custody
-
గచ్చిబౌలి కాల్పుల కేసు.. బస్సులో పరిచయం.. సీన్ కట్ చేస్తే
సాక్షి, హైదరాబాద్: ప్రిజం పబ్బు కాల్పుల కేసులో బత్తుల ప్రభాకర్ను గచ్చిబౌలి పోలీసులు 7 రోజుల కస్టడీ కోరారు. కస్టడీ పిటిషన్పై కోర్టు.. సోమవారం విచారణ చేయనుంది. ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిన్న(గురువారం) సాఫ్ట్వేర్ రంజిత్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. . ప్రభాకర్కు రంజిత్ బస్సులో పరిచయం అయ్యాడు. ప్రభాకర్కు బ్యాంక్ అకౌంట్లు సమకూర్చి హెల్ప్ చేసిన రంజిత్.. ఇద్దరు బీహార్కు వెళ్లి గన్స్ కొనుగోలు చేశారు. ప్రభాకర్ అరెస్ట్తో పారిపోయిన రంజిత్ను నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదీ జరిగింది..పశ్చిమగోదావరి జిల్లాలోని గోపవరం గ్రామానికి చెందిన మిన్నీ రంజిత్ 2022లో రాజమండ్రిలో ఓ ఆర్టీసీ బస్సులో బత్తుల ప్రభాకర్కు పరిచయమయ్యాడు. ఈ నెల 1వ తేదీన ప్రభాకర్, రంజిత్, రోహిత్లు కారులో బీర్లు తాగుతూ ఐటీ కారిడార్లో తిరిగారు. ఈ క్రమంలో కారు బ్రేక్డౌన్ కావడంతో గ్యారేజ్కు వెళ్లారు. ఆ సమయంలోనే ప్రభాకర్ ఫోన్చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రీజం పబ్కు వెళ్లాడు. ఊహించని రీతిలో పోలీసులు పట్టుకోవడంతో కాల్పులు జరపగా, హెడ్కానిస్టేబుల్ వెంకట్రెడ్డికి గాయాలైన విషయం తెలిసిందే. బిహార్లో ఉద్యోగం చేస్తున్న రంజిత్కు 2023లో ఐటీ కారిడార్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది. కేపీహెచ్బీలో ఉంటున్న సమయంలో తరచుగా ప్రభాకర్ అతని వద్దే ఉండేవాడు. అక్కడి నుంచి రంజిత్ వట్టినాగులపల్లిలోని ఓ అపార్ట్మెంట్కు వెళ్లాడు. అక్కడ ఇరుకుగా ఉందని చెప్పి నార్సింగిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్ను రంజిత్ పేరిట బత్తుల ప్రభాకర్ అద్దెకు తీసుకున్నారు. కొద్ది నెలల తర్వాత ఒడిశాకు చెందిన ఓ యువతితో ప్రభాకర్ సహజీవనం చేశాడు.ఇదీ చదవండి: మమత హత్య కేసు.. వీడిన మిస్టరీదీంతో రంజిత్ గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో స్నేహితుడు రోహిత్తో కలిసి ఉంటున్నాడు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని నమ్మించి రంజిత్ క్రెడిట్ కార్డులు ఉపయోగించుకొని ఆ తర్వాత డబ్బు తిరిగిఇచ్చేవాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడటంతో రంజిత్ యూపీఐలు, క్రెడిట్ కార్డులను ప్రభాకర్ వాడుకున్నాడు. రంజిత్ పేరిట కొనుగోలు చేసిన కారులోనే పబ్లు, జిమ్లకు వెళ్లేవారు.గన్లు కావాలని అడగ్గా, రంజిత్ బిహార్లో తనకు తెలిసిన వారిని పరిచయం చేశాడు. వారి ద్వారా మూడు కంట్రీమేడ్ గన్లను ప్రభాకర్ కొనుగోలు చేశాడు. గన్ల కొనుగోలులో రంజిత్ ప్రమేయం ఉండటం, బ్యాంక్ లావాదేవీలు రంజిత్ ద్వారానే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు కారులో రంజిత్తో పాటు రోహిత్ కూడా ఉన్నాడని, ప్రభాకర్ లావాదేవీలు, చోరీల్లో అతని ప్రమేయం లేదని పోలీసులు వెల్లడించారు. ఏ 2 రంజిత్ నుంచి కారు, కేటీఎం బైక్, ఫోన్, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. -
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
అతుల్ సుభాష్ కేసులో దాఖలైన ఓ పిటిషన్పై దేశసర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనవడిని తమకు అప్పగించాలంటూ అతుల్ తల్లి అంజు దేవి వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో.. నాలుగేళ్ల అతుల్ కొడుకు ఎక్కడ ఉన్నాడన్నదానిపై నిఖితా సింఘానియా తరఫు న్యాయవాది స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఫరిదాబాద్(హర్యానా)లోని బోర్డింగ్స్కూల్లో చదువుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం నిఖిత షరతులతో బెయిల్ మీద ఉన్న దృష్ట్యా.. ఆ పిల్లాడిని బెంగళూరుకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపాడాయన. అయితే.. వచ్చే విచారణ టైంలో ఆ చిన్నారిని కోర్టులో ప్రవేశపెట్టాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్సింగ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అయితే..అంజు దేవీ(Anju Devi) తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆరేళ్లలోపు పిల్లలను బోర్డింగ్ స్కూల్కు పంపడం ఎడ్యుకేషన్ గైడ్లైన్స్కు విరుద్ధమని, కాబట్టి అతని సంరక్షణను నాయనమ్మకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుని.. ‘‘ఆ చిన్నారి నాయనమ్మతో గడిపిన సమయం చాలా తక్కువ. ఒకరకంగా చూసుకుంటే పిటిషనర్ ఆ పిల్లాడికి కొత్త ముఖమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో.. అంజుదేవి తరఫు లాయర్ గతంలో ఆ నానమ్మ-మనవడు కలిసి దిగిన ఫొటోలను బెంచ్కు సమర్పించారు.అయితే నిఖితా సింఘానియా(Nikita Singhania) ఈ కేసులో దోషిగా ఇంకా నిరూపించబడాల్సి ఉందని, కేవల మీడియా కథనాల ఆధారంగా ఆమెను దోషిగా గుర్తించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున పిల్లాడి సంరక్షణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉందని పేర్కొంటూ.. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.ఉత్తర ప్రదేశ్కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్ను భార్య స్వస్థలం జౌన్పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో..మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్(Atul Subash) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. అయితే.. వాళ్లకు కోర్టు తాజాగా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఒకవైపు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో, మరోవైపు కర్ణాటక హైకోర్టులో.. ఇంకోవైపు సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. -
నిఖేశ్ లీలలు ఇన్నిన్ని కాదయా!
సాక్షి, హైదరాబాద్: అనతి కాలంలో అంతులేని అవినీతితో వందల కోట్లకు పగడలెత్తిన నీటి పారుదల ఏఈఈ నిఖేశ్కుమార్ లీలలు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోతున్నారు. తనవద్దకు పనికోసం వచ్చిన ప్రజలతోపాటు చిన్ననాటి స్నేహితులు, సొంత కుటుంబ సభ్యులను కూడా ఆయన మోసగించిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.తన మిత్రులు, కుటుంబ సభ్యులకు తెలియకుండానే వారిని నిఖేశ్ బినామీ లుగా మార్చు కున్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన నిఖేశ్కుమార్ను.. ఏసీబీ అధికారులు వరుసగా మూడో రోజు శనివారం కూడా ప్రశ్నించారు. చిన్న పని ఉందంటూ.. అవినీతిలో నిఖేశ్కుమార్ స్టైలే వేరుగా ఉన్నది. తన పదేళ్ల ఉద్యోగ జీవితంలో ఆయన 2020 – 2024 మధ్యే ఎక్కువ ఆస్తులు పోగేశాడు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగా పీక్లో ఉన్నప్పుడు ఆయన గండిపేట్లో పనిచేశాడు. అక్కడ రియల్ ఎస్టేట్ నిర్మాణాల కోసం అనుమతులు ఇవ్వటంలో కీలకంగా మారాడు. ఫీల్డ్ లెవల్ ఆఫీసర్ కాబట్టి ఏ స్థలం ఎఫ్టీఎల్లోకి వస్తుంది..ఏది రాదు అన్నది ఆయనే మార్క్ చేయాల్సి ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి కోట్లలో డబ్బులు గుంజాడు. ఒక్కో ఫైల్ క్లియర్ చేసేందుకు లక్షల్లో లంచంగా తీసుకున్నాడు. నగదు రూపంలో మాత్రమే లంచాలు తీసుకొనేవాడు. ఆ డబ్బును స్థిరాస్తులుగా మార్చుకోవడానికి తన చిన్ననాటి స్నేహితులను వాడడం ప్రారంభించాడు. ఏదో ఒక సాకుతో, లేదంటే చిన్న పని ఉందని చెప్పి తన ఇంటర్మీడియెట్ స్నేహితుల నుంచి ఆధార్కార్డులు, పాన్కార్డులు తీసుకున్నాడు. తన సొంత అన్న, ఇతర కుటుంబ సభ్యుల ఆధార్, పాన్ కార్డులను కూడా తీసుకుని ఆస్తుల కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.లా బినామీలను పిలిచి విచారించగా.. ‘అసలు మేం ఎప్పుడు ఈ ఆస్తులు కొన్నాం? మాకు ఏమీ తెలియదు? ఏదో పని ఉందని మా దగ్గరి నుంచి ఆధార్కార్డు, పాన్కార్డులు తీసుకున్నాడు’ అని వారు సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇంకా చదువులు కూడా పూర్తికాని తన కుటుంబ సభ్యుల పేర్లమీద కూడా కొన్ని ఆస్తులు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. సాక్షుల స్టేట్మెంట్లు రికార్డు సోదాల్లో భాగంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను విశ్లేషించిన ఏసీబీ అధికారులు.. వాటి గురించి నిఖేశ్ను గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలను ఆయన ముందుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిఖేశ్కుమార్ ఆస్తులు కొనుగోలు చేసిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను పిలిచి, వారి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. మైలాన్, బ్లిస్, కపిల్ ఇన్ఫ్రా కంపెనీల్లో నిఖేశ్కుమార్ మొత్తం నగదు రూపంలోనే పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. పలు బ్యాంకు లాకర్లలో నిఖేశ్ దాచి ఉంచిన బంగారం ఇతర ఖరీదైన వస్తువులు, ఆస్తుల పత్రాలపైనా వివరాలు సేకరించారు. కాగా నిఖేశ్ను ఏసీబీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఇచ్చిన గడువు ఆదివారంతో ముగియనున్నది. -
ACB కస్టడీలో ఇరిగేషన్ AEE నిఖేష్
-
బాబా సిద్ధిఖీ హత్య కేసు: నిందితుడికి 7 రోజుల కస్టడీ
ముంబై: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం హత్యకు గురయ్యారు. ఆయనపై జరిగిన కాల్పుల కేసులో నిందితుడు గుర్మైల్ సింగ్ను ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో ఆదివారం హాజరుపర్చగా.. అక్టోబర్ 21 వరకు ముంబై క్రైమ్ బ్రాంచ్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసులో నిందితులైన గుర్మైల్ సింగ్(23), ధర్మరాజ్ సింగ్ కశ్యప్(17)లను ముంబై పోలీసులు ఈరోజు ఉదయం ముంబైలోని ఎస్ప్లానేడ్ కోర్టులో హాజరుపరిచారు. ఎస్ప్లానేడ్ కోర్టు రెండో నిందితుడు మైనర్ కావటంతో ఆసిఫికేషన్ టెస్ట్ చేసిన తర్వాత మళ్లీ తమ ముందు హాజరుపర్చాలని ఆదేశించింది. ఆసిఫికేషన్ టెస్ట్ అనేది.. వ్యక్తి ఎముకలను ద్వారా వయస్సును అంచనా వేసే వైద్య పరీక్ష. ఇద్దరు నిందితులను పోలీసులు ముంబై క్రైం బ్రాంచ్కు తరలించారు.Mumbai: One accused in Baba Siddique firing case sent to custody till October 21Read @ANI Story | https://t.co/DljJNa4h7x#BabaSiddique #MumbaiCourt pic.twitter.com/s9uXQAZ8nw— ANI Digital (@ani_digital) October 13, 2024 నిందితుల తరఫు న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు నిందితుడిని ఈరోజు కోర్టులో హాజరుపర్చారు. మేము దానిని వ్యతిరేకించాం. కోర్టుకు ఇవ్వగలిగిన ఆధారాలను ఇచ్చాం. కోర్టు ఆ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అక్టోబరు 21 వరకు కస్టడీ విధించింది. ఇక రెండో నిందితుడిని ఆసిఫికేషన్ టెస్ట్ తర్వాత మళ్లీ హాజరు పర్చాలని ఆదేశించింది. పోలీసులు 14 రోజుల కస్టడీకి అడిగారు. కానీ కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణ అవసరమని కోర్టు భావిస్తే కస్టడీని మరికొన్ని రోజులు పెంచే అవకాశం ఉంది’ అని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడిని గుర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నాలుగో నిందితుడి పేరు మహ్మద్ జీషన్ అక్తర్ అని వెల్లడించారు. ఇప్పటికే మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.మరోవైపు.. బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ముంబైలో శాంతిభద్రతల పరిస్థితిని దారుణం ఉందని..దానికి నిదర్శణమే బాబా హత్ అని మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. నేరాల విషయంలో మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్, బీహార్ మార్గంలో వెళుతుందని మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను రాజీనామా చేయాలని వాడెట్టివార్ డిమాండ్ చేశారు.చదవండి: బాబా సిద్ధిఖీ హత్య.. కేజ్రీవాల్ రియాక్షన్ -
ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్కు ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీ
కోల్కతా: కోల్కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్కతా కోర్టు ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ వారిని సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ కేసులో విచారించడానికి నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోల్కతా కోర్టును కోరింది. అయితే కోర్టు ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఇందులో ఒక నిందితుడైన అఫ్సర్ అలీ బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సందీప్ ఘోష్పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుపై కోల్కతా పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినప్పటికీ కలకత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సోమవారం సీబీఐ సోదాలు జరిపి అనంతరం అరెస్ట్ చేసింది. -
మనీలాండరింగ్ కేసైనా బెయిల్ ఇవ్వాల్సిందే : సుప్రీం కోర్టు
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసుల్లోను బెయిల్ అనేది ఒక రూల్ అని, జైలు మినహాయింపుగానే ఉండాలని సుప్రీంకోర్టు వెల్లడించింది. బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులో కస్టడీలో ఉన్నప్పుడు నిందితుడు దర్యాప్తు అధికారికి ఇచ్చిన నేరారోపణ ప్రకటన సాక్ష్యంగా అంగీకరించేందుకు వీలుకాదని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనుచరుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రేమ్ ప్రకాష్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.మనీష్ సిసోడియా బెయిల్ తీర్పు విషయంలో కూడా.. పీఎంఎల్ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం)లో బెయిల్ ఒక నియమం, జైలు మినహాయింపు అని తాము చెప్పినట్లు జస్టిస్ బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం గుర్తు చేసింది.ఇక.. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితురాలు కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన మరుసటి రోజు ప్రేమ్ ప్రశాష్ బెయిల్ మంజూరు అయింది. మరోవైపు.. ఈ నెల ప్రారంభంలో మనీలాండరింగ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు కూడా సుప్రీం బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. -
దర్శన్కు రాచమర్యాదలు.. ఏడుగురు జైలు అధికారుల సస్పెండ్
బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్కు బెంగళూరు జైలులో అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే వార్తలు ప్రస్తుతం హాట్టాపిక్గా మారాయి. అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ పక్కనే ఉన్న కొందరితో ముచ్చిటిస్తున్న ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలో తాజాగా వైరల్గా మారడంతో జైల్లో దర్శన్కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందనే వివాదం రాజుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది.దర్శన్కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. దర్శన్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.దర్శన్ ఫోటో, వీడియో విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ద్వారా ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారుల ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. జైల్లోని సీసీ కెమెరాలు, విచారణ తర్వాతే ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. అయితే జైలులో దర్శన్కు ఎలాంటి రాచమర్యాదలు జరగలేదని.. ఫోటో, వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుంది. ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్శన్ ఎపిసోడ్పై లోతుగా విచారణ చేపట్టిననట్లు పేర్కొన్నారు. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్కు మళ్లీ చుక్కెదురు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో భాగంగా సీఎం,ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ శనివారం(జూన్29) రౌస్ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ కేసులో కేజ్రీవాల్కు కోర్టు జులై 12 దాకా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్ను ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తర్వాత కేజ్రీవాల్ను 3 రోజులు సీబీఐ రిమాండ్కు కోర్టు అప్పగించింది. శనివారం ఈ రిమాండ్ ముగియడంతో శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు కేజ్రీవాల్ను జ్యుడీషియల్ రిమాండ్కు పంపించే విషయమై తొలుత తీర్పు రిజర్వు చేసిన కోర్టు కొద్దిసేపటి తర్వాత రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 21 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది. కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్గా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.కవిత కస్టడీ పొడిగించాలన్న సీబీఐ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేశారు. మరోవైపు, ఈ కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషిటును పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరింది. దీనిపై జులై 6న విచారణ చేపడతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
ఏసీబీ కస్టడీలో ఏసీపీ
-
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్లు కోరారు.కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చార్జిషీటుపై ఈడీ వాదనలు: కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లి మెంటరీ చార్జిషీటును పరి గణనలోకి తీసుకోవ డంపై దర్యాప్తు సంస్థ ప్రత్యే క కోర్టులో వాదనలు వినిపించింది. న్యాయవాది నవీన్ కుమార్ మట్టా వాదనలు వినిపిస్తూ.. కవిత, చారియట్ ప్రొడ క్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్కుమార్, చరణ్ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ల పాత్ర గురించి చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కవిత కాకుండా మిగిలిన వారి పాత్రపై వాదనలు విన్పించాలని సూచించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి అడి గిన ప్రశ్నలపై సమాధానానికి నవీన్ కుమార్ సమయం కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
బెంగళూరు: మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణకు బెంగళూరు కోర్టు రిమాండ్ విధించింది. ఆరు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు పంపింది. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డ మహిళను కిడ్నాప్ చేశారని రేవణ్ణపై కేసు నమోదైంది. ఈ కేసులో రేవణ్ణను ఇటీవలే సిట్ అరెస్టు చేసింది. తన తల్లిని కిడ్నాప్ చేయడమే కాక ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని కిడ్నాప్కు గురైన మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రేవణ్ణపై కేసు నమోదైంది. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే 20దాకా రౌస్ న్యూ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ కస్టడీని పొడిగించారు. మరోపక్క కేజ్రీవాల్కు మధ్యంత బెయిల్ ఇచ్చే అంశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం(మే7) విచారించింది. ఈ అంశంపై మళ్లీ మే 9వ తేదీన విచారిస్తామని లేదంటే వచ్చే వారం లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి అత్యున్నత కోర్టు సూచించింది. -
4 రోజులు సిట్ కస్టడీ
శివాజీనగర: లైంగిక దాడి, కిడ్నాప్ తదితర కేసుల్లో శనివారం రాత్రి అరెస్టయిన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్.డీ.రేవణ్ణను ప్రత్యేక తనిఖీ బృందం (ఎస్ఐటీ) అధికారులు రాత్రంతా విచారించారు. మరోవైపు ఆయనకు కోర్టు 4 రోజుల పాటు సిట్ కస్టడీకి అనుమతించింది. రాత్రి విచారణలో రేవణ్ణ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. మహిళ కిడ్నాప్కు నాకు సంబంధం లేదు. నేను ఎవరినీ కిడ్నాప్ చేయలేదు అని చెబుతున్నారని సిట్ వర్గాలు పేర్కొన్నాయి. అర్ధరాత్రి వరకు రేవణ్ణను మహిళ కిడ్నాప్ కేసులో కూలంకుషంగా విచారించారు. సిట్ చీఫ్, ఏడీజీపీ బీ.కే.సింగ్ బృందం విచారణలో పాల్గొంది. ఆరోపణలను రేవణ్ణ నిరాకరించారు. నేను ఆమెను కిడ్నాప్ చేయలేదు, ఎన్నికలు ఉన్న కారణాన ఆమె నా ఇంటికి వచ్చారు. ఆమె కొన్ని సంవత్సరాల నుండి నా ఇంట్లో పని చేస్తుండేవారు. ఆమె గురించి గాని, కిడ్నాప్ గురించి ఏమీ తెలియదు అని రేవణ్ణ చెప్పినట్లు సమాచారం. రాత్రి ఆయనను సిట్ ఆఫీసులోనే నిద్రపోనిచ్చారు. ఆదివారం కొన్ని ప్రశ్నలను అడిగి విచారణను కొనసాగించారు. సదరు మహిళపై రేవణ్ణ తనయుడు, ఎంపీ ప్రజ్వల్ అత్యాచారం చేశాడా?, ప్రజ్వల్ను తప్పించేందుకు ఆమెను కిడ్నాప్ చేయించారా? అనే కోణాలలో సిట్ విచారణ జరుపుతోంది. కస్టడీకి అనుమతి ఆదివారం సాయంత్రం కట్టుదిట్టమైన భద్రత మధ్య కోరమంగళలోని 17వ ఏసీఎంఎం కోర్టు జడ్జి రవీంద్ర కట్టిమని ఇంట్లో రేవణ్ణను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ కోసం ఆయనను వారంపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ న్యాయవాదులు కోరారు. జడ్జి ఆలకించి, 4 రోజుల పాటు.. అంటే 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సిట్ కస్టడీకి అనుమతించారు. దీంతో రేవణ్ణను సిట్ అప్పటివరకు విచారించే అవకాశముంది. రేవణ్ణ బెయిలు కోసం ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో బెయిలు అర్జీ సమర్పించారు. సోమవారం విచారణ జరగనుంది. ప్రజ్వల్ నివాసం సీజ్ ఎంపీ ప్రజ్వల్ ప్రభుత్వ నివాసానికి సిట్ అధికారులు తాళాలు వేశారు. ప్రజ్వల్కు హాసన్ ఆర్సీ రోడ్డులో ప్రభుత్వం కేటాయించిన నివాసం ఉంది. బాధితుల సమక్షంలో శనివారం రాత్రి మహజరు జరిపిన సిట్ అధికారులు నివాసానికి తాళం వేసి సీల్ వేశారు. తొలి అంతస్తు గదిలో అత్యాచారం జరిగిందనే ఆరోపణ వినిపించింది. ఇక్కడే నగ్న వీడియోలు రికార్డు చేసినట్లు అనుమానాలున్నాయి. ప్రజ్వల్ సిట్ విచారణకు వస్తారా?, రారా? అన్నది మిస్టరీగా మారింది. పాస్పోర్టును రద్దు చేయరెందుకు? దొడ్డబళ్లాపురం: ప్రజ్వల్, రేవణ్ణ కేసుల్లో బాధిత మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సుర్జేవాలా ఆదివారం తెలిపారు. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత 75 సంవత్సరాల్లో ఇలాంటి దారుణ సంఘటన జరగలేదని, బాధితులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని సుర్జేవాలా అన్నారు. ప్రధాని మోదీ ప్రజ్వల్ పాస్పోర్టును ఎందుకు రద్దు చేయలేదని, ఇంటర్పోల్ ద్వారా ఎందుకు బ్లూ కార్నర్ నోటీసు ఇవ్వలేదని ప్రశ్నించారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్గ్రూప్నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
ఆమే సూత్రధారి.. పాత్రధారి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకానొక సమయంలో బెదిరింపులకు కూడా పాల్పడ్డారంటూ సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శరత్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డిలను కవిత భయపెట్టినట్లు కోర్టుకు తెలిపింది. కుంభకోణంలో కవితను సూత్రధారి, పాత్రధారిగా పేర్కొంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కవితను ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మూడు రోజులపాటు కవితను సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. విజయ్నాయర్కు హవాలా రూపంలో డబ్బులు లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న కవితను శుక్రవారం అధికారులు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఐదు రోజుల పాటు కవిత కస్టడీ కోరుతూ సీబీఐ, సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది పంకజ్ వాదనలు వినిపిస్తూ.. ‘లిక్కర్ స్కామ్కు సంబంధించిన దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. ఈ కేసులో ఒక నిందితుడైన విజయ్ నాయర్ (కేజ్రీవాల్ అనుచరుడు)కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు మరో నిందితుడైన దినేష్ అరోరా ద్వారా హవాలా రూపంలో చెల్లించారు. ఈ నేరపూరిత కుట్రకు అనుగుణంగా ఇండో స్పిరిట్స్లో 65 శాతం వాటా, రూ.29.29 కోట్లను సౌత్గ్రూపులోని నిందితులకు బదిలీ చేశారు. గోవా ఎన్నికల సమయంలో ఆప్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూ.44.45 కోట్లు వినియోగించారు. కవిత మాజీ ఆడిటర్ బుచి్చబాబు ఫోన్ వాట్సాప్ చాట్లు, భూ కొనుగోలు ముసుగులో సొమ్ము లావాదేవీలు బహిర్గతం అయ్యాయి. ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వడానికి పన్నిన నేరపూరిత కుట్రలో కల్వకుంట్ల కవిత కీలక పాత్రధారిగా ఉన్నట్లు సదరు భూ కొనుగోలు డీల్ ద్వారా వెల్లడైంది..’అని చెప్పారు. కవితతో మద్యం వ్యాపారి భేటీ దక్షిణాదికి చెందిన ఓ మద్యం వ్యాపారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కలిశారని వెల్లడైంది. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రిని వ్యాపారి కోరగా.. ఎమ్మెల్సీ కవిత సంప్రదిస్తారని కేజ్రీవాల్ చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. తర్వాత సదరు వ్యాపారి కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఆమ్ ఆద్మీ పారీ్టకి రూ.100 కోట్లు సమకూర్చాల్సి ఉందని, దాంట్లో రూ.50 కోట్లు సదరు వ్యాపారి అందజేయాల్సి ఉంటుందని, తద్వారా మీరు వ్యాపార భాగస్వామి అవుతారని కవిత ఆయనకు తెలిపారు. అనంతరం బుచి్చబాబు డిమాండ్ మేరకు తన కుమారుడి ద్వారా కవిత అనుచరులకు రూ.25 కోట్లు వ్యాపారి చెల్లించారు. ఈ చెల్లింపులకు గానూ వ్యాపారి కుమారుడికి ఇండో స్పిరిట్స్లో 32.5 శాతం వాటా దక్కింది. విజయ్నాయర్కు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్లు చెల్లించినట్లుగా మరో నిందితుడు అభిషేక్ బోయినపల్లి తనకు చెప్పాడని అప్రూవర్ దినేష్ అరోరా తన వాంగ్మూలంలో వెల్లడించాడు. అభిõÙక్ బోయినపల్లి ఆదేశాల మేరకు హవాలా మార్గంలో గోవాకు భారీగా నగదు బదిలీ చేసినట్లు అప్పటి కవిత పీఏ అశోక్ కౌశిక్ చెప్పాడు. కౌశిక్ ద్వారా రూ.25 కోట్లు బదిలీ అయినట్లు రికార్డులు నిర్ధారించాయి. ఇండో స్పిరిట్స్లో తన ప్రాక్సీ అరుణ్ పిళై ద్వారా కవిత భాగస్వామ్యం కలిగి ఉన్నట్టు బుచ్చిబాబు ఫోను ద్వారా వెల్లడైంది..’అని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. భూ కొనుగోలు డీల్ ముసుగులో రూ.14 కోట్లు! భూ కొనుగోలు డీల్ ముసుగులో శరత్చంద్రారెడ్డికి చెందిన సంస్థల ఖాతాల నుంచి కల్వకుంట్ల కవితకు రూ.14 కోట్లు చేరాయి. నగదు బదిలీ ఒప్పందం అయితే జరిగింది కానీ అసలు భూమి బదిలీ కాలేదు. డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించడానికి శరత్చంద్రారెడ్డి ఆసక్తి చూపకపోవడంతో ఢిల్లీ, తెలంగాణలో వ్యాపారాలు దెబ్బతీస్తానని కవిత బెదిరించినట్లు వెల్లడైంది. పలువురు స్టేట్మెంట్ల ఆధారంగా కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత ఒకరిగా తేలింది. దీంతో ఆమెను నిందితురాలిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తదనంతర పరిణామాల్లో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. తర్వాత కోర్టు అనుమతితో కవితను ఈ నెల 6న తీహార్ జైలులో విచారించాం. కుంభకోణంలో తన పాత్ర గురించి అడిగిన ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. ఐదు రోజులు కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి..’అని పంకజ్ చెప్పారు. న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారు: కవిత న్యాయవాది కవిత అరెస్టు విషయంలో న్యాయ ప్రక్రియను ఉల్లంఘించారని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి తెలిపారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఇతరత్రా రూపంలో ఇప్పటికే తమ వద్ద ఉన్న అంశాలతో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థ చూపిన కస్టడీ కారణాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయన్నారు. కవిత విషయంలో ప్రాథమిక హక్కులు ఉల్లంఘించిన నేపథ్యంలో సీబీఐ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. కవిత పిటిషన్ కొట్టివేత ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి కావేరి బవేజా.. తొలుత సీబీఐ పిటిషన్లో తీర్పు రిజర్వు చేశారు. మధ్యాహ్నం కవిత దాఖలు చేసిన సవాల్ పిటిషన్ను విచారించారు. కవిత పిటిషన్ను కొట్టివేస్తూ 22 పేజీలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ‘వాస్తవాలు, కేసు పరిస్థితులు, వాదనలు పరిశీలించాక కవితను ఈ నెల 15 వరకూ సీబీఐ కస్టడీకి అనుమతిస్తున్నా. సీబీఐ అరెస్టును రద్దు చేయాలని కవిత దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తున్నా. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ టీవీ పర్యవేక్షణలో కవితను విచారించాలి. ప్రతిరోజూ సాయంత్రం 6– 7 గంటల మధ్య అరగంట సేపు తన న్యాయవాది మోహిత్రావుతో మాట్లాడే అవకాశం కవితకు ఇవ్వాలి. భర్త అనిల్కుమార్, సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు, పీఏ శరత్చంద్రలు ఆ సమయంలోనే 15 నిమిషాలు మాట్లాడొచ్చు. నిందితురాలికి ఇంటి భోజనం, జపమాల, దుస్తులు, మేట్రస్, బెడ్ షీట్లు, తువ్వాళ్లు, దిండులను సీబీఐ అధికారులు అనుమతించాలి. ఆమె కోరిన పుస్తకాలు అనుమతించాలి..’అని న్యాయమూర్తి తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. -
‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దోపిడీ రాకెట్ నడుపుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి అనే పొగతో కప్పేసి ఆప్ను అవినీతి పార్టీగా చిత్రీకరించి, అంతమొందించడం ఈడీ లక్ష్యాల్లో ఒకటని చెప్పారు. తాను ఈడీ దర్యాప్తును వ్యతిరేకించడం లేదని అన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను ఈడీ కస్టడీలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఏడు రోజుల కస్టడీ ముగియడంతో సీఎం కేజ్రీవాల్ను ఈడీ అధికారులు గురువారం ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపర్చారు. తొలుత ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు, న్యాయవాది జొహెబ్హుస్సేన్ వాదనలు వినిపించారు. మద్యం కుంభకోణం కేసులో స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతరత్రా డేటాను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనానికి రాజు తెలియజేశారు. ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ను విచారించాల్సి ఉందన్నారు. గోవా నుంచి సమన్లు అందుకొన్న కొందరితో కలిపి కేజ్రీవాల్ను విచారించాలన్నారు. లిక్కర్ కేసులో దర్యాప్తునకు కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదని ఆరోపించారు. మరో ఏడు రోజులపాటు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి అనుమతించాలని న్యాయమూర్తిని కోరారు. అనంతరం స్వయంగా వాదనలు వినిపించుకోవడానికి కేజ్రీవాల్కు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది గుప్తా కోరగా, న్యాయమూర్తి అనుమతించారు. కేజ్రీవాల్ తన వాదనలు హిందీలో కొనసాగించారు. 2022లో సీబీఐ కేసు నమోదైందని, తనని ఎవరూ అరెస్టు చేయలేదని, ఏ కోర్టు కూడా తనను దోషిగా గుర్తించడం గానీ లేదా ఆరోపణలు చేయడం గానీ జరగలేదని స్పష్టం చేశారు. ట్రాప్ చేయడమే ఈడీ అసలు ఉద్దేశం ఈ కేసులో సీబీఐ ఇప్పటిదాకా 31,000 పేజీలను కోర్టులో ఫైల్ చేసిందని, 294 మంది సాకు‡్ష్యలను విచారించిందని, ఈడీ 162 మందిని విచారించిందని, 25,000 పేజీల రిపోర్టును ఫైల్ చేసిందని చెప్పారు. తన పేరు కేవలం 4 స్టేట్మెంట్లలోనే ఉందని తెలిపారు. తననెందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. అయితే, ఈ వివరాలన్నీ అఫిడవిట్ రూపంలో ఇస్తే రికార్డుల్లో చేరుస్తానని న్యాయమూర్తి సూచించారు. దీంతో, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ అభ్యర్ధించారు. తాను ముఖ్యమంత్రినని, తన నివాసానికి మంత్రులు వస్తుంటారని, గుసగుసలాడుతుంటారని, దీని ఆధారంగా సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. దీనిపై ఎస్.వి.రాజు అభ్యంతరం వ్యక్తం చేయగా... ‘‘రాజు గారు, మీ ఆశీర్వాదం నాకు కావాలి. నన్ను మాట్లాడనివ్వండి’’ అని కేజ్రీవాల్ కోరారు. ఐదు నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వగలనని న్యాయమూర్తి చెప్పడంతో కేజ్రీవాల్ తన వాదనలు కొనసాగించారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును ప్రస్తావించారు. తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చే వరకూ అతడి నుంచి స్టేట్మెంట్లు తీసుకుంటూనే ఉన్నారని, దీన్నిబట్టి తనని ట్రాప్ చేయడమే ఈడీ అసలు ఉద్దేశమని అర్థమవుతోందని చెప్పారు. కొంతమంది నిందితులు అప్రూవర్లుగా మారిన అనంతరం ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. మాగుంట రాఘవ ఇచ్చిన స్టేట్మెంట్లను ప్రస్తావిస్తూ... ఆయన ఐదు స్టేట్మెంట్లు ఇచ్చారని తెలియజేశారు. ఈడీ ఏం చెబితే అదే వాంగ్మూలంగా ఇచ్చారని అన్నారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి స్టేట్మెంట్ మార్చుకోగానే ఆయన కుమారుడు మాగుంట రాఘవ బెయిలు పొందారని కేజ్రీవాల్ ఆరోపించారు. స్టేట్మెంట్లలో రాఘవ చెప్పింది ఏదీ కూడా ఈడీ రికార్డుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈడీ కార్యాలయంలో లక్ష పేజీలు ఉన్నప్పటికీ, తనకు అనుకూలంగా ఉన్న ఒక్క అంశాన్ని కూడా రికార్డుల్లోకి తీసుకోలేదన్నారు. రూ.100 కోట్ల కుంభకోణం అంటున్నారని, అయితే ఆ సొమ్ము ఎక్కడా లేదని చెప్పారు. ఈడీ దర్యాప్తు తర్వాతే మద్యం కుంభకోణం అనేది మొదలైందని విమర్శించారు. ఈడీ అంతిమ లక్ష్యం ఆమ్ ఆద్మీ పార్టీని అంతమొందించడమేనని పేర్కొన్నారు. దీనిపై ఈడీ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేయడం తగదన్నారు. నా వద్ద ఆధారాలున్నాయి బీజేపీకి శరత్చంద్రారెడ్డి రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ రాకెట్ నడుస్తోందనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. ఈడీ తనని ఎన్నిరోజులు రిమాండ్లో ఉంచుకున్నా అభ్యంతరం లేదన్నారు. ఈడీపై పదేపదే అవే విమర్శలు చేయడం ద్వారా ప్రజల మద్దతు కూడకట్టుకోవాలని కేజ్రీవాల్ ప్రయతి్నస్తున్నారని ఎస్.వి.రాజు ధర్మాసనానికి తెలిపారు. ఈడీ కార్యాలయంలో తనకు అనుకూలంగా పేజీలు ఉన్నాయని కేజ్రీవాల్ ఎలా భావిస్తున్నారు? ఇదంతా ఊహాజనితం అని అన్నారు. లంచం ద్వారా వచ్చిన సొమ్ములు గోవా ఎన్నికల్లో కేజ్రీవాల్ వినియోగించారని తెలిపారు. ఈ సొమ్మంతా హవాలా రూపంలో సౌత్ గ్రూపు నుంచి వచ్చిందేనని, అదంతా ఒక చైన్ లాంటిదని, అందుకే దాని గురించి కేజ్రీవాల్ మాట్లాడడం లేదని తెలిపారు. బీజేపీకి శరత్చంద్రారెడ్డి విరాళం ఆరోపణలపై రాజు బదులిస్తూ... దీనికి, మద్యం కుంభకోణానికి సంబంధం లేదన్నారు. ఎందుకంటే ఢిల్లీలో మద్యం విధానాన్ని రూపొందించే హక్కు బీజేపీకి లేదన్నారు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వెంటనే క్లీన్చిట్ రాదని, దర్యాప్తును ఎదుర్కోవాలని,సామాన్యుడికి, సీఎంకు అరెస్టు విషయంలో తేడా ఉండదని రాజు పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో ప్రశ్నించడానికి కేజ్రీవాల్కు మరో వారం రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు. అనంతరం, రాజు వాదనలకు తాను స్పందించవచ్చా? అని కేజ్రీవాల్ తరపు న్యాయవాది గుప్తా కోరగా.. ఇప్పటివరకూ స్పందించారుగా ఇక అప్రస్తుతం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది అప్రస్తుతం, అసందర్భం అని ఎలా అంటారని గుప్తా ప్రశ్నించగా... గట్టిగా మాట్లాడొద్దని హెచ్చరిస్తూ అందరి వాదనలు విన్నానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 4 రోజులపాటు ఈడీ కస్టడీకి మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులపాటు పొడిగించింది. ఆయనను ఏప్రిల్ 1న ఉదయం 11 గంటల్లోగా తమ ఎదుట హాజరుపర్చాలని ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ఈడీ అధికారులను ఆదేశించారు. కేజ్రీవాల్ను ఏడు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా, న్యాయమూర్తి నిరాకరించారు. కేవలం 4 రోజలుపాటు కస్టడీకి అనుమతించారు. గత ఐదు రోజులపాటు కేజ్రీవాల్ను ప్రశ్నించామని, తప్పించుకొనేలా ఆయన సమాధానాలిచ్చారని రిమాండ్ పిటిషన్లో ఈడీ వెల్లడించింది. -
తీహార్ జైలా ?..కస్టడీ పొడిగింపా ?
-
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
Updates ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజులు ఈడీ కోరినా నాలుగు రోజులే కస్టడీ పొడిగింపు. ఏప్రిల్ 1 వరకు కస్టడీలోనే కేజ్రీవాల్ సీబీఐ స్పెషల్ కోర్టులో ముగిసిన వాదనలు. కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వు. తీర్పును రిజర్వు చేసిన రౌస్ ఎవెన్యూ కోర్టు. మరో ఏడు రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ గోవా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లతో కలిపి కేజ్రీవాల్ను విచారించాలన్న దర్యాప్తు సంస్థ నన్ను అరెస్టు చేయడమే ఈడీ లక్ష్యం : కేజ్రీవాల్ నిందితుడితో బలవంతంగా నా పేరు చెప్పించారు. నిందితుడు 55 కోట్ల రూపాయల ఎలక్ట్రోరల్ బాండ్స్ బీజేపీకి ఇచ్చారు. ఏ కోర్టు నన్ను దోషిగా పరిగణించలేదు. నా అరెస్టుకు తగిన ఆధారాలు లేవు. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ అని చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నా పార్టీని నిర్మూలించాలనుకుంటున్నారు. నా పేరు కేవలం నాలుగు సార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈడీ వాదనలు: ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ 100 కోట్ల లంచం తీసుకున్నారు. ఆయన విచారణకు సహకరించడం లేదు. ఈడీకి అరెస్టు చేసే హక్కు ఉంది. శరత్ చంద్రారెడ్డి 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రోలు బాండ్స్ రూపంలో బీజేపీకి ఇచ్చిన నిధులకు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధం లేదు. ఇది క్విడ్ ప్రోకో కిందికి రాదు. ఆమ్ ఆద్మీ పార్టీ హవాలా డబ్బు ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు మా దగ్గర ఉన్నాయి. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ మా వద్ద ఉన్నాయి కోర్టుకు తీసుకు వెళ్లే సమయంలో కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు నా అరెస్ట్ రాజకీయ కుట్ర ఢిల్లీ ప్రజలే గట్టిగా సమాధానం చెబుతారు రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ను హాజరుపర్చిన ఈడీ ఢిల్లీ: సీబీఐ స్పెషల్ కోర్టు ముందు కేజ్రీవాల్ను ప్రవేశపెట్టిన ఈడీ మరో వారం రోజులపాటు కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు విధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చనుంది. ఈడీ కస్టడీ పొడిగింపు కోరుతుందా? లేదంటే రిమాండ్కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్ను మార్చి 21 ఆయన నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఆయన్ను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టుకు హజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపర్చనుంది ఈడీ. ఒకవేళ కస్టడీ పొడగింపునకు కోర్టు అంగీకరించకపోతే మాత్రం ఆయన్ని తీహార్ జైలుకు తరలిస్తారు మరోవైపు తనను ఈడీ చేసిన అరెస్ట్ అక్రమమంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్పై ఆయనకు ఊరట లభించలేదు. కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ రెండో ఆదేశం.. ఈడీ సీరియస్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, లాకప్ నుంచే ఆయన పాలన సాగిస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో ఆయన రెండో ఆదేశం జారీ చేయగా.. కస్టడీ నుంచి ఆయన ఇస్తున్న ఆదేశాలపై ఈడీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం లాకప్ నుంచి కేజ్రీవాల్ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. మొహల్లా క్లినిక్లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. ‘‘కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు’’ అని సౌరభ్ పేర్కొన్నారు. చదవండి: ఈడీ కస్టడీలో కేజ్రీవాల్: లాకప్ నుంచే తొలి ఆదేశం అంతా ఉత్తదేనా? ఇటీవల ఆయన నీటి సమస్య నివారణ కోసం సహచర మంత్రి ఆతిశీకి నోట్ ద్వారా ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఈడీ తీవ్రంగా పరిగణించింది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్కు కంప్యూటర్ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆతిశీని ప్రశ్నించే అవకాశముంది. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ ఇచ్చిన తొలి ఆదేశాలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అదే సమయంలో కంప్యూటర్, పేపర్ అందుబాటులో లేని కేజ్రీవాల్ ఆదేశాలు ఎలా జారీ చేశారా? అనే అంశంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇంతలోనే మరో ఆదేశం విడుదల కావడం.. దాన్ని ఆప్ గర్వంగా ప్రకటించుకోవడాన్ని ఈడీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. -
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 15 జ్యూడీషియల్ రిమాండ్ విధించింది ట్రయల్ కోర్టు. ఏప్రిల్ 9 వరకు జ్యూడీషియర్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. లిక్కర్ స్కాం కేసులో కస్టడీ ముగియడంతో ఈడీ ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ జ్యూడీషియల్ కస్టడీ కోరగా.. అదే సమయంలో కవిత వేసిన బెయిల్ పిటిషన్పైనా వాదనలు జరిగాయి. అయితే.. ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆమెకు జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ‘‘సమాజంలో కవిత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆమెను విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సాక్షాధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది. దీనివల్ల దర్యాప్తుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. లిక్కర్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. కవిత పాత్రకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నాం. అక్రమ సొమ్ము గుర్తించే పనిలో ఉన్నాం. ఆర్థిక నేరాల దర్యాప్తు చాలా కఠినమైనది. ఆర్థిక నేరస్తులు చాలా వనరులు, పలుకుబడి ఉన్నవారు. పథకం ప్రకారం ప్రణాళికతో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. అందుకే దర్యాప్తు అనేది చాలా జఠిలమైనది. ఇందుకోసమైనా కవితను జ్యూడిషియల్ కస్టడీ కి పంపాలి’’ :::కవిత ఈడీ జ్యుడీషియల్ రిమాండ్ రిపోర్ట్ ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఏప్రిల్ 9వ తేదీ దాకా కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే.. కవిత బెయిల్ పిటిషన్పై మరోసారి వాదనలు వినాల్సి ఉందని చెబుతూ.. ఏప్రిల్ 1వ తేదీకి ఆ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది. బెయిల్పై వాదనల సందర్భంగా.. తన పిల్లలకు పరీక్షలు ఉన్నాయని.. మధ్యంతర బెయిల్ అయినా మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ ద్వారా అభ్యర్థించారు. అయితే.. కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్. ఇక విచారణ సందర్భంగా.. కోర్టు ప్రాంగణంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగానే తనపై కేసు పెట్టారని అన్నారామె. అదే సమయంలో ఆమె తన భర్త అనిల్, బంధువులను కలిసి మాట్లాడేందుకు ఈడీ అనుమతించింది. ఇదీ చదవండి- అప్రూవర్గా మారను.. క్లీన్గా బయటకొస్తా: కవిత కవిత మేనల్లుడి అరెస్ట్కు రంగం సిద్ధం? మరోవైపు ఇవాళ లిక్కర్ స్కాం కేసులో ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవిత మేనల్లుడు మేకా శరణ్ను ఈడీ విచారణ చేపట్టింది. లిక్కర్ స్కాం కేసులో అక్రమ సొమ్ము బదిలీలో శరణ్ కీలక పాత్ర పోషించారని ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో.. శరణ్ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. -
మరోసారి కస్టడీనా.. బెయిలా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత కస్టడీ సోమవారంతో ముగిసింది. మంగళవారం ఉదయం కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఈనెల 15న కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు మరుసటి రోజు కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఆమెకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అనంతరం శనివారం మరోసారి కవితను కోర్టులో హాజరుపరచిన ఈడీ అధికారులు మరిన్ని రోజులు తమకు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. దీంతో మరో మూడు రోజుల పాటు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పదిరోజుల పాటు కవితను పలు అంశాలపై ఈడీ అధికారులు విచారించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రారంభ దశ నుంచి ఒక్కో పాయింట్ను కవితను అడుగుతూ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇతర నిందితులతో కవిత జరిపిన వాట్సాప్ చాటింగ్ అంశంపై తొలిరోజు ఆమెను విచారించారు. ఈ కేసులో అరెస్టు అయిన వారితో ఏరకమైన సంబంధాలు ఉన్నాయి, వారిని ఎక్కడెక్కడ కలిశారు, వారికి కవితకు మధ్య ఏవిధమైన సంభాషణ జరిగిందనే విషయాలపై విచారణ జరిగింది. వీటితో పాటు ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వాళ్లు ఇచ్చిన సమాచారాన్ని ఆమె ముందు ఉంచి ఒక్కో ప్రశ్న అడిగారు. వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చిన కవిత, మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. మరికొద్ది రోజులు కస్టడీ కోరనున్న ఈడీ! కవిత నుంచి మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్న ఈడీ అధికారులు మంగళవారం విచారణ సందర్భంగా మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టును కోరే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి తెలుస్తోంది. ఇదే సందర్భంలో కవిత అరెస్టు అక్రమం అంటూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ రెండు వాదనలను రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం వినే అవకాశంఉంది. దీంతో కవితను కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి ఇస్తుందా లేక, జ్యుడీషియల్ కస్టడీ విధి స్తుందా? ఈ రెండూ కాక బెయిలు మంజూరు చేస్తుందా? అనే అంశాలపై నేడు స్పష్టత వస్తుందని చెపుతున్నారు. కవితను కలసిన భర్త అనిల్ ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను సోమవారం రాత్రి భర్త అనిల్కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, న్యాయవాది మోహిత్రావు, పీఏ శరత్లు కలిశారు. సుమారు గంట పాటు కవితతో మాట్లాడారు. తొలుత కవిత భర్త అనిల్ ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పినట్లు సమాచారం. అలాగే తాము అంతా అండగా ఉన్నామంటూ వద్దిరాజు రవిచంద్ర భరోసా ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం కవితను కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో.. న్యాయవాది మోహిత్రావు ఆమెతో పలు విషయాలను చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో ఆమె పీఏ శరత్ కూడా పాల్గొన్నారు -
కవిత కస్టడీ పొడిగింపు ?
-
సీఎం కేజ్రీవాల్ కు ఆరు రోజుల కస్టడీ ఇచ్చిన కోర్టు
-
కవిత పిటిషన్కు ఢిల్లీ కోర్టు అనుమతి
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అయితే.. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది సెషన్స్ కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 8 మంది కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వారిలో తల్లి శోభా, పిల్లలు, కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతి లభించింది. ఇక.. శనివారం మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావులు కవితను ఈడీ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే. వారు సుమారు గంటసేపు భేటీ అయి పలు అంశాలుపై చర్చించుకున్నట్లు తెలిసింది.అదేవిధంగా ఇవాళ.. ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలంటూ, అంతవరకు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దు అంటూ గతేడాది దాఖలైన పిటిషన్ను కవిత తరపు న్యాయవాది ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. -
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రెండో రోజు కస్టడీ విచారణ
-
కవితకు రిమాండ్, 7 రోజుల కస్టడీ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. అలాగే ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది. అరెస్టు అక్రమమని కవిత తరఫు లాయర్ల వాదనను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో రిమాండ్ విధిస్తూ.. ఈ నెల 23న మధ్యాహ్నాం 12 గంటలకు కవితను తిరిగి హాజరు పరచాలని ఈడీని ఆదేశించింది. అలాగే రిమాండ్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు కవితకు అవకాశం కల్పిస్తూనే.. ఇంటి భోజనానికి కోర్టు అనుమతించింది. ఫామ్ హౌజ్కు కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం, ఆపై కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించిన పరిణామాల అనంతరం ఆమె తండ్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌజ్కు వెళ్లిపోయారు. అయితే కవిత అరెస్టుపై ఇప్పటివరకూ కేసీఆర్ స్పందించలేదు. కవిత భర్తకు కూడా నోటీసులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అనూహ్యంగా మరో అడుగు ముందుకేసింది. కవిత భర్త అనిల్కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. సోమవారం ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే అనిల్ ఫోన్లను సీజ్ చేసింది ఈడీ. కవిత కస్టడీ రిపోర్టులో ఏముందంటే? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారు సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కాంలో కీలకంగా వ్యవహరించారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కీలక కుట్ర దారు, ప్రధాన లబ్ధిదారు కవితే ఆమ్ అద్మీ పార్టీకి కవిత లిక్కర్ స్కాం ముడుపుల కింద వంద కోట్లు ఇచ్చారు మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రకు పాల్పడ్డారు కవితకు బినామీగా రామచంద్ర పిళ్లై ఉన్నారు పిళ్లై ద్వారా కవిత మొత్తం వ్యవహారం నడిపించారు అరుణ్ పిళ్లైని డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో.. కవిత వాటా పొందారు ఇతరులతో కలిసి 100 కోట్ల రూపాయల లంచాలను ఆప్ నేతలకు కవిత ఇచ్చారు కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్ లోని ఆధారాలు తొలగించారు సౌత్ గ్రూప్ లోని శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ మాగుంటతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు మాగుంట ద్వారా రూ. 30 కోట్లను కవిత ఢిల్లీకి చేర్చారు రూ. 30 కోట్లను అభిషేక్ బోయినపల్లి ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఈడీ పేర్కొంది. మరోవైపు కవిత అరెస్టును ఎన్నికల స్టంట్గా అభివర్ణించారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ను దొంగదెబ్బ తీయడానికే రాజకీయ డ్రామా చేశారని, కవిత అరెస్టుపై ఆమె తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని, ఈడీ ఒకేరోజు హైదరాబాద్ వచ్చారని, ఈ కేసులో మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని అడిగారు. కవిత అరెస్టుతో బీఆర్ఎస్ సానుభూతి, అవినీతిని సహించేది లేదంటూ బీజేపీ ఓట్లు దండుకునే యత్నం చేస్తున్నారన్నారు. -
రూ.250 కోట్లపైనే..
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు రూ. 250 కోట్లపైనే ఉంటాయని ఏసీబీ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. శివబాలకృష్ణ కస్టడీ బుధవారంతో ముగి సింది. ఆయన ఇంట్లో కొద్ది రోజులుగా జరుపుతున్న సోదాలు ముగిసినట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుదీంద్ర వెల్లడించారు. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు గుర్తించామని, ఆయన సమీప బంధువులు, స్నేహితులు, సహ ఉద్యోగుల ఇళ్లలో మొత్తంగా 17 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారని చెప్పారు. ఇవీ ఆస్తులు... శివబాలకృష్ణ ఇంట్లో రూ. 84.60 లక్షల నగదు, 2 కేజీలు బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలు వ చేసే వాచ్లు, 3 విల్లాలు, 7 ఫ్లాట్స్తోపాటు కొడ కండ్ల, జనగామ, నాగర్కర్నూలు, సిద్ధిపేట, యా దాద్రి, పాలకుర్తి, జఫర్గఢ్ ప్రాంతాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించామని సు«దీంద్ర చెప్పారు. భూమి ఆయన పేరుతోపాటు కొందరు బినామీల పేరుపై ఉందని, 29 ఓపెన్ప్లాట్లు ఉన్నాయని, రంగారెడ్డిజిల్లాలోనే 12, వైజాగ్, విజయవా డ, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా ఖాళీ స్థలాలు రిజి స్టర్ అయ్యాయన్నారు. అన్నింటి విలువ రూ.250 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపా రు. సోదాలు ఇంకో నాలుగు చోట్ల కొనసాగుతున్నాయని, శివబాలకృష్ణ పై కేసు నమోదు చేసి, గురువారం న్యాయస్థా నం ముందు హాజరుపరుస్తామన్నారు. ‘ఇంకా కొన్ని విషయాలు ఆయ న చెప్పలేదు..మా విచారణకు సహకరించలేదు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.’అని సు«దీంద్ర తెలిపారు. మిగతా అధికారుల్లో టెన్షన్.. హెచ్ఎండీఏలో పనిచేస్తున్న మిగతా అధికారుల్లో టెన్షన్ నెలకొంది. హెచ్ఎండీఏ పరిధి ఏడు జిల్లాల్లో విస్తరించి ఉండగా, గతంలో అనుమతులు మంజూరు చేసిన లేఔట్లు, ప్లాట్లకు సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ పరిశీలించే యోచనలో ఏసీబీ ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో నిర్మిస్తున్న హైరేజ్ అపార్ట్మెంట్లకు అనుమతుల్లో హెచ్ఎండీఏ అధికారులు భారీగా లంచాలు పొందినట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి రెండు రోజుల ముందు భారీఎత్తున లాండ్ కన్జర్వేషన్ జరిగిందని, హైరైస్ బిల్డింగ్ జోన్ పరిధిలోకి భూముల మార్పు జరిగిందని భావిస్తున్నారు. ఉస్మాన్సాగర్ పరిధిలోనూ భారీగా భూమారి్పడి జరిగిందని సమాచారం. ఆ రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల విలువైన భూములు చేతులు మారినట్టు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. పూర్తిస్థాయి విచారణ జరిగితే ఇందులోని పెద్ద తలకాయల భాగోతాలు బట్టబయలు అవుతాయని తెలుస్తోంది. కాగా ఉప్పల్లో శివబాలకృష్ణ సోదరి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ సోదరి, ఇద్దరు కొడుకులు హెచ్ఎండీఏలో ఆయన దగ్గరే పనిచేశారు. వీరంతా బినామీలుగా ఉన్నట్టు గుర్తించారు. హెచ్ఎండీఏలో మూడో రోజు ఏసీబీ సోదాలు హెచ్ఎండీఏలో మూడో రోజు ఏసీబీ సోదాలు కొనసాగాయి. శివబాలకృష్ణపై విచారణలో భా గంగా పలు కీలకమైన ఫైళ్లు ఏసీబీ అధికారులు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. బుధవారం ఉదయమే అమీర్పేట్లోని హెచ్ఎండీఏ కా ర్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. శివబాల కృష్ణ హయాంలో ఇ చ్చి న అనుమతులపైన ప్ర ధానంగా దృష్టి సారించి మూడురోజుల పాటు ఫైళ్లను పరిశీలించినట్టు తెలిసింది. ముఖ్యంగా కోకాపేట, నార్సింగి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో నిర్మించిన భారీ బహుళ అంతస్తుల భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇ చ్చి నట్టు ఏసీబీ అధికారుల పరిశీలనలో వెల్లడి కావడంతో, ఆ దిశగానే హెచ్ఎండీఏలో సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ రెరాకు బదిలీ అయిన తర్వాత కూడా పలు ఫైళ్ల కు పాత తేదీలపైన అనుమతులు ఇవ్వడాన్ని ఏసీబీ సీరియస్గా పరిగణిస్తోంది. -
శివబాలకృష్ణ అక్రమాస్తులు వెయ్యి కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. దీంతో ఆయన్ని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా.. మరో 14 రోజులు రిమాండ్ను పొడగించింది. అయితే ఎనిమిది రోజుల విచారణలో శివబాలకృష్ణ చెప్పిన విషయాలు.. బయటపడుతున్న ఆస్తులు.. వాటిని కూడబెట్టేందుకు ఆయన అనుసరించిన విధానాల్ని చూసి ఏసీబీ అధికారులే నిర్ఘాంతపోతున్నారు. శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైనే ఉండొచ్చని ఏసీబీ భావిస్తోంది. దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడి అవుతుండడంతో.. మరిన్ని వివరాలు రాబట్టేందుకు శివబాలకృష్ణ రిమాండ్కు పొడగించాలని కోర్టును కోరింది. దీంతో శివబాలకృష్ణ రిమాండ్ను 14 రోజుల పాటు కోర్టు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటివరకు రూ.250 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శివబాలకృష్ణ పేరుతో 214 ఎకరాలు భూమి ఉన్నట్లు ఏసీబీ జాయింగ్ డైరెక్టర్ వెల్లడించారు. తెలంగాణతోపాటు విశాఖపట్నంలో కూడా శివబాలకృష్ణకు 29 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా శివబాలకృష్ణకు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు సంబంధించి హెచ్ఎండీఏలో పలువురు అధికారులు పాత్రపై కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చప్పారు. పలు ఫైల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. లాకర్స్లో ఉన్న బంగారం, ఆస్తులకు సంబంధించి పలు కీలక పత్రాలను సీజ్ చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
బడా రియల్ కంపెనీలతో బంధం
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి లావాదేవీలు ఏసీబీ అధికారులు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులిచ్చిన శివబాలకృష్ణ..అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగుచూసినట్టు సమాచారం. ఎన్నికలకోడ్ సమయంలోనూ శివబాలకృష్ణ అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగినట్టు ఏసీబీ గుర్తించింది. పుప్పాలగూడ, నార్సింగి పరిధిలో రెండు రియల్ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శివబాలకృష్ణకు పెద్దమొత్తంలో ‘లబ్ది’చేకూరినట్టు కీలక వివరాలు సేకరించారు. ‘చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్’ ప్రక్రియలో పెద్దసంఖ్యలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన అనుమతులపైనా ఆరా తీసేందుకు వరుసగా రెండోరోజూ ఏసీబీ అధికారుల బృందం అమీర్పేట్లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు ఫైళ్లు పరిశీలించి వివరాలు సేకరించినట్టు సమాచారం. అక్రమార్జన కేసులో ఏసీబీకి పట్టుబడిన శివబాలకృష్ణను కోర్టు ఎనిమిది రోజుల కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు ఏడో రోజు కస్టడీలో భాగంగా చంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఏసీబీ అధికారులు సేకరించిన భూలావాదేవీల వివరాలు, ఇతర పత్రాలు శివబాలకృష్ణ ముందు ఉంచి మంగళవారం ప్రశ్నించినట్టు సమాచారం. లోతుగా పరిశీలన డాక్యుమెంట్లు, బినామీ ఆస్తుల వివరాల ఆధారంగా బాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇతర మార్గాల్లో సేకరించిన వివరాలపై ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రెరా కార్యాలయంలోనూ సోదాలు చేసి కోట్ల రూపాయల భూములకు సంబంధించిన అనుమతుల విషయంలో వివరాలు సేకరించారు. సోమ, మంగళవారాల్లో అమీర్పేట్లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిపిన సోదాల్లో మరిన్ని వివరాలు లభించాయి. వీటన్నింటినీ విశ్లేషిస్తున్న ఏసీబీ అధికారుల ప్రత్యేక బృందం ఆ విషయాలతో ప్రశ్నావళి రూపొందిస్తూ శివబాలకృష్ణ నుంచి వివరాలు సేకరిస్తోంది. శివబాలకృష్ణకు సహకరించిన సిబ్బందిపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనమతులు పొందిన పలు రియల్ఎస్టేట్ కంపెనీల ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించనున్నట్టు సమాచారం. శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్కుమార్ అరెస్టు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో కీలక మలుపు చోటు చే సుకుంది. ఆయనకు బి నామీగా వ్యవహరించిన ట్టు ఆధారాలు లభించడంతో ఏసీబీ అధికారులు శివబాలకృష్ణ సో దరుడు శివనవీన్కుమార్ను మంగళవారం అరె స్టు చేశారు. ఇప్పటికే శివ బాలకృష్ణను ఎనిమిది రోజుల కస్టడీలో భాగంగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. ఏసీబీ సోదాల్లో భాగంగా గుర్తించిన ఆస్తులు, ఆ తర్వాత లాక ర్లు ఓపెన్ చేసి స్వాదీనం చేసుకున్న పలు డాక్యుమెంట్లు, రేరా, హెచ్ఎండీఏ కార్యాలయంలో సోదాల్లో భాగంగా తెలుసుకున్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు శివ నవీన్కుమార్ను ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలతోపాటు, శివబాలకృష్ణ విచారణలో తెలుసుకున్న అంశాల మేరకు శివనవీన్కుమార్ తన సోదరుడికి బినామీగా వ్యవహరించినట్టు ఏసీబీ అధికారులు ధృవీకరించుకున్నారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసినట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి. నేటితో ముగియనున్న ఏసీబీ కస్టడీ హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ బుధవారంతో ముగియనుంది. గత బుధవారం నుంచి శివబాలకృష్ణను కస్టడీకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు, మరోవైపు ఇతర ఆధారాల కోసం తనిఖీలు కొనసాగిస్తున్నారు. బుధవారం చివరి రోజు కావడంతో మరిన్ని కీలక వివరాలు సేకరించేలా ఏసీబీ అధికారుల బృందం ఏర్పాట్లు చేసుకుంది. ఇప్పటికే సేకరించిన వివరాలతోపాటు తనిఖీల్లో గుర్తించిన ఫైళ్ల ఆధారంగా చివరి రోజు ప్రశ్నించే అవకాశముంది. కాగా, హెచ్ఎండీఏ కార్యాలయాల్లో వరుస సోదాలు, బ్యాంకు లాకర్ల నుంచి సేకరించిన పత్రాలు, ఇతర ఆధారాలపై మరింత లోతుగా ఆరా తీయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజులు శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసే యోచనలో ఏసీబీ అధికారులు ఉన్నట్టు తెలిసింది. -
ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ.. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఆరా
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎమ్డీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏపీసీ కస్టడీలోకి తీసుకుంది. చంచల్గూడ జైలులో రిమాండ్గా ఉన్న ఆయన్ను.. నేటి నుంచి 8 రోజుల వరకు కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. కాగా ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల కస్టడీకి నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో బాలకృష్ణను మరింత లోతుగా ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. బాలకృష్ణ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీయనున్నారు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఆరా తీయనున్నారు. మరోవైపు హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధిచిన కేసులో అవినితి నిరోధక శాఖ(ఏసీబీ) విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీవేటు వేసింది. శివ బాలకృష్ణను సస్పెండ్ చేస్తూ మంగళవారం హెచ్ఎండీఏ కమిషనర్ దాన కిషోర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పుప్పాలగూడ 447సర్వే నంబర్లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో బాలకృష్ణ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. చదవండి: ఎమ్మెల్యేగా రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారం -
ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
-
HMDA: ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు మంగళవారం విచారణ జరిపింది. 10 రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేయగా, 8 రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. బినామీల విచారణ, ఆస్తులపై దర్యాప్తు చేయాలన్న ఏసీబీ.. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేసింది. అధికారులను సైతం ఏసీబీ విచారించనుంది. హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీయనుంది. హైరేస్ బిల్డింగ్ అనుమతుల్లో అక్రమాలపై విచారణ చేపట్టనుంది. కోర్టులను సైతం తప్పుదోవ పట్టించి వివాదస్పద భూముల్లో అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పుప్పాలగూడ 447సర్వే నంబర్లో అనుమతులపై సూర్య ప్రకాష్ అనే వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రూ.100 కోట్ల విలువైన బాలకృష్ణ అక్రమ ఆస్తులను గుర్తించారు. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే అక్రమ ఆస్తులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదీ చదవండి: హెచ్ఎండీఏలో ‘ఏసీబీ’ ప్రకంపనలు -
వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయా?
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఏవైనా ఉన్నాయా? అని సుప్రీంకోర్టు సీబీఐను ప్రశ్నించింది. ఇదే కేసులో నిందితుడైన దినేశ్ అరోరా వాంగ్మూలం మినహా ఇంకా ఏం ఆధారాలున్నాయని అడిగింది. మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సిసోడియా దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కొందరు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని సీబీఐ పేర్కొంది. కొన్ని వాట్సాప్ సందేశాలను సాక్ష్యంగా కోర్టుకు సమర్పించింది. ఈ సాక్ష్యం ఆమోదయోగ్యమేనా? అప్రూవర్గా మారిన వ్యక్తి ఇచి్చన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా ఎలా భావించగలం? అని కోర్టు వ్యాఖ్యానించింది. మద్యం కుంభకోణం కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారని అభిప్రాయపడింది. సిసోడియా ముడుపులు తీసుకున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయని, మరి ఆ డబ్బులు ఆయనకు ఎవరిచ్చారు? డబ్బులిచి్చనట్లు ఆధారాలున్నాయా? ఈ కేసులో అరోరా వాంగ్మూలం కాకుండా సాక్ష్యాలున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సంజయ్ సింగ్కు ఐదు రోజుల కస్టడీ బుధవారం అదుపులోకి తీసుకున్న ఆప్ నేత ఎంపీ సంజయ్ సింగ్ను ఈడీ అధికారులు గురువారం ప్రత్యేక కోర్టు జడ్జి నాగ్పాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో మిగతా నిందితులతో కలిపి ఆయన్ను విచారించాల్సి ఉందని ఈడీ పేర్కొంది. దీంతో జడ్జి నాగ్పాల్ ఆయన్ను విచారణ నిమిత్తం అయిదు రోజుల ఈడీ కస్టడీకి పంపుతూ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా జడ్జి అనుమతి మేరకు సంజయ్ సింగ్ కోర్టులో మాట్లాడారు. -
.. ఈ హెడ్డింగ్ ఓకేనా సార్!
.. ఈ హెడ్డింగ్ ఓకేనా సార్! -
సీఐడీ విచారణలో విస్తుపోయే నిజాలు..?
-
నేటి నుంచి 11 రోజులు పాటు రిమాండ్ ఖైదుగా చంద్రబాబు
-
సీఐడీ కస్టడీతో స్కిల్ స్కాం కుట్ర బయటపడుతుందా ?
-
నేడు, రేపు చంద్రబాబును విచారించనున్న సీఐడీ
-
వ్యూహాత్మకంగా చంద్రబాబు విచారణకు సీఐడీ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడిని విచారించేందుకు సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో.. చంద్రబాబు నాయుడికి ఎలాంటి ప్రశ్నలు సంధించాలి? ఎలా విచారించాలి? అనేదానిపై సీఐడీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. స్కామ్లో చంద్రబాబే ప్రధాన నిందితుడు.. అంతిమ లబ్ధిదారుడు కావడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి కస్టడీ నుంచి వీలైనంత కీలక సమాచారం రాబట్టాలని భావిస్తోంది ఏపీ సీఐడీ. చంద్రబాబు కస్టడీ నేపథ్యంలో ఏం జరగబోతోంది?.. ఏ విధంగా సీఐడీ విచారణ చేయనుంది? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు పర్మిషన్ లభించిన నేపథ్యంలో సీఐడీ ఏర్పాట్లు చేసుకుంటోంది. రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ అధికారుల బృందం వెళ్లనుంది. మెరికల్లాంటి అధికారుల్ని ఇప్పటికే ఏపీ సీఐడీ కస్టడీ విచారణ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కస్టడీలో చంద్రబాబును ప్రశ్నించే అధికారుల జాబితాను ఇప్పటికే సీఐడీ కోర్టుకు సమర్పించింది కూడా. శనివారం ఉదయం నుంచే ఆధికారులు విచారణ చేపట్టే విధంగా సిద్ధం అవుతున్నారు. కోర్టు నిర్దేశించిన టైం ప్రకారం ఉదయం 9.30గం. నుంచి సాయత్రం 5గంటల దాకా.. తిరిగి ఆదివారం సైతం ఇదే సమయంలోనే విచారణ చేపట్టనుంది. లంచ్, టీ బ్రేక్లకు మినహా మిగిలిన సమయం అంతా విచారణకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. కోరింది ఐదురోజులు అయినప్పటికీ.. రెండే రోజులు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాబట్టి.. తక్కువ సమయం ఉండటం వల్ల వీలైనంత ఎక్కువ సమయం విచారణకు వాడుకోవాలనేది సీఐడీ వ్యూహంగా కనిపిస్తోంది. రాబట్టాల్సిన సమాధానాలు బోలెడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి వీలైనంత ఎక్కువగా సమాచారం రాబట్టాలి.. ఇది ఇప్పుడు సీఐడీ ముందున్న టాస్క్. ఈ మేరకు ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షెల్ కంపెనీల నుంచి చంద్రబాబుకు ఏ విధంగా ముడుపులు చేరాయో తేల్చే పనిలో సీఐడీ అధికారులు నిమగ్నమయ్యారు. చంద్రబాబు బ్యాంకు ఖాతాల గురించి ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ విధంగా షెల్ కంపెనీల డబ్బు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వరకు వచ్చిందో తేల్చడమే కస్టడీలో కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడంలో చంద్రబాబు పాత్రపైన సీఐడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్, డిజైన్టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్తో చంద్రబాబు మీటింగ్లపైనా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వద్దన్నా.. ఎందుకు అలా చేశారు? కేవలం షెల్ కంపెనీలు ముడుపుల వ్యవహారం మాత్రమే కాకుండా… కేసులో ఏవిధంగా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి చేశారనే విషయంపైనా సీఐడీ దృష్టి సారించింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటులో క్యాబినెట్ అప్రూవల్ లేకపోడం నుంచి మొదలు ఏవిధంగా అధికార దుర్వినియోగం జరిగిందనే విషయంపై సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు ఎందుకు బలవంతపెట్టి వందల కోట్లు విడుదల చేయించారనే విషయంపై సీఐడీ ప్రశ్నలు సిద్ధం చేశారనే వార్తలు వస్తున్నాయి. దాదాపు 100కు పైగా ప్రశ్నలతో సీఐడీ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో కలిపి విచారించేందుకు ఈ కేసులో ఉన్న నిందితులను పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాన్బీ కూడానా? కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించపోతే ఏం చేయాలి?.. ఈ విషయంపైనా సీఐడీ అధికారులు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు ప్లాన్ బీ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణకు సహకరించకపోతే.. కస్టడీ పిటిషన్ పొడిగించాలనే విజ్ఞప్తితో పాటు విచారణ సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని కోర్టుకు తెలపాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. సీఐడీ విచారణలో చంద్రబాబును షాక్ గురిచేసే కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పక్కా ఆధారాలతో ఈ స్కామ్లో దొరికిన చంద్రబాబును కస్టడీకి తీసుకోవడం ద్వారా కీలకమైన విషయాలనే సీఐడీ బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడే
ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఇవాళ బ్లాక్ ఫ్రైడే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. అయితే ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో ఉన్న ఆయనకి.. కోర్టుల్లో ఇవాళ బ్యాక్ టూ బ్యాక్ ఝలక్కు తగిలాయి. ఒకవైపు ఆయన రిమాండ్ను రెండు రోజులు పొడిగించింది ఏసీబీ కోర్టు. మరోవైపు హైకోర్టు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. ఇంకోవైపు.. ఆయన్ని సీఐడీ విచారణకు అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. వీటితో పాటు ఆయన బెయిల్ పిటిషన్పై వాదనలను కూడా అనిశా(ACB) కోర్టు వాయిదా వేయడం గమనార్హం. స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుడిని ఐదురోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై సుదీర్ఘ వాదనలు జరగ్గా.. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. తీర్పు సమయంలో చంద్రబాబును ఎక్కడ విచారిస్తారనే దానిపై సీఐడీ సమాధానం ఆధారంగా తీర్పు ఉంటుందని తొలుత ఏసీబీ న్యాయమూర్తి చెప్పారు. అయితే.. ఫొటోలు, వీడియోలు బయటకు రావొద్దు ఆయన్ని జైల్లోనే విచారిస్తామని సీఐడీ సమాధానం ఇవ్వడంతో.. చంద్రబాబును రాజమండ్రి జైల్లోనే రెండ్రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. ‘‘విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లు ఇవ్వండి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గం. లోపు విచారణ పూర్తి చేయాలి. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు లాయర్లను అనుమతిస్తాం. ఇబ్బందులేమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి అని న్యాయమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. అలాగే.. చంద్రబాబు విచారణ జరిగే సమయంలో ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చూడాలని జడ్జి ఈ సందర్భంగా సీఐడీ అధికారులను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టు కస్టడీ తీర్పుతో.. రేపు(శనివారం), ఆదివారం జైల్లోనే చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అలా ఎలా వింటాం? మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై రేపు వాదనలు వినిపిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. కస్టడీ విచారణ జరిగే సమయంలో వాదనలు ఎలా వింటామని?.. అలా వినడం సరికాదని పేర్కొంది ఏసీబీ కోర్టు. ఆపై.. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై వాదనలు సోమవారం వింటామని తెలిపింది. అంతకు ముందు రెండు అంతకు ముందు చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ ముగిసి పోవడంతో.. ఏసీబీ కోర్టు మరో రెండు రోజులపాటు పొడిగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే హైకోర్టులోనూ పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. అయితే సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ‘‘ఇంత దర్యాప్తు జరిగిన తర్వాత.. ఈ దశలో తాము జోక్యం చేసుకోమని.. దర్యాప్తును ఆపే ఆదేశాలు ఇవ్వలేమని చెబుతూ క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. -
సీఐడీ కస్టడీకి చంద్రబాబు
-
మాదాపూర్ డ్రగ్స్ కేసు: నిందితుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితులను నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిన్వివగా, బాలాజీ, వెంకట రత్నారెడ్డి, మురళిలను గుడిమల్కాపూర్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. 18 మందికి మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు.. సినీ రంగానికి చెందిన పలువురికి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. చదవండి: పెరుగు అడిగితే చంపేశారు! కాగా, టీఎస్–నాబ్ అధికారులకు గుడిమల్కాపూర్లో దొరికిన డ్రగ్స్ తీగ లాగితే... మాదాపూర్ విఠల్నగర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జరుగుతున్న రేవ్ పార్టీ డొంక కదిలింది. ఈ వ్యవహారంలో ఓ ఫిల్మ్ ఫైనాన్షియర్ సహా ముగ్గురిని పట్టుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరుకు చెందిన బి.బాలాజీ ఇండియన్ నేవీలో పనిచేస్తుండగా, కంటికి తీవ్రమైన గాయమైంది. మెడికల్లీ అన్ఫిట్ కావడంతో నేవీ నుంచి బయటకు వచ్చి వ్యాపారిగా మారాడు. తరచూ హైదరాబాద్కు వచ్చి వెళ్లే బాలాజీ తన స్నేహితులతో కలిసి మాదాపూర్ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో జరిగే రేవ్ పార్టీలకు హాజరయ్యేవాడు. ఇలా హైదరాబాద్తోపాటు బెంగుళూరులో ఉన్న డ్రగ్ పెడ్లర్స్తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆపై రేవ్ పార్టీలు ఏర్పాటు చేయడం బాలాజీకి వ్యాపకంగా మారింది. స్నేహితులతో పాటు పరిచయస్తుల కోసం నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ఫామ్హౌస్లు, గెస్ట్ హౌస్ల్లో వీటిని నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న నైజీరియన్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని, వారి నుంచి మాదకద్రవ్యాలు ఖరీదు చేసేవాడు. ఆపై పార్టీలు నిర్వహిస్తూ, విక్రయాలు ప్రారంభించాడు. బాలాజీ ఖాతాదారుల్లో సినీరంగానికి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. గుంటూరులోని నెహ్రూనగర్కు చెందిన వెంకట రత్నారెడ్డి గతంలో జూబ్లీహిల్స్ పరిధిలో ఓ గెస్ట్హౌస్ లీజుకు తీసుకున్నాడు. ఇందులో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో అప్పట్లో పోలీసులు దాడి చేయగా, నిర్వాహకులు పరారయ్యారు. ఈ కేసులో చిక్కిన వెంకట రత్నారెడ్డి ఆపై అమెరికా వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగిన వచ్చిన తర్వాత తన సన్నిహితులకు సంబంధించిన ప్రొడక్షన్ సంస్థ నిర్వహిస్తూ ఫిల్మ్ ఫైనాన్షియర్గా మారాడు. డమరుకం, కిక్, బిజినెస్మ్యాన్, లవ్లీ, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశాడు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీలకు వెళ్లడం అలవాటైంది. రేవ్ పార్టీలు నిర్వహించే వారికి ఫైనాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా బాలాజీతో కూడా పరిచయం ఏర్పడింది. బెంగళూరుకు చెందిన ముగ్గురు నైజీరియన్లతో పాటు విశాఖపట్నానికి చెందిన మరో వ్యక్తి నుంచి డ్రగ్స్ ఖరీదు చేసిన బాలాజీ వీటిలో కొన్నింటిని వెంకట రత్నారెడ్డికి అందించాడు. ఈ మాదకద్రవ్యాలతో మాదాపూర్లోని అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. రేవ్ పార్టీకి హాజరుకావడానికి మరికొన్ని మాదకద్రవ్యాలను తీసుకొని వస్తున్న బాలాజీ కదలికలపై టీఎస్–నాబ్కు సమాచారం అందింది. ఏసీపీ కె.నర్సింగ్రావు, ఇన్స్పెక్టర్ పి.రాజేష్లతో కూడిన బృందం వలపన్ని పట్టుకుంది. బాలాజీ వద్ద నుంచి కొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ప్రశ్నించగా, సర్వీస్ ఫ్లాట్ విషయం చెప్పా డు. దీంతో పోలీసులు ఆ ఫ్లాట్ పై దాడి చేశారు. అక్కడ వెంకట రత్నారెడ్డితో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ వద్ద సీనియర్ స్టెనోగా పనిచేస్తున్న డి.మురళి పట్టుబడ్డాడు. మద్యంమత్తులో మ్యూజిక్ పెట్టుకుని చిందులు వేస్తున్న వీరు డైనింగ్ టేబుల్పై ప్లేట్లో ఉంచిన కొకైన్ను కరెన్సీ నోటు సాయంతో ముక్కులోకి పీలుస్తున్నారు. వీరి వద్ద టీఎస్–నాబ్ బృందం 2.8 గ్రాముల కొకైన్, ఆరు ఎల్ఎస్డీ బోల్ట్స్, 25ఎక్స్టసీ పిల్స్, రెండు ప్యాకెట్ల గాంజా, రూ.72,500 నగదు, రెండు కార్లు, ఐదుసెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.32.89 లక్షలుగా నిర్థారించారు. డ్రగ్ పెడ్లర్గా మారిన బాలాజీ కస్టమర్లలో సినీరంగానికి చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు కొందరు నటీనటులు ఉన్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వీళ్లందరితో బాలాజీ సోషల్మీడియా యాప్ స్నాప్చాట్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. సందేశాలు, కాల్స్ అన్నీ దీని ద్వారానే చేసేవాడు. ఇందులో వారివారి కాంటాక్ట్స్ ర్యాంబో, కిమ్స్, కింగ్, క్యాచీ, సూపర్ వంటి కోడ్ నేమ్స్తో ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్లో ఫోన్నంబర్లు సహా ఇతర వివరాలు కనిపించకపోవడంతో వారిని గుర్తించడానికి లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక వివరాలను బట్టి 18 మందిని కస్టమర్లుగా గుర్తించి వారి కోసం గాలిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నైజీరియన్లతో సహా నలుగురు పెడ్లర్స్ కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. వెంకట రత్నారెడ్డి ఇద్దరు ఢిల్లీ యువతులను సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ తీసుకొచ్చాడు. వీళ్లిద్దరూ సైతం ఆ అపార్ట్మెంట్లోని సర్వీస్ ఫ్లాట్లో పోలీసులకు చిక్కారు. -
చంద్రబాబు కస్టడీపై ఉత్కంఠ
-
5 రోజులు కస్టడీకి అప్పగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ సోమవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ స్కామ్ గురించి, మిగిలిన నిందితుల పాత్ర గురించి చంద్రబాబుకు చాలా విషయాలు తెలుసని, అందువల్ల ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందంటూ సీఐడీ డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. కస్టడీకి ఇచ్చే సమయంలో ఎలాంటి షరతులు విధించినా తమకు అభ్యంతరం లేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ నిధుల మళ్లింపు, లబ్ధిదారులు ఎవరన్న విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. నిధుల దుర్వినియోగంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీనే అంతిమ లబ్ధిదారులని తెలిపారు. స్కామ్ జరిగిన తీరును ఈ పిటిషన్లో వివరించారు. ‘ఈ స్కామ్ వెనుక కొందరి ఆర్థిక పరమైన దుష్ప్రవర్తన, లోతైన కుట్ర దాగి ఉంది. వీటి వెనకు అసలు కారణాలన్నింటినీ చంద్రబాబు నుంచి తెలుసుకోవాల్సిన అవసరం దర్యాప్తు సంస్థకుంది. అధికార బాధ్యతలను పక్కన పెట్టి వ్యక్తుల లబ్ధి కోసం భారీ, లోతైన కుట్రకు పాల్పడారు. మాకు కావాల్సిన సమాచారాన్ని చంద్రబాబు నుంచి రాబట్టినప్పుడే ఈ ఆర్థిక మోసం పూర్తిగా బయటపడుతుంది. ఈ స్కామ్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను మాయం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన లబ్ధిదారులు చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీనారాయణ. మాయం చేసిన ఫైళ్లు ఎక్కడ ఉన్నాయన్న విషయాలను చంద్రబాబును విచారించి రాబట్టాల్సి ఉంది. షెల్ కంపెనీల ద్వారా, పలువురు వ్యక్తుల సాయంతో మొత్తం డబ్బు తిరిగి చంద్రబాబుకే చేరింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను చంద్రబాబు నుంచి రాబట్టాల్సి ఉంది. చంద్రబాబును అరెస్ట్ తరువాత విచారించాం. అయితే ఆయన విచారణకు సహకరించలేదు. అందువల్ల 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదిని ఆదేశించింది. కౌంటర్ దాఖలు తరువాత ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతామని తెలిపింది. -
కస్టడీలోకి తీసుకుని విచారించాలి
సాక్షి, అమరావతి: ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత చంద్రబాబుపై ఉందని, దీని నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసు ఇచ్చి సమాధానం అడిగింది. సమాధానం చెప్పడంలో ఆలస్యం అయితే చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారణ చేయాలి. నోటీసులు ఎవరు ఇవ్వాలో కూడా ఆయనే చెబుతారా? కేంద్రంలో అనేక ప్రభుత్వాలను నడిపించానని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పరు? తన చేతికి కనీసం ఒక రింగు కూడా లేదని పదేపదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏమంటారు? విక్కీ జైన్, మనోజ్ పార్థసాని ఎవరో చంద్రబాబుకు తెలీదా? విక్కీ జైన్ ద్వారా చంద్రబాబుకు డబ్బు చేరవేశారని ఐటీ శాఖ చెబుతోంది. విక్కీ జైన్ ఎవరో తెలియదని చంద్రబాబును చెప్పమనండి. వాళ్ల వాట్సాప్ చాట్స్లో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఐటీ శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే మరిన్ని డబ్బుల వివరాలు బయటపడతాయి. తక్షణం విక్కీ జైన్, మనోజ్ పార్థసానిని కస్టడీలోకి తీసుకుని ప్రజాధనాన్ని ట్రెజరీకి అప్పజెప్పాలి. అమరావతిలో చంద్రబాబు అవినీతిలో దొరికింది కొంతే. అనేక లావాదేవీల్లో ఐటీ శాఖ కేవలం రూ.118 కోట్లను మనోజ్ పార్థసాని ద్వారా పట్టుకుంది. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయదు. ఆ చానళ్లలో ఒక్కరూ చర్చించరు. ఆ పత్రికలు చాలా విషయాలు రాస్తాయి. మరి బాబు అవినీతిపై ఎందుకు దాస్తున్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే రాస్తారా? ప్రజాధనం దుర్వినియోగంపై వార్తలను ప్రజలకు అందివ్వరా?’ అని మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. -
ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో శుక్రవారం రాత్రి అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ను.. మనీ లాండరింగ్ కేసులను విచారించేందుకు ఏర్పాటైన ముంబైలోని ప్రత్యేక కోర్టు సెపె్టంబర్ 11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపుతూ శనివారం ఆదేశించింది. కెనెరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ నరేష్ గోయల్, భార్య అనితపై సీబీఐ మే 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణ పరిమితులు, రుణాలు మంజూరు చేశామని.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలున్నాయన్న కెనరా బ్యాంకు ఫిర్యాదుపై కేసు నమోదైంది. -
పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేతలు!
సిరిసిల్ల: సీపీఐ (ఎంఎల్) జనశక్తి పార్టీ అగ్రనేతలు కూర రాజన్న అలియాస్ రాజేందర్, కూర దేవేందర్ అలియాస్ అమర్, వెంకటేశ్తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు విమలక్క, కొమురన్న, సంతోష్ గురువారం ప్రకటించారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్తున్న రాజన్న, అతనితోపాటు ఉన్న వెంకటేశ్ను హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అమర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 12 రకాల అనారోగ్య సమస్యలతో ఉన్న కూర రాజన్నతోపాటు అతని సహాయకుడు వెంకటేశ్ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ ముగ్గురికి సంబంధించిన ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయని ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ప్రకటించింది. పోలీసులు వెంటనే వారిని మీడియా ముందు ప్రవేశపెట్టి, ఏమైనా కేసులుంటే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేశారు. వారికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. కాగా, కూర రాజన్న, అమర్, వెంకటేశ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడం సమీపంలోని ఒక తోటలో విచారిస్తున్నట్లు తెలిసింది. -
ఎన్ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష
టంగుటూరు: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. అనంతరం ఆమెను టంగుటూరు పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి, ఐదు నిమిషాలు అక్కడ ఉంచారు. అనంతరం సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్సై శ్రీరామ్, ఒంగోలు దిశ ఎస్సై ఫిరోజ్ ఫాతిమాల సమక్షంలో ఆమెను అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లారన్నది తెలియరాలేదు. ఈ సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆమెను ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారో కూడా వెల్లడించలేదు. గతంలోనూ తనిఖీ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్ఘడ్కు చెందిన ఎన్ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది. ఆ సమయంలో శిరీష వైద్యం నిమిత్తం విజయవాడ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో విరసం నేత కళ్యాణరావును తీసుకొచ్చారు. శిరీష లేకుండా తలుపులు తీయడానికి ఆయన నిరాకరించడంతో తహసీల్దార్, వీఆర్వో సమక్షంలో తాళం పగలగొట్టారు. శిరీష ఇంటి నుంచి సాధారణ షాపుల్లో దొరికే కొన్ని పుస్తకాలు, పలు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇది అక్రమ అరెస్టు: కళ్యాణరావు శిరీషను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొన్నట్లు తెలుసుకున్న విప్లవ రచయితల సంఘం నేత గంగుల కళ్యాణరావు హుటాహుటిన స్టేషన్కు వచ్చారు. కళ్యాణరావు, ఇతర బంధువులు ఎస్సై శ్రీరామ్తో మాట్లాడారు. అనంతరం కళ్యాణరావు మీడియాతో మాట్లాడుతూ.. శిరీషను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఎన్ఐఏ బృందం తమ కుటుంబానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శిరీషను బలవంతంగా తీసుకెళ్లిందని, ఎక్కడ ఉంచారన్నదీ ఇప్పటివరకు తెలపకపోవడం దారుణమని చెప్పారు. ఎవరినైనా అరెస్టు చేసే ముందు కుటుంబ సభ్యులకు తెలపాలని అన్నారు. శిరీషను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.శిరీషపై పెట్టినవన్నీ బూటకపు కేసులేనని అన్నారు. -
అమెరికా ఆర్మీ క్యాంపుల్లో కొందరు నేరగాళ్లు
అమెరికాలోని శాన్ డియాగోలోగల మెరైన్ కార్ప్స్ బేస్ క్యాంప్ పెండిల్టన్లోని బ్యారక్స్లో గతంలో తప్పిపోయిన 14 ఏళ్ల బాలిక ఆచూకీ లభ్యం కావడంతో ఒక యూఎస్ మెరైన్ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బాధిత బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆ బాలికను ఎవరో అక్రమంగా విక్రయించారని, ఆ వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపించారు. శాన్ డియాగో కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం మతిస్థిమితం లేని ఒక బాలిక జూన్ 9 న ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయి, ఇంటికి తిరిగి రాలేదని జూన్ 13 న ఆ బాలిక అమ్మమ్మ పోలీసుకు ఫిర్యాదు చేసింది. కాగా ఆబాలిక అదృశ్యమైన 20 రోజుల తర్వాత జూన్ 28న మిలటరీ పోలీసులు ఆమెను బ్యారక్స్ లోపల కనుగొన్నారని ఆమె అత్త కాసౌండ్రా పెరెజ్ తెలిపారు. ‘ఆ బాలిక ఆచూకీ మిలటరీ పోలీసులకు బ్యారక్లో లభ్యమయ్యింది. లైంగిక కార్యకలాపాల కోసం ఆమెను ఎవరో సైనికునికి విక్రయించారు’ అని పెరెజ్ టిక్టాక్ వీడియోలో తెలిపారు. మెరైన్ బేస్ క్యాంప్లో బాలిక ఉందని షెరీఫ్ డిపార్ట్మెంట్ ధృవీకరించింది. కాగా ఆ బాలిక గతంలోనూ ఇంటి నుంచి ఎక్కడికైనా వెళ్లిపోయేదని, అయితే త్వరగా ఇంటికి తిరిగి వచ్చేదని ఆమె అమ్మమ్మ మీడియాకు తెలిపారు. నేవల్ క్రిమినల్ ఇన్వెస్టిగేటివ్ సర్వీస్ కు చెందిన షెరీఫ్ విభాగం, శాన్ డియాగో హ్యూమన్ ట్రాఫికింగ్ టాస్క్ ఫోర్స్ సాయంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. కంబాట్ లాజిస్టిక్స్ బెటాలియన్ 5, 1వ మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్లో సభ్యుడైన ఒక మెరైన్ను జూన్ 28న ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్ కెప్టెన్ చక్ పామర్ తెలిపారు. కాగా పేరు వెల్లడికాని ఆ మెరైన్పై ఇంకా అభియోగాలు మోపలేదు. మెరైన్ కార్ప్స్ చేతికి సంకెళ్లి వేసి పోలీసులు తీసుకెళ్లిన ఫోటో ఇలీవల సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. కాగా తన మేనకోడలిపై జరిగిన అత్యాచారాన్ని సైన్యం కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని పెరెజ్ ఆరోపించారు. ఈ ఘటనకు బేస్ క్యాంప్దే బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. వారే ఆ బాలికను బేస్లోకి తీసుకురావడానికి అనుమతించారు. అక్కడ అతను ఆమెతో లైంగిక సంబంధం కొనసాగించాడని ఆమె ఆరోపించారు. బాధితురాలు నిస్సహాయ స్థితిలో ఉన్నందున అడ్డుకోలేకపోయిందని పెరెజ్ అన్నారు. కాగా అధికారులు ఆ బాలికను ఆమె అమ్మమ్మకు అప్పగించారు. ఇది కూడా చదవండి: బయటకు కనిపించే బైడెన్ లోపల వేరు.. కేకలేస్తాడు -
పోలీస్ కస్టడీకి వాణిజ్యపన్నుల అధికారులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వాణిజ్య పన్నుల శాఖ విజయవాడ డివిజన్–1 కార్యాలయం ఇంటెలిజెన్స్ విభాగంలో జీఎస్టీ అధికారులు బి.మెహర్కుమార్, కె.సంధ్య, సీనియర్ అసిస్టెంట్ కె.వి.చలపతి, ఆఫీస్ సబార్డినేట్ ఎం.సత్యనారాయణలను పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. నలుగురు ఉద్యోగులు విధులను దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.కోట్ల అవినీతికి పాల్పడుతున్నట్లు రాష్ట్ర పన్నులశాఖ కార్యాలయం డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 31వ తేదీన కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల్ని విజయవాడ మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులు నలుగురికి రిమాండ్ విధించిందన్నారు. నలుగురు ఉద్యోగులు కార్యాలయంలోని పలు రికార్డులను తారుమారు చేశారని, ఈ అవినీతిలో మరి కొందరు అధికారుల పాత్రపై విచారించాల్సి ఉన్నందున నిందితులను తమకు అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరినట్లు చెప్పారు. న్యాయాధికారి ఆదేశాలతో ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నలుగురు ఉద్యోగులను పోలీస్ కస్టడీకి తీసుకుంటున్నట్లు సీపీ తెలిపారు. చదవండి: IAS vs IPS: ఐపీఎస్ రూపకు ముందస్తు బెయిల్ -
ఫ్లాప్స్ తట్టుకోలేక యూ టర్న్ తీసుకున్న అక్కినేని బ్రదర్స్
-
Custody Review: ‘కస్టడీ’ మూవీ రివ్యూ
టైటిల్: కస్టడీ నటీనటుటు: నాగచైతన్య, అరవింద స్వామి, శరత్కుమార్, కృతీశెట్టి, ప్రియమణి, రామ్కీ, సంపత్ రాజ్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాత: శ్రీనివాస చిట్టూరి రచన- దర్శకుడు: వెంకట్ ప్రభు సంగీతం: ఇళయరాజా,యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్. కథిర్ ఎడిటర్: వెంకట్ రాజేన్ విడుదల తేది: మే 12, 2023 గతేడాది నాగచైతన్య హీరోగా నటించిన థాంక్యూ, కీలక పాత్ర పోషించిన లాల్ సింగ్ చడ్డా..రెండూ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడ్డాయి. దీంతో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ‘కస్టడీ’ చిత్రం చేశాడు. సాలిడ్ హిట్తో పాటు తమిళ్లో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని భావిస్తున్నాడు. అందుకే ‘కస్టడీ’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ని క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య నేడు (మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? చైతూకి సాలిడ్ హిట్ లభించిందా?లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1990 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. శివ(నాగచైతన్య).. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఓ సిన్సియర్ కానిస్టేబుల్. డ్యూటీ అంటే ప్రాణం పెడతాడు. ఓ సారి అంబులెన్స్కి దారి ఇప్పించడం కోసం ముఖ్యమంత్రి దాక్షాయణి(ప్రియమణి) కాన్వాయ్ని ఆపి వార్తల్లోకి ఎక్కుతాడు. శివకి డ్రైవింగ్ స్కూల్లో పనిచేసే రేవతి(కృతిశెట్టి) అంటే చాలా ఇష్టం. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే కులాలు వేరుకావడంతో రేవతి ఫ్యామిలీ ఒప్పుకోదు. దీంతో ఇద్దరు కలిసి పారిపోదామనుకుంటారు. డ్యూటీ ముగించుకొని మరో కానిస్టేబుల్తో కలిసి రేవతి ఇంటకి వెళ్తున్న క్రమంలో ఓ కారు వచ్చి వీరి స్కూటర్ని గుద్దుతుంది. ఆ కారులో రాజు(అరవింద స్వామి), , సీబీఐ ఆఫీసర్ జార్జ్ (సంపత్ రాజ్) ఉంటారు. రాజు బాగా మద్యం సేవించి ఉండడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొస్తారు. విషయం తెలుసుకొని ఐజీ నటరాజన్(శరత్ కుమార్)తో సహా కొంతమంది రౌడీలో రాజుని చంపడానికి స్టేషన్కి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాజు నేపథ్యం ఏంటి? అతన్ని చంపడానికి పోలీసులతో పాటు సీఎం దాక్షాయణి మనుషులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వారి నుంచి రాజుని రక్షించిన శివ.. బెంగళూరు ఎందుకు తీసుకెళ్లాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. వెంకట్ ప్రభు సినిమాల్లో స్క్రీన్ప్లే అద్భుతంగా ఉంటుంది. కథ పాతదే అయినా ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. ఊహించని ట్విస్టులు ఉంటాయి. కస్టడీ చిత్రంలో వెంకట్ ప్రభు మ్యాజిక్ అంతగా వర్కౌట్ కాలేదు. అతని స్క్రీన్ప్లే మాయ కొన్ని చోట్ల మాత్రమే పని చేసింది. అయితే ఈ సినిమాలో కొత్తదనం ఏంటంటే.. ఒక విలన్ని కాపాడడానికి హీరో ప్రయత్నించడం. విలన్ని రక్షించుకోవడం కోసం హీరో పడ్డ కష్టాలు ఏంటి అనేది ఈ సినిమా కథ. కథ బాగున్నప్పటికీ కథనం మాత్రం రొటీన్గా సాగుతుంది. సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత అసలు కథ మొదలవుతుంది. అప్పటి వరకు నడిపించిన లవ్స్టోరీ అంతగా ఆకట్టుకోలేదు. అరవింద్ స్వామి పాత్ర ఎంటర్ అయ్యాక కథ మొదలైయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత కథ కాస్త ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ కూడా సాధారణంగానే ఉంటుంది. ఇక సెకండాఫ్లో కథ సీరియస్గా సాగుతుంది. కానీ తర్వాత ఏం జరుగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేదే ముందే ఊహించొచ్చు. సెకండాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్, ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. దానికి తోడు స్లో నెరేషన్ కూడా ఇబ్బందిగా మారుతుంది. ఎవరెలా చేశారంటే.. కానిస్టేబుల్ శివ పాత్రలో నాగచైతన్య ఒదిగి పోయాడు. యాక్షన్ సన్నివేశాలు ఇరగదీశాడు. రేవతిగా కృతీశెట్టి ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక సినిమా మొత్తంలో అరవింద్ స్వామి పాత్రని బాగా హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అతనికి ఇచ్చే ఎలివేషన్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్లుగా క్యారెక్టర్ డెప్త్ లేదు. ఇక ముఖ్యమంత్రి దాక్షాయణిగా ప్రియమణి పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రకి బలమైన సన్నివేశాలు లేవు. పోలీసు ఉన్నతాధికారిగా శరత్ కుమార్ మెప్పించాడు. యాక్షన్ సన్నివేశాలు బాగానే చేశాడు. రాంకీ, జయసుధల పాత్రల నిడివి చాలా తక్కువ. ఆ పాత్రలకు ఇంతపెద్ద నటులు అవసరం లేదనిపిస్తుంది. హీరో అన్నయ్య విష్ణుగా జీవా, అతని ప్రియురాలుగా ఆనందితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. పాటలు అంతగా ఆకట్టుకోకపోవడమే కాకుండా.. సాఫీగా సాగుతున్న కథకి అడ్డంకిగా మారాయి. ఎస్.ఆర్. కథిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
Custody Movie : నాగచైతన్య ‘కస్టడీ’ మూవీ స్టిల్స్
-
సీనియర్ నటుల నుంచి చాలా చేర్చుకున్నా: నాగచైతన్య
‘‘ఓ నటుడుగా నన్ను నేనెప్పుడూ విమర్శించుకుంటూనే ఉంటాను... అభినందించుకోను. ఎప్పటికప్పుడు తప్పులు వెతుకుతూనే ఉంటాను.. నటుడిగా నన్ను నేను మెరుగుపరచుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను’’ అని అన్నారు నాగచైతన్య. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘కస్టడీ’. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో జరిగిన విలేకర్ల సమావేశంలో నాగచైతన్య చెప్పిన విశేషాలు. ► తమిళ చిత్రం ‘మానాడు’ విడుదల కాకముందే వెంకట్ ప్రభుగారు నాకు ‘కస్టడీ’ స్టోరీ చెప్పారు. అయితే ‘మానాడు’ విడుదలై, హిట్ సాధించిన తర్వాత, ఈ సినిమానే మేం తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్నట్లుగా కొందరు నిర్మాతలు అభిప్రాయపడ్డారు. కానీ ‘కస్టడీ’ స్టోరీ నన్ను ఎగ్జయిట్ చేసింది. పైగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొంతవరకు పూర్తయింది. దీంతో ‘కస్టడీ’ని సెట్స్పైకి తీసుకెళ్లాం. ఈ సినిమాలో భాగంగా కొందరు పోలీసులను కలిశాను. వారి కథలు నన్ను చాలా ఇన్స్పైర్ చేశాయి. ► ఈ సినిమాలో నేను పోలీస్ కానిస్టేబుల్ శివ పాత్ర చేశాను. నా కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి కొన్ని కొత్త యాక్షన్ సీక్వెన్స్లను ఈ సినిమా కోసం చేశాం. కథ రీత్యా ఈ తరహా యాక్షన్ సీక్వెన్స్లు అవసరం అయ్యాయి. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం కొంత రిహార్సల్స్ చేశాం. ఈ సినిమాలోని వాటర్ సీక్వెన్స్ కోసం మూడు రోజులు రిహార్సల్స్ చేసి, దాదాపు 15 రోజులు షూట్ చేశాం. ఈ ఎపిసోడ్ ఓ హైలైట్గా ఉంటుంది. ► సినిమా మొదలైన తొలి ఇరవై నిమిషాలు కూల్గా ఉంటుంది. ఎప్పుడైతే స్క్రీన్పైకి అరవింద్ స్వామిగారు వస్తారో అప్పట్నుంచి స్టోరీ మలుపు తీసుకుని ఆడియన్స్ను స్క్రీన్పై నుంచి చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఈ చిత్రంలో శరత్ కుమార్, అరవింద్ స్వామి, ప్రియమణి వంటి సీనియర్స్ నటించారు. వారి నుంచి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఇచ్చిన డైలాగ్స్ను తనదైన స్టైల్లో ఇంప్రూవ్ చేసి చెబుతుంటారు అరవింద్ స్వామిగారు. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. వెంకట్గారు ఏ స్క్రిప్ట్ అయితే నాకు చెప్పారో అదే తీశారు. ఆయన స్క్రీన్ప్లే స్టయిల్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ స్టోరీకి తగ్గట్లుగానే ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవుట్పుట్ పట్ల చాలా నమ్మకంతో ఉన్నాను. పోలీస్ బ్యాక్డ్రాప్ సినిమాల్లో నాకు ‘ఘర్షణ’, నాన్నగారి ‘శివమణి’, ‘జేమ్స్ బాండ్’ యాక్షన్ ఫ్రాంచైజీ చిత్రాలు ఇష్టం. ► నిర్మాత శ్రీనివాసా చిట్టూరిగారు సెట్స్లో కూల్గా ఉంటారు. ‘కస్టడీ’ నా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో నిర్మించబడింది. ఈ సినిమా 1990 బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఇళయరాజాగారు, యువన్ శంకర్రాజాగార్లు ఇచ్చిన మ్యూజిక్ ‘కస్టడీ’కి ప్లస్. ‘కస్టడీ’ని వేరే సినిమాతో పోల్చవద్దు. ‘కస్టడీ’ చిత్రం ‘కస్టడీ’యే. ► నేను తెలుగు డబ్బింగ్ కోసం దాదాపు పది రోజులు తీసుకుంటాను. కానీ తమిళ ‘కస్టడీ’ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేయడానికి నెలరోజుల టైమ్ పట్టింది. నా సొంత వాయిస్ అయితే ఆడియన్స్కు యాక్టర్గా చేరువకావొచ్చు. మన పెర్ఫార్మెన్స్ కూడా మెరుగ్గా కనిపిస్తుంది. అందుకే తమిళంలో డబ్బింగ్ చెప్పాను. ► నేను ఫలానా రకమైన సినిమాలు చేస్తేనే ఆడియన్స్కు నచ్చుతాయని అదే ట్రాక్లోకి వెళితే ఓ యాక్టర్గా అది నా బలహీనత అవుతుంది. ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేను. గతంలో నేను చేసిన కొన్ని లవ్స్టోరీలు వర్కౌట్ అయ్యాయి. అలా అని అవే సినిమాలు చేస్తుంటే ఓ యాక్టర్గా ఎదగలేను. చైతన్య ఎలాంటి సబ్జెక్ట్ అయినా బాగా చేస్తాడని ఆడియన్స్తో అనిపించుకోవాలి. ► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులకు ఏ రకమైన సినిమాలు నచ్చుతున్నాయో తెలుసుకోవడం చాలెంజ్లా మారింది. కానీ ఆడియన్స్కు నచ్చే సినిమా ఇస్తే వారి ఆదరణ ఓ రేంజ్లో ఉంటుంది. ► నా తర్వాతి ప్రాజెక్ట్ గురించి త్వరలో అధికారికంగా చెబుతాను. ‘ధూత’ వెబ్ సిరీస్ రిలీజ్ అమెజాన్ చేతిలో ఉంది. ఈ ఏడాదే స్ట్రీమింగ్ స్టార్ట్ కావొచ్చు. మా తాతగారు, నాన్నగారు గొప్ప గొప్ప సినిమాలు చేశారు. కొన్ని స్టాండర్ట్స్ క్రియేట్ చేశారు. కొందరు వారితో మాకు పోలికలు పెడుతుంటారు. అయితే ఈ విషయాన్ని నేను ఓ ప్రెజర్లా తీసుకోను. చాలెంజ్లా స్వీకరించి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ స్థాయికి నేను రీచ్ అవుతానా? లేదా అనేది నాకు తెలియదు. కానీ నా శక్తివంచన లేకుండా కష్టపడుతూనే ఉంటాను. నా గురించిన కొన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి (విడాకుల అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ..). డిఫరెంట్ వార్తలు రాస్తున్నారు. కానీ ఆడియన్స్ ఫూల్స్ కాదు. తెలివైనవారు. ఏది జెన్యూన్ న్యూస్.. ఏది కాదనేది వారికి తెలుసని అనుకుంటున్నాను. నేను అయితే నవ్వుకుని వదిలేస్తున్నాను. -
Imran Khan: కస్టడీకి ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: అవినీతి సంబంధిత కేసుల్లో పీటీఐ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కస్టడీ విధించింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే దర్యాప్తు సంస్థ ది నేషనల్ అకౌంటబిలిటీ(NAB) పదిరోజుల కస్టడీకి కోరగా.. కోర్టు మాత్రం ఎనిమిది రోజులకు మాత్రమే అనుమతించింది. ఓ (Al-Qadir Trust Case) కేసులో విచారణలో భాగంగా కోర్టుకు హాజరైన ఆయన్ని .. సైన్యం సాయంతో దర్యాప్తు సంస్థ మంగళవారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఆయన్ని రాత్రికి రాత్రి అజ్ఞాతంలోకి తరలించారు. అయితే ఇవాళ కోర్టు(National Accountability Bureau Court)లో ఆయన్ని హాజరు పర్చగా.. అవినీతి సంబంధిత కేసుల్లో ఇమ్రాన్ ఖాన్కు ప్రశ్నించేందుకు కస్టడీ కోరింది ఎన్ఏబీ. కానీ, కోర్టు మాత్రం 8 రోజులకు అనుమతి ఇచ్చింది. అయితే రాత్రికి రాత్రే తనకు నరకం చూపించారంటూ ఆరోపణలకు దిగారు ఇమ్రాన్ ఖాన్. కనీసం వాష్రూం కూడా వినియోగించుకోనివ్వకుండా తనను టార్చర్ చేశారంటూ కోర్టులో బోరుమన్నాడు ఇమ్రాన్ ఖాన్. అంతేకాదు.. నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించడానికి తనకు ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపించారాయన.మే 17వ తేదీన ఈ కేసులో తదుపరి వాదనలు విననుంది కోర్టు. An accountability court sends former PM Imran Khan on 8-day physical remand to the National Accountability Bureau in Al-Qadir Trust case, reports Pakistan media. — ANI (@ANI) May 10, 2023 మరోవైపు పీటీఐ కార్యకర్తలు పాక్ను అగ్గిగుండంగా మార్చేశారు. ఒకవైపు ఇస్లామాబాద్లో గుమిగూడాలని పిలుపు ఇస్తూనే.. మరోవైపు ధర్నాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పీటీఐ ముఖ్యనేతలను సైతం అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇక పెషావర్ ఆందోళనల్లో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బంద్కు పిలుపు ఇచ్చింది పీటీఐ. ఇదీ చదవండి: ఖాన్ అరెస్ట్పై ఆందోళన -
నాగచైతన్య, కృతి శెట్టి ఇంటర్వ్యూ
-
కస్టడీ ట్రైలర్ చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ట్రైలర్ మొత్తం ఇదే
-
హైదరాబాద్ : నాగచైతన్య ‘కస్టడీ’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
అందరూ నా కస్టడీ లోకి రావాలి
‘‘కస్టడీ’ సినిమా తొలి 20 నిమిషాలు డైరెక్టర్ వెంకట్గారిలా కూల్గా వెళుతుంది. 40వ నిమిషం నుంచి ఫాస్ట్గా వెళుతుంది.. థియేటర్లో బ్లాస్టే. అద్భుతమైన యాక్షన్స్ సీక్వెన్స్ ఉన్నాయి. నిజంగా ఒక కొత్త చైతూని (నాగచైతన్య) చూడబోతున్నారు.. అలా నా పాత్రని తీర్చిదిద్దారు వెంకట్గారు. ఈ నెల 12న మీరందరూ (ప్రేక్షకులు, అభిమానులు) నా కస్టడీ లోకి రావాలని, నా కస్టడీలోనే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని నాగచైతన్య అన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతీశెట్టి జంటగా నటించిన చిత్రం ‘కస్టడీ’. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాగచైతన్య మాట్లాడుతూ – ‘‘కస్టడీ’ కథని వెంకట్గారు నాకు చెప్పినప్పుడు తొలిసారి నేను పైకిలేచి వెంటనే ఆయన్ని హత్తుకున్నా.. నాకు అంత ఎగై్జట్మెంట్ ఇచ్చింది ఈ కథ. ఎడిటింగ్ రూంలో చూసినప్పుడు కూడా అదే ఎగై్జట్మెంట్ వచ్చింది. అదే నమ్మకంతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా. అజిత్, సూర్య, కార్తీ, శింబుగార్లతో వెంకట్గారు సినిమాలు తీసి తమిళ్లో ఎన్నో పెద్ద హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన ఆయనకు స్వాగతం. నా కెరీర్లో భారీ బడ్జెట్ మూవీ ‘కస్టడీ’ అని చెప్పగలను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు శ్రీనివాస్, పవన్గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు. వెంకట్ ప్రభు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో చైతన్యగారి స్టైల్, యాక్షన్, నటన, ఫ్యామిలీ సెంటిమెంట్, మాస్... ఇలా అన్నీ ఉన్నాయి. ఈ మూవీలో మీకు ఓ పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది. ‘కస్టడీ’ రెండో పార్ట్ కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘అందరూ థియేటర్స్కి వచ్చి ‘కస్టడీ’ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు నటి ప్రియమణి. ఈ వేడుకలో కృతీశెట్టి, నటుడు ప్రేమ్జీ తదితరులు పాల్గొన్నారు. -
నాగచైతన్యతో నటించడం మంచి ఎక్స్పీరియన్స్: కృతిశెట్టి
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం కస్టడీ. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా పొట్లూరి నిర్మించిన ఈ ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించిన ఇందులో అరవింద్స్వామి, శరత్కుమార్, ప్రియమణి ముఖ్యపాత్రలు పోషించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. దర్శకుడు వెంకట్ ప్రభు మాట్లాడుతూ కస్టడీ చిత్రం బాగా వచ్చిందని చెప్పారు. ఇది యూనిక్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని చేయడం మంచి అనుభవం అన్నారు. కృతిశెట్టి మాట్లాడుతూ ఇది తాను నటించిన రెండవ తమిళ చిత్రం అని, అదేవిధంగా నాగచైతన్యతో నటించిన రెండవ చిత్రం కూడా ఇదని చెప్పారు. ఆయనతో నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అని, ఆ కంఫర్ట్ ఉందని పేర్కొన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ఈ మూమెంట్ గుర్తుండిపోతుందన్నారు. వెంకట్ ప్రభు కథ చెప్పి వినగానే చాలా ఎగ్జైట్ అయ్యానని, చిత్రం పూర్తి అయిన తరువాత కూడా అంతే అనుభూతి కలిగిందన్నారు. యాక్షన్ సన్నివేశాలను బాగా తీశారన్నారు. ఇది సీరియస్ నేపథ్యంలో సాగే కథా చిత్రం అయినా దర్శకుడు వెంకట్ ప్రభు కామెడీ టచ్ మిస్ కాదన్నారు. ఇందులో బ్లాక్ బస్టర్ అంశం సంగీత దర్శకుడు ఇళయరాజా అని పేర్కొన్నారు. -
అందుకే విడాకులు తీసుకున్నా, సమంత సంతోషంగా ఉండాలి: చై
టాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరొందిన నాగచైతన్య-సమంత విడిపోయి దాదాపు రెండేళ్లవుతుంది. కానీ ఇప్పటికీ వీరి విడాకుల అంశంపై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే తొలిసారిగా నాగచైతన్య సమంతతో విడాకులపై స్పందించాడు. అంతేకాకుండా తాము విడిపోవడానికి గల కారణాలను కూడా బయటపెట్టాడు. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి కస్టడీ ప్రమోషన్స్లో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ.. ''మేం విడిపోయి రెండేళ్లు అవుతుంది. చట్టపరంగా మాకు విడాకులు వచ్చి ఏడాది అవుతుంది. ఇద్దరం విడిపోయినా ఆమెతో కలిసి ఉన్న రోజులను చాలా గౌరవిస్తాను. నిజానికి సమంత మంచి అమ్మాయి. అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు. సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ వల్లే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి పెద్దవై చివరికి విడిపోవాల్సి వచ్చింది. మొదట్లో నేను కూడా రూమర్స్ గురించి అంతగా పట్టించుకోలేదు..కానీ ఆ తర్వాత పరిస్థితులు మారాయి. మేం విడిపోయినా ఒకరంటే ఒకరికి ఎంతో గౌరవం ఉంది. కానీ మీడియా, వెబ్సైట్స్.. మాకు ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు చిత్రీకరించడం నా మనసును బాధపెట్టింది. అంతేకాకుండా నా గతంతో ఏమాత్రం సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వాళ్లను అగౌరవపరిచినట్లు వార్తలు రాశారు. అది చాలా చెత్త విషయం. జీవితంలో ప్రతీది ఒక గుణపాఠం లాంటిదే. ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఏం జరిగినా అంతా నా మంచికే అనుకుంటాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను'' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చై. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్ -
పవర్ఫుల్ రోల్లో నాగచైతన్య.. కస్టడీ ట్రైలర్ అదిరిందిగా
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇందులో కృతిశెట్టితో పాటు మరో హీరోయిన్ ఆనంది సైతం నటించింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. చదవండి: ఈ జన్మకు నువ్వు మాత్రమే.. ఆ ఙ్ఞాపకాలతో బతికేస్తాను : అలేఖ్య రెడ్డి ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. విజువల్స్, ఫైట్స్, డైలాగ్స్తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి, శరత్కుమార్లు కీలక పాత్రల్లో నటించారు. చదవండి: నాకిది పెద్ద షాక్, నా వల్ల కావడం లేదు: బోరుమని ఏడ్చేసిన సదా -
Naga Chaitanya: ఎంతమందిని ముద్దు పెట్టుకున్నానో మర్చిపోయా
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తాజాగా నటిస్తోన్న చిత్రం 'కస్టడీ'. ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సీనియర్ యాక్టర్ అరవింద్ స్వామి విలన్ పాత్రలో కనిపించనున్నారు. పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో చైతూ పోలీస్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్లలో బిజీగా పాల్గొంటున్నారు చైతూ. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్యకు పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానలిచ్చారు. (ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!) అయితే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కడా కూడా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదు నాగ చైతన్య. గతంలో పొన్నియిన్ సెల్వన్ నటి శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య-సమంత అక్టోబర్ 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రమోషన్లలో భాగంగా యూట్యూబర్ ఇర్ఫాన్తో డేర్ అండ్ ట్రూత్ అనే సరదా సెగ్మెంట్లో చైతూ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మీరు ఎంత మందిని ముద్దులు పెట్టుకున్నారు అని నాగచైతన్యను ప్రశ్నించాడు. దానికి చైతన్య సిగ్గుపడుతూ.. 'నాకు తెలియదు. ఆ లెక్క మర్చిపోయా. సాధారణంగా సినిమాల్లోనే చాలా ముద్దు సన్నివేశాలు ఉంటాయి. వాటన్నింటినీ నేను ఎలా గుర్తు పెట్టుకోగలను? అయినా ఇదంతా పబ్లిక్కు తెలిసిందే కదా. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. అయినా ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నేను ఇబ్బందుల్లో పడతానేమో' అంటూ నవ్వుతూ అన్నారు. (ఇది చదవండి: నా ఫస్ట్ క్రష్ అతనే.. యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!) కాగా.. కస్టడీ చిత్రంతోనే ద్వారానే చైతూ మొదటిసారిగా కోలీవుడ్లో అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
నాగచైతన్య 'కస్టడీ' ట్రైలర్ డేట్ ఫిక్స్,ఎప్పుడంటే..
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చైతూకి జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ను వదిలారు మేకర్స్. చదవండి: పూజా హెగ్డేతో డేట్కు వెళ్లాలనుంది : అఖిల్ అక్కినేని కస్టడీ ట్రైలర్ రిలీజ్కు డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్ను వదిలారు. కాగా చై ఈ చిత్రంలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ రోల్లో కనిపించనున్నారు. ప్రియమణి, శరత్ కుమార్, వెన్నెల కిషోర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. చదవండి: బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి Crazy outdoor Promotions of #Custody are in full swing❤️🔥 Get Ready for the Mass Extravaganza on big screens from MAY 12th! 🔥#CustodyOnMay12@chay_akkineni @realsarathkumar @vp_offl @thearvindswami @ilaiyaraaja @thisisysr @IamKrithiShetty @SS_Screens @jungleemusicSTH pic.twitter.com/AUEvdopRjW — Srinivasaa Silver Screen (@SS_Screens) May 1, 2023 -
నా జీవితంలో ఎలాంటి బాధలు లేవు.. కానీ ఆ ఒక్క విషయంలోనే: నాగ చైతన్య
అక్కినేని నాగచైతన్య టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తన సొంతం టాలెంట్తోనే పేరు సంపాదించాడు. జోష్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు చైతూ. ఆ తర్వాత ఏమాయ చేశావే మూవీతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. (ఇది చదవండి: నాగచైతన్య 'కస్టడీ' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల) వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ మే 12 విడుదలకానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్లో నాగ చైతన్య పోలీస్గా కనిపించనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. నాగచైతన్య మాట్లాడుతూ.. 'ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి బాధకరమైన సంఘటనలు లేవు. నాకు ఎదురైన ప్రతి సంఘటన ఏదో ఒక పాఠం నేర్పింది. కానీ కొన్ని సినిమాల విషయంలో బాధపడ్డా. వాటిపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయా. ఆ విషయంలో మాత్రం బాధపడుతుంటా. మూడు చిత్రాల విషయంలో అలా జరిగింది.' అని చెప్పుకొచ్చారు. కాగా.. కస్టడీ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య చివరిసారిగా అమిర్ ఖాన్తో కలిసి లాల్ సింగ్ చద్దాలో కనిపించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశకు గురి చేసింది. (ఇది చదవండి: కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో) -
మహేష్ బాబు డైరెక్టర్ ని రిజెక్ట్ చేసిన నాగ చైతన్య..
-
TSPSC పేపర్ లీక్ కేసులో ఇద్దరికి ఈడీ కస్టడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతి లభించింది. రెండు రోజులపాటు వాళ్లను కస్టడీకిలోకి తీసుకుని విచారించొచ్చని కోర్టు ఈడీ అధికారులకు తెలిపింది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్లను ఈడీ ప్రశ్నించేందుకు అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ మేరకు ఈ నెల 17, 18 తేదీల్లో.. అదీ చంచల్గూడ జైల్లోనే ఇద్దరిని ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతించాలంటూ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈడీ. ఈ మేరకు జైల్లోనే నిందితులను విచారించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. ఆ విజ్ఞప్తికి కోర్టు అనుకూలంగా ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. -
నాగచైతన్య 'కస్టడీ' ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల
అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు–తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతీశెట్టి కథానాయికగా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ మే 12 విడుదలకానుంది. మేస్ట్రో ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘హెడ్ అప్ హై..’ అంటూ సాగే తొలి లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్, యువన్ శంకర్ రాజా పాడారు. ‘‘హెడ్ అప్ హై..’ పాట పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. నాగచైతన్య తన గ్రేస్ఫుల్ డ్యాన్స్ పాటలోని ఎనర్జీని మ్యాచ్ చేశారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అరవింద్ స్వామి,ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఖతీర్. -
పోలీసుల దగ్గర గన్ లాగేసుకొని షాక్ ఇచ్చిన నాగ చైతన్య
-
జైలు నుంచి రాను..ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధించండి
గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ గుజరాత్ జైలులో ఉన్నాడు. అతన్ని విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కోర్టుకు తరలించాల్సి ఉంది. తన ప్రాణాలకు హాని అంటూ బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. గుజరాత్లోని సబర్మతి జైలులో ఉన్న తనను ప్రయాగ్రాజ్కు తీసుకువెళ్తుండగా..ఎన్కౌంట్లో చంపేస్తారని భయపడుతున్నట్లు అధికారిక వర్గాలు తెలపాయి. అతిక్పై కిడ్నాప్, హత్య కేసులు ఉన్నాయి. ఈ కేసు విషయమై విచారణ నిమిత్తం కోర్టుకి హాజరు కావల్సి ఉండగా..అతిక్ మాత్రం ఆ శిక్ష ఏదో వీడియో కాన్ఫర్సెన్స్ ద్వారా ఖరారు చేయండి అని వేడుకుంటున్నాడు. వాస్తవానికి ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్కు మార్చి 28న కోర్టులో శిక్ష ఖరారు కానుంది. ఐతే ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి ఈ నెల ప్రారంభంలోనే ఎన్కౌంటర్ కాల్పుల్లో చనిపోయాడు. దీంతో అతిక్లో భయాలు మొదలయ్యాయి. అతన్ని ఈ రోజు తెల్లవారుజామున కస్టడీలోకి తీసుకోవడానికి ఉత్తర పోలీసులు బృందం సబర్మతి జైలుకి చేరుకోగా..అతిక్ వచ్చేందుకు నిరాకరించాడు. అతడిని కస్టడీకి తీసుకోవడానికి జైలు అధికారులతో అధికారుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. అయితే దీనికి సుప్రీం కోర్టు క్లియరెన్స్ అవసరమని జైలు అధికారులు చెప్పినట్లు సమాచారం. కాగా, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ అన్నారు. అయినా కోర్టు ఆదేశాల మేరకు తాము నడుచుకుంటున్నామని, కోర్టు ఏది చెబితే అదే చేస్తాం అని బ్రజేష్ అన్నారు. ఇదిలా ఉండగా, 2005లో బీఎస్పీ శాసనసభ్యుడు రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ ప్రధాన నిందితుడు. హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ను హత్య చేసినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొటున్నారు. ఐతే సాక్షి ఉమేష్పాల్ అపహరణకు గురై కిడ్నాప్ కేసు విచారణ రోజే పట్టపగలే హత్యకు గురయ్యాడు. ఈ ఉమేష్పాల్ని చంపిన వ్యక్తి విజయ్ చౌదరి అలియాస్ ఉస్మాన్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. దీంతో అతిక్లో భయాలు మొదలయ్యాయి. తనను కూడా విచారణ పేరిట ప్రయాగ్రాజ్కి తరలిస్తుండగా..ఎన్కౌంటర్లో చంపేస్తారేమోనని భయపడుతున్నాడు అతిక్. అతను తరుఫున న్యాయవాది కూడా విచారణ మాదిరిగానే కోర్టు నిర్ణయాన్ని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారే శిక్ష విధించాలని అలహాబాద్ హైకోర్టులో దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన మాజీ ఎంపీ, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతిక్ అహ్మద్ 100కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. (చదవండి: అపూర్వమైన ప్రతిపక్ష ఐక్యతకు నాంది పలికింది: శశి థరూర్) -
కొడితే ఇప్పుడే కొట్టాలి..లేకపోతే నాగ చైతన్యకి ఇక ఛాన్స్ లేదు!
సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టిన ప్రతి హీరో మాస్ ఇమేజ్ ట్రై చేస్తుంటారు. ఒకసారి మాస్ ఇమేజ్ వస్తే ఆ హీరో రేంజ్ ఒక్కసారిగా మారిపోతుంది. మార్కెట్ తోపాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోతుంది. ఇక దర్శక నిర్మాతలు అయితే ఆ హీరోతో సినిమాలు చేసేందుకు క్యూ కడతారు. వీటికంటే ముందు మాస్ హీరో అనిపించుకుంటే మినిమం ఓపెనింగ్స్ ఉంటాయి. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాపీస్ కలెక్షన్స్ తో నిండిపోతోంది. టాలీవుడ్ లో మాస్ హీరో అనిపించుకునేందుకు ట్రై చేస్తున్న యంగ్ హీరోస్ లో నాగచైతన్య ఒకడు. నాగచైతన్య తన కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు కానీ వర్కౌట్ కాలేదు. జోష్ మూవీ తో హీరోగా తెరంగ్రేటం చేసిన నాగచైతన్య ఏ మాయ చేశావే వంటి క్లాస్ మూవీతోనే ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఈ అక్కినేని హీరో నటించిన మాస్ మూవీస్ దడ, ఆటోనగర్ సూర్య బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ అక్కినేని హీరో కెరీర్ గమనిస్తే హిట్స్ అందుకున్న సినిమాలన్నీ క్లాస్ మూవీసే. చైతూ కెరీర్లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల తర్వాత మళ్లీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేశాడు. మారుతి డైరెక్షన్ లో శైలాజా రెడ్డి అల్లుడు సినిమాతో మాస్ ఇమేజ్ దక్కించుకోవాలనుకున్నాడు. ఆ మూవీ కూడా చైతూకి లక్కు ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య ‘కస్టడీ’ అనే మాస్ యాక్షన్ ఫిల్మ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 12న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ మూవీ టీజర్ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య లుక్ డిపరెంట్ గా కనిపించింది. కొలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, అరవింద్ స్వామి పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. నాగార్జున లానే చైతన్య టోటల్ మాస్ మూవీస్ చేస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలేరు. కాస్త డిఫరెంట్ స్టోరీకి మాస్ను జోడిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వెంకట్ ప్రభు లాంటి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న కస్టడీ ఆ తరహా సినిమాలాగే కనిపిస్తోంది. ఆ సినిమా పై నాగచైతన్య ఆశలు భారీగానే పెట్టుకున్నాడు. కోలీవుడ్ లో వెంకట్ ప్రభు స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. ఇక మాస్ సినిమాలు తీయటంలో వెంకట్ ప్రభుకి వోన్ స్టైల్ ఒకటుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నాగ చైతన్యకి కస్టడీ తో మాస్ హిట్ దక్కుతుందనే నమ్మకం పెట్టుకున్నారు. -
నాగచైతన్య 'కస్టడీ' టీజర్ డేట్ ఫిక్స్..
యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. అతనికి జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. బంగార్రాజు తర్వాత వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రంపై మరింత క్యూరియాసిటీని పెంచుతూ మరో క్రేజీ అప్డేట్ను వదిలారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఈనెల సాయంత్రం 4.51 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను వదిలారు. కాగా సినిమా మే 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. రాధికా శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిశోర్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
ఈడీ కస్టడీకి స్కిల్డెవలప్మెంట్ కేసు నిందితులు
సాక్షి, విశాఖపట్నం: ఏపీ స్కిల్డెవలప్మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన నలుగురు నిందితులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి సోమవారం అనుమతించింది కోర్టు. విచారణ కోసం 15 రోజుల కస్టడీ కోరింది ఈడీ. అయితే.. ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశించారు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి. న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని నిర్దేశించింది కోర్టు. దీంతో రేపటి నుంచే అరెస్ట్ అయిన నలుగురిని ఈడీ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇదీ చదవండి: ‘స్కిల్’ గోల్మాల్ మీ ప్రభుత్వ హయాంలోదే.. వినబడుతోందా? -
ఏడాదిన్నరగా కస్టడీలోనే.. మా పాపను భారత్కు రప్పించండి: కన్నీటిపర్యంతమైన తల్లిదండ్రులు
భారతీయులు బతుకు దెరువు కోసం దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కొందరు తెలియకుండానే ఆ దేశాల్లో కొన్ని సమస్యల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా జర్మనీకి వెళ్లిన ఓ దంపతులకు ఊహించని కష్టం ఎదురైంది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన తమ చిన్నారికి దూరంగా గడపాల్సి వస్తోంది. చివరికి ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. అసలేం ఏం జరిగిందంటే... ఇదేం అన్యాయం.. మా పాపను ఇప్పించండి గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ జంట ఉపాధి కోసమని జర్మనీకి వెళ్లారు. అక్కడ ఆ దంపతులకి ఓ అడబిడ్డ(అరిహా షా)జన్మించింది. ఓ రోజు అనుకోకుండా ఆ పాప ఆడుకుంటుంటే ప్రమాదవశాత్తు ప్రైవేట్ పార్ట్ దెబ్బతింది. వెంటనే పాప చికిత్స కోసం ఓ వైద్యుడి వద్దకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అతను చెకప్ చేసి పాప బాగుందని చెప్పి వాళ్లని వెనక్కి పంపారు. కొన్ని రోజుల తదుపరి తనిఖీ కోసం వెళ్ళగా.. ఈ సారి కూడా క్షేమంగా ఉందని వైద్యులు చెప్పారు కానీ జర్మనీలోని చైల్డ్ సర్వీసెస్ అధికారులని పిలిచి, వారి కస్టడీలో ఆ పాపని ఉంచారు. దీంతో షాకైన తల్లిదండ్రులు అధికారులను గట్టిగా నిలదీశారు. పాపపై లైంగిక వేధింపులు జరిగాయన్న అనుమానాలతో అధికారులు కస్టడీలోకి తీసుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పారు. అన్ని రిపోర్ట్లు ఇచ్చినా.. మళ్లీ మొదటికి అయితే ఆ దంపతులు వాళ్ల పాపను వెనక్కి తెచ్చకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 2021లో పాపపై లైంగిక వేధింపుల అనుమానాలాను ఆ ఆసుపత్రిలోని వైద్యులు తోసిపుచ్చిన రిపోర్ట్ను తీసుకున్నారు. అంతే కాకుండా ఈ విషయంలో మరింత స్పష్టత కోసం తల్లిదండ్రుల డీఎన్ఏ పరీక్ష, పోలీసు విచారణ, వైద్య నివేదికలు ఇలా వీటి తర్వాత, లైంగిక వేధింపుల కేసును ఫిబ్రవరి 2022లో మూసేశారు. ఈ ఆధారాలతో ఆ దంపతులు జర్మనీ చైల్డ్ సర్వీసెస్ అధికారులను కలిశారు. అయితే వారు ఆ పాపను ఇవ్వకపోగా తిరిగి దంపతులపై కేసు పెట్టారు. దానిపై పాప తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా... అక్కడ వాళ్లు పిల్లలను పెంచే సమర్థతను నిరూపించుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఆ పరీక్షల్లో సైకాలజిస్టు పాప తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చాడు. దీంతో వారికున్న దారులన్నీ మూసుకుపోయాయి. ప్రధాని మాకు న్యాయం చేయాలి.. ఈ విషయంపై పాప తల్లి మాట్లాడుతూ.. జర్మనీలో ఉన్న తమ పాపను కలిసేందుకు ప్రతి నెలా ఒక గంట పాటు అనుమతిస్తున్నారని పేర్కొంది. చివరికి పాపను భారత్కు పంపేందుకు అక్కడి అధికారులు అంగీకరించట్లేదని అవేదన వ్యక్తం చేసింది. చేసేదేమి లేక అరిహా షా తల్లిదండ్రులు ఇటీవలే ముంబైలో దిగారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని, జర్మనీ ప్రభుత్వం నుంచి తమ కుమార్తెను తిరిగి ఇప్పించాలని ఆ దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని వేడుకుంటున్నారు. మూడేళ్ల బాలిక గత ఏడాదిన్నర కాలంగా జర్మనీ అధికారుల కస్టడీలో ఉంది. -
ఆప్కు బిగ్ షాక్.. ఐదు రోజులు సీబీఐ కస్టడీకి సిసోడియా
న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరిచింది సీబీఐ. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది. తాము అడిగే ప్రశ్నలకు సిసోడియా సరిగ్గా సమాధానాలు ఇవ్వడం లేదని, మొబైల్ ఫోన్లు కూడా మార్చారని కోర్టుకు చెప్పింది. ఈ కేసులో ఆయనదే కీలక పాత్ర అని పేర్కొంది. 'ఢిల్లీ లిక్కర్ పాలసీలో చాలా ప్రణాళికాబద్ధంగా ,రహస్యంగా కుట్ర పన్నారు. ఈ కేసులో మనీష్ సిసోడియాను మరింత లోతుగా విచారించాల్సి ఉంది. ఆయన ఒకేసారి అనేక మొబైల్ ఫోన్లను మార్చారు. నిందితులతో మాట్లాడిన సాక్ష్యాలను చెరిపివేసారు. లిక్కర్ పాలసీలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్స్లు పొందిన వారికి లబ్ది చేకూర్చారు. లిక్కర్ పాలసీలో కమీషన్ను 5 శాతం నుంచి ఏకంగా 12 శాతానికి పెంచారు. సిసోడియా జనవరి 2020 నుంచి ఉపయోగిస్తున్న ఫోన్ కోసం అడుగుతున్నాము.' అని సీబీఐ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను ప్రస్తావించారు. అయితే సిసోడియాను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ వాదించారు. ఆయనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ' ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా సీబీఐ అరెస్ట్ చేసింది. న్యాయ నిబంధనలకు వ్యతిరేకంగా అరెస్ట్ చేశారు. సిసోడియాను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే సీబీఐ కేసులో విజయ్ నాయర్ ఇప్పటికే బెయిల్ పొందారు. సీబీఐ అధికారులకు సిసోడియా తన దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్లను అప్పగించారు . ఇప్పటికే సీబీఐ పలుమార్లు చేసిన సోదాల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. లెఫ్టినెంట్ గవర్నర్ లిక్కర్ పాలసీని ఆమోదించారు. మళ్ళీ ఎందుకు సీబీఐకి రిఫర్ చేశారు. మనీష్ రిమాండ్కు గల కారణాలు చట్టంలో ఏమాత్రం సమర్థనీయం కాదు. ఫోన్ కాల్స్, మెసేజ్లు, మీటింగ్లు ఏవీ మనీష్కి సంబంధించినవి కావు. సిసోడియా నాలుగు ఫోన్లు ఉపయోగించారని, వాటిలో మూడు ధ్వంసమయ్యాయని సీబీఐ చెప్పింది . సీబీఐ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తుందని ఊహించి ఆ ఫోన్లు ఉంచాలా? సీబీఐకి అన్నివిధాలుగా సహకరించారు. ఇంట్లొ సోదాలు చేశారు. ఫోన్లు వారి వద్దే ఉన్నాయి. బ్యాంక్ లాకర్స్ సోదాలు చేశారు. సీబీఐ ప్రతి నోటీసుకు సిసోడియా హాజరయ్యారు.' అని దయన్ కృష్ణన్ కోర్టుకు తెలిపారు. వాడీవేడీగా సాగిన వాదనలు విన్న న్యాయస్థానం ఉత్తర్వులను రిజర్వు చేసింది. అనంతరం కాసేపటి తర్వాత సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిసోడియాను ఆదివారం 8 గంటలపాటు ప్రశ్నించింది సీబీఐ. అనంతరం ఆయనను అరెస్టు చేసింది. ఈ చర్యను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. సిసోడియాకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరనసలు చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. పోలీసులు, ఆప్ మద్దతుదారుల మధ్య తోపులాట జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సిసోడియాను కట్టుదిట్టమైన భద్రత నడుమ కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. చదవండి: ఎమ్మెల్యేల ఎర కేసు విచారణ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు -
'కస్టడీ' నుంచి విడుదలైన నాగచైతన్య.. వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జంటగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. బంగార్రాజు తర్వాత వీరిద్దరు మరోసారి జంటగా నటిస్తున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను చై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో డైరెక్టర్ వెంకట్ ప్రభు కట్ చెప్పి.. చై నీకు మా కస్టడీ నుంచి విడుదల అంటూ షూటింగ్ను ముగించారు. ఇక ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, ప్రియమణి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
కస్టడీ కంప్లీట్
నాగచైతన్య ‘కస్టడీ’ పూర్తయింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అరవింద స్వామి విలన్ రోల్ చేస్తుండగా, ప్రియమణి, సంపత్ రాజ్, శరత్కుమార్ కీ రోల్స్ చేశారు. పవన్కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘చైతూ... మా ‘కస్టడీ’ నుంచి ఇక నీకు విడుదల’’ అని వెంకట్ ప్రభు పేర్కొన్నారు. ‘‘మే 12న మీ అందరినీ (ప్రేక్షకులు) కస్టడీలోకి తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు నాగచైతన్య, కృతీశెట్టి. ‘‘నాగచైతన్య కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్ మూవీస్లో ‘కస్టడీ’ ఒకటి. ఇళయ రాజా, యువన్శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.