britan
-
రివైండ్ 2024: ప్రపంచం ఓటేసింది..
అత్యధిక దేశాల్లో ఎన్నికలు జరిగిన సంవత్సరంగా 2024 చరిత్రలో నిలిచిపోనుంది. అమెరికా నుంచి భారత్ దాకా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 73 దేశాలు ఓట్ల పండుగ జరుపుకోవడం విశేషం. 27 సభ్య దేశాలున్న యూరోపియన్ యూనియన్కు జరిగిన పార్లమెంటరీ ఎన్నికలు వీటికి అదనం! ఈ దేశాల్లో దాదాపు 400 కోట్ల పై చిలుకు జనాభా ఉంది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఏడాది ఎన్నికల క్రతువులో పాల్గొన్నారు. వీటిలో చాలా ఎన్నికలు ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రజలు తీర్పు వెలువరించడం విశేషం. పలు ఫలితాలు ఊహించినట్టు రాగా కొన్ని మాత్రం అనూహ్యాలతో ఆశ్చర్యపరిచాయి. అధికార పార్టీల అక్రమాల నడుమ ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేసినవీ ఉన్నాయి... భారత ఓటర్ల పరిణతి భారత్లో సాధారణ ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజాస్వామిక క్రతువుగా ఎప్పుడో రికార్డు సృష్టించాయి. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ లేకుండా ప్రశాంతంగా జరిగే తీరు చూసి ప్రపంచమంతా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉంటుంది. ఈసారి కూడా అందుకు తగ్గట్టే ఏప్రిల్ నుంచి ఆరు వారాల వ్యవధిలో ఏడు విడతల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 64.64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈసారి ఏకంగా ‘400కు మించి’అన్న బీజేపీ చివరికి మెజారిటీకీ కాస్త తక్కువగా 240 లోక్సభ స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అలా ఈసారి ఫలితాలు కూడా అందరినీ ఆశ్చర్యపరచడమే గాక భారత ఓటర్ల పరిణతికి అద్దం పట్టాయి.ట్రంప్.. తగ్గేదేలే...! నానారకాల వాదాలతో విడిపోయిన అమెరికాలో ఈసారి జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రపంచమంతటినీ అమితంగా ఆకర్షించాయి. డొనాల్డ్ ట్రంప్ హవాకు అద్దం పట్టిన ఎన్నికలుగా నిలిచిపోయాయి. రిపబ్లికన్ల అభ్యరి్థత్వం సాధించడం మొదలుకుని ప్రధాన పోరు దాకా ఆద్యంతం ఆయన కనబరిచిన దూకుడు ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ఆయన ‘అమెరికా ఫస్ట్’నినాదం రెండోసారి ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తిమంతమైన అధికార పీఠం ఎక్కించింది. డెమొక్రాట్లకు అధ్యక్షుడు జో బైడెనే భారంగా మారారు. సకాలంలో తప్పుకోకపోవడం ద్వారా పార్టీ విజయావకాశాలకు తీవ్రంగా గండి కొట్టిన అప్రతిష్టను మూటగట్టుకున్నారు. భారత మూలాలున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ శాయశక్తులా ప్రయత్నించినా, ఆమెదే పైచేయి అని ప్రధాన మీడియా ఎంతగా హోరెత్తించినా ట్రంప్ ‘తగ్గేదే లే’అన్నారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో ఏకంగా 312 ఓట్లను ఒడిసిపట్టి భారీ మెజారిటీతో విజయ దరహాసం చేశారు. రిషికి ఓటమి సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్ ప్రజలు తమ ఆగ్రహమంతటినీ అధికార కన్జర్వేటివ్ పార్టీపై చూపించారు. ఆ పార్టీ 14 ఏళ్ల ఏలుబడికి తెర దించారు. భారత మూలాలున్న తొలి బ్రిటన్ ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ సారథ్యంలో కన్జర్వేటివ్లు దారుణ ఓటమి మూటగట్టుకున్నారు. లేబర్ పార్టీ నేత కియర్స్టార్మర్కు జనం పట్టం కట్టారు.పాక్లో ప్రహసనం పాకిస్తాన్లో ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు అత్యంత వివాదాస్పదంగా నిలిచాయి. ప్రధాని షహబాజ్ షరీఫ్ కుటుంబ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్–ఎన్) ఆద్యంతం ఎన్నికల అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్ని చేసినా జైలుపాలైన ఇమ్రా న్ఖాన్ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ)ను అడ్డుకోలేకపోయింది. పీటీఐ గుర్తింపునే రద్దు చేసినా స్వతంత్రులుగానే నిలబడి అన్ని పారీ్టల కంటే ఎక్కువ సీట్లు నెగ్గి సత్తా చాటారు. దాంతో నానా పారీ్టలను కలుపుకుని షహబాజ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచి్చంది. లంకలో నవోదయం : కల్లోల శ్రీలంకలో సుదీర్ఘ వాయిదాల తర్వాత ఎట్టకేలకు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో వామపక్షవాది అనూర కుమార దిస్సనాయకే సాధించిన విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దేశ దుస్థితికి ప్రధాన కారకులని భావించిన రాజపక్స కుటుంబాన్ని జనం రాజకీయంగా సమాధి చేశారు. పుతిన్ ఐదోసారి చెప్పుకోదగ్గ ప్రత్యర్థే లేకుండా జరిగిన ఎన్నికల్లో రష్యాలో పుతిన్ రికార్డు స్థాయిలో ఐదోసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గారు. అది కూడా ఏకంగా 87 శాతం ఓట్లు సాధించారు. సోవియట్ అనంతర కాలంలో రష్యాలో ఇదే అత్యధిక మెజారిటీ. పుతిన్కు ప్రధాన అడ్డంకిగా మారడం ఖాయమని భావించిన విపక్ష నేత అలెక్సీ నావల్సీ ఎన్నికలకు ముందు జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించడం పెను దుమారమే రేపింది. వెనెజువెలాలో అధ్యక్షుడు నికొలస్ మదురో విజయమూ వివాదాస్పదమైంది. పారిపోయిన నేతలుపొరుగు దేశం బంగ్లాదేశ్లో అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అది కూడా జనవరిలో సాధారణ ఎన్నికలు ముగిసి షేక్ హసీనా రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రధాని కావడం ద్వారా అధికారాన్ని నిలబెట్టు్టకున్న ఐదు నెలలకే! అజ్ఞాత శక్తి కనుసన్నల్లో సాగినట్టు కని్పంచిన ‘ప్రజా ఉద్యమం’దెబ్బకు ఆమె పదవీచ్యుతురాలయ్యారు. అధికార నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టడంతో దాదాపుగా కట్టుబట్టలతో ఉన్నపళంగా దేశం వీడి భారత్లో రాజకీయ ఆశ్రయం పొందారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక సర్కా రు కొలువుదీరింది. నాడు మొదలైన అల్లర్లు, అరాచకాలు బంగ్లాలో నేటికీ కొనసాగుతున్నా యి. హిందువులతో పాటు మైనారిటీల భద్రతను ప్రమాదంలో పడేశాయి. అసద్లకు అల్విదా సిరియాలో అసద్ల 50 ఏళ్ల కుటుంబ పాలనకు తిరుగుబాటుదారులు డిసెంబర్లో తెర దించారు. అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కుటుంబంతో పాటు రష్యాకు పారిపోయారు. అలా నియంతృత్వ పాలనకు తెర పడ్డా దేశం మాత్రం అనిశ్చితితో కూరుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గుండె తరుక్కుపోయే ఘటన: పాపం ఆ చిట్టితల్లి ..!
కొన్ని ఘటనలు అత్యంత పాశవికంగా ఉంటాయి. మనుషులేనా..? అనే భయం కలుగుతుంటుంది. అదికూడా అభం శుభం తెలియని చిన్నారులు పట్ల ఇంత హేయంగా ప్రవర్తించడమా..! అనే జుగుప్సకరమైన బాధకలుగుతుంటుంది. అచ్చం అలాంటి గుండె తరుక్కుపోయే ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. ఆ చిట్టి తల్లికి పదేళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి. కంటిపాపలా కాచుకోవాల్సిన తండ్రి చేతిలోనే హతమవుతానని ఊహించి ఉండదు పాపం. పదేళ్ల సారా షరీఫ్ ఇంగ్లండ్లో తన ఇంటిలోనే విగతజీవిగా కనిపించింది. ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉంది. చనిపోవడానికి ముందు దారుణమైన వేధింపులకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. వారి అనుమానమే నిజమయ్యింది. చనిపోయినప్పుడు ఆ చిన్నారి ఒంటిపై మానవ పంటి గాయాలతో సహా మొత్తం 70 గాయలు ఉన్నట్లు పోస్ట్మార్టంలో వెల్లడయ్యింది. అలాగే మెడ, వెన్నుముకతో సహ మొత్తం 25 చోట్ల ఎముకలు విరిగినట్లు నివేదక పేర్కొంది. నా కెరీర్లో ఇలాంటి కేసు చూడలేదుపోలీసులు సైతం ఈ ఘటన చూసి తమ 30 ఏళ్ల కెరీర్లో ఇంతటి దారుణమైన కేసుని చూడలేదన్నారు. ఈ కేసుని సీరియస్గా తీసుకున్న డిటెక్టివ్ చీఫ్ ఇన్స్పెక్టర్ క్రెయిగ్ ఎమ్మెర్సన్ ఈ కేసుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడమే గాక ఈ ఘటనతో సంబంధం ఉన్న నిందితులందర్నీ అరెస్టు చేశారు. ఈ కేసులో అత్యంత బాధకరమైన విషయం ఏమిటంటే కన్నతండ్రే ఆ చిన్నారిని ఇంత ఘోరమైన బాధలకు గురిచేయడమే. ఆమె బాల్యమంత భరించలేని బాధలతోనే గడిచింది. యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది..అక్కడితో ఆగక ఆ కిరాతక తండ్రి తన భార్యతో కలిసి ఆ చిన్నారిని దారుణంగా హతమార్చాడు. ఇందులో ఆ చిన్నారి మేనమామ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సారా ఉదంతంతో ఒక్కసారిగా యావత్ ప్రపంచంలో పిల్లల సంరక్షణ ఏ స్థితిలో ఉందనే భయాందోళన రేకెత్తించింది. ఈ ఘటనతో పిల్లలు సంరక్షణకు సంబంధించిన సంస్కరణలకు పిలుపునిచ్చారు సామాజికవేత్తలు. నిజానికి ఇంగ్లాండ్లాంటి దేశంలో పిల్లల సంరక్షణకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినా కూడా ఆ చిన్నారి కథ విషాదంతో ముగిసిపోయే వరకు వెలుగులోకి రాలేదు. కాగా, ఈ కేసులో పోలీసులకు దొరికిన కీలక ఆధారం నిందితుడు ఉర్ఫాన్ షరీష్ స్వయంగా నా కూమార్తెను కొట్టి చంపానని చేతితో వ్రాసిన నోట్. అయితే విచారణలో మాత్రం బుకాయించే ప్రయంత్న చేశాడు, కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించేటప్పటికీ..తన భార్యతో కలిసి ఈ నేరం చేసినట్లు ఉర్ఫాన్ ఒప్పుకున్నాడు.తీసుకోవాల్సిన చర్యలు..ఇలాంటి ఘటనలు వేధింపులకు గురవ్వుతున్న చిన్నారులు భద్రత గురించే గాక కర్కశంగా ప్రవర్తించే తల్లిదండ్రులకు ఎలా బుద్ధి చెప్పాలో తెలియజెప్పుతోంది. వాస్తవానికి ఇలాంటి ఘటనలు అంతతేలిగ్గా బయటకురావు. అలాగే చుట్టుపక్కల వాళ్లు లేదా ఎవ్వరైనా ధైర్యం చేసి..ఇలాంటి కేసు గురించి పోలీసుల దృష్టికొచ్చేలా చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇవి అత్యంత సున్నితమైన కేసులు. ఈ విషయంలో చిన్నారుల భద్రత, సంక్షేమానికి సంబంధించి..ప్రభుత్వం హెల్ప్లైన్లు, కౌన్సిలింగ్ సెంటర్లతో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ విధంగా ఏ చిన్నారి బలవ్వకుండా ప్రభుత్వం, సమాజం చొరవ చూపితేగానీ..ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అంటున్నారు విశ్లేషకులు.(చదవండి: సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! ఏముంది వెడ్డింగ్ కార్డ్..!) -
77 ఏళ్ల నాటి కేకు ముక్క..!
బ్రిటిష్ రాణి ఎలిజబెత్ పెళ్లి కేకు ముక్క ఇది. ఎలిజబెత్ పెళ్లి 1947 నవంబర్ 20న జరిగింది. ఆ వేడుక కోసం తయారు చేసిన కేకులో ఒక ముక్కను గడచిన డెబ్భయి ఏడేళ్లుగా పదిలంగా భద్రపరచి ఉంచారు. బ్రిటిష్ రాచదంపతులు అప్పట్లో ఈ కేకు ముక్కను ఒక పెట్టెలో ఉంచి, ఎడిన్బర్గ్లోని హోలీరూడ్ హౌస్ను పర్యవేక్షించే మారియన్ పోల్సన్కు కానుకగా పంపారు. నాటి నుంచి పెట్టెతో సహా ఈ కేకు ముక్కను భద్రంగా దాచారు. బ్రిటిష్ రాచదంపతుల నుంచి ఈ కేకు ముక్కలు అప్పట్లో మరికొందరికి కూడా కానుకగా అందాయి. వాటిలో కొన్నింటిని దశాబ్దాల పాటు దాచి, తర్వాతి కాలంలో వేలంలో అమ్ముకున్నారు. ఇటీవల ఈ కేకు ముక్క కూడా వేలానికి వచ్చింది. రీమన్ డెన్సీ వేలంశాల నిర్వహించిన వేలంలో ఈ కేకు ముక్కకు 2,200 పౌండ్లు (సుమారు రూ.2.40 లక్షలు) ధరకు అమ్ముడుపోయింది. (చదవండి: కోడిపుంజులాంటి హోటల్..!) -
భారత్కు బ్రిటన్ రాజ దంపతులు
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్–3, కెమిల్లా దంపతులు మరోసారి భారత్ రానున్నారు. 2025 ప్రారంభంలో వారు భారత్లో పర్యటించనున్నారు. బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి వారు ఈ మేరకు సమాచారమిచ్చారు. సింహాసనాన్ని అధిష్టించాక చార్లెస్–3కు భారత్లో ఇదే తొలి అధికారిక పర్యటన కానుంది. 2019లో యువరాజు హోదా లో ఆయన భారత్లో చివరిసారి అధికారికంగా పర్యటించారు. గత అక్టోబర్లో రాజ దంపతులు బెంగళూరులో పర్యటించినా అది పూర్తిగా వ్యక్తిగతంగా సాగింది. గత ఫిబ్రవరిలో చార్లెస్కు కేన్సర్ నిర్ధారణ అయినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ వెల్లడించింది. అందుకు చికిత్సలో భాగంగా వారు భారత్ వచ్చినట్టు వార్తలొచ్చాయి. బెంగళూరులో వెల్నెస్ రీట్రీట్లో రాజ దంపతులు నాలుగు రోజులు గడిపారు. వారిద్దరూ 2022 లోనే భారత్లో పర్యటించాల్సింది. క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో ఆ పర్యటన రద్దయ్యిన సంగతి తెలిసిందే. -
సమంతాకు ‘బుకర్’
లండన్: బ్రిటిష్ రచ యిత్రి సమంతా హార్వే ను 2024 బుకర్ ప్రైజ్ వరించింది. అంతర్జాతీ య అంతరిక్ష కేంద్రంలోని ఆరుగురు వ్యోమ గాముల జీవితంలో ఒక్క రోజు జరిగే ఘటనలను వర్ణిస్తూ ఆమె రాసిన సైన్స్ ఫిక్షన్ నవల ‘ఆర్బిటాల్’కు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు సాధించిన తొలి అంతరిక్ష నేపథ్య రచనగా ఆర్బిటా ల్ నిలిచింది. ఈ నవలను 2023 నవంబర్లో ప్రచురించారు. బ్రిటన్లో అత్యధికంగా అమ్ముడు పోయిన నవలగా నిలిచింది. అంతరిక్షపు అందాలను అద్భుతంగా కళ్లముందు ఉంచిందని జడ్జింగ్ ప్యానెల్ చైర్మన్ ఎడ్మండ్ కొనియాడారు. -
రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి!
లండన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై.. దాదాపు మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన ప్రతిఘటనను అక్టోబర్ నెలలో రష్యా బలగాలు ఎదుర్కొన్నాయని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి అన్నారు. అక్టోబర్లో రోజుకు సగటున 1,500 మంది రష్యన్ సైనికులు మరణించటం లేదా గాయపడటం జరిగిందని బిట్రన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ రాడాకిన్ తెలిపారు.‘‘రష్యా తన యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించలేదు. అయితే ఫిబ్రవరి 2022లో రష్యా.. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి గత నెలలో అత్యధికంగా సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయం కారణంగా సమామరు 7 లక్షమ మంది మరణించటం లేదా గాయపడటం జరిగింది. పుతిన్ ఆశయం కోసం రష్యా ఈ భారీ నష్టం, నొప్పి, బాధ భరించవల్సి వచ్చింది. చాలా తక్కువ భూభాగం కోసం అధిక సైన్యం నష్టపోయింది. రష్యా ప్రభుత్వం.. రక్షణ, భద్రతపై ప్రజా వ్యయంలో 40 శాతానికి పైగా ఖర్చు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ దేశంపై అధిక భారం వేశారు. ఉక్రెయిన్కు బ్రిటన్ మద్దతు ఇస్తునే ఉంటుంది. అది అధ్యక్షుడు పుతిన్ గ్రహించవలసిన సందేశం. ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి భరోసా’’ అని అన్నారు.రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో ఉక్రెయిన్ బలమైన మద్దతుదారులలో బ్రిటన్ ఒకటి. ఉక్రెయిన్కు బిలియన్లకొద్ది పౌండ్లతో సైనిక సహాయంతో పాటు ఆయుధాలు, బలగాలకు శిక్షణను అందిస్తోంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పాశ్చాత్య దేశాల భవిష్యత్తు నిబద్ధత గురించి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఉక్రెయిన్కు మద్దతును మరోసారి ప్రకటించటం గమనార్హం.చదవండి: కెనడాలో టెంపుల్పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్ -
Mohamed Al Fayed 421 మందిపై లైంగిక వేధింపులు,బాధితుల్లో ప్రముఖుల బిడ్డలు
లైంగిక వేధింపులు ,అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దివంగత ఈజిప్షియన్ బిలియనీర్ మొహమ్మద్ అల్ ఫయెద్పై కేసులో షాకింగ్ సంఖ్యలో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 421 మందికి పైగా బాధితులు ఫిర్యాదు చేశారని న్యాయవాద డీన్ ఆర్మ్స్ట్రాంగ్ వెల్లడించారు.30 ఏళ్ల కాలంలో అల్ ఫయేద్ అఘాయిత్యాలను సంబంధించిన చిట్టా పెరుగుతూనే ఉందని ఆర్మ్స్ట్రాంగ్ లండన్లో ఒక మీడియా సమావేశంలో అన్నారు .మరో న్యాయవాది బ్రూస్ డ్రమ్మాండ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 400కి పైగా బ్రిటన్కు చెందిన మహిళలతోపాటు, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, స్పెయిన్, దక్షిణాఫ్రికా , ఇతర దేశాల మహిళలు తమ న్యాయవాద బృందాన్ని ఆశ్రయించారని తెలిపారు. ఈ ఆరోపణలు తమకు విభ్రాంతికి గురి చేశాయని వ్యాఖ్యానించారు. ‘వాడొక రాక్షసుడు’ అంటూ బాధితులకు క్షమాపణలు చెప్పారు.బ్రిటన్ లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో హారోడ్స్ డిపార్ట్ మెంటల్ స్టోర్ యజమాని మహమ్మద్ అల్ ఫాయిద్ ఒకరు. తన లండన్ డిపార్ట్మెంట్ స్టోర్ హారోడ్స్లో మహిళా సిబ్బందిపై లైంగికంగా వేధింపులు, అత్యాచారాలకు పాల్పడ్డాడు. అంతేకాదు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తప్పవని బెదిరించాడు. దీనికి సంబంధించిన ఆరోపణలపై ఇటీవల బీబీసీ అల్ ఫాయిద్ అత్యాచారాలపై ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే "ది జస్టిస్ ఫర్ హారోడ్స్ సర్వైవర్స్ గ్రూపు" నుంచి చట్టపరమైన చర్యలు మొదలు కావడంతో తాజాగా మరింతమంది బాధితులు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. బాధితుల్లో బ్రిటన్లోని మాజీ యుఎస్ రాయబారి కుమార్తె , ప్రసిద్ధ సాకర్ క్రీడాకారిణి కుమార్తె కూడా ఉన్నారు. కాగా మహమ్మద్ అల్ ఫాయిద్ 94 ఏళ్ల వయసులో గత ఏడాది మరణించాడు. అల్ ఫయీద్ తన మరణానికి ముందు ఈ ఆరోపణలను ఖండించాడు. -
సాహసమే ఊపిరిగా..! ఏకంగా 14 పర్వతాలను ..!
అభిరుచి, అంకితభావం, పట్టుదల ఒక దగ్గర చేరితే ఏమవుతుంది? అపురూప విజయం అవుతుంది. ఆడ్రియానా బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం అవుతుంది. ప్రపంచంలోని 14 ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా 23 ఏళ్ల ఆడ్రియానా బ్రౌన్లీ రికార్డ్ సృష్టించింది. లండన్లో పుట్టి పెరిగిన బ్రౌన్లీకి చిన్నప్పటి నుంచి ఎత్తైన పర్వతాలను అధిరోహించిన వారి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. నాన్న పర్వతారోహకుడు. పర్వతారోహణకు సంబంధించి ఆయన చెప్పే ఒళ్లు గగుర్పొడిచే విషయాలను వినడం అంటే ఇష్టం.ఎనిమిదేళ్ల వయసులో పర్వతారోహకుడైన తండ్రి నుంచి ప్రేరణ ΄పొందింది బ్రౌన్లీ. పెద్ద పర్వతాలు అధిరోహించి పెద్ద పేరు తెచ్చుకోవాలని కలలు కనేది. ఇరవై ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంతో ఆ కల సాకారం అయింది. ఆక్సిజన్ లేకుండా గాషెర్బ్రమ్ 1కు చేరుకున్న అతి పిన్న వయస్కురాలిగా, కే2 శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది.చైనాలోని 8,000 మీటర్ల ఎత్తులో ఉన్న పిషాపాంగ్మా పర్వతాన్ని అధిరోహించడం ద్వారా 14 శిఖరాల అధిరోహణను పూర్తి చేసింది. నిర్మలమైన ఆకాశం సాక్షిగా, సూర్యోదయం వెలుగులో పిషాపాంగ్మా పర్వతం దగ్గరకు చేరుకోగానే బ్రౌన్లీ భావోద్వేగానికి గురైంది. ‘శిఖరానికి చేరుకోకముందే నా లక్ష్యం నెరవేరబోతుంది అనే ఆనందంలో ఏడ్వడం మొదలు పెట్టాను’ అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంది. బ్రౌన్లీ సాధించిన చారిత్రక విజయం కేవలం సంఖ్యకు సంబంధించినది కాదు. అంకితభావాన్ని, నిబద్దతను ప్రతిఫలించే అపురూప విజయం అది. పర్వతారోహణ అనేది అభిరుచి మాత్రమే కాదు త్యాగాల సమాహారం. పర్వతారోహణపై దృష్టి పెట్టిన బ్రౌన్లీ టీనేజ్ సంతోషాలకు దూరమైంది. తన కలను సాకారం చేసుకోవడానికి యూనివర్శిటీకి దూరమైంది. వ్యక్తిగత విజయాలపై మాత్రమే బ్రౌన్లీ దృష్టి పెట్టలేదు. పర్వతారోహణ విషయంలో యువతను ప్రోత్సహించడానికి, వారు తమ కలలను సాకారం చేసుకునే విషయంలో సహకరించడానికి నడుం కట్టింది.‘సాహసం మంచిదేగానీ దుస్సాహాసం తగదు’ అంటున్న బ్రౌన్లీ ఎంతోమంది పర్వతారోహకులను దగ్గర నుంచి చూసింది. వారిలో ఉత్సాహమే కనిపిస్తుంది. శిక్షణ లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘సాహసాల పేరుతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం నాకు తెలుసు. పర్వతారోహణ పేరుతో సాహసాలకు దిగే కొద్దిమందికి ప్రాథమిక విషయాల్లో కూడా అవగాహన లేదని తెలుసుకున్నాను. ఉత్సాహమే కాదు శిక్షణ కూడా చాలా ముఖ్యం. అనుభవం లేని పర్వతారోహకులను ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి అనుమతించరాదు. వారు తమ ప్రాణాల తోపాటు ఇతరులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది. ఎత్తైన శిఖరాలను అధిరోహించడానికి ప్రయత్నించే పర్వతారోహకులు ముందుగా చిన్న పర్వతాలను అధిరోహించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అంటుంది బ్రౌన్లీ. ‘ఎప్పుడు పర్వతాల గోలేనా’ అని బ్రౌన్లీని స్నేహితులు వెక్కిరించేవారు. అయితే ఆమె అలాంటి వెక్కిరింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు.‘జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యం మీకు ప్రత్యేకమైనది కావచ్చు. ఇతరులకు వింతగా అనిపించవచ్చు’ అంటుంది బ్రౌన్లీ. ఒక పర్వతానికి మరో పర్వతానికి సంబంధం ఉండదు. ప్రతి పర్వతం తనదైన సవాళ్లు విసురుతుంటుంది. ‘ప్రతి సవాలు విలువైనదే’ అంటున్న ఆడ్రియానా బ్రౌన్లీ మరిన్ని సాహసాలకు సిద్ధం అవుతుంది.(చదవండి: తాటి ఆకుల కళ..! 75 ఏళ్ల బామ్మ..) -
సెంచరీ వయసులో స్కైడైవింగ్ చేసిన బామ్మ! ఏకంగా..!
సెంచరీ వయసులో సైడైవింగ్ చేసి చరిత్ర సృష్టించింది. అది కూడా ఓ స్వచ్ఛంద సంస్థ కోనం నిధులు సమకూర్చేందుకు చేయడం విశేషం. ఆ బామ్మ ఎవరంటే..?సఫోల్క్కు చెందిన మానెట్ బైల్లీ అనే బామ్మ 102 ఏళ్ల వయసులో ఈ సాహసం చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఆమె ఉమెన్స్ రాయల్ నావెల్ సర్వీస్కు మాజీ సభ్యురాలు. తన పుట్టిన రోజును స్వచ్ఛంద సంస్థకు నిధుల సేకరించే పనితో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. బైల్లీ ఒక ఛారిటీ ఈవెంట్లో భాగంగా యూకే పారాచూటింగ్ సర్వీసెస్ లిమిటెడ్తో కలిసి ఈ సాహసం చేసింది. ఆమె బెన్హాల్ విలేజ్ హాల్, మోటార్ న్యూరాన్ డిసీజ్ అసోసియేషన్, ఈస్ట్ ఆంగ్లియన్ ఎయిర్ అంబులెన్స్ అనే మూడు ఛారిటీ సంస్థల కోసం ఈ నిధులను సేకరిస్తోంది. ఇప్పటి వరకు దగ్గర దగ్గర రూ. 11 లక్షలు సేకరించింది. అయితే రూ. 33 లక్షల వరకు నిధులు సేకరించాలనేది ఆ బామ్మ లక్ష్యం. ఈ బామ్మ ఈస్ట్ ఆంగ్లియాలోని బెక్లెస్ ఎయిర్ఫీల్డ్ నుంచి ఏకంగా ఏడు వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసింది. ఈ మేరకు స్థానికి మీడియాతో మాట్లాడుతూ.."నాకు చేసేటప్పుడూ కొంచెం భయంగా అనిపించింది. గట్టిగా కళ్లు మూసుకున్నానని ఒపుకోవాల్సిందే. ఆ తర్వత ధైర్యంగానే ఉన్నట్లు తెలిపింది. అంతేగాదు తన ఆరోగ్యకరమైన వృధాప్యం గురించి కూడా మాట్లాడారు. ఎనిమిది లేదా తొమ్మిది పదుల వయసులో దేన్ని వదులుకోకూడదు. ఈ వయసులో కూడా తాను ఫిట్గా ఉండటం అనేది అదృష్టం అనే చెప్పాలి. తన వయసులోనే ఉన్న ఇతర వ్యక్తులు ఆర్థరైటిస్తో వికలాంగులుగా మారారు. అయితే తాను అలా ఉండేందుకు ఇష్టపడనని అంటోంది." ఈ బామ్మ. కాగా, ఆమె ఇలాంటి సాహసాలు చేయడం మొదటిసారి కాదు. తన వందో పుట్టిన రోజు సందర్భంగా కూడా ఇలాంటి సాహస కృత్యమే చేసింది. సిల్వర్స్టోన్ చుట్టూ 130 మీటర్ పర్ అవర్ వేగంతో ఫెరారీ కారుని నడిపి మరో రికార్డుని నెలకొల్పింది. తన స్నేహితుడి తండ్రి 85 ఏళ్ల వయసులో ఇలాంటి సాహసకృత్యాలు చేయడం చూసి స్ఫూర్తి పొందానని అన్నారు. బామ్మ బైల్లీ ధైర్యం, సమాజం కోసం నిస్వార్థంగా చేస్తున్న కృషి బ్రిటన్ రాజ కుంటుంబాన్ని ఆకర్షించింది. అంతేగాదు ప్రిన్స్ విలియం ఆ వయసులో ఆ బామ్మ చలాకీగా చేస్తున్న సాహసాలను మెచ్చుకున్నారు. వందవ పుట్టిన రోజునే ఫెరారీ రేసింగ్తో చరిత్ర సృష్టించిన మీరు ఈ స్కైడైవింగ్ని అవలీలగా చేయగలరు. ఆశ్చర్యపోనవసరం లేదు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆ బామ్మ ఆరోగ్య రహస్యం..ఎప్పుడూస్నేహితులు, ప్రజల మధ్య ఉంటుంది. బిజీగా ఉంటుంది. ప్రతిదానిపై ఆసక్తిని కలిగి ఉంటుంది. తన చుట్టూ ఉన్నవారి పట్ల దయతో ప్రేమగా మెలుగుతుందట. అవే ఆమె దీర్ఘాయువుకి కారణం అని ఆనందంగా చెబుతోంది బైల్లీ.The incredible Manette Baillie skydiving this morning at Beccles airfield for her 102nd birthday sponsored by Goldster!! #manettebaillie #102yearoldskydiver pic.twitter.com/q1FOZtqzyU— Goldster (@GoldsterClub) August 25, 2024 (చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!) -
షేక్ హసీనాకు బ్రిటన్ షాక్ ఇవ్వనుందా?
బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటా నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారటంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అయితే ఆమె తన సోదరితో కలిసి బ్రిటన్ వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అనుమతులను ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం షేక్ హసీనా బ్రిటన్కు వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ దేశ హోంశాఖ కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇతర దేశాల చెందిన వ్యక్తులు బిట్రన్లో ఆశ్రయం లేదా తాత్కాలిక ఆశ్రయం పొందడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అనుమతించవు. కానీ, అత్యవసరమైన సమయంలో ఆశ్రయం కావాలనుకునేవారికి గతంలో భారీగా కల్పించిన రికార్డు బ్రిటన్ సొంతం. అంతర్జాతీయ రక్షణ అవసరం కావాలనుకునేవారికి.. వారు చేరుకునే దేశం సురక్షితమైనదై ఉండాలి. అప్పుడే వారు సురక్షితమైన భద్రతను పొందగలరు’ అని పేర్కొంది. బ్రిటన్ హోంమంత్రి శాఖ ఈ ప్రకటన చేసినప్పటికీ షేక్ హాసీనా అధికారిక ఆశ్రయానికి సంబంధించిన అభ్యర్థనపై అనుమతి ప్రక్రియ కొనసాగుతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు.. షేక్ హసీనా అసలు భారత్ను వదిలి బ్రిటన్కు వెళ్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది.మరోవైపు.. గత నెలలో బ్రిటన్లో లేబర్ అధికారంలోకి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలో ఆశ్రయం కోరే వ్యక్తులకు బ్రిటన్ మొదటి సరక్షితమైన దేశమని ఎన్నికల సమయంలో ప్రకటించటం గమనార్హం. మరోవైపు.. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది’అని విదేశాంగ శాఖ మంత్రి జైశంక పేర్కొన్నారు. -
భారత్తో భాగస్వామ్యం.. వైఖరి మార్చుకున్న బ్రిటన్ ప్రధాని!
లండన్: బ్రిటన్లో లేబర్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ ఎన్నిక అయ్యారు. అయితే గతంలో లేబర్ పార్టీ కశ్మీర్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు చేయటంతో భారత్తో సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా లేబర్ పార్టీ అధికారంలోకి రావటంతో భారత్తో భాగస్వాయం విషయం తెరపైకి వచ్చింది. అయితే లేబర్ పార్టీ గతంలో భారత్పై చేసిన ఆరోపణలు, వైఖరిని ప్రధాని కీర్ స్టార్మర్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.2019లో లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ వార్షిక సమావేశంలో భారత్లోని కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన చోటుచేసుకుందని, అక్కడి పరిస్థితిపై ఎమర్జెన్సీ తీర్మానం ప్రవేశపెట్టారు. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేమయంలో లేబర్ పార్టీ చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. లేబర్ పార్టీ ఆరోపణలు సరైన సమాచారం లేని, నిరాధారమైనవి అని భారత్ మండిపడింది. అప్పట్లో జెరెమీ కార్బిన్పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత సంతతి ఎంపీలు వ్యతిరేకించారు. జెరెమీపై చేసిన తీర్మానం భారత వ్యతిరేక విధానమని ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక..2020లో కొన్ని కారణాల వల్ల ఆయన్ను లేబర్ పార్టీ సస్పెండ్ చేసింది.అయితే కొత్తగా ఎన్నికైన ప్రధాని కీర్ స్టార్మర్ భారత్తో భాగస్యామ్యం, సంబంధాల విషయంలో తన పార్టీ వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా భారత్తో సంబంధాలు మెరుగుపర్చుకుంటామని తెలిపారు. గతంలో చేసిన ఆరోపణలపై తమ పార్టీ వైఖరీ మార్చుకుంటామని పేర్కొన్నారు. భారత్తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగించాలనే నిబద్దతతో ఉన్నట్లు తెలిపారు. ‘‘ లేబర్ పార్టీ ఇతర దేశాలతో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాలను మెరుగుపర్చుకుంటుంది. స్వేచ్ఛా వాణిజ్యం, భద్రత, విద్య, టెక్నాలజీ, పర్యావరణ మార్పులు వంటి పలు రంగాల్లో మేము భారత్ కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం’’ అని మేనిఫోస్ట్లో పేర్కొన్నారు. దీంతో లేబర్ పార్టీ తన భారత వ్యతిరేక వైఖరిని మార్చుకొని భాగస్వామ్య సంబంధాలు పెంచుకునే దిశగా వెళ్లుతున్నట్లు స్పష్టం అవుతోంది. -
‘బీజేపీ 400 సీట్ల నినాదం ఫలించింది! కానీ మనదేశంలో కాదు’
ఢిల్లీ: బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హౌజ్ ఆఫ్ కామన్స్లో 650 స్థానాలకు ఏకంగా 412 సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీనిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ బీజేపీపై విమర్శలు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన నినాదం.. మొత్తానికి ఇప్పడు నిజమైందని ఎద్దేవా చేశారు. బీజేపీ ‘అబ్ కీ బార్, 400 పార్’సాధ్యం అయింది. కానీ, అది భారత్లో కాదు. మరో దేశంలో సాధ్యం అయిందని ‘ఎక్స్’ వేదికగా సెటైర్లు వేశారు.Finally “ab ki baar 400 paar” happened — but in another country! pic.twitter.com/17CpIp9QRl— Shashi Tharoor (@ShashiTharoor) July 5, 2024 ‘మొత్తానికి బీజేపీ చేసిన ‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదం సాధ్యం అయింది. కానీ, అది మరో దేశంలో!’ అని శశీ థరూర్ సెటైర్ వేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేసింది. తాము తప్పకుండా 400 సీట్లు గెలుస్తామని ప్రధాని మోదీతో సహా బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ‘అబ్ కీ బార్ 400 పార్’ అనే నినాదాన్ని హోరెత్తించారు. అయితే వారి అంచనాలకు భిన్నంగా బీజేపీ సొంతంగా 240 సీట్లు, ఎన్డీయే కూటమి 293 స్థానాలకే పరిమితమైంది. మిత్రపక్షాల సాయంతో మరోసారి బీజేపీ అధికారాన్ని చేపట్టింది. ఇక.. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాల్లో గెలుపొందగా.. ఇండియా కూటమి 234 సీట్లను కైవసం చేసుకుంది.ఇక.. బ్రిటన్లో తాజాగా అధికారాన్ని చేపట్టిన లేబర్ పార్టీ 2019లో 211 సీట్లు గెలవగా.. ఈసారి 412 సీట్లను గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.చదవండి: తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య -
UK general election 2024: స్టార్మర్... సరికొత్త ఆశాకిరణం
కెయిర్ రాడ్నీ స్టార్మర్. ఈ 61 ఏళ్ల లేబర్ పార్టీ నాయకుని పేరు ఇప్పుడు బ్రిటన్లో మార్మోగుతోంది. ఆర్థిక ఇక్కట్లు మొదలుకుని నానా రకాల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు ఆయనలో తమ నూతన నాయకున్ని చూసుకుంటున్నారని సర్వేలన్నీ చెబుతున్నాయి. జూలై 4న జరగనున్న ఎన్నికల్లో లేబర్ పార్టీని ఆయన ఘనవిజయం దిశగా నడిపించడం, ప్రధాని పీఠమెక్కడం ఖాయమని ఘోషిస్తున్నాయి. అదే జరిగితే 14 ఏళ్ల అనంతరం లేబర్ పార్టీని గెలుపు బాట పట్టించిన నేతగా స్టార్మర్ నిలవనున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్నిరుపేద నేపథ్యం..దేశంలోనే పేరుమోసిన లాయర్. ఐదేళ్ల పాటు బ్రిటన్ చీఫ్ ప్రాసిక్యూటర్. ఆ హోదాలో రాజవంశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన అత్యున్నత పౌర పురస్కారమైన సర్. ఇదంతా 61 ఏళ్ల స్టార్మర్ నేపథ్యం. దాంతో ఆయన సంపన్నుల ప్రతినిధి అంటూ కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థులు తరచూ విమర్శిస్తుంటారు. వీటన్నింటికీ తన నేపథ్యమే సమాధానమని సింపుల్గా బదులిస్తారు స్టార్మర్. కలవారి కుటుంబంలో పుట్టి, మల్టీ బిలియనీర్ కూతురిని పెళ్లాడిన తన ప్రత్యరి్థ, ప్రధాని రిషి సునాక్దే సిసలైన సంపన్న నేపథ్యమంటూ చురకలు వేస్తుంటారు. స్టార్మర్ 1963లో లండన్ శివార్లలో ఓ నిరుపేద కుటుంబంలో పుట్టారు. తండ్రి పనిముట్లు తయారు చేసే కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానం కావడంతో నిత్యం డబ్బు కటకట మధ్యే పెరిగారాయన. తన నిరుపేద నేపథ్యాన్ని ఎన్నికల ప్రచారంలో స్టార్మర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. ‘‘ద్రవ్యోల్బణమంటే ఏమిటో, కుటుంబాలను అది ఎంతగా కుంగదీస్తుందో నాకు చిన్నప్పుడే అనుభవం. ధరల పెరుగుదల ఎంత దుర్భరమో కన్జర్వేటివ్ పార్టీ నేతలందరి కంటే నాకంటే ఎక్కువగా తెలుసు. పోస్ట్మ్యాన్ వస్తున్నాడంటే చాలు, ఏ బిల్లు తెచి్చస్తాడో, అది కట్టడానికి ఎన్ని ఇబ్బందులు పడాలో అని ఇంటిల్లిపాదీ బెదిరిపోయేవాళ్లం. ఫోన్ బిల్లు కట్టలేక నెలల తరబడి దాన్ని వాడకుండా పక్కన పెట్టిన సందర్భాలెన్నో’’ అంటూ చేస్తున్న ఆయన ప్రసంగాలకు విశేష స్పందన వస్తోంది. తన కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే కావడం విశేషం. లీడ్స్ వర్సిటీ, ఆక్స్ఫర్డ్లో లా చేశారు. పేదరికమే తనలో కసి నింపి చదువుల్లో టాపర్గా నిలిచేందుకు సాయపడిందంటారు. 50 ఏళ్ల తర్వాత రాజకీయ అరంగేట్రం 50 ఏళ్లు దాటాక స్టార్మర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2015లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రెండు వరుస ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో జెరెమీ కోర్బిన్ విఫలం కావడంతో 2020లో లేబర్ పార్టీ పగ్గాలతో పాటు విపక్ష నేత బాధ్యతలు కూడా చేపట్టారు. వస్తూనే పారీ్టలో అంతర్గతంగా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బాధ్యతాయుతంగా, మేనేజర్ తరహాలో, కాస్త డల్గా కనిపించే వ్యవహార శైలి స్టార్మర్ సొంతం. ఆర్థిక సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమవుతున్న బ్రిటన్కు ఇప్పుడు కావాల్సిన సరిగ్గా అలాంటి నాయకుడేనన్నది పరిశీలకుల అభిప్రాయం. చరిష్మా ఉన్న నేత కంటే నమ్మకం కలిగించగల నాయకుడినే బ్రిటన్వాసులు కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందుకు తగ్గట్టే నాలుగేళ్లుగా విపక్ష నేతగా తన పనితీరుతోనూ, కీలక విధానాంశాలపై స్పష్టమైన అభిప్రాయాలతోనూ ప్రజలను స్టార్మర్ బాగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, హౌజింగ్ సంక్షోభం వంటి పెను సమస్యల పరిష్కారంలో భారత మూలాలున్న తొలి ప్రధాని రిషి సునాక్ విఫలమయ్యారన్న అభిప్రాయం దేశమంతటా బాగా విని్పస్తోంది. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెర పడటం ఖాయమన్న విశ్లేషణలే విని్పస్తున్నాయి. అందుకే కొద్ది రోజులుగా వెలువడుతున్న ఎన్నికల సర్వేలన్నీ లేబర్ పార్టీ ఘనవిజయం ఖాయమని చెబుతున్నాయి. విజయమే లక్ష్యంగా... కన్జర్వేటివ్ పార్టీ పాలనపై దేశమంతటా నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను స్టార్మర్ ముందుగానే పసిగట్టారు. అందుకే ఘనవిజయమే లక్ష్యంగా కొద్ది నెలలుగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. బ్రెగ్జిట్ తప్పుడు నిర్ణయమంటూనే తాను అధికారంలోకి వస్తే దాన్ని సమీక్షించబోనని చెబుతున్నారు. ఇది ఆయన సిద్ధాంతరాహిత్యానికి నిదర్శనమన్న కన్జర్వేటివ్ నేతల విమర్శలను తేలిగ్గా తోసిపుచ్చుతున్నారు. తాను కేవలం మెజారిటీ ప్రజల ఆకాంక్షలను అంగీకరిస్తున్నానంటూ దీటుగా బదులిస్తున్నారు. ‘‘నేను కారి్మక కుటుంబం నుంచి వచ్చాను. జీవితమంతా పోరాడుతూనే వస్తున్నా. ఇప్పుడు దేశ ప్రజల స్థితిగతులను మెరుగు పరిచి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు మరింతగా పోరాడతా’’ అంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ‘పార్టీ కంటే దేశమే ముందు’ నినాదంతో దూసుకుపోతున్న స్టార్మర్లో బ్రిటన్ ప్రజలు ఇప్పటికే తమ ప్రధానిని చూసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. 18 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు 1997లో తెర దించిన టోనీ బ్లెయిర్ ఫీటును ఈసారి ఆయన పునరావృతం చేస్తారన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.కొసమెరుపు లేబర్ పార్టీ తొలి నాయకుడు కెయిర్ హార్డీ మీద అభిమానంతో స్టార్మర్కు తల్లిదండ్రులు ఆయన పేరే పెట్టుకున్నారు. ఇప్పుడదే లేబర్ పారీ్టకి ఆయన నాయకునిగా ఎదగడం విశేషం!ప్రస్తుత బలాబలాలుబ్రిటన్ పార్లమెంట్ లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లోని 650 స్థానాలకు జూలై 4న ఎన్నికలు జరగనున్నాయి. మెజారిటీ మార్కు 326.పార్టీ స్థానాలుకన్జర్వేటివ్ 344లేబర్ 205ఎస్ ఎన్ పీ 43లిబరల్ డెమొక్రాట్స్ 15ఇతరులు 43 -
ఫేక్ వీడియో కాల్ బారినపడ్డ డేవిడ్ కామెరాన్!
లండన్: సామాన్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు.. ఇలా అందరూ ఇటీవలఫేక్ కాల్స్ బారినపడుతున్నారు. అయితే తాజాగా బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరాన్ కూడా ఫేక్ వీడియో కాల్ బారిన పడ్డారు. డేవిడ్ కామెరాన్కు ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో నుంచి వీడియో కాల్ రావటంతో ఆయన సంభాషించారు. అయితే తర్వాత కొంతసేపటికి అది ఫేక్ కాల్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని యూకే విదేశాంగ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది.‘‘ కామెరాన్కు వీడియో కాల్ వచ్చింది. అందులో అచ్చం ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకోలా కనిపిస్తూ ఓ వ్యక్తి మాట్లాడారు. అయితే కొంత సమయానికి అవతలివైపు ఉన్న వ్యక్తి పెట్రో పోరోషెంకోనా? కాదా? అనే అనుమానం డేవిడ్కు కలిగింది. దీంతో అది ఫేక్ వీడియో కాల్గా ఆయన గుర్తించారు. ఈ ఫేక్ వీడియో కాల్, మెసెజ్లు నకిలీవి’ అని విదేశాంగ విభాగం పేర్కొంది.వీటిపై దర్యాపు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ నకిలీ కాలర్తో డేవిడ్ కామెరాన్ ఏం సంభాషించారనే విషయాన్ని మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఫేక్ కాలర్ కామెరాన్ను సంప్రదించటం కోసం మరింత సమాచారం అడిగినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన డేవిడ్ కామెరాన్.. ఫేక్ కాల్స్, నకిలీ సమాచారాన్ని ఎదుర్కొనే ప్రయత్నం, అవగాహన ప్రజల్లో పెంచాలని భావించినట్లు విదేశాంగ కార్యాలయం పేర్కొంది.2018లో బోరిస్ జాన్సన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో అర్మేనియా ప్రధాని పేరుతో ఓ ఫేక్ కాల్ వచ్చింది. అదే విధంగా 2022లో ఇద్దరు మంత్రులకు ఫేక్ కాల్స్ రావటం వెనక రష్యా హస్తం ఉందని బ్రిటన్ ఆరోపణులు కూడా చేసింది. -
ముందస్తు ఎన్నికలకు సునాక్
లండన్: ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. పలురకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్–3కి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. వేసవిలో ఆరు వారాల్లో ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ప్రధాని సునాక్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఎన్నికల ప్రకటన చేస్తూ.. తన పదవీకాలంలో సాధించిన విజయాలను సునాక్ వివరించారు. ‘మీకు వీలైనంత భద్రత ఇవ్వడానికి నా అధికార పరిధికి లోబడి చేయగలిగినంతా చేస్తాను. ఇది నా హామీ. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది’ అని రిషి సునాక్ దేశ ప్రజలనుద్దేశించి అన్నారు. సునాక్ కన్జర్వేటివ్ పారీ్టకి ఓటమి తప్పదని, లేబర్ పార్టీకి విస్పష్ట మెజారిటీ కనిపిస్తోందని చాలా ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుసబెట్టి లేబర్ పారీ్టయే గెలుస్తూ వచ్చింది. ఈ తరుణంలో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడం గమనార్హం. అంతకుముందు బుధవారమే పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సునాక్ బదులిస్తూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలుంటాయని చెప్పారు. అయితే ఆకస్మింగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆకస్మిక కేబినెట్ భేటీ కోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం అర్ధంతరంగా తమ పర్యటనలు ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. చివరికి కేబినెట్ సమావేశం అనంతరం సునాక్ జూలై 4న ఎన్నికలుంటాయని ప్రకటించారు. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఊహించని ఎదురుదెబ్బ!
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఎదురైంది. గత 40 ఏళ్ల చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఇంతలా ఓటమి చెందడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. బ్రిటన్లో ఈ ఏడాది చివర్లలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఫలితాలు రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. కాగా, బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కన్జర్వేటివ్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో, ప్రధాని రిష్ సునాక్పై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అలాగే, ఈ ఫలితాలు ప్రధాని పీఠంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, బ్రిటన్లో 107 కౌన్సిల్స్కు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ముందంజలో కొననసాగుతోంది. Disaster for Tories. Love to see it. Now @RishiSunak call for general elections. pic.twitter.com/6Bj1ARAUbh— OppaGaymer 🇵🇸 (@RafLee84) May 3, 2024 కాగా, బ్లాక్పూల్ సౌత్లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డేవిడ్ జోన్స్పై లేబర్ పార్టీ అభ్యర్థి క్రిస్ వెబ్ ఘన విజయం సాధించారు. టోరీల నుంచి లేబర్ పార్టీకి 26 శాతం ఓటు స్వింగ్ అయింది. 1945 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గత 40 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే దారుణ ఫలితమని, కన్జర్వేటివ్ ప్రభుత్వ పనితీరును అంతా గమనిస్తున్నారని ప్రొఫెసర్ జాన్ కర్టీస్ తెలిపారు. Local elections in England and Wales have delivered a blow to Prime Minister Rishi Sunak and his governing Conservative Party. The opposition Labour Party is on track to win the next general election which takes place later this year pic.twitter.com/iiHfbaqqUZ— TRT World (@trtworld) May 3, 2024 మరోవైపు.. బ్లాక్పూల్ సౌత్ ఉపఎన్నికలో టోరీ మెజారిటీ తారుమారైంది. ఇక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ గణనీయ విజయాలను సాధించింది. బ్లాక్పూల్ సౌత్ ఉప ఎన్నికల్లో 26 శాతంతో తమ పార్టీ విజయం సాధిచడం కీలక పరిణామం అని లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఫలితాలు టోరీలు కౌన్సిల్ సీట్లలో సగం కోల్పోవచ్చని అంచనాలు వస్తున్నాయని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఈ వారాంతంలో లండన్ మేయర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో లేబర్ పార్టీ లండన్ మేయర్ అభ్యర్థి సాదిక్ ఖాన్ మూడోసారి తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక, ప్రచారంలో తనకు సహకరించిన ప్రజలకు, తనను ఆదరించిన ఓటర్లకు ఆయన ప్రత్యర్థి బ్రిటీష్ భారతీయ వ్యాపారవేత్త తరుణ్ గులాటి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందని గులాటి వ్యాఖ్యలు చేశారు. -
ఇదేం వ్యాధి.. తినకూడనివన్నీ లాగించేస్తోంది..
ఇలాంటి రుగ్మతలు రాకుండా ఉంటే బాగుండనిపించే భయానక వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఆ వ్యాధి పరిస్థితి చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. వాటికి సరైన చికిత్స కూడా ఉండదు. ఇదేం కర్మ అనేంత విచిత్రమైన వ్యాధుల్లా ఉంటాయి. అలాంటి అరుదైన రుగ్మతతోనే మూడేళ్ల చిన్నారి బాధపడుతోంది. ఆమె పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే..తల్లిదండ్రులకు నిత్యం ఆ చిట్టి తల్లిని పరివేక్షించలేక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. బ్రిటన్కి చెందిన మూడేళ్ల వింటర్ హేర్నే ఆటిజం తోపాటు విచిత్రమైన మరోక వ్యాధితో బాధపడుతుంది. ఆమె తినకూడని వాటిని హాంఫట్ చేసేస్తుంది. అంటే ఆ చిన్నారి గోడలకు వేసే ప్లాస్టర్లు, సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ల్లోని గ్లాస్లు వంటి వాటన్నింటిని తినేస్తుంది. గృహోపకరణ వస్తువులన్నీ తినేసే అరుదైన రుగ్మతతో బాధపడుతుంది. ఈ వ్యాధిని 'పికా'గా రోగ నిర్థారణ చేశారు వైద్యులు. దీని కారణంగా బాధితులు తినకూడని వాటిని తినేలా ప్రేరేపిస్తుందని చెప్పుకొచ్చారు వైద్యులు. ఇక్కడ ఈ చిన్నారి ఇలా సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ గ్లాస్లు తిన్నా ఆమెకు ఏం కాలేదని తన తల్లి చెబుతోంది. 'పికా' వ్యాధి అంటే.. పికా అనేది మానసిక ఆరోగ్య పరిస్థితి కారణంగా తలెత్తే ఒక విధమైన రుగ్మత. దీని కారణం ఆహారం కానీ వాటిని బలవంతంగా మింగడం, తినడం వంటివి చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది పిల్లల్లో చాలా సాధారణం. ఒక్కోసారి ప్రమాదం కాకపోయిన మరికొన్నిసార్లు తీవ్రమవుతుందని చెప్పారు. అయితే ఈ పరిస్థితికి చికిత్స కేవలం బాధితుల జీవనశైలిలో కొద్ది కొద్ది మార్పులతో ఓపికగా వారిని మార్చడమే అని చెబుతున్నారు. అయితే ఈ పికా వ్యాధి ఏ వయసులోనైనా సంభవిస్తుందట. ఎవరికైనా కూడా రావొచ్చని చెబుతున్నారు. ఎలాంటి వారికి వస్తుందంటే.. చిన్నపిల్లలు-ముఖ్యంగా ఆరు ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు గర్భిణి స్త్రీలు మానసిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు-అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, మేధో వైకల్యాలు లేదా స్కిజోఫ్రెనియా ఎలా ప్రభావితం చేస్తుందంటే. తినకూడని వాటిని తినేలా ప్రేరేపిస్తుంది. దీంతో గట్టి పదార్థాలను కొరకడంతో దంతాలు దెబ్బతింటాయి. ఒక్కోసారి అవి విషపూరితం కావొచ్చు లేదా అరగక జీర్ణ సంబంధ సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చు. ఎందువల్ల వస్తుందంటే.. దేని కారణంగా పికా వ్యాధి వస్తుందనేందుకు కచ్చితమైన కారణాలు తెలియరాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచే అంశాలను గురించి మాత్రం వెల్లడించారు. అవేంటంటే.. ఒత్తిడి, ఆందోళన ఆర్థిక పరిస్థితులు పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్య పరిస్థితులు వైద్య పరిస్థితులు (చదవండి: 'ఉపవాసం' వల్ల గుండె జబ్బులు వస్తాయా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
Britain: క్రియాశీల రాజకీయాలకు థెరెసా మే గుడ్బై
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి థెరెసా మే(67) క్రియాశీల రాజకీయాలకు గుడ్బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని శుక్రవారం ప్రకటించారు. అయితే, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్కు తన మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2016–2019 కాలంలో బ్రిటన్ ప్రధానిగా ఉన్న థెరెసా మే హౌస్ ఆఫ్ కామన్స్లో 27 ఏళ్లపాటు ఎంపీగా కొనసాగారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా 1997 నుంచి ఏడు పర్యాయాలు ఆమె ఎన్నికయ్యారు. మార్గరెట్ థాచర్ తర్వాత బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళ థెరెసా మే ‘న్యూ ఐరన్ లేడీ’గా పేరు తెచ్చుకున్నారు. 2016 జూన్లో రెఫరెండం నేపథ్యంలో కుదిరిన బ్రెగ్జిట్ ఒప్పందం పార్లమెంట్ తిరస్కరించడంతో ఆమె ప్రధాని పదవి నుంచి వైదొలిగారు. -
ఈ పేర్లు పిల్లలకు పెడితే జైలుకే?
ఏ ఇంటిలోనైనా పిల్ల లేదా పిల్లవాడు పుడితే... ఏం పేరు పెట్టాలా?.. అని కుటుంబ సభ్యులంతా మల్లగుల్లాలు పడుతుంటారు. ఎవరికితోచిన పేరు వారు సూచిస్తుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇంటి చుట్టుపక్కలవారు అందరూ రకరకాల పేర్లను చెబుతుంటారు. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో పిల్లల పేర్లకు సంబంధించి అనేక ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? కొన్ని పేర్లను నిషేధించిన దేశాల జాబితాను ఇప్పుడు చూద్దాం. కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఆయా దేశాల్లో నిషేధించిన పేరు పెట్టినట్లయితే, వారు జైలు శిక్షను కూడా అనుభవించాల్సిరావచ్చు. ‘డైలీ స్టార్’తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్లో పేరు పక్కన ఇంటిపేరు ఉంచుకోవడంపై నిషేధం లేదు. అయితే రిజిస్ట్రార్లు ఎలాంటి పేర్లను అంగీకరిస్తానేది తప్పకుండా గమనించాలి. పేరులో అభ్యంతరకర అక్షరాలు ఉండకూడదు. సంఖ్యలు లేదా చిహ్నాలు మొదలైనవి ఉపయోగించేటప్పుడు వాటిని సరిగా వినియోగిస్తున్నట్లు స్పష్టం చేయాలి. పేరు చాలా పొడవుగా ఉండకూడదు. అది రిజిస్ట్రేషన్ పేజీలో ఇచ్చిన కాలమ్లో సరిపోయినంతవరకే ఉండాలి. పేరు చాలా పెద్దగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. అమెరికన్ జనన ధృవీకరణ పత్రంలోని వివరాల ప్రకారం పిల్లలకు కింగ్, క్వీన్, జీసస్ క్రైస్ట్, III, శాంతా క్లాజ్, మెజెస్టీ, అడాల్ఫ్ హిట్లర్, మెస్సీయా, @, 1069 లాంటి పేర్లు పెట్టకూడదు. కొన్ని దేశాల్లో పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఏ దేశంలో ఏ పేరుపై నిషేధం? సెక్స్ ఫ్రూట్ (న్యూజిలాండ్) లిండా (సౌదీ అరేబియా) స్నేక్ (మలేషియా) ఫ్రైడే (ఇటలీ) ఇస్లాం (చైనా) సారా (మొరాకో) చీఫ్ మాక్సిమస్ (న్యూజిలాండ్) రోబోకాప్ (మెక్సికో) డెవిల్ (జపాన్) నీలం (ఇటలీ) సున్తీ (మెక్సికో) ఖురాన్ (చైనా) హ్యారియెట్ (ఐస్లాండ్) మంకీ (డెన్మార్క్) థోర్ (పోర్చుగల్) 007 (మలేషియా) గ్రిజ్మన్ ఎంబాప్పే (ఫ్రాన్స్) తాలులా హవాయి (న్యూజిలాండ్) బ్రిడ్జ్(నార్వే) ఒసామా బిన్ లాడెన్ (జర్మనీ) మెటాలికా (స్వీడన్) ప్రిన్స్ విలియం (ఫ్రాన్స్) అనల్ (న్యూజిలాండ్) నుటెల్లా (ఫ్రాన్స్) వోల్ఫ్ (స్పెయిన్) టామ్-టామ్ (పోర్చుగల్) కెమిల్లా (ఐస్లాండ్) జుడాస్ (స్విట్జర్లాండ్) డ్యూక్ (ఆస్ట్రేలియా) -
యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..
స్వదేశీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి.. ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి "రాడికల్ యాక్షన్" ప్రకటించింది. ఇందులో భాగంగానే నైపుణ్యం కలిగిన విదేశీయుడు యూకేలో పనిచేయడానికి వీసా కావాలనుకుంటే.. కనీస వేతనాన్ని కూడా భారీగా పెంచింది. 2022లో ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య 745000. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికంగా కావడం గమనార్హం. పెరిగిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలనుకునే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ హోమ్ మినిష్టర్ 'జేమ్స్ క్లెవెర్లీ' (James Cleverly) తెలిపారు. అంతే కాకుండా కొత్త రాకపోకలను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్పై ఒత్తిడి పెరగటం కూడా ఇందుకు ఒక కారణం అని తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడించాయి, దానిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇవన్నీ యూకే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని.. రిషి సునాక్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్కు తీసుకుని రావడంపై కూడా నిషేధం ఉంది. అయితే రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇందులో నుంచి మినహాయింపు ఉంటుంది. విదేశీ ఉద్యోగుల జీతం కూడా 38,000 పౌండ్లకు (రూ.40,01,932) పెంచింది. గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల వారు ఎక్కువగా బ్రిటన్ దేశానికీ వలసలు వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఇండియా, నైజీరియా, చైనా నుంచి బ్రిటన్ వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని సమాచారం. Immigration is too high. Today we’re taking radical action to bring it down. These steps will make sure that immigration always benefits the UK. pic.twitter.com/osz7AmcRgY — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 We've just announced the biggest ever cut in net migration. No Prime Minister has done this before in history. But the level of net migration is too high and it has to change. I am determined to do it. — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 -
బ్రిటన్ పీఎం సునాక్కు పదవీ గండం!
లండన్: తన మంత్రివర్గంలో అనూహ్యంగా మార్పులు చేసి, కొత్త వివాదానికి తెరలేపిన యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని, పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సొంత పార్టీ(కన్జర్వేటివ్) ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ తాజాగా ‘1922 కమిటీ’ చైర్మన్ సర్ గ్రాహమ్ బ్రాడీకి లేఖ రాశారు. అయితే, రిషి సునాక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి డిమాండ్ తెరపైకి రావడం ఇదే మొదటిసారి. సొంత పార్టీ నుంచే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. యూకే మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ను మద్దతుదారుగా పేరుగాంచిన ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ రాసిన అవిశ్వాస లేఖ చర్చనీయాంశంగా మారింది. సునాక్ పదవి నుంచి తప్పుకోవాలని, ఆ స్థానంలో అసలు సిసలైన కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిని నియమించాలని జెన్కిన్స్ తేల్చిచెప్పారు. ‘జరిగింది ఇక చాలు. రిషి సునాక్ ఇంటికెళ్లాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్’లో జెన్కిన్స్ పోస్టు చేశారు. అవిశ్వాస లేఖను కూడా జతచేశారు. ప్రధానమంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ పదవి ఊడడానికి ముమ్మాటికీ సునాక్ కారణమని ఆయన ఆరోపించారు. సుయెల్లా బ్రేవర్మన్ను హోంమంత్రి పోస్టు నుంచి తొలగించడాన్ని జెన్కిన్స్ తప్పుపట్టారు. నిజాలు మాట్లాడినందుకే ఆమెపై వేటు వేశారని ఆక్షేపించారు. సునాక్ రాజీనామా కోసం తన సహచర ఎంపీలు కూడా గళమెత్తుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం కోసం తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. అవిశ్వాసం సాధ్యమేనా? అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో 15 శాతం మంది ఎంపీలు అవిశ్వాసాన్ని కోరుతూ లేఖలు రాస్తే సునాక్కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. పార్లమెంట్లో అవిశ్వాస పరీక్ష ఎదుర్కోక తప్పదు. నైపుణ్యం, అనుభవానికి పెద్దపీట: సునాక్ మంతివర్గంలో మార్పులపై ప్రధాని రిషి సునాక్ స్పందించారు. తన ప్రతిస్పందనను ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశానికి దీర్ఘకాలంలో అవసరమైన మార్పులకు శ్రీకారం చుట్టడానికి సిద్ధంగా ఉండే ఒక ఉమ్మడి బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. నైపుణ్యం, అనుభవం, సమగ్రతకు పెద్దపీట వేశామన్నారు. దేశ కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బృందం తోడ్పడుతుందని వివరించారు. -
బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్, అతని భార్య అక్షతా మూర్తిని కలుసుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ తరపున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిషి సునాక్కు వినాయకుని విగ్రహాన్ని, భారత బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ను బహూకరించారు. జై శంకర్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఖాతాలో .. ‘భారతదేశం- యూకేలు ప్రస్తుతం సంబంధాలను బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అందుకు ఇందుకు సహకారం అందిస్తున్న సునాక్కు ధన్యవాదాలు. వారి సాదర స్వాగతం, ఆతిథ్యం అద్భుతం" అని పేర్కొన్నారు. బ్రిటిష్ పీఎం రిషి సునక్ కూడా తన భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలలోని వివిధ అంశాలను సమీక్షించడం, స్నేహపూర్వక సంబంధాలలో కొత్త ఉత్సాహాన్ని కల్పించే లక్ష్యంతో జైశంకర్ ఐదు రోజుల బ్రిటన్ పర్యటన కోసం లండన్ చేరుకున్నారు. నవంబర్ 15న జైశంకర్ విదేశీ ప్రయాణం ముగియనుంది. జైశంకర్ తన పర్యటనలో పలువురు ప్రముఖులను కలుసుకోనున్నారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. దీనితోపాలు భారత హైకమిషన్ ఏర్పాటు చేసిన దీపావళి ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: నీరుగారిన నిషేధం: పేలిన టపాసులు, ఎగిరిన తారాజువ్వలు! The Prime Minister @RishiSunak welcomed @DrSJaishankar to Downing Street this evening. Together they expressed their very best wishes as Indian communities around the world begin #Diwali celebrations. 🇬🇧🇮🇳 pic.twitter.com/gjCxQ0vr8d — UK Prime Minister (@10DowningStreet) November 12, 2023 -
బ్రిటన్ ప్రధాని ఇంట.. దీపావళి సంబరాలు
లండన్: లండన్ వేదికగా దీపావళి సంబరాలు ఊపందుకున్నాయి. సాక్షాత్తు ప్రధాని నివాసం అధికారిక భవనంలో వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు జరుగాయి. దీపావళి వేడుకలకు హిందూ బంధువులను ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఆహ్వానించారు. చీకటిపై వెలుతురు విజయ సూచకంగా దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను ప్రధాని రిషి సునాక్ అధికారిక ఖాతాలో పంచుకున్నారు. అక్షతా మూర్తి దీపాలను వెలిగిస్తుండగా.. ఆమె చుట్టూ జనం గుమిగూడి ఉన్న ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. యూకే, ప్రపంచమంతటా దీపావళి వేడుకలను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. Tonight Prime Minister @RishiSunak welcomed guests from the Hindu community to Downing Street ahead of #Diwali – a celebration of the triumph of light over darkness. Shubh Diwali to everyone across the UK and around the world celebrating from this weekend! pic.twitter.com/JqSjX8f85F — UK Prime Minister (@10DowningStreet) November 8, 2023 చీకటిపై వెలుతురు, చెడుపై మంచి విజయసూచకంగా దీపావళి పండుగను హిందువులు ఈ ఏడాది నవంబర్ 12న జరుపుకుంటారు. ఇరు దేశాల నాయకులు రిషి సునాక్, ప్రధాని మోదీ ఇటీవల టెలిఫొన్లో సంభాషించుకున్నారు. స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందంపై పురోగతి దిశగా అడుగులు పడ్డాయని పేర్కొన్నారు. వరల్డ్ కప్ సందర్భంగా భారత్కు రిషి సునాక్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: నేను భారతీయురాలినైతేనా..? నితీష్ వ్యాఖ్యలపై అమెరికా సింగర్ ఫైర్ -
మాంద్యంలో బ్రిటన్! పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం.. అసలేం జరుగుతోంది?
పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ బహుశా ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్బర్గ్ ఎకనామిక్స్ విశ్లేషణ పేర్కొంటోంది. వరుసగా తిరోగమనం వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి మందగించిన క్రమంలో ఈ సంవత్సరం ద్వితీయార్థంలో తేలికపాటి మాంద్యం ఏర్పడే అవకాశం 52 శాతం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. త్వరలో బ్రిటన్ జీడీపీ గణాంకాలు అధికారికంగా వెలువడనున్న నేపథ్యంలో ఈ విశ్లేషణ ప్రచురితమైంది. వృద్ధి సంకోచం తేలికపాటిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ అసమానతలు మాంద్యానికి దారితీసినట్లు బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ అనలిస్ట్ డాన్ హాన్సన్ ప్రచురణ నోట్లో పేర్కొన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం పడిపోయిందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం, 4.3 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది. రిషి సునక్కు తలనొప్పిగా మాంద్యం! బ్రిటన్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక మాంద్యం ప్రధానమంత్రి రిషి సునక్కు తలనొప్పిగా మారనుంది. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు అనివార్యం కానున్నాయి. తన అంచనాల్లో ఇప్పటికే తేలికపాటి మాంద్యాన్ని సూచించిన బ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ మూడో త్రైమాసికంలో జీడీపీ తిరోగమన అవకాశం 70 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. జులైలో 0.6 శాతం జీడీపీ క్షీణించగా ఆగస్టులో పెద్దగా పుంజుకోలేదు. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మాత్రం మాంద్యానికి 50 శాతం అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. -
ఆ దేశాల్లో ఒక్క పాము కూడా కనిపించదట!
పాములు లేని ఊరు, గ్రామం ఉండు. కానీ కొన్ని దేశాల్లో అస్సలు పాము అనేదే కనిపించదట. ముఖ్యంగా ఓ దేశంలో అయితే ఇంతవరకు పాము కనిపించిన దాఖలాలు లేవని తేల్చి చెబుతున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. ఎందువల్ల అక్కడ పాములు కనిపించవు? రీజన్ ఏంటి తదితరాల గురించే ఈ కథనం!. బ్రిటన్ , ఐర్లాండ్లో పామలు అస్సలు కనపించవట. అందుకు కారణంగా అతి శీతల ప్రదేశాలు కావడం వల్ల అని అంటుంటారు. గడ్డకట్టే చలిలో ఆ సరిసృపాలు జీవించలేవని అందువల్లే ఇక్కడ పాములు లేవని చెబుత్నున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటి వరకు ఒక్క పాము కూడా కనిపించనట్లు రికార్డుల్లో కూడా లేదని చెప్పారు. పురాణాల ప్రకారం క్రీస్తు శకంలో సెయింట్ పాట్రిక్ అనే క్రైస్తవ మత పెద్ద ఐర్లాండ్ ద్వీపం నలుమూలలోని పాములను తరిమేసి సముద్రంలోకి పడేశాడని అందువల్లే ఇక్కడ పాములు ఉండవని కథలు కథలుగా చెబుతుంటారు. అంతేగాదు సుమారు పదివేల సంవత్సరాల క్రితం ప్రకృతి వైపరిత్యం వల్ల హిమనీనదాలు కరిగిపోవడంతో ఈ ఐర్లాండ్ ద్వీపం కొన్నేళ్ల వరకు మునిగిపోయిందని, అందువల్లే పాములు లేవని చెబుతుంటారు. పురావస్తు రికార్డుల ప్రకారం, బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో పాములు లేవని వెల్లడించింది. ఐతే ఆ తర్వాత మరికొన్ని పరిశోధన కారణంగా ఈ దేశాల్లో మూడు రకాల పాము జాతులను గుర్తించారు. గడ్డి పాములు, ఎడ్డర్ పాములు, సాధారణ పాములు వంటి సరీసృపాలు జాతులను మాత్రమే గుర్తించారు. అలాగే న్యూజిలాండ్లో కూడా ఒక్క పాము కూడా కనిపించదట. ఇది ఎన్నో రకాల అడవి జంతువులకు నిలయమైన ఇక్కడ కూడా ఒక పాము కూడా కనిపించదట. (చదవండి: నిద్ర సమస్యల్ని ఈజీగా పట్టేస్తుంది ఈ వాచ్!) -
20 ఏళ్లు వెదికినా తగిన జోడీ దొరకలేదని..
బ్రిటన్కు చెందిన సారా విల్కిన్సన్ (42) అనే మహిళ సరైన భాగస్వామి కోసం 20 ఏళ్లుగా వెదుకుతూనే ఉంది. అయినా ప్రయోజనం లేకపోవడంతో, ఇక మరోమార్గం లేదని ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇంగ్లండ్లోని ఫెలిక్స్స్టో నివాసి సారా ఇటీవల హార్వెస్ట్ హౌస్లో తనను తానే పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుక కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసింది. చిన్నప్పటి నుంచి పెళ్లిలో డైమండ్ రింగ్ ధరించాలని కలలుగనేదానినని, ఆ కలను ఇప్పుడు నెరవేర్చుకున్నానని సారా మీడియాకు తెలిపింది. బ్రిటిష్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం సారా వివాహం ముఖ్యాంశాలలో నిలిచింది. అయితే అధికారికంగా ఈ పెళ్లికి గుర్తింపు దక్కలేదు. సారా తన వివాహానికి ఘనమైన ఏర్పాట్లు చేసింది. అద్భుతమైన వివాహ వేదికను సిద్ధం చేసుకుంది. గ్రాండ్ వెడ్డింగ్ల మాదిరిగానే డెకరేషన్ నుంచి ఫుడ్, డ్రింక్స్ వరకు అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసినట్లు సారా తెలిపింది. ఈ పెళ్లి వేడుకకు రూ.10 లక్షలు ఖర్చు చేసింది. తన పెళ్లి ఖర్చుల కోసం సారా చాలా ఏళ్లుగా పొదుపు చేస్తూ, డబ్బులు దాచింది. ఈ వివాహానికి సారా విల్కిన్సన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. సారా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. సారా స్నేహితురాలు,ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్ కేథరీన్ క్రెస్వెల్ ఈ వేడుకను నిర్వహించారు. సారా పెళ్లి వేడుకలో స్నేహితులమంతా కలుసుకోవడం ఆనందంగా ఉందని కేథరీన్ చెప్పింది. కాగా సారా తనను తాను వివాహం చేసుకున్నప్పటికీ, తనకు సరైన జోడీ దొరికే వరకూ వెదుకుతూనే ఉంటానని తెలిపింది. ఇది కూడా చదవండి: నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి.. -
బ్రిటన్ ధూమపాన రహితదేశం కానుందా? ప్రధాని రిషి సునాక్ ప్లాన్ ఏమిటి?
బ్రిటన్ కొత్త ప్రతిపాదిత చట్టం ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాలలో బ్రిటన్లో ధూమపానం సమర్థవంతంగా నిర్మూలనకానుంది. 2040 నాటికి బ్రిటన్ ‘పొగ రహిత’ దేశంగా మారుతుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ తర్వాత రాబోయే తరం ధూమపానం చేయకుండా నిరోధించడానికి చట్టం చేసిన రెండవ దేశం బ్రిటన్. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ధూమపానం ఒక సామాజిక దురాచారంగా మారింది. ధూమపానం కారణంగా లెక్కలేనంతమంది క్యాన్సర్తోపాటు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 2040 నాటికి దేశాన్ని ధూమపాన రహితంగా మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం బ్రిటన్లో కొత్త చట్టాలను రూపొందించడంపై చర్చ జరుగుతోంది. బ్రిటీష్ వయోజనులలో 12.9 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. 8.7 శాతం మంది ప్రతిరోజూ ఇ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారు. నూతన చట్టాలను అమలు చేయడం ద్వారా 2075 నాటికి 1.7 మిలియన్ల మంది ధూమపానం చేయడాన్ని తగ్గించవచ్చని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. యూకేలో అమలుకానున్న కొత్త చట్టం జనవరి 1, 2009న లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని చట్టవిరుద్ధం చేశారు. ప్రస్తుతం ధూమపానం చేసే వయస్సు 18 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం చట్టబద్ధంగా ధూమపానం చేసే వయస్సును పెంచడం అనేది సమీక్ష ముఖ్య సిఫార్సులలో ఒకటి. ధూమపానం అనేది గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అంగస్తంభన, గర్భస్రావం వంటి 50 అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం సంవత్సరానికి 76,000 మందిని పొట్టనపెట్టుకుంటోంది. కేఫ్లు, పబ్లు, బార్లు, రెస్టారెంట్లలో ధూమపానాన్ని నిషేధించిన ఏకైక దేశం న్యూజిలాండ్. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా న్యూజిలాండ్ తరహాలో దేశంలో ధూమపానాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కూడా చదవండి: ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? -
కొడుకు హఠాన్మరణం ఆ తండ్రిని..ఏకంగా..
ఒక్కో ఘటన లేదా పరిస్థితులు మనిషిని తనకే తెలియని తనలోని ఓ కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. అవి కొందర్నీ మహనీయుడిని చేస్తే మరికొంర్ని వక్రమార్గంలో పయనించేలా చేస్తాయి. ఇక్కడొక తండ్రి కొడుకుని కోల్పోడమే జీర్ణించుకోలేని సతతమవుతున్న స్థితిలో తన కొడుకులా మరెవరూ అలా చనిపోకూడదనే గొప్ప ఆలోచనకు తెరతీసింది. ఇంకొన్నాళ్లు ఉండాల్సిన కొడుకు ఎలా అకాల మరణం చెందాడన్న ఆ సందేహమే అతడిని ఓ సరికొత్త చైతన్యం వైపుకి తీసుకెళ్లింది. అసలేం జరిగిందంటే..బ్రిటన్లోని భారత సంతతి చెందిన జే పటేల్కి 30 ఏళ్ల బలరామ్ అనే కొడుకు ఉన్నాడు. అతను లండన్లో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో అనూహ్యంగా మరణించాడు. దీంతో జీర్జించుకోలేని బలరామ్ తండ్రి తన కొడుకు ఎలా చనిపోయాడన్న సందేహంతో విచారించడం ప్రారంభించాడు. తన కొడుకు సరైన చికిత్స సకాలంలో అందలేదని, సరైన సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్లే చనిపోయినట్లు వెల్లడైంది. దీంతో అతను ఆస్పత్రిలోని పేషెంట్స్ సమస్యల పూర్వాపరాలు, జీవన వ్యవధిని నమోదు చేయడం ప్రారంభించాడు. అంతేగాదు చికిత్సలో తలెత్తుతున్న వైద్యుల తప్పుల తడకల గురించి కొత్త ఛారిటీ ఫౌండేషన్ని కూడా ప్రారంభించి రోగుల హక్కుల కోసం ప్రచారం చేస్తున్నాడు. తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్లో తన కొడుకు ఆస్పత్రి కన్సల్టెంట్, మిగతా సిబ్బంది చికిత్స సంరక్షణ వైఫల్యం కారణంగానే తీవ్ర నొప్పి, అసౌకర్యంతో ముందుగానే చనిపోయినట్లు అందరికీ తెలియజేశాడు. తాను చేసే ఈ కార్యక్రమాల ద్వారా అయిన తన కొడుకు బలరాం ట్రీట్మెంట్లో ఎలాంటి తప్పులు జరిగాయి అనే దానిపై ప్రభుత్వం స్పందించి..సత్వరమే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాని అన్నారు. ఆస్పత్రుల్లో పేషెంట్ బంధువు, స్నేహితుడు, మరెవరైనా.. వారి ఆత్రతను ఆవేదనను ఆస్పత్రి యాజమాన్యం అస్సలు పట్టించుకోదని, అక్కడ తతెత్తుతున్న లోపాలను సరిదిద్దే యత్నం కూడా చేయదని ఆవేదనగా చెబున్నారు పటేల్. బ్రిటన్ పార్లమెంటు ఈ విషయంపై మార్పు తీసుకురావాలని ఆశిస్తున్నట్లు తెలిపాడు. చివరి నిమిషంలో తన కొడుకు ఆరు ప్రాణాపాయ సంకట పరిస్థితులతో పోరాడడని చెప్పారు. తన కొడుకు చిన్నతనంలో కూడా ఎనిమిది నుంచి 10 ఏళ్ల వరకు మానసికి వయసు సంబంధించిన పెరుగదల సమస్యతో ఇబ్బంది పడ్డాడని కన్నీటి పర్యంతమయ్యారు. అలా.. అలా నెమ్మదిగా మానసిక వికాసం కలుగుతుందనేలోపు ఇలాంటి ఘోరంగా జరిగిందని అన్నారు. అతను అందర్నీ ఆప్యాయంగా పలకరించేవాడు, ప్రేమగా ఉండేవాడంటూ కొడుకుని గుర్తుచేసుకున్నారు. ఇది పీడకలలా తనను వెంటాడుతూనే ఉంటుందని కన్నీళ్లు పెట్టుకున్నారు పటేల్. తన కొడుకు ఇంకొన్నాళ్లు జీవించాల్సిన వాడని, తగిన చికిత్స అందించడంలో జాప్యం, మంచి వైద్యం లేకపోవడం తదితర కారణాల వల్లే మరణించాడన్నారు. అందుకే తాను ఈ ఛారిటీ ద్వారా రోగులకు చికిత్సకు సంబంధించిన వివరాలు సేకరించి అకాల మరణాలను నివారించేలా చేయడమే గాక వారికి మంచి వైద్యం అందేలా ప్రత్యామ్నాయం మార్గాన్ని(వైద్యానికి సంబంధించిన సెకండ్ ఓపినియన్) ఎలా ఎంచుకువాలో అనే దానిపై అవగాహన కల్పిస్తున్నాడు. దీనికి యూకే ప్రభుత్వం, యూకే ఆరోగ్య కార్యదర్శి స్టీవ్ బార్క్లే మద్దతు ఇవ్వడంతోనే ఈ ప్రచారానికి పిలుపు ఇచ్చినట్లు పటేల్ తెలిపారు. ఇక 2021లో సెప్సితో మరణించి 13 ఏళ్ల మార్తా తల్లి కూడా ఇలానే "మార్తాస్ రూల్" అనే పేరుతో వైద్య చికిత్సకు సంబంధించిన సెకండ్ ఓపెనియన్ కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. (చదవండి: భారత సంతతి చిన్నారికి అత్యంత అరుదైన కిడ్నీ మార్పిడి..! బ్రిటన్లోనే తొలిసారిగా..) -
మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..
ప్రస్తుతం ఆలుమగలు ఉరుకులు పరుగులు జీవితంతో పిల్లల ఆలనపాలన చూసుకోలేని స్థితిలో లేరు. అందులోనూ భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయితే పిల్లల బాగోగులు చూసుకోవడం అస్సలు కుదరదు. కాస్త స్తోమత ఉంటే డేకేర్ లేదంటే అమ్మమ్మ, నాయనమ్మల వద్ద ఉంచాల్సిందే. కానీ ఇక్కడొక అమ్మమ్మ తన మనవరాలిని చూసుకునేందుకు గంటకు రూ. 1600లు ఇవ్వాల్సిందేనని కూతురికి తెగేసి చెప్పింది. దీంతో కూతురు ఒక్కసారిగా షాక్ గురయ్యింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకిలా ఆమె డిమాండ్ చేసిందంటే.. అసలేం జరిగిందంటే..ఓ వృద్ధ మహిళ తన సొంత మనవరాలిని సంరక్షణ కోసం, గంటకు రూ. 1600 ఛార్జ్ చేస్తానని కరాఖండీగా చెప్పింది కూతురికి. అంతేగాదు ఆ చిన్నారికి సంబంధించిన కొన్ని లగ్జరీ వస్తువులను కూడా డిమాండ్ చేసింది ఆ వృద్ధురాలు. ఈ విచిత్ర ఘటన బ్రిటన్లో చోటుచేసుకుంది. కూతురు..."తన తల్లి వృద్ధురాలని, పైగా ఇంట్లో ఖాళీగానే ఉంది. కాబట్టి తాను తన కూతురిని చూసుకోమని అడిగాను. ఇది ఏమైనా అడగకూడని విషయమా!. తాను, తన భర్త ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నందువల్లే అడుతున్నా" అని కూతురు తల్లిని ప్రాధేయపడుతోంది. తన తల్లి వయసు 64 ఏళ్లు అని, ప్రస్తుతం ఆమె ఏ ఉద్యోగం చేయడం లేదు. అందువల్ల ఆమెకు చాలా సమయం ఉంటుంది. కాబట్టి నా కుమార్తెను చూసుకోమని అడిగాను. కానీ ఆమె గంటకు సుమారు 16 పౌండ్ల ఛార్జీ ఇవ్వాలని చెబుతోంది. ఏం చేయాలో తెలియడం లేదని సోషల్ మీడియాలో వాపోయింది ఆ వృద్ధురాలి కూతురు. తన తల్లి ఆలస్య రుసుమును కూడా వసూలు చేస్తానని కరాఖండీగా చెప్పనట్లు తెలిపింది. అంతేగాదు కారులో ప్రత్యేక సీటు, స్టోలర్, బాటిల్ ఇతర వస్తువులు కూడా కావలని డిమాండ్ చేసిందంటూ గోడు వెల్లబోసుకుంది కూతురు. ఎందుకు ఆ వస్తువులన్నీ అడిగిందంటే.. తన తల్లి వస్తువులను శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించను కూడా ఉపయోగించదని ఆవేదనగా చెబుతోంది. ఇంత మొత్తం చెల్లించాలంటే తాను అప్పులుపాలు కాక తప్పదని కూతురు ఒకటే గోల చేస్తోంది. కానీ సదరు వృద్ధురాలు తన డిమాండ్లను అంగీకరించకపోతే చూడనని నిర్మోహమాటం చెప్పేసింది. ఇక ఆమె ఒప్పుకోకపోతే కూతుర్ని డేకేర్లో పెడతానని చెబుతోంది. తన కుటంబంలో అందరూ నైన్ టు ఫైవ్ జాబే చేస్తారని, అందువల్లే తాను వాళ్ల అమ్మను కోరినట్లు పేర్కొంది. ఈ విషయం ప్రస్తుతం బ్రిటన్ అంతటా తెగ వైరల్ అవుతోంది. నిజానికి చాలామంది వృద్ధులు లేదా ఇంట్లోని పెద్దవాళ్ల పట్ల ఇలాంటి ధోరణితోనే ఉంటారు. ఇది సరైనది కాదు. వృద్ధులు ఖాళీగా పనిపాట లేకుండా ఉంటారని అలుసుగా చూడకూడదు. జీవితంలో పడరాని పాట్లు కష్టాలు పడి మనల్ని పెంచినవారు. వారు జీవితంలో ఎన్నో వేదనలను గెలుపోటములు చూసి.. చూసి.. అలసిపోయిన వాళ్లు. వాళ్లకంటూ కాస్త ఏకాంతం కావాలని కోరుకుంటారు. ముందుగా వారి ఓపెనియన్ అడగాలి. వారి మనసెరిగి మసులుకుంటే చూసేదేమో ఆమె!. ఏమో ఆమె మనసులో ఏమూలనో ఏదో అభద్రతా భావం ఉంటేనే కథ ఇలా మాట్లాడతారు. ఒక్కసారి ఇలా ఆలోచించి వారిని అర్థం చేసుకునే యత్నం చేయండి. కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఈ విషయం పట్ల నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందించారు. పిల్లలను చూసుకునే సామర్థ్యం లేప్పుడూ పిల్లల్ని కనాలనే ఆలోచన తీసుకోకుండా ఉండాల్సింది. లేదా గర్భధారణ సమయంలోనే తల్లితో మాట్లాడి ఉండాల్సింది. అయినా ఆమె ఇప్పటి వరకు మిమ్మల్ని సంరక్షించింది. ఇక మీ కూతుర్ని చూసుకోవాల్సింది మీ బాధ్యతే అని ఆమెకు చివాట్లు పెడుతూ పోస్ట్లు పెట్టారు. (చదవండి: ఏనుగు చెవులు లాంటి అరుదైన ఆక్టోపస్! విస్తుపోయిన శాస్త్రవేత్తలు -
భయపడొద్దు.. కుక్కలను కంట్రోల్ చేస్తున్నాం: బ్రిటన్ ప్రధాని
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్లో పెరుగుతున్న కుక్కల బెడదపై దృష్టి సారించి, అత్యంత ప్రమాదకరమైన శునకజాతిపై నిషేధం విధించారు. బ్రిటన్లో పెరుగుతున్న కుక్క కాట్లను నివారించేందుకు రుషి సునాక్ అమెరికన్ ఎక్స్ఎల్ బులీ జాతికి చెందిన కుక్కల పెంపకంపై నిషేధం విధించారు. ఈ సందర్భంగా సునాక్ మాట్లాడుతూ అమెరికన్ ఎక్స్ఎల్ బులీ డాగ్స్ మనుషులకు ప్రమాదకరంగా పరిణమించాయని, ముఖ్యంగా ఇవి చిన్నారులపై దాడులు చేస్తున్నాయన్నారు. ఈ తరహా కుక్కలు దాడులకు పాల్పడటానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన షేర్ చేశారు. ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన శునకాలతో సమస్య లేదని, అయితే ఎక్స్ఎల్ బులీ డాగ్స్ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేమన్నారు. బ్రిటన్లో పెరుగుతున్న కుక్కల బెడద నివారణకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలియజేశారు. ఇటీవల జరిగిన దాడులకు కారణంగా నిలిచిన కుక్కల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామన్నారు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని తెలిపారు. కాగా ఇటీవల స్టాఫోర్డ్షైర్లో ఎక్స్ఎల్ బులీ జాతి శునకం ఒక వ్యక్తిపై దాడి చేయగా, అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికిముందు 11 ఏళ్ల చిన్నారిపై ఇదేవిధమైన దాడి జరిగింది. కాగా ఎక్స్ఎల్ బులీ అనేది అమెరికన్ పిట్బుల్ టెరియర్స్- అమెరికన్ స్టాఫోర్డ్షైర్ టెరియర్స్ల క్రాస్ బ్రీడ్. ఇది కూడా చదవండి: సహారా ఎడారిలో పచ్చదనం? వేల ఏళ్లకు కనిపించే దృశ్యం? It’s clear the American XL Bully dog is a danger to our communities. I’ve ordered urgent work to define and ban this breed so we can end these violent attacks and keep people safe. pic.twitter.com/Qlxwme2UPQ — Rishi Sunak (@RishiSunak) September 15, 2023 -
ఆమె భారత యువరాణి.. బ్రిటన్లో మహిళల ఓటుహక్కు కోసం ఎందుకు పోరాడారు?
భారతదేశానికి చెందిన ఒక యువరాణి మహిళల ఓటు హక్కు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆమె కారణంగానే బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు లభించింది. ఈ ఉద్యమం కోసం ఆమె తన రాజ కీయ హోదాను కూడా పక్కన పెట్టారు. అయితే కాలక్రమేణా ఆమె చరిత్ర మరుగున పడింది. ఇంతకీ ఆ భారతీయ యువరాణి ఎవరు? ఆమె బ్రిటన్లో మహిళల ఓటుహక్కు గురించి ఎందుకు పోరాడవలసి వచ్చిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ యువరాణి మరెవరో కాదు.. పంజాబ్ చివరి సిక్కు పాలకుడు మహారాజా దులీప్ సింగ్ కుమార్తె సోఫియా దులీప్ సింగ్. ఈమె బ్రిటన్లోని నార్ఫోక్-సఫోల్క్ సరిహద్దులోని ఎల్వెడీన్లో పెరిగారు. భారతదేశంలోకి ప్రవేశించిన బ్రిటీష్ పాలకులు 1840లో మహారాజా దులీప్ సింగ్ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతనిని బ్రిటన్కు తరలించారు. అయితే భారతదేశానికి తిరిగి రావడానికి దులీప్ సింగ్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ తర్వాత తనకు అందిన పరిహారపు సొమ్ముతో ఆయన ఎల్వెడీన్ హాల్ను కొనుగోలు చేశారు. అతను తన పిల్లలతో సహా అక్కడే ఉండేవారు. బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం, యువరాణి సోఫియా 1900లలో మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడారు. మహారాజా దులీప్ సింగ్ కుటుంబం బ్రిటన్ రాణి విక్టోరియాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఈ నేపధ్యంలోనే విక్టోరియా రాణి ఈ రాజకుటుంబానికి హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్లో అపార్ట్మెంట్ అప్పగించారు. సోఫియా దులీప్ సింగ్ను ‘విక్టోరియా రాణి గాడ్ డాటర్’ అని పిలుస్తారు. ఈ కారణంతోనే ప్రిన్సెస్ సోఫియా బ్రిటీష్ మహిళల మాదిరిగానే జీవితాన్ని గడిపారు. కాలక్రమేణా ఆమె బ్రిటన్లో మహిళల హక్కుల కోసం ఏదైనా చేయాలని భావించారు. ప్రిన్సెస్ సోఫియా ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ అండ్ ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్లో సభ్యురాలు. ఈ లీగ్ మహిళల ఓటు హక్కు కోసం ‘నోట్ నో టాక్స్’ నినాదం అందుకున్నారు. యువరాణి సోఫియా 400 మంది మహిళలతో కలిసి 1910లో బ్రిటీష్ పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో మహిళా ఓటు హక్కు కార్యకర్త ఎమ్మెలిన్ పాన్ఖర్స్ట్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన జరిగిన రోజున ‘బ్లాక్ ఫ్రైడే’గా పిలిచారు. యువరాణి సోఫియా నినాదాలు చేయడం లేదా నిరసనలలో పాల్గొనడం మాత్రమే కాకుండా, హాంప్టన్ కోర్ట్ ప్యాలెస్లోని తన ఇంటి వెలుపల మహిళల ఓటు హక్కుకు సంబంధించిన వార్తాపత్రికలను విక్రయించారు. ఈ కారణంగా ఆమె చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. మహారాజా రంజిత్ సింగ్ మనవరాలు ప్రిన్సెస్ సోఫియా పోరాటాల కారణంగా బ్రిటిష్ మహిళలు ఓటు హక్కును పొందారు. 1876లో జన్మించిన ఆమె 1903లో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. ఇది ఆమె జీవితంలో కీలక మలుపుగా మారింది. రాజద్రోహం ఆరోపణలతో జైలుకెళ్లిన స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతిరాయ్ సాగించిన పోరాట పటిమకు ఆమె ప్రభావితురాలయ్యారు. ఇదే ఆమెను బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు ప్రేరేపణ కల్పించింది. ఆమె బ్రిటన్లో మహిళల ఓటుహక్కు పోరాటం కొనసాగించేందుకు ఇంగ్లాండ్కు తిరిగి వెళ్లారు. అక్కడ ఆమె మహిళా ఓటుహక్కు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె నిరసనలలో పాల్గొంటున్న కారణంగా ఇంగ్లండ్లో ఆమెను వ్యతిరేకించేవారి సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఆమె దానిని పట్టించుకోలేదు. ప్రిన్సెస్ సోఫియా బ్రిటన్ మహిళలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా భారత స్వాతంత్ర్య సంగ్రామంలోనూ పాలుపంచుకున్నారు. అలాగే 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడిన భారతీయ సైనికులకు వైద్య సహాయం అందించారు. ఆమె బ్లూ ఫ్లాక్ అవార్డును అందుకున్నారు. యువరాణి సోఫియా 1948లో తన 71 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ‘కౌన్ బనేగా కరోడ్పతి’ విజేతలు ఏం చేస్తున్నారు? -
బ్రిటన్లో సంచలనం.. దివాలా తీసిన ప్రముఖ నగరం!
బ్రిటన్లోని రెండవ అతిపెద్ద నగరమైన బర్మింగ్హామ్ (Birmingham) దివాలా (bankrupt) తీసింది. స్థానిక సంస్థ అయిన బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ మిలియన్ల పౌండ్ల వార్షిక బడ్జెట్ లోటు కారణంగా దివాలా తీసినట్లు ప్రకటించింది. బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ ప్రతిపక్ష లేబర్ పార్టీ ఆధీనంలో పాలన సాగిస్తోంది. 100 మందికి పైగా కౌన్సిలర్లతో ఐరోపాలోనే అతిపెద్ద స్థానిక సంస్థ ఇది. నగదు లోటుతో సంస్థ దివాలా తీసిందని, పౌరుల రక్షణ, ఇతర చట్టబద్ధమైన సేవలను మినహాయించి అన్ని కొత్త ఖర్చులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు సెక్షన్ 114 నోటీసును జారీ చేసింది. సంక్షోభానికి కారణమదే.. "సమాన వేతనాల చెల్లింపు" చేపట్టాల్సి రావడంతో తీవ్ర సంక్షోభం తలెత్తిందని, ఇందు కోసం ఇప్పటిదాక 650 మిలియన్ పౌండ్ల నుంచి 760 మిలియన్ పౌండ్లు ఖర్చు చేశామని, నిధుల లోటుతో భయంకరమైన ఆర్థిక పరిస్థితి ఏర్పడిందని కౌన్సిల్ పేర్కొంది. ఈ మేరకు కౌన్సిల్ తాత్కాలిక ఫైనాన్స్ డైరెక్టర్ ఫియోనా గ్రీన్వే స్థానిక ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 114(3) కింద ఒక నివేదికను విడుదల చేశారు. 2012లో బర్మింగ్హామ్ కౌన్సిల్పై కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 1.1 బిలియన్ల పౌండ్ల సమాన వేతన క్లెయిమ్లను చెల్లించింది. ఈ కేసులో యూకే సుప్రీం కోర్ట్ 174 మంది మహిళా ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అథారిటీ పరిధిలో పనిచేసే మహిళా టీచింగ్ అసిస్టెంట్లు, క్లీనర్, క్యాటరింగ్ సిబ్బంది, చెత్తను సేకరించేవారు, వీధులు శుభ్రం చేసే కార్మికులు పురుషలతో సమానంగా బోనస్ ఇవ్వాలని కేసు వేశారు. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల మాదిరిగానే, బర్మింగ్హామ్ సిటీ కౌన్సిల్ కూడా వయోజన సామాజిక సంరక్షణ డిమాండ్, ఆదాయ తగ్గుదల కారణంగా తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని కౌన్సిల్ నాయకుడు జాన్ కాటన్, డిప్యూటీ లీడర్ షారన్ థాంప్సన్ ఒక ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే తమ ప్రాధాన్యత అని వివరించారు. -
6 వేల కి.మీ. ప్రయాణించి బీచ్లో బిడ్డకు జననం.. పరాయి ప్రాంతంలో బందీగా మారిన జంట!
ఒక బ్రిటీష్ మహిళ బిడ్డకు జన్మనిచ్చేందుకు 4000 మైళ్లు(6437 కిలోమీటర్లు) ప్రయాణించింది. ప్రకృతి సిద్ధమైన అందమైన సముద్ర తీరంలో బిడ్డకు జన్మన్వివ్వాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడింది. ఆ గర్భిణి కలను సాకారం చేసేందుకు ఆమె భర్త కూడా ఎంతో సహకారం అందించాడు. ఎట్టకేలకు ఆమె దక్షిణ కొరియా దేశమైన గ్రెనడా సముద్రతీరంలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇలా బిడ్డకు జన్మనిచ్చిందో లేదో, వెంటనే ఆ దంపతులను సమస్యలు చుట్టుముట్టాయి. జనన ధృవీకరణ పత్రం కోసం చిక్కులు బిడ్డకు జన్మనిచ్చినది మొదలు నాలుగు నెలలుగా.. అంటే ఇప్పటికీ ఆ దంపతులు గ్రెనడా తీరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆ బిడ్డకు సంబంధించిన జనన ధృవీకరణ పత్రం అడగడమే ఆ దంపతులకు పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ నేపధ్యంలో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారి దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి. యూకేలో చిక్కుకుపోయిన పెద్ద కుమార్తె ఆ బ్రిటీష్ మహిళ పేరు యూలియా గుర్జీ(38). ఆమె యోగా ట్రైనర్. ఆమె భర్త పేరు క్లైవ్(51). వారికి ఇప్పటికే 8 ఏళ్ల ఎలిజబెత్ అనే కుమార్తె ఉంది. ఆమెను వారు యూకేలో ఉంచారు. ఎలిజబెత్ పాస్పోర్టు రివ్వ్యూ కాకపోవడంతో వారు ఆ చిన్నారిని తమతోపాటు తీసుకురాలేకపోయారు. కాగా ఆ దంపతులు యూకే నుంచి యూలియా సముద్ర తీరం చేరుకునేందుకు 6437 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. యూలియా ఏప్రిల్ 23న సాగరతీరంలో బేబీ లూయిస్కు జన్మనిచ్చింది. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసి.. క్లైవ్ మీడియాతో మాట్లాడుతూ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్.. తాము ఆ నవజాత శిశువుకు తల్లిదండ్రులమైనట్లు తగిన రుజువు చూపించాలని కోరుతున్నదన్నారు. తాము రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు సమర్పించి, కొంతకాలం వేచి చూశామన్నారు. ఎంతకీ తమకు బర్త్సర్టిఫికెట్ అందకపోవడంతో తిరిగి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అధికారులను అడగగా, ఆ బిడ్డ ఆసుపత్రిలో జన్మించలేదని, అలాగే ఆ చిన్నారి ఎక్కడ జన్మించిందనే వివరాలు లేవని, అందుకే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చిచెప్పేశారన్నారు. పాస్పోర్టు కార్యాలయ సిబ్బంది కూడా.. తాము కింగ్ యూరోపియన్ యూనియన్ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడి సిబ్బంది తాము ఆ శిశువు జననానికి సంబంధించిన వివరాలు నమోదు చేయలేమన్నారు. బిడ్డపుట్టిన 24 గంటల తరువాత రిజిస్ట్రేషన్ కోసం వచ్చినందున తాము ఏమీ చేయలేమని తేల్చిచెప్పేశారని క్లైవ్ తెలిపారు. పాస్పోర్టు కార్యాలయ సిబ్బంది కూడా బిడ్డ జననానికి సంబంధించిన రుజువులు లేనందున తామేమీ చేయలేమని తెలిపారు. దీంతో క్లైవ్ యూకేలోని సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించగా, వారు డిఎన్ఏ టెస్టు చేయించాలని కోరారు. దీనికి సంబంధించిన రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని క్లైవ్ తెలిపారు. ‘చేతిలో చిల్లిగవ్వ లేదు’ ఇప్పటివరకూ తన కార్డులోవున్న 6,000 పౌండ్లు ఖర్చయిపోయాయని, తమ దగ్గర ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేదని క్లైవ్ తెలిపారు. తాము యూకే నుంచి సహాయం అర్థిస్తుండగా, ఇంతవరకూ ఎటువంటి సమాధానం లేదన్నారు. యూలియా మాట్లాడుతూ తాము ఈ దేశంలో బందీ అయిపోయామని, యూకే తిరిగి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. యూకేలో ఉండిపోయిన తమ పెద్ద కుమార్తె తమకు తరచూ గుర్తుకువస్తున్నదని, బంధువుల ఇంటిలో ఆమె ఎలా ఉన్నదో తమకు తెలియడం లేదని యూలియా కన్నీరుపెట్టుకుంది. ఇది కూడా చదవండి: ‘నన్ను కొట్టి చంపేస్తున్నాడు’.. కమిషనరేట్లో 105 ఏళ్ల వృద్ధుని రోదన! -
200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి..
ఒక యువతికి తమ ఇంటి కింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు, అధ్యాపకులకు తెలిపింది. దీంతో వీరంతా ఆ గదిలోనికి వెళ్లి, లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశారు. ఆ గది 1800 శతాబ్దం నాటిదని గుర్తించారు. ఈ ఉదంతం బ్రిటన్లోని నాటింగ్హామ్లో చోటుచేసుకుంది. ది సన్ రిపోర్టును అనుసరించి ఈ నేలమాళిగ 200 ఏళ్ల క్రితం నాటిది. అమ్మాయిలంతా దానిలోనికి వెళ్లి చూడగా వారికి అక్కడ ఒక ఫ్లోర్ కనిపించింది. అక్కడ నాలుగు మూలలా బెంచీలు కనిపించాయి. అలాగే పలు అల్మరాలు కూడా ఉన్నాయి. అది వారికి ఒక స్టోర్ రూమ్ మాదిరిగా కనిపించింది. ఆ యువతి కుటుంబం ఈ ఇంటిలోకి షిష్ట్ అయ్యే సమయంలో వారికి ఈ సంగతి తెలియదు. నాటింగ్హామ్ ట్రెంట్ యూనివర్శిటీ జర్నలిజం విద్యార్థి స్టెఫానీ బెన్నెట్.. కొద్దిపాటి భయాందోళనల వాతావరణం మధ్య తన ఈ నూతన ఆవిష్కరణ ఎలా జరిగిందో మీడియాకు తెలియజేసింది.. ‘అదేమీ పెద్ద గది కాదు. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ ఆవిష్కరణ ఎంతో ఆసక్తికరంగా సాగింది. లోపల ఏముందో చూడాలనే ఆసక్తితో తామంతా ఒకేసారి ఆ గదిలోనికి ప్రవేశించాం. అయితే ఆ గదిని ఎందుకు వినియోగించేవారో కనుగొనలేకపోయాం’ అని పేర్కొంది. ఈ యువతుల బృందం ఈ విషయాన్ని స్థానిక పురాతత్వ శాస్త్రవేత్తలకు తెలియజేసింది. వారు వెంటనే గుహను సందర్శించారు. అది రెండు శతాబ్ధాల క్రితం నిర్మితమయినదని తెలిపారు. నాటింగ్హామ్ సిటీ కౌన్సిల్ యాక్టింగ్ ఆర్కియాలజిస్ట్ స్కాట్ లోమాక్స్ మాట్లాడుతూ ఆ గుహ ఒక నేలమాళిగ అని తెలిపారు. దానిపైన భవనం నిర్మితమవడాన్ని గమనిస్తే అది 19వ శతాబ్దం నాటిదిగా తెలుస్తున్నదన్నారు. ఈ నేలమాళిక అనేక పురాతన విశేషాలను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్ మరో వింత వ్యాఖ్యానం! -
ఒక్క ఏడాదిలోనే వందమంది బాయ్ఫ్రెండ్స్ను మార్చిన యువతి
పిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నామంటేనే పేరెంట్స్ తాట తీసేస్తారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు ప్రేమ విషయంలో చాలానే ఆంక్షలు పెడుతుంటారు. అబ్బాయిలకు దూరంగా ఉండమని, వీలైతే మాట్లాడటం కూడా చేయొద్దని కాలేజీ రోజుల నుంచే హితబోధ చేస్తుంటారు. కానీ బ్రిటన్కు చెందిన ఓ తల్లి మాత్రం దగ్గరుండి మరీ కూతురిని డేటింగ్కు పంపించింది. కూతురి ఖర్చుల కోసం 500 డాలర్లు కూడా ఇచ్చి హ్యాపీగా డేటింగ్ చేయమని ప్రోత్సహించింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. ఎంత అప్గ్రేటెడ్ సొసైటీలో బతుకుతున్నా ప్రేమ విషయంలో తల్లిదండ్రుల వైఖరి కాస్త కఠినంగా ఉంటోంది. ఇప్పటికీ ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులు బోలెడన్నీ ఆంక్షలు పెడుతుంటారు. కానీ బ్రిటన్కు చెందిన ఓ తల్లి మాత్రం కూతుర్ని డేటింగ్ చేయమని దగ్గరుండి మరీ పంపించింది. అలా ఒకరిద్దరిని కాదు, ఏకంగా వంద మందితో డేటింగ్ చేయమని, అలా చేస్తే డబ్బులు కూడా ఇస్తానంటూ షాకింగ్ ఆఫర్ను ప్రకటించింది. ఇంకేముంది కూతురు కూడా రెచ్చిపోయింది. తన అందంతో అబ్బాయిలకు గాలం వేసి ఒకరిద్దరితో కాదు, ఏకంగా 100మంది బాయ్ఫ్రెండ్స్ను మార్చేసింది. అది కూడా ఒక్క ఏడాదిలోనే కావడం విశేషం. ఈ విషయాన్ని యువతి సోదరి ఎలిస్ కేరొలీన్ టిక్టాక్లో షేర్ చేయడంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తల్లి ఇచ్చిన టాస్క్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఆ యువతికి ఆమె తల్లి గ్రాండ్గా వేడుకలు జరిపిందట. కేక్పై 100 నెంబర్ క్యాండిల్తో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారట. దుగా అనుకున్న ఒప్పందం ప్రకారం.. కూతురికి తల్లి ఐదందల డాలర్లు బహుమతిగా ఇచ్చిందట. కన్నతల్లి అయ్యిండి కూతురికి డేటింగ్ చేయమని ఎంకరేజ్ చేయడం ఏంటని ప్రశ్నించగా.. పెళ్లి తర్వాత తన కూతురికి మగవాళ్ల పట్ల భయం, అనుమానం ఉండకూడదని, అందుకే చాలామంది పురుషులతో డేటింగ్కు వెళ్లమని ప్రోత్సహించినట్లు మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్తో సెలవిచ్చింది. -
ఓ నది హఠాత్తుగా.. నీలం, నారింజ రంగులోకి మారిపోయింది!
ఓ నది అకస్మాత్తుగా నీలం, నారింజ రంగులోకి మారిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది యూకేలో చోటు చేసుకుంది. బిట్రన్లోని స్టఫోర్డ్షైర్లోని ట్రెంట్ నదిలో కొంతభాగం నీలం, మరికొంత భాగం నారింజ రంగులోకి మారింది. దీంతో బ్రిటన్ అంతటా ఇదే చర్చనీయాంశంగా మారింది. అందులో ఉండే చేపలు వంటి ఇతర జలచర జీవులు ఏమయ్యాయో అని పర్వావరణ శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపించిన బ్రిటన్ ప్రభుత్వం నది అలా మారడానకి గల కారణం వివరించింది. బట్టల రంగులు అనుకోకుండా నదిలో పడిపోవడంతో నీరు ఇలా ఆ విధమైన రంగులోకి మారిపోయిందని స్పష్టం చేసింది. దీనివల్ల నదిలో ఉండే చేపలు, ఇతర జలచర జీవులు ఎలాంటి ఇబ్బంది ఉండదని కూడా పేర్కొంది. నది ఇలా మారిపోయినందుకు అధికారుల కూడా విచారం వ్యక్తం చేశారు. నిజానికి ఆ నది చుట్టు పక్కల ప్రాంతం పర్యాటక ప్రాంతంలా జనాల తాకికి ఎక్కువగా ఉండేది. ఈ అనూహ్య ఘటనతో అక్కడ ఉన్నవాళ్లంతా మాత్రం ఇక్కడ ఏదో జరిగింది.. నది అంతా కాలుష్యం అవుతుందంటూ మండిపడుతున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు విషయం బయట పడుతుందని, ఎన్విరాన్మెంటల్ ఏజెన్సీ దగ్గరుండి దీనిపై ఎక్వైయిరీ చేయాలని పట్టుబడుతున్నారు ప్రజలు. We're aware of discolouration of the River Trent in #StokeOnTrent caused by the accidental release of clothing dyes. No fish or wildlife are in distress but we recommend people and pets avoid the water whilst the colour remains. If you have any concerns call 0800 80 70 60. pic.twitter.com/MJb8jtt5cZ — Env Agency Midlands (@EnvAgencyMids) July 18, 2023 (చదవండి: ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?) -
నేరాలను తగ్గించేలా.. సరికొత్త అత్యాధునిక జైలు
జైలు అనగానే సినిమాలే గుర్తోస్తాయి. వాటిల్లో చూపించనంత అందంగా ఏమి ఉండవు. కానీ ఇప్పుడూ ఆ జైళ్లనే ఖైదీలలో పరివర్తన వచ్చేలా గొప్ప కేంద్రాలుగా మారుస్తున్నారు. అలాగే వారి శిక్షకాలం పూర్తి చేసుకున్న తదుపరి హాయిగా జీవించేలా నైపుణ్యాలు సంపాదించుకునేలా చేసేందుకు శ్రీకారం చుట్టింది బ్రిటన్ ప్రభుత్వం. మరోసారి ఎటువంటి నేరాలకు దిగకుండా ఉండి, వారి భవిష్యత్తును వారంతట వారే తీర్చిదిద్దకునేలా చేస్తున్నారు అక్కడి అధికారులు. అందుకోసం అని "హెచ్ఎంపీ ఫోస్సే వే" అనే పేరుతో అత్యాధునికి జైలుని నిర్మిస్తున్నారు. ఇందులో దగ్గర దగ్గరగా దాదాపు వెయ్యిమందికి పైగా అంటే 1,715 మంది దాక ఖైదీలు ఉండేంత స్థలం ఉంటుంది. ఖైదీలకు పునరావసం కల్పించడం తోపాటుగా ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడేందుకు ఈ కొత్త జైలుని ప్రారంభించారు. ఈ కొత్త జైలు నిర్మాణంలో 71 మంది ఖైదీలు, ఇద్దరు మాజీ నేరస్తులు పనిచేయాలనే ఒక నిబంధన కూడా ఉంది. ఇక్కడ మొత్తం 24 వర్కషాప్లు ఉంటాయి. నేరస్తులు ఇక్కడ నిర్మాణ వాహనాలను ఎలా నడపాలి, అద్దాలను ఎలా తయారు చేయాలి, జైలు నిర్మాణానికి సంబంధించి కాంక్రీట్ విభాగాలు, లైటింగ్ పరికరాలు తదితరాలకు సంబంధించిన పనులు నేర్చుకుంటారు. ఇప్పటి వరకు బ్రిటన్లో ఉన్న ఆరు అత్యాధునికి జైళ్లలో ఇది రెండోది. ఈ జైలుని.. చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించారు. అలాగే యూకేలో ఇప్పటి వరకు నిర్మించిన పచ్చటి జైలు కూడా అదే. బ్రిటన్ ప్రభుత్వం ప్రజలకు వాగ్దానం చేసిన నాలుగు బిలియన్ పౌండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ అత్యాధునిక జైలుని నిర్మించింది. అలాగే ఖైదీలు తమ శిక్ష కాలం పూర్తి అయిన వెంటనే ఉపాధిని వెతుక్కోవడం ఈజీ అవ్వడమే గాక సమాజంలో ఎలాంటి ఢోకా లేకుండా ధైర్యంగా బతకగలగుతారని చెబుతున్నారు బ్రిటన్ అధికారులు. (చదవండి: యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం) -
అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు!
ప్రపంచంలో చాలామంది అందం కోసం విపరీతంగా తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు. కొందరు తమ దంతాలు సరిగా లేవంటూ, వాటికి హంగులు సమకూరుస్తారు. ఇటువంటి సందర్బాల్లో చికిత్స చేయించుకున్న కొందరి ముఖాలు భయంకరంగా మారిపోవడాన్ని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇటువంటి మరో తాజా ఉదంతం ఇప్పుడు వైరల్గా మారింది. ఇటీవలే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్న ఒక యువకునికి ఎదురైన చేదు అనుభవం గురించి ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వివరించాడు. జాక్ జేమ్స్ కెమెరాలో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో నకిలీ దంతాలు పెట్టించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం బ్రిటన్ నుంచి టర్కీకి వెళ్లాడు. £3,000( సుమారు రూ. 3 లక్షలు) వెచ్చించి నకిలీ దంతాలు పెట్టించుకున్నాడు. మొదట్లో ఈ దంతాలు అతని ముఖానికి ఎంతో అందాన్నిచ్చాయి. అయితే కొద్ది రోజుల తరువాత అతని దంతాల నుంచి రక్తం కారసాగింది. అలాగే నోటు నుంచి దుర్వాసన కూడా వెలువడసాగింది. దీంతో జాక్ జేమ్స్.. మాంచెస్టర్లోని ఒక డెంటిస్ట్ను సంప్రదించాడు. ఆ దంతవైద్యుడు పలుపరీక్షలు చేసిన అనంతరం అతని దంతాలు పూర్తిగా పాడయిపోయాయని చెప్పాడు. ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపాడు. ఆ దంతాలను తిరిగి సరిగా చేసేందుకు £20,000(సుమారు రూ. 20 లక్షలు) ఖర్చవుతాయని తెలిపాడు. ఇంగ్లండ్లో ఈ చికిత్సకు ఇంత భారీగా ఖర్చవుతుందని తెలుసుకున్న అతను తిరిగి గతంలో తనకు చికిత్స చేసిన టర్కీలోని డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ డెంటిస్ట్ అతనితో దంత చికిత్సలో తప్పేమీ జరగలేదని, అయితే తిరిగి దంతాలను సరి చేసుకోవాలంటే, మరోమారు చికిత్స చేయించుకోవాలని, ఇందుకు మరింత ఖర్చవుతుందని తెలిపాడు. మరో మార్గంలేక జాక్ అందుకు అంగీకరించాడు. నకిలీ దంతాలను తొలగించుకుని ఇన్ఫెక్షన్ దూరమయ్యేందుకు చికిత్స తీసుకున్నాడు. తరువాత కొత్తగా టెంపరరీ దంతాలను పెట్టించుకున్నాడు. అయితే అతను ఈ టెంపరరీ దంతాలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు, అసలు దంతాలు షార్క్ దంతాలుగా మారిపోవడాన్ని గమనించాడు. అన్ని దంతాల మధ్య గ్యాప్ ఉండటాన్ని గుర్తించాడు. జాక్ తన దంతాలు చూసుకున్నప్పుడల్లా ఏదో హర్రర్ ఫిల్మ్లోని క్యారెక్టర్లా ఉన్నానని భావిస్తాడట. దీంతో అతనికి ఈ షార్క్ దంతాలను కూడా తొలగించుకోవాలని అనిపిస్తుందట. ఇందుకోసం మరో వైద్యుడిని సంప్రదించాలని అనుకుంటున్నానని జాక్ తెలిపాడు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ట్రాన్స్ ప్లాంట్కు 56 ఏళ్లు.. ఆ రోజు జరిగిందిదే! -
గొంతును ఏమార్చారు, ఒరిజినల్గా నమ్మించారు
బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ అతని భార్య మేఘన్ మార్కెల్లు ప్రముఖ పాడ్కాస్ట్ సంస్థ స్పాటిఫై నుంచి వైదొలగిన విషయం విదితమే. అయితే, ఆ తదనంతరం వారు ప్రారంభించిన ‘ఆర్కిటైప్స్’ పాడ్కాస్ట్ కోసం మేఘన్ చేసినట్టు చెబుతున్న ఇంటర్వ్యూలు ఆమె చేసినవి కాదని ఒక రిపోర్టులో వెల్లడయ్యింది. షోలోని కొన్ని ఇంటర్వ్యూలను డచెస్ సిబ్బంది చేశారని పాడ్న్యూస్ తెలిపింది. ప్రశ్నలు అడుగుతున్న ఆమె వాయిస్ ఆడియోను ఇంటర్య్యూ మధ్యలో క్లిప్ చేశారని ఆరోపించారు. కాగా స్పాటిఫై, ఆర్కివెల్ పరస్పరం విడిపోవడానికి అంగీకరించాక వారు కలిసి చేసిన సిరీస్ గురించి గర్వపడుతున్నామని ఆ సంస్థలు సంయుక్త ప్రకటన చేసిన కొద్దిసేపటికే మేఘన్పై ఆరోపణలతో కూడిన ఈ వార్త వెలువడింది. హ్యారీ, మేఘన్ ప్రారంభించిన ఆర్కివెల్ మీడియా సంస్థ 2020లో $20 మిలియన్ల డీల్కు సంబంధించిన పూర్తి చెల్లింపును అందుకునేందుకు తగినంత కంటెంట్ను ఉత్పత్తి చేయలేదని గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే మేఘన్ మరొక ప్లాట్ఫారమ్లో ‘ఆర్కిటైప్స్’ ప్రేక్షకుల కోసం మరింత కంటెంట్ను అందిస్తున్నారని ఆర్కివెల్ ప్రొడక్షన్స్ ప్రతినిధి వాల్స్ట్రీట్ జర్నల్కు తెలిపారు. ఈ విషయంలో స్పోర్ట్స్ రైటర్, పాడ్కాస్టర్ బిల్ సిమన్స్ ఈ జంటపై విరుచుకుపడ్డాడు. తాను ఒకసారి హ్యారీని పాడ్కాస్ట్ విషయమై కలిశానని తెలిపాడు. ఈ పాడ్కాస్ట్ ఆడియోలో డచెస్ ఆఫ్ సస్సెక్స్ నుండి వచ్చిన వ్యాఖ్యల మధ్య యారో వివరణలు, వ్యాఖ్యలు జతచేశారు. అవి అల్లినవి, డైలీ మెయిల్ నవంబర్లో నివేదించినవని తేలింది. రాజ దంపతులు రెండు సంవత్సరాల క్రితం స్పాటిఫైతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తరువాత బయటకు వచ్చేశారు. అప్పటికి కేవలం 12 ఎపిసోడ్లు మాత్రమే రూపొందాయి. జమీలా జమీల్, సెరెనా విలియమ్స్, ప్యారిస్ హిల్టన్, మిండీ కాలింగ్తో సహా పలువురు అతిథులతో సంభాషణలతో పాటు నిర్దిష్ట అంశాల గురించి మాట్లాడే నిపుణులు, విద్యావేత్తలు, రచయితల క్లిప్లు ఉన్నాయి. నిపుణుల ఆడియో క్లిప్లు మేఘన్ ఆడియో మధ్య జత చేసి ఉన్నాయి. దీంతో ఆమె స్వయంగా కొందరితోనైనా మాట్లాడారా? లేదా అందరితో మాట్లాడారా అనేది స్పష్టంగా వెల్లడికాలేదు. ఇది కూడా చదవండి: లాలాజలంతో ఇక ప్రెగ్నెన్సీ టెస్ట్ -
‘నా భార్య, తండ్రి కలసి నన్ను వంచించారు’
ఒక వ్యక్తి తనకు ఎదురైన అత్యంత చేదు అనుభవాన్ని ఈ ప్రపంచంతో పంచుకున్నాడు. తాను అమితంగా ప్రేమించిన తన భార్య తనను ఘోరంగా మోసగించిందంటూ తన బాధను వెళ్లగక్కాడు. తన భార్య తన తండ్రితో తిరుగుతున్నదని తెలుసుకుని అతను నిశ్చేష్టుడైపోయాడు. ఇప్పుడు తన భార్య తన తండ్రి కారణంగా గర్భం ధరించిందని తెలుసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకున్నాడు. ఆ వ్యక్తి పేరు డెక్లాన్ ఫులర్. తన 22 ఏళ్ల భార్య స్టెఫనీ తనను మోసగించిందని తెలియగానే అతనికి కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయినట్లయ్యింది. ఆమె తన 44 ఏళ్ల తండ్రి డైరెన్తో సంబంధం పెట్టుకుందని తెలిసి అతను తల్లడిల్లిపోయాడు. ది సన్ రిపోర్టును అనుసరించి ఈ కుటుంబం బ్రిటన్లో ఉంటోంది. 22 ఏళ్ల డెక్లాన్, స్టెఫనీలకు రెండేళ్ల కుమార్తె విలో కూడా ఉంది. బాధితుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ తాను మధ్యాహ్నం సమయంలో తన భార్య, తండ్రి కలసి బెడ్రూమ్లో సరసాలు ఆడటాన్ని చూశానని తెలిపారు. అయితే స్టెఫనీ దీని గురించి మాట్లాడుతూ తాను, తన మామగారితో పాటు ఆ సమయంలో టీవీ చూస్తున్నానని తెలిపింది. అయితే తన తండ్రి కూడా తనను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. తన తండ్రి గతంలో తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నాడని, అయినా తిరిగి తమ ఇంటికి వచ్చివుంటున్నాడన్నారు. పైగా తన భార్య, తన తండ్రి కలసి ఉండటాన్ని చూశాన్నారు. త్వరలో తన భార్య కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నదని అన్నారు. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తమ కుటుంబం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాగా త్వరలో పుట్టబోయే కవలలకు డెక్లాన్ సవతి సోదరుడు కానున్నాడు. అలాగే అతని కుమార్తె విలో ఆ చిన్నారులకు ఆంటీ కాబోతోంది. ఇటువంటి పరిస్థితులను నమ్మలేకపోతున్నానని డెక్లాన్ వాపోతున్నాడు. -
‘ఏడాది పాటు షిప్పు ప్రయాణం’.. డబ్బు కట్టి గొల్లుమంటున్న జనం
తాను ఒక క్రూజ్షిప్ కెప్టెన్ అని చెప్పుకుంటూ జనాల నుంచి ఏకంగా రూ.2.78 కోట్ల సొమ్ము కాజేసిన వ్యక్తికి కేవలం రూ. 36 వేలు తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చిన వింత ఉదంతం సంచలనంగా మారింది. ఆ మోసగాని పేరు జాడీ ఆలివర్. అతను చాలామందిని కలిసి, ఎవరికైనా సరే షిప్పులో సెలవులు ఆనందంగా గడిపేందుకు అవకాశం కల్పిస్తానంటూ వారి నుంచి డబ్బులు గుంజేవాడు. సదరు మోసగాడు షిప్పు కెప్టెన్ తరహా దుస్తులు ధరించి తిరుగుతుండేవాడు. అందరికీ నకిలీ ఐడీ కార్డు చూపించి ప్రలోభపెట్టేవాడు. మిర్రర్ యూకే తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బ్రిటన్లో చోటుచేసుకుంది. ఆ మోసగాడు నకిలీ అకౌంట్ ద్వారా జనాలకు ఈ మెయిల్స్ పంపించి, తాను కార్నివాల్ పీఎల్సీ ఉద్యోగిని అని చెప్పుకునేవాడు. కోర్టు విచారణ నేపధ్యంలో..మోసగాడు జనానికి ఒక షీటు పంపేవాడని, దానిలో ట్రిప్స్కు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన వివరాలు ఉంటాయని వెల్లడయ్యింది. ఈవిధంగా అతను సేకరించిన మొత్తాన్ని ఆన్లైన్ జూదానికి వినియోగించేవాడు. ఆన్లైన్ జూదం కోసం రుణాలు కూడా తీసుకునేవాడు. అయితే ఇప్పుడు అతని దగ్గర బాధితులకు ఇచ్చేందుకు కేవలం రూ.36 వేలు మాత్రమే ఉన్నాయి. బాధితులలో చాలామంది తాము దాచుకున్న మొత్తాన్ని ఆలివర్ చేతిలో పెట్టారు. జీవితంలో మరచిపోలేని విధంగా సెలవులను ఆనందంగా గడపుతామనే ఉద్దేశంలో అతనికి డబ్బులు చెల్లించారు. అతని బారిన పడినవారిలో ముఖ్యంగా వృద్ధులు అధికంగా ఉన్నారు. ఇవాన్స్ అనే ఒక బాధితుడు మాట్లాడుతూ ‘ఆలీవర్ దగ్గర నేను ఎంత సొమ్ము పోగొట్టుకున్నానో చెప్పుకోలేను. ఎందుకంటే ఈ విషయం ఇప్పటికీ నా కుమారునికి చెప్పలేదు. ఇలా డబ్బులు పోగొట్టుకోవడంలో నాదే పూర్తి బాధ్యత’అని అన్నారు. మరో బాధితుడు మార్షల్ గోడాయీ మాట్లాడుతూ‘దీని ప్రభావం నా భార్య ఆరోగ్యం మీద పడింది. గతంలో మేము డబ్బుకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పోగొట్టుకున్న మొత్తం మాకెంతో విలువైనది’ అని అన్నారు. 2018లో బాధితులు ట్రిప్పు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ విషయమై పోలీసులకు తెలిసింది. బాధితులు తమ బ్యాగులతో ఎదురుచూసినప్పటికీ ఎటువంటి షిప్పు రాలేదు. ఆలీవర్ వారికి 2018 జనవరి 1నుంచి 2019 జనవరి 2 వరకూ ట్రిప్పు చేయిస్తానని నమ్మబలికాడు. కాగా అలీవర్ ఒక ప్రాంతంలో భార్యతో ఉంటూ, మరోప్రాంతంలో ప్రియురాలితో కాలం గడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆలివర్ చేసిన మోసాలు కోర్టులో నిర్థారణ కావడంతో కోర్టు అతనిని దోషిగా ఖరారు చేసింది. జడ్జి రిచర్డ్ విలియమ్స్ నేరస్తునికి ఆరు ఏళ్ల ఒకనెల పాటు జైలుశిక్ష విధించారు. -
నర్సు నిర్వాకం..పేషెంట్ నుంచి రక్తం తీసుకునే టైంలో..
ఇటీవల డాక్టర్లు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పలు ఘటనలను చూశాం. ఆపరేషన్ చేసేటప్పుడో లేదా చికిత్స చేసేటప్పుడో తప్పులు దొర్లిన ఘటనలు చూశాం. అదికూడా కంటిన్యూ డ్యూటీల వల్లో లేక ఆరోజు వారు అసహనగా ఉండటం వల్లో జరిగిన అనూహ్య ఘటనలే. కానీ ఇక్కడొక నర్సు మాత్రం కేవలం గేమ్ పిచ్తో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. అది కూడా రక్తం తీసుకునే టైంలో మ్యాచ్ చూస్తు ఉండిపోయింది. దీంతో పేషెంట్కి పెద్ద గాయమైంది కూడా. కానీ ఆమెలో ఏ మాత్రం అయ్యే తప్పుచేశానన్న భావన కూడా లేదు. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..19 ఏళ్ల లిబ్బి బేట్స్ మూర్చరోగంతో బాధపడుతుంది. ఒకరోజు మూర్చ రోగంతో స్ప్రుహతప్పి పడిపోవడంతో అంబులెన్స్లో వూల్విచ్లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడ నర్సు లిబ్సికి రక్త పరీక్షల నిమిత్త రక్తం స్వీకరించేందుకని ఓ గదిలోకి తీసుకువెళ్లింది. ఐతే అక్కడ నర్సు కంప్యూటర్ ముందు మొబైల్ పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ.. బ్లడ్ శ్యాంపిల్స్ తీస్తోంది. వాస్తవానికి లిబ్బికి చేతి నుంచి రక్తం సేకరించేందుకు అంత తేలికగా నరం దొరకదు. దీని గురించి ఆమె తల్లి నికోలా బేట్స్ నర్సును హెచ్చరించింది. అందుకోసం అల్ట్రాసౌండ్ సాయంతో రక్తం సేకరించాల్సి ఉంటుంది. ఐతే ఆమె మాత్రం అదేమి వినిపించుకోకుండా మొబైల్లో మ్యాచ్ చూసుకుంటూ లిబ్బి చేతిని ఎలా పడితే అలా సుదితో గుచ్చేస్తుంది. దీంతో ఆమె చేతికి పెద్ద గాయం కూడా అయ్యింది. అయినా పేషెంట్ భాదను పట్టించుకోకుండా తన ఇష్టమొచ్చిన రీతిలోనే ప్రవర్తించింది. చివరికి ఏదోలా రక్తం సేకరించి బయటకు వెళ్లిపోతుంది. ఆ సమయంలో పేషెంట్ తల్లి నికోలా నర్సుని ఫోటోలు కూడా తీస్తుంది. కోపంతో నికోలా ఆ నర్సు బయటకు వెళ్లిపోతుండగా మీరు ఫుట్బాల్ మ్యాచ్ అస్వాదించటం మర్చిపోకండి అని వెటకారంగా అంది. అప్పుడూ కూడా ఆమె నవ్వుతూ వెళ్లిపోయిందే తప్ప.. ఎందుకలా అందో కూడా ఆలోచించలేనంతగా మ్యాచ్ మూడ్లోనే ఉందామే. దీంతో సదరు పేషెట్ తల్లి నికోలా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకుంది. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లానని, ఇప్పటివరకు తనకు తన కుమార్తెకు తనకు ఈ విషయమై క్షమాపణలు చెప్పలేదని వాపోయింది. ఈ ఘటనతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించి.. ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..సదరు నర్సు తన తప్పిదాన్ని అంగీకరించిందని, అలా ప్రవర్తించినందుకు క్షమాపణలు చెప్పడమే గాక మరోసారి ఇలా జరగదవి హామీ ఇచ్చినట్లు పేర్కొంది ఆస్పత్రి యాజమాన్యం. (చదవండి: ఓ భార్య ఘనకార్యం.. భర్తను హత్య చేసి అతడిపైనే పుస్తకం రాసింది..చివరికి..) -
‘మారాజు’లు.. ప్రపంచంలో ఇంకా రాచరికమున్న దేశాలివే..
ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు నేర్పించిన బ్రిటన్ దేశపు రాణి ఎలిజిబెత్–2 మరణం, ఛార్లెస్–3 పట్టాభిషేకం నేపథ్యంలో.. రాచరికానికి సంబంధించిన పలు ప్రశ్నలు సమాజంలో వస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల పార్లమెంట్లకు తల్లిలాంటిది బ్రిటన్ పార్లమెంట్. ప్రజాస్వామ్యానికి నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్న బ్రిటన్ ప్రజలకు రాచరికం పట్ల అంతులేని ఆకర్షణ ఉందని ఇటీవల ప్రస్ఫుటమయింది. మరణించిన రాణి ఎలిజబెత్ తర్వాత రాజుగా సింహాసనం ఎక్కిన ఛార్లెస్–3 కేవలం బ్రిటన్కే కాకుండా, మరో 14 దేశాలకూ రాజుగా (దేశాధినేతగా) ఉన్నారనే విషయం ఆశ్చర్యం కలిగించే అంశమే. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాల్లోనూ రాచరికమే ఉంది. కొన్ని దేశాల్లో రాజే సర్వాధికారి. మరికొన్ని దేశాల్లో పాక్షిక అధికారాలను కలిగి ఉంటారు. బ్రిటన్ పాలించిన వలస దేశాలను కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తారు. మొత్తం 56 కామన్వెల్త్ దేశాలు ఉన్నాయి. వీటిలో 14 దేశాలు బ్రిటన్ రాజు/రాణినే తమ దేశ రాజు/రాణిగా అంగీకరిస్తాయి. మిగిలిన దేశాల్లో 36 పూర్తి గణతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. మిగిలిన దేశాలకు సొంత రాచరికాలు ఉన్నాయి. బ్రిటన్ రాజునే తమ రాజుగా అంగీకరిస్తున్న 14 దేశాలు 1. కెనడా, 2. ఆస్ట్రేలియా, 3. న్యూజిలాండ్, 4. యాంటిగు అండ్ బాబోడ, 5. ది బహామస్, 6. బెలీజ్, 7. గ్రెనాడ, 8. జమైకా, 9. పాపువా న్యూ గీని, 10. సెయింట్ కిట్స్ అండ్ నెవస్, 11. సెయింట్ లూసియా, 12. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీస్, 13. సోలోమన్ ఐలండ్స్, 14. తువాలు మొత్తం 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే ఉంది. యూకేతో కలిపి మొత్తం 15 దేశాలకు రాజుగా బ్రిటన్ రాజు వ్యవహరిస్తున్నారు. రాచరిక వ్యవస్థ ఉన్న దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలూ ఉండటం గమనార్హం. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి నిలయాలుగా ఉన్న దేశాలూ ఉన్నాయి. యూకే, జపాన్, కెనడా, డెన్మార్క్, స్పెయిన్ తదితర దేశాలే ఇందుకు ఉదాహరణలు. వెనుకబడిన సమాజం ఆనవాళ్లకు రాచరిక వ్యవస్థ గుర్తుగా ఉందనే వాదన చాలా దేశాలకు వర్తించడంలేదని ఆయా దేశాలు వివిధ రంగాల్లో పురోగమిస్తున్న తీరు చెబుతోంది. రాచరిక వ్యవస్థ 3 రకాలు ఆయా దేశాల సంస్కృతి, భాషను బట్టి రాచరికంలో దేశాధినేతను రాజు, రాణి, అమీర్, సుల్తాన్ వంటి హోదాలతో వ్యవహరిస్తున్నారు. రాచరిక స్వభావం, వాటికున్న అధికారాలను బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. రాజ్యాంగపరమైన రాచరికం కేవలం రాజ్యాంగ విధులు (సెరిమోనియల్ డ్యూటీస్) నిర్వర్తించడానికి మాత్రమే రాచరికం పరిమితమవుతుంది. రాజకీయ అధికారాలు ఏమీ ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే నిజమైన అధికారాన్ని అనుభవిస్తుంది. ఇలాంటి రాచరికం బ్రిటన్ (యూకే), జపాన్, డెన్మార్క్ దేశాల్లో ఉంది. పూర్తి రాచరికం దేశంలో రాజుదే పూర్తి అధికారం. చట్టాలను రూపొందించే, సవరించే, తిరస్కరించే అధికారం రాజు/రాణికి ఉంటుంది. విదేశీ వ్యవహారాలను కూడా రాజే పర్యవేక్షిస్తారు. రాజకీయ నేతలను నామినేట్ చేస్తారు. సౌదీ అరేబియా, వాటికన్ సిటీ, యస్వటినీ తదితర దేశాలు ఈ కోవలోకి వస్తాయి. మిశ్రమ రాచరికం కొన్ని అంశాల్లో సంపూర్ణ అధికారాలను వినియోగించుకుంటూనే, కొన్ని అంశాల్లో ప్రజా ప్రభుత్వాలు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటి జాబితాలో జోర్డాన్, మొరాకో, లిక్టన్స్టైన్ తదితర దేశాలు ఉన్నాయి. - (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) ఇది కూడా చదవండి: అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం -
రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై కీలక ప్రకటన
లండన్: బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్లోని వెస్ట్మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే, చార్లెస్–3 పట్టాభిషేకం సందర్బంగా అందరి ఫోకస్ రాజకుటుంబం మీదే ఉంది. ఈ నేపథ్యంలో, రాచరికాన్ని వదులుకున్న చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ ఈ కార్యక్రమానికి వస్తారా..? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది. పట్టాభిషేక మహోత్సవానికి హ్యారీ వస్తున్నట్లు తెలిపింది. అయితే మేఘన్ మాత్రం హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించింది. ‘రాజు పట్టాభిషేక మహోత్సవానికి డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ హాజరవుతారు.. కానీ, ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు అని ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది’. ఇదిలా ఉండగా.. మేఘన్-హ్యారీ దంపతులకు ఇద్దరు సంతానం. ఆర్కీ, లిలిబెట్. అయితే, రాజు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేండ్లు పూర్తవుతాయి. ఇక, రాజకుటుంబంతో విభేధాల కారణంగా చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజరికాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీకి విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ బ్రిటన్ రాజకుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. మరోవైపు.. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు శుక్రవారం లండన్కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. Prince Harry will be attending the #coronation today, but Meghan Markle has remained in California with their children.https://t.co/LfDJkI6e7i pic.twitter.com/PQYLkr68tI — Newsweek (@Newsweek) May 6, 2023 ఇది కూడా చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్ల వర్షం -
బ్రిటన్ స్కూళ్లల్లో భారతీయ విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారా?
1 ." మీరు స్వస్తిక్ గుర్తును పవిత్రంగా భావిస్తారు. అంటే మీరు నాజీలను సమర్థించేవారు". 2 . " మీరు 330 మిలియన్ దేవతల్ని పూజిస్తారు . అందులో కోతి, ఏనుగు లాంటి జంతువులు కూడా ఉన్నాయి" 3 ." మీరు సతి సహగమన ఆచారాన్ని పాటించారు ". 4 ." మీ కుల వ్యవస్థ వల్లే హిట్లర్ అలా అయ్యాడు" బ్రిటన్ పాఠశాలల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థుల్ని బెదిరిస్తూ / గేలి చేస్తూ తోటి విద్యార్థులు అన్న మాటలివి. హెన్రీ జాక్సన్ సొసైటీ బ్రిటన్ లో నివసిస్తున్న వెయ్యి మంది తల్లితండ్రుల్ని ఇంటర్వ్యూ చేసి వెలికి తెచ్చిన కొన్ని అంశాలు ఇవి. ఇలాంటి బుల్లియింగ్ వల్ల తమ పిల్లలు పాఠశాలలకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నారు అని ఆ తల్లితండ్రులు చెప్పుకొచ్చారు. ఇది కేవలం బ్రిటన్ పాఠశాలలకు పరిమితమయిన అంశం కాదు. మాయ మర్మం తెలియని వయసులో చుట్టూరా ఉన్న సమాజం, మీడియా నాటిన విష బీజాల కారణం గా నేటి విద్యార్థుల్లో కుల / మత/ ప్రాంత / వర్ణ విద్వేషలు పెచ్చరిల్లు తున్నాయి. ఒక పక్క ప్రపంచం కుగ్రామంగా మారుతున్న వైనం . గ్రామాలు/ పట్ఠణాలు / రాష్ట్రాలు / దేశాలు లాంటి ఎల్లలు దాటి సముద్రాలు దాటి ఖండాలు దాటి తల్లితండ్రులు వలసపోతున్నారు. ఎక్కడో సెటిల్ అవుతున్నారు . అక్కడ పుట్టిన పిల్లలు తమ పూర్వీకుల సంస్కృతిని అది మంచో చెడో తరువాత .. పూర్తిగా ఒంట బట్టించుకోలేరు .. అక్కడి సమాజం లో పూర్తిగా కలవాలంటే ఇదిగో ఇలాంటి ఆటంకాలు / అవాంతరాలు. విద్వేషం .. నేటి సార్వ జనీన జీవన విధానం అయిపోయింది . అవతలి వారి పై కులం/ మతం / వర్ణం / జాతి /పుట్టుక లాంటి వాటి ఆధారంగా విద్వేషాన్ని పెంచుకోవడం .. ఆస్ట్రేలియా నుంచి కెనడా దాకా ఇదే తంతు. లాక్ డౌన్ కాలం లో ఇంటికే పరిమితం కావడం వల్ల జనాల్లో సంకుచిత స్వభావం బలపడిపోయింది . దీనికి తోడు ఆర్థిక మాంద్యం .. కొరతలు .. ద్రవ్యోల్భణం .. ఉద్యోగాలు కోల్పోవడం .. నిరుద్యోగిత .. బలహీనతల్ని రెచ్చగొట్టే సోషల్ మీడియా .. యు ట్యూబ్ వీడియోలు .. అన్నింటికీ మించి మానవ బలహీనతల్ని కనిపెట్టి కాష్ చేసుకొనే రాజకీయ రాబందులు... వందేళ్ల క్రితం ఇప్పుడు మనకు కరోనా వచ్చినట్టే స్పానిష్ ఫ్లూ వచ్చింది. అటు పై మొదటి ప్రపంచ యుద్ధం. అటు పై పదేళ్ల పాటు ప్రపంచ మాంద్యం .. కొరతలు .. దీన్ని ఆసరాగా చేసుకొని నాజిజం, ఫాసిజం , స్టాలినిజం .. ఇలా ప్రపంచం లో అనేక ప్రాంతాల్లో నిరంకుశ రాజ్యాలు వచ్చాయి . మానవాళి పెను మూల్యం చెల్లించుకొంది . బుద్ధి ఉన్నవాడు చరిత్ర నుంచి పాఠాల్ని గ్రహిస్తాడు . డిజిటల్ యుగం లో చరిత్ర పాఠాలు గాలికి పోయాయి . మానవాళి నేడు ఉపద్రవం వైపు వడివడిగా అడుగులేస్తోంది. ప్రేమ .. సహానుభూతి .. ఓర్పు ఇవే మానవాళిని రక్షించగల మందులు . సర్వే జనా సుఖినోభవంతు ! వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
బ్రిటన్ ప్రధాని సతీమణి చేతికి ఒక్క రోజులో రూ.68 కోట్లు..
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సతీమణి అక్షతా మూర్తి ఒక్క రోజులో రూ.68 కోట్లు అందుకోనున్నారు. భారతదేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఇటీవల డివిడెండ్లను ప్రకటించింది. వీటి ద్వారా అక్షతా రూ.68.17 కోట్లు ఆర్జించనున్నారు. (Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...) ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి. గత ఏడాది ఆమె కంపెనీకి చెందిన 3.89 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున జూన్ 2 నాడు ఆమె ఈ మొత్తాన్ని అందుకోనున్నారు. అయితే దాని కోసం ఆమె తన స్టాక్ హోల్డింగ్ను కొనసాగించాల్సి ఉంటుంది. గతేడాది కంపెనీ డివిడెండ్ కలిపితే ఆమె మొత్తం ఆదాయం రూ.132.4 కోట్లు అవుతుంది. ఇన్ఫోసిస్ అక్టోబర్లో ఒక్కో షేరుకు రూ.16.50 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గతేడాది మూర్తి ఒక్కో షేరుకు రూ.31 డివిడెండ్ను అందుకున్నారు. దీంతో ఆమెకు రూ.120.76 కోట్లు వచ్చాయి. ఇన్ఫోసిస్లో ఆమె షేర్ల విలువ రూ.5400 కోట్లు. ఆమె భర్త, భారత సంతతికి చెందిన రుషి సునాక్ గత అక్టోబర్లో బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. రుషి సునాక్ బ్రిటిష్ పౌరుడు. కానీ అక్షత మాత్రం తన భారత పౌరసత్వాన్ని వదులుకోలేదు. అందుకే ఆమె అక్కడ నివాసితురాలు కాదు. దీని కారణంగా యూకే చట్టాల ప్రకారం.. ఆమె 15 సంవత్సరాల పాటు పన్నులు చెల్లించకుండా దేశంలో నివసించవచ్చు. ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే తన ఆదాయంపై పన్నులు ఉన్నాయని వాటిని ఎప్పుడూ చెల్లిస్తానని ఆమె చెప్పారు. (tata motors: మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు.. ఎందుకంటే..) అక్షతా మూర్తి కర్ణాటకలోని హుబ్బళ్లిలో జన్మించారు. బెంగళూరులో ఆమె పాఠశాల విద్యను అభ్యసించించారు. కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీలో ఎకనామిక్స్ అండ్ ఫ్రెంచ్లో డ్యూయల్ మేజర్లు పూర్తి చేశారు. తర్వాత లాస్ ఏంజిల్స్ ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీని పొందారు. స్టాన్ఫోర్డ్లో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్న సమయంలో ఆమె రుషి సునాక్ను కలిశారు. వీరికి 2009లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు కృష్ణ, అనౌష్క. రుషిసునాక్, అక్షత దంపతులు రియల్ ఎస్టేట్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు. కెన్సింగ్టన్లో వీరికి సొంత ఇల్లు ఉంది. దీని విలువు రూ.71 కోట్లు. వీరికి అక్కడ ఫ్లాట్ కూడా ఉంది. కాలిఫోర్నియాలో ఒక పెంట్హౌస్, యార్క్షైర్లో ఒక భవనం కూడా ఉన్నాయి. అక్షత తల్లి సుధా మూర్తి రచయిత్రి. సామాజిక చైతన్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. అక్షతా మూర్తికి అక్షతా డిజైన్స్ అనే ఫ్యాషన్ లేబుల్ ఉంది. మారుమూల గ్రామాల్లోని కళాకారులతో కలిసి ఫ్యూజన్ దుస్తులను ఆమె తయారు చేస్తుంటారు. -
ఉక్రెయిన్కు బ్రిటన్ ఫుల్ సపోర్ట్.. మండిపడుతున్న రష్యా
బ్రిటన్ ఉక్రెయిన్కి మరింతగా మిలటరీ సాయం పెంచుత్నునట్లు ప్రకటించింది. దీంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మద్దతుదారుడు, సన్నిహితుడు అయిన వ్లాదిమిర్ సోలోవియోవ్ బ్రిటన్ తీరుపై మండిపడ్డాడు. ముందుగా బ్రిటన్కి అడ్డుకట్టవేసేలా యూకే పార్లమెంట్పై దాడి చేయాలంటూ ఫైర్ అయ్యారు. ఈ ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చే పశ్చిమదేశాలపై కూడా విరుచుకుపడ్డారు. బ్రిటన్ ఫిబ్రవరి 8న మిలటరీ సాయాన్ని తక్షణమే పెంచుతున్నట్లు ప్రకటించింది. అదీగాక ఇటీవలే యూకే ప్రధాని రిషి సునాక్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్స్కీని కలిసి అక్కడ పైలట్లకు శిక్షణ ఇస్తామని కూడా చెప్పారు. దీంతో రష్యా ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ఈ నేపథ్యంలోనే సోలోవియోవ్.. ఉక్రెయిన్పై విమర్శలు ఎక్కుపెట్టారు. రష్యా భూభాగంపై గట్టిగా దాడి చేసేలా విమానాలు ఇచ్చేందుకు యూకే రెడీ అయిపోయిందంటూ తిట్టిపోశారు. అయినా ఉక్రెయిన్ విషయంలో యూకే అసలు ఉద్దేశ్యం ఏమిటీ, కేవలం సైనిక బలగాలు మాత్రమే యూకే లక్ష్యం కాదని, వెనుక ఏదో దురుద్దేశమే ఉందని సోలోవియోవ్ ఆరోపణలు చేయడం ప్రారంభించారు. రష్యా ఉనికే లేకుండా చేయాలని చూస్తున్న బ్రిటన్ని తాము ఇక గుర్తించం అని తేల్చి చెప్పారు. అలాగే ఈ ఉక్రెయిన్కి మద్దతు ఇచ్చే జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలు మాకు లేనేలేవు అంటూ పశ్చిమ దేశాలపై నిప్పులు చెరిగారు సోలోవియోవ్. అందుకు సంబంధించిన వీడియోని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా, జెలెన్స్కీ బుధవారం తమ దేశం చేతిలో రష్యా కచ్చితంగా ఓడిపోతుందని ధీమాగా చెప్పారు. అంతేగాదు రష్యా దురాక్రమణ దాడికి దిగిన తొలి రోజు నుంచి మద్దతు ఇస్తున్న బ్రిటన్ ప్రజలకు ధన్యావాదాలు కూడా చెప్పారు జెలన్స్కీ. Solovyev "bombs" London and British Parliament again. I've lost count already. pic.twitter.com/T6GN35UGtG — Anton Gerashchenko (@Gerashchenko_en) February 12, 2023 (చదవండి: అర్జెంటీనాకి తరలిపోతున్న రష్యన్ మహిళలు..వెలుగులోకి కీలక నిజాలు..) -
మన టీ, సమోసాకు ఆ దేశంలో యమా క్రేజ్..! విజయసాయి రెడ్డి ట్వీట్
లండన్: సాయంత్రమయ్యేసరికి వేడి వేడి సమోసా తిని, పొగలు గక్కే టీ ఒక కప్పు లాగిస్తే ఎలాగుంటుంది. ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది కదా. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ చాయ్, సమోసా కాంబినేషన్కి ఇప్పడు బ్రిటన్ యువతరంలో యమా క్రేజ్ పెరుగుతోంది. సాధారణంగా తెల్లవారు టీతో పాటు బిస్కెట్లు తింటారు. ఇప్పుడు వారి జిహ్వలు కొత్త రుచులు కోరుకుంటున్నాయని యునైటెడ్ కింగ్డమ్ టీ అండ్ ఇన్ఫ్యూజన్స్ అసోసియేషన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్గా గ్రానోలా బార్స్ (ఓట్స్తో చేసేది) చాలా బాగుంటుందని మొదటి స్థానం ఇచ్చారు. ఇక రెండోస్థానాన్ని మన సమోసా కొట్టేసింది. సర్వేలో పాల్గొన్న యువతరంలో 8 శాతం మంది సమోసాకి మొగ్గు చూపించారు. విజయసాయి రెడ్డి ట్వీట్ యూకే పేవరేట్ మెనూలో మన చాయ్, సమోసా చేరడంపై ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బ్రిటన్ యువత తమ స్నాక్స్ లో స్వీట్లకు బదులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. 16-24 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగానికిపైగా.. టీతో కలిపి స్వీట్ బిస్కెట్ రుచిని ఆస్వాదిస్తున్నారని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. It is happy to note that tea and samosa have become favourite menu in UK. The young there prefer them instead of sweets as snacks. 16 to 24-year-olds are half as likely to enjoy a sweet biscuit with their tea as those over 55. #indianculture #foodie #uk #india pic.twitter.com/bRTlbIZq1W — Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2023 -
టెక్ టమారం: ఇది వాషింగ్ మెషిన్..కాదు అంతకు మించి
వాషింగ్ మెషిన్లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! దుస్తుల మురికిని శ్రమలేకుండా వదలగొట్టే వాషింగ్ మెషిన్ల వాడకం సర్వసాధారణంగా మారింది. అయితే, వాషింగ్ మెషిన్ల తయారీలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఫొటోలో కనిపిస్తున్న వాషింగ్ మెషిన్. సాధారణ వాషింగ్ మెషిన్లకు మించి పనిచేస్తుంది. సింథటిక్ దుస్తులను ఉతికేటప్పుడు నీటితో పాటే కొట్టుకొచ్చే మైక్రోప్లాస్టిక్స్ను ఒడిసి పట్టుకుంటుంది. దుస్తులను ఉతకడం పూర్తయ్యాక, దీనిలోని ప్రత్యేకమైన మైక్రోప్లాస్టిక్ ఫిల్టర్లో చేరిన మైక్రోప్లాస్టిక్స్ వ్యర్థాలను తేలికగా వేరుచేసుకోవచ్చు. దీనిలో ఎలాంటి డిటర్జెంట్లనైనా వాడుకోవచ్చు. బ్రిటన్లోని బ్రిస్టల్కు చెందిన ‘గల్ప్’ కంపెనీ ఈ అధునాతన వాషింగ్ మెషిన్కు రూపకల్పన చేసింది. దీని ధర 250 పౌండ్లు (రూ.24,513). ప్రస్తుతం ఇది బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
భారత్తో స్వేచ్ఛా వాణిజ్యానికి సై: బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్
లండన్: భారత్–బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) అమలుకు కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్ నూతన ప్రధాని రిషీ సునాక్ మరోమారు స్పష్టంచేశారు. ఒప్పందం వాస్తవరూపం దాల్చేందుకు కృషిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. విదేశాంగ విధానంపై బ్రిటన్ పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల అతిథులు, ఆర్థిక నిపుణులు పాల్గొనే వార్షిక లండన్ మేయర్ బ్యాంకెట్ కార్యక్రమంలో సోమవారం సునాక్ ప్రసంగించారు. ‘ ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బ్రిటన్ ముందునుంచీ మద్దతు పలుకుతోంది. రాజకీయాల్లోకి రాకమునుపు నేను ప్రపంచంలోని వేర్వేరు దేశాల్లో వ్యాపారం చేశా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో వ్యాపార అవకాశాలు పుష్కలం. 2050కల్లా ప్రపంచవాణిజ్యంలో సగం వాటాను ఇండో–పసిఫిక్ హస్తగతం చేసుకుంటుంది. అందుకే ఇండో–పసిఫిక్ సమగ్రాభివృద్ధి ఒప్పందం(సీపీటీపీపీ)లో భాగస్వాములం అవుతున్నాం. ఇందులోభాగంగా భారత్లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వీలైనంత త్వరగా అమల్లోకి వచ్చేందుకు కృషిచేస్తున్నాను’ అని సునాక్ అన్నారు. చైనాతో స్వర్ణయుగ శకం ముగిసినట్లే ‘చైనాతో బ్రిటన్ కొనసాగించిన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన స్వర్ణయుగం ముగిసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగాక అది సామాజిక, రాజకీయ సంస్కరణలు, సత్సంబంధాలకు దారితీయాలి. కానీ చైనా రాజ్యవిస్తరణవాదం, ఆధిపత్య ధోరణి కారణంగా అవి సాధ్యపడలేదు. చైనాతో బ్రిటన్ అద్భుత వాణిజ్యానికి తెరపడినట్లే’ అన్నారు. -
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్కు ఆవకాయ రుచి చూపించిన చిరంజీవి
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ను మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరు నివాసంలోనే ఓవెన్కు అతిథ్యం ఇచ్చారు. ఈ భేటీలో బ్రిటన్, భారత్ సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలను చర్చించుకున్నట్లు స్వయంగా చిరంజీవి ట్వీట్ చేశారు. 'బ్రిటన్ నూతన డిప్యూటీ కమిషనర్తో భేటీ కావడం ఆనందంగా ఉంది. నా నివాసంలో ఆయనకు కొన్ని తెలుగు సంప్రదాయ వంటకాలతో విందు ఏర్పాటు చేశాను. నోరూరించే ఆవకాయ కూడా రుచి చూశారు' అంటూ చిరు పేర్కొన్నారు. భేటికి సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్గా వ్యవహరించారు. ఫ్లెమింగ్ పదవీకాలం జులైలో ముగియగా, ఆయన స్థానంలో గారెత్ విన్ ఓవెన్ నూతన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా నియమితులైన సంగతి తెలిసిందే. Delighted to meet Gareth Wynn Owen @UKinHyderabad the new British Dy High Commissioner in town.Exchanged courteous notes on many topics of UK,India & Telugu states over dinner at my place. Got him to taste some traditional Telugu delicacies,not to forget some spicy #Avakaya 😊 pic.twitter.com/CF8rx7bUBS — Chiranjeevi Konidela (@KChiruTweets) November 1, 2022 -
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. బైడెన్ పొగడ్తల జల్లు!
వాషింగ్టన్: కన్జర్వేటివ్ పార్టీలో తన నాయకత్వనికి బహిరంగంగా తిరుగుబాటు రావడంతో లిజ్ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అలాగే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అనుహ్య రీతిలో తప్పుకోవడం, మరో ప్రత్యర్థి పెన్నీ మోర్డాంట్ కావల్సినంత మంది ఎంపీల మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే మార్గం సుగమమైంది. నెలన్నరరోజుల క్రితం లిజ్ట్రస్ చేతిలో ఓడిపోయిన అదే రిషి సునాక్ తిరిగి ప్రధానిగా బ్రిటన్ పగ్గాలు చేపట్టడం విశేషం. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్హౌస్లో జరిగిన దీపావళి వేడుకలో మాట్లాడుతూ...."సునాక్ విజయం చాలా ఆశ్చర్యకరమైనది. ఈ విజయం ఒక సంచలనాత్మక మైలురాయి. ఆయనకు అధికారిక అభినందనలు తెలిపేందుకు ఎదురు చూస్తున్నాను" అని అన్నారు. ఈ క్రమంలో వైట్హౌస్ ప్రతినిధి కరీన్ జీన్ పియరీ బ్రిటన్ ప్రధాని సునాక్.. కింగ్ చార్లెస్తో ప్రోటోకాల్ సమావేశం జరిగిన తదనంతరం ఆయనతో బైడెన్ సంభాషించనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: అమెరికా వైట్హౌస్లో అంగరంగ వైభవంగా దీపావళి: వీడియో వైరల్) -
ట్రస్ రాజీనామాతో సందిగ్ధంలో భారత వాణిజ్య ఒప్పందం!
న్యూఢిల్లీ: యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధాని లిజ్ ట్రస్ కేవలం 45 రోజుల్లోనే అనుహ్యరీతిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత్కి యూకేతో ఉన్న వాణిజ్య ఒప్పందాల విషయమై సందిగ్ధం నెలకొంది. ఈ మేరకు న్యూఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ ఎగుమతుల సదస్సులో వాణిజ్య పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ...ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై బ్రిటన్తో భారత్ చర్చలు బాగానే సాగిస్తోంది. ఐతే ఇటీవల బ్రిటన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా న్యూఢిల్లీ కాస్త వేచి ఉండక తప్పదని అన్నారు. ఆ తదనందరం మాత్రమే యూకేకి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించగలమని చెప్పారు. అదీగాక వచ్చే వారంలోనే బ్రిటన్లో ఎన్నికలు పూర్తవుతాయన్నారు. ఆ తర్వాత లిజ్ వారసురాలిగా కొత్త ప్రధానిని పాలక కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకోవడం కూడా జరుగుతోందని తెలిపారు. అంతేగాదు యూకే నాయకులు కూడా భారత్తో వాణిజ్య వ్యాపారాలు అత్యంత ముఖ్యమని గుర్తించినట్లు చెప్పారు. యూకేలో ఎవరూ నాయకులుగా వచ్చిన భారత్తో వాణిజ్యం సాగించేందుకు ముందుకు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరుదేశాలకు ఈ ట్రేడ్ డీల్ విజయం చేకూరడం తోపాటు సంతృప్తి చెందాలి అప్పుడే ఈ ఒప్పందం ఖరారవుతుందని లేదంటే ఎలాంటి ఒప్పందం ఉండదని తేల్చి చెప్పారు. అలాగే బ్రిటన్, కెనడా, యూరప్ల వంటి దేశాలతో కనీసం ఒకటి లేదా రెండు స్యేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు 2027 నాటికి వస్తువుల సేవల కోసం సుమారు రూ. 2 లక్షల కోట్లు లక్ష్యం ఉందని, దీన్ని2030 కల్లా సాధించగలమని చెప్పారు. ఈ మేరకు పరస్పర వస్తువుల ప్రమాణాల గుర్తింపు ఒప్పందం(ఎంఆర్ఏ) విషయం గురించి ప్రస్తావిస్తూ... భారత్కి ఏ కారణం చేతన ఎక్కువ ఎంఆర్ఏలు ఇవ్వడానికి సంకోచిస్తున్నారని ప్రశ్నించారు. బహుశా అధిక నాణ్యత వస్తువుల సేవలను అందించగల భారత్ సామర్థ్యంపై విశ్వాసం రావడానికి మరికొంత సమయం కావాలేమో అని వ్యగ్యంగా అన్నారు. అలాగే భారత్కి సరఫరా చేసే నాణ్యత నియంత్రణ ఆర్డర్లను కూడా పెంచాలని నొక్కి చెప్పారు. మీరు ఎంఆర్ఏలను ఇచ్చినట్లుగానే భారత్ కూడా మీకు ఇస్తుందని తేల్చి చెప్పారు. క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్(క్యూసిఓ)పై కూడా భారత పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలేదని అన్నారు. ఈ విషయమై దేశాలను పునరాలోచించమని చెబుతున్నా, ఏ విషయంలో క్యూసీఓని కోరుకుంటున్నాయో కూడా చెప్పండి అని పియూష్ గోయల్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: రూల్ అంటే రూలే.. సాక్షాత్తు పోలీస్ అయినా తప్పదు జరిమానా!) -
ఆర్థిక విధానంపై అప్పుడే యూ టర్న్.. చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని
దాదాపు నెలన్నర క్రితం సంగతి. సెప్టెంబర్ 5న భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్ను ఓడించి లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తగ్గిస్తానని, చుక్కలనంటుతున్న ఇంధన ధరలకు ముకుతాడు వేస్తానని, కట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ప్రకటించారు. ‘చేసి చూపిస్తా’మంటూ ప్రతిజ్ఞ చేశారు. కానీ నెల రోజుల్లోనే అన్నివైపుల నుంచీ ఆమెకు గట్టిగా సెగ తగులుతోంది. ఆర్థిక వ్యవస్థను పట్టాలకెక్కించేందుకు ఆమె ప్రతిపాదించిన విధానాలన్నీ ద్రవ్యోల్బణ కట్టడిలో ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. ట్రస్ తొలి మినీ బడ్జెట్ అన్ని వర్గాల్లోనూ తీవ్ర విమర్శల పాలైంది. ప్రధానంగా కార్పొరేషన్ ట్యాక్స్ను 19 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దాన్ని ఎప్పట్లా 25 శాతంగానే కొనసాగిస్తామంటూ యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కన్జర్వేటివ్ నేతలు, ఎంపీలను బాగా కలవరపెడుతున్నాయి. వారిలో ట్రస్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బ్రిటిష్ మీడియా పేర్కొంటోంది. ఆర్థిక మంత్రిపై ఇప్పటికే వేటు పడింది. ప్రధాని మార్పు కూడా అనివార్యమని ఎంపీల్లో అత్యధికులు భావిస్తున్నారని చెబుతోంది. సమస్యలను చక్కదిద్దడంలో, సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతున్న ట్రస్ ఏ క్షణమైనా తప్పుకోవాల్సి రావచ్చంటున్నారు! ఆమె రాజీనామాకు టోరీ ఎంపీలు త్వరలో బహిరంగ పిలుపు ఇచ్చే అవకాశముందని బ్రిటిష్ మీడియాలో వార్తలొస్తున్నాయి!! ఆరేళ్లు, నలుగురు ప్రధానులు ఆరేళ్లుగా అధికార కన్జర్వేటివ్ పార్టీకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం నిర్వహించినప్పటి నుంచి ఏకంగా నలుగురు ప్రధానులు మారారు! 2016లో డేవిడ్ కామెరాన్ తప్పుకుని థెరెసా మే ప్రధాని అయ్యారు. కానీ బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రతిష్టంభన ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. 2019లో బోరిస్ జాన్సన్ పగ్గాలు చేపట్టారు. మూడేళ్లయినా నిండకుండానే ఆయనా అనేకానేక వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో అయిష్టంగానే గత జూలైలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడిక ట్రస్ వంతు కూడా వచ్చినట్టేనంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆర్థిక విధానాలపై యూ టర్న్ తీసుకోవడం ఆమెకు అప్రతిష్ట తెచ్చిపెట్టిందంటున్నారు. ఇవీ ‘తప్పు’టడుగులు... ► ఆర్థిక మంత్రిగా తొలిసారిగా నల్ల జాతీయుడైన క్వాసీ క్వార్టెంగ్ను ట్రస్ ఎంచుకున్నారు. పౌరుల నివాస పన్నులు, ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభనను వదిలించేందుకు ఆయన ప్రకటించిన మినీ బడ్జెట్ పూర్తిగా బెడిసికొట్టింది. ఏకంగా 4,500 కోట్ల పౌండ్ల మేరకు పన్ను తగ్గింపులను ప్రకటించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతున్న వేళ ఇది ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ► తొలుత ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని సమర్థించిన ట్రస్, కొద్ది రోజులకే యూ టర్న్ తీసుకుంటూ అత్యధిక స్థాయి ఆదాయ పన్ను రేటు తగ్గింపును రద్దు చేయడం వివాదానికి దారితీసింది. పైగా ఇది సొంత పార్టీలోనూ ఆమెపై తీవ్ర అసంతృప్తికి దారి తీయడంతో ఎటూ పాలుపోక క్వాసీని తప్పించి జెరెమీ హంట్కు ఆర్థిక శాఖ అప్పగించారు. రిషి పన్నుల పెంపు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, ఇప్పుడు ఆయన బాటలోనే నడవడాన్ని అసమర్థతగానే అంతా భావిస్తున్నారు. రిషివైపే టోరీ ఎంపీల మొగ్గు? ట్రస్ తప్పుకుంటే తదుపరి ప్రధానిగా రిషి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే సమర్థ ప్రత్యామ్నాయమని కన్జర్వేటివ్ ఎంపీలు భావిస్తున్నట్టు బ్రిటిష్ మీడియా చెబుతోంది. రిషీని ప్రధానిగా, పెన్నీ మోర్డంట్ను ఆయనకు డిప్యూటీగా నియమించే ఆలోచన సాగుతోందంటున్నారు. లేదంటే మోర్డంట్ ప్రధానిగా, రిషి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. చివరికి మళ్లీ బోరిస్ జాన్సనే తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదంటున్న వాళ్లూ ఉన్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్ అవార్డు
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ (42) మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్–2 ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. లండన్లో శనివారం జరిగిన 20వ ఆసియన్ అఛీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డును అందుకున్నారు. బ్రేవర్మన్ తల్లి తమిళ మూలాలున్న ఉమ, తండ్రి గోవాకు చెందిన క్రీస్టీ ఫెర్నాండెజ్. సుయెల్లా లండన్లో జన్మించారు. బ్రిటన్లో పలు రంగాల్లో విజయాలు సాధించిన దక్షిణాసియాకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు. -
8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ
లండన్: సంప్రదాయ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరీక్ష ద్వారా గుండె వైఫల్యాన్ని గుర్తించేందుకు 20 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. కానీ, కేవలం 8 నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక సాంకేతికతను బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంటే ఎంఆర్ఐ పరీక్షతో పోలిస్తే సగం కంటే తక్కువ సమయంలోనే గుండె వైఫల్యాన్ని నిర్ధారించవచ్చు. దీనివల్ల సమస్యను 8 నిమిషాల్లోనే గుర్తించి, రోగులకు ప్రభావవంతమైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు చెప్పారు. ఎంఆర్ఐతో సవివరమైన 4డీ ఫ్లో చిత్రాలను అభివృద్ధి చేసి, గుండె పనితీరును తెలుసుకోవచ్చని అన్నారు. ఈ టెక్నాలజీకి ‘4డీ ఫ్లో ఎంఆర్ఐ’ అని పేరు పెట్టారు. ఇందులో గుండె కవాటాలు, గుండె లోపలికి రక్తప్రవాహాన్ని స్పష్టం చూడవచ్చు. వీటిని బట్టి రోగులకు ఎలాంటి చికిత్స అందించాలన్నది వైద్యులు నిర్ణయించుకోవచ్చు. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ రేడియాలజీ ఎక్స్పరిమెంటల్ పత్రికలో ప్రచురించారు. హార్ట్ ఫెయిల్యూర్ను గుర్తించే విషయంలో ఇది విప్లవాత్మకమైన టెక్నాలజీ అని పరిశోధకులు వెల్లడించారు. -
క్వీన్ అంత్యక్రియల వేళ అనుహ్య ఘటన... షాక్లో బ్రిటన్
లండన్: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వేళ ఒక అనుహ్య ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పోలీసు అధికారులు కత్తిపోటుకు గురయ్యారు. ఒక దుండగుడుని దాడులకు తెగబడతాడన్న అనుమానంతో ఇద్దరు అధికారులు అదుపులోకి తీసుకుంటుండగా.. వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ ఇద్దరు అధికారుల తోపాటు సదరు దుండగుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడు వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందతున్నట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పరిగణించడం లేదని లండన్ మెట్రో పాలిటన్ పోలీస్ శాఖ పేర్కొంది. ఈ సంఘటనకు గల కారణాలపై పూర్తి స్తాయిలో దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. లండన్ మేయర్ ఈ దాడిని అత్యంత భయంకరమైనదిగా పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత యూకేలో తొలిసారిగా జరుగుతున్న ప్రభుత్వ లాంఛన అంత్యక్రియలకు యూఎస్ అధ్యక్షుడు జో బిడెన్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు హాజరుకానున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని కట్టదిట్టంగా పర్యవేక్షించడానికి బ్రిటన్ దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది పోలీసులు లండన్లో మోహరించారు. అందులో 15 వందల మంది ఆర్మీ సిబ్బంది ప్రజల భద్రతను నిర్వహిస్తారు. (చదవండి: రాణి తుది వీడ్కోలు... ఆహ్వానం లేనిది వీళ్లకే) -
గోవాలో బ్రిటన్ హోం సెక్రటరీ తండ్రికి ఉన్న ఆస్తి కబ్జా... విచారణకు ఆదేశం
పనాజీ: బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ పగ్గాలు చేపట్టిన వెంటనే భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్ని హోం సెక్రటరీగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రటరీ బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండజ్కి గోవాలోని అస్సాగోలో సుమారు 13, 900 చ.కిమీ పూర్వీకులు ఆస్తి ఉంది. ఆ ఆస్తి కబ్జాకి గురయ్యిందని బ్రేవర్మన్ తండ్రి క్రిస్టీ ఫెర్నాండెజ్ ఫిర్యాదు చేసినట్లు గోవా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(సిట్) అధికారి నిధి వాసన్ తెలిపారు. ఫెర్నాండజ్ ఫిర్యాదు ఆధారంగా తాము కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు. ఫెర్నాండెజ్కు అతని కుటుంబసభ్యులకు చెందిన అస్సగావో గ్రామంలో సర్వే నెంబర్ 253/3, 252/3లో ఉన్న ఆస్తులను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇన్వెంటరీ ప్రోసీడింగ్లను దాఖలు చేశారని ఫిర్యాదు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆయా వ్యక్తుల ఈ ఏడాది జులై 27న ఆ ప్రోసీడింగ్లను దాఖలు చేసినట్లు ఆగస్టులో తనకు తెలిసిందని ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా ఫెర్నాండజ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జస్పాల్ సింగ్ గోవా ఎన్నారై కమిషనరేట్లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గోవా ఎన్నారై కమీషనర్ నరేంద్ర సవైకర్ మాట్లాడుతూ... తమ శాఖకు గతవారమే ఈమెయిల్ వచ్చిందని, దీన్ని రాష్ట్ర హోం శాఖకు పంపించామని తెలిపారు. ఈ మేరకు గోవా ప్రభుత్వం ఇలాంటి భూ కబ్జా కేసులను నివారించేందుకు ఈ ఏడాది ప్రారంభంలో పోలీస్, రెవెన్యూ, ఆర్కెవ్స్, పురావస్తు శాఖ అధికారులతో కూడిన సిట్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ రాష్ట్రంలో ఇలాంటి భూ కబ్జా కేసులకు సంబంధించి సుమారు 100కు పైగా కేసులను దర్యాప్తు చేస్తోంది. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 7 కోట్లు స్వాధీనం) -
UK PM results 2022: జాన్సన్ వారసులెవరో తేలేది నేడే
లండన్: యూకే తదుపరి ప్రధాని ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనుంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్(42), మంత్రి లిజ్ ట్రస్(47) ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది లిజ్ ట్రస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు పలు సర్వేల్లో ఇప్పటికే వెల్లడైంది. లిజ్ ట్రస్ ఎన్నికైతే బ్రిటన్ ప్రధానిగా మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత మూడో మహిళ కానున్నారు. ఆన్లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటు వేసి పార్టీ నేతను ఎన్నుకుంటారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్ గ్రాహం బ్రాడీ వెల్లడిస్తారు. ఎన్నికైన నేత డౌనింగ్ స్ట్రీట్కు సమీపంలోనే ఉన్న రాణి ఎలిజబెత్–2 కాన్ఫరెన్స్ సెంటర్ నుంచి సంక్షిప్త ప్రసంగం చేస్తారు. మంగళవారం డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి ఆపద్ధర్మ ప్రధాని బోరిస్ జాన్సన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. అనంతరం స్కాట్లాండ్లో ఉన్న రాణి ఎలిజబెత్కు తన రాజీనామాను అందజేస్తారు. ఆపైన, పార్టీ నేతగా ఎన్నికైన వారు స్కాట్లాండ్కు వెళ్లి రాణి నుంచి నియామక పత్రం అందుకుంటారు. ఇంగ్లండ్కు, బకింగ్హామ్ ప్యాలెస్కు బదులుగా మరోచోట నుంచి ప్రధాని పేరును రాణి ప్రతిపాదించడం బ్రిటన్ చరిత్రలో ఇదే మొదటిసారి. 96 ఏళ్ల రాణి వయస్సు రీత్యా ప్రయాణాలను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రస్తుతం ఆమె అబెర్దీన్షైర్ బాల్మోరల్ కోటలో గడుపుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం కొత్తగా నియమితులైన ప్రధానమంత్రి డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం నుంచి మొదటి ప్రసంగం చేయడానికి ముందే కీలకమైన కేబినెట్ పదవులను ఖరారు చేస్తారు. సీనియర్ అధికారులు నూతన ప్రధానికి భద్రతకు సంబంధించిన కీలక వివరాలను, అణ్వాయుధాల రహస్య కోడ్లను అందజేస్తారు. బుధవారం మధ్యాహ్నం అధికార కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేత హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రతిపక్ష నేత ప్రశ్నలకు సమాధానాలిస్తారు. కోవిడ్ నిబంధనలన ఉల్లంఘిస్తూ పార్టీలు జరుపుకోవడం, పార్టీ సీనియర్ నేత ఒకరు కుంభకోణంలో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో బోరిస్ జాన్సన్ కేబినెట్లోని సుమారు 60 మంది సీనియర్ నేతలు రాజీనామాలు చేశారు. దీంతో అధికార పార్టీ కొత్త నేతను ఎన్నుకునే సుదీర్ఘ ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇంధన భారం తగ్గిస్తాం ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గిస్తామని యూకే ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్, లిజ్ ట్రస్ తెలిపారు. బ్రిటన్ ప్రధాని పదవికి జరిగే ఎన్నికలో అధికార కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు బరిలో ఉన్న విషయం తెలిసిందే. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ జరగనున్న సమయంలో ఆదివారం వీరు బీబీసీ ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. రష్యా– ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా యూకేలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో, ఇదే ప్రధాన అంశంగా మారింది. కొత్త ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా రిషి సునాక్ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతానని, తన సొంత రిచ్మండ్, యార్క్షైర్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏం చేస్తారన్న ప్రశ్నలకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. మళ్లీ ఎన్నికలు జరిగితే ప్రధాని పదవి రేసులో ఉంటారా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. -
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో రిషి సునాక్ దంపతులు
Rishi Sunak Celebrate Sri Krishna Janmashtami.. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి.. భారతీయులందరూ ఎంతో భక్తి శ్రద్దలతో కృష్ణుడి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని పదవి రేసులో ఉన్న రిషి సునాక్ పాల్గొన్నారు. పండుగ నేపథ్యంలో ఆయన తన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు సోషల్ మీడియాలో వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన వారి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ కృష్ణుడి పుట్టినరోజును జన్మాష్టమి పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. పండుగ సందర్భంగా తన భార్య అక్షితతో కలిసి తాను గుడికి వెళ్లినట్లు రిషి తెలిపారు. ఇదిలా ఉండగా.. బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. కాగా, బ్రిటన్ దేశ విదేశాంగ మంత్రి లిజ్ ట్రూస్, రిషి సునాక్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుత సర్వేల ప్రకారం.. రిషి సునాక్ మళ్లీ లీడింగ్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. UK PM contender Rishi Sunak visits temple with wife to celebrate Janmashtami Read @ANI Story | https://t.co/9k0ULR4wHR#Janmashtami #Janmashtami2022 #RishiSunak pic.twitter.com/uDAOX74hHi — ANI Digital (@ani_digital) August 19, 2022 -
ఆంగ్ల సహన పాఠం నేర్చుకుందామా?
బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. కానీ ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటన్ ప్రధానమంత్రి పదవి బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. క్రైస్తవులకు ప్రాధాన్యత ఉన్న బ్రిటన్లో రిషీ సునాక్ తనది హిందూమతం అని చెబుతూ, ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. అక్కడి ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నించడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. కానీ అదే భారత్లో ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్ని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించి, సమానత్వం గురించి ఇండియాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతోంది. భారత సంతతికి చెందిన బ్రిటిష్ రాజకీయ నేత రిషీ సునాక్ కన్సర్వేటివ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు. కొన్ని సంవత్స రాల క్రితం అమెరికన్ అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమె తర్వాత రాజకీయ ఉన్నత పదవిని అందుకోవడానికి పశ్చిమ దేశాల్లోని భారత సంతతి వలస ప్రజల్లో ఇటీవల వేగంగా దూసుకొచ్చిన వ్యక్తి రిషీ సునాక్. బ్రిటన్ ఒకప్పుడు భారత దేశ వలసాధిపతిగా ఉండేది. భారతీయ కోణం నుంచి చూస్తే బ్రిటిష్ ప్రధానమంత్రి అంటే దోపిడీ సామ్రాజ్యానికి చారిత్రాత్మకమైన రాజకీయ ప్రతినిధిగా మాత్రమే కనిపిస్తారు. అదే సమయంలో అది సంస్కరణల సామ్రాజ్యం కూడా అని గుర్తుంచుకుందాం. మరి బ్రిటిష్ వలస పాలనా కోణం నుంచి చూస్తే, దానికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం హక్కుల ప్రాతి పదికన పోరాటం చేసి ఉండకపోతే, భారతదేశం 1947లో ప్రజాస్వామిక, రాజ్యాంగబద్ధ రిపబ్లిక్ అయి ఉండేదికాదు. హిందూ లేదా బౌద్ధం... అది ఏదైనా కావచ్చు, మన ప్రాచీన నిర్మాణాలలోనే మన ప్రజాస్వామ్యానికి మూలాలు ఉన్నాయని మనం ఎంత గట్టిగా చెప్పుకున్నప్పటికీ. చర్చలో మతం లేదు మన స్వాతంత్య్ర పోరాటం, వలస జీవితానికి సంబంధించిన అన్ని కీలక అంశాలూ బ్రిటిష్ రాజకీయ వ్యవస్థతో అనుసంధానమై ఉండేవి. ప్రత్యేకించి 20వ శతాబ్ది ప్రారంభం నుంచి బ్రిటిష్ ప్రధాని అంటే వలసపాలనా చిహ్నంగానే భారతీయ ఆందోళనాకారులు భావించేవారు. దూషించడానికైనా, అభ్యర్థించడానికైనా బ్రిటిష్ ప్రధానే మన తలపుల్లో ఉండేవారు. ఈ చారిత్రక నేపథ్యంలో, ప్రస్తుతం భారత సంతతికి చెందిన ఒక కన్సర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిటిష్ ప్రధానమంత్రి పదవి కోసం బరిలో ఉన్నారంటేనే ప్రపంచం ఎంతగా మారిపోయిందో బోధపడుతుంది. హిందూ– జాతీయవాదం ప్రేరేపిస్తున్న వివక్షను భారత్ ఎదుర్కొంటున్న ఈ తరుణంలో క్రైస్తవులకు ప్రాధా న్యత ఉన్న బ్రిటన్లో ఒక వ్యక్తి తనది హిందూ మతం అని చెబుతూ, ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిగా బరిలో నిలబడుతున్నారు. బ్రిటన్ పార్ల మెంటు సభ్యుడిగా, తర్వాత ఆర్థిక మంత్రిగా ఆయన గతంలో భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అదే హిందూ సునాక్... బ్రిటన్ ప్రధాని అధికారిక నివాస భవనమైన 10 డౌనింగ్ స్ట్రీట్కు వెళ్లాలని కోరుకుంటున్నారు. సునాక్ భార్య అక్షత హిందూ భారతీయ కోటీశ్వరుల కుమార్తె. సునాక్ సంపద ఇప్పుడు ప్రజల్లో చర్చించుకునే అంశమైంది. ఎందుకంటే ఆర్థిక, సామాజిక వర్గాలు చాలాకాలంగా బ్రిటిష్ రాజకీయాల్లో భాగంగా ఉంటున్నాయి. అయితే సునాక్ మతం మాత్రం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా కనిపించడం లేదు. బ్రిటన్ ఓటర్లు, రాజకీయ వర్గంలో గణనీయంగా గుర్తించదగిన బహుళ సాంస్కృతిక సహన స్థాయిని ఇది సూచిస్తోంది. ఈ కోణంలో, అమెరికా కంటే మరింత లౌకికమైన, బహుళ సాంస్కృతిక దేశం బ్రిటనే అని నేను అనుకుంటున్నాను. కమలా హారిస్ గనక తనను తాను హిందువు అని బహిరంగంగా చెప్పుకునివుంటే, డెమొక్రాటిక్ పార్టీ టికెట్ని గెల్చుకునేవారు కాదని నా అనుమానం. ఆంగ్లికన్ క్రిస్టియానిటీ బ్రిటన్ అధికార మతం. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ హెడ్ ఎలిజబెత్ రాణి. అయినా సరే బ్రిటన్ ప్రధానమంత్రి కావాలన్న రిషీ సునాక్ కోరికను మత ప్రాతిపదికన అసంగతమైన అంశంగా అక్కడ ఎవరూ చూడటం లేదు. ఇదేనా సహనం? అదే భారతదేశం విషయానికి వస్తే, బ్రిటన్కు కాబోయే ప్రధానిగా అవకాశమున్న, దానికి అక్కడి సమాజ ఆమోదం పొందిన భారత సంతతి హిందువు గురించి ఆరెస్సెస్, బీజేపీ ఏమని ఆలోచిస్తాయో ఊహించగలరా? ఎందుకంటే వీళ్లు భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను మతపరమైన మెజారిటీవాద అజెండాతో అట్టడుగున పడేశారు. పార్లమెంటు ఉభయసభల్లో బీజేపీ తరపున ఒక్క ముస్లిం కూడా లేరు. అలాగే భారత ప్రభుత్వ మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేరు. (అదే బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని ఆయన మంత్రి వర్గంలో భారత్ కంటే ఎక్కువ ముస్లింలు ఉన్నారు.) హిందూయిజం ప్రపంచానికే విశ్వగురువుగా ఉందంటూ ఆరెస్సెస్, బీజేపీ శక్తులు పదేపదే ఎత్తిపడుతున్నాయి. ఇక ఆరెస్సెస్ సాహిత్యమంతా బ్రిటిష్ వారిపై, క్రిస్టియన్ నాగరికతా చరిత్రపై మతయుద్ధ వీరులు, వలసవాద విస్తరణవాదులు అంటూ దాడులతో నిండిపోయింది. దేశంలో ఇప్ప టికీ కొనసాగుతున్న కుల అంతరాలు, దళితులపై దౌర్జన్యాలు వంటి సామాజిక దుర్మార్గాలను ఏమాత్రం పట్టించుకోని ఈ కూటమి, ప్రపంచం లోనే అత్యంత సహనభావం కలిగినది హిందూ మతమేనని మాత్రమే గొప్పగా చెప్పుకుంటుంది. మరోవైపున వీరి తాజా చరిత్ర వర్ణనలో స్థానిక భారతీయ ముస్లింలను, క్రిస్టియన్లను కూడా శత్రువులుగా పరిగణిస్తున్నారు. నేడు బ్రిటన్లో హిందువులు చిన్న మైనారిటీగా ఉంటున్నారు. జనాభాలో వీరి వాటా 1.6 శాతం మాత్రమే. వీరు బ్రిటన్కి ఇటీవలే వలస వచ్చినవారు, వారి వారసులతో కూడి ఉన్నారు. అయినప్పటికీ మైనారిటీవాదం బ్రిటన్ ప్రజా స్వామిక పోటీలో ప్రధాన పాత్ర వహిస్తున్నట్లు కనిపించడం లేదు. అదే ఆరెస్సెస్, బీజేపీ భారత్లో గానీ, చివరకు గతకాలపు కాంగ్రెస్ హయాంలో గానీ ఒక ముస్లిం, లేదా క్రిస్టియన్ని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా అంగీకరించేవారు కాదు. ఇలా హిందూయిజం సహనభావం గురించి చెప్పుకోవ లసింది చాలానే ఉంది మరి. ప్రజాస్వామ్యంలో అసలైన ప్రశ్నలు ఇవే... క్రిస్టియన్ వలసవాద సామ్రాజ్యాన్ని బ్రిటన్ సర్వవ్యాప్తం చేసింది. కానీ ఇప్పుడు అదే బ్రిటన్ అత్యున్నత పదవికి సునాక్ పోటీ చేయడాన్ని అనుమతిస్తోంది. బ్రిటన్లోని ప్రతిపక్ష నేత లేదా ప్రధాని పదవికి పోటీచేస్తున్న ఆయన పార్టీకి చెందిన వారెవరూ కూడా సునాక్ మతాన్ని ప్రశ్నిం చడం లేదు. అతడి సంపదను ప్రశ్నిస్తున్నారు. కార్మికవర్గం పట్ల అతడి వైఖరిని ప్రశ్నిస్తున్నారు. అతడి భార్య పన్ను ఎగవేత గురించి ప్రశ్నిస్తు న్నారు. ప్రజాస్వామ్యంలో సంధించవలసిన అసలు సిసలైన ప్రశ్నలు ఇవే. కానీ ఇలాంటి ప్రశ్నలు భారత్లో అరుదుగానే అడుగుతుంటారు. బ్రిటన్ ప్రధాని పదవికి రిషి సునాక్ వేసిన అభ్యర్థిత్వ ఫలితం పట్ల నేను అజ్ఞేయవాదిగానే ఉంటాను. బ్రిటన్ భావి ప్రధాని ఎంపికలో ఫలితాలు ఎలా అయినా ఉండనివ్వండి... కానీ పార్ల మెంటరీ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి బ్రిటన్... సహన భావం గురించీ, సమానత్వం గురించీ భారతదేశానికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పు తోందని నాకు తెలుసు. కానీ భారతదేశం మాత్రం ఆ పాఠాన్ని నేర్చుకునే దేశంగా మాత్రం ఉండటం లేదని నా భావన. వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
గాంధీజీ భక్తురాలు మీరాబెన్
మీరాబెన్ భారతీయురాలు కారు. ఆమె పేరు కూడా మీరాబెన్ కాదు. ఆమె అసలు పేరు మెడిలియన్ స్లేడ్. బ్రిటన్ దేశస్థురాలు. బ్రిటిష్ సైన్యాధిపతి సర్. ఎడ్మిరల్ స్లేడ్ కుమార్తె. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతో కలిసి పనిచేయడానికి తన దేశాన్ని, ఇంటిని వదిలి వచ్చిన మానవతావాది. ఆమె పేరు మార్చింది గాంధీజీనే! శ్రీకృష్ణపరమాత్ముని భక్తురాలైన మీరాబాయ్ పేరునే ఆయన ఆమెకు పెట్టారు. మీరాబాయ్ క్రమంగా మీరాబెన్ అయ్యారు. ఆమె 1925 నవంబరు 7న భారతదేశంలో అడుగు పెట్టారు. ఆరోజు మహదేవ్ దేశాయ్, వల్లభాయ్ పటేల్, స్వామీ ఆనంద్ ఆమెకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత మీరాబెన్ 34 ఏళ్లు పాటు భారతదేశంలోనే ఉండిపోయారు. హిందీ నేర్చుకున్నారు. 1931లో లండన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ, ఇతర ప్రముఖులతో పాటు మీరాబెన్ కూడా హాజరయ్యారు. లండన్ నుండి వచ్చాక, ఇండియాలో తిరిగి ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ఫలితంగా 1932–33లో జైలు జీవితం గడిపారు. అనంతర కాలంలో మీరాబెన్ గాంధీతో పాటు 1942 నుండి 1944 వరకూ పుణేలోని ఆగాఖాన్ ప్యాలెస్లో నిర్భంధంలో ఉన్నారు. ఆ జైల్లోనే ఆమె మహాదేవ్ దేశాయ్, కస్తూరీబాయ్ మరణాలు చూసి చలించిపోయారు. అంతేకాదు. ఆ రోజుల్లో జరిగిన ప్రతి సన్నివేశాన్నీ కళ్లారా చూసిన ప్రత్యక్షసాక్షి మీరాయే. చివరికి గాంధీజీ అంతిమ యాత్రలో కూడా మీరా సాక్షీభూతురాలై నిలిచారు. ఆగాఖాన్ ప్యాలెస్ నుండి విడుదలయిన తర్వాత గాంధీజీ అనుమతితో మీరాబెన్ రూర్కీలో కిసాన్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమ నిర్మాణానికి గ్రామీణులు పెద్ద ఎత్తున స్థలాన్ని సమకూర్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఋషికేశ్లో పశులోక్ ఆశ్రమాన్ని స్థాపించి, ఆ ప్రాంతానికి బాపూ గ్రామ్ అనే పేరుని పెట్టారు. అలాగే 1952లో భిలాంగనలో గోపాల్ ఆశ్రమం కూడా స్థాపించారు. ఆ ఆశ్రమంలోనే గడుపుతూ పాల సరఫరా, వ్యవసాయంలో పరిశోధనలు చేస్తుండేవారు. అలాగే ఒకొక్కసారి కశ్మీర్ వెళ్లి కొంతకాలం గడిపి వచ్చేవారు. ఆ రోజుల్లోనే ‘సమ్థింగ్ రాంగ్ ఇన్ ది హిమాలయ’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. మనదేశానికి ఇంత సేవచేసిన మీరాబెన్ 1959లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయారు. 1960లో ఆస్ట్రేలియాలో, తర్వాత 22 ఏళ్ల పాటు వియన్నాలో గడిపారు. 1982లో మరణించారు. భారత ప్రభుత్వం 1981లో మీరాబెన్ను భారతీయ పౌరురాలుగా పరిగణించి, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మవిభూషణ్ అవార్డుతో గౌరవించింది. (చదవండి: మహోజ్వల భారతి: నూరేళ్ల రావి చెట్టు) -
దురాక్రమణే లక్ష్యంగా...కిరాయి సైనికులను దింపిన రష్యా
Mercenaries unlikely to make up for the loss of regular infantry units: ఉక్రెయిన్ పై దాడులకు దిగిన రష్యా ప్రస్తుతం కిరాయి సైనికులను సైతం కథన రంగంలోకి దింపినట్లు బ్రిటన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో రష్యా సైన్యం తక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ప్రైవేట్ మిలటరీ కంపెనీ వాగ్నెర్ గ్రూప్ నుంచి పేయిడ్ ఫైటర్స్ని దింపింది. ఇప్పడు మరింత ముందుకడుగు వేసి యుద్ధ కాంక్షతో ఆఖరికి కిరాయి సైన్యాన్ని దింపేందుకు కూడా రెడీ అయిపోయింది. ఒక రకంగా రష్యా సైన్యం కూడా కాస్త ఒత్తిడికి గురవుతోందని అవగతమవుతోంది. ఏదీ ఏమైన రష్యా ఈ కిరాయి సైనికులతో పదాతిదళ సామార్థ్యాన్ని పూరించడం అసాథ్యం అని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఉక్రెయిన్ అధికారులు దక్షిణా ఉక్రెయిన్లో రష్యా బలగాలు భారీగా పునరాగమించినట్లు తెలిపారు. అదీగాక డినిప్రో నదికి పశ్చిమలో రష్య సైన్యం తీవ్ర నష్టం కలిగించనుందని బ్రిటిష్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రష్యా అనుకూల వేర్పాలు వాదుల ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడమే కాకుండా రష్యా సైన్యం చోరబడకుండా అడ్డుకుంది. రష్యా సైన్యం ప్రవేశించకుండా అక్కడ ఉన్న డినిప్రో నదిపై ఉన్న ముడు వంతెనలను ధ్వంసం చేసింది. అంతేకాదు ఉక్రెయిన్ తన యుద్ధ విమానాలతో ఖేర్సన్ చుట్టూ ఉన్న ఐదు రష్యన్ బలమైన ప్రాంతాల తోపాటు సమీపంలోని మరొక నగరంపై దాడి కూడా చేసిందని బ్రిటన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రష్యా కిరాయి సైనికులను యుద్ధంలోకి దింపడమే కాకుండా ఉక్రెయిన్ రాజధాని కీవ్ శివార్లలోని సైనిక స్థావరాలపై కూడా బాంబు దాడి చేసినట్లు పేర్కొంది. ఈ దాడి కారణంగా సుమారు 15 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సీ కులేబా వెల్లడించారు. (చదవండి: చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డ భర్త... నిర్థాక్షిణ్యంగా కాల్చి చంపిన మహిళ) -
బ్రిటన్ని ఫుట్బాల్ ఆడుకుంది
1911 జూలై 29 న ఆంగ్లేయులపై మనం సాకర్లో విజయం సాధించాం. అందుకు గుర్తుగా ఏటా ఈ రోజున ‘మోహన్ బగాన్’ డే జరుపుకుంటున్నాం. కలకత్తాలోని ‘మోహన్ బగాన్ ఫుట్బాల్ క్లబ్’ తరఫున మన భారత జట్టు.. ఆంగ్లేయ క్రీడాకారుల జట్టు అయిన ‘ఈస్ట్ యార్క్షైర్ రెజిమెంట్’తో తలపడి ‘ఐ.ఎఫ్.ఎ. షీల్డ్’ పైనల్ మ్యాచ్లో నెగ్గింది. బెంగాల్ విభజనతో దేశం ఆగ్రహావేశాలతో ఉన్న సమయంలో బ్రిటిషర్లపై మనం సాధించిన ఆ ఘన విజయం.. ‘మా జన్మభూమిలో మాదే పైచేయి’ అనే బలమైన సంకేతాన్ని బ్రిటన్కు పంపినట్లయింది. కలకత్తాలో మ్యాచ్ జరిగింది. బెంగాల్తో పాటు దేశం మొత్తం ఉత్సవం జరుపుకుంది. ‘బ్రిటిష్ వాళ్లను భారత్ ఓడించింది..’ అనే విజయగర్వం ప్రతి ఒక్కరిలోనూ తొణికిసలాడింది. మోహన్ బగాన్ ఫుట్బాల్ క్లబ్ 1889లో ప్రారంభం అయింది. క్లబ్బుకి ఆ పేరే పెట్టడానికి కారణం ఉంది. కలకత్తాలో కీర్తి మిత్రా అనే క్రీడాభిమాని బంగ్లా పేరు మోహన్ బగాన్. ఆ బంగ్లాలో, ఆనాటి బెంగాల్ ప్రముఖుల సమక్షంలో క్లబ్ ఆరంభం అవడంతో క్లబ్కి కూడా మోహన్బగాన్ అనే నామకరణం చేశారు. 1911లో ‘వస్తారా మాతో పోటీకి’ అని ఇంగ్లిష్ వాళ్లే మొదట మోహన్ బగాన్ క్లబ్బుకు సవాల్ విసిరారు. ఆ సవాల్ని మనవాళ్లు స్వీకరించారు. ప్రతిష్ఠాత్మక ఐ.ఎఫ్.ఎ. షీల్డ్ టోర్నమెంట్లో విజయం సాధించారు. విశేషం ఏంటంటే.. బ్రిటిష్ జట్టు బూట్లతో బరిలోకి దిగితే, బగాన్ జట్టు వట్టికాళ్లతో దిగింది. ఇప్పటి మన క్రికెటర్లు మ్యాచ్ గెలిస్తే ఒంటిపై చొక్కాలు తీసేస్తారు కదా, అప్పటి బగాన్ విజేతలు ఆనందం పట్టలేక చొక్కాలు చింపుకుని చిందులేశారు. గాంధీ–ముసోలినీ మీట్ గాంధీజీ శాంతిప్రియులు. అహింసావాది. ఇటలీ నియంత ముసోలినీ అందుకు పూర్తిగా విరుద్ధం. బ్రిటిష్ వాళ్లంటే మనకు కంపరం కదా, బ్రిటిష్ వాళ్లకే కంపరం కలిగించిన ఫాసిస్టు పాలకుడు ముసోలిని. అలాంటి వ్యక్తిని కలవడానికి గాంధీజీ బయల్దేరి వెళ్లడం.. బ్రిటన్కి పెద్ద షాక్. గాంధీజీకీ అసలు ముసోలిని కలిసే ఉద్దేశమే లేదు. 1931లో రౌండ్ టేబుల్ సమావేశానికని లండన్ వెళ్లి, సమావేశం అయ్యాక ఇండియా తిరిగి వచ్చేందుకు ఇటలీ షిప్ ఎక్కారు గాంధీజీ. షిప్ రోమ్లో ఆగినప్పుడు పోప్ని కలిసేందుకు గాంధీజీ ప్రయత్నించారు కానీ కుదరలేదు. అయితే గాంధీజీని ముసోలిని కలవాలని అనుకుంటున్నారన్న కబురు వచ్చింది. ఆరోజు డిసెంబర్ 12, 1931. గాంధీజీ పక్కనే ఆయన కార్యదర్శి మహదేవ్ దేశాయ్, అంతరంగికురాలు మీరాబెన్ ఉన్నారు. ముగ్గురూ కలిసి ముసోలినీ కలిశారు. గాంధీజీ, ముసోలినీ కొద్దిసేపు భారత రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత గాంధీజీ ఇండియా వచ్చాక బ్రిటన్ పత్రికలన్నీ రగడ చేశాయి. నియంత ముసోలినిని ప్రశంసించిన గాంధీజీ అని పత్రికలన్నీ చిలవలు పలవలు చేసి ఉన్నవీ లేనివి రాశాయి. నేడు ముసోలిని జయంతి. 1883 జూలై 29న ఆయన జన్మించారు. ఇటలీ అంతర్యుద్ధంలో దేశాన్ని అధోగతిపాలు చేసినందుకు కమ్యూనిస్టులు అతడిని 1945 ఏప్రిల్ 28న కాల్చిచంపారు. ముసోలినీ మార్క్సిస్టు. తనని తను ‘అధారిటేరియన్ కమ్యూనిస్టు’ అని చెప్పుకునేవారు. (చదవండి: మహాత్ముడి మాటే మహాదేవి బాట) -
'నా కొడుకు ప్రపంచ చాంపియన్.. గర్వంగా ఉంది'
పురుషుల 1500 మీటర్ల పరుగు...ప్రసారకర్తల కామెంటరీ బృందంలో ఒకడైన జెఫ్ వైట్మన్ రేసు ప్రారంభం కాగానే తన వ్యాఖ్యానం వినిపిస్తున్నాడు. 500 మీ...1000 మీ...1400 మీ. ముగిశాయి...అప్పటి వరకు అతను మంచి జోష్తో ఉత్కంఠ పెరిగేలా పరుగు గురించి మాట్లాడుతున్నాడు. రేసు పూర్తయింది... కానీ అతని మాట వినిపించలేదు. ఒక్కసారిగా అతని గొంతు ఆగిపోయింది. ప్రేక్షకులకు క్షణం పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. కొంత విరామంతో అతను మళ్లీ అనేశాడు...‘అతను నా కొడుకు, వాడు ఇప్పుడు ప్రపంచ చాంపియన్’ అంటూ వైట్మన్ ఉద్వేగంగా ముగించాడు. అంతే మైదానంలో ఒక్కసారిగా హర్షధ్వానాలు... సమీపంలో ఉన్నవారంతా చుట్టు చేరి అభినందనలతో ముంచెత్తారు. ఈ రేసును 3 నిమిషాల 29.23 సెకన్లలో పూర్తి చేసి బ్రిటన్ అథ్లెట్ జేక్ వైట్మన్ స్వర్ణం సొంతం చేసుకోవడం ప్రపంచ చాంపియన్షిప్ పోటీల ఐదో రోజు హైలైట్గా నిలిచింది. ఈ ఈవెంట్లో జాకన్ ఇన్బ్రిట్సన్ (నార్వే– 3 నిమిషాల 29.47 సెకన్లు), మొహమ్మద్ కతిర్ (స్పెయిన్–3 ని. 29.90 సె.) వరుసగా రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. Jake Wightman has become the World 1500m champion. Geoff calling his son becoming a World Champion is priceless. Helene, part of our team, filmed Dad. I sat with Mum Susan..then could not wait to give my mate a hug. Beyond proud. ❤️@JakeSWightman @WightmanGeoff @SusanWightman6 pic.twitter.com/8I8IT6ntwb — Katharine Merry (@KatharineMerry) July 20, 2022 Yaroslava Mahuchikh: బాంబుల మోత తప్పించుకొని పతకం గెలిచి.. -
పావులు కదుపుతున్న బోరిస్ జాన్సన్.. రిషి సునాక్ ఓటమికి స్కెచ్!
Rishi Sunak.. బ్రిటన్ ప్రధాని రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక, బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్తో సహా మరో ఐదుగురి మధ్య పోటీ సాగుతున్నది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ షాకింగ్.. రిషి సునాక్ ఓటమి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. పరోక్షంగా తాను రిషి సునాక్ను వ్యతిరేకిస్తున్న చెప్పకనే చెప్పారు. బోరిస్ జాన్సన్ శుక్రవారం ఓ సమావేశంలో ఎవరినైనా ఎన్నుకోండి.. రిషి సునాక్ తప్ప అని తన మద్దతు దారులకు సూచించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. కాగా, బోరిస్ జాన్సన్ బహిరంగంగా ఏ ఒక్కరి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం గానీ, బహిరంగంగా పోటీలో జోక్యం చేసుకోవడం లేదు. పోటీ నుంచి ఉద్వాసనకు గురైన అభ్యర్థులతో మాట్లాడుతూ తనకు మద్దతు ఇవ్వాలని, రిషి సునాక్ను బ్రిటన్ ప్రధానిని కానివ్వవద్దని చెబుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. బోరిస్ జాన్సన్, ఆయన టీం మాత్రం రిషి సునాక్ తప్ప ఎవరైనా సరే స్లోగన్తో ఎన్నికల రహస్య క్యాంపెయిన్ చేపట్టినట్లు సమాచారం. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, వాణిజ్యశాఖ సహాయ మంత్రి పెన్నీ మొర్డాంట్ అభ్యర్థిత్వాల పట్ల బోరిస్ జాన్సన్ చాలా ఆసక్తిగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక మంత్రిగా రిషి సునాక్ రాజీనామా తర్వాతే.. ప్రధానిగా తాను(బోరిస్ జాన్సన్) వైదొలగాల్సి వచ్చినందునే సునాక్పై బోరిస్ ఇలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. Boris Johnson takes revenge on Rishi Sunak: The Times#UKPM #BorisJohnson #RishiSunak https://t.co/IA1m4aHAMv — We For News (@WeForNews) July 16, 2022 ఇది కూడా చదవండి: రష్యాతో కలిసి పని చేస్తాం: నాసా సంచలనం.. ముందుగానే కౌంటర్ ఇచ్చిన పుతిన్ -
ఆ తల్లులకు క్షమాపణలు చెప్పాల్సిందే : మానవహక్కుల ప్యానెల్
UK Owes Apology For Forced Adoptions: అధికారికంగా తల్లి బిడ్డలను వేరుచేసే దారుణానికి పాల్పడిన బ్రిటన్ ప్రభుత్వం సదరు బాధిత మహిళలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని మానవ హక్కుల ప్యానెల్ పేర్కొంది. ఈ మేరకు బ్రిటన్ అధికారికంగా పెళ్లికానీ తల్లుల నుంచి తమ పిల్లలను బలవంతంగా దత్తత ఇచ్చేలా చేసినందుకు గానూ వారికి క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది. 1949, 1976 మధ్యకాలంలో ఇంగ్లండ్, వేల్స్ నుంచి దాదాపు లక్ష మందికి పైగా పిల్లలు బలవంతంగా దత్తతకు వెళ్లారని మానవ హక్కులకు సంబంధించిన పార్లమెంట్ సంయుక్త కమిటీ నివేదికలో పేర్కొంది. అత్యంత దారుణంగా తల్లి బిడ్డలను వేరు చేసే పాశవిక చర్యకు బ్రిటన్ ప్రభుత్వం పాల్పడిందని కమిటీ అధ్యక్షురాలు లేబర్ ఎంపీ హ్యారియోట్ హర్మాన్ అన్నారు. అంతేకాదు ఆ తల్లుల చేసిన ఏకైక నేరం పెళ్లి కాకుండా గర్భవతి కావడమేనని చెప్పారు. ఇది బ్రిటన్ చేసిన ఘోరమైన తప్పుగా కమిటీ పరిగణించింది. స్వయంగా ప్రభుత్వమే ఆ తల్లుల పట్ల అనుచితంగా ప్రవర్తించిందన్నారు. ఇప్పుడైనా వారికి న్యాయం జరగాలని, వారు గౌరవింపబడేలా చేసేందుకైన బ్రిటన్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. గతంలో ఆస్ట్రేలియ ప్రభుత్వం, ఐర్లాండ్ ఇలానే చేశాయని, అందుకు క్షమాపణలు కూడా చెప్పాయని తెలిపారు. 1963లో ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్లలో అబార్షన్ని చట్టబద్దం చేసినప్పటికీ మహిళలు ఈ సమస్యలను ఎదుర్కోవల్సి వచ్చిందన్నారు. పెళ్లికాకుండా తల్లికావడాన్ని ఘోరంగా చూడటం వల్లే ఈ పరిస్థితి వాటిల్లందని అన్నారు. ఐతే పార్లమెంట్ సంయుక్త కమిటీ నివేదిక బాధిత వ్యక్తుల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ను అందించడమే కాకుండా మరియు తల్లి లేదా బిడ్డను కనుగొనడానికి ప్రయత్నిస్తున్న వారికి ప్రభుత్వం సాయం చేయాలని కోరింది. ఈ క్రమంలో ఒక బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ...ఈ చారిత్రత్మక తప్పిదం వల్ల ప్రభావితమైన వారందరికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. గతాన్ని మార్చలేకపోయినప్పటికీ ఈ ఘటనలు పునరావృతం కాకుండా బలోపేతమైన చట్టాలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం. సదరు బాధిత మహిళలకు మెరుగైన సంరక్షణను అందస్తామని చెప్పారు. (చదవండి: ఈయూ ఆంక్షాల మోత...టెన్షన్లో రష్యా!) -
బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన భార్యపై ఇలా విమర్శలు
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా, బ్రిటన్కు తదుపరి ప్రధాని రేసులో ప్రముఖంగా మాజీ ఆర్ధిక మంత్రి రిషి సునాక్ పేరు వినిపిస్తోంది. రిషి సునాక్ కూడా రంగంలోకి దిగుతున్నట్లు శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. దీంతో, ఆయనకు పలువురు ఎంపీలు కూడా మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. తాజాగా రిషి సునాక్ భార్య, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి వార్తల్లో నిలిచారు. కాగా, రిషి సునాక్ ప్రధాని రేసులో ఉన్నట్టు ప్రకటించిన తర్వాత ఆయన మీడియాకు కనిపించలేదు. దీంతో జర్నలిస్టులు ఆయన కోసం ఇంటి వద్ద వేచి ఉన్నారు. ఈ క్రమంలో సునాక్ భార్య.. అక్షతా మూర్తి స్వయంగా తానే వచ్చి టీ, స్నాక్ అందించారు. దీంతో, ఆమె సోషల్ మీడియాలో వార్తలో నిలిచారు. ఈ ఘటనపై కొందరు ప్రశంసించగా.. మరికొందరు విమర్శలు చేశారు. ఎన్నో కోట్లకు అధిపతికి అయిన అక్షతా మూర్తి ఎంతో సంప్లిసిటీతో జర్నలిస్టులకు టీ అందించారని.. ఆమె నిరాడంబరతను ఇది నిదర్శనమంటూ మెచ్చుకుంటున్నారు. ఇక, ఆమె టీ ఇచ్చిన ఒకో టీ కప్పు ధర దాదాపు రూ.3,600(38 పౌండ్లు) ఉంటుందని తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె తమ గొప్పతనాన్ని చూపించడం కోసమే ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆ టీ కప్పు ఖరీదుతో ఓ కుటుంబం రెండు రోజుల పాటు జీవించవచ్చు అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అక్షతా మూర్తి చేసిన పని సునాక్ను విమర్శలకు గురిచేసింది. ఇక, అక్షత మూర్తికి ఇప్పటికీ భారత పౌరసత్వమే ఉంది. కాగా, వేరే దేశంలో స్థిర నివాసం ఉన్న వారికి బ్రిటన్లో నాన్-డొమిసైల్ పన్ను హోదా కల్పిస్తారు. ఇది పొందిన వారు విదేశాల్లో తాము ఆర్జించే ఆదాయానికి బ్రిటన్లో పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని అక్షతా మూర్తి పన్నులు కట్టకుండా ఎగవేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపై.. కొద్ది రోజుల క్రితం అక్షతా మూర్తి ప్రతినిధి స్పందిసూ.. తాము చట్టప్రకారం బ్రిటన్లో చేస్తున్న వ్యాపారాలకు పన్ను చెల్లిస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. ☕️ After his shock resignation last night, Rishi Sunak's wife Akshata Murthy brings out a round of tea for journalists waiting for him to show his face. pic.twitter.com/Yt8ldN2aX9 — ITV News Calendar (@itvcalendar) July 6, 2022 ఇది కూడా చదవండి: రోడ్డుపైకొచ్చిన బోరిస్ మైనపు విగ్రహం.. ఫోటోలు వైరల్ -
యంగ్ పైలట్ మృతి.. చిన్న దోమ ఎంత పనిచేసింది!
చిన్న దోమనే కదా అని లైట్ తీసుకున్నారో అంతే సంగతి. దోమ కారణంగా ఓ పైలట్ మృతి చెందింది. అదేంటి దోమతో ఎలా చనిపోయింది అనుకుంటున్నారా..?. ఈ విషాద ఘటన బ్రిటన్లో చోటుచేసుకుంది. అయితే, ఏడాది క్రితం సదరు పైలట్ మృతిచెందగా నివేదిక తాజాగా బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. బ్రిటన్కు చెందిన ట్రెయినీ పైలట్ ఓరియానా పెప్పర్ దోమ కాటు కారణంగా కంటిపై చిన్న వాపు కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో, ఆమెకు వైద్యులు యాంటీబయోటిక్స్ టీకాలు ఇచ్చి ఇంటికి పంపించారు. కాగా.. రెండు రోజుల తర్వాత ఆమె.. ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోయింది. దీంతో ఆందోళనలకు గురైన కుటుంబ సభ్యులు.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. అనంతరం మృతిచెందింది. కాగా, ఆమె మృతి మిస్టరీ కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తాజాగా నివేదికను వెల్లడించారు. దోమకాటు కారణంగా శరీరంలో తలెత్తిన ఇన్ఫెక్షన్ మెదడుకు చేరిన కారణంగా ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా వైద్యులు.. చిన్న వయస్సులో ఆమె ఇలా దోమకాటుతో చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇలా కొద్ది మందికే జరుగుతుందని అన్నారు. British pilot trainee dies after mosquito bite leads to infection in brain: reports https://t.co/TuuK5TNDxO pic.twitter.com/oVqhwx9cvA — New York Post (@nypost) July 6, 2022 ఇది కూడా చదవండి: జఫ్పా కేక్.. రికార్డులు బ్రేక్.. పేరు డిఫరెంట్గా ఉన్నా... టేస్ట్ మాత్రం సూపర్ -
సాగరంలో సౌరవిహారం..
ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు ప్రపంచం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాల జోరు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. సౌరశక్తితో నడిచే వాహనాలు కూడా కొన్నిచోట్ల నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. తాజాగా బ్రిటన్కు చెందిన జాహా హాడిడ్ ఆర్కిటెక్ట్స్ సంస్థ వందశాతం సౌరశక్తితో పనిచేసే 42 మీటర్ల పొడవైన విలాసవంతమైన నౌకను రూపొందించింది. ఈ నౌక పైకప్పుపై అమర్చిన సోలార్ ప్యానెల్స్ ఇందులోని బ్యాటరీలను నిరంతరం చార్జ్ చేస్తుంటాయి. ఫలితంగా పొద్దుగూకిన తర్వాత కూడా ఈ బ్యాటరీలు భేషుగ్గా పనిచేస్తాయి. మామూలు ఇంధనంతో పనిచేసే నౌకలు దాదాపు 40 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఈ సౌరనౌక నుంచి కార్బన్ డయాక్సైడ్ ఏమాత్రం విడుదల కాదు. ఇలాంటి వాహనాలు విరివిగా వినియోగంలోకి తెస్తే, ఉద్గారాల జోరుకు కళ్లాలు వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
చికుబుకు చికుబుకు రైలు.. కొత్త సమస్య ఎదురయ్యేను చూడూ...
బుల్లెట్ రైళ్ల యుగం వచ్చినా ఇప్పటికీ స్టీమ్ ఇంజన్తో నడిచే హెరిటేజ్ రైళ్లకు ఆదరణ తగ్గలేదు. రెగ్యులర్ ప్రయాణికులు తగ్గిపోయినా టూరిజం, సినిమా షూటింగుల పరంగా హెరిటేజ్ రైళ్లకు ఫుల్ గిరాకీ ఉంది. ముఖ్యంగా బ్రిటన్ దేశంలో హెరిటేజ్ రైళ్లు ఇప్పటికీ పట్టాలపై చుక్బుక్ చుక్బుక్ అంటూ పరుగులు పెడుతున్నాయి. ఈ సర్వీసులకు ఇప్పుడు ఊహించని రీతిలో సమస్యలు వచ్చి పడ్డాయి. మన దగ్గర ప్యాలెస్ ఆన్ వీల్స్ పేరుతో రాజస్థాన్లో స్టీమ్ ఇంజన్ రైలు నడుస్తోంది. ఇదే తరహాలో టూరిజం ప్రత్యేక ఆకర్షణగా ప్రపంచంలోనే అత్యధికంగా హెరిటేజ్ సర్వీసులు బ్రిటన్లో నడుస్తున్నాయి. ఈ రైళ్లు నడిచేందుకు ఇంధనంగా బొగ్గును ఉపయోగిస్తారు. రైళ్లలో ఉపయోగించేందుకు అవసరమైన బొగ్గును సౌత్ వేల్స్లో ఉన్న ఫ్రోస్ వై ఫ్రాన్ మైనింగ్ సంస్థ ఉత్పత్తి చేసేది. ఈ మైన్ కాలపరిమితి కంటే ముందుగానే 2022 జనవరిలో ఇక్కడ కార్యకలాపాలు ఆగిపోయాయి. మరోవైపు హెరిటేజ్ రైళ్లకు అవసరమైన బొగ్గులో కొంత మొత్తాన్ని రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచి బ్రిటన్ దిగుమతి చేసుకునేది. కాగా ఫ్రిబవరిలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలవడంతో అక్కడి నుంచి కూడా దిగుమతి ఆగిపోయింది. దీంతో హెరిటేజ్ రైళ్లకు అవసరమైన బొగ్గు తగ్గిపోయింది. ప్రస్తుతం ఉన్న నిల్వలు 2022 మే 31 వరకే సరిపోతాయని అక్కడి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ముగియని పక్షంలో మరో నెల రోజులకు మించి ఈ రైళ్లను నడిపించే పరిస్థితి లేదంటున్నాయి బ్రిటన్లోని హెరిటేజ్ రైల్ సర్వీసెస్ అందిస్తున్న కంపెనీలు. బొగ్గు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ ఇంత వరకు ఎక్కడ సానుకూల ఫలితాలు కనిపించడం లేదంటున్నాయి. చదవండి: ఏడాది కాలంలో రికార్డ్ స్థాయిలో పెరిగిన సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు..ఎందుకంటే! -
ఆర్థిక మంత్రికే కాంటాక్ట్లెస్ చెల్లింపు కష్టాలు.. వీడియో వైరల్
He Scan His Bank Card On A Bar Code: చాలా పెద్ద హోదాలోని వ్యక్తులు ఒక్కొసారి తికమక పడో లేక కన్ఫ్యూజ్ అవ్వడం వల్లే చాలా తెలివతక్కుగా ప్రవర్తిస్తుంటారు. అది కూడా చాలా సింపుల్ విషయాల్లో చేస్తుంటారు. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఎంత విచిత్రమైన పని చేశాడో చూడండి. వివరాల్లోకెళ్తే...బ్రిటిష్ ఆర్థిక మంత్రి రిషి సునక్ కాంటాక్ట్లెస్ చెల్లింపులతో ఇబ్బందులు పడ్డారు. ఆయన ఒక దుకాణానికి వెళ్లి కోకాకోలా టిన్ని కొన్నారు. బిల్ పే చేసేటప్పడూ మనం కొన్న వస్తువును దుకాణదారుడు బార్కోడ్ మిషన్తో స్కాన్ చేయడం సహజం. అయితే ఆ మంత్రి బార్కోడ్ మిషన్ వద్ద తన ఏటీఎం కార్డుని పెడతారు. దీంతో సదరు దుకాణదారుడు సార్ కోకాకోలాని పెట్టండి అని అంటాడు. ఇంతకీ రిషి ఎవరంటే...రిచ్మండ్కు చెందిన కన్జర్వేటివ్ పార్లమెంటు సభ్యుడు మాత్రమే గాక తదుపరి ఎన్నికల్లో ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్థానంలో బుక్మేకర్లకు ఇష్టమైన వ్యక్తి కూడా. అంతేకాదండోయ్ ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి భర్త కూడా. chancellor of the exchequer doesn’t know how to use contactless my head’s gone pic.twitter.com/h2yBKVMu2K — lucy (@LMAsaysno) March 23, 2022 (చదవండి: పెంపుడు కుక్క ఐతే మాత్రం మరీ ఇలాంటి పేరా!... మండిపడతున్న నెటిజన్లు) -
అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చిన రష్యా!
మాస్కో: ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో రష్యా ఉపగ్రహాల ప్రయోగాలను నిలిపివేస్తున్నట్టుగా బ్రిటిష్ శాటిలైట్ కంపెనీ వన్వెబ్ వెల్లడించింది. కజికిస్తాన్ నుంచి ప్రయోగించే అన్ని ఉపగ్రహ ప్రయోగాలు నిలిపివేస్తున్నట్టుగా బ్రిటన్ శాటిలైట్ కంపెనీ స్పష్టం చేసింది. మరోవైపు రష్యా తమ దేశ అంతరిక్ష రాకెట్ సూయజ్ నుంచి అమెరికా, బ్రిటన్, జపాన్ జాతీయ జెండాలను తొలగించింది. భారత్ జెండాను మాత్రం అలాగే ఉంచింది. రష్యా అంతరిక్ష ఏజెన్సీ చీఫ్ ద్విమిత్రి రోగోజిన్ దీనికి సంబంధించిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. కొన్ని దేశాల జెండాలు లేకపోతే తమ నౌక మరింత అందంగా కనిపిస్తోందని అన్నారు. మరోవైపు అమెరికాకు రాకెట్ ఇంజన్ల సరఫరాను నిలిపివేస్తున్నట్టుగా రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్పై దాడి చేసినందుకు అగ్రరాజ్యం ఆర్థిక ఆంక్షలు విధించడంతో దానికి ప్రతిగా రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల్లో రాకెట్ ఇంజిన్లను అమెరికాకు పంపిణీ చేయలేమని ఆ దేశ అంతరిక్ష ఏజెన్సీ చీఫ్ ద్విమిత్రి రోగోజిన్ చెప్పారు. అమెరికా తాను తయారు చేసే చీపురు కట్టలపై ఎగరాలంటూ ఎగతాళి చేశారు. 1990 నుంచి ఇప్పటివరకు రష్యా 122ఆర్డీ–180 ఇంజన్లను అగ్రరాజ్యానికి పంపిణీ చేసింది. ఇప్పుడు ఆ రాకెట్ ఇంజన్ల సర్వీసును కూడా నిలిపివేస్తున్నట్టుగా రోగోజిన్ స్పష్టం చేశారు. (చదవండి: తట్టుకుని నిలబడతాం!... ఉక్రెయిన్ని పునర్నిర్మిస్తాం) -
ఉక్రెయిన్ పిల్లలే మిమ్మల్ని రక్షిస్తున్నారు!’
లండన్: పుతిన్ యుద్ధోన్మాదం నుంచి తమను కాపాడేందుకు పాశ్చాత్య దేశాలు ఎందుకు ముందుకు రావడం లేదని డారియా కాల్నిక్ అనే ఉక్రెయిన్ మహిళా జర్నలిస్టు ఆవేదనతో ప్రశ్నించారు. పోలాండ్ ఒక భేటీలో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ను ఈ మేరకు నిలదీశారు. ఉక్రెయిన్ ప్రజలను రక్షించేందుకు ఆయన భయపడుతున్నారరు. ఉక్రెయిన్ను నో ఫ్లై జోన్గా నాటో ప్రకటించకపోవడంతో తమ పిల్లలు, మహిళలు వైమానిక దాడులకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఒకరకంగా మా పిల్లలు బలై మిమ్మల్ని కాపాడుతున్నారు. వారి చాటున నాటో దాక్కుంటున్నట్టే లెక్క’ అని దుయ్యబట్టారు. అయితే జాన్సన్, చేయగలిగిందంతా చేస్తానని, నేరుగా సైన్యాన్ని పంపలేనని ఆమెకు సమాధానం ఇచ్చారు. Ukrainian journalist makes emotional plea to Boris Johnson. Pleas for NATO cover on the border to allow refugees cross safely, asks why Abramovich and Putin’s children she claims are in London and the EU are not sanctioned while people in Ukraine dying pic.twitter.com/KGxL0VwzVY — Lisa O'Carroll 🇺🇦 (@lisaocarroll) March 1, 2022 -
ఉక్రెయిన్ బంధువులకు యూకే వీసాలు
లండన్: వలసబాట పట్టిన ఉక్రెనియన్లు తమ దేశానికి రావచ్చంటూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. యూకేలో సమీప బంధువులుంటే వారికి వీసాలను అందజేస్తామని తెలిపారు. ఉక్రెయిన్కు బ్రిటన్ 40 మిలియన్ పౌండ్లు విలువైన వైద్య పరికరాలు, మందులు వంటి కనీస అవసరాలను అందజేస్తామని ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్కు అందజేసే సాయం మొత్తం 140 మిలియన్ పౌండ్లకు చేరుకుంది. -
అవాక్కయ్యే విషయం: ఒక సగం ఆడ.. మరో సగం మగ
Dual Gender Stick Insect That Is Half Male And Half Female: ఈ ఫొటోలో ఉన్నది చార్లీ. మిడతలాంటి కీటకం. గ్రీన్బీన్ స్టిక్ ఇన్సెక్ట్ అని పిలుస్తారు. బ్రిటన్కు చెందిన లారెన్ గార్ఫీల్డ్ దాన్ని పెంచుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు చార్లీ శరీరం రంగు మారడం మొదలైంది. ఇదేమిటా అని శాస్త్రవేత్తలకు చూపిస్తే.. అవాక్కయ్యే విషయం బయటపడింది. ఎందుకంటే చార్లీ ఒక సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు. సాధారణంగా ఈ రకం కీటకాల్లో మగవి ముదురు గోధుమ రంగులో చిన్నవిగా, ఆడవి లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దవిగా ఉంటాయి. చార్లీ ఆడకీటకంలా పెద్ద సైజులో ఒకవైపు ఆకుపచ్చ రంగులో ఉండగా, మరోవైపు ముదురు గోధుమ రంగులో మగ కీటకం లక్షణాలు ఉన్నాయి. ఈ తరహా కీటకాల్లో ఈ లక్షణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తేల్చడంతో.. పరిశోధనల కోసం లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చేశాడు. -
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో!
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అనేక దేశాలు చాలా రోజుల నుంచి పోటీ పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ జాబితాలో ముందు వరుసలో చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. అయితే, ఈ దేశాల కంటే ముందే చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్.. బిజినెస్ కోసం ఒక సూపర్ సోనిక్ జెట్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. చైనా ఏరోస్పేస్ సంస్థ అభివృద్ది చేస్తున్న సూపర్ సోనిక్ జెట్ విమానం గంటలో చైనా రాజధాని బీజింగ్ నుంచి న్యూయార్క్ నగరాన్ని చేరుకొనున్నట్లు తెలిపింది. ఇది గంటకు 2,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ జెట్ వాణిజ్య విమానాల కంటే ఆరు రెట్లు వేగం వెళ్లనున్నట్లు వివరించింది. స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ గత ఏడాది తన సూపర్ సోనిక్ జెట్ విమానం కోసం 46.3 మిలియన్ డాలర్లను ఫండ్ కూడా సేకరించినట్లు తెలిపింది. టియాన్క్సింగ్ 1, టియాన్క్సింగ్ 2 అని పిలిచే ఈ విమానాలను విజయవంతంగా పరీక్షించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు. స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ 2024లో తన మొదటి ఫ్లైట్ టెస్ట్ నిర్వహించడానికి ముందు 2023 చివరి నాటికి గ్రౌండ్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇదే మొదటి కాదు ఇదే మొదటి సూపర్ సోనిక్ విమానం మాత్రం కాదు. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ దేశానికి చెందిన విమాన తయారీ సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్మించిన మొదటి కాంకార్డ్ సూపర్ సోనిక్ వాణిజ్య విమానాన్ని 1973 సెప్టెంబరు 26న అందుబాటులోకి తీసుకొని వచ్చాయి. 1976 జనవరి 21న ప్రపంచంలోని మొట్టమొదటి షెడ్యూల్డ్ సూపర్ సోనిక్ విమానం ప్యాసింజర్ సేవలను కూడా ప్రారంభించింది. ఈ జెట్లను బ్రిటిష్ ఎయిర్ వేస్, ఎయిర్ ఫ్రాన్స్ విస్తృతంగా ఉపయోగించాయి. అయితే, విమానం శబ్దం ఎక్కువగా రావడం, నిర్వహణ వ్యయం కూడా ఎక్కువ కావడంతో వాటి సేవలను నిలిపి వేయాల్సి వచ్చింది. చివరకు మే 2003లో ఎయిర్ ఫ్రాన్స్, అక్టోబర్ 2003లో బ్రిటిష్ ఎయిర్ వేస్ కాంకార్డ్ సేవలను నిలిపి వేశాయి. (చదవండి: లాంఛ్కు ముందే బుకింగ్కు టయోటా బ్రేకులు!) -
ఓలాకు పోటీగా తెలంగాణలో భారీ ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్..!
ప్రముఖ బ్రిటన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ వన్ మోటో ఓలాకు పోటీగా తెలంగాణలో భారీ ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనపూర్వక ఒప్పందం(ఎంఒయు) కుదర్చుకుంటున్నట్టు తెలిపింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివార్లలోని 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్ను నిర్మించనున్నారు. ఇక్కడ కొత్త తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఈ కంపెనీ బ్రాండ్ ₹250 కోట్ల మేర పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి సెమీ-రోబోటిక్స్ వంటి అదునాతన యంత్రాలతో కర్మాగారం నిర్మిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో ప్రకటించింది. 3 స్కూటర్లను లాంచ్ చేసిన కంపెనీ ఈ బ్రిటన్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గత రెండు నెలల కాలంలోనే తన మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి స్పెసిఫికేషన్స్ చూస్తే ఇతర కంపెనీలకు పోటీ ఇచ్చే విధంగా ఉన్నాయి. వన్ మోటో తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలెక్టాను ధర రూ.2 లక్షలు(ఎక్స్ షోరూమ్)కు మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్ళే సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ కంపెనీ మరొక మోడల్ బైకా ధర ₹1.80 లక్షలు కాగా, కమ్యుటా ఈ మూడింటిలో అత్యంత సరసమైనది ₹1.30 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. ఈ సందర్భంగా వన్ మోటో ఇండియా సీఈఒ శుభంకర్ చౌదరి మాట్లాడుతూ.. "కొత్త తయారీ ప్లాంట్తో మేము భారతదేశంలోని వినియోగదారులకు సేవలందించడమే కాకుండా, వన్ మోటో అభివృద్ధి చేస్తున్న వాహనలను ఇతర ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. కేవలం తయారీ కేంద్రంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు సృష్టించడానికి ఇది అద్భుతమైన అవకాశం. ఈవీ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కోసం ప్రత్యేక నైపుణ్యం గల మానవ వనరులు అవసరం గనుక మేం రాష్ట్రంతో నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తాం. ఈ-మొబిలిటీని ప్రోత్సహించే దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ఎదురు చూస్తున్నాము. ఈ ప్లాంట్ వల్ల రాష్ట్రంలో దాదాపు 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 2000 మందికి పరోక్ష ఉద్యోగాలను రానున్నట్లు " అన్నారు. (చదవండి: బంపరాఫర్..! ఉచితంగా రూ. 20 వేల విలువైన 5జీ స్మార్ట్ఫోన్...!) -
రెండేళ్లలో ఫ్రాన్స్, బ్రిటన్ను అధిగమించనున్న భారత్..
లండన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది మొట్టమొదటిసారి 100 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ (సీఈబీఆర్)తాజాగా ఈ అంచనాలను వెలువరించింది. నిజానికి ఈ స్థాయిని ప్రపంచ ఎకానమీ 2024కు అందుకుంటుందని తొలుత సీఈబీఆర్ అంచనావేసింది. ఇక 2030 నాటికి చైనా ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికాను పక్కకునెట్టి ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందని సీఈబీఆర్ అంచనావేసింది. ఈ విషయంలో అంచనాలకన్నా చైనా రెండేళ్లు వెనకబడిందని నివేదిక వివరించింది. కాగా, 2021లో 194 దేశాల ఆర్థిక వ్యవస్థల పరిమాణం దాదాపు 94 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ప్రపంచ ఆర్థిక పరిమాణంపై తాజా సీఈబీఆర్ అంచనా ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాలకు అనుగుణంగా ఉండడం గమనార్హం. వచ్చే రెండేళ్లలో ఫ్రాన్స్, బ్రిటన్ను అధిగమించనున్న భారత్.. నివేదిక ప్రకారం, భారత్ ఎకానమీ 2022లో ఫ్రాన్స్ను అధిగమించనుంది. తద్వారా ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 2023లో బ్రిటన్ను మించి పైకి ఎదిగే అవకాశం ఉంది. 2030 నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలుంది. అత్యధిక వృద్ధితో ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక 2023లో జర్మనీ ఆర్థిక వ్యవస్థ జపాన్ను అధిగమించవచ్చని, 2036లో రష్యా ప్రపంచంలో పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందవచ్చని, 2034లో ఇండోనేషియా ప్రపంచంలో తొమ్మిదివ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే వీలుందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా తొలి పది స్థానాల్లో అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, కెనడా, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణమే అతిపెద్ద సమస్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు ప్రస్తుతం ద్రవ్యోల్బణమే ప్రధాన సమస్య కానుందని నివేదిక విశ్లేషించింది. అమెరికా, చైనాల్లో ద్రవ్యోల్బణం దశాబ్దాల గరిష్ట స్థాయిలకు చేరడం గమనార్హమని వివరించింది. దీనితో వడ్డీరేట్ల పెరుగుదల పలు దేశాల్లో మొదలుకావచ్చని విశ్లేషించింది. మాంద్యంలోకి జారిపోకుండా ఆర్థిక వ్యసస్థలను కాపాడుకోవడం ప్రపంచ ఎకానమీలకు పెను సవాలుగా ఉంటుందని వివరించింది. చదవండి: భవిష్యత్లో కరెన్సీ మాయం..పెత్తనం అంతా బిట్ కాయిన్లదే! -
అదిరిపోయిన బ్రిటన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. హెడ్ ఆఫీస్ మన హైదరాబాద్లోనే!
యూకేకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వన్ మోటో గ్లోబల్ భారత మార్కెట్లలోకి మరో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలెక్టాను లాంచ్ చేసింది. గత నెలలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల(బైకా, కామ్యూటా) మోడల్స్ను లాంచ్ చేసిన వన్ మోటో తాజాగా తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలెక్టాను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ.2 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. గత రెండు మోడల్స్తో దీని ధర ఎక్కువగానే ఉన్న ఫీచర్స్ వాటి కంటే చాలా బాగున్నాయి. ఈ బైక్స్ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. జియో ఫెన్సింగ్, ఐవోటి, బ్లూటూత్, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, మొబిలీటీ ట్రాకింగ్, బ్యాటరీ స్వాప్ అప్షన్స్తో రానున్నాయి. వన్ మోటో గ్లోబల్ ఇండియాలో అధికారికంగా హైదరాబాద్లో తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇది 72వోల్ట్, 45 అంపియర్ గల డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేయడానిక్ నాలుగు గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్ళే సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. (చదవండి: 2022లో పెరగనున్న కార్లు, బైక్స్ కంపెనీల జాబితా ఇదే..!) దీనిలో 4కెడబ్ల్యు క్యూఎస్ బ్రష్ లెస్ డీసీ హబ్ మోటార్ ఉంది. ఇది మ్యాట్ బ్లాక్, షైనీ బ్లాక్, బ్లూ, రెడ్, గ్రే రంగులలో లభిస్తుంది. ఇందులో డిస్ ప్లే అనలాగ్ రూపంలో ఉంటుంది. ఇది హైడ్రాలిక్ డిస్క్ బ్రేకులతో వస్తుంది. మోటార్, కంట్రోలర్, బ్యాటరీపై మూడు సంవత్సరాల వారెంటీ కూడా ఉంది. ఎలెక్టా ప్రస్తుతం కంపెనీ నుంచి అత్యంత ఖరీదైన మోడల్. ఈ కంపెనీ మరొక మోడల్ బైకా ధర ₹1.80 లక్షలు కాగా, కమ్యుటా ఈ మూడింటిలో అత్యంత సరసమైనది ₹1.30 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది.