archana
-
టాలీవుడ్ సూపర్ హిట్ జోడీలు.. మళ్లీ రిపీట్..
చిత్ర పరిశ్రమలో హిట్ జోడీకి ఉన్న క్రేజే వేరు. ఓ హీరో, హీరోయిన్ కాంబినేషన్లో సినిమా విజయం సాధిస్తే మళ్లీ ఆ కాంబో ఎప్పుడు రిపీట్ అవుతుందా? అనే ఆసక్తి ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఉంటుంది. హిట్ జోడీ రిపీట్ అవుతోందంటే ట్రేడ్ వర్గాల్లో, బిజినెస్ సర్కిల్స్లో ఫుల్ క్రేజ్తో ΄ాటు అంచనాలు ఉంటాయి. అందుకే అలాంటి హిట్ జోడీని రిపీట్ చేసేందుకు దర్శక–నిర్మాతలు కూడా తమ వంతు ప్రయత్నాలు సాగిస్తుంటారు. ఇందుకు ఒక్కోసారి కొన్నేళ్లు కూడా పట్టొచ్చు. ప్రస్తుతం తెలుగులో రిపీట్ అవుతున్న జోడీలపై ఓ లుక్కేద్దాం...పద్దెనిమిదేళ్ల తర్వాత..హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జోడీగా నటించారు. 2006 సెప్టెంబరు 20న విడుదలైన ఈ మూవీ విజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి ‘విశ్వంభర’ కోసం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘బింబిసార’ వంటి హిట్ మూవీ తీసిన మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్గా ‘విశ్వంభర’ రూపొందుతోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించింది చిత్రయూనిట్. కానీ చిరంజీవి తనయుడు రామ్చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ కోసం ‘విశ్వంభర’ సినిమా విడుదలని వాయిదా వేశారు. అయితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్రబృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ వేసవిలో సినిమా విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. షష్ఠిపూర్తి కోసం 38 ఏళ్ల తర్వాత... నటుడు రాజేంద్ర ప్రసాద్, నటి అర్చనల జోడీ 38 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. వీరిద్దరూ ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రెండో సారి కలిసి నటించారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన జోడీగా డైరెక్టర్ వంశీ తీసిన చిత్రం ‘లేడీస్ టైలర్’. 1986 నవంబరు 26న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు సూపర్ హిట్గా నిలిచింది. ఆ సినిమా తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించలేదు. తాజాగా పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ‘షష్ఠిపూర్తి’ కోసం వీరు 38 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా నటించారు. ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంట. అయితే ఈ కథ మొత్తం రాజేంద్ర ప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి ‘షష్ఠిపూర్తి’ అనే టైటిల్ పెట్టారట. రూపేష్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే విషయంపై స్పష్టత లేదు. మధ్యతరగతి యువకుడి ప్రేమకథ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తొలి చిత్రం ‘బేబి’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 జూలై 14న విడుదలై, బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ మూవీలో ఆనంద్, వైష్ణవి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ప్రత్యేకించి యువతరం ఈ సినిమాకి ఫుల్ ఫిదా అయ్యారు. ‘బేబి’ తర్వాత వీరు మరోసారి జోడీగా నటిస్తున్నారు. ‘90స్’ (ఎ మిడిల్ క్లాస్ బయోపిక్) వెబ్ సిరీస్తో మంచి విజయం అందుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో 32వ చిత్రంగా రూపొందుతోంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోలో ‘మీరు టీవీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా చూశారు కదా. ఇప్పుడు థియేటర్లో ఒక మిడిల్ క్లాస్ బాయ్ లవ్ స్టోరీ చూడండి. ఇది నా స్టోరీ, నీ స్టోరీ, కాదు కాదు.. మన స్టోరీ. మోస్ట్ రిలేటబుల్ లవ్ స్టోరీ’ అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.మాస్ జాతర రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ధమాకా’. 2022 డిసెంబరు 23న విడుదలైన ఈ మూవీ బ్లాక్బస్టర్గా నిలిచింది. అందులోనూ ప్రత్యేకించి రవితేజ–శ్రీలీల డ్యాన్సులు, భీమ్స్ సంగీతం ఈ సినిమాకి ప్లస్గా నిలిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి హిట్ జోడీ రెండేళ్ల తర్వాత ‘మాస్ జాతర’ సినిమాతో రిపీట్ అవుతోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్లో 75వ చిత్రంగా రూపొందుతోన్న ‘మాస్ జాతర’పై ఇండస్ట్రీలో అంచనాలున్నాయి. అందులోనూ రవితేజ–శ్రీలీల హిట్ జోడీ రిపీట్ అవుతుండటం కూడా ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘మాస్ జాతర’ సినిమాకి కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటం మరో విశేషం. వేసవి కానుకగా మే 9న ఈ మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. నాలుగోసారి...నటుడు శివాజీ, నటి లయది హిట్ జోడీ. ‘మిస్సమ్మ’ (2003), ‘అదిరిందయ్యా చంద్రం’ (2004), ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ (2006) వంటి సినిమాల్లో జంటగా నటించి, హిట్స్ అందుకున్నారు. తాజాగా వీరి జోడీ నాలుగోసారి రిపీట్ అవుతోంది. వివాహం తర్వాత సినిమాలకు కొన్నేళ్లు విరామం ఇచ్చిన లయ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ప్రస్తుతం లయ, శివాజీ జోడీగా కొత్త సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంతో సుధీర్ శ్రీరామ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ నిర్మిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ జంట నటిస్తున్న నాలుగో చిత్రంపై ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. బ్యాక్ టు బ్యాక్హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్ బ్యాక్ టు బ్యాక్ రిపీట్ అవుతోంది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్’ సినిమాలో నితిన్, శ్రీలీల తొలిసారి జంటగా నటించారు. 2023 డిసెంబరు 8న విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. కానీ, నితిన్–శ్రీలీల జోడీ బాగుందనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ‘రాబిన్హుడ్’ సినిమాలో జంటగా నటించారు. ‘భీష్మ’ వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్హుడ్’. మంచి వినోదాత్మక కుటుంబ కథా చిత్రం ఇదని, నితిన్ కెరీర్లో అత్యధిక బడ్జెట్తో రూపొందినట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రాబిన్హుడ్’లో తన పాత్ర, నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారంటూ శ్రీలీల కూడా స్పష్టం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా 2024 డిసెంబరు 25న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన తేదీకి విడుదలకాలేదు. మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. అప్పుడు వినోదం.. ఇప్పుడు థ్రిల్లర్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన కెరీర్లో విజయవంతమైన చిత్రాల్లో ‘సామజవరగమన’ ఒకటి. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెబా మోనికా జాన్ నటించారు. 2023 జూన్ 29న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు హిట్గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘మృత్యుంజయ్’ మూవీ కోసం మరోసారి జోడీ కట్టారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్.ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందింది. ‘సామజవరగమన’తో వినోదం పంచిన శ్రీవిష్ణు, రెబా జాన్ ‘మృత్యుంజయ్’తో ప్రేక్షకులను ఏ మేర భయపెడతారో చూడాలి. మరికొన్ని జోడీలు‘సీతా రామం’ సినిమాతో సూపర్ హిట్ జోడీ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ రెండోసారి నటించనున్నారట. దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. ఈ సినిమాలో సాయిపల్లవి లేదా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలకృష్ణ– ప్రగ్యాజైస్వాల్ జోడీ కూడా రిపీట్ కానుందని సమాచారం. ‘అఖండ, డాకు మహారాజ్’ వంటి సినిమాల తర్వాత ‘అఖండ 2’లో వీరిద్దరూ కలిసి నటించనున్నారట. అయితే ‘అఖండ 2’లో హీరోయిన్గా సంయుక్తని ప్రకటించారు మేకర్స్. మరి ప్రగ్యా జైస్వాల్ సెకండ్ హీరోయిన్గా కనిపిస్తారా? లేదంటే ముఖ్యమైన పాత్ర చేయనున్నారా? అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. మరికొన్ని జోడీలు కూడా రిపీట్ కానున్నాయని సమాచారం. – డేరంగుల జగన్ మోహన్ చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా -
‘కర్మ స్థలం’లో నటించడంతో చాలా సంతృప్తి కలిగింది: హీరోయిన్ అర్చన
అర్చన శాస్త్రి, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కర్మ స్థలం’(Karmasthalam).రాయ్ ఫిల్మ్స్ బ్యానర్పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ని తాజాగా రిలీజ్ చేశారు.కర్మస్థలం అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో కనిపించిన పాత్రలు, ఆ పోస్టర్ను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇక అర్చనా లుక్, గెటప్ ఈ పోస్టర్లో హైలెట్ అవుతోంది. బ్యాక్ గ్రౌండ్లో అమ్మవారి షాడో కనిపించడం చూస్తుంటే.. ఈ చిత్రానికి ఏ రేంజ్లో వీఎఫ్ఎక్స్ను వాడారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం..హీరోయిన్ అర్చన మాట్లాడుతూ.. ‘మహిషాసుర మర్దిని కాన్సెప్ట్తో ఈ మూవీని తెరకెక్కించారు. ఇంత మంచి సబ్జెక్ట్ని, కర్మ స్థలం వంటి అద్భుతమైన టైటిల్తో సినిమాను తెరకెక్కించిన రాకీ గారికి థాంక్స్. కథను చెప్పేందుకు వచ్చినప్పుడు రాకీని చూసి కొత్త వాడు కదా.. ఎలా తీస్తారో అని అనుకున్నాను. కానీ కథను అద్భుతంగా నెరేట్ చేశారు. కథను చాలా మంది అద్భుతంగా చెబుతారు. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడంలో తడబడుతుంటారు. కానీ నిర్మాత శ్రీనివాస్ గారి సహకారంతో దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. క్వాలిటీ పరంగా ఈ మూవీ పాన్ ఇండియ స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ఈ మూవీ నాకు చాలా ప్రత్యేకం. నా హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమిది. ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. ఆ రోజు జరిగిన షూటింగ్ నాకు ఇంకా గుర్తుంది. ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. పోస్టర్ ఎంత ప్రభావం చూపిస్తోందో.. సినిమా కూడా అంతే ప్రభావం చూపించబోతోంది. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.దర్శకుడు రాకీ షెర్మన్ మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాకి మేం అంతా ప్రాణం పెట్టి, ఎంతో ఇష్టంతో పని చేశాం. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. పాన్ ఇండియా రేంజ్లో ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. నిర్మాత శ్రీనివాస్ గారు నా వెన్నంటి ఉండి నడిపించారు. అర్చన గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆమె అందించిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఎం.ఎల్ రాజా మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.నిర్మాత శ్రీనివాస్ సుబ్రహ్మణ్య మాట్లాడుతూ.. ‘‘కర్మ స్థలం’ సినిమాను ఎంతో కష్టపడి చేశాం. మా దర్శకుడు ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో అందరినీ ఆకట్టుకునేలా చేశారు. అర్చన గారు అద్భుతంగా నటించారు. మా సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
షష్టిపూర్తి సినిమాని కుటుంబమంతా చూడాలి– రాజేంద్ర ప్రసాద్
‘‘మంచి కథతో రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి. మన ఇంట్లో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ చిత్రం చెబుతుంది. అందుకే అందరూ కుటుంబంతో సహా థియేటర్కి వెళ్లి ఈ సినిమా చూడాలి’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ కోరారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా, రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. బుధవారం జరిగిన సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ తర్వాత నేను చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనుకోవాలి. ‘షష్టిపూర్తి’ లాంటి అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్. ‘లేడీస్ టైలర్’ తర్వాత అర్చన, నేను మళ్లీ నటించిన ‘షష్టిపూర్తి’లో మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి’’ అని చెప్పారు. అర్చన మాట్లాడుతూ–‘‘చాలా విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ‘షష్టిపూర్తి’ ద్వారా నాకు ఇంత గొప్ప స్వాగతం పలికిన అందరికీ కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ‘‘నా మొదటి సినిమా ఇది. అందరూ ఆదరించాలి’’ అన్నారు రూపేష్. పవన్ ప్రభ మాట్లాడుతూ–‘‘నాకు ఇంతమంచి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఇచ్చిన నిర్మాత రూపేష్గారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘మా సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడాలి’’ అని ఆకాంక్షా సింగ్ అన్నారు. -
ఎవరూ అవకాశాలివ్వలేదు.. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యా!
సినిమాలు ఎందుకు చేయడం లేదు? లైమ్ లైట్కు దూరంగా ఉన్న చాలామంది హీరోయిన్లను ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నామని పలువురూ బదులిస్తుంటారు. తన విషయంలో మాత్రం అది నిజం కాదని, తనకెవరూ ఆఫర్స్ ఇవ్వకపోవడం వల్లే సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చిందంటోంది హీరోయిన్ అర్చన కవి (Archana Kavi). తమిళ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈమె తెలుగు(Tollywood)లో హీరోయిన్గా బ్యాక్బెంచ్ అని ఒకే ఒక్క మూవీ చేసింది. తొమ్మిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఈమె ఐడెంటిటీ అనే మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది.బ్రేక్ ఇవ్వలేదు.. వచ్చింది!ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాజా ఇంటర్వ్యూలో అర్చన ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నా అంతట నేనుగా సినిమాల నుంచి బ్రేక్ తీసుకోలేదు. ఎవరూ నాకు అవకాశాలివ్వలేదు, అందుకే తొమ్మిదేళ్లలో ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. 2013లో నాకు పెళ్లయింది. తర్వాత విడాకులవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నెమ్మదిగా దాన్నుంచి కోలుకున్నాక ఈ సినిమా ఆఫర్ రావడంతో చేసేశాను' అని అర్చన చెప్పుకొచ్చింది.చదవండి: దిల్రూబా టీజర్: ప్రేమ గొప్పది.. కానీ అదిచ్చే బాధే భయంకరంగా ఉంటుంది! -
Archana Jois: మహాదేవి
హీరోయిన్స్ కెరీర్ తల్లి పాత్రలతో ఎండ్ అవుతుందనే అభిప్రాయం ఉంది సినీఫీల్డ్లో! కానీ అర్చనా జోయిస్ సినీ ప్రయాణమే తల్లి పాత్రతో మొదలైంది. ‘కేజీఎఫ్’లో రాకీ భాయ్కి అమ్మగా నటించి, దేశవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. వరుస సినీ, సిరీస్ అవకాశాలతో అదరగొడుతున్న ఆమె గురించి కొన్ని వివరాలు...అర్చన పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని రామనాథపురలో. నాన్న శ్రీనివాసన్, అమ్మ వీణ.. ఇద్దరూ ప్రైవేటు టీచర్లు. అర్చనకు క్రమశిక్షణతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పించారు.చిన్నప్పటి నుంచే సంగీతం, నాట్యంలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలా? లేక నాట్యం వైపు వెళ్లాలా? అనే సందిగ్ధంలో పడింది.మామూలు డిగ్రీలో జాయిన్ అయితే బాల్యం నుంచి ప్రేమించిన నాట్యానికి దూరమవుతానేమో అని భావించి, బెంగళూరు యూనివర్సిటీ, నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీలో చేరింది. మూడేళ్ల ఆ డిగ్రీలో పట్టా పొంది, దేశవిదేశాల్లో నృత్యప్రదర్శనలు ఇచ్చింది.బీఎఫ్ఏ చేస్తున్న రోజుల్లోనే ‘మహాదేవి’ సీరియల్ కోసం జరిగిన ఆడిషన్స్లో ఆమె పాల్గొంది. ఇచ్చిన డైలాగ్స్ని తడబడకుండా బ్రహ్మాండమైన ఫీల్తో చెప్పి, ఆ సీరియల్లో నటించే చాన్స్ని దక్కించుకుంది. అనుకున్నట్టుగానే అది ఆమెకు మంచిపేరే కాదు.. మరెన్నో సీరియల్స్లో అవకాశాలనూ తెచ్చిపెట్టింది. అలా వరుస సీరియల్స్ చేస్తూనే చెన్నైలోని పద్మా సుబ్రహ్మణ్యం అకాడమీలో చేరి ఫైన్ఆర్ట్స్లో మాస్టర్స్ చదివింది.సీరియల్స్ అంటే ఒకే పాత్రలో నెలల తరబడి నటించడం వల్ల వైవిధ్యానికి చోటుండదు. ఆ వైవిధ్యం కోసమే సమయం చిక్కినప్పుడల్లా నృత్యప్రదర్శనలిస్తూ, కవర్ సాంగ్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అవన్నీ మంచి ఆదరణ పొందాయి. ఆ పర్ఫార్మెన్స్ చూసే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’లో తల్లి పాత్రను ఆఫర్ చేశాడు. అప్పటికి అర్చన వయసు 21ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ ఆ పాత్రలో అలవోకగా నటించి, మెప్పించింది. ఆ తర్వాత ‘ఘోస్ట్’, ‘మ్యూట్’ చిత్రాలతోనూ తన ప్రతిభ చాటుకుంది. ‘మాన్షన్ 24’ అనే సిరీస్తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టింది. ఆ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అవుతోంది. అర్చన నటించిన తాజా చిత్రం ‘యుద్ధ కాండ’ విడుదలకు సిద్ధంగా ఉంది.సినిమాల్లోకి రాకముందే మా దూరపు బంధువు శ్రేయస్తో నాకు పెళ్లయింది. నా నాట్యం, నటనకు వైవాహిక జీవితం ఎప్పుడూ అడ్డు కాలేదు. సినిమా, సిరీస్ల వల్లే నాకిష్టమైన డా¯Œ ్సకు కాస్త దూరమయ్యాను. అందుకే ఇకపై నాట్యానికి, నటనకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, ఎప్పటికీ గర్తుండిపోయే పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను!– అర్చనా జోయిస్. -
ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్గా విజయా కిశోర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) నూతన చైర్పర్సన్గా విజయ కిశోర్ రహాట్కర్ నియమితులయ్యారు. అదేవిధంగా, కమిషన్ సభ్యురాలిగా డాక్టర్ అర్చనా మజుందార్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రహాట్కర్ మూడేళ్ల పాటు, లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. మజుందార్ మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది. తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన రహాట్కర్ 1995లో బీజేపీలో చేరారు. 2007–2010 మధ్య ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఉన్నారు. నేషనల్ మేయర్స్ కౌన్సిల్కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా 2010–2014 మధ్య పనిచేశారు. 2016–21 సంవత్సరాల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్కు చైర్పర్సన్గా ఉన్నారు. -
ఐవీఎఫ్తో.. సంతనాలేమికి చెక్!
సంతానలేమితో బాధపడుతున్న వారికి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) అనేది ఒక వరం లాంటిదని వైద్యురాలు అర్చన అన్నారు. జిల్లా కేంద్రంలో ‘పినాకిల్ ఫెర్టిలిటీ’ సెంటర్ ద్వారా సేవలందిస్తున్న వైద్యురాలు అర్చన.. అంతర్జాతీయ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఇన్ఫెర్టిలిటీ సమస్యతో సతమతమవుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్వో) రిపోర్టులు వెల్లడించడం గమనార్హమని అన్నారు. అడ్వాన్స్డ్, ఎక్కువ సక్సెస్ రేట్ కలిగిన ఐవీఎఫ్ విధానం సంతానలేమితో బాధపడుతున్న వారికి మంచి అవకాశమని తెలిపారు. గ్రామీణప్రాంతాల వారికి సైతం తక్కువ ఖర్చుతో ఆధునిక సౌకర్యాల ద్వారా చికిత్స అందించడం పినాకిల్ ఫెర్టిలిటీ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఐవీఎఫ్కు సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను డాక్టర్ అర్చన నివృత్తి చేశారు.ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లల ఆరోగ్యంపై..1978 జూలై 25న ఐవీఎఫ్ ద్వారా మొదటి బేబి లూయీస్ బ్రౌన్ జన్మించారు. నాలుగు దశాబ్దాలు నాటికి 8 మిలియన్ల పిల్లలు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించారు. ఇప్పటి వరకు చేసిన రిసెర్చ్, ఆర్టికల్స్ ఆధారంగా సహజంగా గర్భం ద్వారా పుట్టిన పిల్లలకి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఎటువంటి తేడా లేదని తేలింది.ఐవీఎఫ్ ద్వారా కవలలు పుట్టే అవకాశం..ఐవీఎఫ్ పద్ధతిలో అంటే ఆడవారి అండాలను మగవారి వీర్యకణాలు కలిపితే వచ్చే పిండాలను గర్భసంచిలో ప్రవేశపెడతాం. ఈ పద్ధతిలో మునుపు రెండు లేక మూడు పిండాలను ప్రవేశపెట్టేవారు. అందువల్ల ఐవీఎఫ్లో కవలలు పుట్టే అవకాశం పెరుగుతుంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీతో గర్భం దాల్చే అవకాశాలు మెరుగయ్యాయి.నొప్పి ఉంటుందంటారు..ఆడవారు 10–12 రోజులపాటు ఐవీఎఫ్లో రోజూ కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. తరువాతే ఆడవారి శరీరంలో ఉండే అండాలను బయటకు తీసి మగవారి వీర్యకణాలతో కలపడం జరుగుతుంది. అలా పెరిగిన దాన్ని ఆడవారి గర్భసంచిలో ప్రవేశ పెడతాం. ఈ ప్రక్రియలు ఎగ్ పికప్ (ఎమ్బ్య్రో ట్రాన్స్ఫర్) అంటాం. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్ అంటే అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. ఐవీఎఫ్లో నొప్పి అనేది చాలా తక్కువతొమ్మిది నెలలు రెస్ట్ అవసరమా..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తర్వాత ఒక రెండు నెలలు జాగ్రత్త చెబుతాం. ఆ తరువాత సహజ ప్రెగ్నెన్సీ లాగే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళేవాళ్లు, ఇంటి పనులు చేసుకునేవారు ఎప్పటిలాగే వారి పనులను చేసుకోవచ్చు.సిజేరియన్ అవసరం లేదు..ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన వాళ్లు నార్మల్ డెలివరీ ఖచ్చితంగా చేయించుకోవచ్చు. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ సహజ ప్రెగ్నెన్సీ లాగే ఉంటుంది. వేరే ఇతర కారణాల వల్ల సిజేరియన్ చేయించాల్సిన పరిస్థితి వస్తే తప్ప కేవలం ఐవీఎఫ్ వల్ల సిజేరియన్ చేయించాల్సిన అవసరం అసలు లేదు.– డాక్టర్ అర్చన, పినాకిల్ ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్ -
Archana Rao: అశ్వత్థామకు దుస్తులు కుట్టింది
అశ్వత్థామకు మరణం లేదు. మహాభారత కాలం నుంచి కల్కి వచ్చే కాలం వరకూ బతికే ఉండాలి. మరి అతను ఎలా ఉంటాడు? ఆ పాత్ర ధరించింది సాక్షాత్తు అమితాబ్ అయితే అతన్ని అశ్వత్థామలా మార్చే దుస్తులు ఎలా ఉండాలి?తెలుగు ఫ్యాషన్ డిజైనర్ అర్చనా రావు ‘కల్కి’ సినిమాకు చీఫ్ ఫ్యాషన్ డిజైనర్గా అద్భుతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రశంసలు అందుకుంటోంది. హైదరాబాద్ నిఫ్ట్లో, న్యూయార్క్లో చదువుకున్న అర్చనా రావు పరిచయం.‘సినిమాకు పని చేయడంలో అసలైన సవాలేమిటంటే పేపర్ మీద గీసుకున్నది తెర మీద కనిపించేలా చేయగలగాలి. అందుకు టీమ్ మొత్తంతో మంచి కోఆర్డినేషన్లో ఉండాలి’ అంటుంది అర్చనా రావు.హైదరాబాద్కు చెందిన అర్చనా రావుకు ‘అర్చనా రావు లేబుల్’ పేరుతో సొంత బ్రాండ్ ఉంది. ఆమె దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు ప్రాడక్ట్ డిజైనింగ్ కూడా చేస్తుంది. అంటే పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్లు, బెల్ట్లు... అన్నీ హ్యాండ్మేడ్. ఆమె సృజన మొత్తంలో తప్పనిసరిగా భారతీయత కనిపిస్తుంది.‘నాకు ఇండియన్ కళాత్మక విలువలంటే ఇష్టం. అవే నన్ను కల్కి సినిమా కాస్టూమ్ డిజైనింగ్లో గెలిచేలా చేశాయి. నేడు నా పనికి మంచి ప్రశంసలు అందుతుంటే ఆనందంగా ఉంది’ అందామె.నిఫ్ట్ స్టూడెండ్అర్చనా రావు హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఆమెకు ఇష్టంగా ఉండేది. ఏదో ఒక సృజనాత్మక రంగంలో చదువు కొనసాగించాలనుకున్నా స్పష్టత రాలేదు. ఇంటర్ ముగిసే సమయానికి హైదరాబాద్లో నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఏర్పడింది. అందులో క్లాత్ డిజైనింగ్ కోర్సుకు అప్లై చేస్తే సీటు వచ్చింది. ‘కాలేజీలో చేరాక ఇదే నేను చదవాల్సింది అని తెలిసొచ్చింది. మన దగ్గర క్రియేటివిటీ ఉండటం ఒకటైతే చదువు వల్ల తెలిసే విషయాలు ఉంటాయి. నిఫ్ట్లో ఒక ఫ్యాబ్రిక్కు సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా తెలిసింది. ఫ్యాషన్ డిజైన్ చేయాలంటే ముందు ఫ్యాబ్రిక్ని కనిపెట్టాలి. అలా చదువు పూర్తయ్యాక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం న్యూయార్క్ వెళ్లాను. న్యూయార్క్ నగరమే ఒక క్యాంపస్. ఏ మనిషిని చూసినా ఏ వీధిని చూసినా ఫ్యాషన్ కనపడుతూనే ఉంటుంది. నేను మరింత ఎదగడానికి న్యూయార్క్ ఉపయోగపడింది. అయితే నేను అమెరికాలో స్థిరపడాలనుకోలేదు. ఇండియా ఫ్యాషన్ రంగంలో పుంజుకుంటోంది. నా పని ఇక్కడే అని నిశ్చయించుకుని వచ్చేశాను. నా బ్రాండ్ మొదలెట్టాను’ అని తెలిపిందామె.మహానటితో...దర్శకుడు నాగ్ అశ్విన్ ఏదో సందర్భంలో పరిచయం కావడంతో అతను ‘మహానటి’ చిత్రం కోసం కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేయమన్నాడు. ‘అప్పటికి నాకు సినిమాలకు కాస్ట్యూమ్స్ ఎలా తయారు చేయాలో తెలియదు. కాని నాగ్ అశ్విన్ ప్రోత్సాహంతో మహానటిలో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లకు కాస్ట్యూమ్స్ చేశాను. కథాకాలాన్ని బట్టి 1940ల నాటి ఫ్యాషన్లను, 1980ల నాటి ఫ్యాషన్లను స్టడీ చేయాల్సి వచ్చింది. సినిమాలకు కాస్ట్యూమ్స్ చేయడంలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే లైట్ పడితే ఏ రంగు ఎక్కువ మెరుస్తుంది తెర మీద ఏ రంగు మృదువుగా ఉంటుందో తెలుసుకోవడమే. మహానటితో నేను పని తెలుసుకున్నాను. ఆ సినిమాకు నాకు జాతీయ అవార్డు రావడం మరింత సంతోషం’ అందామె.కల్కి సినిమాలో మహామహులకు...‘కల్కి సినిమా మొదలెట్టే ముందు నిర్మాత దగ్గర నాగ్ అశ్విన్ పెట్టిన మొదటి షరతు నన్ను చీఫ్ ఫ్యాషన్ డిజైనర్గా ఉంచాలని. నా మీద నాగ్ పెట్టుకున్న నమ్మకం అది. నాలుగేళ్ల క్రితం అతను ఈ కథను చెప్పినప్పుడు చాలా పెద్దప్రాజెక్ట్ అని అర్థమైంది. అశ్వత్థామ పాత్ర గురించి చెప్తే ఎవరు చేస్తున్నారు అనడిగాను. అమితాబ్ అన్నాడు. దాంతో నాకు ఎక్కడ లేని నెర్వస్నెస్ వచ్చింది. ఆయనను అశ్వత్థామగా చూపించడం ఎలా? మహాభారత కాలం నుంచి ఆయన జీవించే ఉన్నాడంటే నా మనసులో వచ్చిన భావం మనిషిని చూడగానే ఒక పురాతన వృక్షాన్ని చూసినట్టు ఉండాలని. ఆయనకు వాడే దుస్తులను మళ్లీ మళ్లీ పరీక్షకు పెట్టి తయారు చేశాను. ఆయన ముఖానికి శరీరానికి ఉండే కట్లు రక్తం, పసుపు కలిసిపోయి ఏర్పడిన రంగులో ఉంచాను. మొదటిసారి అమితాబ్ నా కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు అది సినిమా అని అక్కడున్నది సినిమా సెట్ అని తెలిసినా రోమాలు నిక్క΄÷డుచుకున్నాయి. ఇక ప్రభాస్ కోసం నేను డిజైన్ చేసిన సూట్ను కాలిఫోర్నియాలో తయారు చేయించాం. కమలహాసన్కు అయన వ్యక్తిగత డిజైనర్ సహాయంతో కలసి కాస్ట్యూమ్స్ చేశాను. సినిమాలో మూడు ప్రపంచాలుంటాయి. పిరమిడ్ సిటీలో కనిపించే ఆర్మీ కోసం కాస్ట్యూమ్స్ని మన దిష్టిబొమ్మల నుంచి ఇన్స్పయిర్ అయి చేశాను. కల్కి సినిమాకు అందరం కష్టపడి పని చేశాం. అది ప్రేక్షకులకు నచ్చడం చాలా సంతోషంగా ఉంది’ అందామె. -
Archana Sinha: అలా వచ్చిన ఆలోచనే.. ఈ 'ఎన్ఎస్ఎఫ్'..
పిల్లలు, ఆటలు, పాటలు ఒకే కుటుంబం. ఆటపాటలంటే పిల్లలకు బోలెడు ఇష్టం. ఆ ఇష్టాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాహారం నుంచి పరిసరాల పరిశుభ్రత వరకు ఎన్నో కాన్సెప్ట్లను ఆటల రూపంలో డిజైన్ చేసిన బెంగళూరుకు చెందిన నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్(ఎన్ఎస్ఎఫ్) వారి కృషి వృథా పోలేదు. స్కూల్ గార్డెన్ నుంచి గ్రూప్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొనడం వరకు పిల్లల్లో ఎంతో సానుకూల మార్పు కనిపిస్తోంది..ప్రభుత్వ పాఠశాలలకు వెళుతూ పిల్లల వయసు, ఎత్తు, బరువు.. మొదలైన విషయాల ఆధారంగా బేస్లైన్ సర్వేలు నిర్వహిస్తోంది ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్. సర్వే ఫలితాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయడమే కాదు తగిన సూచనలు కూడా ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ సర్వే ఫలితాలు ఉపయోగపడుతున్నాయి.‘పారిశుధ్య ప్రాముఖ్యత, సరైన పౌష్టికాహారం గురించి పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా టూల్ కిట్ ఆధారిత విధానానికి రూపకల్పన చేశాము. వారికి తగిన పరిజ్ఞానాన్ని అందించి ఆలోచనాపరులుగా మార్చడమే మా లక్ష్యం’ అంటుంది ఎన్ఎస్ఎఫ్ కో–ఫౌండర్, సీయివో అర్చన సిన్హా.పోషకాహారం, పారిశుధ్యంతో పాటు నవీన వ్యవసాయ పద్ధతుల గురించి పిల్లలకు అవగాహన పరిచే పదిహేను గేమ్స్తో కూడిన టూల్కిట్లను ఎన్ఎస్ఎఫ్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలకు అందిస్తోంది. పోషకాహార లోపాల లక్షణాలను గుర్తించడానికి ఈ టూల్కిట్లలోని ఎనిమీ కార్డ్, అలాగే... ఈ లోపాలను పరిష్కరించడానికి సహాయపడే ఆహార వనరుల గురించి తెలుసుకోవడానికి ఫ్రెండ్ కార్డు పిల్లలకు ఉపయోగపడుతుంది.వైకుంఠపాళిలోని పాములు, నిచ్చెనలతో కూడా పిల్లలు ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. జంక్ ఫుడ్కు దూరంగా ఉండేవారి సత్ప్రవర్తనకు బహుమతులు, జంక్ ఫుడ్ను అమితంగా ఇష్టపడేవారికి ఈ ఆటలో శిక్షలు (పాముకాటు)లు ఉంటాయి. సబ్బు వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ఆకట్టుకునే కాన్సెప్ట్కు రూపకల్పన చేశారు.టూల్కిట్స్ యాక్టివిటీల ద్వారా పిల్లలు స్కూల్ గార్డెన్లను పెంచుతున్నారు. వారికి ఇచ్చిన గైడ్బుక్లో వెజిటేబుల్ క్యాలెండర్, మొక్కల పెంపకానికి సంబంధించి స్టెప్–బై–స్టెప్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. టూల్కిట్లు పిల్లలపై ఏ మేరకు ప్రభావం చూపాయి... అనే విషయంలో ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తుంటుంది ఫౌండేషన్.‘పిల్లల ఆహారపుటలవాట్లపై టూల్కిట్స్ సానుకూల ప్రభావం చూపించడమే కాదు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గ్రూప్ యాక్టివిటీలలో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నాయి’ అంటుంది ఒకిత ఎం అనే గృహిణి. ‘ప్రభుత్వ పాఠశాలలతో పోల్చితే ప్రైవేట్ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగ్గా ఉండవచ్చు. అయితే ఊబకాయంలాంటి సమస్యలు ఉన్నాయి’ అంటుంది అర్చన సిన్హా. త్వరలో ప్రైవేట్ స్కూల్స్లోకూడా ఆన్లైన్ మాడ్యుల్ అందుబాటులోకి తీసుకు రానున్నారు. ‘ఎన్ఎస్ఎఫ్’ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రభుత్వ పాఠశాలల్లో యాక్టివిటీ ్రపోగ్రామ్స్ నిర్వహించింది. వేలాదిమంది విద్యార్థులపై ఇవి సానుకూల ప్రభావం చూపుతున్నాయి.అలా వచ్చిన ఆలోచనే.. ఎన్ఎస్ఎఫ్..జర్నలిస్ట్గా కెరీర్ మొదలు పెట్టిన అర్చన సిన్హా ఆ తరువాత మేనేజ్మెంట్ అండ్ కన్సల్టింగ్లోకి వచ్చింది. సామాజికసేవా కార్యక్రమాలు అంటే మొదటి నుంచి ఇష్టం ఉన్న అర్చన ‘అశోక ఇన్నోవేటర్స్ ఫర్ ది పబ్లిక్’ అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేసింది. ఒడిషాలోని గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి మహిళలతో పౌష్టికాహారం గురించి మాట్లాడింది. అరుదుగా మాత్రమే వారు పౌష్టికాహారం గురించి పట్టించుకుంటున్నారు. పౌష్టికాహారం, పారిశుధ్యం గురించి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించిన అర్చన ‘నరిషింగ్ స్కూల్స్ ఫౌండేషన్’కు శ్రీకారం చుట్టింది.ఇవి చదవండి: Priya Chhetri - 'ప్రియ'మైన విజయం -
ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రం నుంచి ఇద్దరు
తాంసి/దండేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ప్రదా నం చేసే ఉత్తమ ఉపాధ్యాయ పుర స్కారానికి ఈసారి రాష్ట్రం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 50 మందిని ఎంపిక చేయగా తెలంగాణ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కాగా, ఆ ఇద్దరూ ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాకు చెందినవారే. ఆది లాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం బెదోడ్కర్ సంతోష్కుమార్, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నుగూరి అర్చన.. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. పాఠశాల పేరు మీద యూట్యూబ్ చానల్లో పాఠాలు 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సంతోష్కుమార్ కరోనా ఉధృతి సమయంలో పాఠశాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా గూగుల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పాఠా లను బోధించారు. పాఠశాల పేరు మీద ప్రత్యేక యూ ట్యూబ్ చానల్లో సైతం నిత్యం రోజు వారీ పాఠాలను అప్ లోడ్ చేయడం వంటివి చేపట్టారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా 100 వరకు ఉన్న విద్యార్థులను ప్రస్తుతం 220 వరకు చేర్చారు. సొంత డబ్బులతో స్కూల్ను తీర్చిదిద్ది.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను నుగూరి అర్చన తీర్చిదిద్దారు. దాతలు, స్వచ్చంద సంస్థల సహకారంతోపాటు ఆమె సొంత ఖర్చులతో నాణ్యమైన విద్యాభోధన చేస్తూ, రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల అంటేనే అందరు మెచ్చుకునేలా తీర్చిదిద్దారు. అర్చన సేవలకు ఇప్పటికే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో గుర్తింపు పొందగా, ఈసారి ఏకంగా జాతీయ పురస్కారం దక్కింది. -
తెలుగులో సూపర్ హిట్స్ కొట్టిన హీరోయిన్.. ఆ సినిమాతో రీ ఎంట్రీ!
అప్పట్లో సూపర్ హిట్ సినిమాలు చేసిన కొందరు హీరోయిన్లు లేటు వయసులో రీఎంట్రీ ఇస్తుంటారు. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించిన నటీమణులు అవకాశం వస్తే ఏ పాత్రలోనైనా అలరించేందుకు సిద్ధంగా ఉంటారు. అలా ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ అద్భుతంగా నటిస్తున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న మరో నటి టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకీ అందాల నటి ఎవరో తెలుసుకుందాం. (ఇది చదవండి: 'ఇంకా లేటెందుకు.. త్వరగా పెళ్లి చేసుకోండి'.. మిల్కీ బ్యూటీకి నెటిజన్స్ సలహా!) తెలుగువారికి హీరో భాను చందర్ పేరు సుపరిచితమే. ఆయన హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం‘నిరీక్షణ’. ఈ మూవీతోనే తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న భామ అర్చన. 1980లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అర్చన తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. మీనాక్షి పొన్నుంగా అనే కోలీవుడ్ టీవీ సీరియల్లోనూ కనిపించారు. భానుచందర్ సరసన నటించిన ‘నిరీక్షణ’ చిత్రంలో గిరిజన యువతిగా ఆమె చేసిన క్యారెక్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం 1986లో రిలీజ్ కాగా.. ఈ సినిమాలో ఆమె నటనకు నంది అవార్డ్ దక్కింది. మధురగీతం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్చన ఆ తర్వాత వీడు, లేడీస్ టైలర్, దాసీ,ఉక్కు సంకెళ్లు, మట్టి మనుషులు, భారత్బంద్, పచ్చతోరణం లాంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. అయితే భాను చందర్, అర్చన నటించిన ‘వీడు’ చిత్రానికి నేషనల్ అవార్డ్తో పాటు ఫిలింఫేర్ కూడా దక్కింది. దాసి చిత్రానికి సైతం మరోసారి జాతీయ ఉత్తమ నటిగా అవార్డ్ గెలుచుకున్నారు. అయితే కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న అర్చన రీఎంట్రీకి ఇస్తోంది. ప్రస్తుతం ఆమె షష్ఠిపూర్తి అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం పోస్టర్ రిలీజ్ చేయగా ఈ విషయం బయటకొచ్చింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అర్చన మళ్లీ నటిస్తుండడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నిర్మిస్తున్న చిత్రం 'షష్టిపూర్తి'. ఇందులో రూపేష్ కుమార్ చౌదరి హీరో. కథానాయకుడిగా నటించడంతో పాటు సినిమాను నిర్మిస్తున్నారు. ఆయనకు జోడీగా కథానాయిక ఆకాంక్షా సింగ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్టేక్'... పోస్టర్ రిలీజ్ చేసిన ప్రియదర్శి) -
సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్పై అత్యాచారయత్నం!
బాలీవుడ్ నటి అర్చన జోగ్లేకర్ 1990లో పరిచయం అక్కర్లేని పేరు. అర్చన బుల్లితెరతో పాటు బాలీవుడ్తో పాటు మరాఠీ, ఒరియా, సినిమాల్లోనూు నటించింది. అంతే కాకుండా ఆమె గొప్ప డ్యాన్సర్ కూడా. అర్చనకు క్లాసికల్ డ్యాన్స్లో మంచి ప్రావీణ్యం ఉంది. కిసీ కా శాంతి కా', 'కర్ణభూమి', 'ఫూల్వతి' వంటి సీరియల్స్తో బాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆ సంఘటన అప్పట్లో ఏకంగా సినిమా ఇండస్ట్రీనే కుదిపేసింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!) సినిమా షూటింగ్ సమయంలోనే అర్చనపై అత్యాచారయత్నం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటన ఆమె నటించిన ఒరియా సినిమా సెట్లో చోటు చేసుకుంది. ఓ చిత్రంలో అర్చన హీరోయిన్గా నటించింది. అప్పట్లో వచ్చిన మీడియా కథనాల ప్రకారం మూవీ షూటింగ్ జరిగి సమయంలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేసేందుకు యత్నించాడట. అదే సమయంలో అక్కడున్న వ్యక్తులు ఆమెను రక్షించినట్లు సమాచారం. అయితే అప్పట్లో ఆ సంఘటనతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా భయాందోళనకు గురైందట. కాగా.. పెళ్లి చేసుకున్న తర్వాత అర్చన అమెరికాలో న్యూజెర్సీలో స్థిరపడింది. ప్రస్తుతం తానే స్వయంగా ఓ డ్యాన్స్ స్కూల్ కూడా నిర్వహిస్తోంది. ఆమె స్కూల్ ద్వారా పిల్లలకు శాస్త్రీయ నృత్యంలో శిక్షణనిస్తోంది. కాగా.. అర్చన సునా చదేయ్, స్త్రీ లాంటి ఒరియా చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!) View this post on Instagram A post shared by Archana Arts (@archanaarts.us) -
అర్చన... అనుకున్నది సాధించింది
‘నేర్చుకోవాలి’ అనే తపన ఉంటే ఏ విద్య అయినా చేతికి చిక్కుతుంది. సైకిల్ తొక్కడం కూడా రాని అర్చనా ఆత్రమ్ పెద్ద బస్సును నైపుణ్యంగా నడుపుతూ ‘భేష్’ అనిపించుకోవడానికి ఆ తపనే కారణం.... మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) తొలి మహిళా డ్రైవర్గా వార్తల్లో నిలిచింది అర్చనా ఆత్రమ్. నాందేడ్ జిల్లాలోని కివ్వత్ తాలూకలోని సర్కానీ గ్రామానికి చెందిన అర్చన డ్రైవింగ్ ఫీల్డ్ను ఎంచుకోవడం తండ్రికి నచ్చలేదు. బంధువులు ‘అది ఆడవాళ్లు చేసే ఉద్యోగం కాదు’ అన్నారు. కొందరైతే...‘నీకు సైకిల్ తొక్కడమే రాదు. బస్సు నడుపుతావా!’ అని బిగ్గరగా నవ్వేవాళ్లు. ఎన్నో ప్రతికూల మాటలను ఈ చెవిన విని ఆ చెవిన వదిలేసిందేగానీ ఒక్క అడుగు వెనక్కి వేయలేదు అర్చన. ‘పట్టుదల ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు’ అంటున్న అర్చన పుణెలో జరిగిన శిక్షణ తరగతులలో ఎన్నో విషయాలు నేర్చుకుంది. క్లచ్, గేర్ అంటే ఏమిటో తెలియని అర్చన జీరో నుంచి ప్రయాణం ప్రారంభించి హీరో అయ్యింది. డిపో మేనేజర్ నుంచి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరకు ఎంతో మంది అర్చనా ఆత్రమ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. -
సూపర్ హిట్ కాంబినేషన్.. 37 ఏళ్ల తర్వాత మళ్లీ!
1986లో వచ్చిన చిత్రం లేడీస్ టైలర్ సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో ఆ మూవీ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటించారు. ఈ సినిమాలో జంటగా నటించిన రాజేంద్రప్రసాద్, అర్చనల కెమిస్ట్రీని సినీ ప్రేక్షకులు అంత సులువుగా మరచిపోలేరు. అయితే ఇప్పుడేంటీ అనుకుంటున్నారా? అయితే మళ్లీ అదే జోడీ తెరపై సందడి చేయనుంది. దాదాపు 37 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకోబోతోంది ఈ జంట. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కుతోన్న చిత్రం ‘షష్ఠి పూర్తి’. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా పవన్ ప్రభ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. హీరోగా నటించడంతో పాటు రూపేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాాగ చెన్నైలోని సంగీతదర్శకుడు ఇళయరాజా స్టూడియోస్లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. తొలి సీన్కి ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా.. నిర్మాత ఆర్బి చౌదరి క్లాప్ ఇచ్చారు. రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..'లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్రప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్లో ‘ఆస్తులు అంతస్తులు, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల లాంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా ఏళ్ల తర్వాత ఈ లెజెండ్స్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. అలాగే ‘లేడీస్ టైలర్’ తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన నటిస్తున్న చిత్రమిదే. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఈ మూవీ న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. #LadiesTailor duo #RajendraPrasad & #Archana reunited after 37 years for the film #Shastipoorthi "Shoot starts this month and release in August “ says @ActorRupesh An #Ilaiyaraaja musical#RupeshKumarChaudhary @aakanksha_s30 #PavanPrabha #ThotaTharrani @BrindhaGopal1… pic.twitter.com/nCNwXPp0sz — Phani Kandukuri (@phanikandukuri1) April 1, 2023 -
యూత్ఫుల్ ఎంటర్టైనర్
మాన్యం కృష్ణ, అర్చన జంటగా రూపొందిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ని హీరో ఆకాశ్ పూరి విడుదల చేసి, ‘‘సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. మహిళలకు కనెక్ట్ అయ్యే అంశాలు మా సినిమాలో ఉన్నాయి’’ అని చిత్ర యూనిట్ తెలిపింది. -
ప్రేమ.. వినోదం..
‘‘మిస్టర్ కళ్యాణ్’ మూవీ ట్రైలర్ బాగుంది. మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి దర్శకుడు పండు, నిర్మాత ఎన్వీ సుబ్బారెడ్డి మరిన్ని మంచి సినిమాలు చేయాలి’’ అని డైరెక్టర్ నక్కిన త్రినాథరావు అన్నారు. మాన్యం కృష్ణ, అర్చన జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’. పండు దర్శకత్వంలో ఉషశ్రీ సమర్పణలో ఎన్వీ సుబ్బారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ని నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా పండు, ఎన్వీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ, లవ్, యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూ΄÷ందిన చిత్రం ‘మిస్టర్ కళ్యాణ్’’ అన్నారు. -
చెరిగిపోని పచ్చబొట్టు సంతకం
‘ఒక మహిళ చిత్రకారిణిగా ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.కాని టాటూ ఆర్టిస్ట్గా ఉంటానంటేఆశ్చర్యంగా చూస్తారు’ అంటుంది అర్చన భానుషాలి.దేశంలో ఉత్తమ మహిళా టాటూ ఆర్టిస్ట్గా గుర్తింపు ΄పొం దిన అర్చనమగవాళ్లు రాజ్యమేలే ఈ రంగంలో తన ఉనికిని సగర్వంగా చాటుతోంది. ఈ రంగంలో మగవారు విపరీతంగా ఉన్నారు. ఆడవాళ్ల ప్రవేశం అంత సులభం కాదు. కాని నేను పంతంతో ఈ స్థాయికి వచ్చాను. మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. మీకు లక్ష్యం ఉంటే సరిపోదు. దానికి తగ్గ కష్టం చాలా చేయాలి. ఇవాళ నేను ఈ రంగంలో గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా మంచి రాబడి ΄పొం దుతున్నాను. – అర్చన శివరాత్రి సందర్భంగా ‘శివ్ అండ్ శక్తి కాస్మిక్ డాన్స్’ అనే సబ్జెక్ట్ను పచ్చబొట్టుగా వేసింది అర్చన భానుషాలి. శివుడు, పార్వతి ఆనంద తాండవం చేస్తున్న ఆ పచ్చబొట్టులో జీవం ఉట్టి పడుతోంది. అర్ధనారీశ్వరుడి చిత్రం కూడా పచ్చబొట్టుగా వేస్తుందామె. ఇవే కాదు ఆమె బొమ్మల్లో మన సంస్కృతిని ప్రతిబింబించే భారతీయ పౌరాణిక, ఆధ్యాత్మిక చిహ్నాలు కనపడతాయి. శివాజీ వంటి వీరులూ, అన్నా హజారే వంటి సామాజిక ఉద్యమకారులు కూడా కనపడతారు. పచ్చబొట్టును ఒక విశృంఖల చిహ్నంగా కాకుండా వ్యక్తిత్వ ప్రకటనగా మార్చడం వల్లే అర్చనకు మంచి పేరొచ్చింది. అందుకే ఆమె ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా టాటూ ఆర్టిస్ట్లలో బెస్ట్ ఆర్టిస్ట్గా, సీనియర్ ఆర్టిస్ట్గా గౌరవం ΄పొందుతోంది. కమర్షియల్ ఆర్టిస్ట్గా అర్చన కుటుంబానిది గుజరాత్ అయినా ముంబైలో స్థిరపడింది. అర్చన ఏడేళ్ల వయసు నుంచే వయసుకు మించిన పరిణితిని ప్రదర్శిస్తూ బొమ్మలు వేసేది. దాంతో ఇంట్లోప్రో త్సహించారు. అయితే ఇంటర్ వయసు వచ్చే సరికి గుజరాతీలలో అమ్మాయిలకు పెళ్లి చేసి పంపాలనే తొందర ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని వెంటపడితే అప్పుడే వద్దని చెప్పి ముంబై జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో మూడేళ్ల డిప్లమా చేసింది కమర్షియల్ ఆర్ట్లో. ఆ తర్వాత లండన్ వెళ్లి ఒక సంవత్సరం కోర్సు చదవాలని అనుకుంది. ఆ కోర్సుకు అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తుండగా టీవీలో ఒక షో చూసింది. అందులో ప్రఖ్యాత అమెరికన్ టాటూ చిత్రకారిణి కేట్ వాన్ డి తన క్లయింట్లకు అద్భుతంగా టాటూలు వేయడం చూపించారు. ‘నేను పేపర్ మీద వేసేది ఈమె ఒంటి మీద వేస్తోంది. నేనెందుకు ఇలా వేయకూడదు’ అనుకుంది అర్చన. ఆమె యాత్ర మొదలైంది. ‘మా అమ్మానాన్నలు నేను టాటూ ఆర్టిస్ట్గా మారతానంటే కంగారు పడినా ఆ తర్వాతప్రో త్సహించారు. దాని వల్ల టాటూ వేయడంలో కోర్సు చేశాను. నాకు బొమ్మలు వచ్చు కనుక చాలా త్వరగా పని నేర్చుకున్నాను. మేము గుజరాతీలం. ఒకరి కింద పని చేయడం కంటే సొంత బిజినెస్ ఉండటాన్నే ఇష్టపడతాం. అందుకే ‘ఏస్ టాటూజ్’ పేరుతో ముంబైలో మా నాన్న నా కోసం టాటూ స్టూడియో ఏర్పాటు చేశాడు’ అంటుంది అర్చన. అయితే అసలుప్రో త్సాహం భర్త నిఖిల్ నుంచి, అత్తా మామల నుంచి లభించింది. ‘మా అత్తగారు నన్ను బాగాప్రో త్సహిస్తారు. పెళ్లయ్యాక నా మొదటి పచ్చబొట్టును ఆమెకే వేశాను’ అంది అర్చన. -
Savitri Devi: నిందలు పడి కూతుర్ని విజేతను చేసింది
‘కూతుర్ని ఎవరికో అమ్మేసింది. ఏ తప్పుడు పనుల్లోనో పెట్టింది’... భర్త చనిపోయిన సావిత్రి తన కూతుర్ని పొరుగూరి స్కూల్లో చేర్చాక ఊరి ఆడవాళ్ల నుంచి ఎదుర్కొన్న నింద అది. ‘ఏమైనా సరే నా కూతురు క్రికెట్ ఆడాలి’ అనుకుంది సావిత్రి. అందుకే ఘోరమైన పేదరికంలో కూడా కూతురి కలలకు అండగా నిలబడింది. ఇవాళ ఆ కూతురు– అర్చనా దేవి ప్రపంచ విజేతగా నిలిచింది. ‘అండర్– 19’ క్రికెట్ జట్టులో బౌలర్గా, ఫీల్డర్గా రాణించి ఫైనల్స్ గెలవడంలో కీలకంగా మారింది. ఆడపిల్లల ఆకాంక్షలకు ఎన్ని అవరోధాలు ఉన్నా తల్లి గట్టిగా నిలబడితే కొండంత బలం అని తల్లులకు ఈ స్ఫూర్తిగాథ సందేశం ఇస్తోంది. సౌత్ ఆఫ్రికాలో అండర్ 19 టి 20 మహిళా ప్రపంచకప్. 16 దేశాలు తలపడ్డాయి. మన అమ్మాయిలు కప్ సాధించారు. మొత్తం 16 మంది టీమ్. ఒక్కొక్కరు శివంగిలా మారి అన్ని జట్లతో తలపడ్డారు. ఫైనల్స్లో ఇంగ్లాండ్ను అతి తక్కువ స్కోర్ (68) వద్ద కట్టడి చేసి 14 ఓవర్లకే మూడు వికెట్ల నష్టానికి విజయం సాధించారు. ఇంగ్లాండ్ జట్టును బౌలర్లు హడలగొట్టారు. వారిలో టిటాస్ సాధు, పార్శవి కాకుండా మూడో బౌలర్ ఉంది. అర్చనా దేవి. కీలకమైన రెండు వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి మూడవ వికెట్ పడేందుకు కారణమైంది. వరల్డ్ కప్లో ప్రతి ఒక్కరిదీ ఒక విజయగాథే అయినా అర్చనా దేవిది భిన్నమైనది. కష్టాలను తట్టుకుని అర్చనా దేవి (18) సొంత ఊరు ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని రతై పూర్వ. గంగానది ఒడ్డునే వీరి పొలం. ఊరు. వరదలతో ఆ పొలం సంవత్సరంలో సగం రోజులు మునకలో ఉండేది. మిగిలిన సగం రోజుల్లో తండ్రి శివరామ్ వ్యవసాయం సాగించేవాడు. కాని ఆయనను 2008లో కేన్సర్ కబళించింది. దాంతో ఊళ్లో ఆడవాళ్లందరూ అర్చనా తల్లి సావిత్రిదేవిని నష్ట జాతకురాలిగా పరిగణించసాగారు. సావిత్రి వెరవలేదు. ఇద్దరు కొడుకులను, కూతురైన అర్చనను రెక్కల కింద పెట్టుకుని సాకసాగింది. దురదృష్టం... ఆఖరు కొడుకు బుద్ధిమాన్ కూడా మరణించాడు. దాంతో సావిత్రిని చూస్తే చాలు ఊరు దడుచుకునేది. ‘ఇదో మంత్రగత్తె. మొదట భర్తను మింగింది. తర్వాత కొడుకును’ అని... ఎదురుపడితే పక్కకు తప్పుకునేవారు. సావిత్రి దేవి ఇంకా రాటు దేలింది. పిల్లల కోసం ఎలాగైనా బతకాలనుకుంది. కూతురి క్రికెట్ అర్చనకు క్రికెట్ పై ఆసక్తి, పట్టు కూడా సోదరుడు బుద్ధిమాన్ వల్ల వచ్చినవే. అతను అర్చనను వెంటబెట్టుకుని పొలాల్లో క్రికెట్ ఆడేవాడు. తోడుగా అర్చన బ్యాటు ఝళిపించేది. అర్చన టాలెంట్ను బుద్ధిమాన్ వెంటనే గమనించాడు. ‘నువ్వు క్రికెటర్వి కావాలి’ అనేవాడు. అర్చన ఆశలు పెట్టుకుంది కాని తల్లి పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు బుద్ధిమాన్ బాల్ని కొడితే అది దూరంగా చెత్తలో పడింది. వెళ్లి చేతులతో చెత్తను కదిలిస్తూ ఉంటే పాము కరిచింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుంటే కొన ఊపిరితో ఉన్న బుద్ధిమాన్ ‘అర్చనను క్రికెట్ మాన్పించవద్దు’ అని చెప్పి మరణించాడు. ఆ రోజు సావిత్రి సంకల్పించుకుంది ఎలాగైనా అర్చనను క్రికెటర్ చేయాలని. స్కూల్లో చేర్చి అర్చన క్రికెట్ కొనసాగాలంటే చదువును, ఆటలను నేర్పించే స్కూల్లో చేర్పించాలని సావిత్రి నిశ్చయించుకుంది. తమ పల్లెకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గంజ్ మొరాదాబాద్లోని గర్ల్స్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించింది. వాళ్లుండే పల్లె నుంచి అలా మరో ఊరి బోర్డింగ్ స్కూల్లో ఏ ఆడపిల్లా చేరలేదు. అందుకని ఊరి ఆడవాళ్లు సావిత్రిని అనుమానించారు. కూతుర్ని ఎవరికో మంచి బేరానికి అమ్మేసి ఉంటుందని అనేవారు. చెడ్డ పనుల కోసం ఊరు దాటించింది అనేవారు. అవన్నీ సావిత్రీదేవి నిశ్శబ్దంగా భరించింది. కొడుకును ఢిల్లీలో బట్టల ఫ్యాక్టరీలో పనికి పెట్టి తమకున్న ఒక ఆవు, ఒక బర్రె పాల మీద ఆధారపడి కూతురి ఖర్చులను అతి కష్టం మీద చూసేది. ‘నేను ఉన్నాను’ అని అర్చనకు ధైర్యం చెప్పేది. దశ తిరిగింది బోర్డింగ్ స్కూల్లోని ఒక టీచరు అర్చన ప్రతిభను గమనించి కాన్పూరులో ఉండే కోచ్ కపిల్ పాండే దృష్టికి తీసుకెళ్లింది. ఆ టీచరు తీసిన అర్చన బౌలింగ్ వీడియోలు చూసిన కపిల్ పాండే వెంటనే కాన్పూరుకు పిలిపించి అక్కడి క్రికెట్ అసోసియేషన్లో జాయిన్ చేసి తన శిష్యురాలిగా తీసుకున్నాడు. కపిల్ పాండే క్రికెటర్ కుల్దీప్ యాదవ్కు కూడా కోచ్ కావడంతో కుల్దీప్ యాదవ్ అర్చనను ప్రోత్సహించాడు. ఆమె శిక్షణకు సాయం అందించాడు. అతిథులయ్యారు ‘ఒకప్పుడు మా ఇంట నీళ్లు కూడా ఎవరూ తాగలేదు. ఇవాళ అందరూ అతిథులుగా వచ్చి మీ దశ తిరిగింది అని భోజనం చేస్తున్నారు’ అంది అర్చన తల్లి సావిత్రి. వాళ్ల ఊరిలో ఆ కుటుంబం ఇప్పుడు సగర్వంగా నిలబడింది. తల్లి తన కూతురి ద్వారా అలా నిలబెట్టుకుంది. ఆ తల్లీకూతుళ్లను చూసి ఊరు మురిసిపోతోందిగాని అది ఎన్నో ఎదురీతల ఫలితం. ఎవరో అన్నట్టు... అపజయాల ఆవల విజయ తీరం ఉంటుంది. అర్చన విజయానికి తెడ్డు వేసిన నావ– ఆ తల్లి సావిత్రీ దేవి. అందుకే అర్చన విజయంలో సగం ఆ తల్లిదే. ఇంగ్లాండ్తో ఫైనల్స్లో అర్చన క్యాచ్ ప్రపంచ విజేత మన జట్టు -
అరగంట చాలు.. రాష్ట్రంలో సీన్ మారిపోతుంది!: అర్చనా నాగ్
క్రైమ్: హైప్రొఫైల్ హనీ ట్రాప్గా ఒడిశాలో సంచలనం సృష్టించి.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది అర్చనా నాగ్ అరెస్ట్ ఉదంతం. అయితే వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన తరుణంలో మంగళవారం ఆమె మీడియా ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను పెదవిప్పితే రాష్ట్రంలో పరిస్థితి మారిపోతుంది. ప్రభుత్వమే కూలిపోతుంది. అందుకు మాట్లాడేందుకు 30 నిమిషాలు అవకాశం ఇవ్వండి. కీలక ఆధారాలను మీకిస్తా’ అని అక్కడే ఉన్న మీడియాను ఉద్దేశించి అర్చన నాగ్ వ్యాఖ్యానించారు. ఆమె అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు అర్చన నాగ్ను మంగళవారం ఏడు రోజుల రిమాండుకు తీసుకున్నారు. కారాగారం నుంచి ఆమెను క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆసుపత్రి వద్ద అర్చన నాగ్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనను ఓ ఉగ్రవాదిలా చూస్తున్నారన్నారు. ఎలాంటి దర్యాప్తునకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. అని ఆమె తెలిపారు. . శ్రద్ధాంజలి బెహరా, సినీ నిర్మాత అక్షయ పరిజ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుంటే తననెందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అధికార బీజేడీ నుంచి 20 మంది, ప్రతిపక్ష బీజేపీ నుంచి కొందరు, రాజకీయ నేతలేగాక.. వీఐపీలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, నిర్మాతలు.. అర్చనా వలపు వలలో చిక్కుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాతో పాటు బెంగాల్కు చెందిన ప్రముఖులు ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు. హనీ ట్రాప్ కేసులో అర్చనతో పాటు ఆమె భర్త జగబంధు చంద్, ఈ జంటకు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న ఖగేశ్వర్ పాత్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదివరకు పలువురిని విచారించిన ఈడీ అధికారులు మంగళవారం నుంచి ఏడు రోజులపాటు అర్చన నాగ్ను విచారించనున్నారు. కీలక అంశాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. సంబంధిత కథనం: పేద కుటుంబంలో పుట్టి.. అర్చనా నాగ్ వెర్షన్ డర్టీ పిక్చర్ ఇది! -
భర్త చనిపోయాక అత్తింటి హింస.. గంభీరంగా కనిపించే మేజర్ అర్చన వెనుక కన్నీటి కథ
Minnie Vaid: శాస్త్రరంగం నుంచి సైనికరంగం వరకు మనకు స్ఫూర్తిని ఇచ్చే మహిళలు ఎంతో మంది ఉన్నారు. వారి గురించి తెలుసుకుంటే ఆగిపోయిన అడుగులో కదలిక మొదలవుతుంది. ‘అందదు’ అనుకున్న కల చేరువవుతుంది. అలాంటి మహిళలను తన పుస్తకాలతో లోకానికి పరిచయం చేస్తోంది మిన్నీ వైద్. వాస్తవ జీవిత కథతో తాజాగా ‘ఫతే’ అనే పుస్తకాన్ని రాసింది... జర్నలిస్ట్, రైటర్, డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది ముంబైకి చెందిన మిన్నీ వైద్. మూడు సంవత్సరాల క్రితం ‘ఇస్రో’ మహిళా శాస్త్రవేత్తలపై తాను రాసిన పుస్తకం గురించి హిమాచల్ప్రదేశ్లోని కసౌలి కంటోన్మెంట్ టౌన్లో ప్రసంగించింది. ప్రసంగం పూర్తయిన తరువాత జనరల్ అనీల్ చౌదరి మిన్నీతో మాట్లాడారు. ‘ఇస్రోలోనే కాదు, ఆర్మీలో కూడా ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన మహిళలు ఉన్నారు. వారి గురించి కూడా తప్పనిసరిగా రాయాలి’ అంటూ కొంతమంది గురించి చెప్పారు ఆయన. అలా ‘ఫతే’ పుస్తకానికి బీజం పడింది. ఆ పుస్తకంలో... హరియాణాలోని చిన్న పట్టణంలో పుట్టి పెరుగుతుంది అర్చన. తనది సంప్రదాయ కుటుంబం. ‘ఎక్కడి వరకు చదవాలో అక్కడి వరకే చదవాలి. ఉన్నత చదువులు అవసరం లేదు’ అనేది ఆ కుటుంబ భావన. కాలేజీ రోజుల్లో ఎన్సీసీలో చేరుతుంది అర్చన. అప్పుడే... సైన్యంలో పనిచేయాలని గట్టిగా అనుకుంటుంది. అయితే తాను ఒకటి తలిస్తే, కుటుంబం ఒకటి తలిచింది. అర్చనకు ఆర్మీ ఆఫీసర్ లక్ష్మణ్ దెస్వాల్తో వివాహం జరిపిస్తారు. పెళ్లితో తన కల కలగానే మిగిలిపోయింది. నాన్–ఫ్యామిలీ ఫీల్డ్లో భర్త ఉద్యోగం. సెలవుల్లో అతడు ఇంటికి వచ్చినప్పుడు...ప్రతిరోజూ అపూర్వమైన రోజు. భర్త విధుల్లో చేరిన తరువాత ఉత్తర ప్రత్యుత్తరాలు, ఫోన్లో గంటల తరబడి కబుర్లు ఉండేవి! ఈ సంతోషకాలంలో, తన కల పెద్దగా గుర్తుకు వచ్చేది కాదు. ఒకరోజు.. లక్ష్మణ్కు ఫోన్ చేస్తే ఎత్తలేదు... ఆయన ఫైరింగ్ లో చనిపోయాడు! భూమి నిలువునా చీలిపోయింది. తాను ఎక్కడో పాతాళలోకంలో పడిపోయింది. అప్పటికే తాను గర్భవతి. బిడ్డను చూసుకోకుండానే ఆయన చనిపోయాడు. భర్త ఉన్నప్పుడు ఎలాంటి సమస్యా ఎదురు కాలేదుగానీ, అతడు చనిపోయిన తరువాత అత్త, ఆడబిడ్డల నుంచి మానసిక హింస మొదలైంది. ఒక మూలన ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే బాధ పెరుగుతుంది తప్ప తరగదు అనే విషయం తనకు అర్థం కావడానికి ఎంతోసేపు పట్టలేదు. తాను మళ్లీ బతకాలంటే, కొత్త జీవితం మొదలుపెట్టాలి! ఆగిపోయిన చదువును మళ్లీ పట్టాలెక్కించింది. ఒక్కో అడుగు వేస్తూ...ఆర్మీలో చేరాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. ఆర్మీ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది. అమ్మాయి ఆలనాపాలన చక్కగా చూసుకుంటుంది. ఆర్మీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఆలివ్గ్రీన్ యూనిఫామ్లో గంభీరంగా కనిపించే మేజర్ అర్చన వెనుక ఇంత కన్నీటి కథ ఉందని తెలిసినవారు చాలా తక్కువ. నిజజీవిత కథ ఆధారంగా మిన్నీ రాసిన ఈ కాల్పనిక పుస్తకం పేరు... ఫతే. ‘ఫతే’ అంటే విజయం. ఎన్ని కష్టాలు దాటితే ఒక విజయం సొంతం అవుతుందో కళ్లకు కట్టే పుస్తకం ఇది. దీనిలో ఎలాంటి శైలి, విన్యాసాలు, నాటకీయతా లేవు. 126 పేజీలలో సాధారణ వాక్యాలు కనిపిస్తాయి. అయితే అవి ఒక అసాధారణమైన వ్యక్తి గురించి అద్భుతంగా చెబుతాయి. మిన్నీ ఈ పుస్తకం దగ్గరే ఆగిపోవాలనుకోవడం లేదు. అనేక రంగాలలో మనకు స్ఫూర్తిని ఇచ్చే మహిళలు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి కూడా భవిష్యత్లో మరిన్ని పుస్తకాలు రాయాలనుకుంటోంది. చదవండి: బ్యూటిఫుల్ సక్సెస్ మంత్ర Joycy Lyngdoh: నిరుపేద మహిళ.. తొలుత స్కూల్ బస్ డ్రైవర్గా.. ఇప్పుడేమో! -
అర్చనా నాగ్ వెర్షన్ డర్టీ పిక్చర్ ఇది
భువనేశ్వర్: అర్చనా నాగ్.. ఒడిషాలో కలకలం రేపిన పేరు. వీవీఐపీలకు వలపు వల విసిరి ముగ్గులోకి దించి.. ఆపై బ్లాక్మెయిలింగ్తో కోట్లు దన్నుకున్న వగలాడి. ఓ నిర్మాత ఫిర్యాదుతో కదిలిన ఈ తేనెతుట్టు(హనీట్రాప్) ఒడిషాలో రాజకీయ ప్రముఖులకు మాత్రమే కాదు.. బెంగాల్కు చెందిన సెలబ్రిటీలకు సైతం వణుకు పుట్టిస్తోంది. కలహంది జిల్లా ఒకప్పుడు ఆకలి కేకలతో అల్లలాడిపోయిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా నాగ్.. కట్ చేస్తే కోట్లు విలువ చేసే బ్యాంక్ బ్యాలెన్స్తో, ఇంటి నిండా విదేశాల నుంచి వచ్చిన ఫర్నీచర్తో, లగ్జరీ కార్లతో, హైబ్రీడ్ కుక్కలు, ఓ తెల్ల గుర్రం పెంచుకుంటూ విలాసవంతమైన జీవితం గడపాలనుకుంది. అందుకు తగ్గట్లే 26 ఏళ్ల అర్చన పెద్ద పెద్ద స్కెచ్లే వేసింది. ప్రముఖులను హనీట్రాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకుంది. ► లంజిగర్లో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా.. తల్లి వృత్తిరిత్యా కేసింగలో పెరిగింది. ఆపై 2015లో భువనేశ్వర్లో అడుగుపెట్టింది. తొలుత ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పని చేసి.. ఆపై ఓ బ్యూటీపార్లర్లో పనికి కుదిరింది. అక్కడే బాలాసోర్ జిల్లాకు చెందిన జగబంధు చంద్తో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి ఈ భార్యాభర్తల మోసాలు మొదలయ్యాయి. బ్యూటీపార్లర్లో పని చేసే టైంలోనే సెక్స్రాకెట్ నడిపినట్లు ఆమెపై ఆరోపణలు కూడా వచ్చాయి. ► జగబంధు ఓ కార్ల షోరూం తెరిచి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతరులతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్లతో ఆ భార్యాభర్తలు ఫొటోలు కూడా దిగారు. ఒక అర్చన వీవీఐపీలతో పరిచయం పెంచుకుని.. వాళ్లకు అమ్మాయిలను సప్లై చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే వాళ్ల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసి.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందని పోలీసులు వెల్లడించారు. ► అర్చనా బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. 2018 నుంచి 2022 మధ్య.. కేవలం నాలుగేళ్లలో అర్చనా-జగబంధుల ఆసక్తి రూ.30 కోట్లకు చేరుకుందని చెప్తున్నారు. ఆమె ఏయే విలాసాలు కోరుకుందో.. అవన్నీ నెరవేర్చుకుందామె. అంటే.. ఆ భార్యభర్తల బ్లాక్మెయిలింగ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఓ నిర్మాతను మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో.. ఆయన నాయపల్లి పీఎస్లో ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 6న అర్చనా అరెస్ట్ కాగా.. అప్పటి నుంచి రోజుకో రోజుకో సంచలనం బయటపడుతూనే వస్తోంది. జగబంధు డ్రగ్స్ కార్యకలాపాలు సైతం వెలగపెట్టేవాడని తేలింది. ఇక ఈ వ్యవహారంలో ఆర్థిక దర్యాప్తు విభాగాలను సైతం దర్యాప్తు చేపట్టాలని ఒడిషా పోలీసులు కోరుతున్నారు. ► ఇక ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే అర్చనపై ఫిర్యాదుకు ముందుకు వచ్చారని, మరికొందరు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ కోరుతున్నారు. మరోవైపు ఒడియా ఫిల్మ్ మేకర్ శ్రీధర్ మార్థా.. అర్చనా చేసిన డర్టీ పనుల ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు కూడా. సెక్స్, డబ్బు, మోసంతో పాటు అర్చనా నాగ్ వ్యవహారంలో ఇప్పుడు రాజకీయమూ కీలకంగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ వ్యవహారంలో అధికార బీజేడీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారని ఆరోపిస్తోంది. ఒకవేళ అదే గనుక బయటపడితే 22 ఏళ్ల నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పతనం కాకతప్పదని అంటోంది. మరోవైపు బీజేపీ కూడా బీజేడీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అర్చనా వలలో ఉన్నట్లు ఆరోపిస్తోంది. బీజేడీ మాత్రం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దంటూ బీజేపీ, కాంగ్రెస్లకు సూచిస్తోంది. సుమారు 25 మంది రాజకీయ ప్రముఖులు ఆమె ఉచ్చులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ప్రేమను కాదందనే రైలు కిందకు తోసేశాడు -
హైదరాబాద్లో శ్రీవారి వైభవోత్సవాలు.. తరలివచ్చిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీనివాస కల్యాణం, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న వైభవోత్సవాలు 15వ తేదీ వరకు కొనసాగుతాయి. తిరుపతికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ నగరంలో వెంకటేశ్వర స్వామి మహోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతి రోజు పది వేల మంది దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైభవోత్సవాలను ప్రచారం చేసేందుకు తిరుమల తిరుపతి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన శ్రీ వెంకటేశ్వర స్వామి రథం నగరానికి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడే లడ్డూలు తయారు చేసి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గోపూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని భక్తుల సౌకర్యార్థం ఎన్టిఆర్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎన్టిఆర్ స్టేడియం ప్రాంగణంలో గోపూజ నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాల ప్రచార రధాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోలేని వారికోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నగరానికి తరలిరావడం ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. కార్యక్రమంలో నిర్వహకులు ముప్పవరపు హర్షవర్ధన్, బి.సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలివీ.. ఎన్టీఆర్ స్టేడియంలో 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే రోజు వారి పూజా కార్యక్రమాలు 11న ఉదయం 6 గంటలకు సుప్రభాతం, 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కొలుపు, అర్చన, 7.30 నుంచి 8.15 వరకు నివేదన, 8.15 నుంచి 8.30 వరకు పాద పద్మారాదన, ఉదయం 8.30 నుంచి 9.30 వరకు రెండో నివేదన, 9.30 నుంచి 10 గంటల వరకు వసంతోత్సవం, వీధి ఉత్సవం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు సర్వదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ సాయంత్రం 5.30 గంటల నుచి 6.30 వరకు, వీధి ఉత్సవం సాయంత్రం 6.30 నుంచి 7.30 వరకు, రాత్రి కైంకర్యం రాత్రి 7.30 నుంచి 8.30 వరకు, ఏకాంత సేవ రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. 15న... 15వ తేదీన ఉదయం ఆరు గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాల సేవ, కోలుపు, అర్చన 7.30 నుంచి 8.15, నివేదన 8.15 నుంచి 8.30 వరకు, పాదపద్మారాధన, ఉదయం 8.30 నుంచి 10.30 వరకు, పుష్పయాగం, రెండవ నివేదన 10.30 నుంచి 11 గంటల వరకు, సర్వదర్శనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు, సహస్రదీపాలంకరణ సేవ, సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు శ్రీనివాస కళ్యాణం, సాయంత్రం 6.30నుంచి 8.30 వరకు తోమాల సేవ అర్చన, నివేధన రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు జరుగుతాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హాయ్ అంటూ కవ్విస్తుంది.. ఇంటికి పిలిచి క్లోజ్గా ఉంటుంది.. ఆ తర్వాత..
ఆమె తన అందంతో రంగంలోకి దిగి.. ప్రముఖులను ముగ్గులోకి దింపుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయం పెంచుకుని వారింతో సన్నిహితంగా మెదులుతుంది. ఈ క్రమంలో వారితో తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ హానీట్రాప్ చేస్తుంది. ఇలా డబ్బులు వసూలు చేస్తున్న అర్చనా నాగ్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కాగా, విచారణలో భాగంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందుతురాలు అర్చనకు భువనేశ్వర్లో విశాలమైన భవనం ఉన్నట్టుగా గుర్తించారు. ఇక, అర్చన.. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ప్రముఖులు, సంపన్నులు, ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకుంటుంది. అనంతరం.. మాటలు కలిపి వారిని ముగ్గులోకి దింపుతుంది. పరిచయం అనంతరం.. వారిని తన నివాసానికి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో సీక్రెట్గా ఫొటోలు, వీడియోలు తీసేది. అనంతరం, వారికి ఈ ఫొటోలు, వీడియోలను పంపించి డబ్బులు వసూలు చేసేది. తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు గురిచేసేది. ఇక, కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆమె వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆమెకు ఎంతో ఖరీదు చేసే బీఎండబ్ల్యూ, ఫోర్డు తదితర కంపెనీల కార్లు, ఫార్మ్ హౌస్ కూడా ఉన్నట్టు గుర్తించారు. కాగా, అర్చనను అరెస్ట్ చేసిన అనంతరం.. పోలీసులు ఆమె కంప్యూటర్ హార్డ్ డిస్క్, ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సెల్ఫోన్లోని ఫొటోలు, వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు వెల్లడించారు. మరోవైపు.. ఆమె బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను సైతం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ని కోరినట్టు డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. #ବ୍ୟକ୍ତିଗତ_ଫଟୋ_ରଖି_ଲୋକଙ୍କୁ_ବ୍ଲାକମେଲ_କରୁଥିଲା_ଅର୍ଚ୍ଚନା ଅର୍ଚ୍ଚନା ନାଗ୍ ମାମଲାରେ କ’ଣ ପ୍ରତିକ୍ରିୟା ରଖୁଛନ୍ତି ଡିସିପି ଶୁଣନ୍ତୁ...#Odisha #Bhubaneswar #ArchanaNag #DCP pic.twitter.com/KkZxOodmN0 — NandighoshaTV (@NandighoshaTV) October 9, 2022 -
తల్లిప్రేమ ముందు పులి ఎంత!
పులి అనగానే అమ్మో అనుకుంటాం. కాని అమ్మ ముందు పులి బలమెంత! ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పులితో పోరాడిన సాహసం సోషల్మీడియాలో వైరల్ అయింది... మధ్యప్రదేశ్లోని ఉమేరియా జిల్లాలోని బందవ్ఘర్ టైగర్ రిజర్వ్కు సమీపంలో రోహనియా అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన అర్చన చౌదరికి పదిహేను నెలల కొడుకు రవిరాజ్. కొడుకు నవ్వితే నవ్వేంత, ఏడిస్తే ఏడ్చేంత ప్రేమ తనకు! కొన్ని నెలల క్రితం చీమ కుట్టి కొడుకు ఏడుస్తుంటే తాను కూడా ఏడ్చేసింది. ఈసారి మాత్రం చీమ కుట్టలేదు. పులి ఎదురైంది! బిడ్డను నోట కరుచుకుపోవడానికి రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం అర్చన ఏడ్వలేదు. వణికిపోలేదు. ఏం జరిగిందంటే... ఆరోజు రాత్రి బిడ్డ రవిరాజ్ను తీసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చింది అర్చన. అక్కడి పొదల్లో ఒక పులి కాచుకొని కూర్చుంది. వీరిని చూడగానే బయటికి వచ్చింది. పిల్లాడిని దూరంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించింది. అంతే... అర్చన తన శక్తినంతా కూడదీసుకొని పెద్దగా అరుస్తూ ఎదురుదాడి ప్రారంభించింది. అర్చన కేకలు విన్న గ్రామస్థులందరూ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చారు. వారిని చూసి పులి తోకముడిచి సమీపంలోని అడవిలోకి పారిపోయింది! తల, వీపు వెనుక గాయాలైన బిడ్డను, ఒళ్లంతా గాయాలైన తల్లిని గ్రామస్థులు వెంటనే హాస్పిటల్లో చేర్చడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ‘ఒక పులి టైగర్ రిజర్వ్ దాటి జనావాసాలలోకి వచ్చింది అని ప్రచారం చేస్తున్నాం. ఈ విషయం చాలామందికి తెలుసు’ అని అటవీశాఖ అధికారులు చెబుతున్నారుగానీ అదెంత వరకు నిజమో తెలియదు. ‘మాకు అలాంటి వార్త గురించి ఏమీ తెలియదు’ అని చెబుతున్నాడు అర్చన భర్త బోలా చౌదరి. అరుదుగా మాత్రమే ఊరు దాటేది అర్చన. అలాంటి అర్చన పేరు ఇప్పుడు ఊళ్లు, జిల్లాలు, రాష్ట్రాలు దాటింది. ‘తల్లి శక్తి ఏమిటో నిరూపించావు’ అని వేనోళ్ల కొనియాడుతున్నారు నెటిజనులు. ‘మా ఊళ్లోనే కాదు, ఇంకా చాలా ఊళ్లలో అర్చన పేరు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆమె సాహసం అద్భుతం. పులిని చూడగానే వణికిపోయి, భయపడి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించడానికి కూడా భయంగా ఉంది. ఎంతోమంది తల్లులకు స్ఫూర్తిని ఇచ్చే సాహసం ఆమెది’ అంటుంది రోహనియ గ్రామానికి చెందిన కులుమతి. ఆరోజు అర్చన అరుపులు విని పరుగెత్తుకు వచ్చిన వారిలో కుష్వా అనే రైతు ఉన్నాడు. ‘అరుపులు వినగానే ప్రమాదాన్ని ఊహించి కట్టె తీసుకొని పరుగెత్తుకు వచ్చాను. అక్కడికి వెళ్లగానే విషయం అర్థమైంది. అందరం గట్టిగా అరుస్తూ ముందుకు వెళుతుంటే పులి భయపడి పారిపోయింది. తల్లీబిడ్డలను ఆ దేవుడే రక్షించాడు’ అంటున్నాడు కుష్వా. చాలామందికి మాత్రం అర్చన తన బిడ్డను రక్షించుకున్న దేవత. ఊరి జనాల నుంచి నెటిజనుల వరకు అర్చనా చౌదరి సాహసానికి అందరూ జై కొడుతున్నారు. -
'మగధీర'లో ఆఫర్ వచ్చింది, కానీ నో చెప్పా: అర్చన
హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన అర్చన ఈ మధ్య వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్య బిగ్బాస్ షోలోనూ పాల్గొని బుల్లితెర ప్రేక్షకులక సైతం చేరువైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమాలో తాను బాలకృష్ణకు డ్యాన్స్ నేర్పించానంది. బాలయ్య బృందావనంలో గోపికలతో కలిసి డ్యాన్స్ చేసే ఒక బిట్ నేర్పించినట్లు వెల్లడించింది. ఇక పెళ్లికి ముందు ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్లిన తాను పెగ్గులు ఎక్కువవడంతో ఆసుపత్రికి వెళ్లానని చెప్పింది. రాజమౌళిగారు మగధీరలో చేయమని ఆఫర్ ఇచ్చారు, కానీ అప్పుడంత లౌక్యం లేకపోవడంతో చేయలేదని తెలిపింది. నిజంగా ఆ సినిమా చేసుంటే ఇప్పుడు ఇంకోలా ఉండేదేమోనని పేర్కొంది. కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయంటూ ఎమోషనలైంది అర్చన. చదవండి: నాకు అలాంటి సీన్స్లో నటించడమే ఈజీ పావురాల వ్యర్థాల వల్లే మీనా భర్త మృతిచెందాడా?..షాకింగ్ రీజన్ -
నా వయసున్నోళ్లు లవ్స్టోరీస్ కూడా చేస్తున్నారు
‘‘చోర్ బజార్’ ఎంటర్టైన్మెంట్, కమర్షియల్, కలర్ఫుల్ ఫిల్మ్. ఈ చిత్రంలో వైవిధ్యమైన పాత్ర చేశాను. ఇదొక మాస్ ఫిలిం. నా జానర్ దాటి బయటికొచ్చి ఈ సినిమా చేశాను’’ అని నటి అర్చన (‘నిరీక్షణ’ ఫేమ్) అన్నారు. ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్ బజార్’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన అర్చన మాట్లాడుతూ– ‘‘నా గురువులు, దర్శకులు నన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. 300 సినిమాల్లో చేసిన హీరోయిన్కి ఎలాంటి గుర్తింపు ఇవ్వాలో అలాంటి గుర్తింపును భారతీయ సినిమా, నా దర్శకులు నాకు ఇచ్చారు.. ఆ గౌరవాన్ని పాడు చేసుకునే హక్కు నాకు లేదు. నేను చెన్నైలో ఉంటున్నాను. షూటింగ్ కోసం హైదరాబాద్ రాలేకపోయేదాన్ని. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చింది. ఒకప్పుడు హీరో సరసన నటించిన హీరోయిన్ కొంత కాలానికి అదే హీరోకి సోదరి, వదిన, తల్లి, అత్త అవుతోంది. మన సినిమాల్లో మహిళా పాత్రలకు 80 శాతం ప్రాధాన్యత ఉండటం లేదు. మరాఠీలో మహిళలకు ఎక్కువ వైవిధ్యమైన పాత్రలు దక్కుతున్నాయి. నా వయసువాళ్లు అక్కడ లవ్ స్టోరీస్లో నటిస్తున్నారు.. బోల్డ్ సీన్స్ చేస్తున్నారు. ‘చోర్ బజార్లో’ నాది అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ పాత్ర. ఆయన్ను ప్రేమించి, ఆయన కోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయే పాత్ర నాది. ఈ మూవీలో హీరో పేరు బచ్చన్ సాబ్. మా ఇద్దరికీ అమితాబ్ అంటే ఇష్టం. అర్చన అంటే నెక్ట్స్ డోర్ ఉమెన్ అనే ఇమేజ్ ఉంది.. ఆ గుర్తింపును ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను. ప్రస్తుతం తమిళంలో ఒకటి, కన్నడలో ఒక ఆర్ట్ ఫిలిం చేస్తున్నాను. అలాగే ఓ వెబ్ సిరీస్లోనూ నటించనున్నాను’’ అన్నారు. -
బ్రేక్కి బ్రేక్.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు
సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు ఆనందపడుతుంది? తన అభిమాన తార సినిమా తెరకు వచ్చినప్పుడు. సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు బాధపడుతుంది... తన అభిమాన తార సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పుడు. ఆ బ్రేక్కి బ్రేక్ ఇచ్చి ఆ తారలు మళ్లీ సినిమాలు చేస్తే.. రండి.. రండి.. రండి.. మీ రాక ఎంతో ఆనందమండి అని వెండితెర ఆహ్వానించకుండా ఉంటుందా. ఇక కొందరు తారలు బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 28 ఏళ్ల తర్వాత... బ్యాక్ టు బ్యాక్ జాతీయ ఉత్తమ నటిగా (తమిళ చిత్రం ‘వీడు’– 1987, తెలుగు చిత్రం ‘దాసి’– 1988 చిత్రాల్లోని నటనకు) అవార్డులు సాధించిన అర్చన ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ‘నిరీక్షణ’, ‘లేడీస్ టైలర్’, ‘భారత్ బంద్’ వంటి తెలుగు చిత్రాల్లో అర్చన యాక్టింగ్ అదుర్స్ అని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు కితాబులిచ్చారు. అర్చన కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే మిగతా భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా తెలుగు తెరపై నల్లపూస అయిపోయారు అర్చన. 1994లో వచ్చిన ‘పచ్చతోరణం’ తర్వాత మరో తెలుగు మూవీలో ఆమె కనిపించలేదు. ఇప్పుడు అర్చన మళ్లీ తెలుగు డైలాగ్స్ చెబుతున్నారు. ఈ డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ చిత్రం కోసమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ తల్లిగా కనిపిస్తారు అర్చన. ఈ ఏడాదే ‘చోర్ బజార్’ చిత్రం థియేటర్స్కు రానున్నట్లుగా తెలిసింది. అంటే.. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అర్చన మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారన్నమాట. తమిళంలో ఇరవై.. తెలుగులో పది తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ‘శివ’లో హీరోయిన్గా చేసిన అమలను అంత ఈజీగా మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. అయితే 1993లో ‘ఆగ్రహం’ తర్వాత అమల తెలుగు సినిమాకు గ్యాప్ ఇచ్చారు. తిరిగి 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత ‘మనం’ (2014) చిత్రంలో అతిథిగా కనిపించినప్పటికీ ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది మాత్రం తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) లోనే అని చెప్పాలి. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రంలో శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో శర్వా తల్లి పాత్రలో కనిపిస్తారు అమల. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో అమల కనిపించనున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఇక తమిళంలో 1991లో వచ్చిన ‘కర్పూర ముల్లై’ తర్వాత అమల మరో సినిమా చేయలేదు. ఇరవైసంవత్సరాల తర్వాత ‘కణం’ సినిమాతో తమిళ తెరపై ఆమె మళ్లీ కనిపించనున్నారు. రెండు దశాబ్దాలకు మళ్లీ... ‘బద్రి, జానీ’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేణూ దేశాయ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2003లో వచ్చిన ‘జానీ’ తర్వాత తెలుగులో ఆమె మరో చిత్రం చేయలేదు. 2014లో మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’కి దర్శకత్వం వహించారు కానీ నటిగా వెండితెరపై మాత్రం మెరవలేదు. ఇప్పుడు కనిపించనున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఓ కీ రోల్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకు వంశీ దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజయ్యే చాన్స్ ఉంది. పదేళ్ల తర్వాత.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’... ఈ డైలాగ్ విన్న వెంటనే జెనీలియా గుర్తు రాకుండా ఉండరు. 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత జెనీలియా మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. ఇటీవలే ఆమె ఒక తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిరీటి (వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జెనీలియా తెలుగు సినిమావైపు చూశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ద్విభాషా (తెలుగు, కన్నడం) చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. డబుల్ ధమాకా ‘గోల్కొండ హైస్కూల్’, ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ‘కలర్స్’ స్వాతి ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017లో వచి్చన ‘లండన్ బాబులు’ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో ఆంథాలజీ ఫిల్మ్ ‘పంచతంత్రం’ అంగీకరించారు. అలాగే ఈ సినిమాతో పాటు స్వాతి ‘ఇడియట్స్’ అనే ఫిల్మ్ కూడా చేశారు. స్వాతి, నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఆదిత్యా హాసన్ దర్శకుడు. అభిõÙక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి నవీన్ మేడారం షో రన్నర్. ఇలా కమ్బ్యాక్లోనే ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ డబుల్ ధమాకా ఇస్తున్నారు స్వాతి. వీరే కాదండోయ్... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సోనాలీ బింద్రే, రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో మీరా జాస్మిన్ కీ రోల్స్ చేయడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా తెలుగు సినిమాల పరంగా బ్రేక్లో ఉన్న మరికొందరు తారలు కూడా రీ ఎంట్రీ లిస్ట్లో చేరే అవకాశం ఉంది. -
ఆ దర్శకుడు నాన్సెన్స్ చేసేవాడు, ఇంటికొచ్చి మరీ..: అర్చన
హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టిన అర్చన ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. గతంలో బిగ్బాస్ షోలో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యిందీ భామ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక తెలుగు డైరెక్టర్ తనను నానా హింసించేవాడని పేర్కొంది. 'ఒక డైరెక్టర్ ఉన్నాడు. అతడు రోజుకోసారి డైలాగ్ మార్చేస్తాడు, రోజుకోసారి స్క్రిప్ట్ మార్చేస్తాడు. చాలా నాన్సెన్స్ చేశాడు. అతడిని చూశాక మనుషులు ఇలా కూడా ఉంటారా అనుకున్నా! అతడు సెట్లో డిఫరెంట్గా ఉండేవాడు.. కానీ మళ్లీ ఇదెక్కడ సినిమా వదిలేస్తుందోనని అమ్మా, నిన్ను కలుస్తా, ఇంటికొచ్చి మాట్లాడతాను అంటూ నాతో మాటలు కలిపేవారు. అలా ఒకసారి ఆయన మా ఇంటికొచ్చినప్పుడు మీరు చెప్పింది ఒకటి, చేస్తుంది మరొకటి.. ఇది కరెక్ట్ కాదు సర్ అని చెప్పాను. దీంతో అతడు కాకమ్మ కబుర్లు చెప్తూ తియ్యగా మాట్లాడుతూ నా బ్రెయిన్ వాష్ చేసేవాడు. అతడి మాటలు విని.. నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనుకుని మళ్లీ షూటింగ్కు వెళ్లేదాన్ని. కానీ సెట్లో చాలా ఇరిటేషన్ వచ్చింది. నువ్వు నాకు పైసా కూడా ఇవ్వకు అని ముఖం మీదే చెప్పి వచ్చేశాను. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ సంఘటన కొన్నేళ్ల క్రితం జరిగింది. అతడు మనందరికీ తెలిసిన హీరో, కానీ పెద్దగా సక్సెస్ఫుల్ హీరో కాదు. ఆయన నాకు తెలీకుండా నా వెనకాల కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. చూడటానికి అతడు చాలా సింపుల్గా, సీదాగా ఉన్నారనిపిస్తుంది, కానీ అది అతడి నిజస్వరూపం కాదు. వేరే నిజం ఇంకేదో ఉంటుంది. అతడు చాలా వంకరగా ఆలోచించేవాడు. అందమైన అమ్మాయిలు, అందులోనూ ఎవరి అండా లేనివాళ్లు సెట్లో ఉన్నారంటే వాళ్ల మైండ్ను క్యాప్చర్ చేసేందుకు ఇలాంటి వ్యక్తులు రెడీగా ఉంటారు' అని చెప్పుకొచ్చింది అర్చన. -
‘ది రోజ్ విల్లా’ మూవీ రివ్యూ
టైటిల్ : ది రోజ్ విల్లా నటీనటులు : దీక్షిత్ శెట్టి, శ్వేతా వర్మ, రాజా రవీంద్ర, అర్చన తదితరులు నిర్మాణ సంస్థ : చిత్ర మందిర్ స్టూడియోస్ నిర్మాత : అచ్యుత్ రామారావు దర్శకత్వం :హేమంత్ సంగీతం : సురేష్ బొబ్బిలి సినిమాటోగ్రఫీ : అంజి ఎడిటింగ్: శివ విడుదల తేది : అక్టోబర్ 1,2021 ‘కన్నడ `దియా` ఫేమ్ దీక్షిత్ శెట్టి, బిగ్బాస్ -5 ఫేమ్ శ్వేతా వర్మ హీరో,హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ది రోజ్ విల్లా. చిత్ర మందిర్ స్టూడియోస్ బ్యానర్పై అచ్యుత్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు హేమంత్ దర్శకత్వం వహించాడు. రాజా రవీంద్ర కీలకపాత్రలో నటించారు. అక్టోబర్ 1న ఈ మూవీ తెలుగు, కన్నడలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), శ్వేత (శ్వేత వర్మ) కొత్తగా పెళ్లి చేసుకున్న యువ జంట. ఇద్దరూ తాము కోరుకున్న విధంగా ఉండాలని.. మున్నార్ అనే అందమైన ప్రాంతానికి కారులో బయలుదేరుతారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం సాగిస్తారు. అయితే వీరిద్దరు అనుకోకుండా నక్సల్స్ ఉన్న డేంజర్ పాయింట్కు వెళ్తారు. అక్కడ వారి కారు పాడైపోతుంది. ఎంతకీ స్టార్ట్ అవ్వదు. అలాంటి సమయంలో పోలీసులు వచ్చి వారిని సురక్షితంగా పక్క గ్రామంలో దిగబెడతారు. అక్కడ రెస్టారెంట్లో వీళ్ళు తింటుండగా మిలట్రీ రిటైర్ అయిన సోల్మాన్ (రాజా రవీంద్ర) తన భార్య హెలెన్తో (అర్చనా కుమార్)తో అక్కడే ఉంటాడు. అతన్ని ఓ ప్రమాదం నుంచి డాక్టర్ రవి కాపాడతాడు. దీంతో వారిద్దరు స్నేహితులైపోతారు. తనను కాపాడినందుకు ఆ యువ జంటని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తారు. అలా అక్కడికి వెళ్ళిన ఈ యువజంటకు అక్కడి వాతావరణం వితంగానే కాకుండా భయం కలిగించేలా ఉంటుంది. అలా ఎందుకు అనిపించింది.. ఏం జరిగింది? అప్పుడు ఈ యువజంట ఏం చేశారు? అనేది మిగిలిన కథ ఎలా చేశారంటే.. డాక్టర్ రవి పాత్రకు దీక్షిత్ పూర్తి న్యాయం చేశాడు. బిగ్ బాస్ 5 తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న శ్వేతా వర్మ ఇందులో హీరోయిన్. ఈమె కూడా బాగానే నటించింది. తెరపై అందంగా కనిపించడంతో పాటు తనదైన నటనతో మెప్పించింది. రైటైర్ మిలట్రీ సోల్మాన్ పాత్రలో రాజా రవీంద్ర తన అనుభవాన్ని చూపించాడు. అర్చనతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ ఓ సాధారణ కథకి భావోద్వేగాన్ని అతికించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు హేమంత్. దర్శకుడు తీసుకున్న పాయింట్ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సీన్స్ ప్రేక్షకుడిని థ్రిల్లింగ్ కలిగిస్తాయి. మాటలు కూడా బానే రాసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా కాస్త నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా అర్చన, రాజా రవీంద్ర మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అయితే కొన్ని సీన్స్ పునరావృతం కావడం ప్రేక్షకుడి బోర్ కొట్టిస్తాయి. హీరో హీరోయిన్లు రాజా రవీంద్ర ఇంటికి వచ్చిన తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి ఆసక్తిని కలిగిస్తాయి. దీక్షిత్ను చూసి తన కొడుకు అనుకుని ఇక్కడే ఉండమని బలవంతం చేయడంతో.. తను అక్కడ్నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడం.. ఆ తర్వాత ఏం జరిగిందనేది బాగానే అనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి నేపథ్య బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. అంజి సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాలను సహజంగా చిత్రీకరించారు. ఎడిటర్ శివ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
'అవలంబిక'తో వస్తున్న బిగ్బాస్ ఫేం అర్చన
అర్చన, సుజయ్, మంజూష పొలగాని ముఖ్య పాత్రల్లో పోషిస్తున్న చిత్రం 'అవలంబిక'. షిరిడి సాయి ప్రొడక్షన్స్ బ్యానర్పై జి శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఇటీవలె మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. ఆదిత్య అందించిన మ్యూజిక్, ట్రైలర్కు మంచి స్పందన రావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సందర్బంగా దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ .. ఆద్యంతం ఆసక్తితో, ఉత్కంఠతో తెరకెక్కించిన చిత్రమిది. చిత్రీకరణ విషయంలో చాలా కష్టపడ్డాం, అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. ఈ విషయంలో మా నిర్మాత శ్రీనివాస్ గౌడ్ సపోర్ట్ చాలా ఉంది. ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైట్స్ ఉంటాయి. సోసియో ఫాంటసీ హర్రర్ అంశంలతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి అనిఅన్నారు. కృష్ణ చైతన్య, లావణ్య, వై వి రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా వెంకీ పెద్దాడ, సంగీతం ఉదయ్ కిరణ్, ఎడిటింగ్ : శ్రీ చందు, ఆర్ట్ : రవిబాబు -
‘వైద్యం అందకే గంట వ్యవధిలో నా భర్త, తల్లిని కోల్పోయాను’
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది కరోనా బాధితులు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సకాలంలో వైద్యం అందకపోవడంతో చాలా కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సరైన వైద్య చికిత్స అందకపోవడంతోనే తన భర్త, తల్లి మరణించారని మాజీ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ అర్చన దత్తా ఆరోపించారు. ఏప్రిల్ 27న మాల్వియా నగర్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో అర్చన తన భర్త, తల్లిని కోల్పోయారు. ఈ విషాదాలు కేవలం గంట వ్యవధిలో చోటుచేసుకోవడం మరింత దారుణం. వీరు చనిపోయిన తర్వాత ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ మేరకు ట్విటర్లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. తన తల్లి, భర్తను ఆసుపత్రిలో చేరడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని, ఒక గంట వ్యవధిలోనే తన తల్లి, భర్తను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా లాగా చాలా మంది తమ కుటుంబానికి ఏం జరగకూడదని అనుకుంటారు.. కానీ అదే జరిగింది. నా తల్లి, భర్త ఇద్దరూ చికిత్స అందకుండానే మరణించారు. ఢిల్లీలోని ఎన్నో ప్రముఖ ఆసుపత్రులను సందర్శించానా చేర్చుకోలేదు. వారు మృతి చెందాక కరోనా పాజిటివ్ అని తేలింది.’ అని ట్వీట్ చేశారు. ఇక ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రతినిధిగా ఎంఎస్ దత్తా ఉన్నారు. కాగా అర్చన భర్త ఎఆర్ దత్తా రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేసి విరమణ పొందిన ఏఆర్ దత్తా(68). ఆమె తల్లి బనీ ముఖర్జీ(88) ఇటీవల ఆరోగ్యం క్షీణించింది. అర్చన కుమారుడు అభిషేక్ వారిద్దరిని దక్షిణ డిల్లీలోని ఓ ప్రముఖ ఆసుతప్రికి తరలించాడు. అయితే అక్కడ వారు చేర్చుకోలేదు. ఇలా పలు ఆసుపత్రుల్లో ఏవ్వరూ స్పందించలేదు. చివరికి ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినప్పటికీ అప్పటికే శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఏర్పడి గంటల వ్యవధిలోనే వారిద్దరు మరణించారు. ఇక ప్రస్తుతం తమ కుటుంబంలో అభిషేక్ మినహా అందరూ కోవిడ్ బారిన పడినట్లు అర్చన దత్తా వెల్లడించారు. తన మేనకోడలి పరిస్థితి క్షీణిస్తోందని.. ఆక్సిజన్ కోసం ఆసుపత్రులు తిరుగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘మరో నాలుగు రోజులే, సీఎం యోగీకి మరణం తప్పదు’ జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే! -
శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలో మెరిసిన సినీ నటి అర్చన
-
ఆ బలం ఆర్చనకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో
ఒక కాగితం దాని మీద ఒక సంతకం తాలూకు బలం ఆర్చనకు తెలిసినట్టుగా మరొకరికి తెలియదేమో. బెంగళూరుకు చెందిన ఈ సోషల్ యాక్టివిస్టు ‘మంత్రిగారూ... ఈ స్కూళ్ల టాయ్లెట్లు ఎప్పుడు బాగుపడతాయి’ అని ఒక కాగితం మీద రాసి ట్విట్టర్లో సంతకాలు ఆహ్వానిస్తే 8 వేల మంది చకచకా సంతకాలు చేశారు. పాఠశాల విద్యామంత్రి ఉలిక్కి పడ్డారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశంలో 100 కోట్లు స్కూళ్ల టాయ్లెట్లకు కేటాయించారు. అర్చనను అందరూ ‘నింజా’ అని పిలుస్తారు ముద్దుగా. ఫైట్ చేయడం తెలిసిన వారిని నింజా అనడమే కరెక్ట్ కదా. మార్చి 28న హోలీ పండగ. కాని అర్చన నాలుగైదు రోజుల నుంచే తన ట్విటర్ ఖాతా ద్వారా నీళ్ల పొదుపు గురించి బెంగళూరు వాసులకు సూచనలు చేయడం మొదలుపెట్టేసింది. ‘రంగులు చల్లుకున్న తర్వాత మీ స్నానాన్ని 8 నిమిషాల్లో పూర్తి చేయండి. ఒక్క బకెట్టు నీళ్లలో శుభ్రపడటానికి ప్రయత్నించండి. మీరు కొంటున్న నీళ్లు వాస్తవానికి వాటి రేటు కంటే ఖరీదైనవి’ అని ప్రచారం చేస్తోంది. 28 ఏళ్ల అర్చన కె.ఆర్ బెంగళూరు వాసులకు సోషల్ యాక్టివిస్ట్గా సుపరిచితురాలు. తనని తాను ‘శానిటేషన్, మెన్స్ట్రునల్ హైజీన్ యాక్టివిస్ట్’ గా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమెకు ‘రీప్బెనిఫిట్’ సంస్థ తరఫున పని చేస్తుంది. ఆ సంస్థకు ‘సాల్వ్ నింజా’ అనే యాప్ ఉంది. ఈ యాప్ ద్వారా బెంగళూరులో నగర సమస్యలు, నగరంతో ముడిపడిన పౌర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం, పౌరులే పరిష్కరించుకునేలా చేయడం గురించి అర్చన పని చేస్తుంది. ‘సాల్వ్ స్మాల్ డెంట్ బిగ్’ అనేది వీరి నినాదం. ‘నగరంలో నివసించడానికి అందరూ ఇష్టపడతారు. కాని నగర సమస్యలను పరిష్కరించడంలో కేవలం ఒక శాతం మంది మాత్రమే శ్రద్ధ వహిస్తారు. మన నగరాన్ని బెటర్గా చేసుకోవడం మనందరి బాధ్యత’ అంటుంది అర్చన. యువతీ యువకులను ఈ బాధ్యతలోకి మళ్లించడానికి కూడా అర్చన పని చేస్తుంది. ‘యువతే భవిష్యత్తులో మంచి లీడర్లు కావాలి. అందుకని వారికి ప్రజాస్వామ్యంలో అధికార స్థానాల్లో ఉండటం ఎంత అవసరమో కూడా నేను తెలియచేస్తుంటాను. అందుకోసమే ‘డెమొక్రసీ ఎక్స్ప్రెస్’ వంటి శిక్షణా తరగతులు కూడా ఇస్తాను’ అని అర్చన అంటుంది. తన సమస్య నుంచి అందరి సమస్య చూసి అర్చనది కర్ణాటకలోని హస్సన్ ప్రాంతం. ‘నేను కూడా అందరిలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నాను. కాని ఆ పాఠశాలల్లో టాయ్లెట్లు సరిగ్గా ఉండేవి కావు. అందుకని నేను స్కూల్ తరచూ ఎగ్గొట్టేదాన్ని. పెద్దయ్యాక సామాజిక రంగంలో పని చేయడం మొదలెట్టాక ఆ పరిస్థితి ఎలా ఉందో అని తెలుసుకుందామనుకున్నాను. కర్ణాటకలో దాదాపు 300 ప్రభుత్వ స్కూళ్లు చూశాను. కాని 70 శాతం స్కూళ్ల టాయ్లెట్లు పనికి రాకుండా ఉన్నాయి. అబ్బాయిలు ఎక్కడో ఒక చోట పని కానిస్తారు. కాని అమ్మాయిలకు వేరే మార్గం లేదు. వారు బడి మానేయాల్సిందే. ఒకమ్మాౖయెతే స్కూలుకు వచ్చి స్కూలు నుంచి వెళ్లేదాకా నీళ్లే తాగను అని చెప్పింది టాయ్లెట్కు వెళ్లాల్సి వస్తుందని. అందుకే దీనిమీద ఎంత దూరమైనా వెళ్లి పోరాడాలనుకున్నాను’ అంది అర్చన. సంతకాల ఉద్యమం కర్ణాటకలో ప్రభుత్వ బడుల్లో టాయ్లెట్ల మెరుగుకు అర్చన ‘ఛేంజ్డాట్ఆర్గ్’ ఫౌండేషన్ సాయంతో సంతకాల ఉద్యమం మొదలెట్టింది. ‘ప్రభుత్వ బడులలో టాయ్లెట్ల మెరుగుకు ఉద్యమం’ పేరుతో తొలి సంతకం తాను చేసి ఆన్లైన్ పిటిషన్ మీద సంతకాలు ఆహ్వానించింది. ఆమె గ్రౌండ్ వర్క్, ఆమె పెట్టిన దారుణమైన టాయ్లెట్ల ఫొటోలు చూసి పౌరులు స్పందించారు. 7000 మంది సంతకాలు చేశారు. ఈ సంతకాల ఉద్యమం దావానలంలా వ్యాపిస్తూ ఉండటంతో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖా మంత్రి ఎస్.సురేశ్ కుమార్ స్పందించారు. ‘నేను ఈ పరిస్థితిని చక్కదిద్దుతాను’ అని ట్విటర్లోనే అర్చనకు సమాధానం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రికి ఏమి చెప్పుకున్నారో ఏమో మార్చి మొదటివారంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప 100 కోట్ల రూపాయల నిధులు స్కూళ్ల టాయ్లెట్ల మరమ్మతులకు మంజూరు చేశారు. ‘ఇది మనందరి విజయం. మన పోరాటం గెలిచింది’ అని అర్చన వ్యాఖ్యానించింది. కేవలం అర్చన సంకల్పం, పోరాటం వల్ల ఈ మంచి పని సాధ్యమైందని చెప్పవచ్చు. హైవేల పై మరుగుదొడ్ల కోసం... అర్చన స్కూళ్ల గురించే కాదు హైవేల పై శుభ్రమైన మరుగుదొడ్లు ముఖ్యంగా స్త్రీలకు అవసరం అని మరో ఉద్యమం మొదలు పెట్టింది. ఎన్హచ్ 75 మీద తిరుగుతూ ఈ దారిలో మరుగుదొడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో వీడియో రికార్డులు చేసింది. స్త్రీలు ప్రయాణిస్తూ మరుగుదొడ్లు లేకపోవడం వల్ల పడే ఇబ్బందులు తెలియ చేయడం వల్ల హైవేల మీద కొత్త మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ‘షీ డిమాండ్ ఛేంజ్’ అని ఈ ఉద్యమానికి అర్చన పేరు పెట్టింది. నిజమే. మనం మన హక్కులను డిమాండ్ చేయడం మర్చిపోయాం. డిమాండ్ చేస్తే పనులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా కోల్పోయాం. కాని అర్చనకు హక్కులను పోరాడి సాధించుకోవడం మీద నమ్మకం ఉంది. సంతకానికి ఉన్న శక్తి గురించి కూడా అవగాహన ఉంది. ఆ అవగాహనను అందరూ అందుకోవాల్సి ఉంది. ఈసురోమని బతకడం అలవాటు చేసుకున్నవారికి ఒక దిక్సూచి అర్చన. -
శివరాత్రి: ఇన్ని గంటలు శివార్చన చేస్తే పుణ్యం!
పరమేశ్వరునికి అత్యంత ప్రియమైనది శివరాత్రి. బ్రహ్మ విష్ణువులకు జ్ఞానబోధ చేయడానికి శివుడు లింగరూపం ధరించిన సమయం శివరాత్రి. ఇది మాఘ కృష్ణ చతుర్దశి సమయంలో జరిగింది. కనుకనే మనమంతా ఆ రాత్రిని శివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ శివరాత్రి మధ్యరాత్రిని లింగోద్భవ కాలం అంటారు. లింగోద్భవ కాలంలో ప్రపంచంలోని సకల తీర్థాలు.. దేవతాంశలన్నీ శివలింగంలో నిలిచి ఉంటాయి. అందుకే ఆ సమయంలో ప్రతీ భక్తుడూ శివలింగారాధన చేయాలి. శివలింగారాధన సకల పాపాలనూ పోగొడుతుంది. సకల పుణ్యాలను సంపాదించి పెడుతుంది. ఈ జన్మను తరింపజేస్తుంది. మరు జన్మ లేకుండా చేస్తుంది. శాశ్వత శివపదాన్ని అందిస్తుంది. శివలింగారాధన అనగానే మనందరికీ అనేక పుణ్యక్షేత్రాలు.. గొప్ప పూజలు.. అభిషేకాలు.. యజ్ఞాలు తలంపుకు వస్తాయి. శివార్చన అనేది కేవలం ఆడంబరంతో..అధికారంతో చేసేది కాదు. ఐశ్వర్యంతో సాధ్యమయ్యేది కాదు. భక్తి ప్రధానమైనది. శివరాత్రి సమయంలో ఎనిమిది జాములలో వీలుకాకపోతే ఆరు జాములలో శివార్చన చేయాలని శాస్త్రవచనం. (ఒకరోజుకు ఎనిమిది జాములు. పగలు నాలుగు జాములు.. రాత్రి నాలుగు జాములు. మన కలగణనలో నాలుగు గంటలు) శివరాత్రి ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేయాలి. సత్కాలక్షేపం చేస్తూ చేసేదే జాగరణ. మనసంతా మహాదేవుని నింపుకుని శివగాథలు వింటూ.. శివుని మహిమలను కీర్తిస్తూ.. శివనామం పలుకుతూ.. శివలింగాన్ని అభిషేకిస్తూ..శివార్చన చేస్తూ.. శివునికి నమస్కరిస్తూ..శివునికే తనువు, మనసును సమర్పించి సర్వం శివునిలో లయం చేయగలిగితేనే శివానుగ్రహం కలిగినట్లు. శివరాత్రి రోజున మనం చేయాల్సిన కార్యం ఇదే. అయితే సాధారణంగా శివరాత్రి అంటే అందరూ దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రం ఎక్కడ ఉంటే అక్కడకు పయనమవుతాం. కానీ మనం చేయాల్సిన పని ఒకటుంది. శివాలయం లేని ఊరుండదు. అటువంటి శివాలయం ఎంత పాతదైనా.. పాడైపోయినా.. చెట్టు చేమలు మొలిచినా దాన్ని శుభ్రం చేసి ఆ ఆలయంలో శివుని ఆరాధించుకుంటే కలిగే ఫలితం అనంతమైనది. శివరాత్రి ప్రతి శివలింగం తేజస్సుతో వెలుగులీనుతూ అందులో శివశక్తి ప్రవహిస్తుంది. కనుక అటువంటి ఆలయాలను పునరుద్ధరించి పూజించడం చాలా అవసరం. ఊరిలోని శివభక్తులంతా పూనుకొని ఈ పనిని సాధిస్తే ఆ ఊరిలోని ప్రజలందరికీ శ్రేయస్సు లభిస్తుంది. ఇవేవీ లేకపోయినా కేవలం శుద్ధజలంతో అభిషేకించినా శివుడు అమిత ప్రసన్నుడౌతాడు. శివార్చనకు తామరపువ్వు, జిల్లేడు పూలు, నల్లకలువలు చాలా ముఖ్యం. ఇవి తెచ్చే స్తోమత లేకపోతే దవనపత్రి, ఉసిరి పత్రి, మారేడు పత్రి వీటితోనైనా పూజించవచ్చు. పూజ కూడా కుదరని భక్తుడి చేతిలో శివనామస్మరణమనే ఆయుధం ఎలాగూ ఉంది. ‘ఓం నమఃశివాయ‘ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తే చాలు. సమస్త పాపాలు తొలగిపోతాయి. శివరాత్రికి శివపంచాక్షరీ జపం చేసిన భక్తునికి ఎటువంటి పాపాలూ అంటవు. శివనామం భవసాగరం నుంచి తరింపజేసే నావ. ఏడేడు జన్మల పాపాలను క్షణంలో పోగొట్టే దివ్యమంత్రం. సకలదోషాలను..భూతప్రేతాలను పారద్రోలే పరమ మంత్రం. మహాదేవ అన్నా..శంభు అన్నా అన్నీ సదాశివుని అనుగ్రహాన్ని కలిగించేవే. శివనామోచ్చరణ ఫలితం అంతా ఇంతా కాదు. శివ నామాన్ని ఒక్కసారి కీర్తించినంత మాత్రం చేత మానవులు ఏడు జన్మలలో ఎప్పుడెప్పుడు చేసి ఉన్న ఏ పాపాలనుండి అయినా అతిశీఘ్రంగా విముక్తి పొందుతాడు. బుద్ధిమంతుడు ‘శి–వ’ అనే ఈ రెండక్షరాలనూ సదా ఉచ్చరిస్తూ సంసార సాగరాన్ని అవలీలగా దాటేసి, శివ సాయుజ్యం పొంది తీరుతాడు. ఇలా శివరాత్రి సమయంలో శివపంచాక్షరీ మంత్రం ఎంత ఎక్కువ జపిస్తే అంత గొప్ప ఫలితం లభిస్తుంది. కనుక శివరాత్రి వ్రతాన్ని ఆలయంలోనూ.. గృహంలోనూ.. ఇవి కుదరని వారు మనస్సులోనైనా భక్తితో జరుపుకుంటే వారు శివానుగ్రహభాగ్యులే. శివుడు వారికనుగ్రహించిన స్తోమతను బట్టి వారు శివపూజను ఆచరించుకోవచ్చు. ఇందులో తరతమభేదాలేమీ లేవు. భక్తి ముఖ్యం. భావన ముఖ్యం. శివునిపై మనసును నిలపడం ముఖ్యం. కనుక ఈ శివరాత్రిన శివునిపై భక్తిని నిలిపి చరమైన ఈ జీవితానికి స్థిరమైన లక్ష్యాన్ని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకుందాం. శివానుగ్రహం పొందుదాం. సాధారణంగా శివరాత్రి అంటే అందరూ దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రం ఎక్కడ ఉంటే అక్కడకు పయనమవుతాం. కానీ మనం చేయాల్సిన పని ఒకటుంది. శివాలయం లేని ఊరుండదు. అటువంటి శివాలయం ఎంత పాతదైనా.. పాడైపోయినా.. చెట్టు చేమలు మొలిచినా దాన్ని శుభ్రం చేసి ఆ ఆలయంలో శివుని ఆరాధించుకుంటే కలిగే ఫలితం అనంతమైనది. శివరాత్రి ప్రతి శివలింగం తేజస్సుతో వెలుగులీనుతూ అందులో శివశక్తి ప్రవహిస్తుంది. కనుక అటువంటి ఆలయాలను పునరుద్ధరించి పూజించడం చాలా అవసరం. ఊరిలోని శివభక్తులంతా పూనుకొని ఈ పనిని సాధిస్తే ఆ ఊరిలోని ప్రజలందరికీ శ్రేయస్సు లభిస్తుంది. వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠ శ్రీ భ్రామరీ హృదయలోల దయాంబురాశే శ్రీమల్లికార్జున సదాశివ చంద్రచూడ శ్రీశైలవాస మమ దేహి కరావలంబమ్ వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠ శ్రీ భ్రామరీ హృదయలోల దయాంబురాశే శ్రీమల్లికార్జున సదాశివ చంద్రచూడ శ్రీశైలవాస మమ దేహి కరావలంబమ్ శివుడు అభిషేక ప్రియుడు. కనుక ఆ రోజు పరమేశ్వరునికి ఒక చెంబెడు నీటితో అభిషేకించి.. మారేడు పత్రిని శివలింగంపై ఉంచి ఒక్క చిరుదీపాన్ని ఏ శివాలయంలో వెలిగించినా మహాదేవుడు అమితప్రీతిపాత్రుడై భక్తులను అనుగ్రహిస్తాడు. శివరాత్రి సమయంలో స్థిరలింగం, చరలింగం, మృత్తికా లింగం, బాణలింగం, స్ఫటిక లింగం ఇలా ఏ లోహంతోనైనా తయారు చేసిన శివలింగాన్ని పూజిస్తే ఆ జన్మకు ఆ ఒక్క శివరాత్రితోనే సార్థకత చేకూరుతుంది. సామాన్య భక్తులు చక్కగా మంచి పుట్టమట్టి..బంకమట్టిని తెచ్చుకొని శివలింగం తయారు చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీళ్లు, పంచదార వీటితో అభిషేకం చేయవచ్చు. అభిషేకం చేసేటప్పుడు రుద్రనమకచమకాలనే వేదమంత్రాలను చెప్తూ చేసినా.. ఇవేవీ రానివారు పంచాక్షరీ మంత్రం పలుకుతూ చేసినా ఒకే ఫలితం కలుగుతుందని శివుడు పార్వతికి చెప్పాడు. – కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య, ఆధ్యాత్మిక రచయిత -
ధైర్యమిచ్చిన గౌరవం.. వన్డే కలెక్టర్
ధైర్యం అంటే ఎలా ఉండాలి? ధైర్యానికి ఉదాహరణ ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అమ్మాయిలకు చెప్పాలంటే అర్చన కెవాట్ను చూపించాలి. 21 ఏళ్ల అర్చన ధైర్యానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని కాట్ని జిల్లా కలెక్టర్ అర్చనను ‘ఒకరోజు కలెక్టర్’గా నియమించి గౌరవించింది. ఆ ప్రభుత్వం 51,000 రూపాయలను కానుకగా ఇచ్చి, ఘనంగా సత్కరించింది. వేధింపులకు గురిచేస్తున్న అబ్బాయిల నుంచి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినందుకు గాను అర్చన కెవాట్కు దక్కిన అరుదైన గౌరవం ఇది. మార్చి 8, సోమవారం ఉదయం 21 ఏళ్ల అర్చన కెవాట్ కాట్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కారులో చేరుకుంది. కాటన్ సల్వార్ సూట్ ధరించిన అర్చన కెవాటన్ పేరును మీడియా ముందు ‘వన్డే కలెక్టర్’గా ప్రకటించారు. ఆమె అంతే ఆత్మవిశ్వాసంతో తనకు అందించిన గౌరవాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కూరగాయలు అమ్మే వ్యక్తి కూతురుగా తనను తాను పరిచయం చేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేముందు అర్చనకు జిల్లా కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా, సిబ్బంది పూలతో స్వాగతం పలికారు. సమీక్షలు.. సమావేశాలు సోమవారం కావడంతో జిల్లా పరిపాలన, అభివృద్ధికి సంబంధించిన సమీక్షలు జరిపే సమావేశం. ఈ సమావేశానికి అర్చన అధ్యక్షత వహించింది. జిల్లాల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మొదటి ప్రాధాన్యంగా అధికారులను ఆదేశించింది. తక్కువ బరువు, పోషకాహార లోపం ఉన్న పిల్లలను పునరావాస కేంద్రాలకు చేర్చాలని తెలిపింది. సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో చకా గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంది. ఆ తర్వాత మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఒంటి గంటప్పుడు బస్టాండ్ వద్ద ఉన్న ఆడిటోరియం చేరుకుని, సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 3 గంటలకు వన్స్టాప్ సెంటర్ను, సాయంత్రం 4 గంటలకు ఆడపిల్లల భద్రత గురించిన వివరాలను తెలుసుకుంది. పర్యటన, సమావేశాలు ఒకదాని తర్వాత ఒక కార్యక్రమాన్ని రోజంతా చేపడుతూనే ఉంది అర్చన. కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి.. ఎనిమిది మంది తోబుట్టువులున్న అర్చన తండ్రి చేసే కూరగాయల వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటోంది. కొద్దిరోజుల క్రితం మార్కెట్ వద్ద టీనేజ్ అమ్మాయిలను రౌడీలు వేధిస్తుండటం చూసిన అర్చన సమీపంలోని వ్యక్తుల సాయంతో వారిని కొట్టుకుంటూ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి, పోలీసులకు అప్పజెప్పింది. అర్చన ఎలాంటి భయం లేకుండా దుండగులను చట్టానికి పట్టించిన తీరు స్థానిక ప్రజానీకానికే కాకుండా అధికారులను సైతం ఆకట్టుకుంది. ఆమె సాహసానికి నగదు పురస్కారాన్ని ఇవ్వడమే గాకుండా ఒకరోజు కలెక్టర్గా నియమించి ఆమె పట్ల తమ గౌరవాన్ని చాటారు. -
పల్లెటూరి కథ
అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. బాలాదిత్య, అర్చన హీరో హీరోయిన్లుగా నటించారు. యం.ఎన్.ఆర్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా శివనాగు మాట్లాడుతూ– ‘‘ప్రతిఒక్కరి జీవితానికి అన్వయించుకునే కథ ఇది. పల్లెటూరి నేపథ్యంలో సినిమా ఉంటుంది. మిర్యాలగూడ అమ్మాయి అమృత ప్రేమకథ కూడా ఈ సినిమాలో మిళితమై ఉంటుంది. అమ్మాయి ప్రేమ వివాహాన్ని తండ్రి అంగీకరించని నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశాం. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవ్వటంతో ఇక్కడ విడుదల చేస్తున్నాం. కెరీర్ పరంగా ఇది నా పదకొండవ సినిమా. ఈ చిత్రం తర్వాత నేను తీసిన ‘దేవినేని’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. -
ఆయన దృష్టిలో నేనే సూపర్ స్టార్ : అర్చన
‘‘నేను’సినిమాతో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఈ తర్వాత కూడా నాకు చాలా మంచి పాత్రలు వచ్చాయి. ‘శ్రీరామదాసు’లో చేసిన సీత క్యారెక్టర్ నాకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది’అన్నారు అర్చన. మహానటి జమున, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ రోల్స్ చేసిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన హీరో హీరోయిన్లుగా నటించారు. నర్రా శివనాగేశ్వరరావు(శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం పాత్రికేయులతో అర్చన మాట్లాడుతూ.. ‘జమున, అన్నపూర్ణమ్మగార్ల సినిమాలు చూస్తూ పెరిగాను. వాళ్ల సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాది మెడికల్ స్టూడెంట్ పాత్ర. ప్రేమించిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్ర చేశాను. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న పరువు హత్యలను కూడా ఈ చిత్రంలో చూపించాం. శివనాగుగారు నా పాత్రను అద్భుతంగా మలిచారు. కళాతపస్వి కె. విశ్వనాథ్గారు ఈ సినిమా చాలా బావుందని ప్రశంసించడం ఆనందంగా ఉంది’అన్నారు. గత ఏడాది నవంబర్లో అర్చన వివాహం జగదీశ్తో జరిగింది. ‘పెళ్లి తర్వాత మేమిద్దరం హ్యాపీగా ఉన్నాం. నా భర్త దృష్టిలో నేనే సూపర్ స్టార్. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాం. 2020 మనపై బాగా ప్రభావం చూపించింది. ఈ ఏడాది అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకూ నేను నటించిన అన్ని సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. నాకిచ్చిన పాత్ర ఏదైనా సిన్సియర్గా చేస్తాను. నాకు డాన్స్ చేయడం బాగా ఇష్టం. స్పెషల్ సాంగ్స్, గ్లామర్ రోల్స్ చేయడం వల్ల అవకాశాలు తగ్గుతాయనుకోను. కెమెరామేన్ అంజి డైరెక్షన్లో ఒక ప్రాజెక్టు సైన్ చేశాను. ఇందులో నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది’అన్నారు. -
ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి
సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలు పోషించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన జంటగా, సీనియర్ నటి జమున ముఖ్య పాత్రలో నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇటీవల విడుదలైంది. థియేటర్స్ ప్రారంభించగానే ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో అన్నపూర్ణ మాట్లాడుతూ– ‘‘45 ఏళ్ల కెరీర్లో ఎన్నో చక్కటి పాత్రలు పోషించాను. అయితే నా పేరుతో కూడిన టైటిల్ పాత్రను ఇంతవరకు చేయలేదు. ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ నా కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘సీనియర్ నటీనటులతో కలసి నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు మాస్టర్ రవితేజ. ‘‘హృదయాలను కదిలించే సన్నివేశాలతో పాటు భావోద్వేగాలున్న పాత్ర నాది’’ అన్నారు అర్చన. ‘‘అమెరికాతో పాటు ఓవర్సీస్లో విడుదలైన మా సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు శివనాగు. ‘‘మా చిత్రం దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎం.ఎన్.ఆర్.చౌదరి. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, నిర్మాత ఆచంట గోపీనాథ్, దర్శకుడు వి. సముద్ర, విలన్ పాత్రధారి శ్రీహర్ష, అమెజాన్ ప్రతినిధి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ లీడ్ రోల్స్లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మరో సీనియర్ నటి జమున ప్రధాన పాత్రలో నటించగా బాలాదిత్య, అర్చన జంటగా నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం (అక్టోబర్ 25న) ఓవర్సీస్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ చిన్న సినిమా ఒకేసారి ఓవర్సీస్లో విడుదల కానుండటం ఇదే మొదటిసారి. అమేజాన్ ప్రైమ్లో విడుదలవుతున్న మా సినిమాని ఇండియాలో మాత్రం థియేటర్లు ప్రారంభించాక విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి అభిరుచిగల దర్శకుడు శివనాగు ఈ చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. పాటలు చాలా బావున్నాయి’’ అని అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు కోటి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: గిరికుమార్. -
అనుక్షణం ఉత్కంఠ
ప్రముఖ నిర్మాత శోభారాణి తనయుడు రమణ హీరోగా షఫీ, సిమ్రాన్, సారిక, అర్చన, శివణ్య తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘పాయిజన్’ (వర్కింగ్ టైటిల్). సీఎల్ఎన్ మీడియా పతాకంపై రవిచంద్రన్ దర్శకత్వంలో కె.శిల్పిక, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా కె.శిల్పిక, ప్రవల్లిక మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రానికి చక్కని కథతో పాటు మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. తప్పకుండా ఫీల్గుడ్ మూవీని అందిస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. రవిచంద్రన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్యాక్డ్రాప్లో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథ ఇది. ఈ సినిమా కోసం ఎంతోమంది నటీనటుల్ని ఆడిషన్ చేసి, ఎంచుకోవటం జరిగింది. ఈ సబ్జెక్ట్కు హీరో రమణ పర్ఫెక్ట్ చాయిస్’’ అన్నారు. రమణ మాట్లాడుతూ– ‘‘ప్రతి ఒక్కర్నీ ఎంటర్టైన్ చేస్తూనే అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే కథ ఇది. నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ను ఇవ్వటానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నేహల్ డి.జె. -
బ్రాండ్ ఫ్యాక్టరీ అన్లాక్ సేల్ మోడళ్లు సందడి
-
కాపాడే కళ
లక్షలు పెట్టి పెయింటింగ్స్ కొంటారు. ఇంట్లో నచ్చిన చోట వాటిని అలంకరించి మురిసిపోతారు. ఇంటికి వచ్చిన అతిథుల ప్రశంసలు పొందుతారు. అలాంటి కళాఖండాలు ఏ కాస్త దెబ్బతిన్నా కళను ఆరాధించే ప్రాణాలు విలవిల్లాడిపోతాయి. ఇలాంటప్పుడు ఆ పెయింటింగ్స్కు పూర్వపు కళను తీసుకువచ్చేవారున్నారని తెలిస్తే ప్రాణం లేచి వచ్చినట్టే అనిపిస్తుంది. అలాంటి అరుదైన కళను ఔపోసన పట్టారు హైదరాబాద్ వాసి అర్చన. అద్భుతమైన ప్రాచీన పెయింటింగ్స్, కళాఖండాలను ఐదేళ్లుగా కాపాడుతున్నారు అర్చన దూబె. హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్ వారితో కలిసి హెరిటేజ్ డ్రైవ్స్లోనూ పాల్గొంటున్న అర్చన ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియాల్లోని అరుదైన పెయింటింగ్స్కు కూడా రక్షించే పనిలో ఉన్నారు. అపురూపమైన చిత్రరాజాలను కాపాడుకోవాలనే ఆకాంక్షలో అరుదైన కళను కెరియర్గా ఎంచుకున్న అర్చన నైపుణ్యాలు ఆమె మాటల్లోనే... ‘‘ఫైన్ ఆర్ట్ ఆర్టిస్ట్గా కన్సర్వేషన్లో కెరీర్ 2015లో ప్రారంభించాను. చారిత్రక, పురాతన, సాంస్కృతిక సంపద మీద ఆసక్తి ఎక్కువ. ప్రాచీన వారసత్వ సంపదను పరిరక్షించాలనే ఆలోచన కూడా అందుకే వచ్చిందేమో.. ఆ ఆసక్తితో నేషనల్ రిసెర్చ్ లేబరేటరీ ఫర్ ది కన్సర్వేషన్ ఆఫ్ కల్చరల్ ప్రాపర్టీ (ఎన్ఆర్ఎల్సి)లో ప్రవేశం పొందాను. అక్కడ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేశాక మైసూర్లోని ఎన్ఆర్ఎల్సి ప్రాజెక్టుకు పంపించారు. ఆ సందర్భంగా సీనియర్ కన్సర్వేటర్స్తో కలిసి పనిచేశాను. అప్పుడే మ్యూరల్ పెయింటింగ్స్కి సంబంధించిన కన్సర్వేషన్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఆర్ట్ గ్యాలరీలు.. కళ తగ్గినవి, రంగు వెలిసిన పెయింటింగ్స్ని వాటి పూర్వపు వైభవం ఏ మాత్రం తగ్గకుండా చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎంతో నేర్పు, ఓర్పు ఉండాలి. అలాగే, ఆ కళ పట్ల ఆపేక్ష ఉండాలి. మైసూర్లోని చామ్రాజ్య ఆర్ట్ గ్యాలరీలో కొంత కాలం పనిచేసిన అనుభవం కూడా కళను కాపాడేందుకు సహకరంచింది. ఆ తర్వాత ఢిల్లీలోని ఢిల్లీ ఆర్క్వైస్లో ఒక కన్సర్వేషన్ ప్రాజెక్టులో భాగం పంచుకున్నాను. ఫొటోలామ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండేళ్ల పాటు విభిన్న ప్రాంతాల్లో పని చేశాను. అలాగే కల్చరల్ ప్రాపర్టీ కన్సర్వేషన్పై జరిగిన పలు రకాల వర్క్షాప్స్, సెమినార్స్కు అటెండయ్యాను. అదే క్రమంలో త్రివేండ్రంలోని శ్రీ చిత్ర ఆర్ట్ గ్యాలరీ, జూలో ఉన్న రాజా రవివర్మ పెయింటింగ్స్ స్థితిగతులపై ఒక డాక్యుమెంట్ తయారు చేశాను. కలెక్షన్స్.. ప్రాజెక్ట్స్.. ప్రస్తుతం సాంస్కృతిక కళా సంపదను కలిగి ఉన్న వ్యక్తులు, ప్రైవేట్ కలెక్షన్స్ ప్రాజెక్ట్స్ తీసుకుని వాటికి పూర్వపు వైభవాన్ని తీసుకువస్తున్నాను. పెయింటింగ్స్, పేపర్ మెటీరియల్స్, శిల్పకళాకృతులను కాపాడే పనులు చేపడుతున్నాను. అలాగే హైదరాబాద్ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే హెరిటేజ్ డ్రైవ్స్లో పాల్గొంటున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళా సంపద తాలూకు స్థితిగతులను అక్షరబద్ధం చేస్తున్నాను’’ అని వివరించారు అర్చన. ఎంచుకున్న కళా రంగాన్ని వినూత్నరీతిలో కెరియర్గా మలుచుకుంటున్నవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ మార్పు రేపటితరానికి దారి చూపడమే కాదు గత కాలపు కళావైభవానికీ వారధిగానూ నిలుస్తోంది. – నిర్మలారెడ్డి -
లాక్డౌన్ వేళ.. ఆన్లైన్ అర్చన
సాక్షి, హైదరాబాద్: దైవికమైన శుభసందర్భాలు, పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలు.. ఇలాంటి సందర్భాల్లో దేవాలయాలకు వెళ్లాలని భక్తులు భావిస్తారు. ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉన్నందున ఇది కుదరటం లేదు. దీంతో చాలామంది మానసిక ఆవేదనకు గురవుతున్నారు. దీన్ని గుర్తించిన దేవాదాయశాఖ.. భక్తులకు ఆలయ ప్రవేశం లేకున్నా, వారిపేరుతో పూజలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటే, నిర్ధారిత జాబితాలోని కోరుకున్న దేవాలయంలో పూజలు నిర్వహించే ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ ఐటీ శాఖ రూపొందించిన యాప్ ద్వారా ఈ వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్లేస్టోర్లో యాప్ను రూపొందించింది. తొలుత ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, కర్మన్ఘాట్లోని ధ్యానాంజనేయస్వామి దేవాలయంలో బుధవారం నుంచీ ప్రారంభిస్తున్నారు. ఆపై రాష్ట్రంలోని ఇతర ముఖ్య ఆలయాల్లో ప్రారంభిస్తారు. ప్లేస్టోర్ ద్వారా ఈ వెసులుబాటు కల్పించేందుకు గూగుల్ మంగళవారం సమ్మతి తెలిపింది. భద్రాద్రి రామయ్య తలంబ్రాలు సిద్ధం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణాన్ని భక్తకోటి నేరుగా తిలకించలేకపోయింది. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూసి ఆనందపడింది. కానీ స్వామి తలంబ్రాల అక్షింతల కోసం వారు తపన పడుతున్నారు. ఇప్పుడు టీఎస్ యాప్ ఫోలియో ద్వారా కోరుకున్న వారికి వాటిని అందించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఐదు వేల తలంబ్రాల పొట్లాలను దేవాదాయశాఖ సిద్ధం చేసింది. యాప్ ద్వారా బుక్ చేసుకున్నవారికి తపాలా ద్వారా ఇంటికి అందిస్తారు. ఇందుకోసం తపాలాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో భద్రాచలం దేవాలయం తలంబ్రాల వివరాలు ఉన్న విండో ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవటం ద్వారా బుక్ చేసుకోవచ్చు. తలంబ్రాలకు గాను రూ.20, పోస్టల్ చార్జీ రూ.30, ఐటీ సర్వీస్ చార్జీ చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రత్యేకంగా ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చేందుకు తపాలాశాఖ సిబ్బంది, వాహనాలను సిద్ధం చేసింది. ఎలా బుక్ చేసుకోవాలి? గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీఎస్ యాప్ ఫోలియోను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో దేవాలయాల వివరాలు ఉంటాయి. వాటిల్లో కావాల్సిన ఆలయంలో ఆర్జిత సేవను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేయాలి. దాని ఆధారంగా ఆయా దేవాలయాల్లో భక్తుల పేర్లతో, వారు కోరుకున్న రోజున ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. ఆ వివరాలను తిరిగి వారి మొబైల్ ఫోన్కు సమాచారం రూపంలో అందిస్తారు. కుదిరితే పూజ అక్షింతలు, పసుపు కుంకుమ, డ్రైఫ్రూట్స్, మిశ్రీతో కూడిన ప్రసాదాన్ని కూడా అందించాలని తొలుత భావించారు. కానీ ప్రస్తుతం తపాలా, కొరియర్ సేవలు పరిమితంగానే ఉన్నందున ఇది సాధ్యం కాదని అనుకుంటున్నారు. -
నచ్చినవి రాలేదు.. వచ్చినవి నచ్చలేదు
‘‘టీవీ కెమెరా, సినిమా కెమెరా, వెబ్సిరీస్ కెమెరా... నటించేవారికి ఏదైనా ఒకటే. యాక్టింగ్ యాక్టింగే’’ అన్నారు బాలాదిత్య. అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రధారులుగా నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన కీలక పాత్రధారులు. ఎంఎన్ఆర్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. బాలాదిత్య మాట్లాడుతూ – ‘‘పదిహేడేళ్ల వయసులో హీరోగా ‘చంటిగాడు’ సినిమాలో నటించాను. కానీ సరైన విద్యార్హత ఉండాలనే మా అమ్మ మాట కోసం నా యాక్టింగ్ కెరీర్కు దాదాపు ఐదేళ్లు బ్రేక్ ఇచ్చాను. కంపెనీ సెక్రటరీ కోర్సులో అర్హత సాధించి, ముంబైలో ట్రైనింగ్ తీసుకున్నాను. 2013–2014 సమయంలో సినిమా చాన్సుల కోసం ట్రై చేశాను. నా దగ్గరకు వచ్చిన కొన్ని కథలు నాకు నచ్చలేదు. ఓ ప్రముఖ టీవీ చానెల్కి చెందిన ఓ ప్రోగ్రామ్ ద్వారా మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. ఇటీవల ‘ఎంత మంచివాడవురా!’ సినిమాలో ఓ రోల్ చేశాను. ఇప్పుడు ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’లో మంచి పాత్ర చేశాను. అన్నపూర్ణమ్మగారి మనవడు అనే పాత్రను తీసుకుని ఆ కథలో, ప్రణయ్–అమృతల కథను సినిమాటిక్గా కలిపారు. నేను ప్రణయ్ పాత్ర చేశాను. సినిమా, టీవీ అనే తేడా ఇప్పుడు లేదు. చిరంజీవి, నాగార్జున, సాయికుమార్గార్లు వంటివారు టీవీ ప్రొగ్రామ్స్ చేస్తున్నారు. ‘రాసాత్తి’ అనే ఓ తమిళ సీరియల్లో నటిస్తున్నా. ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ అనే ఓ వెబ్సిరీస్ చేశా’’ అన్నారు. -
ఐటీ అధికారుల ముందుకు అర్చన
చెన్నై ,పెరంబూరు: ఆదాయపన్ను శాఖా అధికారుల ముందుకు ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు అర్చన కల్పత్తి బుధవారం హాజరయ్యారు. బిగిల్ చిత్ర వసూళ్ల వ్యవహారంలో ఐటీ శాఖకు పన్ను చెల్లించలేని కారణంగా ఆదాయశాఖ అధికారులు ఇటీవల ఈ చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయం, నిర్మాతల ఇళ్లు, నటుడు విజయ్కు చెందిన ఇళ్లు, ఫైనాన్సియర్ అన్బుచెలియన్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ ఇల్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అన్బుచెలియన్ ఇళ్లు, కార్యాలయంలో రూ.77 కోట్లు, రూ. 300 కోట్ల విలువైన పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ వ్యవహారంలో ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్, అన్బుచెలియన్, సుధాకర్లకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సినామా షూటింగ్లో బిజిగా ఉండడంతో ఆయన ఆడిటర్ మంగళవారం నుంగంబాక్కంలోని ఐటీశాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులకు వివరణ ఇచ్చారు. కాగా బుధవారం ఏజీఎస్ సంస్థ నిర్వాహకురాలు, ఆ సంస్థ అధినేత అఘోరం కల్పత్తి కూతురు అర్చన ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె బదులిచ్చినట్లు తెలిసింది. కాగా డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ తరపున ఆయనకు సంబంధించిన వ్యక్తి హాజరయ్యారు. ఫైనాన్సియర్ అన్బుచెలియన్ మాత్రం ఇంకా ఐటీ అధికారుల ముందుకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసినట్లు సమాచారం. దీంతో అన్బుచెలియన్ లేదా ఆయన తరపు వ్యక్తి గురువారం ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: విజయ్కి ఐటీ శాఖ సమన్లు) -
స్వచ్ఛమైన ప్రేమ
స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమలను, ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అనుబంధాలను, మానవ సంబంధాలను మిళితం చేసి తెరకెక్కించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. టైటిల్ రోల్స్లో సీనియర్ నటి అన్న పూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా, సీనియర్ నటి జమున ఒక కీలక పాత్రలో బాలదిత్య, అర్చన హీరో, హీరోయిన్లుగా నటించారు. నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించారు. ‘‘ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నాం. కొంతమంది మిత్రుల, శ్రేయోభిలాషుల సలహా మేరకు ఈ చిత్రాన్ని అమృత, ప్రణయ్లకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు ఎం.ఎన్.ఆర్. చౌదరి. శివనాగేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘ఇందులో వైకుంఠపురం అనే గ్రామానికి చెందిన జమిందారిణి అక్కినేని అన్నపూర్ణమ్మగా అన్న పూర్ణమ్మ నటన హైలైట్. మనవడి పాత్రకు మాస్టర్ రవితేజ ప్రాణం పోశాడు. అక్కినేని అనసూయమ్మగా జమున అలరిస్తారు. ఇక మిర్యాలగూడలో వాస్తవంగా జరిగిన అమృత, ప్రణయ్ ప్రేమకథలో బాలాదిత్య, అర్చనలు నటించారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ఓ హైలైట్’’ అన్నారు. -
ఒక్కటయ్యారు
సినీ నటి అర్చన(వేద) వివాహం పారిశ్రామికవేత్త జగదీష్తో హైదరాబాద్లో జరిగింది. గురువారం తెల్లవారుజామున 1.30 గంటలకు వీరి పెళ్లి ఘనంగా జరిగింది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, ‘కళాబంధు’టి. సుబ్బరామిరెడ్డి, నటుడు మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సురేష్ కొండేటి, డైరెక్టర్ ఓంకార్, నటీనటులు మంచు లక్ష్మి, మధుమిత, ఆలీ, శివబాలాజీ, సమీర్, అశ్విన్బాబు, రవిశంకర్, యాంకర్ సుమతో పాటు పలువురు సినీ ప్రముఖులు పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. -
హీరోయిన్ పెళ్లి; అదరగొట్టిన సంగీత్
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ అర్చన(వేద) పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. బంధు మిత్రులతో పాటు వధువు, వరుడు హుషారుగా నృత్యాలు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వధూవరులకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఓ ప్రముఖ హెల్త్కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు హైదరాబాద్లో అర్చన వివాహం జరగనుంది. 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ ఉంటుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. నేను సినిమాతో 2004లో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. సరైన విజయం దక్కపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్బాస్ సీజన్-1 కంటెస్టెంట్గా పాల్గొని ప్రతిభ చాటుకుంది. టీవీల్లో పలు డ్యాన్స్షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. -
బిర్యానీ బేబీస్ అర్చన, మధుశాలిని
-
‘సూత్ర’ బ్రోచర్ ఆవిష్కరణ
-
నటి అర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్
హీరోయిన్ అర్చన(వేద) పెళ్లి ముహుర్తం ఖరారైంది. నవంబర్ 13న ఆమె వివాహం జరుగనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఓ ప్రముఖ హెల్త్కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో ఇటీవల అర్చన నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక జగదీశ్-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం సాగుతున్నట్లు వార్తలు వినిపించిన విషయం విధితమే. 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్బాస్ సీజన్-1 కంటెస్టెంట్గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా వివాహంతో ఆమె రెండో ఇన్సింగ్స్ను ప్రారంభించబోతోంది. -
ఘనంగా హీరోయిన్ నిశ్చితార్థం
హీరోయిన్ అర్చన(వేద) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఓ ప్రముఖ హెల్త్కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్ భక్తవత్సలంతో అర్చన నిశ్చితార్థం గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై అర్చన-జగదీశ్లకు శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యంగా బిగ్బాస్ సీజన్-1 మిత్రులైన నవదీప్, శివబాలాజీలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక జగదీశ్-అర్చనల మధ్య గత కొద్ది కాలంగా ప్రేమాయణం నడుస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేసి త్వరలోనే శుభవార్త వింటారని అర్చన పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, 2004లో నేను సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసింది. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. అయితే తన అందం, అభినయంతో కుర్రకారు మనసులను దోచుకుంది. బిగ్బాస్ సీజన్-1 కంటెస్టెంట్గా పాల్గొని వార్తల్లో నిలిచింది. అయితే ఆ షో తెచ్చిన ఫేమ్ ఆమె సినిమా కెరీర్కు అంతగా ఉపయోగపడలేదు. తాజాగా సప్తగిరి హీరోగా నటించిన వజ్రకవచధార గోవిందా అనే చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్రను పోషించింది. పలు డ్యాన్స్షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఘనంగా అర్చన నిశ్చితార్థం
-
ఇండస్ట్రీలో నిర్మాతలది దైవస్థానం
‘‘మా సినిమాకి తొలిరోజు మిక్డ్స్ టాక్ వచ్చింది. తర్వాత వెంటనే యావరేజ్ అన్నారు. చిన్నవాళ్లం.. అందరూ ఆశీర్వదించండి. మరిన్ని సినిమాలు చేసేలా ప్రోత్సహించండి’’ అని సప్తగిరి అన్నారు. ఆయన హీరో గా, వైభవీజోషి కథానాయికగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. అర్చన కీలక పాత్రలో నటించారు. అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర, జి.ఎన్.రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన సక్సెస్మీట్లో సప్తగిరి మాట్లాడుతూ– ‘‘మన బడ్జెట్ను, మన టార్గెట్ను రీచ్ అయ్యామని డిస్ట్రిబ్యూటర్ బ్రహ్మయ్యగారు చెప్పడంతో హ్యాపీ. పరిశ్రమలో నిర్మాతలది దైవస్థానం. మా నిర్మాతలు జి.ఎన్.రెడ్డి, నరేంద్రగారికి ధన్యవాదాలు. సెకండాఫ్లో 10 నిమిషాలు తగ్గిస్తున్నాం. ఇక 100 శాతం గ్రాండ్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా భారీ హిట్ అవ్వాలని మేం కోరుకోలేదు. కానీ మా శ్రమకు తగ్గ ప్రతిఫలం కావాలని మాత్రం కోరుకున్నాం.. అది దక్కినందుకు అందరం తృప్తిగా ఉన్నాం. సప్తగిరిలాంటి హీరోను నమ్ముకుంటే కచ్చితంగా 200 కుటుంబాలు బతుకుతాయి’’ అన్నారు నిర్మాత నరేంద్ర. ‘‘వజ్ర కవచధర గోవింద’ సినిమాని 400 థియేటర్లలో విడుదల చేశాం. 2 రోజులకు రూ.90లక్షల గ్రాస్ వసూలు చేసింది’’ అన్నారు బ్రహ్మయ్య. ‘‘కాలేజ్, స్కూల్ ఓపెనింగ్ టైమ్లోనూ మా సినిమా ఇంత బాగా ఆడుతోంది. థియేటర్లలో జనాలు నవ్వుతుంటే ఆనందంగా ఉంది’’ అని అరుణ్ పవార్ అన్నారు. ‘‘ఈ సినిమాలో నల్లూరి ప్రసన్నలక్ష్మీ అనే ఎమ్మెల్యేపాత్ర చేశాను’’ అన్నారు అర్చన. -
తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డ హీరోయిన్
ప్రముఖ మలయాళ హీరోయిన్ అర్చన కవి పెను ప్రమాదం నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నారు. కొచ్చిలో ఆమె కారులో ప్రయాణిస్తున్న సమయంలో మెట్రో శ్లాబ్ ఆమె కారుపై పడింది. దీంతో కారు అద్దలు పగిలిపోవడమే కాకుండా.. చిన్న కాంక్రీట్ ముక్క కారులోకి చొచ్చుకువచ్చింది. అయితే అదృష్ణవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ఈ ఘటనపై అర్చన ట్విటర్ వేదికగా స్పందించారు. కారు డ్రైవర్కు నష్ట పరిహారం అందజేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మేము కారులో ఎయిర్పోర్ట్కు వెళ్తున్నప్పుడు కాంక్రీట్ శ్లాబ్ మా కారుపై పడింది. కొద్దిపాటిలో మేము ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. కారు దెబ్బతినందుకు గాను డ్రైవర్కు నష్ట పరిహారం అందజేయాల్సిందిగా కొచ్చి మెట్రో, కొచ్చి పోలీసు అధికారులను కోరుతున్నాను. ఈ ఘటనపై విచారణ జరపడమే కాకుండా.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల’ని అర్చన ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, పలు మాలయాళ చిత్రాల్లో నటించిన అర్చన.. తెలుగులో మధుర శ్రీదర్ దర్శకత్వం వహించిన బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంలో నటించారు. -
సాయి చెప్పిన స్వీయకథ
బంగారపు నగని ఎలా సరైన పెట్టెలోనే భద్రపరుస్తారో గొప్పవిలువైన మంత్రాన్ని ఎలా శక్తి సంపూర్ణంగా నిండిన రోజున మాత్రమే ఎలా ఉపదేశిస్తారో అలా ఈ పాదుకాప్రతిష్ఠని ఎప్పుడు చేయవలసిందిగా సెలవునిస్తావో చెప్పవలసిందని సాయిని అడగ్గానే ఆయన – ‘శ్రావణపూర్ణిమనాడు సరిగ్గా 11 గంటలకు’ అని ఆజ్ఞాపించారు.సరిగ్గా 11 గంటలకి ప్రతిష్ఠ చేసేందుకు వీలుగా దీక్షిత్ తన శిరసు మీద ఆ పవిత్రపాదుకలని పెట్టుకుని పవిత్రమైన ఖండోబా మందిరం నుండి బయలుదేరగానే భక్తుల సాయినామస్మరణతో దిక్కులు మార్మోగిపోసాగాయి.శివుడు పరశురామునికి యుద్ధవిద్యని నేర్పుతూ ఉన్న కాలంలో శంకరుని చేతిలో ఉన్న గొడ్డలికి సంబంధించిన ఓ ఇనుపముక్క నేలనపడింది. దాన్ని శివుడు ఓ అయఃఖండాన్ని (ఇనుపముక్కని) పరశురామునికే ఇచ్చేశాడు ఈ సంఘటనకి గుర్తుగా.అలాఇనుపముక్క తెగిపడ్డ గొడ్డలి కల ఆ శంకరుణ్ణి ‘ఖండపరశుడు’ అని అప్పటినుండే పిలిచారు. ఆ ఖండపరశుణ్ణే మరాఠీ భాషలో ’ఖండోబా’ అని పిలుస్తారు. అంతటి శివశక్తి నిండిన గ్రామదేవతాశక్తికూడా నిండిన (శంకరుడు అర్థనారీశ్వరుడు కదా!) ఆ ఆలయం నుండి పాదుకలని ద్వారకామాయికి తెచ్చారు ఊరేగింపుగా.సాయి వద్దకి ఆ పాదుకలు రాగానే ఆయన తన చేతితో వాటిని స్పృశించి (తన తపశ్శక్తిని ఆ పాదుకలలోనికి ప్రవహింపజేయడానికి సంకేతం అది) ఇవి శ్రీహరి పాదాలు. దైవచరణాలు.. అన్నాడు.మేళతాళాలతో భజన కీర్తనలతో బాజా భజంత్రీలతో అగరు «ధూపాలతో చందనపు నీటి చల్లులతో కర్పూరపు హారతులతో ఆ ప్రదేశం వర్ణించడానికి వీల్లేనంత గొప్పదిగా అనిపించింది అందరికీ.(శాలివాహన శకం 1834 – క్రీ.శ 1912)ఇప్పటికీ గురుశుక్రవారాల్లో విశేషార్చనలు సాగుతూంటాయి పాదుకలకి. ప్రతి రోజూ అర్చన – ఊదీ వితరణ (భస్మప్రసాదం) ఉంటూనే ఉంటుంది. పాదుకల్లో ఉన్న శక్తి అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి తప్ప చెప్తే అర్థమయ్యేది కానే కాదు. ‘ఏదైనా తినడానికి పెట్టనామ్మా?’ అని సంతానం గనుక అడిగితే – ‘అయ్యో! వాళ్లు అడిగే దాకా వాళ్ల ఆకలిని చూడలేకపోయా’ అనే ఒకింత బాధతోనూ, ఇంకా నయం! నేను ఇంట్లో ఉండగానే అడిగారు’ అనే మరింత ఆనందంతోనూ ప్రతి తల్లీ ఎలా వాళ్లకిష్టమైన తినుబండారాన్ని చేసి కడుపునింపుతుందో, అలా సాయికి కూడా మసీదు నిండుగా భక్తులుండి – ఏదైనా చెప్పవూ సాయీ! అనడిగితే చెప్పలేని ఆనందం ఆయనకి. ఇదీ అదీ చెప్పచ్చూ చెప్పకూడదూ ఇది సమ్మానం, అది అవమానకర సంఘటన అనుకోకుండా తట్టిన విశేషాలని యథార్థంగా జరిగిన వాటిని కళ్లకి కట్టినట్టుగా చెప్పేస్తాడాయన. అందరికీ సాయంటే ఇష్టం ఇందుకే. సాయికి కూడా వాళ్లంటే వాత్సల్యం, అభిమానం అందుకే! అలా సాయే చెప్పిన తన కథని అనుకుందాం! నాలుగే మార్గాలు ఓ సారి మేం ఓ నలుగురం మాత్రం– అసలు ఈ సృష్టేమిటి? బ్రహ్మపదార్థమేమిటి? బ్రహ్మజ్ఞానమేమిటి? ఈ రహస్యాన్ని స్వయంగా సాధించేసి – దీని గురించిన ఏ అవగాహన లేని ఎందరికో చాలా తేలికగా అర్థమయ్యేలా వాళ్ల వాళ్ల అనుభవానికి వచ్చేసేలా చేసేద్దాం! మనుకుంటూ బయల్దేరి ఓ నిర్జన (ఏ జనమూ ఉండని) వనానికి వెళ్లిపోయాం.ఈ తోవలో నలుగురం నాలుగు మార్గాలని – ఆ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నుకున్నాం! మొదటివాడు – ఎవరో మనని ఉద్ధరిస్తారనుకోవడం శుద్ధభ్రమ. కాలయాపన(కాలక్షేపం) మాత్రమే. మోక్షం కోసం ఎవరినో ఆశ్రయించడం కంటే మనని మనమే ఉద్ధరించుకోగల ప్రయత్నాన్ని ప్రారంభిస్తే చాలు మనం ఉద్ధరింపబడతాం! ఇదే నిజమైన మార్గమంటూ కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు కదా!(ఉద్ధరే దాత్మనాత్మానమ్) అన్నాడు.వెంటనే రెండవవాడు – అసలు అన్నింటికీ కారణం మననందరినీ మంచివైపుకీ చెడువైపుకీ నడిపిస్తూ ఏ మాత్రమూ కనిపించని మనసు మాత్రమే. కాబట్టి మంచిపనికీ (సంకల్పానికీ) ద్రోహం, వంచన, అసత్యం, దర్పం... (వికల్పానికీ) లాంటి వాటిని చేయడానికీ మూలం మనసు మాత్రమే కదా! మూలం అవుతోంది. దాన్ని కాస్తా స్వాధీనం చేసుకోగలిగితే – పులిని బంధించేసిన పక్షంలో అడవి కూడా మన సొంతిల్లులాగా ఎలా తిరగడానికి సాధ్యమైపోతుందో ఆ కారణంగా మనఃస్వాధీనం సరైనదన్నాడు. ఈ ఇద్దరిదీ విన్న మూడవవాడు – ఈ కనిపించే చెట్టూ పుట్టా పదార్థం కాస్తా ప్రళయం వచ్చినప్పుడు మొత్తం ప్ర+లయం(ఒకదానిలో లీనం) అయిపోతుందో ఆ కారణంగా ఇదంతా అనిత్యం. ముగ్గులేసేవాడు ఓ మంచి బొమ్మనిగీస్తాడు. పెద్ద గాలొచ్చినా వానొచ్చినా లేక వానికి వాడే చెరిపేసినా అంత రాజుగారూ కోటా ఏనుగులూ రాజధాని.. అంతా హుష్కాకీయే కదా! అందుచేత ఈ ప్రపంచాన్ని నిత్యంగా భావించకుండా ఎప్పుడో ఒకప్పుడు పోయేవాళ్లమే– అనే నిర్వేదంతో వైరాగ్యంతో ఉంటే చాలు మోక్షం బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందన్నాడు.నాల్గవవాడు – పుస్తకాలని చదివీ లోకజ్ఞానాన్ని దానికి మేళవించీ కాలాన్ని వెచ్చిస్తూ అనుభవాన్ని గడిస్తూ నిత్యం దైవాన్ని గూర్చిన అనుష్ఠానాన్ని (జపం ధ్యానం ఉపాసన తపస్సు అర్చన అభిషేకం...) గనుక చేస్తూ ఉంటే బ్రహ్మజ్ఞానం మోక్షం మనకి తప్పక లభిస్తుంది. ఎలా ఒక సుందరభవనంలోనికి ప్రవేశించాలంటే ఆ భవనానికి సంబంధించిన తాళపు చెవి అవసరమో, అలాంటివాడవుతూ ఉపాయాలని బోధించగల గురువుని ఎన్నుకోవడం అతిముఖ్యం. ఆయనంటూ మనకి దొరికాక ఈ శరీరాన్ని మనసునీ దాన్ని అదుపు చేయగల బుద్ధినీ ఆ గురువుకి ‘శరణాగతి’ విధానంతో సమర్పించేసుకుని – ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తూ వెళ్లే చాలు – మోక్షం దానంతటదే సిద్ధిస్తుందన్నాడు. ఇలా గురువుని ఆశ్రయించినప్పుడు మాత్రం ఆయన మీద స్థిరమైన విశ్వాసం, దానికి తోడుగా ఓపిక (సహనం) అనేవి అవసరమని కూడా చెప్పాడు. అయితే ‘ఆ గురువు వివాదరహితుడూ ధనాభిలాషీమాయావీ... వంటివాడనే విమర్శలకి గురైనవాడేమో గమనించుకుని అలా కానివాడైన పక్షంలోనే అతడ్ని ఆశ్రయించాలని కూడా చెప్పాడు. ఇలానే తర్కవితర్కాలు చేసుకుంటూ మొత్తానికి ఆ వనంలో తిరగడం ప్రారంభించాం బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే అన్వేషణలో మహానుభావులకీ కనిపించిన ఏదైనా దివ్యమార్గం మహాపురుషదర్శనం ఆత్మజ్ఞానం కలుగుతుందేమోనని అడుగు మీద అడుగేసుకుంటూ ఆగకుండా తిరుగుతూనే ఉంటే క్రమంగా మేం వనం నుండి కీకారణ్యంలోకి వెళ్లిపోయాం. ‘ఇలాంటి ప్రదేశాల్లోనే దివ్యపురుషుల దర్శనమవుతుందనుకుంటూ నలుగురం వెళ్తున్నామన్నమాటే గాని ఆకలీ దప్పికా కారణంగానూ శారీరకశ్రమ కారణంగానూ ఓపిక పూర్తిగా నశించింది. నిర్వేదస్థితిలో ఉన్నా బలాన్ని కూడగట్టుకుని వెళ్తున్నాం.‘ఎవరు మీరు? ఎక్కడి కెళ్తున్నారు? ఏం కావాలని వెదుకుతున్నారు? తోవ తప్పారా? తోవ చెప్పనా?’ అంటూ ఓ వంజరి (అడవిలో తిరుగుతూ పక్షుల్ని కొట్టి జీవిస్తూ ఉండే వ్యక్తి) అడిగాడు నలుగుర్నీ. మా అంతటి జ్ఞానం లేని అతనికి మా ధ్యేయం చెప్పడమెందుకని భావించి మళ్లీ ముందుకే ఆశానిరాశలతో సాగిపోబోతుంటే – ‘దట్టమైన అడవి ఇది. ఇక్కడైతే నేనున్నా గాని ఆ మీదట మీకు దారీ తెన్నూ చెప్పేవాడు కూడా ఉండడు. పైగా ఎండ మండిపోతోంది. శోషవచ్చి పడిపోతే... ఆలోచించుకోండి! కొంతసేపు కనీసం విశ్రాంతైనా తీసుకోండి. నీళ్లుతాగి మీకు కావలసిందేమిటో వెతుక్కునే ప్రయత్నం చేసుకోండి’ అంటూ తాను చెప్పవలసింది చెప్పాడు. మా నలుగురికీ మాకు మేమే సాధించుకోగలమనే అహంకారముంది కదా! మీరు సమాధానం కూడా చెప్పకుండా మరింతగా ఓపిక కూడగట్టుకుని తిరుగుతూ తిరుగుతూ మళ్లీ అతని కంటనే పడ్డాం! అతను ఈసారి ఓ నవ్వు నవ్వి– ‘భగవంతుని సంకల్పం లేనిదే దేనికోసం వెతకాలో తెలియదు. ఎక్కడ వెతకాలో కూడా తెలియదు. తిండిలేని ఈ నీరసశరీరంతో దాహంలో నాలుక పిడచగడుతున్న నోటితో ఇంకా ఇంకా తీవ్రత పెరుగుతున్న ఎండలో ఏం తిరుగుతారు? పైగా తెలిసి ఉన్న చోటుకి కాదుగా మీరు వెళ్తున్నది! అంటూ అందరికీ సరిపడిన అన్నాన్ని తినండన్నాడు. మిగిలిన ముగ్గురూ మాత్రం దాని వైపుకి చూడను కూడా చూడకుండా వెళ్లిపోయారు. నాకు మాత్రం ఆలోచనలు రాసాగాయి. అన్నం పరబ్రహ్మస్వరూపం కదా! అదీ కాక విష్ణువుకున్న పేర్లలో అన్నమే అనేది ఒకపేరు ఆయనకి. అంతేకాక ‘అన్నాద’ (అన్నాన్ని తింటూండేవాడు) అని కూడా ఆయన పేరే కదా! (అన్నమన్నాద పవ చ. సాయికి గీత శ్రీవిష్ణు సహస్రనామాలూ వచ్చుననే విషయం నాలుగైదు సంఘటనల్లో స్పష్టంగా తెలుస్తుంది. వాటిలో ఇదొకటి) స్వార్థం లేకుండా , మా ఆకలిదప్పికలని గమనించి ఓ తల్లిలా పిలిచి అన్నాన్ని పెడుతూ ఉంటే ఇటు ఆధ్యాత్మికంగానైతే హరిని తిరస్కరించినట్లూ అటు లౌకికంగానైతే ఆతిథేయుడ్ని (ఆతిథ్యం ఇచ్చేవాడు) అవమానించినట్లూను అని భావించి అతనిచ్చిన నీరు తాగి ఆహారాన్నితిన్నాను. అది శిక్ష అనిపించలేదు అలా ఆకలి దప్పికలని అతను తీర్చాడో లేదో వెంటనే ఇద్దరు కనిపించారు హఠాత్తుగా నన్ను ఎక్కడికో తీసుకెడతామన్నట్టుగా చేతిని పట్టుకుని వెళ్తూ అప్పటికప్పుడు ప్రత్యక్షమైన గురుమహారాజ్కి అప్పగించారు. గురుమహారాజ్ అంటే అన్ని సందేహాలనీ తీర్చేయగల శక్తిమంతుడని అర్థం. గంభీరకంఠస్వరంతో.. ‘ఎందుకొచ్చారు మీ నలుగురూ? ఏం కావాలనుకున్నారు? వెదుకులాటæ ఎంత వరకొచ్చింది?’ అని అడిగాడు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఆయనకాయనే అన్ని విషయాలనీ దాదాపుగా చెప్పేసేస్తూంటే! నేను మొత్తం చరిత్రని వివరించాను. అంతా తనకి తెలుసున్నట్లుగా విన్నాడాయన. అందుకే ఆశ్చర్యపడలేదు. మమ్మల్ని గురించి వ్యతిరేకధోరణితో మాట్లాడలేదు.‘సరే! నా మాటని తు. చ. తప్పకుండా పాటిస్తావా? నీ వెతుకులాట ముగిసేలా చేసి నీ ప్రయత్నాన్ని సఫలం చేస్తాను. ఇది నీ అంగీకారమైతే నాతోరా!’ అంటూ తన వెంట నన్ను తీసుకువెళ్లిపోయాడు కొంతదూరానికి. అక్కడ నా చేతులూ కాళ్లూ కట్టేసి పెద్దలోతైన బావి నాకు కిందుగా ఉండేలా చేస్తూ నన్ను నూతి గిలక (కప్పీ – నిలువుగా ఉంటూ గుండ్రంగా తిరిగే చక్రం) మీదుగా నన్ను కట్టిన తాడుని ఓ చెట్టు కొమ్మకి తాను కాస్తా నాకు అతని ముఖం కనిపించకుండా ఉండేలా అటు తిరిగి కూర్చున్నాడు.కాసేపయ్యాక అతనంతట అతనే తిరిగొచ్చి! ఎలా ఉన్నావు? ఏమనిపిస్తోంది? అంటూ నా శరీరాన్ని కన్నతల్లిలా ప్రేమ అనురాగ వాత్సల్యాలతో నిమిరి ఒడ్డుకి తెచ్చి కట్లు విప్పాడు.నిజానికి నాకు మాత్రం అదొక శిక్షలా అనిపించలేదు. అలా వేలాడుతున్నంత సేపు ఆ గురుమహారాజ్ మీద మాత్రమే దృష్టి అంతా. అతని రాకమీదనే మనసంతా. అలా కట్టువిప్పాక ఆయన పాదాలమీద పడుతూ ఉంటే నాకు అనిపించింది. తల్లిపక్షి ఎలా తన పిల్లని లోకం కనిపించకుండా రెక్కల్లో దాచి పక్షిబాల్యంలో రక్షిస్తుందో, కోతి ఎలా తన పిల్లని పడకుండా చూసుకుంటూ చెట్లూ గోడలూ ఇంటి మీది నుండి మరో ఇల్లూ దూక్కుంటూ వెళ్తుందో ఆవు ఎలా అప్పుడే పుట్టిన దూడని తన నాలుగుకాళ్ల మధ్యా నిలచెట్టుకుని గర్భవతి అయిన తనకి ఓపిక లేకున్నా ఎలా రక్షించుకుంటుందో... అలాగ. శరీరమంతా పులకలెత్తింది. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఏం కావాలి? అప్పుడు గురుమహారాజ్ నా ఒళ్లంతా నిమురుతూ... ‘నాన్నా! (ప్రేమపూర్వకమైన పిలుపు) నీకేం కావాలని ఆ సమయంలో అనిపించింది? ఆ కాలంలో దేని మీద నీ బుద్ధి నిలిచిపోయింది? ఏం చేస్తూ ఉండిపోయావు?’ అని అడిగాడు. ఆనందాశ్రువులు అలా రాలుతూ ఉండగా చెప్పాను – ‘గురూత్తమా! నాకెవరూ మరొకరు దిక్కులేరు. ఈ గురుమహారాజ్ మాత్రమే నాకు దిక్కు. ఆయనొచ్చి కట్లువిప్పితే చాలు. ప్రాణం నిలుస్తుంది. బతికి బట్టకడతాను. అయినా నా శరీరం మొత్తం ఆయనదే! అనుకుంటూ నిన్నే ధ్యానిస్తూ ఉండిపోయాను’ అన్నాను. అవి హృదయంలో నుండి వచ్చిన మాటలు కాబట్టి గురుమహారాజ్ కూడా ఆ మాటల్ని నమ్మాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు మాట్లాడినా అవి నాలుక చివరి నుండి వచ్చిన మాటలా? కాదా? అనే విషయం స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. ఆ స్థాయిలో కూడా అబద్ధాన్నే మాట్లాడుతూ ఉంటే ముఖం అంటే కళ్లు మాత్రం నిజాన్ని కక్కేస్తాయి చూపుల ద్వారా. అంతే! గురువు వెంట మూగవాడిగా నడుస్తూ కదిలిపోయాను ఆయన అడుగులో అడుగువేసుకుంటూ. గురువుల్ని గుర్తించండి! భక్తులారా! నన్ను ఆ గురుమహారాజ్ గారి వద్దకి తీసుకెళ్లిన ఇద్దరూ నా తల్లిదండ్రులకి సంకేతమన్నమాట. తల్లీ తండ్రీ అనే వాళ్ల కర్తవ్యమేమంటే తమ సంతానాన్ని సరైన గురువు వద్దకి చేర్చడమే. ఇక ఆ గురువు కర్తవ్యమేమంటే ఈ శిష్యుడ్ని తన పుత్రునితో సమానంగా చూసుకుంటూ ఉండటమే. బంగారాన్నైనా సరే మంటలో వేసి కొద్దిపాటి రాగిని కలపకుండా సుత్తితో కొట్టకుండా ఉన్న పక్షంలో అలాగే గరుకుగా ఉండే ఆకురాతితో గీరకుండా అవసరమైతే సానపట్టకుండా అనుకున్న నగగా మారగలుగుతోందా? మదించిన ఏనుగునైనా సరే తోవలో గోతిలో పడేలా చేయకుండా, ఓ వారం రోజుల పాటు తిండి పెట్టకుండా ఉంటే అది మావటివాని మాట వింటుందా? అలాగే గురువు కూడా కొన్ని పరీక్షలకి గురి చేస్తాడు శిష్యుడ్ని. కేవలం అతడ్ని ఓ ప్రయోజకుడిగా చేయాలనేదే అతని లోనిభావం. పండితులుంటారు లోకంలో. వాళ్లది విజ్ఞాన గర్వం. అంత చదువుకున్నాను. ఇంత చదువుకున్నాననే అహంకార భావం. అంతే కాక ఒకరు చెప్పిందాన్ని ఎలా ఖండించి అవతలివాడ్ని ఓడిద్దామా? అనే కండవాతి తప్పు. ఈ తీరు గురుత్వం వాళ్లలో ఉండదు. వాళ్లకి నచ్చదు. అవసరం కూడా లేదు వాళ్లకి. ఇక మరికొందరుంటారు గురువులు. ఎంతమటుక్కు మహిమల్ని ప్రదర్శించి బేలతనపు భక్తుల్ని నమ్మించడం సొమ్ము కాజేయడం శరీరం నిండుగా బంగారాన్ని ధరించి ఆకర్షించడం... వంటివి వారి లక్షణాలు. పొద్దుటి నుండి రాత్రి నిద్రించబోయే వరకూ ధనసంపాదనకి సంబంధించిన మార్గాలనీ ఉపాయాలనీ దైవం వంకతో చేస్తూ శిష్యవిత్తాలని (శిష్యులసొమ్ముని) అపహరించడమే వాళ్ల లక్ష్యం. ఇలాంటి వారిని సేవిస్తే పవిత్రమైన విలువైన సమయమంతా గడిచిపోయి ఏ తీరు సాధనా లేకుండా శరీరం కాస్తా మరణిస్తుంది. అప్పుడు చింతించే వీలు కూడా ఉండదు. ‘కాబట్టి గురువు మందలించినా అరిచినా తిట్టినా రౌద్రంతో కనిపించినా అదంతా శిష్యుడ్ని తోవలోనికి తేవడానికి మాత్రమే అనే దృష్టితోనే సుమా!’ అని ఓ క్షణం ఆలోచనా దృష్టిని మరల్చిగాని చూసుకుంటే నిజగురువులెవరో.. అధర్మ, అసత్య, వంచన గురువులెవరో..ఇట్టే బోధపడిపోతుంది. కోయిలా కాకీ గుడ్డు దశలో ఒకలానే ఉంటాయి. గుడ్డు పగిలి పిల్ల బయటికొచ్చాక గొంతు విప్పితే చాలు ఆ కంఠస్వరంతో కాకీ కోకిలల తేడా మనకి ఎవరూ చెప్పనక్కర్లేకుండా అర్థమైపోతుంది.గురువుకి శిష్యుల మనసునీ బుద్ధినీ ఆకర్షించగల సత్యధర్మప్రవర్తన ఉండాలి తప్ప వస్త్రాలంకారాలు కాదు ప్రధానం. ఆ అరణ్యంలో అన్నాన్ని ఆ ‘వంజరి’ పెట్టినట్టుగా మీ శిష్యులు అన్నాన్ని (వరి, గోధుమలు, జొన్నలు, రాగులు..) పెడితే చాలు అదే గురువుకి పంచభక్ష్యపరమాన్నాలు కాగలగాలి. గురువుకి శిష్యులే నిజమైన సంతానం కాబట్టి వాళ్లలో ఎవరికి రోగం వచ్చినా గురువే వైద్యుడు కావాలి. వాళ్లలో ఎవరికి సంసారంలో సమస్య వచ్చినా గురువే దాన్ని పరిష్కరించే న్యాయాధిపతి కావాలి. వాళ్లలో ఎవరికి ఆకలి దప్పిక పేదతనం, దారిద్య్రం, ఆత్మహత్యా ఆలోచనం... వంటివొచ్చినా కచ్చితంగా వాటికి నివారణని చేయవలసిన బాధ్యత గురువుదే. అలా చేయగల ఉండగల శక్తీ ఇష్టం తగిన సమయం ఉన్నప్పుడు మాత్రమే ‘గురువు’గా తనకి తాను ఉండగలనని అనుకోవాలి. భక్తులు కూడా అలాంటి వాడ్నే గురువుగా (ఎంతో పరీక్ష చేశాక) ఎన్నుకోవాలి.ఎలా ఆవుదూడని ఓ వంద ఆవుల మందలోకి పంపినా అన్ని ఆవుల్నీ దాటుకుంటూ తన తల్లి పొదుగులో మాత్రమే తలని పెట్టి కుడుచుకుంటుందో అదే మరి గేదె, మేక.. వంటివాటికి ఈ నిర్ణయశక్తి లేదో అలా గురువుగా ఒకరినంటూ ఎంచుకున్నాక అలాగే వారివద్దనే కొనసాగిపోవాలి తప్ప– వస్త్రాలని మార్చినట్లు గురువుల్ని కూడా మార్చుకుంటూపోతే చివరికి ఎవరి మీదా గురి కుదరక చుక్కాని లేని నావలా జీవితం మొత్తం ఎటుకో ఎటుకో వెళ్లిపోతుంది. ఒక జీవితం మొత్తం శూన్యం అయిపోతుంది. – సశేషం డా. మైలవరపు శ్రీనివాసరావు -
కష్టమంతా మరచిపోయాం
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చనా శాస్త్రి, ఆషిమా నర్వాల్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘జెస్సీ’. వి. అశ్వినికుమార్ దర్శకత్వంలో ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై శ్వేతాసింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్మీట్లో పీవీఆర్ సినిమా ఉదయ్ మాట్లాడుతూ– ‘‘జెస్సీ’ సినిమాకు ఇంత పెద్ద రేంజ్లో కలెక్షన్స్ వస్తాయని ఊహించలేదు. మల్టీఫ్లెక్స్లో ఒక్క షోతో స్టార్ట్ అయి, 7 షోలతో రన్ అవుతుంటే... వన్ షోతో స్టార్ట్ అయిన సింగిల్ స్క్రీన్స్ 4 షోలతో రన్ అవుతున్నాయి. మొదటి మూడు రోజుల్లో ప్రతి రోజూ కలెక్షన్స్ పెరుగుతూ వచ్చాయి’’ అన్నారు. ‘‘ఆడియన్స్ టాక్ విన్న తర్వాత మేం పడ్డ కష్టమంతా మరచిపోయాం. మాపై నమ్మకంతో పీవీఆర్ సినిమాస్ వారు సినిమాను విడుదల చేశారు. వారి నమ్మకం నిజమైంది’’ అన్నారు శ్వేతా సింగ్. ‘‘చిన్నగా విడుదలైన మా సినిమా హ్యూజ్ రెస్పాన్స్ను రాబట్టుకుంది’’ అని వి. అశ్వినికుమార్ అన్నారు. -
బైక్ రైడర్.. ఫుడ్ ‘డ్రైవ్’ర్
సాక్షి, సిటీబ్యూరో: ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా, ఇంట్లోవారి ఆలనాపాల చూస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఓ డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఔత్సాహిక మహిళలు, యువతులకు బైక్ డ్రైవింగ్లో శిక్షణనిస్తున్నారు. దిల్సుఖ్నగర్కు చెందిన అర్చన చిగుళ్లపల్లి ఓ పార్శం మాత్రమే ఇది. ఎంబీఏ చదివి ఎయిర్లైన్స్లో పనిచేశారు. ఐటీ కంపెనీలో సేవలందించారు. మార్కెటింగ్ మేనేజ్మెంట్లో తన సత్తా నిరూపించుకున్నారు. అయితే, ఆమె.. బైక్ రైడర్గా మారి నిరుపేదల ఆకలి తీర్చేందుకు ‘ఫుడ్ డ్రైవ్’ మొదలు పెట్టారు. ఒంటరిగా ప్రయాణిస్తూ ఎక్కడ పార్టీలు, వేడుకలు జరిగినా అక్కడ మిగిలిన పదార్థాలను సేకరించి కొన్ని ఎన్జీఓలతో కలిసి బస్తీల్లోని పేదలకు అందిస్తున్నారు. ‘చిన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన నా స్కూల్ ఫ్రెండ్ కోసం మా అమ్మ రెండు బాక్స్లు కట్టి ఇచ్చేది. మరొకరి ఆకలి తీర్చడం అప్పుడే అలవాటైంది. ఇప్పుడదే వ్యాపకంగా మారింది. ఏడాదంతా ఫుడ్ డ్రైవ్స్ చేస్తాను. 24/7 రెడీగా ఉంటాను’ అంటున్నారామె. బైక్ డ్రైవింగ్లో శిక్షణ ‘బైక్పై ఫుడ్ సేకరించడానికి వెళుతుంటే కొందరు ఆశ్చర్యపోతున్నారు. మహిళలు సహజంగా శక్తిమంతులు. అది బైక్ రైడింగ్లో నిరూపించవచ్చని నా నమ్మకం. అందుకే స్కూల్ డేస్ నుంచే ఆసక్తి ఉన్న మహిళలకు బైక్ నేర్పడం మొదలుపెట్టాను. ముఖ్యంగా చాలా మంది వర్కింగ్ లేడీస్కి ఫ్రీగా నేర్పించాను. బైక్ రైడింగ్ శిక్షణ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్ధులు నా దగ్గరకి వస్తుంటారు’ అని వివరించారు అర్చన. -
అక్కినేని అన్నపూర్ణమ్మ
అమ్మ పాత్రలనగానే గుర్తొచ్చే నటీమణుల్లో అన్నపూర్ణమ్మ ఒకరు. క్యారెక్టర్ నటిగా పలు పాత్రలు చేసిన ఆమె ప్రధాన పోషిస్తున్న తాజా చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. ఇప్పటివరకూ దాదాపు సాఫ్ట్ క్యారెక్టర్స్లో కనిపించిన అన్నపూర్ణమ్మ ఇందులో పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం.ఎన్.ఆర్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ అమరావతి పరిసర ప్రాంతాల్లో పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత చౌదరి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరిలో ఎవరికి ఏం జరిగినా రచ్చబండ దగ్గర పంచాయితీ చేస్తారు. ఈ రచ్చబండకు అక్కినేని అన్నపూర్ణమ్మ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారు. ఆమెకు ధీటుగా ఎదురెళ్లే వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటిస్తున్నారు. హీరోయిన్గా అర్చన నటిస్తుండగా, జీవ, రఘుబాబు, కారుమంచి రఘు, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేస్తున్నారు’’ అని చెప్పారు. -
ప్రభుత్వ అధికారులతో మంత్రిల బంతాట!
-
తప్పకుండా ఓటేస్తాను..
బంజారాహిల్స్: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలి. మన నేతలనుఎన్నుకోవడానికి ఓటు హక్కు మనకో మంచి అవకాశాన్ని కల్పించింది.ఇటీవల యువత ముందుకొచ్చి ఓటుపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం ఆహ్వానించదగ్గ విషయం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రతిఎన్నికల్లోనూ ఓటు వేయాలి. మంచి మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటేస్తాను. మీరు కూడా వేయండి. – అర్చన, సినీనటి -
మరో విభిన్న పాత్రలో
నటుడు విజయ్సేతుపతి ఎదుగుదల ఆశ్చర్య పరుస్తోంది. ఆయన కథలను ఎంచుకునే విధానం, ఆయా పాత్రల్లో వైవిధ్యం చూపడానికి పడే తపన, శ్రమ చూస్తుంటే, ఈ ఎదుగుదలకు విజయ్సేతుపతి అర్హుడే అని ఎవరైనా చెబుతారు. ఇటీవల ఆయన నటించిన 96 చిత్రం విమర్శకులను సైతం మెప్పించింది. తాజాగా విజయ్సేతుపతి నటిస్తున్న చిత్రాల్లో సీతకత్తి ఒకటి. ఈ చిత్రంలో ఆయన పలు గెటప్లలో కనిపంచనున్నారు. ముఖ్యంగా నటుడు కమలహాసన్ ఇండియన్ చిత్రంలో కనిపించిన తరహాలో 80 ఏళ్ల వృద్ధుడిగా నటించారు. ఆయనకు భార్యగా, జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటి అర్చన నటించడం మరో విశేషం. నటి అర్చన చాలా కాలం తరువాత నటించిన చిత్రం సీతకత్తి. నటి రమ్యనంభీశన్, పార్వతినాయర్, భాగవతి పెరుమాళ్, మౌళి తదితరులు ఇత ప్రధాన పాత్రల్లో నటించారు. ఫ్యాషన్ స్డూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను ముగించుకుని, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రం క్లీన్ యూ సర్టిఫికెట్ పొందినట్లు చిత్ర వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. బాలాజీ ధరణీధరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి అయ్య అనే సింగిల్ సాంగ్ ఇటీవలే విడుదలై సంగీత ప్రియులను అలరిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్సేతుపతి తాజా చిత్రం సీతకత్తిపైనా అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
కోళ్ల పరిశ్రమకు డిజిటల్ టచ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోళ్ల పరిశ్రమ అనగానే సీజనల్ బిజినెస్ అంటారు. గుడ్ల నుంచి మొదలుపెడితే కోడి పిల్లల పెంపకం, ఫీడింగ్, కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా ప్రతి దశలోనూ ఉష్ణోగ్రత, స్థానిక వాతావరణ ప్రభావితం చేస్తుంటాయి. ఏ మాత్రం తేడా వచ్చినా నష్టాలే. టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ కోళ్ల పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎందుకా అనిపించింది హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్–అర్చన దంపతులకు. అప్పటికే చేస్తున్న ఐటీ ఉద్యోగాలకు గుడ్బై కొట్టేసి ఎంఎల్ఐటీని ప్రారంభించారు. ఇదేంటంటే.. పొదుగు, కోడి పిల్లల ఉత్పత్తి, ఆహారం, శీతలీకరణ కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్.. ఇలా కోళ్ల పరిశ్రమలో ప్రతి దశలోనూ టెక్నాలజీ అందిస్తుంది. మరిన్ని వివరాలు ఎంఎల్ఐటీ కో–ఫౌండర్ అర్చన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది హైదరాబాద్. కస్తూర్బాలో ఎంఎస్సీ పూర్తయింది. పెళ్లయ్యాక ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాం. ఏడేళ్ల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చి కుటుంబ వ్యాపారమైన ఇండస్ట్రియల్ పరికరాల తయారీలో భాగస్వామినయ్యా. నట్లు, బోల్ట్ల వంటి ప్రతి ఉత్పత్తి తయారీని ప్రత్యక్షంగా పరిశీలించాల్సిన అవసరం లేకుండా ఉత్పత్తుల తయారీ, నియంత్రణ, నిర్వహణ సులువుగా ఉండేలా ఐఓటీ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేశా. ఈ ఐవోటీ పరికరం... ఉత్పత్తుల తయారీ సమయంలో ఉష్ణోగ్రత, ఒత్తిడి, వాతావరణ పరిస్థితులను నియంత్రిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే.. క్వాలిటీ మేనేజర్ పనంతా ఈ ఐఓటీ పరికరమే చేసేస్తుందన్నమాట! ఓ రోజు మా కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు సంబంధించిన ఓ హేచరీస్ ఇంక్యుబేటర్లో ఉష్ణోగ్రత పెరిగి గుడ్లు పాడైపోయాయని ఫోన్ వచ్చింది. దీన్ని మాతో చెబుతు నట్లు, బోట్ల తయారీలో ఉష్ణోగ్రతలను నియంత్రించినట్లే పౌల్ట్రీ పరిశ్రమలోనూ ఉంటే బాగుండనని అన్నారాయన. అలా ఎంఎల్ఐటీ కంపెనీకి పునాది పడింది. 2016లో రూ.60 లక్షల పెట్టుబడితో టీ–హబ్ కేంద్రంగా ప్రారంభించాం. కన్సైట్, పౌల్ట్రీమాన్ రెండు పరికరాలు.. ప్రస్తుతం ఎంఎల్ఐటీ నుంచి రెండు ఉత్పత్తులున్నాయి. మొదటిది కన్సైట్. దీన్ని బిగ్ డేటా, క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేశాం. కోళ్ల పరిశ్రమలో ఉష్ణోగ్రతల నియంత్రణతో పాటు ఫామ్ నిర్వహణ, విశ్లేషణ సేవలందించడం దీని ప్రత్యేకత. ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అన్ని ఫామ్లను రియల్ టైమ్లో నిర్వహించుకునే వీలుంటుంది. ధర రూ.60 వేలు. రెండోది పౌల్ట్రీమాన్. సెన్సార్లు, క్లౌడ్ టెక్నాలజీ అనుసంధానిత పరికరమిది. దీన్ని హేచరీలో అనుసంధానం చేస్తాం. మొబైల్ అప్లికేషన్స్తో ఎప్పటికప్పుడు ఇంక్యుబేటర్లోని ఉష్ణోగ్రత నివేదికలను చూడొచ్చు. ఏమాత్రం తేడా వచ్చిన అలెర్ట్ చేస్తుంది. ఏ దశలో సమస్య ఉందో కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. దీంతో నేరుగా సమస్యను పరిష్కరించవచ్చు. ధర రూ.15 వేలు. వార్షిక నిర్వహణ రుసుము 12 శాతం. పౌల్ట్రీమాన్కు పేటెంట్ ఉంది. సెప్టెంబర్ నుంచి సుగుణలో సేవలు.. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సేవలందిస్తున్నాం. దాదాపు 10 సంస్థలు మా సేవలు వినియోగించుకుంటున్నాయి. వీటిల్లో వంద వరకు ఇంక్యుబేషన్స్ ఉంటాయి. పెద్ద కంపెనీలతో మాట్లాడుతున్నాం. సుగుణ కంపెనీలో అన్ని విభాగాల్లోనూ పౌల్ట్రీమాన్, కన్సైట్ నిర్వహణ సేవలు సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది కాలంలో బెంగళూరు, కోయంబత్తూరు, కోల్కతాలకు విస్తరించనున్నాం. గతేడాది రూ.12 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఏడాది రూ.5 కోట్ల ఆదాయాన్ని, పౌల్ట్రీ పరిశ్రమలో 30 శాతం మార్కెట్ వాటాను లకి‡్ష్యంచాం. మా సంస్థలో ప్రస్తుతం 8 మంది ఉద్యోగులున్నారు. టెక్నాలజీ, సేల్స్ విభాగంలో మరో నలుగురిని తీసుకుంటున్నాం. దేశంలోని ప్రముఖ అగ్రిటెక్ వెంచర్ క్యాప్టలిస్ట్ నుంచి రూ.7 కోట్ల నిధులను సమీకరించనున్నాం. డీల్ 2 నెలల్లో పూర్తవుతుంది’’ అని అర్చన వివరించారు. -
భారత జూనియర్ సాఫ్ట్బాల్ జట్టులో అర్చన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల (టీఎస్డబ్ల్యూఆర్ఎస్)కు చెందిన విద్యార్థిని పైడి అర్చన గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ఆసియా జూనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు అర్చన ఎంపికైంది. ఫిలిప్పీన్స్లోని క్లార్క్లో మే 12 నుంచి 18 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆర్సీవో సింధు అర్చనను అభినందించారు. -
అరుంధతికి అఘోరాకి పోరు!
అర్చన మసలి ప్రధాన పాత్రలో తోట కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరుంధతి అమావాస్య’. శ్రీ కృష్ణ శంకర్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. వంశీధర్ సమర్పణలో కనమర్లపూడి కోటేశ్వరరావు నిర్మించారు. ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘అరుంధతికి, అఘోరాకి మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అమావాస్య రోజున ముగిసే ఈ పోరాటంలో ఎన్నో మలుపులు ఉంటాయి. ఈ సినిమాలో పాము కీలక పాత్ర పోషించింది. గ్రాఫిక్స్ సన్నివేశాలకు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. భారీ బంగ్లాలో చిత్రీకరించిన సన్ని వేశాలు హైలైట్గా ఉంటాయి’’ అన్నారు. ‘‘షూటింగ్ పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించారు’’ అన్నారు నిర్మాత. బేబీ కీర్తన, షకీలా, నిహారిక తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘనశ్యామ్. -
13 రోజుల్లో పూర్తి
1983లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘మర్లపులి’. డి.నరసింహా సమర్పణలో సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది. వరుణ్ సందేశ్ ప్రత్యేక పాత్రలో, అర్చన ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్ర గీతాలను మరో హీరోయిన్ భాను చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత, సంగీత దర్శకుడు బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘మా చిత్రదర్శకుడు రామకృష్ణ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. సస్పెన్స్ థ్రిల్లర్గా చిత్రం రూపొందింది. నా సంగీతంలో విడుదలవుతున్న ఈ చిత్రం పాటలు మంచి ప్రజాదరణ పొందుతాయని ఆశిస్తున్నా’’ అన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ – ‘‘13 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. తక్కువ సమయంలో అయినా మంచి క్వాలిటీతో తీశాం’’ అన్నారు.‘‘వరుణ్సందేశ్ పక్కన లీడు రోల్లో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు భాను. పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేశ్ నటించిన ఈ చిత్రానికి కెమెరా: యం.మురళీకృష్ణ. నిర్మాతలు: భీరం సుధాకర్ రెడ్డి, బి.భవానీ శంకర్, ఖమ్మం శ్రీను. -
థ్రిల్ ఫుల్
అమోఘ్ దేశపతి, అర్చన, శ్రేయావ్యాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘షాలిని’. షెరాజ్ దర్శకత్వంలో సాయి వెంకట్ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్లో జరిగింది. షెరాజ్ మాట్లాడుతూ– ‘‘సత్యనారాయణతో నాకిది రెండో సినిమా. కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పారు. ప్రతి క్షణం ఉత్కంఠ కలిగిస్తుంది. హారర్ ఇష్టపడే వారికి తప్పకుండా మా సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘సెప్టెంబర్ 1న సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అని అమోఘ్ దేశపతి అన్నారు. ‘‘ఈ చిత్రానికి ప్రధాన కేంద్రాల్లో థియేటర్లు ఇప్పిస్తా’’ అన్నారు ఆర్.కె. గౌడ్. -
భయం!
అమోఘ్ దేశపతి, అర్చన, శ్రేయా వ్యాస్ ముఖ్య తారలుగా షేరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శాలిని’. సాయి వెంకట్ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. సాయి వెంకట్ మాట్లాడుతూ– ‘హర్రర్, థ్రిల్లర్ అండ్ లవ్ ఎంటర్టైన్మెంట్ చిత్రమిది. ౖ టెటిల్ సాఫ్ట్గా ఉన్నా సినిమా మాత్రం భయపెడుతుంది. జూన్ మొదటివారంలో ఆడియో ప్లాటినమ్ డిస్క్ వేడుకను, రెండోవారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. షేరాజ్తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘ప్రతి సీన్ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. నవనీత్ చారి మంచి సంగీతం అందించారు’’ అన్నారు షేరాజ్. -
‘కూతురమ్మ’కు మంత్రి కేటీఆర్ అండ
- అర్చనకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం.. ఆర్థిక సాయం - డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామన్న మంత్రి - తల్లిదండ్రులకు నిమ్స్లో ఉచిత చికిత్సకు హామీ నిర్మల్ రూరల్: ఓ ‘కూతురమ్మ’గా తనను కన్నవాళ్లనే కన్నపిల్లల్లా చూసుకుంటున్న అర్చనకు తాము అండగా ఉంటామంటూ ఆపన్న హస్తాలు చాస్తూనే ఉన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం స్పందించా రు. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన పేదింటి బిడ్డ అర్చన దీనగాథను ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో ఈనెల 18న ‘కూతురమ్మ’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అనంతరం ఈనెల 21న సాక్షి టీవీలో ‘కంటే కూతుర్నే కనాలి రా..’శీర్షికన ప్రత్యేక కథ నాన్ని ప్రసారం చేసింది. పక్షవా తం వచ్చిన తండ్రి దుర్గారెడ్డి, అం ధురాలైన తల్లి పద్మలకు అర్చన చేస్తున్న సేవలు, మందుల కోసం బియ్యం అమ్ముకుంటున్న పేదరికాన్ని.. ఓ ఆడపిల్లగా సమాజం నుంచి ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లను ‘సాక్షి’ కళ్లకు కట్టించింది. అర్చన దీనగాథ కు ఖండాంతరాల నుంచి విశేష స్పందన వస్తోంది. స్పందించిన మంత్రి కేటీఆర్.. సాక్షి మీడియాలో వచ్చిన కథనాలతో స్పందించిన రాష్ట్ర మంత్రి కేటీఆర్ నాలుగురోజుల క్రితం తన పర్సనల్ సెక్రెటరీ ద్వారా అర్చనకు ఫోన్ చేయిం చారు. ఈ క్రమంలో అర్చన సన్నిహితులతో కలసి బుధవారం ఉదయం హైదరాబాద్లోని సచివాలయానికి వెళ్లారు. ఇదేరోజు ఉస్మానియా వర్సిటీ వందేళ్ల ఉత్సవానికి రాష్ట్రపతి రావడంతో మంత్రి కేటీఆర్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. అర్చనను కలుసుకోవడం వీలుకాకున్నా.. తన పర్సనల్ సెక్రెటరీ ద్వారా విషయాలు తెలుసు కున్నారు. అర్చనకు నిర్మల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, డబుల్బెడ్రూం ఇల్లుతోపాటు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆమె తల్లిదండ్రులు పద్మ, దుర్గారెడ్డిలకు నిమ్స్లో ఉచితంగా వైద్యచికిత్సలు చేయిస్తామని చెప్పారు. ‘సాక్షి’కి రుణపడి ఉంటా..: అర్చన తమ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రచురించి, పదిమంది సాయపడేలా తోడ్పడిన ‘సాక్షి’ఫ్యామిలీకి రుణపడి ఉంటా. తమ దీనస్థితిపై మంత్రి కేటీఆర్గారు స్పందించడం, సాయం చేస్తామని హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మా కష్టాలు తీరే రోజు వస్తుందన్న ఆశతో ఉన్నాను. -
‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన అర్చన
హైదరాబాద్ : ‘సాక్షి’ టీవీలో ప్రసారం అయిన ’కంటే కూతుర్నే కనాలి’ కథనానికి తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తనను కన్నవాళ్లకే అమ్మగా మారి.. తల్లిదండ్రులను పిల్లలుగా భావించి సేవలందిస్తున్న అర్చన అనే యువతికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన అర్చన తల్లిదండ్రులు పద్మ, దుర్గారెడ్డిల దీనగాథపై ‘సాక్షి’లో ప్రసారం అయిన కథనానికి స్పందించిన మంత్రి కేటీఆర్... అర్చనకు అండగా నిలిచారు. ఆమెకు డీఆర్డీఓ ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయడం, అలాగే ఆమె తల్లిదండ్రులకు నిమ్స్లో మెరుగైన చికిత్స చేయించనున్నట్లు కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా తన కుటుంబ దీనగాథను ప్రసారం చేసి, ఆదుకున్న ’సాక్షి’కి అర్చన కృతజ్ఞతలు తెలిపింది. కాగా సాక్షి దినపత్రిక ఫ్యామిలీ పేజీలో ఈ నెల 18న మంగళవారం ‘కూతురమ్మ’ శీర్షికన ప్రచురించిన కథానానికి విశేష స్పందన వస్తోంది. ఆ కథనాన్ని చదివి మానవత్వానికి ఎల్లలు లేవు.. మనసుంటే మార్గముంటుంది.. అన్న మంచి మనసుతో అర్చనకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. చదవండి.... (కూతురమ్మ!) -
‘కూతురమ్మ’కు అండగా నిలుస్తాం..
‘సాక్షి’ కథనానికి విశేష స్పందన.. నిర్మల్ రూరల్: తనను కన్నవాళ్లకే అమ్మగా మారి.. తల్లిదండ్రులను పిల్లలుగా భావించి సేవలం దిస్తున్న పేదింటి ‘కూతురమ్మ’కు తాము అండగా నిలుస్తామంటూ మనసున్నోళ్లు ముందుకు వస్తున్నారు. ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో మంగళవారం ‘కూతురమ్మ’ శీర్షికన ప్రచురించిన కథనానికి విశేష స్పందన వస్తోంది. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన అర్చన తల్లిదండ్రులు పద్మ, దుర్గారెడ్డిల దీనగాథతో ‘సాక్షి’ప్రచురించిన కథనం విశ్వవ్యాప్తమైంది. ఈ కథనాన్ని చదివి మానవత్వానికి ఎల్లలు లేవు.. మనసుంటే మార్గముంటుంది.. అన్న మంచి మనసుతో అర్చనకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అర్చన కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. హృదయాన్ని కదిలించే కథనాన్ని రాసిన ‘సాక్షి’ని ఆయన అభినందించారు. అర్చన పరిస్థితిపై స్పందించిన వారిలో మాణిక్రెడ్డి(షాద్నగర్), సతీశ్రాజు (భీమవరం), భాస్కర్రెడ్డి(హైదరాబాద్), వెంగళ్రావు(నెల్లూరు), మాధురి (హైదరాబాద్), బాలాజీ వరప్రసాద్ (విజయవాడ)లతో పాటు నిర్మల్కు చెందిన టీఆర్ఎస్ నేత కూచాడి శ్రీహరిరావు, డాక్టర్ ప్రమోద్చంద్రారెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్రెడ్డి, జాన్డీర్ షోరూం యజమాని రవీందర్, కనకదుర్గా చిట్స్ బ్రాంచ్మేనేజర్ నర్సారెడ్డి, మనోహర్రెడ్డి(డీఎస్పీ) జీవన్రెడ్డి(పట్టణ సీఐ) ఇలా చాలా మంది మనసున్నోళ్లు ముందుకు వచ్చారు. -
కూతురమ్మ!
అమ్మ తెలుసు... అమ్మమ్మ తెలుసు... నానమ్మ తెలుసు... వదినమ్మ తెలుసు... అత్తమ్మ తెలుసు... చెల్లెమ్మ తెలుసు... చిన్నమ్మ కూడా తెలుసు! వీళ్లందరి ప్రేమ కలిపితే కూతురమ్మ. అంధురాలైన తల్లికి బొట్టు పెట్టుకునే అద్దం తను. కుప్పకూలిన తండ్రికి అన్నం పెట్టే కంచం తను. ఈ కూతురమ్మను చూస్తే ఎంతో ధైర్యం వస్తుంది. ఎంతో స్ఫూర్తి కలుగుతుంది. మరి... ఇంత ఇస్తున్న కూతురమ్మకు మనం ఏమివ్వగలం? నవమాసాలు మోసి కంటుంది అమ్మ... చిట్టి పాదాలను తన అరచేతులమీద పెట్టుకుని నడిపిస్తాడు నాన్న. అల్లారుముద్దుగా పెంచిన బిడ్డకు ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతారు. ప్రాణమున్నన్ని రోజులు తమ బిడ్డకు సాయపడాలని ఆశిస్తారు అమ్మానాన్నలు. కానీ... ఇక్కడ విధి ఆ అమ్మానాన్నలతో ఆడుకుంది. వాళ్లు కన్న... ఆ బిడ్డ ఒడిలో... వాళ్లనే చిన్నపిల్లల్లా మార్చేసింది. కన్నవాళ్లను కొట్టి తరిమేస్తున్న ఈ రోజుల్లో... తన రెక్కలను ముక్కలు చేసుకుంటూ... ఉబికి వచ్చే కన్నీళ్లను దిగమింగుకుంటూ... జన్మనిచ్చిన వాళ్లకోసం జీవితాన్ని ధారబోస్తోంది. పేదరికంతో బతుకు పోరాటం చేస్తోంది అర్చన. ఆనందంగా మొదలైన జీవితం.. పచ్చని అడవులు... ప్రశాంతమైన వాతావరణం ఉన్న పల్లె నిర్మల్ జిల్లా మామడ మండలంలోని దిమ్మదుర్తి. అలాంటి గ్రామంలో హెల్పర్గా కరెంటు పనులు చేసేవాడు చెరుకు దుర్గారెడ్డి. ఆయనతో జీవితాన్ని పంచుకుంది పద్మ. వాళ్ల అన్యోన్య దాంపత్యానికి దేవుడిచ్చిన వరమే అర్చన. ఒక్కగానొక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచారు. ఉన్నంతలో ఆ కుటుంబం సంతోషంగా గడిపింది. అర్చన చదువుకూ ఎలాంటి ఇబ్బంది రాలేదు. ప్రభుత్వం నుంచి కొత్త నిబంధన వచ్చింది. హెల్పర్గా ఉండాలంటే కరెంటు స్తంభాలను ఎక్కి తీరాల్సిందేనని సర్కారు ఆదేశించింది. గ్రామంలో చేసేందుకు పని లేదు. కూతురిని ఊళ్లోనే ఆమె నానమ్మ దగ్గర ఉంచి దుర్గారెడ్డి... భార్యతోపాటు హైదరాబాద్ బాట పట్టాడు. కష్టాల పయనం ప్రారంభం... పైసల కోసం పట్నంలో కూలీగా మారాడు. పెళ్లాం బిడ్డలను పోషించడం కోసం పగలనక, రాత్రనక పనిచేశాడు. వచ్చిన డబ్బులో కొంత బిడ్డకు పంపేవాడు. బతుకుబండి గాడిన పడిందనుకున్నాడు. అప్పుడే మరో పెద్ద దెబ్బ... అతడికి పక్షవాతం వచ్చింది. చేతులు, కాళ్లు, నోరు పనిచేయక ఆయన్ను మంచానికి పరిమితం చేసింది. దాంతో భార్య పద్మ తీవ్ర ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో ఆమెకు హైబీపీ, షుగర్ వచ్చేశాయి. ముసురుకున్న చీకట్లు... అప్పటికి అర్చన ఇంటర్ సెకండియర్కొచ్చింది. నాన్నకు పక్షవాతం, అమ్మకు హైబీపీ, షుగర్. సంపాదన లే కుండా హైదరాబాద్ వంటి నగరంలో ఉండటం అసాధ్యమని తెలిసింది అర్చనకు. అమ్మానాన్నలను దిమ్మదుర్తికి తీసుకువచ్చింది. ఇక చదువు సాగే దారిలేదని అర్థమైపోయింది. తానే సంపాదించాలి. అందుకు సిద్ధమైంది. తండ్రి కోలుకోకపోగా... తల్లికి హైబీపీ, షుగర్ మరింత పెరిగి చూపు పోయింది. దెబ్బమీద దెబ్బ... కుటుంబ భారమంతా ఆ అమ్మాయి మీదనే పడింది. గుండె నిండా బాధే... తన వేలు పట్టి నడిపించిన నాన్న... కనీసం వేలు కూడా కదపలేని స్థితిలో ఉన్నాడు. ఏది మంచో... ఏది చెడో... దారి చూపించాల్సిన అమ్మ కనుచూపు కోల్పోయి... కన్నీటికే పరిమితమైంది. కనీసం తోబుట్టువులు, బంధుమిత్రులు ఉండి ఉంటే ఆమెకు కొంతైనా అండ ఉండేది. ఆ పరిస్థితీ లేదు. ఫలితం ఇవ్వని కష్టం... తనను కన్నవాళ్లకోసం కష్టపడటానికి అర్చన సిద్ధమైంది. చిన్ననాటి స్నేహితుల సలహాతో ఖానాపూర్లో గల ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్గా జాయినైంది. రోజూ 40–50కి.మీ ప్రయాణం చేస్తూ... బడిలో పాఠాలు చెబుతోంది. అయినా ఆమె కష్టం తీరలేదు. అక్కడ వచ్చే వేతనం మూడు వేల లోపే. అది అమ్మానాన్నల మందులకే సరిపోవడం లేదు. ఆమె పడుతున్న కష్టం మందుల కొనడానికే ఖతమైపోతోంది. బియ్యం అమ్మి... బీపీ, షుగర్ ఉన్న అమ్మకు ఒక్కరోజు ట్యాబ్లెట్ వేయకున్నా కష్టమే. నాన్నను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కనీసం తోడు లేరు. వాళ్లకు జ్వరం వచ్చినా డాక్టర్ వద్దకు తీసుకెళ్లలేని దుస్థితి. రెక్కల కష్టంతో సేవలు చేస్తోంది. ఒక్కోసారి మందులకు డబ్బుల్లేక తమకు వచ్చే రేషన్ బియ్యాన్ని అమ్ముకుని మందులు కొంటోంది. వాళ్లు తలదాచుకుంటున్న ఆ ఇల్లూ సొంతమేమీ కాదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వాళ్లకు సంబంధించిన ఓ పాడుబడ్డ క్వార్టర్. అది ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. మంచిరోజు కోసం ఎదురుచూపు... అర్చనకు ఇప్పుడు 22 ఏళ్లు. పెళ్లీడుకొచ్చింది. అదే మాట ఆమెనడిగితే ‘నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే... వీళ్లను ఎవరు చూస్తారు. నేను లేకుండా అమ్మానాన్న ఒక్కక్షణం ఉండలేరు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇన్నింటిలో సంతోషం కలిగించే సంగతేమిటంటే... ఇంతటి కటిక పేదరికం వెక్కిరిస్తున్నా... ఆమెలో ధైర్యం సడలలేదు. కన్నవాళ్లకోసం జీవితాంతం సేవలు చేస్తానంటోంది. ఈరోజు కాకపోతే రేపు... ఓ మంచిరోజు రాకపోతుందా... అని అర్చన ఎదురు చూస్తూనే ఉంది. ఆ రోజు త్వరగా వస్తే బావుండు. డైలీ రొటీన్ ఇది! ఆకలైనా... దాహమేసినా, మూత్రమొచ్చినా... నోటితో చెప్పుకోలేడు తండ్రి. భర్త కష్టాన్ని కళ్లతో చూసి గ్రహించలేదు తల్లి. అందుకే వాళ్ల అవసరాలను ఓ తల్లిలా చూస్తోంది అర్చన. తండ్రికి తినిపించడం, స్నానం చేయించడం, గడ్డం గీయడం, దుస్తులు మార్చడం, మలమూత్రాలు శుభ్రం చేయడం... ఇలా అన్నీ తానే చేస్తోంది. నాన్నను లేపి కూర్చోబెట్టడం తన ఒక్కదాని వల్ల కాదు. దీంతో అమ్మను సాయంగా కూర్చోబెట్టి... తండ్రిని లేపుతోంది. ఇక కంటిచూపు లేని అమ్మకూ దాదాపు అన్ని పనులు చేసి పెడుతుంది. బడికి వెళ్లే ముందే వాళ్లకు స్నానాలు చేయించి, అన్నాలు పెడుతుంది. తాను సాయంత్రం వచ్చేవరకు వాళ్లకు కావల్సినవన్నీ సర్దిపెట్టి వెళ్తోంది. చిన్నపిల్లాడిలా మంచంలోనే ఒంటికి, రెంటికి వెళ్లే నాన్నను, ఏ చిన్నపనీ చేయలేని స్థితిలో ఉన్న అమ్మను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఇలా ఓ కన్నతల్లి కూడా తన బిడ్డలకు చేయలేదేమో... అన్నంతగా అమ్మానాన్నల కోసం అర్చన జీవితాన్ని ధారబోస్తోంది. నేను కాకపోతే ఎవరు! మా కుటుంబం ఇలా అవుతుందని ఒక్క క్షణం కూడా ఊహించలేదు. ఉన్నదాంట్లో ఆనందంగా బతికాం. అలాంటిది ఇప్పుడు ఇలా... (కన్నీళ్లు పెట్టుకుంటూ) అయిపోయింది. నన్ను కన్నవాళ్ల కష్టాన్ని నేను కాకపోతే ఎవరు తీరుస్తారు. బిడ్డగా... జన్మనిచ్చిన వారి కోసం ఎంత చేసినా తక్కువే. కానీ... ఓ ఆడపిల్లగా ఈ సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లడమే కష్టంగా మారుతోంది. మంచిరోజులు వస్తాయన్న ఆశే నడిపిస్తోంది. అమ్మానాన్న మళ్లీ మామూలుగా అవ్వాలి. మా కుటుంబంలో సంతోషం నిండాలన్నదే నా కోరిక. – అర్చన – రాసం శ్రీధర్, ఆర్సీ ఇన్చార్జి, నిర్మల్ -
క్షణ క్షణం ఉత్కంఠ
‘‘ఈ సినిమా పాటలు బాగున్నాయి. చిన్న సినిమాలు ఎక్కువగా రావాలి. అప్పుడే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ చెప్పారు. 2000 ఎకరాల్లో ప్రభుత్వం ఫిలిం సిటీ నిర్మించనుంది’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. అమోఘ్ దేశపతి, అర్చన, శ్రేయా వ్యాస్ ముఖ్య పాత్రల్లో షెరాజ్ దర్శకత్వంలో పీవీ సత్యనారాయణ నిర్మించిన సినిమా ‘షాలిని’. నవనీత్ చారీ స్వరపరచిన పాటల సీడీలను వేణుగోపాలాచారి విడుదల చేశారు. చిత్ర సమర్పకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ – ‘‘హారర్, థ్రిల్లర్, లవ్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా చూశాకా, విడుదల చేయాలని నిర్ణయించుకున్నా. షేరాజ్తో ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తా’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు క్షణ క్షణం ఉత్కంఠ కలిగించే చిత్రమిది. హైదరాబాద్, వైజాగ్, గోవాలో షూటింగ్ చేశాం’’ అన్నారు షెరాజ్. ఆర్కే గౌడ్, పీవీ సత్యనారాయణ, అమోఘ్ దేశపతి తదితరులు పాల్గొన్నారు. -
రూపం లేదు!
అమోఘ్ దేశపతి, అర్చన జంటగా షెరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘షాలిని’. సాయి వెంకట్ సమర్పణలో పీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇటీవల ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ‘‘దెయ్యానికి ఒక రూపం ఉండదని చెప్పే చిత్రమిది. ఉత్కంఠ కలిగించే సీన్స్ చాలా ఉన్నాయి’’ అన్నారు దర్శకుడు. ‘‘ఈ చిత్రం తర్వాత షెరాజ్తో భారీ బడ్జెట్ సినిమా తీస్తా’’ అన్నారు సాయి వెంకట్. -
పెళ్లైన వారం రోజులకే వేధింపులు..
మేడ్చల్: పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవక ముందే అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలోని యాప్రాల్ ఎలైట్ కాలనీకి చెందిన భాస్కర్గౌడ్ రైల్వేశాఖలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గత నెలలో అతనికి అర్చనతో వివాహం జరిగింది. పెళ్లైన వారం తర్వాతి నుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త వేధిస్తున్నాడని అర్చన జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భాస్కర్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
దసరా పేరుతో భక్తుల దోపీడీకి రంగం సిద్ధం
-
జైలులో థ్రిల్ !
మంత్ర, మంగళ వంటి వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఓషో తులసీరామ్. కొంత గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పడుతున్నారు. ఇప్పటికే తను తీసిన రెండు చిత్రాలు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కాగా మరోసారి అర్చన (వేద) ప్రధాన పాత్రలో ఆ తరహా చిత్రం తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఎమ్ఎమ్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. తులసీరామ్ మాట్లాడుతూ- ‘‘ జైలు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రేక్షకుల ఊహకందని థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉంటాయి. అక్టోబర్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. -
శ్రీమఠం ఆదాయ మంత్రం
– అర్చన హారతులకు టికెట్ – రూ. 50గా నిర్ణయం – సోమవారం రాత్రి నుంచి అమల్లోకి – అసంతప్తిలో భక్తులు మంత్రాలయం: శ్రీమఠం ఆదాయ మంత్రాన్ని జపిస్తోంది. మంత్రాలయం గ్రామ దేవత మంచాలమ్మ గుడి నిర్వహణ పూర్తిగా మఠాధీశుల చేతుల్లోకి వెళ్లడంతో అమ్మవారి అర్చన హారతికి పైకం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సద్గురు శ్రీరాఘవేంద్రస్వామికి గ్రామ దేవత మంచాలమ్మ ఆశ్రయం ఇచ్చారని చరిత్ర. అందుకు కతజ్ఞతగా ముందుపూజ మంచాలమ్మకు తదుపరి దర్శనం రాఘవేంద్రుల మూలబందావనానికి నిర్ణయించారు. ఒకప్పుడు మంచాలమ్మ ఆలయం ప్రత్యేకంగా ఉండేది. శ్రీమఠం ఈశాన్య భాగంలోని వెలసిన మంచాలమ్మ గుడిని శ్రీమఠం ప్రాకారంలో కలిపి నిర్మించారు. గ్రామానికి చెందిన లింగాయితీలు మంచాలమ్మ పూజారులుగా కొనసాగుతున్నా మఠా«ధీశుల నిర్ణయమే ఇక్కడ శాసనంగా మారింది. ఇప్పటికే మంచాలమ్మ హుండీ ఆదాయం మఠం ఖాతాలో జమ చేస్తున్నారు. దేవర ఉత్సవాలు, తదితర వేడుకలు గ్రామస్తులే చేస్తున్నా ఆలయ ఆదాయం మాత్రం శ్రీమఠానికి చెందేలా నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి అర్చన సహిత హారతులకు టికెట్ పెట్టేశారు. సోమవారం రాత్రి నుంచి రూ.50 చొప్పున టిక్కెట్ నిర్ణయించి కౌంటర్ సైతం ఏర్పాటు చేసేశారు. గ్రామ భక్తులు సైతం ఇక అర్చన, హారతులు పట్టాలంటే కచ్చితంగా రూ.50 చెల్లించాల్సిందే. దీంతో గ్రామస్తులు, భక్తులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతి సూచన మేరకే: శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు సూచన మేరకే అర్చన సహిత హారతులకు టిక్కెట్ నిర్ణయించాం. సోమవారం రాత్రి నుంచి ఈ విధానం అమల్లో ఉంటుంది. మఠం నియమ నిబంధనలు మేరకు భక్తుల సహకరించాలి. – శ్రీనివాసరావు, శ్రీమఠం మేనేజర్ -
పోలవరం కాలువలో పడి ఇంటర్ విద్యార్థిని మృతి
పోలీవరం కాలువలో పడి విద్యార్థిని మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కొప్పులవారి గూడెం వద్ద గురువారం చోటుచేసుకుంది. పెదవేగికి చెందిన అర్చన(17) ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ప్రమాదవ శాత్తు పోలవరం కుడి కాలువలో పడి మృతిచెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో మృతదేహాన్ని వెలికితిశారు. -
కోటి లింగేశ్వరస్వామి
పుణ్యతీర్థం విజయవాడ ప్రకాశం బ్యారేజీపైన కృష్ణమ్మ గుండెల మీదుగా ప్రయాణించి, కొస వరకు నడిచి, ఆ చివర కుడివైపుగా సుమారు పది కిలోమీటర్లు ప్రయాణించాలి. సన్నని బాట. బాటకు ఇరువైపులా అరటితోటలు గెలలతో మనతో పాటు కబుర్లు చెబుతూ ప్రయాణిస్తుంటాయి. కొద్దిగా ముందుకు వెళితే, పొట్టిగా ఉన్న మునగచెట్లు, నిండుగా మునగకాడలతో చేతులు కదుపుతుంటాయి. మరికాస్త ముందుకు వెళ్లేసరికి దొండపాదులు వాటి పిల్లల్ని కిందకు వేళ్లాడదీస్తూ కనిపిస్తాయి. ఎంతో అందమైన ప్రకృతిలో ప్రయాణపు అలుపు తెలియకుండా కోటిలింగేశ్వర శైవక్షేత్రానికి చేరుకుంటాం. శివుడిని ధ్యానిస్తూ, ఆలయంలోకి ప్రవేశించ గానే కైలాసన అడుగుపెట్టిన భావన ఒడలెల్లా కలుగకమానదు. పాదరస శివలింగం... ఆలయంలో ప్రధాన ద్వారం దాటగానే, ఒక పక్క పాదరసంతో రూపొందిన రసలింగేశ్వరుడు దర్శనమిస్తాడు. పాదరసం విడిగా ఉంటే కరిగిపోతుంది కనుక, ఒక గదిలో ఉంచి, ఆయనకు చల్లని గాలులు వీచేలా ఏసి అమర్చారు. అద్దాల ద్వారం గుండా స్వామిని దర్శించుకోవచ్చు. 350 కిలోల పాదరసంతో రూపొందిన శివలింగదర్శనం దివ్యానుభూతిని కలుగచేస్తుంది. ప్రధాన ఆలయం ఆలయ నిర్మాణం విచిత్రంగా ఉంటుంది. ప్రధాన ఆలయంలో అర్చనలు నిర్వర్తించుకోవడానికి అనువుగా ఒక పక్క శివపార్వతుల ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. మరోపక్క... ఉత్సవాలకు సంబంధించిన రాధాకృష్ణులు, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, సిద్ధిబుద్ధి సమేత వినాయకుడు, సీతా, లక్ష్మణ, హనుమత్సమేత రాములవారు దర్శనమిస్తారు. ఇక ప్రధాన ఆలయంలో శివుడు లింగాకృతిలో దర్శనమిస్తూ, ఆ లింగం మీద నలుదిక్కులా ఆకృతిలో కూడా భక్తులకు కనువిందు చేస్తాడు. ఆలయంలో స్వయంగా అందరూ అభిషేకాలు చేసుకోవచ్చు. ఆ లింగానికి నాలుగు దిక్కుల నుంచి ప్రవేశం ఉంది. నాలుగు దిక్కులకూ నాలుగు నామకరణాలు చేశారు. ముఖద్వారంలో ఒక వైపు వినాయకుడు, మరొక వైపు కుమారస్వామి విగ్రహాలు గోమేధికంతో తయారయినవి ప్రత్యేకంగా పరవశింపచేస్తాయి. మూలవిరాట్టుకు కిందుగా! పాతాళంగా పిలచే గర్భాలయంలోనూ శివుడు కొలువుతీరి ఉన్నాడు. ఇక్కడ శివుడు కిరీట ధారణతో విలక్షణంగా దర్శనమిస్తాడు. ఇక్కడే భక్తులు ప్రతిష్టించిన కొన్నివందల స్ఫటిక లింగాలు, వాటితో పాటే చిన్నచిన్న రసలింగాలు కూడా సందర్శకుల గుండెల్లో గుడులు కట్టుకుంటాయి. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చి ఆలయ ప్రాంగణం పరిశీలిస్తే... ఒక పక్క నవగ్రహాలకు ఆలయాలు వలయాకారంలో నిర్మితమై ఉన్నాయి. నవగ్రహాలు వారి వారి కుటుంబాలతో సహా కొలువుదీరి కనువిందు చేస్తారు. మరో పక్కన నక్షత్ర వృక్షాలు కంటికి ఇంపుగా పచ్చని చిగుళ్లతో, ఆకులతో అలరిస్తాయి. వాటిపై నక్షత్రం పేరు, వృక్షం పేరు రాసి ఉంటాయి. మరోపక్క పన్నెండు రాశులకు సంబంధించిన గంటలతో నిండిన దేవాలయం దర్శనమిస్తుంది. ఆయా రాశుల ముందుకు వచ్చిగంట మోగిస్తారు. ఈ దేవాలయంలో ప్రత్యంగిరాదేవి కొలువుదీరి ఉంది. వివిధ లోహాలతో శివలింగాలు అక్కడకు నుంచి ఒకటవ అంతస్తులోకి వెళితే... ప్రధాన ఆలయంలో శివలింగంతోపాటు, కుడి పక్కన, ఎడమ పక్కన వివిధ రత్నాలతో రూపొందిన శివలింగాలు మనలను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతాయి. ముందుగా రెండున్నర లక్షల విలువ చేసే స్ఫటిక లింగం స్వాగతం పలుకుతుంది. ఆ పక్కన మరకతం, మాణిక్యం, గోమేధికం... వంటి వాటితో రూపొందిన శివలింగాలు కనిపిస్తాయి. శివునికి ఎదురుగా ఉన్న నంది కూడా మరకతంతో రూపొందినదే. ప్రపంచంలో ఉన్న అన్ని లోహాల శివలింగాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. మహాలింగేశ్వరుడు, అయఃలింగేశ్వరుడు, తామ్ర లింగేశ్వరుడు, దారు లింగేశ్వరుడు, మరకత లింగేశ్వరుడు, త్రిపుర లింగేశ్వరుడు, ఆరకూట లింగేశ్వరుడు, కాంస్య లింగేశ్వరుడు, నాగ లింగేశ్వరుడు, నీలకంఠేశ్వరుడు... మనలను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతారు. ద్వాదశజ్యోతిర్లింగాల ఆకృతులు, క్షేత్రనామాలతో మనలను మంత్రముగ్ధులను చేస్తాయి. లింగప్రతిష్ఠ కోటి లింగాల ప్రతిష్ఠాపన ధ్యేయంగా ఉన్న ఈ శివాలయంలో భక్తులు స్వయంగా లింగప్రతిష్ఠ చేయడం విశేషం. ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మికతతో ఇక్కడి దేవాలయంలో ప్రతిష్ఠాపన జరుగుతుంది. భక్తులు వారి వారి శక్తిసామర్థ్యాలను బట్టి ఇక్కడ లింగప్రతిష్ఠ జరుపుతారు. తాళ్లాయపాలెం గ్రామం గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలంలో, మందడం పంచాయితీకి చెందిన తాళ్లాయపాలెం కొత్తరాజధాని తుళ్లూరుకు కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో కొలువుతీరి ఉంది. ఇబ్రహీం పట్టణం, తాడేపల్లి, మంగళగిరి, విజయవాడలు నలుదిక్కులా ఉన్నాయి. గుంటూరు కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉంది ఈ క్షేత్రం. - డా. పురాణపండ వైజయంతి సాక్షి, విజయవాడ