Bigg Boss 4 Telugu
-
బిగ్బాస్ సొహెల్ ఇంట్లో విషాదం.. ఏమైంది?
తెలుగు బిగ్బాస్ 4వ సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న సొహెల్ ఇంట్లో విషాదం. ఇతడి తల్లి చనిపోయింది. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో ఇబ్బందిపడుతున్న ఈమెని డయాలసిస్ కోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ప్రముఖ సింగర్ మనో ఇద్దరు కొడుకులు అరెస్ట్)సొహెల్ సొంతూరు కరీంనగర్. తండ్రి సయ్యద్ సలీంతో పాటు తల్లి, తమ్ముడు ఉన్నారు. సొహెల్ కెరీర్ విషయానికొస్తే 'కొత్తబంగారు లోకం' సినిమాలో కనీకనిపించని పాత్ర చేశాడు. 'జనతా గ్యారేజ్' సినిమాలో సైడ్ క్యారెక్టర్లో కనిపించాడు. ఇక బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలా హీరో కూడా అయిపోయాడు.లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు తదితర సినిమాల్లో సొహెల్ హీరోగా చేశాడు. ప్రస్తుతం కొత్త మూవీస్ ఏం చేస్తున్నాడా లేదా అనేది తెలియాలి. ఇక సొహెల్ తల్లి పార్థివ దేహాన్ని హైదరాబాద్ నుంచి సొంతూరు కరీంనగర్కి తీసుకెళ్లి, అక్కడే అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇండస్ట్రీ పెద్దలు.. డైరెక్టర్ త్రివిక్రమ్ని ప్రశ్నించాలి: పూనమ్ కౌర్) -
పెళ్లి చేసుకుందామనుకున్నాం.. కానీ అలా జరగడంతో బ్రేకప్: దివి
తెలుగు రియాలిటీ షోల్లో బిగ్బాస్ షో క్రేజ్ డిఫరెంట్. ఎందుకంటే పాజిటివో నెగిటివో గానీ ఈ షో ద్వారా చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. అలా నాలుగో సీజన్లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఎందుకంటే ఈ ప్రేమకథలో అంత ట్రాజెడీ ఉంది మరి! (ఇదీ చదవండి: డైరెక్ట్గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) 'బీటెక్ చదివే రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం. ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్లో ఉన్నాం. పెద్దలతో మాట్లాడిన తర్వాత పెళ్లికి కూడా అంగీకరించారు. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. కానీ ఇంతలోనే అతడి తమ్ముడి.. అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. అయితే నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. ఎందుకంటే అతడి చివరి రోజుల్లో నేను దగ్గరే ఉన్నా. అలానే చనిపోయిన తర్వాత వాళ్ల ఇంటి దగ్గర చివరి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్కి తోడుగా ఉన్నాను' 'ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు సొంతూరిలోనే తల్లదండ్రులకు తోడుగా ఉండిపోయాడు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. అయితే తనతో పాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్లపోతే నా కెరీర్ నాశనమవుతుందని అనుకున్నాడు. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. ఒకవేళ ఇది ముందే తెలుసుంటే అతడితో పాటు నేను వాళ్ల ఊరికి వెళ్లిపోయేదాన్నేమో' అని దివి తన ట్రాజెడీ ప్రేమకథ గురించి బయటపెట్టింది. (ఇదీ చదవండి: బాత్రూమ్లో కాలుజారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి) -
చిల్లిగవ్వ లేదు, ఫ్యాన్కు ఉరేసుకుందామనుకున్నాడు: అవినాష్ సోదరుడు
ముక్కు అవినాశ్.. జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్గా గుర్తింపు పొందాడు. బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొని ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందించాడు. తర్వాత కూడా పలు రియాలిటీ షోలలో పాల్గొని మెరిశాడు. ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. షోలు, ఈవెంట్ల ద్వారా బాగానే వెనకేసిన అవినాష్ ఒకానొక సమయంలో మాత్రం తినడానికి తిండి లేక అలమటించాడు. తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుని ఎమోషనలయ్యాడు అవినాష్ సోదరుడు అజయ్. చికెన్ కూడా వద్దన్నాడు! అతడు మాట్లాడుతూ.. 'లాక్డౌన్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఇల్లు, కారు తీసుకున్నాం. ఈ రెండు ఈఎమ్ఐలతో పాటు బయట చిన్నపాటి అప్పులు కూడా ఉండేవి. ఈఎమ్ఐలు కట్టకపోవడంతో నోటీసులు వచ్చాయి. మరోవైపు షూటింగ్స్ ఆగిపోవడంతో చేతిలో డబ్బులు లేకుండా పోయాయి. ఈ పరిణామాలతో అన్న మానసికంగా కుంగిపోయాడు. ఒకరోజు సరదాగా చికెన్ వండుకుందాం అని అడిగాను. మన పరిస్థితే బాలేదు, రోజూ పప్పు తింటున్నాం కదా.. ఇప్పుడు కూడా అదే తిందాం.. చికెన్ అవసరమా? అన్నాడు. అలాంటి రోజులు కూడా మా జీవితంలో ఉన్నాయి. వాళ్ల సాయంతోనే.. అన్న ఒక రూమ్లో, నేను ఇంకో రూమ్లో నిద్రించేవాళ్లం. అన్న ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉదయం 5 గంటల వరకు పడుకునేవాడే కాదు. ఈ అప్పులు, ఒత్తిళ్ల వల్ల ఒకానొక సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోదామన్న ఆలోచన కూడా వచ్చింది! బిగ్బాస్కు వెళ్లే ముందు తాను చనిపోదామనుకున్న విషయాన్ని నాతో చెప్పాడు. అప్పుడు అంత దారుణంగా ఉండేది మా పరిస్థితి! అన్న జేబులో రూపాయి లేదు. ఆ సమయంలో బిగ్బాస్ ఆఫర్ రావడంతో ఒప్పుకున్నాడు. జబర్దస్త్కు రూ.10 లక్షలు ఇచ్చి ఆ షో నుంచి బయటకు వచ్చాడు. శ్రీముఖి రూ.5 లక్షలు, గెటప్ శ్రీను రూ.1 లక్ష, చమ్మక్ చంద్ర రూ.2 లక్షలు.. ఇలా అందరి దగ్గరా అప్పు చేసి ఆ డబ్బు ఇచ్చేశాడు. దేవుడి దయ వల్ల బిగ్బాస్ తర్వాత తన కెరీర్ ఇంకా బాగుంది' అని చెప్పాడు అజయ్. బిగ్బాస్ హౌస్లో కష్టాలు చెప్పుకున్న అవినాష్ బిగ్బాస్ హౌస్లోనూ లాక్డౌన్లో తాను పడ్డ కష్టాలను చెప్పాడు అవినాష్. లాక్డౌన్లో ఇంటి ఈఎమ్ఐ కట్టలేకపోయానన్నాడు. ఎందుకంటే అదే సమయంలో తండ్రికి గుండెపోటు రావడంతో మూడు స్టంట్లు వేయడానికి ఇంటి కోసం ఉంచిన రూ. 4 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. అలాగే అమ్మకు కీళ్లు అరిగిపోతే వైద్యం చేయించినట్లు పేర్కొన్నాడు. అప్పుల వల్ల ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపాడు. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. ఆనందంలో తేలియాడుతున్న శోభ -
సినిమాలు వర్కవుట్ కాలేదు, చనిపోదామనుకున్నా: సోహైల్
సోహైల్.. బిగ్బాస్ షోకు ముందు ఇతడెవరో కూడా జనాలకు తెలీదు. కానీ బిగ్బాస్ నాలుగో సీజన్ తర్వాత కథ వేరే ఉంది. ప్రేక్షకుల్లో ఇతడికి విశేష గుర్తింపు, స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతమైంది. బిగ్బాస్ హౌస్లో తన ఆటతో, మాటతో, చేష్టలతో, అరియానాతో గొడవలతో.. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. ఈ షో తర్వాత పలు సినిమాలకు సంతకం చేసి షూటింగ్స్తో బిజీబిజీగా మారాడు. తాజాగా సోహైల్ ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటిరోజులను గుర్తు చేసుకున్నాడు. 'ఒకానొక సమయంలో నా సినిమాలు వర్కవుట్ కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఏమీ సెట్టయితలేదు, నా లైఫ్ అయిపోయింది అని చచ్చిపోదామనుకున్నా' అని చెప్తూ ఎమోషనలయ్యాడు సోహైల్. కానీ బిగ్బాస్ షో అతడిలోని ఆశలకు మళ్లీ ప్రాణం పోసింది. ప్రస్తుతం సోహైల్ లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు సినిమాలు చేస్తున్నాడు. చదవండి: పుష్ప 2 నుంచి పవర్ఫుల్ డైలాగ్ లీక్ రేవంత్, ఇది నీ దగ్గరే నేర్చుకున్నా: నాగార్జున -
సొంతూరికి బస్సు వచ్చేలా చేసిన బిగ్బాస్ గంగవ్వ..
Bigg Boss Gangavva Initiative For Bus Service To Lambadipally: యూట్యూబ్ స్టార్, బిగ్బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పల్లెటూరి యాస, మంచి కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంది. 'మై విలేజ్ షో'లో తనదైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. యూట్యూబ్ స్టార్గా ఎదిగిన గంగవ్వ బిగ్బాస్ నాలుగో సీజన్లో అడుగు పెట్టి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణలతో ఐదో వారంలోనే బిగ్బాస్ హౌజ్ నుంచి నిష్కమించిన గంగవ్వ.. మల్లేషం, ఇస్మార్ట్ శంకర్, లవ్ స్టోరీ, రాజ రాజ చోర చిత్రాల్లో నటించి అలరించింది. ఇటీవల తన సొంతింటి కలను నిజం చేసుకున్న గంగవ్వ తాజాగా తన సొంతూరికి తిరిగి బస్సు సర్వీసును తీసుకొచ్చింది. గంగవ్వది తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. ఈ గ్రామానికి మొదట్లో బస్సు సర్వీసు ఉండేది. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా లంబాడిపల్లికి ఆర్టీసీ బస్సు రావట్లేదు. దీంతో గ్రామస్థులు, వ్యవసాయ దారులు, కూలీలు, విద్యార్థులు జగిత్యాల జిల్లా కేంద్రానికి వెళ్లి రావడానికి ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో జగిత్యాలకు వెళ్లి రావాలంటే వాహన చార్జీలతో తలకుమించిన భారమైంది. తమ సమస్యలకు పరిష్కారంగా బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలనుకున్నారు లంబాడిపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు. ఇందుకోసం బిగ్బాస్ ఫేమ్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ సహాయం కోరారు. చదవండి: తన కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ లంబాడిపల్లికి తిరిగి బస్సు తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామస్థులతో కలిసి జగిత్యాల ఆర్టీసీ డిపో అధికారులను కలిసింది గంగవ్వ బృందం. గంగవ్వ వినతితో లంబాడిపల్లికి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించారు అధికారులు. ప్రస్తుతం ఈ గ్రామానికి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ఐదు ట్రిప్పలుగా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. లంబాడిపల్లికి తిరిగి బస్సు రావడంతో గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులను కలిసిన గంగవ్వ బృందంలో 'మై విలేజ్ షో' టీం నటులు అనిల్, అంజి మామ తదితరులు ఉన్నారు. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1571342813.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
పప్పులో కాలేసి బుక్కైన దేత్తడి హారిక, చూసుకోమ్మా ఇంగ్లీష్ పాప అంటూ ట్రోల్స్..
బిగ్బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వీపరితమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటోంది. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఆమె అదే క్రేజ్తో బిగ్బాస్ 4 సీజన్లో పాల్గొనే చాన్స్ కొట్టేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్బాస్ తర్వాత ఆమెకు స్టార్డమ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో వరస వీడియోలు, రీల్స్తో పాటు హాట్హాట్ ఫొటోషూట్లు షేర్ చేస్తోంది. చదవండి: ఘనంగా అనిల్ అంబానీ కుమారుడి వివాహం, బచ్చన్ ఫ్యామిలీ సందడి ఈ క్రమంలో ఆమెకు అభిమానుల సంఖ్యతో పాటు ట్రోలర్స్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఆమె షేర్ చేసిన వీడియోలు, ఫొటోలపై ఓవరాక్స్ ఎక్కువైందంటూ విమర్శించడమే కాకుండా బుడ్డది, పొట్టిది అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రీసెంట్గా ఆ ట్రోల్స్ స్పందించిన హారిక ‘ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్తో ట్రోలర్స్కు కౌంటర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి ట్రోలర్స్కు అవకాశం ఇస్తూ ఓ వీడియో షేర్ చేసింది. తన నటన ప్రతిభను చూపిస్తూ వింత వింత ఎక్స్ప్రెషన్స్తో ఓ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేస్తూ.. దానికి ఎక్స్ప్రెషన్ క్వీన్ (Expresstion Queen) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఇక్కడే పప్పులో కాలేసింది హారిక. Expression బదులుగా Expresstion అని స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టింది. దీంతో అది చూసిన ట్రోలర్స్ హరీకను ఆడేసుకుంటున్నారు. ‘బిగ్బాస్ హౌజ్లో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఇంగ్లీష్ పాపల బిల్డప్ ఇచ్చావు.. కాస్తా స్పెల్లింగ్ చూసుకోమ్మా’ అని ‘ఎక్స్ప్రెషన్ ఇవ్వడం ఎలాగూ రాదు.. కనీసం స్పెల్లింగ్ అయినా సరిగా రాయడం నేర్చుకోమ్మా ఇంగ్లీష్ పాప’ అంటూ సటైరికల్గా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనన ఇలా ట్రోల్ చేయడానికి కారణం లేకపోలేదు. చదవండి: భీమ్లా నాయక్ ట్రైలర్పై వర్మ షాకింగ్ కామెంట్స్, పవన్పై వరస సటైరికల్ ట్వీట్స్ ఇంత చిన్ని విషయానికే ఆమెకు నెటిజన్ల ఎందుకు టార్గేట్ చేశారంటే.. బిగ్బాస్ హౌజ్లో తరచూ ఇంగ్లీష్ మాట్లాడుతూ బిగ్బాస్కు హారిక కోపం తెప్పించిన సంగతి తెలిసిందే. తెలుగులోనే ఎక్కువగా మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పిన హారిక మాత్రం ఇంగ్లీష్ ఎక్కువగా.. తెలుగు తక్కువగా మాట్లాడేది. బెసిగ్గా ఆమె తెలుగు అమ్మాయే అయినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడానికి ఆమె ఇష్టపడటంతో ప్రేక్షకుల అసహనానికి గురైంది. అంతేకాదు హోస్ట్ నాగార్జున సైతం ప్రతివారం తెలుగులోనే మాట్లాడు హారిక అంటూ నొక్కి మరి చెప్పేవారు. ఇక ఇంగ్లీష్ మాట్లాడితే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని బిగ్బాస్ హెచ్చరించిన హారిక తన తీరును మాత్రం మార్చుకోలేదు. -
అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా: దేత్తడి హారిక వార్నింగ్!
వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్తో క్రేజ్ సంపాదించుకుంది దేత్తడి హారిక. తెలంగాణ యాసలో ఆమె పలికించే డైలాగులు, నటనకు ఎంతోమంది అభిమానులున్నారు. ఈ యూట్యూబ్ స్టార్ బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొని ఫినాలే వరకు వెళ్లింది. ప్రైవేట్ అల్బమ్స్తో పాటు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ నిత్యం అభిమానులతో టచ్లో ఉండే హారికకు ఈ మధ్య కామెంట్ల బెడద ఎక్కువైంది. ఆమె ఫొటోను చూసి హైట్ గురించి చులకన చేసి మాట్లాడుతున్నారు కొందరు. పొట్టిది, బుడ్డది అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఇష్టారీతిన కామెంట్లు పెట్టేవారికి గట్టి కౌంటరిచ్చింది హారిక. ఎవడు పడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమాని అయి ఉండాలి అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేసింది. అదీ.. అర్థమైంది కదా.. అని ట్రోలర్స్కు వార్నింగ్ ఇచ్చింది. -
అప్పుడే కొత్త సినిమా మొదలుపెట్టిన సోహైల్
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండపాటి సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న తొలి చిత్రం పూజా కార్యక్రమం యాదాద్రిలో జరిగింది. సోహైల్, చిత్రనిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కృష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. ‘‘ఈ సినిమా కంటెంట్ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. కాగా సోహైల్ ఇటీవల 'మిస్టర్ ప్రెగ్నెంట్' అనే సినిమాలో కథానాయకుడిగా నటించాడు. ఇందులోని పాటలు బాగా హిట్టయ్యాయి. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. -
ఏడేళ్ల కష్టార్జితంతో కొన్న ముక్కు అవినాష్ ఇల్లు చూశారా?
Mukku Avinash Shares Home Tour Video: కామెడీ షోలో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించిన ముక్కు అవినాష్ బిగ్బాస్ షోతో వారికి మరింత దగ్గరయ్యాడు. బిగ్బాస్ తెలుగు నాల్గో సీజన్లో పాల్గొన్న అతడు కంటెస్టెంట్లందరితో కలిసిపోతూనే వారిని సరదాగా ఓ ఆటాడిస్తూ ఫుల్ కామెడీ చేసి జనాలను తెగ నవ్వించాడు. బుల్లితెరపై కమెడియన్గానే కాకుండా సినిమాల్లో నటుడిగానూ రాణిస్తున్నాడు. ఇటీవల అవినాష్ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఈ క్రమంలో భార్య అనుజతో కలిసి యూట్యూబ్ వీడియోలు, రీల్స్, ఫొటోషూట్స్ అంటూ తెగ సందడి చేస్తున్నాడు. తాజాగా అతడు తన ఇంటిని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు. సుమారు ఏడేళ్ల కష్టపడ్డ అనంతరం ఆ డబ్బుతో ఇల్లు, కారు కొనుక్కున్నానని తెలిపాడు. తనది ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ అంటూ ఇల్లు మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. స్కూల్ఫ్రెండ్ జగదీశ్ తన ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేశాడన్న అవినాష్ తనకు వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను చూపిస్తూ వాటి వెనక స్టోరీని వెల్లడించాడు. బాల్కనీ, కిచెన్, డైనింగ్ టేబుల్, పూజా గది, బెడ్ రూమ్.. ఇలా అన్నింటినీ చూపించాడు. పుట్టబోయే పిల్లల కోసం, ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మరో రెండ్ బెడ్ రూమ్స్ను సైతం చూపించాడు. వారి అభిరుచికి తగ్గట్లుగా ఆయా గదుల్లో థీమ్ పోస్టర్లను అతికించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. మీ జంట చూడముచ్చటగా ఎలా ఉందో మీ హౌస్ కూడా అంతే బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. -
టిక్టాక్ స్టార్కి ప్రపోజ్ చేసిన బిగ్బాస్ కంటెస్టెంట్
Bigg Boss 4 Fame Mehaboob Dil Se Proposed To Swetha Naidu: బిగ్బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యూట్యూబ్, టిక్టాక్ వీడియోలతో ఫేమస్ అయిన మెహబూబ్ గతేడాది బిగ్బాస్ సీజన్-4లో పాల్గొని మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవలె 'గుంటూరు మిర్చి' అనే వెబ్సిరీస్లోనూ నటించాడు. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్సిరీస్లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా యూట్యూబర్, టిక్టాక్ స్టార్ శ్వేత నాయుడుకు ప్రపోజ్ చేశాడు. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ కలిసి కవర్ సాంగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్లోనూ మెహబూబ్ ఎక్కువగా శ్వేత నాయుడుతోనే రీల్స్ అప్లోడ్ చేస్తుంటాడు. తాజాగా ఆమెకు తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు. 'ఎప్పటి నుంచో చెబ్దాం అనుకున్నా. కానీ ఎప్పుడు ఎలా అయ్యిందో తెలియదు. ఎందుకు ఇష్టం అన్నదానికి ఆన్సర్ తెలియదు. నువ్వు నా తోడుంటే బెటర్, సక్సెస్ఫుల్ పర్సన్ని అవుతా. నాతో జీవితాంతం తోడుంటావా' అంటూ తన మనసులో మాటను రివీల్ చేశాడు. దీంతో శ్వేత సైతం సిగ్గుపడుతూ మెహబూబ్ ప్రేమను అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియోను మెహబూబ్ తన సోషల్మీడియాలో షేర్ చేశాడు. మరి ఈ ఇది రియల్ వీడియోనా లేక యూట్యూబ్ కోసం చేసిన ఫ్రాంక్ వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది. -
స్పీడు మీదున్న సోహైల్, వకీల్ సాబ్ బ్యూటీతో రెండో సినిమా
Bigg Boss Contestant Syed Sohel Ryan Second Movie Details: బిగ్బాస్ షోతో దశ తిరిగిపోయిన అతికొద్దిమందిలో సోహైల్ ఒకరు. బిగ్బాస్ తెలుగు నాల్గో సీజన్లో పాల్గొన్న సోహైల్ తన ప్రవర్తన, ఆటతీరుతో ప్రేక్షకులను కట్టిపటేశాడు. టైటిల్ గెలవలేకపోయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చాక మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా అతడి రెండో సినిమా హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'బూట్ కట్ బాలరాజు' అని టైటిల్ ఫిక్స్ చేశారు. కోనేటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వకీల్సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్గా నటిస్తోంది. బెక్కం వేణుగోపాల్ నిర్మాగా వ్యవహరిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్నివ్వగా మిర్యాల రవీందర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ రావిపూడి మొదటి షాట్ను డైరెక్ట్ చేశాడు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ``లాక్డౌన్ టైమ్లో రిలీజైన పాగల్ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. థియేటర్, ఓటీటీ, శాటిలైట్ అన్ని ప్లాట్ఫామ్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సాహంతోనే మా బ్యానర్లో అల్లూరి సినిమా రూపొందిస్తున్నాం. ఈ సినిమా విషయానికి వస్తే గత ఆరేడు నెలలుగా సోహైల్తో ఒక పాయింట్ అనుకుని దాన్ని ఒక కథగా మార్చి ఈ రోజు ఓపెనింగ్ జరిపాం. ఇలాంటి కథ సోహైల్కి కరెక్ట్. హుషారు తర్వాత ఆ తరహాలో మరో మంచి కథలో వస్తున్న సినిమా బూట్కట్ బాలరాజు. జనవరి, పిబ్రవరిలో వరుసగా షెడ్యూల్స్ జరిపి సినిమా పూర్తి చేస్తాం. తెలంగాణ క్యారెక్టరైజేషన్ కావడంతో తెలుగమ్మాయి కావాలని అనన్యని తీసుకున్నాం అన్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) సోహెల్ మాట్లాడుతూ.. ``బిగ్బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న రెండో చిత్రమిది. దాదాపు తొమ్మిది నెలలు స్క్రిప్ట్ మీద వర్క్ చేశాం. మంచి స్క్రిప్ట్ కుదిరింది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయి. బూట్ కట్ బాలరాజు అనే క్యారెక్టర్ డెఫినెట్గా మీ అందరిలో ఉండిపోతుంది`` అన్నారు. దర్శకుడు శ్రీ కోనేటి మాట్లాడుతూ - ``ఈ కథ ఇంతబాగా రావడానికి నా చిన్ననాటి మిత్రుడు గోపి కారణం. మేం ఇద్దరం కలిసి చాలా రోజుల క్రితమే సినిమా చేయాల్సింది. కాస్త ఆలస్యమైంది. బూట్కట్ బలరాజు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు గంటలు హ్యాపీగా నవ్వుకునే సినిమా`` అన్నారు. ఈ సినిమాలో శ్రీమతి ఇంద్రజ, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, ఆనంద్ చక్రపాణి, ఝాన్సి, జబర్దస్త్ రోహిణి, మాస్టర్ రామ్ తేజస్ తదితరులు నటించనున్నారు. -
సాయం చేసిన కాసేపటికే శివశంకర్ మాస్టర్ కన్నుమూత
Shiva Shankar Master: కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ను రక్షించుకునేందుకు ఆయన కుటుంబ సభ్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఎంతగానో ప్రయత్నించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆయనను బతికించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి, హీరో ధనుష్, సోనూసూద్ హాస్పిటల్ ఖర్చులు భరించేందుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా ధనుష్ రూ.10 లక్షలు, చిరంజీవి రూ.3 లక్షల సాయం అందించారు. వీళ్లు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆయనను దక్కించుకోలేకపోయారు. ఆదివారం సాయంత్రం శివశంకర్ మాస్టర్ తుది శ్వాస విడిచారు. వందల సినిమాలకు కొరియోగ్రాఫర్గా సేవలందించిన ఆయన శాశ్వతంగా కన్నుమూశాడని తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇదిలా వుంటే బిగ్బాస్ నాల్గో సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ వేసిన పెయింటింగ్ వేలం పాటలో 20 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. ఈ డబ్బునంతా అఖిల్ సర్వింగ్ హ్యాండ్స్ అనే ఛారిటబుల్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చారు. శివశంకర్ మాస్టర్ చికిత్సకు ఈ డబ్బు ఎంతోకొంత ఉపయోగపడుతుందని సదరు ఛారిటీ వాళ్లు దాన్ని నేడు(నవంబర్ 28)సాయంత్రం శివశంకర్ మాస్టర్ కొడుకు అజయ్కు విరాళమిచ్చారు. కానీ కాసేపటికే ఆయన కన్నుమూయడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. -
దేత్తడి హారిక ఇల్లు ఎంత బాగుందో చూడండి!
Bigg Boss Fame Dethadi Harika Beautiful Home Tour: అలేఖ్య హారిక.. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిందీ తెలంగాణ పిల్ల. దేత్తడి ఛానల్లో ఆమె చేసే వీడియోలను లక్షలాది మంది వీక్షిస్తున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ క్రేజ్తో హారికకు బిగ్బాస్ నాల్గో సీజన్లో అవకాశం రావడం.. వెంటకే ఓకే చెప్పేయడం, అక్కడ టాస్కుల్లో విజృంభిస్తూ శివంగిగా పోరాడటం ఆమెను మరింత పాపులర్ చేశాయి. ప్రస్తుతం షార్ట్ ఫిలింస్, సాంగ్స్, సరదా వీడియోలతో ఫుల్ బిజీగా ఉంది హారిక. ఇదిలా వుంటే తాజాగా దేత్తడి పాప ఇల్లు ఎలా ఉందో చూపిస్తూ ఆమె తల్లి హోమ్ టూర్ వీడియో చేసింది. మరి ఆమె ఇంటి విశేషాలేంటో చూసేద్దాం.. హారిక ఇంట్లో హాల్, కిచెన్, పూజ గది, మూడు పడక గదులు, రెండు బాల్కనీలు, చిన్నపాటి స్టోర్ రూమ్ ఉన్నాయి. ఏ గదికాగది శుభ్రంగా సర్దేసినట్లుగా ఉంది. హారికకు ఇల్లు సర్దేంత ఓపిక ఉండదు కాబట్టి అన్నీ తానే నీట్గా సర్దుతానని చెప్తోంది ఆమె తల్లి. దాదాపు ప్రతి గదిలోనూ హారిక ఫొటోలే కనిపించాయి. మరీ ముఖ్యంగా అభిమానులిచ్చిన ఫొటోలను ఎంతో భద్రంగా దాచుకుందీ దేత్తడి పాప. షూటింగ్స్తో బిజీగా ఉండే హారిక ఖాళీ సమయాల్లో పెయింటింగ్ కూడా వేస్తుందట! ఆమె బెడ్రూమ్లో తను గీసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. బిగ్బాస్ షోకు గుర్తుగా హౌస్లోని నీటి జార్ను, నామినేషన్స్లో వాడే ఫొటోను, తనకిచ్చిన ఫిదా టైటిల్ను ఇంటికి తెచ్చేసుకుని దాచుకుంది. 'షో మస్ట్ గో ఆన్..' పాట హారికకు ఇష్టమని, త్వరలోనే దాన్ని టాటూ వేయించుకోబోతుందన్న విషయాన్ని అభిమానులకు లీక్ చేసింది ఆమె తల్లి. నిజానికి తనకు ఈ పచ్చబొట్టు పొడిపించుకోవడాలు ఇష్టం లేకపోయినా.. తన కూతురికి ఆ సాంగ్ అంటే తెగ ఇష్టం కావడంతో ఈసారికి తనెలాంటి అభ్యంతరం తెలపడం లేదంటోంది. బిగ్బాస్ నుంచి వచ్చాక సైకిల్ కొనివ్వమని సోహైల్ను అడిగిందట హారిక! కానీ అతడు కొనిచ్చేలోపే తనే వెళ్లి ఓ సైకిల్ను ఇంటికి తెచ్చుకుందని చెప్పింది. కొత్త మురిపెంతో రెండు మూడు రోజులు దాన్ని వాడిందని, కానీ బయట సైకిల్ తొక్కడం వల్ల ముఖం నల్లగా అయిపోతుందని దాన్ని మూలనపడేసిందని చెప్పుకొచ్చింది. అలాగే హారికకు ఇప్పటివరకు వచ్చిన అవార్డులన్నింటినీ వీడియోలో చూపించింది. మీరూ ఆమె ఇంటిని చూసేయండి.. -
కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ, ఇంటి విశేషాలేంటో ఆమె మాటల్లో..
Bigg Boss Telugu 4 Fame Gangavva Shares Home Tour Moments: బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఇటీవల కొత్త ఇంటిలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్తో ఫేమస్ అయిన గంగవ్వ తన మాటలతో ఎంతో ప్రేక్షకుల ఆదరణను పొందింది. అనంతరం బిగ్ బాస్ 4వ సీజన్లో అడుగు పెట్టి.. యావత్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. చదవండి: మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్ వీడియోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జునతో తన చిరకాల స్వప్నం గురించి పంచుకున్న ఆమె నాగార్జున, స్టార్ మా సాయంతో సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. ఇటవల గృహప్రవేశం కూడా చేసిన గంగవ్వ ఈ క్రమంలో తన కొత్త ఇంటి గురించి, అందులోని గదుల ప్రత్యేకత గురించి వివరిస్తూ యూట్యూబ్ చానల్లో విడియో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: 13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్కు తండ్రి నుంచి విముక్తి ఈ సందర్భంగా గంగవ్వ తనకు ఇళ్లు కట్టిస్తానాని మాట ఇచ్చిన హీరో నాగార్జున్, బిగ్బాస్ టీం, స్టార్ మాకు ధన్యావాదాలు తెలిపింది. అలాగే గృహ ప్రవేశానికి కలగూర గంప టీంతో పాటు బిగ్బాస్ కంటెస్టెంట్స్ అఖిల్ తన తల్లితో వచ్చాడని, అలాగే సావిత్రి కూడా వచ్చినట్లు చెప్పింది. అనంతంర కొత్త బిజీ కారణంగా రాలేకపోయారు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గంగవ్వ కొత్త ఇంటిని చూపిస్తూ మురిపోయింది. మరి తన ఇళ్లు ఎలా ఉంది, గంగవ్వ పంచుకున్న విశేషాలను మనం కూడా చూద్దాం రండి! చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం -
తండ్రి బర్త్డేకు మర్చిపోలేని కానుకిచ్చిన అఖిల్ సార్థక్!
అఖిల్ సార్థక్.. బిగ్బాస్ షోతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడీ యంగ్ యాక్టర్. మోనాల్తో లవ్ ట్రాక్, సోహైల్తో ఫ్రెండ్షిప్, ఒంటరిగా గేమ్స్ రఫ్ఫాడించగల సత్తా.. ఇవన్నీ అఖిల్ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. బిగ్బాస్ తెలుగు నాల్గో సీజన్లో రన్నరప్గా నిలిచిన అఖిల్ ఆ మధ్య కారు కొనాలన్న కలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అతడు మరో కల నెరవేర్చుకున్నాడు. తండ్రికి కారు కొనిచ్చే స్థాయికి ఎదిగాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నాడు అఖిల్. "హ్యాపీ బర్త్డే డాడ్, ఒక రక్షకుడిలా ఎప్పుడూ నా వెంటే ఉన్నావు. మీరే నా సూపర్ హీరో, మీ వల్లే నేనీ స్థానంలో ఉన్నాను. మీరు నమ్ముతారో లేదో కానీ మీ కోసం ఓ కారు కొన్నాను. చిన్నప్పుడు మీరు నాకు సైకిల్ సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇచ్చారు, నాకోసం మరెన్నో చేశావు. ఇందుకు మీకెన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. నా నుంచి మీకు చిన్న గిఫ్ట్ పప్పా.. మీరు చేసినవన్నీ నేను మీకు తిరిగి చేయలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా కృషి చేస్తాను. మీరు గర్వపడే పనులు చేస్తాను. మీకు కారు గిఫ్ట్ ఇవ్వాలన్నది నా కల. అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సర్ప్రైజ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా! మిమ్మల్ని ఎప్పుడూ తలెత్తుకుని తిరిగేలా చేస్తానని మాటిస్తున్నాను" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు అఖిల్. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
కొత్త ఇంట్లోకి బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం
Bigg Boss Contestant Gangavva House Warming: యూట్యూబ్ స్టార్, బిగ్బాస్ కంటెస్టెంట్ గంగవ్వ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది. సొంతిల్లు కట్టుకోవాలన్న ఆమె కోరిక నెరవేరింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లిలో నూతనంగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ‘మై విలేజ్ షో’తో య్యూట్యూబ్ స్టార్గా ఎదిగిన గంగవ్వ బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పల్లెటూరి యాస, కామెడీ టైమింగుతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న గంగవ్వ సొంతిల్లు కట్టుకోవాలన్న ఆశయంతో బిగ్బాస్ హౌస్లో అడుగు పెట్టింది. అయితే అనారోగ్య కారణాల వల్ల అయిదో వారంలోనే హౌస్ నుంచి నిష్క్రమించింది. అయినప్పటికీ ఆమె కల కలగానే మిగిలిపోకూడదన్న భావనతో హీరో నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. చెప్పినట్లుగానే ఆమెకు రూ.7లక్షల రూపాయలు సహాయం చేశాడు. బిగ్బాస్ షో ద్వారా రూ.11లక్షలు సమకూరడంతోపాటు మరో రూ.3లక్షల వరకు అప్పుచేసిన గంగవ్వ చివరకు తన సొంత గ్రామం లంబాడిపల్లిలో సొంతిల్లు కట్టించుకుంది. ఎట్టకేలకు తన కల నెరవేరినందుకు గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమానికి బిగ్బాస్ ఫేమ్ అఖిల్, శివజ్యోతి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్ షో టీం సభ్యులు సహా పలువురు హాజరయ్యారు. గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్ షో టీం యూట్యూబ్లో అప్లోడ్ చేసిన కాసేపటికే ట్రెండింగ్లో నిలిచింది. గంగవ్వ కల నెరవేరినందుకు పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
దీపావళికి ఎంటర్టైన్మెంట్ మోత, బిగ్బాస్లోకి మాజీ కంటెస్టెంట్లు!
Bigg Boss 5 Telugu, Diwali Episode: పండగ వచ్చిందంటే చాలు సంబరాలు రెట్టింపు చేస్తుంది బిగ్బాస్ టీమ్. దసరాకు స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం చేసిన బిగ్బాస్ ఈసారి దీపావళికి మరో కొత్త ప్లాన్తో ముందుకు రాబోతోంది. ఎంటర్టైన్మెంట్ను రెట్టింపు చేసేందుకు మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్లను రంగంలోకి దించుతోందట! అంటే ఈ వారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బిగ్బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్ బాబా భాస్కర్, నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్, దివి, సోహైల్, ముక్కు అవినాష్ సండే రోజు నాగ్తో కలిసి సందడి చేయబోతున్నారట! మరి వీరిని లోనికి పంపిస్తారా? లేదా గతేడాది లాగే ఓ ప్రత్యేక గదిలో పెట్టి అక్కడినుంచే గేమ్స్ ఆడిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే మరోసారి వారిని బిగ్బాస్లో చూసే అవకాశం రావడంతో తెగ సంబరపడిపోతున్నారు వారి అభిమానులు. వారి రాకతో ఈ దీపావళి మరిత కలర్ఫుల్గా ఉండటం ఖాయమని జోస్యం చెప్తున్నారు. ఏదేమైనా ఈ మాజీ కంటెస్టెంట్లు షోలోకి వస్తున్నారన్న వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు బిగ్బాస్ లవర్స్, -
సొంతింటి కల సాకారం, మెహబూబ్ దిల్సే ఎమోషనల్
'గుంటూరు మిర్చి'లాంటి కుర్రాడు మెహబూబ్ దిల్సే. యూట్యూబ్, టిక్టాక్ వీడియోలతో ఫేమస్ అయిన ఇతడు గతేడాది బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. టాస్కుల్లో ప్రాణం పెట్టి ఆడే మెహబూబ్ ఫ్రెండ్షిప్కు కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. బిగ్బాస్ ద్వారా కేవలం పాపులారిటీ మాత్రమే కాకుండా మంచి మిత్రులను, ఎన్నో ఆఫర్లను అందుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కంట్లో కూడా పడ్డాడు. బిగ్బాస్ 4 గ్రాండ్ ఫినాలేకి ప్రత్యేక అతిథిగా వచ్చిన చిరు.. మెహబూబ్ డ్యాన్సింగ్ కెపాసిటీకి, ఎనర్జీకి ఆశ్చర్యపోయాడు. సినిమాల్లోకి రావాలన్న మెహబూబ్ తపన, ఆరాటం చూస్తుంటే తనను తాను చూసుకున్నట్లుందని ముచ్చటపడిపోయాడు. అతడు అనాథాశ్రమానికి చేసిన సాయాన్ని చూసి అభినందించాడు. అంతేకాదు, మెహబూబ్ సొంతింటి కల సాకారం చేయడం కోసం రూ.10 లక్షల చెక్కును బహుమతిగా అందించాడు. మొత్తానికి ఈ బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ సొంతింటి కల నెరవేరింది. ఆదివారం కొత్తింట్లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు మెహు. 'ఒక సొంతిల్లు ఉండాలి, కట్టుకోవాలని చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. మొత్తానికి అనుకున్నది సాధించాం. మీ అందరి వల్లే ఇక్కడిదాకా వచ్చాము. మమ్మల్ని ఆశీర్వదించిన భగవంతుడికి కృతజ్ఞతలు. అలాగే నాకు సపోర్ట్ చేసిన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా వుంటే ప్రస్తుతం మెహబూబ్ వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు. ఓ పక్క వెబ్సిరీస్లు చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన గుంటూరు మిర్చి వెబ్ సిరీస్ యూట్యూబ్లో అత్యధిక వ్యూస్తో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) చిరంజీవి మెహబూబ్కు ఇచ్చిన 10 లక్షల రూపాయల చెక్ -
కొత్త కారు కొన్న అరియానా, ఆ ఇద్దరితో ఫస్ట్ రైడ్!
Bigg Boss Beauty Ariyana Purchase New Car: బిగ్బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ఓ గుడ్ న్యూస్ను అభిమానులతో పంచుకుంది. కొత్త కారు కొన్నానంటూ దానికి సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీంతో అభిమానులతో పాటు, పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. కొత్తగా కొనుగోలు చేసిన కియా కారును ఇంటికి తీసుకొచ్చినందుకు గాల్లో తేలిపోతుందీ అరియానా. బిగ్బాస్ నాల్గో సీజన్ సెకండ్ రన్నరప్ సోహైల్, బుల్లితెర నటుడు అమర్దీప్ అప్పుడే ఫ్రెండ్ కారెక్కి షికారు కూడా మొదలెట్టేశారు. బిగ్బాస్లో సోహైల్, స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో అమర్దీప్ అరియానాకు క్లోజ్ ఫ్రెండ్స్. దీంతో కొత్త కారు కొన్న సంతోషాన్ని ఆ ఇద్దరితో పంచుకుంటూ అప్పుడే షికారు మొదలెట్టేసిందీ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం అరియానా బిగ్బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా మరోవైపు సినిమాలు కూడా చేస్తూ బిజీబిజీగా మారింది. ఇక బిగ్బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు సరయు, ఉమాదేవి ఇద్దరినీ అరియానా ఇంటర్వ్యూ చేయగా ఆ రెండు వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
ఎంగేజ్మెంట్ వీడియో షేర్ చేసిన ముక్కు అవినాష్
Mukku Avinash Engagement Video: బుల్లితెర షోలపై తనదైన కామెడీతో సందడి చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న ముక్కు అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుజ అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం జరిగింది. గత బిగ్బాస్ సీజన్ 4లో పెళ్లి పెళ్లి అంటూ కలవరించిన అవినాష్ ఇలా గుట్టు చప్పుడుగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైతేనే పెళ్లి పెళ్లి అంటూ తహతహలాడిన అవినాష్ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషించారు. చదవండి: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే! అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కానీ, ఫుల్ ఫొటోలు కానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అవినాష్ తన ఎంగేజ్మెంట్ వీడియోను విడుదల చేశాడు. ‘జత కలిసే’ అంటూ నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియా వేదికగా అవినాష్ అభిమానులతో పంచుకున్నాడు. పూలు పండ్లు మార్చుకోవడం, ఆ తర్వాత అనుజతో అవినాష్ ఫొటో షూట్ చేయడం, కాబోయే శ్రీమతికి రొమాంటిక్గా ముద్దు పెట్టుకొని డ్యాన్స్ చేయడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో అవినాష్ ఎంగేజ్మెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
Mr Pregnant: గర్భం దాల్చిన బిగ్బాస్ స్టార్ సోహైల్
బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొని తనదైన ఆటతీరుతో లక్షలాది మంది ప్రేక్షకులను సంపాధించుకున్నడాఉ సోహైల్. సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన రియాల్టీ షో తర్వాత విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఓ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమాకి ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ అని టైటిల్ని చిత్రబృందం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉదయం సినిమా టైటిల్, హీరో ఫస్ట్గ్లిమ్స్ని నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. సాధారణంగా అమ్మాయిలు ప్రెగ్నెంట్ అవుతుంటారు. ఇందులో మన హీరో సోహైల్ ప్రెగ్నెంట్ కావడమే షాకింగ్ విషయం. ఈ విషయాన్ని తెలియజేసేలా టీజర్, పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీనివాస్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సుహాసిని, బ్రహ్మజీ, రాజా రవీంద్ర, తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఆచార్య మూవీ టీం నుంచి కాల్ వచ్చింది.. కానీ!: మెహబూబ్
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ షోతో కంటెస్టెంట్స్ అంతా ఒవర్నైట్ స్టార్ అయిపోతున్నారు. హౌజ్లో తమదైన తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతంగా చేసుకుని ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఆ క్రేజ్తోనే వరుస ఆఫర్లు కొట్టెస్తున్నారు. గత సీజన్ 4 కంటెస్టెంట్ ఆరియాన గ్లోరీ రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈక్రమంలో సినిమా ఛాన్స్లు కొట్టెసింది. అలాగే దివి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. సోహైల్ కూడా హీరోగా బిజీ అయిపోయాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా వెబ్ సిరీస్లు, సొంతంగా యూట్యూబ్లు ఛానల్ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా మెహబూబ్ దిల్సేకి ఆచార్యలో నటించే ఆఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సింగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా మెహబూబ్ దీనిపై స్పందించాడు. తనకు ఆచార్య టీం నుంచి కాల్ వచ్చిందని, ఆఫీసుకు వెళ్లి కలిశాను అని చెప్పాడు. అక్కడ తన రోల్ ఎంటో వివరించారని, దానిపై కాసేపు చర్చ కూడా జరిగినట్లు తెలిపాడు. అయితే మళ్లీ తనకు ఫోన్ రాలేదని, ఒకవేళ కాల్ వస్తే కళ్లు మూసుకుని షూటింగ్లో పాల్గొంటానని పేర్కొన్నాడు. కాగా బిగ్బాస్ సీజన్-4 ఫైనల్ ఎపిసోడ్లో చిరు ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సోహైల్, దివి, మెహబూబ్లకు చిరు బిగ్ ఆఫర్లు ఇచ్చాడు. సోహైల్ హీరోగా ఏ సినిమా చేసిన అందులో అతిథి పాత్రలో నటిస్తానని మాట ఇచ్చాడు. దివికి తన నెక్ట్ మూవీలో ఓ పాత్ర ఇస్తానని చెప్పాడు. -
ప్రభాస్తో డేటింగ్కు వెళ్లాలనుంది : బిగ్బాస్ బ్యూటీ
సొట్ట బుగ్గలతో బిగ్బాస్ ప్రేమికులను ఆకర్షించిన కంటెస్టెంటు దివి వైద్య. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందంతో బిగ్బాస్ సీజన్-4లోతనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ భామ. అంతకుముందు పలు సినిమాల్లో రాని గుర్తింపు బిగ్బాస్తో కైవసం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ యూత్లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న దివి ప్రస్తుతం హీరోయిన్గానూ అవకాశాలు కొల్లగొడుతుంది. తాజాగా ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తనకు హీరో ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని, ఒక రకంగా చెప్పాలంటే ఆయనంటే క్రష్ అని చెప్పుకొచ్చింది. మిర్చి సినిమాతో ప్రభాస్కు ఫ్యాన్ అయిపోయానని, అప్పటి నుంచి ఆయనకు ఐ లవ్ యూ అంటూ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తుండేదాన్ని అని పేర్కొంది. అంతేకాకుండా ఒకవేళ అవకాశం వస్తే ప్రభాస్తో డేటింగ్కు వెళ్తానని,మిర్చి లాంటి అబ్బాయితో కప్పు కాఫీ తాగినా చాలని ఫ్యాన్ మూమెంట్స్ను షేర్ చేసుకుంది. -
బిగ్బాస్ బ్యూటీకి మరో 'బిగ్' ఆఫర్
బిగ్బాస్ బ్యూటీ దివికి యూత్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ ఫోటోలతో కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ భామ. బిగ్బాస్ సీజన్-4కు ముందు అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తిపు రాలేదు. కానీ బిగ్బాస్ 4వ సీజన్లో హౌజ్లో అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇటీవలె క్యాబ్ స్టోరీస్తో హీరోయిన్గా అలరించిన ఈ భామకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చిందట. సోగ్గాడే చిన్ని నాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఓ వెబ్సిరీస్లో హీరోయిన్గా దివిని తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుకు కళ్యాణ్ కృష్ణ కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించనున్నారట. -
అలాంటి విమర్శలు పట్టించుకోను, వారికి నా సమాధానం ఇదే!
సొట్ట బుగ్గలతో బిగ్బాస్ ప్రేమికులను ఆకర్షించింది కంటెస్టెంట్ దివి వైద్య. ముక్కుసూటిగా మాట్లాడే నైజం, అందంతో హౌజ్లో తనకంటు ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది ఈ అమ్మడు. బిగ్బాస్కు ముందే వెండితెరపై మెరిసినా దివికి అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. కానీ బిగ్బాస్ ఎంట్రీ తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ షో అనంతరం ఆమెకు హీరోయిన్గా నటించే అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇదే ఆమె కోరిక అని దివి ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. హాట్ హాట్గా ఫొటో షూట్లకు ఫోజులు ఇస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న ఈ భామ, ఇటీవల హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్(TV)-2020 టైటిల్ గెలుచుకుని దర్శక- నిర్మాతల దృష్టిని ఆకర్శించింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్య్వూ ఇచ్చిన దివి గ్లామర్ ప్రపంచంలో తనకు గుర్తింపు అంత సులభంగా రాలేదని తెలిపింది. మోస్ట్ డిసైరబుల్ టైటిల్ను గెలుచుకున్నట్లు తనకు ఫోన్ రాగానే ఉక్కిరిబిక్కిరి అయిపోయానని, ఆ ఆనందం తట్టుకోలేకపోయానని పేర్కొంది. అయితే ‘నటపై ఉన్న ఆసక్తితో ఆడిషన్స్కు వెళ్లగా ప్రతిసారి రిజెక్ట్ అయ్యాను. అలా ఒక 100పైగా ఆడిషన్స్లో నన్ను తిరస్కరించారు. ఆడిషన్స్లో పరాభవం ఎదుర్కొన్న ప్రతిసారి నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను. అయితే మహర్షితో పాటు పలు చిత్రాల్లో నటించిన నేను ఎవరనేది ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు దివి అంటే అందరికి తెలుసు. ‘ఈ క్రమంలో నాకు పెద్ద సినిమాలు, హీరోతో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇది నిజంగా సంతోషంగా ఉంది. నేను నెక్ట్స్ చిరంజీవి గారి సినిమాలో నటిస్తున్నా. మరో మూడు నెలల్లో షూటింగ్ మొదలు కానుంది. పెద్ద స్టార్ల చిత్రాలలో నటించాలని నాకు కోరిక, అంతేగాక మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ రోజు కోసమే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా. కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇక ఇటీవల దివి సిలక ముక్కు దానా అనే ప్రైవేటు సాంగ్లో మెరిసి మాస్ స్టేప్పులతో అలరించిన సంగతి తెలిసిందే. ఈ పాట సూపర్ హిట్గా నిలిచి 1.7 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. అయితే ఇందులో దివి సరిగా డ్యాన్స్ చేయలేదని, తనకు డ్యాన్స్ రాదంటూ విమర్శలు చేస్తూ కామెంట్స్ వచ్చాయి. ఈ సందర్భంగా ఈ విమర్శలపై ఆమె స్పందిస్తూ.. ‘ఈ పాట కోసం, డ్యాన్స్ కోసం నేను ఎంతగ కష్టపడ్డానో నాకే తెలుసు. ఇంత కష్టం నేనేప్పుడు పడలేదు. నాకు మోకాలి నొప్పులు వచ్చినా తట్టుకుని డ్యాన్స్ చేశాను. ఇక నా డ్యాన్స్పై వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. అలాంటి వారిక ఈ పాట సాధించిన విజయం, వ్యూసే సమాధానం’ అంటూ విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. కాగా ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. హారిక నారాయణ్ పాడింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. -
కొత్త బిజినెస్లోకి అడుగు పెట్టిన బిగ్బాస్ బ్యూటీ
బిగ్బాస్ తర్వాత అరియానా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఆమె చేసిన వార్తల్లో నిలుస్తోంది. ఇక ముక్కుసూటి తనంతో బిగ్బాస్ హౌజ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అరియానా. యాంకర్గా కేరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. అదే స్టార్డమ్తో బిగ్బాస్ సీజన్ 4లో కంటెస్టేంట్గా ఛాన్స్ కొట్టేసింది. హౌజ్లో బిగ్బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్లో పాల్గోంటూ మిగతా కంటెస్టెంట్స్కు గట్టి పోటీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక హౌజ్ నుంచి బయటకు వచ్చాక అరియానా కేరీర్పై దృష్టి పెట్టింది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ జాగ్రత్త పడుతోంది. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే’ నానుడిని ఈ అమ్మడు చక్కగా వినియోగించుకుంటుంది. ఇటూ ఇంటర్వ్యూలు చేస్తూనే సెలబ్రేటీ హోదాను ఎంజాయ్ చేస్తున్న అరియాన తాజాగా కొత్త బిజినేస్లోకి అడుగు పెట్టింది. తన పేరు మీద ఈవెంట్ ప్లానింగ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ‘ఆర్య ఈవెంట్ ప్లానింగ్’ పేరుతో కొత్త బిజినెస్ను ప్రారంభించినట్లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో ఆమె సన్నిహితులు, ఫాలోవర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) -
హైదరాబాదీని అయిపోయా.. మోనాల్ ఆసక్తికర పోస్ట్
మోనాల్ గజ్జర్.. బిగ్బాస్ నాల్గో సీజన్లో హాట్ టాపిక్గా మారిన ఒకే ఒక్క పేరు ఇది. తొలుత అభిజిత్తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్తో క్లోజ్గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్కి హైలెట్గా నిలిచాయి. బిగ్బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్లో అఖిల్- మోనాల్ల మధ్య రిలేషన్ వీక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్బాస్లో పాల్గొనకముందు ఈ భామ పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. అప్పటి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్బాస్లో పాల్గొనడం ద్వారా వచ్చింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక తన ఫ్యాన్స్తో టచ్లోకి ఉండేందుకు సోషల్ మీడియాలోకి వచ్చిన ఈ గుజరాతీ భామ.. తరచుగా హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు వదులుతూ హల్ చల్ చేస్తుంది. తాజాగా ఈ భామ ఇన్స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. వరుస ఆఫర్లు రావడంతో తన మకాంని హైదరాబాద్కి మార్చాలని భావించిందట ఈ ముద్దుగుమ్మ. ఇందుగో ఇటీవల హైదరాబాద్లో ఓ ఇంటిని కూడా కొనుగోలు చేసింది. తాజాగా తన తల్లిని తీసుకొని హైదరాబాద్లో ప్రత్యేక్షమైంది మోనాల్. దీనికి సంబంధించిన వీడియోని తన ఇన్స్టాస్టోరీలో పోస్ట్ చేస్తూ.. ‘ఇప్పుడు నాకో ఇల్లు దొరికింది. సో.. నేను కూడా అఫీషియల్గా హైదరాబాదీని అయ్యాను. జై శ్రీకృష్ణా.. గోవిందా గోవిందా’అంటూ పోస్ట్ చేసింది. చదవండి: హీరోయిన్ కాజల్ ఆస్తుల విలువ ఎంతంటే... -
అరియానా ఇంట్లో దొంగతనం! అరేయ్ చంపేస్తా.. అంటూ
బిగ్బాస్ నాల్గో సీజన్లో టామ్ అండ్ జెర్రీ ఎవరు అనగానే సోహైల్, అరియానా అని టపీమని చెప్తారు. ఎంత కొట్టుకున్నా చివరికి కలిసిపోయే వీళ్లను అభిమానులు సోషల్ మీడియాలో సోహియానా అని పిల్చుకుంటారు. బిగ్బాస్ షో తర్వాత కూడా వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా అరియానా మీద ప్రతీకారానికి సిద్ధమయ్యాడు సోహైల్. బిగ్బాస్ హౌస్లో తనకు, అరియానాకు చిచ్చు పెట్టిన చింటు(అరియానా ఫేవరెట్ కోతి బొమ్మ)ను దొంగిలించి ఎత్తుకొచ్చేశాడు. ఈ మేరకు సోహైల్ ఓ వీడియో షేర్ చేశాడు. 'బిగ్బాస్లో నాకు శత్రువు ఉంది. వాడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య చిచ్చు పెట్టాలంటే దీన్ని తీసుకెళ్లండి. దీన్ని అమ్మేస్తున్నా. ఎవరైనా కొనేవాళ్లుంటే ముందుకు రండి' అని చెప్పుకొచ్చాడు. "మొట్టమొదటిసారి నాకు ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తోంది. నా అజాత శత్రువు.. బిగ్బాస్ జర్నీలో నాకున్న ఒకే ఒక ఎనీమీ. అతడే ఇతడు. వీడు దొరికేశాడు. ఇక వదిలేది లేదు. నన్ను ఆపొద్దు. అసలు వీడంటూ లేకపోయుంటే బిగ్బాస్లో నా జర్నీ మరింత బాగుండేది. వీడు నా చేతికి దొరికాడు, ప్రతీకారం తీర్చుకునేందుకు నాతో చేతులు కలపండి. వీడి మీద రివేంజ్ తీసుకునేందుకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. భవిష్యత్తులో ఇంకెవరి మీదా ప్రతీకారం తీర్చుకోనని మాటిస్తున్నా.." అని చెప్పుకొచ్చాడు. తను ఎంతో ఇష్టపడే చింటును అమ్మేస్తాననడంపై అరియానా ఫైర్ అయింది. 'అరేయ్, నిన్ను చంపేస్తా.. అది అమ్మడానికి కాదు..' అంటూ వార్నింగ్ ఇచ్చింది. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి: సారీ అరియానా.. ఆలస్యమైనందుకు క్షమించు: ఆర్జీవీ -
అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది: సోహేల్
సోహేల్... బిగ్బాస్ షోతో ఎనలేని క్రేజ్ సంపాదిచుకున్నాడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్కు తెలుగు బిగ్బాస్-4 సీజన్ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది.హౌజ్లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. వంద రోజుల పాటు హౌస్లో సందడి చేసిన సోహేల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. దీంతో ఒక్కసారిగా అతడికి ఫ్యాన్ ఫాలోయింగ్ వీపరితంగా పెరిగిపోయింది. సీజన్ విన్నర్ కన్నా అత్యధిక పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక సీజన్ ఫినాలే రోజు తనకు వచ్చిన డబ్బుల్లో కొంత పేదల కోసం ఖర్చుపెడతానని ప్రకటించిన సోహేల్కు నాగార్జున నుంచి 10 లక్షల ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు 'సోహీ హెల్పింగ్ హ్యాండ్స్' అనే ఛారిటీ ద్వారా ఇప్పటివరకు తాను చేసిన సేవా కార్యక్రమాలు, దానికి అయిన మొత్తం ఖర్చు వివరాలను వెల్లడించాడు. 'నాలుగు ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. చాలామందికి నిత్యావసరాలు అందించాం. సోహీ హెల్పింగ్ హ్యాండ్స్, సోహెలియన్స్ మద్దతుతో ఇదంతా చేశాం. అలా ఇప్పటివరకు 14 లక్షల 70వేల 250 రూపాయలు జమ అయ్యాయి. వీటితో పాటు నాగార్జున సర్ ఇచ్చిన పది లక్షలు కలిపి ఎంతో మంది అనాథలకు, నిరుపేదలకు సహాయం చేశాం. అప్పుడు మొదలైన కథ ఇప్పటికీ నడుస్తుంది. ఇంక ఇలానే ఇది కొనసాగుతూనే ఉంటుంది' అని పేర్కొన్నాడు. భవిష్యత్తులో తన సినిమాలకు వచ్చే రెమ్యునరేషన్లో కొంత వీటికి ఖర్చుపెడతానని తెలిపాడు. అంతేకాకుండా త్వరలోనే 100మంది జూనియర్ ఆర్టిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తామని వివరించాడు. ఎవరికి తోచినంత వారు పక్కన వాళ్లకి సహాయం చేస్తే ఆ కిక్కే వేరు అంటూ తన స్టైల్లో పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం శ్రీనివాస్ వింజనంపతి డైరెక్షన్లో సోహేల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) చదవండి : ఆట సందీప్కు వాయిస్ మెసేజ్ పంపిన మెగాస్టార్ చిరంజీవి సీరియల్స్ కంటే ముందు ‘వంటలక్క’ రియల్ ప్రొఫెషన్ ఇదే! -
Divi Vadthya: టాప్ యాంకర్లను వెనక్కు నెట్టిన దివి!
'దివి నుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ...' ఈ పాట వినగానే బుల్లితెర అభిమానులకు, అందులోనూ బిగ్బాస్ ప్రేమికులకు టపీమని గుర్తొచ్చే పేరు దివి వైద్య. అందచందాలతోనే కాదు, సూటిగా సుత్తి లేకుండా ఏదైనా ముఖం మీదే మాట్లాడే దివి తన యాటిట్యూడ్తో ఎంతోమందిని బుట్టలో వేసుకుంది. బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న ఆమె హౌస్లో తన ప్రయాణం ఎక్కువ రోజులు సాగకపోయినప్పటికీ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. అలా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని పట్టేసింది. తాజాగా దివి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ వుమెన్గా దివి నిలిచింది. హైదరాబాద్ టైమ్స్ దివిని బుల్లితెర మోస్ట్ డిజైరబుల్ వుమెన్గా ప్రకటించింది. శ్రీముఖి, విష్ణుప్రియ, అనసూయ వంటి టాప్ యాంకర్లను సైతం వెనక్కు నెట్టి మరీ దివి ఫస్ట్ ప్లేస్లో నిలవడమంటే మామూలు విషయం కాదు. దీని గురించి దివి మాట్లాడుతూ.. "ఇది కలా? నిజమా? ఇప్పటికీ అస్సలు నమ్మశక్యంగా లేదు. జనాలు నా అందం కన్నా నా గుణాన్ని ప్రేమించారు. అందరూ నన్ను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటుంటే సంతోషంగా ఉంటుంది. అయినా కాలంతో పాటు అందం మారిపోతుందేమో కానీ తెలివితేటలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి" అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా దివి పాప ఇలాంటి రికార్డును సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. హైదరాబాద్ టైమ్స్.. మోస్ట్ డిజైరబుల్ వుమెన్ ఆన్ టీవీ-2020 జాబితా ఇదే.. 1. దివి వైద్య 2. విష్ణుప్రియ 3. శ్రీముఖి 4. రష్మీ గౌతమ్ 5. వర్షిణి సౌందరరాజన్ 6.వర్ష 7.వింధ్యా విశాఖ 8. అశ్విని 9. దీప్తి 10. సమీరా షెరీఫ్ 11. అషూ రెడ్డి 12. లహరి శరి 13.అనసూయ భరద్వాజ్ 14. అలేఖ్య హారిక 15. నవ్య స్వామి చదవండి: ‘బిగ్బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో ‘క్యాబ్ స్టోరీస్’ -
లవ్ మ్యారేజే, కాదంటే చంపుతా: అరియానా
రామ్గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి అప్పట్లో బాగా క్లిక్ అయింది అరియానా గ్లోరీ. అయితే ఆమె పేరును అంతా మరిచిపోయారు అనుకునేలోపు తెలుగు బిగ్బాస్ నాల్గో సీజన్లో అడుగుపెట్టి నానారచ్చ చేసింది. తనకు తప్పు అనిపిస్తే ఏకంగా బిగ్బాస్నే ఎదురించగలిగే సత్తా ఆమెది. అందుకే అరియానాను అందరూ బోల్డ్ పాప అని పిలుచుకుంటే ఆమె అభిమానులు మాత్రం గోల్డ్ పాప అని పలకరిస్తుంటారు. తాజాగా అరియానా అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా తన వాట్సాప్ డీపీని, వాల్పేపర్ను షేర్ చేసింది. వాట్సాప్ డీపీలో ట్రెడిషనల్గా ఉన్న ఈ బ్యూటీ వాల్పేపర్ మీద మాత్రం ట్రెండీగా రెడీ అయింది. ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు.. అసలు ఎలాంటి వీడియోలు చేయాలో అర్థం కావడం లేదని బదులిచ్చింది. నటన, హోస్టింగ్.. ఈ రెండింట్లో యాంకరింగ్ ఎక్కువ ఇష్టమని, ఆ తర్వాతే యాక్టింగ్ అని తేల్చి చెప్పింది. తన ఫేవరెట్ పర్సన్ తానే అంటూ ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పింది. బిగ్బాస్ భామ అరియానా గ్లోరీ అదిరే స్టిల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి బిగ్బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ గారిని కలుద్దామనుకున్నానని, కానీ సరైన సమయం దొరకడం లేదని తెలిపింది. అలాగే అవెంజర్ బైక్ నడపాలన్న తన మనసులోని కోరికను బయటపెట్టింది. ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? అన్న ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా లవ్ మ్యారేజే చేసుకుంటానని కుండ బద్ధలు కొట్టింది. అరేంజ్డ్ మ్యారేజ్ చాలా కష్టమని అభిప్రాయపడింది. కానీ లవ్ మ్యారేజ్ అంటే కూడా కాస్త భయమేనని చెప్పింది. 'నా తిక్కకు, పిచ్చికి, కోపానికి ప్రేమించినవాడు నన్ను పెళ్లి చేసుకుంటాడా? చేసుకోవాల్సిందే, లేదంటే చంపి పారేస్తా'నని చెప్పింది. ఇక క్రష్ గురించి బయటకు చెప్పనన్న అరియానా కొంతమంది అబ్బాయిలను చూసినప్పుడు 'అరె, భలే ఉన్నాడే ఈ అబ్బాయి' అని మనసులో అనుకుంటానని పేర్కొంది. అభిమానులు కోరిక మేరకు వారికి తన వాట్సాప్ నెంబర్ ఇవ్వాలనుందని, కానీ అందుకు ఇంట్లోవాళ్లు ఒప్పుకోరని కొంటెగా బదులిచ్చింది. చదవండి: పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే.. -
కరోనా: గొప్ప మనసు చాటుకున్న బిగ్బాస్ విన్నర్ అభిజిత్
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఈ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు మరోసారి నిత్యవసర సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆపత్కాలంలో పేద కటుంబాలను ఆదుకునేందుకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు ముందుకు వస్తున్నారు. తాజాగా బిగ్బాస్ 4 సీజన్ విన్నర్ అభిజిత్ తన ఉదారతను చాటుకున్నాడు. సిద్దిపేటకు చెందిన ముడు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణి చేసి వారి అవసరాన్ని తీర్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలు అభిజిత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ‘మూడు కుటుంబాలు నిత్యవసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారని నిన్న సాయంత్రం సిద్దిపేట నుంచి ఓ వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. వెంటనే నేను నాకు తెలిసిన యువకులను దీని గురించి తెలుసుకోమ్మని చెప్పాను. తెల్లారి లేచే సరికి ఈ ఫొటోలు, వీడియొలు నాకు పంపించారు. ఇందుకు సహకరించిన సిద్దిపేట యువకులకు ధన్యవాదాలు’ అంటూ అభిజిత్ రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
‘బిగ్బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో ‘క్యాబ్ స్టోరీస్’
తెలుగు ‘బిగ్బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘క్యాబ్ స్టోరీస్’. కేవీఎన్ రాజేష్ దర్శకత్వం వహించారు. ‘గాలి సంపత్’ చిత్రనిర్మాత ఎస్. కృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న ‘స్పార్క్’ ఓటీటీలో ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరికొత్త కాన్సెప్ట్తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సాయి కార్తీక్ చక్కని సంగీతం అందించారు. గిరిధర్, ధన్రాజ్, ప్రవీణ్, శ్రీహన్, సిరి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన మా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి’’ అన్నారు. -
ఆర్జీవీ OTTలో బిగ్బాస్ బ్యూటీ దివి మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
బిగ్బాస్ సీజన్-4తో తర్వాత యూత్లో బాగా క్రేజ్ సంపాదించుకున్న నటి దివి. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తిపు రాలేదు. కానీ బిగ్బాస్ 4వ సీజన్లో హౌజ్లో అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులే అయినా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తాజాగా క్యాబ్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది ఈ భామ. కెవిఎన్ రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ కృష్ణ నిర్మించారు. అయితే కరోనా ఎఫెక్ట్తో ఈ మూవీని థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు వర్మతో కలిసి స్పార్క్ అనే ఓటీటీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాంగోపాల్ వర్మ తన భవిష్యత్తు ప్రాజెక్టులన్నీ స్పార్క్ ఓటీటీలోనే అందుబాటులో ఉంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటికే ఇందులో వర్మ తెరకెక్కించిన డి చిత్రం విడుదలైంది. తాజాగా దివి లేటెస్ట్ మూవీ క్యాబ్ స్టోరీస్ స్పార్క్లో ఈనెల 28నుంచి స్ర్టీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీలో గిరిధర్, ధన్రాజ్, ప్రవీణ్,శ్రీహాన్, సిరి కీలక పాత్రలు పోషించారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించగా, సాయి కార్తీక్ సంగీతం అందించారు. చదవండి : ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ -
మోనాల్పై అఖిల్కి ఎంత ప్రేమో.. ఈ పోస్ట్ చూస్తే తెలిసిపోతుంది
‘మోనాల్-అఖిల్ మధ్య ఏదో ఉంది.. అది కచ్చితంగా ప్రేమే. లేకపోతే అంత క్లోజ్గా ఎలా ఉంటారు? అఖిల్ కోసం మోనాలు ఎన్ని త్యాగాలు చేసింది. అఖిల్ కూడా మోనాల్ని ఎవరైనా ఏమైనా అంటే అస్సల్ సహించడు. దీన్ని ప్రేమ కాకపోతే ఇంకేం అంటారు? బయటకు వచ్చాక కచ్చితంగా వాళ్లు పెళ్లి చేసుకుంటారు’... బిగ్బాస్ నాల్గో సీజన్ మొదలయ్యాక రెండో వారం నుంచి బుల్లితెర ప్రేక్షకుల మదిలో మెదిలిన అనుమానాలు ఇవి. ఈ అనుమానాలు నిజం చేస్తూ బయట కూడా ఈ జంట ఎప్పుడూ కలుస్తూ నెట్టింట హల్ చేస్తుంది. పైకి మంచి స్నేహితులు అని చెబుతున్నా.. ఎప్పటికప్పుడు ప్రేమ, పెళ్లి పదాలు వాడుతూ అభిమానులను కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు మాత్రం వీరి ప్రేమ విషయాన్ని పరోక్షంగా ఒప్పుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్ట్లతో వీరిమధ్య ప్రేమ ఉందనే సందేహాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఇక తాజాగా అఖిల్ మరో అడుగు ముందుకేసి తన రాణి మోనాలే అని చెప్పేశాడు. దీంతో వారి మధ్య కచ్చితంగా ప్రేమ ఉందని తెలిసిపోయింది. మోనాల్ పుట్టిన రోజు(మే 13)సందర్భంగా గురువారం అఖిల్ ఆమెకు బర్త్డే విషెష్ తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. రాణులకు సంబంధించి చాలా కథలు విన్నా.. రియల్ లైఫ్ రాణి మాత్రం నువ్వేనంటూ మోనాల్ పై ప్రేమను అఖిల్ చెప్పుకొచ్చారు. ఆమె గురించి వర్ణించడానికి తాను వాడిన పదాలు చిన్న పదాలు అని, అయితే ఆ పదాలను మించి వర్ణించడం తన వల్ల కావడం లేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. మోనాల్ లాంటి వ్యక్తిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ షోకు థ్యాంక్స్ అని అఖిల్ అన్నాడు. మోనాల్ భవిష్యత్తులో చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నానని అఖిల్ పేర్కొన్నారు. ప్రేమతో జైకృష్ణ జై శ్రీరామ్ అంటూ అంటూ అఖిల్ తన పోస్ట్ ను ముగించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అఖిల్ పోస్టును చూసిన నెటిజన్లు మోనాల్ పై అఖిల్ కు ఇంత ప్రేమ ఉందా..? అని కామెంట్లు చేస్తున్నారు. ఇక అఖిల్, మోనాల్ కలిసి ‘గుజరాతి అమ్మాయి..తెలుగు అబ్బాయి’అనే వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
కొత్త ఇంటికి మారిన బిగ్బాస్ భామ అరియాన
యాంకర్గా కెరీర్ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిపోయింది అరియానా గ్లోరీ. ఆర్జీవీ చేసిన ఒక్క ఇంటర్వ్యూ ఈ బ్యూటీకి క్రేజ్ సంపాదించి పెడితే బిగ్బాస్ ద్వారా తనెంటో ప్రూవ్ చేసుకుంది. సీజన్-4 హౌజ్లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలు సెలబ్రిటీలు సైతం అరియాన యాటిట్యూడ్కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్ మీడియాలో ఆమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ భామ పెళ్లికూతురిగా ముస్తాబైన ఫొటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇవాళ (బుధవారం) తను కొత్త ఇంటికి మారంటు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో అరియాన మంకీ బొమ్మను చూపిస్తూ చింటు, చింటు అంటూ సందడి చేసింది. ఇక ఎక్కడపడితే అక్కడ సమాన్లతో నిండిపోయి గజిబిజిగా ఉన్న వారి కొత్త ఇంటిని చూపిస్తూ.. ‘హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా మేం కొత్త ఇంటికి మారాం.. చూడండి ఇది మా పరిస్థితి’ అంటూ స్టోరీ షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు ‘మీ ఇల్లు చాలా బాగుంది. ఇంతకి కొన్నారా లేదా రెంటుకు దిగారా’ అంటు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ ఇంటిని కొన్నారా లేదా అనేది మాత్రం ఈ బిగ్బాస్ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు. -
ఏదైతే భయపడ్డానో అదే జరిగింది: అభిజిత్
తెలుగు బిగ్బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ తల్లి కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని అభిజిత్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. "ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. అమ్మకు పాజిటివ్ అన్న విషయం మంగళవారం తెలిసింది. కుటుంబ సభ్యులం పరీక్ష చేయించుకుంటే అందరికీ నెగెటివ్ వచ్చింది. కాస్త ఊరటనిచ్చే విషయం ఏంటంటే అమ్మకు సీటీ లెవల్స్ బాగానే ఉన్నాయి. త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా" "ఇకపోతే ఈ కోవిడ్ మానసిక ధైర్యానికి పరీక్ష పెడుతుంది. ఐసోలేషన్లో ఉండటం అనేది చెత్త విషయం. ఒక వ్యాధి సోకిన మనిషిని రూమ్లో బంధించడం అనేది దారుణం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దురదృష్టవశాత్తూ మనం ఘోర పరిస్థితిలో ఉన్నాం. దీని గురించి ఇంకా మాట్లాడదల్చుకోలేదు. ఈ సమయాన్ని వృథాగా పోనీయకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నా. అలా స్పానిష్ నేర్చుకుంటున్నాను" అని అభిజిత్ చెప్పుకొచ్చాడు. చదవండి: ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా? -
అరియానా అసలు పేరు తెలుసా? నాగార్జునకు కూడా చెప్పలేదు!
అరియానా గ్లోరీ.. బిగ్బాస్ షోలో ముక్కుసూటిదనంతో దూసుకెళ్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఐ యామ్ బోల్డ్ అంటూ బిగ్బాస్ హౌజ్లో అడుగు పెట్టిన ఈ భామ ఎంతో అభిమానులను సొంతం చేసుకుంది. బిగ్బాస్ కంటే ముందు యూట్యూబ్ యాంకర్గా ఉన్న అరియాన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయింది. ఇంటర్వ్యూలో సమయంలో తనను బికినీలో చూడాలని ఉంది అంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్తో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ క్రేజ్తో బిగ్బాస్ ఎంట్రీ కొట్టెసిన అరియాన గ్లోరీ అసలు పేరు చాలా తక్కువ మంది తెలుసు. బిగ్ బాస్ తొలి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున సైతం తన అసలు పేరు అడిగినప్పటికీ ఈ అమ్మడు రీవీల్ చేయలేదు. తనకు అరియానా పేరు అంటేనే ఇష్టమని, అసలు తన పాత పేరు గుర్తు కూడా లేదండూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని తాండూరు నుంచి వచ్చిన ఈ అరియానా గ్లోరీ అసలు పేరు మంగలి అర్చన. అయితే ఈ పేరు చాలా మందికి తెలియదు.. కేవలం తన క్లోజ్ ఫ్రెండ్స్, కుటుంబీకులు మాత్రమే తెలుసు. వారు మాత్రమే తనని అప్పడప్పుడు అర్చన అని పిలుస్తారని, బయట వారంత అరియానా అనే పిలుస్తారట. ఎందుకంటే అర్చన పేరు తనకు కలిసి రాకపోవడం అరియానా గ్లోరీగా పేరు మార్చుకుందట. ఇదిలా ఉంటే అరియానా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్త తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే వరుడు ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది. చదవండి: పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే.. -
బిగ్బాస్ దివిపై ట్రోల్స్.. పాప కాస్తా ఓవర్ చేస్తోందంటూ..
నటి దివి బిగ్బాస్ తర్వాత ఒక్కసారిగా ఫేంను సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినప్పటికి ఈ భామ ఎవరికి అంతగా సుపరిచితురాలు కాదు. కానీ బిగ్బాస్ 4వ సీజన్లో హౌజ్ అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులో అయినా అంత్యంత ప్రేక్షకదారణ పొందింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కాగా బిగ్బాస్ తర్వాత దివి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. అంతేగాక ఫోటో షూట్లు చేస్తూ, పలు ప్రకటనలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దివి బంజారాహిల్స్లోని ప్రోటిన్ మార్ట్ అనే బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఈ బ్రాండ్ ప్రకటనలో నటించింది. ఈ యాడ్కు సంబంధించిన వీడియోను దివి తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు.. ‘దివి పాప కాస్తా ఓవర్ చేస్తోంది’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ యాడ్లో దివి తన వంట మనిషి చేసిన చేప కూర తింటూ ఆమెతో కాస్తా దురుసుగా ప్రవర్తిస్తుంది. దీంతో వంట మనిషి అవి ప్రోటిన్స్ నాన్ వెజ్ మార్ట్ నుంచి తీసుకొచ్చిన చేపలు పాపగారు అని చెప్పడంతో.. తనకు ప్రోటిన్స్ మీద నమ్మకం ఉందంటూ కాస్తా ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఓ ఇంటరర్వ్యూలో దివి మాట్లాడుతూ.. అధికంగా ప్రోటీన్లను అందించే సీఫుడ్ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా గతంలో ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షితో పాటు పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్గా నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) చదవండి: సీ ఫుడ్.. మై డైట్ అంటున్న బిగ్బాస్ బ్యూటీ దివి -
అలీ రెజా కొత్త కారు, రవి ఏదో అంటున్నాడే?
అలీ రెజా.. బిగ్బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఇతడు తన యాటిట్యూడ్తో, ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బిగ్బాస్ మూడో సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచిన అలీ ఈ షో తర్వాత ఏకంగా నాగార్జునతో కలిసి నటించే అవకాశాన్ని సైతం దక్కించుకున్నాడు. అలా యాక్షన్ మూవీ వైల్డ్ డాగ్ సినిమాలోనూ నటించి అభిమానులను మెప్పించాడు. తాజాగా అలీ రెజా ఓ కొత్త కారు కొన్నాడు, మహీంద్రా జిప్సీ ముందు ఫొటోకు పోజివ్వగా దీన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. దీంతో బుల్లితెర స్టార్స్తో పాటు ఫ్యాన్స్ అతడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ రవి డిఫరెంట్గా కంగ్రాట్స్ చెప్పాడు,. వాట్ ద .. అంటూ ఎమోజీలు పెట్టాడు. ఇది చూసిన నెటిజన్లు.. ఎమోజీలతో బాగానే కవర్ చేస్తున్నావే అంటూ సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Ali Reza (@i.ali.reza) చదవండి: నాగార్జున ఫ్యాన్స్ను ఏప్రిల్ ఫూల్ చేసిన 'వైల్డ్ డాగ్' యూనిట్ -
సోహైల్కు ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన ఫ్యాన్
ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ తీసుకొచ్చింది. బిగ్బాస్ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఎంతో ఫేమస్ అయిపోయారు. వీరిలో సింగరేణి ముద్దు బిడ్డ సయ్యద్ సోహైల్ ఒకడు. అప్పటిదాకా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన సోహైల్కు తెలుగు బిగ్బాస్-4 సీజన్ ఒక్కసారిగా గుర్తింపునిచ్చింది. హౌజ్లో ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకన్నాడు ఈ సింగరేణి ముద్దు బిడ్డ. 100 రోజుల పాటు హౌస్లో సందడి చేసిన సోహైల్ ఈ సీజన్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. దీంతో సోహైల్కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ వీపరితంగా పెరిగిపోయిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బిగ్బాస్ షో నుంచి బయటకు రాగానే అతడి కోసం వందల సంఖ్యలో ఫ్యాన్స్ బారులు తీరిన దృశ్యమే ఇందుకు ఉదహరణ. తాజాగా ఓ అభిమాని సోహైల్ బర్త్డే సందర్భంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడట. ఏప్రీల్ 18న సోహైల్ పుట్టిన రోజు సందర్భంగా లక్కీ అనే అభిమాని సోహైల్కు ఖరిదైన స్పోర్ట్స్ బైక్ను బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోహైల్ తన ఇన్స్ట్రాగ్రామ్ షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. అంతేగాక సదరు అభిమానికి ఈ సందర్భంగా సోహైల్ కృతజ్ఞతలు తెలిపాడు. కాగా బిగ్బాస్కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన కోరికను బయట పెట్టాడో లేదో అలా సోహైల్కు దర్శక నిర్మాతల నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో బిగ్బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నాడు. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
‘బిగ్బాస్’ ఆఫర్ రిజెక్ట్ చేశా, డబ్బు కోసం కాదు కానీ.., : ఇంద్రజ
బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఈ బిగ్ రియాల్టీ షోకి విపరీతమైన ఆదరణ ఉంది. ఈ షోలో పాల్గొనే అవకాశం వస్తే వదులుకోలేరు. దానికి కారణం ‘బిగ్బాస్’ నుంచి బయటకు వస్తే.. డబ్బుతో పాటు సీనీ అవకాశాలు రావడమే. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలోకి వెళ్తుంటారు. కొంత మంది సెలెబ్రిటీలు మాత్రం అవకాశం వచ్చినా వెళ్లడానికి మొగ్గు చూపపడం లేదు. ఆ లిస్టులో హీరోయిన్ ఇంద్రజ కూడా ఉన్నారు. బిగ్బాస్ నాల్గొ సీజన్లో ఇంద్రజకు అవకాశం వస్తే వెళ్లలేదట.ఒకప్పుడు హీరోయిన్గా వెలుగు వెలిగిన ఇంద్రజ.. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల బుల్లితెరపై ప్రసారమయ్యే ఓ కామెడీ షోకి జడ్జీగా వ్యవహరిస్తోంది. అయితే తాజాగా ఓ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్బాస్ షోపై తన మనసులోని మాటను బయటకు పెట్టింది. ‘బిగ్బాస్’ నాల్గో సీజన్లో ఆఫర్ వచ్చింది. కానీ నేను రాలేనని చెప్పాను. ఫ్యామిలీని చెన్నైలో వదిలి.. నేను ఇక్కడ ఉండలేను. అందుకే బిగ్బాస్లోకి వెళ్లలేదు. భవిష్యత్తులోనే అవకాశం వచ్చినా వెళ్లలేదు. అయితే గెస్ట్గా అవకాశం వస్తే మాత్రం వెళ్తాను. అది కూడా డబ్బులు కోసం కాదు. హోస్ట్గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జునని చూడడానికే వెళ్తా. ఆయనతో కాసేపు హ్యాపీగా మాట్లాడి బయటకు వస్తా. నాగ్ హోస్టింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటికీ స్టైలీష్గా, అందంగా ఉన్నారు’ అంటూ కింగ్ నాగార్జునపై ప్రశంసలు కురిపించారు ఇంద్రజ. అలాగే నాగార్జునతో కలిసి హలో బ్రదర్ సినిమాలో ‘కన్నెపిట్టరో’ పాటకు నటించాని, ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేనని’ ఆ మధుర జ్ఞాపకాలను ఇంద్రజ గుర్తుచేసుకుంది. చదవండి: అలా పెళ్లి చేసుకోలేదు.. తన లవ్స్టోరీ చెప్పిన ఇంద్రజ నవ్వులు పూయిస్తున్న డాక్టర్ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్ -
అఖిల్ కొత్త బైకు: సోహైల్, మోనాల్కు నో ఛాన్స్!
అఖిల్ సార్థక్.. బిగ్బాస్కు ముందు వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ బిగ్బాస్ తర్వాత ఇతడు తెలియని బుల్లితెర ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్న అఖిల్ తన యాటిట్యూడ్తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చిన ఇతడు పాతికేళ్లకే కారు కొన్నాలన్న కోరికను సైతం గత నెలలో సాకారం చేసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ యాక్టర్ లేటెస్ట్ బైక్ను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ఫొటోలతో పాటు బైక్ నడుపుతున్న వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. "నా కలను నిజం చేసిన ఆ దేవుడికి, నా తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తూ నా వెన్నంటే ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రానున్న రాజుల్లో మీ అందరూ గర్వపడేలా చేస్తాను" అని రాసుకొచ్చాడు. ఇక ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో ఆశ్చర్యపోయిన సోహైల్ తానెక్కడ కూర్చోవాలని ప్రశ్నించాడు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. నీకోసం నా గుండెలో స్పెషల్ సీటు ఉందని రిప్లై ఇచ్చాడు. అతడి ఫ్యాన్స్ మాత్రం అక్కడ ఆల్రెడీ మోనాల్ ఉందిగా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక గంగవ్వేమో జర నెమ్మదిగా నడుపు అని తన మనవడు అఖిల్కు సూచించింది. పలువురు సెలబ్రిటీలతో పాటు అతడి అభిమానులు సైతం అఖిల్ కొత్త బైకు కొన్నందుకు కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ బైకుకు ఒకటే సీటు ఉండటంతో అఖిల్.. సోహైల్, మోనాల్నే కాదు, ఎవరినీ ఎక్కించుకుని రైడ్కు తీసుకెళ్లలేడు. కాగా గతంలో పలు సీరియళ్లలో నటించిన అఖిల్ ప్రస్తుతం మోనాల్ గజ్జర్తో "తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి" అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. చదవండి: అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్ భయంతో అవ్వా అంటూ ఏడ్చినంత పని చేసిన గంగవ్వ! -
కరోనా వ్యాక్సిన్: గంగవ్వకు స్వల్ప అస్వస్థత
సాక్షి, కరీంనగర్: బిగ్బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్లందరినీ తన మాటల గారడీతో హుషారెత్తించింది గంగవ్వ. వయసులో పెద్దదైనా అందరినీ కలుపుకుంటూ, ఆఖరికి వ్యాఖ్యాత నాగార్జునను కూడా అన్న అని పిలుస్తూ ఆప్యాయతగా కబుర్లు చెప్పేది. కానీ పచ్చటి పైర్ల మధ్య జీవిస్తూ మట్టివాసన పీల్చే ఆమెకు అక్కడి ఏసీ వాతావరణం పడక అనారోగ్యం బారిన పడింది. దీంతో హౌస్ నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేసింది. ఇక బిగ్బాస్ తర్వాత మరెంతమందో అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంది. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వ్యాక్సిన్ తొలి డోసు వేసుకుంది. అయితే వ్యాక్సిన్ తీసుకునే సమయంలో చిన్నపిల్లలా భయడుతూ అవ్వా.. అంటూ కేకలు పెడుతూ ఏడిచినంత పని చేసింది. ఇక వ్యాక్సిన్ తర్వాత ఆమెకు జ్వరం వచ్చిందని, అంతే కాక ఒళ్లు నొప్పులతోనూ సతమతమవుతోందని గంగవ్వ బాధ్యతలు చూసుకునే శ్రీకాంత్ మీడియాకు తెలిపాడు. అయితే వ్యాక్సిన్ తర్వాత ఈ లక్షణాలు సాధారణమే కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదని చెప్పాడు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోందన్నాడు. ప్రస్తుతం ఆమె తన పనిని పక్కనపెట్టి విశ్రాంతి తీసుకుంటోందని తెలిపాడు. చదవండి: గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ గంగవ్వకు పట్టగొలుసులు ఇచ్చిన అఖిల్ -
ముక్కు అవినాష్ తల్లికి అనారోగ్యం: CMRF నుంచి చెక్
బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్, జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ తల్లి అనారోగ్యానికి లోనైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆమె వైద్యానికి అవసరమయ్యే డబ్బును చెక్ రూపంలో అందించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన కాళ్ళ లక్ష్మిరాజం (ముక్కు అవినాష్ తల్లి) అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 60 వేల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నగదుకు సంబంధించిన చెక్కును శనివారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్ష్మీరాజం కుమారుడు అవినాష్కు అందజేశారు. అనంతరం ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా అవినాష్ బిగ్బాస్ నాలుగో సీజన్లో వైల్డ్కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తూ ప్రేక్షకులకు నాన్స్టాప్ కామెడీని పంచాడు. అరియానాతో స్నేహం చేస్తూ మోనాల్ను ఆటపట్టిస్తూ తెగ సందడి చేసిన అతడు ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: 'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్ 'ఆర్ఆర్ఆర్' నుంచి రామ్చరణ్కు స్పెషల్ సర్ప్రైజ్ -
మోనాల్తో వీడియో కాల్, అఖిల్ కామెంట్ వైరల్
బిగ్బాస్ 4 సీజన్ కపుల్గా మోనాల్, అఖిల్కు సోషల్ మీడియాలో వీపరీతమైన క్రేజ్ ఉంది. బిగ్బాస్ హౌజ్లో ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ట్రయాంగిల్ లవ్స్టోరిగా గొడవలు, ప్రేమలు, స్నేహాలు, అపార్థాలతో ఈ షో అంతా మోనాల్, అఖిల్, అభిజిత్ల చూట్టే తిరిగింది. ఇక మోనాల్-అఖిల్ల మధ్య జరిగే రొమాంటిక్ మచ్చట్ల కోసమే చాలా మంది ఈ షోని వీక్షించారనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిన మోనాల్ను బిగ్బాస్ చివరి వరకు పట్టుకొచ్చాడు. దీంతో మోనాల్ను నెటిజన్లు బిగ్బాస్ దత్త పుత్రికను చేసేశారు. అయినప్పటికి ఎప్పుడు వీరిద్దరి మంచి స్నేహితులమే అని చెబుతుంటారు. దీంతో వీరిద్దరి మధ్య ఏముందో ఇప్పటికి ఎవరికి అంతు చిక్కడం లేదు. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఈ కపుల్ తరచూ పార్టీలకు అటెండ్ అవ్వడం, పలు టీవీ షోలో జంటగా పాల్గొంటూ అదే బ్రాండ్ను కొనసాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా, ప్రేమో అర్థంకాక ప్రేక్షకులు, అభిమానులు జుట్టు పిక్కుంటున్నారు. అయితే వీరిద్దరూ తరచూ వీడియో కాల్స్, చాట్స్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్, మోనాల్తో వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. బిగ్హౌజ్లో, బయటయ పలు టీవీ కార్యక్రమాల్లో మెనాల్పై ఉన్న ప్రేమను పాట రూపంలో వ్యక్త పరిచే అఖిల్.. ఈ సారి కవితాత్మకంగా చెప్పి కవిగా మారాడు. మోనాల్తో వీడియో కాల్ మాట్లాడిన అనంతరం అఖీల్.. మా సంతోషం ఇలా ఉందంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. ఆ తరువాత ‘ప్రేమ క్యాన్సర్ వంటిది.. అది మరిచిపోయినట్టు చేస్తుంది.. చివరకు ప్రాణాలను తీసుకెళ్లిపోతోంది’ తన కవి హృదయాన్ని బయటపెట్టాడు. దీంతో అఖిల్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కాగా వీరిద్దరూ జంటగా ప్రేమ కథా నేపథ్యంలో ఓ వెబ్ సిరీస్ రానున్న సంగతి తెలిసిందే. చదవండి: రామ్ చరణ్ బర్త్డే: మెగాస్టార్ ఎమోషనల్ వీడియో ఆచార్యతో కలిసి నడిచిన సిద్ధ -
అరియానా కోలుకోవాలంటూ ఫ్యాన్స్ పూజలు
బిగ్బాస్ షో అన్నది ఓ రకంగా విలాసవంతమైన జైలు లాంటిది. అందులో అడుగు పెట్టిన వాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకుని చివరి వరకు నిలబడితే విజేతగా అవతరిస్తారు. లేదంటే, మధ్యలోనే ఎలిమినేట్ అయిపోతుంటారు. అయితే షో తర్వాత కూడా వీరికి ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుతూనే ఉంటాయి. అందుకు తాజా ఘటన నిదర్శనం. తెలుగు బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ ఈ మధ్య అనారోగ్యానికి లోనైంది. తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులుగా బాధపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. దీంతో ఆందోళనపడిన అభిమానులు ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ప్రస్తుతానికి తన ఆరోగ్యం కుదుటపడిందని, జ్వరం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చింది. "నాకు జ్వరం వచ్చింది, వెళ్లిపోయింది. నన్నేం చేయలేదు. ఆ విషయంలో నాకు సంతోషంగా ఉంది. నా కోసం చాలామంది అదేపనిగా మెసేజ్లు చేస్తున్నారు. స్టేటస్లు పెడుతున్నారు. నేను వెంటనే కోలుకోవాలని కొందరైతే ఏకంగా పూజలు కూడా చేయిస్తున్నారు. నామీద ప్రేమ చూపిస్తున్న అందరికీ థ్యాంక్స్" అని ఈ బోల్డ్ భామ పేర్కొంది. దీంతో అరియానా తిరిగి సోషల్ మీడియాలో సందడి చేయడంతో అవినాష్, సోహైల్ సంబరపడిపోయారు. ఇక బుల్లితెరపై అవినాష్తో కలిసి సందడి చేస్తున్న అరియానా యంగ్ హీరో రాజ్తరుణ్తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఏదైనా అప్డేట్ ఇస్తారేమో వేచి చూడాలి! చదవండి: అఖిల్ పేరు పచ్చబొట్టు వేయించుకున్న ఫ్యాన్ నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్! -
'అవ్వ బంగారం' అంటూ అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్
బిగ్బాస్ నాల్గో సీజన్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గంగవ్వ. యూట్యూబ్ వీడియోలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆమె బిగ్బాస్లో ఎంట్రీ ఇచ్చి సంచలనమే క్రియేట్ చేసింది. అయితే వయసురీత్యా అనారోగ్యం వెంటాడుతుండటంతో షో మధ్యలోనే అర్ధాంతరంగా బయటకు రాక తప్పలేదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం అందరికంటే హుషారుగా ఉంటూ మిగతా కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. ఇక అఖిల్ సార్థక్ను ప్రేమగా అఖిలూ... అని పిలుస్తూ సొంత మనవడిలా చూసుకునేది. దత్తత తీసుకుని పెళ్లి కూడా చేస్తానంది. అతడు కూడా అవ్వతో ఆప్యాయంగా మెలిగేవాడు. తాజాగా అఖిల్ ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేసింది గంగవ్వ. చాలా రోజులకు అఖిల్ను కళ్లారా చూడటంతో అవ్వ తెగ సంతోషపడిపోయింది. అఖిల్ను తీసుకుపోయేందుకు వచ్చానంటూ అతడి కుటుంబ సభ్యులతో చెప్పుకొచ్చింది. ఇక అఖిల్ వేసుకున్న జీన్స్ మీద కూడా సెటైర్లు వేసింది. ఇది చినిగిపోయింది. ఇలాంటివి నేను మసిగుడ్డలుగా వాడుతానంటూ అతడి పరువు తీసింది. కానీ అంతలోనే అఖిల్ ఒక్కడే కాదు, ఇప్పుడు అందరూ ఇలాంటివే తొడుగుతున్నారని వెనకేసుకొచ్చింది. ఇక సడన్గా అఖిల్ వాళ్ల అమ్మానాన్న కనిపించకపోవడంతో అవ్వ వారి కోసం తెగ వెతికింది. అయితే ఇక్కడ అఖిలే వారి పేరెంట్స్ను బయటకు పంపించి ఆమె కోసం పట్టీలు తీసుకురమ్మన్నాడు. దీంతో అవ్వ ఇష్టపడే డిజైన్లో పట్టీలు కొనుక్కొచ్చారు. వాటిని అవ్వ కాలికి పెట్టి సర్ప్రైజ్ చేశారు. మొత్తానికి ఊరి నుంచి వచ్చిన అవ్వను ఊరికే పంపించకుండా కానుక ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె వెళ్లిపోతుండటంతో 'నా అవ్వ బంగారం..' అంటూ అఖిల్ కొద్దిగా ఎమోషనల్ అయ్యాడు. చదవండి: ఇన్స్టాగ్రామ్ రీల్స్..ఇప్పటికే..10 లక్షలకు పైగానే లైక్స్ గాలి మోటార్ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ ఎమీ హాకిన్స్.. మరో గంగవ్వ -
బిగ్బాస్ భామల బ్యూటిఫుల్ ఫోటోలు
-
అభిమాని చేసిన పనికి షాకైన అఖిల్
అఖిల్ సార్థక్.. బిగ్బాస్ నాల్గో సీజన్లో అతివల మనసు దోచిన అందగాడితడు. కేవలం ఫిట్నెస్తోనే కాకుండా యాటిట్యూడ్తో, తనదైన గేమ్ ప్లేతో ఫినాలే వరకు చేరుకున్నాడు. కానీ గెలుపుకు అడుగు దూరంలో ఆగిపోయి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. అభిమానుల అండ మెండుగా ఉన్న ఇతడికి ఆ మధ్య ఓ ఫ్యాన్ ల్యాప్టాప్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత ఓ వ్యక్తి బిగ్బాస్ ఐ ఉన్న బ్రేస్లెట్ ఇచ్చి అతడి మెప్పు పొందాడు. కానీ తాజాగా ఓ వీరాభిమాని చేసిన పనికి అఖిల్కు షాక్ కొట్టినంత పనైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బిగ్బాస్ షో సమయం నుంచి అఖిల్కు వీరాభిమానిగా మారిపోయాడు అర్జున్ అనే వ్యక్తి. అతడు అందరిలా తన హీరోతో సెల్ఫీ దిగి సంతృప్తిపడాలనుకోలేదు. అతడెప్పటికీ తనతోనే ఉండిపోవాలనుకున్నాడు. దీంతో అఖిల్ పేరును ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఈ మధ్యే అతడు అఖిల్తో ఫొటో దిగాడు. ఈ నేపథ్యంలో అతడి ఎద మీద టాటూ చూసిన అఖిల్కు దిమ్మతిరిగినంత పనైంది. తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు నోట మాట రాకుండా పోయింది. ఈ క్రమంలో అతడు తన అభిమానితో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. "ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకిప్పుడు మాటలు కరువయ్యాయి. కానీ ఇలాంటి అభిమానులు దొరకడం నా అదృష్టం. నా పేరును పచ్చబొట్టు వేయించుకోవడం సాధారణ విషయం కాదు. నీ జీవితంలో నన్ను భాగస్వామ్యుడిని చేసినందుకు, నా మీద ఇంత ప్రేమ చూపిస్తునందుకు థ్యాంక్ యూ అర్జున్. తప్పకుండా మీ అందరూ గర్వపడే స్థాయికి ఎదుగుతాను. కానీ ఓ ముఖ్య విషయం: మీకు నేనంటే చాలా ఇష్టం, అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ టాటూలు వేయించుకోవడానికి బదులు ఎప్పటికీ మీరు నాతోనే ఉంటానని మాటిస్తే అదే చాలు.." అని రాసుకొచ్చాడు. ఈ ఫొటో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇక పాతికేళ్ల వయసులో కారు కొనుక్కోవాలన్న అభిలాషను అఖిల్ ఈ మధ్యే నేరవేర్చుకున్న విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) చదవండి: హారిక నియామకానికి సంబంధించిన వివరాలు తొలగింపు పాతికేళ్లకే సాధించిన అఖిల్ సార్థక్ -
స్టార్ హీరోయినే నా డ్రీమ్: దేత్తడి హారిక
సాక్షి, హైదరాబాద్ : బిగ్బాస్ ఫేం..‘దేత్తడి’ హారిక బంపర్ ఆఫర్ అందుకున్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్గా హారిక నియమితులయ్యారు. బిగ్బాస్ రియాలిటీ షోలో ఫైనల్ వరకు వచ్చిన హారిక ఈ నియామకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి అవకాశాన్ని దక్కించుకున్నారు. సోమవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈ మేరకు ఆమెకు నియామక పత్రాన్ని అందించారు. అలాగే దీనికి సంబంధించిన వివరాలను తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. కాగా తెలంగాణ యాసతో యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సాధించిన దేత్తడి హారిక ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. ఆ క్రేజ్తోనే తెలుగు బిగ్బాస్ 4 సీజన్కు సెలక్ట్ అయ్యారు. హౌజ్లో మిగతా కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చి ఫైనల్ వరకు పోరాడారు. టాప్ 5కు చేరి ప్రేక్షకుల మన్ననలు పొందారు. బిగ్బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా హారిక వరుస అవకాశాలు అందుకుంటున్నారు. పలు ప్రాజెక్టులతోపాటు సినిమా చాన్స్లు కొట్టేశారు హారిక. మరోవైపు.. ప్రస్తుత తన ప్రయాణం ప్రారంభమే అని, ఎప్పటికైనా హీరోయిన్ సినిమాలు చేయడమే తన లక్ష్యమని మనసులో మాటని బయటపెట్టింది బిగ్బాస్–4 ఫేమ్ దేత్తడి హారిక(అలేఖ్య హారిక). నగరంలోని మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో సీఈఓ హరికాంత్, డాక్టర్ పూర్ణిమతో పాటు ముఖ్య అతిథిగా దేత్తడి హారిక పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒక అమ్మాయిగా తనకెప్పుడూ అమ్మే ఆదర్శమని, అంతకుమించి ఎవరినీ స్ఫూర్తిగా తీసుకోనని పేర్కొంది. ముఖ్యంగా తాను తీసుకునే మంచి నిర్ణయాలే తనకు స్ఫూర్తి అని తెలిపింది. ప్రస్తుతం వరుడు కావలెను అనే సినిమాతో పాటు మరిన్ని సినిమాల్లో చేస్తున్నాని, అంతేకాకుండా తన యూట్యూబ్ చానెల్లో మరో వెబ్ సిరీస్ రానుందన్నారు. ఎప్పటికైనా సినిమాల్లోనే.. మంచి కథాంశంతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో హీరోయిన్గా నటించాలనుందని దేత్తడి హారిక తెలిపింది. మహానటి లాంటి సినిమాలో చేయాలనుందని, అంతేకాకుండా రామ్ జామ్ తరహా సినిమాలన్నా తనకు ఎంతో ఆసక్తి అని పేర్కొంది. Sri Uppal Srinivas Gupta Garu, Chairman of Telangana state tourism Development corporation, appointed Miss Alekhya Harika as the new brand ambassador for TSTDC@USrinivasGupta @VSrinivasGoud @KTRTRS @harika_alekhya #Telanganatourism #TSTDC pic.twitter.com/cMIyK4yRlp — Telangana State Tourism (@tstdcofficial) March 8, 2021 చదవండి: ‘బిగ్బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’ నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్! -
నాగార్జునతో అభిజిత్ బిగ్ డీల్!
తెలుగు నాట బిగ్బాస్ రియాలిటీ షోకు స్పెషల్ క్రేజ్ ఉంది. బిగ్బాస్ వస్తుందంటే చాలు సీరియళ్లకు ఫుల్స్టాప్ పెడ్తూ రిమోట్ మార్చేస్తుంటారు. మా టీవీలో ప్రసారమయ్యే బిగ్బాస్ హౌస్లోకి వీళ్లే నేరుగా ప్రవేశించినంత సంబరపడిపోతుంటారు. ఇక వారి ఫేవరెట్ సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా వస్తే వాళ్ల ఆనందాన్ని మాటలో చెప్పలేము. హాట్స్టార్ ఓట్లు మాత్రమే కాదు మిస్డ్ కాల్స్ కూడా ముఖ్యమేనంటూ లోపల ఉన్న పోటీదారులను ఎలిమినేషన్ నుంచి గట్టెక్కించేందుకు నానా రకాలుగా కష్టపడుతారు. మొత్తానికి తెలుగు బిగ్బాస్ నాల్గో సీజన్లో అందరూ ఊహించినట్లుగానే అభిజిత్ విజేతగా అవతరించాడు. కానీ సోహైల్ రూ.25 లక్షలు తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకోవడంతో అభిజిత్ ప్రైజ్మనీలో కోత పడింది. దీంతో అతడు కూడా పాతిక లక్షలు తీసుకుని ట్రోఫీని పట్టుకెళ్లిపోయాడు. షో తర్వాత తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అభిజిత్ నోరెళ్లబెట్టాడు. తనను గెలిపించిన ప్రేక్షకులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని వారి మీద ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే అతడు సినిమాల్లోకి వస్తే చూడాలని ఉందని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తుండగా అభిజిత్ మాత్రం పలు కారణాలు చెప్తూ తన దగ్గరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడ్డారు. అయితే తాజాగా ఫిల్మీ దునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అభిజిత్ ఏకంగా నాగార్జునతో డీల్ కుదుర్చుకున్నాడట. అవును, నాగ్ సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్తో ఓ మూడు సినిమాలు చేసేందుకు అభిజిత్ సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటికి దర్శకులను వెతికే పనిలో పడ్డారట. అంటే దర్శకులు దొరికేయగానే అభిజిత్ ఒకేసారి మూడు ప్రాజెక్టుల్లో పని చేస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉండబోతున్నాడని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అన్నపూర్ణ స్టూడియోస్ అభిజిత్తో ఓకేసారి మూడు సినిమాలకు డీల్ కుదుర్చుకోవడమంటే మామూలు విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకైతే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. చదవండి: అనురాగ్ కశ్యప్, తాప్సీలపై ఐటీ దాడులు: రూ.350 కోట్లకు పన్ను ఎగవేత అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్: అవాక్కైన బిగ్బాస్ కంటెస్టెంట్ -
బిగ్బాస్ బ్యూటీ అరియానాకు ‘మెగా’ ఆఫర్
యాంకర్గా కేరీర్ మొదలు పెట్టిన అరియానా గ్లోరీ బిగ్బాస్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్బాస్ తర్వాత ఫుల్ బిజీగా మారింది. యాంకర్గా రామ్ గోపాల్ వర్మ్ను ఇంటర్వ్యూ చేయడంతో అందరి దృష్టి ఆకర్షించిన ఈ భామ ఇప్పుడు వెండితెరపై మెరవనున్నట్టు సమాచారం. ఇప్పటికే యంగ్ హీరో రాజ్ తరుణ్తో కలిసి అరియానా ఓ సినిమాలో నటిస్తుంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేసింది. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సెట్స్పై ఉండగానే.. అరియానా మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. మెగా హీరో కల్యాణ్ దేవ్ సినిమాలో అరియానా నటిస్తుంది. శ్రీధర్ సీపన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ దేవ్కు చెల్లి పాత్రలో అరియానా కనిపించనుంది. స్పోర్ట్స్ బేస్డ్ డ్రామాలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. నమో వెంకటేశ, దూకుడు సహా పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన శ్రీధర్ సీపన ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన విజేత సినిమాతో కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆయన నటించిన ‘సూపర్ మాచి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి : (బిగ్బాస్ భామ అరియానకు అరుదైన ఘనత) (ఆచార్య’ సెట్లో సందడి చేయనున్న మెగా కోడలు) -
ఏకధాటిగా 21 గంటలు షూటింగ్లో పాల్గొన్నా
మోనాల్ గజ్జర్ ఇప్పుడీ పేరు టాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తోంది. బిగ్బాస్ షోతో ఈ అమ్మడుకు దక్కిన క్రేజ్ వేరే ఎవరికీ దక్కలేదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హౌజ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ భారీగానే పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపించింది. ఒక వైపు తన ముద్దుముద్దు మాటలు.. మరో వైపు హౌస్లో ట్రయాంగిల్ లవ్స్టోరి షోకే హైలేట్గా నిలిచాయి. కొన్నిసార్లు ఆమె ప్రవర్తనకు విమర్శలు ఎదురైనా అవేం పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకు వెళ్ళిపోయింది. పద్నాలుగా వారాలపాటు హౌస్లోఉన్న ఈ గుజరాతి భామ ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. కుర్రకారుల మనస్సును కొల్లగొట్టిన ఈ బ్యూటీ ఓంకార్ డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జిగా చేస్తోంది. అఖిల్ సార్థక్తో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. కాగా, ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో తను చేసిన పోస్ట్ ఇప్పుడు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. డ్యాన్స్ షో ఎపిసోడ్ కోసం ఏకంగా 21 గంటలు షూటింగ్ చేసినట్లు వెల్లడించింది. అంతసేపు కష్టపడినా ఇప్పటికీ ఎంత ఫ్రెష్గా ఉన్నానో అంటూ ఓ వీడియోను ఇన్స్టా స్టోరీస్లో యాడ్ చేసింది. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మోనాల్ ఓపిక, సహనానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చదవండి: మోనాల్ గిఫ్ట్: హాట్గా ఉన్నానంటున్న అఖిల్! మహేశ్బాబుతో మోనాల్ స్పెషల్ సాంగ్! -
అఖిల్ సర్ప్రైజ్ గిఫ్ట్: అవాక్కైన బిగ్బాస్ కంటెస్టెంట్
తెలుగు బిగ్బాస్ నాల్గో సీజన్కు రన్నర్ను, కానీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న విన్నర్ను అని చెప్పుకుంటాడు అఖిల్ సార్థక్. ప్రస్తుతం అతడు తెలుగు అబ్బాయి - గుజరాత్ అమ్మాయి అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ సోమశేఖర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా అతడి ఫొటో ఫ్రేమ్ను ప్రత్యేక కానుకగా పంపించాడు. ఈ విషయాన్ని అతడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో అభిమానులతో పంచుకున్నాడు. "హలో రాక్స్టార్, హ్యాపీ బర్త్డే. మనిద్దరికీ చాలా దగ్గర పోలికలున్నాయి. అందుకే ఇలా కనెక్ట్ అయిపోయాం. మా అమ్మది తమిళ్. అలా నాకు ఆ భాష కాస్తోకూస్తో అర్థమవుతుంది, కానీ మాట్లాడలేను. నేను తమిళ బిగ్బాస్ షో చూశాను. ఇద్దరం బిగ్బాస్ 4 నుంచి వచ్చినవాళ్లమే. లవ్ యూ రాక్స్టార్" అంటూ వీడియో సందేశం పంపాడు. ఇక అతడు పంపిన గిఫ్ట్ చూసి సోమశేఖర్ ఎంతగానో ఆశ్చర్యపోయాడు. "ఓ మై గాడ్, చాలా బాగుంది బ్రదర్" అంటూ త్వరలోనే కలుద్దామని చెప్పుకొచ్చాడు. సోమశేఖర్ విషయానికొస్తే.. బాక్సింగ్ మ్యాచ్లో గోల్డ్ మెడల్, తమిళనాడు స్టేట్ లెవల్ మువైతాయ్ ఛాంపియన్షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన ఆయన 'అజగియ తమిళ్ మ్యాగన్' టీవీ షోలో తళుక్కున మెరిశాడు. బైకులను అమితంగా ప్రేమించే ఇతడు ఈ మధ్యే కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన తమిళ బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొని అందరి ఆదరాభిమానాలను అందుకున్నాడు. గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న ఇతడు నాలుగో రన్నరప్గా నిలిచాడు. చదవండి: అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్ ఫ్రాంక్తో తల్లిని హడలుగొట్టిన కుమారులు -
తొక్కేశారు, రాహుల్ కాలికి రక్తస్రావం
బిగ్బాస్ మూడో సీజన్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అందరి నోళ్లలో నానేలా తన స్టోర్కు ఊకోకాకా అని నామకరణం చేశాడు. హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో ఇప్పటికే ఈ స్టోర్లను లాంఛనంగా ప్రారంభించగా ఆదివారం సాయంత్రం వరంగల్లోని హన్మకొండలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రాహుల్ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో వారిని ఆపడం అక్కడున్నవాళ్లకు కష్టతరంగా మారింది. ఈ క్రమంలో రాహుల్ తనను ముందుకెళ్లనివ్వకుండా పైపైకి వస్తున్నవారి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో పలువురు నెటిజన్లు రాహుల్ చిచా ఇలా ప్రవర్తించాడేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే అతడి తీరును తప్పుబట్టారు. సెలబ్రిటీ అయ్యావని పొగరు చూపిస్తున్నావా? అంటూ కొందరు విమర్శలు చేశారు. దీంతో రాహుల్ తన కోపం వెనక ఉన్న బాధను బయట పెట్టాడు. "పొద్దున్నే నా కుడి కాలి చిటికెన వేలుకు ఆరు కుట్లు పడ్డాయి. అయినా ఓ 20 మంది నా కాలిని తొక్కేశారు. ఆ కుట్ల నుంచి రక్తం కారిపోతుంది. దీంతో ఎక్కడ కుట్లు ఊడిపోతాయో అని భయపడ్డాను. అంతే, కానీ మీ అందరికీ నా కోపం మాత్రమే కనబడుతుంది. ఏదేమైనా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఓరుగల్లు జనాల వల్ల స్టోర్ వైభవంగా ప్రారంభించాం" అని తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) చదవండి: ఆమెను అమాంతం ఎత్తుకున్న రాహుల్! 'ప్యాన్ ఇండియా’ను టార్గెట్ చేసిన చిరు, చెర్రీ, ప్రభాస్ -
అఖిల్ కొత్త కారు: షికారుకెళ్దామంటున్న సోహైల్
గెలుపు ఒక్కటే విజయం కాదు, డబ్బుతో వెలకట్టలేని అభిమానాన్ని సంపాదించడమూ ఓ రకంగా విజయమే. బిగ్బాస్ నాల్గో సీజన్ రన్నర్ అఖిల్ సార్థక్ ఈ మాటను బలంగా విశ్వసిస్తాడు. అందుకే హిందీ బిగ్బాస్ 14వ సీజన్ విన్నర్ రుబీనాకు కాకుండా రన్నర్గా నిలిచిన రాహుల్ వైద్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. రన్నర్లు కూడా విన్నర్లే అని చెప్పుకొచ్చాడు. ఇదిలా వుంటే తాజాగా అఖిల్ సార్థక్ ఓ కొత్త కారు కొన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. "పాతికేళ్లలోపే కొత్త కారు కొనాలని నాకు నేను ప్రామిస్ చేసుకున్నాను. తల్లిదండ్రుల సపోర్ట్, నా హార్డ్వర్క్, మీ ప్రేమాభిమానాల వల్లే ఇప్పుడా కల నెరవేరింది. నేను కష్టాన్ని నమ్ముతాను, పనిని దైవంగా భావిస్తాను. ఏదైనా సరే సాధించేవరకు పోరాడుతూనే ఉంటాను. అఖిల్ ఫ్యామిలీలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జై శ్రీరామ్.." అంటూ అఖిల్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. త్వరలోనే హోండా సిటీ కారులో రైడ్కు వెళ్దాం అని సోహైల్, నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ మోనాల్ సదరు పోస్ట్కు రిప్లై ఇచ్చారు. నోయల్ సహా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అఖిల్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన ఎర్రటి కారులో ఎరుపు రంగు డ్రెస్సులో అఖిల్ నేడు షికారుకు వెళ్లాడు. ఈ వీడియోను ఆర్జే చైతూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తూ అఖిల్కు కంగ్రాట్స్ చెప్పుకొచ్చాడు. మరి ఈ కారులో సామ్(సోహెల్, అఖిల్, మోనాల్ గజ్జర్) ఎప్పుడు షికారుకు వెళ్తారోనని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇదిలా వుంటే అఖిల్ ప్రస్తుతం "తెలుగు అబ్బాయి- గుజరాత్ అమ్మాయి" అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు. ఇందులో బిగ్బాస్ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ అతడితో జోడీ కడుతోంది. View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) చదవండి: జంటగా మారబోతున్న బిగ్బాస్ ఫేం మోనాల్-అఖిల్ -
భర్తకు ఖరీదైన కారు గిఫ్టిచ్చిన లాస్య
యాంకర్ లాస్య. ఈ పేరు తెలియని టీవీ ప్రేక్షకులు లేరనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ యాంకర్గా పాపులారిటీ గడించిన ఆమె తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు కారణంగా బుల్లితెర మీద నుంచి నెమ్మదిగా పక్కకు జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటం, పెద్దలను ఒప్పించి మరోసారి అదే వ్యక్తితో వేదమంత్రాల సాక్షిగా, కుటుంబ సభ్యుల సమక్షంలో భర్త వేలు పట్టుకుని ఏడడుగులు నడిచింది. ఆమె యాంకర్గా తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో మరోసారి బిగ్బాస్ షో నుంచి పిలుపు వచ్చింది. ఈసారి ఆలోచించింది, షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పింది. అలా బిగ్బాస్ నాల్గో సీజన్లో అడుగు పెట్టిన లాస్య తన అభిమానులను మెప్పించింది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా తన పనేదో తను చేసుకుపోయింది. కానీ అందరికీ వండి పెడుతూ వంటలక్కలా స్థిరపడిపోయింది. తన ప్రేమ, పెళ్లి విషయాలు చెప్తూ ఎన్నోసార్లు కంటతడి పెట్టింది. సోమవారం వారి పెళ్లి రోజు. ఈ సందర్భంగా లాస్య కొత్త కారు కొంది. మహీంద్రా ఎక్స్యూవీ 500 కారు కొనుగోలు చేసి భర్తకు కానుకగా ఇచ్చింది. దీని ధర పదహారు లక్షల పైమాటే! View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి బహుమతినిస్తే ఎంత సంతృప్తిగా ఉంటుందో?! మేము ఇప్పుడు దీనిలో ఓ రౌండ్ వేసుకొస్తాం అని రాసుకొచ్చింది. ఇక నిన్న పెళ్లిరోజును పురస్కరించుకుని మంజునాథ్తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఏ అనుబంధంలోనూ మంచి రోజులే ఉండవు. తుపానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం. ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది అని భావోద్వేగ నోట్ రాసుకొచ్చింది. తన ప్రేమ కథను చెప్తూ ఓ స్పెషల్ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) చదవండి: లాస్య ఛానెల్ హ్యాక్: హ్యాపీ అంటున్న నోయల్ బిగ్బాస్: అరియానా ఖాతాలో అరుదైన ఘనత సినిమాలు తెలుగోడి దమ్ము చూపిస్తున్నాయి -
తండ్రితో కలిసి శుభవార్త చెప్పిన సోహెల్
బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ ఎంతోమందికి నేమ్, ఫేమ్ రెండూ తీసుకొచ్చింది. బిగ్బాస్ ముందు వరకు అంతగా పరిచయం లేదని వారంతా ఈ షోతో ఫేమస్ అయిపోయారు. వీరిలో సోహైల్ ఒకడు. అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్ సోహైల్కు తెలుగు బిగ్బాస్-4 సీజన్ ఒక్కసారిగా ఎనలేని గుర్తింపునిచ్చింది. ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్తో ఈ ‘సింగరేణి ముద్దుబిడ్డ’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.100 రోజులపాటు హౌస్లో సందడి చేసిన ఈ కరీంనగర్ కుర్రోడు షోలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. విన్నర్ కాకపోయినా అదే రేంజ్లో తనపై దృష్టి పడేలా చేసుకున్నాడు. బిగ్బాస్కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. బిగ్బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇలా తన ఉద్ధేశ్యం బయటకు చెప్పాడో లేదో అలా సోహైల్కు సినిమాల నుంచి అవకాశాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బిగ్బాస్ అనంతరం వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోహైల్ స్నేహితుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. తాజాగా సోహైల్ మరోసారి వార్తల్లోకెక్కారు. అయితే ఈసారి వృత్తిపరంగా కాకుండా ఓ ముఖ్యమైన వ్యక్తిగత విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన తండ్రి, సోదరుడితో కలిసి ఓ శుభవార్త చెప్పాడు. అదే.. సోహైల్ కొత్త కారును కొనుగోలు చేశాడు. MG కంపెనీకి చెందిన దాని ధర దాదాపు రూ. 30 లక్షలు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘కొత్త కారు కొనాలనే కల నిజమైంది. దీన్ని సాధ్యం చేసినందుకు బిగ్బాస్కు, అలాగే ఎప్పుడూ నాకు ఆదర్శంగా నిలిచే మా నాన్నకు కృతజ్ఞతలు’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. ఇదిలా ఉండగా బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేలో టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్ను సోహైల్ అంగీకరించి ఇంటిని వీడాడు. చదవండి: మెగాస్టార్ ఇంట్లో బిగ్బాస్ తురుమ్ఖాన్ సందడి అభిజీత్ను వెనక్కినెట్టిన అఖిల్.. View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) -
జంటగా మారబోతున్న మోనాల్-అఖిల్
బిగ్బాస్ నాల్గో సీజన్లో మోనాల్, అఖిల్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. వీరిద్దరి మధ్య జరిగే రొమాంటిక్ మచ్చట్ల కోసమే షోని వీక్షించినవారు ఉన్నారు. ఇక మోనాల్, అఖిల్, అభిజిత్ మధ్య జరిగిన ట్రయాంగిల్ లవ్ షోని ఎంత రక్తి కట్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాల్గో సీజన్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చాక కూడా అదే ప్రేమానుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బిగ్బాస్ లవ్ కపుల్గా పేరొందిన మోనాల్ గజ్జర్-అఖిల్కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ ఏర్పడింది. వీరిద్దరు కూడా అదే బాండ్ను కొనసాగిస్తూ.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. షో నుంచి బయటకు వచ్చాక పార్టీలు చేసుకొని ఆ ఫోటోలను ఫ్యాన్స్తో పంచుకున్నారు. ఇలా బుల్లితెరపై, సోషల్ మీడియాలో సందడి చేసిన ఈ లవ్ కపుల్..వాలెంటైన్స్డే సాక్షిగా జంటగా మారబోతున్నట్లు ప్రకటించారు. అయితే వీరు జంటగా మారబోతున్నది రియల్ లైఫ్లో కాదు.. రీల్ లైఫ్లో. వీరిద్దరు కలిసి ‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సీరిస్లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఆదివారం ప్రకటిస్తూ మోషన్ పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ వెబ్ సిరీస్కి భాస్కర్ బంతుపల్లి దర్శకత్వం వహిస్తుండగా, ఏ భాస్కరరావు నిర్మిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అంతేకాదు, దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేస్తూ.. ‘బిగ్ డే.. మీ ఆశీర్వాదం కావాలి' అంటూ అభిమానులను కోరారు. -
బిగ్బాస్: అరియానా ఖాతాలో అరుదైన ఘనత
యాంకర్గా కేరీర్ మొదలు పెట్టిన అరియానా గ్లోరీ బిగ్బాస్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హౌజ్లో ముక్కసూటి వైఖరీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బోల్డ్ బ్యూటీ బిగ్బాస్ తర్వాత ఫుల్ బిజీగా మారింది. వరుస ఇంటర్వ్యూలు, మాల్స్ ఓపెనింగ్స్తో పాటు పలు పార్టీలతో ఆమెకు క్షణం తీరిక లేకుండా పోయింది. అంతేగాక ఓ సినిమాకు కూడా సంతకం చేసిన సంగతి తెలిసిందే. యువ హీరో రాజ్ తరణ్ కలిసి ఈ మూవీలో నటించనుంది. ఈ క్రమంలో ఇటీవల గోవా పర్యటనకు వెళ్లిన అరియాన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను కలిసిన సంగతి తెలిసిందే. గోవాలో శ్రీముఖి, విష్ణుప్రియ, ఆర్జే చైతు, సుశ్రుత్తో కలిసి ఎంజాయ్ చేసింది. (చదవండి: గోవాలో ఆర్జీవీని కలిసిన అరియానా) ఈ నేపథ్యంలో అరియానా అక్కడ వర్మను కలిసినట్లు తన ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు పంచుకుంది. ఇదిలా ఉండగా ఈ భామకు ఓ అరుదైన ఘనత దక్కింది. బిగ్బాస్ షోతో ఎంతో క్రేజ్ అందుకున్న ఆమె .. గూగుల్లో ప్రిన్సెస్ ఆఫ్ బిగ్బాస్ తెలుగు అని టైప్ చేయగా అరియానా గ్లోరీ అని చూపించడం విశేషం. దీంతో తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే ఇంతటి ఘనత దక్కిన తొలి కంటెస్టెంట్గా ఆమె నిలిచింది. ఈ విషయాన్ని ఆమె ‘సీరియస్లీ’ అంటూ తన ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. దీంతో అరియాన హాట్టాపిక్ అయిపోయింది. అయితే ఇప్పుడు గూగుల్ ఆమె పేరును తొలగించింది. (చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. యంగ్ హీరోతో..) -
కింగ్ నాగార్జునను కలిసిన బిగ్బాస్ రన్నరప్
బిగ్బాస్ షో ముగిసి చాలా రోజులైనా ఆ షోలో పాల్గొన్న వారంతా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘కథ వేరుంటది’ అని బిగ్బాస్ షో-4లో హల్చల్ చేసిన సోహేల్ అక్కినేని నాగార్జునను, చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ షో రన్నరప్గా నిలిచిన అఖిల్ సార్ధక్ కింగ్ నాగార్జునను కలిశాడు. తన తల్లితో కలిసి నాగ్ నివాసానికి అఖిల్ చేరుకున్నాడు. తన తల్లితో కలిసి నాగార్జునతో దిగిన ఫొటోలను అఖిల్ ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు. ‘నాగార్జునను మరోసారి కలవడం చాలా ఆనందంగా ఉంది.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను.. బిగ్బాస్ రోజుల్ని ఇంకా మరిచిపోలేకపోతున్నా.. లవ్ యూ సర్ మీ టైమ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్’ అంటూ పోస్ట్ చేశాడు. నాగ్, అఖిల్ గట్టిగా నవ్వుతూ కనిపించారు. హోస్ట్గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున షోలో అఖిల్ సార్థక్తో కొంత చనువుగా ఉన్నారు. అఖిల్పై జోక్స్ వేస్తూ.. అతడి వస్త్రధారణను మెచ్చుకుంటూ ఉన్నారు. ‘బిగ్బాస్’లోకి టిక్టాక్ స్టార్ దుర్గారావు! బిగ్బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ పేరు ఖరారు! View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
గోవాలో ఆర్జీవీని కలిసిన అరియానా
బిగ్బాస్ భామ, సన్నజాజి తీగ అరియానా గ్లోరీ బిగ్బాస్ నాల్గో సీజన్ తర్వాత ఫుల్ బిజీగా మారింది. ఇంటర్వ్యూలతో, మాల్స్ ఓపెనింగ్స్తో, పార్టీలతో క్షణం తీరిక లేకుండా పోయింది. పనిలో పనిగా ఓ సినిమాకు సంతకం కూడా చేసిన విషయం తెలిసిందే. "సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు" ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో యంగ్ హీరో రాజ్ తరుణ్తో కలిసి నటిస్తోంది. ఆ మధ్య దీనికి సంబంధించిన ఫొటోలను సైతం షేర్ చేసింది. కాగా ముక్కుసూటి వైఖరితో, ఎవరినైనా ఎదిరించే ధైర్యంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆమె ఎలాగైనా బిగ్బాస్ ట్రోఫీ గెలుద్దామని ధృడంగా నిశ్చయించుకుంది, కానీ ఆమె కల నెరవేరలేదు. అయినప్పటికీ బోలెడంత మంది ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఆమెకు ఆర్జీవీ కూడా ఓ అభిమానే! అవును, బిగ్బాస్కు ముందు కూడా అరియానా యూత్కు సుపరిచితురాలే. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరియానా ఇంటర్వ్యూ చేసిన వీడియో అప్పట్లో వైరల్ కావడంతో ఆమె బాగా ఫేమస్ అయింది. దీంతో ఆమె బిగ్బాస్లో అడుగు పెట్టడానికి కారణం ఓ రకంగా ఆర్జీవీనే అన్న వార్తలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో వర్మ ఆమెకు ఓటేయమంటూ సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలపడం విశేషం. అంతే కాదు వీలైతే అరియానాతో సినిమా తీసేందుకు సిద్ధమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే మొత్తానికి వీళ్లిద్దరూ సమావేశమయ్యారు. గోవాలో శ్రీముఖి, విష్ణుప్రియ, ఆర్జే చైతు, సుశ్రుత్తో కలిసి ఎంజాయ్ చేస్తున్న అరియానా తాజాగా రామ్ గోపాల్ వర్మను కలిసింది. ఈ మేరకు అతడితో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తనకోసం సమయం కేటాయించినందుకు ఆర్జీవీకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో వర్మ ఆమెతో సినిమా తీస్తానన్న మాట గురించి ప్రస్తావించాడా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ) (చదవండి: హీరోయిన్గా బిగ్బాస్ బోల్డ్ బ్యూటీ) -
మహేశ్తో స్పెషల్ సాంగ్: మోనాల్ క్లారిటీ!
బిగ్బాస్కు ముందు వరకు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఉంది నటి మోనాల్ గజ్జర్ పరిస్థితి. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్బాస్ రియాలిటీ షోతో ఆమె సొంతమైంది. తనకు పేరు తెచ్చిన స్టార్ మా ఛానల్లోనే డ్యాన్స్ ప్లస్ షోకి జడ్జిగా వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. అల్లుడు అదుర్స్లో ప్రత్యేక గీతంలో బెల్లంకొడ శ్రీనివాస్తో కలిసి స్టెప్పులేసి అదరగొట్టింది. తాజాగా సూపర్ స్టార్ మహేశ్బాబు సినిమా సర్కారు వారి పాటలోనూ ప్రత్యేక గీతంలో స్టెప్పులేయనుందన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. (చదవండి: పీనట్ డైమండ్ హిట్ అవ్వాలి) అయితే నిజంగానే ఈ బ్యూటీ మహేశ్తో డ్యాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసిందా? అని పలువురు సందేహపడ్డారు కూడా! దీనిపై తాజాగా మోనాల్ స్పందిస్తూ.. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. సర్కారు వారి పాట సినిమాలో తను ఎలాంటి స్పెషల్ సాంగ్లో ఆడిపాడటం లేదని స్పష్టం చేసింది. కాగా మోనాల్ ఇటీవలే బిగ్బాస్ రీయూనియన్ పార్టీలో తళుక్కున మెరిసింది. స్టార్ మా చేపట్టిన ఈ కార్యక్రమంలో బిగ్బాస్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన పలు ఫొటోలను సెలబ్రిటీలు షేర్లు చేస్తుండటంతో ప్రస్తుతం అవి వైరల్గా మారాయి. (చదవండి: ఆచార్యలో మరోసారి లెట్స్ డు కుమ్ముడు!) -
మా అందాలకు అదే వన్నె: బిగ్బాస్ అరియానా
సాక్షి, హైదరాబాద్: ఆత్మసంతృప్తే మగువల అందాలకు మరింత వన్నె తెస్తుందని అన్నారు బిగ్బాస్-4 ఫేమ్ అరియానా. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న హైదరాబాద్ బ్యూటీ కాన్ఫరెన్స్–2021ను బిగ్బాస్ ఫేమ్ అరియనా, వర్ధమాన నటి లోహితా తనుడ్రాతో కలిసి సోమవారం ప్రారంభించారు. లాక్డౌన్ తర్వాత చాలారోజులకు ఫ్యాషన్ ప్రియులకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఈ బ్యూటీ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్న ఎస్బీ ఇన్నోవేషన్స్ ఎండీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దాదాపు 50 ఫ్యాషన్ అనుబంధ ఉత్పత్తిదారులు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారన్నారు. ప్రసిద్ధ బ్రాండ్స్ కాస్మొటిక్స్, స్కిన్ కేర్, పర్సనల్ ప్రొడక్ట్స్, బ్యూటీ ఫెస్ట్, సెలూన్ ఎక్విమెంట్స్ ప్రదర్శనకు ఉంటాయన్నారు. -
ఈ యంగ్ హీరోను గుర్తుపట్టారా?
పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తోంది. తల్లి చంకనెక్కిన ఆ పాలబుగ్గల పసిపిల్లాడు ఎవరనుకుంటున్నారు? బిగ్బాస్ నాల్గో సీజన్లో బుద్దిబలంతో టాస్కులు గెలవడంతో పాటు అమ్మాయిల మనసు దోచుకున్న మిస్టర్ పర్ఫెక్ట్ అభిజిత్. చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్గా ఉన్న ఈ ఫొటో ఆయన అభిమానులకు విపరీతంగా ఆకర్షిస్తోంది. అమ్మ ప్రేమ అన్న క్యాప్షన్తో ఈ ఫొటోను అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. కాగా ఓ స్పెషల్ ఎపిసోడ్లో అభి అమ్మ కూడా హౌస్లోకి అడుగు పెట్టి తెగ సందడి చేసిన విషయం తెలిసిందే. మీరు కొట్టుకోండి, అదే కదా మజా అంటూ కంటెస్టెంట్లతో ఫ్రెండ్లీగా కలిసిపోవడంతో ఆమె కూడా పాపులర్ అయింది. (చదవండి: బిగ్బాస్ : అభిజిత్కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్) కేవలం ఎక్స్పీరియన్స్ కోసమే బిగ్బాస్ హౌస్లోకి వచ్చానన్న అభి తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్తో విజేతగా అవతరించి టైటిల్ను ఎగరేసుకుపోయాడు. ప్రేక్షకులు చూపించిన ప్రేమలో తడిసి ముద్దైన అతడు సోషల్ మీడియాలో వారికి నిత్యం టచ్లో ఉంటున్నాడు. ఆ మధ్య బిగ్బాస్ ప్రయాణంలో తనకు సపోర్ట్ చేసిన సెలబ్రిటీలను ప్రత్యేకంగా కలుసుకుని మరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మధ్యే తన స్నేహితుడు, క్రికెటర్ హనుమ విహారిని కలుసుకుని కబుర్లు చెప్పుకున్నారు. అయితే టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు అభి వీరాభిమాని అని తెలిసిన హనుమ విహారి ఈ విషయాన్ని హిట్మ్యాన్ చెవిన వేశాడు. దీంతో రోహిత్ అభికి ఫోన్ చేసి మాట్లాడటమే కాక ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్గా పంపించాడు. (చదవండి: ఇండియా లాక్డౌన్.. టైటిల్ పోస్టర్ విడుదల) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) -
మోనాల్ గిఫ్ట్: హాట్గా ఉన్నానంటున్న అఖిల్!
ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది.. అని అఖిల్, సోహైల్ ఏనాడో అనుకున్నారు. అందుకే వీళ్లిద్దరిలో ఎవరు బిగ్బాస్ టైటిల్ సొంతం చేసుకున్నా మిగిలినవాడికి బైక్, ల్యాప్టాప్ కొనివ్వాల్సిందేనని డీల్ మాట్లాడుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే ప్రేక్షకులు మరొకటి తలిచారన్నట్లుగా వీళ్ల కల నెరవేరలేదు. విజయం వీళ్లను వరించలేదు. అలా అని వీరి కోరిక అసంపూర్తిగా మిగిలిపోలేదు. అఖిల్కు ఓ మహిళా అభిమాని ల్యాప్ట్యాప్ బహుమతిగా ఇచ్చింది. దీంతో అతడి సంతోషం కట్టలు తెంచుకుంది. తన మీద చూపిస్తున్న అభిమానానికి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయాడు. అయితే ఈసారి ఏకంగా అతడి మనసుకు మరింత దగ్గరైనవాళ్లు ఓ బహుమతినిచ్చారు. ఎవరి గురించి చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును, మోనాల్ గజ్జర్. (చదవండి: ఇల్లు కొనబోతున్న మోనాల్?!) బిగ్బాస్ హౌస్లో అఖిల్ను అంటిపెట్టుకుని ఉన్న మోనాల్ షో తర్వాత కూడా అతడితో స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ నానా హంగామా చేస్తోంది. ఈ క్రమంలో అఖిల్కు పూల ప్రింట్ ఉన్న ఎరుపు రంగు షర్ట్ను బహుకరించింది. ఇంకేముందీ.. అఖిల్ మరోసారి గాల్లో తేలిపోయాడు. ఆమె ఇచ్చిన షర్ట్ ధరించి మోనాల్కు కృతజ్ఞతలు తెలిపాడు. నాకు తెలుసు, ఈ చొక్కాలో నేను చాలా హాట్గా కనిపిస్తున్నా కదూ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఓ వీడియో షేర్ చేశాడు. నిజంగానే అఖిల్కు పూలచొక్కా భలే సెట్టయ్యింది, ఎంతైనా మోనాల్ ఇచ్చింది కదా! అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా బిగ్బాస్ రన్నరప్ అఖిల్ ఈ మధ్యే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు. అటు మోనాల్ డ్యాన్స్ ప్లస్ షో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్లో ఆమె ప్రత్యేక గీతంలో ఆడిపాడిన విషయం తెలిసిందే! (చదవండి: ఆ రెండింటి విషయంలో కంట్రోల్గా ఉండలేను) -
బిగ్బాస్ : అభిజిత్కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్
బిగ్బాస్ నాలుగో సీజన్ విజేతగా మిస్టర్ కూల్ అభిజిత్ ఊహించని వ్యక్తి నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నాడు. టీమిండియా వైస్ కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఫోన్ చేసి మాట్లాడటమే కాకుండా.. ప్రేమతో తన జెర్సీని అతడికి గిఫ్ట్గా పంపించాడు. ఈ విషయాన్ని అభిజీతే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన గురించి రోహిత్ శర్మకు చెప్పిన తెలుగు క్రికెటర్ హనుమ విహారికి ధన్యవాదాలు తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ, హనుమ విహారికి మధ్య జరిగిన సంభాషణలో బిగ్బాస్ షో గురించి చర్చకు వచ్చిందట. ఈ సందర్భంగా బిగ్బాస్ నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్ గురించి రోహిత్కు చెప్పాడట హనుమ విహారి. అంతేకాకుండా అతను తనకు పెద్ద ఫ్యాన్ అన్న విషయం కూడా చెప్పాడట. దీంతో రోహిత్ అభిజిత్కు ఫోన్ చేసి విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ తెలిపాడట. అలాగే అతన్ని అభినందిస్తూ తన జెర్సీని గిఫ్ట్ ఇచ్చాడట. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్... రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడని అభిజిత్ ట్వీటర్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా రోహిత్ శర్మ తన ఫేవరెట్ క్రికెటర్ అని, అతని నుంచి గిఫ్ట్ రావడం సంతోషంగా ఉందని అభిజిత్ క్యాప్షన్గా రాసుకొచ్చాడు. ఇక రోహిత్ శర్మ తల్లి పూర్ణిమా శర్మది విశాఖపట్నం అన్న విషయం తెలిసిందే. రోహిత్ మహారాష్ట్రలోనే పుట్టిపెరిగినప్పటికీ.. తెలుగు మూలాల కారణంగా అతడికి తెలుగు అర్థం అవుతుంది. అంతే కాదు గతంలో అతడు డెక్కర్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్లో కూడా ఆడాడు. DAY MADE. The Hitman @ImRo45 says Hello from Australia! Thanks for this wonderful gift @Hanumavihari!! Get well soon. You showed amazing character at the highest level of the game, in a pressure situation. Contnd. pic.twitter.com/GMAVS6hgt8— Abijeet (@Abijeet) January 14, 2021 -
బిగ్బాస్: అఖిల్కు ఊహించని బహుమతి
'నువ్వు గెలిస్తే నాకు ల్యాప్టాప్, బైక్ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా' ఇది ఎక్కడో విన్నట్లుంది కదూ.. అవును ఈ మధ్యే విజయవంతంగా పూర్తైన బిగ్బాస్ నాల్గో సీజన్లో అఖిల్, సోహైల్ కుదుర్చుకున్న డీల్ ఇది. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా! వీరి విషయంలో కూడా అంతే... 25 లక్షల రూపాయలకు టెంప్ట్ అయి సోహైల్ ట్రోఫీ రేసు నుంచి తప్పుకుని సెకండ్ రన్నరప్గా నిలిచాడు. ఎలాగైనా టాప్ 2లో ఉండాలన్న కోరికతో అడుగుపెట్టి గ్రాండ్ ఫినాలే వరకు వచ్చిన అఖిల్ రన్నరప్గా నిలిచాడు. ఇద్దరినీ వెనక్కు నెట్టి అభిజిత్ విజేతగా అవతరించాడు. అలా వీరి డీల్ మధ్యలోనే ఆగిపోయింది. ల్యాప్ట్యాప్తో అభిమానం చాటుకుంది ఎవరికీ బైక్, ల్యాప్ట్యాప్ రాకుండా పోయింది అనుకుంటున్న తరుణంలో అఖిల్కు మాత్రం ఓ మంచి ల్యాప్ట్యాప్ వచ్చింది. జయలక్క్క్ష్మి అనే మహిళా అభిమాని విజయవాడ నుంచి వచ్చి మరీ అతడికి ల్యాప్ట్యాప్ను బహుమతిగా ఇచ్చింది. రెప్పకాలంపాటు ఇది నిజమా? కలా? అనుకున్న అఖిల్ కళ్లముందు అభిమాని ల్యాప్ట్యాప్ బ్యాగు పట్టుకుని కూర్చుండటం చూసి నమ్మక తప్పలేదు. తనకు అంత ఖరీదైన బహుమతినిచ్చినందుకు అఖిల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఆమెకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీక మాటలు వెతుక్కున్నాడు. ఎలాగైతేనేం ల్యాప్ట్యాప్ కావాలన్న తన స్నేహితుడి కోరిక నెరవేరినందుకు అతడి జిగిరీ దోస్త్ సోహైల్ కంగ్రాట్స్ తెలిపాడు. పలువురు అభిమానులు కూడా అఖిలే నంబర్ 1 అంటూ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) 'సిటీమార్'లో అఖిల్ కాగా ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరూ దాదాపు ఏదో ఒక పనిలో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా దివి, సోహైల్, మెహబూబ్, మోనాల్, అభిజిత్కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే అఖిల్కు కూడా ఏదో మంచి అవకాశం వచ్చిందట. కానీ దాన్ని సంక్రాంతికి చెప్తానంటూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే గోపీచంద్ సిటీమార్ సినిమాలో సెకండాఫ్ కోసం అఖిల్ను తీసుకున్నారన్న టాక్ అయితే నడుస్తోంది. మరి తనకు వచ్చిన అవకాశం అదేనా? ఇంకేదైనా ఉందా? అనే విషయాలను ఆయన అధికారికంగా చెప్పేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: కోటి రూపాయలు ఎగ్గొట్టిన వర్మ) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) -
బాధపడ్డా.. కానీ పశ్చాత్తాపం లేదు: సోహైల్
అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్ సోహైల్కు తెలుగు బిగ్బాస్-4 సీజన్తో ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు వచ్చింది. ‘కథ వేరే ఉంటది’ అంటూ తనదైన మేనరిజమ్స్తో ఈ ‘సింగరేణి ముద్దుబిడ్డ’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఫినాలేలో అనూహ్య నిర్ణయంతో అతడు అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అభిజిత్, అఖిల్తో పాటు టాప్-3లో నిలిచిన సోహైల్.. బిగ్బాస్ ఇచ్చిన రూ. 25 లక్షల డీల్కు అంగీకరించి ఇంటిని వీడాడు. అంతేగాక మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు అందుకోవడమే గాకుండా.. తన సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తానంటూ ఆయనే స్వయంగా చెప్పడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ క్రమంలో బిగ్బాస్ ముగిసిన తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటున్న సోహైల్.. హీరోగా ఓ సినిమాలో నటించనున్నాడు. ‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ చిత్రాల నిర్మాత అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఏ నిర్ణయంతో అయితే సోహైల్ సీజన్ మొత్తానికి సెంటరాఫ్ అట్రాక్షన్గా నిలిచాడో.. దాని కారణంగానే విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా ఫినాలేకు ముందు అతడి స్నేహితుడు, తోటి కంటెస్టెంటు మెహబూబ్ చేసిన పనితో ట్రోలింగ్కు గురయ్యాడు. మెహబూబ్ సైగల కారణంగానే తాను మూడోస్థానంలో ఉన్నానని తెలుసుకున్న సోహైల్.. డబ్బు తీసుకునేందుకు అంగీకరించాడని.. ఇలా మోసపూరితంగా ఆడటం సరికాదంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. (చదవండి: బంపరాఫర్ కొట్టేసిన అఖిల్..!) ఈ విషయంపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన సోహైల్ మరోసారి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇలాంటి నిరాధార ఆరోపణలు, రాతల వల్ల నేనెంతో బాధపడ్డాను. నేను విజేతను కాదని తెలిసే రూ. 25 లక్షలు తీసుకున్నాననడం సరికాదు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. 25 లక్షలు అంటే నాకు పెద్ద మొత్తం. ఆ డబ్బు తీసుకుని షో నుంచి బయటకు రావడం పట్ల నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక బిగ్బాస్లో పాల్గొనడం తనకెన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చిందని, తన జీవితంలో ఇది భావోద్వేగపూరిత ప్రయాణం అని పేర్కొన్నాడు. తన పదేళ్ల కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని ఉద్వేగానికి లోనయ్యాడు. -
ఇల్లు కొనబోతున్న మోనాల్?!
సినిమాలతో రాని గుర్తింపు రియాలిటీ షో బిగ్బాస్తో సొంతం చేసుకున్నారు మోనాల్ గజ్జర్. ఓట్లు, గేమ్తో కాకుండా లవ్ట్రాక్తో బిగ్బాస్లో కొనసాగారు మోనాల్. ఎలిమినేషన్కు ముందు కొన్ని రోజుల పాటు తనలోని అసలు టాలెంట్ని చూపించినప్పటికి.. ఫైనల్కి మాత్రం చేరుకోలేకపోయారు. ఇక ఈ సారి బిగ్బాస్లో పాల్గొన్న వారందరు ప్రస్తుతం టీవీ, సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో మోనాల్కి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ నటి మా టీవీలో డ్యాన్స్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది. తాజాగా మొనాల్కి సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. (చదవండి: బంపర్ ఆఫర్ అందుకున్న మోనాల్.. ) ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు, టీవీ షోల ఆఫర్స్తో బిజీగా ఉన్న మోనాల్ హైదరాబాద్లో ఇల్లు కొనే ఆలోచనలో ఉందట. తనకు ఎంతో గుర్తింపు ఇచ్చిన టాలీవుడ్లోనే ఆమె కొనసాగాలునుకుంటున్నట్లు.. ఈ మేరకు సిటీలోనే ఇల్లు కొనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఫిలీంనగర్లో చక్కర్లు కొడుతున్నాయి. -
బిగ్బాస్ 4 నయా రికార్డు, ఆన్లైన్లో..
బిగ్బాస్ నాలుగో సీజన్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్ ఇలా అన్నీ పంచిపెట్టింది. కరోనా కష్ట కాలంలో అసలు ఈ ఏడాది బిగ్బాస్ ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించింది. 19 మంది కంటెస్టులతో ప్రారంభమైన బిగ్బాస్ సక్సెస్ఫుల్గా నాలుగో సీజన్ను పూర్తి చేసుకుంది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా అభిజిత్ నిలిచాడు. ఇక అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. అఖిల్ సార్థక్ రన్నరప్గా నిలిచాడు. మూడో స్థానంలో సోహైల్, నాలుగు, అయిదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. చదవండి: బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్! కాగా బిగ్బాస్ను ప్రేక్షకులు అమితంగా ఆదరించడంతో టీఆర్పీ రేటింగ్లోనూ ఈ షో దూసుకుపోయింది. బిగ్బాస్లో పాత రికార్డులను తుడిచిపెడుతూ నయా రికార్డులు రాసింది. తాజాగా ఆన్లైన్ వేదికగా అత్యధిక వీక్షకాదరణ పొందిన కార్యక్రమంగా బిగ్బాస్ సీజన్ 4 నిలిచింది. ఈ విషయాన్ని డిస్నీ హాట్ స్టార్ నిర్వహించిన పరిశోధన ఫలితాల్లో వెల్లడైంది. మొత్తంగా చూస్తే 75శాతం వీక్షకులను బిగ్బాస్ సొంతం చేసుకుంది. రెండో స్థానంలో కార్తీక దీపం సీరియల్ నిలిచిందని పేర్కొంది. బిగ్బాస్ షో మొత్తంలో 86వ ఎపిసోడ్ అత్యధిక ఓట్ల వెల్లువ అందుకుందని వెల్లడించింది. లాక్డౌన్ తర్వాత ఓటీటీకి నాన్ మెట్రల్లో వీక్షకుల సంఖ్య 117శాతం పెరిగిందని ఈ పరిశోధన వెల్లడించింది. అలాగే తమ ప్లాట్ ఫామ్ మీద ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమాగా ‘ప్రతి రోజూ పండగే’ నిలిచిందని వివరించింది. మొత్తంగా వినోద కార్యక్రమాలను వీక్షించిన వారిలో 40 శాతం మంది మహిళలే ఉన్నారని తెలిపింది. చదవండి: స్టార్ డైరెక్టర్ హామీ ఇచ్చారు: అవినాష్ -
బంపరాఫర్ కొట్టేసిన అఖిల్.. పెద్ద సినిమాలో చాన్స్!
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలా మంది.. ఇప్పుడు సెలెబ్రెటీలు అయిపోయారు. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్బాస్లో పాల్గొన్న వారికి కాస్త ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా యూట్యూబర్లు, చిన్న నటీనటులు పాల్గొనప్పటికీ.. వారికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ విన్నర్గా గెలిచిన అభిజీత్కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. మూడో స్థానంలో నిలిచిన సోహైల్కు అయితే.. ఇప్పటికే హీరోగా ఒక సినిమా చాన్స్ కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో నటిస్తానని మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చారు. మరోవైపు బిగ్బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్కు కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలతో పాటు స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఓ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలా నాల్గో సీజన్లో పాల్గొన్న ఒక్కొక్కరికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్లో క్రేజీ జంటగా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సీజన్లో పాల్గొని రన్నర్గా నిలిచిన అఖిల్ సార్ధక్ గురించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. స్టార్ హీరో గోపిచంద్ మూవీలో అఖిల్కి అవకాశం వచ్చినట్లు తెలుస్తోందిసంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా ‘సిటీమార్’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ మూవీలో సెకండాఫ్లో ఓ కీలక పాత్ర కోసం అఖిల్ని తీసుకున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. నిజానికి అఖిల్ 2016లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘బావ మరదలు’ అనే సినిమా ద్వారా తన కెరీర్ను ప్రారంభించారు. అయితే ఆ సినిమా ద్వారా అఖిల్కి ఎలాంటి గుర్తింపు రాలేదు. దీంతో అఖిల్ బుల్లితెర వైపు అడుగులు వేశాడు. పలు సీరియళ్లలో కీలక పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపుతోనే బిగ్బాస్ నాల్గో సీజన్లోకి వెళ్లి రన్నర్గా నిలిచాడు. ఇప్పుడు అఖిల్కి పలు సినిమా ఆఫర్లు వస్తున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, తన సినిమా అవకాశాల గురించి అఖిల్ అయితే ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
స్టార్ డైరెక్టర్ హామీ ఇచ్చారు: అవినాష్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ నాల్గో సీజన్లో జబర్ధస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి చప్పగా సాగుతున్న బిగ్బాస్ హౌజ్ను తన కామెడితో ఆసక్తికరంగా మార్చాడు. అయితే అతడు బిగ్బాస్ హౌజ్లో అడుగుపెట్టేందుకు జబర్ధస్త్ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని బ్రేక్ చేసి పెద్ద రిస్క్ చేసిన సంగతి తెలిసిందే. మధ్యలో జబర్ధస్త్ను వదిలి వెళుతున్నందుకు గాను నిర్మాతలకు అవినాష్ 10 లక్షల రూపాయల జరిమాన కూడా చెల్లించాడు. అయితే బిగ్బాస్ ద్వారా అవినాష్ బాగానే లాభపడినట్లు తెలుస్తోంది. బిగ్బాస్తో మరింత ఫేంను సంపాదించుకున్న అవినాష్కు.. డబ్బులు కూడా భారీ మొత్తంలో అందినట్లు సమాచారం. అయితే ఇటీవల బిగ్బాస్ ముగియడంతో కంటెస్టెంట్స్ అంతా టీవీ, న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిబీ బిజీగా ఉన్నారు. (చదవండి: బిగ్బాస్: అవినాష్కు నాగ్ ఊహించని గిఫ్ట్) అదే విధంగా అవినాష్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా అయిపోయాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో అవినాష్ మాట్లాడుతూ.. తన సహా కంటెస్టెంట్ అరియాన గ్లోరితో వివాహం అంటూ వస్తున్న పుకార్లను ఖండించాడు. అనంతరం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాల్లో మంచి పాత్ర ఇస్తానని తనకు హామీ ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే గత ఆదివారం జరిగిన ఫైనల్ ఎపిసోడ్లో దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా బిగ్బాస్లో హౌజ్లో అడుగుపెట్టి టాప్ 5లోని ఒకరిని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను కలిసిన దర్శకుడు అనిల్ తన తదుపరి సినిమాల్లో నటించే అవకాశం ఇస్తానని, ఒకసారి కలవమని కూడా చెప్పినట్లు అవినాష్ చెప్పుకొచ్చాడు. -
బంపర్ ఆఫర్ అందుకున్న మోనాల్..
అప్పటి వరకు వాళ్ల ఫేమ్ ఎలా ఉన్నప్పటికీ ఒకసారి బిగ్బాస్ హౌజ్లోకి అడుగుపెట్టి వచ్చాక ఏదైనా జరగవచ్చు. అవకాశాలు లేని వారికి తలుపుతట్టి మరి రావొచ్చు. బిజీగా ఉన్నవారికి అవకాశాలు తగ్గిపోవచ్చు. కంటెస్టెంట్ల జీవితాల్లో బిఫొర్ బిగ్బాస్ ఆఫ్టర్ బిగ్బాస్ అనేంతలా మార్పు వస్తుంది. అయితే మిగతా సీజన్లతో పోలీస్తే బిగ్బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్లకు హౌజ్ నుంచి బయటొచ్చాక సినిమా ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే సోహైల్ ఓ సినిమాకు సైన్ చేయగా.. తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తానని మెగాస్టార్ మాటిచ్చాడు. ఇక అభిజిత్ ఎఫ్ 3లో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చదవండి: విజయ్ ‘మాస్టర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ జాబితాలోకి తాజాగా మోనాల్ గజ్జర్ చేరిపోయింది. ఇప్పటికే బుల్లితెరలో ప్రసారమవుతున్న ఓ డ్యాన్స్ షోలో జడ్జీగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మరోసారి తెలుగు సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది ఈ గుజరాత్ భామ. టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం అల్లుడు అదుర్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అను ఎమ్మాన్యుయేల్, నభానటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా స్పెషల్ సాంగ్లో మోనాల్.. బెల్లంకొండ శ్రీనివాస్తో ఆడిపాడనుంది. ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల సారథ్యంలో సెట్ వేసినట్లు, దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫీ చేయనున్నారని సమాచారం. ఇక మోనాల్ ఎంట్రీతో సినిమాకు మరింత గ్లామర్ యాడ్ కానుందనడంలో సందేహం లేదు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. చదవండి: అభిమానులకు రకుల్ గుడ్న్యూస్ #BiggBoss beauty #MonalGajjar shaking legs with @BSaiSreenivas for a special song in #AlluduAdhurs.🕺💃 Movie releasing on Jan 15th 2021.✨ #SanthoshSrinivas @ThisIsDSP @prakashraaj @SonuSood @NabhaNatesh @ItsAnuEmmanuel @shekarmaster #AvinashKolla #SumanthMovieProductions pic.twitter.com/7fFof5xE7u — Shreyas Group (@shreyasgroup) December 29, 2020 -
‘బిగ్బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’
ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్బాస్ సీజన్ 4లో ఫైనల్స్కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని ఒడిదొడుకులను చిన్ననాటి నుంచీ చూస్తూ పెరిగారు. జీవితం నేర్పిన పాఠాలతోనే తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా ముందుకు సాగాలనుకున్నారు. నవతరం అమ్మాయిలకు ప్రతీకగా నిలుస్తున్నారు. ►‘దేత్తడి’ అంటూ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అలేఖ్య హారిక. డిగ్రీ చదువుతూ పాకెట్ మనీ కోసం పార్ట్టైమ్ జాబ్ చేసింది. జాబ్ పోతే ఎలా అనే ఆలోచనతో కొత్త ఆలోచనలకి పదును పెట్టింది. ►యాంకరింగ్ ద్వారా టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా గ్లోరీ. కాలేజీ రోజుల నుంచే యాంకరింగ్ అంటే ఇష్టం పెంచుకుని తనకు అభిరుచి ఉన్న రంగం వైపే అడుగులు వేసింది. కొద్ది రోజుల్లోనే కుటుంబం మెప్పుతో పాటు ప్రేక్షకుల అభిమానాన్నీ పొందుతోంది. ఇంటిని వదిలి 105 రోజులు వేరే చోట ఉన్నారు. అంత ధైర్యం ఎలా వచ్చింది? హారిక: ఎలా వచ్చిందో నాకూ తెలియదు. ముందు మా అమ్మ, అన్న కోసం ఒప్పుకున్నాను. మా ఇంటి నుంచి బిగ్బాస్ ఇంటిలోకి అడుగుపెట్టాక అక్కడంతా వేరే ప్రపంచం. వెళ్లకముందు కొంత భయం అనిపించింది. వెళ్లాక, అక్కడున్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశాను. ఒక నిర్ణయానికి వచ్చామంటే ధైర్యం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా డౌన్ అయిపోతున్నానా అనిపించినప్పుడు కళ్లు మూసుకొని రెండు నిమిషాలు కూర్చొనేదాన్ని. ‘మా అమ్మ, అన్నయ్య కళ్లముందు కనిపించేవారు. హారికా.. డౌన్ అయిపోవద్దు. ఏదైనా నీకు అండగా కుటుంబం ఉంది. ఇది కేవలం ఒక గేమ్. లాక్డౌన్ టైమ్లో నీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. దీనిని బాగా ఉపయోగించుకో..’ అని నాకు నేను చెప్పుకునేదాన్ని. మా అమ్మ సమస్యలను ఎదుర్కొన్న విధానం వల్ల కూడా నాకు ధైర్యం వచ్చి ఉంటుంది. అరియానా: చిన్నప్పటి నుంచీ నేనూ, చెల్లి ఏ సమస్య అయినా ఫేస్ చేసేవాళ్లం. మా మమ్మీ జాబ్ చేసేది. తను వెళ్లిపోయాక మేమిద్దరమే ఇంట్లో ఉండేవాళ్లం. తనకూ క్లాస్ ఉంటే నేనొక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. నేను బయటకు వెళితే చెల్లి కూడా అంతే. అలా ఇండిపెండెంట్గా ఉండటం మాకు ఎప్పుడో అలవాటైపోయింది. హౌజ్లో ఉన్నప్పుడు ఒకసారి 104 జ్వరం వచ్చింది. తట్టుకోలేక ఏడ్చేశాను. అక్కడ అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఎంతో ధైర్యం చెప్పారు. బిగ్బాస్కి కూడా చెప్పాను. నాకు ఒంట్లో బాగోలేదు, ఇంటికి పంపించేస్తే మా ఇంటి ఫుడ్ తిని, త్వరగా కోలుకుంటాను అని. కానీ, బిగ్బాస్ ‘స్పెషల్ కేర్ తీసుకుంటామ’ని చెప్పారు. అవినాష్ నన్ను బాగా చూసుకున్నారు. ఆ వారం రోజులు మాత్రం కొంచెం లోన్లీగా అనిపించింది. బిగ్బాస్ హౌస్లో మీ ఎక్స్పీరియెన్స్ ఎలా ఉంది? హారిక: బయట రంగులరాట్నంలో తిరిగితే ఎంత సంబరంగా ఉంటుందో బిగ్బాస్ హౌజ్లో అలాంటి ఎక్స్పీరియెన్స్. భలేగుంది. ముందు భయపడ్డా... ఎలా ఉంటుందో ఏమో అని. కానీ, లోపలకు వెళ్లినప్పుడు చిల్... మస్తుంది. టాస్క్ మీదనే నా దృష్టి అంతా. ఇదో హ్యూమన్ ఎక్స్పరిమెంట్. టైమ్ కనుక్కోకముందు సూర్యుడిని చూసి పాతకాలం నాటి వాళ్లు ఎలా అంచనా వేసుకునేవారో మేం అలా చేసేవాళ్లం. ఫోన్లు లేవు, టీవీ లేదు, వాచీలు లేవు. అదో లోకం.. ఆ లోకంలో అడుగుపెట్టడం చాలా థ్రిల్లింగ్గా భావిస్తాను. అరియానా: బిగ్బాస్ సీజన్ 4 అంతా రికార్డ్ చేసి పెట్టి, భవిష్యత్తులో నా పిల్లలకు చూపిస్తాను. అన్ని రోజుల పాటు బిగ్బాస్ హౌజ్లో ఎప్పుడెలా ఉన్నానో నాకే చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటోంది. కోపం వస్తే ఎలా ఉంటాను, బాధ వస్తే, సంతోషం కలిగితే ఎలా ఉంటాను.. అనేవన్నీ నాకు నేనే ఎక్స్పీరియెన్స్ చేశాను. బిగ్బాస్ తర్వాత మీకు మీరుగా మార్చుకోవాలనుకున్నవి? హారిక: సహజంగా నాకు కోపం ఎక్కువ. ప్రతి చిన్నదానికి బాగా చిరాకుపడేదాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో కోపం చూపాలి... ఎలాంటి స్థితిలో మౌనంగా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అరియానా: ముక్కుమీది కోపం. చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది. మా చెల్లితో అలాగే గొడవ పడేదాన్ని. అదే, పెద్ద పెద్ద విషయాల్లో అయితే మౌనంగా ఉండిపోతాను. బిగ్బాస్లో బాధ కలిగించినది... అత్యంత సంతోషాన్నిచ్చిన ఇన్సిడెంట్స్..? హారిక: అన్ని రోజులు కెప్టెన్సీకి వర్క్ చేసినా బెస్ట్ కెప్టెన్సీ రాలేదు. అది చాలా బాధ అనిపించింది. హాపీ మూమెంట్స్ అయితే లెక్కలేనన్ని. నాకెవ్వరితోనూ లొల్లి లేదు. పర్సనల్గా ఎవ్వరిమీదా కోపం లేదు. అంతా హ్యాపీ. అరియానా: మా ఫ్రెండ్స్ ఎలిమినేట్ అవడం బాధగా అనిపించింది. ఒకసారి గిఫ్ట్లు ఎవరికి ఇవ్వాలో నోట్ చేయమన్నారు. అందులో ఇద్దరికి రాయాలనుకున్నాను. కానీ, ఎవరికి రాయాలి..? అనేది సందేహం. దాంతో ఎవరికీ రాయలేదు. నాకూ ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదు. అయినా ఏమీ బాధనిపించలేదు. అప్పుడు బిగ్బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ కన్సర్న్కి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి ఆనందంతో. రూమర్స్ గురించి.. ఏమనుకుంటారు? హారిక: వాటి గురించి పట్టించుకుంటే మనం అస్సలు నడవను కూడా నడవలేం. అరియానా: ఏం వచ్చినా పట్టించుకోను. నాది నాకు తెలుసు. అందరికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేం. అందరూ ఫ్రెండ్స్గా ఉంటారు. కానీ, ఒక పర్సన్కే కనెక్ట్ అవుతాం. నా సిచ్యుయేషన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి పట్టించుకోను. సింగిల్ పేరెంటింగ్లో పెరిగినట్లున్నారు కదా... మీకు ఎలా అనిపించింది? హారిక: పిల్లలకు కానీ, పేరెంట్స్ కానీ అన్ని సౌకర్యాలు ఉంటే బాధ్యత రాకపోవచ్చు. అలా లేకపోవడం వల్లే నాలో ఒక బాధ్యత పెరిగిందనుకుంటాను. అమ్మ బొటీక్ ద్వారా కష్టపడుతుంది... తనను డబ్బులు అడగకూడదు అనుకున్నాను. అమెజాన్లో పార్ట్టైమ్గా జాబ్లో చేరాను. ‘కానీ, ఈ రోజున్న జాబ్ రేపు ఉండకపోవచ్చు. ఇంకేదైనా చేయాలి..’ అనుకున్నాను. అప్పుడే ఫ్రెండ్ ద్వారా క్రియేటివ్ థాట్స్ని మీడియా ద్వారా చూపవచ్చు అని తెలిసింది. అప్పటికి ఫుల్టైమ్ జాబ్ చేస్తున్నా. వీకెండ్లో స్కిట్లు ప్లాన్ చేసుకున్నా. ఎలాగైనా ఫర్వాలేదు.. అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా బతికేయాలని డిసైడ్ అయ్యాను. అరియానా: లైఫ్లో భార్య, భర్త, పిల్లలు అనే బంధం ఉండాలి. దీనితో పాటు మనకు మనంగా లైఫ్లో ఏదో సాధించాలనే పట్టుదల కూడా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అమ్మాయిల్లో టు షేడ్స్ ఉండాలి. కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకుండా వ్యక్తిగతంగా ఏం సాధించాలనుకుంటామో ఆ దిశగా ప్రయత్నాలూ చేయాలి. కుటుంబం కుటుంబమే. నాకు నేనుగా ఎదగడమూ ముఖ్యమే. వర్క్లో అధిగమించిన సమస్యల గురించి.. హారిక: నాకు జీవితంలో ఎదిగే అవకాశం ఇచ్చింది ‘దేత్తడి.’ దేవుడు.. పాపా నువ్వు ఇందులో ఉంటే సెట్ అవుతావు. నీ కుటుంబానికి హెల్ప్ అవుతావు.. అని పెట్టాడేమో అనిపిస్తుంది. ముందు 7–8 వీడియోలు చేసేవరకు నాకు వాటిలో చాలా విషయాలు తెలియవు. తర్వాత అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులను పిక్ చేసుకోవడానికి టైమ్ పట్టేది. ఆర్టిస్టుల కోసం టిక్టాక్ వీడియోలు చూసి, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పదిమందిని కాంటాక్ట్ చేశాను. ఎడిటింగ్, డబ్బింగ్ అంటూ స్టూడియోలు వెతుక్కొని వెళ్లాను. రిలీజ్ అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. మంచి రిజల్ట్ వచ్చింది. ముందు దీనిలో ఓనమాలు తెలియవు. అందుకే, జాబ్ చేస్తూనే ఈ వర్క్ వీకెండ్లో చేసేదాన్ని. ఆఫీస్ షూట్.. షూట్.. ఆఫీస్ అన్నట్టుగా చేసేదాన్ని. అరియానా: కాలేజీ రోజుల నుంచి ఒకే ఆలోచన.. ఒక్కరోజు టీవీలో కనిపించినా పాప్యులర్ అయిపోతాను అనుకునేదాన్ని. చాలా ప్రయత్నాలు చేశాను. అమ్మ వద్దంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఓ మెయిల్ క్రియేట్ చేసి, టీవీలకి బోలెడన్ని ఫొటోలు పంపించాను. తర్వాత అడిషన్స్కి వెళ్లాను. సెలక్ట్ అయ్యాను. ఐదేళ్లుగా యాంకరింగ్ చేస్తున్నాను. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ చేశాను. మొదట్లో ఏవీ తెలియవు. అన్నీ తెలుసుకుంటూ వెళ్లడమే. నేను యాంకర్ కావాలి అనుకున్నాను. నేర్చుకునే క్రమంలో ప్రతిచోటా ప్రతిరోజూ ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. మీ ముందున్న లక్ష్యం? హారిక: గొప్ప నటిగా ఎదగాలి. క్రేజీ క్యారెక్టర్ చేయాలి. అది సినిమా లేదా వెబ్సీరీస్. సినిమా ఏది వస్తుందో తెలియదు. ఇంట్లో టీవీలో సినిమా చూస్తున్నప్పుడు అందులోని నటీనటుల యాక్టింగ్ గురించి మాట్లాడుతుంటాం. అలా నా యాక్టింగ్ గురించి కూడా చాలా మంది మెచ్చుకోవాలని ఉంది. అలా నేనూ చేయాలి అదే నా యాంబిషన్. అరియానా: మంచి యాంకర్ అవ్వాలి. క్రికెట్లో కామెంటరీ చేయాలి. ఒక పెద్ద నేషనల్ ఛానెల్లో ఇంటర్వ్యూస్ చేయాలి. ఈ అమ్మాయి ఎవరో భలే మాట్లాడింది.. అనుకోవాలి. ఆ రోజు రావడానికి టైమ్ పట్టచ్చు. కానీ, తప్పక వస్తుంది అనుకుంటాను. – నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
హోస్ట్గా అవియానా జంట.. ఇక సందడే సందడి
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి వచ్చిన చాలా మంది.. ఇప్పుడు సెలెబ్రెటీలు అయిపోయారు. వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లు ఏం ఆశించి హౌస్లోకి వచ్చారో.. అంతకంటే ఎక్కువ క్రేజ్ సంపాదించారు. గత మూడు సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్బాస్లో పాల్గొన్న వారికి కాస్త ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా యూట్యూబర్లు, చిన్న నటీనటులు పాల్గొనప్పటికీ.. వారికి ఇప్పుడు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ విన్నర్గా గెలిచిన అభిజీత్కి వరుస ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో నిలిచిన సోహైల్కు అయితే.. ఇప్పటికే హీరోగా ఒక సినిమా చాన్స్ కొట్టేశాడు. ఇక ఈ సినిమాలో నటిస్తానని మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం ఇప్పటికే ప్రకటనలు కూడా ఇచ్చారు. మరోవైపు బిగ్బాస్ దత్తపుత్రికగా పేరొందిన మోనాల్కు కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలతో పాటు స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఓ షోలో జడ్జిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా నాల్గో సీజన్లో పాల్గొన్న ఒక్కొక్కరికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సీజన్లో క్రేజీ జంటగా పేరొందిన అరియానా-అవినాష్ జోడీకి కూడా ఇప్పుడు ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి : భలే చాన్స్ కొట్టేసిన మోనాల్.. బుల్లితెరపై సందడి) బిగ్బాస్ హౌస్లో అరియానా, అవినాష్ జోడికి ఎంత పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదే. నెటిజన్లు అయితే ఈ జంటకు అవియానా అని పేరు పెట్టి మరి ప్రశంసలు కురిపించారు. ఇంట్లో ఉన్నన్ని రోజులు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు, అన్నం తినిపించుకోవడం, ఒకరిపైఒకరు పంచ్లు వేసుకోవడం వీక్షకులను బాగా ఆకట్టుకుంది. అవినాష్ ఎలిమినేట్ అయినప్పుడు అరియానా ఎంత భావోద్వేగానికి గురైందో అందరూ చూశారు. ఇలా ఈ సీజన్లో గుడ్ పెయిర్గా గుర్తింపు పొందిన ఈ జంటతో ప్రత్యేక ప్రోగ్రామ్లను నిర్వహించి టీఆర్పీ రేటింగ్ను పెంచుకునే ప్లాన్ చేస్తున్నాయట కొని ఎంటర్టైన్మెంట్ చానళ్లు. దీనికి సంబంధించి ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిని హోస్ట్గా పెట్టి స్పెషల్ ప్రోగ్రామ్లను ప్లాన్ చేస్తున్నారట ఓ చానల్ నిర్వాహకులు. కాగా హోస్ట్గా అరియానాకు మంచి అనుభవం ఉంది. అలాగే అవినాష్ కూడా శ్రీముఖితో కలిసి ఓ షోను హోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరితో కలిసి పలు ఛానెళ్ల వాళ్లు షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అరియానా, అవినాష్ టీవీ ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. కొన్ని చానళ్లకు జంటగా వెళ్లి మరి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ జంట హోస్ట్గా వస్తే.. బుల్లితెరపై సందడి మాత్రం మా..ములుగా ఉండదు మరి. -
బిగ్బాస్ : సోహైల్కు ఫ్యాన్స్ ఘన స్వాగతం
హుస్నాబాద్: బుల్లితెర వీక్షకులను అలరించిన తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ సోహైల్కు శనివారం రాత్రి హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వరంగల్ నుంచి కరీంనగర్కు వెళ్తున్న సోహైల్కు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో అభిమానులు స్వాగతం పలికారు. కొద్ది సేపు ఆగి వారితో మాట్లాడారు. కాగా సోహైల్కు స్నేహితుడు ఒకరు అతని వాహనంలో ప్రయాణించడంతో.. స్నేహితుడి స్వగ్రామం హుస్నాబాద్ కావడంతో అతని కోరిక మేరకు హుస్నాబాద్ నుంచి వెళ్దామని కోరడంతో సోహైల్ వరంగల్ నుంచి హుస్నాబాద్ మీదుగా కరీంనగర్కు వెళ్లేందుకు పయనమయ్యాడు. అప్పటికే తన స్నేహితుడి సమాచారం మేరకు అయనను కలుసుకునేందుకు హుస్నాబాద్ పట్టణంలో అభిమానులు సిద్ధమయ్యారు. అంబేడ్కర్ చౌరస్తాలో సోహైల్కు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా బిగ్బాస్ షోలో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా, చివరకు 5గురు టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్గా నిలిచారు. కాగా చివరి ముగ్గురిలో వెళ్లిపోవడానికి ఇష్టపడిన వారిలో సోహైల్ అంగీకరించడంతో అతను రూ.25లక్షలు ప్రైజ్మనీ పొందాడు. -
భలే చాన్స్ కొట్టేసిన మోనాల్.. బుల్లితెరపై సందడి
మోనాల్ గజ్జర్.. బిగ్బాస్ నాల్గో సీజన్లో హాట్ టాపిక్గా మారిన పేరు ఇది. తొలుత అభిజిత్తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్తో క్లోజ్గా మూవ్ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్కి హైలెట్గా నిలిచాయి. బిగ్బాస్ నాల్గో సీజన్లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ముఖ్యంగా హౌజ్లో అఖిల్- మోనాల్ల మధ్య రిలేషన్ వీక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్బాస్లో పాల్గొనకముందు ఈ భామ పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ.. అప్పటి కంటే ఎక్కువ క్రేజ్ ఈమెకు బిగ్బాస్లో పాల్గొనడం ద్వారా వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చకా.. బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాలతో పాటు పలు షోలలో ఆమె పాల్గొనబోతున్నట్లు సమాచారం. కాగా స్టార్ మాలో రేపటి నుంచి ప్రసారం కాబోయే డ్యాన్స్ ప్లస్ షోలో మోనాల్ పాల్గొనబోతున్నట్లు ఈ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఓ ప్రోమోను విడుదల చేశారు నిర్వాహకులు. అందులో వన్ డే టు గో అంటూ తనదైన స్టైల్లో చెప్పింది మోనాల్. అయితే ఈ షోలో మోనాల్ మెంటర్గా ఉండనున్నారా..? లేక జడ్జిగా ఉండబోతున్నారా అనేది నిర్వాహకులు తెలియజేయలేదు. కానీ ఆమె జడ్జిగానే ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ షోకి మోనాల్తో పాటు బాబా భాస్కర్ మాస్టర్, యశ్ మాస్టర్, రఘు మాస్టర్ కూడా జడ్జిలుగా ఉండబోతున్నారట. ఇక ఈ షోకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమోలు అందరినీ ఆకట్టుకున్నాయి. వాటిని చూస్తుంటే ఈ షో ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. 1 Day to go!!!#Dancee+ starts tomorrow at 6 PM on @StarMaa#DanceePlus pic.twitter.com/xeab1aFzgr — starmaa (@StarMaa) December 26, 2020 -
అభిజిత్ ఛాలెంజ్ స్వీకరించిన సోహైల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ను రెండో రన్నరప్ సోహైల్ స్వీకరించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని పార్క్లో సోహైల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుందని పేర్కొన్నారు. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బులు ఇచ్చి కోనుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని సోహైల్ కోరారు. చదవండి: హీరోగా ఎంట్రీ.. సోహైల్ కొత్త సినిమా ఫిక్స్! దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్, నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తను మరో ముగ్గురికి( అరియానా, మెహబూబ్, అఖిల్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు ఈ సందర్భంగా సోహైల్కు వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు. చదవండి: సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్ బిగ్బాస్ 4 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
హీరోగా ఎంట్రీ.. సోహైల్ కొత్త సినిమా ఫిక్స్!
బిగ్బాస్ సీజన్ 4 సీజన్లో మూడో ప్లేస్లో నిలిచిన సోహైల్ ప్రజల్లో విన్నర్ కంటే ఎక్కువ క్రేజ్ను సొంతం చేసుకున్నాడు. సెకండ్ రన్నరఫ్గా నిలిచినా.. విన్నర్ సాధించినంత ఫ్రైజ్ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్ నిర్ణయం అందరిని ఆకట్టుకుంది. బిగ్బాస్ నుంచి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించాలని ఉన్నట్లు తన మనసులోని మాటను సోహైల్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒకటి రెండు సినిమాల్లో నటించిప్పటికీ సోహైల్కు పెద్దగా పేరును తెచ్చిపెట్టలేదు. అయితే బిగ్బాస్కు వెళ్లిన తర్వాత సోహైల్ లైఫ్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు. అయితే ఇలా తన ఉద్ధేశ్యం బయటకు చెప్పాడో లేదో అలా సోహైల్కు సినిమాల నుంచి అవకాశాల వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కమెడీయన్ బ్రహ్మనందం వంటి స్టార్ సెలబ్రిటీలు సోహైల్ చిత్రంలో నటిస్తామని మాటివ్వగా.. హౌజ్ నుంచి బయటకు వచ్చిన రోజే ఓ సినిమా స్టోరీ కూడా విన్నట్లు సోహైల్ చెప్పాడు. చదవడి: మెహబూబ్ సైగలపై సోహైల్ రియాక్షన్ ఈ క్రమంలో తాజాగా సోహైల్ హీరోగా తన మొదటి సినిమాకు ఓకే చెప్పాడు. జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నారు. దర్శకుడు మంచి స్క్రిప్ట్ రెడీ చేసి సోహైల్ దగ్గరకు తీసుకెళ్లగా కథ విన్న అతడు ఓకే కూడా చెప్పాడు. దీంతో ఈ చిత్రం ప్రీ పప్రొడక్షన్ పనులు 2021 న్యూయర్ తర్వాత ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దీన్ని పక్కన పెడితే హీరో కావాలన్న సోహైల్ ఆశ తొందరలోనే నెరవేరనుంది. ఇప్పటికే బిగ్బాస్ విన్నర్ ప్రకటించేందుకు వచ్చిన చీఫ్ గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సోహైల్ మేనరిజం.. ‘కథ వేరే ఉంటది’ తన సినిమాల్లో వాడుకుంటానని చిరు చెప్పడమే కాకుండా ఎప్పటికైనా సోహైల్తో తనొక మంచి సినిమా చేస్తానని మాటిచ్చాడు. అదే విధంగా టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపినట్లు సోహైల్ స్వయంగా వెల్లడించారు. చదవండి: సోహైల్కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్ కథ వేరే ఉంటది 🔥🤘 Pics from @SohelRyan's new film announcement press meet. Produced by #GoergeReddy and #PressureCooker fame @Appireddya#SrinivasVinjanampati to direct Shoot 🎬 starts from February.@Mic_Movies @GskMedia_PR pic.twitter.com/dYXr7Tw7uV — BARaju (@baraju_SuperHit) December 24, 2020 ఇక బిగ్బాస్ గ్రాండ్ ఫినాలేలో టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్ను సోహైల్ అంగీకరించి.. ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సోహైల్ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. వచ్చిన ఆ 25 లక్షల రూపాయాల్లో అయిదు లక్షలు అనాథశ్రమానికి, మరో ఐదు మెహబూబ్ ఇల్లు కట్టుకునేందుకు ఇస్తానని చెప్పాడు. కానీ మెహబూబ్ అతడి ఆఫర్ను తిరస్కరిస్తూ ఆ ఐదు లక్షలు కూడా అనాథశ్రమానికే ఇచ్చేయమన్నాడు. వీరి ఆలోచన మెచ్చిన నాగ్ ఆ పది లక్షలు అనాథశ్రమానికి తాను ఇస్తానని, సోహైల్ను 25 లక్షలు ఇంటికే తీసుకెళ్లమని చెప్పారు. చదవండి: సోహైల్, దివికి చిరు బంపర్ ఆఫర్! -
సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్
బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లను చూసి జనాలు పెదవి విరిచారు. ముక్కూమొహం తెలీని వాళ్లను హౌస్లోకి పంపించారేంటని విమర్శలు గుప్పించారు. కానీ షో నడిచే కొద్దీ జనాలు వారికి తెలీకుండానే కంటెస్టెంట్లకు అభిమానులుగా మారిపోయారు. వారిని ఎలాగైనా గెలిపించాలన్న కసితో సోషల్ మీడియాలో ఆన్లైన్ యుద్ధాలు చేశారు. అంతిమంగా మెజారిటీ ప్రేక్షకుల మనసున్న దోచుకున్న అభిజితే విజేతగా అవతరించాడు. అయితే సీజన్ అలా ముగిసిందో లేదో వరుస ఆఫర్లు కంటెస్టెంట్ల ఇంటి ముందు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సోహైల్ సినిమాలో ఒక్క రూపాయి తీసుకోకుండా నటిస్తామని మెగాస్టార్ చిరంజీవి, కమెడియన్ కింగ్ బ్రహ్మానందం మాటిచ్చారు. అటు దివి కూడా మెగాస్టార్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. సామ్తో అభిజిత్ ఈ క్రమంలో విన్నర్ అభిజిత్కు సైతం బంపరాఫర్ తగిలినట్లు కనిపిస్తోంది. హీరోయిన్ సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సామ్జామ్కు అభిని ఆహ్వానించినట్లు సమాచారం. ఈమేరకు ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే ఈ బిగ్బాస్ స్టార్ త్వరలోనే సమంతతో సందడి చేయనున్నాడు. ఓటీటీ వేదిక ఆహాలో నిర్వహిస్తున్న సామ్జామ్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మొదటి అతిథిగా హాజరయ్యారు. తర్వాత రానా, తమన్నా, రాకుల్ ప్రీత్సింగ్, నాగ్ అశ్విన్, క్రిష్ తదితరులు సామ్ షోలో మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ షోలో పాల్గొనగా దీనికి సంబంధించిన ప్రోమో వైరల్గా మారింది. చూస్తుంటే త్వరలోనే అభి కూడా ఈ షోలో ప్రత్యక్షమవనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: బిగ్బాస్: అభిజిత్ విజయానికి కారణాలివే) అభికి సినిమా ఆఫర్లు కాగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో వెండితెరకు పరిచయమైన అభిజిత్ తర్వాత కనిపించకుండా పోయాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు బిగ్బాస్ను వేదికగా మలుచుకున్నాడు. హౌస్లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఎక్కడా నోరు జారకుండా, గొడవల్లో దూరకుండా, మెచ్యూర్డ్గా మాట్లాడుతూ, తెలివిగా టాస్క్లు ఆడుతూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఆయన సహనం, ప్రేమ, తెలివి, వ్యక్తిత్వం అన్నింటినీ మెచ్చి జనాలు బ్రహ్మరథం పట్టారు. అతడిని గెలిపించారు. ఇది అతడి లైఫ్కు టర్నింగ్ పాయింట్ కానుంది. మళ్లీ సినిమా అవకాశాలు వస్తున్నాయి..పలువురు దర్శకనిర్మాతలు అభికి కథలు వినిపిస్తున్నారట. ఈ క్రమంలో ఓ మంచి సినిమాలో ప్రధాన పాత్రలో నటించేందుకు అభి ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. అభికి మళ్లీ హిట్ దొరికి హీరోగా నిలదొక్కుకోగలిగితే అతడి లైఫ్ మరింత బ్యూటిఫుల్ అవడం ఖాయం! (చదవండి: 'విజయ్ దేవరకొండను కిస్ చేయాలని ఉంది') -
మెహబూబ్ సైగలపై సోహైల్ రియాక్షన్
బిగ్బాస్ నాలుగో సీజన్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్ ఇలా అన్నీ పంచిపెట్టింది. ఈ సీజన్లో మొత్తం 19 మంది బిగ్బాస్లోకి అడుగుపెట్టగా వారిలో కొంత మందికి మాత్రమే సరైన గుర్తింపు లభించింది. తమ తలరాతను మార్చేలా భవిష్యత్తు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బిగ్బాస్తో లైఫ్ చేంజ్ అయిన వారిలో సోహైల్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటి వరకు అడపాదడపా సినిమాల్లో నటించిన సోహైల్కు పెద్దగా చెప్పుకునే అంతా పేరు రాలేదు. కానీ బిగ్బాస్లోకి వెళ్లిన తర్వాత తన లైఫ్ వేరేలా మారిపోయింది. సీజన్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాడు. అయితే ఇంత పాపులారిటీ సంపాదించిన సోహైల్కు ఒక్కసారిగా ట్రోల్స్, మీమ్స్తో గట్టి ఎదురుదెబ్బ ఎదురయ్యింది. చదవండి: బిగ్బాస్: బయటపడ్డ సోహైల్, మెహబూబ్ కుట్ర! బిగ్బాస్ చివరి అంకానికి చేరుకున్న సమయంలో ఎలిమినేట్ అయిన సభ్యులు ఇంట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అద్దాలతో ఏర్పాటు చేసిన గది నుంచి ఒక్కొక్కరూ వచ్చి టాప్ 5 కంటెస్టెంట్లను కలిసి కాసేపు అలరించారు. అయితే మెహబూబ్ మాత్రం సోహైల్తో ఏవో సైగలు చేసినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అందరితో కూల్గా మాట్లాడినట్లు నటించిన నటించిన మెహబూబ్.. తన సంజ్ఞలతో సోహైల్కు ఏదో చెప్పాడని నెటిజన్లు మండిపడ్డారు. సోహైల్ నెంబర్ త్రీలో ఉన్నట్టు మెహబూబ్ అద్దంపై మూడు వేళ్లతో సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే, డబ్బులు తీసుకునే ఆఫర్ గనుక వస్తే వదిలిపెట్టొదని సిగ్నల్ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఇక మెహబూబ్ చెప్పినట్లుగానే టాప్ 3 కంటెస్టెంట్లుగా మిగిలిన అఖిల్, అభిజిత్, సోహైల్కు బిగ్బాస్ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని బిగ్బాస్ చెప్పగా.. సోహైల్ ఆ డీల్కు అంగీకరించాడు. రూ.25 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటికొచ్చాడు. దీంతో మెహబూబ్ చెప్పడం వల్లే ఎలాగూ తనది మూడో స్థానం అని సోహైల్ డబ్బులు తీసుకున్నాడని, తద్వారా విన్నర్ అభిజిత్కు ప్రైజ్ మనీలో సగం కోత పడిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సోహైల్కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్ కాగా తాజాగా మంగళవారం సోహైల్ తన ఇన్స్టాగ్రామ్లో లైవ్ వీడియోలోకి వచ్చారు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం చేప్తానని చెప్పడంతో అనేకమంది మెహబూబ్ సైగా విఫయాన్ని కామెంట్ల రూపంలో ప్రశ్నించారు. దీంతో మెహబూబ్ సైగలపై స్పందిస్తూ ఆగ్రహానికి గురయ్యాడు. బిగ్బాస్లో తరువాత ఏం జరుగుతుందనేది అసలు ఎవరికి తెలియదని, ఎవరు ఉంటారు, ఎవరు పోతరని ఎవరికి తెలియదు. ‘అంతా సీన్ లేదు అక్కడ. అట్ల ఉంటే మంచిగుండు. ఏరోజు అలాంటి పరిస్థితి రాలేదు. అలాగే చిన్న లాజిక్ చెబుతా. జాగ్రత్తగా వినండి. వాడు ఏదో గ్లాస్ను పట్టుకుని ఊరికే చేతి వేళ్లను అలా అన్నాడు. అసలు వాడేమన్నడో నాకు తెలియదు. టాప్ 3లో ఎవరుంటరనేది ఎవరూ జడ్జ్ చేయలేదు. నేడు విన్నర్ అయ్యే వాడినేమో, టాప్ 2లో ఉండే వాడినేమో. వాడు ఎలా చెప్తడు. వాడికి ఎలా తెలుస్తోంది. మెహబూబ్ బిగ్బాస్ కాదు. వాడు డబ్బులు గెలుచుకొని రారా అని సిగ్నల్ చేసిండేమో.. తను చెప్పింది అర్థం కాలేదని తర్వాత అఖిల్తో కూడా చర్చిందాను. దాన్ని పట్టుకొని వీడియోలు చేసి, కథలు పడి ఇవన్నీ చేయడం నాకు నచ్చలేదు. నా పది సంవత్సరాల కష్టం. నా కెరీర్ మీద ఒట్టేసి చెప్తున్నా. నిజంగా అలా అన్నది ఎందుకు అన్నాడో నాకు తెలీదు. టాప్ 3 అని నేను అన్నది తెలీదు. నేను నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అని అడిగాను. అంతే అయినా థర్డ్ ప్లేస్లో ఉన్న వాళ్లకు డబ్బులు ఇస్తారని మెహబూబ్కు ఎలా తెలుసు. 25 లక్షలు 25 లక్షలు ఆఫర్ ఇస్తే మనం వినియోగించుకుందాం అని అఖిల్ నేను అనుకున్నాం. అంతేగాని మూడో ప్లేస్లో ఉంటే డబ్బులు ఇస్తారని ఎవరికి తెలియదు. నేను అలా స్కాం చేసి చేసి గెలిస్తే నా కెరీర్లోనే బాగుపడను. అసలు అది ఫ్రాడ్, స్కాం కాదు. అభిజిత్ ఫ్యాన్స్కు కూడా చెబుతున్నా. నేను తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా చెప్తా. బిగ్బాస్ హౌజ్లో అసలేం జరుగుతుందో ముందే ఎవరికి తెలియదు’ అని సోహైల్ వివరించాడు. -
అమలగారూ నాకు అమ్మే: అభిజీత్
బిగ్ స్క్రీన్లో నటించాలి. బిగ్ హౌస్లో జీవించాలి. రెండూ తెలిసిన కుర్రాడు అభిజీత్. సహజంగానే స్ట్రాంగ్. ‘రియాలిటీ’తో.. మరింత స్ట్రాంగ్ అయ్యాడు. విజేతగా నిలిచాడు. ‘ఈ విజయం వీక్షకుల కటాక్షమే’ అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్లది గత తరం. ఇంజనీర్ అయ్యి సినిమాల్లోకి వస్తున్న తరం ఇప్పటిది. ఈ తరానికి నవ ప్రతినిధి అభిజీత్. ‘‘సినిమాకి ఉన్న అందం అది. ఎప్పటికీ వన్నె తగ్గని కళ అది. అందుకే ఈ ఆకర్షణకు లోనయ్యాను’’ అని పెద్దగా నవ్వేశాడు అభిజీత్. స్కూల్లో నేర్చుకున్నవి కాలేజ్లో మనల్ని నడిపిస్తాయి. కాలేజ్లో నేర్చుకున్నవి సమాజంలో నడిపిస్తాయి. చదువు సమాజంలోకి ధైర్యంగా నడిపించే సాధనం అయితే... సమాజం నుంచి నేర్చుకున్న జ్ఞానం మనిషిగా నిలబెడుతుంది. బిగ్బాస్ తనకు అలాంటి జ్ఞానాన్నే ఇచ్చిందని అన్నాడు అభిజీత్. ‘‘బిగ్బాస్ హౌస్లో జీవించడం మాత్రం జీవితంలో గొప్ప అనుభవం. ఒక మామూలు మనిషిని గొప్ప వ్యక్తిత్వంతో మలచగలిగిన శక్తి ఈ రియాలిటీ షోకి ఉంది. బిగ్బాస్లోకి వెళ్లక ముందు అభిజీత్కి, బిగ్బాస్ విజేతగా బయటకు వచ్చిన అభిజీత్కి మధ్య తేడా ఉంటుంది. ఆ మార్పును మీరే చూస్తారు’’ అని అన్నాడు అభిజీత్. ‘‘బిగ్బాస్ విజేత కావడం కంటే చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు అందుకునే అదృష్టం నాకు ఎక్కువ ఆనందాన్నిస్తోంది. ఈ షోలో విజేతనయ్యాను కాబట్టే ఆ అదృష్టం దక్కింది. కాబట్టి బిగ్బాస్ విజేత అనే ట్యాగ్ని ఎప్పటికీ గౌరవిస్తాను. ఈ షో పట్ల గౌరవంగా ఉంటాను’’ అని చెప్పాడు. అమలగారూ నాకు అమ్మే మొదటి సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అమల కొడుకు అభిజీత్. ‘‘అమలగారు ఎంత కేరింగ్గా ఉండేవారంటే... ‘అభీ నువ్వు తిన్నావా’ అని అడిగేవారు. అంతటి సీనియర్ నటితో సీన్ అంటే ముందుగానే రెండు– మూడు రిహార్సల్స్ చూసుకుని సిద్ధంగా ఉండేవాళ్లం. కానీ ఆమె కొత్తవాళ్లు కదా భయపడతారేమోనని ‘ఓకేనా, ప్రిపరేషన్కి మరికొంత టైమ్ కావాలా’ అని అడిగేవారు. నాగార్జున సర్ నుంచి డెడికేషన్, డిసిప్లిన్ నేర్చుకున్నాను. మా సమస్యలను అర్థం చేసుకుని అందులో నుంచి ఒక పంచ్ వేసి మమ్మల్ని నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తారాయన. అఖిల్ కూడా అమలగారిలాగానే ఉంటారు. ఆ కుటుంబం నుంచి చాలా నేర్చుకోవచ్చు’’ అంటూ నాగార్జున్ సర్ని అంత దగ్గరగా అన్ని రోజుల పాటు ఆయనతో కలిసి పని చేసే అవకాశం బిగ్బాస్ షో ద్వారా వచ్చిందని అభిజీత్ సంతోషంగా చెప్పాడు. ఇంకా స్ట్రాంగ్ అవాలి మంచి ప్రమాణాలున్న రిషీవ్యాలీ స్కూల్, జేఎన్టీయూ, మసాచుసెట్స్లో చదువు తనను వ్యక్తిగా దృఢంగా నిలబెట్టాయని చెప్పాడు అభిజీత్. ‘‘బిగ్బాస్లోకి అడుగుపెట్టే వరకు ‘నేను మెంటల్లీ చాలా స్ట్రాంగ్’ అనుకునే వాడిని. నేను మరింత స్ట్రాంగ్గా మారాలని హౌస్లోకి వెళ్లిన కొద్ది రోజుల్లోనే తెలిసింది. కొన్ని సందర్భాలు నన్ను ఎమోషనల్గా మార్చాయి. మానసికంగా బలహీన పరిచే సంఘటనలు కూడా ఎదురయ్యాయి. నేను తప్పు చేయలేదు కదా, ఎందుకిలా అవుతోంది అని బాధపడిన సందర్భాలున్నాయి. అయితే ఆందోళన, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగిన నిగ్రహం నాలో ఉంది. అది నేను చదువుకున్న మంచి విద్యాసంస్థల శిక్షణతోనే వచ్చింది. నేను బలహీన పడిన ప్రతి సందర్భంలోనూ వీక్షకులు నాకు అండగా నిలిచారు. నన్ను విజేతగా నిలపడానికి వాళ్లందరూ ఇచ్చిన మద్దతు మర్చిపోలేనిది. నా కుటుంబం ఇచ్చినంత సహకారాన్ని నాకు తెలియని చాలా మంది నుంచి కూడా పొందగలగడం నిజంగా వరమే’’ అని తనకు ఓట్లేసి విజేతగా నిలిపిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియచేశాడు. నటనకే నా జీవితం నటనలో కెరీర్ను మలుచుకోవడం కాదు, నటన కోసం జీవితాన్ని అంకితం చేస్తానన్నాడు అభిజీత్. సినిమా థియేటర్, ఓటీటీ ఏదైనా సరే... నటనలోనే జీవితం, నటనతోనే జీవితం... అంటూ ‘మా అమ్మకు నన్ను తెర మీద చూడడం ఇష్టం’ అని అసలు రహస్యాన్ని బయటపెట్టాడు.‘‘మా నాన్న మాత్రం చదువుకుని ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ స్థిరపడాలని కోరుకున్నాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా అవకాశం వచ్చినప్పుడు అమ్మ నేను పెద్ద హీరోనైపోయినంతగా సంతోషపడింది. అమ్మ కోరుకున్నట్లు ‘హీరో అభిజీత్’గా గుర్తింపు తెచ్చుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నాడు అభిజీత్. అమ్మాయి ఎంపిక ఇక జీవిత భాగస్వామిని నిర్ణయించే బాధ్యత అమ్మకే ఇచ్చేశానని చెప్పాడు ఈ బిగ్బాస్ తాజా విజేత. ‘‘ఈ రోజు నేను అందరి ఎదుట ఇలా నిలబడగలిగానంటే... అది నా ఒక్కడి సమర్థత, కాదు. అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ అందరి ఆశలు, ప్రయత్నం, శ్రమ ఉన్నాయి. వాళ్లు మంచి చదువుని, మంచి జీవితాన్నిచ్చారు. నా జీవితంలో, మా కుటుంబంలో చక్కగా ఇమిడిపోగలిగిన అమ్మాయి ఎంపిక కూడా మా అమ్మ అయితేనే కరెక్ట్గా చేయగలుగుతుంది. ఓకే... థాంక్యూ’’ అంటూ ఇంటర్వ్యూ ముగించాడు అభిజీత్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సోహైల్కు బ్రహ్మానందం బంపర్ ఆఫర్
బుల్లితెర ప్రేక్షకులను 106 రోజుల పాటు అలరించిన బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్ మొన్నటి ఆదివారంతో ముగిసింది. నాల్గో సీజన్ విన్నర్గా అభిజిత్ నిలిచినా... అంతకు మించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు సోహైల్. సెకండ్ రన్నరఫ్గా నిలిచినా.. విన్నర్ సాధించినంత ఫ్రైజ్ మనీని సొంతం చేసుకుకున్నాడు. రూ.25లక్షలు తీసుకోవడానికి ముందుకు వచ్చిన సోహైల్ నిర్ణయం అందరిని ఆకట్టుకుంది. (చదవండి : బిగ్బాస్ : హారిక నా చెల్లి.. అభిజిత్ షాకింగ్ కామెంట్స్) అందులో నుంచి రూ.10 లక్షలు అనాథశ్రయాలకు ఇస్తానంటే.. వద్దని, ఆమొత్తాన్ని నేనే ఇస్తానని నాగార్జున్ చెప్పాడు. ఐదు లక్షలు మిత్రుడు మెహబూబ్కి ఇస్తానంటే.. వద్దొద్దు.. నేనే మెహబూబ్కి పది లక్షలు ఇస్తానని షోకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి చెప్పాడు. దీంతో సోహైల్కు మంచి పేరు రావడంతో పాటు రూ.25లక్షలు దక్కాయి. అంతే కాకుండా తను తీయబోయే సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పడం సోహెల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇది ఇలా ఉంటే సోహైల్ను మరో బంపర్ ఆఫర్ వరించింది. ప్రముఖ టాలీవుడ్ కమెడీయన్ బ్రహ్మానందం కూడా సోహెల్ చేసే సినిమాలో రూపాయి తీసుకోకుండా నటిస్తానని తెలిపాడట. ఈ విషయాన్ని సోహైలే స్వయంగా వెల్లడించాడు. ‘బ్రహ్మనందం ఫోన్ చేసి.. సోహైల్ నీ కోసమే బిగ్బాస్ చూశా అన్ని అన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు నేనే వచ్చి కలుస్తానని చెప్పారు. అలాగే నేను తీయబోయే సినిమాలో ఫ్రీగా నటిస్తానని హామీ ఇచ్చారు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి’ అని సోహైల్ చెప్పుకొచ్చాడు ఓ వైపు చిరంజీవి, నాగార్జున అండ, మరోవైపు బ్రహ్మానందం వంటి స్టార్ కమెడీయన్ కూడా సోహెల్కు తోడుగా తన సినిమాలో నటిస్తాననడం సూపర్ అంటున్నారు నెటిజన్స్. ఇలా ఓ కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Telugu Entertainment Page🔥 (@dubcaffehub) -
బిగ్బాస్ : హారిక నా చెల్లి.. అభిజిత్ షాకింగ్ కామెంట్స్
బిగ్బాస్ నాల్గో సీజన్లో మొదట్లో అభిజిత్-మోనాల్-అఖిల్ ట్రయాంగిల్ లవ్స్టోరీ ఎంత హైలెట్ అయిందో చెప్పనక్కర్లేదు. గంట సేపు ప్రసారమయ్యేలో షోలో.. ఈ ముగ్గురికే ఎక్కువ స్క్రీన్ స్పెస్ ఇచ్చేవాడు బిగ్బాస్. అయితే బిగ్బాస్ ఎత్తుగడను పసిగట్టిన మిస్టర్ కూల్ అభిజిత్.. మోనాల్తో కాస్త దూరంగా ఉండటం మొదలు పెట్టాడు. దీంతో అఖిల్- మోనాల్ ప్రేమాయణాన్ని హైలెట్ చేసి చూపించాడు బిగ్బాస్. ఇక వీరిద్దరంతా కాకపోయినా.. అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. నోయల్, లాస్య ఎలిమినేట్ అయ్యాక అభి, ఎక్కువగా హారికతోనే గడిపాడు. ఇద్దరు సరదాగా మాట్లాడుకున్న మాటలు, హగ్లు, ముద్దులను హైలెట్ చేసి చూపించాడు బిగ్బాస్. దీంతో అభికి హారిక మధ్య సమ్థింగ్.. సమ్థింగ్ అంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. (చదవండి: బిగ్బాస్: అభిజిత్ విజయానికి కారణాలివే) ఇక ఆ పుకార్లు నిజమే అన్నట్లు హారిక కూడా అభిజిత్ లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోయింది. చాలా సందర్భంలో వీళ్లిద్దరి మధ్య రొమాంటిక్ సీన్లను హైలైట్ చేస్తూ ఏదో నడుస్తుందని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేశారు బిగ్ బాస్. దీంతో అభి-హారిక పేర్లను ఏకం చేసి అభిక అని ఫ్యాన్స్ పేజ్లు కూడా వచ్చేశాయి. వీరిద్దరూ కొత్త లవ్ ట్రాక్ మొదలుపెట్టారని రూమర్లు పుట్టుకొచ్చాయి. ఇక వీరిద్దరి పేరెంట్స్ కూడా పరోక్షంగా వాళ్లు లవ్లోనే ఉన్నారని ఒప్పేసుకున్నారు. హారిక లాంటి కోడలు కావాలని అభి తల్లి.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఓకే హారిక తల్లి చెప్పడంతో వీరద్దరి గుండెల్లో గంట మోగిందని ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే ఇదంతా తప్పని, బిగ్బాస్ తమ రిలేషన్ని వేరేలా చూపించారని చెబుతున్నాడు నాల్గో సీజన్ విన్నర్ అభిజిత్. తాజాగా ఆయన ఓ టీవీ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హారిక తన చెల్లి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ఒక తమ్ముడు ఉన్నాడని, ఇక హారిక లాంటి చెల్లెలు కూడా ఉంటే బాగుంటుందని అనుకునేవాడినని, అందుకే ఆమెతో ఎక్కు టైం స్పెండ్ చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయాన్ని హౌస్లో హారికకు ఎన్నోసార్లు చెప్పానని, అది బయటకు రాలేదని ఇప్పుడే తెలిసిందని అభి చెప్పుకొచ్చాడు. రేటింగ్ కోసమే బిగ్బాస్ అభి, హారిక రిలేషన్ని వేరుగా చూపించినట్లు అర్థమవుతుంది. -
బిగ్బాస్: అభిజిత్ విజయానికి కారణాలివే
బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్ రియాల్టీ రియాలిటీ షో బిగ్బాస్ నాల్గో సీజన్కు శుభం కార్డు పడింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేకు గ్రాండ్ ఫినాలే వేడుకలో సినీ తారలు అదిరిపోయే ప్రదర్శనతో అలరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ రియాలిటీ షో విజేతగా యువ హీరో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. ట్రోఫీ కోసం 19 మంది బరిలోకి దిగి చివరికి ఫినాలే వరకు ఐదుగురు మాత్రమే మిగిలారు. అయితే ఈ ఐదుగురు బిగ్ బాస్ విన్నింగ్ ట్రోఫీకి తీవ్రంగా కృషి చేశారు. కానీ చివరు గెలుపు మాత్రం మిస్టర్ కూల్ అభిజిత్ను వరించింది. అయితే ఇది ఒక వారం రోజులు పాటు చూసిన ఇచ్చిన ట్రోఫి కాదు. 105 రోజుల పాటు అతని ఆట తీరు, ప్రవర్తను బట్టి బిగ్బాస్ ట్రోఫీ లభించింది. మరి అంతమందిలో అభి మాత్రమే ఎలా విజయం సాధించాడు. అసలు ఆయన బిగ్బాస్ జర్నీలో ట్రోపి కొట్టడానికి ఉపయోగపడ్డ అంశాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం బుద్ది బలంతో కొట్టాడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజిత్ను ప్రేక్షకులు ఎప్పుడో మర్చిపోయారు. బిగ్బాస్లోకి వచ్చినప్పడు కూడా అభిజిత్పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. షో ఆరంభంలో అతడిపై ఎలాంటి అంచనాలూ లేవు. షో హైపు కోసం, అమ్మాయిలతో ట్రాకులు నడపడం కోసమే అభిని ఎంచుకున్నారని అనుకున్నారు. కానీ క్రమ క్రమంగా అభిజిత్ టాలెంట్ బయటపడింది. కండబలంతో కాకుండా బుద్ది బలంతో గేమ్ ఆడడం ప్రేక్షకులను ఆకర్షించింది. మాస్టర్ మైండ్తో అతడు తీసుకున్న నిర్ణయాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టాస్క్ వచ్చిందంటే చాలు అందులో ఈజీగా ఎలా గెలవచ్చు అనేదానిపై అభి ఫోకస్ ఉండేది. అత్యధిక సార్లు నామినేషన్లో బిగ్బాస్లో అత్యంత కీలకమైనది నామినేషన్. ప్రతి సోమవారం జరిగే ఈ నామినేషన్ ప్రక్రియను చూసి ఇంటి సభ్యులంతా గజ గజ వణికిపోయేది.ఒక అభిజిత్ తప్ప. ఆయన నామినేషన్ను సానుకూలంగా స్వీకరించేవాడు. సరైన కారణాలతో ఇతరులను నామినేట్ చేసేవాడు. ఎవరైనా తనను నామినేట్ చేసినా మిగతా వాళ్లలాగా గొడవకు దిగకుండా.. నామినేషన్లను స్వాగతించేవాడు. అభిజీత్ను హౌస్మేట్స్ అంతా కలిసి 11 సార్లు నామినేట్ చేశారు. నామినేషన్ జరిగిన 14 వారాల్లో 11 సార్లు నామినేట్ అవడం వల్ల ప్రేక్షకులు అతడికి ఓట్లు వేయడానికి అలవాటు పడ్డారు. ఇది కూడా అతడి విజయానికి కారణమైంది. గత రెండు సీజన్ల విన్నర్లు రాహుల్, కౌషల్ కూడా 11 సార్లు నామినేట్ కావడం గమనార్హం. మిస్టర్ కూల్గా పేరు బిగ్బాస్ నాల్గో సీజన్లో అతి తక్కువ గొడవలు పెట్టుకున్న ఏకైక వ్యక్తి ఒక అభిజితే అని చెప్పొచ్చు. ఒక్క నామినేషన్ టాస్కుల్లో తప్ప ఆయన ఎప్పుడూ ఎవరితో గొడవపడలేదు. కామ్గా ఉంటూ.. నామినేషన్ను కూడా సీరియస్గా తీసుకునేవాడు కాదు. క్లిష్ట సమయంలోనూ సహనాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకుల ఓట్లను సంపాదించాడు. అలాగే లవ్ ట్రాకులకు ఆయన దూరంగా ఉన్నాడు. మోనాల్ విషయంలోనూ అభి నిర్ణయం అందరిని అబ్బురపరిచింది. అఖిల్ ఆమెకు దగ్గరైనప్పుడు అభి దూరంగా ఉంటడం. ఆమెపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం కలిసొచ్చింది. ఇక అఖిల్, మోనాల్ ప్రవర్తన కూడా అభికి ప్లస్ అయింది. ఒక్క టాస్క్... అభిని హీరో చేసింది నాల్గో సీజన్ మొత్తంలో అతి తక్కువగా టాస్క్లు ఆడింది మాత్రం అభిజిత్. ఇందులో సందేహం లేదు. మిగతావాళ్లు వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడినా.. అభి మాత్రం ఫిజికల్ టాస్కులు మాత్రం అంతగా ఆడేవాడు కాదు. కానీ ఒకే ఒక టాస్క్ అభికి మంచి పేరు తెచ్చి విజయానికి కారణమైంది. అదే రోబో టాస్క్. బిగ్ బాస్ ఇచ్చిన రోబో టాస్క్లో అతడు దివిని కిడ్నాప్ చేయడం పెద్ద సంచలనం అయింది. అప్పుడు సోహెల్, మెహబూబ్, అఖిల్, మోనాల్లు అతడిని తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో కొట్టేందుకు మీదకెళ్లారు. కానీ అభి మాత్రం తన సహనంతో గేమ్ ప్లాన్ను వివరించాడే తప్ప.. గొడవకు సై అనలేదు. అప్పుడే అభి పట్ల ప్రేక్షకుల్లో సానుభూతి పెరిగింది. గేమ్ను గేమ్లాగే ఆడాడని అతనికి ఓట్లు వేయడం మొదలుపెట్టారు. నోయల్, లాస్యల ఫ్రెండ్షిప్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన నోయల్, లాస్యల మద్దతు కూడా అభికి కలిసొచ్చింది. హౌస్లో ఉన్నప్పుడు తక్కువ మాట్లాడినా.. అందరితో మాత్రం అభి టచ్లో ఉండేవాడు. అతను అంతగా మాట్లాడనప్పటికీ అభిపై మాత్రం ఇంటి సభ్యులకు కోపం ఉండేది కాదు. ప్రతి ఒక్కరు అభితో ఫ్రెండ్షిప్ చేయడానికే ఇష్టపడేవారు. ఇక నోయల్ అయితే తన సపోర్ట్ అభిజిత్కే అని బహిరంగంగా చెప్పేశాడు. అభి గెలుపును తన భుజానా వేసుకుంటానని, అయన ఇంట్లో గేమ్ ఆడితే తాను బయట అతనికి చేయాల్సిన సాయం చేస్తానని నాగార్జున ముందే చెప్పేశాడు. చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడా. కలిసొచ్చిన సినీ పెద్దల మద్దతు ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరు అభి గురించి పాజిటివ్గానే చెప్పారు కానీ నెగెటివ్గా ఒక్కరు కూడా చెప్పకపోవడం కూడా అభికి ఓట్లు పడేలా చేశాయి. వీటితో పాటు సినీ ప్రముఖుల సపోర్టు కూడా అభికి కలిసొచ్చింది. స్టార్ హీరో విజయ్ దేవరకొండ, మెగా బ్రదర్ నాగబాబు, శ్రీకాంత్ సహా ఎంతో మంది అతడికి సపోర్ట్ చేశారు. నాగబాబు అయితే అవినాష్కి ఓట్లు వేయమని చెబుతూనే.. తనకు మాత్రం అభిజితే ఇష్టమని చెప్పాడు. అతను బాగా ఆడుతున్నాడని, తన ప్రవర్తన బాగా నచ్చిందని అభిని ఆకాశానికెత్తేశాడు. ఇక ప్రతి సీజన్ని ఫాలో అయ్యే శ్రీకాంత్ సైతం అభికే నా ఓటు అటు తేల్చేశాడు. సోషల్ మీడియా వేదికగా అతన్ని గెలిపించమని అభిమానులకు పిలుపునిచ్చారు. మొత్తానికి అభి ప్రవర్తననే ఆయన గెలుపుకు కారణమని చెప్పొచ్చు. -
బిగ్బాస్: అభిజిత్ రెమ్యునరేషన్ ఎంతంటే..
తెలుగు బుల్లితెరపై 106 రోజులు వినోదాన్ని అందించిన బిగ్బాస్ సీజన్ 4 డిసెంబర్ 20న శుభంకార్డు పడిన విషయం తెలిసిందే. కరోనా కష్ట కాలంలో అసలు ఈ ఏడాది బిగ్బాస్ ఉంటుందో లేదో అనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి అందరిని అలరించింది. 29 మంది కంటెస్టులతో ప్రారంభమైన బిగ్బాస్ సక్సెస్ఫుల్గా నాలుగో సీజన్ను పూర్తి చేసుకుంది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. ఆదివారం అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. 25 లక్షల ప్రైజ్మనీతోపాటు ఓ బైక్ గెలుచుకున్నాడు. అఖిల్ సార్థక్ రన్నరప్గా నిలిచాడు. మూడో స్థానంలో సోహైల్, నాలుగు, అయిదు స్థానాల్లో అరియానా, హారిక నిలిచారు. టాప్ 5 కంటెస్టెంట్లందరికిరు హౌజ్ నుంచి బయటకు వచ్చిన అనంతరం గ్రాండ్గా బ్యాండ్ బాజాలతో ఇంటికి పయనమయ్యారు. చదవండి: బిగ్బాస్: అభి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా కాగా అభిజిత్ తన వ్యక్తిత్వంతో షో ప్రారంభం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులను దక్కించుకున్నాడు. చివరి వరకు అభిజిత్పై అదే అభిమానం కురిపిస్తూ అతన్ని విజయ తీరానికి నడిపించింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కూడా అభిజిత్దే గెలుపు అంటూ పలువురు చెప్పిన జోస్యం, అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితం ఉండడం విశేషం. ఇదిలా ఉండగా బిగ్బాస్ ముగిసినప్పటికీ ఈ షోకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా విన్నర్గా నిలిచిన అభిజిత్ షో మొత్తం రెమ్యునరేషన్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాజాగా విజేతగా నిలిచిన అభిజిత్ బిగ్బాస్ షో కోసం వారానికి 4 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం 106 రోజులకు 60 లక్షలు, ప్రైజ్ మనీ 25 లక్షలు కలిపి మొత్తం 85 లక్షలు అభికి మూటజెప్పినట్లు టాక్. వాస్తవానికి బిగ్బాస్ ప్రైజ్మనీ కంటే హౌజ్లో ఉన్నందుకే అభి అధికంగా రెమ్యునరేషన్ అందుకున్నాడు. అదే విధంగా టీవీ యాంకర్ లాస్యకు ఒక వారానికి లక్ష రూపాయల చొప్పున తీసుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ కూడా వారానికి ఏకంగా 2 లక్షలు డిమాండ్ చేసినట్లు వదంతులు వ్యాపించాయి. -
ఇలా చేస్తుంటే కష్టం అన్నారు: బిగ్బాస్ విన్నర్ అభిజిత్
ఒక విజయం కోసం 105 రోజుల ఎదురుచూపు, రోజూ పిల్లలాటలు, కుమ్ములాటలు. అలకలు, బుజ్జగింపులు, ఎలిమినేషన్లు, వైల్డ్కార్డ్ ఎంట్రీలు... కొన్ని రాజీల మధ్య బిగ్బాస్ నాలుగో సీజన్ కూడా పూర్తయింది. విజేత అభిజీత్. కంటెస్టెంట్లందరూ ఇన్ని రోజులు ప్రేక్షకుల ఇళ్లలో ఒకరిగా కలిసిపోయారు. ఒక్కో కంటెస్టెంటూ వెళ్లిపోతుంటే హౌస్లో ఉన్న తోటి కంటెస్టెంట్లతోపాటు ప్రేక్షకులు కూడా బాధపడ్డారు. ఇన్ని అడ్డంకులనూ దాటుకుని విజేతగా నిలిచిన అభిజీత్కు తెర ముందు కనిపించే ప్రశంసలతోపాటు తెర వెనుక కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజయం అందరిదీ అదృష్టం అనాలో దేవుడి రాత అనాలో తెలియదు కానీ, నా ప్యాషన్ని ప్రదర్శించడానికి మంచి అవకాశం వచ్చింది. మనకేది ఇష్టమో అదే చేయాలి. ఆ పనిని పర్ఫెక్ట్గా చేయాలి. బిగ్బాస్ హౌస్లో ఉండగలగడం అంత సులభం ఏమీ కాదు. సవాళ్లతో కూడుకున్న పని, చాలా కష్టమైన విషయమే, అయితే ఇది చాలా మంచి అనుభవం. హౌజ్లో ఉన్నంత కాలం ఇంట్లో వాళ్లందరూ గుర్తుకువచ్చారు. ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. నేను విజేతగా నిలవడానికి నాకు తెలియని వాళ్లు కూడా సహాయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. – అభిజీత్ బిగ్బాస్ 4 విజేత తనే అవుతాడని అభిజీత్ అనుకున్నాడో లేదో కానీ, వాళ్ల అమ్మ లక్ష్మీప్రసన్న మాత్రం బలంగా నమ్మారు. ఎందుకంటే అతను హౌస్లోకి వెళ్లిన కొద్దిరోజులకే ‘మా అబ్బాయిని 105 రోజులపాటు మిస్ అవుతున్నాం’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ‘హౌస్లోకి వెళ్లేటప్పుడే విజేతగా తిరిగి వస్తాడని ఊహించా’నని ఇప్పుడు చెప్పారు లక్ష్మీ ప్రసన్న. అభిజీత్ విజేతగా నిలవడంతో అతని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. బ్యూటిపుల్ లైఫ్ అభిజీత్... మదనపల్లెలోని రిషీవ్యాలీ స్కూల్లో చదివాడు. హైదరాబాద్లోని లిటిల్ ఫ్లవర్స్ జూనియర్ కాలేజ్ తరవాత జేఎన్టీయూలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేరాడు. క్యాంపస్ ప్లేస్మెంట్తో ఉద్యోగంలో చేరి ఉంటే అభిజీత్ అనే ఒక నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యే వాడే కాదేమో! ఫైనల్ ఇయర్లో ఉండగానే ఫ్రెండ్తో కలిసి సరదాగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఆడిషన్కెళ్లాడు. శేఖర్ కమ్ముల అంచనా తప్పలేదు. స్పార్క్ ఉన్న కుర్రాడిని చేజార్చుకోలేదతడు. అలా తెర మీదకొచ్చాడు అభిజీత్. ఇదంతా జరిగింది 2012లో. ఆ సినిమా పూర్తయిన తర్వాత తిరిగి చదువుకోసం అమెరికాకి వెళ్లాడు. మసాచుసెట్స్, నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు అభిజీత్. ఆ తర్వాత మళ్లీ ‘రామ్లీలా, మిర్చిలాంటి కుర్రాడు’ సినిమాలు చేశాడు. మూడేళ్ల కిందట వెబ్ సీరీస్ ‘పెళ్లిగోల’లో నటించాడు. అవి మూడు సీజన్లు పూర్తయ్యాయి. అంతలో బిగ్బాస్లో సహజ నటనకు తెరతీశాడు. ఇక ఆ తర్వాత అభిజీత్ అందరికీ తెలిసిన వాడయ్యాడు. (చదవండి: అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) ప్రిన్సిపల్ నుంచి ఫోన్ అభిజీత్ గురించి ఎవరికీ తెలియని ఓ సరదా సంఘటన రిషీవ్యాలీ స్కూల్లో ఉన్నప్పుడు జరిగింది. పిల్లల్లో ఓ కుర్రాడు ‘ఎవరికైనా ధైర్యం ఉంటే ఆ పోల్ ఎక్కగలరా’ అన్నాడు. ఆ చాలెంజ్ని స్వీకరించి స్తంభాన్ని ఎక్కేశాడు అభిజీత్. అది ప్రిన్సిపల్కి తెలిసింది. తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. ‘మీ వాడిని చదువు విషయంలో తప్పుపట్టడం లేదు. కానీ అల్లరి ఎక్కువ. ఇలా చేస్తుంటే కష్టం’ అన్నారు. పిల్లల చురుకుదనం తల్లిదండ్రులకు సంతోషాన్నిస్తుంది. కానీ మరీ ఇంత చురుగ్గా ఉంటే సంతోషంతోపాటు భయం కూడా వెంటాడుతుంటుంది. ‘‘మా అభి సవాళ్లను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. గెలవాలనే ఆకాంక్ష మెండు. అతడు హౌస్లోకి వెళ్లేటప్పుడే విజేతగా తిరిగి వస్తాడని ఊహించాను. నా మనసుకు అలా అనిపించింది’’ అన్నారు లక్ష్మీ ప్రసన్న. స్కూల్ నేర్పిన పరిణతి ‘‘రిషీవ్యాలీ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా రోజూ ఫోన్లో మాట్లాడేదాన్ని. యూఎస్లో ఉన్నన్ని రోజులు రోజూ వీడియో కాల్లో మాట్లాడేదాన్ని. ఇన్ని రోజులు అభితో మాట్లాడకుండా ఉన్నది ఇప్పుడే. బిగ్బాస్ షోలో రోజూ చూస్తూనే ఉన్నాను. కానీ మాట్లాడలేకపోవడంతో డిజప్పాయింట్మెంట్కు లోనయ్యాను. బిగ్బాస్ చాలెంజ్ అభికి కాదు అసలైన చాలెంజ్ నాకే’’ అన్నారు లక్ష్మీ ప్రసన్న. ‘‘అభిని నేను తీర్చిదిద్దానని చెప్పడం కంటే రిషీ వ్యాలీ స్కూలే అలా తీర్చిదిద్దింది. జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని ఒంటపట్టించుకున్నాడు. స్వతంత్ర వ్యక్తిత్వంతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన మానసిక పరిపక్వత వచ్చింది. ఆ లక్షణాలే అభిని ఈ రోజు విజేతగా నిలిపాయి’’ అన్నారామె సంతోషంగా. ‘‘తన కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. వెంటనే స్పందిస్తాడు. రోడ్డు మీద ఎవరైనా రూల్స్ పాటించకుండా వాహనం నడుపుతున్నా కూడా వెంటనే వెళ్లి వాళ్లతో ‘ఇలా చేయడం తప్పు’ అంటాడు. అలాగని ఊరికే గొడవలు పడడు. స్వతహాగా తను స్మార్ట్ బాయ్, క్వైట్ కూడా’’ అన్నారు తండ్రి మన్మోహన్. (చదవండి: బిగ్బాస్ తీరుపై అభిమానుల ఆగ్రహం) ఇదీ కుటుంబం అభిజీత్ పూర్వికులు హైదరాబాద్ స్థానికులు. ముత్తాతలు చార్మినార్ నిర్మాణంలో భాగస్వాములు. తాత నాగయ్య ఆదిలాబాద్ కడెం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్నారు. హైదరాబాద్, దోమల్గూడలో తాత నాగయ్య దాదాపుగా ఎనభై ఏళ్ల కిందట కట్టిన ఇంట్లోనే ఇప్పుడు అభిజీత్ కుటుంబం నివసిస్తోంది. తండ్రి మన్మోహన్ భవన నిర్మాణ రంగం నుంచి వ్యవసాయరంగానికి మారారు. అభిజీత్ తమ్ముడు అభయ్ వ్యవసాయం పనులు చూస్తున్నాడు. తల్లి ప్రసన్న కేటరింగ్ అండ్ ఫుడ్ టెక్నాలజీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశారు. కానీ కుటుంబ బాధ్యతల రీత్యా గృహిణిగా ఉండిపోయారు. అభిజిత్ పెట్ లవర్. మంచి శివభక్తుడు, పోకర్ ఆటను ఇష్టపడే అభిజీత్కి బైక్ రేసింగ్ అంటే మంచి సరదా. స్థితప్రజ్ఞత బిగ్బాస్ ఇచ్చిన టాస్కులో గెలవడానికి తొందరపడకపోవడం, ఎలిమినేషన్ సమయంలో ఆందోళన పడకపోవడం... ఈ రెండు లక్షణాలూ అభిజీత్లో కనిపిస్తాయి. ఈ లక్షణాలే అందరిలో ఒకడిగా కాకుండా అతడిని ఒకే ఒక్కడిగా నిలిపాయి. ముప్పై రెండేళ్లకు ఇంతటి స్థితప్రజ్ఞత ఎలా అలవడింది అని ముచ్చటపడేలా చేశాయి. ‘చదువుకున్నవాడినని అతడికి గర్వం ఎక్కువ’ అనే అభిప్రాయాలకు కూడా కారణమయ్యాయి. ‘ఇక్కడ అందరూ సమానమే’ అని ఒక సందర్భంలో నాగార్జున హెచ్చరించారు కూడా. అభిజీత్ నటించిన సినిమాల్లో కూడా ‘అతడు తన పాత్రకు తగినట్లు హుందాగా నటిస్తాడు. పాత్రోచిత నటనకే పరిమితమవుతాడు తప్ప సన్నివేశంలో తనను డామినేట్ చేసే ప్రయత్నం చేయడు, పాత్రను తేలిక చేయడు అని సినీ విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడు అభిజీత్. – వాకా మంజులారెడ్డి, ఫీచర్స్ ప్రతినిధి -
అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!
సాక్షి, హైదరాబాద్: అత్యంత ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ఫినాలేలో అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ సీజన్-4 టైటిల్ను అభిజీత్ ఎగరేసుకుపోయాడు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్ సందర్భంగా అభిజీత్ను మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ తెలుగు 4 విజేతగా ప్రకటించారు. మొదటి నుండి నామినేషన్స్ లోకి వచ్చిన అభిజిత్ ప్రతీవారం సేఫ్ గేమ్ ఆడుతూ చివరికి టైటిల్ సాధించాడు. కానీ టైటిల్పై ఎన్నో ఆశలు పెట్టుకుని తుదికంటూ పోరాడిన అఖిల్ సార్థక్ మాత్రం రన్నరప్గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్తో సందడి చేస్తున్నారు. అంతేకాదు రన్నరప్ అఖిల్కు నగదు బహుమతి ఏమీ ఇవ్వకపోవచ్చని కూడా సోషల్ మీడియా కోడై కూస్తోంది. టాప్ 2 వరకు వెళ్లిన అఖల్ చివరికి భంగపాటు తప్పలేదంటూ సోషల్మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అభిజిత్తో గొడవ, మోనాల్తో లవ్ ట్రాక్ తనను గెలిపిస్తాయని ఆశపడిన అఖిల్ ట్రోఫీ దక్కించు కోలేకపోయాడు. అంతేకాదు గ్రాండ్ ఫినాలే వేదికగా టాప్-5 లో నిలిచిన సోహైల్, మెహబూబ్లపై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి మాటలకు అందరూ ఫిదా అయ్యారు. వారిద్దరి గురించి చిరు ఎక్కువగా హైలెట్ చేయడం, అఖిల్ గురించి చాలా తక్కువ మాట్లాడడం కూడా అఖిల్కు దెబ్బేనని పేర్కొంటున్నారు. వాళ్లనలా పొగుడుతూంటూ.. అఖిల్ మాత్రం బేలగా నిలబడిపోయాడని అలాగే దివి, హారికలతో చిరు రొమాంటిక్ సంభాషణ, మెహబూబ్కి 10 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం లాంటివి అంశాలు అఖిల్కి బాధాకర విషయాలని ఫ్యాన్స్ అంటున్నారు. దీనిపై మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క రేసు నుంచి తప్పుకుని, తనకు వచ్చిన 25 లక్షల రూపాయల్లో అనాథాశ్రమానికి రూ. 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నానని ఆ గోల్డ్ బాక్స్ తీసుకొని బయటకు వచ్చేశాడు సొహేల్. ఇది నెటిజనుల ప్రశంసలను దక్కించుకుంది. దీనికి తోడు తనకొచ్చిన ప్రైజ్మనీలో 10 లక్షలు దానం చేస్తానని సోహైల్ ప్రకటించడం బిగ్బాస్ హోస్ట్ నాగార్జున మురిసిపోయి, ఆ పది లక్షలూ తానే ఇస్తాననడం మరింత హైలెట్గా నిలిచింది. అయితే హౌస్లో తన ఆట పాటలతో అలరించిన అఖిల్ మోనాల్ గజ్జర్తో ప్రేమాయణంద్వారా మొదట్లో బాగా చర్చల్లో నిలిచాడు. ఆ తరువాత ఆమెను అడ్డం పెట్టుకుని గేమ్ ఆడుతూ అఖిల్ చివరికి బకరాగా మిగిలిపోయాడు. మోనాల్ చుట్టూనే తిరుగుతూ హగ్స్ ఇస్తూ.. ముద్దులు పెట్టుకుంటూ బిగ్ బాస్ గేమ్ను బాగానే రక్తికట్టించినా, విన్నర్ మాత్రం అభిజిత్ అయ్యాడు. అయితే ఎలాంటి ఫేమ్ లేని అఖిల్ బిగ్ బాస్ టాప్ 2 వరకు రావడం విశేషమే. మరి అఖిల్ కెరీర్కు ఇదిఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిందే. కాగా మొదట్లో అఖిల్-మోనాల్-అభిజిత్ మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ఆ తర్వాత మోనాల్ డబుల్ గేమ్ తెలిసి మోనాల్ ని అభిజిత్ దూరం పెట్టాడు. అయితే మోనాల్ ది డబుల్ గేమ్ తెలిసినా ఆమెతో కనెక్షన్, ఎమోషన్ పెంచుకోవడమే కాదు శృతి మించి ప్రవర్తించాడు. ఈ సందర్భంగా ఇది ఆయన అభిమానులకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో మోనాల్ విషయంలో అఖిల్ పెద్ద బకరాగా మిగిలిపోతాడని వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే కొనసాగితే ఓ బకరాగా బయటికి రాకతప్పదని కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరికి వారి జోస్యం నిజం కావడంతో అయ్యో అఖిల్ అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. An entertaining finale to most talked about season. While #Abhijeet won well deserved title, #Sohel with street smart moves and character won all hearts, #Akhil continued making mess of his chances and abilities.. Disappointed to miss #Ariyana in final 2. #BiggBossTelugu4 pic.twitter.com/GHXHRefxlv — Sampath Murki (@anytime_sampath) December 21, 2020 -
మెహబూబ్ వల్లే సోహైల్ అలా చేశాడా?!
బిగ్బాస్ తెలుగు సీజన్-4 కంటెస్టెంట్ మెహబూబ్ దిల్సేపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. హౌజ్లోనూ, బయట కూడా అతను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని బిగ్బాస్ ప్రేక్షకులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రూపాయి పెర్మార్మెన్స్ చేయమంటే మూడు రూపాయల యాక్టింగ్తో బిల్డప్ ఇస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఆదివారం జరిగిన బిగ్బాస్-4 గ్రాండ్ ఫినాలే సందర్భంలోనూ అతని అతి కనిపించిందని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. చీఫ్ గెస్ట్గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి మెహబూబ్ గురించి మాట్లాడుతుంటే ప్రాణం పోయినట్టుగా చేశాడని, అతనికి చిరంజీవి రూ.10 లక్షలు ఇస్తానని చెప్పినప్పుడు కూడా ఆ ఓవర్ కనిపించిందని పోస్టులు పెడుతున్నారు. బిగ్బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అతని ప్రవర్తనలో మార్పు లేదని మండిపడుతున్నారు. (అఖిల్ నిజంగానే బకరా అయ్యాడా?!) ఇదిలాఉంటే.. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినవారు టాప్ 5 కంటెస్టెంట్లతో కలుసుకునే అవకాశాన్ని బిగ్బాస్ కల్పించాడు. అద్దాలతో బిగించిన రూమ్లోకొచ్చి మాజీ కంటెస్టెంట్లు ఒక్కొక్కరూ హౌజ్లో ఉన్న అఖిల్, అభిజిత్, సోహైల్, అరియానా, హారికను తమ మాటలు, పాటలు, డ్యాన్సులతో హుషారెత్తించారు. అయితే, మెహబూబ్ మాత్రం సోహైల్తో ఏవేవో సైగలు చేసినట్టు వీడియోలో అతని కదలికల ద్వారా తెలుస్తోంది. అందరితో మామూలుగానే జోష్ నింపినట్టు నటించిన మెహబూబ్.. తన సంజ్ఞలతో సోహైల్కు ఏదో చెప్పాడని మిగతా కంటెస్టెంట్ల అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బహుశా, సోహైల్ నెంబర్ త్రీలో ఉన్నట్టు మెహబూబ్ అద్దంపై మూడు వేళ్లతో సూచించినట్టు ఆరోపిస్తున్నారు. అలాగే, డబ్బులు తీసుకునే ఆఫర్ గనుక వస్తే వదిలిపెట్టొదని సిగ్నల్ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. కాగా, టాప్ 3 కంటెస్టెంట్లుగా మిగిలిన అఖిల్, అభిజిత్, సోహైల్కు బిగ్బాస్ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైనల్ పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని బిగ్బాస్ చెప్పగా.. సోహైల్ ఆ డీల్కు అంగీకరించాడు. రూ.25 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటికొచ్చాడు. ఇక మెహబూబ్ చెప్పడం వల్లే ఎలాగూ తనది మూడో స్థానం అని సోహైల్ డబ్బులు తీసుకున్నాడని, తద్వారా విన్నర్ అభిజిత్కు ప్రైజ్ మనీలో సగం కోత పడిందని అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో కింద చూడవచ్చు 👇 Mehaboob Leaked Sohel's Position Yesterday that he is not the Winner😂 So Today, Sohel preferred 25L instead of 2,3 places which he got from audience votes👍#BiggBossTelugu4#BBTeluguGrandFinale pic.twitter.com/mENk78bsxa — Vinod Reddy (@Vinod_Since1990) December 21, 2020 -
సోహైల్, దివికి చిరు బంపర్ ఆఫర్!
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన బిగ్బాస్ సీజన్ 4 ఆదివారంతో ముగిసింది. షోలో పాల్గొన్న కంటెస్టెంట్ల తలరాతని మార్చేసింది. ముఖ్యంగా విన్నర్ అభిజిత్, రన్నరప్ అఖిల్, రెండో రన్నరప్ సోహైల్ ఎక్కువగా లాభపడ్డారు. అభిజిత్ రూ.25 లక్షలు గెలుచుకోగా.. సోహైల్ బిగ్బాస్ ఇచ్చిన రూ.25 లక్షల ఆఫర్ తీసుకుని తుది పోరు నుంచి తప్పుకున్నాడు. తనకు వచ్చే రూ.25 లక్షల్లో 5 లక్షలు అనాథ శరణాలయానికి, మరో 5 లక్షలు తన స్నేహితుడు మెహబూబ్కు ఇస్తానని చెప్పడంతో అతను అభిమానులు, హోస్ట్ నాగార్జున మనసులూ దోచుకున్నాడు. దాంతో సోహైల్ దాతృత్వం తెలుసుకున్న నాగార్జున.. అతను అనాథ శరణాలయానికి, మెహబూబ్కు ఇద్దామనుకున్న మొత్తాన్ని తాను అందిస్తానని హామినిచ్చారు. ఇక విన్నర్ని ప్రకటించేందుకు వచ్చిన చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి సోహైల్ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున స్ఫూర్తితో తాను కూడా మెహబూబ్కు రూ.10 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆమేరకు చెక్కు కూడా వెంటనే అందించారు. దాంతో మెహబూబ్ కళ్లనీరు పెట్టుకుంటూ చిరుకు పాదాభివందనం చేశాడు. కళాకారులు కన్నీరు పెట్టొద్దని చిరు వ్యాఖ్యానించారు. (చదవండి: బిగ్బాస్ తీరుపై అభిమానుల ఆగ్రహం) స్వయంగా బిర్యానీ సోహైల్ మేనరిజం.. ‘కథ వేరే ఉంటది’ తన సినిమాల్లో వాడుకుంటానని చిరు చెప్పుకొచ్చారు. తన సతీమణి సురేఖ సోహైల్ కోసం ప్రత్యేకంగా మటన్ బిర్యానీ చేసి పంపించారని చెప్పారు. దాంతో సోహైల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి తనకు ఇంత మద్దతు ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని అతను కంటతడి పెట్టాడు. అలాగే, చిరంజీవి ఎదుట తన మనసులో మాటను సోహైల్ బయటపెట్టాడు. ఎప్పటికైనా తానొక మంచి సినిమా చేస్తానని, ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లేక ఆడియో ఫంక్షన్కి చిరు సర్ రావాలని కోరాడు. అతని అభ్యర్థనపై స్పందించిన చిరు తప్పకుండా.. సోహైల్ రెక్వెస్ట్ను గౌరవిస్తానని చెప్పారు. కుదిరితే అతని సినిమాలో తనకూ ఓ చిన్న క్యారెక్టర్ ఇవ్వాలని అన్నారు. మెగాస్టార్ నుంచి ఊహించని ఆఫర్తో సోహైల్ మరింత ఉప్పొంగిపోయాడు. (చదవండి: బిగ్బాస్: పది లక్షలు వదిలేసుకున్న అరియానా) దివికి చిరు బంపర్ ఆఫర్ బిగ్బాస్ కంటెస్టెంట్ దివి వైద్యకు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి బంపర్ ఆఫర్ ఇచ్చారు. దివితో స్టెప్పులు వేయాలని ఉందని అన్నారు. మరో ఐదారు నెలల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న తన సినిమాలో దివికి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇవ్వనున్నట్టు చిరు ప్రకటించారు. కాగా, తమిళ్లో అజిత్ హీరోగా సూపర్హిట్గా నిలిచిన ‘వేలాయుధం’ సినిమాను తెలుగులో రిమేక్ చేయనున్నారు. చిరు హీరోగా మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇదిలాఉండగా.. రన్నరప్గా నిలిచిన అఖిల్కు కూడా బిగ్బాస్ కొంత మొత్తాన్ని ఇస్తాడని తెలిసింది. హౌజ్ నుంచి బయటికొచ్చిన కంటెస్టెంట్లు గంగవ్వకు హోస్ట్ నాగార్జున ఇల్లు నిర్మించి ఇస్తున్నారు. బిగ్బాస్ పాపులారిటీతో చాలామంది కంటెస్టెంట్లు యూట్యూబ్ చానెల్స్ పెట్టి లక్షలాది వ్యూయర్షిప్ను సొంతం చేసుకున్నారు. (చదవండి: బిగ్బాస్: రూ.25 లక్షలకు సోహైల్ టెంప్ట్) -
బిగ్బాస్ తీరుపై అభిమానుల ఆగ్రహం
బిగ్బాస్-4 సీజన్ ఆదివారంతో ముగిసింది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో అభిజిత్ విన్నర్గా నిలిచాడు. అయితే, అభిజిత్కు దక్కాల్సిన ప్రైజ్ మనీ రూ.50 లక్షల్లో కోత పడింది. కంటెస్టెంట్లలో చివరగా అభిజిత్, అఖిల్, సోహైల్ మాత్రమే మిగలడంతో.. పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పడంతో. బిగ్బాస్ ఆఫర్ను స్వీకరించిన సోహైల్ పక్కకు తప్పుకునున్నాడు. ఇక అఖిల్, అభిజిత్ ఫైనలిస్టులుగా మిగలగా.. అభిని ట్రోఫీ వరించింది. అయితే, అభి అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్కు ఓట్లు వేసి గెలిపిస్తే రూ.25 లక్షలు కట్ చేయడమేంటని ట్రోల్ చేస్తున్నారు. బిగ్బాస్ నిర్వాహకులు అభిమానుల్ని అవమానించారని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. (చదవండి: సోహైల్, దివికి చిరు బంపర్ ఆఫర్!) కష్టపడి ఓట్లేస్తే ఇంత చెత్తగా ఆలోచిస్తారా అని కామెంట్లు చేస్తున్నారు. జీవితంలో మరోసారి బిగ్బాస్ చూసేది లేదని, కంటెస్టెంట్లకు ఓట్లు వేయమని తెగేసి చెప్తున్నారు. విన్నర్ అభిజిత్ రూ.25 లక్షలు మాత్రమే దక్కాయని, సెకండ్ రన్నరప్ సోహైల్కు అంతకన్నా ఎక్కువ మొత్తం, ఇంకా బెనిఫిట్స్ అందాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మెహబూబ్కు మెగాస్టార్ చిరంజీవి రూ.10 లక్షల చెక్ ఇవ్వడం గొప్ప విషయమని చెప్తూనే.. మిగతా కంటెస్టెంట్లు అరియానా, అవినాష్, హారిక పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. హోస్ట్ నాగార్జున కూడా ఒకవైపే మొగ్గు చూపారని ఆరోపిస్తున్నారు. ఒకవేళ సోహైల్, అఖిల్.. అభిజిత్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి ఉంటే కూడా బిగ్బాస్ ఇలాగే ప్రైజ్ మనీలో కోత పెట్టేవారా అని ప్రశ్నిస్తున్నారు. (చదవండి: బిగ్బాస్– 4 విజేత అభిజిత్) -
బిగ్బాస్– 4 విజేత అభిజిత్
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర వీక్షకులను 106 రోజులపాటు అలరించిన ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్బాస్–4 గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసింది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా వర్ధమాన నటుడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. పరిణతి చెందిన వ్యక్తిత్వంతో పెద్ద సంఖ్యలో మహిళాభిమానుల్ని, బిగ్బాస్ ప్రశంసల్ని కూడా దక్కించుకున్న అభిజిత్ను విజయం వరించింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కూడా అభిజిత్దే గెలుపు అంటూ పలువురు చెప్పిన జోస్యం, అంచనాలకు అనుగుణంగానే తుది ఫలితం ఉండడం విశేషం. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అభిజత్ బిగ్బాస్–4 ట్రోఫీ అందుకున్నాడు. అఖిల్ రన్నరప్గా నిలిచాడు. మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఈ షోలో పాల్గొనగా వారిలో వారానికి ఒకరు చొప్పున ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరకు అఖిల్, అభిజిత్, సోహైల్, హారిక, అరియానాలు టాప్–5 ఫైనల్ కంటెస్టెంట్స్గా మిగిలారు. అయితే చివరి ముగ్గురిలో వెళ్లిపోవడానికి ఇష్టపడిన వారు రూ. 25 లక్షలు తీసుకొని వెళ్లిపోవచ్చన్న వ్యాఖ్యాత నాగార్జున ఆఫర్ను సోహైల్ అంగీకరించడంతో అభిజిత్ ప్రైజ్ మనీలో సగానికి కోత పడింది. అలరించిన ముగింపు.. బిగ్బాస్ సీజన్ 4 చివరి రోజున మెగాస్టార్ చిరంజీవి ఈ షో కంటెస్టెంట్స్తో సాగించిన ముచ్చట్లు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షోలో పాల్గొన్న పోటీదారులంతా ఫినాలే సందర్భంగా హాజరై తమ అనుభవాలు పంచుకున్నారు. మెగాస్టార్తో మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా స్టార్ మెహబూబ్కు చిరంజీవి ఆర్థిక సాయం అందించడంతో ఆహూతులు అంతా హర్షధ్వానాలు చేశారు. హీరోయిన్లు ప్రణీత, లక్ష్మీరాయ్, మెహ్రీన్, దర్శకుడు అనిల్ రావిపూడి గ్రాండ్ ఫినాలేలో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ కాన్సర్ట్తో అలరించారు. గత బిగ్ బాస్ సీజన్–3కు 8 కోట్ల మంది ఓట్లు వేయగా 4వ సీజన్కు మొత్తం 15 కోట్ల 65 లక్షల ఓట్లు వచ్చాయని హోస్ట్ నాగార్జున చెప్పారు. -
మెహబూబ్కు రూ.10 లక్షలిచ్చిన చిరు
పెద్ద హీరోలది పెద్ద మనసని చాటి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే సాక్షిగా కంటెస్టెంట్ల ఆశయాలకు మద్దతు తెలుపుతూ వారికి సాయం చేశారు. గ్రాండ్ ఫినాలేకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ తన మాటలు, పంచ్లతో షోను మరో మెట్టు పైకి ఎక్కించారు. అలాగే బిగ్బాస్ సాక్షిగా యువ టాలెంట్ను ప్రోత్సహించేందుకు కంకణం కట్టుకున్నట్లు కనిపించింది. ఈ క్రమంలో సోహైల్కు ఏం కావాలో కోరుకోమని అడిగారు. దానికి అతడు తను తీయబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు రావాలని ఆహ్వానించాడు. ఇది సరిపోదనుకున్న చిరు ఏకంగా అతడి సినిమాలో నటిస్తానని కోట్లాది మంది ప్రేక్షకుల సాక్షిగా మాటిచ్చారు. అంతేకాకుండా ఆ సినిమా ప్రమోషన్ బాధ్యత కూడా భుజాన వేసుకున్నారు. ఇక దివికి తన నెక్స్ట్ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ ఇస్తున్నట్లు తెలిపారు. నన్ను నేను చూసుకున్నట్లుంది: చిరు మెహబూబ్ గురించి మాట్లాడుతూ.. అతడిని చూస్తుంటే చిన్నప్పుడు తనను తాను చూసుకున్నట్లుంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి రావాలని నా చిన్నప్పుడు ఎలా తపన చెందానో అది నీలో కనిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కలగజేసుకుని సోహైల్ గెలుచుకున్న డబ్బు గురించి ప్రస్తావించారు. 'సోహైల్ అందుకున్న 25 లక్షల రూపాయల్లో అనాథశ్రమానికి రూ.5 లక్షలు మెహబూబ్ ఇంటి కోసం రూ.5 లక్షలు ఇస్తానన్నాడు. అయితే మెహబూబ్ మాత్రం దాన్ని తిరస్కరించాడు. తనకివ్వాలనుకున్నదాన్ని కూడా అనాథశ్రమానికి ఇచ్చేయమని సూచించాడు' అని వివరించారు. (చదవండి: 25 లక్షలకు సోహైల్ టెంప్ట్) సోహైల్కు మరో పది లక్షలిచ్చిన నాగ్ అయితే సోహైల్ గెలుచుకున్న మొత్తాన్ని అతడి కోసమే వాడుకోవాలని నాగ్ సూచించారు. అతడు దానం చేద్దామనుకున్న పది లక్షలను తన జేబులో నుంచి ఇస్తానని నాగ్ ప్రకటించారు. దీంతో నాగార్జునను ప్రేరణగా తీసుకున్న చిరంజీవి మెహబూబ్కు అవసరమయ్యే డబ్బు నేనిస్తాను అంటూ స్టేజీ మీదనే రూ.10 లక్షల చెక్ రాసిచ్చారు. మెగాస్టార్ తనకు చెక్ రాసివ్వడాన్ని నమ్మలేకపోయిన మెహబూబ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఏడ్చుకుంటూ వచ్చి ఆయన కాళ్ల మీద పడ్డాడు. దీంతో చిరంజీవి అతడిని ఓదార్చుతూ.. మీరు కళాకారులయ్యా.. కళాకారులు కన్నీళ్లు పెట్టకూడదు అంటూ దగ్గరకు చేరదీసి హత్తుకున్నాడు. అతడికి ప్రేమగా ముద్దు పెట్టి పది లక్షల చెక్ ఇచ్చారు. మొత్తానికి సోహైల్ సినిమాలో నటిస్తాననడం, దివికి సినిమా ఛాన్స్, మెహబూబ్కు చెక్ ఇవ్వడం మెగాస్టార్ ప్రత్యేకతను చాటుతున్నాయి. మనసున్న మారాజుగా ఆయన్ను అభిమానుల గుండెల్లో నిలబెట్టాయి.(చదవండి: బిగ్బాస్: నెరవేరుతున్న గంగవ్వ కల) -
బిగ్బాస్: పది లక్షలు వదిలేసుకున్న అరియానా
బిగ్బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ కోసం పంతొమ్మిది మంది పోటీ పడగా ఫినాలేకు ఐదుగురు చేరుకున్నారు. వీరిలో హారిక మొదట ఎలిమినేట్ అయింది. తర్వాత ఉన్న నలుగురితో డీల్ మాట్లాడేందుకు ప్రణీత లోపలకు వచ్చారు. పది లక్షలు తీసుకుంటారా? అని డీల్ మాట్లాడారు. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండని వారికి సలహా ఇచ్చారు. అయితే ప్రేక్షకుల ఓట్లే మాకు ముఖ్యమంటూ వారు ఆ డబ్బు తీసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఈ డీల్ కుదరట్లేదని ప్రణీత సూట్కేస్ తీసుకుని వెళ్లిపోయింది. తర్వాత నాగ్ అరియానా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో షాకైన అరియానా ఓ క్షణం పాటు నిశ్చేష్ఠురాలై నిలబడిపోయింది. ఆపై స్టేజీ మీదకు వచ్చి మాట్లాడుతూ ఓ వైపు బాధగా ఉన్నా, మరోవైపు ప్రేక్షకుల ప్రేమ దొరికినందుకు సంతోషంగా ఉందని చెప్పింది. పదిహేను వారాలు ఉండి మంచి పేరుతో వెళ్తున్నందుకు హ్యాపీ అంది. బిగ్బాస్కు వెళ్లక ముందు, ఇప్పటికీ చాలా సన్నబడిపోయావు అని నాగ్ అడగ్గా.. అవినాష్ వెళ్లిపోయాక తినిపించేవాళ్లు లేక సన్నబడ్డానంది. (చదవండి: బిగ్బాస్: గంగవ్వకు మెహబూబ్ స్పెషల్ గిఫ్ట్) అరియానా గురించి చెప్పాలంటే ఆమె ఓ ఫైటర్. హౌస్ అంతా ఏకమై తనకు వ్యతిరేకంగా నిలబడ్డా ఆమె మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. తనకు ఎదురయ్యే ఒక్కో సమస్యను అధిగమిస్తూ మరింత బలంగా మారుతూ వచ్చింది. టాస్కుల్లోనూ మగవాళ్లతో సమానంగా ఆడుతూ వారికి గట్టి పోటినిచ్చింది. అయితే ఆమె కెప్టెన్గా ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా వ్యవహరించడం వల్ల మిగతా ఇంటిసభ్యులు ఆమెకు మనసు లేదని నిందించేవారు. దీంతో ఇంటిసభ్యులు ఆమెను ఈ సీజన్లోనే వరస్ట్ కెప్టెన్గా పేర్కొ న్నారు. కానీ నాగార్జున మాత్రం ఆమెను బెస్ట్ కెప్టెన్గా అభివర్ణించడం విశేషం. (చదవండి: అరియానా, ఇంత అందంగా ఎట్లున్నవే: సోహైల్) -
బిగ్బాస్: బ్రదర్స్ అంటూ షాకిచ్చిన హారిక
బిగ్బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ గెలుచుకునేందుకు అరియానా, సోహైల్, హారిక, అఖిల్, అభిజిత్ హోరాహోరీగా పోరాడారు. కానీ అందరిలో హారికకే తక్కువ ఓట్లు పడటంతో ఆమె టైటిల్ రేసు నుంచి నిష్క్రమించక తప్పలేదు. కానీ వెళ్లిపోయేముందు దేత్తడి హౌస్మేట్స్ను బ్రదర్ అని పిలుస్తూ షాకిచ్చింది. కొత్తగా ఈ పిలుపేంటని అఖిల్, సోహైల్ ఖంగు తిన్నారు. తమను అలా పిలవొద్దని వేడుకున్నారు. స్టేజీ మీదకు వచ్చిన తర్వాత హారిక మాట్లాడుతూ.. మా అమ్మ నన్ను వదిలేసి ఇన్ని రోజులు ఉండటం మొదటిసారి అని చెప్పింది. అమ్మ, అన్నయ్య గర్వపడేలా చేశాననుకుంటున్నానని తెలిపింది. ఇక ట్రోఫీ ఎవరు గెలిచినా హ్యాపీనే అని చెప్పుకొచ్చింది. (చదవండి:బిగ్బాస్: నెరవేరుతున్న గంగవ్వ కల) కాగా హారిక జర్నీ చూసుకుంటే మొదట్లో ఆమె అభిజిత్, లాస్య, నోయల్తో మాత్రమే ఉండేది. నోయల్ను తండ్రిలా ఫీలయ్యేది. కానీ కేవలం ఈ గ్రూపుతో మాత్రమే ఉంటోందని, అందరితో కలవడం లేదన్న కారణంతో ఆమెను ఇంటిసభ్యులు పదేపదే నామినేట్ చేసేవారు. అయితే గేమ్ చివరికి వచ్చేసరికి మాత్రం ఆమె అందరితోనూ కలిసిపోయింది. ఈ క్రమంలో తనను పట్టించుకోవడం లేదని అభి కొన్నిసార్లు హర్ట్ అయ్యాడు కూడా! కాగా హౌస్లో ఎన్నో టాస్కుల్లో ఒంటరిగా పోరాడిన ఆమె ఎనిమిది సార్లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచి రికార్డు సృష్టించింది. చివరికి 13వ వారంలో కెప్టెన్గా అవతరించింది. అంతేకాకుండా ఈ సీజన్లోనే బెస్ట్ కెప్టెన్గా అవతరించింది. టాస్కులతో పాటు డ్యాన్స్ పెర్ఫామెన్స్తో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హారిక.. అవినాష్ను ఏడిపించాలన్న సీక్రెట్ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేసింది. మొత్తానికి హారిక చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్న వాక్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా మారింది. (చదవండి:బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే అప్డేట్స్) -
బిగ్బాస్: గంగవ్వకు ఇల్లు కట్టిస్తున్న నాగ్
యూట్యూబ్ స్టార్ గంగవ్వకు పెద్ద సమస్యే వచ్చిపడింది. ఆమె బిగ్బాస్కు రాకముందు చాలా తక్కువ మంది ఆమెను కలిసేందుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు మాత్రం నిత్యం వందల్లో అభిమానులు ఆమె ఇంటికి క్యూ కడుతున్నారు. వారందరితో మాట్లాడి గొంతు పోతుందని గంగవ్వ వాపోయింది. బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజీ మీద ఆమె మాట్లాడుతూ మరో ఆసక్తికర విషయాన్ని సైతం బయటపెట్టింది. తనకు ఇల్లు కావాలన్న కల నెరవేరుతోందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తన ఊరిలో ఇంటి నిర్మాణం కోసం ముగ్గు కూడా పోసినట్లు వెల్లడించింది. దీంతో త్వరలోనే ఆమె కళ్లముందు కలలు గన్న ఇల్లు రూపుదిద్దుకోనుందన్నమాట. (చదవండి: బిగ్బాస్: అదరగొట్టిన ఆ నలుగురు.. కరీంనగర్ బిడ్డలే) కాగా బిగ్బాస్ షోలో అడుగు పెట్టిన గంగవ్వ అందరితో కలిసిపోవడమే కాక వాళ్ల మీద పంచ్లు కూడా విసిరేది. ఎలాగైనా చివరి వరకు ఉండాలని బలంగా నిర్ణయించుకుని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెను నామినేట్ చేయాలంటే కూడా ఇతరులకు వెన్నులో నుంచి వణుకు పుట్టేది. ఆమె మాటకు ఎవరూ అడ్డు చెప్పేవాళ్లే కాదు. అరవై ఏళ్ల వయసులో కూడా ఎనర్జీగా స్టెప్పులేసిన ఆవిడ చివరికి అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తనను పంపించేయడంటూ పెద్దన్న బిగ్బాస్ను, చిన్నన్న నాగార్జునను అభ్యర్థించింది. ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న బిగ్బాస్ ఆమెను హౌస్ నుంచి పంపించేశారు. ఈ క్రమంలో తనకు ఇల్లు కట్టివ్వండి అని అవ్వ నోరు తెరిచి అడగడంతో నాగార్జున ఆమె కలను సాకారం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు. అందులో భాగంగానే ఆమె ఊర్లో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్బాస్ హౌస్లో జరిగిన ఫ్యాషన్ షోలో గంగవ్వ లక్ష రూపాయల చెక్కును అందుకోగా ఈ మధ్యే దానితో బంగారం కూడా కొనుగోలు చేసింది. ఇప్పుడిక సొంతింటి కల కూడా నెరవేరుతుండటంతో గంగవ్వ సంతోషం వ్యక్తం చేసింది. (చదవండి: పెద్దగా ఆకట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..) -
బిగ్బాస్: రూ.25 లక్షలకు సోహైల్ టెంప్ట్
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్బాస్ నాల్గో సీజన్కు శుభం కార్డు పడింది. గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అభిజిత్ను విజేతగా ప్రకటించారు. అఖిల్ను రన్నరప్గా వెల్లడించారు. మూడో సీజన్ ఫినాలేకు 8 కోట్ల ఓట్లు రాగా నాల్గో సీజన్కు రికార్డు స్థాయిలో 15.65 కోట్ల ఓట్లు వచ్చాయని నాగ్ వెల్లడించారు. కాగా 19 మంది కంటెస్టెంట్లతో.. వారానికి ఒక ఎలిమినేషన్ చొప్పున 105 రోజులపాటు సాగిన ఈ రియాటీ షో ప్రేక్షకులను గణనీయంగా అలరించింది. సెప్టెంబర్ 6న అట్టహాసంగా ప్రారంభమైన ఈ సీజన్ తెలుగు ప్రజలకు త్వరగానే చేరువైంది. తొలి రోజు నుంచే ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ..15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఒకరిని విన్నర్గా ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ విశేషాలేంటో చదివేయండి.. క్షమాపణ చెప్పిన నోయల్ నాగార్జున, ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు 14 మంది స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేశారు. దేవి నాగవల్లి మాత్రం ఫినాలే ముగిసే సమయానికి హాజరైంది. ఇక నోయల్ మాట్లాడుతూ.. 'బిగ్బాస్కు ముందు రాజమౌళి, సుకుమార్ ఇచ్చిన అవకాశాలతో నన్ను గుర్తు పట్టేవారు. బిగ్బాస్ తర్వాత నాకు మరింత పాపులారిటీ సంపాదించుకున్నాను. ఇంటిలో అవినాష్, అమ్మా రాజశేఖర్తో జరిగిన గొడవ వల్ల వాళ్లు ఏమైనా హర్ట్ అయితే అందుకు సారీ. అవినాష్ కామెడీ ఓ మెడిసిన్.. ఆయనలా ఎప్పుడు నేను కామెడీ చేయలేను' అంటూ ఇద్దరికీ క్షమాపణలు తెలిపాడు. బిగ్బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది : అవినాష్ గ్రాండ్ ఫినాలేకి వచ్చిన అవినాష్ నాగ్తో తన బిగ్బాస్ జర్నీ అనుభవాలను పంచుకుంటూ.. ‘మీరు చెప్పినట్టే.. బిగ్బాస్కు ముందు, బిగ్బాస్ తర్వాత నా లైఫ్ చాలా వేరుగా ఉంది. ఇంతకు ముందు మా ఊరు వాళ్లే ఫోటోలు దిగేవారు. కానీ బిగ్బాస్ తర్వాత ఇతర జిల్లాల వాళ్లు వచ్చి నాతో ఫోటో దిగుతున్నారు. నాతోనే కాకుండా నా తల్లితో కూడా ఫోటోలు దిగుతున్నారు అని సంతోషం వ్యక్తం చేశాడు. ఫొటోలు దిగలేకపోతున్నా : గంగవ్వ గంగవ్వ అయితే ఇంటికొచ్చే వాళ్లతో ఫొటోలు దిగలేకపోతున్నానని వాపోయింది. వచ్చిన వాళ్లు వారి కుటుంబ సభ్యులతో ఫోన్లో తనతో తెగ మాట్లాడిస్తున్నారని, దాని వల్ల గొంతు నొప్పి పుడుతోందని నాగార్జునతో చెప్పుకొచ్చింది. దీనికి బదులు బిగ్ బాస్ హౌస్లో ఉండిపోయినా బాగుండని అనిపిస్తోందని చెప్పింది. రోజుకి 500 మంది తనను కలవడానికి వస్తున్నారంది. తన కోరిక మేరకు ఇల్లు కట్టిస్తున్నారని, చాలా సంతోషం అంటూ నాగార్జునకు ధన్యవాదాలు తెలిపింది. జర్నీ చూసి కంటెస్టెంట్స్ కంటతడి బిగ్బాస్ ఫినాలే సందర్భంగా ఇంటి సభ్యులందరికి 105 రోజుల జర్నీని చూపించి అందరినీ ఏడిపించారు. 19 మందితో మొదలైన బిగ్బాస్ నాల్గో సీజన్ ప్రస్తుతం 5 మంది ఉన్నారు. ఇన్నాళ్లు వాళ్లు చూపించిన ప్రేమ, కోపం,ఆప్యాయతలు అన్నింటినీ ఏవీలో వేసి చూపించారు. తమ జర్నీ చూసి ఇంట్లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అభిజిత్, హారిక, అరియానా, సోహైల్, అఖిల్తో పాటు ఎలిమినేట్ అయినవారు కూడా కంటతడి పెట్టారు. అనిల్ రావిపుడి రచ్చ రచ్చ బిగ్బాస్ ఎలిమినేట్ అయిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చే బాధ్యతను యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపుడికి అప్పగించారు. అయితే తాను నవ్విస్తాను కానీ ఎలిమినేట్ చేయలేనని నాగ్కు విజ్ఞప్తి చేశాడు. దీంతో నాగ్ ఆ బాధ్యతను ఎఫ్2 హీరోయిన్ మెహరిన్కు అప్పగించారు. దీంతో బ్యాండ్ బాజాలతో అనిల్ రావిపుడి, మెహరిన్ హౌస్లోకి అడుగుపెట్టారు.ఇక ఇంట్లోకి వెళ్లిన అనిల్తో టాస్క్లు ఆడించారు నాగ్. పలు చిలిపి ప్రశ్నలు అడిగి ఎంటర్టైన్మ్మెంట్ చేశాడు. హౌస్మేట్స్ని ఇమిటేట్ చేసి కడుపుబ్బా నవ్వించాడు. హారిక అవుట్ ఫినాలే పోరులో నుంచి తొలుతగా హారిక ఎలిమినేట్ అయింది. హౌస్లోకి వెళ్లిన మెహరిన్, అనిల్ రావిపుడి కలిసి హారికను ఎలిమినేట్ చేశారు. మొదటగా హౌస్మేట్స్ అందరికి కళ్లకి గంతలు కట్టి ఎలిమినేట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. టాప్ 5లో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సిందిగా మెహరిన్కు నాగ్ సూచించారు. కాసెపు అందరికి టెన్షన్ పెట్టి చివరగా హారికను ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఆ తరవాత హారిక గంతలు విప్పిన మెహ్రీన్, అనిల్.. ఆమెను తీసుకెళ్లి ఒక పంజరం లాంటి ఐరన్ రూమ్లోకి పంపారు. ఆ పంజరాన్ని ఒక క్రేన్ గాల్లోకి లేపుతూ బయటికి తీసుకెళ్లిపోయింది. హారిక గాల్లో ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఫైనలిస్ట్ల గంతలు విప్పగా దేత్తడి వెళ్లిపోవడం చూసి విస్తుపోయారు. 10 లక్షలు తిరస్కరించిన హౌస్మేట్స్ రెండో వ్యక్తిని ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యతను నాగ్ హీరోయిన్లు లక్ష్మీరాయ్, ప్రణీతలకు అప్పగించారు. దీంతో ఆ ఇద్దరు బ్యూటీలు బ్యాండ్ బాజాలతో ఇంట్లోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. మొదటగా ప్రణీత 10 లక్షలు రూపాయలు ఉన్న సూట్ కేస్తో వెళ్లి కంటెస్టెంట్స్ను టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. రూ.10లక్షలు తీసుకొని ఎవరైనా వెళ్లొచ్చు అని ఆఫర్ ఇవ్వగా అందరూ తిరస్కరించారు. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చారని, డబ్బుతో వాళ్ల ప్రేమను పొగొట్టుకోలేమని తేల్చి చెప్పారు. దీంతో ప్రణీత 10 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసింది. తర్వాత హీరోయిన్ లక్ష్మీరాయ్ వెళ్లి అరియానాను ఎలిమినేట్ చేశారు. రూ. 25 లక్షలకు సోహైల్ టెంప్ట్ టాప్ 3లో ముగ్గురు అబ్బాయిలు మిగలగా.. బిగ్బాస్ నుంచి సోహైల్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయ్యాడు. నాగార్జున ఇచ్చిన రూ.25లక్షల ఆఫర్కు సోహైల్ టెంప్ట్ అయ్యాడు. ఇంట్లో ఉన్న అభిజిత్, అఖిల్, సోహైల్లో ఎవరైనా 25లక్షల రూపాయలు తీసుకొని బయటకు రావొచ్చని నాగ్ సూచించగా.. అఖిల్, అభిజిత్ తిరస్కరించారు. సోహైల్ మాత్రం తాను ఈ డబ్బును తీసుకొని వెళ్తానని చెప్పాడు. సోహైల్ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. వచ్చిన ఆ 25 లక్షల రూపాయాల్లో ఐదు లక్షలు అనాథశ్రమానికి, మరో ఐదు మెహబూబ్ ఇల్లు కట్టుకునేందుకు ఇస్తానని చెప్పాడు. కానీ మెహబూబ్ అతడి ఆఫర్ను తిరస్కరిస్తూ ఆ ఐదు లక్షలు కూడా అనాథశ్రమానికే ఇచ్చేయమన్నాడు. వీరి ఆలోచన మెచ్చిన నాగ్ ఆ పది లక్షలు అనాథశ్రమానికి తాను ఇస్తానని, సోహైల్ను 25 లక్షలు ఇంటికే తీసుకెళ్లమని చెప్పారు. సోహైల్ పర్మిషన్ తీసుకున్న చిరు లక్ష్మీ రాయ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకోగా తర్వాత వచ్చిన తమన్ మ్యూజిక్తో మ్యాజిక్ చేశాడు. అనంతరం స్వయంగా నాగార్జునే హౌస్లోకి వెళ్లి టాప్ 2 కంటెస్టెంట్లు అభిజిత్, అఖిల్ను స్టేజీ మీదకు తీసుకొచ్చారు. బిగ్బాస్ ట్రోఫీ ఇచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. నాగార్జున ఫిట్నెస్ను చూస్తే కుళ్లు వేస్తోందన్నారు. అలాగే పది సీజన్ల వరకు కూడా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉండాలన్నారు. ఆ తర్వాత నాగ్ జర్నీ చూపించారు. అనంతరం అభిజిత్ మీద పంచులేస్తూనే అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. ప్రతిదాంట్లో గెలవాలన్న తాపత్రయం కనిపించేదని, ప్రేమోనాల్ను గెలిచేవాడని తెలిపారు. మన కథ వేరన్న డైలాగ్ తర్వాతి సినిమాలో పెడతాను, అందుకు పర్మిషన్ ఇవ్వంటూ సోహైల్ను అడిగారు. అభి విన్నర్ అభిజిత్, అఖిల్ను స్టేజీ మీదకు తీసుకొచ్చిన నాగ్.. అభి విజయానికి సంకేతంగా అతడి చేయి పైకెత్తారు. ఇద్దరు మిత్రులు చిరు, నాగ్ కలిసి అతడికి ట్రోఫీ అందించారు. స్టైలిష్ బైక్ను కూడా అందజేశారు. ఈ విజయాన్ని ఊహించలేకపోయిన అభి సంతోషం కట్టలు తెంచుకుంది. తనకు ఓట్లేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలిపాడు.. 63 ఏళ్లలో ఇది తనకు గొప్ప వేడుకలాంటిదని అభిని చూసి అతడి తండ్రి గర్వపడ్డారు. -
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే ఫోటోలు
-
బిగ్బాస్ ఫినాలే: ఫైటర్ ఎలిమినేట్?!
బిగ్బాస్ నాల్గో సీజన్ కథ క్లైమాక్స్కు వచ్చింది. విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అనేది నేడు తేల్చనున్నారు. ఈ సీజన్లో ఊహించని ఎలిమినేషన్లు ఇస్తూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ విజేతను ప్రకటించే విషయంలో ఏం ఎలాంటి ట్విస్టు ఇవ్వనున్నాడోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. సుదీర్ఘంగా సాగనున్న ఈ గ్రాండ్ ఫినాలే షూటింగ్ మొదటి పార్ట్ శనివారమే ముగిసింది. ఇందులో ముద్దుగుమ్మల డ్యాన్సులు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల స్పెషల్ పర్ఫామెన్సులతో ఎంటర్టైన్మెంట్ పార్ట్ చిత్రీకరణ ముగిసింది. నేడు విన్నర్ను ప్రకటించే అసలు సిసలైన ఘట్టం షూటింగ్ జరగనుంది. దీనికి స్పెషల్ గెస్ట్లు ఎవరొస్తున్నారనేది సస్పెన్స్గా ఉంచారు. అయితే ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయినట్లు సోసల్ మీడియా కోడై కూస్తోంది. ఫైనల్ వీక్లో దేత్తడి హారికకు తక్కువ ఓట్లు వచ్చి ఐదో స్థానంలో నిలిచిందని, ఫలితంగా చోటా ప్యాకెట్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా టైటిల్ కొట్టాలన్న ఆమె కల అందని ద్రాక్షగానే మిగిలినట్లు కనిపిస్తోంది. (చదవండి: బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే: హారిక అవుట్!?) ఆమె వెళ్లిపోయిన తర్వాత హౌస్లో అరియానా, సోహైల్, అభిజిత్, అఖిల్ మిగిలారు. హారిక తర్వాత అరియానాకు తక్కువ ఓట్లు పడ్డాయని వినికిడి. దీంతో నాలుగో స్థానంలో ఉన్న ఆమెను నాగార్జున ఎలిమినేట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే హారిక వెళ్లాక మిగిలిన నలుగురికి నాగార్జున రూ.10 లక్షల ఆఫర్ ప్రకటించారని, కానీ వాళ్లు దాన్ని అందుకోవడానికి తిరస్కరించడంతో ఓట్ల లెక్క ప్రకారం అరియానాను పంపించేశారని మరో వార్త చక్కర్లు కొడుతోంది. అనధికారిక పోల్స్లో మాత్రం అరియానా రెండు, మూడు స్థానాల్లో ఊగిసలాడింది. దీంతో గత రెండు సీజన్లలాగే మరోసారి అమ్మాయి రన్నరప్గా నిలుస్తుందని అంతా భావించారు. ఒకానొక సమయంలో విన్నర్ అయ్యే అవకాశాలూ లేకపోలేదనుకున్నారు. ఈ క్రమంలో అరియానా నాలుగో స్థానంలో నిలవడం చాలామందిని షాక్కు గురి చేస్తోంది. అయితే తమ ఫైటర్ విన్నర్ కాకపోయినా రన్నరప్గానైనా నిలుస్తుందని బోల్డ్ బ్యూటీ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అరియానా నిజంగా నాలుగో స్థానం దగ్గరే ఆగిపోయి టైటిల్ రేసు నుంచి తప్పుకుందా? లేదా? అనేది తెలియాలంటే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: బిగ్బాస్ : అమ్మాయిలకు ఛాన్సెంత?) -
బిగ్బాస్ ఫినాలే: దేవి నాగవల్లి ఎక్కడ?
బిగ్బాస్ నాల్గో సీజన్ గ్రాండ్ ఫినాలే నేడు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా ఇప్పటికే రిలీజ్ చేసింది. హీరోయిన్లు ప్రణీత, మెహరీన్ డ్యాన్సులు, అనిల్ రావిపూడి పంచ్ పటాకాలతో షో డబుల్ జోష్తో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఒకే చోట చేరి డ్యాన్సు చేయడం చూడముచ్చటగా ఉంది. కానీ ఆ గుంపులో దేవి నాగవల్లి మాత్రం కనిపించలేదు. ఇప్పటికే రీయూనియన్లో మోనాల్, లాస్య, సుజాత, గంగవ్వ, నోయల్, కుమార్ సాయి, అవినాష్, దివి, మెహబూబ్, కల్యాణి హౌస్లోకి వె్లి వచ్చారు. కానీ సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి మాత్రం వెళ్లలేదు. తాజా ప్రోమోలో దేవి నాగవల్లి తప్ప మిగతా ఇద్దరు కూడా స్టేజీపై కనిపించారు. దీంతో ఆమె ఎందుకు గ్రాండ్ ఫినాలేకు వెళ్లలేదన్న చర్చ నడుస్తోంది. అయితే ఆమె తన ఎలిమినేషన్పై అసంతృప్తితో ఉండటం వల్లే ఫినాలేకు హాజరు కాలేదని తెలుస్తోంది. కాగా లేడీ బిగ్బాస్ అవుతానంటూ షోలో ఎంట్రీ ఇచ్చిన దేవి నాగవల్లి మూడో వారంలోనే ఎలిమినేట్ అయింది. అప్పటివరకు ఆమెతో పెద్దగా కలిసినట్లు కనిపించని ఇంటిసభ్యులు దేవి వెళ్లిపోతుంటే మాత్రం కంటతడి పెట్టుకున్నారు. బిగ్బాస్ హౌస్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కోల్పోయిందని ఎంతోమంది ఫీలయ్యారు. అయితే ఉన్నన్ని రోజులు దేవి బిగ్బాస్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించేది. చాలామంది మొదట్లో రూల్స్ బ్రేక్ చేసి బిగ్బాస్ చేత అక్షింతలు వేయించుకునేవారు. ఓసారైతే ఇంటి సభ్యుల నిర్లక్ష్యానికి చిర్రెత్తిన బిగ్బాస్ అందరికీ చీవాట్లు పెట్టాడు. ఈ క్రమంలో క్షమించమంటూ కంటెస్టెంట్లు నిల్చుని రెండు చేతులు జోడిస్తూ వేడుకున్నారు. కానీ దేవి నాగవల్లి మాత్రం తను ఏ తప్పూ చేయలేదని దర్జాగా కూర్చుండిపోయి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇలా ఏ విషయంలోనైనా తనకంటూ ఓ క్లారిటీ ఉంటుంది. అలాగే సింగర్, డ్యాన్సర్గా తనలోని కొత్త కోణాలను సైతం అభిమానులకు పరిచయం చేసింది. (నోయల్ రాకతో అభిజిత్ ఎమోషనల్) కానీ మరీ తొందరగా మూడో వారంలోనే ఎలిమినేట్ కావడం ఆమె ఊహించలేకపోయింది. బయటకు వచ్చాక కూడా ఇదే అసంతృప్తిని వెల్లగక్కింది. 'బిగ్బాస్ను నమ్మి వెళ్లాను. నాకు ఓట్లు తక్కువ వచ్చాయి, కాబట్టి ఎలిమినేట్ అయ్యానన్నారు. కానీ బయట మాత్రం నాకు ఓట్లు ఎక్కువ వచ్చాయని చాలామంది అంటున్నారు. అంటే నాకంటే వెనక ఉన్నవాళ్లను వదిలేసి నన్ను ఎలిమినేట్ చేయడం షాకింగ్గా ఉంది. నా వల్ల స్క్రిప్ట్ మారిపోతుందని నన్ను పంపించేసి ఉండొచ్చు' అని బాధపడింది. బిగ్బాస్ షో తనకు ద్రోహం చేసిందన్న భావనతోనే ఆమె ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు వెళ్లడానికి నిరాకరించిందేమోనని నెటిజన్లు చర్చిస్తున్నారు. (బిగ్బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే) -
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది..
దాదాపు 15 వారాల పాటు ఎంటర్టైన్మెంట్ అందించిన బుల్లితెర బిగ్ రియాల్టీషో బిగ్బాస్ నాల్గో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించనున్నారు. దీంతో ఈ సారి ఎవరు గెలవబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. మరో వైపు గ్రాండ్ ఫినాలేకు ఎవరు ముఖ్య అతిథిగా వస్తారు? ఎంత మంది హీరోయిన్లు తమ డాన్స్ ఫెర్ఫార్మెన్స్తో అదరగొడతారు? అసలు ఫినాలేలో ఎలాంటి సర్ప్రైజ్లు, ట్విస్టులు ఉంటాయో చూసేందుకు బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగాగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షుల ఆసక్తిని మరింత పెంచేందుకు ఖతర్నాక్ ప్రోమోను వదిలారు బిగ్బాస్ నిర్వాహకులు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.తాజాగా ప్రోమోలో హోస్ట్ నాగార్జున స్పెషల్ ఎంట్రీ ఇవ్వగా.. ఎలిమినేట్ కంటెస్టెంట్స్ అందరూ సందడి చేస్తున్నారు. గంగవ్వ దివి, మోనాల్, మెహబూబ్, కుమార్ సాయి,అవినాష్, అమ్మ రాజశేఖర్ ఇతర కంటెస్టెంట్స్ స్పెషల్ సాంగ్స్తో అలరిస్తున్నారు. గంగవ్వను అయితే ప్రత్యేకంగా కొంతమంది ఎత్తుకొని మరి స్టేజ్ మీదకు తీసుకువచ్చారు. ఇక హీరోయిన్ ప్రణీత, మెహరీన్ స్పెషల్ పెర్ఫామెన్స్తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి పంచ్ వేసి అలరిస్తున్నారు. హౌస్మేట్స్ని ఇమిటేట్ చేసి నవ్వించాడు. ఇక గంగవవ్వ అయితే తన ఇంటికి ఒక్కొక్క రోజు ఐదు నూర్ల మంది వస్తున్నారని, నాకు రామ రామ గోస అయితుందంటూ..హోస్ట్ నాగ్కు తన అభిమాన బాధను పంచుకుంది. లాస్య ఏమో బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చక ఇంత వరకు పప్పే తినలేదని చెబుతోంది. మరో వైపు తమన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీలు షోకి వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. ఇక ఈ సీజన్కి గెస్ట్ ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు. -
ఈసారైనా దక్కుతుందా.. బిగ్బాస్ ఎవరు?
పోటీలో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. నాలుగో సీజన్ ఇది. మూడు సీజన్లనూ అబ్బాయిలే తన్నుకుపోయారు. ఈసారైనా అమ్మాయి విజేతగా నిలుస్తుందా? అరియానా, హారికలకు చాన్స్ ఉందా? 100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన షో ఈరోజు ముగుస్తోంది. భావోద్వేగాల కేంద్రంగా సాగే ఈ షోలో అన్ని రకాల వొత్తిళ్లను అమ్మాయిలు దాటగలిగారు. టైటిల్ చేజిక్కించుకోగలరో లేదో చూద్దాం. ఒక అంచనా. సల్మాన్ ఖాన్ హోస్ట్గా నిర్వహించే హిందీ బిగ్బాస్లో ఇప్పుడు 14వ సీజన్ నడుస్తోంది. పూర్తయిన 13 సీజన్లలో ఐదు మంది మహిళా విజేతలు ఉన్నారు. పురుషులకే ఎక్కువగా ఓటింగ్ జరిగే క్రేజ్ ఉన్నచోట ఒకరకంగా పెద్ద నంబర్. హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో మహిళలే ఉత్తమ మానవ ప్రవర్తనను ప్రదర్శించారని దీనిని బట్టి రుజువైంది. ఎందుకంటే బిగ్బాస్ షో వ్యక్తుల బలాబలాలు, శక్తి సామర్థ్యాలను కాక మానవ ప్రవర్తనలను ప్రేక్షకుల ముందు పెట్టి ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం అని చెబుతుంది. మానవ ప్రవర్తనను బయటకు తేవడానికి బిగ్బాస్ హౌస్లో రకరకాల సందర్భాలను సృష్టిస్తారు. ఎత్తుకు ఎదగడానికి, పతనం కావడానికి కూడా సమాన అవకాశం ఉంటుంది. అలాంటి షోలో ఐదు మంది స్త్రీలు గెలిచి తాము మెరుగైన మానవులం అని చెప్పారు. కాని తెలుగులో కూడా అంతటి ప్రతిభావంతంగా రాణించినా పురుషులకు దీటుగా నిలిచినా స్త్రీలకు గత మూడు సీజన్లలో టైటిల్ దక్కలేదు. ఈసారైనా దక్కుతుందా... తెలియదు. మిస్సయిన శ్రీముఖి, గీతా మాధురి తెలుగు బిగ్బాస్ 1,2,3 సీజన్లలో మహిళా కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇచ్చారు. సీజన్ 1లో నటి హరితేజ , నటి అర్చన చివరివరకూ నిలిచారు. సీజన్ 2లో గాయని గీతామాధురి రన్నర్ అప్గా నిలిచారు. నటుడు కౌశల్ ఆ సీజన్కు విన్నర్ అయినా గీతా మాధురి గెలుస్తుందని చాలామంది భావించారు. సీజన్ 3 లో శ్రీముఖి రన్నరప్గా నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నారు. విజేత ఓటింగ్ ద్వారా నిర్ణయం అవుతారని నిర్వాహకులు చెబుతారు. కాని ఓటింగ్ సరళి పురుషుల ఫేవర్లో వెళుతోంది. స్త్రీలను విజేతలకు నిలబెట్టడానికి బయట సరైన బృందాలు పని చేయడం లేదనే భావన కూడా ఉంది. ఈసారి అరియానా, హారిక బిగ్బాస్ 4 సీజన్ కరోనాకు వెరవక అట్టహాసంగా సెప్టెంబర్ 6న మొదలైంది. మొత్తం 105 రోజుల ఈ షోలో చివరి రోజు ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వారిలో 10 మంది స్త్రీలు ఉన్నారు. సీజన్కు అట్రాక్షన్గా నిలుస్తుంది అనుకున్న గంగవ్వ ఆరోగ్య కారణాల రీత్యా నిష్క్రమించాల్సి వచ్చింది. ఫైనల్ వరకూ వెళుతుందనుకున్న లాస్య 77వ రోజున నిష్క్రమిస్తే గట్టి పోటీ ఇస్తూ వచ్చిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ చివరి వారంలో ఎవిక్ట్ అయ్యింది. చివరి ఐదుమంది పోటీదారుల్లో టెలివిజన్ యాంకర్ అరియానా, యూ ట్యూబ్ స్టార్ హారికా మిగిలారు. అమ్మాయిలు గెలుస్తారా? ఓటింగ్ సరళిని, హౌస్లో అరియానా, హారికల గేమ్ తీరును, ప్రవర్తనను గమనించిన పరిశీలకులు చాలామంది ఈసారి బిగ్బాస్ టైటిల్ గెలిచేంత గట్టిగా వీరిరువురు లేరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరియానా ప్రవర్తన నిక్కచ్చిగా ఉండటం ఆమెకు మైనస్ అయ్యింది. ఒక దశలో హౌస్మేట్స్ అందరూ ఆమెను ఎలిమినేట్ చేయాలనే వరకూ వెళ్లారు. ఇక హారికా పట్ల అభ్యంతరాలు లేకున్నా ఆమె గట్టిగా ఒక అభిప్రాయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక యాటిట్యూడ్ని చూపలేకపోయింది. మరోవైపు పురుష కంటెస్టెంట్లు అభిజిత్, సొహైల్, అఖిల్ తమ సొంత తీరుతో ఓట్లను నిలబెట్టుకున్నారు. 50 లక్షలు ప్రైజ్ బిగ్బాస్ 4 విజేతకు 50 లక్షల ప్రైజ్మనీ దక్కుతుంది. ఇప్పుడు పోటీలో నిలుచున్న ఐదుగురూ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అభ్యర్థులే. ఈ మొత్తం చాలా పెద్దది తమ దృష్టిలో అని వారే చెప్పుకున్నారు. అందరికీ సొంతింటి కలే లక్ష్యంగా ఉంది. ఈ 50 లక్షల కోసం బిగ్బాస్లో గత 100 రోజులుగా అభ్యర్థులు అనేక అగ్నిపరీక్షలకు లోనయ్యారు. హారికా, అరియానాలు కూడా ఎన్నోసార్లు గట్టి దెబ్బలు తిన్నా తట్టుకుని నిలుచున్నారు. హారికాకు సొహైల్కు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలే గెలిచాయి. అరియానా సొహైల్కు మధ్య కూడా యుద్ధాలే జరిగాయి. హారికా అభిజిత్ ఒక జట్టు కడితే సొహైల్– అఖిల్ ఒక జట్టుగా మారి అరియానాను ఒంటరిని చేశారు. అయితే బయట ప్రేక్షకులలో అరియానా మద్దతుదారులు గట్టిగానే ఉన్నారు. ఎవిక్ట్ అయ్యి వెళ్లే ముందు మోనల్ గజ్జర్ విజేత అయ్యే ఏ లక్షణమూ అరియానాలో లేదు అని చెప్పి వెళ్లింది. కాని ప్రేక్షకుల తీర్పు ఈసారి అమ్మాయిల వైపు మొగ్గితే ఇద్దరిలో ఒకరు గెలిచి మహిళా విజేతల ఖాతా తెరుస్తారు. నేడే ఫైనల్స్ నేడు మా టీవీలో ప్రసారమయ్యే ఫైనల్స్లో విజేత ప్రకటన వెలువడుతుంది. చీఫ్గెస్ట్గా చిరంజీవి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో వెంకటేశ్ హాజరయ్యారు. అంతకు ముందు సీజన్ చిరంజీవి వచ్చారు. మళ్లీ ఆయనే రావచ్చు అంటున్నారు. ఏమైనా లాక్డౌన్ కాలంలో మొదలైన ఈ షో పెద్ద ఆటంకాలు లేకుండా చివరి అంకానికి చేరడం వెనుక టీమ్ కష్టం ఎంతో ఉంటుంది. వారికి మెచ్చుకోళ్లు చెప్పక తప్పదు. విజేత ప్రకటన కోసం ఎదురు చూద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
నోయల్ టైటిల్ గెలవాల్సింది: అభిజిత్
బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్లు ఆఖరుసారి సంతోషంగా డ్యాన్సులు చేసుకుంటూ గడిపారు. ఎలిమినేట్ అయినవాళ్లను తిరిగి హౌస్లో చూస్తున్నందుకు ఓపక్క సంతోషం, తర్వాతి రోజు నుంచి ఈ హౌస్ ఉండదన్న మరో వైపు బాధ వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో హౌస్లో చివరి రోజు కొంత ఎమోషనల్గా సాగింది. అయితే దేవి నాగవల్లి, సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ మాత్రం రీయూనియన్ పార్టీకి రాకపోవడం గమనార్హం. మరి సంతోషాలు వెల్లివెరిసిన నేటి బిగ్బాస్ ఎపిసోడ్ ఎలా సాగిందో చదివేయండి.. ఇంటి నుంచి సందేశం.. అఖిలూ, ఓ అఖిలూ.. అని పిలుచుకుంటూనే గంగవ్వ లోపలకు వచ్చింది. అవ్వ పిలుపు వినగానే అఖిల్ ఉత్సాహం ఉరకలెత్తింది. ఆమెను చూడగానే పిల్లాడిలా సంబరపడిపోయాడు. తర్వాత జోర్దార్ సుజాత లోనికి రాగా అవ్వతో కలిసి ఫైనలిస్టులతో ఆటాడించారు. నన్ను ఇంప్రెస్ చేస్తే మీ ఇంటి నుంచి వచ్చిన మెస్సేజ్ను చూపిస్తానని సుజాత బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో అభిజిత్ సోహైల్ పోటీపడుతూ ఇంట్లోకి పరుగెత్తారు. ఈ క్రమంలో అభి మైకు విరగొట్టుకుని మరీ మొదటగా కాఫీ మగ్గు తీసుకొచ్చాడు. తర్వాత సోహైల్ ప్లేటు మీద ఐ లవ్ యూ అని రాసుకొచ్చి మరీ అందించాడు. ఇలా ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేయగా.. ఫైనలిస్టులందరికీ కుటుంబ సభ్యులు మాట్లాడిన వీడియోలు చూపించారు. అనంతరం గంగవ్వ, సుజాత ఇద్దరూ వీడ్కోలు తీసుకున్నారు. (చదవండి: కృష్ణుడిలాంటి భర్త కావాలి: మోనాల్) నేను నిన్ను గెలిచాను.. తర్వాత వచ్చిన నోయల్ ర్యాప్తో ఊపేస్తూ అందరి సంతోషాన్ని రెట్టింపు చేశాడు. అతడి కోసం ఓ సందేశాన్ని రాసిన బాటిల్ను అభి నోయల్ చేతికందించాడు. దానిపై 'నోయల్ టైటిల్ గెలిచేందుకు అర్హుడు' అని ఉంది. ఇది చదివిన నోయల్ నేను నిన్ను గెలిచాను, ఇది చాలదా.. అంటూ అభిజిత్తో చెప్పుకొచ్చాడు. హౌస్ను మిస్సవలేదు, కానీ మిమ్మల్ని మిస్ అవుతున్నానని పేర్కొన్నాడు. ఈ బిగ్బాస్ తనకు ఎంతో ఇచ్చిందని, కానీ తను ఏమీ తిరిగివ్వలేకపోతే క్షమించండి అంటూ హౌస్కు గుడ్బై చెప్పాడు. (చదవండి: బిగ్బాస్ : నోయల్కు వచ్చిన వ్యాధి ఇదే) దివి.. దీపిక పదుకొణెలా ఉన్నావు తర్వాత మెహబూబ్ను చూడగానే సోహైల్ తెగ ఎగ్జైట్ అయ్యాడు. అతడు మాత్రం తన ఆతృతను లోలోపలే అణుచుకుంటూ దివితో స్టెప్పులేశాడు. అనంతరం తన జిగిరీ దోస్తులు సోహైల్, అఖిల్, అభిజిత్తో కబుర్లు చెప్పాడు. అటు అఖిల్ మాత్రం దీపిక పదుకొణెలా ఉన్నావంటూ దివిని పొగడ్తలతో ముంచెత్తాడు. చాలా బాగున్నావంటూ అభిజిత్ కూడా మెచ్చుకోవడంతో ఏంటి పులిహోరా? అని దివి ప్రశ్నించింది. మరోపక్క మెహబూబ్, సోహైల్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. అనంతరం ఫైనలిస్టులు అన్ని హార్ట్ దిండులను మెహబూబ్, దివికి బహుమతిగా ఇచ్చారు. మీ ఐదుగురు విన్నర్లే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండని మెహబూబ్ పదే పదే చెప్తూ సెలవు తీసుకున్నాడు. (చదవండి: బిగ్బాస్: పెద్దగా ఆకట్టుకోని కంటెస్టెంట్లు వీళ్లే..) మిస్ అవుతున్నానంటూ ఏడ్చేసిన అరియానా తర్వాత అవినాష్ ఎంట్రీ ఇవ్వడంతో అరియానా ఆనందంతో గెంతులేసింది. కానీ ఆ వెంటనే నిన్ను మిస్ అవుతున్నానంటూ గుక్కపెట్టి ఏడవటంతో ఆమెను ఓదార్చాడు. తననిప్పుడు అవినాష్ అని కాకుండా ఎంటర్టైనర్ అని పిలుస్తున్నాడని చెప్పుకొచ్చాడు. తన ఇంటికి వేరే వేరే జిల్లాల నుంచి అభిమానులు కలిసేందుకు వస్తున్నారని తెలిపాడు. అఖిల్ పులిహోర మామూలుగా కలపడం లేదంటూ సెటైర్లు వేశాడు. హారిక అలాగే చూస్తుండటం చూసి ఏంటి? దినాలకు పిట్టకు పెట్టినట్లు చూస్తున్నావు అని పంచ్ వేశాడు. అనంతరం అందరి హౌస్కు గుడ్బై చెప్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. తర్వాత ఫైనలిస్టులు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. (చదవండి: బిగ్బాస్ విన్నర్ అతడే: అలీ రెజా) -
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే: హారిక అవుట్!?
బిగ్బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ దక్కించుకునేందుకు 19 మంది కంటెస్టెంట్లు పోరాడారు. ఈ పోరాటంలో తుది వరకు నిలిచిన అరియానా, సోహైల్, అఖిల్, అభిజిత్, హారిక ఫినాలేకు చేరుకున్నారు. ఈ ఐదుగురి మధ్య జరుగుతున్న ఓట్ల యుద్ధంలో గెలుపు ఒక్కరినే వరించనుంది. ఆ విజేత ఎవరనేది రేపు తేలనుంది. ఈ గ్రాండ్ ఫినాలేను ప్రీమియర్ ఎపిసోడ్ కంటే వైభవంగా నిర్వహించేందుకు బిగ్బాస్ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. హీరోయిన్ల డ్యాన్సులు, తమన్ లాంటి గొప్ప సింగర్ల పాటలతో షోను గ్రాండ్గా నిర్వహించనున్నారు. దీనికితోడు మాజీ కంటెస్టెంట్ల డ్యాన్సులతో ఫినాలే మరింత వినోదాత్మకంగా సాగనుంది. ముఖ్యంగా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారనుంది. (చదవండి: హారిక హగ్గిచ్చి ఎన్నిరోజులైతుందో: అభిజిత్) అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. దేత్తడి హారికకు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఫైనల్ ఎలిమినేషన్లో హారిక హౌస్లో నుంచి వెళ్లిపోనున్న మొదటి కంటెస్టెంటుగా నిలవనుంది. అరియానా, సోహైల్, అభిజిత్, అఖిల్.. ట్రోఫీ కోసం పోటీపడనున్నారు. అనధికారిక పోల్స్ ప్రకారం ఓట్ల సంఖ్యలో అఖిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సోహైల్, అరియానాలు రెండో స్థానం కోసం పోటీపడుతున్నారు. అభిజిత్ తొలి స్థానంలో నిలుస్తూ వస్తున్నాడు. అయితే హాట్స్టార్ ఓట్లు అందరూ వేస్తారు, కానీ మిస్డ్ కాల్స్ కూడా చేసే ఓపిక చాలా తక్కువ మందికే ఉంటుంది. ఈ మిస్డ్ కాల్స్ ఓట్లే విన్నర్, రన్నర్ను డిసైడ్ చేయనున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి ఈ అనఫీషియల్ పోల్స్ చెప్తున్నట్లుగా రేపు అభిజిత్నే విన్నర్ను ప్రకటిస్తారనేది కచ్చితంగా చెప్పలేం. ఇక ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం కానుంది. అప్పుడే నాగార్జునతోపాటు ప్రత్యేక అతిథులు విజేతను అధికారికంగా ప్రకటిస్తారు. అప్పటివరకు వేచి చూడక తప్పదు. (చదవండి: నువ్వు ఫేక్, ఇది నీ ఎథిక్స్: అఖిల్ ఫైర్) -
బిగ్బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే
అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్బాస్ నాల్గో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. 16 మందితో మొదలైన షోలో మరో మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చేరాయి. కానీ ఏ వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కూడా ఫినాలేకు చేరుకోలేకపోయింది. కొందరు మెరుపు తీగల్లా వచ్చి వెళ్లిపోగా, భారీ అంచనాల మధ్య వచ్చిన మరికొందరు మాత్రం ఉనికిని కూడా చాటుకోలేక అభిమానులను నిరుత్సాహానికి గురి చేశారు. అలాంటి కంటెస్టెంట్లు ఎవరెవరే చూద్దాం... సూర్యకిరణ్ తన కోపమే తన శత్రువు అన్న వాక్యం దర్శకుడు సూర్య కిరణ్ విషయంలో అక్షరాలా నిజమైంది. ఎదుటి వాళ్లు చెప్పేది వినకుండా, ప్రతిదానికి చిర్రుబుర్రులాడేవాడు. అందుకే షోలో అడుగు పెట్టిన మొదటి వారమే షో నుంచి నిష్క్రమించాడు. కానీ తను హౌస్లో ఉండాల్సిన వ్యక్తి అని, ఇలా ఎలిమినేట్ అయిపోతాననుకోలేదని చెప్పుకొచ్చాడు. కానీ రెమ్యూనరేషన్ మాత్రం ఊహించినదానికన్నా పది రెట్లు ఎక్కువే ఇచ్చారని చెప్పాడు. (చదవండి: వారం రోజులకు లక్షల్లో ఇచ్చారు) కరాటే కల్యాణి అప్పుడే కోప్పడుతూ అప్పుడే ఏడుస్తూ కల్యాణి ఎవరికీ ఓ పట్టాన అర్థం కాలేదు. చిన్నచిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసేది. అలా ఆమె పెద్దపెద్దగా కేకలేస్తూ అందరి మీద నోరు పారేసుకోవడంతో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. చాలామందితో కయ్యం పెట్టుకుని చివరికి రెండో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. కానీ ఆమె అమ్మ రాజశేఖర్తో కలిసి అందరినీ తెగ ఎంటర్టైన్ చేసేది. (చదవండి: అభిజిత్ బిగ్బాస్కే గర్వకారణం) స్వాతి దీక్షిత్ ఇంట్లో మూడో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన బొద్దు గుమ్మ స్వాతి దీక్షిత్. ఆమె ఎంట్రీ, ఎలిమినేషన్ రెండూ అందరినీ సర్ప్రైజ్ చేశాయి. ఇంట్లోకి వెళ్లగానే ఆమెను ఇంప్రెస్ చేసేందుకు అబ్బాయిలు పోటీపడ్డారు. చివరికి ఆమె అభిజిత్తో కనెక్ట్ కావడం, అభిజిత్-హారిక మధ్య గ్యాప్ రావడం, ఇంతలో ఆమె ఎలిమినేట్ కావడం చకచకా జరిగిపోయాయి. (చదవండి: స్వాతిలో అది నాకు నచ్చలేదు: లాస్య) యాంకర్ లాస్య లాస్య అనగానే గుర్తొచ్చేది చీమ-ఏనుగు జోకులు. ఆమె వేసే జోకులకు ఎవరూ నవ్వకపోయినా ఆమె మాత్రం పడీపడీ నవ్వేది. కానీ ఈ నవ్వే ఆమెకు నానాపేర్లు తెచ్చిపెట్టింది. ఫేక్ స్మైల్, కవరింగ్ స్మైల్ అంటూ మిగతావాళ్లు లాస్య గురించి ఎన్నో అన్నారు. ఇది పక్కన పెడితే ఈ యాంకర్ నుంచి ఆమె అభిమానులు ఎంతగానో ఆశించారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కు మ్యాచ్ అవకుండా ఆమె కిచెన్లోనే ఉండిపోయి వంటలక్కగా మారిపోయింది. టాస్కుల్లోనూ వెనకబడిపోయింది. (చదవండి: టాప్ 2: లాస్య జోస్యం నిజమయ్యేనా?) జోర్దార్ సుజాత తెలంగాణ యాసలో మాట్లాడే ఈ యాంకర్ కిలకిలా నవ్వుతూనే ఉండేది. ఎప్పుడు చూసినా లాస్యతో కలిసి ఇంట్లో జరిగే విషయాల గురించి గుసగుసలు పెట్టేది. అలా ఆమెకు గాసిప్ క్వీన్ అన్న ముద్ర పడిపోయింది. అయితే వ్యాఖ్యాత నాగార్జునను పట్టుకుని ఆమె బిట్టూ అని పిలవడం చాలామందికి నచ్చలేదు. దీంతో ఐదోవారంలోనే ముల్లెమూట సర్దుకుని ఇంటిబాట పట్టింది. బయటకు వచ్చాక సుజాత మాట్లాడుతూ తనను బిట్టూ అని బిగ్బాస్ యూనిటే పిలవమని చెప్పిందంటూ తనపై జరుగుతున్న ట్రోలింగ్కు గట్టి సమాధానం ఇచ్చింది. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత) కుమార్ సాయి బిగ్బాస్ హౌస్లో అడుగు పెట్టిన మొట్ట మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు. ఎవరితోనూ కలవలేక, క్లారిటీ లేని సమాధానాలతో కన్ఫ్యూజన్ మాస్టర్గా నిలిచాడు. కొన్ని టాస్కుల్లో బాగా ఆడి కెప్టెన్ అయినప్పటికీ హౌస్లో ఉన్నానా? లేనా? అన్నట్టుగా ఉండటంతో అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. హౌస్లో కూడా ఇంటిసభ్యులు కుమార్ను తమలో ఒకరుగా ఫీల్ అవలేదు. దీంతో అతడు ఏకాకిగా మారిపోయాడు. చివరికి ఏడో వారంలో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ నాగార్జున స్క్రిప్ట్ చెప్పాలన్న కోరికకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సంతోషంగా వీడ్కోలు తీసుకున్నాడు. -
బిగ్బాస్: అరియానా, ఇంత అందంగా ఎట్లున్నవే
బిగ్బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లు సోహైల్, అరియానా పేర్లు చెప్పగానే అందరికీ టామ్ అండ్ జెర్రీ గుర్తొస్తుంది. వీళ్లు ఎంత కొట్టుకున్నా అది టామ్ అండ్ జెర్రీ ఫైట్లాగే కనిపించేది. కానీ గతవారంలో మాత్రం ఇద్దరూ బద్ధ శత్రువుల్లా మారి పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించారు. మాటల తూటాలు పేలుస్తూ ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లారు. వీళ్లను శాంతింపజేయడం ఎవరి తరమూ కాలేదు. చివరకు వీకెండ్లో నాగార్జున వీళ్ల పంచాయితీని పరిష్కరిస్తూ తలా రెండు మొట్టికాయలు వేశారు. దీంతో ఇద్దరూ ఒకరికి ఒకరు సారీ చెప్పుకుంటూ మళ్లీ కలిసిపోయారు. ఒకరినొకరు జెండూబామ్ అనుకున్నవాళ్లే బబుల్గమ్లా అతుక్కుపోయారు. కానీ ఏడిపించడం మాత్రం మానుకోలేదు. (చదవండి: అభి ఫ్యాన్స్ఫై పోలీసులకు మోనాల్ ఫిర్యాదు) నాకు పెట్టకుండా తింటున్నావా? తాజాగా బిగ్బాస్ అన్సీన్లో సోహైల్, అఖిల్ గార్డెన్ ఏరియాలో పడుకున్నారు. అరియానా కప్పులో ఏదో తినుకుంటూ వస్తోంది. ఇది చూసిన సోహైల్ నాకు పెట్టకుండానే తింటున్నావా? ఇదేనా దోస్తానా? అని భారీ డైలాగులు కొట్టాడు. దీంతో అరియానా అతడికి స్పూన్తో తినిపించింది. సరిగ్గా తినిపించట్లేదు, అవసరం లేదు, పో అని సోహైల్ హర్ట్ అవ్వడంతో నువ్వు జోక్ చేయొచ్చు, కానీ నేను చేయొద్దా అంటూ ఆమె అరిచేసింది. (చదవండి: మోనాల్ వెళ్లిపోయాక ఊపిరి ఆడలేదు: అఖిల్) 24 ఏళ్ల వయసులో పదహారేళ్ల పిల్లలా ఎలా? దీంతో తాను కూడా జోక్గా అన్నా అంటూ సోహైల్ ఆమెను బంగారుతల్లి అంటూ బుజ్జగించాడు. ఇంత అందంగా ఎట్లున్నావు? అంటూ పులిహోర కలిపాడు. సోహైల్లో ఈ కొత్త యాంగిల్ చూసిన అరియానా షాక్ తింది. ఈ వయసులో కూడా ఇంత అందంగా ఎలా ఉన్నావు? అని బిస్కెట్లు వేస్తూ ..32 ఏళ్లు ఉంటాయ్ కదా? అన్నాడు. అది నీకు అంటూ అరియానా పంచ్ వేసింది. నాకు 28 అని సోహైల్ చెప్పడంతో తనకు 24 అని అరియానా సమాధానమిచ్చింది. అయినా 24 ఏళ్ల వయసులో పదహారేళ్ల పిల్లలాగా ఎలా కన్పిస్తున్నావే.. అంటూ అడుగుతూనే ఉన్నాడు. దీంతో ఈ పులిహోర ఘాటు తట్టుకోలేక అరియానా ఇది మనకు సెట్టవ్వదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. (చదవండి: బిగ్బాస్: మాట మీద నిలబడ్డ దేవి నాగవల్లి) Day 103 Unseen 💥 Telegram ➡️ @biggboss4_unseen#BiggBossTelugu4 #BiggBoss4Telugu #BiggBossUNSEEN #Ariyana #Sohel pic.twitter.com/PIZdgmNjwC — BB4 Telugu UNSEEN (@BiggBoss4Unseen) December 19, 2020 -
పీఆర్ టీమ్ పెట్టుకుంటే సోహైల్ కథ వేరే ఉండేది
బిగ్బాస్ ఫైనలిస్టు హారిక చెప్పినట్లుగా పోరాటం ముగిసింది. అటు కంటెస్టెంట్లతో పాటు, వారిని గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసిన అభిమానుల పోరాటం ముగిసింది. దీని ఫలితం మాత్రం తేలాల్సి ఉంది. ఈసారి గత సీజన్ల కంటే భారీ స్థాయిలో ఓట్లు పడినట్లు తెలుస్తోంది. మరోపక్క నెట్టింట్లో అభిజితే విన్నర్ అన్న పేరు వినిపిస్తోంది. కానీ అది బిగ్బాస్ షో. అంచనాలు తారుమారు చేసేందుకు బిగ్బాస్కు ఓ క్షణం పట్టదు. గెలుపోటముల లెక్క రేపు నాగార్జున చూసుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే మాజీ కంటెస్టెంటు అలీ రెజా కాబోయే విజేత ఎవరనేది చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్రోఫీ కన్నా అదే ముఖ్యం "సోహైల్ నాకు 8 ఏళ్లుగా తెలుసు. అతడు నా తమ్ముడు లాంటి వాడు. తనేంటో ప్రూవ్ చేసుకుంటేనే సపోర్ట్ చేస్తానని ముందే చెప్పాను. రెండు మూడు వారాల్లోనే అతడేంటో నిరూపించుకున్నాడు. అప్పుడే అనుకున్నా, వీడు కచ్చితంగా టాప్ 5లో ఉంటాడని! కొందరు అతడు ముస్లిం కాబట్టి సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు. అది పూర్తిగా అబద్ధం. ఇలా మతాలను అడ్డు పెట్టుకుని నేను ఏ పనీ చేయను. అతడికే కాదు, గతంలోనూ ఎవరికీ మతపరంగా పక్షపాతం చూపించలేదు. సోహైల్ జెన్యూన్, చిన్న పిల్లాడి మనస్తత్వం. అవి చూశాకే మూడో వారం నుంచి అతడికి సపోర్ట్ చేయడం ప్రారంభించాను. అతడు షోకి వెళ్లేముందు కొన్ని సలహాలు ఇచ్చాను. ట్రోఫీ అందుకోవడం కన్నా ప్రత్యేకతను చాటుకోవడం ముఖ్యమని చెప్పాను. ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వు నీలాగే ఉండమని సూచించాను. అతడు అలాగే ఉన్నాడు కూడా! అందుకే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నామినేషన్లంటే భయపడొద్దన్నాను. ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంటేనే ప్రేక్షకులకు మనకు ఓట్లు వేసే అలవాటు పెరుగుతుంది" అని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఆ ఒక్కరికే రాహుల్ సిప్లిగంజ్సపోర్ట్!) అభిజిత్ వల్ల కాదు "కోపాన్ని జయించి తనను తాను ఎంతగానో మార్చుకున్న సోహైల్ ట్రోఫీ గెలిచేందుకు అన్ని విధాలా అర్హుడు. ఈసారి అమ్మాయి గెలిచేందుకు జీరో ఛాన్స్ ఉంది. సోషల్ మీడియా ప్రకారం అభిజిత్, సోహైల్ మధ్య గట్టి పోటీ ఉంది. కానీ సోహైల్ కూడా మంచి పీఆర్ టీమ్ను పెట్టుకుంటే ఫలితం మరోలా ఉండేది. అయితే అతడి కుటుంబానికి పీఆర్ టీమ్ పెట్టుకునేంత ఆర్థిక స్థోమత లేదు. కానీ ఇప్పటికీ సోహైల్ గెలిచేందుకు అవకాశాలున్నాయి. సోహైల్ వల్లే ఈ సీజన్ ముందుకు నడిచింది తప్ప అభిజిత్ వల్ల కాదు అని స్పష్టం చేశాడు. ఏదేమైనా తన దృష్టిలో సోహైల్ ఇప్పటికే గెలిచేశాడని అలీ రెజా పేర్కొన్నాడు. (చదవండి: బిగ్బాస్ గిఫ్ట్: బంగారం కొన్న గంగవ్వ) -
బిగ్బాస్: గంగవ్వ, సుజాతల కొట్లాట!
బిగ్బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్ల తలరాతను మార్చే గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమవుతోంది. ఈ టెన్షన్ నుంచి ఉపశమనం కల్పిస్తూ, చివరి సారి హౌస్లో సరదాగా గడిపేందుకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను లోనికి పంపించారు. వాళ్లను చూడటంతోనే ఫైనలిస్టుల కళ్లు ఆనందంతో మతాబుల్లా వెలిగిపోతున్నాయి. ఇప్పటికే మోనాల్, కల్యాణి, లాస్య, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేశారు. నేడు మిగతా కంటెస్టెంట్లు గంగవ్వ, నోయల్, సుజాత, అవినాష్, మెహబూబ్, దివి ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నారు. ఈ క్రమంలో నోయల్ తన ర్యాప్ సాంగ్తో ఫైనలిస్టుల్లో జోష్ను నింపాడు. ఇక మెహబూబ్ను చూడగానే సోహైల్ ఆనందంతో గంతులేశాడు. (చదవండి: నిద్ర పట్టడం లేదు అఖిల్.. నాక్కుడా మోనాల్!) అటు పక్క మెహబూబ్ మాత్రం దివితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ జోడీని చూసి ఇంటి సభ్యులు కూడా రెట్టించిన హుషారుతో స్టెప్పులేశారు. గంగవ్వ, సుజాతలు మాత్రం కాసేపు కొట్టుకున్నట్లుగా నటించి ఆ వెంటనే మాస్ సాంగ్కు ఇరగదీశారు. అవినాష్ తనకు దొరికిన కాసింత సమయంలో కూడా కామెడీని పండించి ఆకట్టుకున్నాడు. అభిని చూస్తూ బయట అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా లేదు, నెంబర్ అడుగుతున్నారు అని ఊరించి చివర్లో తన నెంబర్ అడుగుతున్నారని పంచ్ వేశాడు. అలాగే ఈ మధ్య మొహమాటం లేకుండా రెచ్చిపోయి మరీ పులిహోర కలుపుతున్న అఖిల్ గురించి మాట్లాడకుండా ఉండలేకపోయాడు. పులిహోర చేయాలంటే ముందుగా కావాల్సింది అఖిల్ అంటూ జోకులు పేలుస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఈ ప్రోమోలో సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి జాడ మాత్రం కనిపించలేదు. మరి వారు తర్వాతి ప్రోమోలో అయినా కనిపిస్తారో లేదో చూడాలి! (చదవండి: బిగ్బాస్: గంగవ్వకు కండల వీరుడు స్పెషల్ గిఫ్ట్) -
అతిథులు వీళ్లేనా బాస్?
బిగ్బాస్ సీజన్ 4 ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. రేపే గ్రాండ్ ఫినాలే. విజేత ఎవరో ప్రకటించే రోజు. ప్రతీ సీజన్ ఫైనల్ ఎపిసోడ్కి హోస్ట్తో పాటు ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్గా వస్తుంటారు. సీజన్ 3 ఫైనల్కి నాగార్జునతో కలసి చిరంజీవి సందడి చేశారు. ఈసారి నాగార్జునతో పాటు ఫైనల్లో సందడి చేయడానికి ‘లవ్స్టోరీ’ జంట రాబోతున్నారని తెలిసింది. నాగచైతన్య, సాయి పల్లవి ఈ సీజన్ ముఖ్య అతిథులుగా ఫైనల్ ఎపిసోడ్లో పాల్గొంటారట. ‘లవ్స్టోరీ’ సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరే కాకుండా పలువురు హీరోయిన్లు కూడా కనిపిస్తారట. లక్ష్మీ రాయ్, మెహరీన్లతో పాటు ఇంకొంతమంది హీరోయిన్ల స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటుందని తెలిసింది. ∙ -
‘బిగ్బాస్’లో గంగవ్వ.. అఖిలూ, ఓ అఖిలూ అంటూ..
మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ నాల్గో సీజన్ ముగిసిపోతుంది. అందుకే ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఇది గుర్తుండి పోయేలా ప్లాన్ చేస్తున్నాడు బిగ్ బాస్. గత రెండు ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల ప్రయాణాన్ని వారి కళ్లముందుంచిన బిగ్బాస్..నేడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకొచ్చి పాత జ్ఞాపకాలను గుర్తుచేశాడు. అందరితోనూ సరదాగా డాన్సులు చేయించాడు. చిలిపి ప్రశ్నలు అడిగించి ఇంటి కంటెస్టెంట్స్తో ఆడుకునేలా చేసాడు. మోనాల్, కరాటే కల్యాణి, లాస్య, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ ఇలా ఇలా చాలా మంది ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ మళ్లీ ఇంటికి వచ్చారు. ఇక హౌస్లో వారు చేసిన రచ్చ ఏంటో చదివేయండి బయట కథ వేరే ఉంటది : మోనాల్ ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా హౌస్లోకి ఎలిమినేట్ అయిన సభ్యులను తీసుకువచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటిస్తూ.. ఎంట్రీ ఇచ్చిన వారు కంటెస్టెంట్స్ని డైరెక్ట్గా కలవనీయకుండా వారిని ఒక అద్దాల గదిలో ఉంచారు. అద్దాల గదికి ఒక్క పక్క టాప్ 5 కంటెస్టెంట్స్.. మరో పక్క ఎలిమినేట్ అయిన సభ్యులు ఉన్నారు. మొదటగా లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన మోనాల్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా మ్యూజిక్ వినిపించగానే అఖిల్, సోహెల్ పరుగులు పెట్టి వచ్చారు. వారికి మోనాల్ కనిపించడంతో ఆనందంతో చిందులేశారు. అఖిల్ అయితే అడ్డుగా అద్దాలు ఉన్న సంగతి మర్చిపోయి మోనాల్కి హగ్లు, కిస్లు ఇచ్చాడు. ‘మూడు రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు అఖిల్.. ప్రతి రోజు 3-4 అవుతుంది’అని అఖిల్తో తన బాధను చెప్పుకోగా..‘ నువ్వు వెళ్లాక నాక్కూడా నిద్ర పట్టలేదు.. అసలు పడుకోలేదు’ అని మోనాల్తో చెప్పాడు. అభిజిత్ కూడా మోనాల్ని చూసి సూపర్ ఉన్నావ్ అంటూ ప్రశంసలు కురిపించాడు. బయట ఎలా ఉందని సోహైల్ అడగ్గా.. ఏ విషయం చెప్పకుండా అంతా సూపర్ అని సరిపెట్టేసింది. జనాలు నీ కోసం బయటకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంటూ సోహైల్కు మోనాల్ చెప్పడంతో ఆనందంతో గంతులు వేశాడు. ఆ తర్వాత అఖిల్ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుతూ గాల్లోకి బెలూన్లను ఎగురవేసింది. బెలూన్లు గాల్లోకి ఎగరగానే అఖిలే నంబర్ వన్ అని మోనాల్ గట్టిగా అరిచింది. ఆ తర్వాత అభిజిత్ ప్యూచర్ బాగుండాలంటూ, అరియానాతో ఫ్రెండ్ షిప్ పెరగాలని, సోహైల్ బిగ్బాస్ విజేత కావాలంటూ బెలూన్లను పైకి ఎగురవేసింది. బయటకు వచ్చాక అందరం కలిసి పార్టీ చేసుకుందాం అని సోహైల్ అనగా.. బయట కథ వేరే ఉందని, కలిసేందుకు టైమ్ కూడా దొరక్కట్లేదని మోనాల్ చెప్పుకొచ్చింది. చివరగా అఖిల్కి హగ్ ఇచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బిగ్బాస్లోకి ఇద్దరు వంటలక్కలు ఆ తర్వాత హరికథ చెబుతూ.. కల్యాణి ఎంట్రీ ఇచ్చింది. ఇంటి సభ్యులందరిని చూసి కంటతడి పెట్టింది. మీ అందరిని ఎంత మిస్ అయ్యానో.. మీరంతా బయటకు వచ్చగా చక్కటి వంటలు చేసి పెడతా అంటూ ఎమోషనల్ అయింది. మీరు ఇంటి నుంచి వెళ్లాక.. స్వీట్ చేయడమే లేదని అభిజిత్ అనగా.. బయటకు రాగానే అన్ని వంటలు చేసి పెడతా అని కల్యాణి చెప్పింది. కల్యాణి ఇలా మాట్లాడుతుండగానే లాస్య ఎంట్రీ ఇచ్చింది. లాస్యను చూసి ఇంటి సభ్యులంతా ఆనందంతో గట్టిగా అరిచేశారు. జున్ను ఎలా ఉన్నాడు? బయట ఏంటి పరిస్థితి?లాంటి ప్రశ్నలు వేసి ఉక్కిరిబిక్కిరి చేశారు. సోహైల్ అయితే ఇంట్లోకి ఇద్దరు వంటలక్కలు వచ్చారని పంచ్ వేశాడు. ఇక తనపై వంటలక్క 2.o అని మీమ్స్ వేస్తున్నారంటూ లాస్య తన బాధను పంచుకుంది. ఇక అభిజిత్ను చూస్తూ.. పాపం అభి.. తనతో టైమ్ స్పెండ్ చేయమని హారికను అడుక్కుంటున్నాడు అని అనగా.. లాస్యక్క నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నావా అని హారిక అలిగింది. అభి ఏమో.. ఎంత రిక్వెస్ట్ చేసినా తనతో స్పెండ్ చేస్తలేదని లాస్యకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా లాస్య ఎక్కువ సమయం తన క్లోజ్ ఫ్రెండ్స్ హారిక, అభిజిత్లతోనే గడిపింది. అందరి కంటే అఖిల్కే ఎక్కువ హగ్స్! ఇక లాస్య, కల్యాణి కలిసి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించారు. తాము ఒక్కొక్కరిని కొన్ని ప్రశ్నలు అడుతామని.. వరుసగా ముగ్గురు అవును(ఎస్) అని చెబితే.. ఆ కంటెస్టెంట్ ఐస్ వాటర్ ఒంటిపై పోసుకోవాలని కండీషన్ పెట్టారు. మొదటగా అఖిల్పై ప్రశ్నలు అడుగుతూ.. అఖిల్కు ఎక్కువ హగ్స్ లభించాయని భావిస్తున్నారా?, అఖిల్ అరియానాను కంటే హారికను ఎక్కువగా ఫ్లర్టింగ్ చేస్త్నున్నాడా?, అఖిల్ అభిజిత్ కంటే మంచి సింగర్ అవునా కాదా? అని అడగ్గా.. ఇంటి సభ్యులంతా ముక్తకంఠంతో అవునని సమాధానం ఇచ్చారు. అఖిల్కు 2021లో పెళ్లి అవుతుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం అంతా నో అని చెప్పారు. అరియానాకి అవినాష్ కంటే చింటే ఎక్కువ ఇష్టం ఇక అరియానాపై ప్రశ్నలు అడుగుతూ.. అరియానా ఇంట్లో తాను తెలివైనది అని భావిస్తోంది?, అరియానాకి అవినాష్ కంటే చింటు ఎక్కువ ఇష్టం?, అరియానా గొతు జలజ గొంతు కంటే భయంకరంగా ఉంటుంది? లాంటి ప్రశ్నలకు అంతా ఎస్ అని సమాధానం ఇచ్చారు. దీంతో అరియానా మూడుసార్లు ఐస్ నీళ్లు ఒంటిపై పోసుకుంది. ఇక సోహైల్ గురించి అడుతూ.. రాత్రి 9 గంటల తర్వాత సోహైల్ ఏ పని చేయడు. ఆయన మంచి బోల్డ్ డాన్సర్ అవుతాడు. సోహైల్ టూత్పేస్ట్ను ఫేస్ క్రీమ్గా వాడుతాడా లాంటి చిలిపి ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికి ఇంటి సభ్యులు అవుననే సమాధానం ఇచ్చారు.ఇక అభిజిత్ గురించి అడుతూ.. అభి వాళ్ల అమ్మ ఆయన కంటే ఫన్నీగా ఉంటారా? అభి ధరించే మోనాలి జాకెట్ ఆయన కంటే ఫేమస్ అని భావిస్తున్నారా? అని అడగ్గా.. అంతా ఎస్ అని సమాధానం ఇచ్చారు. ఈ గేమ్ అనంతరం లాస్య, కళ్యాణి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అఖిల్పై పగ తీర్చుకున్న కుమార్ సాయి ఆ తర్వాత కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులతో ఆడిపాడారు. ఇక కుమార్ సాయి అయితే తన పాత పగను అంతా తీర్చుకున్నాడు. అమ్మాయి అంటే హారికలా ఉండాలంటూనే ఆమెపై పంచ్లు వేశాడు. ‘అభిజిత్ను నామినేట్ చేస్తుంది మళ్లీ బాధపడుతోంది. నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా? టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేస్తుంది’అంటూ హారికను ఏడిపించాడు. ఆ తర్వాత అఖిల్ అంటే తనకు ఇష్టమని చెబుతూనే ‘నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర. ఇద్దరికి కరివేపాకు అంటే నచ్చదు’ అని మరోసారి కరిపేపాకు గొడవను గుర్తు చేశాడు. తర్వాత సొహైల్తో జరిగిన గొడవలో వేలు సెంటీ మీటర్ దిగింది.. సరిపోతుందా? అంటూ మళ్లీ పంచ్ వేశాడు. అనంతరం ఇంటి సభ్యులతో కలిసి డాన్స్ వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత అఖిలు.. ఓ అఖిలు.. అంటూ గంగవ్వ ఎంట్రీ ఇచ్చింది. గంగవ్వ వాయిస్ విని ఇంటి సభ్యులంతా గార్డెన్ ఏరియాలోకి పరుగులు తీశారు. మరి బిగ్బాస్ హౌస్లో గంగవ్వ చేసిన సందడి ఏంటో రేపటి ఎపిసోడ్లో చదివేద్దాం. -
బిగ్బాస్ : అఖిల్పై పగ తీర్చుకున్న కుమార్ సాయి
బిగ్ బాస్ నాల్గో సీజన్లోకి మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కుమార్ సాయి అనూహ్యంగా ఆరోవారంలో ఎలిమినేట్ అయ్యాడు. మోనాల్ కోసమే కుమార్ సాయిని బలి చేశారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఒక ఎలిమినేట్ అయినప్పటికీ కుమార్ సాయికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాల్గో సీజన్ మొత్తంలో ‘మంచోడు’ అని పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కుమార్ అనే చెప్పాలి. బిగ్బాస్ హౌస్లో ఉన్నన్ని రోజులు ఒంటరిగానే ఆతను గేమ్ ఆడాడు. ఇంటి సభ్యులంతా అతన్ని వేరుగా చూసినా.. ఆయన మాత్రం ఎవరిపైనా కోపం కానీ ద్వేషం కానీ ప్రదర్శించలేదు. ఎలిమినేట్ అయిన రోజు కూడా ఈ ‘మంచోడు’ని హౌస్మేట్స్ సరిగా సాగపంపలేదు. ముఖ్యంగా ‘కరివేపాకు’ గొడవను ఇప్పటికీ మర్చిపోలేదు. లిమినేషన్ ఎపిసోడ్లో.. నాగార్జున వెజిటబుల్స్ ఇచ్చి ఇది ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని అడగడంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కర్నీ ఒక్కో విజిటబుల్తో చక్కని పోలిక ఇచ్చాడు. అందులో భాగంగా అఖిల్ని కరివేపాకుతో పోల్చుతూ.. పాజిటివ్గా మాట్లాడాడు. కానీ దీన్ని నెగిటివ్గా తీసుకున్న అఖిల్.. ‘మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో’ అంటూ తన యాటిట్యూట్ చూపించాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి.. ఇంత దారుణంగా హేళన చేస్తారా? అని అప్పట్లో అఖిల్ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే...అఖిల్పై ఉన్న పగను కుమార్ సాయి తీర్చుకున్నాడు. రీ యూనియన్లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి హౌస్కి వస్తుండగా.. కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చి నవ్వుతూనే అఖిల్, హారికపై ఉన్న పగను తీర్చుకున్నాడు. సిల్లీ రీజన్స్తో తనను నామినేట్ చేసిన హారికను..‘నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా? టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పావ్’అని తన మనసులో ఉన్న పగను తీర్చుకున్నాడు. ఆ తర్వాత సొహైల్తో జరిగిన గొడవలో వేలు సింటీ మీటర్ దిగింది.. సరిపోతుందా? అంటూ మళ్లీ పంచ్ వేశాడు. ఇక అఖిల్ని‘నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర’ అంటూ పులిహోరా రాజాకి గట్టిగానే ఇచ్చేశాడు. అయితే ఇవన్ని ఇంటి సభ్యులు సరదాగానే తీసుకున్నట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇంకా కుమార్ సాయి ఎవరెవరిపై పంచ్లో వేశాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్బాస్: మోనాల్.. అఖిల్కి ముద్దులే ముద్దులు
బిగ్బాస్ తెలుగు నాల్గో సీజన్ మరో రెండు మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో ఉన్న రెండు రోజుల్ని మరింత ఎంటర్టైన్గా మార్చేందుకు సిద్దమయ్యారు బిగ్బాస్ నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రతి సీజన్ మాదిరే ఈ సారి కూడా హౌస్లోకి ఎలిమినేట్ అయిన సభ్యులను తీసుకువచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటిస్తూ.. ఎంట్రీ ఇచ్చిన వారు కంటెస్టెంట్స్ని డైరెక్ట్గా కలవనీయకుండా వారిని ఒక అద్దాల గదిలో ఉంచారు. అద్దాల గదికి ఒక్క పక్క టాప్ 5 కంటెస్టెంట్స్.. మరో పక్క ఎలిమినేట్ అయిన సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా మ్యూజిక్ వినిపించగానే అఖిల్, సోహెల్ పరుగులు పెట్టి వచ్చారు. వారికి మోనాల్ కనిపించడంతో ఆనందంతో చిందులేశారు. అఖిల్ అయితే అడ్డుగా అద్దాలు ఉన్న సంగతి మర్చిపోయి మోనాల్కి హగ్లు, కిస్లు ఇచ్చాడు. ఇక మోనాల్ అయితే అఖిల్ని డైరెక్ట్గా కలవలేకపోవడంతో కాస్త బాధపడింది. కలవాలని ఉన్నా..అద్దం ఓన్లీ ప్రాబ్లెంగా ఉంది అంటూ తెగ ఫీలలైపోయింది. చైర్ వేసుకొని అద్దాల గోడ దూకి రా అని సోహైల్ సలహా ఇవ్వగా.. నో..నో అంటూ మోనాల్ అక్కడే నిలబడింది. అయితే ఈ సారి ఈ నర్మద కంటతడి పెట్టకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని పసిగట్టిన సోహైల్..బిగ్బాస్ ఇంటిలో 9వ వండర్ ఏమిటో తెలుసా? నువ్వు ఏడవకపోవడమే అంటూ పంచ్ వేశాడు. ఆతర్వాత కరాటే కల్యాణి ఇంటిలోకి హుషారుగా ప్రవేశించింది. అనంతరం లాస్య ఇంట్లోకి మళ్లీ అడుగుపెట్టింది. దాంతో వంటలక్కలిద్దరూ వచ్చారు అంటూ సోహెల్ గట్టిగా అరిచాడు. జనాలు నీ కోసం బయటకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంటూ సోహైల్కు మోనాల్ చెప్పడంతో ఆనందంతో గంతులు వేశాడు. ఇక లాస్య ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించింది. అఖిల్కు ఎక్కువ హగ్స్ లభించాయని భావిస్తున్నారా అని ఇంటి సభ్యులను అడగ్గా..ఎక్కువ మంది అవును అంటూ చెప్పడంతో అఖిల్ నో నో అంటూ ఎగిరి గంతులు వేశాడు. అరియానా గొంతు జలజ(దెయ్యం) కంటే భయంకరంగా ఉందా అంటే అందరు అవునని సమాధానమిచ్చారు. అలాగే అభిజిత్ ఇంటిలోనే డ్యాన్స్ నేర్చుకొన్నాడని భావిస్తున్నారా అని అడగ్గా.. అవును అందరూ అన్నారు. దాంతో అభిజిత్కు అంతకు ముందు డ్యాన్స్ రాదని మీ ఉద్దేశమా అని లాస్య ప్రశ్నించగా.. అందులో డౌటా? బాండ్ పేపర్ మీద రాసిస్తా అంటూ అఖిల్ అన్నాడు. గంగవ్వ, కుమార్ సాయి, నోయల్, జోర్దార్ సుజాత, దివి, మెహబూబ్, అవినాష్లు ఈ ప్రోమోలో కనిపించారు. -
బిగ్బాస్: గంగవ్వకు మెహబూబ్ స్పెషల్ గిఫ్ట్
బిగ్బాస్ హౌస్లో కోపం, ప్రేమ, ద్వేషం, గొడవలు,అలకలు, మనస్పర్థలు అన్నీ ఉంటాయి. ఒక్కో కంటెస్టెంట్స్ కొట్టుకునే రేంజ్లో గొడవ పడతారు కూడా. అయితే ఈ గొడవలు, కోపాలు కేవలం ఆటలో మాత్రమే ఉంటాయి. తర్వాత అంతా ఒక్కటైపోతారు.హౌస్లో శత్రువుల్లా మారినవారు సైతంబయటకు వచ్చాక మిత్రులైపోతారు. ఇది గత మూడు సీజన్లలో చూస్తూ వచ్చాం. బిగ్ బాస్ లో గోడవలు ఎన్ని జరిగినా కూడా ఎక్కడో ఒక చోట కంటెస్టెంట్స్ మధ్య స్నేహ భావం అనేది ఉంటుంది.ఇక బిగ్బాస్ నాల్గో సీజన్లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన సభ్యులంతా బయట కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇంటికెళ్లి కలుస్తున్నారు. గంగవ్వ ఇంటికి జోర్దార్ సుజాత వెళ్లి పలకరించింది. అలాగే లాస్య, నోయల్ కలిశారు. ఇలా ప్రతి కంటెస్టెంట్ మిగిలిన వారందరిని కలుసుకుంటు స్పెషల్ గా పార్టీలు కూడా చేసుకుంటున్నారు. ఇక తాజాగా కండల వీరుడు మెహబూబ్ దిల్సే గంగవ్వతో పాటు జోర్దార్ సుజాతను ప్రత్యేకంగా ఇంటికి పిలిచాడు. మెహబూబ్ వారితో బిగ్బాస్కు సంబంధించిన సంగతులను గుర్తు చేసుకుంటూ సరదాగా నవ్వించాడు. తన ఇంట్లో వారిద్దరికీ స్పెషల్ గా వంట చేసి పెట్టాడు. ఆ తర్వాత బిగ్బాస్ పెట్టినట్లు వీరిద్దరికి ఒక గేమ్ పెట్టాడు మెహబూబ్. అద్దం లేకుండా మేకప్ వేసుకోవాలని సుజాత, గంగవ్వకు పోటీ పెట్టాడు. అందులో గంగవ్వ తనదైన శైలీలో మేకప్ వేసుకొని నవ్వులు పూయించింది. ఇక చివర్లో గంగవ్వకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు మెహబూబ్. ఆమె కోసం 25 తులాల పట్టీలను అందించారు. గంగవ్వ బిగ్బాస్ హౌస్లో ఉన్నప్పుడు పట్టీల స్టోరీ చెప్పింది. అప్పట్లో పొలం పని చేసేటప్పుడు పట్టీలు తీసి ఒక కుండలో దాచగా, ఆమె భర్తే తాగుడుకు అలవాటు పడి అమ్ముకున్నట్లు చెప్పింది. ఇక అప్పటి నుంచి కాళ్లకు పట్టీలు లేకుండానే ఉంటున్నానని ఒక సందర్భంలో చెప్పింది. అది గుర్తుపెట్టుకున్న మెహబూబ్.. బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పట్టీలను కానుకగా ఇచ్చి గంగవ్వను సర్ప్రైజ్ చేశాడు. మెహబూబ్ ఇచ్చిన గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోయిన గంగవ్వ ఎమోషనల్ అయింది. మోహబూబ్ను దగ్గరికి పిలిచి హగ్ చేసుకుంది. ఇక మెహబూబ్, సుజాతకు స్వీట్స్ ప్రజెంట్ చేశాడు. -
నిజంగానే దివి బ్యూటీ విత్ బలం కూడా
సాక్షి, హైదరాబాద్: బిగ్బాస్ సిజన్ 4 గ్రాండ్ ఫినాలేకు సిద్దమవుతోంది. ఈ సిజన్ ట్రోఫీ గెలుచుకునేది ఎవరా అని బిగ్బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురూచుస్తున్నారు. ఈ క్రమంలో హౌజ్ నుంచి వెళ్లిపోయిన మెహబూబ్ దిల్సే, దివిలకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ఇందులో దివి మహబూబ్ను ఎత్తుకుని ఫొటోలకు ఫొజిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెహబుబ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా గురువారం షేర్ చేశాడు. (చదవండి: సీరియల్స్లో అవకాశాలు, కానీ.. : దివి) వీటిని ‘బ్యూటీ విత్ బ్రెయిన్ యే కాదు.. బ్యూటీ విత్ బలం కూడా’ అంటూ మెహబూబ్ పోస్టు చేశాడు. అయితే హౌజ్లోని మగవారందరిలో మహబుబ్ కండలవీరుడన్న సంగతి తెలిసిందే. ఫిజికల్ లాస్క్లు వస్తే చాలు అందరూ మహబూబ్ను చూసి దడుచుకునే వారు. అలాంటి మెహబూబ్ను దివి అలవోకగా ఎత్తుకోవడమే కాక ఎంచక్కా ఫొటోలకు ఫొజులు ఇవ్వడం చూసి నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. దీంతో ‘నిజంగానే దివి బ్యూటీ విత్ బలం’ అంటూ ప్రశంసిస్తున్నారు. (చదవండి: బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే: స్టార్ హీరో ఫిక్స్!) View this post on Instagram A post shared by Mehaboob Shaikh 👑 (@mehaboobdilse) -
నా పోరాటం ముగిసింది: హారిక
ఇప్పటివరకు ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని టాప్ 5కు చేరుకున్న కంటెస్టెంట్లను సంతృప్తి పరిచేందుకు బిగ్బాస్ వారి జర్నీ వీడియోలను చూపించారు. ఈ ప్రయాణాన్ని తనివితీరా వీక్షించిన ఫైనలిస్టులు వారి భయాందోళనలను మర్చిపోయి మనసు తేలిక చేసుకున్నారు. బిగ్బాస్ తమకు ఎంతో గుర్తింపునిచ్చిందని సంతోషంగా ఫీలయ్యారు. మరి ఈ సందర్భంగా బిగ్బాస్ ఎవరికి ఏమేం చెప్పాడో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి.. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా.. నిన్న అఖిల్, అభిజిత్ ప్రయాణాన్ని చూపించిన బిగ్బాస్ నేడు మరో ముగ్గురి జర్నీ వీడియోలను ప్రదర్శించారు. ముందుగా గార్డెన్ ఏరియాలోకి వచ్చిన హారికను... ఈ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచారని, ఎవరి సపోర్ట్ లేకపోయినా పట్టుదల, మొండిదలతో ఇక్కడివరకు వచ్చారని బిగ్బాస్ అభినందించాడు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అన్న వాక్యాన్ని నిజం చేస్తూ ఫైనలిస్టుగా నిలిచారని చెప్తూ జర్నీ వీడియో చూపించారు. ఇందులో అభిజిత్తో కలిసున్న క్షణాలను చూపించడంతో హారిక సంతోషపడింది. (చదవండి:ఓటింగ్లో అభిజిత్ను దాటేసిన అరియానా!) నిద్ర లేని రాత్రిళ్లు గడిపాను అలాగే తను చేసిన అల్లరి, టాస్కులను అన్నింటినీ చూపించడంతో భావోద్వేగానికి లోనైంది. మిక్చర్ పొట్లంలా అన్ని ఎమోషన్స్ కలగలపి ఉన్న తన జర్నీ చూసి ఈ బిగ్బాస్ ప్రయాణం తనకు గొప్ప అనుభవమని చెప్పుకొచ్చింది. ఎన్నో రోజులు నిద్ర లేని రాత్రిళ్లు గడిపానని, కానీ ఈ జర్నీ చూడగానే ఆ కష్టమంతా ఎగిరిపోయిందని పేర్కొంది. రేపు తను ఉన్నా లేకపోయినా తన జీవితాన్ని తెరిచి చూస్తే అందులో బిగ్బాస్ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని తెలిపింది. అయితే తనకు సంతృప్తినిచ్చిన బిగ్బాస్ షోలో తన పోరాటం ఇక్కడితో ముగిసిందని చెప్పడం ఆమె అభిమానులకు రుచించడం లేదు. (చదవండి:బిగ్బాస్: రీయూనియన్ పార్టీ ఉంటుందా?) నా సినిమాకు 20 మంది కూడా ఉండరు తర్వాత సోహైల్ వెళ్లగా.. మీరు అన్ని భావోద్వేగాలను చూపించారని బిగ్బాస్ తెలిపాడు. స్నేహం అనే పదానికి కొత్త అర్థాన్ని సృష్టించారని మెచ్చుకున్నాడు. ఆట పట్ల అతడికి ఉన్న ధ్యాస, తాపత్రయానికి బిగ్బాస్ సెల్యూట్ చేశాడు. మీ శ్రమ, ప్రతిభ ఊరికే పోదని, ఇకపై మీ కథ వేరేలా ఉంటుందని సోహైల్ డైలాగ్ను అతడికే అప్పజెప్పాడు. అనంతరం అతడి జర్నీ వీడియోను చూపించగా... అందులో బాధ, కోపం, స్నేహం, ప్రేమ అన్నింటినీ చూపించడంతో సోహైల్ కంటతడి పెట్టుకున్నాడు. నా సినిమాకు నేనే టికెట్టు కొనుక్కునేవాడిని. నా సినిమాకు 20 మంది కూడా రాలేదని హేళన చేసేవారు. కానీ ఇప్పుడు నన్ను బిగ్బాస్లో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. రేపు నేను సినిమా చేస్తే ప్రేక్షకులు హిట్ కొడతారని ఆశిస్తున్నా. పది సంవత్సరాల కష్టానికి ప్రతిఫలం 105 రోజుల్లో ఇచ్చారన్నాడు. ట్రోఫీ రాకపోయినా మనసుకు సంతోషాన్నిచ్చారు, అది చాలంటూ ఉప్పొంగిపోయాడు. అనంతరం తన స్నేహితులు మెహబూబ్, అఖిల్ ఉన్న ఫొటోలతో పాటు తన సింగిల్ ఫొటోను తీసుకుని లోపలకు వెళ్లాడు. అరియానా.. షైనింగ్ స్టార్ తర్వాత వచ్చిన అరియానాను ఉద్దేశించి బిగ్బాస్ మీరొక సంచలనం అని పేర్కొన్నాడు. సొంత నియమాలతో సొంత ఆటను ఆడారని, కానీ కొన్నిసార్లు ఒంటరయ్యారని గుర్తు చేశాడు. అందరి గురి మీమీదే ఉన్నా ధైర్యంగా ముందుకు సాగారని మెచ్చుకుంటూ ఆమెను షైనింగ్ స్టార్గా అభివర్ణించాడు. అనంతరం ఆమె జర్నీ చూపించడంతో అరియానా ఎమోషనల్ అయంది. సమాజంలో తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చారని ధన్యవాదాలు తెలిపింది. అనంతరం అవినాష్ తనకు తినిపించిన ఫొటోతో పాటు బిగ్బాస్ ఇచ్చిన చింటూ బొమ్మను హత్తుకున్న ఫొటోను తీసుకుంది. (చదవండి: ఆరేళ్లు రిలేషన్షిప్, డిప్రెషన్లోకి వెళ్లిపోయా) -
బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే: స్టార్ హీరో ఫిక్స్!
బిగ్బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ కోసం పంతొమ్మిది మంది పోరాడారు. చివరికి ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. హారిక, అరియానా, సోహైల్, అభిజిత్, అఖిల్.. ఎవరికి వారు విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉన్నారు. మరో మూడు రోజుల్లో గెలుపోటములుఖరారు కానున్నాయి. మరి డిసెంబర్ 20న అంగరంగ వైభవంగా జరగనున్న గ్రాండ్ ఫినాలేను ఇంతకు ముందెన్నడూ లేనంత గ్రాండ్గా ఏర్పాటు చేసేందుకు బిగ్బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా విజేతను ప్రకటించేందుకు స్టార్ హీరోను తీసుకురావడంతో పాటు, అందమైన భామలతో డ్యాన్సులు చేయించనున్నారు. ఇప్పటికే స్పెషల్ గెస్ట్ను రప్పించేందుకు బిగ్బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. (చదవండి: అభిజిత్ బిగ్బాస్కే గర్వకారణం) రంగంలోకి హీరోయిన్లు ఈ క్రమంలో మొదటి సీజన్కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా వచ్చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే తాజాగా అందుతున్న సమచారం ప్రకారం గత సీజన్లో గ్రాండ్ ఫినాలేకు వచ్చి రాహుల్ సిప్లిగంజ్ను విజేతగా ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవే మరోసారి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆచార్య షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన ఈ ఆదివారం మాత్రం బిగ్బాస్కు కేటాయించారట. అలాగే ఈ ఫినాలే ఎపిసోడ్ను డ్యాన్సులతో హోరెత్తించేందుకు లక్ష్మీరాయ్, మెహరీన్ వంటి హీరోయిన్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. వీరికి తోడుగా మరో హీరోయిన్ మోనాల్ ఉండనే ఉంది. అలాగే ఎలిమినేట్ అయిన బిగ్బాస్ కంటెస్టెంట్లు అందరూ కలిసి డ్యాన్సులతో సందడి చేయనున్నారు. (చదవండి: మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?) మరోసారి చిరంజీవి కాగా జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మొదటి సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కు స్పెషల్ గెస్టుల ఎవరూ రాలేదు. ఆయనే శివబాలాజీని విజేతగా ప్రకటిస్తూ అతడికి చెక్కునందించారు. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్లో మాత్రం విక్టరీ వెంకటేష్ వచ్చి కౌశల్ మండాకు ట్రోఫీని అందించారు. కింగ్ నాగార్జున హోస్ట్గా ఉన్న మూడో సీజన్లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా విచ్చేసి రాహుల్ సిప్లిగంజ్ను విన్నర్గా ప్రకటిస్తూ ఆ ఎపిసోడ్ను మెగా సక్సెస్ చేశారు. నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్కు18.29 టీఆర్పీ రాగా మెగాస్టార్ ప్రత్యక్షమైన చివరి గంటలో మాత్రం 22.4 టీఆర్పీ వచ్చింది. మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునే ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే! (చదవండి: ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) -
బిగ్బాస్ చెక్కుతో బంగారం కొన్న గంగవ్వ
బిగ్బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లలో మోస్ట్ ఎట్రాక్షన్ పర్సన్ ఎవరయా అంటే అది గంగవ్వ మాత్రమే! ఈ వయసులో అవ్వ ఏం చేయగలదు అనుకునేవాళ్లకు ఆమె జర్నీ చెంపెట్టు సమాధానం. ఆమె హుషారును ఎవరూ అందుకోలేకపోయారు. ఆమె కామెడీని ఎవరూ బీట్ చేయలేకపోయారు. ఆమె పంచ్లకు రివర్స్ పంచ్ అనేదే లేకుండా పోయింది. కల్మషం లేని మనసుతో ముసుగు లేకుండా ఆడిన గంగవ్వకు పిల్లల నుంచి పెద్దల వరకు అంతా అభిమానులే. దేశవిదేశాల్లో ఉన్న ఎంతోమంది తెలుగువాళ్లు కేవలం అవ్వ కోసమే బిగ్బాస్ షో చూసేవారు. (చదవండి: ఇల్లు కోసం పైసలత్తయంటే పోయిన..) గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని నాగ్ హామీ అంతటి ఆదరణ పొందిన ఈ యూట్యూబ్ స్టార్ కొత్తిల్లు కట్టుకోవాలన్న ఆశయంతో బిగ్బాస్ హౌస్లో అడుగు పెట్టింది. తన కలుపుగోలుతనంతో అందరితో ఇట్టే కలిసిపోయింది. అందరి మీద ఉన్న చనువుతో వారిపై సరదాగా పంచులేస్తూ, వాళ్లతో కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంతగానో అలరించింది. కానీ అనారోగ్య కారణాల వల్ల అయిదో వారంలోనే హౌస్ నుంచి నిష్క్రమించింది. ఆమె కల కలగానే మిగిలిపోకూడదన్న భావనతో నాగార్జున తన చెల్లెలికి మంచి ఇల్లు కట్టిస్తానని ఆ బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. ఈ మాటలతో ఆమె మనసు ఖుషీ అయింది. గుండె నిండా ఆనందంతో ఇంటి నుంచి వీడ్కోలు తీసుకుంది. (చదవండి: బిగ్బాస్: లక్ష రూపాయలు పట్టేసిన గంగవ్వ) ఫ్యాషన్ షోలో రూ.లక్ష గెలుచుకున్న అవ్వ అయితే హౌస్లో అవ్వ ఓ స్పెషల్ టాస్క్ గెలిచింది. చందన బ్రదర్స్ ఫ్యాషన్ షోలో అమ్మాయిలు, అబ్బాయిలు ర్యాంప్ వాక్పై నడిచారు. ఇందులో అబ్బాయిలు గంగవ్వను విజేతగా ప్రకటించారు. ఆమెకు లక్ష రూపాయల గిఫ్ట్ వోచర్ అందించారు. ఆ చెక్కుతో బంగారం కొనాలా? బట్టలు కొనాలా? అన్న సందిగ్ధంలో ఊగిసలాడిన అవ్వ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. బంగారం కొనుగోలు చేసేందుకు తాజాగా హైదరాబాద్కు వచ్చింది. లక్ష రూపాయల చెక్కుతో రెండు తులాల బంగారం కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు వీడియోను అవ్వ తన ఛానల్లో పోస్ట్ చేసింది. అలాగే త్వరలోనే గంగవ్వ తన ఇంటి నిర్మాణం వీడియోను కూడా వదలనున్నట్లు తెలుస్తోంది. (చదవండి: నా గుండె తట్టుకుంట లేదు: ఏడ్చేసిన గంగవ్వ) -
బిగ్బాస్ తర్వాత మీ కథ వేరే ఉంటది!
బిగ్బాస్ నాల్గో సీజన్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఈ క్రమంలో బిగ్బాస్ కంటెస్టెంట్ల ప్రయాణాన్ని వారి కళ్లముందుంచుతూ ఎమోషనల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే అఖిల్, అభిజిత్ వారి జర్నీ వీడియోలు చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. విన్నర్ అయ్యేది తానేనంటూ విశ్వాసం కనబరిచాడు. తర్వాత అభిజిత్ మాట్లాడుతూ.. బిగ్బాస్కు రావడమే తను తీసుకున్న గొప్ప నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. అటు బిగ్బాస్ కూడా అభి లాంటి తెలివైన కంటెస్టెంటు హౌస్లో ఉండటం బిగ్బాస్కే గర్వకారణం అని చెప్పడం విశేషం. అయితే వీరి ఇద్దరి వీడియోలలో మోనాల్ ఆకర్షణగా నిలిచింది. అంటే బిగ్బాస్ ఎడిటర్లు ట్రయాంగిల్ స్టోరీ మీదనే పెద్దగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అభిజిత్ జర్నీ వీడియోలో హారికతో గడిపిన క్షణాలు తక్కువగా చూపించారు. నోయల్, లాస్యలకు కూడా పెద్దగా స్థానాన్ని కల్పించలేదు. దీంతో మిస్టర్ కూల్ అభిమానులు కొంత నిరుత్సాహానికి లోనయ్యారు. (చదవండి: ఆ పాట పాడుతూ ప్రపోజ్ చేయాలి: మోనాల్) నేడు మిగిలిన ముగ్గురికి బిగ్బాస్ హౌస్లో వారి మజిలీని చూపించనున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచే ఆమె ఒక సంచలనం అంటూ బిగ్బాస్ అరియానాను ప్రశంసించాడు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అన్న వాక్యాన్ని నిజం చేస్తూ హారిక ఫైనలిస్టుగా నిలిచిందని ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మీరు పడ్డ ప్రతిభ, శ్రమకు ఇకపై మీ కథ వేరేలా ఉంటుందంటూ సోహైల్ను పొగిడాడు. ఓవైపు 100 రోజుల జర్నీ, మరోవైపు బిగ్బాస్ చూపిస్తున్న ప్రేమతో ఇంటి సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి మధుర క్షణాలు మళ్లీ మళ్లీ రావని తలుచుకుని లోలోపలే కొంత బాధపడుతున్నా పైకి మాత్రం ఆనంద భాష్పాలు కారుస్తున్నారు. వీరి సంతోషాన్ని, జర్నీ వీడియోను వీక్షించాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: బిగ్బాస్: నెట్టింట అభి, హారిక ఫ్యాన్స్ ఫైట్) -
తప్పకుండా విన్నర్ అవుతా: అఖిల్ కాన్ఫిడెన్స్
ప్రేమ పాఠాలు, గుణ పాఠాలు, కథలు, వ్యథలు, పోరాటాలు, ఆరాటాలు, బాధలు, బంధాలు, కలయికలు, విడిపోవడాలు, ఆటపాటలు, అడ్డంకులు.. ఇలా అన్నీ కలగలిపితేనే అది బిగ్బాస్ రియాలిటీ షో. తెలుగులో ప్రస్తుతం నడుస్తున్న నాల్గవ సీజన్కు నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ సందర్భంగా బిగ్బాస్ టాప్ 5 కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా పిలుస్తూ వారి వంద రోజుల ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. నేడు అఖిల్, అభిజిత్ వారి ప్రయాణాన్ని తరిచి చూసుకుని ఆనందంతో గాల్లో తేలుతున్నారు. మరి ఈ జర్నీ గురించి వాళ్లేమన్నారో తెలియాలంటే ఇది చదివేయండి.. ప్రేక్షకుల ప్రేమ చాలు.. బిగ్బాస్ హౌస్లో ఇప్పటివరకు ఆడించిన టాస్కులకు సంబంధించి అన్ని వస్తువులను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశాడు. ముందుగా అఖిల్ను పిలిచి అతడి జర్నీ వీడియో ప్లే చేశారు. ఇందులో మోనాల్తో ఆటపాటలు, అభితో గొడవలు, సోహైల్ త్యాగాలు అన్నీ చూపించడంతో అఖిల్ కంటతడి పెట్టుకున్నాడు. తను ఎఫర్ట్స్ పెట్టి ఆడానని అఖిల్ మరోసారి స్పష్టం చేశాడు. గెలుపోటములు తన చేతిలో లేవని, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పటికీ మానుకోలేదని చెప్పాడు. తోడు కోసం పరితపించాను కానీ ప్రేక్షకుల ఓట్ల రూపంలో అంత ప్రేమ వచ్చినప్పుడు ఇంకా ప్రేమ కావాలనుకోవడం ఫూలిష్నెస్ అనిపిస్తోందన్నాడు. తనకీ ప్రేక్షకుల ప్రేమ చాలు అంటూ మోకాళ్లపై మోకరిల్లి ఓట్లేసిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. బిగ్బాస్ వల్ల తనేంటో తనకు తెలిసిందని, తప్పకుండా విన్నర్ అవుతానన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అనంతరం బాల్కనీలో ఉన్న తన ఫొటోను తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. (అభి ఫ్యాన్స్ఫై పోలీసులకు మోనాల్ ఫిర్యాదు) ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించావు అనంతరం అభిజిత్ గార్డెన్ ఏరియాలోకి వెళ్లి తనకు పేరు తెచ్చిన రోబో టాస్క్లోని వస్తువులను తనివితీరా చూసుకున్నాడు. బిగ్బాస్ అతడికి "మెచ్యూర్డ్ మ్యాన్ ఆఫ్ ద హౌస్" బిరుదునిచ్చాడు. నీ కంటే ఎక్కువగా వేరేవాళ్లకోసం ఆలోచించావని అభిని మెచ్చుకున్నాడు. ఇలాంటి పరిపక్వత చెందిన తెలివైన కంటెస్టెంటు హౌస్లో ఉన్నందుకు గర్వపడుతున్నానని బిగ్బాస్ చెప్పాడు. దీంతో అభి చేతులెత్తి నమస్కరిస్తూ.. నేను బిగ్బాస్కు రావడం అనేది నా జీవితంలోనే సరైన నిర్ణయం అని భావిస్తున్నాను అని తెలిపాడు. అనంతరం అతడికి జర్నీ వీడియో చూపించగా దాన్ని చూసి అభి మైమరిచిపోయాడు. (ఓటింగ్లో అభిజిత్ను దాటేసిన అరియానా!) నేనంటే నీకిష్టం లేదా? ఆ వీడియోలో అభి మోనాల్తో పెట్టిన కబుర్లనే ఎక్కువగా చూపించారు. అందులో 'నీకు నేనంటే ఇష్టం లేదా?' అని అభి మోనాల్ను ప్రశ్నించాడు. అప్పుడు దానికి మోనాల్ సమాధానం చెప్పకపోయినా తర్వాత మాత్రం 'ఐ లైక్ యూ' అని చెప్పింది. కానీ తర్వాత మారిన పరిస్థితుల వల్ల ఆమెతో దూరం కావడం, అఖిల్తో గొడవలు, నామినేషన్లు అన్నింటినీ చూపించారు. హారిక అతడికి తోడుగా నిలిచిన సందర్భాలను సైతం గుర్తు చేశారు. ఇవన్నీ చూసి చలించిపోయిన అభి ఎంతో సంతోషించాడు. తర్వాత తన ఫొటోను తీసుకుని లోపలకు వెళ్లాడు. రేపటి ఎపిసోడ్లో మిగతా ముగ్గురి జర్నీలు చూపించనున్నారు. (ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) -
కృష్ణుడిలాంటి భర్త కావాలి: మోనాల్
గుజరాతీ భామ మోనాల్ గజ్జర్ ఈ మధ్యే బిగ్బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. అలా బయటకు వచ్చిందో లేదో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా మారింది. ఈ క్రమంలో సాక్షి గరం గరం వార్తలులో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాలను పంచుకుంది. నాగార్జున గారితో సినిమా చేయాలనుందన్న కోరికను బయటపెట్టింది. తనకో మంచి ఆఫర్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. తనకు తెలుగు ప్రాబ్లమ్ ఉంది కానీ తెలివి ప్రాబ్లమ్ లేదని చెప్పింది. ఎప్పటికైనా హైదరాబాద్లో ఇల్లు కొంటానంటోంది. మరి మోనాల్ ఇంకా ఏమేం ముచ్చటించిందో ఆమె మాటల్లోనే.. సంతోషమొచ్చినా, బాధేసినా ఏడుస్తాను. పైగా బిగ్బాస్ హౌస్లో చాలా ఒత్తిడి ఉండేది. నాకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మొదటి వారం ఎలిమినేషన్ నుంచే దివితో అపార్థాలు మొదలయ్యాయి. భాషా సమస్య క్లియర్ చేసుకుందామనుకున్న ప్రతిసారి అవి మరింత పెరిగేవి. అందుకే నన్ను తప్పుపడుతున్నా కూడా నేను ఏం స్పందించకుండా ఉండాలని నిశ్చయించుకున్నా. అలా రిప్లై ఇవ్వడం మానేశాను. (మోనాల్ లేకపోతే పిచ్చి లేస్తుంది: అఖిల్) అఖిల్, అభిజిత్, నేను ముందు నుంచీ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్లో నమ్మకం తప్పనిసరి. కానీ పరిస్థితులు మారేకొద్దీ అభికి నా మీద నమ్మకం పోయింది. ఈ విషయంలో కొంచెం హర్టయ్యాను. కానీ నాకు అఖిల్ బెస్ట్ఫ్రెండ్గా ఉన్నందుకు సంతోషంగా ఫీలయ్యా. అఖిల్తో పాటు హారిక, సోహైల్ నా ఫేవరెట్. నా పెళ్లికి ఇంకా టైముంది. కానీ ప్రేమ పెళ్లా, అరేంజ్డ్ మ్యారేజా అనేది నా చేతుల్లో లేదు. ఒకవేళ నన్నెవరైనా ప్రేమిస్తే మాత్రం నీకేం కావాలి చెప్పు.. సాంగ్ పాడుతూ నాకు ప్రపోజ్ చేయాలి. నాకు మాత్రం కృష్ణుడిలాంటి భర్త కావాలి. ఇకపోతే ఎప్పటికైనా హైదరాబాద్లో ఒక ఇల్లు కొనాలి. కానీ దానికింకా సమయం పడుతుంది అని మోనాల్ చెప్పుకొచ్చింది. (మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?) -
ఉండిపోరాదే..
-
బిగ్బాస్: కంటెస్టెంట్ల రీఎంట్రీ?
కోవిడ్ కాలంలో బిగ్బాస్ షో ఉంటుందా? ఉండదా? అన్న తరుణంలో కింగ్ నాగార్జున నాల్గో సీజన్ను నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లను తీసుకువచ్చినా వారితోనే షోను రక్తికట్టించి విజయవంతంగా నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడిక సీజన్కు శుభం కార్డు వేసే సమయం ఆసన్నమైంది. ఇప్పటిదాకా ఓట్లు వేస్తూ కంటెస్టెంట్ల మీద అభిమానం కురిపించిన ప్రేక్షకుల చేతిలోనే వారి గెలుపు ఆధారితమై ఉంది. ఇదిలా వుంటే మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. దీనికోసం పెద్ద పెద్ద స్టార్లను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్లతో స్టెప్పులేయించనున్నారు. అలాగే మాజీ కంటెస్టెంట్లు కూడా డ్యాన్సులతో హోరెత్తించనున్నారు. (చదవండి: అభి ఫ్యాన్స్ఫై పోలీసులకు మోనాల్ ఫిర్యాదు) ఎలిమినేట్ అయినవారి రీ ఎంట్రీ! అయితే ఈ సంబరాలన్నీ జరగడానికి ముందు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లంతా హౌస్లోకి వెళ్లి పార్టీ చేసుకుంటారు కదా! ప్రతి సీజన్లో పార్టీ పక్కాగా ఉంటోంది కానీ, ఈసారి మాత్రం పార్టీ జరిగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బిగ్బాస్ షో నుంచి వెళ్లిపోయిన వారు ఎవరిపనుల్లో వారు పడిపోయారు. వారిని మళ్లీ క్వారంటైన్లో ఉంచి లోపలకు పంపించేంత సమయం లేదు. దీంతో రీయూనియన్ ఉంటుందా? ఉండదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం కంటెస్టెంట్ల రీయూనియన్ 17, 18వ తేదీల్లో ఉండబోతుందని ఊహాగానాలు మొదలయ్యాయి. (చదవండి: ఆరేళ్లు రిలేషన్షిప్, డిప్రెషన్లోకి వెళ్లిపోయా) చివరిసారి అందరూ కలుస్తారా? ఒకవేళ అదే నిజమైతే ఇదివరకు కంటెస్టెంట్ల ఫ్యామిలీలను ఓ గాజు తెరలో ఉంచి మాట్లాడించినట్లుగా ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు అవకాశముంది. లేదంటే గత సీజన్ల కంటెస్టెంట్లు శ్రీముఖి, హరితేజ, గీతామాధురి, అలీ రెజాలతో ఇంట్లో వారికి ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశాన్ని రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంతైనా పార్టీ టచ్ ఉండాలంటే అందరూ ఇంట్లోకి వెళ్లాల్సిందే అని బిగ్బాస్ నిశ్చయించుకుంటే మాత్రం ఎలిమినేట్ అయిన 14 మంది ఇంటి సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించి లోపలకు వెళ్లేందుకు పచ్చజెండా ఊపేస్తారు. దీనివల్ల ఫైనలిస్టులతో పాటు కంటెస్టెంట్లు అందరూ చివరిసారిగా బిగ్బాస్ హౌస్లో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసే అవకాశం దొరకుతుంది. (చదవండి: ఆ హౌజ్మెట్కే నా మద్దతు: విజయ్ దేవరకొండ) -
బిగ్బాస్: చీలిపోతున్న అభిక ఓట్లు?!
బిగ్బాస్ నాల్గో సీజన్ ఓటింగ్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా మారింది. ఇంతకుముందు తమ అభిమాన కంటెస్టెంట్లు నామినేషన్స్లో లేకపోతే వారికిష్టమైన ఫ్రెండ్స్ను సేవ్ చేసే బాధ్యతను అభిమానులు వారి భుజాన వేసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం తమకిష్టమైన కంటెస్టెంట్ల మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా వుంటే హౌస్లో ఉన్న ఫైనలిస్టులతో బిగ్బాస్ "టైటిల్ గెలిచేందుకు ఎవరు అనర్హులు?" అని ఓ టాస్క్ ఆడించిన విషయం తెలిసిందే కదా! ఇందులో అఖిల్, హారిక.. అరియానా గెలవడానికి అనర్హురాలు అని చెప్పారు. సోహైల్ మాత్రం అభిజిత్, అరియానాకు విజేతగా నిలిచే అర్హత లేదని అభిప్రాయపడ్డాడు. హారికకు ఝలక్ ఇచ్చిన అభిజిత్ అటు అభిజిత్ మాత్రం హారిక అనర్హురాలు కావాలని కోరుకున్నాడు. ఈ ఆటలో ఇద్దరమే మిగిలితే అందులో హారిక ఓడిపోవడం ఇష్టం లేదని, అలా అని తాను ఓడిపోలేనని, ఎలాగైనా గెలవాలని, అందుకే ఆమె అనర్హురాలుగా మిగిలిపోవాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. అభిజిత్ ఏం చెప్తున్నాడో అర్థం కాని హారిక కాస్త డల్ అయినట్లు అనిపించింది. ఏదేమైనా అభిజిత్ తనను అనర్హురాలు అని చెప్పడాన్ని ఆమె మనసులో నుంచి తీసేయలేకపోయింది. ఈ క్రమంలో అభిజిత్, హారిక ఫ్యాన్స్ మద్ద మాటల యుద్ధం నడుస్తోంది. (చదవండి: మోనాల్ మనసులో నేనున్నా అంది: అభి) చీలిపోతున్న అభిక ఓట్లు ఇప్పుడు కూడా అభిక అంటే కుదరదని వారు వాదిస్తున్నారు. అభిజిత్, హారిక.. ఇద్దరిలో ఒకరికే ఓటేయాలని చెప్తున్నారు. దీంతో అభిక ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఇందులో మొదటి వర్గం.. అభికి మాత్రమే ఓటేయాలని, అభి లేనిదే హారిక లేదని అంటున్నారు. అభి ఫ్యాన్స్ ఆమెను చాలాసార్లు నామినేషన్ నుంచి సేవ్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడిక ఫినాలే వీక్లో ఆమెకు ఓటేయాల్సిన అవసరం లేదని, ప్రతి ఓటు అభికే వేయండని ఆయన అభిమానులు సూచిస్తున్నారు. పైగా కన్ఫెషన్ రూమ్లో నాగార్జున క్లాస్ పీకిన తర్వాత ఆమె అభిని దూరం పెట్టి అఖిల్తో క్లోజ్ అయిందని విమర్శిస్తున్నారు. (చదవండి: అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి) అభిక ఫ్యాన్స్ ఓటు ఎటువైపు? దీనిపై రెండో వర్గానికి చెందిన హారిక ఫ్యాన్స్ కూడా దీటుగానే స్పందిస్తున్నారు. మా క్యూటీ లేకపోతే అభి లేడని కౌంటరిస్తున్నారు. హారిక.. అభిజిత్లాగా బద్ధకంగా టాస్కు చేయకుండా కూర్చోలేదని, అన్నింట్లోనూ తన సత్తా చూపిస్తూ, ఒంటరి పోరాటంతో ఇక్కడివరకు వచ్చిందంటున్నారు. అభిజిత్ను సేవ్ చేయడం కోసం ఆమెను కెప్టెన్ చేసిన మోనాల్ను నామినేషన్లోకి పంపిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హారికను తక్కువ అంచనా వేయకండని హెచ్చరిస్తూ, ఆమెకు ఓటేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఏదేమైనా గెలుపును నిర్దేశించడంలో అభిక ఫ్యాన్స్ ఓట్లు కీలకంగా మారనున్నట్లు కనిపిస్తోంది. (చదవండి: అభిజిత్ను గెలిపించండి: యువ హీరో) -
బిగ్బాస్ ఓటింగ్: రెండో స్థానంలో అభిజిత్!
సెంచరీ ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్బాస్ నాల్గో సీజన్ విజేత ఎవరనేది నాలుగు రోజుల్లో తేలిపోనుంది. ఈ క్రమంలో ఎవరు విజేతగా నిలుస్తారని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నిర్వహిస్తున్న పోల్స్లో అభిజిత్ ఎక్కువ ఓట్లతో ముందు వరుసలో ఉన్నాడు. ఏ అనఫీషియల్ పోల్ చూసినా సుమారు 50 శాతం ఓట్లు అభిజిత్కే పడుతున్నాయి. తర్వాతి స్థానంలో సోహైల్ ఉంటుండగా అరియానా మూడో ప్లేస్లో ఉంది. కొన్నిసార్లు వీరిద్దరి స్థానాలు తారుమారవుతూ వస్తున్నాయి. కానీ అభి మాత్రం ఏ పోల్ చూసినా మొదటి స్థానం నుంచి కదలడమే లేదు. ఇక అఖిల్, హారిక వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. (చదవండి: శ్రీముఖి టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా?) అయితే తాజాగా కొన్నింటి పోల్స్లో అరియానా ఏకంగా రెండు స్థానాలు ఎగబాకి మొదటి స్థానంలో పాగా వేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా తొలి స్థానం నుంచి అంగుళం కూడా కదలని అభిని ఆమె వెనక్కు నెట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఇదెంతవరకు నిజమో తెలీదు కానీ ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. 50 శాతం ఓటింగ్తో ముందు వరుసలో ఉన్న అభి సెకండ్ ప్లేస్కు రావడానికి ఛాన్సే లేదని ఆయన అభిమానులు అంటున్నారు. మరికొందరేమో అభికి ఓట్లు పడేందుకు ఇలాంటి కొత్త ట్రిక్కులు ప్లే చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. నిమిషానికోసారి స్థానాలు మారిపోయే ఈ ఓటింగ్ పోల్స్ను పూర్తిగా నమ్మలేమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా బయట నడుస్తున్న టాక్ ప్రకారం అభిజిత్ విజేతగా నిలిచేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేదంటే సోహైల్ ట్రోఫీ ఎగరేసుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనా ట్విస్టులు చోటుచేసుకుంటే మాత్రం అరియానా విన్నర్ లేదా రన్నరప్గా నిలిచేందుకు ఆస్కారముంది. (చదవండి: మోనాల్ రెమ్యూనరేషన్ ఎంతంటే?) -
బిగ్బాస్.. నా లైఫ్లో గొప్ప నిర్ణయం: అభి
బిగ్బాస్ నాల్గో సీజన్ చివరి ఘట్టానికి చేరుకునేసరికి అన్నీ మారిపోయాయి. అభిజిత్తో తప్ప ఎవరితో కలవదనుకున్న హారిక అందరితో కలిసిపోయింది. కోపిష్టి అనుకున్న సోహైల్ ప్రేమతో ఇంటి సభ్యుల మనసులు గెలుచుకుని అందరివాడయ్యాడు. టాస్కులు ఒక్కటే తన గోల్ అనుకున్న అఖిల్ ఇంట్లో వాళ్ల మమకారం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్నాడు. కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వచ్చానన్న అభిజిత్ అభిమానుల సపోర్ట్ చూశాక ఎలాగైనా గెలవాల్సిందేనంటున్నాడు. ఎవరికీ ఓ పట్టాన అర్థమవదనుకున్న అరియానా ఏం చేసినా తన గెలుపుకోసమే చేశానని చెప్తోంది. ఆట ఎంత ముఖ్యమో ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో టాప్ 5 కంటెస్టెంట్లు నూటికి నూరు మార్కులు సాధించారు. ఇక్కడివరకు రావడానికి వాళ్లు ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు మిగిలిందంల్లా ప్రేక్షకుల వంతు. వారిని ఏయే స్థానాల్లో నిలబెట్టాలనేది వీక్షకులే నిర్ణయించనున్నారు. (ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) మరో మూడు రోజుల్లో బిగ్బాస్ ముగుస్తుండటంతో బిగ్బాస్ అందరి జర్నీని వీడియో ద్వారా చూపించాడు. దీంతో కంటెస్టెంట్లు భావోద్వేగానికి లోనయ్యారు. సోహైల్కు కోప్పడిన సందర్భాలను చూపిస్తూనే మెహబూబ్ ఎలిమినేట్ అయినప్పుడు బాధపడటాన్ని చూపించడంతో అతడు మరోసారి ఏడ్చేశాడు. అభికి అతడి రాతనే మార్చేసిన రోబో టాస్క్ను కళ్ల ముందుంచారు. అవినాష్కు కోపం తెప్పించాలనే సీక్రెట్ టాస్క్ హారిక ఎలా గెలిచిందో మరోసారి చూపించడంతో ఆమె నవ్వేసింది. అంతలోనే తన అన్నయ్యకు ఇష్టం లేకపోయినా సరే, టాస్క్ కోసం జుట్టు కత్తిరించుకోవడం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. (తిండి కోసం అతడి ఇంటికి వెళ్లాను: అరియానా) సుమ తనను ఇమిటేట్ చేయడం, సోహైల్తో గొడవలో కిందపడి ఏడ్చేయడం చూసి అరియానా స్థాణువులా నిల్చుండిపోయింది. ఇప్పటికే మోనాల్ లేకపోవడంతో ఊపిరి ఆడనట్లుగా ఉందన్న అఖిల్కు ఆమెతో కలిసున్న క్షణాలను చూపించి ఆ బాధను రెట్టింపు చేశారు. మొత్తానికి ఈ హౌస్లో అన్ని ఎమోషన్స్ పండించిన కంటెస్టెంట్లు వాళ్లను వాళ్లే వెనక్కు తిరిగి చూసుకుని ఎమోషనల్ అవుతున్నారు. ఈ సందర్భంగా.. నేనేంటో నాకు బిగ్బాస్ హౌస్లోనే పూర్తిగా తెలిసిందని అఖిల్ చెప్పుకొచ్చాడు. బిగ్బాస్కు రావడం అనేది నా జీవితంలోనే నేను తీసుకున్న గొప్ప నిర్ణయం అని అభిజిత్ అభిప్రాయపడ్డాడు. మరి ఈ కంటెస్టెంట్ల వంద రోజుల ప్రయాణాన్ని మరోసారి చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (బిగ్బాస్: మాట మీద నిలబడ్డ దేవి నాగవల్లి) -
బిగ్బాస్: పోలీసులకు మోనాల్ ఫిర్యాదు
బిగ్బాస్ నాల్గో సీజన్లో కన్నీళ్ల వరద పారించిన కంటెస్టెంటు మోనాల్ గజ్జర్. సంతోషమొచ్చినా, బాధొచ్చినా ఆమె కళ్ల వెంట నీటిప్రవాహం ధారలు కట్టేవి. అలా ఆమెకు నర్మద అన్న పేరు స్థిపరడిపోయింది. హీరోయిన్ అయినప్పటికీ అందరితో సులువుగా కలిసిపోయిన ఆమె పద్నాలుగో వారంలో ఎలిమినేట్ అయి షో నుంచి నిష్క్రమించింది. బయటకు రాగానే ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీబిజీగా మారింది. ఈ క్రమంలో జోర్దార్ సుజాతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ట్రోలింగ్పై స్పందించింది. 'ఓ వీకెండ్లో డీప్ నెక్ డ్రెస్ వేసుకున్నానని ట్రోల్ చేశారని బాధపడింది. ఆరోజు నా ఆరోగ్యం బాగోలేదు. తలకు నూనెతో మేకప్ లేకుండా అలాగే కూర్చున్నాను. కనీసం కూర్చోడానికి కూడా నాకు ఓపిక లేదు' అని అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. (మోనాల్ వెళ్లిపోయాక ఊపిరి ఆడలేదు: అఖిల్) తన సోదరి హేమాలిని కూడా ట్రోల్ చేయడాన్ని ఆమె ప్రస్తావించింది అభి గురించి చెడుగా మాట్లాడకపోయినా ఆమెను ఇష్టమొచ్చినట్లు నిందించారని మండిపడింది. 'హేమాలి హౌస్లోకి వచ్చినప్పుడు అభిజిత్కు ఓ సలహా ఇచ్చింది. నా వెనక కాకుండా నాతో నేరుగా మాట్లాడమని అభికి చెప్పింది. అంతకుముందు కొన్నిసార్లు అతడు నా వెనకాల మాట్లాడాడు కాబట్టే ఆమె అలా చెప్పింది. అందులో ఏ తప్పూ లేదు. ఒకవేళ ఆమె చెప్పే విధానం స్ట్రాంగ్ కావచ్చు. కానీ అభి గురించి చెడుగా ఏం చెప్పలేదు. అయినా సరే అభిజిత్ ఫ్యాన్స్ దారుణంగా ప్రవర్తిస్తూ సోదరిపై నీచంగా కామెంట్లు చేశారు. ఆమెను చంపుతామని బెదిరించారు. దీని వల్ల హేమాలి చాలా బాధ పడింది' అని తెలిపింది. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని తాను సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొంది. తన సోదరిని దారుణంగా ట్రోల్ చేసినందుకు అభిజిత్ ఫ్యాన్స్ మీద ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజులే ఉన్న తరుణంలో మోనాల్.. అభి ఫ్యాన్స్ మీద కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. (సోహైల్ అర్ధరాత్రి అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తాడు) (చదవండి: అభిజిత్కు క్లాస్ పీకిన మోనాల్ సోదరి) -
బిగ్బాస్: అదరగొట్టిన ఆ నలుగురు.. కరీంనగర్ బిడ్డలే
బిగ్బాస్ సీజన్–4 రియాల్టీ షో చివరి అంకానికి చేరింది. వంద రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో వచ్చే ఆదివారం విజేత ఎవరో తేలనుంది. ఈ క్రమంలో ఫినాలే పోరులో నిలిచిన సయ్యద్ సోహెల్ది పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీ కాగా.. దేత్తడి హారిక సుల్తానాబాద్ ఆడబిడ్డే. సీజన్–4ను రక్తికట్టించిన వారిలో జగిత్యాల జిల్లా లంబాడిపల్లికి చెందిన గంగవ్వ షోకే ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. వైల్డ్కార్డుతో ఎంట్రీ ఇచ్చి షోను జబర్దస్త్గా నడిచేలా చేసిన అవినాష్ గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందినవాడు. ఈ సందర్భంగా అవినాష్ ‘సాక్షి’తో తన జీవన ప్రయాణ అనుభవాన్ని పంచుకోగా.. సోహెల్ గురించి ప్రత్యేక కథనం.. బిగ్బాస్ నుంచి కాల్ వచ్చింది ఒకరోజు బిగ్బాస్ షో నిర్వాహకుల నుంచి ఫోన్ వచ్చింది. రియాల్టీషోలో పని చేయాలని ఆహ్వానించారు. అయితే ఓ టీవీ చానల్లో ఎనిమిదేళ్లుగా చేస్తున్నా... రానన్నాను. ఒక్కసారి ట్రై చేయండి అన్నారు. నాకున్న ఆర్థిక పరిస్థితులు నన్ను కన్విన్స్ చేశాయి. ఓకే చెప్పాను. ఇదే విషయం కామెడీ షో నిర్వాహకులకు చెబితే ఒప్పుకోలేదు. ఇంకా రెండేళ్ల అగ్రిమెంట్ ఉందని, మధ్యలో వెళ్తే రూ.10 లక్షలు కట్టాలని హెచ్చరించారు. దాంతో పాటు ఒక్కసారి వెళ్లినవారికి మరో అవకాశం ఉండదన్నారు. అప్పటికే పీకల్లోతు అప్పుల్లో ఉన్నా. ఏం చేయాలో తోచలేదు. ఈ క్రమంలో గెటప్ సీను, శ్రీముఖి, చంద్ర నాకు అండగా నిలిచారు. వాళ్లే రూ.10లక్షలు ఫైన్ కట్టారు. అలా నటనలో జన్మనచ్చిన షోను వదిలి బిగ్బాస్లో అడుగుపెట్టాను. పునర్జన్మనిచ్చింది: అవినాష్ గొల్లపల్లి(ధర్మపురి): నాన్న ఉపాధికోసం ఎడాదిదేశాలకు వెళ్తే.. అమ్మా, అన్నయ్యలు వ్యవసాయం చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవారు. చదువుకునే వయసులో స్నేహితుల ప్రోత్సాహం, అన్నయ్య సాయంతో నటనవైపు మళ్లాడు తను. హైదరాబాద్లో అందరిలాగే క్రిష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. అవకాశాలు రాలేదు. చిన్నచిన్న ప్రోగ్రాంలతో జీవితాన్ని గడిపాడు. అనుకోకుండా వచ్చిన చాన్స్ను అందిపుచ్చుకున్నాడు. ఓ టీవీచానల్లోని కామెడీ షో జన్మనిస్తే.. బిగ్బాస్ పునర్జన్మనిచ్చిందని చెబుతున్నాడు ముక్కు అవినాష్. సాధారణ కుటుంబమే.. మాది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామం. నాన్న లక్ష్మణ్, అమ్మ మల్లమ్మ. ఐదుగురం అన్నదమ్ములం. నేను మూడోవాణ్ని. నాన్న నా చిన్నప్పటినుంచి దుబాయ్ వెళ్లేవాడు. అమ్మ, అన్నలు వ్యవసాయం చేస్తుండేవారు. నేను జగిత్యాలలో పదోతరగతి వరకు, కరీంనగర్లో ఇంటర్, హైదరాబాద్లో బీటెక్ పూర్తిచేశా. స్కూల్ టైంనుంచే నటన అంటే ఇంట్రెస్టు. కల్చరల్ ప్రోగ్రాముల్లో మిమిక్రీ, డ్యాన్స్లు చేసేవాడ్ని. ఇంటర్లో నా ప్రతిభను చూసిన స్నేహితులు ప్రోత్సహించారు. ఇండస్ట్రీకి వెళ్తాఅంటే అమ్మానాన్న ఒప్పుకోలేదు. మా పెద్దన్నయ్య వారిని మెప్పించి నన్ను హైదరాబాద్లోని ఓ యాక్టింగ్ స్కూల్లో చేర్పించాడు. ఆఫీస్ బాయ్గా చేసిన.. ఐస్క్రీం అమ్మిన రెండునెలలు యాక్టింగ్ నేర్చుకున్నా. బతకడానికి డబ్బులు అవసరం కాబట్టి మూడు నెలలు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్బాయ్గా పనిచేశా. ఐస్క్రీం బండి నడిపా. కిరాణాషాపులో పనిచేశా. బీటెక్ చేస్తుండగా.. సిటీలోని ఓ లోకల్ చానెల్లో పనిచేస్తూ.. రూంరెంట్, ఖర్చులు వెల్లదీసుకున్నా. సినిమాల్లో అవకాశం కోసం కృష్ణానగర్ చుట్టూ తిరిగా. ఆడిషన్లకు వెళ్తే.. నా ఫొటోలు డస్ట్బిన్లో వేసిన సందర్భాలున్నాయి. 16 రోజులకు రూ.వెయ్యి ఇచ్చారు మొట్టమొదటిసారి ఓ సినిమా షూటింగ్ కోసం అండమాన్ నికోబార్ తీసుకెళ్లారు. అక్కడ టీ బాయ్గా ప్రొడక్షన్ చూసుకునేది. 16 రోజులు పనిచేస్తే రూ.వెయ్యి ఇచ్చారు. ‘వాట్హాపెండ్ 6టు6’ సినిమాలో అవకాశం రాగా రెండురోజులు ఆడింది. వరంగల్కు చెందిన కిరణ్ నా యాక్టింగ్ను చూసి కెవ్వుకేక ప్రోగ్రాంలో అవకాశం ఇప్పించారు. ఈ క్రమంలో ఓ టీవీలో వచ్చిన తడాఖా ప్రోగ్రాంలో చాన్స్ వచ్చింది. అప్పుడే చమ్మక్చంద్ర నా యాక్టింగ్ను గుర్తించి తనటీంలో చేర్చుకున్నారు. తరువాత వేణు వండర్స్ టీంలో చేశాను. అలా ఎనిమిదేళ్లలో టీం లీడర్స్థాయికి ఎదిగాను. ఓ వైపు కామెడీ షో చేసూ్తనే పలు ఈవెంట్లు, షోలు చేసేవాడ్ని. వచ్చిన సంపాదనతో 2019లో మణికొండలో ఇల్లు కొన్నా. చీకట్లు నింపిన లాక్డౌన్ ఇల్లు కొన్న సమయంలోనే అమ్మ అనారోగ్యానికి గురైంది. రూ.10 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించా. ఆపై రూ.15లక్షలు అప్పు చేశా. ఈ క్రమంలో కరోనా లాక్డౌన్ నా జీవితంలో చీకట్లు నింపింది. లాక్డౌన్తో కామెడీ షో షూటింగ్ నిలిచిపోయింది. షోలు, ఈవెంట్లు లేవు. అప్పు కట్టేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో అర్థంకాక నేను కొనుక్కున్న ఇంటి పైనుంచే దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. అదే సమయంలో గెటప్ సీను ఫోన్ చేశాడు. మేమున్నామని ధైర్యం చెప్పాడు. 13 వారాలున్నా.. వైల్డ్కార్డ్ ఎంట్రీ ద్వారా బిస్బాస్ రియాల్టీషోలో అడుగుపెట్టిన నేను 13 వారాలు హౌస్లో ఉన్నా. హౌస్లో బాగానే ఉన్నప్పటికీ అమ్మానాన్నలకు దూరం ఉండడం కొంత బాధేసింది. కానీ నాకున్న కష్టాలు పోవాలంటే గెలవాలనే కసితో ఆడాను. టాప్–5లో నిలుద్దామని అనుకున్నా. కుదరలేదు. ఏదేమైనా అన్నిరోజులు హౌస్లో ఉండేలా నాకు ఓట్లువేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆఫర్లు వస్తున్నాయి షోనుంచి బయటకు వచ్చాక చాలా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఆర్థిక కష్టాలు కూడా తీరాయి. అందరిని నవ్విస్తూ.. అందరితో నవ్వుతూ ఉండాలన్నది నా కోరిక. మళ్లీ కామెడీ షో నిర్వాహకుల నుంచి పిలుపు వస్తే.. తప్పకుండా వెళ్తా. ఫైనల్లో సింగరేణి కుర్రోడు రామగిరి(మంథని): ‘అరె ఏందిబై.. నేను గిట్లనే ఉంటా. నా ఇష్టమున్నట్టు చేస్తా.. ఊరమాస్ ఇక్కడా..!’ బిస్బాస్లో ఈ డైలాగులు ఎంతో ఫేమస్. ఆ మాస్ క్యారెక్టరే.. సయ్యద్ సోహైల్. అతడిప్పుడో యూత్ ఐకాన్. సింగరేణి పొత్తిళ్లలో పెరిగి ప్రస్తుతం బిగ్బాస్ ఫైనల్లో నిలిచాడు. సింగరేణి ఉద్యోగం వద్దని.. పెద్దపల్లి మండలం మారేడుగొండ గ్రామానికి చెందిన సయ్యద్ సలీం–ఫాహీమా సుల్తానా దంపతులకు సయ్యద్ సోహెల్ రెండో సంతానం. సలీం సింగరేణి ఉద్యోగం రీత్యా కుటుంబంతో సహా సెంటినరీకాలనీలో స్థిరపడ్డారు. మైనింగ్ సర్దార్గా పనిచేస్తున్న సలీంకు 2016లో ఓపెన్హార్ట్ సర్జరీ అయ్యింది. యాజమాన్యం అతడ్ని అన్ఫిట్ చేసింది. వారసత్వంగా తండ్రి ఉద్యోగాన్ని స్వీకరించేందుకు సోహెల్ నిరాకరించాడు. దీంతో సలీంకు డిమోషన్ కల్పించి జనరల్ మజ్దూర్గా అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఓసీపీ–2లో విధులు నిర్వహిస్తున్నాడు. బిగ్బాస్ ఫైనల్లో.. ఈ క్రమంలో బిగ్బాస్ షోనుంచి ఆహ్వానం అందింది. ఎంట్రీతోనే సీక్రెట్ కంటిస్టెంట్గా ఉన్న సయ్యద్ సోహెల్ మొదటినుంచి చురుగ్గా ఆడాడు. ఇచ్చిన ప్రతీటాస్క్లో విజయం సాధించాడు. మాస్ క్యారెక్టర్గా పేరు, ఫ్యాన్స్ని సంపాదించాడు. మనసున్న స్నేహితుడిగా మన్ననలు పొందాడు. బిగ్బాస్ ఫైనల్లో అడుగుపెట్టాడు. విజేతగా తిరిగిరావాలని జిల్లా ప్రజలు, కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు. డ్యాన్స్ అంటే ప్రాణం.. నటన అంటే ఇష్టం సయ్యద్ సోహెల్కు చిన్ననాటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 2005లో 9వ తరగతి చదువుతున్న సమయంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమానికి ఎంపిక య్యాడు. ఇంటర్ కరీంనగర్లో చదివి, డిగ్రీ హైదరాబాద్లో పూర్తిచేశాడు. 2009లో దిల్రాజ్ దృష్టిని ఆకర్షించిన సయ్యద్ సోహెల్ కొత్తబంగారు లోకం సినిమాలో సైడ్ క్యారెక్టర్కు ఎంపికయ్యాడు. 2010లో యూఅండ్ఐ, 2013లో మ్యాజిక్ మ్యూజిక్, 2015లో దిబెల్స్, 2017లో సినీ మహల్ సినిమాల్లో నటించాడు. నాతిచరామి, కృష్ణవేణి సీరియల్స్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. విజేతగా వస్తాడు సోహెల్ ఏదైనా సాధించాలంటే పట్టుదలతో ఉంటాడు. అదే సంకల్పంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ రాణిస్తున్నాడు. సోహెల్ యూత్ ఐకాన్గా నిలవడం గర్వంగా ఉంది. బిగ్బాస్ షోలో విజేతగా నిలుస్తాడనే నమ్మకం ఉంది. – సయ్యద్ సలీం, సోహెల్ తండ్రి -
బిగ్బాస్ రూల్స్ బ్రేక్ చేయండి: శ్రీముఖి సలహా
తెలుగు బిగ్బాస్ హిందీ బిగ్బాస్ను ఫాలో అయినట్లు కనిపించింది. మాజీ కంటెస్టెంట్లను తీసుకువచ్చి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు. మొదటి సీజన్ ఫైనలిస్ట్ హరితేజ, రెండో సీజన్ రన్నరప్ గీతా మాధురి, మూడో సీజన్ రన్నరప్ శ్రీముఖితో పాటు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజాలకు రెట్టించిన ఉత్సాహంతో షోను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. కానీ కోవిడ్ వల్ల నేరుగా హౌస్లోకి వెళ్లకుండా ప్రత్యేక గదిలో నుంచే ఫైనలిస్టులతో సంభాషించారు. మరి 101వ ఎపిసోడ్లో ఈ మాజీ ఫైనలిస్టులు ఇప్పుడున్న కంటెస్టెంట్లను ఏమేం ప్రశ్నలడిగారు? వారిని ఎలా ఆడుకున్నారనేది తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి.. టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? గత సీజన్ల ఫైనలిస్టులు హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజా ఇంటిసభ్యులను సర్ప్రైజ్ చేశారు. అప్పట్లో తాము దంచుతూ కష్టాలు పడుతుంటే మీరేమో మిక్సీలు వాడుతున్నారా? అని ఈ సీజన్ కంటెస్టెంట్ల మీద అక్కసు వెళ్లగక్కారు. తమ టాటూలు నిజమైనవా? గ్రాఫిక్సా? అని అడుగుతున్నారని, బయట ఇలాంటి టాస్కులు ఉంటాయనుకోలేదని శ్రీముఖి వాపోయింది. తర్వాత ప్రేక్షకుల తరపున ప్రశ్నలు అడుగుతూ వారికి సరదాను పంచేందుకు సిద్ధమయ్యారు. ఇంకొన్ని రోజులైతే ఆరిపోయేట్టు ఉన్నావు, కాస్త తినమని శ్రీముఖి అరియానాకు సలహా ఇచ్చింది. (చదవండి: ఏడవకుండా నవ్వుతూ మోనాల్ వీడ్కోలు) మోనాల్ లేకపోవడంతో ఊపిరాడలేదు నీకు ఎలాంటి అమ్మాయి కావాలన్న ప్రశ్నకు సోహైల్ తన కోపాన్ని కూల్ చేయగలగాలి అని చెప్పాడు. ఇది జరగని పని అని హరితేజ కుండ బద్ధలు కొట్టింది. మోనాల్ వెళ్లాక సైలెంట్ అయ్యావేంటని అఖిల్ను కూపీ లాగేందుకు ప్రయత్నించగా సోహైల్ మధ్యలో లేచి అంత లేదంటూ, ఇక్కడ ఇద్దరికి సోపులేస్తున్నాడని పంచ్ వేశాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక కాసేపటివరకు ఊపిరి ఆడలేదని అఖిల్ చెప్పుకొచ్చాడు. తర్వాత సీనియర్లు అరియానాను లౌడ్ స్పీకర్గా అభివర్ణిస్తూ ఇమిటేట్ చేయడంతో ఇంటి సభ్యులు పడీపడీ నవ్వారు. అయితే కొన్నిసార్లు ఆమె లీడ్ తీసుకుని మాట్లాడటాన్ని శ్రీముఖి మెచ్చుకుంది. దీనిపై అరియానా స్పందిస్తూ.. గత సీజన్లో శ్రీముఖికే సపోర్ట్ చేశాను, ఆమె ఆడిన విధానం నచ్చిందంటూ చెప్పుకొచ్చింది. హౌస్ అంతా రివర్స్ అయినప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడటం గ్రేట్ అని హరితేజ సైతం మెచ్చుకుంది. (చదవండి: హౌస్లో శివగామి ఎవరో చెప్పిన అభిజిత్) అమ్మాయిల కోసం పాట పాడిన అభి కావాలని తప్పులు చేయండి, ఎందుకంటే వారంలో బిగ్బాస్ గొంతు మిస్సవుతారు అని సీనియర్లు ఉచిత సలహా ఇచ్చారు. తర్వాత అందరితో డ్యాన్స్ చేయించారు. గర్ల్ ఫ్యాన్స్ కోసం అభిజిత్తో పాట పాడించారు. అయితే లిరిక్స్ రాకపోయినా 'నీ ఎదలో నాకు చోటే వద్దు.. అంటూ బాగానే పాడాడు. తర్వాత అలీ రెజా మాట్లాడుతూ..నన్ను అర్జున్రెడ్డి అనేవారు, కానీ నువ్వు నన్ను మించిపోయావని, గొడవయ్యాక నువ్వే వెళ్లి కలిసిపోవడం బాగుందని సోహైల్ను మెచ్చుకున్నాడు. ఇలా కోప్పడే ఒకరు ట్రోఫీ తీసుకెళ్లారు తన కోపం కారణం లేకుండా రాదని, ఎంత కోప్పడినా మళ్లీ మనవాళ్లే అని దగ్గరకు తీసుకుంటా అని సోహైల్ చెప్పగా ఇలా కోప్పడే ఒకరు బిగ్బాస్ 1 ట్రోఫీని పట్టుకెళ్లారని హరితేజ శివబాలాజీని గుర్తు చేసింది. తర్వాత మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ అఖిల్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. టాస్కుల్లో మామూలు స్పీడు లేదని గీతా మాధురి మెచ్చుకుంది. నవ్వితే బాగుంటావు, కానీ ఎప్పుడూ సీరియస్గా ముఖం పెడతావేంటని శ్రీముఖి నిలదీయడంతో అలాంటిదేమీ లేదని అఖిల్ తెలిపాడు. పులిహోర మాత్రం మామూలుగా కలపడం లేదని గీతా, హరితేజ సెటైర్లు వేశారు. (చదవండి: ఆ సెంటిమెంట్ కలిసొస్తే అభిజితే విన్నర్?) ఉన్న టైమ్ను ఎంజాయ్ చేయండి చివర్లో మాకు సలహాలు ఇవ్వండని జూనియర్లు సీనియర్లను కోరారు. మొదట హరితేజ మాట్లాడుతూ... ఇక్కడిదాకా వచ్చాక మార్చుకోవాల్సినవేమీ ఉండవని చెప్పింది. ఉన్న సమయాన్ని ఎంజాయ్ చేయమని సూచించింది. గీతా మాధురి కూడా ఎంజాయ్ చేయమని చెప్తూనే చివర్లో ఎవరినీ బాధపెట్టే డైలాగులు మాట్లాడకండని సలహా ఇచ్చింది. శ్రీముఖి మాట్లాడుతూ.. 'గత సీజన్లో నేను సెట్లో ప్రతి మూలమూలకు వెళ్లాను. ఎందుకంటే తర్వాత ఆ సెట్ తీసేస్తారు. కాబట్టి మీరు కూడా హౌస్లో చిల్ అవ్వండి. రూల్స్ బ్రేక్ చేసి బిగ్బాస్తో తిట్టించుకోండి. ఎందుకంటే మళ్లీ ఆ వాయిస్ వినలేరు' అని చెప్పింది. హౌస్లో ఎంత నెగెటివిటీ వస్తుందో అంత పాజిటివిటీ వస్తుందని అలీ ధైర్యం చెప్పాడు. మా అమ్మాయి బిగ్బాస్ చూస్తూనే అన్నం తింటుది, వారం తర్వాత పరిస్థితి ఏంటో అని గీతామాధురి తల పట్టుకోగా తాము ఇంటికొచ్చి తినిపిస్తాం అని ఫైనలిస్టులు ముందుకొచ్చారు. అనంతరం మాజీలు టాప్ 5 కంటెస్టెంట్లకు ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడ్కోలు పలికారు. (చదవండి: బిగ్బాస్: టైటిల్ గెలిచే అర్హత హారిక, అరియానాకు లేదు!) -
బ్రేకప్తో డిప్రెషన్లోకి వెళ్లా: మోనాల్
బిగ్బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ తెలుగు, గుజరాతీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ గుర్తింపు దక్కించుకోలేదు. కానీ ఇప్పటివరకు రాని పాపులారిటీ ఒక్క బిగ్బాస్తో ఆమె సొంతమైంది. గుజరాతీ భామ అయినా కష్టపడి మరీ తెలుగు నేర్చుకుని ముద్దుముద్దుగా మాట్లాడేది. ఆమె తెలుగులో మాట్లాడటాన్ని కింగ్ నాగార్జున సైతం మెచ్చుకునేవారు. అందం, అభినయంతో ప్రేక్షకులను బుట్టలో వేసుకున్న మోనాల్ పద్నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. అయితే అఖిల్కు ఇచ్చిన మాట ప్రకారం బిగ్బాస్ షో ముగిసేవరకు ఆమె హైదరాబాద్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిలుకూరి బాలాజీని కూడా సందర్శించారు. అనంతరం ఆమె ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీని బయటపెట్టారు. అలాగే తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మరి మోనాల్ ఏమేం మాట్లాడిందో ఆమె మాటల్లోనే.. (చదవండి: రోడ్డుపై గొడవ.. చాకచక్యంగా డీల్ చేసిన నటుడు) 'నా తొలి చిత్రం ఒక కాలేజ్ స్టోరీ. కానీ మొదట రిలీజైంది మాత్రం సుడిగాడు. తర్వాత మలయాళంలో ఒక ఆఫర్ వచ్చింది. ఆ వెంటనే తమిళంలో చేశాను. 2015లో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చేశాను. అదే సమయంలో నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆరేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న నా బాయ్ఫ్రెండ్తో బ్రేకప్ అయింది. దాని నుంచి కోలుకోలేకపోయాను. అతడు సౌత్కు చెందిన వ్యక్తి. అందుకే నేను ఇకపై దక్షిణాదికి రాకూడదని నిశ్చయించుకుని గుజరాత్కు వెళ్లిపోయాను. అప్పుడే గుజరాత్లో ఆఫర్లు రావడంతో సినిమాలు చేసుకుంటూ బిజీ అయ్యాను. 2018-19లో మరాఠీ సినిమాలు చేశాను. 2019లో హిందీలో కాగజ్ చిత్రం చేశాను. అది వచ్చే ఏడాది జనవరి 7న రిలీజ్ కానుంది. ఇప్పుడు మరో మంచి ప్రాజెక్ట్ కూడా వచ్చింది. పూర్తి వివరాలు త్వరలోనే చెప్తాను' అని మోనాల్ చెప్పుకొచ్చింది. (చదవండి: బిగ్బాస్: అవినాష్ను గెలిపించిన హారిక) -
మోనాల్కు లక్షలు కురిపించిన బిగ్బాస్
చూస్తుండగానే బిగ్బాస్ నాల్గో సీజన్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. హౌస్లో మొదట అడుగు పెట్టిన మోనాల్ గజ్జర్ ఫినాలేకు అడుగు దూరంలో ఆగిపోయి బిగ్బాస్ షో నుంచి నిష్క్రమించింది. సంతోషాలు, స్నేహాలు, బాధలు, బంధాలు అన్నింటినీ రుచి చూసిన ఆమె పద్నాలుగో వారంలో ఎలిమినేట్ అయంది. కాగా మోనాల్ షో ప్రీమియర్ ఎపిసోడ్ నాడు హౌస్లో ఎంట్రీ ఇచ్చేవాళ్లకు మంచి నీళ్లు ఇస్తూ ముందుగానే మంచిపేరు కొట్టేసింది. తర్వాత అఖిల్, అభిజిత్తో క్లోజ్ అవుతూ కెమెరాలను తన వైపు తిప్పుకుంది. (చదవండి: అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి) బెడిసి కొట్టిన ట్రయాంగిల్ స్టోరీ కానీ ఈ ట్రయాంగిల్ స్టోరీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. అటు హౌస్లో కూడా బెడిసి కొట్టింది. దీంతో ఇద్దరి మధ్య నలిగిపోయిన ఆమె చివరకు ఏకాకిగా మిగిలింది. టాస్కులు సరిగా ఆడదంటూ ఇంటి సభ్యులు ఆమెను పదేపదే నామినేట్ చేసేవారు. దీంతో తను కూడా ఆడతాను అని నిరూపించుకోలేక మోనాల్ లోలోపలే కుమిలిపోయేది. అయితే ఎన్నోసార్లు కెప్టెన్సీకి అడుగు దూరంలో ఆగిపోయిన హారికను కెప్టెన్ చేసి ఆమె అందరి నోళ్లు మూయించింది. ఆ తర్వాత కూడా టాస్కుల్లో సత్తా చూపుతూ వచ్చిన ఆమె మొన్నటి ఆదివారం ఎలిమినేట్ అయింది. (చదవండి: మోనాల్ మనసులో నేనున్నా అంది: అభి) రూ.35 లక్షల పైనే అందుకున్న మోనాల్ ఈ క్రమంలో మోనాల్ రెమ్యూనరేషన్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బిగ్బాస్ నిర్వాహకులు ఆమెకు వారానికి రెండున్నర లక్షల పైచిలుకు పారితోషికం అందించారట. అంటే మొత్తం పద్నాలుగు వారాలకు కలిపి మోనాల్ రూ.35 లక్షలకు పైనే ముట్టినట్లు తెలుస్తోంది.మరికొందరేమో ఏకంగా బిగ్బాస్ ప్రైజ్మనీతో సమానంగా రూ.49 లక్షలు అందుకున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది తెలీదు కానీ సోషల్ మీడియాలో ఆమె రెమ్యూనరేషన్ విషయం హాట్ టాపిక్గా మారింది. -
'11' నెంబర్ అభిని విన్నర్ చేస్తుందా?
బిగ్బాస్ గూటికి చేరాక హీరోలు జీరోలవుతుంటారు, జీరోలు హీరోలవుతుంటారు. స్ట్రాంగ్ అనుకున్నవాళ్లు మధ్యలోనే ఎలిమినేట్ అవుతారు, ఊహించని కంటెస్టెంట్లు చివరి వరకూ వెళ్తుంటారు. ఇలా ఎన్నో జంతర్మంతర్ మాయలు చోటు చేసుకునే బిగ్బాస్ హౌస్లో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే మిగిలారు. అరియానా, హారిక, అభిజిత్, సోహైల్, అఖిల్.. టైటిల్ కోసం పోటీపడుతున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో మాత్రం అభిజితే విన్నర్ అవుతాడని బలమైన ప్రచారం జరగుతోంది. దీనికి తోడు 11 సెంటిమెంట్ వర్కవుట్ అయితే ఇదే నిజమయ్యే అవకాశమూ లేకపోలేదు. ఇంతకీ ఈ 11 నెంబర్ ప్రత్యేకత ఏంటేంటే.. ఈ సీజన్లో అతడు 11 సార్లు నామినేట్ అయ్యాడు. 11 సార్లు నామినేట్.. మోనాల్ అతడికన్నా ఒకసారి ఎక్కువగా అంటే 12 సార్లు నామినేట్ అయినప్పటికీ ఫినాలే వీక్కు ముందే ఎలిమినేట్ అయి రేసు నుంచి తప్పుకుంది. ఆమె విషయాన్ని కాస్త పక్కన పెడితే ఎక్కువ సార్లు నామినేట్ కావడం అభిజిత్కు కలిసొచ్చినట్లు కన్పిస్తోంది. ప్రతిసారీ నామినేషన్లో ఉండటం వల్ల అతడికి ప్రేక్షకుల సపోర్ట్ ఎంత ఉందనే విషయం అర్థమై ఉంటుంది. ఇక మొదటి సీజన్ మినహా రెండో సీజన్లో కౌశల్ మండా కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. గీతా మాధురి తనకు లభించిన సూపర్ పవర్తో అతడిని సీజన్ మొత్తం నామినేట్ చేసింది. అయినా సరే ప్రతిసారి ఎక్కువ ఓట్లతో సేవ్ అవుతూ చివరికి విజేతగా అవతరించాడు. (చదవండి: నీ వల్ల చాలా హర్ట్ అవుతున్నా: అభి) ఎక్కువ సార్లు నామినేట్ అయిన రాహుల్ తర్వాత మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ కూడా 11 సార్లు నామినేట్ అయ్యాడు. తన జిగిరీ దోస్త్ పునర్నవిని నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం కోసం సీజన్ మొత్తం తనను తాను నామినేట్ చేసుకున్నాడు. అయినా సరే ప్రేక్షకుల సపోర్ట్తో చివరికి ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఇక ఈసారి కూడా అభిజిత్ 11 సార్లు నామినేషన్లో ఉండి సేవ్ అవుతూ టాప్ 5లోకి చేరుకున్నాడు. దీంతో మరోసారి 11 సెంటిమెంట్ వర్కవుట్ అయితే అభిజిత్ విజేతగా నిలవడం ఖాయం అనిపిస్తోంది. మరి అభిజిత్ ఆ సెంటిమెంట్ను రిపీట్ చేసి హిస్టరీ క్రియేట్ చేస్తాడా? లేదా? అనేది తెలియాలంటే డిసెంబర్ 20న గ్రాండ్ ఫినాలే కోసం ఎదురు చూడాల్సిందే. (చదవండి: అరియానాను కాపాడుకుందామంటోన్న దేవి) Nominated for 11 times by housemates and saved with all your support & continued his journey in #BiggBossTelugu4. Let's finish this with his victory, Let's prove them that #Abijeet is the most Loved Contestant. Let's Vote For the #MostDeservingWinnerABI .#VoteForAbijeet pic.twitter.com/30rutWxnwh — Abijeet (@Abijeet) December 15, 2020 -
బిగ్బాస్ ట్రోఫీ తీసుకురా, దావత్ చేసుకుందాం
బిగ్బాస్ నాల్గో సీజన్ ముగింపుకు చేరుకుంటున్న సమయంలో లోపలున్న కంటెస్టెంట్లను గెలిపించేందుకు అభిమానులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా లెక్క ప్రకారం ఇప్పుడున్న ఫైనలిస్టుల్లో అభిజిత్కే ప్రేక్షకుల సపోర్ట్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీనికి తోడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సైతం అభికే మద్దతు తెలిపాడు. వీరిద్దరూ గతంలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంలో కలిసి నటించారు. ఇదే సినిమాలో నటించిన మరో హీరో సుధాకర్ కోమాకుల కూడా మొదటి నుంచి అభికే తన మద్దతు తెలుపుకుంటూ వచ్చాడు. బిగ్బాస్ ఫైనల్ వీక్లోకి అడుగు పెట్టిన సందర్భంగా సుధాకర్ మరో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. (చదవండి: బిగ్బాస్ : కుక్క అనుకున్నా పర్లేదు.. అఖిల్) ఏ కంటెస్టెంటుకు రాని పాపులారిటీ.. "బిగ్బాస్ కంటెస్టెంటు అభిజిత్ నా క్లోజ్ ఫ్రెండ్. టైటిల్ దక్కించుకునేందుకు ముందు వరుసలో ఉన్నాడు. రెండు నెలల క్రితం అతడి గురించి వీడియో చేసినప్పుడు పాజిటివ్తో పాటు నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ అభి గ్రాఫ్ పెరిగిపోయింది. అతడిని బిగ్బాస్ విన్నర్గా చూడాలనుకుంటున్నా. అతడు హౌస్లో అందరూ సర్ప్రైజ్ అయ్యేలా పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇన్ని సీజన్లలో ఏ కంటెస్టెంటుకు రాని పాపులారిటీ అభికి వచ్చింది. కానీ అతడు బిగ్బాస్లోకి వెళ్లినప్పుడు టైటిల్ ఫేవరెట్ కాదనే చెప్పాలి. లోపలికి వెళ్లే వారం ముందు నాతో మాట్లాడాడు. నేను నాలా ఉంటా. పార్టిసిపేట్ చేస్తా అన్నాడు. అరేయ్ మామా, మనం ఒక్కసారి దిగినమంటే సిక్స్ కొడితే బాల్ స్టేడియం అవతల పడాల్సిందే, టైటిల్ గెలవాల్సిందేనని చెప్పాను. అతడేమో ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నా కానీ చూద్దామని చెప్పాడు." (చదవండి: ఆ హౌజ్మెట్కే నా మద్దతు: విజయ్ దేవరకొండ) నీ కోసం అమెరికా నుంచి వచ్చాను "ఎన్నిసార్లు నామినేషన్లోకి వెళ్లినా ప్రేక్షకులు ఎక్కువ ఓట్లు వేసి సేఫ్ చేశారు. రోబో టాస్క్ తర్వాత అతడికి పేరొచ్చింది. భుజాల నొప్పి, మోకాళ్ల సమస్య ఉండటం వల్ల ఫిజికల్ టాస్కులు చేయలేకపోయాడు. అయినా సరే తన బెస్ట్ ఇచ్చాడు. ఏ పరిస్థితిలోనైనా బ్యాలెన్స్గా ఉంటాడు. బయట ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. టాస్క్లో ఫ్రెండ్స్ను పక్కన పెట్టాడు. ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే వెళ్లి సాయం చేస్తాడు. ఏదైనా తప్పు చేస్తే సారీ చెప్పి దాన్ని సరిదిద్దుకున్నాడు. ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్న అభికి ఓటు వేసి గెలిపించండి" అని సుధాకర్ అభిమానులను కోరాడు. చివర్లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలోని నాగరాజు పాత్రలోకి దూరిపోయి ఓ డైలాగ్ విసిరాడు. "అరేయ్ మామా అభిజిత్, బిగ్బాస్ ట్రోఫీ తీసుకుని రా. బీ ఫేస్ మొత్తం వెయిట్ చేస్తుంది. మస్త్ దావత్ చేసుకుందాం. ఎంజాయ్ చేద్దాం. అమెరికా నుంచి వచ్చినరా బై నీకోసం.. బిగ్బాస్ 4 విన్నర్ కావాలి చెప్తున్నా.." అంటూ అభిని విజేతగా నిలపండని ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. (చదవండి: అరియానాకు ఓటేయమని ఆర్జీవీ పిలుపు) -
సోహైల్కు అలాంటి అమ్మాయి కావాలట!
మరో ఐదు రోజుల్లో బిగ్బాస్ నాల్గో సీజన్ విన్నర్ ఎవరనేది తేలిపోనుంది. గెలుపు కోసం తపిస్తూ ఇప్పటిదాకా కష్టపడ్డ కంటెస్టెంట్లకు కాస్త సరదాను పంచేందుకు కొత్త అతిథులు వచ్చారు. మాజీ బిగ్బాస్ కంటెస్టెంట్లు హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజా ప్రత్యేక గదిలో నుంచి ఫైనలిస్టులకు హాయ్ చెప్తూ వారిని సర్ప్రైజ్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్లు జూనియర్లను ప్రశ్నలతో ఆడుకున్నారు. వారితో స్పెషల్ టాస్కులు చేయిస్తూ డ్యాన్సులు కూడా చేయించినట్లు కనిపిస్తోంది. వీరిని ఆకట్టుకునేందుకు అభిజిత్ అందరూ ఎంత బాగున్నారో అంటూ పొగిడేయగా.. హరితేజ అందుకుని మమ్మల్ని కూడా వదలవా? అని పంచ్ వేసింది. ఇక శ్రీముఖి.. మోనాల్ వెళ్లిపోయాక సైలెంట్ అయ్యావేంటి అని అఖిల్ బాధను పంచుకునే ప్రయత్నం చేసింది. ఇంతలో సోహైల్ అఖిల్ గాలి తీసేస్తూ.. అతడు ఇక్కడున్న ఇద్దరమ్మాయిలకు సోపేస్తున్నాడని పులిహోర వేషాలను బయటపెట్టాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక ఆమెను తలుచుకుని బాధపడ్డ అఖిల్కు నిన్నటి ముసుగు టాస్క్లో ఆమె లేని లోటు స్పష్టంగా తెలుసొచ్చింది. అభి- హారిక, సోహైల్-అరియానా కలిసి డ్యాన్సు చేస్తుంటే అఖిల్ మాత్రం ఒంటరిగానే స్టెప్పులేశాడు. (విజయానికి దూరమవుతున్న సోహైల్!) కాగా గత సీజన్లలో మనల్ని లౌడ్ స్పీకర్ అన్నారు కానీ అక్కడుంది అసలైన లౌడ్ స్పీకర్ అంటూ హరితేజ, శ్రీముఖి.. అరియానా వైపు వేలు చూపిస్తూ ఆమెను ఇమిటేట్ చేసి నవ్వించారు. అనంతరం నిన్ను చేసుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీ ఉండాలని శ్రీముఖి సోహైల్ను ప్రశ్నించింది. దీనికి అతడు బదులిస్తూ తనకు కోపం వచ్చినప్పుడు కూల్ చేసే సామర్థ్యం ఉండాలని చెప్పాడు. ఇది విన్న శ్రీముఖి అది ఎవరి వల్లా చేతకాదు అంటూ దండం పెట్టేసింది. మరి వీరి ఎంటర్టైన్మెంట్ను చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (హారిక, అరియానాకు గెలిచే అర్హత లేదు!) -
మోనాల్ లేకపోతే పిచ్చి లేస్తుంది: అఖిల్
బిగ్బాస్ నాల్గో సీజన్ నేటితో విజయవంతంగా వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. టాప్ 5లోకి చేరుకున్న ఇంటిసభ్యుల మధ్య బిగ్బాస్ చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక ట్రోఫీ గెల్చుకునేందుకు అనర్హురాలు ఎవరన్న ప్రశ్నకు అమ్మాయిల పేర్లే ఎక్కువగా వినిపించడంతో వారిలో గెలవాలన్న కసి మరింత పెరిగింది. సెంచరీ కొట్టిన బిగ్బాస్ ఎపిసోడ్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ లుక్కేయండి. మోనాల్ లేదని బాధపడిన అఖిల్ ఎప్పుడూ సినిమా పాటతో నిద్ర లేచే కంటెస్టెంట్లు ఇవాళ మాత్రం బిగ్బాస్ జర్నీ ర్యాప్ సాంగ్తో మేలుకున్నారు. వాళ్ల అరుపులు, మాటలు, ఏడుపులు వారికే కొత్తగా అనిపించాయి. ఇక ఈ మధ్య మోనాల్ను పట్టించుకోవడం మానేసిన అఖిల్ ఆమె లేని లోటును ఫీలయ్యాడు. తోడు లేకపోవడంతో పిచ్చి లేస్తుందని హారిక దగ్గర బాధ చెప్పుకున్నాడు. అనంతరం బిగ్బాస్ ముసుగు వెనుక దాగింది ఎవరు? అనే టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంట్లో మొదట ముసుగు ధరిస్తే దానిని బయట పెట్టింది ఎవరనే విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది. టాస్క్ ప్రారంభం అవగానే ఇంటి సభ్యులు ముఖాన మాస్కు పెట్టుకుని డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. (చదవండి: గెలిస్తే రైతుల అప్పు తీరుస్తానన్న అరియానా) అఖిల్ వల్ల పులిహోర కలపడం బయటపడింది మ్యూజిక్ ఆగిపోగానే మొదట అభిజిత్ మాట్లాడుతూ.. నా కోపాన్ని ఇంట్లోకి జంటగా అడుగు పెట్టిన సోహైల్, అరియానా బయట పడేలా చేశారని చెప్పాడు. తనకు వంట వచ్చన్న విషయం అమ్మ రాజశేఖర్ వల్ల అందరికీ తెలిసిందని అరియానా చెప్పుకొచ్చింది. కోపం సోహైల్ వల్ల, కెమెరాల ముందు ఏడవడం అవినాష్ వల్ల బయట పడిందని పేర్కొంది. అనంతరం సోహైల్ మాట్లాడుతూ.. దివి వల్ల అగ్రెసివ్, అరియానా వల్ల వంట చేయడం బయటపడిందన్నాడు. అఖిల్.. నోయల్ వల్ల ఏడవడం, అభి వల్ల కోపం బయటపడిందని చెప్పాడు. హారిక.. సోహైల్ వల్ల కోపాన్ని దాచుకోలేకపోయానని చెప్పింది. అభి వల్ల పొజెసివ్నె, అఖిల్ వల్ల పులిహోర కలపడం, అరియానా వల్ల తనకున్న సహనం బయటపడిందని తెలపింది. (చదవండి: హారిక తమన్నా, మోనాల్ అనుష్క అంటోన్న అభి) సోహైల్ మనసులో ఏదీ పెట్టుకోడు తర్వాత ఒకరి గురించి మరొకరు మాట్లాడారు. సోహైల్ ఎంత కోప్పడతాడో అంతకంటే ఎక్కువ బాధపడతాడు. చిన్నపిల్లాడి మనస్తత్వం, మనసులో ఏదీ పెట్టుకోడని అరియానా చెప్పుకొచ్చింది. తర్వాత సోహైల్.. అరియానా గురించి చెప్తూ ఆమె లోపల ఉన్న ప్రేమను బయటపెట్టదని చెప్పాడు. తర్వాత అభి గురించి నేను చెప్తానంటే నేను చెప్తానని అఖిల్, హారిక పోట్లాడారు. చివరికి అఖిల్ అందుకుంటూ.. రిజర్వ్డ్గా కనిపిస్తాడు కానీ అభి ఎమోషనలేనని, దాన్ని బయటపెట్టట్లేదు అని చెప్పాడు. తర్వాత హారిక.. అఖిల్ గురించి చెప్తూ.. అతడిని కేర్ తీసుకునేందుకు ఒకరు కావాలని ఎదురు చూస్తాడు అని మోనాల్ గురించి పరోక్షంగా చెప్పుకొచ్చింది. అభిజిత్.. హారిక గురించి చెప్తూ ఆమె లోపల ఉన్న విషయాన్ని బయట పెట్టదని చెప్పాడు. తనకంటే ఎక్కువ ఇగో ఉంటుందన్నాడు. మోనాల్, అరియానాను బాగున్నావని మెచ్చుకుంటే నన్ను ఎందుకు పొగడలేదని దబాయించేదని చెప్పాడు. (చదవండి: బొమ్మ లొల్లి: శోకాలు పెట్టిన టామ్ అండ్ జెర్రీ) ముగ్గురి దృష్టిలో అరియానా అనర్హురాలు తర్వాత బిగ్బాస్ ఈ ఫైనలిస్టులకు మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఫైనలిస్టులు తాము విజేత కావడానికి ఎందుకు అర్హులో చెప్తూ, అర్హత లేని వ్యక్తి పేరును చెప్పాల్సి ఉంటుంది. మొదట అభి మాట్లాడుతూ.. 'ఎక్కువ సార్లు నామినేట్ అయి సేఫ్ అయ్యాను. నేను ట్రోఫీ గెలిచేందుకు అర్హుడిని అనుకుంటున్నాను. హారికతో పోటీపడటం నేను తట్టుకోలేను. కాబట్టి నేను గెలవాలంటే హారిక అర్హురాలు కావద్దు' అని చెప్పాడు. తర్వాత అఖిల్.. టాస్కుల్లో హద్దులు దాటినందుకు అరియానా అనర్హురాలు అనుకుంటున్నానని చెప్పాడు. సోహైల్.. అరియానా, అభిజిత్ అనర్హులు అని, హారిక.. అరియానా అనర్హురాలు అని చెప్పింది. మెజారిటీ ఫైనలిస్టులు అరియానా విజేత అయ్యేందుకు అర్హురాలు కాదని తేల్చి చెప్పారు అమ్మాయిలే ట్రోఫీ కొట్టాలి చివరగా అరియానా మాట్లాడుతూ.. 'ఆటలో నా పేరు గుర్తుండిపోవడం బాగుంది. అందరి బుర్రల్లోకి నా పేరే వచ్చిందంటే నేను గేమర్నే. అంటే ట్రోఫీ తీసుకునేందుకు నేను అర్హురాలినే' అని చెప్పుకొచ్చింది. హారిక కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేదంటూ ఆమెను అనర్హురాలని ప్రకటించింది. ఈ టాస్క్ ముగిసిన తర్వాత హారిక, అరియానా దీని గురించి చర్చించుకున్నారు. అనర్హులుగా అమ్మాయిల పేర్లే రావడాన్ని తట్టుకోలేకపోయారు. దీంతో ట్రోఫీ ఎలాగైనా అమ్మాయే గెలవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. (చదవండి: టోటల్ డ్యామేజ్ చేసుకుంటున్న అఖిల్) -
ఇప్పుడు తన వంతు అంటోన్న మోనాల్
బిగ్బాస్ నాలుగో సీజన్ కథ కంచికి చేరుతోంది. ఈ తరుణంలో లోపల ఉన్న తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించేందుకు అభిమానులు నడుం కట్టారు. హాట్స్టార్ ఓటింగ్తో పాటు మిస్డ్ కాల్స్ ద్వారా నిన్నటి నుంచే ఓట్ల వరద పారిస్తున్నారు. మరోవైపు టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్ల కోసం ఇప్పటికే ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్ సపోర్ట్ చేస్తున్నారు. ముక్కు అవినాష్, దేవి నాగవల్లి.. అరియానాకు, నోయల్.. హారికకు మద్దతిస్తుండగా మోనాల్ గజ్జర్ తన క్లోజ్ ఫ్రెండ్, ఫస్ట్ ఫైనలిస్ట్ అఖిల్ కోసం రంగంలోకి దిగింది. (చదవండి: అభిజిత్కు సపోర్ట్ చేస్తున్న రౌడీ హీరో) పద్నాలుగు వారాలు హౌస్లో తన ప్రయాణాన్ని కొనసాగించిన మోనాల్ నిన్నటితో బిగ్బాస్కు వీడ్కోలు పలికింది. ప్రతిదానికి ఏడుస్తూ నర్మదగా పేరు గడించిన ఆమె ఇంటి నుంచి నవ్వుతూ వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అఖిల్ తన బెస్ట్ఫ్రెండ్ అని ముందుగానే క్లారిటీ ఇచ్చింది. షో మొదటి రోజు నుంచి అతడు తనకు సపోర్ట్గా నిలబడ్డాడని చెప్తూ ఇప్పుడు అఖిల్ కోసం నిలబడాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. అఖిల్కు ఓటేయండని పిలుపునిచ్చింది. అలాగే సోహైల్, హారికకు కూడా సపోర్ట్ చేయండని అభిమానులను కోరింది. కాగా షో నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం మోనాల్ చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని సందర్శించినట్లు సమాచారం. (చదవండి: బిగ్బాస్ ట్రోఫీ గెలిచేందుకు అనర్హులు ఎవరు?) -
వచ్చే వారం నుంచి బిగ్బాస్ మిస్సవుతాం
బిగ్బాస్ గూటి కింద చేరిన కంటెస్టెంట్లు ఒకరితో ఒకరు కలిసిపోయారు. ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యారు. పొద్దున ఏదైనా పాట వేస్తే తప్ప నిద్ర లేవని ఇంటి సభ్యుల కోసం బిగ్బాస్ ఈ రోజు స్పెషల్ సాంగ్ వేయించినట్లు కనిపిస్తోంది. ఇందులో ఇంటిసభ్యుల మాటలు, పాటలు, అలకలు, ఏడుపులు, హెచ్చరికలు అన్నీ కలగలిపి ఉన్నాయి. ఇది విన్న కంటెస్టెంట్లు కొంత ఆశ్చర్యం, మరికొంత ఆనందంతో ఈ ర్యాప్ సాంగ్కు మరింత ఉత్సాహంగా స్టెప్పులేస్తున్నారు. బిగ్బాస్ కోరిక మేరకు అభిజిత్ తెలుగులో మాట్లాడండి అన్న వాక్యం రాగానే అభి లోలోపలే సరదాగా నవ్వుకున్నాడు. దెయ్యం టాస్కులో అరియానా అద్దంలో దెయ్యాన్ని చూసి జడుసుకుని ఏడవడం కూడా ఈ ర్యాప్ సాంగ్లో భాగం కావడంతో అందరూ పగలబడి నవ్వారు. (చదవండి: ఆ ఒక్కరికే రాహుల్ సిప్లిగంజ్సపోర్ట్!) మొత్తానికి ఈ ర్యాప్తో బిగ్బాస్ ఫినాలేలో ఉన్న ఇంటి సభ్యులకు వారి ప్రయాణాన్ని అంతా గుర్తు చేసినట్లైంది. ఈ వారంతో బిగ్బాస్ నాల్గో సీజన్కు శుభం కార్డు పడుతుండటంతో మిగిలిన ఐదుగురు ఇంటి సభ్యులు కూడా ఎవరి దారి వారు చూసుకోనున్నారు. ఇటు ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్మెంట్ మిస్సవనున్నారు. ఈ విషయాన్ని పదేపదే గుర్తు చేసుకుంటూ బిగ్బాస్ ప్రేమికులు డీలా పడిపోతున్నారు. వచ్చేవారం నుంచి బిగ్బాస్ ఉండదని తెగ బాధపడుతున్నారు. అరియానా బోల్డ్నెస్, సోహైల్ కామెడీ, హారిక క్యూట్నెస్, అభిజిత్ తెలివైన మాటలు, అఖిల్ పాటలు అన్నింటికీ దూరమవుతామంటున్నారు. ఈ సీజన్ చాలా తొందరగా పూర్తైనట్లు అనిపిస్తోందని చెప్తున్నారు. మొదట్లో వీళ్లంతా ఎవరు అనుకున్నవాళ్లేవాళ్లు ఇప్పుడు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను మిస్ అవుతామని భారంగా కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: నీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉంది: మోనాల్) -
బిగ్బాస్: మాట మీద నిలబడ్డ దేవి నాగవల్లి
ఎప్పటిలాగే ఈ సీజన్లో కూడా ఓ జర్నలిస్టు ఉండాలని దేవి నాగవల్లిని బిగ్బాస్ హౌస్లో దింపారు. ఆమె మాటల్లో పదును, చేతల్లో వేగం చూసి ఇంటిసభ్యులే భయపడిపోయేవారు. ఇంటి నియమాలను పట్టించుకోవడం లేదని బిగ్బాస్ క్లాస్ పీకినప్పుడు అందరూ క్షమించండంటూ లేచి దండాలు పెడుతుంటే ఆమె మాత్రం సోఫాలో నుంచి అంగుళం కదల్లేదు. తనే తప్పూ చేయనప్పుడు సారీ చెప్పాల్సిన అవసరమే లేదని అలాగే కూర్చుండిపోయింది. ఇక నామినేషన్స్ సమయంలోనూ ఆమె తనమన బేధాలు చూడకుండా ఇంటి సభ్యులు చేస్తున్న పొరపాట్లను ముక్కుసూటిగా ప్రస్తావిస్తూ నామినేట్ చేసేది. ఈసారి అమ్మాయిలే గెలవాలి ఇంటి సభ్యులతో పెద్దగా క్లోజ్ అయినట్లు చూపించకపోయినా ఆమె ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం అందరూ గుక్కపెట్టి ఏడ్చేశారు. ఆమెను శత్రువుగా అభివర్ణించిన అమ్మ రాజశేఖర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. అరియానా అయితే.. దేవి నా అక్క అంటూ బాధతో కూలబడిపోయింది. అయితే ఇది జరగడానికి ముందు అరియానా, దేవి నాగవల్లి ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సీజన్ అమ్మాయిల సొంతం కావాలని మాట్లాడుకున్నారు. మనలో ఎవరు వెళ్లిపోయినా మిగతా ఒకరు గెలిచే బాధ్యత తీసుకోవాలని మాట్లాడుకున్నారు. ఒకవేళ తను ఎలిమినేట్ అయి వెళ్లిపోయినా దేవి మాత్రం ఎలాగైనా గెలవాలంటూ అరియానా వర్షంలో ఏడ్చేసింది కూడా. కానీ చివరకు మూడో వారంలోనే దేవి ఎలిమినేట్ కాక తప్పలేదు. (చదవండి: దేవి నాగవల్లికి దాసరి దగ్గరి బంధువు) అరియానాను రక్షించుకుందాం.. ఇక అరియానా ఎవరి అండదండలు లేకుండానే హౌస్లో పద్నాలుగు వారాల జర్నీ పూర్తి చేసుకుని ఫైనల్కు చేరుకుంది. ఈ సమయంలో దేవి నాగవల్లి ఆమెకు అండగా నిలబడింది. ఇచ్చిన మాట ప్రకారం అమ్మాయి విన్నర్ అవ్వాలన్న కలను సాకారం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తోంది. అరియానాను గెలిపించాల్సిన సమయం ఆసన్నమైందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆమెను రక్షించుకుందామంటూ అభిమానులకు పిలుపునిచ్చింది. ఈ ఒక్క పోస్టుతో అరియానా అభిమానులకు కొండంత బలం వచ్చినట్లైంది. లేడీ ఫైటర్కు సపోర్ట్ ఇచ్చినందుకు ఆమె అభిమానులు దేవికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. (చదవండి: హారిక తమన్నా, మోనాల్ అనుష్క అంటోన్న అభి) View this post on Instagram A post shared by Devi Nagavalli (@devi_nagavalli) -
హారిక అర్హురాలు కాదు: బాంబు పేల్చిన అభి
బిగ్బాస్ నాల్గో సీజన్ పదిహేనో వారంలో ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరు ఎన్నో ఆటంకాలను దాటుకుంటూ, సమస్యలకు ఎదురీదుతూ ప్రీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్కు అర్హత సాధించారు. ముందైతే టాప్ 5లో అర్హత సాధించాలని కలలు నెరవేరడంతో అభిజిత్, అఖిల్, సోహైల్, హారిక, అరియానా ఇప్పుడు కప్పు గెలిచేందుకు తాపత్రయపడుతున్నారు. వీరి గెలుపు అంతా ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంది. ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు రన్నరప్గా నిలుస్తారో అనేది తేలడానికి కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో బిగ్బాస్ ఫైనలిస్టులతో ఓ ఆటాడించాడు. (చదవండి: బిగ్బాస్: నెరవేరని మోనాల్ కల!) ఇప్పుడున్న ఐదుగురిలో విజేత అవడానికి అర్హత లేని ఇంటి సభ్యుడి పేరు చెప్పమని ఆదేశించాడు. దీంతో అభిజిత్.. హారిక అర్హురాలు కావద్దు అనుకుంటున్నానని చెప్పి బాంబు పేల్చాడు. అయితే హారిక విజేత అయ్యేందుకు అర్హురాలు కాదన్నాడా? లేదా చివరలో ఉండేందుకు అర్హురాలు కాదన్నాడా? అనేది తెలియాల్సి ఉంది. అఖిల్, హారిక.. టైటిల్ గెలిచేందుకు అరియానా అనర్హురాలని అభిప్రాయపడ్డారు. అందరూ తనను అర్హురాలు కాదని గుచ్చిగుచ్చి చెప్పడాన్ని అరియానా పాజిటివ్గా తీసుకుంది. "నేను స్ట్రాంగ్ ప్లేయర్ అని ఇక్కడే తెలిసిపోతుంది. అందరి బుర్రలోకి దూరానంటే నేను గేమర్ను అని అర్థం. ఇది నాకు సంతోషాన్నిస్తోంది" అని చెప్పుకొచ్చింది. మరి ఈ గేమ్ పూర్తయ్యేసరికి ఎవరిని అనర్హురాలిగా ప్రకటించారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! (చదవండి: అవినాష్ను కాదని అభికే ఓటేస్తానంటోన్న బుల్లెట్ భాస్కర్) -
బిగ్బాస్: నెరవేరని మోనాల్ కల!
ఊహించనట్లే నర్మద వెళ్లిపోయేందుకు బిగ్బాస్ గేట్లు ఎత్తారు. అయితే ఎప్పుడూ ఏడ్చే ఆమె వెళ్లిపోయేటప్పుడు మాత్రం పెద్దగా ఏడవకుండా నవ్వుతూనే అందరికీ వీడ్కోలు పలకడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. తనకు మొదట్లో పువ్విచ్చిన అఖిల్కు బరువెక్కిన హృదయంతో వీడ్కోలు చెప్తూ అతడి చేతికి పువ్వందించింది. ఇంకా ఎన్నెన్నో జరిగిన బిగ్బాస్ హౌస్లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీ మీద ఓ కన్నేయండి.. రైతుల కోసం డబ్బు పక్కన పెడతా బిగ్బాస్ ప్రైజ్మనీ రూ.50 లక్షలని నాగ్ పేర్కొన్నారు. ట్రోఫీ గెలిచి ఈ డబ్బు మీ సొంతమవుతే ఏం చేస్తారని నాగ్ ప్రశ్నించారు. నాకు ఒక్క రూపాయి వద్దు, అన్నీ అమ్మకే ఇస్తానని హారిక చెప్పుకొచ్చింది. ఈ డబ్బులతో ఒక ఇల్లు కట్టుకుంటాను. మా ఊరిలో పొలం కోసం రూ.50,000 అప్పు చేసిన ఐదారుగురి రుణాన్ని తీర్చేస్తానని అరియానా తన మంచి మనసును చాటుకుంది. తాను డబ్బు గెలిస్తే దాన్ని నాన్నకే ఇచ్చేస్తానని అభిజిత్ అన్నాడు. నా కోసం ఎన్నో కష్టాలు పడ్డ అమ్మ కోసం ఇన్వెస్ట్ చేస్తాను అని మోనాల్, ఓల్డేజ్ హోమ్ వాళ్లకు కొంత డబ్బు ఇస్తాను. వీలైతే ఓ ఇల్లు కొనుక్కుంటా అలాగే ఒక కెఫె పెడతాను అని అఖిల్ చెప్పాడు. తను కెఫె పెడితే తప్పకుండా రావాలని నాగార్జునను ఆహ్వానించాడు. అనంతరం సోహైల్ మాట్లాడుతూ... నా అకౌంట్లో ఎప్పుడూ లక్షకు మించి లేవు. అవసరంలో ఉన్నవారి కోసం రూ.10 లక్షలు పక్కన పెడతాను. ఓ ఫ్లాట్ కొంటాను అని తన ప్లానింగ్స్ వివరించాడు. [చదవండి: ఆ హౌజ్మెట్కే నా మద్దతు: విజయ్ దేవరకొండ ] అబ్బాయిలను చిత్తుచిత్తుగా ఓడించిన అమ్మాయిలు అనంతరం కంటెస్టెంట్లు విన్నింగ్ స్పీచ్ ఇచ్చారు. కాకపోతే వారి విజయం గురించి కాకుండా తోటి ఇంటి సభ్యుడు గెలిస్తే ఎలా స్పీచ్ ఇస్తారో చెప్పాలని నాగ్ మెలిక పెట్టారు. ఇందులో హారిక.. మోనాల్, అరియానా.. అభిజిత్, అభిజిత్.. అఖిల్, మోనాల్.. సోహైల్, అఖిల్.. అరియానా, సోహైల్.. హారికను ఇమిటేట్ చేస్తూ వారి విన్నింగ్ స్పీచ్ ఇచ్చి నవ్వించారు. అనంతరం అభి ఫినాలేకు చేరుకున్నట్లు నాగ్ వెల్లడించారు. తర్వాత ఇంటిసభ్యులతో సినిమా పేరు కనుక్కోమని పోస్టర్ గేమ్ ఆడించారు. రెండో లెవల్లో డంబ్ షేరాడ్స్ ఆడించారు. అయినా సరే అబ్బాయిలు చిత్తు చిత్తుగా ఓడిపోగా అమ్మాయిలు గెలుపు సాధించారు. తర్వాత హారిక ఫినాలేలో అడుగు పెట్టినట్లు నాగ్ ప్రకటించారు. ఆమె మోనాల్ సేఫ్ అవుతుందని అభిప్రాయపడింది. కానీ ఆమె అంచనా తప్పింది. అరియానా ఫైనలిస్టుగా ఎంపికై మోనాల్ ఎలిమినేట్ అయింది. టైటిల్ గెలవాలా? ఇది మార్చుకోండి మోనాల్ ఎలిమినేషన్తో అఖిల్కు షాక్ తగిలింది. అతడి గొంతు మూగబోయింది. అతడి మౌన వేదనను అర్థం చేసుకున్న మోనాల్.. కన్నీళ్లతో అతడికి పువ్విచ్చి వీడ్కోలు తీసుకుంది. స్టేజీ మీదకు వచ్చిన మోనాల్ టైటిల్ గెలవాలంటే ఏం మార్చుకోవాలో ఇంటిసభ్యులకు సలహాలిచ్చింది. అందరితో మాట్లాడమని, ముఖ్యంగా అఖిల్కు సమయం కేటాయించమని అభిజిత్కు సూచించింది. నేను హౌస్లో ఉంటే మీ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యేవారు అన్నావు కదా, ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ వచ్చిందని అభికి చెప్పచెప్పింది. దీంతో అభి స్పందిస్తూ.. తానలా అనలేదని, బాధపెట్టి ఉంటే క్షమించమని కోరాడు. బిగ్బాస్ అయ్యాక తప్పకుండా గుజరాత్కు వచ్చి కలుస్తానని మాటిచ్చాడు. అరియానాకు టాస్క్లో అంత అగ్రెసివ్ వద్దని సూచించింది. సోహైల్.. చిన్న చిన్న మాటలకు బాధపడొద్దని తెలిపింది. ఫైనల్లో హారిక.. అఖిల్ను దాటేయాలని కోరింది. ఆమె కోరిక విని అఖిల్ షాక్తో నోరు తెరిచాడు. (చదవండి: బిగ్బాస్ విన్నర్ అభిజితే: శ్రీకాంత్) భావాలను పాటలో వ్యక్తీకరించిన అఖిల్ ఈ మధ్య తనను పట్టించుకోవడం మానేసిన అఖిల్ మీద మోనాల్ గరమైంది. వచ్చే ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేదని చిర్రుబిర్రులాడింది. ఒక పాట పాడమని చెప్పగా.. 'ఉండిపోరాదే, గుండె నీదేలే..' అంటూ గుండె లోతుల్లోని ప్రేమను వెలికితీస్తూ పాడటంతో ఆమె కళ్ల వెంట నీళ్లు జలజలా రాలాయి. నిన్ను బాధపెట్టినందుకు సారీ అంటూనే వారం తర్వాత వచ్చి మాట్లాడతానన్నాడు. అయితే గొడవపెట్టుకునేందుకు మాత్రం రావద్దని మోనాల్ హెచ్చరించగా అదేంటో కాస్త మాకు కూడా చెప్పండని నాగ్ సరదాగా జోక్ చేయడంతో అందరూ నవ్వేశారు. పార్టీ చేసుకున్న ఫైనలిస్టులు టైటిల్ గెలిస్తే వచ్చే ప్రైజ్మనీతో అమ్మ కోసం ఇన్వెస్ట్ చేయాలన్న మోనాల్ కల ప్రస్తుతానికైతే కలగానే మిగిలిపోయింది. అనంతరం టాప్ 5 కంటెస్టెంట్లు అఖిల్, సోహైల్, అభిజిత్, హారిక, అరియానా ఫైనల్లో అడుగుపెట్టినందుకు చిందేస్తూ పార్టీ చేసుకున్నారు. మరో ముఖ్య విషయమేంటంటే.. వీళ్లలో ఒకరిని విన్నర్ చేసే ఓటింగ్ ఈ రాత్రి నుంచే మొదలు కానుంది. కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంటుకు ఓటేయడం అస్సలు మిస్సవకండి. (చదవండి: హారిక తమన్నా, మోనాల్ అనుష్క అంటోన్న అభి) -
బిగ్బాస్ : ఫ్రైజ్ మనీ గెలిస్తే.. సోహైల్ ఎమోషనల్
ఎన్నో అనుమానాల మధ్య మొదలైన బిగ్బాస్ నాల్లో సీజన్.. అప్పుడే ముగింపు దశకు చేరుకుంది. కరోనా, ఐపీఎస్ లాంటి ఎన్నో ఆటుపోటులను తట్టుకుంటూ వచ్చిన ఈ బిగ్ రియాల్టీ షో మరో వారం రోజుల్లో ముగియనుంది. కొద్ది సమయం మాత్రమే ఉండటంతో కంటెస్టెంట్స్ తుదిపోరుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హౌస్లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్లో ఇప్పటికే టాప్ 5లో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. అఖిల్ , సోహైల్ ఇద్దరూ బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫినాలే చేరుకున్నారు. ఈ రోజు ఒకరు ఎలిమినేట్ అయి మరో ముగ్గురు టాప్లోకి చేరుకుంటారు. ఇదిలా ఉంటే వారం రోజుల ముందే విన్నర్కు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో నాగార్జున తేల్చేశాడు. నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ప్రైజ్ మనీ పై క్లారిటీ ఇచ్చినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. బిగ్బాస్ విన్నర్కు 50లక్షల రూపాయల ప్రైజ్ మనీని అందుకుంటారు. అయితే ఈ భారీ జాక్ పాట్ ఎవరు అందుకుంటారు? ఆ డబ్బుతో ఏమేం చేస్తారో చెప్పాలని నాగ్ అడగ్గా.. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. ముఖ్యంగా సోహెల్ ఒక్క డైలాగ్ తోనే ఎమోషనల్ గా టచ్ చేసినట్లు అర్ధమయ్యింది. ఇప్పటివరకు నా అకౌంట్ లో లక్ష దాటి లేదు అని వివరణ ఇచ్చాడు. ఇక హారిక మాత్రం ఆ డబ్బును గెలుచుకుంటే పూర్తిగా తన తల్లికే ఇస్తానని చెప్పింది. ఇక అభిజిత్ వంతు రావడంతో ఆ ప్రైజ్ మనీ మొత్తం ఇంట్లో వాళ్ళకే అంటూ ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ అని చెప్పాడు. ఇక అఖిల్ మంచి కేఫె ఓపెన్ చేస్తానని చెప్పాడు. దానికి ముఖ్య అతిథిగా రావాలని నాగ్ను కోరాడు. ఇక బిగ్ బాస్ విన్నర్గా ప్రకటిస్తే.. కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేరే కంటెస్టెంట్స్ చూపించాలని నాగ్ కోరడంతో హారిక, మోనాల్ ను ఇమిటేట్ చేసింది. ఇక అఖిల్ అరియానా ఫీలింగ్ ను తెలుపగా..అరియానా అభిని ఇమిటేట్ చేసింది. మోనాల్, సోహెల్ డ్యాన్స్ ను చూపించగా.. హారిక ముద్దులు ఎలా పెడుతుందో సోహెల్ చూపించాడు. మరి వారి ఇమిటేట్ హౌస్లో ఏ మేరకు నవ్వులు పూయించిదో నేటి ఎపిసోడ్లో చూడాలి. -
బిగ్బాస్ : పిల్లలెలా పుడతారు.. నాగ్ ఫన్నీ ఆన్సర్
బిగ్బాస్ నాల్గో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ బిగ్ రియాల్టీ షోకి శుభం కార్డు పడనుంది. ఎన్నో అనుమానాల మధ్య మొదలైన బిగ్బాస్ నాల్గో సీజన్.. మొదట్లో కాస్త చప్పగా సాగింది. హౌస్లో ఎక్కువ మంది కొత్త ముఖాలే ఉండటంతో షో చూడడానికి ప్రేక్షకులు అంతగా ఇష్టపడలేదు. ఇలాంటి తరుణంగా షోను విజయవంతం చేసే బాధ్యతను హోస్ట్ నాగార్జున తన భుజాల పైన వేసుకున్నాడు. మొదట్లో కేవలం నాగార్జున కోసం మాత్రమే షో చూశారనడంతో అతిశయోక్తి లేదు. వచ్చేది వారానికి రెండు రోజులే అయినా.. వారం మొత్తం ఆ రెండు ఎపిసోడ్లను గుర్తు పెట్టుకునేలా తనదైన ముద్ర వేసి వేళ్లేవాడు. ఇంటి సభ్యుల తప్పులకు కోపంతో కాకుండా నవ్వుతో చెబుతూ వచ్చాడు. అలాగే తనదైన శైలీలో ఇంటి సభ్యులపై పంచ్లేస్తూ శని, ఆదివారాలను ఫన్డేలుగా మార్చేస్తున్నాడు. షో ముగింపుకు వచ్చిన నాగ్ పంచ్, జోకులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా శనివారం నాగార్జున చెప్పి ఫన్నీ అన్సర్ ఒకటి ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. గత మూడు రోజుల క్రితం టాస్క్లో భాగంగా మోనాల్ని అభిజిత్ కొన్ని నాటీ ప్రశ్నలు అడిగి ఆమెను తికమక పెట్టే ప్రయత్నం చేశాడు. ఆమె ఏకాగ్రతను దెబ్బతీసేందుకై.. ‘పిల్లలు ఎలా పుడతారు మోనల్?’ అని అభిజిత్ అడిగాడు. అతడు ఈ ప్రశ్న అడగగానే సోహెల్, అరియానా ఆశ్చర్యపోయారు. అరియానా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఈ ప్రశ్న మోనల్ మాత్రం అదిరిపోయే సమాధానం ఇచ్చింది. ‘‘అమ్మ హాస్పిటల్కు వెళ్తుంది. అక్కడ డాక్టర్ హెల్ప్ చేస్తారు. అదొక గిఫ్ట్’’ అని మోనల్ సమాధానం ఇచ్చింది. ఆ రోజు ఆ ప్రశ్నే హైలెట్గా నిలిచింది. ఇక ఇదే ప్రశ్నను మరోసారి ఇంటిసభ్యుల ముందుకు తెచ్చాడు నాగార్జున. శనివారం ఇంటి సభ్యులకు ఫన్నీ టాస్కులు ఇచ్చిన నాగ్... పిల్లలెలా పుడతారు? అని అభిజిత్ అడిగిన ప్రశ్నను తిరిగి అతడికే సంధించారు. దీంతో కంగుతిన్న అభి.. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఆశ్చర్యంతో నిలబడిపోవడంతో,నాగ్.. ఏడుస్తూ పుడతారు అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు. నాగ్ జవాబుకు హౌస్మేట్స్ అంతా పగలబడి నవ్వారు. -
బిగ్బాస్ అయ్యాక గుజరాత్ వెళ్తా: అభిజిత్
బిగ్బాస్ నాల్గో సీజన్ ప్రీ ఫైనల్స్లో నాగార్జున టామ్ అండ్ జెర్రీ గొడవను చర్చించారు. ఇద్దరి తప్పులను ఎత్తి చూపి చిన్నదానికి పెద్దదిగా చేశారని చురకలంటించార. వుమెన్ కార్డు తీయడం మాత్రం అక్షరాలా తప్పేనని అరియానాను విమర్శించారు. అమ్మాయి మీదకు అలా పైపైకి వెళ్లి మాట్లాడటం కూడా తప్పేనని సోహైల్ను తిట్టిపోశారు. అనంతరం సోహైల్ను ఫైనల్లో అడుగు పెట్టిన రెండో కంటెస్టెంట్గా ప్రకటించారు. మరి ఈ సూపర్ సిక్స్ కంటెస్టెంట్లతో నాగ్ ఏం ఆటలాడించారు? ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ బిగ్బాస్ స్టోరీని చదివేయండి.. మోనాల్ హైపర్: అభి హౌస్లోకి వచ్చినప్పుడు మిగతావాళ్ల మీద ఫస్ట్ ఇంప్రెషన్, ఇప్పుడు ఫైనల్ ఇంప్రెషన్ ఏంటో చెప్తూ లైక్, డిస్లైక్ పెట్టాలని నాగార్జున ఇంటిసభ్యులను ఆదేశించారు. మొదట హారిక.. అఖిల్, అభిజిత్, మోనాల్కు గ్రీన్ థమ్సప్ ఇచ్చి సోహైల్, అరియానాను డిస్లైక్ చేసింది. తర్వాత వచ్చిన అఖిల్.. హారిక, మోనాల్, సోహైల్కు లైక్, మిగతా ఇద్దరికి డిస్లైక్లు ఇచ్చాడు. అనంతరం అభిజిత్.. అరియానా, హారిక, సోహైల్కు లైక్, మిగతా ఇద్దరికి డిస్లైక్ ఇచ్చాడు. మోనాల్ను చూడగానే హైపర్ అనిపించిందని, బిగ్బాస్ అయిపోయాక ఓసారి గుజరాత్కు వెళ్తానన్నాడు. మోనాల్ను, ఆమె అమ్మను కలుద్దామనుకుంటున్నానని చెప్పాడు. (చదవండి: మనసుతో ఆలోచించి ఓటేయండి: రాహుల్) అఖిల్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేశా మోనాల్ వంతు రాగా ఆమె అఖిల్, హారిక, సోహైల్కు లైక్ మిగతా ఇద్దరికి డిస్లైక్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చేముందు అఖిల్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేశానంది. కానీ హౌస్లోకి రాగానే అతడు పట్టించుకోలేడని బుంగమూతి పెట్టింది. అనంతరం అరియానా.. అభిజిత్, హారిక, మోనాల్కు లైక్, అఖిల్, సోహైల్కు డిస్లైక్ ఇచ్చింది. సీక్రెట్ రూమ్లోనే సోహైల్ ఆలోచన, తన ఆలోచన కనెక్ట్ అవ్వలేదని చెప్పింది. ఈ సందర్భంగా నాగ్ వీళ్ల గొడవను ప్రస్తావించారు. అతడికి కోపమే వీక్నెస్ అని తెలిసి దాన్ని టచ్ చేశావు, ఫస్ట్ హైపిచ్లో నువ్వు మాట్లాడితేనే అతడు రైజ్ అయ్యాడు అని వివరించారు. (చదవండి: హారికను చుమ్మా ఇవ్వమని బెదిరించిన అఖిల్) మూడో వ్యక్తిని తీసుకొచ్చింది నువ్వు అటు సోహైల్ను సైతం టాస్క్లో కోపం కంట్రోల్ చేసుకున్న నువ్వు జీవితంలో దాన్ని నియంత్రించుకోలేవా? అని ప్రశ్నించారు. నీ ఆటిట్యూట్ వల్ల, అరియానా మొదట అరిచి మాట్లాడటం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు. నువ్వు హారికను ఉదాహరణగా చెప్పడం వల్లే అతడు మోనాల్ గుడ్డు విషయాన్ని ఉదాహరణగా తీసుకొచ్చాడని అరియానాకు స్పష్టం చేశారు. ఆడపిల్లలను నేను సపోర్ట్ చేస్తాను కానీ హౌస్లో అందరూ సమానమే అని పేర్కొన్నారు. మోనాల్ బిక్కుబిక్కుమని ఏడుస్తుంటే ఓదార్చడానికి కూడా వెళ్లలేదు? అని అడగ్గా అప్పుడే గొడవైంది కాబట్టి ఆమెను ఓదార్చలేదని అరియానా స్పష్టం చేసింది. (చదవండి: అవినాష్ అవుట్: అభిజిత్పై బిగ్బాంబ్) అభిజిత్ ప్రశ్నకు నాగ్ ఆన్సర్ వుమెన్ కార్డు ఎందుకు తీశావు? సోహైల్ బూతులేమైనా అన్నాడా? అని ప్రశ్నలు కురిపించగా లేదని అరియానా బదులిచ్చింది. అబ్బాయి మీద మీదకు వచ్చాడంటూ వుమెన్ కార్డు తీయడం తప్పని నాగ్ ఆమెను హెచ్చరించారు. నా జీవితంలో ఏ అబ్బాయి ఇలా పైకి వచ్చి మాట్లాడలేదని, అందుకే ఏడ్చానంటూ అరియానా తన బాధ వెనక కారణాన్ని చెప్పుకొచ్చింది. తర్వాత తిరిగి టాస్కు కంటిన్యూ చేయగా.. సోహైల్.. అఖిల్, మోనాల్కు యాటిట్యూడ్, అభిజిత్ను అమాయకుడు అంటూ వారికి లైక్, హారిక, అరియానాకు డిస్లైక్ ఇచ్చారు. ఈ క్రమంలో నాగ్.. పిల్లలెలా పుడతారు? అని అభిజిత్ అడిగిన ప్రశ్నను తిరిగి అతడికే సంధించారు. అందుకాయన ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో నాగ్.. ఏడుస్తూ పుడతారు అని ఆన్సరిచ్చారు. కలిసిపోయిన టామ్ అండ్ జెర్రీ తర్వాత నాగ్ ఫినాలేకు వెళ్లే టాప్ 5 కంటెస్టెంట్లను రివీల్ చేసుకుంటూ వెళ్లారు. మొదటగా ఫినాలేలో అడుగు పెట్టిన అఖిల్ను అతడి తర్వాత వచ్చే నలుగురు ఎవరో చెప్పమని అడగ్గా సోహైల్, మోనాల్, అభిజిత్, హారిక పేర్లను వరుస క్రమంలో చెప్పుకుంటూ పోయాడు. అనంతరం సోహైల్ ఫైనలిస్టుగా ఎంపికైనట్లు ప్రకటించడంతో అతడు ఆనందంతో గంతులు వేశాడు. తన కోపాన్ని తగ్గించుకుంటానని, బిగ్బాస్ ఒక లాకెట్ ఇస్తే, కోపం వచ్చినప్పుడల్లా దాన్ని చూసి కంట్రోల్ చేసుకుంటానన్నాడు. చివర్లో సోహైల్, అరియానా కలిసిపోవడం కొసమెరుపు. ఇద్దరూ మోకాళ్లపై కూర్చుని ఒకరికి ఒకరు సారీ చెప్పుకున్నారు. జరిగినవన్నీ మర్చిపోదామని, కొత్త అధ్యాయం ప్రారంభిద్దామని మాటిచ్చుకున్నారు. (చదవండి: మోనాల్ నాకోసం స్టాండ్ తీసుకోవాల్సింది: అభిజిత్) -
బిగ్బాస్: హారిక సేఫ్, మోనాల్ అవుట్!
బిగ్బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ దక్కించుకునేందుకు కంటెస్టెంట్లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎలాగోలా టాప్ 5లో స్థానం సంపాదించుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్ సుడిగండం నుంచి తప్పించుకోగలిగితే ఫైనల్ బెర్త్ ఖాయమైనట్లే. తాజాగా రిలీజైన ప్రోమో ప్రకారం వ్యాఖ్యాత నాగార్జున వారి సస్పెన్స్కు తెరదించబోతున్నారు. ఫినాలేలో అడుగుపెట్టనున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఫినాలేలో తిష్ట వేసిన అఖిల్ ఏ భయం లేకుండా గుండెల మీద చెయ్యేసుకుని కళ్ల ముందు జరుగుతున్న విన్యాసాలను ప్రేక్షకుడిలా చూస్తున్నాడు. అయితే అఖిల్ కోసం ఫినాలే మెడల్ త్యాగం చేసిన సోహైల్ టాప్ 5లోకి వెళ్లిన రెండో కంటెస్టెంటు అని చెప్తున్నారు. అభి, అరియానా కూడా ఫైనల్కు వెళ్తున్నారు. (చదవండి: అరియానాను గెలిపించండి: వర్మ విన్నపం) మిగిలిందల్లా హారిక, మోనాల్. డేంజర్ జోన్లో ఉన్న ఈ ఇద్దరిలో దేత్తడి సేఫ్ కాగా మోనాల్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఎన్నోవారాలు నామినేషన్లోకి వెళ్లిన ఆమె ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లి బయట పడ్డ సందర్భాలు కోకొల్లలు. కొన్నిసార్లైతే ఆమె కోసం కుమార్ సాయి, అవినాష్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పంపించేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ వారం మోనాల్ బిగ్బాస్.. మిగిల్చిన బాధలను, అపనిందలను మూటగట్టుకుని హౌస్ నుంచి వీడ్కోలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్న ఆమె కల అసంపూర్తిగానే మిగిలిపోయేలా ఉంది. మొదట్లో ఇద్దరబ్బాయి మధ్య నలిగిపోయిన ఆమె చివరికి ఒంటరిగా బయటకు వెళ్తోంది. అయితే ఈ ఎలిమినేషన్లో బిగ్బాస్ ఏదైనా ట్విస్టు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే గతవారం కూడా మొదట మోనాల్ ఎలిమినేట్ అయిందన్న వార్తలు వినిపించాయి. కానీ చివరికి ఎంటర్టైనర్ అవినాష్ వెళ్లిపోయాడు.ఇక ఈ వారం దేత్తడి పాప కూడా డేంజర్ జోన్లోనే ఉంది కాబట్టి ఆమెను పంపించేసి మోనాల్ను సేఫ్ చేసే అవకాశాలూ లేకపోలేదు. మరి ఏం జరగనుందనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా చెప్పేవరకు వెయిట్ చేయాల్సిందే! (చదవండి: విన్నర్ ఎవరో తేల్చేసిన హీరో శ్రీకాంత్) -
బిగ్బాస్: తప్పెవరిదో తేల్చనున్న నాగ్
పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఇష్టమైన కార్టూన్ 'టామ్ అండ్ జెర్రీ'. బిగ్బాస్ హౌస్లోని అరియానా, సోహైల్ బంధం కూడా ఇలాంటిదే. ట్రయాంగిల్ స్టోరీ కన్నా ఈ రిలేషన్నే చాలామంది ఇష్టపడుతారు కూడా. ఈ రియల్ టామ్ అండ్ జెర్రీలు ఎప్పుడు కలిసుంటారో, ఎప్పుడు కొట్టుకుంటారో వీళ్లకే తెలీదు. అలా చాలాసార్లు సరదాగా గొడవ పడ్డ ఈ కంటెస్టెంట్లు ఎన్నడూ లేనట్లుగా ఈ వారంలో తొలిసారి భీభత్సమైన గొడవకు దిగారు. బద్ధ శత్రువుల్లా కయ్యానికి కాలు దువ్వారు. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా మాటల యుద్ధానికి దిగారు. వీళ్ల ఉక్రోషాన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదు. ఆ ఘర్షణ జరిగిన మరుక్షణం నుంచి వీళ్ల మధ్య దూరం పెరిగింది. వాళ్ల మనసుల్లోనూ అశాంతి మొదలైంది. ఈ సమస్యను పరిష్కరించుకోకోవాలన్న వారి ప్రయత్నం వృథా అయింది. (చేజేతులా నాశనం చేసుకుంటున్న సోహైల్) దీంతో ఇద్దరూ నాగార్జున చెప్పే తీర్పు కోసం ఎదురు చూస్తూ భారంగా రోజులు వెళ్లదీశారు. తీరా ఈ రోజు వాళ్ల గొడవకు ముగింపు పలికే సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నాగ్ వీళ్ల గొడవను ప్రస్తావించారు. ఇద్దరి తప్పులను ఎత్తి చూపారు. టాస్క్లో కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావు, కానీ జీవితంలో మాత్రం దాన్ని నియంత్రించుకోలేవా? అని సోహైల్ను నిందించారు. దీంతో అతడు స్పందిస్తూ హారిక చేసింది తప్పైతే నువ్వు చేసిందేంటి? అని ఆమె నా దగ్గర మూడో వ్యక్తి గురించి ప్రస్తావించింది అంటూ అరియానా వైపు చేయి చూపించాడు. అతడి మాటలు విన్న తర్వాత నాగ్.. "ముందుగా ఆవేశపడింది నువ్వు, మూడో వ్యక్తిని మొదట తీసుకొచ్చింది నువ్వు, మళ్లీ ఏడ్చి వుమెన్ కార్డు తీసుకొచ్చావు' అంటూ అరియానాకు క్లాస్ పీకుతున్నట్లుగా చూపించారు. బిగ్బాస్ హౌస్లో అందరూ సమానమే అని మరోసారి కుండ బద్ధలు కొట్టారు. మరి వీళ్ల సమస్యకు నాగ్ ఎటువంటి పరిష్కారం చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. (అరియానాతో సినిమా తీస్తా: రామ్ గోపాల్ వర్మ) -
ఆ ఒక్కరికే రాహుల్ సిప్లిగంజ్సపోర్ట్!
బిగ్బాస్ నాల్గో సీజన్లో టాప్ 5 గురించే చర్చ నడుస్తోంది. ఈ వారంలో ఎవరు ఫైనల్కు వెళ్లే అవకాశానికి దూరం కానున్నారనేది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు కంటెస్టెంట్ల బలాబలాను చూపించిన బిగ్బాస్ ఈ వారం మాత్రం వారిని అన్ని రకాలుగా పరీక్షించాడు. ఇంటిసభ్యుల ఓపికకు పరీక్ష పెడుతూనే ఏకాగ్రతను అంచనా వేశాడు. వారిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ను కూడా 'అధికారం' టాస్కు ద్వారా బయటపడేందుకు ప్రయత్నించాడు. కానీ ఈ టాస్కుల్లో ఎన్నడూ లేనంత రచ్చ చోటు చేసుకుంది. ఇంకో వారంలో షో ముగిసే సమయంలో పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. మోనాల్, అరియానా మధ్య మొదలైన ఈ గొడవ అరియానా, సోహైల్ దగ్గర అగ్గి రాజుకుంది. (చదవండి: ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే అఖిలే విన్నర్!) అగ్రిమెంట్ రాసుకున్నానా? వీళ్ల లొల్లితో అగ్నిగుండంలా మార్చిన హౌస్ను చల్లార్చడం కేవలం నాగార్జున వల్లే అవుతుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే గత సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఈ టామ్ అండ్ జెర్రీలను సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట అభిజిత్కు మద్దతు తెలిపినప్పటికీ తర్వాత అరియానా, సోహైల్కు ఓటేయమండంటూ యూటర్న్ తీసుకోవడంతో అభి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయనను ట్రోల్ చేశారు. దీంతో మండిపడ్డ రాహుల్ ఒక్కరికే సపోర్ట్ చేస్తానని అగ్రిమెంట్ రాసుకున్నానా? అని విరుచుకుపడ్డాడు. అభి ఎలాగో సేవ్ అవుతాడు కాబట్టే మిగతావాళ్లకు సపోర్ట్ చేస్తున్నా అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వారం జరిగిన గొడవతో రాహుల్ మళ్లీ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరికి బదులుగా సోహైల్కు ఒక్కడికే సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్టు కూడా పెట్టాడు. (చదవండి: బిగ్బాస్లోకి రామ్ గోపాల్ వర్మ.. కండీషన్స్ అప్లై) కారణం లేకుండా కోపం రాదు "బిగ్బాస్ హౌస్లో సోహైల్ నిజమైన ఎంటరైనర్. ముక్కసూటిగా మాట్లాడతాడు, శక్తిమేర కష్టపడతాడు, పాజిటివ్గా ఆలోచిస్తాడు, ముఖ్యంగా తన స్నేహితులను ఎప్పుడూ ఎంకరేజ్చేస్తుంటాడు. హౌస్లో ఎవరైనా బాధపడుతుంటే చూడలేడు, వాళ్లను సముదాయించేందుకు ప్రయత్నిస్తాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించేందుకు ఎప్పుడూ ముందుంటాడు. అతడికి షార్ట్ టెంపర్ ఉంది. కానీ ఏ కారణం లేకుండా ఊరికే కోపం రాదు, అలా అని వచ్చిన కోపాన్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించడు. ఎలాంటి ముసుగు ధరించకుండా నిజాయితీగా ఉంటాడు. మనందరిలో ఒకడిగా మెదులుతాడు" అని సోహైల్ గురించి చెప్పుకొచ్చాడు. ఇది కేవలం తన అభిప్రాయమని పేర్కొన్నాడు. షో ముగింపుకు ఇంకా కొన్ని రోజులే ఉన్నందున బాగా ఆలోచించి మీకు బెస్ట్ అనిపించిన కంటెస్టెంట్కే ఓటేయండని బిగ్బాస్ ప్రేమికులకు విజ్ఞప్తి చేశాడు. -
సంక్రాంతి తర్వాత షురూ
‘వైల్డ్ డాగ్’ సినిమా చిత్రీకరణ, బిగ్ బాస్ షోతో కొన్ని రోజులుగా నాగార్జున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20తో ‘బిగ్ బాస్–4’ పూర్తవుతుంది. ‘వైల్డ్ డాగ్’ కూడా ఇటీవలే పూర్తయింది. దాంతో కొత్త ప్రాజెక్ట్కు రెడీ అయ్యారు నాగ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందనున్న చిత్రం జనవరి నెలలో ఆరంభం కానుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను సంక్రాంతి తర్వాత ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో నాగ్ సరసన జోడీగా ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వారిని త్వరలోనే ఫైనల్ చేయనున్నారని తెలిసింది. -
బిగ్బాస్ : కుక్క అనుకున్నా పర్లేదు.. అఖిల్
మొదటి సారి తెలివైనోడు(అభిజిత్) టాస్క్ కండీషన్స్ మర్చిపోయి ఓడిపోయాడు. ప్రతి సారి టాస్క్ పేపర్ను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చదివే అభిజిత్.. నేడు మాత్రం ఒక్కసారి కూడా టాస్క్ పేపర్ చదవలేదు. దీంతో నిబంధనలు మర్చిపోయి మంచి చాన్స్ మిస్సయ్యాడు. ఇక తనకు కెప్టెన్సీ టాస్క్కు సహాయం చేసిన మోనాల్కు అరుదైన అవకాశం కల్పించి హారిక తన రుణం తీర్చుకుంది. అసలు మన తెలివైనోడు మర్చిపోయిన కండీషన్ ఏంటి? మోనాల్ రుణం హారిక ఎలా తీర్చుకుందో నేటి ఎపిసోడ్లో చదివేద్దాం. మరింత రెచ్చిపోయిన పులిహోర రాజా పులిహోర కలపడంతో అఖిల్ ఆరితేరిపోయాడు. చాన్స్ దొరికితే చాలు ఇంట్లోని అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నిన్న పులిహోర రాజా అన్న మోనాల్తో గొడవ పడిన అఖిల్.. ఈ రోజు ఏమో ఆమె ముందే హారికను ఫ్లర్ట్ చేశాడు. హారిక ఏదో పనిచేసుకుంటూ కిచెన్లో ఉండగా.. అఖిల్ మెల్లగా ఆమె దగ్గరకు చేరాడు. సొహైల్ చూసి.. ఏంటి ఆమె దగ్గరకు పోతున్నావ్ అని అనడంతో.. హారికను వెనకనుంచి వాటేసుకుని ఏం షాంపూ ఇది.. మా దగ్గర లేదే నీ దగ్గరకు ఎలా వచ్చింది? అంటూ ఆమెతో మాటలు కలపడం స్టార్ట్ చేశాడు. ఏంట్రా ఇది అంటూనే హారిక కూడా అఖిల్తో డబుల్ మీనింగ్ వచ్చే మాటలు మాట్లాడింది. ఇక హారిక మాటలకు అఖిల్ మరింత రెచ్చిపోయి ఆమెపై పాట పాడుతూ.. పక్కనే ఉన్న మోనాల్ను ఏడిపించే ప్రయత్నం చేశాడు. కానీ మోనాల్ మాత్రం ఏమి విననట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఎదురుగా ఉన్న సోహైల్.. పులిహోర కలపడంలో నువ్వే తోపువంటూ అఖిల్పై పంచ్ వేశాడు. ‘నన్ను కుక్క అనుకున్నా పర్లేదు.. కుక్కకు విశ్వాసం ఉంటుంది.. మా యాజమాని(హారిక) దగ్గరకి వస్తే కరిచేస్తా’ అంటూ ఘోరమైన పులిహోర కలిపాడు. స్టెప్పులేసి.. గొల్డెన్ మైక్ పట్టు ప్రేక్షకులతో మరింత కనెక్ట్ అయ్యేందుకు హౌస్మేట్స్కు బిగ్బాస్ మరో అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే మూడు రకాల టాస్క్లు ఇచ్చిన బిగ్బాస్.. నాల్లో టాస్క్గా వినోదాన్ని అందించే చాన్స్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా తక్కువ సైజు షూ ధరించి స్లేజ్పై డాన్స్ చేయాలి. ఆ సమయంలో ఎవరూ కూడా స్జేజీపై కూర్చోవడం కానీ, నిలబడటం కానీ చేయకూడదు. అలాగే మధ్య మధ్య మ్యూజిక్ ఆపేస్తానని.. అప్పుడు ఒకరు కిందకు దిగాలని కండీషన్ పెట్టాడు. అయితే ఎవర దిగిపోతారో ఇంటి సభ్యల ఇష్టమని చెప్పాడు. ఈ టాస్క్కు అఖిల్ని సంచాలకుడిగా నియమించాడు. కిందికి ఎవరి దించాలో అఖిల్ కూడా సూచించవచ్చని బిగ్బాస్ చెప్పాడు. చివరి వరకు స్టేజీపై ఎవరు ఉంటారో వారికి గోల్డెన్ మైక్ లభిస్తుందని చెప్పాడు. అయ్యో అభి.. చూసుకోవాలిగా దీంటో భాగంగా ఇంటి సభ్యులంతా తక్కువ సైజ్ గల షూ ధరించి డాన్స్ చేశారు. మొదటి సారి మ్యూజిక్ ఆపేయగా.. అఖిల్ పాటు మిగతా ఇంటి సభ్యులంతా అరియానాను దిగాల్సిందిగా కోరారు. ఆమెకు ఇదివరకే రెండు సార్లు ప్రేక్షకులతో మాట్లాడే చాన్స్ వచ్చిందని, ఈ సారి మిగతా వారికి అవకాశం ఇవ్వాలన్నారు. అయితే ఇక్కడ అరియానా కొంచెం అతి చేసింది. తాను దిగేందుకు సిద్దంగా ఉన్నానంటునే ఇప్పుడు మాత్రం దిగనని, రెండోసారి దిగుతానని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఎవరు దిగుతారని అభిజిత్ ప్రశ్నించగా.. సోహైల్ కూడా ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసే చాన్స్ వచ్చింది కదా.. ఆయన్ని దిగమని చెప్పింది. ఇప్పుడు నువ్వు ఎందుకు దిగవని చెబితే.. నాకు డాన్స్ చేయాలని ఉందని, ఏవోవో చెప్పుకొచ్చింది. ఇక అరియానా ఇప్పట్లో ఒప్పుకునేలా లేదనుకున్న అభిజిత్.. టాస్క్ కండీషన్ మర్చిపోయి కింద కూర్చున్నాడు. ఈ విషయాన్ని మోనాల్ గుర్తు చేసింది. దీంతో మొదటి సారి మన తెలివైనోడు.. తనకు ఈ విషయం తెలియదని, పొరపాటు జరిగిపోయిందంటూ స్టేజీ దిగేశాడు. ఇక అభి మొదటి సారి టాస్క్ కండీషన్స్ మర్చిపోవడంతో ఇంటి సభ్యులు అంతా అవాక్కయ్యారు. సోహైల్ అయితే.. ఏంటి అభి.. ప్రతిసారి టాస్క్ పేపర్ క్షుణ్ణంగా చదువుతావు.. ఈ సారి ఏమైంది చూసుకోవాలి కదా..అని నవ్వుతూ అభిపై సెటైర్లు వేశాడు. అందుకే దిగుతున్నా : అరియానా ఇక రెండో సారి మ్యూజిక్ ఆగినప్పుడు అరియానా దిగుతూ..తనకు ఇప్పటికే రెండు సార్లు ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేసుకునే చాన్స్ వచ్చిందని, మిగతవారికి కూడా రావాలనే స్టేజీ దిగుతున్నానని చెప్పి దిగిపోయింది. అలా మూడో సారి సోహైల్ దిగిపోయాడు. తానకు డాన్స్ చేయాలని ఉందని, కేవలం హౌస్మేట్స్ కోసమే కిందికి దిగుతున్నానని చెప్పాడు. అనంతరం వాష్రూమ్ దగ్గరకు వెళ్లి అరియానాపై బిగ్బాస్కు కంప్లైంట్ ఇచ్చాడు. ఇదివరకు జరిగిన టాస్క్లో ఇంటి సభ్యుల కోసం త్యాగం చేయమంటే చేయని అరియానా ఇప్పుడు ఎందుకు ఇచ్చిందని తప్పుపట్టాడు. మోనాల్ రుణం తీర్చుకున్న హారిక ఇక స్టేజీపై చివరకు హారిక, మోనాల్ మాత్రమే మిగిలి ఉన్నారు.ఇద్దరిలో ఒకరు దిగాల్సిరావడంతో.. హారికను దిగాల్సిందిగా మోనాల్ రిక్వెస్ట్ చేసింది. ఒక టాస్క్లో లాస్ట్ వరకు ఉండటం ఇది రెండో సారి అని, ఈ చాన్స్ తనకు చాలా ముఖ్యమని హారికను రిక్వెస్ట్ చేసింది. ఒక్కనిమిషం ఆలోచించిన హారిక.. చివరకు గోల్డెన్ మైక్ను మోనాల్కు త్యాగం చేసింది. కెప్టెన్సీ టాస్క్లో తనను భుజాలపై ఎత్తుకొని గెలిపించావని, అందుకే ఇప్పుడు నేను ఈ చాన్స్ ఇస్తున్నా అని హారిక చెప్పి దిగిపోయింది. ఇక టాస్క్ గెలిచి గొల్డెన్ మైక్ సాధించిన మోనాల్.. కన్ఫెషన్ రూమ్కి వెళ్లి ఓట్లు వేయమని ప్రేక్షకులను రిక్వెస్ట్ చేసింది. అనంతరం గార్డెన్ ఏరియాకు వచ్చి సంతోషంతో బిగ్బాస్కు హగ్లు, ఫ్లైకింగ్ కిస్లు ఇచ్చేసింది. -
బిగ్బాస్లోకి రామ్ గోపాల్ వర్మ.. కండీషన్స్ అప్లై
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడు ఏ అంశంపై ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తాడో ఆయనకే తెలియదు. ఊహకు అందని పనులు చేయడం, తన మాటలతో అవతలి వాళ్లను వెర్రోళ్లను చేయడంలో ఆయనకు ఆయనే దిట్ట. ఇక ఆయన సినిమాలు కూడా అంతే. తనకు మనసులో ఒక ఐడియా వచ్చిందంటే చాటు దానిని బిగ్ స్ర్కీన్పై పెట్టేస్తాడు. అంత విచిత్రమైన మనిషి బిగ్ బాస్ లోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. అబ్బా అదిరిపోతుంది కదా. తన ప్రశ్నలతో.. చేష్ఠలతో కనిపించని బిగ్ బాస్కు కూడా తలనొప్పులు తెప్పిస్తాడు. బిగ్బాస్ నిర్వాహకులు కూడా అంతటి సాహసం చేయకపోవచ్చులే. (చదవండి : బిగ్బాస్: అవినాష్కు నాగ్ ఊహించని గిఫ్ట్) కాగా, వర్మ కూడా తనకు బిగ్బాస్ షో అంటేనే తెలియదని చెప్పాడు. అందులో 16 మంది కంటెస్టెంట్స్ ఉంటారంటే.. ఏం చేస్తారు అని అడిగాడు. అలాంటి వ్యక్తి యూటర్న్ తీసుకొని ఉన్నఫలంగా తాను బిగ్బాస్లోకి వెళ్తా అంటున్నాడు. వర్మ నేతృత్వంలో వచ్చిన కరోనా వైరస్ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే ఎలక్ట్రానిక్, యూ ట్యూబ్ ఛానెల్స్ అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు వర్మ. ఇలా ఓ ఇంటర్వ్యూలలో బిగ్ బాస్ గురించి చెప్పాడు వర్మ. తాను బిగ్బాస్లోకి వెళ్లడానికి సిద్దంగా ఉన్నానంటూనే, కొన్ని కండీషన్స్ పెట్టాడు.తను ఒక్కడినే మగాన్ని పంపించి.. మిగిలిన 15 మందిని అమ్మాయిలను పంపిస్తే 100 కాదు ఎన్ని రోజులైనా బిగ్ బాస్ హౌజ్లో ఉండటానికి తనకేం అభ్యంతరం లేదంటూ తనదైన శైలీలో సమాధానం చెప్పి మరోసారి అందరిని వెర్రొళ్లను చేశాడు వర్మ.