈ సేవలు వర్తిస్తాయి కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్తో సహా తొమ్మిది బ్యాంకులు ప్రస్తుతం పేటీఎం లైట్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నాయి. లావాదేవీల్లో ఎలాంటి గందరగోళం లేకుండా బ్యాంకునుంచి ఎస్ఎంఎస్, పేమెంట్స్ హిస్టరీ కూడా ఉంటుందని తెలిపింది. యూపీఐ లైట్ని యాక్టివేట్ చేసిన వినియోగదారులకు రూ. 100 క్యాష్బ్యాక్ను అందిస్తోంది. డ్రైవ్ అడాప్షన్కు బ్యాలెన్స్గా రూ. 1,000 జోడిస్తుంది. క్యాన్సిల్ ప్రొటెక్ట్ ఫీచర్ ఈ ఫీచర్ భారతదేశంలోని ప్రజలకు డిజిటల్ చెల్లింపులను,అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. తాజాగా తన యాప్లో ‘క్యాన్సిల్ ప్రొటెక్ట్’ అనే కొత్త ఫీచర్ను కూడా ప్రవేశపెట్టింది. దీనిద్వారా విమాన, బస్సు టిక్కెట్ల క్యాన్సిలేషన్పై 100 శాతం రీఫండ్ అందిస్తుంది. టికెట్ల క్యాన్సిల్ ప్రొటెక్ట్ కోసం కస్టమర్నుండి విమాన టికెట్ల బుకింగ్పై రూ. 149, బస్ టిక్కెట్లకు రూ. 25 వసూలు చేస్తుంది. తద్వారా షెడ్యూల్ సమయానికి కనీసం 24 గంటల ముందు షెడ్యూల్ చేసిన బయలుదేరే సమయానికి కనీసం నాలుగు గంటల ముందు క్యాన్సిల్ చేసిన బస్ టికెట్లపై 'క్యాన్సిల్ ప్రొటెక్ట్'తో 100 శాతం వాపసు క్లెయిమ్ చేయవచ్చు. క్యాన్సిల్ చేసుకున్న తక్షణమే సంబంధిత ఖాతాలోకి నగదు జమ అవుతుంది. Very proud of launching with @UPI_NPCI our latest in commitment to payments that are scalable and never fail. Upgrade your UPI experience by switching to @Paytm App ! Here payments never fail, tx are super fast and you don’t see clutter in your bank statement! All this 🚀🚀 pic.twitter.com/c1tr7J4V3A — Vijay Shekhar Sharma (@vijayshekhar) February 24, 2023 -
మరోసారి ట్విటర్ సర్వర్ డౌన్.. షాకింగ్ లిమిట్స్ తెలుసా?
సాక్షి,ముంబై: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విటర్ సర్వర్ మరోసారి డౌన్ అయ్యింది. దీంతో వినియోగదారులు తమ అకౌంట్లను లాగిన్ చేయలేక ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు ట్వీట్ డెక్ సైతం పని చేయలేదంటూ సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి మైక్రోబ్లాగింగ్ సైట్లో పలు సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా ట్వీట్ చేయలేక పోవడం, ప్రత్యక్ష సందేశాలు పంపడం లేదా ప్లాట్ఫారమ్లో కొత్త ఖాతాలను అనుసరించడం వంటివి చేయలేకపోయారు. కొత్త ట్వీట్లను పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది వినియోగ దారులు "మీరు ట్వీట్లను పంపడానికి రోజువారీ పరిమితిని మించిపోయారు" అని పాప్-అప్ సందేశం రావడం గందరగోళానికి దారి తీసింది. ట్విటర్ కొత్త లిమిట్స్ - రోజుకు 2,400 ట్వీట్లు - రోజుకు 500 ప్రత్యక్ష సందేశాలు (డైరెక్ట్ మెసేజెస్) - కేవలం 5,000 ఫాలోవర్లకు అనుమతి - రోజుకు 400 కొత్త ఖాతాల ఫాలోయింగ్కు అనుమతి బిలియనీర్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ట్విటర్ కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తిగత , వ్యాపార ఖాతాలను ఆపరేట్ చేసే వినియోగదారులు "ట్వీట్లు పంపడానికి రోజువారీ పరిమితిని" ఉంటుంది. హెల్ప్ పేజీ సైట్ సమాచారం ప్రకారం ట్విటర్ కొంత ఒత్తిడిని తగ్గించడానికి,సర్వర్ డౌన్, ఎర్రర్ పేజీలను తగ్గింపు ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. బ్లూ టిక్ బాదుడు షురూ: భారతదేశంలో ట్విటర్ బ్లూ ప్లాన్ లాంచ్ చేసింది. ఇండియా యూజర్లు నెలకు బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ రూ.900 ప్రారంభం. కాగా ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు తరువాత గతేడాదిలో పలుమార్లు సర్వర్ డౌన్, సాంకేతిక సమస్యలతో యూజర్లు ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే. -
ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగం పెరిగుతున్నకొద్దీ టెలికం టారిఫ్ ధరలు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు టారిఫ్ ధరల్ని పెంచే యోచనలో ఉండగా.. తాజాగా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ను భారీగా పెంచింది. కొద్దిరోజుల క్రితం ఎయిర్టెల్ సీఈవో సునిల్ మిట్టల్ మాట్లాడుతూ ప్రతి యూజర్పై సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) నెలకు రూ.300కి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెలికాం కంపెనీలు ఏఆర్పీయూని నెలకు 300 రూపాయలకు పెంచినప్పటికీ, వినియోగదారులు తక్కువ ధరలోనే నెలకు 60జీబీ డేటాను వినియోగిస్తున్నందున ప్రజలకు పెద్దగా ఇబ్బంది ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తాజాగా అన్లిమిటెడ్ ప్యాక్స్లో కనీస రీచార్జ్ ధరను రూ.155కు చేర్చింది. అంతకు మునుపు అదే అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.99గా ఉంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది సర్కిళ్లలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్యాక్ కాలపరిమితి 24 రోజులు.1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఉచితం. రూ.99 రీచార్జ్ ప్లాన్ను ఎయిర్టెల్ నిలిపివేసింది. ఎయిర్టెల్ బాటలో మరికొన్ని కంపెనీలు పెరిగిన ధరల కారణంగా యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం అర్ధం. ఇప్పుడు అదే ఆదాయం క్యూ2 నాటికి ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.190, రిలయన్స్ జియో సగటు ఆదాయం ఒక్కో వినియోగదారుకు రూ.177.2 అని చెబుతోంది. వొడాఫోన్-ఐడియా అత్యల్పంగా ఉంది. అదే త్రైమాసికంలో ఇది రూ. 131గా నివేదించబడింది. ఎయిర్టెల్తో పోల్చితే వీఐ, జియో ఏఆర్పీయూ రూ. 300కి చేరుకోవడం కొంచెం కష్టమే. ధరల పెంపు సాధారణంగా అదే శాతంలో ఉంటుంది కాబట్టి కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచితే ఎయిర్టెల్ ముందుగా పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లుగానే ఎయిర్టెల్ అన్లిమిటెడ్ ప్యాక్స్లో కనీస రీచార్జ్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
ఇన్స్టాగ్రామ్లో 2022 రీక్యాప్.. రీల్స్ ట్యాబ్లోకి వెళ్లి..
ఇన్స్టాగ్రామ్ ‘2022 రీక్యాప్’ టెంప్లెట్లను తీసుకువచ్చింది. కొన్ని వారాల పాటు ఇవి యూజర్స్కు అందుబాటులో ఉంటాయి. ఈ టెంప్లెట్తో ఈ సంవత్సరానికి సంబంధించిన చిరస్మరణీయ దృశ్యాలను షేర్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరంలో మన ఫెవరెట్ ఫొటోలు, వీడియోలను ‘2022 రీక్యాప్ రీల్’ హైలెట్ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీకు ఇష్టమైన వాటిని ‘రీ క్యాప్’ చేసేసుకోండి. దీని కోసం... 1. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రీన్ బాటమ్లోని ప్లేబటన్ ఐకాన్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా రీల్స్ ట్యాబ్లోకి వెళ్లాలి 2. న్యూ రీల్ క్రియేట్ చేయడానికి స్క్రీన్ టాప్ రైట్ కార్నర్లోని కెమెరా ఐకాన్ను సెలెక్ట్ చేసుకోవాలి 3. రీల్ క్రియేషన్ టూల్స్ ఓపెన్ అయిన తరువాత స్క్రీన్ బాటమ్లో నచ్చిన టెంప్లెట్ను ఎంపిక చేసుకోవాలి 4. స్క్రీన్ బాటమ్లోని యూజ్ టెంప్లెట్ బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేయండి: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్: ‘సీక్రెట్’ ఫీచర్ ఒక్కసారే! -
వీకెండ్ పార్టీలకు వెళ్తున్నారా? మోసగాళ్లు తొలుత ఏం చేస్తారో తెలుసా?
వీకెండ్ వస్తుందంటేనే చాలామందిలో ఒక జోష్ వస్తుంది. ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నాం. కుటుంబంతో కలిసి పిక్నిక్లకు వెళ్లాం.. అంటూ ఆ ఫొటోలను సోషల్మీడియాలో షేర్ చేసి ఆనందాన్ని పంచుకుంటాం. వాటికి వచ్చిన లైక్స్, కామెంట్స్ చూసి మురిసిపోతుంటాం. ఇలాంటి వీకెండ్ పార్టీ జాబితా మీద నిఘా వేసే మోసగాళ్లు డిజిటల్లో పొంచి ఉన్నారు జాగ్రత్త. డిజటల్ మోసగాడి లక్ష్యం ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్ను అనుకరిస్తూ వారి పేరిట నకిలీ అకౌంట్స్ను సృష్టించడం. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, నటీనటులు, కంపెనీ అధినేతలు, ప్రముఖుల అకౌంట్స్ ఉండే అవకాశాలే ఎక్కువ. నకిలీ అకౌంట్స్తో మోసం చేసేవారు అన్ని ఆన్లైన్ సామాజిక ప్లాట్ఫారమ్లలో కనిపిస్తారు. వీరిలో చాలా మంది ప్రమాదకారులు కానప్పటికీ, పరువు నష్టం లేదా విరాళాలు అడగడం/ రుణాలు కోరడం/ కనెక్ట్ అయిన వెంటనే డబ్బు దోపిడీ చేయడం .. వంటి వాటిపై దృష్టి సారించే వారున్నారు. ముందే ప్లాన్ డిజిటల్ మోసగాళ్లు ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం ఏ మాత్రం నమ్మదగని కంటెంట్ను సృష్టిస్తారు. బాధితులు లేదా ఇతర హెల్త్ కేర్ ప్రొవైడర్స్ నుండి సమాచారాన్ని దొంగిలించడానికి టెలిఫోన్ స్కామర్లు ఎన్సిబి, ఇతర డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లలాగా నటించే విస్తృత మోసపు పథకాలు రిలీజ్ చేస్తుంటారు. ముఖ్యంగా వీక్ ఎండ్ పార్టీ కల్చర్ ఉన్న ఆన్లైన్ వినియోగదారులకు ఈ విధమైన కాల్స్ చేస్తుంటారు. స్కామర్లు నకిలీ పేర్లు, ప్రసిద్ధ డ్రగ్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు లేదా అసలు విభాగాలలోని పోలీసు అధికారుల పేర్లను కూడా ఉపయోగిస్తారు. ప్రధానమైన ఎంపిక వైద్యపరమైన సమస్యలు, విడాకులు, కొత్త ఉద్యోగం, పార్టీల అవగాహన, గేమింగ్, కొనుగోళ్లు చేయాలనుకునేవారు, లైఫ్ స్టైల్ అవగాహన, టెక్నాలజీ, ట్రావెల్, స్పోర్ట్స్.. వంటి టాపిక్స్ గురించి చర్చించే సామాజిక ప్రొఫైల్స్ను మోసగాళ్లు ఎంచుకుంటారు. మోసగాళ్ల సాధారణ లక్షణాలు ♦దాడి చేసేవారి మాటల్లో వేగం ఉంటుంది. దీనిని గమనించి బాదితులు వెంటనే అలర్ట్ అవ్వచ్చు. ♦డబ్బుకు సంబంధించి ధ్రువీకరణ పొందడానికి ఊహించని రిక్వెస్ట్లు పంపుతారు. ఇది ఇ–మెయిల్స్కు ఎక్కువ. ♦స్కామర్లు తరచుగా ‘ప్రైవేట్, గోప్యమైన, రహస్య‘ పదాలను ఉపయోగిస్తారు, ♦చాలాసార్లు స్కామర్లు మీ ఇన్ బాక్స్లోకి ప్రవేశించడానికి ఇ మెయిల్ స్పూఫింగ్ లేదా ఒకేలా కనిపించే ఇమెయిల్ను ఉపయోగిస్తారు. ఇటీవలి కొత్త దాడులు ♦మోసగాళ్లు దొంగిలించిన ఉన్నతాధికారుల ఖాతాలను ఉపయోగించి ఆన్ లైన్ లో నకిలీ ఖాతాను సృష్టిస్తున్నారు. మోసగాళ్ళు వారి డిజిటల్ ప్రొఫైల్ (ఈ్క)ని ఎన్ ఫోర్స్మెంట్ అధికారి లేదా సీనియర్ బ్యూరోక్రాట్ చిత్రంతో సృష్టిస్తారు. స్కామర్ ఆ ఎన్ ఫోర్స్మెంట్ ఆఫీసర్ లేదా బ్యూరోక్రాట్గా నటించి వారి బృందాలకు వాట్సప్ సందేశాలను పంపుతాడు. ♦వారు వారాంతపు పార్టీపై అవగాహన ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటారు. మొత్తం డేటా సోషల్ మీడియా పోర్టల్ల నుండి సేకరిస్తారు. ♦స్కామర్ల కథనాలు కొద్దిగా మారవచ్చు కూడా. సాధారణంగా, వారు చట్టవిరుద్ధమైన డ్రగ్స్తో ప్యాక్ చేసిన పార్శిల్ను స్వాధీనం చేసుకున్నట్లు మీకు చెప్తారు. ఇది బాధితుల పేరుతో కొరియర్ చేయబడింది, లేదా అక్రమ మాదకద్రవ్యాలతో చేసిన ప్యాక్ను స్వాధీనం చేసుకున్నట్టు, కొరియర్కు సంబంధించిన సమాచారాన్ని కూడా సృష్టిస్తారు. అంతేకాదు, మాదకద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కోసం బాధితుడిని అరెస్టు చేయబోతున్నారని బెదిరించడం. ♦బాధితులు వారి ఇ మెయిల్లు, వాట్సాప్ సంభాషణలకు సరిగ్గా స్పందించకపోతే, స్కామర్లు మొత్తాలను చెల్లించనందుకు అరెస్టు చేయడానికి లా ఎన్ఫోర్స్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలుగా నటిస్తూ నకిలీ నోటీసులు పంపడం ద్వారా బాధితుడిని బెదిరించడం ప్రారంభిస్తారు. బాధితురాలికి బకాయిపడిన మొత్తంపై అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ♦దోపిడీలో భాగంగా, బాధితుడు తమకు చెల్లింపుగా డబ్బును బదిలీ చేయడానికి లేదా బాధితుడు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాడని నిరూపించడానికి నకిలీ అధికారి పైన పేర్కొన్న కారణాన్ని చూపుతాడు. UPIని ఉపయోగించి డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని చెబుతారు. సోషల్ మీడియాలో మోసం జరిగితే.. Instagramలో అయితే https://help.instagram.com/ 370054663112398 YouTubeలో అయితే https://support.google.com/youtube/answer/2801947?hl=en Facebookలో అయితే https://www.facebook.com/ help/contact/169486816475808 LinkedInలో అయితే https://www.linkedin.com/ help/linkedin/answer/61664/reporting-fake-profiles?lang=en రిపోర్ట్ చేయవచ్చు సైబర్ క్రైమ్ పోర్టల్... పరిస్థితి తీవ్రతను బట్టి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.inలో రిపోర్ట్ చేయచ్చు. మోసం చేయడానికి రకరకాల వేషాలు వేయడం, పరువు తీయడం లేదా మోసం చేయడం లేదా మోసం చేయాలనే ఉద్దేశ్యంతో తప్పుడు గుర్తింపు ఉండటం.. వంటివి నేరంగా ఈ పోర్టల్లో ఉంటుంది. మోసగాళ్ల బారిన పడకుండా.. ♦మీ ఖాతాలకు ప్రత్యేక, ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలతో సంక్లిష్టమైన పాస్వర్డ్లను ఉపయోగించండి ♦(2FA) రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి. ♦లాక్/ గార్డ్ వంటివి మీ ప్రొఫైల్ ఫీచర్లకు ఉపయోగించండి. ♦సమాచార భాగస్వామ్యాన్ని నియంత్రించడానికి మీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల కోసం గోప్యతా సెట్టింగ్లను కాన్ఫిగర్ చేయండి ♦సామాజిక ప్లాట్ఫారమ్లలో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు ♦అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయడం మానుకోండి, https://isitphishing.org/తో లింక్ను ధృవీకరించండి. ♦నిజ జీవితంలో మీకు తెలిసిన, విశ్వసించే వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ♦ఆఫ్లైన్– ఆన్లైన్ అందరినీ ఒకే విధంగా పరిగణించాలి. ♦మీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల కోసం GPS లొకేషన్ ఫీచర్కి యాక్సెస్ ఆపేయండి. ♦మీ ఆర్థిక లావాదేవీలను ఉపయోగించే సమయాల్లో రిక్వెస్ట్ చేయడం, రిప్లై ఇవ్వడం వంటివి చేసే ముందు మీ ఇమెయిల్ హెడర్లను కూడా చెక్ చేయడం అలవాటు చేసుకోండి. -
ఇలానే కొనసాగితే ఫోనూ పాడవుతుంది.. అసలు కారణం ఇదే..!
సాక్షి, అమరావతి: శ్రీముఖి తన తల్లితో మాట్లాడాలని ఫోన్ చేసింది. తల్లి పార్వతమ్మ లిఫ్ట్ చేసింది. హలో.. హలో.. అన్నా అవతలి నుంచి సమాధానం లేదు. హలో వినిపిస్తుందా అని శ్రీముఖి అడుగుతోందే తప్ప అవతలి నుంచి శబ్దం రాదు. ఆ కాసేపటికే కాల్ కట్ అయింది. వెంకటేశ్వర్లు తన తమ్ముడితో అత్యవసరంగా మాట్లాడాలని తన మొబైల్ నుంచి ఫోన్ చేశాడు. ఒకసారి, రెండుసార్లు.. మూడు సార్లు.. ఇలా చాలా సార్లు కాల్ చేస్తే ఒక్క కాల్ కలిసింది. ఇవి ప్రస్తుతం దేశంలో ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు. ఫోన్ చేస్తే కాల్ కలవదు. ఒకవేళ కలిసినా వెంటనే కట్ అవుతుంది. కాల్లో ఉండగానే వాయిస్ బ్రేకింగ్.. ఒక్క కాల్ మాట్లాడటానికి మూడు, నాలుగుసార్లు డయల్ చేయాలి. సిగ్నల్స్ ఉన్నా ఒక్కోసారి ఫోన్ను ఫ్లైట్ మోడ్/స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తేగాని కాల్ వెళ్లని పరిస్థితి. ప్రస్తుతం టెలికాం రంగంలో ‘కాల్ డ్రాప్’, ‘కాల్ కనెక్షన్’ పెద్ద సమస్యగా మారింది. మిగతా దేశాలతో పోలిస్తే దేశంలోనే కాల్ డ్రాప్ రేటు ఎక్కువగా ఉంది. సాంకేతికత 2జీ నుంచి 4జీకి వచ్చినప్పటికీ సిగ్నల్ లెవల్స్ పరిధి తగ్గుతోంది. గతంతో పోలిస్తే ఒక టవర్ సిగ్నల్ పరిధి 10వ వంతుకు తగ్గిపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.50 లక్షల మొబైల్ నెట్వర్క్ టవర్లు ఉన్నాయి. అయినా సమస్య పరిష్కారమవలేదు. కొత్త సాంకేతికతతో పాటు మరో లక్ష టవర్లు అందుబాటులోకి వస్తే తప్ప నెట్వర్క్ నాణ్యత మెరుగుపడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వినియోగదారులు కాల్ డ్రాప్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే వినియోగదారులు ప్రస్తుతం ఉన్న టారిఫ్లకే పరిమితమవుతారని, ఎక్కువ వెచ్చించి 5జీ వంటి కొత్త టారిఫ్లకు వెళ్లేందుకు ఇష్టపడరని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ త్వరగా అయిపోతుంది భారత టెలికాం మార్కెట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మార్కెట్. ప్రస్తుతం దేశంలో 1.1 బిలియన్ మొబైల్ కనెక్షన్లు ఉన్నాయి. టెలికాం కంపెనీలు ట్రాయ్ నిర్దేశించిన బెంచ్మార్క్ను అందుకోలేక΄ోవడంతోనే అధిక కాల్ డ్రాప్స్ తలెత్తుతున్నాయి. సిగ్నలింగ్ కవరేజీ క్షీణించడం వల్ల హ్యాండ్సెట్ అధిక శక్తితో పని చేయాల్సి ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ వేగంగా అయిపోవడంతో పాటటు ఫోన్ కూడా త్వరగా పాడవుతుంది. ఈ నేపథ్యంలోనే కాల్ డ్రాప్ సమస్యపై వినియోగదారుల నుంచి కచ్చితమైన అభిప్రాయ సేకరణకు.. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా ‘ట్రాయ్మై కాల్’ వాయిస్ కాల్ క్వాలిటీ మానిటరింగ్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు కాల్ పూర్తి చేసిన తర్వాత తమ అభిప్రాయాన్ని అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ సమాచారంతో టెలికాం సర్కిల్ నెట్వర్క్ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు వీలవుతుంది. పెరిగిన డేటా, వైఫై కాల్స్ ఆన్లైన్ ఫ్లాట్ఫాం లోకల్ సర్కిల్స్ దేశంలో 339 జిల్లాల్లో చేసిన సర్వే ప్రకారం 91 శాతం మంది కాల్ డ్రాప్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తేలింది. ఇందులో 56 శాతం మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు వినియోగదారులు డేటా, వైఫై ఆధారిత కాల్స్కు వెళ్తున్నారు. ఈ తరహా కాల్స్ 2019లో 75 శాతం ఉంటే ఇప్పుడు 82 శాతానికి పెరిగాయి. దేశంలో 0 నుంచి 3 సెకన్లలోపు కాల్ డ్రాపింగ్ శాతం పెరిగింది. నిమిషంలోపు డ్రాపింగ్ శాతం తగ్గింది. 5జీపై అనాసక్తత సాంకేతికతలో ఎంత మార్పులు వచ్చినప్పటికీ కాల్ డ్రాప్ సమస్యలు తగ్గక΄ోవడంతో మొబైల్ నెట్వర్క్ యూజర్లు కొత్త సాంకేతికత వైపు వెళ్లడానికి అంతగా ఇష్టపడటంలేదు. 5జీ వంటి హై స్పీడ్ నెట్వర్క్ తేవడానికి ముందుగా నెట్వర్క్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. అందుకే ప్రస్తుత టారిఫ్లతోనే సరిపెట్టుకొంటామని, ఎక్కువ చార్జీలు పెట్టి కొత్త టారిఫ్లు తీసుకోబోమని చెబుతున్నారు. ఇటీవలి సర్వేలో 43 శాతం మంది ప్రస్తుత టారిఫ్కంటే ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా లేమని కరాఖండిగా చెప్పడమే దీనికి నిదర్శనం. మరో 43 శాతం మంది 10 శాతం ఎక్కువ చెల్లించగలమని చె΄్పారు. 10 శాతం మంది మాత్రం 10 నుంచి 25 శాతం వరకు ఎక్కువ చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్న్యూస్ -
క్రెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త
-
మీరెవరో.. ట్రూకాలర్ ఇట్టే చేప్పేస్తుంది!
కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ మరో అదిరిపోయే ఫీచర్ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్ సాయంతో తాము గవర్నమెంట్ అధికారులమని, లేదంటే మంత్రి, ఎమ్మెల్యేలం’ అంటూ డబ్బులు వసూలు చేసే కేటుగాళ్ల ఆటకట్టిస్తున్నట్లు తెలిపింది. తాము తెచ్చిన ఈ గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్తో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధుల పేర్లను ఈజీగా గుర్తించవచ్చని ట్రూకాలర్ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు బాధితులు సమస్యల్ని నేరుగా అధికారులు, సంబంధిత ఎమ్మెల్యే, ఎంపీలతో చర్చించవచ్చని, ఇందుకోసం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ ఫీచర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, ప్రజా ప్రతినిధుల ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెబుతోంది. తాము ప్రభుత్వ పెద్దలమని సామాన్యుల్ని మోసం చేసే వారిని గుర్తించే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా మోసాల్ని అరికట్టవచ్చని ట్రూకాలర్ తెలిపింది. ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే ఆ సమాచారం గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీలో సంబంధిత ఫోన్ వినియోగదారులకు సమాచారం వెళ్తుందని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. యూజర్లు తమ ఫోన్లలో ట్రూకాలర్ యాప్ను అప్డేట్ చేసి ఈ ఫీచర్ను పొందవచ్చు. -
గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు షాక్
-
జియో జోరు, వొడాఫోన్ ఐడియాకు 40 లక్షల యూజర్లు గోవిందా!
న్యూఢిల్లీ: టెలికం కనెక్షన్లలో జియో ఆధిపత్యం కొనసాగుతోంది. సెప్టెంబర్లో కంపెనీ కొత్త యూజర్ల సంఖ్య 7.2 లక్షలు పెరిగింది. 4.12 లక్షల కొత్త యూజర్లతో భారతీ ఎయిర్టెల్ రెండో స్థానంలో నిల్చింది. సంక్షోభంలో ఉన్న వొడాఫోన్ ఐడియా కనెక్షన్లు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్లో ఏకంగా 40 లక్షల యూజర్లను కోల్పోయింది. 21.75 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానంలో నిలిచింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జియో యూజర్లు సెప్టెంబర్లో పెరిగినప్పటికీ ఆగస్టుతో పోలిస్తే (32.81 లక్షలు) మాత్రం తగ్గింది. ఇక తాజాగా సెప్టెంబర్లో మొత్తం అన్ని టెల్కోల వైర్లెస్ యూజర్ల సంఖ్య 36 లక్షల మేర తగ్గింది. ఆగస్టు ఆఖరు నాటికి ఇది 114.91 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్ ఆఖరు నాటికి 114.54 కోట్లకు పడిపోయింది. -
వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లు: పోల్స్ ఫీచర్ ఇంకా...!
సాక్షి,ముంబై: ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ మరో బంపర్ ఫీచర్ను తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్లకు యాండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్టఫోన్లలో 'పోల్స్' ఫీచర్ను జోడించింది. ఇంతకు ముందు, వినియోగదారులు ప్రత్యక్ష చాట్లు, గ్రూపు సంభాషణలలో పోల్లను నిర్వహించడానికి థర్డ్ పార్ట్ యాప్ల ద్వారా క్రియేట్ చేసిన పోల్ లింక్లను షేర్ చేయాల్సి వచ్చేది. ఇపుడు ఆ అవసరం లేకుండానే ప్రైవేట్ చాట్ లేదా గ్రూప్ మెసేజెస్లో పోల్ నిర్వహించేందుకు అనుమతినిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలోఉన్న వాట్సాప్లో పోల్లను ఎలా సృష్టించాలో ఒకసారి చూద్దాం. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) ఇదీ చదవండి : ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే? ఐఫోన్లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి ♦ వాట్సాప్ యాప్ను అప్డేట్ చేయండి ♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్ని ఓపెన్ చేయాలి. ♦ టెక్స్ట్ బాక్స్కు ఎడమ వైపున ఉన్న ప్లస్ (+) గుర్తుపై నొక్కండి ♦ 'పోల్' ఎంపికపై నొక్కండి. పోల్కు సంబంధించిన ♦ పోల్కు సంబంధించిన ప్రశ్నను టైప్ చేసి, ఆ తర్వాత ఆప్షన్స్ను టైప్ చేయండి ♦ ఆ తరువాత చాట్లో పోల్ను షేర్ చేయడానికి సెండ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఎంపికపై నొక్కండి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పోల్స్ ఎలా క్రియేట్ చేయాలి ♦ వాట్సాప్ యాప్ను అప్డేట్ చేయండి ♦ ఎక్కడ పోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ చాట్, ప్రైవేట్ లేదా గ్రూప్ని ఓపెన్ చేయాలి. ♦ టెక్స్ట్బాక్స్కు కుడి వైపున ఉన్న పేపర్ క్లిప్ ఐకాన్ను ఎంచుకోవాలి. ♦ 'పోల్' ఎంపికపై క్లిక్ చేయండి. ♦ పోల్కు సంబంధించిన ప్రశ్నను, ఆప్షన్స్ను టైప్ చేయాలి. ♦ ఆ తర్వాత, చాట్లో పోల్ సెండ్ చేస్తే సరిపోతుంది. (దూసుకొచ్చిన మ్యాటర్ ఎనర్జీ: అత్యాధునిక ఫీచర్స్తో ఎలక్ట్రిక్ బైక్) యూజర్లు పోల్లో గరిష్టంగా 12 ఆప్షన్స్ను జోడించవచ్చు. రైట్ సైడ్లో ఉన్న హాంబర్గర్ సహాయంతో, వినియోగదారులు ప్రతిస్పందనల క్రమాన్ని మార్చు కోవచ్చు. అంతేకాదు ఇతర పోల్ ప్లాట్ఫారమ్ల మాదిరిగా కాకుండా, వాట్సాప్ పోల్స్ క్రియేట్ అయితన తర్వాత వినియోగదారులు ఎప్పుడైనా ఓటు వేయవచ్చు. ఎపుడు ఓటు వేస్తే అపుడు ఆటోమేటిగ్గా అప్డేట్ అవుతుంది. గ్రూపు సభ్యులు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేయవచ్చు. అలాగే వ్యూ వోట్స్ ఆప్షన్ ద్వారా ఎవరు ఎన్ని ఓట్లు వేసింది, ఎవరు ఏయే ఆప్షన్ను ఎంచుకున్నారు అనేది కూడా చూడవచ్చు. పాస్వర్డ్ లేదా పిన్ స్క్రీన్ లాక్ పేరుతో మరో కొత్త ఫీచర్ను వాట్సాప పరీక్షిస్తోంది. డెస్క్టాప్లో యాప్ ఓపెన్ చేసి మర్చిపోయేవాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. డెస్క్టాప్ మీద వాట్సాప్ యాప్ను ఓపన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ లేదా పిన్ ఎంటర్ చేయాల్సిందే. తద్వారా యూజర్ చాట్ సంభాషణలకు అదనపు భద్రత కల్పిస్తోంది సంస్థ, త్వరలోనే ఈ ఫీచర్ వస్తుంది. -
పేటీఎం యూజర్లకు బంపర్ ఆఫర్: ఈ విషయం తెలుసా మీకు?
సాక్షి,ముంబై: దేశీయ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం వినియోగదారులు యూపీఐ ద్వారా ఏ మొబైల్ నంబరుకైనా డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. అంతేకాదు రిసీవర్ పేటీఎంలో రిజిస్టర్ కాక పోయినా కూడా వారి యూపీఐ ఐడీద్వారా ఏదైనా మొబైల్ నంబర్కు డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించ వచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం రిజిస్టర్డ్ UPI IDతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సార్వత్రిక డేటాబేస్ను యాక్సెస్కు, యూపీఎల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టు తెలిపింది. (వన్ప్లస్ ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదే లక్కీ చాన్స్!) పేటీఎం యూపీఐ ద్వారా నగదు ఎలా పంపాలి ♦ Paytm యాప్లోని ‘UPI మనీ ట్రాన్స్ఫర్’ విభాగంలో, ‘ టూ UPI యాప్స్’ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ♦ ఇక్కడ మొబైల్ నంబర్ను నమోదు చే గ్రహీత మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. ♦ నగదును నమోదు చేసి, తక్షణ నగదు బదిలీ కోసం ‘పే నౌ ’ బటన్ క్లిక్ చేయాలి. యూపీఐ నెట్ వర్క్ ఇదొక కీలక పరిణామామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపింది. ఇది తమ వినియోగదారులుమ రింత మంది వినియోగదారులు ఏదైనా UPI యాప్ ద్వారా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి వీలు కల్పిస్తుందని, అంతరాయం లేని, సురక్షితమైన చెల్లింపులకవసరమైన బలమైన మౌలిక సదుపాయాలను వినియోగదారులకు అందిస్తున్నట్టు తెలిపారు. (ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్! ఇక కనీస రీచార్జ్ ప్లాన్ ఎంతంటే?) కాగా ఎన్పీసీఐ తాజా నివేదిక ప్రకారం, పేటీఎం లబ్ధిదారు బ్యాంకుగా PPBL 1,614 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది, రెమిటర్ బ్యాంక్గా, అక్టోబర్ 2022లో 362 మిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది.అలాగే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ UPI లావాదేవీల పరిమాణంలో అతిపెద్ద లబ్ధిదారుల బ్యాంక్గా టాప్లో ఉంది. అక్టోబర్ 2022లో 1,614 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు కంపెనీ పేర్కొంది. -
గూగుల్ పే పై యూజర్స్ ఫైర్
-
OTT యూజర్లకు జియో బిగ్ షాక్..
-
ఎలాన్ మస్క్కి కొత్త టెన్షన్..ట్విటర్ యూజర్లు చేజారిపోతున్నారా!
రోజుకు 4 బిలియన్ డాలర్లు నష్టపోయే ట్విటర్ను సుమారు రూ. 3.37 లక్షల కోట్లు పెట్టి ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాను చేసిన కొనుగోలు వల్లే ట్విటర్ యూజర్లు పెరిగిపోతున్నారంటూ మస్క్ చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మస్క్ చేతుల్లోకి వెళ్లిన నాటి నుంచి గతంలో కంటే ఎక్కువ మంది యూజర్లు యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లో ట్విటర్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కానీ ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్లైన మాస్టోడాన్, టంబ్లర్ డౌన్లోడ్ల కంటే ట్విటర్ను ఇన్స్టాల్ చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన డేటా హైలెట్ చేస్తోంది. ►సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం.. మస్క్ ట్విట్టర్ బాస్గా బాధ్యతలు చేపట్టిన 12 రోజుల్లో ట్విటర్ డౌన్లోడ్లు 657శాతం పెరిగాయి. ►అదే సమయంలో యాహూకు చెందిన టంబ్లర్ను ఒక్క అమెరికాలో 96శాతం మంది ఇన్స్టాల్ చేసుకోగా, వరల్డ్ వైడ్గా 77శాతం మంది డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ట్విటర్ ఇన్స్టాల్లు 21శాతం పెరిగాయి. ►మాస్టోడాన్లో వరల్డ్ వైడ్గా 1 మిలియన్ యూజర్లు డౌన్లోడ్ చేసుకోగా.. జూలై నాటికి ట్విటర్లో 238 మిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. అయినప్పటికీ , ట్విటర్కు మస్క్ బాస్ అవ్వడంతో యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా యూజర్లు మాస్టోడాన్ వైపు మొగ్గుచూపుతున్నారని సెన్సార్ టవర్ నివేదిక చెబుతోంది. -
ట్విటర్కు షాక్: లక్షలకొద్దీ కొత్త యూజర్లతో ప్రత్యర్థులకు పండగ
న్యూఢిల్లీ: టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ను ట్విటర్ను కొనుగోలు చేసిన తరువాత అనేక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు ట్విటర్కు గుడ్ బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారట. ప్రత్యామ్నాయాలను ప్లాట్ఫారమ్ వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రత్యర్థి ప్లాట్ఫామ్స్కు కలిసి వస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా మాస్టోడాన్కు లక్షలమంది కొత్త వినియోగదారులు జత అవుతున్నారు. మాస్టోడాన్ ఆవిష్కారం ఎపుడు? దాదాపు ట్విటర్లానే పనిచేసే మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ మాస్టోడాన్. 2016లో యూజెన్ రోచ్కోచే దీన్ని స్థాపించారు. ద్వేషపూరిత ప్రసంగాలను, పోస్ట్లను నియంత్రిస్తూ స్వీయ-హోస్ట్ సోషల్ నెట్వర్కింగ్ సేవలందించే ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అయితే ట్విటర్ టేకోవర్ తరువాత నెలకొన్న గందరగోళం నేపథ్యంలో జర్నలిస్టులు, నటులతోపాటు, ఇతర సెలబ్రిటీలు మాస్టోడాన్కి షిప్ట్ అవుతున్నారట. ముఖ్యంగా జర్నలిస్ట్ మోలీ జోంగ్-ఫాస్ట్ నటుడు, హాస్యనటుడు కాథీ గ్రిఫిన్ ఇప్పటికే మాస్టోడాన్కు మారిపోయారు. మాస్టోడాన్ వ్యవస్థాపకుడు, సీఈవో ట్వీట్ ప్రకారం ఈ ప్లాట్ఫారమ్లో అంతకుముందెన్నడూ లేని విధంగా యూజర్లు పెరిగారు. ప్రస్తుతం మాస్టోడాన్కు 6,55,000 మంది నెలవారీ వినియోగ దారులుండగా, అక్టోబర్ 27న మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసిన గత వారం రోజుల్లో 230,000 మందికి పైగా కొత్త యూజర్లు చేరారు. మరోవైపు తన ఫోటో, పేరుతో కామెడీ ఖాతా తెరిచిన నటి కాథీ గ్రిఫిన్ ట్విటర్ ఖాతాను బ్యాన్ చేశారు మస్క్. బ్లూస్కీ సోషల్: ట్విటర్ ఫౌండర్, మాజీ సీఈవో జాక్ డోర్సే గత వారం లాంచ్ చేసిన కొత్త బ్లాక్చెయిన్ ఆధారిత సోషల్ మీడియా బ్లూస్కీ సోషల్లో రెండు రోజుల్లోనే 30,000 మందికి పైగా సైన్ అప్ చేశారు. మస్క్-ట్విటర్ డీల్ తరువాత ప్రత్యామ్నాయంగా ఈ యాప్వైపు మొగ్గు తున్నారు యూజర్లు. కూ: ఇండియాకుచెందిన బహుళ-భాషా మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ కూ యాప్ ఇటీవల 50 మిలియన్ల డౌన్లోడ్లను దాటేసింది. యాప్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి వినియోగదారులు, గడిపిన సమయం, ఎంగేజ్మెంట్లో భారీ పెరుగుదలను సాధించింది. 2020లో ప్రారంభించిన ఈ యాప్ 10 భాషల్లో అందుబాటులో ఉంది. ఇండియాలో దాదాపు అన్ని ప్రభుత్వరంగ శాఖలు, ఉన్నతా ధికారులు ప్రభుత్వరంగ ఉద్యోగులు, కూ యాప్లో నమోదై ఉండటం గమనార్హం. The number of people who switched over to #Mastodon in the last week alone has surpassed 230 thousand, along with many returning to old accounts bumping the network to over 655 thousand active users, highest it's ever been! Why? 👉 https://t.co/9Ik30hT3xR — Mastodon (@joinmastodon) November 3, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4961499954.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4961499954.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ట్విటర్ డౌన్: యూజర్లకు లాగిన్ సమస్యలు,ఏమైంది అసలు?
సాక్షి, ముంబై: మైక్రో-బ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్లో లాగిన్ సమస్య యూజర్లను అయోమయానికి గురిచేసింది. శుక్రవారం ఉదయం ట్విటర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది యూజర్లను లాగిన్ సమస్య ఇబ్బంది పెట్టింది. యూజర్లు లాగిన్ అవుతోన్న సందర్భంలో ఎర్రర్ మెసేజ్ దర్శనమివ్వడంతో అసౌకర్యానికి గురయ్యారు. అయితే మొబైల్ యూజర్లకు ట్విటర్లాగిన్లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాలేదు. డెస్క్టాప్ యూజర్లకు ‘సమ్థింగ్ వెంట్ రాంగ్’ అనే ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. కొత్త ఫీచర్ మార్పులు కారణంగా సమస్య ఏర్పడుతోందా, అందుకోసమే డౌన్టైమ్ ప్లాన్ చేశారా అనేది క్లారిటీ లేదు. అయితే ఏ మేరకు ప్రభావితమైంది?, సమస్యకు గల కారణం ఏంటి అనే దానిపై సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఇటీల సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ సేవలు ప్రపంచవ్యాప్తంగా నిలిచి పోవడం పెద్ద కలకలమే రేపింది. గత వారం ట్విటర్ను ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ టేకోవర్ చేశారు. మరుక్షణం నుంచి భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన మస్క్ కీలక ఎగ్జిక్యూటివ్లకు ఉద్వాసన పలికారు. దాదాపు సగానికిపైగా సంస్థ ఉద్యోగుల తొలగింపు ప్రణాళికల్లో ఉన్నారన్న నివేదికలు ఆందోళన రేపాయి. ముఖ్యంగా ఈ రోజునుంచే ఈ తొలగింపులను ప్రారంభించ నుందని అంచనా. -
సగం ధరకే రెడ్ మీ స్మార్ట్ఫోన్స్.. ఎక్కడంటే..!
సాక్షి,ముంబై: స్మార్ట్ఫోన్ కంపెనీ రెడ్మీ పేరెంట్ కంపెనీ ఎంఐ క్లియరెన్స్ సేల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ అతి తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. ఈ సేల్లో కొనుగోలుదారులు రూ. 3,999కే స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ క్లియరెన్స్ సేల్కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. దీని ప్రకారం రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో. వంటి మోడల్స్ ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-లెవల్ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 6ఏ మోడల్ ప్రారంభ ధర రూ.6,999 కాగా, క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఫీచర్లతో, 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్ఫోన్ రెడ్మీ 6ఏ, దీంతోపాటు మిగతా మోడళ్లను కూడా తక్కువకే ఎంఐ సేల్లో లభ్యం. అయితే ఈ సేల్లో తగ్గింపుతో కొనుగోలు చేసిన స్మార్ట్ఫోన్లు వారంటీని కలిగి ఉండవు అనేది గమనార్హం. -
ఈపీఎఫ్ఓ వడ్డీ జమ షురూ: మీరూ చెక్ చేసుకోండిలా..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఎఫ్ఓ) వడ్డీ డిపాజిట్ కోసం ఎదురుచూస్తున్న ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీ జమలను ప్రారంభించినట్టు ఈపీఎఫ్వో ట్విటర్ ద్వారా సమాచారాన్ని అందించింది. ప్రక్రియ ప్రారంభమైంది త్వరలోనే మీ ఖాతాలోనే పూర్తిగా జమ అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేసింది. 2021-22 ఏడాదిగాను డిపాజిట్లపై వడ్డీరేటు నాలుగు దశాబ్దాల కనిష్టం వద్ద 8.1 శాతంగా ప్రభుత్వం జూన్లో ఆమోదించింది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. The process of crediting interest is ongoing and it will get reflected into your account soon. Whenever the interest is credited, it will be paid in full. There will be no loss of interest. — EPFO (@socialepfo) October 31, 2022 పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? సాధారణంగా బ్యాలెన్స్ను ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా చూసుకోవచ్చు. సంస్థ పోర్టల్లో లాగిన్ కావడం ద్వారానూ తెలుసుకోవచ్చు. ఖాతాదారులు అధికారిక వెబ్సైట్ లో ‘మా సేవలు’ ట్యాబ్కు వెళ్లాలి. ట్యాబ్లో, 'ఉద్యోగుల కోసం' ఆప్షన్ను ఎంచుకోండి..కొత్త పేజీ ఓపెన్ అయ్యాక సబ్స్క్రైబర్ తప్పనిసరిగా 'సభ్యుని పాస్బుక్'పై క్లిక్ చేసి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN),పాస్వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. పాస్బుక్లో వడ్డీ క్రెడిట్ అయిందీ లేనిదీ చెక్ చెసుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగం చేసిన వారు వేర్వేరు ఐడీ ఆధారంగా చెక్ చేయాలి. మిస్డ్ కాల్: ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవవచ్చు. 011-22901406 అనే నంబరుకు చందాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కాల్ చేయాలి. ఎస్ఎంఎస్: పీఎఫ్ చందాదారుడు తన రిజిస్టర్ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్సును తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం 7738299899 నంబరుకు ‘‘EPFOHO UAN ENG’’ అని ఎస్ఎంఎస్ పంపాలి. యూఏఎన్ అని ఉన్న చోట దాన్ని టైప్ చేయాలి. ఎస్ఎంఎస్ సెండ్ చేశాక పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో మరో మెసేజ్ వస్తుంది. -
మస్క్ క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: బిలియనీర్, టెస్లా సీఈవో, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ బ్లూటిక్ చార్జీపై క్లారిటీ ఇచ్చేశారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో యూజర్లు తమ బ్లూటిక్ను నిలుపుకోవాలన్నా, కొత్తగా బ్లూటిక్ కావాలన్నా ఇక చెల్లింపులు చేయాల్సిందే. నెలకు 8 డాలర్లు (దాదాపు రూ.700) చెల్లించాల్సి ఉంటుందని ట్విటర్ ఏకైక డైరెక్టర్ మస్క్ మంగళవారం ప్రకటించారు. దేశంలోని కొనుగోలు శక్తి ప్రకారం ధరలను సర్దుబాటు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాదు బ్లూటిక్ యూజర్లు అదనపు ప్రయోజనాలు పొందుతారని ముఖ్యంగా స్పామ్, స్కామ్ల నుంచి తప్పించుకోవడానికి అవసరమైన రిప్లైలు పొందడంలో ప్రాధాన్యత, ప్రస్తావనలు, సెర్చ్లో ప్రాధాన్యత లభిస్తుందని మస్క్ ప్రకటించారు. అంతేకాదు పెద్ద వీడియోను, ఆడియోను కూడా పోస్ట్ చేసుకోవచ్చన్నారు. దీంతో పాటు తమతో కలిసి పనిచేయడానికి ఇష్టపడే ప్రచురణ కర్తలకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే ఇలా వచ్చే ఆదాయం కంటెంట్ క్రియేటర్ల చెల్లింపులకు తోడ్పడు తుందని కూడా మస్క్ ట్వీట్ చేశారు కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ను సొంతం చేసుకున్న తక్షణమే మస్క్ అనేక మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్ , పాలసీ చీఫ్ విజయ గద్దెతో సహా టాప్ ఎగ్జిక్యూటివ్లను తొలగించి అందర్నీ షాక్కు గురి చేశారు. మొత్తం వెరిఫికేషన్ ప్రక్రియను పునరుద్ధరిస్తున్నానని చెప్పిన మస్క్, నెలకు 20 డాలర్ల ఫీజును వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తరువాత డైరెక్టర్ల బోర్డును రద్దు చేసి ప్రస్తుతం ట్విటర్ ఏకైక డైరెక్టర్గా కొనసాగుతున్నారు. తాజాగా బ్లూటిక్ ఫీజును నెలకు 8 డాలర్లుగా నిర్ణయించారు. అయితే ఈ బ్లూటిక్ బాదుడుపై చాలామంది యూజర్లు అసంతృప్తితో ఉన్నారు. You will also get: - Priority in replies, mentions & search, which is essential to defeat spam/scam - Ability to post long video & audio - Half as many ads — Elon Musk (@elonmusk) November 1, 2022 This will also give Twitter a revenue stream to reward content creators — Elon Musk (@elonmusk) November 1, 2022 -
గూగుల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక ఆ బెడద ఉండదు
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ యూజర్లకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న 15జీబీ స్టోరేజీ సామర్థ్యాన్ని ఏకంగా 1టీబీ సామర్థ్యానికి పెంచనుంది. ఈ మేరకు ప్రతి గూగుల్ వర్క్స్పేస్ వ్యక్తిగత ఖాతాలో ఆటోమేటిగ్గా 1 టీబీ నిల్వ సామర్థ్యం ఉండేలా అప్గ్రేడ్ చేయనుంది. ఈ విషయాన్ని గూగుల్ తన తాజా బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. దీంతో గూగుల్ స్టోరేజ్, జీమెయిల్ లాంటి వాటిల్లో స్టోరేజ్ బాధ లేకుండా అపరిమితంగా ఫైల్స్ను దాచుకోవచ్చు. ప్రతి Google Workspace వ్యక్తిగత ఖాతా 1 టీబీ సురక్షిత క్లౌడ్ స్టోరేజ్తో వస్తుందని కంపెనీ ప్రకటించింది. వినియోగదారులు అడగాల్సిన అవసరం లేకుండానే ప్రతి ఖాతాలో 1 టీబీ స్టోరేజ్ స్వయంచాలకంగా స్టోరేజ్ అప్గ్రేడ్ చేస్తామని బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. తాజా చర్య గూగుల్ డ్రైవ్ దాదాపు 100 రకాల ఫైల్స్ స్టోరేజ్కు, పీడీఎఫ్, సీఏడీ, జేపీజీ తదితర రకాల ఫైల్స్ స్టోర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వీటిని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఫైల్స్లా కన్వర్ట్ చేసుకోకుండానే ఎడిట్ చేసేలా ఆప్షన్స్ ఎనేబుల్ చేయనుంది. దీనికి తోడు గూగుల్ డ్రైవ్ ఇప్పుడు మాల్వేర్, స్పామ్, రాన్సమ్వేర్ నుంచి రక్షణగా బిల్ట్ ఇన్ ప్రొటెక్షన్ ఫీచర్లను అందించనుంది. -
అదరగొట్టిన భారతి ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో ఏకంగా 89 శాతం రెట్టింపు లాభాలను సాధించింది. 30 సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో 2,145 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. (Zomato మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు) గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ లాభం రూ.1,134కోట్లు మాత్రమే. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 21.9 శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.28,326 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు టెల్కో రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 21.9శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది, పోర్ట్ఫోలియో అంతటా బలమైన, స్థిరమైన పనితీరు కనబర్చినట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల కస్టమర్లను దాటినట్టు కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్యూ1తో 183 రూపాయలతో పోలిస్తే క్యూ2లో రూ. 190కి పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, ఎయిర్టెల్ త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో 33.5 శాతం పెరుగుదలను నివేదించింది. కాగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్ , వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో ఎయిర్టెల్ 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఇటీవల తెలిపిన సంగతివ తెలిసిందే. -
చిక్కుల్లో ట్విటర్: వారు గుడ్బై, ఆదాయం ఢమాల్..రీజన్?
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ భారీగా యాక్టివ్ యూజర్లను పెద్దమొత్తంలో కోల్పోతోందట. ట్విటర్ ఇంటర్నెల్ రీసెర్చ్ ప్రకారం ట్విటర్ గ్లోబల్ ఆదాయంలో కీలక భూమిక పోషిస్తున్న 10 శాతం హెవీ ట్వీటర్లు ట్విటర్ను వీడుతున్నారట. ఈ మేరకు రాయిటర్స్ ట్విటర్లో ఒక రిపోర్ట్ను పోస్ట్ చేసింది. హెవీ ట్వీటర్లు అంటే ఎవరు? రాయిటర్స్ నివేదిక ప్రకారం తనవ్యాపారంలో కీలకమైన సెలబ్రిటీలు, అత్యంత చురుకైన వినియోగ దారులను నిలబెట్టుకోవడానికి కష్టాలు పడుతోంది. వారానికి ఆరు లేదా ఏడు రోజులు ట్విట్టర్లోకి లాగిన్ అయి వారానికి మూడు నుండి నాలుగు సార్లు ట్వీట్ చేసే వ్యక్తిని "హెవీ ట్వీటర్" గా పిలుస్తారు. వీరి సంఖ్య నెలవారీ మొత్తం వినియోగదారులలో 10శాతం కంటే తక్కువే అయినా ప్రపంచ ఆదాయంలో సగం సృష్టిస్తున్నారని రాయిటర్స్ నివేదించింది. ఇంగ్లీష్ మాట్లాడే ఎక్కువ యూజర్లలో క్రిప్టోకరెన్సీ, అశ్లీలతతో కూడిన కంటెంట్పై ఆసక్తి బాగా పెరిగిందని తెలిపింది. అదే సమయంలో వార్తలు, క్రీడలు, వినోదంపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొంది. (ట్విటర్ డీల్: మస్క్ మరోసారి సంచలన నిర్ణయం!) కాగా టెస్లా సీఈవో ట్వీటర్ డీల్ ను రద్దు చేసుకోవడంతో, షేర్ ధర పడిపోవడం, భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోవడం, న్యాయపోరాటం లాంటి ఇబ్బందుల్లో ఉన్న సంస్థకు దీంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టే యూజర్లను కోల్పోవడం మరో సమస్య కానుంది. ఇదీ చదవండి : ఇండోనేషియా కొత్త వీసా: ‘సెకండ్ హోం’ అక్కడే పదేళ్లు పండగ! EXCLUSIVE Twitter is losing its most active users, internal documents show https://t.co/EoHgcznik5 pic.twitter.com/Jlz5zWyipN — Reuters (@Reuters) October 25, 2022 -
వాట్సాప్లో మరో 5 కొత్త ఫీచర్లు... యూజర్స్ కి పండగే
-
వాట్సాప్ లేటెస్ట్ అప్డేట్స్: 5 ఫీచర్లు కమింగ్ సూన్
సాక్షి, ముంబై: మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకోసం త్వరలోనే మరో అయిదు కీలక ఫీచర్లను లాంచ్ చేయనుంది. ఎప్పటికపుడు కాలానుగుణంగా అప్డేట్స్తో వినియోగదారులకు ఆకట్టుకునే వాట్సాప్ తాజా అప్డేట్స్పై ఓ లుక్కేద్దాం. మెసేజ్ ఎడిట్: వాట్సాప్ ద్వారా యూజర్లు పంపించిన సందేశాలను నిర్ణీత సమయంలోపు ఎడిట్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనుంది. అయితే ఎడిట్ చేసుకునేందుకు మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు మాత్రమే సమయం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్లో ఉంది. గ్రూపు మెంబర్స్ సంఖ్య: వాట్సాప్ గ్రూపులో గరిష్టంగా 512 మంది మరిమితమైన సంఖ్యను త్వరలోనే రెట్టింపు చేయనుంది. దీంతో ఒక గ్రూపులో 1024 మంది సభ్యులుగా చేరే అవకాశం కలుగుతుంది. షేర్ డాక్యుమెంట్ విత్ క్యాప్షన్: ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. వాట్సాప్ ద్వారా ఒకరికొకరు క్యాప్షన్లతో డాక్యుమెంట్లను సెండ్ చేసుకోవచ్చు. వీడియోలు, ఫోటోలుమాదిరిగానే ఇకమీదట డాక్యుమెంట్లకూ క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. స్క్రీన్ షాట్ బ్లాక్ : వాట్సాప్ ద్వారా వచ్చే మెసేజ్లకు, లేదా ఫోటోలను ఇకపై స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశాన్ని రద్దు చేయనుంది. యూజర్ల గోప్యత పరిరక్షణలో భాగంగా వాట్సాప్ దీనికి త్వరలోనే చెక్ పెట్టనుంది. ఇలా స్క్రీన్ షాట్ తీసుకోకుండా ఉండాలంటే, యూజర్లు వ్యూ వన్స్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రీమియం సబ్ స్క్రిప్షన్: బిజినెస్ వాట్సప్ ఖాతాల ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ను ప్రారంభించింది. ధర ఇంకా వెల్లడించిపోయినప్పటికీ, వ్యాపార సేవల కోసం ప్రీమియం సబ్ స్క్రిప్షన్పై మాత్రమే సేవలను వాట్సాప్ అందించనుంది. వాట్సాప్ బిజినెస్ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
ప్లీజ్.. వాటిని స్క్రీన్షాట్లు తీయకండి.. యూజర్లను కోరిన ట్విటర్!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్.. ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీయకండని యూజర్లను కోరుతోంది. స్క్రీన్ షాట్ తీసే బదులుగా ఆ ట్వీట్ షేర్చేయడం లేదా ఆ లింక్ని కాపీ చేసుకోమని పలువురు యూజర్లకు సూచిస్తోంది. దీని ద్వారా ట్విటర్ని మరింత మంది యూజర్లకు చేరువయ్యేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ట్వీట్ను సెక్యూరిటీ రిసెర్చర్, రివర్స్ ఇంజినీరింగ్ నిపుణులు జేన్ మంచున్ వాంగ్ మొదట షేర్ చేశారు. ప్రస్తుతం బీటా యూజర్లు ద్వారా షేర్ ట్వీట్, కాపీ లింక్ అనే రెండు కొత్త ఫీచర్లను ట్వీటర్ పరీక్షిస్తోంది. త్వరలో మిగతా యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆగస్టులో, మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ఓ కొత్త ఫీచర్ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా యూజర్లు ఇతరులకు ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా, వారితో కూటా ట్వీట్లను పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకునేందుకు ముందు వరుసలో ట్వీటర్ ఉంటుంది. ఇటీవల తన వినియోగదారులకు ఎడిట్ ట్వీట్ బటన్ను వాడుకలోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ట్విట్టర్ ప్రకటించిన మేరకు ఈ ఎడిట్ ఫీచర్ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోని ట్విట్టర్ బ్లూ వినియోగదారులు మాత్రం ఉపయోగించగలరు. ఈ ఫీచర్ త్వరలో యుఎస్కి వస్తుందని కంపెనీ తెలిపింది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్తో షాకైన కంపెనీ! -
యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా!
యూట్యూబ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుని అతిపెద్ద వీడియో ప్లాట్ఫాంగా అవతరించింది యూట్యూబ్. ప్రస్తుతం ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలలో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో యూజర్లపై భారం మోపుతోంది. తాజాగా యూట్యూబ్ మరో బాదుడికి సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఇకపై యూట్యూబ్లోని హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే పైసలు చెల్లించాల్సి వచ్చేలా ఉంది. ఎలా అని ఓ లుక్కేద్దాం! సమాచారం ప్రకారం.. యూట్యూబ్లో 4K రెజుల్యూషన్ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసే ప్లాన్లో ఉందట. ప్రసుత్తం యూట్యూబ్లో యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి ₹1290 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే 4k వీడియోలు చూడాలంటే కూడా ప్రీమియం తప్పనిసరి చేయనున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, యూజర్లలో దీనిపై చర్చ మాత్రం జరుగుతోంది. 4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు యూజర్లు రెడిట్ ప్లాట్ఫాంలో వివరించారు. కొందరు యూజర్లు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. దీని బట్టి చూస్తే త్వరలో యూట్యూబ్లో 4కే వీడియోలు ఉచితంగా చూడటం సాధ్యం కాకపోవచ్చు. హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాల్సి వచ్చేలా ఉంది. So, after testing up to 12 ads on YouTube for non-Premium users, now some users reported that they also have to get a Premium account just to watch videos in 4K. pic.twitter.com/jJodoAxeDp — Alvin (@sondesix) October 1, 2022 చదవండి: ఫ్రెషర్స్కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్! -
వాట్సాప్లో ఎడిట్ మెసేజ్ ఫీచర్
పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ‘ఎడిట్ మెసేజ్’ అనే కొత్త ఫీచర్ను పరీక్షిస్తుంది. కొన్నిసార్లు తొందరపాటు వల్లో, పరధ్యానం వల్లో పంపిన మెసేజ్లో తప్పులు దొర్లుతుంటాయి. ఇకముందు నాలుక కర్చుకొని అయ్యో అనుకోనక్కర్లేదు. ఎడిట్ మెసేజ్ ఫీచర్తో పంపిన మెసేజ్లో తప్పును సరిద్దుకోవచ్చు. ఇప్పటికీ వాట్సాప్లో ‘డిలిట్ ఫర్ ఎవ్రీవన్’ ఫీచర్ అందుబాటులో ఉంది. దీంతో యూజర్స్ సెంట్ మెసేజ్లను డిలిట్ చేయవచ్చు. అయితే ‘ఎడిట్ మెసేజ్’తో పూర్తిగా డిలిట్ చేయాల్సిన అవసరం లేకుండానే అవసరం ఉన్న చోట ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. (క్లిక్: అక్టోబరు ఒకటిన 5జీ సేవలు లాంచ్) -
కొన్ని గంటల్లో ఈ బ్యాంక్ షట్ డౌన్: అంతకుముందే సొమ్ము తీసుకోండి!
సాక్షి,ముంబై: మరి కొన్ని గంటల్లో దేశంలో మరో బ్యాంకు మూతపడనుంది. ఖాతాదారులు తమ డిపాజిట్లను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచిస్తోంది. అదే పూణేకు చెందిన రూపే కో-ఆపరేటివ్ బ్యాంకు. బ్యాంకు మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పూణేలోని రూపే కో ఆపరేటివ్బ్యాంకు మూసివేయాలని ఆగస్టులోనే ఆర్బీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 22న బ్యాంక్ మూసివేయబడుతుందని కస్టమర్లకు ముందుగానే సమాచారం అందించారు. బ్యాంకు సజావుగా పనిచేయడానికి మూలధనం లేక, లాభదాయకంగా మారడానికి ఎలాంటి నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడంతో ఆర్థిక సంక్షోభంలోపడింది. ఆ తర్వాత ఆర్బీఐ లైసెన్స్ను రద్దు చేసింది. అయితే తాజా నిర్ణయంతో గడువు లోపు తమ సొమ్మును తీసుకోకపోతే డిపాజిటర్లు తమ డబ్బును పోగొట్టుకుంటారా? బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం, రూ. 5 లక్షల వరకు ఖాతాదారులకు చెల్లించనున్నారు. అంటే రూ.5 లక్షల వరకు డిపాజిట్లు ఉన్నవారు తమ డబ్బును తిరిగి పొందుతారు. అయితే, ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు అదనపు మొత్తాన్ని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అలాగే డీఐసీజీసీ బ్యాంకు ఖాతాదారులకు బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. -
యూట్యూబ్ క్రియేటర్లకు పండగలాంటి అప్డేట్!
సాక్షి, ముంబై: యూట్యూబ్ క్రియేటర్లకు పండగలాంటి వార్త. షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు ఇకపై డబ్బులు సంపాదించవచ్చు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని మంగళవారం ప్రకటించింది. ఇది చదవండి: Tata Nexon:సేల్స్లో అదరహ! కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది టిక్టాక్ (మన దేశంలో బ్యాన్) తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తాజా అప్డేట్ను తీసు కొచ్చింది. షార్ట్-ఫారమ్వీడియోపై డబ్బు సంపాదించడానికి క్రియేటర్ల కోసం యూట్యూబ్ కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. మారుతున్న డిజిటల్ ల్యాండ్ స్కేప్లో (సృష్టికర్తలకు) భారీ మద్దతునిచ్చేలా ఉండాలని కోరుకుంటున్నామని సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న వీడియో ప్లాట్ఫాం యూట్యూబ్ ఎంటర్టైన్మెంట్ రారాజు. తన యూజర్లకు ఎంటర్టైన్మెంట్ను అందిస్తూనే మరోవైపు క్రియేటర్లు తమ ట్యాలెంట్ను ప్రదర్శించుకునే అవకాశాన్ని కూడా కల్పించిన యూట్యూబ్ తాజాగా క్రియేటర్లకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో యూజర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో యూట్యూబ్ ప్రకటనల ద్వారా 14.2 బిలియన్ డాలర్లను ఆర్జించింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 9 శాతం పెరిగింది. -
యూజర్లు పండగ చేస్కోండి! న్యూ ఇమోజీ బోనాంజా
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్లో ఇమోజీలు ఇప్పుడు నిత్యావసరం అయ్యాయి. కొత్త ఇమోజీలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తాజా వార్త ఏమిటంటే గూగుల్ యానిమేటెడ్ ఇమోజీలు త్వరలో ఆండ్రాయిడ్ డివైజ్, గెలాక్సీలలోకి రానున్నాయి. షేకింగ్ ఫేస్, జెల్లీఫిష్, అల్లం, దుప్పి, బాతు, గాడిద, పిల్లనగ్రోవి, హేయిర్ పిక్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, పింక్, ఎల్లో, గ్రే కలర్ హార్ట్...మొదలైన 31 ఇమోజీలు ఉన్నాయి. జీ–బోర్డ్ బేస్డ్ ఇమోజీ కిచెన్ ద్వారా ఇమోజీ కలర్స్ను తమకు ఇష్టం వచ్చిన రంగులో మార్చుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ‘గిఫ్ట్స్’ కొన్నిసార్లు మన ఫెవరెట్ కంటెంట్ క్రియేటర్ను అభినందించడానికి ‘లైక్’లు మాత్రమే చాలవు అనిపిస్తుంది. ‘గిఫ్ట్’ ఇవ్వాలనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్లాట్ఫామ్స్ టిప్ లేదా డొనేట్ సిస్టంను ప్రవేశ పెట్టాయి. ఫోటో అండ్ షేరింగ్ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త ఫీచర్ను పరీక్షిస్తుంది. ఈ టెస్ట్ ఫీచర్ పేరు గిఫ్ట్స్. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్స్ అభిమానుల నుంచి ‘గిఫ్ట్స్’ అందుకోవచ్చు. -
అమెజాన్, ఫ్లిప్కార్ట్ పార్సిళ్ల వీడియో వైరల్: మండిపడుతున్న యూజర్లు
సాక్షి,ముంబై: ఆన్లైన్ రీటైల్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలు సోషల్మీడియాలో మరోసారి హాట్టాపిక్గా నిలిచాయి. వీటి ఆన్లైన్ డెలివరీ పార్సిల్స్కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన యూజర్లు అయ్యో.. నా పార్సిల్ .. నా ఫోన్, నా ల్యాప్టాప్ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. దీంతో రీట్వీట్టు, కమెంట్లతో హోరెత్తి పోతోంది. విషయం ఏమిటంటే.. రైలు బోగీలోంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్ పార్సిల్స్ను, ప్యాకెట్ల,అట్టపెట్టెలను అన్లోడింగ్ చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్లో తెగ షేర్ అవుతోంది. నిర్లక్క్ష్యంగా, కనీస జాగ్రత్త లేకుండా వాటిని విసిరి పారేస్తున్న వైనం వినియోగదారుల్లో గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ఇందుకేనా మా దగ్గర అదనంగా 29 రూపాయలు అప్పనంగా వసూలు చేస్తోంది అంటూ మండిపడుతున్నారు. రకరకాల కమెంట్స్ ట్విటర్లో వైరలవుతున్నాయి. ‘3 లక్షల రూపాయల విలువైన నా ఆసుస్ గేమింగ్ ల్యాప్టాప్ అందులోనే ఉందనుకుంటా’ గోవిందా అని ఒకరు ఆందోళన వ్యక్తం చేయగా, ఖాళీ పెట్టెల్లాగా అలా విసిరేస్తున్నారేంటిరా బాబూ అని మరొకరు, ఇక ఇవాల్టితో ఆన్లైన్ షాపింగ్ బంద్ ఇంకొకరు కమెంట్ చేశారు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఏ సమయంలో తీసింది అనేదానిపై క్లారిటీ లేదు. అలాగే వీడియోపై అటు అమెజాన్గానీ, ఇటు ఫ్లిప్కార్ట్కానీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. Amazon & Flipkart parcels 😂pic.twitter.com/ihvOi1awKk — Abhishek Yadav (@yabhishekhd) August 29, 2022 There is my Asus gaming laptop 💻 worth 3lacks I think it's right there 🫣🫣 pic.twitter.com/6Tu12IWwkP — Varun (@Varun11171) August 29, 2022 Mean while #Flipkart 29rs for secured packaging so it doesn't get damage 🤣 pic.twitter.com/8dpUCXAadH — Poco Lover (@occuppymoonNow) August 29, 2022 -
పాస్వర్డ్ మేనేజర్ సంస్థకే హ్యాకర్ల షాక్:మూడు కోట్ల యూజర్ల భద్రత గోవిందేనా?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్, లాస్ట్పాస్కు హ్యాకర్లు భారీ షాకిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 33మిలియన్లకు పైగా ప్రజలు ఉపయోగించే పాస్వర్డ్ మేనేజర్ లాస్ట్పాస్కు సేబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇటీవల సంస్థ సిస్టమ్స్లోకి ఎంట్రీ ఇచ్చి సోర్స్ కోడ్, యాజమాన్య సమాచారాన్ని దొంగిలించారని తెలుస్తోంది. అయితే దీని ప్రభావాన్ని అంచనా వేయడానికి కొంత సమయం పడుతుందని, కానీ తమ కస్టమర్ల భద్రతకు ఢోకా లేదని తెలిపింది. ఈ మేరకు సంస్థ ట్విటర్ ద్వారా సమాచారాన్ని వెల్లడించింది. అయితే తమ ఖాదారులు పాస్ట్వరర్డ్స్కు వచ్చిన ప్రమాదమేమీ లేదని స్పష్టం చేసింది.ప్రస్తుతానికి వారుఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. లాస్ట్పాస్ నిర్వహణకు ఉద్యోగులు ఉపయోగించే సాఫ్ట్వేర్ డెవలపర్ లోకి "అనధికారిక పార్టీ" ప్రవేశించిందని తన పరిశోధనలో తేలిందని తెలిపింది. నేరస్థులు ఒక్క డెవలపర్ అకౌంట్కి మాత్రమే యాక్సెస్ పొందారని పేర్కొంది. అయితే సైబర్ సెక్యూరిటీ వెబ్సైట్ బ్లీపింగ్ కంప్యూటర్ రెండు వారాల క్రితమే ఉల్లంఘన గురించి లాస్ట్పాస్ అడిగిందని నివేదించింది. మరోవైపు లాస్ట్పాస్ తక్షణమే స్పందించి సమాచారం అందించడంపై కంప్యూటర్ సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు అలెన్ లిస్కా సంతోషం వ్యక్తంచేశారు. అయితే చాలామందికి రెండు వారాలు చాలా ఎక్కువ సమయం అనిపించినప్పటికీ, పరిస్థితిని పూర్తిగా అంచనా వేయడానికి టీమ్స్కి కొంత సమయం పట్టొచ్చన్నారు. కానీ కస్టమర్ పాస్వర్డ్లను యాక్సెస్ చేసే అవకాశం లేదని లిస్కా చెప్పారు. ఇది ఇలా ఉంటే సోర్స్కోడ్, ప్రొప్రయిటరీ సమాచారాన్ని దొంగిలించిన హ్యాకర్లకు,కస్టమర్ల డేటా చోరీ చేయడంపెద్ద కష్టం కాదని, పాస్వర్డ్ వాల్ట్ల కీలను యాక్సెస్ చేసేసి ఉంటారని సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ అంచనాలపై లాస్ట్సాప్ స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా మాన్యువల్గా ఆధారాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే తన యూజర్లకు నెట్ఫ్లిక్స్ లేదా జీమెయిల్ లాంటి బహుళ ఖాతాల కోసం హార్డ్-టు-క్రాక్, ఆటోమేటెడ్ జనరేటెడ్ పాస్వర్డ్లను అందిస్తుంది లాస్ట్పాస్. We recently detected unusual activity within portions of the LastPass development environment and have initiated an investigation and deployed containment measures. We have no evidence that this involved any access to customer data. More info: https://t.co/cV8atRsv6d pic.twitter.com/HtPLvK0uEC — LastPass (@LastPass) August 25, 2022 -
మార్చుకోం : ఐఫోన్14 సిరీస్ విడుదలపై భారతీయులు ఏమంటున్నారంటే!
టెక్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ -14 సిరీస్ సెప్టెంబర్ 7న లాంచ్ కానుంది. కొత్త ఐఫోన్ సిరీస్ విడుదలతో యూజర్లు తమ ఫోన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సేవింగ్స్.కామ్ అనే సంస్థ ఐఫోన్ వినియోగదారులతో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరికొద్ది రోజుల్లో ఎంతమంది ఐఫోన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కాస్ట్ ఎక్కువగా ఉన్నా ఐఫోన్-14 విడుదల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటూ ఇలా పలు ప్రశ్నలపై సర్వేలో పాల్గొన్న యూజర్లను సర్వే సంస్థ ప్రతినిధులు అడిగారు. ► అందుకు 10శాతం మంది మాత్రమే ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఐఫోన్ అమ్మేసి కొత్త ఐఫోన్-14 సిరీస్ ఫోన్ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆర్ధిక పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల కొత్త ఫోన్లను కొనుగోలు చేసే ఉద్దేశం తమకు లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరహా ధోరణి భారతీయల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ►ఉత్తర అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఏ ఐఫోన్ ఎక్కువ కాలం పని చేస్తుందో.. ఆ సిరీస్ ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఐఫోన్ -14 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉంటే వారి అభిప్రాయాలు మార్చుకోవచ్చు. ►ఆసక్తికరమైన విషయమేమిటంటే, ముగ్గురు కొనుగోలుదారులలో ఇద్దరు 2 ఏళ్లు అంతకంటే తక్కువ రోజులు మాత్రమే ఐఫోలను వినియోగిస్తున్నారు. ఐఫోన్ -14 సిరీస్కి అప్గ్రేడ్ చేయాలనుకోవడానికి వేగవంతమైన ప్రాసెసర్లు, ఎక్కువ స్టోరేజ్, కెమెరా పనితీరు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ►తాము అప్గ్రేడ్ చేయబోమని తెలిపిన యూజర్లు వారి ప్రస్తుత ఐఫోన్లు బాగా పనిచేయడం, అలాగే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం. -
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్. త్వరలో భారత్లో తయారయ్యే స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ విభాగం మొబైల్స్లో వినియోగించే ఇన్ పుట్స్పై (ఫోన్లో వినియోగించే విడి భాగాలు) కస్టమ్ డ్యూటీ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త కస్టమ్ ఛార్జీలు అమల్లోకి వస్తే .. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు పెరిగిన ధరల్ని కొనుగోలు దారులకు బదలాయించే అవకాశం ఉంది. దీంతో దేశీయంగా తయారయ్యే స్మార్ట్ ఫోన్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. పలు నివేదికల ప్రకారం..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (cbic) విభాగంగా ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్ల డిస్ప్లే అసెంబ్లీ దిగుమతిపై 10శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ విధిస్తుంది. ఆ కస్టమ్ డ్యూటీని మరో 5 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. "సిమ్ ట్రే, యాంటెన్నా పిన్, స్పీకర్ నెట్, పవర్ కీ, స్లయిడర్ స్విచ్, బ్యాటరీ కంపార్ట్మెంట్, వాల్యూమ్, పవర్, సెన్సార్లు, స్పీకర్లు, ఫింగర్ ప్రింట్ మొదలైన వాటి కోసం ఫ్లెక్సిబుల్ ప్రింటెడ్ సర్క్యూట్లు (ఎఫ్పీసీ), ఇతర వస్తువులు డిస్ప్లే అసెంబ్లీతో దిగుమతి చేసుకుంటే 15శాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ అమలవుతుందని సీబీఐసీ తెలిపింది. నో క్లారిటీ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో,ఒప్పోలతో పాటు ఇతర కంపెనీలు కస్టమ్ డ్యూటీ ఎగవేతకు పాల్పడ్డాయని సీబీఐసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులపై.. ఫోన్ల విడిభాగాల్ని దిగుమతి చేసుకుంటే ఎంత కస్టమ్ డ్యూటీ చెల్లించాలనే అంశంపై స్పష్టత లేదని, అందుకే సీబీఐసీ అధికారులు నోటీసులు అందించినట్లు పలు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ స్పష్టం చేశాయి. ఈ తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అధికారులు ఫోన్ల విడి భాగాలపై విధించే కస్టమ్ డ్యూటీ ఎంత చెల్లించాలనే అంశంపై స్పష్టత ఇవ్వడం గమనార్హం. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు అదిరిపోయే ఫీచర్లు..ఇక పండగే!
సాక్షి, ముంబై: మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్ యూజర్లకోసం మరో చక్కటి వెసులుబాటును కల్పిస్తోంది. ఇకపై రీల్స్ను ఫేస్బుక్లో పోస్ట్ చేయడం మరింత సులువు కానుంది. అంతేనా ఈ క్రమంలో వీడియో క్రియేటర్లు కోసం ఏకంగా మూడు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుండి ఫేస్బుక్కి క్రాస్-పోస్టింగ్తో సహా రీల్స్కు కొత్త ఫీచర్లు, అప్డేట్లను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అప్డేటెడ్ ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఇన్స్టా ప్రస్తుత ట్రెండ్ను క్యాష్ చేసుకుంటోంది. ముఖ్యంగా ఇన్స్టా రీల్స్కు వస్తున్న భారీ క్రేజ్ నేపథ్యంలో నేరుగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్కు రీల్స్ను క్రాస్ పోస్టింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతోపాటు స్టోరీస్లో పాపులరైన ‘యాడ్ యువర్స్ స్టిక్కర్’ ఫీచర్ను రీల్స్లోనూ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక మూడవదిగా ఎఫ్బీలో రీల్స్ రీచ్, యావరేజ్ వ్యూస్ టైం, టోటల్ వ్యూస్టైంను తెలుసుకునే అవకాశం కూడా యూజర్లకు కలగనుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్లో ఉన్న ఈ ఫీచర్లను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. (ప్రత్యేక డిపాజిట్ స్కీమ్: లక్ష డిపాజిట్ చేస్తే దాదాపు లక్షా 28 వేలు!) మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఫోటో-షేరింగ్ ప్లాట్ఫారమ్ హెడ్ ఆడమ్ మొస్సేరి కొత్త రీల్స్ అప్డేట్స్ను ప్రకటించారు. స్టోరీస్లో పాపులర్ అయిన యాడ్ యువర్స్ స్టిక్కర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్టింగ్ కోసం రీల్స్ ఫీచర్ అప్డేట్ వస్తోందని మొస్సేరి వెల్లడించారు. అలాగే యాడ్ యువర్స్ స్టిక్కర్, ఐజీ-ఎఫ్బీ క్రాస్ పోస్టింగ్, ఎఫ్బీ రీల్స్ ఇన్సైట్స్ అనే మూడు ఫీచర్లు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. 📣 Reels Updates 📣 We’re launching a few new Reels features to make it fun and easy for people to find + share more entertaining content: - ‘Add Yours’ Sticker - IG-to-FB Crossposting - FB Reels Insights Have a favorite? Let me know 👇🏼 pic.twitter.com/RwjnRu5om2 — Adam Mosseri (@mosseri) August 16, 2022 -
75వ ఇండిపెండెన్స్ డే: జియో కొత్త రీచార్జ్ ప్లాన్
ముంబై: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కొత్త ప్లాన్నులాంచ్ చేసింది. తన కస్టమర్లకోసం రూ.750 ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రారంభించింది. ఇందులో రోజుకు 2జీబీ డేటా వినియోగదారులు వాడుకోవచ్చు. (YouTube: మరో బంపర్ ఫీచర్ను లాంచ్ చేయనున్న యూట్యూబ్) ఈ రీఛార్జ్ ప్యాక్ ఇతర ప్రయోజనాలను పరిశీలిస్తే ఏ నెట్వర్క్కైనా అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 SMSలు, Jio సూట్ యాప్లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు.ఈ ప్లాన్ ఇప్పటికే జియో వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆసక్తి గల కస్టమర్లు కొత్త ప్లాన్ MyJio యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇటీవల జియో రూ. 2,999 విలువైన వార్షిక రీఛార్జ్ ప్లాన్తీసుకొచ్చినసంగతి తెలిసిందే. తాజాగా మరో స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ను జియో వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. రూ. 750 ప్రీపెయిడ్ ప్లాన్ ఏనెట్వర్క్కైనా అన్లిమిటెడ్ కాలింగ్ రోజుకు 2 జీబీ డేటా ప్రతిరోజూ 100 SMSలు 90రోజుల వాలిడిటీ చదవండి: వీఎల్సీ మీడియా ప్లేయర్పై నిషేధం, వెబ్సైట్, డౌన్లోడ్ లింక్ బ్లాక్ -
ఇన్స్టాలో కొత్త అవతార్, స్నాప్చాట్లో స్పెషల్ ఫీచర్లు
సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ సొంతమైన ఇన్స్టాగ్రామ్లో అవతార్ని క్రియేట్ చేసుకోవడం ఇపుడు చాలా ఈజీ. ఫేస్బుక్, ఇన్స్టాలో మనకు నచ్చిన అవతార్ సృష్టించుకునే అవకాశాన్ని మెటా కల్పించింది. తద్వారా మన స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన అవతార్ను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రొఫైల్ పిక్ను కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం. (Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?) ఇన్స్టాగ్రామ్లో మీ అవతార్ ఇలా.... ఇన్స్టాగ్రామ్లో మీ అవతార్ను క్రియేట్ చేసుకోవడానికి... ♦ మీ ప్రొఫైల్లోకి వెళ్లిన తరువాత స్క్రీన్ రైట్ కార్నర్లోని హంబర్గర్ మెనూ క్లిక్ చేయాలి. ♦ ఎకౌంట్–అవతార్లోకి వెళితే ‘అవతార్ మేకింగ్ స్క్రీన్’ ఓపెన్ అవుతుంది. ♦ స్కిన్ టోన్ను ఎంపిక చేసుకొని మీ ఇన్స్టా అవతార్ను తయారు చేసుకోవాలి. ♦ మీ అవతార్కు మీకు ఓకే అనిపిస్తే...స్క్రీన్ టాప్రైట్ కార్నర్లోని ‘డన్’ క్లిక్ చేయాలి. ♦ ఫేస్స్ట్రక్చర్, హెయిర్ స్టైల్, నోస్షేప్... మొదలైన ఆప్షన్స్ను యూజర్ ఎంపిక చేసుకోవచ్చు. ఫోటో షేరింగ్ ప్లాట్ఫారమ్ స్నాప్చాట్ ఇండియాలో స్నాప్చాట్+ సబ్స్క్రిప్షన్ను నెలకు కేవలం 49 రూపాయలకే అందిస్తోంది. దీంతో పాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కూడా యూజర్లకు అందిస్తోంది. స్నాప్చాట్+లో ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ మెసేజింగ్ అండ్ అప్డేట్ షేరింగ్ ప్లాట్ఫామ్ స్నాప్చాట్ ‘స్నాప్చాట్ ప్లస్ సబ్స్క్రిప్షన్’ సర్వీస్ను లాంచ్ చేసింది. దీనిలో భాగంగా యూజర్లు ఎక్స్క్లూజివ్, ఎక్స్పెరిమెంటల్, ఫ్రీ రిలీజ్ ఫీచర్లతో యాక్సెస్ కావచ్చు. రీవాచ్ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్ యాప్ ఐకాన్స్, బెస్ట్ఫ్రెండ్స్ ఫర్ఎవర్, ఘోస్ట్ ట్రయల్స్ ఆన్ స్నాప్ మ్యాప్, సోలార్ సిస్టమ్...అనే ఆరు ఎక్స్క్లూజివ్ ఫీచర్స్ను ప్రవేశపెట్టింది. సబ్స్క్రిప్షన్ సర్వీస్లోకి వచ్చాం అనేదానికి సూచనగా యూజర్ ప్రొఫైల్లో స్నాప్చాట్ ప్లస్ బ్యాడ్జ్, స్టార్లు కనిపిస్తాయి. ఇది కూడా చదవండి: Anand Mahindra: వీకెండ్ మూడ్లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్ -
స్తంభించిన గూగుల్ సేవలు..! ట్విట్టర్లో యూజర్ల అరాచకం..!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి గూగుల్ వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. గూగుల్ సెర్చ్ ఇంజిన్తో పాటు జీమెయిల్ సర్వీస్, యూట్యూబ్,గూగుల్ మ్యాప్స్ సైతం పనిచేయడం లేదంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్లో సెర్చ్ చేసే సమయంలో గూగుల్ సర్వర్లో 502 ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. టెంపరరీగా ఆగిపోవడంతో పాటు ప్లీజ్ ట్రై ఎగైన్ ఇన్ 30 సెకెండ్స్ అని చూపిస్తుంది. ఇంటర్నల్ సర్వర్లలో అంతరాయం ఏర్పడించింది. మీ రిక్వెస్ట్ను ప్రాసెసింగ్ చేస్తున్నాం అంటూ రిప్లయి రావడంపై యూజర్లు..గూగుల్కు మెయిల్స్ పెడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో వెంటనే సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. గూగుల్ ట్రెండ్స్ విభాగం ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అందులో బ్లాంక్ పేజ్ కనిపించడంతో భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన యూజర్లు..గూగుల్ పనిచేయడం లేదంటూ ఆ సంస్థకు వరుస ట్వీట్లు చేస్తున్నారు. కొంత యూజర్లు ఏకంగా గూగుల్ను వదిలేసి ట్విట్టర్ను వినియోగిస్తామంటూ ట్వీట్ చేస్తున్నారు. మీమ్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా అవి మీకోసం. everyone in the world running to twitter after using google : pic.twitter.com/c4OzMoCxc1 — Carla Ng (@cnntwlc) August 9, 2022 Me omw to twitter to check if google is down for anyone else since I cant google search it #googledown pic.twitter.com/g797tcAv1q — Ur mom (@bigfatBUSSY6) August 9, 2022 Me switching to twitter after experiencing error 500 in google#Google #googledown pic.twitter.com/hu4TMsB2K5 — 1038 (@remier_acbang) August 9, 2022 Se cayó Google alv xd pic.twitter.com/WO1HDNblta — Yisus Gonzalez🍀🚂🇲🇽🐉 (@YisusRGR) August 9, 2022 trying to revive internet explorer with google being down pic.twitter.com/zujf1vNbpr — mou ☘️🌐 (@pxresouls) August 9, 2022 -
ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ గురించి మీకు తెలుసా?
వాట్సాప్ యూజర్లకు శుభవార్త. సెక్యూరీటీ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్న వాట్సాప్ త్వరలో లాగిన్ అప్రూవల్ పేరుతో మరో కొత్త ఫీచర్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సందర్భానుసారం మనం ఉపయోగించే కంప్యూటర్లో జీమెయిల్ అకౌంట్ను ఓపెన్ చేస్తుంటాం. అలా కాకుండా కొత్త కంప్యూటర్లలో జీమెయిల్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే..జీమెయిల్ ఓపెన్ చేసేది మీరేనా? కాదా అంటూ మన ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ వస్తుంది. ఇదే తరహాలో ఇన్స్ట్రాగ్రామ్లో సైతం లాగిన్ అప్రూవల్ అడుగుతుంది. త్వరలో వాట్సాప్ సైతం ఈ తరహా సెక్యూరిటీ ఫీచర్ను ఎనేబుల్ చేయనుంది. యూజర్లు పొరపాటున కొత్త డివైజ్ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే.. వెంటనే మనకు సదరు వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసేది ఎవరని ప్రశ్నిస్తూ ఓ మెసేజ్ పంపుతుంది. ఆ మేసేజ్కు మీరు రిప్లయి ఇస్తేనే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ బ్లాగ్ వీ బీటా ఇన్ఫో ప్రకారం..ఎవరైనా “ఎవరైనా మీ వాట్సాప్ అకౌంట్లో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు అందుకు అంగీకరించాల్సి ఉంటుంది. అంతేకాదు 6 అంకెల ఓటీపీని షేర్ చేస్తే.. ఆ నెంబర్ను తప్పుగా ఎంటర్ చేస్తే చివరకు లాగిన్ అయ్యే అవకాశాన్ని కోల్పోవచ్చు. అదనంగా, మీ వాట్సాప్ అకౌంట్ను మీకు తెలియకుండా ఎవరైనా లాగిన్ అయేందుకు ప్రయత్నిస్తే.. ఆఫోన్ వివరాలు, టైంతో పాటు ఇతర సమాచారం పొందవచ్చని పేర్కొంది. -
వాట్సాప్ యూజర్లకు షాక్.. ఒక్క జూన్లోనే 22 లక్షల అకౌంట్లు బ్యాన్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన యూజర్లపై మరో సారి కొరడా ఘుళిపించింది. భారత్లో జూన్ ఒక్క నెలలోనే ఏకంగా 22 లక్షల వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. వాట్సాప్కు అందిన ఫిర్యాదులు, ఉల్లంఘనలను గుర్తించే మెకానిజం ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొందరు యూజర్లు నిబంధనలకు విరుద్ధంగా ఫేక్ న్యూస్ షేర్ చేయడం, అనధికారిక మెసేజలు వ్యాప్తి, విద్వేషపూరిత ప్రసంగాలు లాంటివి చేస్తున్నారని అందుకే వారి అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. కాగా మే నెలలో 19 లక్షలకు పైగా అకౌంట్లకుపై నిషేధం విధించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్లతో యూజర్ల డేటా సురక్షితంగా ఉంచేందుకు వాట్సాప్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక టెక్నాలజీ వాడుతున్నామని, దీనిపై నిరంతరం నిపుణుల పర్యవేక్షణ ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గతేడాది నుంచి అమలులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ రూల్స్ 2021 నియమాల ప్రకారం 50 లక్షలకు పైగా యూజర్లు కలిగిన సోషల్ మీడియాలో అవాస్తవాలు, హింస ప్రేరేపిత, తప్పుడు వ్యాఖ్యలపై అందిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవాలి. నిషేధించిన అకౌంట్ల వివరాలు ప్రతి నెలా వెల్లడించాల్సి ఉంటుంది. చదవండి: వడ్డీ ఎక్కువైనా లోన్ యాప్స్ నుంచి రుణం -
5జీ దూకుడు మామూలుగా లేదుగా, ఎన్ని అవాంతరాలున్నా తగ్గేదేలే!
సాక్షి,న్యూఢిల్లీ: 5జీ టెక్నాలజీ రికార్డు స్థాయిలో దూసుకుపోనుంది. గ్లోబల్ 5జీ మొబైల్ సబ్స్క్రిప్షన్లు 2022లో 100కోట్లను అధిగమించ గలవని అంచనా వేస్తున్నట్లు, స్వీడిష్ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ తాజాగా వెల్లడించింది. qఅయితే బలహీనమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉక్రెయిన్పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన అనిశ్చితుల కారణంxe తమ అంచనాలో 2022లో సుమారు 100 మిలియన్ల మేర తగ్గాయని కంపెనీ తన ద్వైవార్షిక మొబిలిటీ నివేదికలో పేర్కొంది. 10 ఏళ్లకు బిలియన్ సబ్స్క్రైబర్లను సాధించిన 4జీ కంటే రెండేళ్ల ముందుగానే ఈ మార్కును చేరుకుంటుందని వ్యాఖ్యానించింది. తాజా నివేదిక ప్రకారం మొదటి త్రైమాసికంలో 5జీసబ్స్క్రిప్షన్లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 620 మిలియన్లకు చేరుకోగా, 4జీ సబ్స్క్రైబర్లు 70 మిలియన్లు పెరిగి దాదాపు 4.9 బిలియన్లకు చేరుకున్నాయి. 4 జీ కంటే 100 రెట్ల వేగాన్ని అందించే 5జీ వినియోగదారుల సంఖ్య గరిష్ట స్తాయికి చేరుకుంటుందని తెలిపింది. 4జీ వినియోగదారుల వృద్ధి ఈ సంవత్సరం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ 5జీ నేపథ్యంలో సబ్స్క్రైబర్ల తగ్గుముఖం పడుతుందని నివేదిక పేర్కొంది. కాగా 4 జీ చందాదారులు రికార్డుస్థాయికి చేరతారని గత ఏడాది ఎరిక్సన్ ముందుగానే అంచనా వేసింది. 5జీ నెట్వర్క్, 120 డాలర్ల కంటే తక్కువకు హ్యాండ్సెట్ ధరల కుదింపులో టెలికాం ఆపరేటర్ల ఒత్తిడి 5జీ స్వీకరణకు సహాయపడిందని రిపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పీటర్ జాన్సన్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఉత్తర అమెరికాలో65 మిలియన్లతో పోలిస్తే 2021లో 270 మిలియన్ల చైనా వినియోగదారులున్నారని వెల్లడించారు. అయితే 5జీ స్పెక్ట్రం వేలానికి కేంద్రం సిద్ధమవుతున్న సమయంలో ఈ ఏడాది చివరి నుండి భారత్లో 5జీ సబ్స్క్రిప్షన్లు పెరుగుతాయని భావిస్తున్నామన్నారు. కాగా దేశీయంగా 5జీ సబ్స్క్రైబర్ల సంఖ్య 2027 నాటికి 50 కోట్లకు చేరుకోనుందని ఎరిక్సన్ గతంలో అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
ట్విటర్ కొత్త ఫీచర్: ‘సర్కిల్’ ఎలా వాడాలి?
సాక్షి, ముంబై: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విటర్ కొత్త ఫీచర్ను పరిచయం చేయనుంది. తన యూజర్ల సౌకర్యం నిమిత్తం ఈ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. దీని పేరును ‘సర్కిల్’ గా పిలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఉన్న మాదిరిగా ట్విటర్ యూజర్ తన ట్వీట్ను ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో నిర్ణయించుకునే అవకాశాశాన్ని కల్పించనుంది. క్లోజ్ ఫ్రెండ్ ఫీచర్ ను పోలిన దానినే ట్విటర్లో ‘సర్కిల్ పేరుతొ తీసుకొస్తోంది. పరిమితంగా ఆండ్రాయిడ్, ఐవోస్ వినియోగదారులకు అందుబాటులో ఉందని ట్విటర్ తన బ్లాగ్ పోస్ట్లో వివరించింది. నిర్దిష్ట ట్వీట్లలో కొన్నింటిని స్నేహితులు మాత్రమే చూసే విధంగా సెట్ చేసుకోవచ్చు. సర్కిల్లో ఉన్నవారికి మాత్రమే సంబంధిత ట్వీట్లకు రిప్లై ఇవ్వడం, లైక్, రీట్విట్ లాంటి వాటికి అవకాశం ఉంటుందని ట్విటర్ పేర్కొంది. సర్కిల్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, ప్రపంచవ్యాప్తంగా కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే ఈ సర్కిల్ ఫీచర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఎలా యూజ్ చేయాలంటే ట్విటర్ యాప్లో మెయిన్ మెనూలో ట్వీట్ కంపోజర్ క్లిక్ చేయాలి. ఇక్కడ ట్విటర్ సర్కిల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత సెలెక్ట్ ఎవ్రీవన్ లేదా మన కిష్టమైన వ్యక్తులను సెలక్ట్ చేసుకొని, డన్ క్లిక్ చేయాలి. ఒకవేళ లిస్ట్ లోని వారిని ఎవరినైనా వద్దు అనుకుంటే రిమూవ్ చేసే అవకాశం కూడా ఉంది. -
5జీ ఎఫెక్ట్.. కొత్త ఫోన్లకు సూపర్ క్రేజ్
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు గ్రామీణ ప్రాంతాలు దన్నుగా నిలుస్తున్నాయి. దీనితో వచ్చే అయిదేళ్లలో స్మార్ట్ఫోన్ల యూజర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లకు చేరనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2021 గణాంకాల ప్రకారం దేశీయంగా 120 కోట్ల మొబైల్ యూజర్లు ఉండగా.. వీరిలో 75 కోట్ల మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వచ్చే అయిదేళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ఫోన్లు తయారు చేసే రెండో దేశంగా నిలవనుంది. ఈ నేపథ్యంలోనే డెలాయిట్ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ 2026 నాటికి స్మార్ట్ఫోన్ మార్కెట్ 1 బిలియన్ (100 కోట్లు) యూజర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది‘ అని 2022 గ్లోబల్ టీఎంటీ (టెక్నాలజీ, మీడియా.. వినోదం, టెలికం) అంచనాల పేరిట రూపొందించిన నివేదికలో డెలాయిట్ తెలిపింది. దీని ప్రకారం 2021–26 మధ్య కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం వార్షిక వృద్ధి రేటు పట్టణ ప్రాంతాల్లో 2.5 శాతంగా ఉండనుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 6 శాతం స్థాయిలో నమోదు కానుంది. ‘ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ స్మార్ట్ఫోన్లకు కూడా డిమాండ్ పెరగవచ్చు. ఫిన్టెక్, ఈ–హెల్త్, ఈ–లెరి్నంగ్ మొదలైన అవసరాల రీత్యా ఈ మేరకు డిమాండ్ నెలకొనవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. భారత్నెట్ ప్రోగ్రాం కింద 2025 నాటికల్లా అన్ని గ్రామాలకు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ ప్రణాళిక కూడా గ్రామీణ మార్కెట్లో ఇంటర్నెట్ ఆధారిత డివైజ్ల డిమాండ్కు దోహదపడగలదని వివరించింది. కొత్త ఫోన్లకే మొగ్గు.. 2026 నాటికి పట్టణ ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనే వారి సంఖ్య 5 శాతానికే పరిమితం కావచ్చని 95 శాతం మంది తమ పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ఫోన్లను కొనుక్కునేందుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని డెలాయిట్ నివేదికలో తెలిపింది. 2021లో ఇలా తమ పాత ఫోన్ల స్థానంలో ప్రీ–ఓన్డ్ స్మార్ట్ఫోన్లను కొనేవారు 25 శాతంగా ఉండగా.. కొత్త వాటిని ఎంచుకునే వారి సంఖ్య 75 శాతంగా నమోదైంది. ఫోన్ సగటు జీవితకాలం దాదాపు నాలుగేళ్లుగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధోరణి కనిపించనుంది. 2026లో ఆయా ప్రాంతాల్లో రీప్లేస్మెంట్లకు సంబంధించి 80 శాతం వాటా కొత్త ఫోన్లది ఉండనుండగా.. మిగతా 20 శాతం వాటా సెకండ్ హ్యాండ్ ఫోన్లది ఉండనుంది. ఇక స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య పెరిగే కొద్దీ ఫీచర్ ఫోన్ల స్థానంలో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయడం కూడా తగ్గనుంది. 2021లో ఫీచర్ ఫోన్ రీప్లేస్మెంట్ .. పట్టణ ప్రాంతాల్లో 7.2 కోట్లుగా ఉండగా 2026లో ఇది 6 కోట్లకు తగ్గనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో 7.1 కోట్ల నుంచి 6 కోట్లకు దిగి రానుంది. 5జీతో పెరగనున్న డిమాండ్ .. డెలాయిట్ అధ్యయనం ప్రకారం భారత్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ 6 శాతం మేర వార్షిక వృద్ధితో 2026 నాటికి 40 కోట్లకు చేరనుంది. 2021లో ఇది 30 కోట్లుగా ఉంది. 5జీ సర్వీసుల కారణంగా స్మార్ట్ఫోన్లకు ప్రధానంగా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. దాదాపు 80 శాతం అమ్మకాలకు (సుమారు 31 కోట్ల యూనిట్లు) ఇదే ఊతంగా నిలవనుంది. హై–స్పీడ్ గేమింగ్, మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించడం వంటి వివిధ రకాల అవసరాలకు ఉపయోగపడే 5జీ టెక్నాలజీ.. మిగతా మొబైల్ సాంకేతికలతో పోలిస్తే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉందని డెలాయిట్ తెలిపింది. ఒక్కసారి 5జీ సర్వీసులను ఆవిష్కరిస్తే .. 2026 నాటికి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు మొత్తం మీద అదనంగా 13.5 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. ‘2022–26 మధ్య కాలంలో మొత్తం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనితో ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు చేరనుంది. అయిదేళ్ల వ్యవధిలో 84 కోట్ల పైచిలుకు 5జీ పరికరాలు అమ్ముడు కానున్నాయి‘ అని డెలాయిట్ వివరించింది. మరోవైపు, మీడియా విషయానికొస్తే.. కొరియన్, స్పానిష్ వంటి అంతర్జాతీయ కంటెంట్కు భారత్లో ప్రాచుర్యం పెరుగుతోందని తెలిపింది. దీంతో పలు స్ట్రీమింగ్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని పేర్కొంది. తమ కస్టమర్లను కాపాడుకునే క్రమంలో స్ట్రీమింగ్ సర్వీసుల కంపెనీలు.. రేట్ల విషయంలో పోటీపడే అవకాశం ఉంటుందని తెలిపింది. తగ్గనున్న చిప్ల కొరత.. సెమీకండక్టర్ చిప్ల కొరతతో ప్రపంచవ్యాప్తంగా తయారీ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని డెలాయిట్ తెలిపింది. సమీప కాలంలో డిమాండ్ పెరిగే కొద్దీ సరఫరాపరమైన పరిమితులు కొనసాగవచ్చని.. 2023లో క్రమంగా పరిస్థితి మెరుగుపడవచ్చని పేర్కొంది. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్ తయారీలో భారత్ ప్రాంతీయంగా పటిష్టమైన హబ్గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ పీఎన్ సుదర్శన్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం .. ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. -
క్రెడిట్ కార్డు కస్టమర్లకు చార్జీల మోత..
-
యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్!
ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూట్యూబ్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా చూసిన వీడియోల్ని ఇకపై డబ్బులు చెల్లించి వీక్షించాలని యూట్యూబ్ కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది. రాబోయే రోజుల్లో యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ కాస్త మరింత కమర్షియల్గా మారనుంది. ఇప్పటికే యూట్యూబ్లో కొన్ని వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాలి. మనకు నచ్చిన సినిమానో లేదంటే వెబ్ సిరీస్ చూసే సమయంలో యాడ్స్ రాకుండా ఉండాలంటే పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై డౌన్లోడ్ చేసుకున్న వీడియోలకు డబ్బులు కట్టాలని యూట్యూబ్ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. బఫరింగ్ సమస్య , డేటా అయిపోతుందనే బాధలేకుండా విద్యార్ధులు, ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల కోసం నచ్చిన వీడియోల్ని చూపించేలా యూట్యూబ్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టి మరి ఆ వీడియోల్ని చూపించే వారు. విద్యార్ధులు సైతం వారికి కావాల్సిన ఏదైనా కోర్స్ ట్యుటోరియల్ వీడియోల్ని డౌన్లోడ్ పెట్టుకొని వీక్షించేవారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభంలో ఈ డౌన్లోడ్ సదుపాయాన్ని వినియోగించుకునే వారి సంఖ్య ఎక్కువైంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేలా యూట్యూబ్' డౌన్లోడ్ వీడియోలకు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలని సూచించింది. దీంతో తాజా యూట్యూబ్ నిర్ణయంపై యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది -
కరోనా దెబ్బకు డిమాండ్, భలే స్కెచ్చేసిన మార్క్ జుకర్ బర్గ్..!
కోవిడ్ కారణంగా ప్రపంచ దేశాల్లో యూపీఐ, క్యూఆర్ కోడ్ పేమెంట్స్ వినియోగం పెరిగిపోతుంది. అయితే దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆయా సంస్థలు యూపీఐ Unified Payments Interface (UPI) పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే ఫోన్పే, పేటీఎం, గూగుల్పే, వాట్సాప్లు ఉండగా.. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్(మెటా) అధినేత మార్క్ జుకర్ బర్గ్ సైతం ఈ యూపీఐ సర్వీసుల్ని ఫేస్బుక్ మెసెంజర్లో అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో బీటా వెర్షన్ పై పనిచేస్తున్నట్లు, మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ఆ తరువాత ఇతర దేశాల్లో సైతం ఈ ఫీచర్ను వినియోగించేకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఫేస్బుక్ ప్రతినిధులు చెప్పారు. వచ్చే వారం యూఎస్యూలోని మెసేంజర్ యూజర్లు వినియోగించేలా పేమెంట్ ఆప్షన్పై టెస్ట్ చేయనున్నట్లు ఫేస్బుక్ తన బ్లాగ్లో పేర్కొంది. స్ప్లిట్ పేమెంట్ పేరుతో మెసెంజర్లో ఫేస్బుక్ పరిచయం చేయనున్న ఈ ఫీచర్తో నిత్యవసర సరుకులు, రెంట్, హోటల్ బిల్లుల్ని ఒకేసారి సెండ్ చేయొచ్చు. అదే సమయంలో నోటిఫికేషన్ సైతం పంపిచుకోవచ్చు. చెల్లించిన మొత్తం సంబంధిత వ్యక్తులకు ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు గ్రూప్లో ఒక చాట్లా కనిపిస్తుంది. ఫీచర్ ఎలా పనిచేస్తుంది ►స్ప్లిట్ పేమెంట్స్ ఫీచర్ని ఉపయోగించడానికి గ్రూప్ చాట్లో “గెట్ స్టార్ట్” అనే బటన్పై క్లిక్ చేయాలి. ►క్లిక్ చేస్తే పేమెంట్స్ ఎవరెవరికి ఎంత పంపించాలో డివైడ్ చేయాలి ►ఆ వివరాల్ని ఎంటర్ చేసిన అనంతరం మీరు మీ ఫేస్బుక్ పేమెంట్ వివరాల్ని కన్ఫాం చేయాల్సి ఉంటుంది. ►కన్ఫామ్ చేసిన తరువాత.. మీ పంపిన మెసేజ్ వెళ్లిందా లేదా చెక్ చేయాలి. చదవండి: జుకర్ బర్గ్ను వెంటాడుతున్న యూకే, అమ్ముతావా? లేదా? -
అసలు ఏం జరుగుతోంది ? నిన్న ఫేస్బుక్...నేడు..
అక్టోబర్ 4 న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు ఏడు గంటలపాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. నానాఅవస్థల తరువాత తిరిగి ఆ సేవలు యధావిధిగా కొనసాగాయి.ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో యూజర్లు ఒక్కసారిగా అంధకారంలో ఉండిపోయారు. ఇప్పుడు కొంతమంది యూజర్లకు మరో తలనొప్పి వచ్చి పడింది. నిన్న ఫేస్బుక్..ఇప్పుడు జియో...! భారత్లో అతి తక్కువ ధరలకే ఇంటెర్నెట్ సేవలను అందిస్తోన్న జియో నెట్వర్క్ పలు నగరాల్లో ఈ రోజు(అక్టోబర్ 6న) నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో వినియోగదారులు నెట్వర్క్లో సమస్యలు ఉన్నాయంటూ ట్విటర్లో #Jiodown పేరుతో ట్రెండ్ చేస్తున్నారు.పలువురు జియో యూజర్లు డౌన్డిటెక్టర్లో నెట్వర్క్ డౌనైందని రిపోర్ట్చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో డౌన్డిటెక్టర్కు గణనీయమైన రిపోర్టులు వచ్చాయి. ఇదిలా ఉండగా నెట్వర్క్ క్యారియర్ జియో నుంచి ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ , ఇండోర్ వంటి పెద్ద నగరాల్లో చాలా మంది జియో నెట్వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ట్విటర్లో నెటిజన్ల అసహనం...! జియో స్పందన.. పలు ప్రాంతాల్లో జియో నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా ఉండడంతో యూజర్లు ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ట్వీట్లకు జియోకేర్ స్పందించింది. జియోకేర్ ఒక కస్టమర్కు స్పందిస్తూ... , “మేము ప్రస్తుతం మీ లొకేషన్లో కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్నాము. మా టెక్నికల్ బృందం దానిపైనే పనిచేస్తోంది. వీలైనంత త్వరగా సేవలు పునరుద్ధరించబడతాయి. " అని ట్విటర్లో పేర్కొంది. after facing fb, whatsApp n instagram outage, it's time for jio#jio #Jiodown pic.twitter.com/yDGzvf3F1w — Raghav Patidar (@im_raghav96) October 6, 2021 No it's not your phone, stop restarting your phones!! It's jio😑#Jiodown https://t.co/TGCw3HrrhV — Pradeep Yadav (@DeePBhopali) October 6, 2021 @JioCare please get my connection fixed unable to lodge case via toll free or chat it gets dis connected saying "During this pandemic situation we are working with Limited System & Resources. We are currently unable to answer your query. We appreciate your cooperation. — Nitesh Kumar Khatri (@nitesh0900) October 6, 2021 #JioDown: #RelianceJio network goes down in certain circles, users report they cannot use internet or make callshttps://t.co/9I2kbPvqkf By @jainrounak pic.twitter.com/4aF92wHSkR — Business Insider India🇮🇳 (@BiIndia) October 6, 2021 చదవండి: గూగుల్ నుంచి ‘స్నోకోన్’, దాని వెనుక చరిత్ర ఏంటో తెలుసా ? -
అలెర్ట్: మీరు ఆ ఫోన్లు వాడుతుంటే ఇకపై వాట్సాప్ పనిచేయదు
యూజర్లకు వాట్సాప్ హెచ్చరికలు జారీ చేసింది. యూజర్లు వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0 వినియోగిస్తున్నట్లైతే వెంటనే అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. లేదంటే అప్డేట్ చేయని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని స్పష్టం చేసింది. వీటితో పాటు పలు పాత మోడల్ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ఆండ్రాయిడ్ 4.1 సపోర్ట్ చేయదని, అందుకే ఆఫోన్లలో వాట్సాప్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. వాట్సాప్ ఫీచర్ లీకర్ వీ బీటా ఇన్ఫో ప్రకారం..కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లకు ఆకట్టుకునేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తుంది.పనిలో పనిగా ఆండ్రాయిడ్ వెర్షన్లలో మార్పులు చేస్తుంది. తాజాగా వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0 ను అప్ డేట్ చేసింది. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ వర్షన్ 4.0ను వినియోగిస్తున్న యూజర్లు ఆండ్రాయిండ్ వెర్షన్ 4.1కి అప్ డేట్ అవ్వాలని తెలిపింది. అధికారిక సపోర్ట్ పేజీలో సైతం వాట్సాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.1 సపోర్ట్ చేస్తున్నట్లు పేర్కొంది. నవంబర్1,2021 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.4 ఉంటే వాట్సాప్ పనిచేయదని చెప్పింది. ఇక వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ సపోర్ట్ చేయని స్మార్ఫోన్ల జాబితాలో ఆప్టిమస్ ఎల్ 3, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ఐఐ, గెలాక్సీ కోర్, జెడ్టిఇ గ్రాండ్ ఎస్ ఫ్లెక్స్, హువాయ్ అసెండ్ జి 740లు ఉన్నాయి. ఈ ఫోన్లలో లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ కాదని వాట్సాప్ ప్రకటించింది. చదవండి: ఫీచర్లతో డబ్బులే డబ్బులు, వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్! -
వాట్సాప్లో కొత్త ఫీచర్..! యూజర్లకు కాస్త ఊరట..!
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ సెట్టింగ్ను తిరిగి యూజర్లకు అందుబాటులో రానుంది. చివరిసారిగా వాట్సాప్ను ఏ సమయంలో ఉపయోగించారో చూపించే లాస్ట్సీన్ సెట్టింగ్లో అప్డేట్ను తీసుకురానుంది. లాస్ట్సీన్ ఆప్షన్ ద్వారా యూజర్లకు సంబంధించిన ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఆయా యూజర్ ఎప్పుడు వాడరనే విషయాన్ని రెసిపెంట్ కాంటాక్టులకు తెలియజేస్తుంది. చదవండి: WhatsApp: 'మనీ హెయిస్ట్ సీజన్ 5' ఎమోజీలొస్తున్నాయ్ లాస్ట్సీన్ ఆప్షన్ ఎవరు చూడకుండా ఉండడం కోసం ప్రైవసీ సెట్టింగ్లో ‘నోబడీ’, ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్ అప్షన్స్ను ఎంచుకోవడం ద్వారా లాస్ట్సీన్ను ఇతర యూజర్ల నుంచి నియంత్రించుకోవచ్చును. తాజాగా వాట్సాప్ లాస్ట్సీన్ సెట్టింగ్లో మరో ఆప్షన్ త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. లాస్ట్సీన్ సెట్టింగ్లో భాగంగా ‘మై కాంటాక్ట్స్ ఎక్సప్ట్’ అనే ఆప్షన్ను వాట్సాప్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంచుకున్న ఆయా కాంటాక్ట్లకు యూజర్ లాస్ట్సీన్ కన్పించదు. ప్రస్తుతం ఈ సెట్టింగ్ను వాట్సాప్ కేవలం ఐవోస్ యూజర్లకోసం పరీక్షిస్తుండగా ఈ సెట్టింగ్ను త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి వస్తోందని డబ్ల్యూఏబెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెట్టింగ్తో కొంతమంది లాస్ట్సీన్ ఆప్షన్ను పూర్తిగా ఆఫ్ చేయకుండా నచ్చిన వ్యక్తులకు కన్పించే విధంగా చేసుకోవడంతో యూజర్లకు కాస్త ఊరట కల్గనుంది. చదవండి: Microprocessor Chips: సొంత చిప్ ప్రకటనలు పాతవే.. ఇప్పటికైతే డిజైన్ వరకే? -
వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్
చేజారిపోతున్న యూజర్లను మళ్లీ తనవైపుకు తిప్పుకునేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త అప్డేట్లతో ముందుకు వస్తోంది. తాజాగా మరో సూపర్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. యాపిల్ ఐ మెసేజ్,ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ తరహాలో మెసేజ్ రియాక్షన్ ఎమోజీ తో పాటు వరల్డ్ వైడ్గా పాపులర్ అయిన వెబ్ సిరీస్ 'మనీ హెయిస్ట్' ఎమోజీలను వినియోగించుకోవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా'లో తెలిపింది. More details: • You can react to a message multiple times with different emojis. • The process to send a reaction is end-to-end encrypted, so nobody outside the chat can see your reactions. • You can react to messages in individual chats as well. https://t.co/mJwPL44xvK — WABetaInfo (@WABetaInfo) September 4, 2021 కమ్యూనిటీ బ్లాగ్లో ఏముంది? 'వాట్సాప్ బీటా' ఇన్ఫర్మేషన్ ప్రకారం..వాట్సాప్ పర్సనల్ అకౌంట్, లేదంటే పబ్లిక్ గ్రూప్లలో యూజర్ల మధ్య సంభాషణలు జరుగుతుంటాయి. ఆ సమయంలో సిచ్చువేషన్కు తగ్గట్లు ఎమోజీలను సెండ్ చేయాలంటే సాధ్యమయ్యేది కాదు. కానీ తాజాగా వాట్సాప్ ఆ ఫీచర్ను బిల్డ్ చేసినట్లు వెల్లడించింది.ఇకపై యూజర్లు చాటింగ్కు అనుగుణంగా ఎమోజీలను సెండ్ చేసుకోవచ్చుని, ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు స్పష్టం చేసింది. వీటితో పాటు నెట్ ఫ్లిక్స్లో విడుదలైన 'Money Heist Season 5' కి చెందిన 17 ఎమోజీలను త్వరలో విడుదల చేస్తున్నట్లు బ్లాగ్ పేర్కొంది. ఈ రెండు ఫీచర్లను ఎప్పుడు విడుదల చేస్తుందనే అంశంపై వాట్సాప్ క్లారిటీ ఇవ్వలేదు. కమ్యూనిటీ బ్లాగ్లో స్క్రీన్ షాట్లను షేర్ చేయడంతో ఫీచర్లు మరో కొద్దిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని యూజర్లు అంచనా వేస్తున్నారు. అకౌంట్లను బ్లాక్ చేస్తున్న వాట్సాప్ గత కొద్ది కాలంగా ఆయా దేశాల ఐటీ రూల్స్కు విరుద్దంగా వ్యవహరిస్తున్న యూజర్లపై వాట్సాప్ ఉక్కుపాదం మోపుతోంది. యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనుచిత, హానికరమైన సమాచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. ఇటీవలే ఈ ఏడాది జూన్ - జూలై నెలల మధ్య కాలంలో 3 మిలియన్లకు పైగా ఖాతాలను నిషేధించినట్లు అధికారికంగా చెప్పింది. అందుకే చేజారిపోతున్న యూజర్లను తనవైపుకు తిప్పుకునేందుకు వాట్సాప్ మరిన్ని అప్డేట్లను తెచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: వారెన్ బఫెట్ తరువాత మనోడే, ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ -
ట్విట్టర్ను వదిలేస్తున్నారు,'కూ' కు క్యూ కట్టేస్తున్నారు
ట్విట్టర్కు కేంద్రానికి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు దేశీ సోషల్ మీడియా నెట్ వర్క్ 'కూ' కు వరంగా మారింది. కూ' ను ప్రారంభించిన కేవలం 16 నెలల కాలంలో 10మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుందని సోషల్ మీడియా స్టాటిటిక్స్ సెన్సార్ టవర్ తెలిపింది. ట్విట్టర్కు ప్రత్యామ్నాయం అమెరికాకు చెందిన ట్విట్టర్ను వినియోగించే జాబితాలో భారత్ 22.1 మిలియన్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో నవంబర్ 14,2019 లో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రప్రెన్యూర్ లు అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ లు బెంగళూరు కేంద్రంగా 'కూ' ను అందుబాటులోకి తెచ్చారు. ట్విట్టర్ కు కేంద్రానికి వైరం 2020 నాటికి కూ యాప్ ను 2.6 మిలియన్ల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. అయితే ట్విట్టర్ భారత్ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందంటూ పలువురు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై కేంద్రం ట్విట్టర్కు పలు ఆదేశాలు జారీ చేసింది. అయినా ట్విట్టర్ లైట్ తీసుకుంది.ముఖ్యంగా 2020-21 మధ్య కాలంలో వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళన, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సర్టిఫైడ్ బ్లూ టిక్ ను తొలగించడం, కేంద్రం తెచ్చిన ఐటీ నిబంధనల్ని ఉల్లంఘించడంతో కేంద్రానికి - ట్విట్టర్ల మధ్య వార్ మొదలైంది. దీంతో కేంద్ర కేబినెట్ మినిస్టర్లు పియూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్లు ట్విట్టర్ అకౌంట్ను డిలీట్ చేసి దేశీ నెట్వర్క్ కూ'ను వినియోగించడం ప్రారంభించారు. అప్పటి నుంచే ట్విట్టర్ యూజర్లు కాస్త కూ కు అలవాటు పడ్డారు. దేశీ నెట్ వర్క్ కేంద్రం - ట్విట్టర్ల వివాదం కూ' కు ప్లస్ అయ్యింది. హిందీ, ఇంగ్లీష్తో పాటు ఇతర స్థానిక భాషల్లో ఆపరేట్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన ఈ నెట్ వర్క్ను 85శాతం మంది యూజర్లు వినియోగిస్తున్నారు. ట్విట్టర్ యూజర్లు కాస్త దాన్ని వదిలేసి కూ ను వినియోగించేందుకు క్యూ కడుతున్నారు.వారిలో మంత్రులు,బాలీవుడ్ సెలబ్రిటీస్, క్రికెటర్లతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కూ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ స్థానిక భాషాల్లో దేశీ యాప్ను వినియోగించేలా డెవలప్ చేశామన్నారు. త్వరలోనే సౌత్ ఈస్ట్ ఏసియన్ కంట్రీస్, ఈస్ట్రన్ యూరప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ యాప్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి : ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్
టెక్నాలజీలో గూగుల్ మ్యాప్స్ నిజంగానే ఓ గేమ్ ఛేంజర్. గమ్యస్థానం చేరుకునేందుకు సరైన మార్గం కోసం కోట్ల మంది గూగుల్ మ్యాప్స్ను ఉపయోగించుకుంటున్నారు. ఒక సెకనులో 70వేలమంది, గంటలకు 227 మిలియన్ల మంది.. ఒకరోజులో దాదాపు ఐదున్నర బిలియన్ల గూగుల్ యూజర్లు మ్యాప్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి యాప్ ఇప్పుడు రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్లు అందించింది. గూగుల్ మ్యాప్.. ఓ ఆసక్తికరమైన ఫీచర్ను తీసుకురాబోతోంది. రహదారులపై టోల్ ఛార్జ్ వివరాల్ని యూజర్లకు ముందుగానే తెలియజేయబోతోంది. తద్వారా వాహనదారుడు ముందుగానే తన రూట్ను ఎంచుకునే అవకాశం కలగనుంది. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్లో ఉన్న ఈ ఫీచర్ను వీలైనంత త్వరలోనే గూగుల్ మ్యాప్ అందుబాటులోకి రానుంది. కొందరు వాహనదారులకు కొత్త రూట్లో ప్రయాణించినప్పుడు రహదారి ఎలా ఉండబోతోంది? మధ్యలో ఎన్ని టోల్ గేట్స్ ఉన్నాయి? ఎంత వసూలు చేస్తారు? అనే వాటిపై ఒక ఐడియా ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ల కోసం గూగుల్ మ్యాప్ ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. అయితే దీనిపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోయినా.. గూగుల్ మ్యాప్ ప్రివ్యూ ప్రోగ్రాం ఓ సందేశాన్ని పంపింది. చాలా దేశాల్లో వాజే మ్యాపింగ్ యాప్(ఇది కూడా గూగుల్ కిందే పని చేస్తోంది) ఇలాంటి ఫీచర్గా వాహనదారులకు ఉపయోగపడుతోంది. ఇక గూగుల్ మ్యాప్ టోల్ ట్యాక్స్ ధరలను ఎలా తెలియజేస్తుందనే దానిపై ఇప్పటివరకు స్పష్టత లేకపోయినా.. బహుశా టోల్ ఆపరేటర్లు ఫిక్స్ చేసే ధరల పట్టిక, రోడ్డు మార్గాలు తదితర వివరాల వెబ్సైట్ ఆధారంగా.. వాహనదారులకు తెలియజేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చెల్లిస్తేనే.. ముందుకు వెళ్లేది! గూగుల్ మ్యాప్లో బెస్ట్ ఫీచర్గా ‘టర్న్ బై టర్న్’ నావిగేషన్కు పేరుంది. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో, ఇరుకు గల్లీల్లో, సిటీల్లో చాలామంది ఈ ఫీచర్ను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇది ఉపయోగించాలంటే ఇప్పుడు ఎంతో కొంత చెల్లించాల్సిందే. అవును.. ప్రస్తుతం ఈ ఫీచర్.. గూగుల్ క్రౌడ్ఫండింగ్ ఫీచర్ కిందకు వెళ్లిపోయింది. జీపీఎస్ లొకేషన్-నేవిగేషన్ను యూజర్కు అందించడం భారంగా మారుతున్న నేపథ్యంలోనే గూగుల్ మ్యాప్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచే ఈ ఫీచర్ను మొదలుపెట్టింది గూగుల్ మ్యాప్(అప్డేట్ చేసుకోవాల్సిందే!). అయితే మొత్తం గూగుల్ యాప్నే ‘పే అండ్ యూజ్’ కిందకు తీసుకురానుందా? అనే ప్రశ్నపై మాత్రం గూగుల్ మ్యాప్ మౌనం వహిస్తోంది. చదవండి: కంటిచూపుతోనే ఇక ఫోన్ ఆపరేటింగ్! -
ఇంటర్నెట్లో ఒక్క నిమిషం వ్యవధిలో జనం ఏం చేశారో తెలుసా?
ఒక్క నిమిషం.. 60 సెకన్లు.. ఇంత టైంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చేయగలరు? అవునూ.. ఏం చేయగలం అని ఆలోచిస్తున్నారా? మరి డిజిటల్ ప్రపంచంలో.. ఈ ఒక్క నిమిషంలో మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఇదే డౌటు మరికొందరికి వచ్చినట్లుంది. దీంతో 2021లో ఇంటర్నెట్లో ఒక్క నిమిషం వ్యవధిలో జనం ఏం చేశారన్న దానిపై ఓ పరిశోధన చేశారు. ఆ వివరాలు ఇవిగో.. 2021లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కొన్ని కట్టడాలను, ప్రదేశాలను గుర్తించింది. అందులో మన రామప్ప, గుజరాత్లోని దోలవీర ఉన్న సంగతి తెలిసిందే. దీంతో యునెస్కో ఇప్పటివరకూ 167 దేశాల్లోని 1,155 ప్రదేశాలను లేదా కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్లయింది. గతేడాది వరకూ చైనా, ఇటలీలు చెరో 55 స్థానాలతో సమానంగా ఉండేవి. తాజా జాబితాలో అది మారిపోయింది. ఇక మన పరిస్థితి చూస్తే.. భారత్ ఈ జాబితాలో టాప్–10లో ఉంది. ఆ వివరాలివీ.. -
పిల్లల ఇ(న్)ష్టాలపై.. పేరెంట్స్కి గైడెన్స్...
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఇన్స్టాగ్రామ్ యువతకు అత్యంత వేగంగా చేరువవుతోంది. సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు తదితర విశేషాల కోసం మాత్రమే కాకుండా స్వయంగా తాము కూడా విభిన్న రకాల కంటెంట్ను అప్లోడ్ చేస్తూ ఇన్స్టా కు ఫ్యాన్స్గా మారిపోతున్నారు యూత్. ఈ నేపధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతను దృష్టిలో ఉంచుకుని లక్షల సంఖ్యలో ఉన్న యువ వినియోగదారుల కంటెంట్ భద్రత దృష్ట్యా... ఇన్స్టాగ్రామ్ పేరెంట్స్ గైడ్ను రూపొందించింది. దీనిని హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ ఆన్లైన్ సదస్సులో విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ అందిస్తున్న అన్ని రకాల సేఫ్టీ ఫీచర్స్ గురించి తమ యువ వినియోగదారుల తల్లిదండ్రులకు తెలియజెప్పడమే ఈ పేరెంట్స్ గైడ్ రూపకల్పన ఉద్ధేశ్యమని రూపకర్తలు వివరించారు. మారుతున్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ గురించి అవగాహన కూడా ఇది అందిస్తుందన్నారు. టీనేజర్ల భధ్రత, హక్కులకు సంబంధించి పనిచేస్తున్న సెంటర్ ఫర్ సోషల్ రిసెర్చ్, సైబర్ పీస్ ఫౌండేషన్, ఆరంభ్ ఇండియా ఇనీషియేటివ్, యంగ్ లీడర్స్ ఫర్ యాక్టివిటీ సిటిజన్ షిప్., ఇట్స్ ఓకె టూ టాక్, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్.. వంటి సంస్థలు అందించిన విశేషాలు, వివరాలు ఈ గైడ్ లో పొందుపరచామన్నారు. అంతేకాకుండా ఈ గైడ్లో ఇన్స్టాగ్రామ్ అందిస్తున్న డిఎమ్ రీచబులిటీ కంట్రోల్స్, బల్క్ కామెంట్ మేనేజ్మెంట్ వంటివాటి గురించి సమగ్రంగా వివరించామన్నారు. అవగాహన అవసరం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీనేజర్లు, యువత ఆన్లైన్లో అత్యధిక సమయం వెచ్చిస్తున్న పరిస్థితుల్లో... వారు వినియోగిస్తున్న ఉత్పత్తులు, ఫీచర్ల గురించి తల్లిదండ్రులకు తెలిసి ఉండడం అత్యంత అవసరం. దీని వల్ల తమ పిల్లల సృజనాత్మక శైలి గురించి కూడా తెలుసుకోగలుగుతారు. అలాగే వారికి అందుబాటులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా అవగాహన పెంచుకుంటారు. –తారాబేడీ, ఇన్స్టాగ్రామ్ -
PUBG: అందరికీ అందుబాటులో బీజీఎమ్ఐ
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ తాజాగా బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది ప్రత్యేకంగా దేశీ గేమింగ్ ప్రియుల కోసం తయారు చేసిందని పేర్కొంది. ఈ ఏడాది మే 18న ప్రీ–రిజిస్ట్రేషన్స్ ప్రారంభించగా ఏకంగా 4 కోట్ల పైచిలుకు రిజిస్ట్రేషన్స్ వచ్చాయని తెలిపింది. జూన్ 17న గేమింగ్ ప్రియులకు ముందస్తుగా అందుబాటులోకి తెచ్చామని, సుమారు 2 కోట్ల మంది ప్లేయర్లు దీన్ని ఆడి, అభిప్రాయాలు తెలిపారని క్రాఫ్టన్ వివరించింది. ప్రస్తుతం ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీ–టు–ప్లే మల్టీప్లేయర్ గేమ్గా అందుబా టులో ఉంటుందని పేర్కొంది. క్రాఫ్టన్ అనుబం ధ సంస్థ పబ్జీ కార్పొరేషన్కి చెందిన పబ్జీ గేమ్ను, చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా కేంద్రం గతేడాది నిషేధించింది. చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ సంస్థ పబ్జీని భారత్లో పంపిణీ చేసేది. ఆ తర్వాత ఆ కంపెనీకి భారత్లో పంపిణీ హక్కులను ఉపసంహరించినట్లు పబ్జీ కార్పొరేషన్ అప్పట్లో తెలిపింది. తాజాగా దాని స్థానంలో క్రాఫ్టన్ కొత్త గేమ్ను ఆవిష్కరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో 100 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు క్రాఫ్టన్ తెలిపింది. ఇప్పటికే పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే ప్రక్రియలో ఉన్నట్లు వివరించింది. -
Twitter down: సమ్థింగ్ వెంట్ రాంగ్..
సాక్షి, న్యూఢిల్లీ: యూజర్ల ప్రైవసీ, ఫేక్ న్యూస్ వ్యవహారంలో దేశంలో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ట్విటర్ మరోసారి చిక్కుల్లో పడింది. భారత్ సహా పలు దేశాల్లో ట్విటర్ లాగిన్ సమస్య తలెత్తడం కలకలం రేపింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ట్విటర్ పనిచేయడం లేదంటూ యూజర్లు గగ్గోలు పెట్టారు. పదే పదే రిఫ్రెష్ కొట్టి మరీ లాగిన్కి ప్రయత్నించినపుడు సమ్థింగ్ వెంట్ రాంగ్..అన్న సందేశం యూజర్లను వెక్కిరించింది. సాంకేతిక సమస్యల కారణంగా ట్విటర్లోకి లాగిన్ కాలేకపోతున్నామంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వెబ్సైట్ను యాక్సెస్ చేస్తున్నప్పుడు ట్విట్టర్ వినియోగదారులు సమస్యలను ఎదుర్కోవడం కలకలం రేపింది. అలాగే తమ ప్రొఫైల్ యాక్సెస్ అవడం లేదని, కొందరికి టైమ్ లైన్ ఫీచర్ రావడం లేదని ఆరోపించారు. అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఎలాంటి సమస్యలేక పోవడంతో కొంతమంది వినియోగదారులకు ఊపిరి పీల్చుకున్నారు. డౌన్డిటెక్టర్ నివేదిక ప్రకారం 80 శాతం మంది వినియోగదారులు ముఖ్యంగా ఉదయం 8 గంటల సమయంలో వెబ్సైట్తో ఇబ్బంది పడ్డారు.16 శాతం ఆండ్రాయిడ్ యాప్ యూజర్లు ఈ యాప్ను యాక్సెస్ చేయలేకపోయారని, 8 శాతం ఐఓఎస్ యూజర్లు యాప్లో సమస్య తలెత్తిందని నివేదించింది. దాదాపు గంట సేపు ఈ గందరగోళం కొనసాగినట్టు పేర్కొంది. మరోవైపు ఈవ్యవహారంపై ట్విటర్ అధికారికంగా స్పందించింది. ఇబ్బందుల విషయం తమ దృష్టికి వచ్చిందని పరిష్కరిస్తున్నామని తెలిపింది. యూజర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది. ఆతరువాత సమస్య పరిష్కారమైనట్టు వెల్లడించింది. అయితే కొంతమంది ఇప్పటికి ఈ సమస్య విముక్తి లభించలేదని తెలుస్తోంది. చదవండి : ట్విట్టర్కు జాతీయ మహిళా కమిషన్ ఆదేశం Profiles’ Tweets may not be loading for some of you on web and we’re currently working on a fix. Thanks for sticking with us! — Twitter Support (@TwitterSupport) July 1, 2021 Is #twitterdown since seeing error messages. What about others? pic.twitter.com/Y77evfbSxZ — The Normal Investor (@DataXTradeXInv1) July 1, 2021 Aaaand we’re back. Twitter for web should be working as expected. Sorry for the interruption! — Twitter Support (@TwitterSupport) July 1, 2021 -
మొరాయించిన గూగుల్: యూజర్లు పరేషాన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజీన్ సంస్థ గూగుల్, దాని సంబంధిత సేవలు పనిచేయకపోవడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. ఆల్ఫాబెట్ సొంతమైన సెర్చ్ ఇంజన్ గూగుల్తో పాటు దాని స్ట్రీమింగ్, ఈమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందంటూ చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మానిటరింగ్ వెబ్సైట్ డౌన్డెక్టెక్టర్ ఈ విషయాన్ని నివేదించింది. ఈ సమస్యకు గల కారణాలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. డౌన్డెక్టెక్టర్ అందించిన సమాచారం ప్రకారం గూగుల్, యూట్యూబ్, జీమెయిల్తో కొన్ని గూగుల్ ప్లాట్ఫారమ్లు సోమవారం సాయంత్రంనుంచి మొరాయించాయి. ఉత్తర అమెరికాలోని కొన్నిప్రాంతాల్లోకి లాగిన్ అయ్యేందుకు, వెబ్సైట్ను యాక్సెస్ చేయడంలో సమస్యలు తలెత్తాయంటూ ఫిర్యాదు చేసినట్లు డౌన్డెక్టర్ తెలిపింది. ఒక దశలో వెయ్యి మందికి పైగా వినియోగదారులు గూగుల్ సేవల అంతరాయంతో గగ్గోలు పెట్టారని తెలిపింది. దీంతో పాటు యూట్యూబ్ టీవీ , గూగుల్ డ్రైవ్తో కూడా వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. చదవండి : ఫేస్బుక్, గూగుల్కు సమన్లు ఫ్లిప్కార్ట్ ధమాకా సేల్: ఇన్వర్టర్ ఏసీలపై భారీ తగ్గింపు -
మన లైక్ కౌంట్... ఇకపై సీక్రెట్
యువతకు, సామాజిక మాధ్యమాలపై కోట్లాది మందికి మోజు పెరగడానికి ఒక ప్రధాన కారణం లైక్స్. తాము పెట్టే పోస్టులు, చేసే షేరింగ్స్...ఇంకేవైనా సరే విశ్వవ్యాప్తంగా లైక్స్ను కొల్లగొట్టే అవకాశం ఉండడంతో పోటా పోటీగా సోషల్ వీరులు చెలరేగిపోతున్నారనేది తెలిసిందే. అదే సమయంలో లైక్స్ తగ్గడం, పెరగడం అనేవి అనేక రకాలుగా సమస్యలు సృష్టిస్తున్న సంగతీ తెలిసిందే. ఈనేపథ్యంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పై ప్రతి ఒక్కరికీ తమకు వచ్చే లైక్ కౌంట్స్ను ఇతరులకు కనబడకుండా దాచుకునే అవకాశం అందిస్తున్నట్లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రతినిధులు ప్రకటించారు. సాధారణ ప్రజలతో పాటుగా నిపుణుల నుంచి విన్నదాని ప్రకారం లైక్ కౌంట్స్ అనేవి కొంతమందికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించడం లేదు, కొంతమందికి మాత్రం ఇది బాధను మిగులుస్తుంది. కొంతమంది ప్రజలు లైక్ కౌంట్స్ను ఏది ట్రెండింగ్లో ఉందనేది తెలుసుకోవడం కోసం వినియోగిస్తున్నారని తేలింది. అందుకే ఈ మార్పు చేర్పులను జత చేసినట్టు వెల్లడించారు. తాము జత చేసిన కొత్త టూల్స్ ద్వారా తమ డీఎంల నుంచి ప్రమాదకరమైన కంటెంట్ను యూజర్స్ ఫిల్టర్ చేసుకునేందుకు వీలు కలుగుతుందని, అలాగే ఫేస్బుక్ న్యూస్ ఫీడ్పై తాము ఏది చూస్తున్నాం, ఏది పంచుకుంటున్నామనే అంశాలపై నియంత్రణకు సాధ్యమవుతుందని వివరించారు. ఇప్పుడు యూజర్స్ మరింత ప్రైవసీని, సౌకర్యాలను కోరుకుంటున్నారనీ రాబోయే కొద్ది వారాలో ఈ కంట్రోల్స్ అన్నీ కూడా ఫేస్బుక్పై కనిపించనున్నాయనీ వీరు తెలిపారు. దాచుకోండి ఇలా... సొంత పోస్ట్లపై లైక్ కౌంట్స్ను దాచుకునే అవకాశం వల్ల ఇతరులు మన పోస్ట్లకు ఎన్ని లైక్లు వచ్చాయనేది ఏ మాత్రం తెలుసుకోలేరు. దాంతో ఎవరైనా సరే మన పోస్ట్లకు ఎన్ని లైక్లు వచ్చాయన్న అంశం పై దృష్టి సారించకుండా, మనం షేర్ చేసే ఫోటోలు, వీడియోలపై మాత్రం దృష్టి సారించవచ్చు. సెట్టింగ్స్పై న్యూ పోస్ట్స్ విభాగాన్ని సందర్శించడం ద్వారా ఇతరుల పోస్ట్లపై లైక్ కౌంట్స్ను సైతం మనం దాయవచ్చు మన ఫీడ్లోని అన్ని పోస్ట్లకూ ఇది వర్తిస్తుంది. ఓ పోస్ట్ను షేర్ చేసే ముందే లైక్ కౌంట్స్ను హైడ్ చేసుకోవచ్చు.. అంతేకాదు ఈ సెట్టింగ్ను ఒక వేళ పోస్ట్ లైవ్లోకి వెళ్లిపోయినప్పుడు సైతం ఆప్షన్ ఆఫ్ చేయవచ్చు. ఇలాంటి అనేక మార్పులతో సోషల్ మీడియా మరింత కొత్తదనాన్ని సంతరించుకోనుంది. చదవండి: ట్విటర్పై కేంద్రం ఆగ్రహం -
కరోనా: జియో ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్లు
సాక్షి,ముంబై: దేశం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్తో పోరాడుతున్న నేపథ్యంలో టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రెండు కార్యక్రమాలను ప్రకటించింది. జియో ఫోన్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రెండు పథకాలను ఈ సందర్భంగా ప్రకటించింది. కరోనా విపత్తు సమయంలో ఉచిత ఔట్గోయింగ్ కాల్స్ను అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసే వరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్గోయింగ్ కాల్స్(రోజుకు10 నిమిషాలు) ఉచితం. అలాగే జియోఫోన్ వినియోగదారు రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్ఫై అంతే సమానమైన రీఛార్జ్ వాల్యూను ఉచితంగా అందించనుంది. ఉదాహరణకు 75 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసే జియోఫోన్ యూజర్ అదనంగా మరో 75 రూపాయల ప్లాన్ ప్రయోజనాలను ఉచితంగా పొందవచ్చన్నమాట. ఇందుకు రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నట్లు రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. ప్రతీ భారతీయుడికి డిజిటల్ లైఫ్ అందించే లక్ష్యంతో జియోఫోన్ను తీసుకొచ్చాం.. ప్రస్తుత మహమ్మారి సంక్షోభకాలంలో వారికి ఎఫర్డబుల్ ధరలో, నిరంతరం సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని జియో వెల్లడించింది ఈ కాలంలో రీఛార్జ్ చేయించుకోలేకపోయిన జియోఫోన్ వినియోగదారులకు ఈ పథకాలు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపింది. చదవండి: దిగుమతి చేసుకున్న స్పుత్నిక్-వీ ధర ఎంతంటే? ఊరట: స్పుత్నిక్-వీ తొలి డోస్ హైదరాబాద్లోనే -
ఈ యాప్ యూజర్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఫ్రీ
బెంగళూరు: భారత్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి భారత ప్రజలు ఈ వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యపరంగానే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, సంస్థలు, అంతేందుకు సామాన్యులు సైతం తమకు తోచిన విధంగా కరోనా బాధితులకు సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైడింగ్ యాప్ ఓలా ఔదార్యం చాటుకుంది. తమ యూజర్ల ముంగిటకు ఆక్సిజన్కాన్సన్ట్రేటర్లను ఉచితంగా అందించాలని నిర్ణయించుకుంది. మా యూజర్లకు ఫ్రీగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ప్రతీ రోజు పెరగడం, అందులో ఎక్కువ మంది ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొందరికి సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కూడా విడిచారు. దీంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ఓలా సంస్థ తమ యూజర్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా అందించడానికి ముందుకువచ్చింది. ఇందుకు చేయాల్సిందల్లా అవసరమైన వారి కనీస వివరాలు ఓలా యాప్లో నింపాల్సి ఉంటుంది. తరువాత అవసరమైన వారి ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా తీసుకునేలా ఓలా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని గివ్ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా ఓలా ఫౌండేషన్ చేయనుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు, వాటి రవాణా చార్జీల కింద ఓలా తమ యూజర్ల నుంచి ఎలాంటి మొత్తం వసూలు చేయదు. ప్రారంభంగా 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఈ వారం నుంచి బెంగళూరు నగరంలో ప్రారంభించనుంది. రాబోయే వారాల్లో 10,000 వరకు దేశవ్యాప్తంగా వీటి సరఫరా జరిగేలా అమలు చేస్తామని ఓలా సహ వ్యవస్ధాపకులు భవీష్ అగర్వాల్ వెల్లడించారు. అసాధారణ పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేసేందుకు తాము ఓ2ఫర్ఇండియా కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన ప్రకటించారు. ( చదవండి: మద్యం ప్రియులకు శుభవార్త.. ఇకపై హోం డెలివరీ ) -
2021లో భారీగా పెరిగిన ఫేస్బుక్ ఆదాయం
ఫేస్బుక్లో నెలవారీ క్రియాశీల వినియోగదారులు సంఖ్య ఇప్పుడు 2.85 బిలియన్లకు చేరుకుంది. అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం 10 శాతం(సంవత్సరానికి పైగా) వృద్దిని కనబరిచింది. అలాగే, ఫేస్బుక్ రోజువారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య సగటున 1.88 బిలియన్లకు చేరుకుంది, గతంతో పోలిస్తే 8 శాతం పెరుగుదల నమోదు చేసింది. సోషల్ నెట్వర్క్ అంచనాలను మించి మొదటి త్రైమాసికంలో 26.1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 48 శాతం ఎక్కువ. 2020 మొదటి త్రైమాసికంలో సంస్థ నికర ఆదాయం 4.9 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది 9.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ మాట్లాడుతూ.. "ప్రజలను చేరుకోవడానికి, వ్యాపారాలు వృద్ధి చెందడానికి ఇది మాకు బలమైన త్రైమాసికం. రాబోయే సంవత్సరాల్లో కొత్త, మంచి అనుభూతిని అందించడానికి వర్చువల్ రియాలిటీపై మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్లు" ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫేస్బుక్ షేర్లు 7 శాతం పెరిగాయి. చదవండి: సామాన్యులకు ఊరట.. జీఎస్టీ తొలగింపు! -
యూట్యూబ్ కొత్త ప్రయోగం.. ఫ్యాన్స్ వార్కి చెక్ పెట్టనుందా?
మన నిత్యజీవితంలో యూట్యూబ్ ఒక భాగమైంది. తీరికగా యూట్యూబ్లో వీడియోలను చూస్తు కాలక్షేపం చేస్తాం. అందులో మనకు నచ్చిన వీడియోలను లైక్ కొడతాం. వీడియో నచ్చక పోతే సింపుల్ డిస్లైక్ కొడతాం. యూట్యూబ్లో అత్యధికంగా డిస్లైక్లు కొట్టిన వీడియో ఏది అంటే...? ఠక్కున బాలీవుడ్కు చెందిన సడక్-2 ట్రైలర్ అని చెప్తాము. యూజర్లు ఈ విధంగా చేయడంతో ఒకింతా చిత్రపరిశ్రమలో చర్చకు దారి తీసింది. సడఖ్-2 చిత్రం తరువాత వరుణ్ ధవన్ హీరోగా నటించిన కూలీ చిత్ర బృందం లైక్, డిస్లైక్ బటన్ లేకుండా చేసింది. ఒక వీడియోపై మన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి యూట్యూబ్ డిస్లైక్ చేయడం ప్రజాస్వామ్య మార్గాలలో ఒకటిగా చెప్పుకొవచ్చు. కానీ కొంతమంది యూజర్లు వీడియోలకు దురుద్ధేశంతో డిస్లైక్లను కొట్టడం ఒక వ్యసనంగా మారింది. ఈ సమస్యలన్నింటికీ భవిష్యత్తులో యూట్యూబ్ చెక్ పెట్టనుంది. అందుకుగాను యూట్యూబ్ వివిధ మార్గాలను పరీక్షిస్తోంది. భవిష్యత్తులో యూట్యూబ్లో కనిపించే వీడియోలకు డిస్లైక్ల సంఖ్య కనిపించకుండా, అసలు డిస్లైక్ బటన్ లేకుండా చేయబోతుంది. ప్రస్తుతం ఈ టెస్టును యూట్యూబ్ పరీక్షిస్తోందని ట్విటర్లో తెలిపింది. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ సిస్టమ్లలో పరీక్షించనుంది. యూజర్ల నుంచి తగు సూచనలు తీసుకున్న తరవాత ఈ ఫీచర్ను అమలు చేయనున్నారు. యూట్యూబ్ ఒకటే ఇలాంటి ఫీచర్ను తీసుకొని వస్తూదంటే మీరు పొరపడినట్లే. గతంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు నిజమైన యూజర్లను గుర్తించడానికి ఈ ఫీచర్ను పరీక్షించాయి. 👍👎 In response to creator feedback around well-being and targeted dislike campaigns, we're testing a few new designs that don't show the public dislike count. If you're part of this small experiment, you might spot one of these designs in the coming weeks (example below!). pic.twitter.com/aemrIcnrbx — YouTube (@YouTube) March 30, 2021 చదవండి: నెలకు రూ.36 లక్షలు సంపాదిస్తున్న 24 ఏళ్ల కుర్రాడు -
డిజిటల్ మీడియాకు వాక్ స్వేచ్ఛ వద్దా?
నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, వారి సంభాషణలను శాశ్వతంగా భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ఇది మీడియా వాక్ స్వేచ్ఛకు మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛకు కూడా సంబంధించిన సమస్య. ప్రతి యూజర్ సందేశాన్ని ఇలా నిలవ చేయటం ద్వారా నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ వాటిలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు. కానీ, రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించే తరహా నిబంధనలు విఫలమవుతాయన్నది వాస్తవం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నిబంధనలు వాక్ స్వేచ్ఛ అనే భావనకే వ్యతిరేకంగా ఉన్నాయనే అంశంపై ఏకాభిప్రాయం కలుగుతోంది. సాధారణంగా మితభాషిగా ఉండే ఎడిటర్స్ గిల్డ్ సైతం ఈ విషయమై ఒక ప్రకటన చేస్తూ ఈ కొత్త నియమాలు దేశంలో మీడియా స్వతంత్రతకు వ్యతిరేకమని పేర్కొనడం గమనార్హం. సాధారణ ప్రజానీకం కోసం కోడ్ రచన, సంకేత నిక్షిప్త సందేశాల టెక్నాలజీ ప్రాప్యతను పరిమితం చేయడానికి 50 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న జాతీయ ప్రభుత్వాల ట్రెండ్కీ కేంద్రప్రభుత్వ మధ్యస్థపు మార్గదర్శకాలకు సమాన ప్రాధాన్యత ఉంది. అమెరికా 1990ల చివరలో క్రిప్టోగ్రఫీని సాధారణ ప్రజానీకానికి అందుబాటులో ఉంచడంపై పరిమితి విధించడానికి ప్రయత్నించినప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న సైఫర్పంక్స్ (సామాజిక, రాజకీయ మార్పుకోసం ప్రైవసీ పొడిగింపు టెక్నాలజీలను, క్రిప్టోగ్రఫీని విస్తృతంగా ఉపయోగించాలని ప్రబోధించే వారు) ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకున్నారు. క్రిప్టోగ్రఫిక్ కోడ్ రచనను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని అనుమతించకుండా ఆంక్షలు విధించినప్పుడు, టీ షర్ట్లపై ఈ కోడ్ను సైఫర్పంక్లు ముద్రించి సంచలనం రేకెత్తించారు.ఈరోజు మనందరం ఆధారపడిన ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటోకాల్ (పంపిన సందేశాలను సంబంధిత యూజర్లు మాత్రమే చదవగలిగేలా చేసే కమ్యూనికేషన్ సిస్టమ్) సైఫర్పంక్లు ప్రారంభించిన 50 ఏళ్ల ప్రతిఘటనా ఉద్యమ ఫలితం మాత్రమే. నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటర్మీడియరీ లయబిలిటీ మార్గదర్శకాలను కూడా ఈ కోణంలోనే చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ మార్గదర్శకాలు యూజర్ల గోప్యతపై నిషేధం విధించి, ప్రతి యూజర్ గోప్యతా సంభాషణను శాశ్వత రికార్డు రూపంలో భద్రపర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత సమస్య మీడియా వాక్ స్వేచ్ఛకు సంబంధించింది మాత్రమే కాదు. అంతకు మించి ఇది సాఫ్ట్వేర్ రంగంలో వాక్ స్వేచ్ఛకు సంబంధించిన సమస్య. ప్రాథమిక స్థాయిలో చూస్తే కోడ్ను రాసి దాన్ని ప్రచురించడానికి, అభిప్రాయాలను రాసి వాటిని పుస్తకాలుగా ప్రచురించడానికి మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదు. కానీ మెసేజింగ్ యాప్లు కోడ్ రచనను ఎలా చేయాలనే విషయమై, కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మధ్యస్థపు మార్గదర్శకాలు ఆదేశిస్తున్నట్లుగా కనబడుతున్నాయి. ఇది సాంకేతిక రంగానికి వర్తించే వాక్ స్వేచ్ఛపై ఆంక్షలు విధించే రూపమే తప్ప మరేమీ కాదు.ఈ ప్రత్యేక సమస్య కేంద్ర బిందువు ఏదంటే సిగ్నల్ ప్రొటోకాల్. ఇది సైబర్ రంగంలో అభిప్రాయాలను వెలువరించే కోడ్ వ్యక్తీకరణ. ఇది భౌతిక రంగంలో వాక్ స్వేచ్ఛ పరవళ్లు తొక్కడాన్ని అనుమతిస్తుంది. దీన్ని ‘ఓపెన్ విస్పర్ సిస్టమ్స్’ అనే పేరు కలిగిన లాభేతర కంపెనీ వృద్ధి చేసింది. ఇతరుల కంటబడకుండా, వినకుండా యూజర్లు చేసే గోప్య సంభాషణలను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టరాదనే ప్రగాఢ విశ్వాసం ఈ కంపెనీకి ఊపిరిగా ఉంటోంది. మద్రాస్ హైకోర్టులో ఫింగర్ప్రింటింగ్ టెక్నిక్పై చర్చ జంతు పరిరక్షణా కార్యకర్త ఆంథోనీ క్లెమెంట్ రూబిన్ మద్రాస్ హైకోర్టు ముందు దాఖలు చేసిన ప్రజావ్యాజ్య ప్రయోజన దావాతో యూజర్ల గోప్యతపై చర్చ భారత్లో మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. న్యాయస్థానంలో ఈ అంశంపై జరిగిన చర్చ.. నిక్షిప్త సందేశాలను విచ్ఛిన్నపర్చకుండానే యూజర్ల మాటల సందేశాన్ని వాట్సాప్ ట్రాక్ చేయవచ్చా అనే అంశంపైకి మళ్లింది. అప్పుడు సైతం పేరుచెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ అధికారులు కొందరు ప్రతి సందేశంపై ఫింగర్ ప్రింటింగ్ (డేటాను గుర్తించి, ట్రాక్ చేసేందుకు నెట్వర్క్ డేటా నష్ట నివారణ సంస్థలు చేపట్టే డేటా లేదా డాక్యుమెంట్ ఫింగర్ ప్రింటింగ్ టెక్నిక్) వేయడాన్ని ఒక పరిష్కార మార్గంగా ప్రతిపాదించారు. ప్రతి సందేశంపై ఫింగర్ ప్రింటింగ్ అమలు అసాధ్యమని వాట్సాప్ తోసిపుచ్చినందున ఎండ్–టు–ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటోకాల్ అవసరమే లేదని తమిళనాడు అడ్వొకేట్ జనరల్ వాదించారు కూడా.అయితే ఇప్పుడు కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను ప్రకటించి ఉన్నందున ఫింగర్ప్రింటింగ్ సొల్యూషన్ని అమలుపర్చేందుకు అధి కార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అయితే యూజర్ల గోప్యత సందేశాలను తాను వెల్లడి చేయబోననే తప్పుడు ప్రకటనతో ప్రభుత్వ యంత్రాంగం ముందుకొస్తోంది. ఫింగర్ ప్రింటింగ్ సొల్యూషన్ యూజర్ల గోప్యత సందేశాలను ఎలా బహిర్గతం చేస్తుందో అర్థం కావాలంటే ఫార్వార్డ్ సీక్రెసీ భావనను ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఫార్వార్డ్ సీక్రెసీ అంటే మీ ప్రస్తుత ఎన్క్రిప్షన్ కీని ఎవరైనా సైబర్ అటాకర్ దొంగిలించినా, మీ మునుపటి సందేశాలను ఇప్పటికీ సురక్షితంగానే ఉంచే సిగ్నల్ ప్రొటోకాల్. ఈ ఫార్వర్డ్ సీక్రెసీ అనేది చైనా వంటి ప్రత్యర్థి దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని విచ్ఛిన్నపర్చడం ద్వారా మీ సందేశాలన్నింటిని అడ్డుకోవడమే కాకుండా, మీ ఫోన్ నుండి మీ ప్రమేయం లేకుండా బలవంతంగా సందేశాలను గుంజుకోవడానికి ఇలాంటి దేశాలు ప్రయత్నించే అవకాశం ఉంది. మన ప్రత్యర్థి దేశాలు ఆత్యాధునిక సైబర్ ఆపరేషన్లను కలిగి ఉంటున్నప్పుడు బలహీనమైన ఎన్క్రిప్షన్ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. మునుపటి సందేశాలు కొంత కాలం తర్వాత ఆటోమేటిక్గా తొలిగిపోతున్నప్పుడు ఫార్వర్ట్ సీక్రెసీ అనేది మరింతగా ఆచరణ సాధ్యంగా మారుతుంది. కాబట్టి మీ ఫోన్ని మీరు కోల్పోయినా లేక ఎవరైనా తీసుకుపోయినా సరే వాటిలోని పాత సందేశాలని ఎవరూ ఇకపై చూడలేరు. సంగ్రహించలేరు. కాబట్టి, సిగ్నల్ మెసెంజర్, వాట్సాప్ రెండింటిలో సందేశాలు మాయమవడం అనేది ఒక ప్రామాణిక ఫీచర్గా ఉంటుంది. అంటే ఇతరుల చెవిలో మాత్రమే మనం వినిపించే గుసగుసలు ఎలా రహస్యంగా ఉంటాయో, అవి గాల్లో ఎలా కలిసిపోతాయో ఆ రకంగా ఇకపై మొబైల్ సందేశాలు కనిపించకుండా పోతాయి. మీరు ఒక గ్రూప్లో సందేశాలను పంపించినప్పుడు, ఇతర డివైస్ల నుంచి సందేశాలను తొలగించే సందర్భంలో కూడా ఇది వర్తిస్తుంది. దీనివల్ల మీ గోప్యత మరింత విస్తృతమవడమే కాకుండా స్వేచ్ఛగా మీకు మీరుగా గానీ, లేక గ్రూప్లో కానీ మాట్లాడవచ్చు.అభిప్రాయాలను పంచిపెడుతూ, ప్రజలను ప్రభావితం చేసేం దుకు ఒక పబ్లిక్ రంగాన్ని రూపొందించి ఉంచే ట్విట్టర్, ఫేస్బుక్ మాదిరి కాకుండా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లు అనేవి వ్యక్తులు లేదా గ్రూపుల వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసమే ప్రాథమికంగా ఉపయోగపడతాయి. అయితే ఈ గ్రూపులు లేదా సంభాషణ కర్తలు నేరస్వభావంతో ఉండవచ్చు. ఒక మూసివుంచిన గదిలో నేరాలు ఎలా చేయాలో మాట్లాడుకునే భావసారూప్యత కలిగిన వ్యక్తులకు, ఇలాంటి యూజర్ల గ్రూపుకు పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఇలాంటి గ్రూప్లలోకి చొరబడటం ద్వారా లేక ఇలాంటి గ్రూప్ల ఆధారాన్ని సేకరించి వారు చేస్తున్న నేరాలను పసిగట్టి దర్యాప్తు చేయడం నిఘా సంస్థల పని. ఒక సందేశాన్ని మొట్టమొదటగా ఎవరు పంపించారో కనుగొనడానికి మెసేజింగ్ అప్లికేషన్లు తమ నిక్షిప్త సందేశాల టెక్నాలజీని మార్చుకోవాలని ఆదేశించడం ద్వారా, ప్రభుత్వం ప్రతి సందేశాన్ని, ప్రతి యూజర్ వివరాలకు సంబంధించిన హ్యాష్ విలువలను తప్పకుండా నిల్వ చేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రతి సందేశాన్ని ఇలా నిలవ చేయటం అంటే నిఘా సంస్థలు కోరుకున్న ప్రతిసారీ ఈ సందేశాలలోని విషయాన్ని సమర్థంగా పరిశీలించవచ్చు. ఇటీవలే దిశారవి అరెస్టు సందర్భంగా ఢిల్లీ కోర్టు వాక్ స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత వ్యక్తీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను కోరుకునే హక్కును కలిగి ఉంటుందని, కమ్యూనికేషన్లో అలాంటి భౌగోళిక అడ్డుగోడలు ఉండవని వ్యాఖ్యానించడాన్ని గుర్తుంచుకోవాలి. రహస్యంగా సాగించే సంభాషణలను, లేదా పంపే సందేశాలను నిషేధించడానికి తీసుకొచ్చే నిబంధనలు తప్పక విఫలమవుతాయి. ఈ సందర్భంగా ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేయడాన్ని నియంత్రించడం ఎలా అనే అంశంపై మరింత చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీనివాస్ కొడాలి వ్యాసకర్త స్వతంత్ర పరిశోధకుడు డేటా, ఇంటర్నెట్ గవర్నెన్స్ (ది వైర్ సౌజన్యంతో) -
జియోకు షాకిస్తున్న ఎయిర్టెల్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ ఖాతాలో జనవరిలో కొత్తగా 69 లక్షల యాక్టివ్ యూజర్లు చేరారు. డిసెంబరుతో పోలిస్తే రిలయన్స్ జియో యాక్టివ్ చందాదారులు 34 లక్షల మంది తగ్గారని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్ నెట్వర్క్లో విజిటర్ లొకేషన్ రిజిష్టర్ (వీఎల్ఆర్) నివేదిక ఆధారంగా యాక్టివ్ సబ్స్క్రైబర్లు ఎంత మంది ఉన్నారో లెక్కిస్తారు. మొత్తం యాక్టివ్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి ఎయిర్టెల్కు 33.6 కోట్లు, జియోకు 32.5 కోట్లకు చేరింది. భారత్లో అతిపెద్ద టెలికం సంస్థగా కొనసాగుతున్న జియో మొత్తం చందాదార్ల సంఖ్య 41.07 కోట్లు కాగా, రెండవ స్థానంలో ఉన్న ఎయిర్టెల్కు 34.46 కోట్లు ఉన్నారు. ఎయిర్టెల్ కొత్త యూజర్ల చేరికలో బలమైన వృద్ధిని కొనసాగించింది, రిలయన్స్ జియో కంటే మూడు రెట్లు ఎక్కువ చందాదారులను సాధించడం గమనార్హం. 2020 ఆగస్టు నుండి 2021 జనవరి మధ్య దాదాపు 25 మిలియన్ల యూజర్లు ఎయిర్టెల్ సాధించింది. జియో కేవలం 10 మిలియన్లను ఖాతాదారులను దక్కించుకోగలిగింది. క్రియాశీల చందాదారుల మార్కెట్ వాటా విషయానికి వస్తే ఎయిర్టెల్ జియోపై తన ఆధిక్యాన్ని విస్తరించింది మొత్తంమీద ఎయిర్టెల్ గత ఆరు నెలలుగా జియో కంటే ఎక్కువమంది యూజర్లను తన ఖాతాలో వేసుకుంది. మొత్తం చందాదారులలో 97 శాతానికిపైగా క్రియాశీలకంగా ఉన్నారు. అయితే జియోకు కేవలం 79శాతం మాత్రమే. అలాగే వోడాఫోన్ ఐడియా గత 15 నెలల్లో మొదటిసారిగా చందాదారులను చేర్చుకోవడం విశేషం. -
శివరాత్రి ట్వీట్: సోనూసూద్పై మండిపాటు
సాక్షి,ముంబై: బాలీవుడ్ నటుడు సోనూసూద్ను మరో వివాదం చుట్టుముట్టింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన వేలాది వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరో నిలిచిన సోనూసూద్పై ఇపుడు కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీటే దీనికి కారణం. దీనిపై కొంతమంది హుదహెల్ఆర్యు సోనూసూద్ (#WhoThe Hell AreU SonuSood) హ్యాష్ట్యాగ్తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు అభిమానులతోపాటు మరికొంతమంది యూజర్లు సోనూసూద్కు మద్దతుగా నిలుస్తుండటం విశేషం. (కొత్తవారిని ప్రోత్సహించాలి!) శివుడి చిత్రాలను ఫార్వార్డ్ చేయడానికి బదులుగా ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మహాశివరాత్రిని జరుపుకోండి అంటూ గురువారం తెల్లవారుజామున సోనూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఆయనపై దూషణలకు దిగారు. మతవిద్వేషాన్ని ఉసిగొల్పేలా కమెంట్ చేస్తున్నారు. అయితే గత ఏడాది దేశంలో కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, వేలాదిమందిని తమ స్వగ్రామాలకు చేరవేయడంతోపాటు, అనేకమందికి విద్యా, వైద్యం కోసం నిరంతరాయంగా సాయం చేస్తున్న దేవుడు సోనూసూద్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. నిజాయితీగల ఇండియన్ ఐడల్ అంటూ సోనూసూద్కు భారీ మద్దతు పలుకుతున్నారు. ఐసపోర్ట్ సోనూసూద్ అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండింగ్లో నిలిపారు. కరోనా కష్టకాలంలో పేదల పాలిట పెన్నిధిగా అడిగినవారికి కాదనకుండా సాయం చేసే రియల్ హీరోగా సోనూ సూద్ అవతరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అనేక కార్యక్రమాలతో నిర్మాణాత్మకంగా తన సేవను కొనసాగిస్తున్నారు. ఇక నటనపరంగా చూస్తే అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ చిత్రంలో చంద్ బర్దాయిగా కనిపించనున్నారు. మానుషి చిల్లార్ సంజయ్ దత్ నటించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ నవంబర్ 5న థియటర్లను పలకరించనుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా, సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఆచార్య’ కూడా ఏడాది మే 13 న విడుదల కానుంది. కాగా ఇలాంటి ఆన్లైన్ ట్రోలింగ్కు సోనూసూద్ గతంలోనే గట్టి కౌంటర్ ఇచ్చారు. మానవత్వంతో స్పందించి, సాయం చేయడమే తన విధి, ‘సామాన్యుడికి’ మాత్రమే జవాబుదారీగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఈ ట్రోలింగ్ వెనుక నేపథ్యం, ఎవరున్నారో తనకు తెలుసు కాబట్టి, వీటికి స్పందించాల్సిన అవసరం లేదని ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. అంతేకాదు నెగిటివిటీ ట్రోలింగ్ చేసేవారి డీఎన్ఏలోనే ఉంది .. కానీ నలుగురికీ ఉపయోగపడే పనిచేసుకుంటూ పోవడమే తన పని అని సోనూ సూద్ స్పష్టం చేశారు. शिव भगवान की फोटो फॉरवर्ड करके नहीं किसी की मदद करके महाशिवरात्रि मनाएं। ओम नमः शिवाय । — sonu sood (@SonuSood) March 11, 2021 On Other's festivals On Hindu's Festivals #WhoTheHellAreUSonuSood@TheDeepak2020In pic.twitter.com/zhs7C1NNWg — Abhijeet vishnoi (@abhi029_vishnoi) March 11, 2021 #WhoTheHellAreUSonuSood He’s the guy who came on roads to help thousands of migrants when their elected Government abandoned the poor souls to die during the unprecedented lockdowns. Don’t know about acting skills as I do not watch movies, but @SonuSood is an honest Indian Idol. pic.twitter.com/l5WokAtrtC — 𝐉𝐨𝐫𝐝𝐚𝐧 (@aka_dpu) March 11, 2021 He’s the guy who came on roads to help thousands of migrants when their elected Government abandoned the poor souls to die during the unprecedented lockdowns. I don't think he did anything wrong. I firmly stand with him.@SonuSood#ISupportSonuSood #ISupportSonuSood — Suv Bhardwaj (@BhardwajSuvm) March 11, 2021 -
ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్
సాక్షి, ముంబై: సోషల్ మీడియా ప్లాట్పాం ఇన్స్టాగ్రామ్ తాజాగా ‘రిసెంట్లీ డిలిటెడ్’ ఫీచర్ను ప్రవేశపెట్టింది. మన ఎకౌంట్ నుంచి డిలిట్, రిమూవ్ చేసిన పోస్ట్లు, వీడియోలు, రీల్స్, ఐజీటీవీ వీడియోలు...30 రోజుల లోపు రీస్టోర్ చేసుకోవచ్చు. 30 రోజుల తరువాత ఇవి ఆటోమెటిగ్గా డిలిట్ అయిపోతాయి. డిలిట్ కంటెంట్ కోసం సెట్టింగ్-ఎకౌంట్-రీసెంట్ డిలిటెడ్లోకి వెళితే సరిపోతుంది. డిలిట్ అయినవి హ్యాకర్ల బారిన పడకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. యూజర్ల కోరికమేరకు ఈ ఫీచర్ను తీసుకొచ్చినట్టు ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది. గూగుల్లోకొత్తగా... సంగీత అభిమానులకు ఉపకరించే మార్పును డెస్క్టాప్ సెర్చ్ రిజల్ట్లో చేసింది గూగుల్. నెవిగేషన్ డ్రాయర్తో టాప్ లెఫ్ట్లో మనం కోరుకునే సమాచారానికి సంబంధించిన వివరణతో పాటు వోవర్ వ్యూ, లిజెన్, వీడియోసాంగ్...ఇలా సబ్కేటగిరిలు కనిపిస్తాయి. షేర్ బటన్ ఉంటుంది. తాజా మార్పు వల్ల మనం కోరుకునే పేజీని వెంటనే క్లిక్ చేయవచ్చు. టైమ్ సేవ్ అవుతుంది. -
ఈ నెల్లోనే ఈపీఎఫ్ వడ్డీ జమ!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఆరు కోట్ల మంది సభ్యుల భవిష్యనిధి నిల్వలపై 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ 8.5 శాతాన్ని డిసెంబర్ నెలాఖరులోపు జమ చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కార్మికమంత్రి సంతోష్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్వో ట్రస్టీల సమావేశంలో 8.5 శాతాన్ని రెండు భాగాలుగా చేసి.. తొలుత 8.15 శాతం, తర్వాత డిసెంబర్ చివరిలోపు 0.35 శాతం చొప్పున జమ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకు ఏదీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ నెలలోనే 8.5 శాతం వడ్డీని జమ చేసేందుకు ఆర్థిక శాఖా సమ్మతి కోరుతూ కార్మిక శాఖ ప్రతిపాదన పంపినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజుల్లోనే ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రావచ్చని, దాంతో ఈ నెల చివర్లోగా వడ్డీ జమ చేయడం పూర్తవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
ల్యాండ్లైన్ వాడుతున్నారా? కొత్త నిబంధన
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయంగా ల్యాండ్లైన్ వినియోగదారులకు టెలి కమ్యూనికేషన్స్ విభాగం(డాట్) కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇకనుంచి దేశంలో ల్యాండ్లైన్ నుంచి మొబైల్ ఫోన్కు కాల్ చేసినప్పుడల్లా ప్రతీసారి తప్పనిసరిగా సున్నా (0) ను చేర్చాలని తాజాగా తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానుందని స్పష్టం చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త ప్రతిపాదనకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డాట్ వెల్లడించింది. ఈ మేరకు టెలికాం సంస్థలు తగిన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించింది. జనవరి 1వ తేదీనుంచి ల్యాండ్లైన్ వినియోగదారులు ఏదైనా మొబైల్ నంబర్కు కాల్ చేయడానికి ముందు సున్నా జోడించాల్సి ఉంటుందని టెలికమ్యూనికేషన్ విభాగం తాజా సర్క్యులర్లో తెలిపింది. కొత్త నిబంధనలను అమలు చేయడానికి అవసరమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని డాట్ అన్ని టెలికం కంపెనీలను కోరింది. అలాగే కొత్త మార్పుల గురించి ల్యాండ్లైన్ వినియోగదారులకు త్వరలో తెలియ జేయనున్నట్లు కూడా తెలిపింది. అలాగే ల్యాండ్లైన్ నుంచి సున్నాను చేర్చకుండా డయల్ చేసిన యూజర్లకు క్రమం తప్పకుండా ప్రతీసారి ఈ హెచ్చరికను వినిపించాలని డాట్ పేర్కొంది. వినియోగదారులకు సున్నా డయిలింగ్ సౌకర్యాన్ని కల్పించాలని టెలికాం సంస్థలను తన సర్క్యులర్లో ఆదేశించింది. కొత్త నేషనల్ నంబరింగ్ ప్లాన్ (ఎన్ఎన్పి) ను త్వరగా జారీ చేయాలని కూడా సిఫారసు చేసింది. మరోవైపు 11 అంకెల మొబైల్ నంబరింగ్ ప్లాన్ను తిరస్కరించిన సంస్థ 10 అంకెల నంబరుకే ఆమోదం తెలిపింది. -
చక్రవడ్డీ మాఫీ : వారికి సుప్రీం షాక్
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి, లాక్డౌన్ కాలంలో విధించిన ఆరు నెలల మారటోరియం కాలానికి సంబంధించి క్రెడిట్ కార్డు వినియోగదారులకు సుప్రీంకోర్టు షాకిచ్చింది.క్రెడిట్ కార్డు వినియోగదారులు కార్డ్ రుణాల ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేశారని, వారికి మారటోరియం ప్రయోజనాలు అవసరమా అంటూ అత్యున్నత న్యాయస్థానం గురువారం కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రెడిట్ కార్డుదారులు రుణగ్రహీతల కిందకు రారని చక్రవడ్డీ మాఫీ ప్రయోజనం క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇవ్వకూడదని అభిప్రాయపడింది వాస్తవానికి వారు రుణాలు పొందలేదని, దానికి బదులుగా వస్తువులు కొనుగోళ్లు చేశారని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే ప్రీ-కోవిడ్ డిఫాల్టర్లు కూడా చక్రవడ్డీ మాఫీ పొందలేరని తెలిపింది. లోన్ మారటోరియం, ప్రయోజనాలకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. వడ్డీ మినహాయింపు ప్రణాళికలో ఇప్పటివరకు 13.12 కోట్ల ఖాతాలకు రూ .5270 కోట్లు జమ అయ్యాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం మార్చినుంచి ఆగస్ట్ వరకు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఈ కాలంలో రూ .2 కోట్ల వరకు ఉన్న అన్ని రుణాలపై వడ్డీవడ్డీని రద్దు చేసింది. ఈ భారాన్ని భరించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన చెల్లింపులను కూడా ప్రారంభించింది. SG: banks havs to lodge claim to SBI for which a separate nodal agency is created, they’ll verify, take it from Government and then pay it SG: I am a credit card holder and I received SMS for ex gratia credit Sc: but do you need it? People like you should not get the benefit — Bar & Bench (@barandbench) November 19, 2020 -
ఇన్స్టా మొరాయింపు: ‘నేను ఎలా బ్రతకగలను’
న్యూఢిల్లీ : మంగళవారం ఉదయంనుంచి ప్రపంచ వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ సేవలు మొరాయించటంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. భారత కాలమానం ప్రకారం నిన్న ఉదయం 4.07 నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫోటో, వీడియో అప్లోడ్, షేరింగ్లో వినియోగదారులకు సమస్యలు ఎదురయ్యాయి. దీంతో తమ సమస్యలను ట్విటర్ వేదికగా ఏకరువు పెడుతున్నారు. ‘‘ ఇన్స్టాగ్రామ్కి ఏమైంది.. నేను రోజంతా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేయలేకపోయాను.. అప్డేట్ను పూర్తిచేయండి లేదా, ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించండి... నిన్నటి నుంచి ఫోటో అప్లోడ్ చేయలేకపోతున్నా. నేను ఎలా బ్రతకగలను... ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (యూట్యూబ్ ఛానల్స్ పెట్టేందుకు నో ఛాన్స్...) కాగా, ఇన్స్టాగ్రామ్ మంగళవారం ఉదయం ‘షేర్ యువర్ లైట్’ అనే రియాలిటీ ఫీచర్ను రాబోయే దీపావళీ పండుగ దృష్ట్యా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. తమ ఆలోచనలను అందరితో పంచుకోవడానికి ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించింది. ఇన్స్టాగ్రామ్లో ఎఫెక్ట్స్ గాలరీ ఓపెన్ చేయగానే ‘ఫెస్టివ్ దియా’ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్స్ ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ న్యూ అప్డేట్ కారణంగానే ఇన్స్టాగ్రామ్ సేవలు మొరాయించాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Me, not being able to post on Instagram for a full day...#instagramdown pic.twitter.com/HiwhwUswd0 — Cristiane Stoll (@StollCristiane) November 11, 2020 -
వాట్సాప్లో ‘షాపింగ్ బటన్’.. ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సొంతమైన వాట్సాప్ మరో కీలక ఫీచర్ను లాంచ్ చేసింది.ఇటీవల పేమెంట్ సేవలను విజయవంతంగా ప్రారంభించిన వాట్సాప్ తాజాగా ఈ-కామర్స్ బిజినెస్లోకి ఎంట్రీ ఇస్తూ యూజర్లకు శుభవార్త చెప్పింది. తమ ప్లాట్ఫాంపై షాపింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు ప్రత్యేకంగా షాపింగ్ బటన్ ఫీచర్ను పరిచయం చేసింది. ఈ కొత్త ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించింది. బిజినెస్ అకౌంట్స్ ఉన్న వాట్సాప్ యూజర్లు కేటలాగ్లో ఉన్న ప్రొడక్ట్స్ని ఓపెన్ చేసి నచ్చితే వెంటనే వాట్సప్లోనే కొనుగోలుచేయవచ్చని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది ఉత్పత్తులను కనుగొనడం సులభతరం చేస్తుందనీ, అలాగే అమ్మకాలను పెంచడానికి సహాయపడుతుందని పేర్కొంది. ఇప్పటివరకు బిజినెస్ ప్రొపైల్ ఓపెన్ చేసి తమకు నచ్చిన వస్తువు కేటలాగ్ లిస్ట్లో చెక్ చేసుకోవాల్సి వచ్చేంది. తాజాగా షాపింగ్ బటన్ను విడుదల చేసింది. ఈ షాపింగ్ బటన్ వాయిస్ కాల్ బటన్ స్థానంలో ఉంటుంది. అయితే వినియోగదారులు వాయిస్ లేదా వీడియో కాల్ను ఎంచుకోవడానికి కాల్ బటన్ను నొక్కాలి. తద్వారా వ్యాపారులు తమ సేల్స్ పెంచుకోవడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. వాట్సాప్ సమాచారం ప్రకారం ప్రస్తుతం రోజూ వాట్సప్ బిజినెస్ అకౌంట్లో 17.5 కోట్ల మంది మెసేజెస్ పంపిస్తున్నారు. దేశంలో 30 లక్షల మందితో సహా, ప్రతీ నెలలో 4 కోట్ల మంది బిజినెస్ క్యాటలాగ్ చూస్తున్నారు. -
బిగ్బాస్కెట్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
సాక్షి, ముంబై: గ్రోసరీ ఈ కామర్స్ సంస్థ బిగ్ బాస్కెట్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్. కంపెనీకి చెందిన రెండు కోట్ల మందికి పైగా యూజర్ల వ్యక్తిగత డేటా హ్యాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా బిగ్బాస్కెట్ వెల్లడించింది. తమ కంపెనీ పై హ్యకర్లు దాడి చేశారని బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తమ సంస్థకు చెందిన 2 కోట్లకు పైగా ఖాతాదారుల డేటా చోరీకి గురైందని ఫిర్యాదు చేసింది. డేటా ఉల్లంఘనలను గుర్తించే సైబుల్ నివేదిక ప్రకారం, హ్యాకర్లు ఈ డేటాను రూ. 30 లక్షలకు డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. మొత్తం 2కోట్ల మందికి చెందిన 15 జీబీ డేటాను హ్యాకర్లు తస్కరించారు. ఇందులో వినియోగదారుల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, పాస్వర్డ్, కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్, అడ్రస్, పుట్టినతేదీ, లొకేషన్, ఐపీ అడ్రస్ వంటి కీలక సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే క్రెడిట్ కార్డ్, ఇతర ఫైనాన్షియల్ వివరాలు క్షేమంగానే ఉంటాయని కంపెనీ చెబుతోంది. డేటా హ్యాకింగ్ను కొన్ని రోజుల కిందటే గుర్తించామనీ, ఏ స్థాయిలో డేటా చౌర్యం జరిగిందో తెలుసుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్న విషయాలను పరిశీలిస్తున్నామని చెప్పింది. డార్క్ వెబ్ను మానిటర్ చేస్తున్నప్పుడు బిగ్బాస్కెట్కు చెందిన డేటా అమ్మకాన్ని గమనించామని సైబల్ తన బ్లాగ్లో పేర్కొంది. సుమారు రెండు కోట్ల మంది యూజర్ల డేటా ఇందులో ఉందని తెలిపింది. బిగ్బాస్కెట్ వినియోగదారులు - జాగ్రత్తలు ఓటీపీలను ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ చెప్పవద్దు. ఆప్ నుండి ఆర్డర్ చేయడానికుపయోగించే అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాల పాస్వర్డ్లను మార్చండి. యూపీఐ యాప్ పిన్లను మార్చండి. అలాగే ఈమెయిల్, ఇతర సేవలకు ఒకే పాస్వర్డ్ లేదా పిన్లను ఉపయోగిస్తుంటే తక్షణమే వాటన్నింటి పాస్వర్డ్లను మార్చండి. వేరు వేరు పాస్వర్డ్లను ఉపయోగించడం ఉత్తమం. బిగ్బాస్కెట్ యాప్ను అధికారిక ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయండి లేదా అప్ డేట్ చేయండి. అప్డేట్కు సంబంధించి ఎలాంటి తప్పుడు సందేశాలను నమ్మకండి. కస్టమర్ కేర్ మోసాలు, క్రెడిట్ కార్డ్ ఆఫర్లపై పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీకుసంబంధంలేని, మీరు ఆర్డర్ ఇవ్వని ప్యాకేజీలను డెలివరీలు స్వీకరించవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వని క్యాష్ ఆన్ డెలివరీ ప్యాకేజీలను విశ్వసించకండి. వాటికి ఎలాంటి నగదు చెల్లించకండి. డెలివరీ ఎగ్జిక్యూటివ్గా నటిస్తూ మానిప్యులేట్ చేస్తున్న స్కాం పట్ల జాగ్రత్త వహించండి. -
రూపే కార్డు కస్టమర్లకు శుభవార్త
సాక్షి, ముంబై: ముంబై: రూపేకార్డు కస్టమర్లకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా శుభవార్త తెలిపింది. వివిధ బ్రాండ్ల కొనుగోళ్లపై ‘‘రూపే ఫెస్టివల్ కార్నివాల్’’ పేరుతో 65 శాతం వరకు డిస్కౌంట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెజాన్, స్విగ్గి, శామ్సంగ్ వంటి టాప్ బ్రాండ్లపై రూపే కార్డు కస్టమర్లు 10-65శాతం వరకు డిస్కౌంట్లను పొందవచ్చు. ఆరోగ్యం, ఫిట్నెస్, ఎడ్యుకేషన్, ఈ–కామర్స్ లాంటి వాటిపైనే కాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరాలైన డైనింగ్, ఫుడ్ డెలివరి, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, వెల్నెస్, ఫార్మసీతో పాటు మరికొన్నింటిపైనా ఆకర్షణీయమైన ఆఫర్లను పొం దవచ్చు. సురక్షితమైన, కాంటాక్ట్లెస్, క్యాష్లెస్ పే మెంట్లను పెంచడమే లక్ష్యమని ఎన్సీసీఐ పేర్కొంది. ‘‘కార్నివాల్ ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌం ట్లు కస్టమర్ల పండుగ సంతోషాల్ని మరింత పెం చుతాయి. ఇదే సమయంలో డిజిటల్, కాంటాక్ట్లెస్ పేమెంట్ల సంఖ్య పెరుగుతుంది’’ అని ఎన్పీసీఐ మార్కెటింగ్ చీఫ్ కునాల్ కలవాతియా తెలిపారు. -
ఐఫోన్ యూజర్లకు శుభవార్త : ఫ్రీ సెషన్లు
సాక్షి, న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త అందించింది. ముందుగా ప్రకటించినట్టుగానే సంగీతం, ఫోటోగ్రఫీ, ఆర్ట్ పై ఆసక్తి ఉన్నవారి కోసం ఉచిత వర్చువల్ సెషన్లను షురూ చేసింది. ఇటీవల భారతదేశంలో ఆపిల్ స్టోర్ ఆన్లైన్ ప్రారంభించిన ఆపిల్ తన ఐఫోన్ వినియోగదారులలో అప్ కమింగ్ కళాకారులకు ఈ సెషన్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ వర్చువల్ సెషన్కు మీ ఐఫోన్ సిద్ధంగా ఉండండి అని ఆపిల్ పేర్కొంది. నవంబర్ 29 వరకు ఉచిత వర్చువల్ సెషన్లను ప్రకటించింది. ప్రముఖ స్థానిక ఫోటోగ్రాఫర్లు, ప్రసిద్ధ సంగీతకారులు వారి వారి విజయ గాథలను పంచుకుంటారు. ఈ ఆపిల్ ఈవెంట్ల కోసం నమోదు చేసుకున్న వినియోగదారులకు చిట్కాలు , సలహాలు అందిస్తారు. ఈ క్రమంలో ముందుగా ఫోటోగ్రఫీ సెషన్ల వివరాలను ఆపిల్ ప్రకటించింది. (ఆపిల్పై శాంసంగ్ సెటైర్లు) ఫోటోగ్రఫీ సెషన్లు ఉచిత వర్చువల్ ఫోటోగ్రఫీ సెషన్లు అక్టోబర్ 22 నుండి ప్రారంభం. వీటిని ఫోటో ల్యాబ్ అంటారు. ప్రధానంగా సిద్దార్థ జోషి, అవని రాయ్ వంటి ప్రముఖులు అక్టోబర్ 22, అక్టోబర్ 27 తేదీల్లో ఉదయం 7 నుండి 8 గంటల వరకు పాల్గొంటారు. డీఎస్ఎల్ఆర్, మిర్రర్లెస్ కెమెరాలను ఎలా ఉపయోగించాలో చెబుతారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చిట్కాలను అందిస్తారు. ప్రసిద్ధి చెందిన డాక్యుమెంటరీలను కూడా ప్రదర్శిస్తారు. అక్టోబర్ 29 న, అనురాగ్ బెనర్జీ నాన్-ఫిక్షన్ ఫోటోగ్రఫీపై ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు, నవంబర్ 3 న, పోర్ట్రైట్ ఫోటోగ్రఫీపై ప్రార్థనా సింగ్ ఒక సెషన్ తీసుకోనున్నారు. ఆపిల్ అక్టోబర్ 28, నవంబర్ 1, నవంబర్ 2 న ఐఫోన్లలో ఫోటోగ్రఫీపై మూడు సెషన్లను ఉంటాయి. నవంబర్ 5 న హషీమ్ బదాని నిర్వహించే ఫోటోగ్రాఫిక్ సెషన్ ఉంటుంది. ఇందులో తన ప్రాజెక్టుల ప్లానింగ్, పరిశోధనలను వివరిస్తారు. ఈ సెషన్లకు రిజిస్టర్ చేసు కోవాలంటే ఆపిల్ కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ లేదా టాబ్లెట్, ఇంటర్నెట్ కనెక్షన్, ఉచిత సిస్కో వెబెక్స్ సమావేశాల యాప్ ఉండాలి. అలాగే యూజర్లు18 ఏళ్లలోపు వారైతే, తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమోదం కావాలని ఆపిల్ వెల్లడించింది. -
యూజర్లకు షాక్ : ఐఫోన్ 12లో అవి మిస్
సాక్షి, న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు భారీ షాకే ఇచ్చింది. అట్టహాసంగా లాంచ్ చేసిన ఐఫోన్ 12కు సంబంధించి యూజర్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది. హైస్పీడ్, అధునాతన టెక్నాలజీ, 5జీ నెట్ వర్క్ అంటూ పరిచయమైన 24 గంటల్లోనే ఐఫోన్ 12 వివాదంలో పడింది. ఇంతకు విషయం ఏమిటంటే ఖరీదైన ఆపిల్ ఐఫోన్12తో పాటు చార్జర్, ఇయర్ ఫోన్స్ ను సంస్థ మిస్ చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు సోషల్ మీడియాలో ఆపిల్ సంస్థపై మండిపడుతున్నారు. (ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్) ఆపిల్ అధికారిక వెబ్ సైట్ లో ఐఫోన్ 12 బాక్స్ లో ఐఫోన్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్ ఇవ్వడం లేదంటూ ప్రకటించి కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లింది. 2030 నాటికి “నెట్-జీరో క్లైమేట్ ఇంపాక్ట్” తో ప్రపంచాన్ని తీర్చిదిద్దుతామన్న హామీని నెరవేర్చడానికే ఈనిర్ణయం తీసుకున్నామంటూ చావుకబురు చల్లగా చెప్పింది. దీంతోఎంతోకాలంగా లేటెస్ట్ ఐఫోన్ కోసం ఎదురుచూసిన యూజర్లు ట్విటర్లో విమర్శలు గుప్పిస్తున్నారు. కిడ్నీ అమ్ముకొని మరీ ఖరీదైన ఐఫోన్ కొనుక్కుంటే.. ఇంత అన్యాయమా అంటూ చమత్కరిస్తున్నారు. కాగా మొత్తం నాలుగు వేరియంట్లలో విడుదలైన ఐఫోన్ 12 ప్రీ ఆర్డర్లు వచ్చే నెల 6 నుంచి డెలివరీలు 23 నుంచి షురూ కానున్న సంగతి తెలిసిందే. (5జీ ఐఫోన్ 12 వచ్చేసింది..) Imagine selling your kidney to buy the new iPhone 12 and it comes WITHOUT a charger and headphones. #AppleEvent pic.twitter.com/LuoUmAsLtJ — àbDullah✨ (@BehtareenInsan) October 13, 2020 2020: Charger and earphones not included in the box Year 2030: No Phone in the box...It's called iPhone Air#AppleEvent pic.twitter.com/obX3XPwc83 — Meera (@meera_3001) October 13, 2020 Apple should consider our wallet is also part of environment. Removing earpods, power adapter and increasing the PRICE of this years iPhone and calling it supporting environment is a BIG NOPE. 👎🏻 #AppleEvent #iPhone12 pic.twitter.com/y4Th0MAaYs — iRobinPro (@iRobinPro) October 14, 2020 -
ట్రంప్కు కరోనాపై సెటైర్లు : ట్విటర్ హెచ్చరిక
వాషింగ్టన్ : కరోనా మహమ్మారి కారణంగా ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ట్విటర్ వేదికగా సెటైర్లు, అనుచిత కమెంట్ల వెల్లువ కురుస్తోంది. దీనిపై స్పందించిన ట్విటర్ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ట్రంప్పై నోటి దురుసును ప్రదర్శించిన యూజర్ల ఖాతాలను నిలిపివేస్తామని ట్వీట్ చేసింది. మరణం, తీవ్రమైన శారీరక హాని, ఎవరికైనా ప్రాణాంతక వ్యాధి రావాలని కోరుకోవడం లాంటి ట్వీట్లను సహించం. తక్షణమే వాటిని తొలగిస్తామని వెల్లడించింది. ఒక వ్యక్తి మరణం కోరుకునే ట్వీట్లు తమ నిబంధనలకు విరుద్ధమని, ఈ విధానం వినియోగదారులందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొన్నింటిని సస్పెండ్ చేస్తున్నట్లు ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది. (కరోనా : ట్రంప్నకు మరో దెబ్బ) కరోనా సోకిన ట్రంప్ దంపతులు త్వరగా కోలుకోవాలని, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా, పలువురు దేశాధినేతలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి జోబైడెన్, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ట్రంప్ త్వరగా కోలుకోవాలని అభిలషించారు. అయితే ట్విటర్ యూజర్లు మాత్రం తరచూ నోటి దురుసు ప్రదర్శించే ట్రంప్పై అదే స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. రాజకీయ వ్యంగ్యోక్తులతోపాటు మీమ్స్ షేర్ చేస్తూ చాలామంది నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ హ్యాజ్ కోవిడ్ హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. అటు ట్రంప్ దంపతులకు కరోనా సోకిన విషయానికి చైనా అధికారిక మీడియా కూడా భారీ ప్రధాన్యమే ఇస్తోందట. (త్వరగా కోలుకోండి మిత్రమా : మోదీ) ‘అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ కొత్త నాటకానికి (సర్కస్)కు తెరతీశారు’ అంటూ ఒకరు, మొత్తానికి ట్రంప్ ఒక పాజిటివ్ వార్తను ట్వీట్ చేశారంటూ గూనర్ అనే మరొకరు చేయగా, ‘దేవుడా.. దేవుడా.. మీరు మాకు కావాలి.. ఆయన్ని కాపాడండి, ప్లీజ్’ అంటూ మరో యూజర్ సెటైర్ వేశారు. ప్రధానంగా కోల్ గోర్మన్ అనే నెటిజన్ చేసిన ఓ ట్వీట్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. ఆ స్క్రీన్షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘కొవిడ్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఈ వైరస్కు చివరికి ఎలాంటి గతి పట్టింది. అది త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా..’ అంటూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కరోనా రూపంలో ట్రంప్కు కోలుకోలేని దెబ్బపడింది. ట్రంప్, ఆయన సతీమణి మెలనియా కరోనా బారిన పడటమే కాదు, ప్రధాన సలహదారు, ఒక సెనేటర్, ఆయన ప్రధాన ప్రచార నిర్వాహకుడికి కూడా వైరస్ సోకింది. దీంతో ప్రచార కార్యక్రమాలకు వీరు తాత్కాలింగా దూరంకానున్నారు. Is it still a “Democrat hoax?” Are you still going to mock people for wearing masks? Are you sorry for lying to the American people for months? I ask these b/c I assume you’ll get the best taxpayer funded gov’t healthcare avail + genuinely hope you recover. But you owe us answers https://t.co/cOvMX7eElq — Sophia Bush (@SophiaBush) October 2, 2020 Shit happens#Memes #Trump #TrumpHasCovid pic.twitter.com/sQl36O79Q7 — stay for the memes (@strator) October 2, 2020 😉 Live ....from "Walter Reed" #WalterReed #WalterReedHospital #Trump #TrumpHasCovid #MichaelMoore 😷please be good & safe & healthy, everyone. pic.twitter.com/gKF3qgDd6o — A.Silver-MeMEs & GIFs (@SilverAdie) October 3, 2020 -
మన వాట్సాప్ చాట్ సురక్షితమేనా?
సాక్షి, న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు మాదక ద్రవ్యాల కేసుగా మారడం, ఇందులో వాట్సాప్ చాట్ కీలకంగా మారిన నేపథ్యంలో సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ వాట్సాప్ స్పందించింది. ఆపరేటింగ్ సిస్టమ్ తయారీదారులు అందించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని, దీంతో యూజర్ల భదత్రకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది. వాట్సాప్ మెసేజ్ లు పూర్తిగా సురక్షితమని, ధర్డ్ పార్టీలు వాటిని యాక్సెస్ చేయలేవంటూ యూజర్లకు భరోసా ఇస్తోంది. ఈ మేరకు వాట్సాప్ ఒక ప్రకటన విడుదల చేసింది. (డ్రగ్స్: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) వాట్సాప్ సందేశాలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ అందిస్తున్నామని తద్వారా మీరు, మీరు కమ్యూనికేట్ చేస్తున్నవ్యక్తి మాత్రమే ఆయా సందేశాలను చదవగలరు. తప్ప, మధ్యలో ఎవరూ దీన్ని యాక్సెస్ చేయలేరని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ను మాత్రమే వాట్సాప్లో ఉపయోగిస్తారు కనుక మిగతా సమాచారం లీక్ అయ్యే అవకాశం లేదని వాట్సాప్ ప్రతినిది ఒకరు తెలిపారు. అలాగే ఫోన్ డాటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా బలమైన పాస్వర్డ్లు లేదా బయోమెట్రిక్ ఐడీలు వంటి అన్ని భద్రతా ఫీచర్లను సద్వినియోగం చేసుకోవాలని యూజర్లకు విజ్ఞప్తి చేశారు. కాగా సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, మహేష్ భట్ మధ్య వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ తోపాటు, టాలెంట్ ఏజెంట్ జయ సాహా సెల్ఫోన్ నుంచి సేకరించిన 2017 నాటి వాట్సాప్ చాట్ వ్యవహాం హాట్ టాపిక్ గా మారింది. ఈ చాట్ల ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బాలీవుడ్ హీరోయిన్స్ సారా ఆలీఖాన్, దీపికా పదుకొనే, శ్రద్ధా కపూర్, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి నటులకు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఈ ప్రకటన జారీ చేసింది. -
66 లక్షల వినియోగదారులతో ‘పేటీఎం మనీ’
బెంగుళూరు: దేశంలోని కస్టమర్లకు పేటీఎం యాప్ ద్వారా మెరుగైన సేవలను అందిస్తు వినియోగదారుల ప్రజాదరణ చూరగొంది. అయితే తాజాగా పైటీఎం మనీ విభాగం(వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్) అత్యాధునిక సేవలతో 66లక్షల మంది వినియోగదారుల సంఖ్యను చేరుకున్నట్లు సంస్థ పేర్కొంది. కాగా ఈ విజయంపై పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్పందిస్తు మొదటిసారి వినియోగిస్తున్న వారే 70 శాతం ఇన్స్టాల్ చేసుకున్నారని అన్నారు. అయితే 60 శాతం మంది వినియోగదారులు చిన్న పట్టణాలు, నగరాల నుంచే తమ యాప్ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర పేన్సన్ పథకానికి, స్టాక్స్కు పీటీఎం మెరుగైన సేవలందిస్తుంది. మరోవైపు లక్షలాది ప్రజల సంపదను పెంచడానికి పేటీఎమ్ మనీ కీలక చర్యలు తీసుకుంటున్నట్లు పేటీఎం మనీ సీఈఓ వరుణ్ వశ్రీధర్ తెలిపారు. ప్రజల ఆదాయాలను పెంచే ఆత్మనిర్బహర్ భారత్ విజయం సాధించడంలో పేటీఎం కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ అధికారులు తెలిపారు. ఇటీవలె స్టాక్ బ్రోకరేజ్ రంగంలోని పేటీఎం ప్రవేశించిన విషయం తెలిసిందే. దీనికి కావాల్సిన అనుమతులను సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ద్వారా పొందింది. (చదవండి: పబ్జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు) -
తగ్గిన టెలికం యూజర్ల సంఖ్య
న్యూఢిల్లీ: టెలికం యూజర్ల సంఖ్య ఈ ఏడాది మే నెలలో 116.3 కోట్లకు తగ్గింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే 0.49 శాతం క్షీణించింది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ పూర్తి స్థాయిలో అమలైన ఏప్రిల్లో టెలికం యూజర్ల సంఖ్య 85.3 లక్షల మేర క్షీణించి 116.94 కోట్లకు తగ్గింది. ఏప్రిల్తో పోలిస్తే మేలో యూజర్ల సంఖ్య తగ్గుదల 57.6 లక్షలకు పరిమితమైంది. మొబైల్ టెలిఫోనీ విభాగంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు చెరి 47 లక్షల యూజర్లను కోల్పోయాయి. ఎయిర్టెల్ వైర్లెస్ కస్టమర్ల సంఖ్య 31.7 కోట్లు, వొడాఫో¯Œ ఐడియా యూజర్ల సంఖ్య 30.9 కోట్లకు క్షీణించింది. జియో, బీఎస్ఎన్ఎల్ జోరు..: జియో 36 లక్షల కొత్త కనెక్షన్లు జారీ చేసింది. మొత్తం మీద 39.2 కోట్ల యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. అటు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య సైతం 2 లక్షలు పెరిగి 11.9 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో క్షీణత..: పట్టణాల్లో మొబైల్ యూజర్ల సంఖ్య 92.3 లక్షల మేర తగ్గగా, గ్రామీణ ప్రాంతాల్లో 36.2 లక్షలు పెరిగింది. మే నెలాఖరు నాటికి మొత్తం మొబైల్ సబ్స్క్రయిబర్స్ సంఖ్య 114.39 కోట్లుగా, ల్యాండ్లైన్ యూజర్ల సంఖ్య 1.97 కోట్లుగా ఉంది. బీఎస్ఎన్ఎల్ ఫిక్స్డ్ లైన్ కస్టమర్ల సంఖ్య తగ్గుదల మేలోనూ కొనసాగింది. మొత్తం 1.34 లక్షలు క్షీణించింది. అటు జియో మాత్రం 90,000 కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. పెరిగిన బ్రాడ్బ్యాండ్... మొత్తం టెలికం యూజర్ల సంఖ్య తగ్గినప్పటికీ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లు మాత్రం పెరిగారు. వీరి సంఖ్య ఏప్రిల్లో 67.3 కోట్లుగా ఉండగా 1.13 శాతం పెరిగి 68.3 కోట్లకు చేరింది. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు అత్యధికంగా 66.37 కోట్లుగా ఉండగా, వైర్లైన్ కనెక్షన్లు 1.93 కోట్లుగా ఉన్నాయి. -
బంగారం పెట్టుబడులవైపు అమెజాన్ చూపు..
ముంబై: ఈ కామెర్స్ దిగ్గజం అమెజాన్ అన్ని రంగాలలో దూసుకెళ్లాలని ప్రణాళికలు రచిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగిన నేపథ్యంలో డిజిటల్ బంగారు పెట్టుబడులను అమెజాన్ పే ఆహ్వానిస్తోంది. త్వరలోనే వినియోగదారులకు బంగారు పెట్టుబడులను ఆకర్శించే ‘గోల్డ్ వాల్ట్’ను వినియోగదారులకు అందించనుంది. సాంకేతికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తన కార్యాచరణ ఉంటుందని, వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇటీవల కాలంలో చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ మైపే డిజిటల్ బంగారు సేవలను అందించింది. దేశంలో పేటీఎమ్, ఫోన్పే, గూగుల్ఫే, తదతర సంస్థలు ఇది వరకు బంగారు పెట్టుబడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. -
జీమెయిల్ డౌన్ కలకలం : యూజర్లు గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా జీమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం కలగడం కలకలం రేపింది. జీమెయిల్ సేవల్లో మరోసారి సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది, ప్రధానంగా భారతీయ యూజర్లు ఇబ్బందులు పాలయ్యారు. కొంతమంది వినియోగదారులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మీమ్స్తో హోరెత్తిస్తున్నారు. జీమెయిల్తోపాటు గూగుల్ డ్రైవ్ కూడా పనిచేయడం మానేశాయి. జీమెయిల్ లాగిన్ కాలేకపోవడంతోపాటు, లాగిన్ అయినా, ఫైల్స్ అప్లోడ్, డౌన్లోడ్ నిలిచిపోవడం లాంటి సమస్యలను నివేదించారు. భారత్ సహా జపాన్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లోని యూజర్లు జీమెయిల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారని డౌన్ డిటెక్టర్ సంస్థ తెలిపింది. గూగుల్ మీట్, గూగుల్ వాయిస్, గూగుల్ డాక్స్తో కూడా సమస్యలు తలెత్తడంతో గూగుల్ స్పందించింది. ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. కాగా రెండు నెలల్లో జీమెయిల్ షట్డౌన్ అవ్వడం ఇది రెండోసారి. జూలై నెలలో సాంకేతిక సమస్యకారణంగా జీమెయిల్ సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. User reports indicate Gmail is having problems since 1:12 AM EDT. https://t.co/pTPsDoNKxQ RT if you're also having problems #Gmaildown — Downdetector Canada (@downdetectorca) August 20, 2020 Gmail is down for more than an hour. Can't send attachments. Aaaaaaaaaaaahhhhhh#Gmail #gmaildown pic.twitter.com/hQSMNizX3K — Sourav Bhunia (@souravbhunia415) August 20, 2020 How long before its set right @gmail? #GmailDown pic.twitter.com/j1OQ8lz7AZ — Prashanth ಪ್ರಶಾಂತ್ 🇮🇳 (@pvaidyaraj) August 20, 2020 After 1 Hour #Gmail Down all employment person 😤😖😫😭😬 But, Unemployment Persons to cooooooolllll✌️🤞✌️ pic.twitter.com/1tumoosd8B — Karthi Durai (@akkmrc12) August 20, 2020 -
టిక్టాక్ బ్యాన్ : ఇన్స్టా, యూట్యూబ్ ఉందిగా!
సాక్షి, న్యూఢిల్లీ : టిక్టాక్ నిషేధం అనంతరం టిక్టాక్ స్టార్లు ఫ్రస్ట్రేషన్ లో మునిగిపోయారు. ఈ నిషేధం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినప్పటి నుండి, ప్రత్యామ్నాయాలపై వైపు దృష్టిపెట్టారు. ముఖ్యంగా తమ అనుచరులను ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫాలో కావాలని కోరడం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియోలతో ఇన్స్టాలో హల్ చల్ చేస్తున్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కు క్రేజ్ క్రమంగా పుంజుకోనుంది. (నిషేధంపై టిక్టాక్ స్పందన) టిక్టాక్ ప్రొఫైల్లలో వారి ఇన్స్టాగ్రామ్ ఖాతా వివరాలను అందిస్తున్నారు. ఇన్స్టా ఎలా ఉపయోగించాలో అభిమానులకు నేర్పుతూ వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇంకా చాలామంది టిక్టాక్ వినియోగదారులు ఇన్స్టా లైవ్ ద్వారా తమని ఫాలో కావాలని, యూట్యూబ్లో తమ వీడియోలను చూడమని కోరుతుండటం విశేషం. అయితే టిక్టాక్ యాప్ ను ఆపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్లో ప్రస్తుతం డౌన్లోడ్ చేయలేం. కానీ ఇప్పటికే టిక్ టాక్ యాప్ ఫోన్లలో ఉన్న యూజర్లకు దీనికి యాక్సెస్ ఉంది. మరోవైపు టిక్టాక్ నిషేధంపై సోషల్ మీడియాలో ఆర్ఐపీ టిక్టాక్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో వుంది. యూజర్లు మీమ్స్, వీడియోలతో సందడి చేస్తున్నారు. (టిక్టాక్ బ్యాన్ : సెలబ్రిటీల కష్టాలు) Twitter celebs jinka khud ka account tiktok videos ke bharose chal raha tha: pic.twitter.com/SZuK0woQm0 — Diksha🌈 (@BrahmaandKiMaa) June 29, 2020 Right now in Bharat#TikTok stars vs non TikTok users pic.twitter.com/GIT25do5sK — Vertigo_Warrior (@VertigoWarrior) June 29, 2020 Twitter celebs jinka khud ka account tiktok videos ke bharose chal raha tha: pic.twitter.com/SZuK0woQm0 — Diksha🌈 (@BrahmaandKiMaa) June 29, 2020 #TikTok worker right now thinking about #tiktokbanindia . #RIPTiktok pic.twitter.com/smblKUsZv4 — PREM (@PREM48722990) June 30, 2020 -
‘గూగుల్లోకి 6 కోట్ల షేర్చాట్ యూజర్స్’
ముంబై: ప్రస్తుతం స్మార్ట్ఫోన్ వాడే యువతకు పరిచయం అక్కర్లేని యాప్ షేర్ చాట్. ప్రస్తుతం షేర్చాట్ సంస్థ ఖర్చులను తగ్గించి విస్తృత సేవలను అందించాలని భావిస్తోంది. అందులో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం గూగుల్ క్లౌడ్లోకి తమ యాప్కు చెందిన 6 కోట్ల మంది వినియోగాదారులను బదిలీ చేశామని సోమవారం షేర్చాట్ ప్రకటించింది. ప్రస్తుతం షేర్చాట్ అన్ని రంగాల వారికి ఉపయోగపడుతుంది. కాగా విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ రంగాల వారైనా సరే వారి మనోభావాలు, కళాత్మక నైపుణ్యం, మాటలు, వీడియోలు, సరదా సన్నివేశాలు ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు షేర్చాట్ కీలక పాత్ర పోషిస్తుంది. కాగా వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు 6 కోట్ల మందికి ఉపయోగపడే మౌలిక సదుపాయాలను బదిలీ చేశామని తెలిపింది. షేర్చాట్ తన వ్యాపార వృద్ధిని మరింత విస్తరించడానికి, ఖర్చులను తగ్గించడానికి, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. ఇటీవల షేర్చాట్ మెరుగైన సేవల కోసం అత్యాధునిక ఐటి మౌలిక సదుపాయాలపై ఆధారపడుతుంది. దీని వల్ల అధిక డేటా, కంటెంట్, ఎక్కువ వినియోగదారులు ఉపయోగించడం(ట్రాఫిక్ కారణంగా) ఇటీవల కాలంలో షేర్చాట్కు సమస్యగా మారింది. షేర్చాట్ వినియోగదారులలో అధిక శాతం టైర్ 2, టైర్ -3 నగరాలకు చెందినవారు కావడంతో వారు ఇప్పటికీ 2జీ నెట్వర్క్పైనే ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్లో తమ సేవలను వినియోగించే వారికి అత్యుత్తమ సేవలందించేందుకు గూగుల్ క్లౌడ్లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు షేర్చాట్ పేర్కొంది. ప్రస్తుతం సంస్థ వృద్ధి బాటలో కొనసాగుతోందని, కానీ ఖర్చులను తగ్గించి మెరుగైన సేవలందించేందుకు గూగులతో ఒప్పందం కుదుర్చోవడం ఎంతో కీలకమని షేర్ చాట్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ రామస్వామి పేర్కొన్నారు. మరోవైపు మెరుగైన సేవల కోసం 6 కోట్ల మంది వినియోగదారులను తమకు బదిలీ చేయడం సంతోషకరమని గూగుల్ క్లౌడ్ ఎండీ కరణ్ బాజ్వా తెలిపారు. (చదవండి: చాటింగ్ తెచ్చిన చేటు) -
సరికొత్త వెర్షన్లో జూమ్ యాప్..
అమెరికాకు చెందిన జూమ్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ యాప్ యూజర్లకు అనుకూలంగా వీడియా సెషన్స్ అందిస్తోంది. ప్రస్తుతం జూమ్ యాప్ యూజర్లకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో సేవలందిస్తోంది. తాజాగా జూమ్ యాప్పై కొన్ని ఆరోపణలు నేపథ్యంలో సరికొత్త రీతిలో యూజర్లను అలరించడానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలో జూమ్ కంపెనీ మే 30, 2020లో ఇన్స్టాల్ అయ్యే నూతన వెర్షన్నే ఉపయోగించాలని కోరింది. ప్రస్తుతం కంపెనీ జూమ్ రూమ్స్, సిస్టమ్స్, వైర్లెస్ సేవలను యూజర్లకు అందిస్తోంది. సరికొత్త రీతిలో జూమ్ రూమ్స్ను నవీకరిస్తున్నందున వీడియో సెషన్స్ అద్భుతంగా కొనసాగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. జూమ్ యాప్ తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందిస్తున్నందున ఈ యాప్ను ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ స్థాయిలో యూజర్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. యూజర్లకు అన్ని కొత్త వెర్షన్లు రావాలంటే అడ్మిన్ పోర్టల్కు లాగిన్ అయ్యి జూమ్ రూమ్స్ కంట్రోలర్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవలని కంపెనీ సూచించింది. మరోవైపు భారతలో వినియోగదారుల గోప్యతకు జూమ్ వీడియో కాలింగ్ యాప్ భంగం కలిగిస్తుందని ఇటవల సుప్రీం కోర్టులో హర్ష్ చుగ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ యాప్ వినియోగిస్తున్న పలువురి నుంచి హ్యాకింగ్, సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయని ఫిర్యాదులో పిటిషన్దారుడు పేర్కొన్నారు. -
200 కోట్లకు వాట్సాప్ యూజర్ల సంఖ్య
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సుమారు 25 శాతం. వాట్సాప్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ప్రతీ వ్యక్తిగత మెసేజీకి పూర్తి స్థాయిలో గోప్యత ఉండేలా ఎప్పటికప్పుడు తమ ప్లాట్ఫాంను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. గతేడాది జూలై గణాంకాల ప్రకారం వాట్సాప్నకు భారత్లో 40 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. -
ఇన్స్టాలో కొత్త ఫీచర్..
న్యూఢిల్లీ : ఇంటరాక్టివ్ ప్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ను లాంఛ్ చేయనుంది. తమతో అరుదుగా ఇంటరాక్ట్ అయ్యే ప్రొఫైల్స్ను ఎంపిక చేసి వాటిపై యూజర్లకు అన్ఫాలో సజెషన్స్ను ఇచ్చే ఈ ఫీచర్ను ఇన్స్టాగ్రామ్ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ యూజర్లకు తమ సన్నిహిత మిత్రుల గ్రూప్ను సార్ట్ చేసేందుకు, చురుకుగా లేని ఫాలోయర్లను అవాయిడ్ చేసేందుకు సహకరిస్తుంది. ఇప్పటినుంచి ‘మీ ఫీడ్ను ఏయే ఇన్స్టా ఖాతాలు చురుకుగా పరిశీలిస్తున్నాయి..మీతో ఎవరు ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు.. ఏ ఖాతాలను అవాయిడ్ చేయవచ్చు అనే అంశాలన్నింటినీ మీరు ఇక్కడ నుంచి మేనేజ్ చేసుకోవచ్చ’ని తాజా ఫీచర్ గురించి వివరిస్తూ ఇన్స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ ముసోరి ట్వీట్ చేశారు. తాజా ఫీచర్తో ఎంపిక చేసిన ఫీడ్ ద్వారా యూజర్ మరింత ఎక్కువ సేపు యాప్లో గడపటంతో పాటు సైట్కు సైతం అధిక వ్యూస్ వస్తాయని భావిస్తున్నారు. మరి ఈ ఫీచర్పై ఇన్స్టా యూజర్లు ఎలా స్పందిస్తారు..ఇది తన ఉద్దేశాలను నెరవేరుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి : లైవ్ సెక్స్ చాట్ పేరుతో.. -
వాట్సాప్ @ 500 కోట్ల డౌన్లోడ్లు
శాన్ఫ్రాన్సిస్కో: దిగ్గజ మెసేజింగ్ ప్లాట్ఫాం వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల డౌన్లోడ్లను సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో గూగుల్యేతర యాప్గా చరిత్ర సృష్టించింది. అయితే ఇది కేవలం ప్లేస్టోర్ నుంచి చేసుకున్న డౌన్లోడ్లు మాత్రమేగాక, వివిధ సంస్థలకు చెందిన మొబైల్ ఫోన్లలో ప్రీఇన్స్టాల్గా వచ్చే వాటితో కలిపి ఈ ఘనత సాధించింది. వాట్సాప్కు నెలకు 160 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫేస్బుక్కు 130 కోట్ల మంది, వియ్చాట్కు 110 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. సోషల్ నెట్వర్క్లలో ఫేస్బుక్, యూట్యూబ్ల తర్వాత వాట్సాప్ మూడో స్థానంలో నిలిచింది. గతేడాదిలో గూగుల్ 230 కోట్ల డౌన్లోడ్లను సాధించగా, ఫేస్బుక్ 300 కోట్ల డౌన్లోడ్లను సాధించింది. మరోవైపు టిక్టాక్ యాప్ 2019లో రెండో అత్యధిక డౌన్లోడ్లు సాధించిన యాప్గా నిలిచింది. వాట్సాప్ సేవల్లో అంతరాయం.. భారత్తో పాటు, పలు దేశాల్లో వాట్సాప్ స్తంభించింది. ఫొటోలు, వీడియోలు, స్టేటస్ అప్డేట్లు చేయలేకపోయామని పలువురు యూజర్లు ట్విట్టర్ వేదికగా ‘వాట్సాప్డౌన్’ హాష్టాగ్తో వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4:15 నుంచి ఈ సమస్య ఎదురైనట్లు యూజర్లు తెలిపారు. సందేశాలు అందుకోవడం, పంపడం వంటి వాటిల్లో కూడా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. భారత్, యూరోప్, మలేసియా, ఇండోనేసియా, బ్రెజిల్లోని పలు చోట్ల ఈ సమస్య ఎదురైంది. దాదాపు మూడు గంటల తర్వాత ఈ సమస్యను వాట్సాప్ ఇంజనీర్లు పరిష్కరించారు. -
వాట్సాప్ డౌన్ : యూజర్లు విలవిల
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఆదివారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో మొరాయించడంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. వాట్సాప్ ఔటేజ్తో తాము ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్లు షేర్ చేసుకోలేకపోయామని వాట్సాప్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్ స్టేటస్లోనూ తాము వీడియోలు, ఫోటోలను వీక్షించలేకపోయామని యూజర్లు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ పనిచేయకపోవడంతో యూజర్లు మెసేజ్లు పంపడం, రిసీవ్ చేసుకోవడంలో సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్డిటెక్టర్ వెల్లడించింది. వాట్సాప్ డౌన్ కావడంతో ఇండియా, యూరప్, మలేషియా, ఇండోనేషియా, బ్రెజిల్ సహా పలు దేశాల యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఔటేజ్ మ్యాప్లో కనిపించింది. వాట్సాప్ డౌన్ కావడంతో యూజర్లు ట్విటర్ సేవలను ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో ట్విటర్ ఇండియాలో వాట్సాప్డౌన్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. వాట్సాప్ సేవలు కొద్దిసేపటికి పునరుద్ధరించడంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. -
గూగుల్ ప్లే స్టోర్లో డేంజరస్ యాప్స్ హల్చల్
హానికరమైన యాప్స్ను తొలగించేందుకు గూగుల్ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ డేంజరస్ యాప్స్ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. తాజా పరిశోధన ప్రకారం గూగుల్ ప్లే స్టోర్లో వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటి నిరోధానికి ఎంత కృషి చేస్తున్నప్పటికీ, మరిన్ని యాప్స్ రంగంలోకి దిగుతున్నాయని ఈఎస్ఈటీ భద్రతా పరిశోధకుడు లుకాస్ స్టెఫాంకో విశ్లేషణలో బహిర్గతమైంది. ప్రమాదకరమైన ఈ గూగుల్ ఆండ్రాయిడ్ యాప్స్ ప్లే స్టోర్లో వేగంగా పెరుగుతున్నాయని లుకాస్ స్టెఫాంకో నివేదించారు. ఈ యాప్స్లోని మాలావేర్ లక్షలాది వినియోగదారులను చేరిందని ఆయన తన పరిశోధనలో తేల్చారు. ఈ క్రమంలో దాదాపు 172 హానికరమైన అనువర్తనాలను గుర్తించినట్టు తెలిపారు. వీటిని 335 మిలియన్లకు పైగా వినియోగదార్లు ఇప్పటికే ఇన్స్టాల్ చేసుకున్నట్టు చెప్పారు. అటువంటి అనువర్తనాలు ప్లే స్టోర్లో అందుబాటులో లేకుండా ప్లే స్టోర్ చర్యలు తీసుకుంటున్నా ఇవి చెలరేగుతున్నాయని, ఈ నేపథ్యంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అవసరమైన యాప్స్ను మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవడం, విశ్వసనీయ మూలాల నుండి మాత్రమే వీటిని స్వీకరించడంతోపాటు, వెబ్లో బ్రౌజ్ చేసేటప్పుడు ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్టెఫాంకో హెచ్చరిస్తున్నారు. -
షాకింగ్ న్యూస్ చెప్పిన ఫేస్బుక్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ షాకింగ్ న్యూస్ చెప్పింది. డేటా భద్రతపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తమ యూజర్ల వందల మిలియన్ల పాస్వర్డ్లను తమ ఇంటర్నల్ సెర్వర్లలో దాచిపెట్టినట్టు గురువారం ధృవీకరించింది. భద్రతా నిబంధనలకు విరుద్ధంగా సులువుగా చదవగలిగిన (ప్లెయిన్ టెక్స్ట్) ఫార్మాట్లోనే సర్వర్లలో నిక్షిప్తం చేసామని వెల్లడించింది. జనవరిలో నిర్వహించిన సెక్యూరిటీ రివ్యూలో ఈ విషయాన్ని ఫేస్బుక్వెల్లడించింది. అయితే ఈ పాస్వర్డ్లు ఫేస్బుక్ ఉద్యోగులకు తప్ప ఇతరులకు కనిపించవని వివరణ ఇచ్చింది. ఫేస్బుక్ ఇంజినీరింగ్, భద్రత, గోప్యత విభాగం ఉపాధ్యక్షుడు పెడ్రో కనహువాటి తన ‘బ్లాగ్స్పాట్’లో దీనిపై వివరణ ఇచ్చారు. ఏటా జరిపే భద్రత సమీక్షలో భాగంగా ఇంతవరకు దుర్వినియోగం అయిన దాఖలాలేవీ లేవని, ఈ ఏడాది కూడా ఈ ఘోర తప్పిదాన్ని కనిపెట్టలేకపోయామని ఆయన అంగీకరించారు. కాకపోతే ఈ తప్పిదం తమ దృష్టికి రాగానే ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తమ ఉద్యోగులకు కనిపించేలా పాస్వర్డ్లు కలిగి ఉన్నఫేస్బుక్ లైట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజర్లకు త్వరలోనే ఈ విషయమై తగిన హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తామన్నారు. కొత్త పాస్వర్డ్లు పెట్టుకునేలా సూచిస్తామన్నారు. కాగా క్రెబ్స్ఆన్సెక్యూరిటీ.కామ్ అనే సెక్యూరిటీ న్యూస్ వెబ్సైట్ ఇంతకుముందెప్పుడో ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. గత కొన్నేళ్లుగా 60 కోట్లమంది ఫేస్బుక్ ఖాతాదారుల పాస్వర్డ్లు సాధారణ అక్షరాల్లోనే నిల్వ ఉంచారని, గుప్త అక్షరాల్లో నిక్షిప్తం చేయలేదని, 20వేలమంది ఫేస్బుక్ ఉద్యోగులు వాటిని చూడగలరని తెలిపింది. దీంతో ఫేస్బుక్ గోప్యతపై సర్వత్రా అనుమానాలు తలెత్తాయి. అయితే 2012కు ముందు పెట్టుకున్న పాస్వర్డ్లు మాత్రమే ఈ ప్రభవానికి లోనయ్యాయని, ఆ తరువాత పాస్వర్డ్లు మార్చుకున్నవారు, కొత్త యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా క్రెబ్స్ నివేదించింది. -
నకిలీ ‘ఫేస్బుక్’ ఖాతాలు 25 కోట్లు
హైదరాబాద్: ఫేస్బుక్లో నకిలీల బెడద ఎక్కవైపోతోంది. గత మూడేళ్లలోనే ఇటువంటివి మూడు రెట్లు పెరిగిపోయాయి. నెలవారీ యాక్టివ్ యూజర్ల (తరచూ ఫేస్బుక్లో లీనమయ్యే వారు)ఖాతాలను విశ్లేషించగా, వీటిల్లో 25 కోట్ల ఖాతాలు నకిలీవేనని ఫేస్బుక్ సంస్థ తన 2018 వార్షిక నివేదికలో వెల్లడించింది. 2018 చివరి త్రైమాసికం (అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు)లో నెలవారీ యాక్టివ్ యూజర్లలో నకిలీ ఖాతాలు 11 శాతంగా ఉన్నట్టు సంస్థ వెల్లడించింది. వాస్తవానికి 5 శాతం మేర ఉండొచ్చని సంస్థ అంచనా వేయడం గమనార్హం. 2015లో యాక్టివ్ యూజర్లలో నకిలీ ఖాతాలు 5 శాతంగానే ఉన్నాయి. 2015 డిసెంబర్ నాటికి ఫేస్బుక్లో నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 159 కోట్లుగా ఉంటే 2018 డిసెంబర్ చివరికి 232 కోట్లకు పెరిగినట్టు ఫేస్బుక్ నివేదిక తెలియజేసింది. గడిచిన నెల రోజుల్లో ఫేస్బుక్ ఖాతాలో లాగిన్ అయిన యూజర్లను నెలవారీ యాక్టివ్ యూజర్లుగా సంస్థ పరిగణిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే... అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఫిలిప్పీన్స్, వియత్నాం తదితర మార్కెట్లలో నకిలీ ఖాతాల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్టు ఫేస్బుక్ తెలిపింది. ఒకటి కంటే అదనంగా ఓ యూజర్ నిర్వహించే ఖాతాలను డూప్లికేట్గా సంస్థ పరిగణిస్తుంది. ఇందులో యూజర్లు తమ వ్యక్తిగత ప్రొఫైల్తో ఒకటి, వ్యాపార అవసరాల కోసం మరొకటి, సంస్థ పేరిట, తమ పెంపుడు జంతువుల పేరిట నిర్వహించే ఖాతాలు ఒక కేటగిరీ కాగా, రెండో కేటగిరీలో ఫేస్బుక్ నిబంధనలకు ఉల్లంఘించే ఉద్దేశంతో క్రియేట్ చేసినవి. -
జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం సంచలనం రిలయన్స్ జియో తాజా జియో ఫోన్ యూజర్లకోసం రెండు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. రూ.594, రూ.297 దీర్ఘకాల ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. ముకేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో తీసుకొచ్చిన ఈ కొత్త పథకాల ద్వారా జియో ఫోన్ వినియోగదారులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించనుంది. రూ 594 పథకం కింద, జియో ఫోన్ వినియోగదారులు 168 రోజులు (దాదాపు ఆరు నెలల) అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. అలాగే జియో యాప్స్కు ఉచిత యాక్సెస్ అందిస్తోంది. అయితే రోజుకు అపరిమిత హై స్పీడ్ డేటా 0.5జీబీ పరిమితి దాటిన తరువాత డేటా స్పీడ్ 64కేబీపీఎస్కు కు తగ్గుతుందని జియో ప్రకటించింది. అలాగే నెలకు 300 ఎంఎంఎస్లు ఉచితం. రూ. 297 ప్లాన్లో వినియోగదారులు నెలకు 300 ఎస్ఎంఎస్లతో ఉచిత కాలింగ్ సదుపాయంతో పాటు రోజుకు 0.5జీడీ డేటా పొందుతారు. ఈ పరిమితిని దాటినట్లయితే, వేగం 64కేబీపీఎస్కు తగ్గుతుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు అంటే మొత్తం 3నెలలు. -
కేబుల్ చందాదారును మోసగించిన ‘ట్రాయ్’
కేబుల్ టీవీ డిజిటైజేషన్ వలన చందాదారుకు ఎంతో మేలు జరు గుతుందంటూ కేబుల్ టీవీ నియం త్రణ చట్టాన్ని సవరించే సంద ర్భంలో కేంద్ర ప్రభుత్వం నమ్మబలి కింది. పారదర్శకత, ప్రసారాల నాణ్యత, కోరుకున్న చానల్స్కే చెల్లించే అవకాశం లాంటి మాయ మాటలు చెప్పింది. కానీ సామాన్య ప్రేక్షకులను బుట్టలో వేయటానికే ఈ అబద్ధాలు చెప్పిందన్నది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న నిజం. సగటున 15 నుంచి 20 చానల్స్ మాత్రమే చూసే ప్రేక్షకులకు వంద చానల్స్ అందుతున్న సమయంలో ఈ సంఖ్యను 500కు తీసుకుపోతా మంటూ చెప్పింది. అలా చానల్స్ పెరిగే కొద్దీ బిల్లు తడిసి మోపెడవుతుందని మాత్రం చెప్పలేదు. అనలాగ్ ప్రసారాల వలన కేబుల్ టీవీలు వంద చానల్స్ మించి ఇవ్వలేకపోతున్నాయని, అందువలన చందాదారు ఎంచుకునే స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ప్రభుత్వానికి డిజిటైజేషన్ మీద చేసిన సిఫార్సులలో ట్రాయ్ చెప్పింది. డిజి టైజేషన్లో 500 చానల్స్ సైతం ఇవ్వగలిగే వీలుంటుందని చెప్పినా పంపిణీ సంస్థలకు మాత్రం 500 చానల్స్ ఇవ్వాలనే షరతు విధించలేదు. ఉచిత చానల్స్ ఎంచుకునే స్వేచ్ఛ చందాదారుడిదే అనేది మరో మోసం. స్వేచ్ఛ అంటున్నప్పుడు కనీసం 200 ఇవ్వ కుండా 100 ఎంచుకోమంటే దాన్ని స్వేచ్ఛ అనాలా? అలా 200 చానల్స్ ఎంతమంది ఎమ్ఎస్ఓలు ఇవ్వగలుగుతు న్నారు? పైగా ఆ 100 లోనే 26 దూరదర్శన్ చానల్స్ కచ్చి తంగా తీసుకోవాలి. మిగిలిన 74 చానల్స్ లో ఉచిత చానల్స్ తోబాటు మనం ఎంచుకునే పే చానల్స్ కూడా కలిసే ఉంటాయి. కాకపోతే పే చానల్స్కు అదనంగా చందా కడతాం. అంటే, ఈ 74 లో మనం కనీసం నాలుగు తెలుగు బొకేలు ఎంచుకున్నా 33 అయిపోతాయి. మిగిలేది 41. తెలు గులో ఉచిత చానల్స్ సంఖ్య దాదాపు 45. ఆ విధంగా చూస్తే మనం కోరుకునే చానల్స్ సంఖ్య 100 దాటిపోతుంది. అది దాటాక ప్రతి 25 చానల్స్ కు రూ.20 వసూలు చేస్తారు. ఇదీ ట్రాయ్ చెప్పే రూ. 130 – వంద చానల్స్ వెనుక అసలు కథ. పైగా ఇప్పుడున్న రూ.130 మరో ఆరు నెలల తరువాత పెంచుకోవటానికి పంపిణీ సంస్థలకు ట్రాయ్ అవకాశ మిచ్చింది. డిజిటైజేషన్ అనేది సెట్ టాప్ బాక్స్ తోనే సాధ్యం. ఇది టీవీ యజమాని సమకూర్చుకోవాలని ప్రచారం చేశారు. కానీ, ఆ సెట్ టాప్ బాక్స్ ఒకేసారి డబ్బు పెట్టి కొనుక్కో వాల్సిన అవసరం లేదని, అద్దెకు కూడా తీసుకోవచ్చునని, వాయిదాల పద్ధతిలో ఇమ్మని కూడా మీ ఎమ్మెస్వో/ ఆపరేటర్ను అడగవచ్చునని ఆ ప్రచారంలో ఎక్కడా చెప్ప లేదు. చందాదారుల ప్రయోజనం ముఖ్యమైతే ఈ వెసులు బాటు గురించి కదా ప్రచారం చేయించాల్సింది? ఎవరైనా ఆ ఎమ్ఎస్ఓ సేవలు నచ్చక ఇంకొకరి పరి ధిలోకి వెళ్ళాలంటే ఆ బాక్స్ పనికి రాదు. ఇంటర్ ఆపరేట బిలిటీ లక్షణం వాటికి లేదు. అంటే, చందాదారుడు కొను క్కున్న బాక్స్ మీద పరోక్షంగా యాజమాన్యం మాత్రం ఎమ్ ఎస్ఓదే. అతడి పరిధిలో మాత్రమే అది పనికొస్తుంది. ఎవ రైనా మరో ఊరికి మారితే మళ్ళీ అక్కడ సెట్ టాప్ బాక్స్ కొనుక్కోవాల్సిందే. అప్పట్లో స్వదేశీ సెట్ టాప్ బాక్సులు తగినన్ని లేక దిగుమతి చేసుకోవటం వలన ఈ ఫీచర్ లేక పోయినా తీసు కోవాల్సి వచ్చిందనేది ట్రాయ్ వివరణ. హడా వుడిగా డిజిటైజేషన్ అమలు చేసిన ఫలితమిది. డిజిటైజేషన్ వలన కేబుల్ బిల్లు తగ్గుతుందని ట్రాయ్ చెప్పటం అతిపెద్ద అబద్ధం. ఇప్పటికీ అదే అబద్ధం చెబు తోంది తప్ప వివరణ ఇవ్వటం లేదు. తగ్గటం, పెరగటం అనేది ఇప్పటి బిల్లుతోనే జనం పోల్చుకుంటారు. 200 చానల్స్ ఇచ్చే ఆపరేటర్ ప్రస్తుతం రూ. 200 వసూలు చేస్తున్నాడనుకుంటే ఇప్పుడు అవే చానల్స్కు బిల్లు లెక్కగడితే రూ.750కి తగ్గటం లేదు. ట్రాయ్ ఇప్పుడు చెబుతున్నదేం టంటే, ఆపరేటర్ ఇచ్చే చానల్స్ కాకుండా నిజంగా మీరు చూడాలనుకునే చానల్స్ కే లెక్కగట్టండి అంటోంది. అలా చూసినా రూ. 400 కి తగ్గేట్టు లేదు. టారిఫ్ ఆర్డర్ 36 వ పేజీ 52వ పాయింట్ ఇలా ఉంది: ‘‘ట్రాయ్ అందరి అభిప్రాయాలూ లెక్కలోకి తీసుకున్న మీదట చానల్స్కు పూర్తి స్వేచ్ఛ, వ్యాపారంలో వెసులుబాటు ఇవ్వటం ద్వారా అవి సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వాలని భావించింది. అందుకే పే చానల్స్ కు వాటి కంటెంట్ తరహా ఆధారంగా ధర పరిమితి విధించకూడదని నిర్ణయించింది. అయితే తన పే చానల్స్ ధర నిర్ణయించేటప్పుడు బ్రాడ్ కాస్టర్ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ వివక్ష చూపకుండా, చందాదారుల ప్రయోజనాలు కాపాడతాడని ఆశిస్తున్నాం. అర్థవంతంగా ధర నిర్ణయించటం ద్వారా అధికాదాయం సంపాదించుకుంటాడని కూడా అంచనావేస్తున్నాం ’’. ఇది ట్రాయ్ చేసిన పెద్ద తప్పుడు అంచనా. బ్రాడ్కాస్టర్కు అవ కాశమిచ్చిన తరువాత తక్కువధర నిర్ణయించవచ్చునని ఆశించటమేంటి?. ప్రేక్షకులు ఆసక్తి చూపని చానల్స్ను కూడా అంటగట్టే బొకేల విధానాన్ని అదుపులో ఉంచటానికి ఒక నిబంధన పెట్టింది. బొకేలోని చానల్స్ విడివిడి ధరల మొత్తంలో డిస్కౌంట్ 15% మించకుండా బొకే ధర నిర్ణయించాలని చెప్పింది. ఇది కచ్చితంగా ధరలను అదుపు చేయటానికి వీలుండే అంశమే. అయితే మద్రాసు హైకోర్టు ఈ నిబం ధనను కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న కనీస జ్ఞానం ట్రాయ్కి లేకపోయింది. నెలలతరబడి ఆలస్యంగా మేలుకొని వెళితే, మీరు ఇన్నాళ్ళూ నిద్రపోయారా అని సుప్రీంకోర్టు అడగ్గానే పిటిషన్ వెనక్కు తీసుకుని ‘‘బ్రాడ్ కాస్టర్లు తగ్గిస్తే తగ్గవచ్చునేమో వేచి చూద్దాం’’ అని చెప్పటం ఎంత సిగ్గు చేటు? డిజిటైజేషన్ గురించి స్పష్టత ఇవ్వకుండా, సెట్ టాప్ బాక్స్ కొనకపోతే ప్రసారాలు ఆగిపోతాయని భయపెట్టటాన్నే అవగాహనగా చెప్పుకుంది. ఇప్పుడు కూడా ‘‘మేం అవకాశ మిచ్చినట్టుగా చానల్స్ నిర్ణయించుకున్న ధరలకు మీరు ఆమోదముద్ర వెయ్యకపోతే ఫిబ్రవరి 1 తరువాత మీకు టీవీ ప్రసారాలు ఆగిపోతాయి’’ అనే ప్రచారం మొదలైంది. నియంత్రణా సంస్థ అయిన ట్రాయ్కి చాలా విషయాల్లో నియంత్రణ లేదు. కేబుల్ నెట్వర్క్స్ను ఎమ్ఎస్ఓలు అమ్ము కుంటున్నప్పుడు వాటి పరిధిలో ఉన్న ఆపరేటర్లు, చందా దారుల ప్రయోజనాల సంగతేంటని పట్టించుకోదు. ఈ మధ్య కాలంలో రిలయెన్స్ జియో లాంటి సంస్థలు పెద్ద ఎత్తున కార్పొరేట్ ఎమ్ఎస్ఓలను సైతం కొంటూ ఉంటే ఎలాంటి సమాచారమూ లేకుండానే స్థానిక కేబుల్ ఆపరేటర్లు, చందా దారులు గొర్రెల్లా కొత్త యజమాని అధీనంలోకి వెళ్ళిపోతు న్నారు. ఇది కచ్చితంగా గుత్తాధిపత్యానికి దారి తీసి చందా దారుల మీద పెనుభారం మోపే ప్రమాదం ఉంది. అయినా ట్రాయ్ జోక్యం చేసుకోవటానికి ఇష్టపడటం లేదు. చందా దారుల ప్రయోజనాలు గాని, కేబుల్ ఆపరేటర్ల ప్రయోజ నాలుగాని కాపాడలేని నియంత్రణా సంస్థ ఎవరికి మేలు చేస్తు న్నదో ఆత్మ విమర్శ చేసుకోవాలి. వ్యాసకర్త: తోట భావనారాయణ సీనియర్ పాత్రికేయుడు మొబైల్ : 99599 40194 -
ఎయిర్టెల్కు 7 కోట్లమంది యూజర్లు షాకిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం మార్కెట్ సంచలనం రిలయన్స్ జియో దెబ్బతో విలవిలలాడిన ప్రయివేటు దిగ్గజ టెల్కో ఎయిర్టెల్కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తాజా నివేదికల ప్రకారం ఇప్పటికే.. జియో దెబ్బకు కుదేలైన ఎయిర్టెల్ సుమారు 5-7 కోట్ల ఖతాదారులను ఎయిర్టెల్ కోల్పోనుంది. జీవిత కాల కస్టమర్లు ఉచిత ఇన్కమింగ్ కోసం 35రూపాయల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధన కంపెనీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లైఫ్ టైం ఫ్రీ ఇన్కం ప్లాన్లో ఉన్న కస్టమర్లు నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ. 35గా ఎయిర్టెల్ ఇటీవల ఆదేశించింది. కస్టమర్లు నెలకు ఈ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని లేదంటే కనెక్షన్ను కట్ చేస్తానని నోటీసులు కూడా పంపింది. దీంతో చాలా మంది కస్టమర్లు ఎయిర్టెల్ను వీడనున్నారని సమాచారం. ఎయిర్టెల్ ఏమంటోంది? తమ తాజా నిర్ణయం వల్ల తమకు నష్టం ఏమీ ఉండదని ఎయిర్టెల్ ధీమాగా చెబుతోంది. ఖాతాదారులను నష్టపోనుందన్న అంశంపై స్పందించిన ఎయిర్టెల్ ఈ చర్య వల్ల యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (సగటు వినియోగదారుని నుండి వచ్చే ఆదాయం) ఏపీఆర్యూ పెరుగుతుందని, ఇప్పటికే చాలా సిమ్లు లైఫ్ టైం ప్యాకేజ్ కింద కేవలం ఇన్కమింగ్ కాల్స్ కోసమే వాడుతున్నారని , దీన్ని అరికట్టడానికే ఈ చర్య తీసుకున్నామని ఎయిర్టెల్ తెలిపింది. అంతేకాదు ఒక వేళ కస్టమర్లు తగ్గినా ఆ భారాన్ని మోయడానికే తాము సిద్ధ పడ్డామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 4జీ సేవలతో బాటు , ఇతర రంగాల్లో నుంచి తమకు ఆదాయం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. -
ఫేస్బుక్ యూజర్ల నెత్తిన మరో పిడుగు
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ యూజర్లకు మరో షాకింగ్ న్యూస్. ఇటీవలి డేటా లీక్ ఉదంతాలను మర్చిపోకముందే మరో డేటా బ్రీచ్ పిడుగు ఖాతాదారుల నెత్తిన పడింది. మూడవసారి తమ ఖాతాదారుల డేటా లీక్ అయ్యిందంటూ స్వయంగా ఫేస్బుక్ నిన్న(డిసెంబరు 14, శుక్రవారం) ఒక ప్రకటన జారీ చేసింది. ఏకంగా 68 లక్షల ఫేస్బుక్ యూజర్ల డేటా, ముఖ్యంగా ఫోటోలు ప్రభావితమైనట్టు వెల్లడించింది. ఫేస్బుక్ యాప్లోని ఓ బగ్ ద్వారా ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపింది. సెప్టెంబరు 12వ తేదీనుంచి సెప్టెంబరు 25వ తేదీల మధ్య 12 రోజులపాటు ఇది జరిగి వుంటుందని అంచనా వేసింది. 876 మంది డెవలపర్లు రూపొందించిన1500 థర్డ్పార్టీ యాప్స్లో బగ్స్ ఉన్నట్టు గుర్తించామంది. యూజర్ల ప్రమేయం లేకుండానే వారి ఫోన్లలోని వ్యక్తిగత ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిందని వెల్లడించింది. 6.8 మిలియన్ల యూజర్లు ఈ బగ్ ప్రభావానికి గురైనట్టు గుర్తించామని పేర్కొంది. అంతేకాదు దీనికి తమను క్షమించాలని కోరింది. అయితే ఈసమస్యను పరిష్కరించామని, ఈ పరిణామానికి క్షంతవ్యులమంటూ ఫేస్బుక్ ఇంజనీరింగ్ డైరెక్టర్ టోమర్ బార్ ప్రకటించారు. వినియోగదారులు థర్డ్పార్టీ యాప్స్ యాక్సెస్ సందర్బంగా ఫేస్బుక్ వివరాలతో లాగిన్ అవుతుండటం దీనికి కారణం కావచ్చని తెలిపింది. థర్డ్పార్టీ యాప్స్ను వినియోగదారులు ఇన్స్టాల్ చేసినప్పుడు.. ఫేస్బుక్ యాక్సెస్, మీడియా అనుమతి ఇవ్వడం వల్ల ఒక బగ్ దాడి చేసిందని తెలిపింది. అయితే వాటిని గుర్తించి, తొలగించే ప్రక్రియ చేపట్టామనీ, ఈ బగ్ బారిన పడిన ఖాతాదారులకు సమాచారం అందిస్తున్నామని చెప్పారు. -
మొబైల్ యూజర్లు@ 142 కోట్లు!
న్యూఢిల్లీ: భారత్లో మొబైల్ సబ్స్క్రయిబర్ల సంఖ్య 2024 నాటికి 142 కోట్లకు చేరుకోనుంది. అప్పటికి 80 శాతం మంది యూజర్లు 4జీ సేవలను వినియోగించుకునే అవకాశముందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ఎరిక్సన్ మొబిలిటీ తెలియజేసింది. 2022 నుంచి భారత్లో 5జీ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. ‘2020 నాటికల్లా 5జీ సర్వీసులను ప్రవేశపెడతామని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఈ సర్వీసుల వినియోగం 2022 నాటికి గానీ గణనీయ స్థాయికి చేరుకోకపోవచ్చు. 2024 నాటికి 3.8 కోట్ల 5జీ సబ్స్క్రిప్షన్స్ ఉండొచ్చు. అప్పటి మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్స్లో ఈ వాటా సుమారు 2.7 శాతంగా ఉంటుంది‘ అని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్యాట్రిక్ సెర్వాల్ తెలిపారు. మొబైల్ ఫోన్లలో 1 జీబీపీఎస్ (గిగాబిట్ పర్ సెకన్) వేగంతో బ్రాడ్బ్యాండ్ సేవలు అందుకోవడానికి 5జీ కనెక్షన్లు తోడ్పడతాయని చెప్పారాయన. ప్రస్తుతం 56 కోట్లుగా ఉన్న స్మార్ట్ఫోన్ సబ్స్క్రిప్షన్స్ సంఖ్య మరో ఆరేళ్లలో 100 కోట్లకు చేరగలదని, అలాగే డేటా నెలవారీ వినియోగం 6.8 జీబీ స్థాయి నుంచి 15 జీబీకి పెరగవచ్చని పేర్కొన్నారు. 150 కోట్ల మంది 5జీ యూజర్లు.. 2024 ఆఖరు నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు 150 కోట్ల స్థాయిలో 5జీ యూజర్లు ఉంటారని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక పేర్కొంది. 5జీ వినియోగంలో ఉత్తర అమెరికా, ఈశాన్య ఆసియా ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయని వివరించింది. భారత్లో మరికొన్నాళ్ల పాటు 4జీనే ప్రధాన టెల్కో టెక్నాలజీగా కొనసాగవచ్చని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 12 కోట్ల మేర పెరగ్గా.. ఇందులో భారత్ వాటా 3.1 కోట్లుగా ఉందని సెర్వాల్ తెలిపారు. కొత్త సబ్స్క్రయిబర్స్ విషయంలో ఎరిక్సన్ నివేదిక ప్రకారం 3.7 కోట్ల మంది కొత్త యూజర్లతో చైనా అగ్రస్థానంలో ఉంది. -
జియోఫోన్కు త్వరలో పాపులర్ గూగుల్ ఫీచర్లు
అన్ని స్మార్ట్ఫోన్లలో అందిస్తున్న పాపులర్ గూగుల్ సర్వీసులు త్వరలో రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్, జియోఫోన్లోకి రాబోతున్నాయి. గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ సెర్చ్లను జియో ఫోన్లో అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జియో ఫీచర్ ఫోన్ ప్రస్తుతం అమెరికా కంపెనీ కిఓఎస్ టెక్నాలజీస్కు చెందిన కిఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తున్నాయి. గూగుల్తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కిఓఎస్ ఈ యాప్స్ను త్వరలో తన యూజర్లకు అందించడానికి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నుంచి కిఓఎస్ టెక్నాలజీస్ సంస్థకు 22 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ పెట్టుబడులు వచ్చాయని, ఈ పెట్టబడులను తర్వాతి తరం యూజర్లకు ఇంటర్నెట్ను అందించడానికి ఉపయోగిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. గూగుల్ నుంచి వచ్చిన ఈ నిధులను ఫాస్ట్-ట్రాక్ అభివృద్ధికి ఉపయోగిస్తామని, కిఓఎస్ ఆధారంగా రూపొందిన స్మార్ట్ ఫీచర్ఫోన్లను గ్లోబల్గా అందిస్తామని కిఓఎస్ చెప్పింది. ముఖ్యంగా ఇంటర్నెట్ లేని ఎమర్జింగ్ మార్కెట్లలో వీటిని ఉపయోగిస్తామని కిఓఎస్ టెక్నాలజీస్ సీఈవో సెబాస్టియన్ చెప్పారు. జియోఫోన్లు విజయవంతం కావడంతో, గూగుల్కు చెందిన పలు పాపులర్ యాప్స్ను ఈ యూజర్లకు అందించాలని కిఓఎస్ నిర్ణయించినట్టు తెలిసింది. కిఓఎస్ అనేది వెబ్ ఆధారిత ప్లాట్పామ్. జియోఫోన్కు వెల్లువెత్తిన భారీ డిమాండ్తో ఈ ఓఎస్ మొబైల్ ఓఎస్ మార్కెట్లో ఆపిల్ ఓఎస్ను బీట్ను చేసి మరీ 15 శాతం లాభాలనార్జించింది. -
వారి కోసం ‘ఇన్స్టాగ్రామ్ లైట్’
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ సొంతమైన సోషల్ మీడియా యాప్ 'ఇన్స్టాగ్రాం' ప్రపంచవ్యాప్తంగా మరింతమంది యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్ల కోసం కొత్త యాప్ను విడుదల చేసింది. పనిచేసేలా 'ఇన్స్టాగ్రాం లైట్' పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అంతేకాదు మెయిన్ యాప్ లో ఉన్న ప్రధాన ఫీచర్లనీ లైట్ వెర్షన్లో కూడా అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ లాంటి స్మార్ట్ఫోన్ల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ యాప్ సైజ్ కేవలం 573 కేబీ మాత్రమే. అంటే ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువగా ఉండే యూజర్లకు ఇది ప్రత్యేకంగా ఉపయోగపడనుంది. ఈ యాప్ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ లైట్ యాప్లో కూడా యూజర్లు ఫోటోలు, స్టోరీలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు, ఇతర స్నేహితులు, యూజర్లు షేర్చేసినస్టోరీలను,వీడియోలను వీక్షించవచ్చు. కాగా 2015లో ఫేస్బుక్ కూడా ఫేస్బుక్ లైట్, మెసేంజర్ లైట్ వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఇటీవల యూ ట్యూబ్కు పోటీగా ఇన్స్టాగ్రామ్ ఐజీటీవీ పేరుతో కొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. తద్వారా గంట నిడివి గల వీడియోను షేర్ చేసుకునే సౌలభ్యాన్ని యూజర్లకు కలిగించింది. -
ఈ దారి.. స్మార్ట్ఫోన్ దారి..
చేతిలో స్మార్ట్ఫోన్, చెవుల్లో ఇయర్ఫోన్స్ ఉంటే చాలు..టీనేజ్కురాని పిల్లాడి నుంచి పండు ముసలాడి వరకు.. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఏ సమయంలోనైనా.. ఎక్కడున్నా బయటి ప్రపంచంతో పనిలేదన్నట్టు స్మార్ట్ఫోన్ ప్రపంచంలో చక్కర్లు కొడుతుంటారు. ఇది ఎంత ప్రమాదకరమో వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని గుర్తించిన చైనాలోని షియాన్ నగర అధికారులు ఫుట్పాత్ తరహాలో స్మార్ట్ఫోన్ వాకర్ల కోసం ప్రత్యేకంగా ‘స్మార్ట్పాత్’ను ఏర్పాటు చేశారు. షియాన్ సిటీలో అత్యంత రద్దీగా ఉండే యాంటా రోయాన్ ప్రాంతంలో ఈ ప్రత్యేక లైన్ను నిర్మించారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో కూడిన ఈ లైన్పై మొబైల్ చిత్రాలను ఉంచారు. దీంతో అయినా ఫోన్ ప్రియులను ప్రమాదాల బారి నుంచి కాపాడవచ్చని భావిస్తున్నారు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. అదేంటంటే స్మార్ట్ఫోన్ వాకర్ల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు చైనాలోని చాంగ్కింగ్ సిటీలో ఇదే తరహాలో స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆలోచన ఫోన్ ప్రియులపై ఏమాత్రం ప్రభావం చూపలేదంట. ఫోన్లోనే చూస్తూ.. అసలు తమకోసం ఏర్పాటు చేసిన ఈ స్మార్ట్పాత్నే వారు గమనించటం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. -
మరో బాంబు పేల్చిన ఫేస్బుక్
శాన్ ఫ్రాన్సిస్కో: డేటా భద్రత యూజర్లకు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఇప్పటికే సోషల్మీడియా ప్లాట్ఫాం ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారుల డేటా లీక్ ప్రకంపనల నుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ మరో బాంబు పేల్చారు. డేటా బ్రీచ్ ప్రమాదం మరింత పొంచి వుందని యూజర్లు, ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు సమర్పించిన త్రైమాసిక నివేదికలో భవిష్యత్తులో మరింతగా డేటా లీక్ ఉండే అవకాశముందని ఫేస్బుక్ వెల్లడించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు అందించిన త్రైమాసిక నివేదికలో, కేంబ్రిడ్జ్ ఎనలైటికా గురించి ప్రస్తావించకుండానే యూజర్లకు ఈ హెచ్చరిక చేసింది. థర్డ్ పార్టీల అవాంఛనీయ కార్యాచరణ ద్వారా వినియోగదారుల డేటా లీక్ సంఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తమ సంస్థ నుంచి మరింత డేటాను ఇతరులు తస్కరించి వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని ఫేస్బుక్ ఎస్ఈసీకి తెలిపింది. ఇది తమ కీర్తి, ప్రతిష్టలకు తీవ్ర హాని కలిగించవచ్చు. తమ వ్యాపారాన్ని, ఆర్థిక ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. కాగా ఫేస్బుక్ నుంచి అక్రమంగా సేకరించిన కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా లీక్ చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో అమెరికా, బ్రిటన్ చట్ట సభలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. అంతేకాదు ఈ వ్యవహారంలో కంపెనీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదని అంచనా. -
నష్టాలపాలు
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుంది జిల్లాలో సబ్సిడీ ఆవులు పొందుతున్న లబ్ధిదారుల పరిస్థితి. ఆవులతోనైనా అప్పులు పూడ్చుకోవచ్చని భావించిన పేదలకు చివరకు కష్టాలు.. నష్టాలే మిగులుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినఆవులు ఇక్కడమనలేక మృత్యువాతపడుతున్నాయి. వీటికి బీమా సొమ్మూ ఇవ్వకుండా అధికారులు అప్పులపాలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బలవంతంగా అంటగట్టారు నాకు పట్టించిన ఆవులు ఏమీ బాగోలేవు. ఇవి వద్దన్నా బ్యాంకర్లు, పశువైద్యాధికారులు వినలేదు. మీకు సబ్సిడీ ఆవులు కావాలంటే వీటినే పట్టుకోండి అంటూ హుకుం జారీ చేశారు. చేసేది లేక వారు చూపించిన వాటినే పట్టుకున్నా. ఆవులు ఇంటికి చేరేలోపే ఓ ఆవుకు కడుపులోనే దూడ చనిపోయింది. దూడను బయటకు తీసి ఆవుకు వైద్యం చేయాలని డాక్టర్కు చెప్పినా పట్టించుకోలేదు. చివరకు ఆవుకూడా చనిపోయింది. – వేద, మహిళా రైతు, ఎట్టేరి చిత్తూరు అగ్రికల్చర్ : జిల్లాలో 2017–18కి గాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మొత్తం 920 పాడి ఆవులు పంపిణీ చేశారు. ఇందులో 60 శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధిదారునికి రెండేసి ఆవులను అంటగట్టారు. వీటిని ఇతర రాష్ట్రాల్లోనే కొనుగోలు చేసేవిధంగా అధికారులు ఆంక్షలు విధించారు. సమీప రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి ఆవులను పట్టించి ఇచ్చారు. అక్కడి ఆవులు ఇక్కడ మనుగడ సాగించలేకపోతున్నాయి. వింత వ్యాధితో మృత్యువాత పడుతున్నాయి. నెల తిరక్కనే.. సబ్సిడీ ఆవులు ఇక్కడికొచ్చిన నెల రోజులకే పాడెక్కుతున్నాయి. బ్యాంకర్లు, వైద్యాధికారులు పక్కరాష్ట్రాల్లో ఆవులను పట్టిస్తున్నారే గానీ వాటిని ఇక్కడికి తీసుకొచ్చాక పట్టించుకోవడం లేదు. కొన్ని చూలు ఆవులు ఇక్కడకు చేరుకునే సమయానికే కడుపులోనే దూడలు చనిపోతున్నాయి. లబ్ధిదారులు వైద్యాధికారులకు తెలిపినా సకాలంలో స్పందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 200 సబ్సిడీ ఆవులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఒకే గ్రామంలోనే 8 ఆవులు.. గంగాధరనెల్లూరు మండలం ఎట్టేరి గ్రామస్తులకు తమిళనాడులోని నామక్కళ్ గ్రామం వద్ద మొత్తం 22 ఆవులను అధికారులు పట్టించారు. అక్కడి నుంచి తీసుకొచ్చే సమయంలో ఐదు ఆవులకు కడుపులోనే దూడలు చనిపోయాయి. మరో వారం రోజులకే మూడు ఆవులు వింత వ్యాధితో మృత్యువాత పడ్డాయి. ఇంకో రెండు ఆవుల పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. అప్పుల ఊబిలోకి లబ్ధిదారులు సబ్సిడీ పేరుతో ఆవులు పొందిన లబ్ధిదారులు అప్పులపాలవుతున్నారు. బ్యాంకులో రుణం చెల్లించలేక.. పెట్టుబడీ చేతికి రాక చితికిపోతున్నారు. బీమా ఏదీ? సబ్సిడీ ఆవులకు బీమా తప్పనిసరి. బీమా చేసిన ఆవుల చెవులకు ఏజెంట్లు గుర్తుగా కమ్మ వేయాలి. కానీ ఆ ఏజెంట్లు గ్రామాలకు వచ్చే సమయానికే ఆవులు వ్యాధుల బారినపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏజెంట్లు వాటికి కమ్మ వేసేందుకు సమ్మతించడంలేదు. బీమా వర్తించకనే ఆవులు మృత్యువాత పడుతున్నాయి. సబ్సిడీ..దోపిడీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే మొత్తాలు పక్కదారి పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఆవులను పట్టించేందుకు వెళుతున్న బ్యాంకర్లు, వైద్యాధికారులు అక్కడి పాడి ఆవుల దళారీలతో కుమ్మక్కై సబ్సిడీ నిధులను అప్పనంగా దిగమింగుతున్నారన్న విమర్శలున్నాయి. ప్రతి ఆవుకూ రూ.50 వేలు కేటాయించగా, అందులో రూ.20 వేలు లబ్ధిదారునికి బ్యాంకు రుణం, మిగిలిన రూ.30 వేలు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ కింద అందించాల్సి ఉంది. కానీ బ్యాంకర్లు, వైద్యాధికారులు రూ.20 వేల విలు చేసే ఆవులను పట్టించి మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని దిగమింగుతున్నట్లు పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దోచేసుకున్నారు ఆవులకు కార్పొరేషన్ అందించే సబ్సిడీని బ్యాంకర్లు, వైద్యాధికారులు దోచేసుకున్నారు. మాకు పట్టించిన ఆవులు ఒక్కొక్కటీ రూ.20 వేలే చేస్తాయి. రూ.50 వేలని పట్టించారు. మిగిలిన డబ్బులు వారే పంచుకున్నారు. ఆఖరుకు ఇటు ఆవూలేక.. అటు రుణం తీర్చలేక ఇబ్బందులు పడుతున్నాం. – రాధిక, మహిళారైతు, ఎట్టేరి బీమా లేదు బ్యాంకు రుణం ద్వారా పట్టుకొస్తున్న ఆవులకు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదు. తమిళనాడు నుంచి ఆవులు ఇక్కడకు తీసుకొచ్చే సమయానికే కొన్ని జబ్బు చేసి పైకిలేవలేని స్థితికి చేరుతున్నాయి. బీమా ఏజెంట్లకు చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. – జయలక్ష్మి, మహిళా రైతు, ఎట్టేరి జాగ్రత్తగా చూసుకోక పోవడం వల్లే పక్క రాష్ట్రాల్లో పట్టిస్తున్న ఆవులకు అక్కడి వాతావరణం, ఇక్కడి వాతావరణానికి తేడా ఉంటుంది. లబ్ధిదారులు జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొందరు అలా చేయడంలేదు. అందువల్లే కొన్ని ఆవులు చనిపోతున్నాయి. – వెంకట్రావ్, జేడీ, పశుసంవర్థకశాఖ -
ఫేస్బుక్ను లెక్క చేయని కొన్ని దేశాలు
-
అనుకోకుండా ఆ మెసేజ్లు: ఇబ్బందుల్లో ఆపిల్ యూజర్లు
శాన్ ఫ్రాన్సిస్కో: ఆపిల్ యూజర్లు మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యూజర్లకు సంబంధంలేకుండానే ఎమర్జన్సీ ఎస్ఓఎస్ మెసేజ్లో డెలివరీ అవుతున్నాయట. ఆపిల్ డివైస్లు అనుకోకుండా అత్యవసర మెసేజ్లను పంపడం తాజాగా కలకలం రేపింది. అనుకోకుండా ఆపిల్ వాచ్లు అత్యవసర సందేశాలను పంపుతున్నాయని కొంతమంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ సంఘటనలకు సంబంధించిన ఉదంతాలపై ట్విటర్లో పోస్ట్ చేశారు. జాసన్ రోలే అనే వినియోగదారుడు ట్వీట్ ప్రకారం ఆయన ఆపిల్వాచ్ బటన్ ప్రెస్ కావడంతో పోలీసులకు అత్యవసర మెసేజ్ వెళ్లింది. దీంతో పోలీసులు అర్థరాత్రి పరుగెత్తుకు వచ్చారు. ఇలాంటి అ నేక సంఘటనల గురించి ఆపిల్ వినియోగదారులు ట్విట్టర్ లో రిపోర్ట్ చేశారు. ఎస్ఓఎస్ అలర్ట్తో తమ బంధువులు ఆందోళనలో మునిగిపోయారని మరికొంతమంది వాపోయారు. జార్జ్ ఎడ్మండ్స్ అనే వినియోగదారుడు మైక్రో-బ్లాగింగ్ సైట్లో ఇలా వ్రాశాడు: "గత రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లాను.. నిద్రపోయాను. నా ఫోన్లో అత్యవసర బన్ ప్రెస్ అయింది. దీంతో నిద్రనుంచి లేసి చూసేసరికి సోదరివి బోలెడు మిస్ కాల్స్. నా కేదో అయిపోయిందని భయపడిపోయింది’’. అంతేకాదు ఇలాంటి సమస్యే ఐఫోన్లలో కూడా ఉత్పన్నం కావచ్చని ది వెర్జ్ నివేదించింది. ఎస్ఓఎస్ అలర్ట్ బటన్: యూజర్లు క్లిష్టమైన లేదా అత్యసవరమైన సహాయం అవసరమైన సమయాల్లో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపకరించే వర్చువల్ ఎమర్జెన్సీ బటన్ ఇది. పోలీసులు, బంధువులు సహా ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులకు కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం. బాధితులు, ఫిర్యాదుదారుల లొకేషన్ ఇండికేషన్ ఆధారంగా ఆటోమేటెడ్గా మెసేజ్లను పంపుతుంది. -
వాట్సాప్లో ఫీచర్లు.. కథా కమామిషు
నిత్యం ఉపయోగించే సామాజిక మాద్యమాలలో వాట్సాప్ది ప్రత్యేక స్థానం. వాట్సాప్ను ప్రతి నెల 1.4 బిలియన్ల మంది వాడుతుంటే ఒకరోజులో వాట్సాప్ ద్వారా పంపించే మెసెజ్ల సంఖ్య అక్షరాల 60 బిలియన్లు. ప్రతి రోజు వాట్సాప్ తెరవకుండా ఉండలేని వారు కోట్లలోనే ఉన్నారంటే అందులో ఆశ్ఛర్యమేమి లేదు. అంతే కాదు మనలో చాలా మందికి తెలియని ఫీచర్లు ఎన్నో వాట్సాప్లో ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం... 1) వాట్సాప్లో యూట్యూబ్ వీడియోలు చూడొచ్చు మన మిత్రులు పంపిన యూట్యూబ్ వీడియో లింక్ను అక్కడే ఓపెన్ చేసి చూడొచ్చు. ఏవైనా వీడియో సైట్ల నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ను వాట్సాప్లో మనం చూసే అవకాశం ఉంటుంది. ఇంకో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే వీడియో ఆన్లో ఉండగానే మనం చాట్ చేయోచ్చు అంతేకాదు వీడియోను క్లోజ్ చేయకుండానే వేరు వేరు వ్యక్తులతో చాట్ చేసే సౌలభ్యం కూడా ఉంది. 2) ఫోటోలకు స్టిక్కర్లు అంటించవచ్చు ఫోటోలు, వీడియోలపై స్టిక్కర్లు అంటించడానికి ఉపయోగపడే టూల్ ఇందులో ఉంది. ఫోటోలపై వీడియోలపై లొకేషన్, టైం స్టిక్కర్లను అంటించి మనం ఎవరికైనా పంపే అవకాశం ఉంది. ఇందుకోసం వాట్సాప్లో ఉన్న + సింబల్ను నొక్కి మనకు అవసరమైన ఫోటోలపై వీడియోలపై స్టిక్కరింగ్ చేసుకోవాలి. 3) మనీ ట్రాన్స్ఫర్ సౌలభ్యం వాట్సాప్లో మనీ ట్రాన్ఫర్స్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఎవరికైనా డబ్బు పంపాలన్నా, మనం డబ్బు పొందాలన్నా వాట్సాప్లో చాట్ విండో క్లోజ్ చేయకుండానే చేసుకోవచ్చు. 4) వ్యక్తిగత గోప్యత మీరు ఎప్పుడు చివరగా వాట్సాప్ ఓపెన్ చేశారు, ఎన్ని గంటలు చాట్ చేశారు అన్న విషయాలు మీ స్నేహితులకు, ఇతరులకు తెలియకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్లోని అకౌంట్లోకి వెళ్లి ప్రైవసీలోని లాస్ట్ సీన్ ఆప్షన్లో నోబడిని క్లిక్ చేస్తే సరిపోతుంది. 5) డిలీట్ మెసెజ్ ఈ ఆప్షన్ ద్వారా మనం పోస్టు చేసిన మెసెజ్లను డిలీట్ చేయొచ్చు. మొదట మెసెజ్లు డిలీట్ చేయడానికి 7 నిమిషాల సమయం మాత్రమే ఉండేది కాని దానిని ప్రస్తుతం 68 గంటలకు పొడిగించారు. -
యూజర్లందరికీ ట్విటర్ బ్లూ టిక్
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్విటర్ ఎంతో ప్రాముఖ్యం చెందిన సంగతి తెలిసిందే. ఏ విషయాన్నైనా ఇటీవల అధికారికంగా ప్రకటించడానికి ట్విటర్నే ప్రధాన సాధనంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు ట్విటర్ను ఉపయోగించనంతగా మరోదాన్ని ఉపయోగించరు. ట్విటర్ ద్వారానే విలువైన విషయాలను షేర్ చేస్తుంటారు. అందుకు తగ్గట్టు ట్విటర్ కూడా వారికి ఆ అకౌంట్ వాళ్లదే అని తెలిసేటట్టుగా వెరిఫికేషన్ టిక్ కూడా ఇస్తోంది. ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ టిక్ను యూజర్లందరకూ ఇస్తోంది. యూజర్ల గుర్తింపును నిర్థారిస్తూ.. ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతోంది. గతేడాది రద్దు చేసిన ఈ ప్రక్రియను, ఇప్పుడు మళ్లీ చేపడుతున్నట్టు తెలిపింది. తొలుత ఈ బ్లూ టిక్ ఉండటాన్ని.. కొందరు స్టేటస్ సింబల్గా భావించేవారు. కానీ ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ టిక్ను ఇక అందరికీ ఇస్తోంది. సంబంధిత వినియోగదారుని అకౌంట్ అతనిదే అని ధ్రువీకరిస్తూ ఈ బ్లూ టిక్ మార్క్ ఇస్తారు. ప్రపంచంలో అత్యంత నమ్మకమైన సర్వీసులు అందించే దానిలో తాము ఒకరిగా ఉండాలనుకుంటున్నామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే చెప్పారు. అయితే ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వ గుర్తింపు ఐడీ కార్డు, ఫేస్బుక్ ప్రొఫైల్, ఫోన్ నంబర్ వంటివి ఏమైనా అందించాలా అన్న విషయాలేవి ట్విటర్ తెలుపలేదు. 2009లో తొలుత ఈ వెరిఫికేషన్ కోడ్ ప్రక్రియను ట్విటర్ చేపట్టింది. తొలినాళ్లలో సినిమా వాళ్లకు, క్రీడాకారులకు, వీఐపీలకు మాత్రమే ఈ టిక్ మార్క్ ఇచ్చింది. ఆ తర్వాత జర్నలిస్టులకు కూడా ఇవ్వడం ప్రారంభించింది. అయితే గతేడాది కొత్త దరఖాస్తుదారులకు ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ను ఇవ్వడాన్ని ట్విటర్ రద్దు చేసింది. మళ్లీ ఇప్పుడు ప్రారంభించింది. ప్రస్తుతం సామాన్యులకు కూడా ఈ టిక్ మార్కును అందిస్తోంది. సామాన్యులకు కూడా ఈ టిక్ మార్కును అందించడంతో, ఫేక్ అకౌంట్స్ కట్టడయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
ఇంటెల్ యూజర్లకు వార్నింగ్
ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీ సంస్థ ఇంటెల్ కార్ప్ వినియోగదారులను విస్మయానికి గురిచేసే వార్త చెప్పింది. ఇటీవల రిలీజ్ చేసిన సిస్టం అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. తాము విడుదల చేసిన అప్డేటెడ్ పాచెస్లో లోపాలు ఉన్నట్టు వెల్లడించింది. తన చిప్లో రెండు హై-భద్రతా ప్రమాదాలను పరిష్కరించేందుకు విడుదల చేసిన పాచెస్ ప్రమాదకరమైనవని, కనుక అప్డేట్ చేసుకోవద్దని హెచ్చరించింది. వీటిని ఇన్స్టాల్ చేసుకోవద్దంటూ వినియోగదారులు, కంప్యూటర్ తయారీదారులు, క్లౌడ్ ప్రొవైడర్లకు కీలక సూచనలు జారీ చేసింది. చిప్ మేకర్ వెబ్సైట్లో ఇంటెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నవిన్ షెనోయ్ ఈ విషయాన్ని ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటెల్ యూజర్లకు క్షమాపణలు చెప్పారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించనున్నామని హామీ ఇచ్చారు. దీనికోసం 24 గంటలుపనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటెల్ వైఫ్యలం కంప్యూటర్ల వ్యాపారంపై ప్రభావం పడనుందని ఐడీసీ ఎనలిస్ట్ మారియో మోరేల్స్ వ్యాఖ్యానించారు. సంబంధిత పాచ్ను విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం కొనుగోళ్లపై పడుతుందన్నారు. స్పెక్ట్రే అండ్ మెల్ట్డౌన్ అని పిలవబడే ఫాల్టీ పాచెస్ ప్రభావానికిగురైన తన చిప్లో లోపాలు ఉన్నాయని ధృవీకరించిన దాదాపు మూడు వారాల తరువాత ఈ హెచ్చరిక చేసింది. అలాగే కొత్త వెర్షన్ను పరీక్షించాలని టెక్నాలజీ ప్రొవైడర్లను కోరింది. -
130 కోట్ల మార్క్ దాటేసిన మెసెంజర్
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సోషల్మీడియా నెట్ర్కింగ్ సైట్ ఫేస్బుక్ కు చెందిన మెసేంజెర్ యాప్ దూసుకుపోతోంది. ప్రతినెలా యూజర్ల పరంగా భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. 130కోట్ల యాక్టివ్ యూజర్లతో ప్రపంచ వ్యాప్తంగా తన హవాను కొనసాగిస్తోంది. ఫేస్బుక్ సొంతమైన మరో మెసేజింగ్ యాప్ వాట్సాప్కు సమానంగా యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రతినెల ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల మెసెంజర్ ప్రతి నెల ఉపయోగిస్తున్నారని ఫేస్బుక్ అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది జూలైలో వన్బిలియన్ యాక్టివ్ యూజర్ల మార్క్ను అధిగమించిన మెసెంజర్ యూజర్లను మరింత ఆకట్టుకుంటోందని ఫేస్బుక్ తెలిపింది. మెసెంజర్ ఉత్తమంగా ఉండటం, కొత్త మాస్క్, ఫిల్టర్లు, వీడియో చాట్ లాంటి అంశాలు దీనికి దోహదం చేసినట్టుతెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ప్రదేశాల్లో తమ వర్చ్యువల్ పెర్సనల్ అసిస్టెంట్ త్వరలో అందుబాటులో తేనున్నట్టు ఫేస్బుక్ పోస్ట్ లో శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు కాదు ఇన్బాక్స్ పునఃరూపకల్పనతో మరిన్ని మార్పులను తీసుకొస్తామని తెలిపింది. ఇందుకు ప్రతి వినియోగదారుడికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఫేస్బుక్ ఆధ్వర్యంలోని వాట్సాప్కు 1.3బిలియన్ల యూజర్లు ఉండగా, ఇన్స్టాగ్రామ్కు 700 మిలియన్ నెలవారీ వినియోగదారులు నమోదువుతున్నారు. అలాగే 200 మిలియన్ల మంది ప్రతి రోజు 'స్టోరీస్' ఫీచర్ ఉపయోగిస్తున్నారు. మరోవైపు సమీప ప్రత్యర్థి స్నాప్చాట్ రోజువారీ యూజర్లు 166 మిలియన్ మాత్రమే. -
బీఎస్ఎన్ఎల్ పై మాలావేర్ ఎటాక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సేవల సంస్థ బీఎస్ఎన్ఎల్ హ్యాకింగ్ బారిన పడింది. దీంతో వెంటనే పాస్వర్డ్లను మార్చుకోవాలంటూ తమ బ్రాడ్బ్యాండ్ వినియోగదారుకు సూచించింది. పలు బ్రాడ్బ్యాండ్ సిస్టమ్లపై ఇటీవల మాల్వేర్ దాడులు జరగడంతో డిఫాల్ట్ సిస్టమ్ పాస్వర్డులను తక్షణం మార్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ కోరింది పిటిఐ నివేదిక ప్రకారం, దాదాపు 2,000 బ్రాడ్బ్యాండ్ మోడెమ్లు దాడికి గురయ్యాయి. వెంటనే వీటి డిఫాల్ట్ పాస్వర్డ్ ‘అడ్మిన్’ను మార్చుకోవాలని సంస్థ కస్టమర్లను కోరింది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బాండ్ సిస్టంలోని కొంత భాగంగా మాల్వేర్ దాడికి గురైంది. దీంతో తమ సొంత బ్రాడ్ బాండ్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. చందాదారులు డిఫాల్ట్ పాస్వర్డ్ మార్చకపోవడం మూలంగానే మాలావేర్ దాడికి గురయ్యాయని కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అయితే పరిస్థితిని చాలావరకు చక్కదిద్దామని, కానీ వెంటనే పాస్వర్డ్లను మార్చకోవాలని బిఎస్ఎన్ఎల్ ఛైర్మన్ అనుపమ్ శ్రీవాత్సవ సలహా ఇచ్చారు. ఒక్కసారి పాస్వర్డ్ను మార్చితే ఇక ఎలాంటి సమస్య ఉండదు, ఆందోళన అవసరంలేదని చెప్పారు. అయితే తమ ప్రధాన నెట్ వర్క్, బిల్లింగ్ లేదా ఏ ఇతర వ్యవస్థను ప్రభావితం చేయలేదని తెలిపారు. -
సలహా సంఘాలేవి?
►మూడేళ్లుగా ఆహార సలహా సంఘం కమిటీలు వేయని ప్రభుత్వం ► పెరుగుతున్న కల్తీ మోసాలు ► నష్టపోతున్న వినియోగదారులు జిల్లాలో ఆహార సలహా సంఘం కమిటీలు లేకపోవడంతో కల్తీ మోసాలు ఎక్కువయ్యాయి. వినియోగదారుల్లో చైతన్యంతోపాటు కల్తీలను అరికట్టేందుకు గత ప్రభుత్వం ఆహార సలహా సంఘం కమిటీలను వేసింది. ఇవి మూడు నెలలకోసారి సమావేశమై వినియోగదారుడి రక్షణకు పలు నిర్ణయాలు తీసుకునేవి. కానీ గత మూడేళ్లుగా ఈ కమిటీలు లేకపోవడంతో మోసాలు పెరిగిపోయాయి. కెరమెరి(ఆసిఫాబాద్): వినియోగదారుడు ఏదో విధంగా మోసపోతూనే ఉన్నాడు. కొనే పదార్థాల్లో కల్తీ, నిత్యావసర సరుకుల తూనికల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తెలియకుండానే వినియోగదారుడు నష్టపోతున్నాడు. అయితే వినియోదారుడి రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఈ క్ర మంలో వినియోగదారుల్లో చైతన్యంతోపాటు పలు సూచనలు సలహాలు తీసుకొని వారి సమస్యలు పరిష్కరించాల్సిన ఆహార సలహా సంఘం కమిటీలు జిల్లాలో ఎక్కడా కాన రావడం లేదు. జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతీ మూడు మాసాలకోసారి సమావేశం నిర్వహించి అందులో వినియోగదారుడి రక్షణకు పలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్లుగా ఈ కమిటీలు ఏర్పాటు చేయకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి.కుమురం భీం జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. రెండు డివిజన్లు, వాటిలో 173 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఏ స్థాయిలోనూ ఆహార సలహా సంఘం కమిటీలు లేకపోవడంతో వినియోగదారుడు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నాడు. నాణ్యమైన ఆహారం అందక ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల కల్తీ రాయుళ్లు రెచ్చిపోయి దేన్నీ విడిచిపెట్టకుండా కల్తీ చేస్తుండడంతో ఆ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. అయితే ఈ కల్తీలపై ప్రజలను చైతన్య వంతుల్సి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన చర్యలపై చర్చించి తగు నిర్ణయం, సూచనలు, సలహాలు తీసుకునేందుకు గతంలో ప్రభుత్వం ఆహార సలహా సంఘాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కల్తీ మోసాలపై ప్రతీ మూడు మాసాలకోసారి తగిన నిర్ణయాలు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం ఆహార సలహా సంఘాలు పత్తా లేకుండా పోవడం గమనార్హం! చౌకధరల దుకాణాలపై కొరవడిన నిఘా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో జరుగుతున్న మోసాలపై ఈ కమిటీలు గతంలో ఆరా తీసేవి. లోపాలుంటే కమిటీ సమావేశం దృష్టికి తెచ్చిం ది. దీంతో అధికారులు చర్యలు తీసుకునే వారు. ఇప్పుడు సలహా సంఘాలు లేకపోవడంతో చౌకధరల దుకాణాల్లో ఇష్టారాజ్యం నడుస్తోంది. ఆహార పదార్థాలు కల్తీ ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులు సైతం కల్తీ అవుతున్నాయి. కాగజ్నగర్తోపాటు తదితర ప్రాంతాల్లో గతంలో కల్తీ నూనెతోపాటు ఇతర ఆహార పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉండడంతో అధికారులు దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. కొన్ని శాంపిళ్లను ల్యాబ్కు కూడా పంపించారు. ఇలాంటి కల్తీ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం వినియోగదారుల రక్షణకు అనేక చట్టాలు తెచ్చినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. వీటిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత సలహా సంఘాలకు ఉండేది. సంఘాలే నామమాత్రంగా మారడంతో చట్టాల అమలును ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఇందులో ఆహార కల్తీ నిరోధక చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం, నీటి కాలుష్య నివారణ చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల చట్టం వంటి అనేకంగానే ఉన్నాయి. వీటిపై అవగాహన కల్పిస్తే వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు.. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ఆహార సలహా సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, వినియోగదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక వర్గాల నుంచి సభ్యులు ఉంటారు. ఈ కమిటీ ప్రతీ మూడు మాసాలకు ఒకసారి సమావేశమై వినియోగదారుల సమస్యలపై చర్చించేది. సమవేశంలో సంబంధిత ప్రభుత్వ శాఖలు చేపట్టాల్సిన చర్యలపై సూచనలు, సలహాలు స్వీకరించేంది. ప్రభుత్వ అధికారులు సమస్యలను పరిష్కరించే వారు. తిరిగి మూడు మాసాలకోసారి జరిగే సమీక్షలు ప్రగతిని వివరించాల్సి ఉంటుంది. దీని వల్ల వినియోగదారుడి సమస్య కొంతైన పరిష్కారమవుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. -
గెలాక్సీ ఎస్8,ఎస్8ప్లస్లపై షాకింగ్న్యూస్
దిగ్గజ మొబైల్ మేకర్ శాంసంగ్ సంస్థకు స్మార్ట్ఫోన్ల కష్టాలు వీడేలా కనిపించడంలేదు. శాంసంగ్ నోట్ 7 పేలుళ్లతో అటు ఆర్థికంగాగానూ, ఇటు నైతికంగానూ బాగా దెబ్బతింది. దీంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఆధిపత్యాన్ని చలాయిస్తున్న సౌత్ కొరియన్ మొబైల్ మేకర్ శాంసంగ్ ప్రతిష్ట మరింత మసకబారనుంది. ఇటీవల లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ ఫోన్లు గెలాక్స్ 8, గెలాక్సీ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లలో కూడా సమస్యలు తలెత్తినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇవి తరచూ రీస్టార్ట్ అవుతున్నాయని అమెరికా, తదితర దేశాల యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఇది మరిన్ని జోన్లకు విస్తరించే ప్రమాదం ఉందని అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. ఈ సమస్యపై అనేక గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ వినియోగదారులు సంస్థ అధికారిక ఫోరమ్ను, ఎక్స్డీఏ డెవలపర్స్ ఫోరమ్ను ఆశ్రయించారు. తన గెలాక్సీ ఎస్ 8 దానికదే రిస్టార్ట్ అవుతోందనీ, ఇది తప్ప మిగతా అంతా బావుందని కమ్యూనిటీ ఫోరంను ఆశ్రయించిన మొదటి ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. 10 గంటల్లో ఇప్పటికే 7 సార్లు రీస్టార్ట్ అయిందని ఫిర్యాదు చేశాడు. కెమెరా, శాంసంగ్ థీమ్స్ ఆప్స్ వాడుతున్నపుడు సడెన్గా యాప్ ఫ్రీజ్ అయ్యి, కొన్ని సెకన్ల తర్వాత స్క్రీన్ ఆఫ్ అయిపోతోందని తెలిపారు. ఇంకా ఎవరికైనా ఇలాంటి సమస్య ఎదురైందా? దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అని ప్రశ్నించాడు. యాదృచ్ఛికంగా, ఎస్ 8 స్మార్ట్ఫోన్ స్క్రీన్పై ఏవేవో దృశ్యాలు కనిపించి (దిగువ భాగంలో) పునఃప్రారంభమవుంతోని మరో యూజర్ ఫిర్యాదు. ఇది యాప్ ప్రాబ్లమ్లా తనకు అనిపించడంలేదనీ తెలిపాడు. అంతేకాదు శాంసంగ్కు ఫోన్ చేస్తే రీటైలర్ తిరిగి ఇచ్చేసి.. కొత్తది రిప్లేస్మెంట్ అడగమని చెప్పారని పేర్కొన్నాడు. దాదాపు ఎస్ 8 ప్లస్ విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులే రావడం గమనార్హం. అయితే వీటిపై శాంసంగ్ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు టర్కీ, యూకే లలో ఇలాంటి ఫిర్యాదులే అందుతున్నాయని శాంమొబైల్ నివేదించింది. జర్మనీ టర్కీలలో ఎస్8 ప్లస్లో సమస్యలు తలెత్తినట్టు నివేదించింది. ఈ డిస్ప్లే సమస్యలపై శాంసంగ్ పరిశీలిస్తోందని తెలిపింది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ వినియోగదారులచే నివేదించబడిన రెడ్ టింట్ సమస్యను పరిష్కరించే క్రమంలో ఉందని పేర్కొంది. గత వారంలో, దక్షిణ కొరియా వినియోగదారుల కంప్లయింట్లపై బగ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నిస్తోందని తెలిపింది. -
మెగా విలీనం: 40కోట్ల యూజర్లు, 80 కోట్ల రెవెన్యూలు
మెగా విలీనానికి ఓకే చెబుతూ ఐడియా సెల్యులార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఈ సంస్థ అవతరించబోతుంది. వైర్ లెస్ సబ్స్క్రైబర్లలో ఈ సంస్థ మార్కెట్ లీడర్ గా నిలువబోతుంది. ఇన్ని రోజులు వొడాఫోన్ రెండో స్థానంలో, ఐడియా మూడో స్థానంలో ఉండగా.. టెలికాం లీడర్ గా భారత్ ఎయిర్ టెల్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగేది. ఇటీవలే టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో దూకుడుగా ముందుకు దూసుకెళ్తోంది. దీంతో ఇటు ఎయిర్ టెల్ స్థానాన్ని దక్కించుకుని, రిలయన్స్ జియో దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు వొడాఫోన్, ఐడియాలు విలీనానికి తెరలేపాయి. ఇండియా రేటింగ్స్ ప్రకారం ఈ మెగా విలీనంతో కంపెనీకి 80 కోట్ల రెవెన్యూలు వచ్చి చేరతాయని తెలిసింది. స్పెక్ట్రమ్ డూప్లికేషన్ అరికడుతూ నిర్వహణ వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ డీల్ ఎంతో సహకరించనుందట. ఖర్చులు తగ్గడంతో ఈ సంస్థకు ఈబీఐటీడీఏ మార్జిన్లు 250-350 బేసిస్ పాయింట్లు మెరుగుపడతాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ముఖ్యంగా నెట్ వర్క్, మార్కెటింగ్ వ్యయాలపై ఖర్చులు తగ్గుతాయన్నారు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో వొడాఫోన్ చాలా గట్టి పునాదులను ఏర్పరుచుకుంది. ఐడియా ఎక్కువగా రూరల్ మార్కెట్ పై ఫోకస్ చేస్తుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ రెండింటి కలయికతో 205 మిలియన్ వొడాఫోన్ యూజర్లు, 190 మిలియన్ ఐడియా యూజర్లు ఒకటై మొత్తం 40 కోట్ల సబ్స్క్రైబర్ బేసిస్ తో విలీన సంస్థ ఏర్పడుతోంది. మార్కెట్లో మొత్తం 43 శాతం షేరును సంపాదించుకోనుంది. ఇది ప్రత్యర్థి ఎయిర్ టెల్ కంపెనీ కంటే 10 శాతం ఎక్కువని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. -
అధికారుల నిర్లక్ష్యం.. వినియోగదారులకు శాపం
– మీటర్ల ఏర్పాటు, పర్యవేక్షణలో అలసత్వం – విజిలెన్స్ దాడుల్లో వెలుగులోకి.. వినియోగదారులపైనే కేసులు – ఇటీవలే బనగానపల్లె ఏఈపై సస్పెన్షన్ వేటు – మిగిలిన వారిపై చర్యలకు సిద్ధపడని అధికారులు కర్నూలు(రాజ్విహార్): కమర్షియల్ కనెక్షన్లకు మీటర్లు పెట్టడం, నిరంతరం పర్యవేక్షించడం ఏఈల బాధ్యత. అయితే కింది స్థాయి సిబ్బందికి పనులు చెప్పి వదిలేస్తున్నారు. అక్కడ తప్పులు జరిగి వేలాది యూనిట్లకు లెక్క లేకుండా పోతోంది. చివరకు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పొరపాట్లు వెలుగులోకి రావడంతో ఆ తప్పును వినియోగదారులపైనే వేసి కేసులు పెట్టి రూ.లక్షల జరిమానా విధిస్తున్నారు. ఇలాంటి ఓ కేసు విషయంలో వినియోగదారుడిపై రూ.5.34లక్షలు జరిమానా విధించి, బనగానపల్లె రూరల్స్ ఏఈ పుల్లయ్యపై సస్పెండ్ చేశారు. కాగా ఇది వరకే ఉన్న పలు కేసుల విషయంలో బాధ్యలైన వారిపై చర్యలకు అధికారులు సిద్ధ పడడంలేదని తెలిసింది. ఉన్నతాధికారుల వైఖరి పట్ల విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ద్వంద నీతిపై పవర్ డిప్లొమా, ఇంజినీర్ల సంఘం ప్రతినిధులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. దీనిపై సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్తోపాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఎస్పీడీసీఎల్ కర్నూలు సర్కిల్లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా మారింది. కనెక్షన్లు, మీటర్ల వద్ద ఏర్పడిన సమస్యను సకాలంలో గుర్తించకపోవడంతో బాధితులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పెద్ద సర్వీసులపై నిఘా లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ పొరపాట్లు జరుగుతున్నట్లు తెలిసినా పట్టించుకోవడం లేదు. అవి పెద్దగా మారి వినియోగదారుడి తలపై కుంపట్లు తెచ్చి పెడుతున్నాయి. నిబంధన ప్రకారం పరిశ్రమలు, టవర్లు, ఇతర భారీ కనెక్షన్లపై ఏఈలు నిరంతరం పర్యవేక్షణ సాగించాలి. కమర్షియల్ కనెక్షన్లు, టవర్లకు సీటీ మీటర్లు (ఏయే సమయాల్లో ఎంతెంత విద్యుత్ కాల్చారో తెలియజేస్తుంది) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ కొందరు చేతివాటం ప్రదర్శించి ఈ నిబంధనలను మరిచిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఇలాంటి తప్పులతోపాటు వాటికి బాధ్యులైనవారి చిట్టాను కూడా బయటకు తీస్తున్నారు. వీటిపై విచారణ చేసి నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నా బాధ్యులపై చర్యలు కరువయ్యాయి. కంటితుడుపు చర్యగా నోటీసులు, మెమోలిచ్చి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఉదాహరణలు: – కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ సర్వీసు మీటర్ నంబర్ 1456ను 2015 సెప్టెంబరు7న డీపీఈ విజిలెన్స్ డీఈ ఎం. ఉమాపతి తనిఖీలు నిర్వహించారు. మీటర్ల వద్ద అమర్చిన సీల్ బిట్ కట్ కావడంతోపాటు స్పాట్ బిల్లింగ్లో అవకతవకలు, చౌర్యం జరిగిందని భావించి రూ.5,84,951లను జరిమానా విధించారు. దీనికి ఏఈ పర్యవేక్షణ లోపం ఉన్నట్లు నివేదికలు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేనట్లు తెలుస్తోంది. – నంద్యాల మండలంలోని కానాలలో ఉన్న ఇండస్ టవర్ సర్వీస్ నంబర్ 1112ది కూడా అలాంటి సమస్యే. దీనిపై 2015 జూలై 17న ఏడీఈ బి. జీవరత్నం తనిఖీలు నిర్వహించి రూ.5,84,436 జరిమానా విధించారు. ఇందులో కూడా బాధ్యలైన వారిపై చర్యలు లేవు. – అదే మండలం అయ్యలూరులోని సర్వీస్ (నంబర్ 1347) ఇలాంటి కారణం చేత వినియోగదారుడు వెంకటరామిరెడ్డిపై రూ.1,03,600 జరిమానా విధించారు. 2008 మే13న కేసు నమోదైనా బాధ్యులపై చర్యలు లేవు. – మిడ్తూరులోని బీఎస్ఎన్ఎల్ టవర్కు ఏర్పాటు చేసిన మీటర్ కాలిపోయింది. ఈ సమస్య గత జూన్ నుంచి ఉన్నా అధికారులు పట్టించుకోకుండా మీటర్ బర్న్ స్టేటస్–11 కింద బిల్లింగ్ యావరేజ్గా తీశారు. ఇది 2016డిసెంబరు 17న విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటకొచ్చింది. అధికారులు బీఎస్ఎన్ఎల్కు 8వేల యూనిట్లకు రూ.69వేలు జరిమానా విధించారు. ఇందులో తమ తప్పేమి లేదని, విద్యుత్ అధికారులు పర్యవేక్షించకుండా జరిమానా విధించారని బీఎఎస్ఎన్ఎల్ నందికొట్కూరు ఎస్డీఈ మహేంద్ర తెలిపారు. – కర్నూలులోని బీ. రోడ్డు సెక్షన్లో ఉన్న బార్, రెస్టారెంట్ కనెక్షన్ (నంబర్ 42520)కూ ఇలాగే జరిగింది. స్పాట్ బిల్లింగ్కు ఏఈ వెళ్లకుండా కింది స్థాయి సిబ్బందిని పంపడంతో రీడింగ్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని 2013లో అప్పటి డీఈ తనిఖీలు నిర్వహించి బ్యాక్ బిల్లింగ్ కింద రూ.6లక్షలు జరిమానా విధించారు. ఇందులో అధికారి నిర్లక్ష్యం ఉందని నివేదికలు ఇచ్చినా ఎలాంటి చర్యలు లేవు. ఒకరిపైనే చర్యలు.. గుర్రుమంటున్న ఇంజినీర్లు బనగానపల్లె మండలం వెంకటాపురంలో ఇండస్ టవర్కు హెచ్టీ మీటరు ఏర్పాటు చేయాల్సి ఉండగా సాధారణ మీటర్ ఏర్పాటు చేశారు. ఇది విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తేలింది. టవర్ యజమానికి రూ.5.34లక్షల జరిమానా విధించడంతోపాటు ఏఈ పర్యవేక్షణ లోపం ఉందంటూ నివేదికలు ఇవ్వడంతో ఈనెల 1న బనగానపల్లె రూరల్స్ ఏఈ పుల్లయ్యపై సస్పెన్షన వేటు వేశారు. అయితే గతంలో జరిగిన సంఘటల్లో బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇంజినీర్స్, పవర్ డిప్లొమా ఇంజినీర్స్ సంఘాలు ఈనెల 3న ఆందోళన నిర్వహించి ఎస్ఈని కలిసి ప్రశ్నించారు.