Education Sector
-
ప్రైవేటు జిత్తులకు చిత్తవ్వాల్సిందేనా?
ముప్పై ఏళ్ల ఆర్థిక సంస్కర ణల తర్వాత పరిధులు దాటి ప్రభుత్వంలోకి చొరబడు తున్న ప్రైవేటీకరణ వల్ల కొన్ని కొన్ని రంగాల్లో ‘రాజ్యం’ ఉనికే ప్రశ్నార్థకం అవుతు న్నది. పైగా విషయం సున్నిత మైన జ్ఞాన రంగానికి మూల మైన ఉన్నత విద్యకు సంబంధించింది కావడం వల్ల ‘ఎలీట్’ అనబడే ఎగువ మధ్యతరగతి ఆలోచనాపరుల చురుకైన జోక్యం అవసరం అవుతుంది. ప్రభుత్వ పరిధిలోకి ‘ప్రైవేట్’ చొచ్చుకు రావడం వల్ల నిర్వీర్యమవుతున్న విద్యా ప్రమాణాలు కారణంగా తెలుగు సమాజానికి మిగిలే నామర్దాపై లోతైన సమీక్ష అవసరమైన దశకు మనం చేరాం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004–2014 మధ్య పలు స్టేట్ యూనివర్సిటీలు రావడం, ప్రభుత్వం అందించిన ‘ఫీజు రీయింబర్స మెంట్’ దన్నుతో ఆర్థిక–సామాజిక బలహీన వర్గాలు కొంతమేర ప్రయోజనం పొందడం జరిగాయి. కొద్దిపాటి ప్రయత్నంతో విదేశాల్లో విద్యా–ఉపాధి అవకాశాలు పెరిగిన కాలం అది. అయితే ‘జాతీయ విద్యా విధానం–2020’ పేరుతో దేశమంతా ‘స్టేట్ యూనివర్సిటీ’లలో సంస్కరణలు అమలును ‘నీతి ఆయోగ్’ తప్పనిసరి చేసింది. సంపన్నులు తమ పిల్లల్ని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంత ఖర్చుకైనా వెరవకుండా చదివిస్తారు. కానీ దిగువ మధ్యతర గతి పరిస్థితి అదికాదు. వాళ్లకు నాణ్యమైన విద్య అందడం కల కాకూడదు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుగా మొదలై ఆర్థిక సంస్కరణల కాలంలో ‘డీమ్డ్ యూనివర్సిటీలు’గా చలామణీ అవుతూ, ఉన్నత విద్యా వ్యాపారం చేస్తున్న చోట... ఉన్న ప్రమాణాలు గురించిన చర్చ ఇది. యాజమాన్యాలకు తమ వాణిజ్య ప్రయోజనాలు ప్రధానం అవుతుంటే, వాటి ప్రమాణాలు వడకట్టి మరీ వర్గీకరించే సమీక్ష బాధ్యతలు చూసే ‘న్యాక్’ (నేషనల్ ఎసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ కౌన్సిల్) పరపతి పలచబడిన సందర్భం ఇది.ఇటీవల నీతి ఆయోగ్ 2011–2021 మధ్య చేసిన మదింపులో ‘తెలుగునాట యూనివర్సిటీల ప్రమాణాలు ఏ మాత్రం బాగాలేవు’ అని తేలింది. మూడు అంశాలను అది పరిశీలించింది. 1. విద్యా ర్థుల స్థూల నమోదు, 2. విద్యార్థి– టీచర్ నిష్పత్తి,3. లింగ సమానత్వ సూచిక. ఈ మూడు అంశాల్లో దేనిలోనూ మొదటి పది స్థానాల్లో మనం లేము. ప్రభుత్వం కంటే ప్రైవేట్ క్వాలిటీ బాగుంటుంది అనేది మన నమ్మకం. గడచిన ముప్పై ఏళ్లలో డిగ్రీతో మొదలై పీజీ, పీహెచ్డీ వరకు ఎదిగిన మన యూని వర్సిటీ చదువుల్లోకి భారీ పెట్టుబడులతో ప్రైవేట్ రంగం ప్రవేశించినా, నీతి ఆయోగ్ మదింపు అలా ఉందంటే, మన ప్రమాణాలు అనుమానమేగా! రాష్ట్ర విభజన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి కూడా కొత్త యూనివర్సిటీలు వస్తుంటే అమరావతి చుట్టూ భూములు ఇవ్వడం, వాళ్ళు భారీ భవనాలు కట్టడం... ఇలా మన దృష్టి అంతా ‘షోకేసింగ్’ మీదే సరిపోయింది.ఈ యాజమాన్యాల రాజకీయ రంగ ప్రవేశంతో విద్యా వ్యవస్థలో ప్రభుత్వ– ప్రైవేట్ ప్రయోజనాలు ఒక్కటయ్యాయని పిస్తున్నది. అమరావతి సమీపాన ఉన్న ఒక డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన ఉదంతం వెనుక పైన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అంటే విషయం సులువుగా బోధపడుతుంది. సీబీఐ అరెస్ట్ చేసిన పదిమంది ముఖ్యుల్లో ఒక వైస్– ఛాన్స్లర్ ఉండడం దేశాన్ని ఉలిక్కి పడేట్టుగా చేసింది. తమ యూనివర్సిటీకి ‘ఏ ప్లస్ ప్లస్’ ర్యాంకింగ్ రాబట్టడం కోసం న్యాక్ నుంచి తనిఖీకి వచ్చే ‘పీర్ రివ్యూ వర్స్’కు ముందే నగదు, విలువైన బహుమతులతో యాజమాన్యం వారిని ప్రలోభపరిచింది అనేది సీబీఐ అభియోగం. నింది తులు ఉన్నత విద్యారంగంలో పలు విభాగాలలోని ప్రమాణాలను సమీక్షించడంలో నిపుణులు. అరెస్ట్ వార్త వెలుగులోకి వచ్చిన మూడు వారాల్లో సుమారు 900 మంది పీర్ రివ్యూవర్స్ను శాశ్వతంగా న్యాక్ బాధ్యతల నుంచి తొలగించింది. ఒక ఆంగ్లపత్రిక ప్రతినిధికి న్యాక్ డైరెక్టర్ గణేశన్ కన్నాభిరాన్ జరిగింది ఏమిటో చెబుతూ– ‘మా వద్ద పీర్ రివ్యూవర్స్ జాబితాలో 5,000 మంది ఉన్నారు. వీరి పనిని సమీక్షించే కసరత్తు గత 18 నెలలుగా మా వద్ద సాగుతున్నది కనుకనే, ఈ విషయం తెలిసిన వెంటనే వారిపై వేటు సాధ్యమయింది. ఇకముందు మా వడపోత ‘హైబ్రీడ్ మోడల్’లో ఉంటుంది’ అన్నారు. జరిగిన దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొ‘‘ ఎం. జగదీశ్ కుమార్ స్పందిస్తూ – ‘యూజీసీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతి పత్తి కలిగిన న్యాక్లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల తర్వాత ర్యాంకింగ్ ఇచ్చే విషయంలో పారదర్శకత, చిత్తశుద్ధి పెంచే విధంగా న్యాక్ సమూల సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ఎక్రిడిటేషన్ జారీ విషయంలో న్యాక్ దృఢ చిత్తంతో అనుసరిస్తున్న పరిపాలనా విధానాన్ని, నిర్దేశించిన రూల్స్ అమలుచేయడానికి తీసుకుంటున్న చొరవను యూజీసీ అభినందిస్తున్నది’ అన్నారు.వారం తర్వాత విశాఖపట్టణంలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగిన ఓ ప్రైవేట్ పుస్తక ఆవిష్కరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి ఇద్దరూ ఒకే వేదికపైన ఉన్నారు. అక్కడున్న ‘ప్రభుత్వ భూమి–కేంపస్ గోడ’ వివా దాన్ని దృష్టిలో ఉంచుకుని, తన ప్రసంగంలో సీఎం ‘...ఇటువంటి యూనివర్సిటీని మీరు కూల్చివేయా లని అనుకుంటారా’ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలో చించాల్సిన ప్రశ్న అది. జ్ఞానరంగానికి మూలమైన ఉన్నత విద్య ప్రమాణాలు ‘ప్రైవేట్’ వల్ల ప్రమాదంలో పడినప్పుడు, ‘రాజ్యం’తో పాటు పౌర సమాజమూ అప్రమత్తం కావాలి.వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఏపీలో బాబు సర్కార్ వచ్చాక మొక్కుబడి తతంగంగా మారిన విద్యాహక్కు చట్టం
-
రంగంలోకి అంగడి చదువు!
పేదరికం కారణంగా కొంతమంది ఏపీ విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయలేకపోయారన్న వార్తలు వస్తున్నాయి. మన పాలక వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవలసిన పరిణామం ఇది. ఉన్న ఊళ్లో ఉపాధి లేక పొట్టకూటికోసం వెనుకబడిన ప్రాంతాల ప్రజలు వలసబాట పడుతున్నారు. చదువుకుంటున్న వారి పిల్లలు కూడా గత్యంతరం లేక తల్లిదండ్రులను అనుసరించవలసి వస్తున్నది. వారిలో పదో తరగతి చదివిన పిల్లలు కూడా ఉన్నారు. వలస కారణంగా వారు కీలకమైన పదో క్లాసు పరీక్షలకు దూరమయ్యారు. వారి భవిష్యత్తు గురించి వ్యవస్థ పట్టించు కోనట్టయితే డ్రాపవుట్లుగా మిగిలే అవకాశం ఉన్నది. వారి భావి జీవితం వలసకూలి టైటిల్తో ముడిపడే ప్రమాదం ఉన్నది.‘‘ఒక్క మలినాశ్రు బిందువొరిగినంత వరకు... ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను’’ అంటాడు కవి బాలగంగాధర తిలక్. నిజంగా ప్రజల ఆలనాపాలనా చూడవలసిన ఏపీ సర్కార్కు మాత్రం అటువంటి సెంటిమెంట్లేవీ లేవు. ఇప్పుడు ఒక్క కన్నీటి బొట్టు రాలడం కాదు. మూర్తీభవించిన కన్నీరు దారిపొడుగునా ప్రవహిస్తున్నది. ‘‘జగన్ సర్కార్ అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని కొనసాగించి ఉన్నట్లయితే మా పిల్లలు తప్పకుండా పదో తరగతి పరీక్ష రాసేవార’’ని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. నాణ్యమైన సార్వత్రిక విద్యను అమలు చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి ఎంతగా మేధామథనం జరిపి పథకాన్ని రూపొందించి ఉంటారో ఈ విషాద పరిణామాన్ని చూస్తే అర్థమవు తున్నది.మన దేశంలో విద్యాహక్కు చట్టం అమలులో ఉన్నది. అటు వంటి చట్టాన్ని అమలు చేయాలని భారత రాజ్యాంగం కూడా ఆదేశించింది. దురదృష్టవశాత్తు ఇది మొక్కుబడి తతంగంగా మారిందన్న సంగతి అందరికీ తెలిసిందే. బడికి వచ్చే పిల్లలకు అరకొర చదువు చెప్పడం ప్రభుత్వ స్కూళ్ల కర్తవ్యంగా మారి పోయింది. ఉద్దేశపూర్వకంగా తలెత్తిన ఈ ధోరణి ఫలితంగా తామరతంపరగా ప్రైవేట్ విద్యాసంస్థలు పట్టుకొచ్చాయి. స్థోమత ఉన్నవాళ్లంతా ప్రైవేట్ స్కూళ్లలో మెరుగైన విద్యను కొనుగోలు చేయడం, పేద పిల్లలు సర్కారు బడి చదువులతో పోటీలో నిలవలేకపోవడం... గత మూడు దశాబ్దాలుగా బాగా ఎక్కువైంది. ఈ ధోరణి పట్ల పలువురు ప్రగతిశీల సామాజిక వేత్తలు, మేధావులు అసహనాన్నీ, ఆందోళననూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు.ఐక్యరాజ్య సమితి సైతం తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్డీజీలు) పిల్లలందరికీ నాణ్యమైన విద్య ఉచితంగా సమా నంగా అందుబాటులో ఉండాలని నాలుగో లక్ష్యంగా నిర్దేశించింది. మన్నికైన జీవన ప్రమాణాలతో మానవజాతి దీర్ఘకాలం పాటు ఈ భూగోళంపై మనుగడ సాగించాలంటే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడం అవసరమేనని మేధాప్రపంచం అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. కానీ పాలకుల్లో చిత్త శుద్ధి లేకపోవడం ఈ లక్ష్యాలకు ఆటంకంగా మారింది. ఉదార ప్రజాస్వామిక వ్యవస్థలు క్రమంగా ‘ప్లుటానమీ’ (సంపన్నులు శాసించే వ్యవస్థలు)లుగా పరివర్తనం చెందుతున్నాయని పలు వురు పొలిటకల్ ఎకనామిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్ద్ద కాలానికి ఈ పదప్రయోగం వ్యాప్తిలోకి వచ్చింది.సంస్కరణలు ప్రారంభమైన తొలి దశాబ్దిలో క్రియాశీలకంగా ఉన్న రాజకీయ నాయకుల్లో చంద్రబాబు కూడా ఒకరు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వరాదనే వాదాన్ని ఆయన బలంగా వినిపించేవారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ డిమాండ్ను ఆయన ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారో చాలామందికి గుర్తుండే ఉంటుంది. రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో అమలుచేసిన తర్వాత ఈ అంశానికి సర్వత్రా ఆమోదం లభించింది. అలాగే ప్రభుత్వ సేవలన్నింటికీ ప్రజలు యూజర్ ఛార్జీలు చెల్లించాలనే నియమం పెట్టింది కూడా చంద్రబాబే! మితిమీరిన ప్రైవేటీకరణ సూపర్ రిచ్ వర్గాన్ని సృష్టించడం, తిరిగి ఆ వర్గం మొత్తం ఆర్థిక – రాజకీయ వ్యవస్థలను ప్రభా వితం చేయడం ప్లుటానమీకి దారి తీస్తున్నది.ఇటువంటి వ్యవస్థల్లో సహజ వనరుల దగ్గ ర్నుంచి సర్వే సర్వత్రా ప్రైవేటీకరణే తారకమంత్రంగా పనిచేస్తుంది. విద్యారంగం ఇందుకు మినహాయింపేమీ కాదు. విభజిత రాష్ట్రానికి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాద’ని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేసుకోవడం అవసరం. ఈ నేపథ్యాన్ని అర్థం చేసు కుంటేనే జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ రంగంలో నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని ఎందుకనుకుంటున్నారో అర్థమవుతుంది. అమరావతి కోసం అరవై వేల కోట్ల రూపాయల అప్పును ఆగమేఘాల మీద పుట్టించగలిగిన వ్యక్తి, తాను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ‘తల్లికి వందనం’ ఎందుకు అమలుచేయలేకపోయాడో అర్థమవుతుంది. ఈ పూర్వరంగం అర్థం కానట్లయితే ఆర్థిక వెసులుబాటు లేకనే అమలు చేయలేకపోయారనే మోసపు ప్రచారానికి తలూప వలసి వస్తుంది.విద్యారంగంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పూర్తి ప్రజాస్వామికీకరణ చర్య లను చేపట్టింది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించింది. భాషా – సంస్కృతుల ముసుగులో పెత్తందారులు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా చలించలేదు. సీబీఎస్ఈ సిలబస్ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. నగరాల్లో సూపర్ రిచ్ పిల్లలకు మాత్రమే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఐబీ సిలబస్ను పిల్లలందరికీ ఉచితంగా ఈ సంవత్సరం నుంచి అమలుచేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసింది. అంతర్జా తీయ స్థాయిలో మన పిల్లలు పోటీపడాలన్న తపనతో చేపట్టిన కార్యక్రమాలివి. డిజిటల్ యుగంలో తన రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో వెలుగొందాలని పాఠశాలల్లో డిజిటల్ బోర్డు లను ఏర్పాటు చేయించారు. ఎనిమిదో క్లాసు నుంచి విద్యార్థుల చేతికి ట్యాబ్లను ఉచితంగా అందజేశారు.పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి స్వయంగా పూనుకొని తయారు చేయించిన మెనూతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులపై పైసా భారం పడకుండా పుస్తకాలు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్లను పాఠశాలల ప్రారంభానికి ముందే సిద్ధం చేసి ఉంచేవారు. మూడు నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులూ ఏకోపాధ్యా యుడే బోధించే పద్ధతికి స్వస్తిచెప్పి వారికి సబ్జెక్టు వారీగా బోధించే టీచర్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆ మూడు తరగతులను కిలోమీటర్ పరిధి లోపల ఉండే అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లలో విలీనం చేశారు. ఫలితంగా ఆ విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల సదుపాయం ఏర్పడింది. ఆ వయసు పిల్లల్లో గ్రాహ్యశక్తి బలంగా ఉంటుందన్న అధ్యయనాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ల తన పదవీ కాలంలో రెండేళ్లు కోవిడ్ కోతకు గురైనప్పటికీ పాఠశాల విద్యారంగంలో పెను మార్పులకు జగన్ తెరతీశారు.పేద – ధనిక తేడాల్లేని, లింగవివక్ష అసలే లేని ఒక నవ యుగ విద్యాసౌధ నిర్మాణం కోసం ఇన్ని ఇటుకల్ని పేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యావ్యవస్థ పునర్నిర్మాణా నికి ఇంత వేగంగా అడుగులు వేసిన వ్యక్తి కూడా మరొకరు కాన రారు. కేరళ రాష్ట్ర విద్యారంగం మొదటి నుంచీ కూడా మిగతా దేశంతో పోల్చితే ఆరోగ్యంగానే ఉన్నది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా అది తన ప్రతిష్ఠను కాపాడుకోగలిగింది.చదువుల తల్లి సరస్వతిని అమ్ముకోవడం తరతరాలుగా మన సంస్కృతిలో తప్పుగానే భావిస్తున్నారు. ఇందుకు ఆంధ్ర భాగవతం కర్త బమ్మెర పోతనామాత్యులే ఉదాహరణ. ‘‘బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ / కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్ / హాలికులైననేమి? గహనాంతర సీమల కందమూల / కౌద్దాలికు లైననేమి నిజ దార సుతోదర పోషణార్థమై’’ అన్నారు. తాను రాసిన కావ్యాన్ని సరస్వతిగా భావించి, దాన్ని రాజులకు అంకిత మివ్వడానికి ఆయన నిరాకరించారు. అలా వచ్చిన సొమ్ము పడుపువృత్తితో వచ్చిన సొమ్ముగా ఆయన అసహ్యించుకున్నారు. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఇప్పుడు చదువుల తల్లిని అంగట్లో నిలబెట్టి అమ్ముకుంటున్నారు. దానికి మనం ఎన్ను కున్న ఏలికలు వత్తాసుగా నిలబడుతున్నారు.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరమే ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లను విడిచిపెట్టి ప్రైవేట్ స్కూళ్లలో చేరారు. ఆయన అధికారంలోకి వస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం రద్దవుతుందన్న భయం ఒక కారణం. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ‘తల్లికి వందనం’ కింద డబ్బులొస్తా్తయనే నమ్మకం కూడా ఇంకో కారణం కావచ్చు. అట్లా మారిన విద్యార్థులు ఇప్పుడు ఫీజులు కట్టలేక అల్లాడు తున్నారు. ఇంగ్లీషు మీడియాన్ని రద్దు చేస్తారనే ప్రచారం, సీబీఎస్ఈ సిలబస్ను ఎత్తేయడం దేన్ని సూచిస్తున్నాయి? ఎని మిదో తరగతి నుంచి విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్లను నిలిపి వేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లలో కొత్త కంటెంట్ లోడ్ చేయలేదు. ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద దాదాపు ఇరవై వేల స్కూళ్లలో సౌకర్యాలను ప్రైవేట్ స్కూళ్ల కంటే మిన్నగా జగన్ ప్రభుత్వం మెరుగుపరిచింది. మిగిలిన స్కూళ్లలో ఆ కార్యక్ర మాన్ని నిలిపివేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యత చాలాచోట్ల నాసిరకంగా మారింది. మూడు నుంచి ఐదో తరగతి చదివే విద్యార్థులకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను ఎత్తేస్తారట! ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లపై ప్రజలకు ఏర్పడ్డ నమ్మకాన్ని చంపేయడమే లక్ష్యంగా పెట్టు కున్నట్టు కనిపిస్తున్నది. మరోపక్క పెద్ద ఎత్తున ప్రైవేట్ స్కూళ్లకు, జూనియర్ కాలేజీలకు అనుమతులిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను పెద్ద ఎత్తున తగ్గించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. మెడికల్ కాలేజీల సంగతి తెలిసిందే! మరోసారి ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ప్రైవేట్ జేగంట మోగుతున్నది. అంగడి చదువులు మళ్లీ రంగప్రవేశం చేస్తున్నాయి. విద్యా విప్లవానికి గ్రహణం పట్టింది. ఈ ప్రభుత్వం మారితేనే గ్రహణం విడిచేది!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘చదివింపులు’ పెరగాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్లో పాఠశాల విద్యకు కేటాయింపులు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ రూ.3లక్షల కోట్లు దాటుతోంది. ఇందులో విద్యారంగానికి కనీసం 15 శాతం కేటాయింపులు ఉండాలన్నది ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, విద్యారంగ నిపుణుల డిమాండ్. రాష్ట్ర అవతరణ నుంచి కేటాయింపులు గరిష్టంగా 7 శాతం దాటడం లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, కొత్త టీచర్ల నియామకా లు చేపట్టాలన్నా, నిధుల కొరత అడ్డంకిగా మారుతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. విద్యారంగానికి నిధులు పెంచాలని రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫా ర్సు చేసింది. నిధులు పెంచి విద్యారంగ సంస్కరణలు చేప ట్టాలని మంత్రివర్గ ఉపసంఘం కూడా అభిప్రాయపడింది. ఎక్కువ భాగం వేతనాలకే చెల్లు రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే కేటాయింపుల్లో సింహభాగం టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలకే ఖర్చవుతోంది. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం వెనుకబడి ఉందని కేంద్ర విద్యాశాఖ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పటికే పేద విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు సకాలంలో పంపిణీ చేయడానికి ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లనూ తీర్చిదిద్దుతామని చెప్పి మన ఊరు–మనబడి కార్యక్రమం చేపట్టినా తొలి దశలోనే నిధుల కొరత ఎదురైంది. తగ్గుతున్న ప్రవేశాలు కోవిడ్ కాలంలో మినహా ప్రభుత్వ స్కూళ్లల్లో ప్రవేశాలు ఏటా పడిపోతున్నాయి. రాష్ట్రంలో 11,067 గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూళ్లున్నాయి. చిన్న స్కూళ్లలో ఫీజులు రూ.30 నుంచి రూ.40 వేల మధ్య ఉంటున్నాయి. కార్పొరేట్ స్కూళ్లల్లో రూ.లక్షల్లో ఉంటున్నాయి. అయినా మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయించడానికి కారణం.. ప్రభుత్వ స్కూళ్లల్లో నాణ్యత కొరవడటమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి సర్కారీ స్కూళ్లల్లో నాణ్యమైన బోధకులే ఉన్నారు. కానీ బోధన విధానం సరైన రీతిలో ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే విద్యారంగానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరముంది. టీచర్లు ఏరి.. సదుపాయాలెక్కడ ? ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ 18 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలా స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్లే లేరు. 602 మండలాల్లో కేవలం 17 చోట్ల మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. 6 వేల పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడు. విద్యావలంటీర్ల నియామకంపైనా పాఠశాల విద్యా శాఖ దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా బోధన అరకొరగా ఉంటోందన్న ప్రచారం.. విద్యార్థులను ప్రైవేట్ బాట పట్టిస్తోంది. నిధులు పెంచాలి పాఠశాల విద్యకు నిధులు పెంచాలి. మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీపడే శక్తి సామర్థ్యాలున్నా, అవసరమైన వసతులు లేకపోవడమే సమస్యగా మారింది. – పింగిలి శ్రీపాల్రెడ్డి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 15 శాతం నిధులైనా ఇవ్వాలి విద్యకు కేవలం 7 శాతం నిధులే ఇస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 13 శాతం నిధులిస్తున్నారు. 90 శాతం బడుగు,బలహీన వర్గాల విద్యార్థులున్న తెలంగాణలో విద్యారంగానికి నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహిస్తోంది. – మాచర్ల రాంబాబు,ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కేటాయింపులతో సంస్కరణలు పాఠశాల విద్యలో సంస్కరణలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిని స్వాగతిస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో అవసరాలు ఏంటి? ఏమేం సమకూర్చాలనే దానిపై ఫోకస్ పెట్టాలి. ఇది జరగాలంటే నిధులు పెంచాలి. – రాజగంగారెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
మెడికల్ అకాడమీకి మంగళం!
కంకిపాడు: విద్యారంగాన్ని రాష్ట్రంలోని కూటమి సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. విద్యార్థుల జీవితాలను నడిరోడ్డుకు లాగుతోంది. ఫలితంగా కోటి ఆశలతో ప్రతిభా పరీక్ష రాసి ఐఐటీ–మెడికల్ అకాడమీలో ప్రవేశం పొందిన విద్యార్థుల భవిష్యత్పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ ఏడాది ఐఐటీ–మెడికల్ అకాడమీలో ప్రవేశాల జాబితాలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీ పేరు లేకపోవటం అకాడమీకి మంగళం పాడేందుకు రంగం సిద్ధమైందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. దీంతో ప్రస్తుతం మొదటి సంవత్సరం విద్య పూర్తిచేస్తున్న విద్యార్థులు రెండో సంవత్సరం తమ విద్యాభ్యాసం ఎక్కడ? ఎలా? సాగుతుందోనన్న ఆందోళనతోనే వార్షిక పరీక్షలు రాస్తున్న దుస్థితి నెలకొంది. మూడింటిలో ఒకటిరాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఐఐటీ–మెడికల్ అకాడమీలు మూడు మాత్రమే ఉన్నాయి. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు, కర్నూలు జిల్లా చిన్నటేకూరు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడు ప్రాంతాల్లో ఇవి నడుస్తున్నాయి. చిన్నటేకూరు, అడవి తక్కెళ్లపాడు రెండు అకాడమీలు బాలురకు, ఈడుపుగల్లు అకాడమీ ప్రత్యేకించి బాలికలకు ఏర్పాటు చేశారు. 2017లో ఏర్పాటైన ఈ కేంద్రంలో ప్రస్తుతం 500 మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు. గురుకులం మూసివేతకు రెడీరాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పూర్తిచేసిన ప్రతిభావంతులైన విద్యార్థులకు రెండు దశల్లో పరీక్ష రాసి అర్హత పొందిన వారికే ఈ అకాడమీలో ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ, నీట్తో పాటు ఐక్యరాజ్యసమితి సందర్శనకు వెళ్లిన విద్యార్థులు కూడా ఈ అకాడమీలో విద్యనభ్యసించారు.పటిష్టమైన భద్రత ఉన్న అకాడమీని మూసివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ద్వారా నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల ప్రవేశ నోటిఫికేషన్లో ఈడుపుగల్లు ఐఐటీ–మెడికల్ అకాడమీ ప్రస్తావన లేకపోవటం నిదర్శనం. విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంనోటిఫికేషన్ నిలిపివేతతో ఐఐటీ–మెడికల్ అకాడమీ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. దీంతో ఈ ఏడాది మొదటి సంవత్సరం ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకున్న విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ద్వితీయ సంవత్సరం చదువులు ఎలా, ఎక్కడన్న ఆందోళనలో మునిగిపోయారు. చదువుల దిగులుతోనే మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలను విద్యార్థులు రాస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూటమి సర్కారు, సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈడుపుగల్లు అకాడమీ నిర్వహిస్తున్న భవనం ప్రైవేటు వ్యక్తులది కావటంతో అక్కడి నుంచి అకాడమీ తీసివేయాలనే ఆలోచనతో అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల చేయలేదని చెబుతున్నారు. మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులను ఎన్టీఆర్ జిల్లా కుంటముక్కల గురుకులం, అలాగే విద్యార్థుల సొంత జిల్లాల్లో గురుకులాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో ఐఐటీ–మెడికల్ అకాడమీతో మెరుగైన విద్య అందుతుందని ఆశించి ప్రతిభా పరీక్షల్లో సత్తా చాటి అకాడమీలో ప్రవేశం పొందిన విద్యార్థులు సాధారణ ఇంటర్ విద్యను అభ్యసించటం ద్వారా తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనికితోడు విద్యార్థుల సామర్థ్యాలు కూడా తక్కువగా ఉన్నాయని, విద్యాప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతుండటం గమనార్హం. న్యాయ పోరాటానికి సిద్ధంఈ పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అకాడమీని కొనసాగిస్తేనే విద్యార్థులకు మెరుగైన విద్య, భవిష్యత్ భద్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అధికారులు తమ ఆవేదన అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. అకాడమీని కొనసాగించేలా విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయపోరాటానికి సన్నద్ధంఅవుతున్నారు. విద్యార్థులకు నష్టం జరగనివ్వంవిద్యార్థులకు ఎలాంటి నష్టం జరగనివ్వం. ప్రస్తుతం అకాడమీ ఉన్న భవనం ప్రైవేటుది. 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులను అకాడమీలో చేర్చుకున్నాం. ఇక్కడ ఉన్న పిల్లలను కుంటముక్కలకు తరలిస్తాం. వచ్చే ఏడాది 10 వరకూ ఐఐటీ–మెడికల్ అకాడమీలు రాబోతున్నాయి. ఆందోళన చెందాల్సిన పనిలేదు. మెరుగైన విద్య అందుతుంది. – ఎ.మురళీకృష్ణ, జిల్లా కోఆర్డినేటర్, ఉమ్మడి కృష్ణాజిల్లా -
‘ఫీజు’లో కోత.. విద్యార్థులకు వాత!
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మరోసారి రుజువైంది. నూతన విద్యా విధానాన్ని బలోపేతం చేస్తూ చేపట్టాల్సిన చర్యలు బడ్జెట్లో ఏమాత్రం కనిపించ లేదు. కేవలం వర్సిటీల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, సాంకేతిక విద్యా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2,506 కోట్లు కేటాయించారు. ఐటీఐ, సంప్రదాయ, సాంకేతిక ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్–ఎంటీఎఫ్)ల కేటాయింపుల్లోనూ అలసత్వం ప్రదర్శించినట్టు బడ్జెట్ ద్వారా స్పష్టమైంది. ఏటా రూ.2,800 కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్–ఆర్టీఎఫ్) కోసం ఖర్చు చేయాల్సి ఉండగా, బడ్జెట్లో రూ.1,960 కోట్లు మాత్రమే కనిపిస్తోంది. ఇక హాస్టల్ వసతి ఖర్చులు (పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్– ఎంటీఎఫ్)కు ఏడాదికి రూ.1,100 వ్యయం అవుతుండగా రూ.684 కోట్లు మాత్రమే కేటాయింపులు ఉన్నాయి. చాలా వరకు వివిధ కార్పొరేషన్ల కేటాయింపుల్లో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ల కేటాయింపులను చూపిస్తుండటం గమనార్హం. మొత్తంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్ షిప్లలో సుమారు రూ.1200 కోట్ల మేర కోత విధించినట్టు తెలుస్తోంది.పెండింగ్ బకాయిలఊసే లేదుగత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్ తర్వాత చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్ మెయింటెనెన్స్ చార్జీలను ప్రభుత్వం నిలిపి వేసింది. మేలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎన్నికల కోడ్తో విద్యార్థులకు, పేదలకు సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి. అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులకు రెండు విడతల ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు రూ.1,400 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద రూ.1,100 కోట్ల చెల్లింపులు చేయాలి. కూటమి ప్రభుత్వం వీటిని ఆపేసింది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పిడుగులా పడింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కళాశాలల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లులు దిక్కుతోచక పుస్తెలు అమ్మి, తాకట్టుపెట్టి, అధిక వడ్డీలకు అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్న దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రైవేటు కాలేజీల్లో పీజీ చేరే వారికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ ఊసే మరిచారు. ఇప్పటికి రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల్లో పీజీ చదివే విద్యార్థులను విస్మరించింది. విద్యకు సంబంధించి కేంద్రం నుంచే సింహ భాగం నిధులు వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా మోసం చేయడం తగదని విద్యార్థి వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.ఏటా విద్యార్థులకుఇవ్వాల్సింది రూ.2,800 కోట్లుబడ్జెట్లో కేటాయించింది రూ.1,960 కోట్లు -
పర్లేదు సార్
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఇందులో ఉన్నత విద్యకు రూ.50,067 కోట్లు, పాఠశాల విద్యకు రూ.78,572 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఐఐటీలు, వైద్య విద్య, పాఠశాల విద్య, స్కిల్లింగ్కు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024–25 బడ్జెట్లో విద్యా రంగం సవరించిన అంచనాలు రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్నాయి. మానవ వనరుల అభివృద్ధి దిశగా కేటాయింపులు చేశారని, ఉద్యోగాల ఆధారిత అభివృద్ధి బ్రాండ్ ఇండియా సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బడ్జెట్ను స్వాగతించారు. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్..ఈ ఏడాది కొత్తగా భారతీయ భాషా పుస్తక్ స్కీమ్ను ప్రకటించారు. దీని ద్వారా పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనివల్ల విద్యార్థులు సులభంగా అన్ని అంశాలను అవగతం చేసుకునే వీలుంటుంది. ఐఐటీల విస్తరణ.. 2014 తర్వాత ఏర్పాటు చేసి న ఐదు ఐఐటీల్లో మౌలిక వసతులు విస్తరించి మరో 6,500 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలు కల్పించనున్నారు. ఐఐటీ పాట్నాను పూర్తి స్థాయిలో విస్తరిస్తారు. గత పదేళ్లలో దేశంలోని 23 ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య 65 వేల నుంచి 1.30 లక్షలకు చేరిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మొత్తంగా ఐఐటీలకు రూ.11,349 కోట్లు కేటాయించారు. ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరులో టెక్నాలజీ రీసెర్చ్ అభ్యర్థుల కోసం ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ను వచ్చే ఐదేళ్లలో పది వేల మందికి అందిస్తారు. నైపుణ్యాల పెంపు.. విద్యార్థులకు ఆయా వృత్తులు, విభాగాల్లో క్షేత్ర నైపుణ్యాలు అందించేలా గ్లోబల్ నైపుణ్యాలు, పార్ట్నర్íÙప్స్ కోసం కొత్తగా ఐదు నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ను ఏర్పాటు చేయనున్నారు. పాఠశాల స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ను నెలకొల్పనున్నారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేలా గ్రామీణ ప్రాంతాల్లోని సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ కల్పిస్తారు. ఐఐఎంలకు పెరిగిన కేటాయింపులు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు గతేడాది రూ.227 కోట్లు కేటాయించగా ఈదఫా రూ.251 కోట్లను కేటాయించారు. ఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు కేటాయింపుల్లో రూ.137 కోట్ల మేర కోత విధించడం గమనార్హం. అంతర్జాతీయ స్థాయి కలిగిన ఇతర ఉన్నత విద్యా సంస్థలకు కేటాయింపుల్లో 50 శాతం మేర కోత పడింది. ఏఐ ఆవశ్యకతకు గుర్తింపు విద్యా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవశ్యకతను గుర్తించినట్లు తాజా బడ్జెట్ స్పష్టం చేస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ ఏర్పాటుతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. – వి. రాజన్న, టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ – సాఫ్ట్వేర్ సర్విసెస్)రీసెర్చ్ ఔత్సాహికులు పెరుగుతారు ఐఐటీలు, ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్స్ను పెంచడం వల్ల పీహెచ్డీ ఔత్సాహికుల సంఖ్య పెరుగుతుంది. మరిన్ని పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. – ప్రొఫెసర్. బి.ఎస్.మూర్తిఐఐటీ–హైదరాబాద్ డైరెక్టర్స్పష్టత ఇవ్వాల్సింది సర్వ శిక్ష అభియాన్, రీసెర్చ్ ఫెలోషిప్స్కు కేటాయింపులు పెంచడం హర్షణీయం. ఐఐటీల్లో సీట్ల పెంపు, మెడికల్ సీట్ల పెంపు విషయంలో స్పష్టత లేదు. బీటెక్ స్థాయిలో ఎన్ని సీట్లు, వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్ల పెంపులో ప్రైవేట్, ప్రభుత్వ సీట్ల సంఖ్యను వేర్వేరుగా స్పష్టం చేస్తే బాగుండేది. ఉన్నత విద్యకు కేటాయింపులు తగ్గాయి. ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం సరికాదు. – మహేశ్వర్ పేరి, ఫౌండర్, కెరీర్స్360జాతి వృద్ధికి ఊతం ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ, 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుతో ప్రతి విద్యార్థికి ఇన్నోవేషన్ దిశగా ప్రోత్సాహం లభిస్తుంది. – నిపుణ్ గోయెంక, ఎండీ, జీడీ గోయెంక గ్రూప్ఏటా కుదింపులు.. ఇది మరోసారి ప్రభుత్వ విద్యారంగాన్ని బలహీన పరిచే చర్యే. రూ.50.65 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు రూ.1,28,650 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్లో 2.53 శాతం. గత పదేళ్లలో 3.16 నుంచి 2.53 శాతానికి నిధులు తగ్గాయి. – ముత్యాల రవీందర్టీపీటీఎఫ్ అదనపు ప్రధాన కార్యదర్శి -
ఆశయాన్ని దెబ్బతీసే ఆచరణ?
రాజకీయాలకు అతీతంగా సాగాల్సిన విద్యారంగానికీ రంగులు అంటుకున్నాయి. కేంద్రం ఇటీవల జారీ చేసిన ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు – 2025’ ముసాయిదా చర్చ నీయాంశమైంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల ఎంపిక ప్రక్రియను సమూలంగా మార్చేస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెలువరించిన ఈ ముసాయిదా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో రచ్చ రేపుతోంది. ఉమ్మడి జాబితాలోని అంశమైన విద్యారంగంలో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పెత్తనం చేయాలనుకుంటున్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజా యూజీసీ ముసాయిదా అందుకు నిదర్శనమన్నది వాటి భావన. రాష్ట్ర గవర్నర్ నిర్వాకమా అని ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో వీసీలు లేకుండా పోయిన తమిళనాడు ఈ ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరుతూ చట్టసభలో తీర్మానం చేయడం గమనించాల్సిన అంశం. వీసీల పదవీ కాలాన్ని మూడు నుంచి అయిదేళ్ళకు పెంచడం మంచిదే అయినా, పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల పేరిట కాషాయ భక్తుల్ని వీసీలను చేస్తారన్న అనుమానాలకు జవాబు దొరకడమే కష్టంగా ఉంది. ముసాయిదా ప్రకారం వైస్ఛాన్సలర్ల (వీసీల) నియామకం కోసం ముగ్గురు సభ్యుల అన్వేషణ, ఎంపిక కమిటీని నియమించే అధికారాన్ని ఛాన్సలర్లకు, అంటే కేంద్రసర్కార్ నియమించే ఆ యా రాష్ట్రాల గవర్నర్లకు కట్టబెట్టారు. ఒకవేళ మార్గదర్శకాలను గనక అమలు చేయకుంటే... సదరు విద్యా సంస్థను యూజీసీ పథకాల నుంచి, లేదంటే అసలు డిగ్రీ కోర్సులు చెప్పడానికైనా వీలు లేకుండా బహిష్కరించవచ్చు. ఈ ముసాయిదాపై సంబంధిత వర్గాలు, సామాన్య ప్రజలు నెల రోజుల్లోగా తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చెప్పాలని కేంద్రం కోరుతోంది. వైస్–ఛాన్సలర్ మాట అటుంచి, పాఠశాల నుంచి కాలేజ్లు, విశ్వవిద్యాలయాల దాకా విద్యా రంగంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తుంటే, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ హోదానైనా కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి (గవర్నర్)కి అసలెలా కట్టబెడతారన్నది తమిళనాడు సీఎం స్టాలిన్ సహా పలువురి ప్రాథ మిక ప్రశ్న. సమాఖ్య స్ఫూర్తినే దెబ్బ తీసేలా ఉన్న తాజా ముసాయిదాను వ్యతిరేకిస్తూ, ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు చట్టసభల్లో తీర్మానాలు చేయాలని ఆయన ఏకంగా పిలుపునివ్వడం విశేషం. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వా లకూ, పై నుంచి వచ్చిన గవర్నర్లకూ మధ్య నిత్య ఘర్షణ చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర సర్కార్లు నడిపే పలు విశ్వవిద్యాలయాల్లో సదరు గవర్నర్లే ఛాన్సలర్లు. వీసీల నియామకంపై వాళ్ళు రాష్ట్ర ప్రభు త్వాల అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటి వరకు వీసీల నియా మక అన్వేషణ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వాలే ఏర్పాటుచేసేవి. తాజా ముసాయిదా ప్రకారం ఆ కమిటీల నియామకం సైతం ఛాన్సలర్లయిన గవర్నర్ల చేతిలోకి వెళ్ళిపోనుంది. ఢిల్లీ నుంచి తాము పంపే రబ్బరు స్టాంపులతో రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల్ని సైతం తమ చేతుల్లోకి తీసుకోవాలన్న ప్రయత్నమిది అని ప్రతిపక్షాల ఆరోపణ. కేంద్ర పాలకులు ఆ ఆరోపణల్ని నిజం చేయరాదు. నిజానికి, నూతన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలు చేస్తామంటూ కేంద్రం ప్రకటించి మూడున్నరేళ్ళు దాటినా, ఉన్నత విద్యాసంస్థల సంస్కరణ నేటికీ నత్తనడక నడుస్తోంది. దీర్ఘకాల లోపాల్ని సవరించి, ఆధునిక కాలానికీ, విజ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థ అవసరాలకూ తగ్గట్లు యూనివర్సిటీలను తీర్చిదిద్దాల్సి ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి నియంత్రణ వ్యవస్థయిన యూజీసీది అందులో ప్రధాన బాధ్యత. అతిగా నియంత్రిస్తోందంటూ గతంలో విమర్శలను ఎదుర్కొన్న యూజీసీ వైఖరి తాజా ముసాయిదాలో కొంత మారినట్టు కనిపిస్తోంది కానీ, కొత్త విమర్శలకు తావిచ్చింది. ఫలానా అంశం బోధించాలంటే అందులో పీజీ చేసి ఉండాల్సిందేనన్న అర్హత ప్రమాణాల్ని సడలించడం, వీసీ పదవికి పరిశ్రమలోని సీనియర్లు, ఉన్నతాధికారులకు సైతం వీలు కల్పించడం లాంటివి కొందరు స్వాగతిస్తే, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా,సంస్థాగత స్వతంత్రత ఎన్ఈపీ ప్రధానోద్దేశమైతే... తద్విరుద్ధంగా వీసీల నియామకంలో గవర్నర్లకు పెద్దన్న పాత్ర కల్పించడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. ‘నీ ఎడమ చేయి తీయి... నా పుర్ర చేయి పెడతా’ అన్నట్టు ఇక వీసీల ఎంపికలో రాష్ట్రం బదులు కేంద్రం పట్టు బిగుస్తుందన్న మాట. పార్లమెంట్ చేసిన 1956 నాటి చట్టం ప్రకారం తన పరిధిలోకే రాని వీసీల ఎంపిక, నియామకాన్ని యూజీసీ నియంత్రించాలనుకోవడం సమస్యే కాదు రాజ్యాంగపరమైన చిక్కులు తెస్తుంది. గతంలో శాస్త్రవేత్త నాయుడమ్మ లాంటి వారిని వీసీలుగా నియమించినప్పుడు, వారి విజ్ఞానం విద్యాలయాలకు వన్నె తెచ్చింది. అలా చూస్తే, అధ్యాపక వర్గానికి ఆవల ఉన్న వృత్తి నిపుణులకు సైతం తలుపులు తెరవడం వల్ల ఉన్నత విద్యా సంస్థల్లో ప్రతిభావంతుల సమూహం పెరగడం మంచిదే. యూనివర్సిటీల్లో నియామక నిబంధనల్ని సరళం చేయడం స్వాగతించాల్సిందే. కానీ, ఇప్పుడైనా, అప్పుడైనా వీసీ పదవిని రాజకీయ నియామకంగా మార్చడంతోనే అసలు సమస్యంతా! వీసీల నియామకాల్లో రాజ్భవన్ను కీలకంగా మార్చడమన్నది అసలు ఎన్ఈపీ లక్ష్యాలకే విరుద్ధం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ మధ్య నలిగి పోతున్నాయి. వీసీల ఎంపిక సైతం గవర్నర్ల చేతికొచ్చాక పరిస్థితేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉన్నత విద్యాలయ ప్రాంగణాన్ని నడిపే ఉత్తముడి ఎంపిక ఇటు రాష్ట్రం, అటు కేంద్రాల రాజకీయ ఒత్తిళ్ళకు అతీతంగా ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. -
KSR Live Show: జగన్ పై కోపంతో విద్యావ్యవస్థపై చంద్రబాబు కుట్ర
-
వ్యక్తి లోపలనే గుప్తంగా దాగి ఉండే ధనరాశి అదేంటో తెలుసా?
‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’ – ఇతరుల కళ్ళకు కనిపించకుండా, వ్యక్తి లోపలనే గుప్తంగా దాగి ఉండే ధనరాశి వంటిది విద్య అని భర్తృహరి సుభాషితం చెప్పింది. విద్య వలన ప్రయోజనం అదొక్కటి మాత్రమే కాదనీ, మనిషి విద్యావంతుడు కావడం వలన సమకూరే ఉత్తమమైన ప్రయోజనాలు మరి కొన్ని వున్నాయనీ తెలుగు కవులు చెప్పారు. వారిలో, విక్రమార్కుడి సింహాసనపు సాలభంజికలు భోజరాజుకు చెప్పిన కథలను తెలుగులో ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యంగా రచించిన కొఱవి గోపరాజు ఒకరు. ‘పరులకు, సోదరులకు, భూమిని పాలించే భూవరులకు నిలువెత్తు ధనం వెచ్చించైనా ఒకవ్యక్తి నుండి కొనలేనిది అతడి విద్య అని, ఏ వ్యక్తిలో ఉంటేఆ వ్యక్తికి మాత్రమే నూటికి నూరుపాళ్ళు వశ్యమై ఉండేది విద్య ఒక్కటే అని, ఒకరు తనలోని విద్యను మరొకరికి బోధించినపుడు, ఆ బోధనను గ్రహించిన వ్యక్తిలో తిరిగి అదే రకమైన వృద్ధికి ఆ విద్య దారితీస్తుందని ఆయన చెప్పిన మాటలు చిరస్మరణీయాలు. పరాయి ఊరికి వెళ్ళినప్పుడు వ్యక్తి లోపల ఉన్న విద్యా ధనం ఒక్కటే దొంగలకు కనపడకుండా ఉంటుందని, విద్య ఒక్కటి మాత్రమే ఒక్కొకసారి వ్యతిరేక పరి స్థితులలో సైతం స్నేహితులను పుట్టించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుందని, కాబట్టి విద్యను పోలిన ధనం మరొకటి ఉంటుందనుకోవడం అవివేకమే అవుతుందని కూడా చెప్పాడు కొఱవి గోపరాజు. విద్యను గురించి కావ్యాంతర్గతమైన వివరణ అలా ఉండగా, భారతీయుల ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యమైన మార్గదర్శకాలుగా భావించే అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘శ్రీవిష్ణుపురాణం’ పంచమ అంశం, పదవ అధ్యాయం, 30వ శ్లోకంలో విద్యను గురించిన అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక భావన కనపడుతుంది. విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్,సైవ పూజ్యార్చనీయా చ సైవ తస్యోపకారికా. ఏ విద్య ఆసరాతో ఒక వ్యక్తి తన జీవనాన్ని సాగిస్తుంటాడో, ఆ విద్యయే అతడికి ఇష్టదైవం వంటిది. ఆ విద్యయే ఆ వ్యక్తికి పూజనీయమైనది. ఆ విద్యయే ఆ వ్యక్తికి చిరకాలం ఆనందాన్ని కలిగించేదిగా కూడా ఉంటుంది అని పై శ్లోకంలో చెప్పబడింది.– భట్టు వెంకటరావు -
Year Ender 2024: విద్యారంగంలో నూతన అధ్యాయం
2024లో దేశంలోని విద్యావ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచ వేదికపై ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాయి. మరోవైపు ఈ ఏడాదిలో జరిగిన వివిధ పరీక్షల పేపర్ లీక్ కేసులు ప్రభుత్వాన్ని పలు ఇబ్బందులకు గురిచేశాయి. ఇదిలావుంటే విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను కూడా చేపట్టింది. 2024లో విద్యా రంగంలో చోటుచేసుకున్న నూతన మార్పులను ఒకసారి గుర్తుచేసుకుందాం.వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్దేశంలో విద్య, పరిశోధనలకు నూతన దిశను అందించడానికి కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్(One Nation One Subscription) పథకాన్ని ప్రారంభించింది. ఇది విద్యార్థులు, పరిశోధకులకు జాతీయ స్థాయిలో అకడమిక్ జర్నల్స్, ఈ-బుక్స్, పరిశోధన డేటాబేస్లను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ పథకానికి రూ.6,000 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలకు ఇది డిజిటల్ విప్లవంగా మారింది.పీఎం విద్యా లక్ష్మి యోజన2024లో కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మి యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకం ముఖ్యంగా దేశంలోని 860 ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పథకంలో భాగంగా విద్యార్థులకు కనీస వడ్డీ రేట్ల(Minimum interest rates)కు విద్యా రుణాలు లభిస్తాయి. ఏటా 22 లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే ఈ పథకానికి ప్రభుత్వం వచ్చే ఏడేళ్లలో రూ.3,600 కోట్ల బడ్జెట్ను కేటాయించింది.పీఎంశ్రీజాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)2020 కింద పీఎం శ్రీ విద్యాలయాలను నెలకొల్పారు. వీటిని సమగ్ర విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభించారు. విద్యార్థులను అకడమిక్ పరిజ్ఞానం వైపు మాత్రమే కాకుండా సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, క్యారెక్టర్ బిల్డింగ్ వైపు ప్రేరేపించడం దిశగా ఈ విద్యా విధానం ముందుకుసాగనుంది.పీఎం ఇంటర్న్షిప్ పథకంకేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్షిప్(PM Internship) పథకాన్ని కూడా ఈ ఏడాదే ప్రారంభించింది. దీనిలో విద్యార్థులు, ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినవారు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం పొందగలుగుతారు. విద్యను పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న యువతకు ఈ పథకం ఒక వేదికను అందిస్తుంది. విద్యార్థులు ఈ పథకం ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడమే కాకుండా వివిధ రంగాలలో పనిచేసిన అనుభవాన్ని కూడా సంపాదించవచ్చు.ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు -
విద్యా రంగంలో ‘సాల్ట్’ అమలు భేష్
సాక్షి, అమరావతి : రాష్ట్ర విద్యా రంగంలో సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ (సాల్ట్) ప్రాజెక్టు అమలు విజయవంతంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. విద్యా రంగంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అమలుకు ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టుకు 250 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఇందులో భాగంగా.. దీని పురోగతిపై తాజాగా మధ్యకాల సమీక్ష నిర్వహించి గణనీయమైన పురోగతి సాధించిందని బ్యాంకు వెల్లడించింది. 2020 జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం ముందంజలో ఉందని కిలారించింది.పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. ప్రాజెక్టు ముగింపు కాలపరిమితి డిసెంబరు 31, 2026 నాటికల్లా మిగిలిన మైలురాళ్లను చేరుకోవడానికి చేపట్టిన కార్యకలాపాలు చాలావరకు ట్రాక్లో ఉన్నాయని వెల్లడించింది. విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు వీలుగా డిజిటల్ లెర్నింగ్ అసెస్మెంట్ వ్యవస్థనూ విజయవంతంగా అమలుచేసిందని బ్యాంకు మెచ్చుకుంది.మొత్తమ్మీద ఏపీలో విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపడుతున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఉదా.. గణితంలో 4వ తరగతి విద్యార్థుల ప్రావీణ్యం గత రెండేళ్లలో గణనీయంగా మెరుగుపడిందని.. అలాగే, ప్రాథమిక, మా«ద్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచేందుకు టీచ్ టూల్ను కూడా ఆవిష్కరించారని బ్యాంకు తెలిపింది. అంతేకాక.. రెండేళ్లలో బోధనా పద్ధతులు మెరుగుపరిచారని పేర్కొంది. జాతీయ విద్యా విధానం అమలులోనూ భేష్..ఇక జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం చాలాబాగా అభివృద్ధి చెందినట్లు ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. గ్రేడ్–3 ద్వారా పిల్లల పునాది అభ్యాసన కొనసాగుతోందని.. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఈ వాతావరణాన్ని, పనితీరును మెరుగుపరిచే చర్యల పురోగతి కూడా కొనసాగుతోందని తెలిపింది. మొత్తం మీద సాల్ట్ ప్రాజెక్టు అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది.తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్బ్యాక్కు, ఫిర్యాదులకు ఆన్లైన్ పోర్టల్ను కూడా అమల్లోకి తీసుకొచ్చారని, విద్యార్థుల లెర్నింగ్ లెవెల్స్, టీచర్లకు మెరుగ్గా పాఠ్యప్రణాళిక రూపకల్పన చేసినట్లు బ్యాంకు తెలిపింది. ప్రారంభ బాల్య విద్య, గ్రేడ్–1, 2 ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లకు ముందస్తు శిక్షణ ప్రారంభించారని కూడా పేర్కొంది.అంతేకాక.. విద్యార్థుల అభ్యాస సమస్యలను పరిష్కరించేందుకు అనుకూల చర్యలూ కొనసాగుతున్నాయని.. 700 రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచే చర్యలూ తీసుకుంటున్నారని, ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం మౌలిక సదుపాయాల కార్యకలాపాలను ఖరారుచేశారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇక పాఠశాలల నిర్వహణ, పనితీరుపై నిరంతరం సమాచారం అందించడానికి తల్లిదండ్రుల కమిటీలను మరింత పటిష్టం చేసిందని బ్యాంకు ప్రశంసించింది. -
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
Satyameva Jayate: చిదిమేస్తున్న చదువులు.. ప్రతిభకు కొలమానం ర్యాంకులేనా?
-
అది ‘విద్యా మీట్’ కాదు..దగా మీట్: మేరుగ నాగార్జున
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన హాయంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర్నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున గుర్తుచేశారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం(డిసెంబర్7) మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడారు.‘45 వేలకు పైగా స్కూళ్లను నాడునేడు కింద వైఎస్ జగన్ బాగు చేశారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీషు మీడియం,ట్యాబులు,మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నిటినీ దూరం చేశారు.ఇవన్నీ బాగుచేయడం వదిలేసి ఇప్పుడు విద్యా మీట్ పెడతారంట.అది విద్యా మీట్ కాదు.దగా మీట్. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణలను నిలిపేసి ఏం చేయదలచుకున్నారు? రూ.3,900 కోట్ల బకాయిల గురించి మాట్లాడకుండా ఈ విద్యామీట్లు ఎందుకు పెడుతున్నారు?జగన్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వపు కుట్రలకు విద్యారంగం పూర్తిగా నాశనం అయింది.ఉన్నత విద్యామండలిలో కూడా దారుణాలు జరుగుతున్నాయి.ఇరవై మంది వైస్ ఛాన్సిలర్లను బెదిరించి రాజీనామాలు చేయించారు.ఇప్పటికీ కొత్తగా ఎవరినీ నియమించలేదు.దీన్నిబట్టే విద్యారంగంపై ఈ ప్రభుత్వానికి ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసింది.రూ.72వేల కోట్లు కేటాయించి విద్యారంగంలో వైఎస్ జగన్ పెద్దఎత్తున సంస్కరణలు తీసుకొచ్చారు.అంతకుమించి చేయాలనుకుంటే చంద్రబాబు కూడా అభివృద్ధి చేయాలి. అంతేకానీ విద్యా రంగాన్ని నాశనం చేయొద్దు’అని మేరుగ నాగార్జున అన్నారు.ఇదీ చదవండి: బాబూ ఒక్కో రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం ఏమైంది..? -
మా హయాంలోనే ఎక్కడాలేని రివల్యూషన్స్
-
ఏపీలో విద్యారంగం నీరుగారిపోతోంది!
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ. 2 లక్షల 94 వేల 427 కోట్ల బడ్జెట్లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమానికి ఇవి ఏమాత్రమూ సరిపోవు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి విద్యారంగ సంక్షేమానికి పెద్దపీట వేసిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.పాఠశాల విద్యకు చంద్రబాబు సర్కారు 2024–25 బడ్జెట్లో రూ. 29 వేల 909 కోట్లు కేటాయించింది. అంటే మొత్తం బడ్జెట్లో ఇది కేవలం 9.84 శాతం మాత్రమే. ఈ కేటాయింపు పాఠశాల విద్యను ఎలా బలోపేతం చేస్తుంది? ‘నాడు–నేడు’ పథకం గురించి బడ్జెట్లో ఊసె త్తలేదు. గత జగన్ ప్రభుత్వం పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్లు పంపిణీ చేసింది. ఆరో తరగతీ, ఆపై చదువు తున్న విద్యార్థులకు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటు చేసింది. 45 వేల స్మార్ట్ టీవీలను ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. పాఠ్య, నోట్ పుస్తకాలు; బ్యాగులు, బూట్లు, యూనిఫారాలు వంటి వాటిని పాఠశాలల ప్రారంభం రోజునే పూర్తి స్థాయిలో జగన్ ప్రభుత్వం అందించింది. ‘విద్యా కానుక’, ‘జగనన్న గోరుముద్ద’ వంటి పథకాలకు వేలకోట్లు ఖర్చు చేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్లను జగన్ పటిష్టంగా అమలు చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏకంగా రూ. 73 వేల కోట్లు విద్యారంగానికి కేటాయించి ఖర్చు చేశారు. గొల్లప్రోలు జెడ్పీ పాఠశాలలో తరగతి గదులు, ల్యాబ్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించి ప్రైవేట్ పాఠశాలల కంటే ఇవే బాగున్నాయని వ్యాఖ్యనించారు. జగన్ అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలకు పవన్ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి.‘తల్లికి వందనం’ (జగన్ హయాంలో ‘అమ్మఒడి’) పథకానికి చంద్రబాబు సర్కారు బడ్జెట్లో కేవలం రూ. 5,387.03 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన బాబు వాస్తవంగా 84 లక్షల మంది విద్యార్థులకు రూ. 12 వేల 600 కోట్లు ఇవ్వాలి. కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి చంద్రబాబు సర్కారు తల్లుల్ని తీవ్రంగా దగా చేసింది. ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ఈ, ఐబీ బోధనను చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అట్టడుగు శ్రామిక వర్గాల పిల్లలకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ చదువుల్ని కూటమి నేతలు దూరం చేస్తున్నారు.చదవండి: ‘ఏపీ’ కోసం ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది?ఉన్నత విద్యకి బడ్జెట్లో రూ. 2,326.68 కోట్లు కేటాయించారు. బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు గత ఆరు నెలల నుండి రూ. 3,500 కోట్లు రావాలి. ఒక్క పైసా కూడా చంద్ర బాబు సర్కారు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో బోధనా ఫీజులు, ఉపకార వేతనాల కోసం రూ. 2,542.95 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 75 శాతం. ప్రతీ ఏటా 12 లక్షల మంది విద్యార్థులకి రూ. 2,800 కోట్లు అవసరం. హాస్టల్ మెస్ చార్జీలకు రూ. 1,100 కోట్లు అవసరం.ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పోస్టు గత 5 నెలల నుండి ఖాళీగా ఉంది. జగన్ హయాంలో వున్న వైస్ ఛాన్స్లర్లను బలవంతంగా రాజీనామాలు చేయించింది చంద్రబాబు సర్కారు. 18 విశ్వ విద్యాలయాల వీసీ పోస్టుల్ని ఇంకా భర్తీ చేయలేదు. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని చంద్రబాబు మోసగిస్తున్నారు. విద్యార్థి లోకం ఉద్యమించాల్సిన అవసరం ఉంది.– ఎ. రవిచంద్రవైఎస్సార్ ఎస్యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
నాణ్యత లేకుంటే జైలే!: సీఎం రేవంత్
ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్లుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేది. ఇప్పుడు ఓటుహక్కుకు అర్హత 18 ఏళ్లకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాలి. అప్పుడే ఎక్కువ మంది యువత రాజకీయాల్లోకి వస్తారు. – మాక్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలకు నాసిరకం బియ్యం, కూరగాయలు సరఫరా చేస్తే కాంట్రాక్టర్లతో ఊచలు లెక్కబెట్టిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు. కలుషిత ఆహారం సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ గురుకులాల్లో నాసిరకం భోజనం వల్ల విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోందని, దీన్ని దృష్టిలో ఉంచుకునే కేటాయింపులు పెంచామని తెలిపారు. విద్యార్థి నులకు కాస్మెటిక్ చార్జీలు సకాలంలో చెల్లిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపి అయినా, విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని గ్రీన్ చానల్ ద్వారా సకాలంలో ఇవ్వాల్సిందిగా ఆదేశించామన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతాధికారులు వారానికి రెండుసార్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే వారికి భవిష్యత్ ప్రయోజనాల్లో ప్రాధాన్యత ఇవ్వబోమని చెప్పారు. ప్రజా ప్రతినిధులు కూడా స్కూళ్లకు వెళ్లాలన్నారు. కుల గణనపై కొంతమంది కుట్ర చేస్తున్నారని, దీన్ని విద్యార్థి లోకం సమర్థవంతంగా తిప్పికొట్టాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లాల నుంచి వచ్చిన బాలలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లపై విశ్వాసం పెంచాలి ‘ప్రభుత్వ స్కూళ్ల ప్రతిష్ట దెబ్బతింటోంది. గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల పాఠశాలలు మూతపడ్డాయి. రాష్ట్రంలో 26 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతుంటే, 36 లక్షల మంది ప్రైవేటు స్కూళ్ళకు వెళ్తున్నారు. అన్ని సౌకర్యాలున్నా, అర్హులైన టీచర్లు ఉన్నా ఈ పరిస్థితి ఎందుకుందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. కలెక్టర్లు, ఎస్పీలు స్కూళ్లకు వెళ్లాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళాలి. విద్యార్థుల్లో విశ్వాసం కల్పించాలి. రెసిడెన్షియల్ స్కూళ్ళలో సన్న బియ్యంతో అన్నం పెట్టాలి. అందుకే రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యా రంగానికి పెద్దపీట ‘విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 20 వేలమంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం. 35 వేలమంది టీచర్ల బదిలీలు పూర్తి చేశాం. 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. వర్సిటీలకు వీసీలను నియమించాం. త్వరలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తాం. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం విద్యా కమిషన్ను ఏర్పాటు చేశాం. గత సీఎం మనవడి కుక్క చనిపోతే డాక్టర్ను జైల్లో పెట్టారు. విద్యార్థులు చనిపోతే కనీసం కన్నీరు కూడా పెట్టలేదు..’అని రేవంత్ అన్నారు. ‘తెలంగాణకు విద్యార్థులే పునాదులని, తమ ప్రభుత్వం చేకూర్చే ప్రయోజనాలను అందరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత వారిదేనని అన్నారు. భవిష్యత్లో ఎలాంటి వ్యసనాలకు బానిసలం కాబోమని, ఉన్నత విద్యలో రాణిస్తామని ప్రమాణం చేయాలని బాలలను సీఎం కోరారు. చదువులోనే కాదు.. క్రీడల్లో రాణించినా ఉద్యోగాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. కుల గణన మెగా హెల్త్ చెకప్ లాంటిది ‘కులగణనను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇది సమాజానికి మెగా ఆరోగ్య పరీక్ష వంటిది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలకు పెరగాలన్నా, నిధుల కేటాయింపు జరగాలన్నా కుల గణనే కీలకం. కులగణన ఆధారంగా భవిష్యత్తులో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అందుబాటులోకి తేవాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దీనిద్వారా ఎవరి ఆస్తులూ లాక్కోవడం జరగదు. సంక్షేమ పథకాలు అందకుండా పోవడం అంటూ ఉండదు. విద్యార్థులు కూడా కులగణన వివరాలు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి..’అని రేవంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ళ శ్రీధర్బాబు, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్లానింగ్ బోర్డు చైర్మన్ చిన్నారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యా డైరెక్టర్ నర్సింహారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పుస్తకాన్ని, తెలంగాణ విద్యా ప్రగతి సూచించే పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. చదువులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పారితోషికం అందజేశారు ‘21 ఏళ్ళకే పోటీ చేసే హక్కు’తీర్మానం చేయండి ఎస్సీఈఆర్టీలో గురువారం జరిగిన అండర్ 18 విద్యార్థుల నమూన అసెంబ్లీ సమావేశ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో పోటీ చేసే వయసును 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకు తగ్గించాలని, ఈ విధంగా చేసిన మాక్ అసెంబ్లీ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపాలని సూచించారు. రాష్ట్ర అసెంబ్లీలోనూ ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబుకు సూచించారు. ఓటు హక్కుకు అర్హత 21 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే హక్కు 25 ఏళ్లకు లభించేదని, ఇప్పుడు ఓటు హక్కుకు అర్హత 18 ఏళ్ళకు తగ్గింది కాబట్టి పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్ళకు తగ్గిస్తే ఎక్కువమంది యువత రాజకీయాల్లోకి వస్తారని సీఎం పేర్కొన్నారు. -
5 నెలలకే విద్యార్థులను రోడ్డుకు ఎక్కేలా చేశారు
-
CRPF స్కూల్లో బాంబు ఉందంటూ కాల్
-
సారం లేని భూమి.. విద్య లేని జీవితం ఒక్కటే: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: సారం లేని భూమి.. విద్య లేని జీవితం ఒక్కటేనని అన్నారు మంత్రి సీతక్క. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో సమానత్వ సాధన దిశలో విద్య కీలకం అంటూ సీతక్క చెప్పుకొచ్చారు.గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య సదస్సుకు ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ..‘గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించేందుకు మీరంతా సమావేశమైనందుకు అభినందనలు. కార్పొరేట్, సాఫ్ట్వేర్ కంపెనీలు జీవోలను ఒక వేదిక మీదికి తీసుకొచ్చిన నిర్మాన్ సంస్థ ఫౌండర్ మయూర్కి ప్రత్యేక అభినందనలు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యను అందించటానికి మీరంతా ముందుకు వచ్చారు.సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే. అందుకే విద్య అనేది చాలా ముఖ్యం. దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే. సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయి. విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. మైదాన ప్రాంతాల, అటవీ ప్రాంతాల మధ్య విద్య విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది. పట్టణ ప్రాంతాలకు మెరుగైన విద్య అందుతుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు. అందుకే విద్యలో ఉన్న అంతరాలను తొలగించాలి. సమానత్వ సాధన దిశలో విద్య కీలకంహైదరాబాద్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఉందో, మారుమూల పల్లెలో అలాంటి విద్య ఉండాలి. ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. గ్రామీణ విద్యార్థులు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారు. అందుకే గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. అందుకు మీ వంతు సహకారం అందించండి. సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతులున్న సమాజంలో కనీస విద్య లేనివారు సమాజంలో ఉండటం బాధాకరం.అందుకే అంతరాలను తగ్గించేందుకు మీ వంతు చేయూత ఇవ్వండి. అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలి, అప్పుడే అందరికీ సమాన అవకాశాలు అందుతాయి. అప్పుడు సమాజంలో పోరాటాలు ఉండవు. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే మా లక్ష్యం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే వివక్షతా భావం ప్రజల్లో పెరుగుతోంది. మీరంతా గ్రామాలకు తరలండి.. అటవీ గ్రామీణ పరిస్థితులను చూడండి. విద్యా వ్యవస్థ సరిగా లేనిచోట పర్యటించి ప్రణాళిక రూపొందించండి. ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో విద్య అభివృద్ధికి కృషి చేస్తే దేవుళ్లుగా మిమ్మల్ని ఆరాధిస్తారు. ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి. అప్పుడు మీరే మార్పునకు నాంది పలికిన వారు అవుతారు. మనసుంటే మార్గం ఉంటుంది. ములుగు ఎన్నో ప్రత్యేకతలకు వేదిక.. అందరూ అక్కడ పర్యటించండి. ఏసీ గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలి. ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయండి’ అంటూ కామెంట్స్ చేశారు. -
పరిశోధనల సులభతరం ఇలాగా!
ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు ఇటీవల ఓ నోటీసు వచ్చింది. గడచిన ఐదేళ్ల కాలంలో పరిశోధనల కోసం అందుకున్న నిధులపై జీఎస్టీ ఎందుకు చెల్లించలేదని అందులో ప్రశ్నించారు. జీఎస్టీ సకాలంలో చెల్లించనందుకు జరిమానా, వడ్డీ కలిపి రూ.120 కోట్లు కట్టమని కూడా ఆదేశించారు. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచారు. ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్ టేపిజమ్. ప్రతిష్ఠాత్మక సైన్సు అవార్డులను కూడా నగదు బహుమతి లేకుండానే అందిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాలి. ఐఐటీ ఢిల్లీతో పాటు దేశంలోని మరికొన్ని విద్యా సంస్థలకు వచ్చిన జీఎస్టీ చెల్లింపుల నోటీసుపై శాస్త్రవేత్తలు స్పందించలేదు కానీ, ‘ఇన్ఫోసిస్’ మాజీ సీఎఫ్వో, ఇన్వెస్టర్ టీవీ మోహన్ దాస్ పై మాత్రం దీన్ని ‘అతి నీచమైన పన్ను తీవ్రవాదం’ అని వ్యాఖ్యానించారు.నెల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరిశోధనల కోసం ఉపయోగించే రసాయనాలపై కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 150 శాతానికి పెంచడం... అకస్మాత్తుగా పెరిగిన ప్రాజెక్టు ఖర్చులతో శాస్త్రవేత్తలు, విద్యా సంస్థలు బెంబేలెత్తడం తెలిసిన విష యమే. పరిశోధనలకు అవసరమైన ఎంజైములు, రీజెంట్లు చాలా వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే. కస్టమ్స్ డ్యూటీ పెంచ డమంటే వాటిని దాదాపుగా అడ్డుకోవడమే. శాస్త్రవేత్తల నిరసనల నేప థ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది. సృజనాత్మక ఆలోచనలు వృద్ధిచెందాలంటే, ‘రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్’(ఆర్ అండ్ డీ)కి మరిన్ని నిధులు ఇవ్వాల్సి ఉండగా... కేంద్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం గమనార్హం.జీఎస్టీ నోటీసులు, కస్టమ్స్ డ్యూటీ పెంపులు ఏవో చెదురు ముదురు సంఘటనలు కావచ్చునని అనుకునేందుకూ అవకాశం లేదు. ఉన్నత విద్యా రంగంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పరిశోధనలను తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే వీటిని చూడాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే సాంకేతిక పరిజ్ఞాన పరికరాలపై జీఎస్టీని 5 నుంచి 18 శాతానికి పెంచడం, తాజాగా నిధు లపై జీఎస్టీ నోటీసులు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ రెండు నిర్ణయాల వల్ల పరికరాలను సమకూర్చుకోవడం, పరిశోధనల నిర్వహణ ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. ఈ విషయంపై ఆందో ళనతోనే కేంద్ర ప్రభుత్వానికి శాస్త్ర అంశాల్లో సలహా ఇచ్చే విభాగంకేంద్రానికి ఒక నోట్ను పంపింది. జీఎస్టీ వసూళ్లు, పన్నుల పెంపుల ప్రభావం నుంచి ప్రైవేట్ సంస్థలు సర్దుకోవచ్చుననీ, ప్రభుత్వ సంస్థల్లో ఇందుకు అవకాశాలు తక్కువనీ ఈ నోట్లో స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నోట్పై స్పందిస్తూ, సంస్థలకు కేటాయించే నిధు లను ఎక్కువ చేస్తున్నాము కాబట్టి జీఎస్టీతో నష్టమేమీ ఉండదని నమ్మబలికే ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితిని సరిచేసేందుకుచేసింది మాత్రం శూన్యం. పరిశోధనలకు ఊతం ఇలా కాదు...ఏ దేశంలోనైనా స్వేచ్ఛగా పరిశోధనలు చేసుకునే వాతావరణం ఉన్నప్పుడు కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. తగినన్ని నిధులు సమకూర్చడం, భాగస్వామ్యాలను ప్రోత్సహించడం.... పన్నులు, నిబంధనల విషయంలో ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఈ అన్ని అంశాలు భారత్లో ఇప్పుడు కొరవడ్డాయనే చెప్పాలి. నిధుల విషయాన్ని చూద్దాం. జాతీయ స్థూల ఉత్పత్తిలో ఒక శాతం కంటే తక్కువ. అన్ని రకాల ప్రాజెక్టులకు ఒకే ఛత్రం కింద నిధులిస్తామని ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ (ఏఎన్ ఆర్ఎఫ్) ఒకటి ఏర్పాటు చేసేందుకు ఐదేళ్లుగా ప్రయత్నాలు సా...గుతూనే ఉన్నాయి. మరోవైపు పరిశోధనలకు తాము నిధులు ఎక్కువ చేశామని ప్రభుత్వం బాకా ఊదుతూనే ఉంది. ఐదేళ్ల కాలంలో కొత్త సంస్థ ద్వారా 50 వేల కోట్ల రూపాయలు ఇస్తామని పదే పదే సంకల్పం చెప్పుకుంటోంది. ఈ మొత్తం కూడా వట్టి మాటే. తామిచ్చేది 30 శాతమనీ, మిగిలిన 70 శాతాన్ని ఆయా సంస్థలు ప్రైవేట్ రంగంలో సేకరించుకోవాలనీ ప్రభుత్వమే తేల్చి చెప్పింది. అంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం ఏడాదికి రూ.30,000 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ప్రస్తుత కేటాయింపుల కంటే చాలా తక్కువ. 2024–25లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రిత్వ శాఖకు రూ.16,628 కోట్లు కేటాయించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఏఎన్ ఆర్ఎఫ్ ఏర్పాటు ఆలోచన వెనుక ‘ఆర్ అండ్ డీ’ బరువును తగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని స్పష్టం అవుతోంది. అదెలా చేయాలో మాత్ర స్పష్టత కనిపించడం లేదు. దేశంలో ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థలు ఎదుర్కొంటున్న ఇంకో సమస్య రెడ్ టేపిజమ్. నిధులు పొందేందుకు, పంపిణీ, స్కాలర్షిప్, ఫెలోషిప్ల నిర్ధారణ వంటి అనేక అంశాల్లో అధికారుల జోక్యం ఉంటోంది. మేకిన్ ఇండియా వంటి వాటికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన ఇంకో సమస్య. వీటన్నింటి మధ్య తాము పరిశోధనలపై దృష్టి ఎలాకేంద్రీకరించగలమని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్త ఒకరు ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిశోధనలకు అడ్డంపడే ఇలాంటి విషయాలు ఇంకా అనేకమున్నాయి. అంతర్జా తీయ ప్రయాణాలకు అందించే నిధులపై నియంత్రణ వాటిల్లో ఒకటి. కీలకమైన శాస్త్ర అంశాల్లో పలు దేశాలు కలిసి పని చేయడం ఎక్కువ అవుతున్న ఈ కాలంలో కాన్ఫరెన్సులకు వెళ్లేందుకు ఇలాంటి వంకలు పెట్టడం గమనార్హం.సైన్ ్స వ్యవహారాల్లో సౌలభ్యమెంత?గత ఏడాది ఫౌండేషన్ ఫర్ అడ్వాన్సింగ్ సైన్ ్స అండ్ టెక్నాలజీ (ఫాస్ట్) ఒక సర్వే చేసింది. టాప్–10 పరిశోధన సంస్థల్లో పని చేస్తున్న శాస్త్రవేత్తలను ప్రశ్నించి దేశంలో పరిశోధనలు చేసేందుకు అనువైన వాతావరణం ఎలా ఉందో అంచనా కట్టింది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మాదిరిగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్ ్స’ అన్నమాట. 2015లో ప్రధాని నరేంద్ర మోదీనే ఈ పదాన్ని పరిచయం చేశారు. ‘ఫాస్ట్’ చేసిన సర్వేలో స్థూలంగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ సైన్స్ బాగుందని ఆరు శాతం మంది కితాబిచ్చారు. నిధులు పొందే విషయంలో మాత్రం యావరేజ్ కంటే తక్కువని తేల్చారు. నిధులిచ్చే సంస్థలు గ్రాంట్లు ఇచ్చేందుకు తీసుకునే సమయం, నిధుల మొత్తం, ప్రాజెక్టు ఉద్దేశం వంటి అంశాల ఆధారంగా పనిచేస్తున్నాయని వీరు చెప్పారు. ఇకఅందించిన నిధులను స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఉందా? విదే శాల్లో జరిగే సదస్సులకు వెళ్లగలుగుతున్నారా? పరిశోధనలకు అవస రమైన వనరులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయా? అన్న ప్రశ్న లకు శాస్త్రవేత్తల సమాధానం ‘అధ్వాన్నం’ అని!ప్రతిభను ఎప్పటికప్పుడు గుర్తించి ప్రోత్సహించడం, ‘ఆర్ అండ్ డీ’ వాతావరణం బాగుందని అనేందుకు ఇంకో గుర్తు. కానీ శాంతి స్వరూప్ భట్నాగర్ పేరిట ఇస్తున్న ప్రతిష్ఠాత్మక అవార్డులను కూడా ‘విజ్ఞాన్ పురస్కార్’ పేరిట నగదు బహుమతి లేకుండానే అందిస్తు న్నారు. 2022లో సైన్ ్స అవార్డులను నిలిపివేసిన ప్రభుత్వం నోబెల్ స్థాయిలో ‘విజ్ఞాన రత్న’ అవార్డు ఒకదాన్ని అందిస్తామని చెప్పింది. గత నెలలో ఈ అవార్డును ప్రకటించారు కూడా. ఇందులోనూ నగదు ప్రస్తావన లేదు. ఆసక్తికరంగా ఉత్తర ప్రదేశ్, హరియాణా ప్రభుత్వాలు అందించే రాష్ట్ర స్థాయి అవార్డులైన ‘విజ్ఞాన్ గౌరవ్’, ‘విజ్ఞాన్ రత్న’ (జాతీయ అవార్డుకు ముందే అమల్లో ఉన్న రాష్ట్ర స్థాయి అవార్డు)లకు రూ. 5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు!ఒకవైపు భారత్లో సైన్సును సులభతరం చేయడం తగ్గిపోతూండగా, చైనా మున్ముందుకు దూసుకెళుతోంది. భారత్ తన జీడీపీలో 0.66 శాతం పరిశోధనలకు వెచ్చిస్తూండగా, చైనా 2.4 శాతం ఖర్చు పెడుతోంది. చైనాలోని పెకింగ్, ట్సింగ్హువా యూనివర్సిటీల పరి శోధన బడ్జెట్ మనం విద్యకు పెడుతున్న దాని కంటే ఎక్కువ ఉండటం చెప్పుకోవాల్సిన అంశం. ఈ విషయాన్ని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రాంగోపాల్ రావు ఇటీవలే ఒక సమావేశంలో తెలిపారు. పరిశోధనల నిధుల విషయంలో యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలను పస్తు పెట్టడం అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చాలన్న ఆకాంక్షను నెరవేర్చేది ఎంతమాత్రం కాదన్నది గుర్తించాలి.- రచయిత సైన్ ్స అంశాల వ్యాఖ్యాత- (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) దినేశ్ సి. శర్మ -
ఏపీలో విద్యకు ‘నారా’ వారి గ్రహణం
కొద్ది కాలం క్రితం ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఏలా సాగుతున్నాయో చూశారు. పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోవడం, డిజిటల్ బోర్డులు, పిల్లల చేతిలో ట్యాబ్లు, అడిగిన వెంటనే కొంత మంది విద్యార్థులు ఆంగ్లంలో మాట్లాడటం వంటి సన్నివేశాలు కనిపించాయి. దాంతో లోకేష్ కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు ఏమీ చేయకుండా వెళ్లిపోయారు.అయితే, ఆ స్కూల్లో లోటు పాట్లు కనిపించి ఉంటే మంత్రి హోదాలో ఆయన ఎంత గందరగోళం సృష్టించే వారో. విద్యా రంగానికి సంబంధించి వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్కరణలు ఏలా ఉన్నాయో స్వయంగా గమనించినా, మొత్తం విద్యా వ్యవస్థను వెనక్కు నడిపించేందుకు లోకేశ్, సీఎం చంద్రబాబులు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. సీబీఎస్ఈ సిలబస్ను రద్దు చేయాలన్న నిర్ణయమే ఇందుకు తాజా సాక్ష్యం. కొన్ని సందర్బాల్లో ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య లేకుండా చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.ఒక వైపు తెలంగాణలో ప్రభుత్వం సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టాలని, ఎయిడెడ్ స్కూల్లో కూడా అదే విధానం అమలు చేయాలని తలపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ప్రపంచంతో పోటీ పడాలని సీబీఎస్ఈ విధానం తీసుకువస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే.. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికే అమలు అవుతున్న విధానాలకు మంగళం పాడుతున్నారు. అంతర్జాతీయ స్కూళ్లతో పాటు తెలంగాణలోని కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సిలబస్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూంటే ఏపీలో ఇప్పటికే అమలు అవుతున్న ఆ సిలబస్ను, ఇతర సంస్కరణలను ఎత్తివేయాలని సంకల్పించడం అత్యంత శోచనీయం.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాదిరి తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం విద్యా కమిషన్ను ఏర్పాటు చేసి ఈ ప్రయత్నాలు సాగిస్తోంది.స్టేట్ సిలబస్ వల్ల ప్రభుత్వ స్కూల్స్ పిల్లలు రాణించ లేకపోతున్నారని తెలంగాణ మార్పులు తీసుకువస్తుంటే ఏపీలో ఇప్పటికే దేశం అంతటిని ఆకర్షించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరు గార్చే ప్రయత్నం జరగడం అత్యంత దురదృష్టకరం. ఆంగ్ల మీడియంలో మిషనరీ స్కూళ్లు, ప్రతిష్టాత్మకమైన కాలేజీ, అమెరికాలో ఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ ఏపీలో కూడా అదే స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లను మరింతగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాల్సింది పోయి, ఉన్న పేద విద్యార్ధులకు ఉపయెగపడే వ్యవస్థలను ధ్వంసం చేస్తూ కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేలా చర్యలు చేపట్టం అంతా బాగలేదు.వైఎస్ జగన్ హయంలో ప్రభుత్వ స్కూల్స్ కళకళలాడాయి. చదువుతో పాటు పిల్లలు తీసుకునే ఆహారం, వారు ధరించే దుస్తులు, బూట్లు, మొదలైన అన్నింటిపై చాలా శ్రద్ద తీసుకునే వారు. కేంద్రం తీసుకువచ్చిన విద్యా విధానంతోపాటు పిల్లల భవిష్యత్కు ఉపయోగపడే టోఫెల్, ఇంటర్నేషనల్ బాకులరేట్(ఐబి) బోధనకు కూడా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వాటి అన్నింటి ఫలితంగానే వైఎస్సార్సీపీ హయంలో విద్యా వ్యవస్థకు మంచిపేరు వచ్చింది. పలు రాష్ట్రాల బృందాలు వచ్చి పరిశీలించి వెళ్లాయి. ఏపీ నుంచి ప్రభుత్వ స్కూల్ పిల్లలు ఐక్యరాజ్యసమితి కూడా వెళ్లి మాట్లాడి వచ్చారు. అందుకే ప్రభుత్వ స్కూల్లో విద్యార్ధులు జగన్ మామయ్య అంటూ అప్యాయంగా పిలుచుకునేవారు. ఆయా కార్యక్రమాల్లో వారు ఆంగ్లంలో ప్రసంగించిన తీరు అందరిని ఆకట్టుకునేది. బహుశా ఆ గుర్తులు అన్నింటినీ చెరిపేయాలని భావనతోనే చంద్రబాబు, లోకేష్ల ప్రభుత్వం పేద పిల్లలకు ఉపయోగపడే సిలబస్ మార్చివేస్తున్నట్టుగా ఉంది.ఇదే సమయంలో ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో మాత్రం ఆంగ్ల మీడియం, సీబీఎస్ఈ సిలబస్లు మాత్రం యథా ప్రకారం కొనసాగుతాయి. తత్ఫలితంగా పేద పిల్లలు సైతం ప్రైవేట్ బడుల వైపు చూసే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిందని అనుకోవాలి. ఇప్పటికే రెండు లక్షల మంది ప్రభుత్వ స్కూల్ పిల్లలు ప్రైవేట్ వైపు మళ్లారని మీడియాలో కథనాలు వచ్చాయి. సీబీఎస్ఈ విద్యను అందించడం కోసం తొలుత వెయ్యి ప్రభుత్వ స్కూల్ను జగన్ ప్రభుత్వం ఎంపిక చేసి అమలు చేసింది. కానీ, ఇప్పుడు దాన్ని ఎత్తి వేస్తుండటంతో సుమారు 84వేల మంది విద్యార్ధులు నష్టపోతున్నారని అంచనా.ఒక యూనిట్ పరీక్షలు ముగిసిన తర్వాత ఇలాంటి గందరగోళం ఎందుకు సృష్టించారో అర్థం కాదు. ఇంగ్లీష్లో ప్రావీణ్యం సాధించేందుకు వీలుగా జగన్ ప్రభుత్వం టోఫెల్ శిక్షణను తీసుకువచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో దాదాపు 11.75 లక్షల మంది, ప్రైమరీ విభాగంలో 4.17 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షల్లో పాస్ అయిన విద్యార్ధులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ అనే సంస్థ సర్టిఫికెట్లను ఇస్తుంది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం పరీక్ష ఫలితాలను ప్రకటించకపోగా ఈ విద్యా సంవత్సరంలో మొత్తం టోఫెల్ను రద్దు చేసింది. ఇలాగే అంతర్జాతీయ స్థాయిలోని ఐబీ కోర్సును కూడా రద్దు చేశారు. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు పిల్లల దగ్గర లక్షల ఫీజులు వసూలు చేసి ఐబీ సిలబస్ను అందిస్తున్నాయి. అలాంటిది పేద పిల్లలకు ఉచితంగా అందించడం కోసం వైఎస్ జగన్ తీసుకువచ్చిన ఈ కోర్స్ను ఎత్తివేయడం దురదృష్టకరం.పెద్దగా చదువుకోని పవన్ కళ్యాణ్ వంటి వారు వీటికి వ్యతిరేకంగా మాట్లాడితే అర్ధం చేసుకోవచ్చు కానీ, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన లోకేష్ ఇలాంటి నిర్ణయాలు చేయడం ఏపీలోని పేద విద్యార్ధులకు అశనిపాతమే. కార్పొరేట్ స్కూల్స్ వ్యాపారంలో సిద్దహస్తుడు అయిన నారాయణ.. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన లాంటి బడా బాబులకు మేలు చేసేందుకు పేద పిల్లల చదువుపై దెబ్బకొడుతున్నారన్న విమర్శలకు మంత్రి లోకేష్ అవకాశం ఇవ్వకుండా ఉంటే మంచిదని చెప్పాలి. తల్లికి వందనం పథకాన్ని పెట్టి ప్రతీ విద్యార్ధికి పదిహేను వేలు ఇస్తామన్న హామీ సంగతి దేవుడెరుగు కానీ, గత ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు అన్నింటినీ ఎత్తివేయడం ద్వారా వైఎస్ జగన్ పేరు తుడిచి వేయాలన్న వికృతమైన ఆలోచన ఏపీలో పేద పిల్లలకు శాపంగా మారేలా ఉంది.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
గ్రామీణ విద్యకు వాయిస్ టెక్నాలజీ దన్ను
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో విద్యాబోధనలో వాయిస్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించగలదని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (అలెక్సా) ఆర్ఎస్ దిలీప్ తెలిపారు. అయితే, ఇప్పటికీ దీని ఉపయోగం గురించి చాలా మందికి తెలియదని, ఈ నేపథ్యంలోనే అవగాహన కల్పన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.నాగాలాండ్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాల్లో అలెక్సా ఎనేబుల్డ్ ఎకో స్మార్ట్ స్పీకర్లను ఉపయోగిస్తుండటమనేది వాయిస్ టెక్నాలజీ వల్ల చేకూరే ప్రయోజనాలను తెలుసుకునేందుకు తోడ్పడగలదని చెప్పారు. చదువుపై విద్యార్థుల్లో ఆసక్తి పెరగడానికి కూడా ఈ సాంకేతికత దోహదపడుతోందని దిలీప్ పేర్కొన్నారు. వాయిస్ టెక్నాలజీ మెరుగుపడే కొద్దీ విద్యారంగంలో మరిన్ని వినూత్న సాధనాలు అందుబాటులోకి రాగలవని, గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభ్యాసం రూపురేఖలు మార్చగలవని ఆయన చెప్పారు. -
కూటమి సర్కార్ కుట్ర.. విద్యారంగ సంస్కరణలపై వేటు!
సాక్షి, విజయవాడ: ఏపీ విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలకు కూటమి సర్కార్ తిలోదకాలు పలికింది. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలను ఆపేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ జగన్కు పేరు రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సంస్కరణలపై వేటు వేస్తోంది...ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన కీలక సంస్కరణలను ఆపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అధికారికంగా ప్రకటించారు. ఇదే సమయంలో సీబీఎస్ఈ సిలబస్ను కూడా ఎత్తేస్తామని ఆయన తెలిపారు. ఇక, బైజూస్ ట్యాబ్లు దండగ అంటూ టీడీపీ ముద్ర వేసింది. పిల్లలకు ఇచ్చే ట్యాబ్ల పంపిణీకి కూడా మంగళం పాడేయాలని కూటమి సర్కార్ నిర్ణయించుకుంది.మరోవైపు.. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే ఏడాది నుండి ఎత్తేసే ఆలోచనలో ఉన్నట్టు అశోక్ బాబు తెలిపారు. ఇక, ఇప్పటికే టోఫెల్ శిక్షణను ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలు తేవాలని వైఎస్ జగన్ ఎంతగానో ప్రయత్నించారు. కార్పొరేట్ పాఠశాలతో పోటీ పడేందుకు ఆధునిక పద్ధతులను తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే టోఫెల్, ఐబీ సిలబస్, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ వంటి వాటిని వైఎస్ జగన్ అమలుచేశారు. దీంతో, వైఎస్ జగన్కు పేరు రావొద్దని భావించిన చంద్రబాబు.. సంస్కరణలు అన్నింటినీ ఎత్తేయాలని చూస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు మేలు చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలపై వేటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు తన పార్టీ ఎమ్మెల్సీలు, ఎల్లో పత్రికలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రచారం చేయిస్తున్నారు. క్రమంగా ఒక్కో సంస్కరణపై చంద్రబాబు వేటు వేసుకుంటూ వస్తున్నారు. -
మెగా డీఎస్సీ నిర్వహించాలని, ప్రస్తుత డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్
-
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: చదువు – లోకహితం కోసమే
రామాయణంలో ఒక చోట ‘‘సర్వే వేద విదః శూరః సర్వే లోకహితే రతః /సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః’’ అని ఉంటుంది. రామలక్ష్మణ భరత శతృఘ్నులకు గురువులు ఎన్నో విషయాలు నేర్పారు.ఎన్ని నేర్పినా, వాళ్ళకు నేర్పుతున్నప్పుడే అంతర్లీనంగా ఒక బోధ చే శారు. ‘‘ఈ చదువు మీకు ఒక కొత్త విభూతిని కట్టబెడుతుంది. ఈ చదువు మీకు ఒక కొత్త అధికారాన్ని తీసుకొస్తుంది. మీకున్న ఏ విభూతిని కూడా స్వార్థ ప్రయోజనానికి వాడుకోకుండా కేవలం ప్రజాహితానికి మాత్రమే వాడాలి.’’–అని.చదువు లేనివాడు మోసం చేయడానికి సంతకం కూడా పెట్టలేడు. చదువుకున్నవాడు వాడిని పిలిచి నిలదీస్తే వాడు భయపడి ‘ఇంకెప్పుడూ ఇలా చేయనండీ ...’ అంటాడు. కానీ బాగా చదువుకున్నవాడు అందరికీ నియమనిష్టలు చెప్పగలిగినవాడు తప్పు చేసినప్పుడు.. ... తన తప్పును అంగీకరించక΄ోగా అదే ఒప్పు అని సమర్థించుకోవడానికి సవాలక్ష వాదనలు ముందు పెడతాడు. రావణాసురుడికి ఏ విద్యలు తెలియవని!!! అయినా ‘‘స్వధర్మో రక్షసాం భీరు సర్వథైన న సంశయః! గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా!!’’ అని వాదించాడు. ‘నా తప్పేముంది కనుక. నేను రాక్షసుడిని.నా జాతి ధర్మం ప్రకారం నాకు కావలసిన స్త్రీలను అవహరిస్తాను, అనుభవిస్తాను. నేను చూడు ఎంత ధర్మాత్ముడినో’’ అని సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు. అంత చదువుకున్నవాడు అంత మూర్ఖంగా వాదిస్తే అటువంటివాడిని అభిశంసించగలిగిన వాడెవడుంటాడు!!! చదువు సంస్కారవంతమై ఉండాలి.సామాజిక నిష్ఠతో ఉండాలి. అందరి మేలు కోరేదై ఉండాలి. విశ్వామిత్రుడుకానీ, వశిష్టుడు కానీ రామలక్ష్మణులకు విద్యను నేర్పించేటప్పుడు ‘ఇంత ధనుర్వేదాన్ని వీళ్లకు అందచేస్తున్నాం. వీళ్ళు తలచుకుంటే ముల్లోకాలను లయం చేయగలరు. అంత శక్తిమంతులవుతారు..’ అన్న ఆలోచనతో దానిని ఎక్కడా దుర్వినియోగపరచకుండా ఉండేవిధంగా విద్యాబోధనలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. నిజానికి రామచంద్రమూర్తి నేర్చుకున్న ధనుర్విద్యా΄ాటవం అటువంటిది. ఆచరణలో ఆయన దానికి పూనుకుంటే ఆపడం ఎవరితరం కాదు. ఆయన బాణ ప్రయోగం చేస్తే అగ్నిహోత్రం కప్పేస్తుంది సమస్త భూమండలాన్ని... అది ప్రళయాన్ని సృష్టించగలదు. కానీ అంత బలాఢ్యుడై ఉండి కూడా రాముడు ఒక్కసారి కూడా స్వార్థం కోసం హద్దుదాటి ఎవరినీ శిక్షించలేదు. అంటే గురువులు ఇచ్చిన విద్య లోకప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడాలన్న స్పృహతో ఉండడమే కాదు, అందరికీ తన నడవడిక ద్వారా ఒక సందేశం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు.రుషులు లోకహితం కోరి మనకు అందించిన పురాణాలు మనల్ని వారికి రుణగ్రస్థుల్ని చేసాయి. ఎప్పుడో వయసు మీరిన తరువాత, పదవీవిరమణ తరువాత చదవాల్సినవి కావు అవి. చిన్నప్పటినుంచి వాటిని చదువుకుంటే, అవగాహన చేసుకుంటే మన జీవితాలు చక్కబడతాయి. అదీకాక రుషిరుణం తీరదు కూడా. ఇది తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం చాలు. బ్రహ్మచారిగా ఉండగా రామాయణ భారత భాగవతాదులు, ఇతర పురాణాలు, వేదాలు ఏవయినా చదువుకోవచ్చు. కానీ మిగిలిన రెండు రుణాలు–పితృరుణం, దేవరుణం మాత్రం గృహస్థాశ్రమ స్వీకారంతోనే తీరతాయి.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
Narendra Modi: ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా భారత్
రాజ్గిర్: అత్యాధునిక, పరిశోధనల ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థతో ప్రపంచంలోనే అతిముఖ్యమైన వైజ్ఞానిక కేంద్రంగా ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎల్లప్పుడూ జిజ్ఞాస, ధైర్యసాహసాలు కలిగి ఉండాలని విద్యార్థులకు ఉద్బోధించారు. బిహార్లోని రాజ్గిర్లో నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 10 రోజుల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చే అవకాశం దక్కడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందన్నారు. విజ్ఞానాన్ని అగి్నకీలలతో కాల్చి బూడిద చెయ్యలేమని, ఇందుకు నలంద విశ్వవిద్యాలయమే ఒక ఉదాహరణ అని చెప్పారు. 21వ శతాబ్దంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని, ఆ శతాబ్దం ఆసియాదేనని, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని పునరుద్ఘాటించారు. విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలే ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్యాలుగా ఎదుగుతాయని, ఇది చరిత్ర చెబుతున్న సత్యం అని పేర్కొన్నారు. ప్రాచీన కాలంలో మన దేశం ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రరాజ్య హోదాను అనుభవించిందని గుర్తుచేశారు. అప్పట్లో నలంద, విక్రమశిల వంటి విద్యాసంస్థలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయన్నారు. గ్లోబల్ ర్యాంకింగ్స్లో మన వర్సిటీలు భారత్ను ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా చిన్నారుల్లో నవీన ఆలోచనలను ప్రోది చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ల ద్వారా కోటి మందికిపైగా బాలలకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు. చంద్రయాన్, గగన్యాన్ వంటి ప్రయోగాలు మన బాలబాలికల్లో సైన్స్ పట్ల ఉత్సకతను కలిగిస్తున్నాయని చెప్పారు. పదేళ్ల క్రితం మన దేశంలో కేవలం 100 స్టార్టప్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 1.30 లక్షలు దాటేసిందని హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పేటెంట్లు మనకు లభిస్తున్నాయని, రీసెర్చ్ పేపర్ల ప్రచురణలో ముందంజలో ఉన్నామని పేర్కొన్నారు. పరిశోధన, నవీన ఆవిష్కరణలకు మరింత ఊతం ఇవ్వడానికి రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ప్రకటించామన్నారు. గత పదేళ్లుగా చూస్తే మన దేశంలో సగటున ప్రతి వారానికొక యూనివర్సిటీని నెలకొల్పినట్లు, ప్రతి పది రోజులకొక ఐటీఐని స్థాపించినట్లు తెలుస్తోందని నరేంద్ర మోదీ అన్నారు. రెండు రొజులకొక అటల్ టింకరింగ్ ల్యాబ్, ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు ఏర్పాటయ్యాయని స్పష్టంచేశారు. ప్రస్తుతం 23 ఐఐటీలు, 21 ఐఐఎంలు, 22 ఎయిమ్స్లు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మెడికల్ కాలేజీ సంఖ్య రెండింతలు అయ్యిందన్నారు. నలంద మహా విహార సందర్శనబిహార్ రాష్ట్రం నలంద జిల్లా రాజ్గిర్లోని ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలలో కూడిన నలంద మహా విహారను ప్రధాని మోదీ బుధవారం సందర్శించారు. ఈ కట్టడం విశేషాలను అధికారులు ఆయనకు వివరించారు. ఈ మహా విహార యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది.మోదీ వేలిపై సిరా గుర్తు ఉందా? నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ప్రారం¿ోత్సవంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోదీ ఎడమ చేతిని కొద్దిసేపు పట్టుకొని చూశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన మోదీ చూపుడు వేలిపై సిరా గుర్తు ఇంకా ఉందా? అని పరిశీలించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నితీశ్ ఆకస్మిక చర్యకు మోదీ కూడా కొంత ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించారు. అంతేకాదు ఆయన వెనుక ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. -
నీట్ పై దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న రచ్చ
-
త్వరలోనే విద్యా కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరలోనే విద్యా కమిషన్ను ఏర్పాటు చేయనున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పా రు. టెన్త్లో పదికి పది జీపీఏ వచ్చిన విద్యార్థుల కు ఇంటర్లో ఫీజుల్లేకుండా అడ్మిషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో వందేమాతరం ఫౌండేషన్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరై.. టెన్త్లో పది జీపీఏ సాధించిన విద్యార్థులకు వందేమాతరం ఫౌండేషన్ తరపున ప్రతిభా పురస్కారాలు అందించారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. మౌలిక వసతులు తక్కువగా ఉన్నా.. కార్పొరేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు పోటీపడటం అభినందనీయమని చెప్పారు. ఇప్పుడున్న సివిల్ సర్విస్ అధికారుల్లో చాలా మంది ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని.. తనతోపాటు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా సర్కారీ స్కూల్లోనే చదివామని రేవంత్ చెప్పారు.విద్యార్థులు లేరని స్కూళ్లు మూసేయబోం..రాష్ట్రంలో ప్రతీ గ్రామం, తండాకు విద్యను తీసుకెళ్లాలన్నదే తమ లక్ష్యమని, అందుకోసమే మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నామని రేవంత్ చెప్పారు. విద్యార్థులు లేరంటూ స్కూళ్లు మూసేసే పరిస్థితి ఉండబోదని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న సర్కారీ స్కూల్ భవనాల మరమ్మతుల కోసం రూ.2 వేల కోట్లు వెచ్చించనున్నట్టు చెప్పారు. రెసిడెన్షియల్ పాఠశాలలతో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చిందన్నారు. ఈ క్రమంలో ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తూ.. సెమీ రెసిడెన్షియల్గా మార్చాలన్న ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకే ఇస్తున్నామన్నారు. సరికొత్త రీతిలో బడిబాట చేపట్టి స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. విద్య మీద వెచి్చంచేది ఖర్చు కాదని, పెట్టుబడి అని పేర్కొన్నారు. టెన్త్లో ప్రతిభ చూపిన విద్యార్థులు ఇంటర్లోనూ మంచి ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పాఠశాల విద్య కమిషనర్ దేవసేన, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, యశోద ఫౌండేషన్ చైర్మన్ రవీందర్రావు, వందేమాతరం ఫౌండేషన్ అధ్యక్షుడు టి.రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇక చదువుల సీజన్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హడావుడి ముగియ డంపై విద్యా రంగంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు రీ ఓపెనింగ్ అవుతున్నాయి. స్కూళ్లల్లో మౌలిక సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఇక ఇంట ర్ బోర్డ్ ప్రవేశాల మొదలు, ఉన్నత విద్యా మండలి కార్యక్రమాలు, యూనివర్శిటీల ప్రక్షాళన వరకు అన్ని అంశాలపై దృష్టి పెట్టబోతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతీ అంశంపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. 7 నుంచి బదిలీలు, పదోన్నతులు ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు దీన్ని చేపట్టాలని భావించినా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. గత ఏడాది కొంతమంది టీచర్లను బదిలీ చేశారు. కానీ ఇప్పటి వరకూ రిలీవ్ చేయలేదు. దాదాపు 50 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మరోవైపు 10 వేల మంది టీచర్ల వరకూ పదోన్నతులు పొందాల్సి ఉంది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ నుంచి హెచ్ఎం వరకూ ప్రమోషన్లు ఇవ్వడానికి సీనియారిటీ జాబితా కూడా రూపొందించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఊపందుకుంటున్న అడ్మిషన్లు ఇంటర్ అడ్మిషన్లకు అనుగుణంగా ఇంటర్ కాలేజీలకు బోర్డ్ అనుబంధ గుర్తింపు ఇప్పటికే చాలావరకు పూర్తి చేసింది. ఇంకా 600 ప్రైవేటు కాలేజీలకు ఇవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరు కల్లా అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ప్రవేశాలు ఊపందుకున్నాయి. గత ఏడాది 80 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఈ సంవత్సరం మరికొంత మంది చేరే వీలుంది. టెన్త్ ఉత్తీర్ణులకు అవసరమైన డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ నుంచి మొదలు పెట్టే వీలుంది. డిగ్రీ ప్రవేశాలను వేగంగా చేపడుతున్నారు. తొలి దశ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీన జరుగుతుంది. డిగ్రీలో ఏటా 2.20 లక్షల మంది చేరుతున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కూ చురుకుగా ఏర్పాట్లు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి ఆన్లైన్ దర ఖాస్తు లు ప్రక్రియ మొదలుపెడతారు. రాష్ట్రంలో 1.06 లక్ష ల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 80 వేల వర కూ కనీ్వనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియ జూ లై నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అవసరమై న అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.వీసీల నియామకాలపై దృష్టిరాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల్లో కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వచి్చన దరఖాస్తుల పరిశీలనకు ప్రభు త్వం సెర్చ్ కమిటీలను కూడా నియమించింది. మే నెలాఖరుతో వీసీల పదవీ కాలం ముగిసింది. వీరి స్థానంలో ఐఏఎస్లను ఇన్ఛార్జిలుగా నియమించారు. ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటంతో వీసీల నియామకం ఇంత కాలం చేపట్టలేదు. సెర్చ్ కమిటీ భేటీ అయిన, ఒక్కో వర్శిటీ కి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఇందులో ఒకరిని వీసీగా నియమిస్తారు. ఈ ప్రక్రియ మరో పది రోజుల్లో జరగొచ్చని అధికారులు చెబుతున్నారు. -
Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?!
400కు పైగా అని ఒక కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మరో కూటమి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. జూన్ 1న చివరిదైన ఏడో విడతతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్ప్రదేశ్ ఒకటి. అక్కడి తొలి ఓటర్లు పలు అంశాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, మహిళా భద్రత తదితరాలకే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల్లో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని డైలమాలో ఉన్నామని ఈ యంగ్ ఓటర్స్లో పలువురు అంటున్నారు. నోటాకే తమ ఓటని పలువురు చెబుతుండటం విశేషం. రాష్ట్రంలో 4 లోక్సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఉచితాలు అనుచితాలే...! కొన్నేళ్లుగా పారీ్టలన్నీ పోటాపోటీగా ప్రకటిస్తున్న పలు ఉచిత హామీలపై, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై యువ ఓటర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండటం విశేషం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల భారమంతా అంతిమంగా పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజానీకంపైనే పడుతోందని వారంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా హిమాచల్లో ఉచితాలను నిలిపివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన నిధులు ఉచితాల కారణంగా పక్కదారి పడుతున్నాయన్నది నిస్సందేహం’’ అంటున్నారు సోలన్కు చెందిన రియా. ఆమె ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా యువత నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పదేళ్ల బీజేపీ పాలనను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. ‘‘బీజేపీ సారథ్యంలోని నియంతృత్వమా? విపక్ష ఇండియా కూటమి సంకీర్ణమా? కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేకపోతున్నా. ఏమైనా రాజకీయాల్లో సానుకూల మార్పు మాత్రం కోరుకుంటున్నా’’ అంటున్నాడు మరో ఓటరు నితీశ్. బీజేపీ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ దురి్వనియోగం చేస్తోందని డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి రోహిత్ విమర్శిస్తున్నారు. ‘‘మోదీకి ఓటేయడమంటే నియంతృత్వాన్ని సమర్థించడమే. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దేశానికి మంచివి కావు. కనుక ఇండియా కూటమికి ఓటేయడం కూడా సరికాదు’’ అంటున్నాడతను! ఔత్సాహిక జర్నలిస్టు...సంజౌలీ ప్రభుత్వ పీజీ కాలేజీలో జర్నలిజం చదువుతున్న అన్షుల్ ఠాకూర్ ఈసారి ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కలి్పంచి, మహిళలకు భద్రతను పెంచేవారికే తన ఓటని స్పష్టంగా చెబుతున్నాడు. పారిశ్రామికవేత్త కావాలన్నది తన కల అని మరో పీజీ విద్యార్థి పరీక్షిత్ అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను, స్టార్టప్ సంస్కృతిని, యువతను ప్రోత్సహించే వారికే తన ఓటని చెబుతున్నాడు. ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచి్చనా ఉమ్మడి పౌరస్మృతి, నూతన విద్యా విధానాలను సమర్థంగా అమలు చేయాలి. ఈశాన్య ప్రాంతాలతోపాటు లద్దాఖ్ వంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. భారత సంస్కృతిని పరిరక్షించాలి. తొలిసారి ఓటరుగా ఇది నా ఆకాంక్ష’’ అని సంజౌలీ పీజీ కాలేజీకి చెందిన మరో విద్యార్థి వశి‹Ù్ట శర్మ చెప్పాడు. అభ్యర్థులెవరూ నా అంచనాలకు తగ్గట్టుగా లేరు. అందుకే నా తొలి ఓటు నోటాకే’’ అని మంచీకి చెందిన అదితి ఠాకూర్ చెప్పుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు: హీరో విశాల్
♦ ‘నేను ఎవరికీ వ్యతిరేకం కాదు.. మనసు లోతుల్లో అనిపించిందే చెబుతున్నా.. ♦ జగన్ ప్రభుత్వంలో పల్లెల్లో విద్యా రంగంలో మార్పులు బాగా అనిపించాయి. ♦ ఏ నాయకుడైనా సరే... ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ♦ పొత్తు పెట్టుకోండి.. అయితే గతంలో ఇంత మంచి చేశామని ప్రజలకు చెప్పగలరా? ♦ ఈ ఐదేళ్లూ ఇప్పుడున్న ఆయన ఏం చేయలేకపోయారని ధైర్యంగా మాట్లాడగలరా? ♦ ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. ♦ ఎవరెన్ని కూటములు కట్టినా... ఈ ఎన్నికల్లో జగన్దే గెలుపు అని నా భావన ♦ వీడెందుకు ఇంత మంచి చేస్తున్నాడనే మంటతో కొందరు కాళ్లు పట్టుకుని లాగాలని చూస్తారు. ♦ అలాంటి వాటికి వెరవని నేత జగన్ అనేది నా నమ్మకం..’ అని హీరో విశాల్ తన మనసులో మాటను బయటపెట్టారు. రత్నం సినిమా విడుదల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మళ్లీ ఆయనే సీఎం.. నేనెప్పుడూ మనసులో ఉన్నదే మాట్లాడతా. పాదయాత్ర రోజుల నుంచి జగన్ను గమనిస్తున్నాను. ట్రెడ్ మిల్పై రెండు కి.మీ వాకింగ్ చేస్తే అలసి పోతాం. అలాంటిది ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేల కిలోమీటర్లు నడవడం ప్రజా సమస్యల పట్ల ఆయన నిబద్ధతను చాటిచెబుతోంది. ఒక కొడుకుగా తండ్రి ప్రజాసేవను కొనసాగించడం మామూలు విషయం కాదు. జగన్ నాకు నచ్చిన నాయకుడు. మళ్లీ ఆయనే సీఎం. విద్యలో సంస్కరణలు భేష్ ఆంధ్రప్రదేశ్ పల్లెల్లో విద్యారంగంలో మార్పులు నన్ను ఆకట్టుకున్నాయి. ఎంత ఖర్చయినా సరే ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న జగన్ సంకల్పం నచ్చింది. ఆడపిల్లలకు మంచి విద్య నేర్పించి మంచి భవిష్యత్ను ఇవ్వాలి. ఆడపిల్ల చదువు సమాజానికి మలుపు. జగన్ పాలనలో అది సాకారమవుతోంది. అందరికీ నాణ్యమైన విద్య అందాలనేది నా కోరిక. అందుకే మా అమ్మ పేరుతో ట్రస్ట్ నిర్వహిస్తున్నాను. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేస్తున్నారు. మా వలంటీర్లు అలాంటి వారిని వెదికి చదివించడం చేస్తున్నారు. మంచి నేతను ఎవరూ ఆపలేరు ఏ నాయకుడైనా ప్రజలకు ఏం చేస్తున్నారనేది ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి చేయాలంటే చాలా కష్టం.. మంచి చేసేవాళ్లని చూసి ఎన్నో కుట్రలు చేస్తారు. వైఎస్ జగన్పై దాడులు జరుగుతున్నాయి. అయితే మంచి చేయాలనుకునే నాయకుడిని ఆపడం ఎవరితరం కాదు. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ సమన్వయం చేయడం కష్టం. రాజకీయాలంటే చాలా కష్టమైన విషయం. ఏసీ రూముల్లో కూచుని రాజకీయాలు చేయాలంటే కుదరదు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మర్చిపోవాలి. –సాక్షి, అమరావతి మనసులో ఉన్నదే చెబుతున్నా నాకు ఆంధ్రలో ఓటు లేకున్నా.. కొంతకాలంగా ఇక్కడి రాజకీయాలు గమనిస్తున్నా. జగన్ ఇంటర్వ్యూలు తరచుగా చూస్తాను. నేను వైఎస్సార్సీపీ ని సపోర్ట్ చేయడం లేదు. చంద్రబాబుకు వ్యతిరేకం కాదు. మనసులో ఏమనిపిస్తుందో అదే చెబుతున్నాను. పార్టీ లు జత కట్టడం మంచిదే. అయితే ఆ పార్టీలన్నీ ఒకే మేనిఫెస్టో పెట్టాలి. గతంలో మీరు ఏం మంచి చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి. ఈ ఐదేళ్లలో ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదో చెప్పగలగాలి. అలా కాకుండా ఇప్పుడు వచ్చి ఐదేళ్ల నాటి మేనిఫెస్టోను తుడిచి దానికే రెండు, మూడు తాయిలాలు చేర్చి ప్రజల్ని ఏమార్చాలంటే కుదరదు. ప్రజలకు అన్నీ తెలుసు. పొత్తులు పెట్టుకోండి.. అయితే మీరెందుకు పొత్తులు పెట్టుకుంటున్నారో ఓటరుకు తెలుసు. ఎవరికి ఓటేయాలో కూడా తెలుసు. ఎవరెన్ని కూటములు కట్టినా ఈ ఎన్నికల్లో జగన్దే గెలుపు. -
ఫీజుల ‘మోత’..‘నా కుమారుడి ప్లేస్కూల్ ఫీజు రూ.4.3 లక్షలు’
న్యూఢిల్లీ : అక్షరాల రూ.4.3లక్షల ఫీజు. ఇది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో కాదు. ప్లేస్కూల్!! కోసం. అవును మీరు విన్నది కరెక్టే కొత్త విద్యా సంవత్సరం వస్తోంది. అప్పుడే దోపిడీ ప్రణాళిక కూడా మొదలైంది. గత ఏడాది కంటే 40 శాతం నుంచి 50 శాతం వసూలు చేసేందుకు ఢిల్లీ కార్పొరేట్ స్కూల్స్ రెడీ అయినట్లు తెలుస్తోంది. దీంతో పిల్లల్ని అష్టకష్టాలు పడుతున్న పేరెంట్స్ చివరికి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తమ పిల్లల స్కూల్ ఫీజు రసీదులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. My son's Playschool fee is more than my entire education expense :) I hope vo ache se khelna seekhle yaha! pic.twitter.com/PVgfvwQDuy — Akash Kumar (@AkashTrader) April 12, 2024 ఢిల్లీకి చెందిన ఆకాష్ కుమార్ చార్టర్డ్ అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తన కుమారుడు ప్లేస్కూల్ ఫీజు గురించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో నేను మొత్తం చదివిన చదువుకు ఎంత ఫీజు చెల్లించానో.. అంతకంటే ఎక్కువగా నా కుమారుడు ప్లేస్కూల్ కోసం చెల్లిస్తున్నాను. ఆ స్కూల్లో కనీసం ఆడటం నేర్చుకుంటాడని నేను ఆశిస్తున్నాను అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. ఫీజు రిసిప్ట్ను సైతం ట్వీట్లో చేశారు. అందులో ఏప్రిల్ 2024 - మార్చి 2025 విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ఫీ - రూ.10వేలు ఏడాది ఫీజు - రూ.25వేలు టర్మ్-1 (ఏప్రిల్ - జూన్ 2024) - రూ.98,750 టర్మ్-2 (జులై- సెప్టెంబర్ 2024) - రూ.98,750 టర్మ్-3 ( అక్టోబర్ -డిసెంబర్ 2024) - రూ.98,750 టర్మ్ -4 ( జనవరి - మార్చ్ 2025) - రూ.98,750 టోటల్ ఫీజు - రూ.4,40,000 అంటూ స్కూల్ ఫీజు గురించి షేర్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇప్పటి వరకు ఈ స్టోరీ పోస్ట్ చేసే సమయానికి 2.3 మిలియన్ల మంది వీక్షించారు. ఈ ట్వీట్పై ఢిల్లీలోని అనేక మంది తల్లిదండ్రులు తమ అనుభవాల్ని షేర్ చేస్తున్నారు. గుర్గావ్లోని ఒక వ్యక్తి ఇటీవల తన 3వ తరగతి కుమారుడి స్కూల్ ఫీజు నెలకు రూ. 30,000 చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఆ లెక్కన అతను ఇంటర్ వచ్చేసరికి ఆ మొత్తం సంవత్సరానికి రూ. 9 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేశారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తన హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో 100 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ లావాదేవీ స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో జరుగుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్విస్ ఛాలెంజ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత హెచ్డీఎఫ్సీ ఎడ్యుకేషన్ వాటాను ఎవరు కొనుగోలు దారులను ఖరారు చేస్తుంది. ఆ తర్వాత బ్యాంక్ బిడ్డర్ ప్రయోజనాల కోసం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి స్విస్ ఛాలెంజ్ పద్ధతి అనేది ఓ కంపెనీలో వాటాను మరో సంస్థకు అమ్మేందుకు ఉపయోగపడే బిడ్డింగ్ ప్రక్రియ. ఆసక్తిగల సంస్థ (సాధారణంగా ఒక ప్రైవేట్ సంస్థ) ఒక కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ కోసం ఒక ప్రతిపాదనను ప్రారంభిస్తుంది. అప్పుడు ప్రభుత్వం ప్రాజెక్టు వివరాలను బహిరంగంగా విడుదల చేసి, ఇతర పార్టీలను తమ ప్రతిపాదనలను సమర్పించమని ఆహ్వానిస్తుంది. ఈ ప్రతిపాదనను ప్రారంభించిన అసలు బిడ్డర్(ఇక్కడ హెచ్డీఎఫ్సీ బ్యాంక్)కు తిరస్కరించే హక్కు ఉంది. అసలు బిడ్డర్కు నచ్చితే వాటా అమ్మకం ప్రక్రియ ముందుకు సాగుతుంది. -
మోసగాళ్లను నమ్మొద్దు
చంద్రబాబు ఈ రోజు శింగనమలకు వెళ్లారు. వైఎస్సార్సీపీ ఓ టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చిందని హేళన చేసి తూలనాడారు. ఆ పిల్లోడు చదువుపై కూడా తప్పులు చెప్పారు. అవునయ్యా.. పేదవాడికి టికెట్ ఇచ్చాం. తప్పేముందయ్యా చంద్రబాబూ? వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరే. కాదని చెప్పలేదు. కానీ అతను చదివింది చంద్రబాబు కంటే పెద్ద చదువులు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా చేశాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్గా తన కాళ్లపై నిలబడ్డాడు. వీరాంజనేయులు చాలా ఏళ్లుగా మనకు తోడుగా ఉన్నాడు. అలాంటి పేద కార్యకర్తకు మీ జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీ జగన్ 175 అసెంబ్లీ, 25 ఎంపీలలో 200 స్థానాల్లో ఏకంగా 50 శాతం అంటే 100 సీట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. పేదవారికి అండగా ఉండే జగన్కు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబుకు మధ్య తేడాను గమనించాలని కోరుతున్నా. అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం ఎస్సీలది. అక్కడ మన అభ్యర్థి పేరు లక్కప్ప. చంద్రబాబు అక్కడికి వెళ్లి ఉపాధి హామీ కూలీకీ జగన్ టికెట్ ఇచ్చారు అని అంటారు. అవునయ్యా.. ఉపాధి కూలీ, పేదవాడైన లక్కప్పకు టికెట్ ఇచ్చాం. జగన్కు, చంద్రబాబుకు మధ్య ఇదీ తేడా. మాది పేదల పార్టీ. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘పొత్తులు, జిత్తులు, మోసాలు, అబద్దాలు, కుట్రలతో వారు మళ్లీ మీ ముందుకు వస్తున్నారు. మాట నిలబెట్టుకున్న మనకూ, మాట తప్పిన చంద్రబాబుకూ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. మనందరి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్ చేసిన మంచిని, చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. మోసం చేసిన వారి తోకలు కత్తిరించే స్టార్ క్యాంపెయినర్లు మీరే. ఈ ఐదేళ్ల పాలనలో మేలు చేసి చూపించి ప్రజల ఇళ్ల వద్దకు వెళుతున్నాం. మీకు మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఆయన ఎమ్మిగనూరు బహిరంగ సభలో మాట్లాడారు. జన సముద్రంగా మారిన ఎమ్మిగనూరు సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని చెప్పారు. మే 13న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో పేదల పక్షాన నిలిచి పెత్తందారులను ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. అని ప్రశ్నించారు. సిద్ధం అంటూ చేతులు పైకెత్తిన ఈ మహా సైన్యం.. పైకి లేచిన ప్రతి చేయి, ఉప్పొంగిన ప్రతి గుండె మా ఇంట గత ఐదేళ్లుగా మంచి జరిగింది అని చెబుతోందన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.., – సాక్షి ప్రతినిధి, కర్నూలు పిల్లల భవిష్యత్ కోసమే సంస్కరణలు ♦ మా ప్రభుత్వ బడులు బాగుపడుతున్నాయని, మా పిల్లల చదువులు మెరుగు పడుతున్నాయని ప్రతీ గుండె చెబుతోంది. రాష్ట్రంలో ఈ 58 నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 10–16 ఏళ్ల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన బడుల్లో, విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. నిలబెట్టే చదువు, తలెత్తుకునే ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతికేలా అవకాశాలు మన విద్యా విధానంలో తీసుకొచ్చాం. ♦ బడులకు పంపే తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడిని తీసుకొచ్చాం. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, తరగతి గదులు, కార్పొరేట్ కంటే గొప్పగా 6వ తరగతి నుంచి ఐఎఫ్బీ ప్యానల్ ద్వారా డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి ట్యాబ్లు, విద్యా కానుక కిట్లు, గోరుముద్ద, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు మంచి మార్పులు తీసుకొచ్చాం. ♦పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ పేదల పెద్ద చదువులకు అండగా నిలిచాం. బోధనలో మార్పులు, ఇంటర్న్షిప్తో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. పిల్లలకు ఓట్లు ఉండవని, వారి చదువుల గురించి గతంలో ఏ పాలకుడు పట్టించుకోలేదు. వారి బతుకులు మారాలన్న తపన, తాపత్రయంతో మనం అడుగులు ముందుకు వేశాం. ఈ ఎన్నికలు కేవలం ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేందుకు తూతూ మంత్రంగా ఓటు వేసేవి కాదు. పిల్లల భవిష్యత్, వారి తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆడబిడ్డలు ఎదిగేలా అడుగులు వేశాం ♦ మన బంగారు తల్లులు ఆడబిడ్డలు, అవ్వల కోసం గత ప్రభుత్వం ఏం చేసిందని అడిగితే చెప్పేందుకు ఒక్కటైనా ఉందా? మన రాష్ట్రంలో నూటికి 30 మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేయలేదు. బాల్య వివాహాలను ఆపే పరిస్థితి కూడా లేదు. తన బిడ్డను, వారి భవిష్యత్ను నిర్ణయించే శక్తి తల్లుల చేతుల్లో లేదంటే.. అలాంటి పాలకులు ఉన్నా, లేకున్నా ఒకటే. ♦ పాదయాత్రలో నా కళ్లతో చూసిన మరో విషయం చెబుతా. పూలు, వరి, తృణధాన్యాల దాకా ప్రతి గింజ ఎవరి నోట్లోకి వెళుతుందో భగవంతుడు రాస్తాడు. ప్రతీ గింజ పండించడంలో అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్లతో చూశా. పని వాళ్లుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్న లక్షల మంది వారి బతుకులను ఎంత కష్టంగా లాగుతున్నారో చూశా. వారి బతుకులు మారాలని ఈ 58 నెలల్లో అడుగులు ముందుకు వేశాం. ♦రోజు కూలీ, దోశలు.. ఇడ్లీలు అమ్మే ఓ అక్క, కుట్టుమిషన్ నడిపే ఓ చెల్లి ఇలా వీరంతా బాగుపడాలి. వీరందరి జీవితాల్లో వెలుగులు రావాలని పథకాలు తీసుకొచ్చాం. ఈ ఆలోచనల నుంచే అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, తోడు, చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా పుట్టాయి. కుదేలైన పొదుపు సంఘాలు ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో ఇవాళ తలెత్తుకుని నిలబడ్డాయి. 45–60 ఏళ్ల వయస్సులో నా అక్కచెల్లెమ్మల జీవితాలను బాగు చేసేందుకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అనే పథకాలు పుట్టాయి. చేతల్లో సామాజిక న్యాయం ♦ స్వాతంత్య్రం వచ్చిన ఈ 77 ఏళ్లలో సామాజిక న్యాయం అంశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఇందులో 75 శాతం పైచిలుకు నా.. నా.. అని పిలిచే నా సామాజిక వర్గాలకే వచ్చాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చే వరకూ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు ఏకంగా మరో 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 80 శాతం ఉద్యోగాలు ఈ వర్గాల వారే. నామినేషన్పై ఇచ్చే ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఏకంగా 50 శాతం చట్టం చేసి ఈ వర్గాలకే వచ్చేట్లు చేసింది కూడా మీ ప్రభుత్వమే. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీ, మంత్రి పదవుల వరకూ ఈ వర్గాలకే ప్రాధాన్యత ఇస్తూ పదవులు ఇవ్వడం సప్తవర్ణాల మిశ్రమం, సామాజిక ఇంధ్ర ధనస్సు అని చెప్పేందుకు సంతోష పడుతున్నా. భవిష్యత్ను మార్చే ఎన్నికలివి ♦ దేశంలో తొలిసారి ఆలయ బోర్డులు, మార్కెట్ కమిటీలు, రాజకీయ నియామకాల్లో ఏకంగా 50 శాతం పదవులకు చట్టం చేసి మహిళలకు ఇచ్చిన ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలి. బ్యాంకులకు వెళ్లి.. మహిళల అకౌంట్లలో చంద్రబాబు ఐదేళ్ల వివరాలు, మన ప్రభుత్వంలోని ఐదేళ్ల వివరాలు చూడండి. చంద్రబాబు పాలనలో మీ ఖాతాలకు ఒక్క రూపాయి అయినా వచ్చిందా? మీ బిడ్డ ప్రభుత్వ హయాంలో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. ప్రతిపక్షం మాయలు, మోసాల్ని నమ్ముకుంటే.. మీ ప్రభుత్వం మీకు చేసిన మంచిని నమ్ముకుంది. ఈ ఎన్నికలు 2.5 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు.. వారి భవిష్యత్, వారి పిల్లల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలని గుర్తు పెట్టుకోవాలి. ♦రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం ఇది. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున ఈ 58 నెలల్లో ఏకంగా రూ.67,500 ప్రతీ రైతు చేతిలో పెట్టాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. చంద్రబాబు హయాంలో రాత్రి పూట 12 గంటలకు ఎప్పడో కరెంట్ వచ్చేది. ఈ రోజు పగటి పూటే నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ఆర్బీకేలు చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి రైతులకు ఉచిత పంటల బీమా ఇస్తున్నాం. వరదలు, తుపాన్లు వచ్చి రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్లోనే ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చేది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. అసైన్డ్, ఇనాంతో పాటు 22ఏకు సంబంధించిన 35 లక్షల ఎకరాల భూములపై శాశ్వత భూ హక్కులు కల్పించిన ప్రభుత్వం ఇది. రైతు పేరు పలకడమే నేరంగా భావించి, వారిని మోసం చేయడం, వ్యవసాయం దండుగ అనే పార్టీలకు మద్దతిస్తారా? మీకు అండగా నిలిచే మీ భూమిపుత్రుడికి అండగా నిలుస్తారా? మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి ♦ నా చేతికి మాత్రమే కాదు.. మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని కోరుతున్నా. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. దిశ యాప్ ద్వారా 35 వేల మంది అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే వారికి భద్రత కల్పించిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టాలి. మహిళా పోలీసును ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలి. అవ్వా, తాతలకు.. అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు, దివ్యాంగులకు ఒకటో తేదీన, సెలవైనా సూర్యోదయానికి ముందే వారి చేతిలో పింఛన్ పెట్టేందుకు వలంటీర్ను ఇంటికే పంపిన ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. ♦ పింఛన్ తీసుకునే 66 లక్షల మందిలో అవ్వలు, వితంతు అక్క చెల్లెమ్మలు 45 లక్షల మంది ఉన్నారు. వీరందరూ మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలని కోరుతున్నా. ఈ 58 నెలల్లో లంచాలు, వివక్ష లేకుండా నేరుగా రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం. అందులో రూ.1.90 లక్షల కోట్లు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చి మహిళ సాధికారతను ఉద్యమంగా నడిపిన ప్రభుత్వం ఇది. వారి భవిష్యత్ కోసం రక్షాబంధన్ కట్టాలని కోరుతున్నా. బాబు తోక కత్తిరించండి ♦ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ది చెప్పండి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేసిన వారు, బీసీల తోకలు కత్తిరిస్తాం.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అనే చంద్రబాబు తోకను మరోసారి కత్తిరించాలని కోరుతున్నా. నాన్న ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను పణంగా పెట్టడమే కాకుండా, గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న బాబును ఏ ఒక్కరైనా సమర్థిస్తారా? ఈ వర్గాలన్నీ నేను అక్కున చేర్చుకున్న వర్గాలు. ♦ బాబుకు నా.. నా.. అని పిలచుకునే వర్గాలు హైదరాబాద్ మెట్రోలో హైటెక్సిటీలో ఉన్నాయి. ఇక్కడ లేవు. ఓ ఈనాడు, ఆంధ్ర‡జ్యోతి, టీవీ–5 వీరికి తోడు ఓ దత్తపుత్రుడు. వీరు మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు, మోసాలు మాత్రమే. ఐదేళ్ల కిందట ఓ దత్తపుత్రుడు, ఢిల్లీ నుంచి మోడీని తెచ్చుకుని ఇదే చంద్రబాబు 2014లో మేనిఫెస్టో అని చెప్పి రంగు రంగుల కాగితాలు తీసుకొచ్చారు. 650 హామీలు ఇచ్చారు. ఇవి ప్రజలు మర్చిపోతారు అని ముఖ్యమైన హామీలు అంటూ ఓ కరపత్రం (చేత్తో పట్టుకుని చూపిస్తూ) సంతకం చేసి ప్రతీ ఇంటికి పంపారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లో ప్రకటనలు ఇచ్చారు. చంద్రబాబు మోసాలు ఇవిగో.. ♦ రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. రూ. 87,612 కోట్లు మాఫీ చేశాడా? ♦ డ్వాకా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. రూ.4,205 కోట్లు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటింటికీ ఓ ఉద్యోగం.. లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఇచ్చారా? ♦ అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు సాయం ఇస్తామన్నారు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చారా? ♦రూ.10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత, మహిళ రుణాలు మాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతీ నగరాన్ని హైటెక్సిటీగా నిర్మించడం ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. మీ నగరంలో, జిల్లాలో హైటెక్సిటీ ఎక్కడైనా కన్పించిందా? ♦ ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు మోడీ ఫొటో పెట్టుకుని ఇంటింటికీ పంపిన ఈ కరపత్రంలో కనీసం ఒక్కటైనా చేశారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? మన టార్గెట్ 175కు 175 ఒక్క హామీ నెరవేర్చకపోగా, ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి, మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ దత్తపుత్రుడు, చంద్రబాబు, మోడీ ఇదే ముగ్గురూ కలిసి సూపర్సిక్స్, సూపర్సెవన్ అంటున్నారు. ప్రతి ఇంటికీ కిలో బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి మోసాల నుంచి రాష్ట్రంలోని పేదల భవిష్యత్ను కాపాడుకోవాలా? వద్దా? ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా? సిద్ధం అంటే జేబులో నుంచి సెల్ఫోన్లు బయటకు తీసి పేదవాడి భవిష్యత్ కోసం మేమంతా సిద్ధం అని లైట్ వేసి పిలుపునివ్వండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ ఆన్ చేసి మద్దతు పలికారు). మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి. ఈ ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175. 25కు 25 ఎంపీలు గెలవాలి. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్య, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ ఎమ్మెల్యేలుగా బుట్టారేణుక, సాయిప్రసాద్రెడ్డి, విరూపాక్షి, ఇంతియాజ్, డాక్టర్ సతీశ్, బాలనాగిరెడ్డి, శ్రీదేవిని నిండు మనస్సుతో ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి గెలిపించాలి. సంక్షేమంతో ఎమ్మిగనూరుకు రూ.650 కోట్లు.. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలు అమోఘం. ముఖ్యమంత్రి జగన్ చొరవతో ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలకు రూ.650 కోట్ల మేర లబ్ధి చేకూరింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేసిన ఘనత సీఎం జగన్దే. గాజులదిన్నె ప్రాజెక్టును ఆధునీకరించడం, గాజులదిన్నెకు హంద్రీనీవా నుంచి 3 టీంఎంసీల నీటిని తరలించే అవకాశాన్ని కల్పించింది కూడా ముఖ్యమంత్రి జగనే. సామాజిక న్యాయం లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతల సంక్షేమానికి టైక్స్టైల్ హబ్ను విస్తరించడంతోపాటు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు మరిన్ని ఎత్తిపోతల పథకాలను చేపట్టాలని కోరుతున్నా. పేద వర్గాలకు అందుతున్న పథకాలు కొనసాగాలన్నా, మరింత మెరుగుపర్చాలన్నా వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపాలనే లక్ష్యంతో ఐదేళ్ల పాటు సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలి. బీసీ మహిళనైన నాకు ఎమ్మిగనూరు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.– బుట్టా రేణుక, ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి చిన్నా.. నేనున్నా! ♦ చూపులేని చిన్నారికి సీఎం భరోసా ♦ తక్షణమే స్పందించిన సీఎంవో కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన శిబిరం నుంచి శుక్రవారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభమైన సమయంలో గ్రామానికి చెందిన రేష్మ అనే మహిళ తన నాలుగేళ్ల కుమార్తె పింజరి జుహతో కలసి ఆయన వద్దకు వచ్చింది. పుట్టుకతోనే తన కుమార్తెకు రెండు కళ్లు కనిపించవని సీఎం జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. మూడు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పాపకు కంటి చూపు రాదని డాక్టర్లు చెప్పారని విలపించింది. కనీసం పెన్షనైనా మంజూరు చేస్తే పాపకు అవసరమైన మందులకు ఉపయోగపడుతుందని అభ్యర్థించారు. దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జగన్ తన పీఏ ద్వారా సమాచారాన్ని సీఎంవోకు చేరవేశారు. సీఎంవో కార్యాలయం అధికారులు పాపకు సంబంధించి వివరాలను సేకరించారు. -
ఇంగ్లిష్.. భవిత భేష్
మన పిల్లలు ఇంగ్లిష్ చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి.. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. కేవలం కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా? ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా.. ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య, పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు. మన పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన.. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం.. 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ మన చిన్నారులకు ట్యాబ్లతో డిజిటల్ బోధన’’ – సాక్షి, అమరావతి ♦ డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్ల పంపిణీ ♦ ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(ఐఎఫ్పీ), ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాట మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్లో పాఠాలు మిర్రర్ ఇమేజ్ విధానంలో ముద్రించి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ అందిస్తోంది. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. మన ఇంగ్లిష్ విద్యపై ప్రసంశలజల్లు ♦ ‘‘ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ ♦ ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ ♦ ‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ ♦ ‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ విద్యార్థుల చెంతకు డిజిటల్ పాఠాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలు ట్యాబ్స్తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారు. హైస్కూల్ లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది. బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధనను కూడా తేస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్ నుంచి ప్రారంభం కానుంది. తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్. లేటరల్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలు అందించడంతో పాటు భవిష్యత్ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. -
దేశం చూపు రాష్ట్రం వైపు
సాక్షి, అమరావతి : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరికం నిర్మూలనే ధ్యేయంగా.. అర్హతే ప్రమాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు సీఎం జగన్ అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ. 2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఇంత భారీ ఎత్తున పేదల ఖాతాల్లో జమ చేయడం ఇదే తొలిసారి. ఇది దేశంలో అన్ని వర్గాల ప్రజల చూపు రాష్ట్రం వైపు చూసేలా చేసింది. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1,79,246.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4,38,102.91 కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియో గం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగు పరుచుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కార్ హయాంలో పేదరికం 11.77 శాతం ఉంటే.. అది 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. అభివృద్ధికి ఊతం ♦ అంతర్జాతీయ స్థాయి విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్ను బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటతో ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది. ♦ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ.. ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసే శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో 1.80 లక్షల మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఎడెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ♦ నాణ్యమైన వైద్యం అందించడానికి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలు లేకుండా 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరి మితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి రూ.13 వేల కోట్ల వ్యయం చేసి.. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 17 కొత్త కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభమవగా.. వచ్చేవి ద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీ లు ప్రారంభం కానున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్ట, విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజలకు నాణ్యమై న వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లు రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. గత 58 నెలల్లోనే రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు రావడమే అందుకు తార్కాణం. పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. ♦ ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)ల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17–18 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 35 శాతం ఉండటమే అందుకు తార్కాణం. ♦ విప్లవాత్మక సంస్కరణతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం. ♦ సీఎం జగన్ సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతిపథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాల్సిందేననే చైతన్యం విద్యావంతులు, మేధావులతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో రగులుతోంది. -
మహిళా దినోత్సవం: మహిళల ప్రాతినిథ్యం ఎలా ఉంది?
ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెరుగుపడిందని సంబరపడిపోతాం. అయినప్పటికీ ఇంకా చాల చోట్ల మహిళలు కొన్ని అంశాల్లో వెనుకంజలోనే ఉన్నారని వివక్షను ఎదుర్కొంటున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ మహిళల ప్రాతినిధ్యం ఎలా ఉంది?. వారి స్థితి మెరుగు పడిందా? అనే విషయాల గురించి ఈ దినోత్సవం సందర్భంగా కూలంకషంగా తెలుసుకుందామా!. ప్రపంచ ఆర్థిక వేదిక ( వరల్డ్ ఎకనామిక్ ఫోరం ) 2023 సంవత్సరానికి వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారతదేశం 0.643 స్కోర్తో 127వ స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరం కంటే ఎనిమిది స్థానాలు పైకి ఎగబాకింది. అన్ని రంగాల్లో లింగ భేదాన్ని తొలగించడంలో భారతదేశం 64.3% ముందంజ వేసినా, పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో, ఆర్థిక అవకాశాల్లో 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది. 146 దేశాల లింగ సమానత్వ సూచీలో ఐస్లాండ్ వరుసగా 14వ సారి అగ్రస్థానానంలో ఉంది. పొరుగు దేశం బంగ్లాదేశ్ 59వ స్థానంతో మెరుగైన ఫలితాన్ని సాధించింది. అయితే భారత్ లింగ సమానత్వంలో బెటర్గా ఉన్నా.. కొన్ని విషయాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఏయో వాటిలో మెరుగవ్వాల్సి ఉందంటే.. మహిళల విద్య!: భారతదేశంలో మహిళా విద్య అనేది దాదాపు దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించే అంశంగా ఉంది. ఎందుకంటే ఈ విషయంలో భారత్ భాగా వెనుకబడి ఉండటమే. పురుషులతో సమానంగా చదువుకునేందుకు మహిళలకు హక్కులు ఉన్నా తరతరాలుగా వేన్నేళ్లుకు పోయిన భావనల కారణంగా పురుషులే అత్యధికంగా విద్యావంతులుగా ఉంటున్నారు. ఇప్పటకీ అక్షరాస్యతలో 2021 నాటి లెక్కల ప్రకారం.. స్త్రీల అక్షరాస్యత రేటు 70.3% కాగా, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది. సామాజిక ఒత్తిళ్లు, పేదరికం, బాల్య వివాహాలు తదితర కారణాల కారణంగా నిర్భంధ విద్యహక్కుకు దూరమవ్వుతున్నారని చెప్పొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రవేశపెట్టి విద్యనందించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పలు కార్యక్రమాలతో మహిళా సాధికారత కోసం ఆర్థిక సహాయం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్కాలర్షిప్లు వంటివి అందిస్తున్నాయి కూడా. అయినప్పటికి పలుచోట్ల బాలికలు విద్యకు దూరమవుతుండటం బాధకరం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల అక్షరాస్యత రేటు 90% ఉండగా, స్త్రీలు 82.7%తో కొంచెం వెనుకబడి ఉన్నారు. దేశాల పరంగా చూస్తే..అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా వయోజన అక్షరాస్యత రేటు 96% లేదా అంతకంటే ఎక్కువ. దీనికి విరుద్ధంగా, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో సగటు అక్షరాస్యత రేటు 65% మాత్రమే ఉండటం గమనార్హం. ఏ దేశాలు మెరుగ్గా ఉన్నాయంటే.. రష్యా, పోలాండ్, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, క్యూబా, అజర్బైజాన్, తజికిస్తాన్, బెలారస్ మరియు కిర్గిజ్స్థాన్లు స్త్రీ పురుషుల అక్షరాస్యత రేటు 100% కలిగి ఉన్నాయి. తక్కువగా ఉన్న దేశాలు: చాద్, మాలి, బుర్కినా ఫాసో, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నైజర్, సోమాలియా, గినియా, బెనిన్ వంటి దేశాలు ఈ విషయంలో పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో అక్షరాస్యత రేటు 27% నుంచి 47% వరకు ఉంది. వ్యత్యాసం ఎలా ఉందంటే.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 781 మిలియన్ల పెద్దలలో మూడింట రెండు వంతుల మంది స్త్రీలు చదవడం లేదా వ్రాయడం రాని ఉన్నారు. తక్కువ-అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే పురుషులు ఉద్యోగాలు చేస్తుండగా, మహిళలు వంటింటికి పరిమితమవ్వుతున్నారు. మహిళా అక్షరాస్యత రేటు ఎక్కువగా ఉన్న దేశాలు: తైవాన్ 99.99% మహిళా అక్షరాస్యత రేటుతో ముందంజలో ఉండగా, 99.98%తో ఎస్టోనియా తర్వాత స్థానంలో ఉంది. ఇక ఇటలీ మూడో స్థానంలో ఉంది. స్త్రీలు అక్షరాస్యతలో మెరుగుపడితే, ఆర్థికపరంగా, ఉద్యోగాల్లోనూ మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడే లింగ సమానత్వానికి సరైన నిర్వచనం ఇవ్వగలం. ఈ మహిళల అక్షరాస్యతలో అసమానతను పరిష్కరించడం అనేది అత్యంత కీలకమైనది. ఇదే స్త్రీలను శక్తిమంతంగా మార్చి సాధికారతవైపుకి అడుగులు వేయించి దేశాన్ని ప్రగతి పథంలోకి దూసుకుపోయేలా చేస్తుంది. (చదవండి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి?) -
త్వరలో రైతు కమిషన్.. విద్యా కమిషన్!
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్, విద్యా రంగంపై (ఎడ్యుకేషన్) కమిషన్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర విద్యా విధానం ఎలా ఉండాలో ఎడ్యుకేషన్ కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు. రైతులు, కౌలు రైతుల సాధక బాధకాలు, వారి సంక్షేమం, వ్యవసాయరంగంలో సంస్కరణలకు సంబంధించి రైతు కమిషన్ తగిన సలహాలు, సూచనలు అందిస్తుందని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సామాజిక సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో సీఎం రేవంత్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజాహిత కార్యక్రమా లు చేపట్టిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకా రం సంక్షేమ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నా మన్నారు. మహిళలు, నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా నాలుగు గ్యా రంటీలను అమలు చేశామ ని.. రైతులు, నిరుద్యోగుల కు మేలు చేసేందుకు మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు. అసలైన అర్హులకు అదనపు సాయం! కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమా వేశం నిర్వహిస్తామని.. ప్రత్యేక చట్టం తీసుకురా వాలనే ఆలోచన ఉందని రేవంత్ చెప్పారు. రైతు భరోసా అనేది రైతులు పంటలు వేసేందుకు అందించే పెట్టుబడి సాయమని.. అది ఎవరికి ఇవ్వాల న్న దానిపై విస్తృత చర్చ జరగాలని పేర్కొన్నారు. నిస్సహాయులకు, అసలైన అర్హులకు చెప్పిన దాని కంటే ఎక్కువ సాయం చేయాలనేది తమ ఆలోచన అని రేవంత్ చెప్పారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. పంట మార్పి డికి, అన్ని పంటల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాల్సి న అవసరం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పాఠశా లలు, విద్యాలయాలను మెరుగుపర్చేందుకు ప్రభు త్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోందని తెలి పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకులాలను వేర్వేరు చోట్ల కాకుండా.. దాదాపు 25 ఎకరాల్లో ఇంటిగ్రేటేడ్ క్యాంపస్లుగా ఏర్పాటు చేస్తామని, దీనితో కుల, మత వివక్ష కూడా తొలగుతుందని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా కొడంగల్లో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నెలకొల్పుతామని, దశలవారీగా అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని తెలిపారు. గురుకులాల నిర్వహణ, పర్యవేక్షణ మరింత సమర్థంగా జరిగేలా చూస్తామన్నారు. నిరుద్యో గులకు ఉద్యోగాల కల్పన కోసం తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పారు. సీఎంను కలసిన వారిలో ఎమ్మెల్సీ మహేశ్గౌడ్, యోగేంద్ర యాదవ్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హర గోపాల్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు, రమ మేల్కొటే, ప్రొఫెసర్ రియాజ్, ప్రొఫెసర్ పురుషోత్తం, గాదె ఇన్నయ్య తదితరులు ఉన్నారు. -
రాష్ట్రంలో ఐబీ విద్యావిధానానికి ప్రభుత్వం కసరత్తులు
-
ఏపీ డిజిటల్ విద్యకు ప్రశంసల వెల్లువ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణలను ఎన్సీఈఆర్టీ మరోసారి ప్రశంసించింది. ఇతర రాష్ట్రాల విద్యాశాఖలు ఏపీ విధానాలను అధ్యయనం చేయాలని సూచించింది. ముఖ్యంగా ఐఎఫ్పీల ద్వారా డిజిటల్ బోధన, ట్యాబ్ల వినియోగం, విద్యార్థుల ట్రాకింగ్, జగనన్న గోరుముద్ద యాప్, విద్యా సమీక్ష కేంద్రాల పనితీరు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని కొనియాడింది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సమీక్ష కేంద్రాల(వీఎస్కే) పనితీరుపై గుజరాత్లోని గాంధీనగర్లో రెండు రోజులు నిర్వహించనున్న జాతీయస్థాయి వర్క్షాప్ శుక్రవారం ప్రారంభమైంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ(సీఐఈటీ) ఆధ్వర్యంలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య కమిషనరేట్ ఐటీ విభాగం అధికారి రమేష్కుమార్, విద్యా సమీక్ష కేంద్రాల సూపర్వైజర్ రమ్యశ్రీ, సమగ్ర శిక్ష నుంచి శ్రీదీప్ హాజరై రాష్ట్ర విద్యాశాఖలో అమలు చేస్తున్న డిజిటల్ విధానాలు, వీఎస్కేల పనితీరును వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో యాప్ ద్వారా లెక్కించడం, ఆన్లైన్ విధానంలో విద్యార్థుల హాజరు, ట్రాకింగ్ చేయడం వంటివి వివరిండంతో ఎన్సీఈఆర్టీ ప్రశంసించింది. ఐఎఫ్పీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 2డి, 3డీల్లో పాఠాలు బోధించడం అద్భుతమని సీఐఈటీ జాయింట్ డైరెక్టర్ అమరేంద్ర బెహరా కితాబిచ్చారు. విద్యా సమీక్ష కేంద్రాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో ముందుందని, అక్కడి విధానాలను అధ్యయనం చేసి ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించాలని సూచించారు. ఏపీలో వీఎస్కే పనితీరు ఇలా.. ♦ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన విజయవాడ, విశాఖపట్నంలలో విద్యా సమీక్ష కేంద్రాలు(వీఎస్కే) ఏర్పాటు చేశారు. వీటి ద్వారా రాష్ట్రంలోని 58,465 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న 70,70,143 మంది విద్యార్థుల హాజరును ప్రతిరోజు ట్రాక్ చేస్తున్నారు. ♦ ప్రతిరోజు ఉదయం విద్యార్థుల హాజరును ఉపాధ్యాయులు మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ వెంటనే ఎంతమంది గోరుముద్ద స్వీకరిస్తారు, ఎవరెవరు కోడిగుడ్డు, రాగిజావ, చిక్కీ తీసుకుంటారనే వివరాలు సైతం ‘ఏఐ’ టెక్నాలజీ అటెండెన్స్ యాప్లో నమోదవుతున్నాయి. ♦ ఉపాధ్యాయుల ఫేషియల్ రికగ్నేషన్ సైతం ఇదే తరహాలో ఉదయం 9 నుంచి 9.15 గంటల మధ్య స్కూలు పరిధిలోనే ఫొటోతో నమోదు చేస్తున్నారు. ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోయినా సిగ్నల్ వచ్చినప్పుడు టైమ్తో సహా అప్డేట్ అయ్యేలా టెక్నాలజీని రూపొందించారు. ఆ వెంటనే ‘స్కూల్ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం’(సిమ్స్)లో నమోదై, ఉదయం 11– 12 గంటల్లోగా విజయవాడ, విశాఖల్లోని విద్యా సమీక్ష కేంద్రాలకు చేరుతాయి. ♦ ఈ టెక్నాలజీ రాకతో గతంలో రోజుకు 68 శాతం కంటే తక్కువగా ఉన్న హాజరు... ఇప్పుడు 99 శాతం పైగా నమోదవుతోంది. ♦ విద్యార్థి ఒక్కరోజు స్కూలుకు రాకపోతే తల్లిదండ్రులకు, వరుసగా మూడురోజులు రాకపోతే విద్యార్థి ఇంటి పరిధిలోని వలంటీర్కు, నాలుగు రోజులు హాజరుకాకపోతే గ్రామ, వార్డు సంక్షేమ కార్యదర్శికి, ఎంఈవో, డీఈవోలకు సమాచారం అందుతుంది. వారు కారణాలను తెలుసుకుని ఆ వివరాలను యాప్లో నమోదు చేసి సమస్యకు పరిష్కారం చూపించాలి. ♦ ఇందుకోసం జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది సిబ్బంది, జోన్కు ఒక్కరు చొప్పున నలుగురు పర్యవేక్షకులు ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉండి, ఆరోజు అంశాలను అదేరోజు పరిష్కరిస్తున్నారు. ♦ విజయవాడ సెంటర్ నుంచి టీచర్స్ అటెండెన్స్, గోరుముద్ద, బైజూస్, అకడమిక్ అంశాలను, విశాఖపట్నం కేంద్రం ద్వారా విద్యార్థుల హాజరు, కన్స్టెన్ రిథమ్(నాడు–నేడు), జేవీకే, డీబీటీ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. ♦ డిజిటల్ టెక్నాలజీని అత్యంత పకడ్బందీగా వినియోగిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది, ఇప్పుడు ఎన్సీఈఆర్టీతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దృష్టిని ఆకర్షించింది. -
సీఐఐ సదస్సులో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : హోటల్ వెస్టిన్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదస్సు ఆధ్వర్యంలో ‘విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపక అవకాశాలు’అంశంపై సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐ తో కలిసి ముందుకు నడుస్తాం.. ఇందులో భాగంగా 64 ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2000 కోట్లలతో డెవలప్ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నాం.స్కిల్ డెవలప్మెంట్లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని..గతంలో అవుటర్ రింగ్రోడ్ అవసరం లేదని కొందరు అన్నారు. ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్ లైన్ గా మారిందని సీఐఐ సదస్సులో సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం.పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవు. గర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. -
ఇంగ్లిష్ 'పది'లం
మా లాంటి పేదలకు అండగా సీఎం గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిల్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. ఆ ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. టీచర్లు బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లిష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా సాక్షి, అమరావతి: విద్యా రంగంలో సమూల సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల క్రితం తలపెట్టిన చదువుల యజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుకునేలా దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం చదువులకు ఆదరణ పెరుగుతోంది. ఇన్నాళ్లూ మాతృభాష ముసుగులో పేద బిడ్డల ఇంగ్లిష్ చదువులకు అడ్డుపడుతూ కొందరు పెత్తందార్లు కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో పేద విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం తీసుకొస్తే తెలుగును అణగదొక్కుతున్నారంటూ విష ప్రచారం చేశారు. అందరూ ఆంగ్లంలోనే చదివితే తమ పరిస్థితి ఏం కావాలని కార్పొరేట్ విద్యా సంస్థలు బెంబేలెత్తాయి. ఇవన్నీ అధిగమిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలు మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సర్కారీ స్కూళ్లలో గత ఐదేళ్లలో దాదాపు 25 శాతం మంది విద్యార్థులు తెలుగు నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మారిపోయి పదో తరగతి పరీక్షలకు హాజరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఇంగ్లీషు మీడియం చదువులను ముఖ్యమంత్రి జగన్ అందిస్తుండటం తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో అత్యధిక విద్యార్థులు తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తదితరాలతో కిట్ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తోంది. ఇప్పటివరకు జగనన్న విద్యా కానుక కింద రూ.3,366.53 కోట్లను వ్యయం చేయగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా కానుక నిధులను సిద్ధం చేస్తూ రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ► వచ్చే నెలలో టెన్త్ పరీక్షలు రాయనున్న మొత్తం విద్యార్ధులు 6.23 లక్షల మంది ఉండగా ఏకంగా 4.51 లక్షల మందికిపైగా ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు రాయనుండటం గమనార్హం. వీరిలో ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వారు ఏకంగా 3.97 లక్షల మంది ఉన్నారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న వారి సంఖ్య 2.25 లక్షల వరకు ఉంది. ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య త్వరలోనే వంద శాతానికి చేరుతుందంని విద్యావేత్తలు, నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాలకు పదును పెడుతూ టోఫెల్ శిక్షణ సైతం అందుబాటులోకి తెచ్చిందని ఉదహరిస్తున్నారు. ► చంద్రబాబు హయాంతో పోలిస్తే ఐదేళ్లలో పరిస్థితి తిరగబడింది. సీఎం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాయనున్న విద్యార్ధులు 72.54 శాతానికి పెరిగారు. ఈసారి తెలుగు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్ధులు 26.74 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగతా అతి స్వల్ప శాతం విద్యార్థులు ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో చదువుతున్న వారున్నారు. ► టీడీపీ హయాంలో ఇంగ్లీషు మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 2.88 లక్షలు కాగా ఇప్పుడు ఏకంగా 4.51 లక్షలకు పెరిగింది. గత సర్కారు హయాం కంటే ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే వారి సంఖ్య 1.63 లక్షలు పెరగడం గమనార్హం. వీరంతా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో చదివిన విద్యార్థులే కావడం మరో విశేషం. పరీక్షలపై సీఎస్ సమీక్ష వచ్చే నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లును సమీక్షించాలని ఆదేశించారు. మంచినీటి సౌకర్యంతో పాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్లను నియమించాలని ఎస్పీలను ఆదేశించారు. జగన్ మావయ్య ఆశయాన్ని సాధిస్తా గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య ఇంగ్లీష్ మీడియం పెట్టి మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిళ్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. వాటి నుంచి వచ్చే ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచితంగా మాకు వసతి కల్పిస్తున్నారు. స్కూల్లో టీచర్లు చాలా బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లీష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా. కోరిక నెరవేరింది మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివా. ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నది నా చిన్ననాటి కోరిక. పేదరికం కారణంగా నా ఆశ నెరవేరదేమో అనుకున్నా. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో ఆరో తరగతి చదువుతున్నా. జగన్ మామకు మేమంతా రుణపడి ఉంటాం. మా అమ్మ చిలకమ్మ నన్ను కాన్వెంట్లో ఇంగ్లీషు మీడియంలో చదివించాలని బలంగా కోరుకునేది. దళితులమైనందున పేదరికంతో కాన్వెంట్లో చదివించలేకపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో మా అమ్మ కోరిక నెరవేరింది. –సామాబత్తుల లక్ష్మి, కాకినాడ జిల్లా, సంపర ప్రాధమిక పాఠశాల మా అదృష్టం.. కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పడం మా అదృష్టం. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి ఇంగ్లీష్ మీడియం పునాదిగా ఉపయోగపడుతుంది. మా తల్లిదండ్రులు నాగరాజు, పద్మావతి బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాలాంటి పేదలకు ఇంగ్లీష్ మీడియం అందించిన సీఎం జగన్కు రుణపడి ఉంటాం. –తలారి శ్వేత, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం -
విద్యలో వండర్
‘ఎడెక్స్’తో ఒప్పందం రాష్ట్ర విద్యా రంగ చరిత్రలో సువర్ణాధ్యాయం. ‘రైట్ టు ఎడ్యుకేషన్’ అనేది పాత నినాదం. ‘రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్’ అనేది మన ప్రభుత్వ విధానం. నాణ్యమైన విద్య అందించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పిల్లల ఉన్నత చదువుల ఖర్చు కోసం వెనుకాడకుండా మానవ వనరులపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక సంస్కరణలతో ఎవరూ ఊహించనన్ని మార్పులు తెచ్చామని గుర్తు చేశారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లి చదువుకోలేని మన విద్యార్థుల కోసం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే కోర్సులను ‘ఎడెక్స్’ (edX) ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి విఖ్యాత వర్సిటీలు అందించే కోర్సుల్లో 2 వేలకు పైగా వర్దికల్స్లో విద్యార్థులు తమకు నచ్చిన అంశాన్ని నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడంలో వెనుకబడితే మిగతా ప్రపంచం మనల్ని దాటుకుని ముందుకు వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు. అందుకే చదువుల్లో దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీపడుతున్నామన్నారు. వరల్డ్ క్లాస్ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతభత్యాలు సాధిస్తారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియట్ (ఐబీ) సిలబస్ అందుబాటులోకి తెస్తున్నామని, దీన్ని తొలుత ఒకటో తరగతితో ప్రారంభించి పదేళ్లలో రాష్ట్ర విద్యార్థులు ఐబీ విధానంలో టెన్త్ పరీక్షలు రాసేలా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు చేపట్టిన ఈ సంస్కరణల ఫలాలు కనిపించేందుకు మరో నాలుగైదేళ్లు పట్టవచ్చని తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ‘ఎడెక్స్’ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, 26 వర్సిటీల వీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అనూహ్య సంస్కరణలు.. ఉన్నత విద్యారంగంలో అనూహ్య సంస్కరణలు తెచ్చాం. ఆర్థిక భారంతో ఏ ఒక్కరి చదువులూ మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. ప్రతిభ కలిగిన పేదింటి విద్యార్థులను ప్రైవేట్ వర్సిటీల్లోనూ కూర్చోబెట్టి చదివిస్తున్నాం. ఏటా జగనన్న వసతి దీవెన ద్వారా అర్హులందరికీ వసతి ఖర్చులు అందజేస్తున్నాం. ప్రతి విద్యార్థి చదువు పూర్తవగానే ఉద్యోగాలు సాధించేలా పాఠ్య ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. దాదాపు 30 శాతం స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులు ప్రవేశపెట్టాం. తొలిసారి డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు, మూడేళ్ల కోర్సులో ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశాం. దీనికి అదనంగా మరో ఏడాది ఆనర్స్ డిగ్రీ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా సిలబస్ చదువుకునేలా 400కిపైగా బైలింగ్యువల్ పాడ్కాస్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్యలో బోధన ప్రమాణాలు పెంచేందుకు కోర్టు కేసులను అధిగమించి 18 వర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. 2019లో 257 ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు ఉంటే మనం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలతో 437కు పెరిగింది. బలమైన పునాది.. మానవ వనరులపై పెట్టుబడికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. విద్యార్థులను గ్లోబల్ సిటిజెన్స్గా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాం. నాడు – నేడుతో సర్కారు స్కూళ్ల రూపురేఖలు మార్చాం. విద్యార్థులను స్కూళ్లకు రప్పించేందుకు, తల్లిదండ్రుల్లో స్ఫూర్తిని నింపేందుకు అమ్మఒడి, గోరుముద్ద అమలు చేస్తున్నాం. పదేళ్లలో మన విద్యార్థులకు పూర్తిగా ఐబీ విధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ విభాగం ఎస్సీఈఆర్టీ భాగస్వామ్యంతో ఈ ఏడాది టీచర్లకు బోధన విధానాలపై శిక్షణ ఇస్తుంది. వచ్చే ఏడాది ఒకటో తరగతితో ఐబీని ప్రారంభించి ప్రతి ఏడాది ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతాం. తద్వారా 2035 నాటికి పదో తరగతిలో ఐబీ బోర్డు పరీక్షలు రాస్తారు. సృజనకు పదును.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు నాంది పలికి 6వ తరగతి నుంచి ఐఎఫ్పీ ప్యానెళ్లతో సృజనాత్మక బోధన చేపట్టాం. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉచితంగా ట్యాబ్లు అందించడం ద్వారా చదువుల్లో వేగం పెంచి సులభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టాం. ద్విభాషా పాఠ్యపుస్తకాలు విద్యార్థుల నైపుణ్యాన్ని మరింత పెంపొందించాయి. అంతర్జాతీయ వర్సిటీ కోర్సులు స్థానికంగానే మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ స్థాయిలో అందించేందుకు ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా దాదాపు 2 వేలకు పైగా కోర్సులు మన పాఠ్య ప్రణాళికలో వర్టికల్స్ కిందకు వస్తాయి. ఎడెక్స్లో విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి విద్యా సంస్థలు ఈ కోర్సులను ఆఫర్ చేసి బోధిస్తాయి. అక్కడి ప్రొఫెసర్లతో మన విద్యార్థులు ఆన్లైన్లో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లతో పాటు క్రెడిట్స్ దక్కుతాయి. తద్వారా జాబ్ మార్కెట్లో ఉద్యోగాలు సులభంగా లభిస్తాయి. పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్ఛేంజ్, వెల్త్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ లాంటి వర్టికల్స్ కనిపిస్తాయి. మన దగ్గర అవి లేకపోగా నేర్పించే సరైన మానవ వనరులు అందుబాటులో లేవు. ఈ సమస్యలను అధిగమించేందుకు అత్యుత్తమ వర్సిటీల కోర్సులను మన కరిక్యులమ్లో భాగం చేస్తున్నాం. తద్వారా ఆంధ్రా వర్సిటీ నుంచి తీసుకునే డిగ్రీల్లో స్టాక్ ఎక్ఛేంజ్, రిస్క్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్, ఫైథాన్ కోర్సులకు ప్రపంచ వర్సిటీల సర్టిఫికేషన్ లభిస్తుంది. విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం మన వర్సిటీల్లో వీటిని అందుబాటులోకి తెస్తున్నాం. దీని ద్వారా ఉన్నత విద్యలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. వర్సిటీల్లో టెక్నాలజీ వినియోగం పెరగాలి.. యువతకు మనం ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య అందిస్తే పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్దపెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. అందుకే జగనన్న విదేశీ విద్య ద్వారా అత్యధికంగా ఒక్కో విద్యార్థిపై రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రపంచంలోని టాప్–50 వర్సిటీలు, 21 ఫ్యాకల్టీల్లో టైమ్స్ రేటింగ్స్, క్యూ ఎస్ రేటింగ్స్లోని 320 కాలేజీలలో సీటొస్తే ఉచితంగా చదివిస్తున్నాం. ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రభుత్వ సాయంతో విదేశాల్లో చదువుతున్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోలేని వారికి కూడా మనం ఆ స్థాయి విద్యను అందించాలి. వర్సిటీల్లో ఏఐ, అగ్మెంటెడ్ టెక్నాలజీ, 3 డీ లెర్నింగ్ విధానాలను మన కరిక్యులమ్లో అందుబాటులోకి తేవాలని గతంలోనే వీసీలకు సూచించా. ఇప్పటికే పద్మావతి వర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగానికి చర్యలు తీసుకున్నారు. కంప్యూటర్ విజన్, మెటావర్స్ లెర్నింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్కు దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇలాంటివి అన్ని వర్సిటీల్లోనూ రావాలి. సీఎం జగన్ దార్శనికతకు నిదర్శనం పద్మశ్రీ అనంత్ అగర్వాల్, ఎడెక్స్ సీఈవో రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే తపనతో 12 లక్షల మందికి ఎడెక్స్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికీ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ దార్శనికతకు ఇది నిదర్శనం. ఉన్నత విద్యలో ఇది నిజంగా గేమ్ ఛేంజర్. పదేళ్ల కిందట ఎడెక్స్ ప్రయాణం మొదలైంది. డిగ్రీ చదివి రెండేళ్లు ఉద్యోగం కోసం ఎదురు చూసిన అక్షయ్ అనే విద్యార్థి కెరీర్పై ఆశలు వదులుకున్న తరుణంలో ఎంఐటీ రూపొందించిన పైథాన్ కోర్సు ఎడెక్స్ ద్వారా నేర్చుకున్నాడు. క్లౌడ్ కంప్యూటింగ్ చేశాడు. ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగానే ఎంపికయ్యాడు. బెంగళూరు విమానాశ్రయంలో నన్ను గుర్తుపట్టి ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. సంపన్నుల పిల్లలకు చాలా అవకాశాలు వస్తాయి. వాళ్లు డబ్బు ఖర్చుచేసి మంచి కోచింగ్ సెంటర్లకు వెళ్లి నేర్చుకోగలరు. 36 ఏళ్లపాటు ప్రొఫెసర్గా ఉన్న నన్ను ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు, విజన్ ఆశ్చర్యపరిచాయి. ఎంఐటీ, హార్వర్డ్ లాంటి వర్సిటీల విద్యను పేద విద్యార్థులందరికీ ఇవ్వాలని నాతో చెప్పారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఆ స్థాయి విద్యను ఎలా అందించగలమో నాతో చర్చించారు. ఎడెక్స్తో ఒప్పందం ఆంధ్రప్రదేశ్ను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలబెడుతుంది. విజ్ఞానం, ఆర్థిక ప్రగతి, మంచి పౌరుడిగా తీర్చిదిద్దడంలో నాణ్యమైన చదువు ఎంతో ముఖ్యం. అందుకే ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి అగ్రపీఠం వేస్తోంది. సామాన్యులకూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోంది. త్వరలోనే వివిధ రాష్ట్రాలు, దేశాలు సైతం ఏపీ విద్యా విధానాన్ని అనుసరిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. సీఎం కోరిక మేరకు పాఠ్య ప్రణాళికలను సమర్థంగా తీర్చిదిద్దేందుకు నా వంతు సహకారం అందిస్తా. మరింత రాణిస్తాం.. నాలాంటి ఎంతో మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోరుకుంటున్నారు. మధ్య తరగతి విద్యార్థులు పరిమిత వనరులతో ఉన్నత స్థాయి విద్య అందుకోవడం చాలా కష్టం. అంతర్జాతీయ వర్సిటీల్లో చదువుకోవడం కలే. ముఖ్యమంత్రి జగన్ విజనరీ లీడర్షిప్తో వరల్డ్ క్లాస్ విద్య సాధ్యమవుతోంది. ఏపీని స్టేట్ ఆఫ్ నాలెడ్జ్, స్టేట్ ఆఫ్ ఇన్నొవేషన్, స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దడం గొప్ప విషయం. ఎడెక్స్ అందించే అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందిపుచ్చుకుని రాణిస్తాం. – ప్రగతి జైశ్వాల్, బీటెక్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి స్ఫూర్తినిచ్చిన సీఎం జగన్ మా నాన్న చిన్న రైతు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా నేను చదువుకుంటున్నా. నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా ఉన్నత విద్యావకాశాలు దక్కుతున్నాయి. కరిక్యులమ్తో మా స్కిల్స్ పెరుగుతున్నాయి. ఎడెక్స్తో టాప్ వర్సిటీల కోర్సులను ఉచితంగా నేర్చుకుని గ్లోబల్ లెవల్ పోటీకి సిద్ధమవుతాం. ముఖ్యమంత్రి జగన్ లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. – ఎ.హరిత, బీటెక్, జేఎన్టీయూ–అనంతపురం మార్కెట్లో మంచి విలువ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్న్షిప్తో చదువుకునే సమయంలోనే ఉద్యోగ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాం. మాకంటూ మార్కెట్లో వాల్యూ క్రియేట్ చేశారు. ఇంటర్న్షిప్ ద్వారా నెలకు రూ.8 వేల స్టైఫండ్ పొందుతున్నా. మా అమ్మను నేనే చూసుకోవాలి. జీవితంలో స్థిరపడితేనే ఏదైనా చేయగలను. పోటీని తట్టుకుని నిలబడాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి. ఎడెక్స్తో ఇది ప్రతి విద్యార్థికీ దక్కుతుంది. అంతర్జాతీయ వర్సిటీ సర్టిఫికేషన్తో సులభంగా ఉద్యోగాలు వస్తాయి. – అంజలి, బీకాం, మేరీ స్టెల్లా కాలేజీ, విజయవాడ -
ఉన్నత విద్యలో గేమ్ ఛేంజర్
-
Forbes India 30 Under 30 2024: నెక్ట్స్ వేవ్ వ్యవస్థాపకులకు ఫోర్బ్స్ ఇండియా గుర్తింపు
హైదరాబాద్: హైదరాబాద్ కి చెందిన అంకుర సంస్థ నెక్ట్స్ వేవ్ వ్యవస్థాపకులు శశాంక్ రెడ్డి గుజ్జుల, అనుపమ్ పెదర్లకు 2024 సంవత్సరానికి ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలో చోటు దక్కింది. విద్యారంగంలో విశేష మార్పులు తీసుకువచి్చనందుకు ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వీరు ఇద్దరూ తెలుగు వారే కావడం విశేషం. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్కు చెందిన శశాంక్ గుజ్జుల ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవగా.. ఏలూరుకు చెందిన అనుపమ్ పెదర్ల ఐఐటీ ఖరగపూర్లో బీటెక్ పూర్తి చేశాడు. పరిశ్రమకు కావలసిన నైపుణ్యాలు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో లేకపోవడంతో వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నట్టు గుర్తించిన వీరు, సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. గొప్ప ఉద్యోగావకాశాలను కాదనుకొని గోదావరిఖనికి చెందిన రాహుల్ అత్తులూరితో కలిసి నెక్ట్స్వేవ్ను స్థాపించారు. యువతలో ఆధునిక 4.0 టెక్నాలజీలలో నైపుణ్యాలు పెంపొందిస్తూ ఐటీ ఉద్యోగాలు సొంతం చేసుకునే దిశగా వారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మూడేళ్లలోనే దేశ విద్యా రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న అంకుర సంస్థల్లో ఒకటిగా నెక్సŠట్ వేవ్ నిలిచింది. గత సంవత్సరం గ్రేటర్ పసిఫిక్ క్యాపిటల్ నుంచి 275 కోట్ల రూపాయల నిధులను సొంతం చేసుకుంది. బహుళజాతి సంస్థలు సహా 1700 లకు పైగా కంపెనీలు వేలాది నెక్ట్స్ వేవ్ విద్యార్థులను ఇప్పటికే ఉద్యోగాలలో నియమించుకున్నాయి. ఈ సందర్భంగా నెక్సŠట్ వేవ్ సహ వ్యవస్థాపకుడు శశాంక్ గుజ్జుల మాట్లాడుతూ ‘‘నెక్ట్స్ వేవ్ మొదలైనప్పటి నుంచి మా దృష్టి అంతా కూడా టెక్నాలజీ రంగంలోని గొప్ప అవకాశాలకు సొంతం చేసుకునేలా యువతని సిద్ధం చేయడంపైనే ఉండేది. ఇలాంటి గుర్తింపులు మరింత ఉత్సాహంగా మా లక్ష్యం వైపు అడుగు వేయడానికి తోడ్పడుతాయి’’అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీ విద్యను దేశంలోని నలుమూలలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని నెక్ట్స్ వేవ్ మరో సహ వ్యవస్థాపకుడైన అనుపమ్ పెదర్ల చెప్పారు. -
థ్యాంక్స్ మామయ్య..విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఉన్నత విద్యలో మరో చరిత్ర
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న శాస్త్ర, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన విద్యార్థులను సన్నద్ధం చేస్తూ విద్యా రంగ సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక అడుగు వేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి అత్యుత్తమ వర్సిటీలు అందించే కోర్సులను విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈమేరకు ఇప్పటికే ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. పాఠ్యప్రణాళిక కోర్సుల్లో విద్యార్థి తనకు నచ్చిన వర్టికల్ను చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి వర్సిటీల్లో ఎడెక్స్ కోర్సులను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. ఉచితంగా రూ.30 వేల విలువైన కోర్సు.. ఎడెక్స్ ప్రపంచంలోనే ప్రముఖ ఈ–లెర్నింగ్ ప్లాట్ఫారమ్గా పేరొందింది. ఇందులో 180కిపైగా వరల్డ్క్లాస్ వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సుల్లోని 2 వేలకు పైగా వర్టికల్స్ను చదువుకోవచ్చు. ఒక్కో కోర్సు చేయాలంటే సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మందికిపైగా విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా అందిస్తోంది. దీనికోసం ఏడాదికి సుమారు రూ.50 కోట్లకు పైగా వెచ్చించనుంది. అసైన్మెంట్స్, ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని సాంప్రదాయ వర్సిటీలతో పాటు సాంకేతిక విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ లాంటి 20 విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులకు ఎడెక్స్ కోర్సులను అందిస్తారు. ఉదాహరణకు డిగ్రీ సెమిస్టర్లో ఆరు సబ్జెక్టులు ఉంటే ఒకటి ఎడెక్స్ కోర్సుతో భర్తీ చేస్తారు. ఆయా కళాశాలలు, వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సును విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఎడెక్స్ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్మెంట్స్, ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తుంది. రాత పరీక్షను ఎడెక్స్ రూపొందించిన ప్రశ్నాపత్రంతో వర్సిటీలే నిర్వహిస్తాయి. క్రెడిట్స్ను కూడా వర్సిటీలే ఇస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేయవచ్చు. వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్ ఇస్తారు. ఎడెక్స్ కోర్సు ఇలా.. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు తప్పనిసరిగా ఎడెక్స్ కోర్సులు అభ్యసించేలా కరిక్యులమ్లో భాగం చేశారు. డిగ్రీ, పీజీ స్థాయిలో 2, 4వ సెమిస్టర్, ఇంజనీరింగ్లో 2, 4వ, 6వ సెమిస్టర్లలో ప్రతి విద్యార్థి వర్సిటీ/కళాశాల ఎంపిక చేసిన ఎడెక్స్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఎడెక్స్ అందించే అంతర్జాతీయ కోర్సులను అభ్యసించేందుకు అవకాశం ఉంది. తద్వారా వారు నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు మరింత అర్థవంతంగా బోధించేందుకు వీలుంటుంది. విద్యార్థికి నచ్చిన సమయంలో.. విద్యార్థులు ఎడెక్స్ ఆన్లైన్ కోర్సును తమకు అనువైన సమయంలో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. వారానికి నాలుగు గంటల పాటు క్లాసులు ఉంటాయి. ప్రతి విద్యార్థి ప్రత్యేక లాగిన్ ద్వారా మొబైల్ యాప్లో క్లాసులకు హాజరు కావచ్చు. సందేహాలను నివృత్తి చేసేందుకు ఆన్లైన్ సపోర్టింగ్ సిస్టమ్లో మెంటార్లు ఉంటారు. తద్వారా విద్యార్థులు స్వయంగా నేర్చుకునే సామర్థ్యాలు పెరుగుతాయి. ఉదాహరణకు బీకామ్ విద్యార్థులు హార్వర్డ్ వర్సిటీ అందించే సీఎస్ 50 ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్, కొలంబియా వర్సిటీ నుంచి ఫ్రీ క్యాస్ ఫ్లో అనాలసిస్, మసాచుసెట్స్ వర్సిటీ నుంచి మేథమెటికల్ మెథడ్స్ ఫర్ క్వాంటిటేటివ్ ఫైనల్స్ లాంటి విభిన్న వర్టికల్స్ను చదువుకోవచ్చు. ఇలా ఇంజనీరింగ్, బీఏ, బీఎస్సీ, ఫార్మా, ఎంబీఏ, వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన విభిన్న, వినూత్న కోర్సులను అభ్యసించవచ్చు. దేశంలో అందుబాటులో లేని విప్లవాత్మక కోర్సులను ఎడెక్స్తో ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. తద్వారా వివిధ కోర్సుల్లో స్థానికంగా అందుబాటులో లేని బోధనా సిబ్బంది కొరతను అధిగమించవచ్చు. మెరుగైన ఉపాధి.. ఎడెక్స్తో రెగ్యులర్ కోర్సులు కాకుండా మార్కెట్ ఓరియంటెడ్ విద్య లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటింగ్, ఫైథాన్ లాంటివి ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ కోవలో ఉన్నాయి. వీటిని నేర్చుకోవాలంటే బోధనా విధానంతో పాటు అందుబాటులో ఉన్న కంటెంట్ను మెరుగుపరచాలి. అత్యున్నత విశ్వవిద్యాలయాలు/సంస్థలకు చెందిన అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధించేలా ఎడెక్స్ దోహదం చేస్తుంది. తద్వారా విద్యార్థుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను గుర్తించి స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. -
Fact Check: సంస్కరణలు వద్దట.. వెనుకబాటే ముద్దట
సాక్షి, అమరావతి: విద్యా వ్యవస్థలో మార్పును, సంస్కరణలను స్వాగతించకపోతే వర్తమానంలో యువత రాతి యుగంలోనే ఆగిపోతుందన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాటలు కూడా ఎల్లో మీడియాకు ఎక్కవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా రంగంలో తెచ్చిన మార్పులు, సంస్కరణలు ఓవైపు మన పిల్లలను బంగారు భవిత వైపు నడిపిస్తుంటే, రామోజీరావుకు కంటగింపుగా ఉంది. ఇలాంటి మార్పు, సంస్కరణలు వద్దనే రీతిలో ఈనాడులో తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారు. పేదింటి పిల్లలు అరకొర చదువులతో నిరుద్యోగులుగా, పెత్తందారుల వద్ద బానిసలుగా బతకాలన్నదే రామోజీ కోరిక. పేదింటి పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగితే తమ బూర్జువా వ్యవస్థ కూలిపోతుందని, చై–నా స్కూళ్ల ప్రాధాన్యం తగ్గిపోతుందన్న భయంతో ’వినాసకాలే ం.విలీనబుద్ధి’ అంటూ విషం చిమ్మారు. అసలు వాస్తవాలను పరిశీలిస్తే.. బాబు హయాంలో కుప్పకూలిన విద్యా వ్యవస్థ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా చేపట్టిన చర్యలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వ బడుల్లో కనీస సదుపాయాలూ కల్పించలేక సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–2019 మధ్య 1,785 పాఠశాలలను మూసివేశారు. విద్యా బోధన ప్రమాణాలు దెబ్బ తిన్నాయి. పిల్లలు వయసుకి తగిన అభ్యాస ఫలితాలను సాధించలేకపోయారు. ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ స్టాండర్డ్స్తో వస్తున్నారని, బేసిక్స్ కూడా తెలియక సిలబస్ను అర్ధం చేసుకోలేకపోతున్నారని ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఎంతసేపూ ప్రైవేటు విద్యా రంగానికి నిచ్చెనలు వేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రభుత్వ విద్యా రంగాన్ని పాతళంలోకి తోసేసింది. దీంతో పేదింటి పిల్లలు చదువులు మానేసే పరిస్థితి ఏర్పడింది. పేద పిల్లలపై సీఎం జగన్ మమకారం పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులతో సమానంగా ఎదగాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష. దీనికి అనుగుణంగా వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యా సంస్కరణలపై అధ్యయనం చేసింది. ఎంతోమంది ఉపా« ద్యాయుల సూచనలతో ‘నాడు–నేడు’ పథకంతో సంస్కరణలు చేపట్టింది. చంద్రబాబు హయాంలో మూతపడిన స్కూళ్లన్నింటినీ తిరిగి తెరిచింది. 2022–23 విద్యా సంవత్సరంలో కిలోమీటరు లోపు ఉన్న 8,643 ప్రాథమిక, యూపీ పాఠశాలలను గుర్తించింది. వీటీలో కేవలం 4,943 పాఠశాలలను సమీపంలోని 3,557 ప్రీ–హై స్కూల్స్, హైస్కూళ్లతో మ్యాపింగ్ చేసింది. ఫలితంగా 3 నుంచి 5 తరగతులకు చెందిన 2,43,540 మంది విద్యార్థులకు బీఈడీ అర్హత గల సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. దీనివల్ల పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు బలోపేతమవుతున్నాయి. సబ్జెక్టు టీచర్ల పర్యవేక్షణ ఉండడంతో దీర్ఘకాలంలో 3వ తరగతి నుంచి పిల్లల పనితీరు మెరుగుపడుతుంది. ఈ సంస్కరణలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం స్వాగతించా రు. మౌలిక సదుపాయాలు, సరిపడినన్ని తర గతి గదులు ఉన్నచోట మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాపింగ్ కారణంగా ఏ పాఠ శాలనూ మూసివేయలేదు. మ్యాపింగ్ చేసిన ఉన్నత పాఠశాలల్లో 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు 3–10 తరగతుల్లో బోధన చేయాలి. ఇందులో 59,663 మంది ఉపాధ్యా యులు ఇప్పటికే పనిచేస్తున్నారు. పదోన్నతి ద్వారా ఈ విద్యా సంవత్సరంలో 6,582 మంది సబ్జెక్ట్ టీచర్లను మ్యాప్ చేసిన హైస్కూళ్లకు పంపించారు. నాడు–నేడు ఫేజ్–2లో 13,868 అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ విద్యలో పూర్వ ప్రాథమిక విద్య ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1, 2 తర గ తుల బోధన, అభ్యాసంపై దృష్టి కేంద్రీ క రించి, తదుపరి అభ్యాసానికి పునాది వేసింది. పైగా అంగన్వాడీలను పీపీ–1, పీపీ–2 బోధన స్థాయికి పెంచింది. 1, 2 తరగతుల నమోదు ఆధారంగా అన్ని ఫౌండేషన్ పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించారు. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు, హైస్కూళ్లల్లో 62 వేల ఐఎఫ్ పీ స్క్రీన్లతో డిజిటల్ బోధన సాగుతోంది. -
ఇంతటి అభివృద్ధి ఇదే ప్రథమం
గుంటూరు ఎడ్యుకేషన్: ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉపాధ్యాయుల సంక్షేమం భేషుగ్గా ఉందని పలువురు మేధావులు, విద్యావేత్తలు వెల్లడించారు. విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి.. ప్రభుత్వ పాఠశాలలకు జీవం పోసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన–ఉపాధ్యాయుల స్పందన’పై శనివారం గుంటూరులో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతుంటే ఎల్లో మీడియా నిత్యం విష ప్రచారం సాగిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దిన జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. కాగా లక్ష్మీపార్వతిని ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సదస్సులో బండ్లమూడి రోజారాణి, వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు జి.శాంతమూర్తి, హైకోర్టు న్యాయవాది ప్రభాకర్, ఉపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, జ్యోతిరెడ్డి, డి.తిరుపతిరెడ్డి, సాదం సత్యనారాయణ, పలువురు విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థిపై రూ.90 వేలు ఖర్చు జాతీయ స్థాయిలో విద్యాభివృద్ధి కోసం వివిధ రాష్ట్రాలు ఒక్కో విద్యార్థిపై సగటున రూ.50 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నాయి. అదే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.90 వేలు ఖర్చు చేస్తోంది. గతేడాది ఉపాధ్యాయులతోపాటు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను బైజూస్ కంటెంట్తో ఉచితంగా పంపిణీ చేసింది. దేశంలోని మరే రాష్ట్రం వేల కోట్ల రూపాయల విలువైన డిజిటల్ విద్యా ఉపకరణాలను ఉచితంగా ఇవ్వడం లేదు. ఐబీ సిలబస్లో చదువుకోవాలంటే ఏడాదికి రూ.నాలుగు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ప్రైవేటు స్కూళ్లు వసూలు చేస్తున్నాయి. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలకు దీన్ని ఉచితంగా బోధించనుంది. – వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుత్వ పాఠశాలలు కొత్తరూపు సంతరించుకున్నాయి.. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక వసతులతో కొత్త రూపు సంతరించుకున్నాయి. పేద పిల్లలకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం చదువులను అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ఉచితంగా చెప్పిస్తోంది. ఉపాధ్యాయులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి. ఆరేళ్ల సరీ్వసు ఉన్న ఉపాధ్యాయులకు కేరళలో రూ.2.6 లక్షలు, కర్ణాటకలో రూ.3 లక్షలు, తమిళనాడులో రూ.4.3 లక్షలు, తెలంగాణలో రూ.5.2 లక్షల వార్షిక వేతనాలు మాత్రమే ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో రూ.5.6 లక్షలు అందుతున్నాయి. –మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బెటర్ ఏపీ కన్వినర్ ప్రభుత్వ రంగాభివృద్ధితో ఉపాధ్యాయులకే ప్రయోజనం నా 50 ఏళ్ల విద్యారంగ అనుభవంలో ఎన్నడూ ఇంతటి అభివృద్ధిని చూడలేదు. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందితే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులకే ప్రయోజనం. మరింత మంది ఉపాధ్యాయులు అవసరమవుతారు. – ప్రొఫెసర్ డీఏఆర్ సుబ్రహ్మణ్యం, డీన్, మహాత్మాగాంధీ కళాశాల, గుంటూరు ఇంతటి అభివృద్ధి చరిత్రలో ఎప్పుడూ లేదు గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేక ఆడపిల్లలు చదువులు మానేయాల్సిన దుస్థితిని చూశాం. వైఎస్ జగన్ వచ్చాక నాడు–నేడు ద్వారా జరిగిన అభివృద్ధి చరిత్రలోనే ఎన్నడూ జరగలేదు. – ఆలపాటి రాధామాధవ్, అధ్యాపకుడు, గుంటూరు జగన్ను గెలిపించుకోకుంటే ఈ సంక్షేమం ఆగిపోతుంది.. స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను ఆధునికంగా తీర్చిదిద్దిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే. పేదలకు అండగా నిలిచిన సీఎం జగన్కు ప్రజలందరూ అండగా నిలవాలి. ఆయనను గెలిపించుకోకుంటే ఈ సంక్షేమం ఆగిపోతుంది. – డాక్టర్ పి.ముత్యం, ఏసీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్, గుంటూరు విద్యా రంగంపై రూ.74 వేల కోట్ల వ్యయం విద్యారంగంపై ప్రభుత్వం రూ.74 వేల కోట్లు ఖర్చు చేసింది. వివిధ పథకాలతో పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. డిజిటల్ విద్య, ట్యాబ్స్, ఐఎఫ్పీ, స్మార్ట్టీవీలతో ఆధునిక చదువులను అందుబాటులోకి తెచ్చారు. జగన్ పాలనలో రాష్ట్రంలో 12 వేల పీఈటీ, భాషా పండిట్లకు పదోన్నతులు కల్పించారు. 1998, 2008, 2018 డీఎస్సీల కింద మొత్తం 13,272 పోస్టులను భర్తీ చేశారు. –టి.కల్పలతారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
ఇదిగో.. సామర్థ్య ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ పరిపూర్ణ మానవ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అనతి కాలంలోనే ‘సామర్థ్య ఆంధ్ర’గా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతితో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘సామర్థ్య ఆంధ్ర’ కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఏకంగా రూ.53,508.04 కోట్లు కేటాయించింది. బుధవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో బడ్జెన్ను ప్రవేశపెట్టారు. పాఠశాల, సాధారణ విద్యకు పెద్దపీట వేస్తూ రూ.33,898.04 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు రూ.578.59 కోట్లు, కార్మిక శక్తి, ఉద్యోగాల కల్పనను పెంచేలా రూ.1,114.74 కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణ పేదలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా, ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని పెంచడానికి రూ.17,916.67 కోట్లు కేటాయించడం విశేషం. –సాక్షి, అమరావతి ‘విద్య’యీ భవ పిల్లలకు మంచి విద్య అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. త్వరలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) పాఠ్య ప్రణాళికలను అమలు చేయనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచేలా టొఫెల్ సరి్టఫికేషన్ అందిస్తోంది. విద్యా బోధనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. పిల్లలకు ఉచిత కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందిస్తోంది. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్తో బోధన ప్రవేశపెట్టింది. జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా ఏటా రూ.3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్లు, బ్యాగ్లు, బూట్లు, పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మనబడి నాడు–నేడు ద్వారా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల రూపురేఖలను మార్చింది. నాడు – నేడు ద్వారా ఇప్పటివరకు రూ.7163 కోట్ల స్కూళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది. రెడీ టు వర్క్ విద్యార్థులు చదువుల సమయంలోనే పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించింది. తద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా.. వీరిలో 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు. యువతకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్లు, క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసింది. 14 పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలతో ల్యాబ్లను అభివృద్ధి చేసింది. ఉన్నతంగా విద్య జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు విద్యా దీవెన కింద రూ.11,901 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం భారీగా తగ్గింది. ప్రపంచంలోని టాప్–50 (సబ్జెక్టుల వారీగా) విశ్వ విద్యాలయాల్లో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టింది. ఇంటర్న్షిప్ ద్వారా చదువుతో పాటే విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులు పొందే అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగిలిన అన్ని కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో పేదలు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది. ఆరోగ్యశ్రీతో పునరుజ్జీవనం వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకు సమూల మార్పులు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది. గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ఇంటి వద్దనే అందిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పేదల పాలిట సంజీవనిగా మారింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి, మరింత మందికి ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తోంది. ప్రొసీజర్స్ను పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య ఆసరా కింద 25 లక్షల మంది రోగులకు రూ.1366 కోట్లు అందించింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.67కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ చేసింది. కిడ్నీ రోగులకు కార్పొరేట్ సౌకర్యాలతో 200 పడకలతో పలాసలో వైఎస్సార్ కిడ్నీ రిసెర్చ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. వైద్య శాఖలో 53,126 మంది శాశ్వత సిబ్బందిని నియమించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టుల ఖాళీలు సగటున 61 శాతం ఉంటే.. ఏపీలో దానిని 4 శాతానికంటే తక్కువకు తగ్గించడం గమనార్హం. గోరుముద్దతో ఆరోగ్యం.. ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తూ 43 లక్షల మందికిపైగా విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లతో మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గిస్తోంది. సామర్ధ్యాంధ్ర కేటాయింపులు రూ. 53,508.04 కోట్లు సాధారణ విద్య రూ.33,898.04 కోట్లు వైద్య రంగంరూ.17,916.67 కోట్లు సాంకేతిక విద్య రూ.578.59 కోట్లు ఉద్యోగ, ఉపాధి రంగాలురూ. 1,114.74 కోట్లు -
మా బడి బ్రహ్మాండం
-
తల్లిదండ్రులు పిల్లల్ని చూసి గర్వపడేలా సీఎం జగన్ విద్యారంగం అభివృద్ధి
-
ఏపీ విద్యారంగంలో మరో చరిత్రాత్మక నిర్ణయం
-
అభ్యర్థులు దొరక్కుంటే అన్ రిజర్వుడే
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రిజర్వు చేసిన పోస్టుల్లో సంబంధిత కేటగిరీల అభ్యర్థులు దొరకని సందర్భాల్లో ఆయా పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించాలంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)తాజా ప్రతిపాదిత మార్గదర్శకాలల్లో పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాలను అభిప్రాయ సేకరణ కోసం ఆన్లైన్లో ఉంచింది. అయితే, యూజీసీ ప్రతిపాదించిన మేరకు ఉన్నత విద్యాసంస్థల్లోని రిజర్వుడు పోస్టులు వేటినీ కూడా డీ రిజర్వుడుగా మార్చడం లేదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ స్పందిస్తూ ‘ఉన్నత విద్యా సంస్థల్లోని రిజర్వుడు పోస్టులను అన్ రిజర్వుడుగా ప్రకటించడమనే విధానం గతంలో లేదు, ఇకపై అమలు కాబోదు. రిజర్వుడు కేటగిరీలోని అన్ని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నత విద్యాసంస్థలదే’అని స్పష్టం చేశారు. -
విదేశీ విద్యా దీవెన సమాచార బుక్లెట్ ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు యునైటెడ్ నేషన్స్ లక్ష్యాలకు చేరువలో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, జగనన్న విదేశీ విద్యాదీవెన పథకంపై షకిన్ కూమార్ రూపాందించిన సమగ్ర సమాచార బుక్లెట్ను బుధవారం తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సదస్సులో సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. గత సెప్టెంబర్లో పది మంది పేద విద్యార్థులను ఐక్యరాజ్యసమితికి తీసుకువెళ్లడంపై షకిన్ కుమార్ను సీఎం జగన్ అభినందించారు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని షకిన్ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం, అర్హతలు, దరఖాస్తు విధానం, అందించే కోర్సులు, డాక్యుమెంట్స్ చెక్లిస్ట్, అప్లికేషన్ స్టేటస్ చెకింగ్, అక్రిడేషన్, యూనివర్సిటీల జాబితా వంటి సమస్త సమాచారం ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు వివరించారు. ఈ పథకం పేద, ప్రతిభావంతమైన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు రూ.కోటిన్నరకు పైగా స్కాలర్షిప్ రూపంలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. -
విద్యా విప్లవం: బైజూస్ కంటెంట్ ఎంతో బాగుందంటున్న విద్యార్థులు
-
ప్రభుత్వ బడికి సరికొత్త శోభ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ రెండో దశ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రెండో దశలో భాగంగా 22,217 పాఠశాలల్లో పనులు చేపట్టిన ప్రభుత్వం.. ఇప్పటికే 2,755 స్కూళ్లలో నూరు శాతం పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చింది. అన్ని పాఠశాలల్లో కొత్త భవనాలతో పాటు తాగునీటి నుంచి ఆట వస్తువుల వరకు నిర్దేశిత 12 వసతులను కల్పిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి రాష్ట్రంలోని 44,512 ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం సదుపాయాలు కల్పించి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా నాడు–నేడు మొదటి దశ కింద ఇప్పటికే దాదాపు రూ.3,700 కోట్లతో 15,715 ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. మొదటి దశలో లేని 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు 2,755 స్కూళ్లలో పనులు నూరు శాతం పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. అలాగే మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్ల నిర్మాణం, మరో 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లను పూర్తి చేసింది. 394 పాఠశాలల్లో పెయింటింగ్, తాగునీటి సదుపాయాలు తప్ప ఇతర అన్ని పనులూ పూర్తయ్యాయి. రెండో దశలో చేపట్టిన పనులకు ఇప్పటికే రూ.3,535.44 కోట్ల బిల్లుల చెల్లింపులు కూడా జరిగాయి. సమున్నతంగా నిలిపేందుకు.. వైఎస్ జగన్ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను సమున్నతంగా నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టారు. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్లతో సహా అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్లలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలతో సహా మొత్తం 44,512 స్కూళ్లను నాడు–నేడు పథకం కిందకు తీసుకువచ్చారు. పాఠశాలల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను క్రమపద్ధతిలో, దశలవారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో నిరంతర నీటి సరఫరాతో పాటు టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లతో విద్యుద్దీకరణ, విద్యార్థులు, సిబ్బందికి డబుల్ డెస్క్ ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్లు, డిజిటల్ క్లాస్రూమ్లు, అదనపు తరగతి గదులు, వంటషెడ్లు, ప్రహరీ వంటి మొత్తం 12 సదుపాయాలను కల్పిస్తున్నారు. -
విద్యకు ‘నూతన’ జవసత్వాలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరంలో విద్యా రంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గణనీయ మార్పులు, కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖపై జరిపిన సమీక్ష తర్వాత రాష్ట్రంలో మార్పులపై సంకేతాలు వస్తున్నాయి. ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు కొత్త అడుగులు పడవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వంటి సంస్థలు కూడా ఈ ఏడాది కీలక సంస్కరణల అమలుకోసం సిద్ధమవుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఆశలు రాష్ట్రంలో 26 వేలకుపైగా ప్రభుత్వ బడులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 12 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు పదోన్నతులు కలి్పస్తే మరో 10 వేల వరకు పోస్టులు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 22 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండనుంది. గత ఏడాది 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి కార్యాచరణ చేపట్టినా అడుగు ముందుకు పడలేదు. అయితే త్వరలో మెగా డీఎస్సీ చేపడతామని రాష్ట్ర సర్కారు ప్రకటించడం విద్యాశాఖలో ఆశలు రేపుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కేవలం ఏడు జిల్లాల్లోనే పర్యవేక్షణ అధికారులు ఉన్నారు. దీంతో విద్యలో నాణ్యత తగ్గిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు పదోన్నతులు, బదిలీలు కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం టీచర్లలో హర్షం వ్యక్తమవుతోంది. కాలేజీ విద్యకూ మంచి రోజులు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో 2,400 బోధన సిబ్బంది పోస్టుల భర్తీ కోసం గత ఏడాది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కానీ రోస్టర్ పాయింట్ విషయంలో న్యాయపరమైన ఇబ్బందితో భర్తీ ప్రక్రియ ముందుకు కదల్లేదు. నిజానికి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు 1,200 మందే ఉన్నారు. 4,007 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. జూనియర్ కాలేజీల్లో 6,008 పోస్టులుంటే.. 4 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు అవసరమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. కొత్త ఏడాదిలో కాలేజీ విద్యకు మంచిరోజులు వచ్చినట్టేనని అంటున్నారు. ఇక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, సమన్వయ పాలన వ్యవహారాలపై సర్కారు దృష్టి పెట్టిందని.. ఇవన్నీ 2024 ఏడాదిలో కీలక పరిణామాలకు దారి తీయవచ్చని అంటున్నారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేలా.. ఫిబ్రవరిలో ఇంటర్, మార్చిలో టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో పేపర్ లీకులు, ఇంటర్ ఫలితాలపై విద్యార్థుల ఆందోళన వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం, విద్యార్థులను ముందు నుంచే సన్నద్ధం చేస్తూ భయం పోగొట్టడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెప్తున్నారు. మారుతున్న సిలబస్.. ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్ సిలబస్ మారనుంది. విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకుని కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఒక్కో డిప్లొమా బ్రాంచీకి ఒక్కో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సింగపూర్, చైనా దేశాల్లోని సిలబస్లను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. పాలిటెక్నిక్ విద్యలో ఇంటర్న్షిప్, ఆన్లైన్ మూల్యాంకనం, ఓపెన్ బుక్ విధానం వంటి సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరిన్ని డీమ్డ్ వర్సిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ ఏడాది కీలక మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇప్పటికే సంబంధిత ముసాయిదాపై అన్ని వర్గాల ఆమో దం తీసుకున్నారు. మూడేళ్లు వరుసగా న్యాక్ ఏ ప్లస్తోపాటు గ్రేడ్లో నాలుగు పాయింట్లకుగాను కనీసం 3.4 పాయింట్లు సాధించిన కాలేజీలకు డీమ్డ్ హోదా ఇవ్వాలని యూజీసీ నిర్ణయించింది. దీనిని బట్టి తెలంగాణలో పది కాలేజీలకు డీమ్డ్ హోదా లభించే వీలుంది. మరోవైపు విదేశీ విద్యాలయాలు మన దేశంలో బ్రాంచీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. వాటికి యూజీసీ, సాంకేతిక విద్యా మండలి సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. విదేశీ యూనివర్సిటీల రాకతో విద్యా బోధనలో మార్పు రావొచ్చని నిపుణులు చెప్తున్నారు. -
ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, మార్పులు
-
సరికొత్త దారిలో సర్కారీ చదువులు
ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లోని 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో ఫీజులు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉన్నాయి. అయితే ఈ వర్సిటీల్లో చదివించేందుకు ఏ ఒక్కరూ అప్పుల పాలు కాకూడదనే జగనన్న విదేశీ విద్యా దీవెన తీసుకొచ్చాం. సీటు తెచ్చుకోండి.. రూ.1.25 కోట్లు మీ జగన్ మామే భరిస్తాడని చెప్పాం. జగనన్న విదేశీ విద్యా దీవెన వల్ల 400 మంది పిల్లలు ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదువుతున్నారు. బెస్ట్ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగితే వారి బతుకులతో పాటు రాష్ట్ర రూపురేఖలు మార్చే లీడర్ షిప్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది. పెద్ద పెద్ద సంస్థలు మన పిల్లల్ని చేయిపట్టుకుని మరీ పైకి తీసుకుని పోయే అవకాశాలు ఇస్తాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. దేశ భవిష్యత్ను, తల రాతను మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. దీనిని నేను గట్టిగా నమ్మాను. విద్యా విధానంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉన్నత విద్య దాకా 55 నెలల పరిపాలనలో విప్లవాత్మక అడుగులు వేశాం. ఏకంగా రూ.73 వేల కోట్లు విద్యా రంగానికే ఖర్చు చేశానని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి గొప్ప మార్పులు ఒక్క విద్యా రంగంలోనే కాకుండా వైద్య, వ్యవసాయ రంగాల్లో, మహిళా సాధికారత విషయంలో, సామాజిక న్యాయం, పరిపాలన సంస్కరణల విషయంలోనూ తీసుకొచ్చామని చెప్పారు. ఇలా ప్రతి రంగంలో మార్పులు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి జూలై – సెప్టెంబర్ త్రైమాసికం నిధులను కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారు. 8,09,039 మంది పిల్లలకు మంచి చేసేలా రూ.7,47,920 మంది తల్లుల ఖాతాల్లో రూ.583 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా 27.61 లక్షల మంది పిల్లల పూర్తి ఫీజులు రూ.11,900 కోట్లు చెల్లిస్తూ తల్లిదండ్రులపై భారం పడకుండా ఒక మేనమామలా ఆదుకున్నానని చెప్పారు. పిల్లలపై బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల భారం పడకూడదని వసతి దీవెన ద్వారా అండగా ఉంటూ రూ.4,275 కోట్లు ఇచ్చామన్నారు. పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలు మరింత ఉన్నత చదువులు చదవాలనే తాపత్రయంతో విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా మొత్తంగా రూ.16,175 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. ‘ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ గొప్ప చదువులు, డిగ్రీలతో బయటకు రావాలి. ఇంజనీర్లు, కలెక్టర్లు, డాక్టర్లు కావాలి. అలా ఆ కుటుంబాల తలరాతలు మారాలనే తపనతో అడుగులు వేస్తున్నాం. 2017–18కి సంబంధించి అప్పటి ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజులు రూ.1,777 కోట్లను మనందరి ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యలో సంస్కరణలు ♦ నాడు–నేడుతో బడుల రూపురేఖలను మార్చుతూ ఉన్నత విద్యపై ధ్యాస పెట్టి సంస్కరణలు తీసుకువచ్చి కరిక్యులంలో మార్పులు చేశాం. పిల్లలు ఏం చదువుతున్నారు.. అని ఒక ముఖ్యమంత్రి ధ్యాస పెట్టిన పరిస్థితి మీ జగన్ మామ పాలనలోనే జరిగింది. తొలిసారి డిగ్రీలో కూడా ఆన్లైన్ వర్టికల్స్ను తీసుకొచ్చాం. ఏకంగా 10 నెలల ఇంటర్న్షిప్తో జాబ్ ఓరియంటెడ్ దిశగా వేగంగా అడుగులు ముందుకు వేశాం. ♦ మన పిల్లలు ప్రపంచంలోని మేటి యూనివర్సిటీలతో పోటీ పడేలా మన రాష్ట్రంలో చదువులుండాలనే తపనతో అంతర్జాతీయంగా ఆన్లైన్ ప్లాట్ఫాంలు, ఎంఐటీ, హార్వర్డ్, ఎల్బీఎస్, ఎల్ఎస్సీ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు వచ్చేందుకు హైడెక్స్ అనే సంస్థతో టై అప్ అయ్యాం. తద్వారా ఆన్లైన్లో ఆ కోర్సులు తీసుకొస్తూ ఏఐని అనుసంధానం చేస్తూ డిగ్రీలో భాగం చేస్తూ ఈ ఫిబ్రవరి నుంచి ఈ దిశగా అడుగులు వేస్తున్నాం. ♦ పేద విద్యార్థులు మన పిల్లలు.. ప్రపంచంతో పాటు విద్యాభ్యాసం చేయగలిగితేనే వేగంగా ఎదగగలుగుతారు. ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన డిగ్రీలో భాగమైనప్పుడు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ముందు వరుసలో ఉంటాం. పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలకు ఒక పేజీ ఇంగ్లిష్, ఒక పేజీ తెలుగుతో బై లింగ్వల్ టెక్ట్స్ బుక్స్ ద్వారా మెరుగైన చదువు చెప్పిస్తున్నాం. శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉండే.. రూ.15 వేలు ఆన్లైన్లో చెల్లిస్తే తప్ప రాని బైజూస్ కంటెంట్ను మన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాం. 6వ తరగతి.. ఆపై తరగతి గదుల్లో ప్రతి క్లాస్ రూంలో ఇంటరాక్టివ్ ప్లాట్ఫాంలు ఏర్పాటు చేసి డిజిటల్ క్లాస్ రూంలుగా మార్చి డిజిటల్ బోధనను తీసుకువచ్చాం. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లలకు ట్యాబ్లు ఇస్తున్నాం. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు సీబీఎస్ఈతో మొదలై ఐబీ వరకు వెళుతున్న ఈ ప్రయాణం పిల్లలందరినీ గొప్ప వారిగా తీర్చిదిద్దే వరకు సాగుతుంది. 3వ తరగతి నుంచి టోఫెల్ సబ్జెక్ట్ను తీసుకువచ్చి క్లాస్ టీచర్ లేని పరిస్థితి నుంచి ఏకంగా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేయడం వరకు.. పిల్లల బంగారు భవిష్యత్ కోసం వాళ్ల జగన్ మామ ఎంతో తాపత్రయపడుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా.. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టయ్యా నేను పేద కుటుంబంలో పుట్టాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివాను. నేను ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో చిన్నప్పటి నుంచి కలగనేదాన్ని. జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక్క రూపాయి ఫీజు కూడా కట్టకుండా చదువుకుంటున్నాను. మొత్తం ఫీజు మీరే (సీఎం) కట్టారు. వసతి దీవెన ఎంతో ఉపయోగపడింది. మీ వల్ల అందరం బాగా చదువుకోగలుగుతున్నాం. మీ వల్ల నేను మంచి ప్యాకేజీతో క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఆ క్రెడిట్ అంతా మీదే సార్. – ప్రిన్స్ ఏంజిల్, బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని, నరసాపురం మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారన్నా నేను జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా బీటెక్ చదువుతున్నా. నెల్సన్ మండేలా చెప్పినట్టు విద్య అనే ఒక ఆయుధం మాత్రమే మన భవిష్యత్ను మారుస్తుంది అన్న మాటను మీరు నిజం చేశారు. మీరు విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వరల్డ్ క్లాస్ వర్సిటీల్లో మాదిరి సిలబస్ తీసుకొచ్చారు. మహిళా సాధికారత, విద్య.. ఈ రెండు జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి. మీరు ఈ రెండింటినీ సాధించారు. మీరు గొప్ప విజ్ఞతతో ముందుకెళ్తున్నారు. థ్యాంక్యూ సార్. – నవ్యశ్రీ, బీటెక్ విద్యార్థిని, భీమవరం మార్పును గమనించండి ♦ దేశ భవిష్యత్ను మార్చగలిగేది చదువు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేని పరిస్థితి. ఈ రోజు మనందరి ప్రభుత్వం రూ.18,576 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి. తేడాను మీరే గమనించాలి. చదువు అనేది తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను మార్చాలన్నా, ఒక కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలన్నా, వెనుకబడిన కులాల తలరాతను మార్చాలన్నా, దేశ భవిష్యత్ను మార్చాలన్నా.. ఆ శక్తి కేవలం చదువుకే ఉంది. అందుకే 55 నెలల ప్రయాణంలో విద్యా రంగంలో విప్లవాత్మక అడుగులు వేశాం. ♦ నాడు–నేడుతో బడులు బాగుపడిన తీరుతెన్నులు గమనించాలి. ప్రభుత్వ స్కూళ్లల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టాలని తపన, తాపత్రయంతో అడుగులు వేస్తూ జగనన్న గోరుముద్ద మీద ఫోకస్ పెట్టాం. పిల్లలు బాగా చదవాలని, వారిని బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి కార్యక్రమం అమలు చేస్తున్నాం. పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని ప్రభుత్వ బడులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంకు తీసుకువచ్చి రూపురేఖలు మార్చుతున్నాం. ♦ ఒక్క విద్యా రంగంలోనే రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాం. కేవలం 55 నెలల కాలంలోనే ఇన్ని మార్పులు జగన్ చేయగలిగినపుడు గత పాలకులు 14 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు చేయలేకపోయారో మీరే ఆలోచన చేయాలి. ఒకసారి చంద్రబాబు నాయుడు పరిపాలన గుర్తు తెచ్చుకోండి. -
ఏపీ స్కూళ్ళలో అత్యున్నత విద్యా ప్రమాణాలు
-
హిజాబ్పై ఆలోచిస్తున్నాం
మైసూరు: రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధారణపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడంపై మాత్రమే రాష్ట్ర సర్కార్ లోతుగా ఆలోచిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంచేశారు. రాష్ట్రస్థాయిలో విస్తృతస్థాయిలో సంప్రతింపులు జరిపిన తర్వాతే ఈ అంశంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. శనివారం మైసూరులో మీడియాతో ఆయ మాట్లాడారు. ‘ హిజాబ్పై నిషేధాన్ని ఇంకా అమల్లోకి తేలేదు. ఈ విద్యాసంవత్సరంలోనే అమలుచేయాలా వద్దా అనే దానిపై ఇంకా సంప్రతింపులు కొనసాగుతున్నాయి’’ అని చెప్పారు. కర్ణాటకవ్యాప్తంగా విద్యాలయాల్లో మతపరమైన వ్రస్తాలు ధరించడంపై ఎలాంటి ఆంక్షలు లేవుకదా. అయినా ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి ఆహారం తినాలి అనేది పూర్తిగా వ్యక్తిగతం’’ అని శుక్రవారం వ్యాఖ్యలుచేసిన ఆయన మరుసటిరోజే ఇలా విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ చర్యల ఫలితంగా విద్యాసంస్థల్లోని లౌకక వాతావరణం దెబ్బతినే ప్రమాదముందని బీజేపీ ఆందోళనవ్యక్తంచేసింది. ‘‘ రాష్ట్రాల్లోని విద్యా వాతావరణాన్ని సీఎం చెడగొడుతున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన బుజ్జగింపు రాజకీయలకు పాల్పడుతున్నారు’’ అని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఆరోపించారు. -
ఫలించిన సీఎం వైఎస్ జగన్ కృషి..బెటర్ ఎడ్యుకేషన్
-
అక్షరానికి అగ్రపీఠం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగాన్ని అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ విద్యా రంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ప్రక్షాళన చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంచలనాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా రంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యా రంగానికి తనదైన శైలిలో ఊపిరిలూది ప్రగతి బాట పట్టించారు. ఇంటాబయటా వెల్లువెత్తుతున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. దాదాపు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో విద్యా సంస్కరణలకే ఏకంగా రూ. 66,722.36 కోట్లు వ్యయం చేశారు. నాడు–నేడుతో పాఠశాలల్లో కొత్త భవనాలు, తరగతి గదులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ, డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ సదుపాయంతో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, తదితరాలను ఏర్పాటు చేశారు. నవశకానికి నాంది.. ♦ 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం. ♦ ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్ కేటాయింపు ♦ టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన ఖర్చు రూ.450 కోట్లు మాత్రమే. ♦ 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి. ♦ ఈ ఏడాది ముగిసిన ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. ♦ నాడు నేడులో తొలి విడత కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15,713 పాఠశాలలను రూ.3,669 కోట్లతో సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. రెండో విడత కింద రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ♦ 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల చొప్పున జమ. ♦ పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సత్కారం. ♦ 10 మంది పేద ప్రతిభావంతులైన విద్యార్థులను అమెరికా సందర్శించే అవకాశం. ♦ 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 47 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.15,762 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ. 11,317 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద మరో రూ. 4,267 కోట్లు చెల్లించింది. ♦ ప్రైవేటు వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ కోర్సుల్లో 35 శాతం సీట్లలో రిజర్వేషన్ కోటా అమలు. ♦ గత నాలుగున్నరేళ్లల్లో 1,925 మంది విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థికంగా అండ. ♦ నైపుణ్య వర్సిటీ, ప్రత్యేక శిక్షణ సంస్థల ఏర్పాటుతోపాటు ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు 2021–22 బడ్జెట్లో రూ.774.01 కోట్లు ఖర్చుచేయగా 2022–23 బడ్జెట్లో రూ.969.91 కోట్లు కేటాయించారు. మైక్రోసాఫ్ట్తో ఒప్పందం.. ఎడ్యుస్కిల్, సేల్స్ఫోర్స్తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్య కోర్సులు పూర్తి చేశారు. ఒక రాష్ట్రంలో 1.64 లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వం ఏపీనే కావడం విశేషం. దీంతో 2018–19లో క్యాంపస్ ఎంపికల్లో 37 వేల మంది ఉద్యోగాలు పొందితే, 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇక 2022–23లో 1.20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. దేశ సగటు కంటే మెరుగ్గా జీఈఆర్.. ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తుండడంతో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్)లో మన రాష్ట్రం దేశ సగటుకంటే చాలా ముందుంది. 2019–20లో ఇండియా సగటు 27.1 శాతం ఉంటే.. రాష్ట్రంలో 35.2 శాతం, 2020–21లో దేశ సగటు 27.3 శాతం ఉంటే రాష్ట్రంలో 37.2 శాతం జీఈఆర్ నమోదు కావడం విశేషం. మరోవైపు కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిబంధనలు కూడా విద్యా అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆడపిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు. -
డిజిటల్ చదువులపై పిచ్చి కూతలు
-
భవిష్యత్ తరాలు బాగుండేలా..ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం!
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ తరాలు బాగుండాలనే సదుద్దేశంతో త్వరలో మరిన్ని స్కూల్స్, కాలేజీలు నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ‘ది ఫౌండేషన్’ పేరుతో కొత్తగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థకు 100 మిలియన్ల విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఎలాన్ మస్క్ ప్రాథమిక విద్య నుంచి హైస్కూల్స్ వరకు వినూత్న పద్దతుల్లో విద్యను అందించేలా ప్రణాళికల్ని సిద్ధం చేశారు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ సబ్జెట్లపై దృష్టిసారిస్తున్నట్లు వెల్లడించారు. 50 మంది విద్యార్ధులతో ప్రారంభించి ఎలాన్ మస్క్ ట్యాక్స్ ఫైలింగ్ ఆధారంగా బ్లూమ్బెర్గ్ నివేదికను విడుదల చేసింది. అస్టిన్, టెక్సాస్లలో నిర్మించనున్న పాఠశాలలను దాదాపు 50 మంది విద్యార్థులతో ప్రారంభించాలని యోచనలో ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక పేర్కొంది. ఒక వేళ విద్యార్ధులకు ప్రత్యేకంగా ట్యూషన్లు పెట్టాలనుకుంటే అందుకు వారికి అయ్యే ఖర్చును స్వయంగా భరించనున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు కోసం ది ఫౌండేషన్ ద్వారా స్కూల్స్, కాలేజీల్లో చదివే విద్యార్ధులకు అత్యున్నత స్థాయిలో విద్యను అందించి.. యూనివర్సిటీ స్థాయిలో తీర్చిదిద్దేలా దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మస్క్ ట్యాక్స్ ఫైలింగ్లో తెలిపారు. ఇక తాను ఏర్పాటు చేయనున్న స్కూల్స్, కాలేజీలకు గుర్తింపు కోసం అమెరికా ప్రభుత్వ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన సదరన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ స్కూల్స్ కమీషన్ (Sacscoc) తో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడా? ఎలాన్ మస్క్ విజినరీ ఆంత్రప్రెన్యూర్. స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓగా ఉన్న ఆయన 2014లో ఆస్ట్రా నోవా స్కూల్ పేరుతో తన సంస్థల్లో పనిచేసే పిల్లలకు విద్యను అందిస్తున్నారు. సంప్రదాయ పద్దతులకు స్వస్తి చెప్పి యూనిక్గా చదువు చెప్పిస్తున్నారు. ఈ తరుణంలో మస్క్ గత కొంతకాలంగా విద్యా వ్యవస్థపై అసంతృప్తని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్ధుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయంటూ ఎక్స్.కామ్లో వరుస ట్వీట్లు చేశారు. తాజాగా, ఆయనే మరిన్ని స్కూల్స్,కాలేజీలు నిర్మించేందుకు నడుం బిగించారు. సింథసిస్ స్కూల్ సైతం ఎలాన్ మస్క్, జోష్ డాన్లు కలిసి ఆరేళ్ల క్రితం సింథసిస్ స్కూల్ను స్థాపించారు. ప్రస్తుతమున్న స్కూళ్లన్నింటి కంటే విభిన్నంగా కరిక్యులమ్, యాక్టివిటీస్ సింథసిస్లో ఉంటాయి. ఈ స్కూల్లో క్లాస్ రూమ్ బోధన కంటే ప్రాక్టికల్స్, ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.కొత్త ఆవిష్కరణల దిశగా ప్రయోగాలు, వ్యూహాత్మక ఆలోచన విధానం, క్రియేటివ్ యాక్టివిటీస్ను విద్యార్థులకు నేర్పిస్తారు. గతంలో స్పేస్ఎక్స్ కంపెనీలో పనిచేసే సిబ్బంది కుటుంబాలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏ మారుమూల విద్యార్థి అయిన తమ టాలెంట్తో ఇందులో సీటు సాధించే అవకాశాన్ని కల్పించారు. మూడేళ్ల క్రితం ఈ స్కూల్లో వరంగల్కు చెందిన అనిక్పాల్ సీటు సంపాదించాడు. -
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ కాంతులు
-
ప్రవేశాలు పెరిగాయ్
విద్యా రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతతో సాకారమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత సర్కారు హయాంతో పోలిస్తే అన్ని తరగతుల్లోనూ స్థూల నమోదు నిష్పత్తి పెరిగినట్లు ఇటీవల విడుదలైన ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. రాష్ట్రాల వారీగా స్థూల నమోదు నిష్పత్తి వివరాలను రూపొందించింది. 2018–19తో పోలిస్తే 2021–22లో ఉన్నత విద్యలో బాలురు, బాలికల నమోదు నిష్పత్తి భారీగా పది శాతం మేర పెరగడం గమనార్హం. ఇందుకు ప్రధాన కారణం విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేనని స్పష్టం అవుతోంది. విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహిస్తూ అమ్మ ఒడితోపాటు జగనన్న గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక లాంటి పథకాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా బోధనను ప్రభుత్వం అందుబాటులోకి తేవటమేనని స్పష్టమవుతోంది. మన బడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించగా ఇంగ్లిష్ మీడియం చదువులను సైతం అందుబాటులోకి తెచ్చింది. 2018–19లో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 46.9 శాతం ఉండగా 2021–22లో 56.7కి పెరిగింది. బాలుర స్థూల నమోదు నిష్పత్తి 45.4 నుంచి 55.2కు పెరగగా బాలికల స్థూల నమోదు నిష్పత్తి 48.5 నుంచి 58.3కి పెరిగింది. -
ఇలాంటి వ్యాపారమా అన్నారు? ఇప్పుడూ అదే..!
ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ కొన్ని విషయాల్లో బిడియం, సిగ్గుతో వెనకబడే ఉన్నారు స్త్రీలు. ముఖ్యంగా పీరియడ్స్, లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయం. ఎవరిదైనా బ్రా, పెట్టీకోట్లు కొద్దిగా బయటకు కనిపిస్తుంటే... చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఇలా మాట్లాడ్డానికి ఇబ్బంది పడే అంశాన్నే కెరీర్గా ఎంచుకుంది రిచాకర్. అమ్మాయిల నుంచి మహిళలు ధరించే ‘బ్రా’ల బ్రాండ్ను ఎంతో ధైర్యంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎటువంటి బిడియం లేకుండా తీసుకొచ్చిన ఈ బ్రాండ్ నేడు కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోంది. జంషెడ్పూర్లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది రిచాకర్. తండ్రి టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి విభిన్నంగా ఆలోచించే మనస్తత్వం రిచాది. డిగ్రీ అయ్యాక ఐటీ కంపెనీలో కొన్నేళ్లపాటు ఉద్యోగం చేసింది. శాప్ రిటైల్ కన్సల్టింగ్, స్పెన్సర్స్లో ఉద్యోగం చేశాక... సొంతంగా వ్యాపారం చేయాలన్న కోరికతో నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసింది. ఒకపక్క ఉద్యోగానుభవం, మరోపక్క మేనేజ్మెంట్ స్టడీస్ ద్వారా నేర్చుకున్న జ్ఞానంతో సొంతంగా వ్యాపారం పెట్టడానికి పూనుకుంది. ఇందుకోసం మహిళల లోదుస్తుల వ్యాపారం ఎంచుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ‘‘సమాజంలో లోదుస్తుల గురించి మాట్లాడాలంటే భయడతారు. ఈ వ్యాపారం అవసరమా? వద్దు’’ అని నిరుత్సాహపరిచారు. తల్లిదండ్రులు అలా చెప్పినప్పటికీ రిచా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన వ్యాపారం ప్రారంభ పనుల్లో మునిగిపోయింది. రేడియంట్ మి మహిళలు ధరించే బ్రాలను సొంతంగా డిజైన్ చేసి, తయారు చేసి, విక్రయించడంపై దృష్టిపెట్టింది. కొన్నిరోజులకి తన పనిమీద నమ్మకం ఏర్పడడంతో 2011లో ‘జివామే’ పేరుతో బ్రా బ్రాండ్ను ఏర్పాటు చేసింది. జివామే అంటే హిబ్రూలో ‘రేడియంట్ మి’ అని అర్థం. కాలేజీ అమ్మాయిల నుంచి పిల్ల తల్లుల వరకు అందరూ సౌకర్యంగా ధరించే బ్రాలను విక్రయించడం మొదలు పెట్టింది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో ఐదువేల డిజైన్లు, యాభై బ్రాండ్లు వంద రకాల సైజుల్లో లోదుస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా అందిస్తోంది జివామే. డైరెక్టర్గా... కోట్ల టర్నోవర్తో దూసుకుపోతోన్న సమయంలో కొన్ని కారణాలతో 2017 సీఈవో పదవి నుంచి తప్పుకుని, డైరెక్టర్గా కొనసాగుతోంది రిచా కర్. ప్రస్తుతం రిచా నెట్ వర్త్ దాదాపు 750 కోట్లు ఉండొచ్చని అంచనా. మంచి లాభాల్లో దూసుకుపోతోన్న జివామే బ్రాండ్ను 2020 లో రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. తన కలను నిజం చేసుకున్న 43 ఏళ్ల రిచా కర్ ప్రస్తుతం తన భర్త కేదార్ గవాన్తో కలిసి అమెరికాలో నివాసముంటోంది. ‘‘ ఒక స్త్రీ మనసును మరో స్త్రీ మాత్రమే అర్థం చేసుకుంటుంది. అందుకే మూసపద్ధతులను దాటుకుని మహిళలు సౌకర్యంగా ధరించే లో దుస్తుల బ్రాండ్ను తీసుకొచ్చాను. జివామేను మార్కెట్లోకి తేవడానికి, దానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకు రావడానికి చాలా సవాళ్లను, ఒత్తిళ్లనూ ఎదుర్కోవలసి వచ్చింది. వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోబట్టే ఇవాళ ఈ స్థాయికి రాగలిగాను. ఇంట్లో... సమాజంలో మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. అయినా మన మీద మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడు అమ్మాయిలు దేనిలో తక్కువ కాదు. మనసులో ఏదైనా నిర్ణయించుకుంటే అది కచ్చితంగా సాధించ గలుగుతారు’’ అని చెబుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది రిచాకర్. కోట్ల టర్నోవర్తో.. లోదుస్తులు ధరించిన మహిళలు సౌకర్యంగా... కాన్ఫిడెంట్గా ఉండడమే లక్ష్యంగా లోదుస్తులను అందుబాటులో ఉంచుతుండడంతో జివామే బ్రాండ్ మార్కెట్లోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడిదార్లను ఆకర్షించింది. దీంతో 2012లో మూడు మిలియన్ల డాలర్లు, మరుసటి ఏడాది ఇది రెట్టింపు అయ్యింది. 2015 నాటికి నలభై మిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. దీంతో కంపెనీ ఆరువందల కోట్లపైకి ఎగబాగి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. (చదవండి: చీకటిమయంగా ఉన్న కూతురి జీవితాన్ని 'ప్రేరణ ' ఇచ్చే శక్తిగా మార్చిన ఓ తల్లి కథ!) -
పీపుల్స్ సీఎం..అధికారాన్ని బాధ్యతగా స్వీకరించిన జగన్
-
విదేశీ విద్యను ఇక్కడే కల్పించేలా...
భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల (ఎఫ్హెచ్ఇఐ) క్యాంపస్ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఈ క్రమబద్ధీకరణ ఉదారంగానూ, సమర్థంగానూ ఉందని చెప్పాలి. ఇది నూతన విద్యా విధానపు సిఫార్సులను అనుసరిస్తోంది. అయితే, ఇది ఇప్పటికే ఉన్న దేశంలోని విద్యా వ్యవస్థలను సవాలు చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక అవకాశంతోపాటు ఆందోళన కరమైన విషయం కూడా! ఇంకా, విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన భారతీయ క్యాంపస్లోని విద్యాపరమైన నాణ్యతను తమ దేశంలోని ప్రధాన క్యాంపస్తో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చాలా గొప్ప ఆలోచనే అయినప్పటికీ, క్రమబద్ధీకరణ యంత్రాంగం దీన్ని ఎలా అనువర్తించగలుగుతుంది? యూజీసీ క్రమబద్ధీకరణ విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు పాలన పరంగా ప్రత్యేక అధికారాలకు అనుమతిస్తోంది. అన్ని విభాగాలలో యూజీ/ పీజీ/ డాక్టోరల్/ పోస్ట్డాక్టోరల్ అధ్యయనాలు, డిగ్రీల ప్రదానం, డిప్లొమాలు, సర్టిఫికేట్లను ఇచ్చే వీలు కల్పిస్తోంది. ఈ విదేశీ విద్యా సంస్థలు మొత్తం సబ్జెక్ట్వారీగా, ప్రపంచ ర్యాంకింగ్స్లో 500 లోపు ఉంటే అది నిజంగా గొప్ప అడుగే. కాకపోతే, ప్రపంచంలో కనీసం 20 ప్రముఖ ర్యాంకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వివిధ కారణాల వల్ల ఈ ర్యాంకింగ్ సంస్థల చర్యలలో పాల్గొనడం లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ర్యాంకింగ్లను ఎలా ప్రామాణీ కరిస్తారనేది ప్రశ్న. కాకపోతే భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థల మధ్య సహకారం కోసం 2022లో జరిగిన విద్యా సంబంధ సహకార నియంత్రణ నేపథ్యంలో చూస్తే, ఉమ్మడి డిగ్రీ, ద్వంద్వ డిగ్రీ కార్య క్రమాలకు ఉత్తేజకరమైన కాలం ముందుందని చెప్పొచ్చు. దేశంలో అడుగుపెట్టే విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ఈ క్రమ బద్ధీకరణ ద్వారా, భారతీయ ఉన్నత విద్యా సంస్థలు లేదా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్లోకి ప్రవేశించవచ్చు. జాయింట్ వెంచర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పక్షాలు తమ వనరులతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి అంగీక రించే వ్యాపార పరమైన ఏర్పాటు అని మనం అర్థం చేసుకున్నప్పటికీ – విదేశీ ఉన్నత విద్యా సంస్థ భౌతిక, విద్యా, పరిశోధనా మౌలిక సదుపాయాలతో కూడిన స్వతంత్ర క్యాంపస్ను కలిగి ఉండాలని ఈ నిబంధన ఎందుకు నొక్కి చెబుతోంది? దాని విద్యాపరమైన, పరిశోధనా కార్యక్రమాలను సీరి యస్గా నిర్వహించడానికి ఏ విదేశీ ఉన్నత విద్యా సంస్థ అయినా భారతదేశంలో ఉండటం కోసం భూమిపై, వనరులపై పెట్టుబడి పెడుతుందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న భారతీయ క్యాంపస్ లతో వనరులను పంచుకునే సహకార క్యాంపస్ నమూనా మరింత ఆచరణీయంగా ఉంటుంది. ఇప్పుడు ‘కంపెనీ’ పాత్రను చూద్దాం. నిర్దేశిత లక్ష్యాల కోసం, సెక్షన్ 8 కింద నమోదు అయిన కంపెనీ, లాభాలు ఏవైనా ఉంటే, వాటిని ఆ నిర్దేశిత లక్ష్యాల కోసమే ఉపయోగించాలి. లాభాలను దాని సభ్యులకు చెల్లించకూడదు. ఇంకా, ఇండియన్ ట్రస్ట్ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, ఒక విదేశీయుడు లేదా ఎన్నారై, భారతీయ ట్రస్ట్కు ట్రస్టీగా ఉండకూడదు. అయితే ఫెమా చట్టం, 1999 నిబంధనలకు అనుగుణంగా ఉండే పక్షంలో నిధులను సరిహద్దులు దాటించడానికీ, విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణకూ, చెల్లింపులకూ, అమ్మకాలకూ అను మతిస్తోందని తెలుస్తున్నప్పుడు ఇక్కడ ఏదో లోపం ఉందని గమనించాలి. నిధులను స్వదేశానికి పంపగలిగే వీలు ఉన్నట్లయితే, సంబంధిత విదేశీ ఉన్నత విద్యా సంస్థ లాభాలను పొందగలదని దీని అర్థమా? అంటే ఇప్పుడు విద్య ‘లాభార్జన’ కోసమా? భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా మారుతుందని ఈ క్రమబద్ధీకరణ ఆశిస్తోంది. ఏ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ఏయే కార్యక్రమాలతో తమ క్యాంపస్లను మన దేశంలో ఏర్పరుస్తాయి; వారు స్థానిక అధ్యాపకులను తీసుకుంటారా, అంతర్జాతీయంగానా; విద్యార్థుల ప్రవేశం కోసం వారు ఉప యోగించే కొలమానాలు ఏవి అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయకంగా, అక్రిడిటేషన్ అనేది భారతదేశంతో పాటు చాలా దేశాలలో నాణ్యతా తనిఖీ విధానం. విదేశీ ఉన్నత విద్యా సంస్థ నాణ్యతాపరమైన హామీ, ఆడిట్కు లోనవుతుందనీ, యూజీసీకి తన నివేదికను సమర్పించాలనీ ఈ క్రమబద్ధీకరణ నిర్దేశిస్తోంది. ఏదైనా నెరవేరదగిన హామీ నెరవేర్చని పక్షంలో వినియోగదారు న్యాయస్థానంలో పరిష్కారాన్ని కోరవచ్చు. ఒక విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన రుసుముల చట్రాన్ని నిర్ణ యించుకోవడానికి ఈ క్రమబద్ధీకరణ అనుమతించడం నిజానికి ప్రగతి శీలమైనది. భారతదేశంలోని విద్యాసంస్థలు మాత్రం ఫీజు నిర్ణా యక కమిటీల ఇష్టాలకు లోబడుతున్నప్పుడు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు? ఫెమా నిబంధనలు ఉన్నప్ప టికీ, పరిమాణాత్మకం కాని మొత్తాలను ఎల్లప్పుడూ సర్దుబాటు చేయ వచ్చు. అలాంటప్పుడు, అకడమిక్ పరపతి ఆధారితమైన రుసుము చట్రాన్ని తప్పనిసరి చేయడం మరింత విశ్వసనీయమైన ఎంపిక. విదేశీ ఉన్నత విద్యా సంస్థ అందించే కార్యక్రమాలు ఆన్లైన్ , బహిరంగ మరియు దూరవిద్యా (ఓడీఎల్) విధానంలో అనుమతించ బడవు అనే షరతు నిర్బంధపూరితంగా ఉంది. ఎమ్ఐటి, స్టాన్ ఫోర్డ్, హార్వర్డ్ వంటి అ్రగ్రశ్రేణి విద్యాసంస్థలు అద్భుతమైన ఆన్లైన్ ప్రోగ్రామ్లను కలిగి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యూజీసీ అనేక ఓపెన్, దూరవిద్యా నిబంధనలను సడలించినప్పుడు, వాటిని మన విద్యార్థులకు ఎందుకు దూరంచేయాలి? విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్లను గుర్తించడానికి రెండు ముఖ్యమైన కొలమానాలు ఏవంటే... అంతర్జాతీయీకరణ, పరిశో ధన. భారతీయ క్యాంపస్లలో విదేశీ విద్యార్థులు, అధ్యాపకులు వర్ధిల్ల డాన్ని అంతర్జాతీయీకరణ అంటారు. ఒక ప్రముఖ ఫ్యాకల్టీ ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా మెరుగైన పరిశోధనా సౌకర్యాల కోసం, లేదా తన పరిధిలోని అత్యుత్తమ వ్యక్తులతో పరస్పర సంభాషణ కోసం; అవకాశాలను అన్వేషించడం లేదా కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలకు దారితీసే పేటెంట్లను, ఐపీఆర్లను తమ హోదాకు జతచేసు కోవడం కోసం పనిచేస్తారు. అవి సాధ్యం కాదని తెలిసినప్పుడు, మహా అయితే ఏదో ఒక వారం సందర్శన కోసం తప్ప, ఎవరూ బయ టకు రారు. అప్పుడు విదేశీ ఉన్నత విద్యా సంస్థ ఎలా పని చేస్తుంది? అధ్యాపకులు, సిబ్బంది నియామకంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఈ క్రమబద్ధీకరణలో అత్యంత ముఖ్యమైన భాగం. మన సంస్థలలోని అత్యుత్తమ అధ్యాపకులు విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు వలసవెళ్లే అవకాశం ఉండటం ఈ నిబంధనకు రెండో కోణం. బహుశా, చివరికి ఒక కొత్త సాధారణ స్థితి ఏర్పడవచ్చు. ఆ స్థితి మన విద్యా సంస్థలలో నాణ్యతను పెంచినట్లయితే, దానిని స్వాగతించాలి. మన విద్యా సంస్థల ఫీజు కమిటీ సిఫార్సులు, అడ్మిషన్ల కోసం రాష్ట్ర లేదా కేంద్ర నిబంధనలు మొదలైన వాటికి కట్టుబడి ఉండాలి. అధ్యాపకు లను ఎన్నుకోవడంలో, ఫీజులను నిర్ణయించడంలో ప్రవేశ నిబంధనలను ఏర్పర్చడంలో మన సంస్థలకు స్వయంప్రతిపత్తిని ఎందుకు పొడిగించకూడదు? అవన్నీ అంతర్జాతీయ ర్యాంకింగ్ సంస్థలకు చెందిన అవే కొలమానాలపై పోటీ పడాలని భావిస్తున్నాం కదా! ఏదైనా ప్రయోగం విషయంలో దాని విమర్శకులు దానికి ఉంటారు. విదేశాల్లోని మాతృసంస్థల్లో అయ్యేదానితో పోల్చినప్పుడు తక్కువ ఖర్చుతో, విదేశీ విద్యార్హతలతో భారతీయ విద్యార్థులు నాణ్యమైన విద్యను ఇక్కడే పొందేందుకు ఈ క్రమబద్ధీకరణ వీలు కల్పిస్తే, ఇది స్వాగతించాల్సిన విషయమే. అయితే ఐఐటీల వంటి మన ప్రథమశ్రేణి విద్యాసంస్థలను సాధారణంగా ఎంపిక చేసుకునే విద్యార్థులు కూడా ఈ కొత్త క్యాంపస్లలో చేరేలా ప్రభావితం అయితే, అది ఆందోళన కలిగించే అంశం అవుతుంది. అందుకే, నాణ్యతా ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగినందున విద్యారంగానికి భారీ పెట్టుబడులు అవసరం. పరిశోధనా సౌకర్యాల్లో భారీ స్థాయి వృద్ధి అవసరం. ప్రభుత్వ నిధులను అలా ఉంచుతూనే, విదేశీ నిధులను అనుమతించడం, విజయవంతమైన వ్యవస్థలను అనుసరించడం మేలు. ఎస్ఎస్ మంథా, ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) మాజీ ఛైర్మన్; అశోక్ ఠాకూర్, కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పిల్లల చదువు కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది!
నేను సావరీన్ గోల్డ్ బాండ్లలో (ఎస్జీబీలు) ఇన్వెస్ట్ చేశాను. కాల వ్యవధి ముగిసిన తర్వాత వీటిని విక్రయించాలా..? లేక ఆ మొత్తం నా ఖాతాలో జమ అవుతుందా? – వేదవ్యాస్ విశ్వరూప్ ఎస్జీబీల కాల వ్యవధి ఎనిమిదేళ్లు. గడువు ముగియడానికి నెలరోజుల ముందు బాండ్ల మెచ్యూరిటీ తేదీ గురించి ఇన్వెస్టర్లకు సమాచారం వస్తుంది. గడువు ముగిసిన తర్వాత ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టే రోజున ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. గడువు ముగిసిన రోజు నాటి ముందు మూడు రోజుల బంగారం సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఇండియా బులియన్ అండ్ జ్యుయెలర్స్ అసోసియేషన్ ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ధరలను ఇందుకు ప్రామాణికంగా పరిగణిస్తారు. ఆ ప్రకారం ఇన్వెస్టర్కు చెల్లింపులు చేస్తారు. ఎస్జీబీ సర్టిఫికెట్లోనూ బ్యాంక్ ఖాతా వివరాలు నమోదై ఉంటాయి. ఒకవేళ సార్వభౌమ బంగారం బాండ్లను ట్రేడింగ్ ఖాతా ద్వారా సెకండరీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తే అవి డీమ్యాట్ ఖాతాలో ఉంటాయి. కనుక మెచ్యూరిటీ ముగిసిన అనంతరం డీమ్యాట్ ఖాతాకు అనుసంధానమైన ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాకు ఆ మొత్తం జమ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఎస్జీబీల ట్రేడింగ్ ధర హెచ్చు, తగ్గులుగా ఉండొచ్చు. అయినప్పటికీ గడువు తీరే నాటి ముందు మూడు పనిదినాల సగటు ధర ప్రకారమే చెల్లింపులు చేస్తారు. బంగారంలో పెట్టుబడులకు ఎంతో సౌకర్యవంతమైన మార్గం ఎస్జీబీలు అని తప్పక చెప్పాలి. పెట్టుబడిపై ఏటా 2.5 శాతం వడ్డీ ఇందులో లభిస్తుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే వచ్చే లాభంపై ఎలాంటి పన్ను లేదు. పిల్లల ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – శరవణన్ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్లకు పైగా కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరలతో ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరిష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్క్ను తగ్గిస్తుంది. కనుక మీరు పెట్టుబడి మొత్తాన్ని ఒకే సారి కాకుండా.. డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి.. అక్కడి నుంచి ప్రతి నెలా సిప్ రూపంలో మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. -
బడుల పైనా ‘బండ’ రాతలే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేద పిల్లలు కూడా ఉన్నత స్థితిలోకి రావాలని, చదువుల కోసం ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ విద్యా రంగంలో అనేక సంస్కరణలు తెచ్చారు. ‘మన బడి నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను నూతన భవనాలు, అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తీర్చి దిద్దుతున్నారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందిస్తున్నారు. పేద విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిని అందుకొనేలా ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన అందిస్తున్నారు. చంద్రబాబు జమానాలో పాఠశాలల పైకప్పులు కూలిపోయినా, బెంచీలు, నీరు లేకపోయినా, టెక్ట్స్బుక్స్ ఇవ్వకపోయినా కదలని ‘ఈనాడు’ కలం.. అవే పాఠశాలల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం కక్కుతోంది. రెండో దశలో నిర్మాణంలో ఉన్న నాలుగు బడుల ఫొటోలు తీసి ఏమీ జరగడంలేదంటూ కుటిల కథనం ప్రచురించింది. అసలు వాస్తవాలివీ.. ♦ మనబడి నాడు నేడు రెండో దశలో ప్రభుత్వం రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టింది. 8,529 పాఠశాలల్లో 25,154 అదనపు తరగతి గదులు కూడా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకు పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు. ♦ ఏలూరు ఆరో డివిజన్లోని నగరపాలకోన్నత పాఠశాలలో రెండో దశలో రూ.1.08 కోట్లతో 9 అదనపు తరగతి గదుల నిర్మాణం జరుగుతోంది. ఇప్పటివరకు రూ.62 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ♦ కర్నూలు జిల్లా కోసిగి జేబీఎం ప్రాథమిక పాఠశాలలో రూ.21.10 లక్షలతో పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.14.98 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ♦ విజయవాడ కృష్ణలంక బాలికల పాఠశాలలో రూ.62.87 లక్షలతో పనులు చేపట్టారు. ఇందులో రూ.19.06 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ఇదే పాఠశాలలో రూ.58.90 లక్షలతో ఐదు అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా చేపట్టి, రూ.29.73 లక్షల విలువైన పనులు చేశారు. కృష్ణలంకలోనే ఉన్న ఎస్వీఆర్ ఎంసీహెచ్లో రూ.62.94 లక్షలతో పనులు చేపట్టి, రూ.27.55 లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. ఏపీఎస్సార్ మున్సిపల్ హైస్కూల్లో రూ.81.18 లక్షలతో పనులు చేపట్టి రూ.33.13 లక్షల విలువైన పనులు చేశారు. రూ.47.79 లక్షలతో 4 అదనపు తరగతి గదులను కూడా నిర్మిస్తున్నారు. ♦తిరుపతి జిల్లాలోని ఎంజీఎం మున్సిపల్ హైస్కూల్లో రూ.84 లక్షలతో ఏడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. రూ.19.63 లక్షల పనులు పూర్తి చేశారు. ♦ విశాఖ జిల్లా గంభీరం ఎంపీపీ పాఠశాలలో రూ.17.82 లక్షలతో చేపట్టిన పనుల్లో రూ.10.81లక్షల విలువైన పనులు పూర్తి చేశారు. -
చదువు ఎలా మొదలయ్యింది? ఎందుకు అవసరమయ్యింది?
నేటి యుగంలో ప్రతి ఒక్కరికీ విద్య అనేది చాలా ముఖ్యం. మనిషి ఆకలితో ఉండగలడు కానీ చదువు లేకుండా ఉండలేడని కొందరు అంటారు. నేటి రోజ్లులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది విద్యే అవుతుంది. ఇప్పుడు మనం అసలు ప్రశ్నలోకి వస్తే ఈ పఠన కళ మనుషులలో ఎలా అభివృద్ధి చెందింది? మనిషిని విద్యలో ముందుకు నడిపించిన విషయం ఏమిటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చదువుకు సంబంధించిన చరిత్ర శతాబ్దాల క్రితం నాటిది. అయితే విద్య విషయంలో సైన్స్ భిన్నమైన వాదనలను వినిపిస్తుంది. బీబీసీ నివేదిక ప్రకారం రీసెర్చ్ స్కాలర్ మరియాన్ వోల్ఫ్ మాట్లాడుతూ, అధ్యయనం అనేది ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన కళ. ఎన్ని మద్యం పాత్రలు లేదా గొర్రెలు ఉన్నాయో లెక్కించడం కోసం ఇది మొదలయ్యిందని ఆమె తెలిపారు. వర్ణమాల ఏర్పరిచిన తరువాత దాని సాయంతో మనుషులు ఏదైనా చదవడం ద్వారా సమాచారాన్ని గుర్తుంచుకోవడం, అవగాహన కల్పించుకోవడం మొదలైనవి చేసేవారు. చదువులో ఎవరైనా రాణించినప్పుడు వారిని చురుకైనవారని అంటారు. చదువులో వెనుకబడినవారిని మందబుద్ధి గలవారని అభివర్ణిస్తారు. నిజానికి విద్యకు, మనసుకు చాలా దగ్గరి సంబంధం ఉంది. చదవడం లేదా నేర్చుకోవడం అనేది మనసు ద్వారానే జరుగుతుంది. మెదడులో పది బిలియన్లకు మించిన న్యూరాన్లు ఉన్నాయి. వాటి ద్వారా మెదడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంది. విషయాలను అధ్యయనం చేయడంలో, గుర్తుంచుకోవడంలో ఈ న్యూరాన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇది కూడా చదవండి: ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ ఎలా జరుగుతుంది? -
జగనన్నే మళ్లీ సీఎం కావాలి
పట్నంబజారు (గుంటూరుఈస్ట్): విద్యా సాధికారత జగనన్నతోనే సాధ్యమని గుంటూరు వేదికగా విద్యార్థి లోకం గొంతెత్తి నినదించింది. పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘‘వై ఏపీ నీడ్స్ వైఎస్ జగన్’’ కార్యక్రమంలో భాగంగా గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం, శంకర్విలాస్, ఓవర్బ్రిడ్జి, ఏసీ కళాశాల మీదుగా హిందూ కాలేజ్ సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘‘మా బతుకులు మారాలంటే.. మా తలరాతలు మేమే రాసుకోవాలంటే.. ఉన్నత విద్య, అత్యున్నత ఉద్యోగ అవకాశాలతో మా జీవన స్థితిగతులలో సమూలమైన మార్పు రావాలంటే.. మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి’’ అంటూ విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. విద్యారంగం అభివృద్ధికి జగనన్న ఏమేం చేశారో చెప్పడానికే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అనేక పథకాలతో రాష్ట్రంలో అక్షరకాంతులు పూయిస్తున్నారన్నారు. రాష్ట్రానికి మళ్లీ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర అవతరణ దినోత్సవాన గుంటూరు వేదికగా విద్యార్థి లోకం గర్వంగా గొంతెత్తి చాటిచెప్పడం శుభపరిణామమని అన్నారు. ర్యాలీలో విద్యార్థి విభాగం రీజనల్ కోఆర్డినేటర్లు విఠల్, మనోహర్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిరాజ్, నాయకులు గంటి, రవి, బాజీ, జగదీష్, వలి, బంటి, మహేష్, అజయ్, కరీమ్, కిరణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో అత్యల్ప అక్షరాశ్యత గల జిల్లా ఏది?
దేశంలో అత్యధిక విద్యావంతులు కలిగిన రాష్ట్రం గురించి ప్రస్తావించినప్పుడు కేరళ పేరు గుర్తుకు వస్తుంది. అయితే భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు కలిగిన జిల్లా ఏదో తెలుసా? భారతదేశంలో జనాభా గణన 2011లో నిర్వహించారు. ఇది దేశ జనాభాతో పాటు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల స్థితిగతులు సమాచారాన్ని అందించింది. ఇలా సేకరించిన డేటాలో ముఖ్యమైన అంశం వివిధ ప్రాంతాలలోని జనాభా, అక్కడి అక్షరాస్యత రేటు. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు గల జిల్లాలను గుర్తించడానికి ఈ డేటా ఉపకరిస్తుంది. భారతదేశంలో అత్యల్ప అక్షరాస్యత శాతం కలిగిన జిల్లా అలీరాజ్పూర్. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ సగటు అక్షరాస్యత రేటు 36.10 శాతం మాత్రమే. ఈ జిల్లాలలో మగవారిలో అక్షరాస్యత రేటు 42.02 శాతం, స్త్రీలలో 30.29 శాతంగా ఉంది. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు ఉన్న రెండవ జిల్లా విషయానికొస్తే.. అది ఛత్తీస్గఢ్లోని బీజాపూర్. ఈ జిల్లాలో సగటు అక్షరాస్యత రేటు 40.86 శాతం. ఇందులో పురుషుల అక్షరాస్యత 50.46 శాతం. స్త్రీల అక్షరాశ్యత 31.11 శాతంగా ఉంది. అత్యల్ప విద్యావంతులు కలిగిన మూడవ జిల్లా దంతేవాడ. ఇది చత్తీస్గఢ్లో ఉంది. ఇక్కడ సగటు అక్షరాస్యత రేటు 42.12 శాతం. పురుషుల అక్షరాశ్యత శాతం 51.92 శాతం. స్త్రీలలో 35.54 శాతం అక్షరాశ్యత ఉంది. మధ్యప్రదేశ్లోని ఝబువా సగటు అక్షరాస్యత రేటు 43.30 శాతం. ఇది దేశంలో నాల్గవ అత్యల్ప అక్షరాస్యత కలిగిన జిల్లా. ఇక్కడ పురుషులలో 52.85 శాతం, మహిళలలో 33.77 శాతం అక్షరాశ్యత కలిగినవారున్నారు. భారతదేశంలో అతి తక్కువ విద్యావంతులు ఉన్న ఐదవ జిల్లా ఒడిశాలోని నబరంగ్పూర్. ఇక్కడ నమోదైన సగటు అక్షరాస్యత రేటు 46.43 శాతం. ఇది కూడా చదవండి: రాజస్తాన్లో కొత్త పరిణామం.. బీజేపీ, కాంగ్రెస్లకు గుబులు -
అసత్య ప్రచారంపై ఏపీ మంత్రి బొత్స ఫైర్
సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా వ్యవస్థలో మార్పులపై అసత్య ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు . విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండాలనేది ప్రతిపక్షాల భావన. ఏపీ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనేదే మా లక్ష్యం. విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తున్నాం. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు ఓపెన్ టెండర్ ద్వారానే తీసుకున్నాం. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘బాబు బాధలో ఉంటే బాలకృష్ణ మూవీ రిలీజ్ చేస్తారా’ -
మరిన్ని స్కూళ్లు ‘డిజిటల్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ అత్యున్నత స్థాయి విద్య అందించాలని, వారు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో విద్యా రంగంలో పలు సంస్కరణలు తెచ్చారు. పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్కూళ్లలో మాదిరిగా అత్యాధునిక పద్ధతుల్లో బోధన, వసతులు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెస్తున్నారు. ఇందుకోసం గత నాలుగున్నరేళ్లలో రూ. 66 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. ‘నాడు – నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణంతోపాటు అత్యాధునిక బోధన పద్ధతులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పాఠశాల విద్యను పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీలు) ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ నాటికి అన్ని ఉన్నత పాఠశాలల్లో మరో 32 వేల ఐఎఫ్పీ స్క్రీన్లు, ప్రాథమిక పాఠశాలల్లో 23 వేల స్మార్ట్ టీవీలు అందించనున్నారు. సామాన్యుల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన బోధనను ఈ (2023–24) విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో పాఠశాల విద్యను దేశంలోనే అతి పెద్ద డిజిటల్ ప్లాట్ఫారంగా మారుస్తోంది. తొలివిడత నాడు–నేడులో ఆధునీకరించిన పాఠశాలల్లో నూతన తరగతి గదులు, డబుల్ డెస్క్ బెంచీలు, ద్విభాషా పాఠ్య పుస్తకాలతో పాటు కార్పొరేట్ పిల్లలకు మాత్రమే సాధ్యమైన బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా అందించింది. అనంతరం అమెరికా వంటి అగ్ర దేశాల్లో మాత్రమే విద్యా బోధనకు వినియోగించే అత్యాధునిక టెక్నాలజీ గల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల ను, స్మార్ట్ టీవీలను 11,315 పాఠశాలల్లో ఈ ఏడాది జూన్ నెలలోనే అందుబాటులోకి తెచ్చింది. 4,800 ఉన్నత పాఠశాలల్లో 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను ఏర్పాటు చేయగా, 6,515 ప్రాథమిక పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఈ డిసెంబరు మొదటి వారానికి మరో 32 వేల ఐఎఫ్పీలను హైస్కూళ్లకు అందించనుంది. గతంలో పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పీలనే ఇప్పుడూ తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈమేరకు అధికారులు టెండర్ ప్రక్రియ ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసే 23 వేల స్మార్ట్ టీవీల టెండర్ల జ్యుడిíÙయల్ ప్రివ్యూ పూర్తయింది. ఈ టెండర్లను ఖరారు చేసి వచ్చే నెలలోనే స్మార్ట్ టీవీల పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే దేశంలో పాఠశాల విద్యను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ఈ ఏడాది టోఫెల్ కూడా ప్రవేశపెట్టడం, స్మార్ట్ టీవీలు, ఐఎఫ్పీల ద్వారా బోధన వల్ల కలిగే మంచి ఫలితాలు ఇటీవల ముగిసిన ఫార్మాటివ్ అసెస్మెంట్ 1, 2 పరీక్షల్లో కనపడటంతో అన్ని పాఠశాలల్లో కొత్త ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐఎఫ్పీలతో అత్యాధునిక పద్ధతిలో బోధన ఐఎఫ్పీలు అత్యాధునిక బోధనకు ప్రతీకగా నిలుస్తాయి. 165 సెంటీమీటర్ల వైశాల్యం ఉండే ఈ స్క్రీన్లపై ఓ పక్క వీడియోలో బోధన చేస్తూనే.., మరోపక్క విద్యారి్థకి అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులు బోర్డు మీద రాసి చూపించవచ్చు. అవసరమనుకుంటే అదే అంశాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. మొత్తం పాఠాన్ని లింక్ రూపంలో ఆన్లైన్లో పెట్టొచ్చు. అంటే ఒకే బోర్డుపై అనేక విధాలుగా బోధన (మల్టీ టాస్కింగ్) చేయొచ్చు. ఈ ఐఎఫ్పీ ప్యానెళ్లలో పాఠ్యాంశాలు, బైజూస్ కంటెంట్ను తెలుగు, ఇంగ్లిష్, హిందీతో పాటు మొత్తం ఏడు భాషల్లో అందిస్తారు. గూగుల్ అసిస్టెంట్తో వచ్చే ఈ ఇంటరాక్టివ్ స్మార్ట్ ప్యానెళ్లు 6 నుంచి 10వ తరగతి వరకు సెక్షన్కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. తొలివిడత ఐఎఫ్పీ స్క్రీన్లు ఏర్పాటుచేసిన పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించినట్టు గుర్తించారు. -
ప్రపంచంతో పోటీపడితేనే మన బతుకులు మారుతాయని దానికి చదువు ఒక్కటే మార్గమని సీఎం వైయస్ జగన్ అన్నారు
-
యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి?
‘‘విద్యార్థులు జాతి సంపద. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంపై, ప్రభుత్వాలపై, మన అందరి పైనా ఉంది అని చెప్పే చిత్రమే ‘యూనివర్సిటీ’’ అని ఆర్. నారాయణ మూర్తి అన్నారు. ఆయన లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూ΄÷ందిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అయితే మొత్తం వ్యవస్థే దెబ్బతింటుంది. యూనివర్సిటీల్లో పేపరు లీకేజీలు, గ్రూపు 1, 2 ప్రశ్నా పత్రాల లీకేజీలు... ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమై΄ోవాలి? సంవత్సరానికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీగారు దయచేసి ఇవ్వాలి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసుకుంటూ΄ోతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వంటి విషయాలను మా సినిమాలో ప్రస్తావించాం’’ అన్నారు. -
విద్యారంగంలో దేశంలో ఎవరూ తీసుకురానన్ని సంస్కరణలు సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చారు. -ఎమ్మెల్యే కిలారి
-
అల్ప సంఖ్యాకులకు అగ్రపీఠం
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా మైనార్టీలకు అండగా నిలుస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 50,07,259 మంది మైనార్టీలకు రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో డీబీటీ ద్వారా రూ. 12,366.91 కోట్లు, నాన్డీబీటీ ద్వారా రూ. 10,801.02 కోట్లు అందించింది. స్వతంత్ర భారతదేశంలో మైనార్టీలను ఓటు బ్యాంకు కోసమే వినియోగించుకున్నారు. కానీ మైనార్టీ సంక్షేమం కోసం గతంలో వైఎస్సార్, ఇప్పుడు జగన్ మాత్రమే కృషి చేశారు. మైనార్టీ సంక్షేమమంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరే. సీఎం వైఎస్ జగన్ కూడా మైనార్టీల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో మైనార్టీల కోసం రూ. 2,665 కోట్లు ఖర్చు చేస్తే, జగన్ ప్రభుత్వం 50 నెలల్లో రూ. 23,167.93 కోట్లు ఖర్చు చేసి, గత ప్రభుత్వం కంటే 10 రెట్లు అధికంగా నిధులు వెచ్చించింది. – డిప్యూటీ సీఎం అంజద్ బాషా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయండి ప్రభుత్వం మైనార్టీల కోసం 38 పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో ఇమామ్లు, మౌజమ్లకు, పాస్టర్లకు ఎలాంటి గుర్తింపుగాని, గౌరవ వేతనంగాని ఇవ్వలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ అందరితోపాటు మైనార్టీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేలా చేశారు. పీలేరు చుట్టుపక్కల మైనార్టీ బాలికలు చదువుకునేందుకు దూరంలో ఉన్న కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. దాంతో చాలామంది చదువును మధ్యలోనే మానేస్తున్నారు. పీలేరులో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ప్రారంభిస్తే వారికి మేలు జరుగుతుంది. – చింతల రామచంద్రారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే విద్యా సంస్కరణల్లో మనమే మేటి ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యమంత్రి ప్రాధాన్య అంశాల్లో విద్య మొదటి స్థానంలో ఉంది. విద్యా ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నాం, విద్యార్థులకు టోఫెల్ బోధనకు కూడా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నాం. గతంలో అక్షరాస్యతపై అంటే కేరళ గుర్తుకువచ్చేది. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి సైతం ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణలను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారంటే మనం ఎంత ప్రగతి సాధించామో తెలుస్తుంది. మూడో విడత నాడు–నేడులో రూ. 8 వేల కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ ఇవ్వనున్నాం. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్సీ అమలుతో ఆ బోర్డు మన రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఉన్నత విద్యలో రూ. 15,600 కోట్ల నిధులను విద్యాదీవెన, వసతి దీవెన కింద ఖర్చు చేశాం. ఇంజినీరింగ్ చదువుతున్న 1.69 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నాం. వర్సిటీల్లో 15 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 3,268 పోస్టులను భర్తీ చేసేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు విదేశీ వర్సిటీలతో జాయింట్ సర్టిఫికేషన్ కూడా అందించనున్నాం. దీనివల్ల మన విద్యార్థులకు అంతర్జాతీయంగా అవకాశాలు వేగంగా పొందుతారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యం పరిశీలించేందుకు కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. – మంత్రి బొత్స సత్యనారాయణ ఏజెన్సీ పాఠశాలలకు అధిక నిధులివ్వండి పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారు. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ వంటివి మన విద్యారంగం గతిని మార్చాయి. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్ను బాగుచేస్తున్నారు. ఇందులో గిరిజన నియోజకవర్గాల్లో 1,400 స్కూళ్లు కూడా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 1,000 సింగిల్ టీచర్ పాఠశాలలకు భవనాలు లేవు. నాడు–నేడు కింద భవనాలు నిర్మిస్తే గిరిజన పిల్లలకు మేలు జరుగుతుంది. అదనపు గ్రాంట్ మంజూరు చేసి భవనాలు నిరి్మంచాలి. గతంలో ఆశ్రమ స్కూల్స్లో హెల్త్ వలంటీర్లు ఉండేవారు. రాత్రివేళ ఆయా పిల్లలకు ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు హెల్త్ వలంటీర్లను నియమించాలి. – నాగులపల్లి ధనలక్ష్మి , రంపచోడవరం ఎమ్మెల్యే విద్యలో విప్లవాత్మక మార్పులు విద్యారంగంలో ఇటు తల్లిదండ్రులకు, అటు విద్యార్థులకు మేలు జరిగేలా అనేక పథకాలను సీఎం ప్రవేశపెట్టారు. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు కూడా మంజూరు చేశారు. మా నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ కాలేజీలు వచ్చాయి. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో ఎంపీపీ స్కూల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నిడదవోలు టౌన్లో అంతర్భాగమైన లింగంపల్లి గ్రామం.. టౌన్కు దూరంగా ఉంది. ఇక్కడి స్కూల్ను మెర్జింగ్ చేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూల్ను డీమెర్జింగ్ చేయాలి. – జి.శ్రీనివాసనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే మన విద్యార్థుల అంతర్జాతీయ ఖ్యాతి నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ నిర్ణయాలతో విద్యారంగం మెరుగుపడింది. మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. ఫౌండేషన్ స్కూల్స్ను తీసుకువచ్చాం. అయితే ఉత్తమ ఫలితాలు రావాలంటే వాటిలో బోధకులకు శిక్షణ ఇవ్వాలి. సీఎం లక్ష్యం నెరవేరాలంటే శిక్షణ, బోధనపై పూర్తి అజమాయిషీ అవసరం. దీనికోసం సరైన కార్యాచరణ రూపొందించాలి. – డాక్టర్ ఎం.జగన్మోహన్రావు, నందిగామ ఎమ్మెల్యే పాఠశాలల్లో పిల్లలకు డైనింగ్ ఏర్పాటు చేయండి గత ప్రభుత్వం విద్యను వ్యాపారం చేయడంతో పేద కుటుంబాలు అక్షరానికి దూరమయ్యాయి. ఇప్పుడు సీఎం జగన్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అనేక పథకాల ద్వారా 42 లక్షల మంది పిల్లలను బడిబాట పట్టించారు. నాడు–నేడు కింద 56 వేల స్కూల్స్ను బాగుచేస్తున్నారు. సీబీఎస్సీ సిలబస్, బైలింగువల్ బుక్స్, పౌష్టికాహారం అందిస్తున్నారు. అయితే, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేసేందుకు పిల్లలకు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలి. దీనికి స్కూల్లో ఓ గదిని కేటాయిస్తే మంచిది. విద్యారంగంలో మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. – కిలారి వెంకట రోశయ్య, పొన్నూరు ఎమ్మెల్యే ఏపీలో బెస్ట్ విద్యా వ్యవస్థ ఉంది రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధికి నాడు–నేడు విధానాలు పరిశీలించేందుకు తెలంగాణ అధికారులు ఇక్కడకు వస్తున్నారు. చాలా స్కూల్స్లో ప్లస్ 2 అందుబాటులోకి తెచ్చాం. అయితే, టీచర్లకు సరైన శిక్షణ లేదని తల్లిదండ్రుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. దీనిపై అధికారులు, మంత్రులు దృష్టిపెట్టి, ఇంటర్ బోధించేవారికి శిక్షణ ఇవ్వాలి. నైపుణ్యం ఉన్నవారికే ఆ స్కూల్స్లో బోధనా అవకాశం ఇవ్వాలి. దీంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో విశాలమైన మైదానాలు ఉన్నాయి. స్పోర్ట్స్ను కూడా ప్రోత్సహించాలి. అన్ని స్కూళ్లలోను పీఈటీలను నియమించాలి. – సామినేని ఉదయభాను, జగ్గయ్యపేట ఎమ్మెల్యే విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ పెంచండి స్వతంత్ర భారత చరిత్రలో విద్యలో ఇన్ని సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. అయితే, ఆరు, ఏడు తరగతులకు రీడింగ్ స్కిల్స్ తక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తిచేసేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప నైపుణ్యం పెంపుపై దృష్టి పెట్టలేదు. ఆరు నుంచి 8 తరగతులకు స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ ఇస్తే రెండేళ్లలో అద్భుతంగా రాణిస్తారు. దీంతోపాటు అన్ని స్కూళ్లకు వాచ్మెన్లను నియమించాలి. – కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే -
త్వరలో ఇంటర్ విద్యార్థులకూ గోరుముద్ద
సాక్షి, అమరావతి: ‘జగనన్న గోరుముద్ద’ దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాలు సైతం అనుసరిస్తుండటమే ఇందుకు నిదర్శనమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తోన్న ఈ పథకాన్ని త్వరలో ఇంటర్మీడియట్కు వర్తింప చేయా లని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సోమ వా రం పలువురు సభ్యుల డిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స బదులిచ్చారు. సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టాక విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పు లు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మన విద్యా విధానంలోని మార్పులకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పా రు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. అమ్మఒడి పథకంతో డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. గోరుముద్దతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా బడిబాటపట్టారన్నారు. నాడు– నేడుతో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. డీఎస్సీపై త్వరలో నిర్ణయం.. మధ్యాహ్న భోజన పథకం కింద చంద్రబాబు హయాంలో కేవలం రూ.2,729 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మంత్రి బొత్స గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ నాలుగేళ్లలోనే రూ.6,268 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మరో రూ.1,500 కోట్లకుపైగా ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. మండలానికి కనీసం రెండు ఉన్నత పాఠశాలలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో 1–10 తరగతి వరకు చదివే విద్యార్థులకు అమలు చేస్తున్న గోరుముద్ద పథకాన్ని అదే కాంపౌండ్లో చదివే ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింప చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. త్వరలోనే శుభవార్త వస్తుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1,960 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వాటిలో 505 మంది సమగ్ర శిక్ష ద్వారా పార్ట్టైమ్ విధానంలో పనిచేస్తున్నారని తెలిపారు. మిగిలిన పోస్టులను త్వరలో భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే డీఎస్సీ నిర్వహణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆట స్థలాలు లేని కార్పొరేట్ పాఠశాలలను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తొలుత ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచి్చన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. అదే బాటలో సీఎం జగన్ నడుస్తూ రూ.వేల కోట్లు విద్యకు ఖర్చు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నాడు–నేడు కింద పాఠశాలలన్నీ కొత్తరూపు సంతరించుకుంటున్నాయన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో యోగాను నిర్బంధ సబ్జెక్ట్గా ప్రవేశపెట్టాలని సూచించారు. ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ గతంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కింద ఉడికి ఉడకని అన్నం, నీళ్ల సాంబారు పెట్టేవారని.. దీంతో 10 శాతం కూడా భోజనం చేసేవారు కాదన్నారు. కానీ నేడు 16 రకాల మెనూతో మంచి రుచికరమైన భోజనం పెడుతుండడంతో నూటికి నూరు శాతం పిల్లలు పాఠశాలల్లోనే భోజనం చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో నేడు అక్షరాస్యత పెరుగుతుందంటే దానికి కారణం అమ్మఒడి, నాడు–నేడు, గోరుముద్ద వంటి పథకాలేనన్నారు. -
బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే?
ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్(Byjus) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అండ్ ఇండియా బిజినెస్ హెడ్ 'మృణాల్ మోహిత్' స్టార్టప్కు రాజీనామా చేశారు. ఈ స్థానంలోకి అనుభవజ్ఞుడైన 'అర్జున్ మోహన్' వచ్చాడు. ఇంతకీ మృణాల్ ఎందుకు రాజీనామా చేసాడు? కొత్త సీఈఓ బ్యాగ్రౌండ్ ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మృణాల్ మోహిత్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా అప్పుల భారంతో ముందుకెళుతున్న కంపెనీకి ఈయన అపారమైన సేవ అందించినట్లు కంపెనీ ఫౌండర్ రవీంద్రన్ వెల్లడించారు. కాగా ఇప్పుడు ఇప్పటికే సంస్థతో అనుభందం ఉన్న 'అర్జున్ మోహన్' సీఈఓగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన సారథ్యంలో సంస్థ మళ్ళీ పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నారు. గతంలో అర్జున బైజూస్లో కీలక పాత్ర పోషించాడు. 2020 వరకు కంపెనీ చీప్ బిజినెస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆ తరువాత రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్టెక్ స్టార్టప్ సీఈఓగా వెళ్లే క్రమంలో రాజీనామా చేశారు. కాగా మళ్ళీ ఇప్పుడు సొంత గూటికి చేరుకున్నారు. మృణాల్ రాజీనామా సందర్భంగా బైజూ రవీంద్రన్ మాట్లాడుతూ.. బైజూస్ ఈ రోజు గొప్ప స్థాయికి చేరుకుందంటే అది తప్పకుండా మా వ్యవస్థాపక బృందం అసాధారణ ప్రయత్నాలే అంటూ అతనికి వీడ్కోలు తెలిపాడు. బైజూస్ నుంచి నిష్క్రమించడం గురించి మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. బైజూస్ వ్యవస్థాపక బృందంలో భాగం కావడం ఒక అద్భుతమైన ప్రయాణం, విద్యారంగంలో పరివర్తనకు సహకరించినందుకు నేను కృతజ్ఞుడను. ఈ సంస్థలో పనిచేసినందుకు గరివిస్తున్నాను అన్నాడు. -
రాష్ట్ర విద్యార్థులకు బంగారు భవిత
భీమడోలు/దెందులూరు: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న పథకాల ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని నోబెల్ అవార్డు గ్రహీత (అర్థ శాస్త్రం) ప్రొఫెసర్ మైకేల్ రాబర్ట్ క్రెమెర్ చెప్పారు. విద్యారంగంలో పథకాలు, సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు. వీటి సత్ఫలితాలు భవిష్యత్తులో ప్రతి ఒక్కరం చూస్తామని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెరి్నంగ్ (పాల్) ప్రాజెక్టు అమలు చేస్తున్న ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల, దెందులూరు మండలం కొవ్వలి జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం చికాగోలోని దిల్ యూనివర్సిటీకి చెందిన ఎమిలీ క్యుపిటో బృందంలోని ఐదుగురు సభ్యులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు, టీచర్లకు గణిత విద్యాబోధన, వాటిలోని మెలకువలను నేర్చుకునేందుకు అందజేసిన గణిత ట్యాబ్ల పనితీరును పరిశీలించారు. బైజూస్ ట్యాబ్లను 8వ తరగతి చిన్నారులు అర్థవంతంగా వినియోగించడం చూసి మెచ్చుకున్నారు. 8, 9 తరగతి గదుల్లోని చిన్నారులు గణిత ట్యాబ్ల వినియోగించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గణిత పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఈ ట్యాబ్లు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారా, ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమాధానాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. నోటు పుస్తకాలను పరిశీలించారు. గణితాభ్యసన కార్యక్రమాల అమలు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతుల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉంటున్నారని, ట్యాబ్లలో గణిత బోధనను వినే సమయంలో వినికిడి ఆటంకాలు లేకుండా హెడ్ఫోన్లు ఇవ్వాలని పూళ్ల హైస్కూలు విద్యార్థులు ఆ బృందం సభ్యులను కోరారు. ఈ సందర్భంగా క్రెమెర్ మాట్లాడుతూ తాము అందజేసిన గణిత ట్యాబ్లు సబ్జెక్టుకు సంబంధించిన విద్యాసామర్థ్యాలను పెంపొందించేందుకు దోహద పడుతున్నాయని, బైజూస్ ట్యాబ్లు 8వ తరగతిలోని అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థి దశ నుంచి నేర్చుకోవడం ద్వారా ప్రగతి సాధిస్తారన్నారు. పాల్ ప్రాజెక్టు ద్వారా కోవిడ్ సమయంలో విద్యార్థులకు ట్యాబ్లు అందించామని, విద్యార్థులు వాటిని వినియోగించే విషయంలో ఉపాధ్యాయులు తీసుకున్న శ్రద్ధ బాగుందని చెప్పారు. అనంతరం క్రెమెర్ను పూళ్లలో సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, హెచ్ఎం భువనేశ్వరరావు, ఉపాధ్యాయులు, కొవ్వలిలో హెచ్ఎం, ఉపాధ్యాయులు సత్కరించారు. రాష్ట్ర కో ఆర్డినేటర్ కె.వి.సత్యం తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
-
ఈ ఐదుగురు.. స్కూలు టీచర్లు కాదు.. కానీ ఉత్తమ ఉపాధ్యాయులు!
నిరుపేదలకు ఆర్ధిక సహాయం చేయడం, వారికి ఆహారం ఇవ్వడం లాంటివి చాలామంది చేస్తుంటారు. కానీ వీటన్నింకంటే గొప్ప దానం విద్యాదానం. చదువుకునేందుకు తాపత్రయ పడేవారికే విద్యకున్న నిజమైన ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ జ్ఞానాన్ని తమ వద్దే ఉంచుకోవడమే కాకుండా ఇతరులకు పంచే బాధ్యతను కూడా తీసుకున్న కొంతమంది ఉపాధ్యాయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖేష్ పిథోరా: విద్య విలువ తెలుసుకుని.. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన ముఖేష్ పిథోరా పేద, నిస్సహాయస్థితిలో ఉన్న పిల్లల కోసం తన సమయాన్ని, జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు ముఖేష్. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ముఖేష్ అనేక సమస్యలను ఎదుర్కొంటూనే విద్యను అభ్యసించారు. పలువురు పేద పిల్లలు విద్యను అభ్యసించడానికి తగిన వనరులు లేని కారణంగా విద్యారంగంలో ముందుకు సాగలేకపోతున్న విషయాన్ని ఆయన గమనించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉచిత విద్యను అందించాలని ముఖేష్ నిర్ణయించుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తన వద్దకు వచ్చే పేద, నిస్సహాయ పిల్లలకు విద్యా తరగతులు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం వారినుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరు. అరుప్ ముఖర్జీ: సొంత సొమ్ముతో పాఠశాల ట్రాఫిక్ కానిస్టేబుల్ అరూప్ ముఖర్జీ 1999లో కోల్కతా పోలీస్ ఫోర్స్లో చేరారు. తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు పొదుపు చేయడం మొదలుపెట్టారు. తన 6 సంవత్సరాల వయస్సులోనే పాఠశాల ప్రారంభించాలని కలలు కన్నారు. 43 ఏళ్ల అరూప్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన డ్యూటీ చేయడమే కాకుండా, పేద గిరిజన పిల్లలకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. ముఖర్జీ ఏర్పాటు చేసిన పుంచ నబాదిశ మోడల్ స్కూల్ 126 మంది సబర్ పిల్లలకు వసతి, ఆహారం, ప్రాథమిక విద్యను ఉచితంగా అందిస్తుంది. ముఖర్జీ ఈ పాఠశాలను 2011లో నిర్మించారు. కోల్కతాకు 280 కి.మీ దూరంలో ఉన్న పుంచ గ్రామంలోని ఈ పాఠశాలకు రూ.2.5 లక్షల ప్రాథమిక నిధి తన సొంత పొదుపు నుంచి ముఖర్జీ వెచ్చించారు. దాతలు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఈ పాఠశాలను నిర్మించారు. అరూప్ తన జీతంలో ప్రతీనెల రూ.20 వేలు స్కూల్ కోసం వెచ్చిస్తున్నారు. వ్యవసాయంతో వచ్చే ఆదాయంతో అతని కుటుంబం బతుకుతోంది. డాక్టర్ భరత్ శరణ్: వైద్యులను తీర్చిదిద్దుతూ.. రాజస్థాన్కు చెందిన డాక్టర్ భరత్ శరణ్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్లో 11వ తరగతికి చెందిన వెనుకబడిన 25 మంది విద్యార్థులకు, 12వ తరగతి చదువుతున్న 25 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. డాక్టర్ శరణ్ మీడియాతో మాట్లాడుతూ తాను గత 7 సంవత్సరాలుగా ఈ కోచింగ్సెంటర్ నడుపుతున్నానని తెలిపారు. అతని ఇన్స్టిట్యూట్లో చదివిన 30 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్లో అడ్మిషన్ పొందారు. ఐదుగురు ఎయిమ్స్లో పనిచేస్తున్నారు. కొందరు వెటర్నరీ మెడిసిన్లో ఉన్నారు. మరికొందరు ఆయుర్వేద రంగంలో కొనసాగుతున్నారు. కానిస్టేబుల్ వికాస్ కుమార్: గ్రామంలోని పేద పిల్లలకు.. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ వికాస్ కుమార్ దేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తన డ్యూటీకి సమయం కేటాయిస్తూనే, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. 2014 నుంచి తన గ్రామంలోని పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. తనకు 18 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఆయన ఈ మహోత్కార్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా పిల్లలు చదువుకోలేకపోతున్నారని, ఇలాంటి పిల్లలకు చదుపు చెప్పించే బాధ్యతను తీసుకున్నానని వికాస్ కుమార్ తెలిపారు. కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్: తన కలను స్టూడెంట్స్ నెరవేరుస్తారని.. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాకు చెందిన కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్ తన డ్యూటీ ముగియగానే రోజూ పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతుంటారు. జాఫర్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న చెట్టుకింద పాఠశాల నడుపుతున్నారు. ఈ పోలీస్ స్కూల్కు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ట్యూషన్ కోసం వస్తుంటారు. నవోదయ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న పిల్లలు కూడా ఈ స్కూల్లో కోచింగ్ తీసుకుంటారు. జాఫర్ సైన్స్ గ్రాడ్యుయేట్, సివిల్ సర్వీసెస్లో చేరాలనేది అతని కల. కానీ అతని కల నెరవేరలేదు. తాను చదువు నేర్పుతున్న పిల్లల్లో ఎవరో ఒకరు తన కలను నెరవేర్చుకుంటారని జాఫర్ చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ‘డూమ్స్డే క్లాక్’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా? -
గురువు ‘లఘువు’ కాకూడదు!
‘తరగతి గది ప్రపంచానికి అద్దం వంటిది. విద్యార్థి అభివృద్ధి అక్కడ నుంచే మొదలవుతుంది. నిజమైన ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని తన తరగతి గదిలోకి తీసుకురాగలడు’ అంటాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఉపాధ్యాయుని ‘గురు’తర బాధ్యతనూ, వృత్తి గౌరవాన్నీ వ్యక్తం చేసేందుకు ఈ ఒక్కమాట చాలు. అయితే చదువుకు కేంద్ర బిందువు అయిన ‘గురువు’ మాత్రం ‘లఘువు’గా మారాడన్న అపవాదు మోస్తున్నాడు. గురు భావన వేద కాలం నుంచి ప్రస్తావనలో ఉంది. తమ గురించి తాము బాగా తెలిసిన గురువులు మంచి శిష్యుల కోసం చూసేవారట. శిష్యులు కూడా అటువంటి గురువునే ఆశ్రయించి శుశ్రూష చేస్తూ జ్ఞానార్జన చేసేవారట. ‘నిజమైన గురువు జ్ఞాన రంగంలో నిష్ణాతుడు కావాలి. వేదాలు అభ్యసించిన వాడ వ్వాలి. అసూయ లేనివాడు, యోగం తెలిసినవాడు, సరళమైన జీవితాన్ని గడిపేవాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అయివుండాలి’ అంటూ నాటి సమాజం గురు వుకు అత్యున్నత స్థానం కట్టబెట్టి గౌరవించింది. గురువు నైపుణ్యాల బోధకుడు. మానసిక విశ్లేషకుడు. విలువలు అలవర్చడం, అనుభవా లను వివరించడం అతని బాధ్యత. అన్ని విషయాలపై అవగాహనకల్పించి శిష్యుడిని సర్వసమగ్రంగా తీర్చేదిద్దే శిక్షకుడు గురువు. అక్షర జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక అంశాల వరకు, యుద్ధ కళల నుంచి సంగీత, సాహిత్య, చిత్రకళల వరకు గురుకులాల్లో బోధన జరిగేది. ఊహ తెలిసిన తర్వాత గురు కులంలోకి ప్రవేశించిన విద్యార్థి యుక్తవయసు నాటికి అన్ని కళల్లో ఆరితేరి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరేవాడు. సూర్యు నిలా ప్రకాశించే గురువు అంతే ప్రకాశవంతంగా శిష్యుని తీర్చి దిద్దేవాడని వేదాలు చెప్పాయి.నేటి కాలానికి వస్తే – ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడం, లక్ష్యం మేరకు విధులు నిర్వహించడంలో పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావడం వాస్తవమే అయినా... ఉన్నంతలో తమ విధులు నిర్వ హించడంలో చాలామంది ఉపాధ్యాయులు విఫలమవుతూ చిన్న చూపుకు గురవుతున్నారు. చదువుకోవడం ఒకప్పుడు గౌరవ ప్రదమైన కార్యక్రమం. ఇప్పుడు ప్రాథమిక హక్కు. ఉచిత నిర్బంధ విద్యతో మొదలైన ప్రభుత్వాల కృషి నేడు ‘హక్కు’ అమలుకు పటిష్టంగా కొనసాగుతోంది. కనీస సదుపాయాలు లేవనో, ఉపకరణాలు అందుబాటులో ఉండడం లేదనో, సరిపడే సిబ్బందిని నియ మించడం లేదనో చెప్పి ఉపాధ్యాయులు నిందను ప్రభుత్వం మీదకు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమ స్యలు లేవని చెప్పలేకున్నా గతకాలంతో పోల్చితే ఇప్పుడు విద్యపై ప్రభుత్వాల శ్రద్ధ పెరిగింది. నిధుల కేటాయింపు అధిక మయ్యింది. సదుపాయాలు, ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకుకృషి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. మొక్కుబడి ఫలితాలపై కాకుండా వాస్తవ అభివృద్ధి సాధించాలని కోరుతోంది. ఆధునిక విద్య అందరికీ అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ పెట్టుబడి పెట్టడం వరకే ప్రభుత్వం చేయగలదు. క్షేత్ర స్థాయిలో అమలు బాధ్యత ఉపాధ్యా యులదే. ఉన్న వనరులను సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులను తీర్చి దిద్దినప్పుడు వారికి ఆత్మసంతృప్తితోపాటు ప్రజల నుంచి హర్షామో దాలు వ్యక్తమవుతాయి. ఇందుకు ఆధునిక బోధనా విధానాలు, మూల్యాంకనా విధానాలతో పాటు జాతి నిర్మాణానికి ఉపయుక్తమయ్యే తాజా కరికులంపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పర్చుకుని లక్ష్య సాధనకు ఉపాధ్యా యులు సిద్ధపడాలి. ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడు, పరిశోధకుడు అయినప్పుడు మాత్రమే మంచిఫలితాలు సాధ్యమవుతాయి. ఆధునిక అవసరాలు, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని తమను తాము అందుకు సన్నద్ధం చేసుకుంటూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు సిద్ధం కావాలి. క్షేత్ర స్థాయిలో ఇది కనిపించినప్పుడే ఉపాధ్యాయులకు గౌరవం. – బి.వి. రమణమూర్తి, టీచర్, విశాఖపట్నం (నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి; ఉపాధ్యాయ దినోత్సవం) -
అభిమాన సంపన్నులు
విద్యావంతులైన వాళ్లు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తుపూర్వం నుంచే గురుశిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువులే లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో! గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం. గురువులు ఊరకే పాఠాలను వల్లెవేయించడమే కాదు, భావితరాలను జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ‘ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు’ అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే, అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం. జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాల్లో గురుశిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయినా, వారి చరిత్రను జనాలు చర్వితచర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురుశిష్యుల కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు. అవతార పురుషులైన రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపని మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలినవారిదంతా ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండా మార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలిగురువు బహుశా ఆయనే! చండామార్క వారసులైన గురువులు అక్కడక్కడా తారసపడుతుంటారు. మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుద్ధ్యాలు గురుశిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆణిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యమూ, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలూ కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాత్రులే! ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు. గురువుకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే, అతగాడు గురుత్వం వెలగబెట్టాడు. గిరీశం శిష్యరికంలో వెంక టేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని, చదువు ఒంటబట్టలేదు. అయితే, మన దేశంలో వివిధ రంగాల్లో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీరంగంలో తమదైన ముద్రవేసిన గురుశిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురుశిష్యుల్లో మొదటగా చెప్పుకోవల సిన వారు – తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ. వారిద్దరూ అరుదైన గురుశిష్యులు. పాండితీ ప్రాభవంలోను, కవన శైలిలోనూ ఇద్దరూ ఇద్దరే! చెళ్లపిళ్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది: ‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు... బ్రాహ్మీమయమూర్తి శిష్యు డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళవంశస్వామి కున్నట్లుగన్’. నన్నయకు, తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెళ్లపిళ్ల వారికే ఆ వైభోగం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా, మరెందరో పరోక్ష శిష్యులూ ఉన్నారు. విశ్వనాథను శ్రీశ్రీ ‘కవికుల గురువు’గా ప్రస్తుతించడమే కాదు, ‘తెలుగువాళ్ల గోల్డు నిబ్బు’గా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో ‘నా వంటి కవి మరో వెయ్యేళ్ల వరకు పుట్టడు’ అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ ‘నిజమే! వారు పుట్టి వెయ్యేళ్లయింది’ అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం ఉండేది. తర్వాతికాలంలో అబ్బూరి రామకృష్ణారావు శ్రీశ్రీపై ఎనలేని ప్రభావం చూపారు. అబ్బూరి వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా, వారిద్దరిదీ గురుశిష్య సంబంధమే! సాహితీ లోకంలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఆయన శిష్యులే! ఇక భద్రిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తూమాటి దొణప్ప వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. ఎందరో గురువులు ఉన్నా, శిష్యుల మనసుల్లో చెరగని ముద్రవేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో గుర్తుండిపోతారు. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్లి మరీ మైసూరు రైల్వేస్టేషన్లో సాగనంపారు. అదీ రాధాకృష్ణన్ ఘనత! రేపు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి! జీతంరాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరిసంపదలుగా తలచే గురువులు ఉంటారు. అలాంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తారు. -
ఉన్నత విద్యపై ఉన్మాదపు రాతలెందుకు?
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే పని అన్నట్టు ఈనాడు రామోజీరావు తప్పుడు రాతలు మానడం లేదు. ప్రభుత్వం చేసే ప్రతి పనిలోనూ భూతద్దం పెట్టి వెతకడం.. అందులో ఏమీ దొరక్కపోయినా తన విష పుత్రిక ‘ఈనాడు’లో విషం జిమ్మడం రామోజీకి నిత్యకృత్యంగా మారింది. ఈ కోవలోనే వాస్తవాలను వక్రీకరించి ‘ఉన్నత విద్యలో గాడి తప్పిన క్యాలెండర్’ అంటూ శనివారం ‘ఈనాడు’లో దుష్ప్రచారానికి దిగారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా రంగాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టింది. అయితే చంద్రబాబు అనే గుడ్డి గుర్రానికి పళ్లు తోమడమే పనిగా పెట్టుకున్న రామోజీకి ప్రభుత్వం చేసిన మంచి పనులు కనిపించడం లేదు. పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది అన్నట్టు ప్రభుత్వం ఏం చేసినా తప్పే.. ఏం చేయకపోయినా తప్పే అనే రీతిలో అడ్డగోలు రాతలకు దిగజారుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనాడు కథనానికి సంబంధించి వాస్తవాలు ఇవిగో.. కరోనాతో దెబ్బతిన్నషెడ్యూల్ సాధారణ స్థితికి.. కరోనా కాలంలో దాదాపు పదినెలల విద్యా సంవత్సరాన్ని కోల్పోయినా గత రెండేళ్లలో ఆ కాలాన్ని క్రమబద్ధీకరించి రాష్ట్రంలో విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వం సాధారణ స్థితికి తెచ్చింది. ప్రస్తుతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ప్రవేశాల ప్రక్రియ నడుస్తోంది. తెలంగాణలోనూ ఇప్పుడే పలు కోర్సులకు ప్రవేశాల ప్రక్రియ చేపట్టారు. వాస్తవం ఇలా ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నత విద్యలో క్యాలెండర్ గాడి తప్పిందని రామోజీ దుష్ప్రచారానికి దిగారు. వాస్తవానికి విద్యార్థులు రాష్ట్రంలో పలు సెట్స్ రాసినా వారి మొదటి ప్రాధాన్యత సెంట్రల్ యూనివర్సిటీలకే ఉంటుంది. దీంతో విద్యార్థులు మంచి అవకాశాలు కోల్పోరాదన్న భావనతో ఏపీ పీజీఈ సెట్ కౌన్సెలింగ్ను ఆగస్టు 11న చేపట్టారు, సెప్టెంబర్ 6న ఐసెట్, 11న పీజీసెట్, 26న లాసెట్, 30న ఎడ్సెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని గతంలోనే షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కూడా టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ను వచ్చే నెల 6న, టీఎస్ పీజీసెట్ను మూడో వారంలో నిర్వహించనున్నారు. పలు సెంట్రల్ యూనివర్సిటీలు కూడా సెప్టెంబర్లోనే ప్రవేశ ప్రక్రియ చేపట్టబోతున్నాయి. అందుకు అనుగుణంగా ఏపీ సెట్స్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్ణయించారు. కానీ రాష్ట్రంలోనే అనర్థం జరిగిపోతోందంటూ రామోజీ తనకలవాటైన రీతిలో ఏడుపు లంకించుకున్నారు. యూజీసీ నిబంధనలు పట్టవా రామోజీ? మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యపై బురద చల్లడమే ‘ఈనాడు’ పనిగా పెట్టుకుంది. సజావుగా జరుగుతున్న కార్యక్రమాలను కూడా తీవ్ర అపరాధంగా చిత్రీకరించేందుకు నానా అగచాట్లు పడుతోంది. ఇలాగే ఆర్–సెట్ విషయంలోనూ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేసింది. యూజీసీ.. పీహెచ్డీ ప్రవేశాల నిబంధనలను మార్చడంతో మన ఆర్–సెట్ జీవో కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. ముందుగా జేఆర్ఎఫ్ అభ్యర్థుల అడ్మిషన్స్ పూర్తి చేశాకే రాష్ట్ర సెట్ ద్వారా మిగిలిన సీట్లను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఒక జాప్యంగా ‘ఈనాడు’ చూపడం ప్రభుత్వంపై బురద చల్లడంలో భాగమే. ఎమర్జింగ్ టెక్నాలజీస్పైనా వ్యంగ్యమేనా? అడ్మిషన్స్ ప్రక్రియకు ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేస్తూ ‘ఈనాడు’ తన కుత్సిత బుద్ధిని చాటుకుంది. ముఖ్యమంత్రి దూరదృష్టితో ఎమర్జింగ్ టెక్నాలజీస్పై దిశానిర్దేశం చేస్తే దాన్ని కూడా వ్యంగ్యానికి వాడుకోవడం రామోజీకే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతతో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. గత నాలుగేళ్లలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలపై గతంలో ఏ ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయలేదు. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థ.. ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా వస్తున్న మంచి పేరును దెబ్బతీసే ప్రక్రియలో భాగంగానే ‘ఈనాడు’ ఇలాంటి విష ప్రచారానికి దిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఉన్నత విద్యామండలి, విశ్వవిద్యాలయాలు కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఈ రెండింటి మధ్య సమన్వయం లేదని రామోజీ తీర్మానించేశారు. రెండేళ్లుగా విద్యార్థులు సాధించిన సర్టిఫికేషన్ ఇంటర్న్షిప్స్, కమ్యూనిటీ ప్రాజెక్టులు ప్లేస్మెంట్స్ సమన్వయానికి నిదర్శనాలుగా నిలుస్తున్నా ఆయన పచ్చ కళ్లకు కనిపించడం లేదు. దేశమంతా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా వ్యవస్థని మెచ్చుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాలు మన పథకాలను అమలు చేయడానికి ముందుకు వస్తున్నాయి. కానీ రామోజీ మాత్రం విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. -
చదువులపై ‘ఈనాడు’ చిత్తు కథ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన విద్యపై ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మరోసారి విషం కక్కారు. పేదల చదువులపై పూర్తి వక్రీకరణలు, అభూత కల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు పత్రికలో కథనాన్ని ప్రచురించారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడంలో భాగంగానే ఈ కథనం ప్రచురించారు. ఈ కథనంలోని డొల్లతనాన్ని, రామోజీ ఏడుపుగొట్టుతనాన్ని ప్రభుత్వం బట్టబయలు చేసింది. ♦ బెస్ట్ అవైలబుల్ పథకంలో ఎంపిక చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు అందేదని ఈనాడు రాసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పలు పథకాల ద్వారా విద్యార్థులకు మేలు చేస్తోంది. అత్యుత్తమ విద్యను అందిస్తోంది. ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి తల్లికీ ఏడాదికి రూ.15 వేలు అందిస్తోంది. ఇవికాక ప్రభుత్వ విద్యా రంగంలో ప్రతి విద్యార్థి మీద ఏడాదికి అదనంగా చేస్తున్న ఖర్చు రూ.30 వేల పైనే. ♦ బెస్ట్ అవైలబుల్ పథకం కొందరికే అందేది. అంటే మిగిలిన విద్యార్థులకు నాసిరకం చదువులు అందినా పర్వాలేదనేది ఈనాడు అభిప్రాయమా? ఇది పేదలు, ఎస్సీ, ఎస్టీలు బడుగు, బలహీనవర్గాల వారికి అన్యాయం చేసినట్టుగా కాదా? అందరికీ నాణ్యమైన విద్య అందడం ఈనాడుకి ఇష్టంలేదా? ♦ మంచి చదువులు ఏ ఒక్కరికో కాదు.. అందరికీ సమానంగా అందాలన్నదే ఈ ప్రభుత్వ ధ్యేయం. అందుకే కార్పొరేట్ స్కూళ్లకంటే మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతోంది. మన బడి నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. తొలి దశలో రూ.3,699 కోట్లతో 15,715 స్కూళ్లలో సదుపాయాలు కల్పించింది. రెండో దశలో మరో 22,344 స్కూళ్లను రూ.8,000 కోట్లతో బాగుచేస్తోంది. ఇందులో ఇప్పటికే రూ.2,949 కోట్లు ఖర్చు చేసింది. నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రైవేటు స్కూళ్లలో కూడా లేవన్నది నిజం. ♦ పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం విప్లవాత్మక మార్పుగా అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చింది. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే కాకుండా, ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న వారికీ వర్తిస్తోంది. అమ్మ ఒడి ద్వారా ఈ నాలుగేళ్లలో సుమారు 45 లక్షల మంది తల్లులు అందుకున్న మొత్తం రూ.26,067.28 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి రూ.100 కోట్లు ఎక్కడ? ఒక్క అమ్మ ఒడి ద్వారా ఈ నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన రూ.26,067.28 కోట్లు ఎక్కడ? ఈ పథకం ద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల పిల్లలు ఎంతగానో లబ్ధిపొందారు. ♦ విద్యా రంగంలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల వల్ల 14,28,568 మంది ఎస్సీ విద్యార్థులు, 5,19,116 మంది ఎస్టీ విద్యార్థులు లబ్ధి పొందారు. మరోవైపు 10వ తరగతి, ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 22,761 మంది విద్యార్థులను జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రభుత్వం సత్కరించింది. ♦ జగనన్న గోరుముద్ద ద్వారా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. దీనికి రాగిజావను కూడా ఇటీవల అదనంగా చేర్చింది. ఈ నాలుగేళ్లలో కేవలం జగనన్న గోరుముద్ద పథకం మీద పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.4,286.7 కోట్లు. ఇలాంటి ఆహారాన్ని ఉచితంగా ఏ ప్రైవేటు పాఠశాలలైనా అందిస్తున్నాయా? ♦ బడికి వెళ్లే పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద వారికి కావాలి్సన యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్టు, సాక్సులు, ఇంగ్లిష్ డిక్షనరీ, వర్క్స్ బుక్స్ లాంటివాటిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. దీని కోసం నాలుగేళ్లలో చేసిన ఖర్చు అక్షరాలా రూ.3,366.53 కోట్లు. చంద్రబాబు అమలు చేసిన స్కీమ్లో ప్రైవేటు పాఠశాలలు ఇలాంటివి అందించాయా? ♦ అందరికీ ఇంగ్లిష్ మీడియం, మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, టోఫెల్లో శిక్షణ, పరీక్షలు ఇవన్నీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయా? ♦ కార్పొరేట్ పాఠశాలలు పోటీ పడలేనంతగా ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత స్థాయిలో ఉంచే మరో అంశం డిజిటలీకరణ. గ్లోబల్ సిటిజన్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీనిపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. ఆరు, ఆపై తరగతుల వారికి ప్రతి తరగతి గదిలో ఒక ఐఎఫ్పీ ప్యానెల్ ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో రూ.440 కోట్లతో 30,213 తరగతి గదుల్లో ఐఎఫ్పీల ఏర్పాటు చేసింది. రెండో దశలో మరో రూ.520 కోట్లు ఖర్చు చేస్తోంది. 5వ తరగతి లోపు 10,038 తరగతి గదుల్లో తొలిదశలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఇలాంటి ఏర్పాటు ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఎన్నో ఈనాడు చెప్పగలదా? ♦ డిజిటల్ విద్యలో భాగంగా 4 నుంచి 10వ వతరగతి వరకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్ను ప్రభుత్వం అందిస్తోంది. అంతేకాక 8వ తరగతి చదువుకునే ప్రతి విద్యార్థికి బైజూస్ కంటెంట్తో ట్యాబ్ను ఉచితంగా ఇస్తోంది. ఇందుకోసం 5.18 లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి రూ.686 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా సౌకర్యాలు, డిజిటల్ ఎడ్యుకేషన్ ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వీటిద్వారా మేలు పొందడంలేదా? ఇలా గడచిన 50 నెలల్లో ప్రభుత్వ విద్యా రంగం మీద చేసిన ఖర్చు అక్షరాలా రూ.68,607 కోట్లు. విద్యార్ధులకు మేలు జరిగేలా చర్యలు బెస్ట్ అవైలబుల్ స్కీంలో చేరిన విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 9, 10 తరగతులు వారిని అదే పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. మిగిలిన విద్యార్థులు వారు కోరుకున్న ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరే అవకాశాన్ని కల్పించింది. వీరికి ప్రభుత్వ పరంగా మిగిలిన విద్యార్థుల మాదిరిగానే అన్ని పథకాలు, సదుపాయాలు కల్పిస్తోంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనేది పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో తేలింది ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా గుర్తించిన చాలా పాఠశాలల్లో కనీస ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు లేవు. వరుసగా ఐదేళ్లపాటు పదో తరగతిలో 90 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించాలి. అందులో 50% విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఫలితాలు సాధించిన స్కూళ్లే ఈ స్కీంకు అర్హత పొందుతాయి. ఈ నిబంధనలేవీ ఎంపిక చేసిన స్కూళ్లలో లేవు అని ప్రభుత్వం వివరించింది. -
‘చెలిమి’కి అంకురం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యా వ్యవస్థలో శాస్త్రీయతను జోడిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వివిధ రూపాల్లో విద్యార్థులకు ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకునేలా ‘చెలిమి’ విద్యార్థుల్లో వ్యాపార దృక్పథాన్ని పెంచడంతో పాటు, వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’అనే కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలోని శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం కార్యక్రమాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తిని పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. పిల్లలు తమ నిజ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, వేగంగా పురోగమిస్తున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము సమాయత్తం చేసుకొనేలా తరగతి గదిలో సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. విద్యార్థుల్లోని అభిరుచులను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పాటు ఏయే రంగాల్లో రాణిస్తారనే విషయాన్ని తెలుసుకునేందుకు శాస్త్రీయ మదింపు చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకురం కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టులో భాగంగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో 11వ తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తున్నామని చెప్పారు. మంచి భవిష్యత్ను అందించేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ బి.వినోద్కుమార్ అన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకురాలు దేవసేన తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా బోధన అందించాలన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏపీ విద్యాసంస్కరణలపై తెలంగాణ ఆసక్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆసక్తి చూపుతోంది. గత నాలుగేళ్లుగా మన విద్యాశాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించి అనేక విజయాలు సాధించారు. విద్యార్థి దినచర్యను పాఠశాల నుంచి రాష్ట్రస్థాయిలో ప్రిన్సిపల్ కార్యాదర్శి, ముఖ్యమంత్రి వరకు పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు బడిబయటి పిల్లలను ట్రాక్ చేయడంలో సాధించిన విజయాలు, మధ్యాహ్న భోజనం అమలు తీరును తెలంగాణ అధికారులు పరిశీలించారు. ఇటీవల ఏపీకి వచ్చిన తెలంగాణ సమగ్ర శిక్ష అధికారులు ఇక్కడి అధికారులతో సమావేశమై ఐటీ వినియోగంతో సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 58,685 పాఠశాలలు, 70.64 లక్షలమంది విద్యార్థులు, మూడులక్షలకు పైగా ఉపాధ్యాయులను నూరుశాతం పర్యవేక్షిస్తున్న తీరుకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (సిమ్స్) ద్వారా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఒక్కటి చేయడాన్ని అడిగి తెలుసుకున్నారు. యాప్స్ ద్వారా విద్యార్థుల హాజరు తీసుకోవడం, అదే సమయంలో మధ్యాహ్న భోజనం చేసేవారి సంఖ్యను లెక్కించడం, పాఠశాల ప్రాంగణంలోనే ఉపాధ్యాయుల హాజరును ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయడాన్ని అభినందించారు. రాష్ట్రస్థాయిలో రియల్ టైమ్ గవర్నెన్స్ అమలును తమ రాష్ట్రంలోను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపించారు. సిమ్స్, యాప్స్ పనితీరును వివరించిన అధికారులు విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (సిమ్స్), దానికి అనుసంధానంగా కీలక విభాగాలకు మొబైల్ యాప్స్ రూపకల్పన ద్వారా విద్యార్థి ట్రాకింగ్ను ఏపీ సమగ్ర శిక్ష అధికారులు తెలంగాణ అధికారుల బృందానికి వివరించారు. ఇందులో ప్రధానంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ విభాగంలో పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం అమలు, చేస్తున్న మార్పులను నమోదు చేస్తారు. టీచర్స్ ప్రొఫైల్లో వారి హాజరు, ఎన్వోసీ, మెడికల్ రీయింబర్స్మెంట్, సెలవులు, గ్రీవెన్స్ వంటివి, విద్యార్థుల విభాగంలో ఆధార్ నంబరు ఆధారంగా విద్యార్థి పాఠశాలలో ఉన్నారా, బడిబయట ఉన్నారా అని ట్రాకింగ్ చేసి, గ్రామ, వార్డు కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరించి వారిని తిరిగి బడిలో చేరుస్తున్నారు. ఇలా గత విద్యాసంవత్సరంలో సుమారు లక్షమంది పిల్లలను తిరిగి బడిలో చేర్చారు. ఐటీ సంస్కరణలతో తక్కువ కాలంలోనే వేగవంతమైన విజయాలు నమోదు చేయడాన్ని తెలంగాణ అధికారులు అభినందించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి పాఠశాలను, విద్యార్థిని ప్రతిరోజు పర్యవేక్షించడం, వారి పనితీరును తెలుసుకోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటిలో కొన్నింటిని తెలంగాణలోను అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం ‘మనబడి: నాడు–నేడు’ పథకాన్ని ప్రవేశపెట్టి సాధించిన విజయాన్ని పరిశీలించిన తెలంగాణ అధికారులు వారి రాష్ట్రంలో ‘మన ఊరు–మన బడి’ పేరుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. -
‘కాసులిస్తే’ అన్నీ ఓకే.. లేదంటే 'నో పర్మిషన్'!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహణ కొనసాగిస్తోంది. ఈ విషయం విద్యా శాఖాధికారులకు తెలిసినప్పటికీ మామూలుగా వ్యవహరిస్తున్నారు. పాఠశాల యాజమాన్యానికి రాజకీయ అండదండలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడంతో జిల్లా విద్యాశాఖాధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్లో గల ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్నారు. అనుమతుల కోసం అక్టోబర్ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో వీరు ఆన్లైన్ చేసుకోలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకున్నప్పటికీ ఆన్లైన్లో మాత్రం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం నిబంధనలు మాత్రం పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాలకు అనుమతి లేదని విద్యానగర్కు చెందిన యువజన సంఘాలు, కాలనీవాసులు డీఈవోకు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇదిలా ఉండగా పాఠశాల యాజమాన్యానికి చెందిన పలువురు డీఈవో కార్యాలయానికి వెళ్లి త్వరగా అనుమతులు ఇవ్వాలని ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాసులిస్తే’ అన్నీ ఓకే.. గతంలో విద్యానగర్లోని ఇదే పాఠశాల భవనంలో ఓ ప్రైవేట్ పాఠశాల కొనసాగేది. ఆ భవనానికి ఫైర్ అధికారులు ఫైర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. పాఠశాల భవనం చుట్టూ వెళ్లే విధంగా లేదని, ఫైర్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆ యాజమాన్యం మరోచోట పాఠశాల నిర్వహణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భవనంలోనే కొనసాగుతున్న ఓ పాఠశాల యాజమాన్యానికి మాత్రం ఫైర్ అధికారులు అనుమతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాసులిస్తే ఎలాంటి పనులైనా చేసుకోవచ్చనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ పాఠశాలకు ఫైర్ సర్టిఫికెట్ ఏ నిబంధనల మేరకు ఇచ్చారని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ కోరిన ఉన్నతాధికారులు జిల్లాకు చెందిన పలువురు ఫైర్ అధికారులకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయమై స్టేషన్ ఫైర్ అధికారి శివాజీని వివరణ కోరగా ఉన్నతాధికారి సెలవులో ఉన్నారని, తనకు ఈ విషయం తెలియదని వివరించారు. తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం.. అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహణ కొనసాగించరాదు. ఆ పాఠశాల యాజమాన్యం గడువు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి పొందారు. అయినప్పటికీ ఇంతవరకు ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి కాలేదు. మాకు ఎలాంటి పత్రాలు సమర్పించలేదు. పాఠశాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. – ప్రణీత, డీఈవో -
త్వరలో ‘కేసీఆర్ విద్యా కానుక’: గంగుల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలు తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శాసనమండలిలో శుక్రవారం ‘రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. సంక్షేమంపై పలువురు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలపై మంత్రులు స్పందించారు. బీసీ సంక్షేమంపై మంత్రి గంగుల మాట్లాడుతూ కేసీఆర్ తీసుకున్న చర్యలతో బీసీల్లో ఆత్మగౌరవం ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. త్వరలోనే కేసీఆర్ విద్యాకానుక పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్ మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఎవరూ చేయలేదన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన వర్గాలను కేసీఆర్ జనజీవనంలో ఉన్నతస్థానంలో నిలిపారన్నారు. -
విద్యారంగంపై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి దారుణంగా ఉందని, క్రమంగా అది తీసికట్టుగా మారుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. విద్య–వైద్యంపై శుక్రవారం శాసనసభ లో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. వాస్తవంగా పరిస్థితులు బాగా లేవని, తెలంగాణ వచ్చాక విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయని అంకెలతో సహా వివరించారు. అయితే, భట్టి విక్రమార్క సభను, తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అంకెలు చెబుతున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కేవలం విద్యాశాఖ బడ్జెట్ను మాత్రమే భట్టి పేర్కొంటున్నారని, ఇతర శాఖల ద్వారా కూడా విద్యారంగానికి జరుగుతున్న కేటాయింపులను ఆయన ప్రస్తావించలేదని అన్నారు. దీనికి భట్టి జవాబు ఇస్తూ, ప్రతి సంవత్సరం బడ్జెట్ పద్దు పెరుగుతున్నప్పుడు, ఆ దామాషా ప్రకారం విద్యా రంగానికి కేటాయింపులు లేక పోవటం అంటే బడ్జెట్ తక్కువ ఇచ్చినట్టేనంటూ మళ్లీ సభ ముందు లెక్కలు ఉంచారు. ఇదేనా మీ స్ఫూర్తి: స్పీకర్పై భట్టి అసహనం.. తాను మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డు తగులుతుండటం, ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్ బెల్ కొడుతుండటంతో ఓ దశలో భట్టి అసహనం వ్యక్తం చేశారు. ‘నేను ఐదు నిమిషాలు మాట్లాడితే, మంత్రులు పది నిమిషాలు అడ్డుతగులుతున్నారు. వారు లేచినప్పుడల్లా మీరు వారికి మైక్ ఇస్తున్నారు. ఇదేనా మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి?’ అని ప్రశ్నించారు. కాగా, వచ్చే అసెంబ్లీకి బీఆర్ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారో రారో తెలియదని, అంతకు మించి అయితే రారని భట్టి వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. -
అన్నా.. ఇది పద్ధతి కాదే.. పవన్ కళ్యాణ్ కు అభిమాని చురకలు
పవన్ కళ్యాణ్.. నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటూ ప్రతీ సారి చెప్పుకునే పీకే.. ఇప్పుడు పనికిరాని ప్రశ్నలు వేసి నవ్వులపాలవుతున్నాడు. తనకు తెలియని విద్యావిధానం గురించి, ఇంకెవరో రాసిచ్చిన ప్రశ్నలను అనుసంధానం చేసి.. దాన్ని సోషల్ మీడియా వేదికగా సంధించి ప్రభుత్వంపై బురద జల్లాలనుకున్న పవన్ ప్రయత్నం పాపం.. బెడిసికొట్టింది. ఆంధ్రప్రదేశ్ విద్యావిధానాలు భేష్ ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ప్రభుత్వం విద్యార్థుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, తీసుకొచ్చిన పథకాలకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. అమెరికా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి వేదికగా జులై మూడో వారంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ డిస్కషన్ మీట్ సందర్భంగా ఏపీ ప్రతినిధులు ప్రత్యేకంగా రాష్ట్రంలో చేపడుతున్న విద్యావిధానాలను ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రజెంట్ తీసుకొచ్చారు. పేదరికాన్ని పారదోలాలంటే విద్యకు మించిన విధానం మరొకటి లేదన్న సీఎం జగన్ ఆశయానికి పలు ప్రశంసలు వచ్చాయి. (ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఏపీ ప్రభుత్వ విద్యావిధానాలపై స్టాల్) (చదవండి : ఏపీ విద్యావిధానాలు భేష్) విద్యార్థులకిచ్చిన ట్యాబ్లెట్లపై అక్కసు ఏపీ విధానాలను అందరూ ప్రశంసిస్తుంటే.. కొందరిలో మాత్రం అక్కసు మొదలైంది. అసలు పేద విద్యార్థులకు ట్యాబ్లు ఎలా ఇస్తారన్నట్టుగా వీరి వ్యవహారం తయారయింది. విద్యార్థుల విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు ట్యాబ్లు ఉపయోగపడుతాయన్న కనీస స్పృహ లేకుండా.. దానిపై చిలువలు పలువలుగా వ్యాఖ్యానాలు జోడించి, కొన్ని ప్రశ్నలను ట్విట్టర్ వేదికగా వదిలారు పవన్ కళ్యాణ్. Points to note : 1. ప్రభుత్వం బైజూస్ కంటెంట్ లోడ్ చేసిన టాబ్లెట్స్ కోసం దాదాపు 580 కోట్లు ఖర్చు చేస్తుంది. బహిరంగ మార్కెట్ లో ఒక్కొక్క టాబ్లెట్ విలువ 18,000 నుండి 20,000 ఉంటుంది. 2. బైజూస్ CEO రవీంద్రన్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) లో భాగంగా 8వ తరగతి… — Pawan Kalyan (@PawanKalyan) July 23, 2023 సొంత అభిమాని నుంచే పవన్ కు ప్రశ్న పవన్ వ్యాఖ్యలను చాలా మంది తప్పుబట్టారు. అయితే వారంతా ప్రభుత్వానికి చెందిన వారని, వైఎస్సార్ సిపి క్యాడర్ అని జనసేన చెప్పుకోవచ్చు కానీ.. పవన్ ట్వీట్కు సొంత అభిమాని రమేష్ బోయపాటి నుంచి ఎదురయిన విమర్శను మాత్రం కచ్చితంగా క్షుణ్ణంగా చదవాల్సిందే. మీ సినిమాలు చూస్తాను, మిమ్మల్ని అనుసరిస్తాను కానీ, పేద విద్యార్థులకు మేలు చేసే విద్యావిధానాన్ని విమర్శిస్తే మాత్రం మౌనంగా ఉండలేనంటూ నేరుగా స్పందన వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న విద్యావిధానంలో కచ్చితంగా సీఎం జగన్ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందేనంటూ నొక్కి వక్కాణించారు రమేష్ బోయపాటి. పవన్ కళ్యాణ్ గారు బైజూస్ తో రాష్ట్రం కుదుర్చుకున్న ఒప్పందం గురించి మీరు లేవనెత్తిన సందేహాలు విలువైనవి. ఇక్కడ మీ ట్వీట్ ఉద్దేశం బైజూస్ తో ఒప్పందం గురించి కన్నా, ఆ ఒప్పందంలో ఉన్న అనేక సందేహాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నం అనిపించింది. నేను కూడా ఈ విషయం గురించి అవగాహన ఏర్పరుచుకునే… pic.twitter.com/thDcCgldYM — Ramesh Boyapati (@rameshboyapati) July 24, 2023 -
భయం గుప్పిట్లో చదువులు..!
మహబూబ్నగర్: నారాయణపేట జిల్లా మద్దూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే పాఠశాలకు సోమవారం సెలవు కావడం, విద్యార్థులు బడిలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఒక్క చోటే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నో పాఠశాలలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి దాపురించింది. మంగళవారం కూడా ఎడతెరిపి లేకు ండా వాన ముసురు కురవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులను మధ్యాహ్నం నుంచే ఇళ్లకు పంపించా రు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కుస్తున్న నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదకరంగా.. ఉమ్మడి జిల్లాలోని 3,162 ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇందులో కొన్ని శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లో పైకప్పు పెచ్చులూడడం, నెర్రెలు రావడంతో వర్షం వచ్చిన ప్రతిసారి తరగతి గదల్లోకి వర్షపు నీరు చేరుతుంది. దీంతో కొన్నిచోట్ల పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండగా.. మరికొన్నిచోట్ల భవనాలే కూలిపోతా యా అన్న ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే పలు చోట్ల పైకప్పు పెచ్చులు ఊడిపడగా.. విద్యార్థులు గా యపడటం, త్రుటిలో ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడిన సందర్భాలు లేకపోలేదు. అలాగే కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు సైతం ప్రత్యేక గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – మహబూబ్నగర్ ఎడ్యుకేషన్ -
రాష్ట్ర విద్యారంగ చరిత్రలో పిల్లల అభివృద్ధి దిశగా గొప్ప మార్పులు
-
ఎంబీబీఎస్ ప్రవేశాలు
సిరిసిల్ల: జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ భవనం సిద్ధమైంది. సిరిసిల్ల, వేములవాడ పాత తాలూకా ప్రాంతాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భవించడం.. రాష్ట్రంలోనే భౌగోళికంగా, జనాభా పరంగా చిన్న జిల్లాగా ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తూ మెడికల్ కాలేజీ ఏర్పాటు అవుతుంది. పట్టణ శివారులోని పెద్దూరు బైపాస్ రోడ్డులో పది ఎకరాల స్థలంలో రూ.40 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం, విద్యార్థుల హాస్టళ్ల భవనాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. ఆగస్ట్ మొదటి వారంలోగా పనులు పూర్తి కానున్నాయి. రెండో వారంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం వైద్య విద్య తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్ఎంసీ అనుమతులు జిల్లా కేంద్రంలో వైద్య విద్యను బోధించే మెడికల్ కాలేజీని మంజూరు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) న్యూఢిల్లీ లెటర్ ఆఫ్ ఇన్టెంట్(ఎల్వోటీ) నం.ఎన్ఎంసీ/యూజీ/2023– 2024/000033/ 021 475 తేదీ: 21.0.4.2023ను జారీ చేసింది. కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీకి వంద ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారు. ఈ ఏడాది ఆగస్ట్ మొదటి వారంలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారికంగా మెడికల్ కాలేజీకి అనుమతి లభించింది. ఎంబీబీఎస్ తరగతులకు శ్రీకారం సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది వంద సీట్లు కేటాయించగా, ఇందులో 15 సీట్లు ఆలిండియా కోటాలో కేటాయిస్తారు. మరో 85 మన రాష్ట్ర అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 40 శాతం బాలురు, 60 శాతం సీట్లు బాలికలకు ఉంటాయి. ఆగస్ట్ మొదటి వారంలో కౌన్సెలింగ్ ఉంటుంది. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో మొత్తం 340 బెడ్స్ సిద్ధం చేశారు. పెద్దూరు వద్ద నిర్మించిన సొంత భవనంలోనే ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తారు. హాస్టల్ భవనాలు నిర్మాణంలో ఉండగా, అబ్బాయిలు, అమ్మాయిల కోసం వేర్వేరు ప్రైవేటు భవనాలు సిద్ధం చేశారు. సిరిసిల్లకు వచ్చిన ప్రొఫెసర్లు సిరిసిల్ల మెడికల్ కాలేజీకి ప్రభుత్వం సిబ్బందిని కేటాయించింది. అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే 55 మంది సిబ్బందిని కేటాయించారు. మెడికల్ కాలేజీ ప్రారంభమైతే సుమారు వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మొత్తంగా మెడికల్ కాలేజీలో సుమారు 700 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన బోధన సిబ్బంది, ఇతర డాక్టర్లు జిల్లా ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. సీఎంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిరిసిల్ల మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9లో నిర్మించిన జలాశయం, జిల్లా పోలీస్ ఆఫీస్ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రారంభంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. పట్టణంలోని జిల్లా ఆస్పత్రి పూర్తి స్థాయిలో మాతాశిశు సంరక్షణ, నవజాత శిశువుల కేంద్రంగా మారుతుంది. జనరల్ ఆస్పత్రి మొత్తంగా మెడికల్ కాలేజీకి మార్చడంతో పెద్దూరు శివారులోని మెడికల్ కాలేజీ బోధన ఆస్పత్రిగా ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, ఆధునిక పరికరాలతో అందుబాటులోకి వస్తుంది. ఆగస్టులో తరగతులు.. రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఆగస్ట్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. భవన నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. మొదటి ఏడాది వైద్యపాఠాలు బోధించేందుకు మౌలిక వసతులు సమకూరాయి. – డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ న్యూస్రీల్ -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 40 లక్షల మంది పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి డిజిటల్ బోధనను ప్రవేశపెట్టింది. ఇప్పటికే నాడు–నేడు: మనబడి కింద పాఠశాల భవనాలు, తరగతి గదులు, డబుల్ డెస్క్ బెంచీలు, విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలతో పాటు బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్లను ఉచితంగా అందించింది. నాడు–నేడు పనులు పూర్తయిన 15,713 పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ప్లస్ 2 వరకు బోధించే 6,731 స్కూళ్లలో అత్యాధునిక టెక్నాలజీ గల 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఇలాంటి ప్యానెళ్లు దేశవ్యాప్తంగా సుమారు 25 వేలు మాత్రమే ఉండగా.. మనరాష్ట్రంలో 30 వేలకు పైగా అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంపై 1,34,281 మంది ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నారు. ఈ నెల 4 నుంచి ప్రారంభమైన డిజిటల్ శిక్షణ ఇప్పటికే లక్ష మందికిపైగా పూర్తయింది. మిగిలిన వారికి ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది. 11,455 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ రెండో దశ నాడు–నేడు పనులు 22 వేల పాఠశాలల్లో జరుగుతున్నాయి. వీటిలో దాదాపు పనులు పూర్తయినవి మొత్తం 11,455 పాఠశాలలు ఉన్నాయి. వీటి నుంచి 1,34,281 మంది ఉపాధ్యాయులను శిక్షణకు ఎంపిక చేశారు. వీరికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగంపై ఇంజనీరింగ్ కాలేజీల్లో నిపుణులతో తర్ఫీదునిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 144 ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది చొప్పున ఒక బ్యాచ్గా చేసి శిక్షణ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతంలో శిక్షణ పొందిన దాదాపు 600 మంది మాస్టర్ ట్రైనర్లతో రెండు లేదా మూడు మండలాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు రెండు రోజుల చొప్పున శిక్షణ అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గణితం, భౌతిక, జీవ, రసాయన శాస్త్రాలతో పాటు ఇంగ్లిష్ బోధించే 35 వేల మంది సబ్జెక్టు ఉపాధ్యాయులకు అక్టోబర్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నారు. నిధులు చెల్లించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల శిక్షణకు, ప్యానెళ్లు బిగించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం గత నెలలోనే విడుదల చేసింది. 1,34,281 మంది టీచర్లకు రూ.5,79,12,000.. ఐఎఫ్పీ స్క్రీన్లు తరలింపు, శిక్షణ కేంద్రాల్లో బిగించేందుకు రూ.7.20 లక్షల నిధులను ప్రభుత్వం గత నెలలోనే చెల్లించింది. దీంతో పాటు ఐఎఫ్పీ స్క్రీన్లు మంజూరైన పాఠశాలల్లో వాటిని బిగించేందుకు, వైరింగ్, రంగులు వేసేందుకు కూడా నిధులను ఇచ్చింది. పద్యాలను బాగా నేర్పించొచ్చు గతంలో విద్యార్థులకు తెలుగు పద్యాలను నేర్పించేందుకు ఫోన్ ను ఉపయోగించేవాళ్లం. అయితే ఇలా ఎక్కువమంది పిల్లలకు చేరేది కాదు. ఇప్పుడు ఐఎఫ్పీల ద్వారా తెరపై అందరికీ వినిపించేలా చెప్పొచ్చు. చెప్పిన ప్రతి అంశాన్ని మరోసారి పునశ్చరణ చేసేందుకు వీలుంది. ఇంత మంచి శిక్షణ ప్రతి టీచర్కు అవసరం. – పి.రాణి, తెలుగు టీచర్, కొండపల్లి బాలికల హైసూ్కల్, ఎన్టీఆర్ జిల్లా శిక్షణ గొప్ప అవకాశం ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మారకుంటే వెనుకబడిపోతాం, బోధనలో కూడా అంతే. ఉపాధ్యాయుడిగా నాకు 27 ఏళ్ల అనుభవం ఉంది. ఇన్నేళ్ల బోధన ఒక ఎత్తయితే.. డిజిటల్ బోధన మరో ఎత్తు. బ్లాక్ బోర్డుపై చెప్పే దానికన్నా ఐఎఫ్పీలపై 3డీలో విద్యార్థికి మరింత సమర్థవంతంగా చదువు చెప్పొచ్చు. బోధనా సామర్థ్యాలు పెంచుకోవడానికి ఇదో గొప్ప అవకాశం. – కె.హరిశరణ్, జెడ్పీ స్కూల్ హెచ్ఎం, సూరంపల్లి, కృష్ణా జిల్లా ప్రభుత్వ బడిలో ఇదో విప్లవం వేగంగా మారుతున్న ప్రపంచంలో కార్పొరేట్ స్కూళ్లు కూడా అందుకోలేని డిజిటల్ బోధనను ప్రభుత్వ స్కూళ్లల్లో అందుబాటులోకి తేవడం ఓ ఎత్తయితే.. ఉపాధ్యాయులకు వేగంగా శిక్షణనివ్వడం మరో ఎత్తు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులు కొత్త టెక్నాలజీని నేర్చుకునేందుకు నూరుశాతం ఆసక్తి చూపించారు. పిల్లలకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ఇదో గొప్ప అవకాశం. ప్యానెళ్లను ఎలా వినియోగించాలి?, నోట్స్ సేవింగ్, 3డీ పాఠాలు ఎలా చెప్పాలి? వంటి సాంకేతిక అంశాలపై శిక్షణనిచ్చాం. – డాక్టర్ కె.శ్రీనివాసరావు (మాస్టర్ ట్రైనర్), బి.శ్రీనివాస్ (పెదపారుపూడి ఎంఈవో) బోధనా సమయం ఆదా బయాలజీ టీచర్గా బ్లాక్ బోర్డుపై విద్యార్థికి పాఠాలు అర్థమయ్యేలా చెప్పడం ఒక సవాల్. ఇప్పుడు ఐఎఫ్పీలపై తక్కువ సమయంలోనే ఎక్కువ ఉదాహరణలతో అర్థమయ్యేలా బోధించవచ్చు. స్క్రీన్పై 3డీ చిత్రాలతో ప్రతి అంశాన్ని విశదీకరించి చెప్పొచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా స్క్రీన్పైనే నోట్స్ రాసి సేవ్ చేయడంతో పాటు ఎక్కువ అంశాలను నేర్పించవచ్చు. – వి.అరుణశ్రీ, బయాలజీ టీచర్, పెనమలూరు జెడ్పీ స్కూల్, కృష్ణా జిల్లా -
ఐరాసలో ‘మన బడి’.. ఏపీకి అంతర్జాతీయంగా ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యారంగ సంస్కరణలు, మారిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విద్యార్థులకు ట్యాబ్లు, జగనన్న విద్యాకానుక ద్వారా బ్యాగులు, పుస్తకాలు, డిక్షనరీ, బెల్టు, బూట్లుతోపాటు గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ లాంటివి ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సు (హై లెవెల్ పొలిటికల్ ఫోరం) న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఈనెల 10 తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. ఐరాసలో అంతర్భాగమైన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలపై ఇందులో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ప్రమాణాలు, ప్రధానంగా బాలికా విద్యలో వచ్చిన విప్లవాత్మక మార్పులపై నిర్వహించిన ‘నాడు–నేడు’ స్టాల్ను శుక్రవారం పలు దేశాల ప్రతినిధులు సందర్శించి కితాబిచ్చారు. ప్రధానంగా 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతర నీటి సదుపాయంతో వాష్రూమ్లు, తాగునీరు, స్వేచ్ఛ పేరుతో శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీతో బాలికలు చేరికలు పెరగడం, ఇంగ్లీష్లో బోధన, బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్, విద్యా కానుక, ట్యాబ్ల పంపిణీ, ఐఎఫ్పీ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ విద్యా బోధన లాంటివి ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించాయి. వేగంగా మెరుగైన ఫలితాలు.. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్కుమార్ ఏపీలో విద్యా సంస్కరణల గురించి వివరించారు. సుస్థిర అభివృద్ధిలో విద్య పాత్ర కీలకమని బలంగా నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యలో లింగ వివక్ష, అసమానతలను తొలగించేందుకు చేపట్టిన నాడు–నేడు పథకం ద్వారా తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలను సాధించినట్లు చెప్పారు. ఐరాస సదస్సుకు మన విద్యార్థులు తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించడంపై కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు ముఖ్య అధికారి జూడీ ప్రశంసలు కురిపించారు. మన విద్యార్థులతో ముచ్చటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఉన్నవ షకిన్ కుమార్ తెలిపారు. విద్యారంగంలో బాలికలు సాధించిన ప్రగతిని క్యాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ అభినందించారన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరిగే ఐరాస ప్రత్యేక సదస్సుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లనున్నారు. ఐరాస ప్రతినిధులతో పాటు వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంకు సదస్సులో పలు దేశాల ప్రతినిధులను మన విద్యార్థులు కలుసుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను స్వయంగా వివరించనున్నారు. బాలిక విద్యకు ప్రశంసలు కోవిడ్ను అధిగమించి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతిపై సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు చర్చించారు. ఏపీలో చేపట్టిన విద్యా సంస్కరణలు, చదువులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా సాకారమైన మార్పులను ప్రశంసించారు. బాలిక విద్యకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, వారు సాధిస్తున్న విజయాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించాయి. మన విద్యార్థులను కలసి స్వయంగా మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్లో జరిగే సదస్సుకు రాష్ట్రం నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లాలని నిర్ణయించాం. – ఉన్నవ షకిన్ కుమార్, ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ -
విద్యావ్యవస్థలో ఏఐ భాగం కావాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు, యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లతో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాం. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ విధానాన్ని తీసుకురావాలి. విద్యారంగంలో టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. టెక్నాలజీని ఉపయోగించి మార్పులు తీసుకురావాలి. అధునాతన పద్ధతిలో వైద్య విద్యార్థులకు బోధన ఉండాలి. మన విద్యార్థులు క్రియేటర్లుగా ఉండాలి. విద్యార్థులకు కావాల్సిన కోర్సులు, లెర్నింగ్ ఆప్షన్స్పై చర్చించాలి. రానున్న రోజుల్లో సిలబస్ విధానం మార్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యా సంస్థలతో ఎంవోయూలు పెంచుకోవాలి. విద్యావ్యవస్థలో ఏఐ భాగం కావాలి.. రానున్న రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు వస్తాయి. విద్యావ్యవస్థలో ఏఐని భాగం చేయాల్సిన అవసరం ఉంది. అగ్మెంటేషన్ రియాల్లీలను బోధనలో వాడుకోవడంపై దృష్టి సారించాలి. మన ఫ్యాకల్లీ కూడా ఆ స్థాయిలో పిల్లలకు విద్యనందించాలి. విద్యారంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్ను పూడ్చాలంటే.. ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు చేయాలి. ఉన్నత విద్యా రంగంలో వైస్ఛాన్సలర్లది కీలక పాత్ర. టెక్నాలజీ పరంగా చూస్తే.. మొదటి రివల్యూషన్ 1784లో స్టీమ్తో రైలు ఇంజన్ రూపంలో చూశాం. తర్వాత 100 ఏళ్ల తర్వాత విద్యుత్ రూపంలో మరొక రివల్యూన్ చూశాం. మూడోది 1960–70 ప్రాంతంలో కంప్యూటర్లు, ఐటీ రంగం రూపేణా మరొక విప్లవం చూశాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో నాలుగో విప్లవం దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో విద్యావిధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చబోతోంది. ఈ అడుగులో మనం వెనుకబడితే.. కేవలం అనుసరించే వాళ్లుగానే మనం మిగులుతాం. సరైన సమయంలో తగిన విధంగా అడుగులు వేయగలిగితే.. మనం ఈరంగాల్లో నాయకులమవుతాం. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. దీన్ని వినియోగించుకుని, సామర్ధ్యాన్ని పెంచుకునే వర్గం ఒకరు అయితే, ఏఐని క్రియేట్ చేసేవారు.. మరొక వర్గంగా తయారవుతారు. మనం క్రియేటర్లుగా మారాలి.. గతంలో స్టీం ఇంజిన్, ఎలక్ట్రిసిటీ, కంప్యూటర్ విప్లవాల్లో మనం వెనకడుగులోనే ఉన్నాం. మనం ఏదీ క్రియేట్ చేసే పరిస్థితిలో లేం. అందుకనే ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం క్రియేటర్లుగా మారడం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ రంగంలో మనం లీడర్లుగా తయారు కావడం చాలా ముఖ్యం. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మనం క్రియేటర్లుగా తయారు కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒకవైపు మన విద్యావిధానంలోకి తీసుకువచ్చి.. విద్యార్థులకు బోధన, నేర్చుకునే సమర్థతను పెంచుకోవడంలో ఎలా వాడుకోవాలి? అన్న కార్యక్రమం చేస్తూనే.. రెండోవైపున ఏఐ క్రియట్ చేసే స్కిల్స్, టాలెంట్ను కూడా మన పిల్లల్లోకి తీసుకుని రావాలి. ఇది కూడా కరిక్యులమ్లో భాగం కావాల్సిన అవసరముంది. మార్పులకు శ్రీకారం.. ఇటీవలే జర్మన్ కాన్సులేట్ జనరల్ నన్ను కలిశారు. జర్మనీ లాంటి దేశంలో నైపుణ్యం ఉన్న మానవవనరుల కొరత ఉందని చెప్పారు. పాశ్చాత్య ప్రపంచం అంతా డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ ఎదుర్కొంటోంది. మనదేశంలో, మన రాష్ట్రంలో సుమారు 70శాతం మంది పనిచేసే వయస్సులో ఉన్నారు. వీరికి సరైన నాలెడ్జ్, స్కిల్స్ ఇవ్వలేకపోతే మనం ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా ఉండలేం. ఇది వాస్తవం. అందుకే విద్యారంగంలో మార్పులకు మనం శ్రీకారం చుట్టాలి. ఏ రకమైన మార్పులకు శ్రీకారం చుడితే.. మనం అనుకున్నట్టు ఫలితాలు ఉంటాయి, విద్యారంగంలో ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం అన్నదానిపై ఆలోచనలు చేయాలి. మన పిల్లలు లీడర్లుగా ఉండాలి.. నలుగురితో నేను మాట్లాడి... నాకు అనిపించిన ఆలోచనలన్నింటినీ కూడా వీసీల ముందు ఉంచుతున్నాను. ఈ ఆలోచనలు కార్యాచరణలోకి రావాలి, వీటికి రూపకల్పన జరగాలి. ఇందులో మీ పాత్ర గరిష్టంగా ఉండాలి. ఈరోజు మనం మొట్టమొదటి అడుగు వేస్తున్నాం. ఈ తొలి అడుగు మన ఆలోచనలను చైతన్యం చేయడం ద్వారా విద్యారంగాన్ని ఇప్పుడున్న స్థాయి నుంచి మెరుగైన స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రపంచస్థాయిలో మన పిల్లలను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. ఇవాళ మనం చదివిస్తున్న, చదువుకుంటున్న చదువులు నిజంగానే.. ప్రపంచస్థాయిలో నాయకులుగా నిలబడగలిగే స్థాయిలో ఉన్నాయా? లేకపోతే.. ఎలా చేయాలన్న దానిపై ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకు చదువులు చెప్తే విధానాలను పరిశీలిస్తే.. మనం కొన్ని సబ్జెక్టులను నిర్దేశిస్తున్నాం. ఒకసారి వెస్ట్రన్ కరిక్యులమ్ చూస్తే.. వెస్ట్రన్ వరల్డ్లో... ఒక ఫ్యాకల్టీని తీసుకుంటే.. చాలా వర్టికల్స్ కనిపిస్తాయి. విద్యార్థులకు మరిన్ని ఆప్షన్స్ ఇవ్వాలి.. ఒక బీకాంలోనే అసెట్ మేనేజ్మెంట్, ఫైనాన్సియల్ మార్కెట్, రిస్క్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అనాలసిస్ ఇలాంటి వర్టికల్స్ ఎన్నో ఉన్నాయి. మన దగ్గర లేవు. మంచి డిగ్రీ రావాలంటే విదేశాలకు పోవాల్సిందే. మనం కూడా చదువుకునే విద్యార్థులకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వాలి. వారు కావాల్సిన వర్టికల్స్ చదువుకునే అవకాశాలను ఇవ్వాలి. మనం డిగ్రీలకు సంబంధించి తాజాగా క్రెడిట్స్ఇస్తున్నాం. కానీ, వాటి స్థాయిని కూడా పెంచాల్సి ఉంది. పిల్లలకు కావాల్సిన కోర్సుల్లో బోధన అందించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేయడానికి ప్రతీ ఫ్యాకల్టీలో మనం క్రియేట్ చేయగలగాలి. దీనిపై ప్రతి వీసీ కూడా ఆలోచన చేయాలి. ఇవేకాకుండా రకరకాల అంశాల్లో అడుగులు పడాల్సి ఉంది. మనం ఇచ్చే డిగ్రీలకు సంబంధించి కూడా మార్పులు రావాల్సి ఉంది. ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. వైద్య రంగంలో ఎన్నో మార్పులు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను పూర్తిగా వినియోగించుకోవాలి. సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వర్టికల్ కోర్సులకు సంబంధించి బోధన చేసే స్థాయిలో మనం ఉన్నామా? లేదా? అన్నదికూడా చూడాలి. ఒకవేళ లేకపోతే.. అలాంటి కోర్సులు కావాలనుకునే విద్యార్థులకు బోధనను నిలిపేస్తామా? అంటే నిలిపివేయలేం. వర్చువల్ రియాలిటీని తీసుకునివచ్చి ఆగ్మెంటెడ్ రియాలిటీతో కలుపుతాం. ఎప్పుడైతే ఈ రెండూ కలిసాయో.. వర్చువల్ క్లాస్ టీచర్ విద్యార్ధులకు పాఠాలు చెబుతారు. ఆ మేరకు తరగతుల నిర్వహణ ఉండాలి. మెడికల్ కోర్సుల బోధనలో కూడా మార్పులు గణనీయంగా రావాల్సి ఉంది. 5 ఏళ్ల మెడికల్ కోర్సు రాబోయే రోజుల్లో ఇవాళ సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్టుగా కూడా మార్పులు రావాలి. శరీరాన్ని కోసి ఆపరేషన్ చేసే రోజులు పోయాయి. కేవలం కొన్ని హోల్స్ చేసి.. కంప్యూటర్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడకుని ఆపరేషన్ చేసే స్థాయి వచ్చింది. అందుకే వైద్యులకు రోబోటిక్స్, ఏఐలను పాఠ్యప్రణాళికలో, బోధనలో భాగస్వామ్యం చేయాలి. హర్యానాలోని ఒక మెడికల్ కాలేజీలో కూడా దీనికి సంబంధించిన కోర్సులనుకూడా పెట్టారు. కేవలం మెడిసిన్లో చికిత్సకు సంబంధించిన జ్ఞానం ఇవ్వడమేకాదు, టెక్నాలజీని ఎలా వాడుకోవాలన్న దానిపై పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్ టెక్నాలజీని అవగాహన చేసుకోవాలి. దాన్ని కరిక్యులమ్లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దాన్ని వినయోగించుకోవడం, ఆ రంగాల్లో బోధనను మెరుగుపరచడం చేయాలి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దీనికి సంబంధించిన కంటెంట్ అందుబాటులో ఉంది. అందులో వర్చువల్ రియాల్టీ, అగమెంటెడ్ రియాల్టీని కరిక్యులమ్లోకి తీసుకునిరావాలి. వ్యవసాయంలో కూడా గణనీయ మార్పులు.. వ్యవసాయం చేసే తీరుకూడా గణనీయంగా మారిపోతోంది. మన రాష్ట్రంలో గ్రామస్థాయిలో ఆర్బీకేలను తీసుకుని రావడం ద్వారా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. గణనీయ మార్పులు తీసుకు వచ్చాం. గ్రామ స్ధాయిలో చేయిపట్టుకుని నడిపే వ్యవస్ధను తీసుకొచ్చాం. ఈ అడుగులు ఇక్కడితో ఆగిపోకూడదు. ప్రతి రైతును, ప్రతి ఎకరాలో సాగును కూడా చేయిపట్టుకుని నడిపించుకునే స్థాయికి వెళ్లాలి. ప్రతి ఎకరాలో భూసార పరీక్ష చేస్తాం. శాటిలైట్ ఇమేజ్ ద్వారా భూమిలో ఉన్న కాంపోజిషన్ చెప్పే పరిస్థితి ఉంది. డ్రోన్ల ద్వారా భూసారం ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది. ఈ రిపోర్ట్ ద్వారా ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకుని రావచ్చు. దీని ద్వారా ఆ పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో ఇట్టే తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీని మనం పిల్లలకు నేర్పకపోతే.. మనం వెనకబడతాం. ప్రశ్నా పత్నం విధానం మారాలి.. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్ గాని చూస్తే.. వీళ్ల పాఠ్యపుస్తకాలు, వీళ్ల బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాలు రూపొందించే విధానం.. చాలా విభిన్నంగా ఉంటుంది. మనకు, వీరికీ తేడా ఎందుకు ఉంటుంది? అన్నదానిపై ఆలోచన చేయాలి. మన పిల్లలకు మంచి సబ్జెక్ట్ జ్ఞానం ఉండొచ్చు.. కానీ, వెస్ట్రన్ దేశాల మాదిరిగానే అక్కడ రూపొందించే ప్రశ్నలకు సమాధానాలు నింపే పరిస్థితుల్లో ఉన్నారా? అన్నది చూడాలి. ప్రశ్నా పత్నం విధానం మారాలి. వెస్ట్రన్ వరల్డ్ ఎలా బోధిస్తుందన్నది మన కరిక్యులమ్లోకి రావాలి. ఇవేమీ చేయకపోతే మనం వెనకబడి ఉంటాం. అక్కడ పాఠ్యపుస్తకాలు కూడా పిల్లలకు ఇచ్చి.. సమాధానాలు రాయించి.. ప్రాక్టికల్ అప్లికబిలిటీ ఉందా? లేదా? అని చూస్తారు. మనం ప్రాక్టికల్ అప్లికబులిటీ ఆఫ్ నాలెడ్జ్ను తీసుకునిరావడం లేదు. అందుకే ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి. ఇవన్నీకూడా అత్యంత కీలకమైన అంశాలు. ఇవన్నీ చేయాల్సిన మార్పులు. ఇవి చేయకపోతే వెనుకబడతాం. ఇవన్నీ చేయాలంటే.. ఎలా చేయాలి? ఎలా చేయగలుగుతాం? అన్నది ఆలోచన చేయాలి. ఒక్కో యూనివర్శిటీ ఒక్కో రకంగా కరిక్యులమ్ తయారు చేయలేదు. ఒక్కో మాదిరిగా ఉండలేదు. మనం చేస్తున్న విజన్ కోసం ఒక హైలెవల్ అకడమిక్ బోర్డు మనకు అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఈ బోర్డును ఏర్పాటు చేద్దాం. ఆ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్లకు పైన చెప్పిన అంశాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఈ మార్పులతో కరిక్యులమ్ను రీడిజైన్ చేద్దాం. పాఠ్యప్రణాళికను, బోధనను, ప్రశ్నపత్రాల తీరును మారుద్దాం. వర్చువల్ రియాలిటీ, ఏఐ టెక్నాలజీని పాఠ్యప్రణాళికలో భాగం చేద్దాం. బోధనలో కూడా వాడుకుందాం. ఇవన్నీ అత్యంత సమర్ధవంతంగా ఎలా చేయాలన్నదానిపై ఆలోచన చేయడానికే బోర్డు ఏర్పాటు చేద్దాం. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే మార్పులు రావాలి.. కేవలం ఉన్నత విద్యాస్థాయిలోనే మార్పులు చేస్తే ఫలితాలు రావు. ప్రాథమిక విద్యాస్థాయి నుంచే ఈ మార్పులు రావాలి. ఆ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు పడ్డాయి. స్కూళ్లను ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలోకి మార్పు చేశాం. బైలింగువల్ పాఠ్యపుస్తకాలు ఇచ్చాం. ఆరోవ తరగతి ఆ పైనున్న తరగతులను డిజిటల్ క్లాస్ రూమ్స్లా మార్చాం. తరగతి గదుల్లో ఐఎఫ్పీ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబరు నాటికి 6వ తరగతి ఆపై తరగతులకు చెందిన 63వేల క్లాస్రూమ్స్ను ఐఎఫ్పి ఫ్యానెల్స్తో డిజిటలైజ్ చేస్తున్నాం. ఇప్పటికే 31వేల తరగతి గదులకు ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. బైజూస్ కంటెంట్ను ఇంటిగ్రేట్ చేశాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు ఇచ్చాం. దీనికి తదుపరిగా తీసుకు రావాల్సిన మార్పులు తీసుకురావాలి. వీఆర్, ఏఆర్, ఏఐలని టెక్నాలజీని వాడుకుని వారికి మంచి బోధన, నేర్చుకునే సమర్థతను పెంచాలి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటర్లుగా కూడా తొలిఅడుగులు అక్కడ పడాలి. అందుకే పాఠశాల విద్య స్థాయిలో ఒక బోర్డును, హయ్యర్ఎడ్యుకేషన్ లెవల్లో మరొక బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలి. పౌండేషన్ లెవల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తీసుకుంటున్న చర్యలను సినర్జీ చేయాలి. కలను సాకారం చేసుకోవాలి.. నా ఆలోచనలను తదుపరిస్థాయికి మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో పలు విధానాలు ఇప్పటికే వచ్చేశాయి. కాని వాటి ఫ్యాకల్టీలో మనం వెనకబడి ఉన్నాం. కంటెంట్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది. దాన్ని ఎలా వాడుకోవాలి అన్నదానిపై మనం ఆలోచన ఉండాలి. శిక్షణ ఇచ్చుకుంటూ పోతే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధం అవుతారు. ఆ రకంగా దీన్ని అధిగమించాలి. దీనిపై మరిన్ని సాలోచనలు చేయడానికి నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయాలి. మెడికల్, ఇంజనీరింగ్తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్యప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి. మన కలను సాకారం చేసుకోవాలి అని సూచనలు చేశారు. ఇది కూడా చదవండి: రామోజీ కథ, బాబు నిర్మాత, పవన్ యాక్టర్: ఎంపీ భరత్ సీరియస్ -
జీఆర్టీ జ్యువెలర్స్ చేయూత: రూ. 50 లక్షల స్కాలర్షిప్స్
హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థుల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ‘జీఆర్టీ జ్యువెలర్స్’ చేయూత అందించింది. ఈ విద్యా సంవత్సరం(2023-24) మొదటి లేదా రెండో ఏడాది ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులు చదువుతున్న వారికి స్కాలర్ షిప్స్ అందించింది. అర్హులైన 100 మంది విద్యార్థులకు రూ.50 లక్షల ఉపకార వేతనాలు మంజూరు చేసింది. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయితే డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ సాయం కొనసాగుతుందని వెల్లడించింది. ఉన్నత విద్య ద్వారానే సామాజిక చైత్యనం అభివృద్ధి చెందుతుందని కంపెనీ తెలిపింది. -
జాతీయస్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం
ఢిల్లీ: జాతీయ స్థాయిలో ఏపీ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు అగ్రస్థానం దక్కింది. 2021-22 రాష్ట్రాల విద్యా వ్యవస్థ పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ను కేంద్రం విడుదల చేయగా, అందులో ఏపీకి ప్రథమ స్థానం లభించింది. 73 అంశాలకు 1000 పాయింట్ల ఆధారంగా కేంద్రం గ్రేడింగ్ ఇవ్వగా, 902 పాయింట్లతో ఏపీ అగ్రస్థానం దక్కించుకుంది. లెర్నింగ్ అవుట్కమ్లు (LO), యాక్సెస్ (A), ఇన్ఫ్రాస్ట్రక్చర్ & ఫెసిలిటీస్ (IF), ఈక్విటీ (E), గవర్నెన్స్ ప్రాసెస్ (GP) & టీచర్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (TE&T) అనే ఆరు అంశాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చారు. చదవండి: నెట్టింట అభిమానం: జగనన్న పాలనలో.. మహానేత కలగన్న గ్రామస్వరాజ్యం -
వాటిల్లో కుల వివక్ష తీవ్రమైన అంశం
న్యూఢిల్లీ: ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులపై కుల వివక్షను ప్రదర్శించడం అత్యంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశమని సుప్రీం కోర్టు పేర్కొంది. కుల వివక్షను రూపుమాపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో , ఏయే చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారో తెలపాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని ఆదేశించింది. కులపరమైన వివక్షను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన హైదరాబాద్కు చెందిన రోహిత్ వేముల, ముంబైకు చెందిన పాయల్ తాడ్విల తల్లులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎ.ఎస్. బొపన్న, ఎంఎం. సంద్రేశ్లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఈ వివక్షను పారద్రోలడానికి చేపట్టిన చర్యలేంటో వెల్లడించాలని యూజీసీకి ఆదేశాలు జారీ చేసింది. ‘‘ఇది తీవ్రమైన అంశం. వారి ఆందోళల్ని మీరు ఎలా చూస్తున్నారు ? కులవివక్షకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టారు ? ఈ సమస్య పరిష్కారానికి యూజీసీ నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలి. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి’ కోర్టు∙యూజీసీ తరఫు∙లాయర్కు చెప్పింది. రోహిత్ వేముల, తాడ్వి తల్లుల తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ ఇందిర కొడుకు, కూతురిని పోగొట్టుకున్న వారి మనోవేదన తీర్చలేదని అన్నారు. వీరిద్దరే కాకుండా గత ఏడాది కాలంలో మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్షను తట్టుకోలేక నిండు ప్రాణాలను బలి తీసుకున్నారని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు. -
మన వర్సిటీలు ప్రపంచంలో మేటి
న్యూఢిల్లీ: విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో అమల్లోకి తీసుకొచి్చన విధానాలు, తీసుకున్న నిర్ణయాలతో భారతీయ విశ్వవిద్యాలయాలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన వర్సిటీలు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో క్యూఎస్ గ్లోబల్ ర్యాంకింగ్స్లో కేవలం 12 భారతీయ యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 45కు చేరుకుందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఎన్ఐటీల సంఖ్య పెరిగిందని చెప్పారు. నవ భారత నిర్మాణంలో అవి విశిష్టమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన తన అమెరికా పర్యటనను మోదీ ప్రస్తావించారు. మన దేశ యువత పట్ల ప్రపంచానికి విశ్వాసం పెరిగిందన్నారు. అమెరికాతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటివల్ల అంతరిక్షం, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధ వంటి కీలక రంగాల్లో మన దేశ యువతకు నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. మన విద్యా వ్యవస్థకు ఘన చరిత్ర మైక్రాన్, గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు భారత్లో పెట్టుబడులు భారీగా పెట్టబోతున్నాయని, మనదేశ ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ యూనివర్సిటీ అంటే కేవలం ఒక విద్యాలయం కాదని, ఒక ఉద్యమమని వ్యాఖ్యానించారు. ప్రాచీన కాలంలో నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు సంతోషానికి, సౌభాగ్యానికి వనరులుగా నిలిచాయని చెప్పారు. భారతీయ విద్యావ్యవస్థకు ఘన చరిత్ర ఉందన్నారు. విదేశీయుల నిరంతర దాడుల వల్ల భారతీయ విద్యావ్యవస్థ కుప్పకూలిందని, తద్వారా అభివృద్ధి ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం అనంతరం వర్సిటీలు నైపుణ్యం కలిగిన యువతను దేశానికి అందించాయని, అభివృద్ధికి పాటుపడ్డాయని మోదీ ప్రశంసించారు. ‘యుగే యుగే భారత్’ మ్యూజియం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గిరిజన ప్రదర్శనశాలలు(మ్యూజియమ్స్) ఏర్పాటు చేశామని, ఢిల్లీలోని ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం’ ద్వారా స్వతంత్ర భారత్ అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకోవచ్చని నరేంద్ర మోదీ చెప్పారు. ‘యుగే యుగే భారత్’ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద హెరిటేజ్ మ్యూజియాన్ని ఢిల్లీలో నిర్మిస్తున్నామని తెలిపారు. మన స్టార్టప్ కంపెనీల సంఖ్య లక్ష మార్కును దాటిందన్నారు. 2014లో కేవలం వందల సంఖ్యలోనే స్టార్టప్లు ఉండేవన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనాలు, నార్త్ క్యాంపస్ అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి ప్రధాని పునాదిరాయి వేశారు. ఢిల్లీ యూనివర్సిటీ 1922 మే 1న ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ వర్సిటీలో 86 డిపార్ట్మెంట్లు, 90 కాలేజీలు ఉన్నాయి. మెట్రో రైలులో మోదీ ప్రయాణం ప్రధాని మోదీ శుక్రవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన మెట్రో రైలులో వచ్చారు. రైలులో విద్యార్థులతో సరదాగా సంభాíÙంచారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన మెట్రో రైలు ప్రయాణ అనుభవాన్ని పంచుకున్నారు. ఓటీటీల్లో ప్రసారమవుతున్న కొత్త వెబ్ సిరీస్ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఏ వెబ్ సిరీస్ బాగుంది? ఏ రీల్స్ బాగున్నాయో వారు చెప్పగలరని పేర్కొన్నారు. మాట్లాడేందుకు విద్యార్థుల వద్ద ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు. సైన్స్ నుంచి ఓటీటీల్లోని కొత్త వెబ్ సిరీస్ల దాకా చాలా విషయాలను వారితో మాట్లాడొచ్చని వెల్లడించారు. ఏ ఒక్క అంశాన్నీ వారు వదిలిపెట్టరని వ్యాఖ్యానించారు. భూగోళంపై ఉన్న అన్ని అంశాలను విద్యార్థులు చక్కగా చర్చించగలరని ట్వీట్ చేశారు. -
విద్యారంగంలో ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చింది
-
విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు: మంత్రి బొత్స
-
నాలుగో ఏడాదీ ‘జగనన్న అమ్మ ఒడి’
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. తద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి అమ్మ ఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా అందచేసే డబ్బులతో కలిపితే ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. నాలుగేళ్లలో విద్యా రంగానికి రూ.66,722.36 కోట్లు విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ చదువులకు దూరం కారాదనే సంకల్పంతో విద్యారంగంపై పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అది భావి తరాల ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా మార్చి ప్రైవేట్ స్కూళ్లే సర్కారు విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితిని కల్పించారు. పేద విద్యార్థులను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దుతూ ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ విధానంలో బోధన నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ ఉచితంగా అందిస్తున్నారు. పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. నాడు–నేడు తొలిదశ పనులు పూర్తైన స్కూళ్లలో ఆరు, ఆపై తరగతుల నుంచి డిజిటల్ తరగతి గదులను తీసుకొచ్చారు. ఆన్లైన్తోపాటు ఆఫ్లైన్లో కూడా పనిచేసేలా బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను విద్యార్థులకు అందించి ప్రపంచంతో పోటీ పడేలా వెన్ను తడుతున్నారు. మన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉన్నత చదువులు చదివేలా జగనన్న విదేశీ విద్యా దీవెనతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఆదుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లీషులో నైపుణ్యాలను సాధించేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్’ పరీక్షలకు సన్నద్ధం చేసి సర్టిఫికెట్లు అందించేలా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అమెరికా సంస్థ ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాగా విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తూ జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు టెన్త్, ఇంటర్లో ఉత్తీర్ణులు కాకపోయినా తిరిగి తరగతులకు హాజరైతే వారికి కూడా అమ్మ ఒడిని వర్తింపచేయాలని నిర్ణయించారు. -
అమ్మ ఒడితో 100 శాతం సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలతో ముఖ్యంగా జగనన్న అమ్మఒడి ద్వారా నూటికి నూరు శాతం సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అమ్మ ఒడి ద్వారా ప్రాథమిక విద్యలో జాతీయ స్థాయిని మించి చేరికలు నమోదైనట్లు వెల్లడైంది. గతేడాది ప్రాథమిక విద్యలో జాతీయ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) 100.13 ఉండగా ఆంధ్రప్రదేశ్లో 100.80కి చేరింది. అమ్మ ఒడి ద్వారా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ విద్యలో జీఈఆర్ పెరిగినట్లు ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి స్పష్టం చేశారు. మండల, జిల్లా స్థాయిల్లో నూరు శాతం జీఈఆర్ నమోదుకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లుగా ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యలో జీఈఆర్ పెరుగుతూ వస్తోంది. 2020 జనవరి 9వతేదీన జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి పథకం కింద ఇప్పటి వరకు 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.19,674.34 కోట్లు జమ చేశారు. 2023–24కి సంబంధించి ఈ నెల 28న అమ్మ ఒడి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రాథమిక విద్యలో 2018లో జాతీయ స్థాయిలో జీఈఆర్ 96.09 ఉండగా రాష్ట్రంలో 92.91 ఉంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమ్మ ఒడితో పాటు పలు పథకాలను అమలు చేయడంతో 2019–20 నుంచి వరుసగా ప్రాథమిక విద్యలో జీఈఆర్ పెరుగుతూ 2022–23 నాటికి జాతీయ స్థాయిని మించి 100.80కి చేరింది. సెకండరీ విద్యలో 2018–19లో జీఈఆర్ 79.69 ఉండగా 2022–23 నాటికి 89.63కి చేరింది. ఉన్నత విద్యలో రాష్ట్రంలో 2018–19లో జీఈఆర్ 46.88 ఉండగా 2022–23 నాటికి 69.87 శాతానికి జీఈఆర్ పెరగడానికి ప్రధాన కారణం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన తదితరాలు కారణమని స్పష్టం అవుతోంది. టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్ధులు చదువు మానేస్తున్నారు. ఉన్నత విద్యలో జీఈఆర్ను మరింత పెంచడంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వారిని రెగ్యులర్ తరగతుల్లో అవే కోర్సుల్లో తిరిగి చేర్చుకునేందుకు అనుమతించింది. ఈమేరకు మిషన్, విజన్ పేరుతో ఈ ఏడాది ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ను వలంటీర్ల ద్వారా అమలు చేస్తోంది. అంతేకాకుండా పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిలై తిరిగి రెగ్యులర్ తరగతుల్లో చేరిన విద్యార్ధులకు కూడా జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
గోల్డెన్ చాన్స్! సర్కారు బడి పిల్లలకు 'గ్లోబల్ చదువులు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో ఇప్పటికే పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్గా తీరిదిద్దేందుకు తాజాగా మరిన్ని చర్యలు చేపట్టింది. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా, మారుతున్న టెక్నాలజీ రంగంలో విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దేలా మరో అడుగు ముందుకేసింది. భవిష్యత్ టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నైపుణ్యాలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దనుంది. వారికి హైఎండ్ టెక్నాలజీ రంగంలో ఉన్నతోద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, గ్లోబల్ టెక్ కంపెనీల ప్రతినిధులతో ఉన్నత స్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది. పాఠ్య ప్రణాళిక, ఉండాల్సిన మానవ వరులు, సదుపాయాలపై ఈ వర్కింగ్ గ్రూప్ నివేదిక ఇవ్వనుంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమ్మ ఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యాదీవెన వంటి పథకాలతోపాటు పాఠ్య ప్రణాళిక, మౌలిక సదుపాయాల పరంగా ఎన్నో మార్పులు తీసుకు వచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు 41 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందుతున్నాయి. తెలుగు– ఇంగ్లిష్లో టెక్స్ట్ బుక్స్ విప్లవాత్మక నిర్ణయాలకు అనుగుణంగా, విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యాకానుక కింద సైన్స్, సోషల్ స్టడీస్, మాథమెటిక్స్ సబ్జెక్టుల్లో బైలింగ్వల్ (ఒక పేజీలో ఇంగ్లిష్, మరో పేజీలో తెలుగు) టెక్స్ట్ బుక్స్ను రూపొందించి విద్యార్థులకు అందించింది. ఇంగ్లిష్లో భాషా పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఇంగ్లిష్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసింది. 2021–2౨లో ఆరో తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆక్స్ఫర్డ్ డిక్షనరీని, మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ పిక్టోరియల్ డిక్షనరీని అందించింది. సబ్జెక్ట్ టీచర్.. డిజటల్ బోధన బోధనలో మరో కీలక మార్పు సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్. విద్యార్థులకు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. జాతీయ.. ప్రపంచ స్థాయి విద్యార్థులతో పోటీపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ గుర్తింపు వచ్చేలా 2022–23లో చర్యలు చేపట్టింది. విద్యార్థులకు సైన్స్, సోషల్, మాథమెటిక్స్లో అత్యుత్తమ పాఠ్యాంశాలను అందించడానికి బైజూస్తో ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు అర్థమయ్యేందుకు ఆడియో, విజువల్ రూపంలో బైజూస్ కంటెంట్ను అందించింది. ఇందుకోసం 5,18,740 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించింది. వీటితోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియను విస్తృతంగా, వేగవంతంగా చేపట్టింది. నాడు–నేడు పూర్తి చేసుకున్న 30,213 హైస్కూల్ తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్ (ఐఎఫ్పీ)ను ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం జూలై కల్లా వీటిని ఏర్పాటు చేయనున్నారు. మరో 10,038 ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తోంది. మిగిలిన పాఠశాలల్లో వచ్చే డిసెంబర్ నాటికి ఐఎఫ్పీలు, స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్ పరీక్షలను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. టెక్నాలజీపై సూచనలు ఇచ్చేందుకు వర్కింగ్ గ్రూప్ ప్రపంచ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడాలంటే ఇంగ్లిష్లో ప్రావీణ్యం అవసరం. ప్రపంచ స్థాయి కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ టెక్నాలజీలపై పిల్లలను సుశిక్షతులుగా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), ఎల్ఎల్ఎం ఫ్లాట్ఫాం మీదకు వచ్చే డేటా అనలిటిక్స్ చాట్ జీపీటీ, వెబ్ 3.0, అగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్), వర్చువల్ రియాల్టీ (వీఆర్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెంట్ర్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, అటానమస్ వెహికల్స్, త్రీడీ ప్రింటింగ్, గేమింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు నైపుణ్యం ఇచ్చే అంశాలపై చేపట్టాల్సిన చర్యలు, మార్పులను సూచించేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు సీఎం ఆదేశాలిచ్చారు. విద్యాభ్యాసం తొలినాళ్ల నుంచే ఈ తరహా టెక్నాలజీపై బోధన, సంబంధిత నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళిక, ఇవ్వాల్సిన శిక్షణ, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, లెర్నింగ్ కంటెంట్, ల్యాబ్లు తదితర అంశాలు పాఠశాలల్లో ఎలా ఉండాలన్న దానిపై ఈ వర్కింగ్ గ్రూప్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు ఇలా.. పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఈ వర్కింగ్ గ్రూప్నకు చైర్మన్గా, పాఠశాలల మౌలిక సదుపాయాల కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి, స్కూలు ఎడ్యుకేషన్ కమిషనర్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. మైక్రోసాఫ్ట్ ఇండియా నుంచి అశుతోష్ చద్దా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా నుంచి షాలినీ కపూర్, గూగుల్ సంస్థ ప్రతినిధి, ఇంటెల్ ఏసియా నుంచి శ్వేత ఖురానా, నాస్కాం ప్రతినిధి, సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు జైజిత్ భట్టాచార్య, నీతి ఆయోగ్ డిజిటల్ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారు అర్చన జి.గులాటి వర్కింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జూలై 15 నాటికల్లా ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. -
చదువులకూ పెద్దన్నే..
అమెరికా సంయుక్త రాష్ట్రాలు..! కొందరికి అగ్రరాజ్యం.. దేశాలకు పెద్దన్న.. మరికొన్నింటికి కుట్రదారు, శత్రువు.. కానీ ప్రపంచం మొత్తం అంగీకరించే ఓ అంశంలో పైచేయి ఆ దేశానిదే.. అదే అత్యుత్తమ ఉన్నత విద్య. రెండు వందలకుపైగా దేశాలున్న ఈ భూమ్మీద ఒక్క అమెరికానే ఎక్కువమంది విదేశీ విద్యార్థులను ఎందుకు ఆకర్షిస్తోందో తెలుసా? రెండు లక్షల మంది.. గత ఏడాది ఒక్క భారతదేశం నుంచే ఉన్నత చదువుల కోసం అమెరికాకు చేరిన విద్యార్థుల సంఖ్య ఇది. గత ఏడాది మొత్తంగా 200 దేశాలకు చెందిన 9.48 లక్షల మందికిపైగా విద్యార్థులు అమెరికాలోని నాలుగు వేలకుపైగా ఉన్న యూనివర్సిటీల్లో చేరడం గమనార్హం. దీనికి ఎన్నో కారణాలు. అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, విస్తృత అవకాశాలు, వైవిధ్యత, చదువుకోవడంలో రకరకాల వెసులుబాట్లు, అంతర్జాతీయ గుర్తింపు, స్కాలర్షిప్లు.. ఇలా మరెన్నో సానుకూల అంశాలు విద్యార్థులను అమెరికా వైపు ఆకర్శిస్తున్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు టాప్! అమెరికా మొత్తమ్మీద ఉన్నత విద్యనందించే సంస్థలు నాలుగు వేలకుపైనే ఉన్నాయి. అత్యాధునిక కృత్రిమ మేధ/మెషీన్ లెర్నింగ్ మొదలుకుని జెనెటిక్ ఇంజనీరింగ్ వరకు.. ఆర్ట్స్, హ్యుమానిటీస్, పొలిటికల్ ఎకానమీ.. ఇలా ఎన్నో రంగాలకు సంబంధించి విస్తృతస్థాయి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నా.. ప్రభుత్వ సంస్థల్లో చేరే విద్యార్థులే ఎక్కువని అక్కడి విద్యాశాఖ గణాంకాలు చెప్తున్నాయి. కాలేజీలు, యూనివర్సిటీల్లో అత్యధికం గ్రాడ్యుయేట్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. కమ్యూనిటీ కాలేజీల్లో రెండేళ్ల కోర్సులుంటాయి. ఇవి సిద్ధాంతాలకు కాకుండా వాస్తవిక జ్ఞానానికి, ఉద్యోగాలకు పనికొచ్చే విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. విదేశీ విద్యార్థుల్లో చాలామంది ఈ కమ్యూనిటీ కాలేజీలు అందించే రకరకాల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చేసి.. తర్వాత ఉన్నత విద్య కోసం ఇతర యూనివర్సిటీల్లో చేరుతుంటారు. హార్వర్డ్, యేల్, బ్రౌన్, ప్రిన్స్టన్ వంటి ప్రైవేట్ యూనివర్సిటీలు విద్యార్థుల ఫీజులతోపాటు దాతలు ఇచ్చే విరాళాలతో నడుస్తూంటాయి. ఎన్నో రకాల వెసులుబాట్లతో.. భారత్లో ఇంటర్మీడియట్లో చదివే కోర్సులే మీరు భవిష్యత్తులో ఏం కావాలని అనుకుంటున్నారో నిర్ణయిస్తాయి. ఎంపీసీ అయితే ఇంజనీరింగ్.. బైపీసీ అయితే వైద్యం. కానీ అమెరికాలో విభిన్న చదువులకు అవకాశం ఉంటుంది. చాలా యూనివర్సిటీల్లోని నాలుగేళ్ల గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లోనూ రెండేళ్లపాటు హ్యుమానిటీస్, నేచురల్ సైన్సెస్, సోషల్ సైన్స్, గణితం వంటి సబ్జెక్టుల్లో కోర్సు చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్ల కోర్సు సమయంలో ఎప్పుడైనా మీరు ఎంచుకున్న మేజర్ (ప్రధాన సబ్జెక్ట్)ను మార్చుకోవచ్చు. ఇంజనీరింగ్ చేస్తూ కంప్యూటర్ సైన్స్ నుంచి కృత్రిమ మేధకు మారిపోవచ్చు. యూనివర్సిటీలో చేరేటప్పుడు ఫలానా సబ్జెక్టు అని ఎంచుకోవాల్సిన అవసరమూ లేదు. యూనివర్సిటీ అందించే వేర్వేరు కోర్సులను దగ్గరి నుంచి పరిశీలించి.. నచ్చిన అంశాన్ని మేజర్గా ఎంచుకోవచ్చు. కచ్చితంగా క్లాస్రూమ్లకు రావాలన్న నియమం లేదు. ఆన్లైన్ కోర్సులు చేయవచ్చు. ఒకేసారి రెండు డిగ్రీలు చదవవచ్చు. ఒక యూనివర్సిటీ నుంచి ఇంకోదానిలోకి మారి కోర్సులు కొనసాగించేందుకూ అభ్యంతరాలు ఉండవు. గుర్తింపు, ఉద్యోగావకాశాలు అమెరికా యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన వారికి ప్రపంచ దేశాలన్నింటిలోనూ తగిన గుర్తింపు ఉంటుంది. చదువుకునే సమయంలోనే వివిధ దేశాల వారితో కలిసిమెలిసి ఉండే అవకాశం లభిస్తుంది. పేరు ప్రతిష్టలున్న అధ్యాపకులు, నిపుణుల నుంచి నేర్చుకుని ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల నెట్వర్క్, ఫార్చ్యూన్–500 కంపెనీల్లో అత్యధికం అగ్రరాజ్యంలోనే ఉండటం వంటి కారణాలతోనూ అమెరికాలో చదివిన వారికి మెరుగైన ఉద్యోగావకాశాలు కలిగిస్తాయి. అమెరికాలో చదువు పూర్తయిన తర్వాత మూడేళ్లపాటు ఆ దేశంలోనే పనిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్ విద్యార్థులకు ఇది ఎంతో విలువైన వృత్తిపరమైన నైపుణ్యాన్ని అందిస్తుంది. దీన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఓపీటీ) అంటారు. యూనివర్సిటీలు స్వయంగా కెరీర్ సర్వీసులను కూడా అందిస్తాయి. విదేశీ విద్యార్థులకు, కంపెనీలకు మధ్య వారధిగా నిలుస్తాయి. రెజ్యూమ్లు ఎలా తయారు చేసుకోవాలన్న చిన్న అంశాల నుంచి కంపెనీలతో కెరీర్ ఫెయిర్లు, మెంటార్షిప్ ప్రోగ్రామ్స్ వరకు సాయం అందిస్తాయి. ఖర్చుల మాటేమిటి? అమెరికా చదువులంటే ఖరీదైనవని చాలామంది అంటూ ఉంటారు. అందులో వాస్తవం కొంతే. జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే.. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం బోలెడన్ని స్కాలర్షిప్లు, గ్రాంట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికితోడు చదువుకునేటప్పుడే పనిచేసుకునేందుకు అవకాశం కల్పించడం, రుణాలు వంటి మార్గాల ద్వారా విద్యాభ్యాసానికయ్యే ఖర్చులను పొందవచ్చు. ♦ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి లభించే ఆర్థిక సాయం ప్రధానంగా రెండు రకాలు. ఒకటి మీ అవసరాలను తీర్చేది. రెండోది మీ ప్రతిభకు అనుగుణంగా దక్కేది. కొన్ని స్కాలర్షిప్స్ ట్యూషన్ ఫీజులతోపాటు అక్కడి రోజువారీ ఖర్చులకు కావాల్సిన మొత్తాలను కూడా అందిస్తాయి. కొన్ని స్కాలర్షిప్లు ట్యూషన్ ఫీజు మొత్తం లేదా అందులో కొంత భాగాన్ని చెల్లిస్తాయి. ♦ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాను ఉదాహరణగా తీసుకుంటే.. విదేశీ విద్యార్థుల కోసం మెరిట్ ఆధారిత స్కాలర్ర్షిప్ లు, క్యాంపస్లో ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీ అవసరాలకు తగిన ఆర్థిక సాయం (నీడ్స్ బేస్డ్ ఫైనాన్షియల్ ఎయిడ్) ఈ యూనివర్సిటీలో లభించదు. ♦ కేవలం గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు మాత్రమే కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు కూడా కొన్ని కాలేజీలు, విద్యాసంస్థలు ఆర్థిక సాయం అందిస్తాయి. ఈ అంశంపై మీకు సాయం అవసరమనుకుంటే ‘ఎడ్యుకేషన్ యూఎస్ఏ’ విభాగాన్ని సంప్రదించవచ్చు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
వచ్చే ఏడాది బైజూస్ ఆకాష్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్.. పరీక్షల సన్నాహక అనుబంధ సంస్థ ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ. 4,000 కోట్ల ఆదాయం అందుకునే మార్గంలో ఉన్నట్లు బైజూస్ పేర్కొంది. రూ. 900 కోట్ల నిర్వహణ లాభాన్ని(ఇబిటా) అంచనా వేస్తోంది. ఇందుకు బోర్డు అధికారిక అనుమతి ఇచ్చినట్లు బైజూస్ వెల్లడించింది. త్వరలోనే మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేయనున్నట్లు తెలియజేసింది. వచ్చే ఏడాది మధ్యలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు తెలియజేసింది. 2021 ఏప్రిల్లో ఆకాష్ ఎడ్యుకేషన్ను రూ. 7,100 కోట్లకు బైజూస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
జగనన్న అందిస్తున్న ‘విద్యాదీవెన’ పథకం వల్ల మా అమ్మాయి చదువుకు మేము అప్పులు చేయాల్సిన అవసరం లేదు..!
-
వస్తున్నారు టాపర్లు! మారిన సర్కారు బడి.. మురిసిన చదువుల తల్లి
వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి దాకా 2019–23 మధ్య విద్యా రంగంలో పలు ప్రగతిశీల మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ సంస్థలను తలదన్నేలా సకల సదుపాయాలతో రూపు దిద్దుకున్నాయి. ‘మనబడి నాడు–నేడు’ పథకంతో ప్రభుత్వ విద్యా సంస్థలు సమూల మార్పులతో సమున్నతంగా మారాయి. ప్రభుత్వం విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అంటే చులకనగా చూసే పరిస్థితి నుంచి ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసి.. టాప్ మార్కులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ సంస్కరణలకు అద్దంపట్టారు. విద్యా రంగ సంస్కరణల కోసమే గత నాలుగేళ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.59,173.72 కోట్లు వెచ్చించింది. ఇందులో భాగంగా జగనన్న అమ్మ ఒడి, మనబడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగు పరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు అమలు చేశారు. స్కూళ్లలో చేపట్టిన నాడు–నేడు పనులు పూర్తయి విద్యార్థులకు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం రెండో దశ పనులు జరుగుతున్నాయి. – సాక్షి, అమరావతి నాలుగేళ్లలోఎంత తేడా! నాడు విరిగిన బెంచీలు.. బీటలు వారిన గోడలు.. పెచ్చులూడే పైకప్పులు.. వర్షం వస్తే సెలవులే.. సగం విద్యా సంవత్సరం పూర్తయ్యే దాకా అందని పాఠ్య పుస్తకాలు, అసలు పిల్లలు బడికి వస్తున్నారో లేదో పట్టించుకోని పరిస్థితి. ఇదీ నాలుగేళ్ల క్రితం వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. నేడు ప్రస్తుతం అందమైన భవనాలు.. పిల్లల కోసం డబుల్ డెస్క్ బెంచీలు.. డిజిటల్ తరగతి గదులు.. ద్విభాషా పాఠ్య పుస్తకాలు.. ఇంగ్లిష్ ల్యాబ్లు, ఆర్వో నీరు.. పరిశుభ్రంగా ఉండే మరుగుదొడ్లు.. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారం, బూట్లు, బెల్టు, పుస్తకాలు పెట్టి స్కూలు బ్యాగు అందజేత.. అన్నింటికీ మించి పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల కానుక. విద్యపై చేసే ఖర్చు భవిష్యత్కు పెట్టుబడి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులను చూశారు. కనీస సదుపాయాలు లేక ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోయి విద్యార్థుల భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వీలుగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే బృహత్తర సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నాడు–నేడు ద్వారా రూ.వేల కోట్ల ని«ధులతో పనులు చేపట్టారు. రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి పరిచేలా కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చారు. 2019–20లో తొలి విడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో కనీసం 9 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. నీటి వసతితో మరుగు దొడ్లు, తాగునీటి సదుపాయం, మేజర్, మైనర్ మరమ్మతులు, విద్యుత్ సదుపాయం, విద్యార్థులు, టీచర్లకు డ్యూయెల్ డెస్కులు, బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు వంటి ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం వంటి వసతులు కల్పించారు. ఆ తర్వాత కిచెన్షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు దీనికి జోడించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యా బోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు, కేజీబీవీలు.. మొత్తంగా తొలివిడతలో 61,661 విద్యా సంస్థల్లో రూ.16,450.69 కోట్లతో పది రకాల సదుపాయాలు కలి్పంచారు. నాడు–నేడు రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అమ్మ ఒడి.. గోరుముద్ద.. విద్యా కానుక పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అమ్మ ఒడి పథకంతో అర్హురాలైన ప్రతి పేద తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇప్పటి దాకా రూ.19,674.34 కోట్లు తల్లులకు అందించింది. జగనన్న గోరుముద్ద పథకంతో నాణ్యమైన, రుచికరమైన పోషకాహారాన్ని మధ్యాహ్న భోజనంగా పిల్లలకు అందించేందుకు రోజుకో రకం మెనూ ప్రకటించింది. వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడు రోజులు చిక్కి (వేరుశనగ, బెల్లంతో తయారీ) పిల్లలకు అందిస్తున్నారు. ఏటా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. పాఠశాలల్లో పిల్లల ఆత్వవిశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం బోధన–అభ్యాస సామగ్రిని సరఫరా చేస్తోంది. అందుకోసం జగనన్న విద్యా కానుకగా ప్రతి కిట్లో ఒక బ్యాగ్, స్టిచింగ్ చార్జీతో సహా 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, జత షూ, రెండు జతల సాక్స్లు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు ఇంగ్లిష్–తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తోంది. ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కింద 47 లక్షల మంది విద్యార్థుల కోసం మూడేళ్లలో రూ.2,368.33 కోట్లు ఖర్చు చేసింది. బోధన, పాఠ్య ప్రణాళికలో సంస్కరణలు వైఎస్సార్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రమాణాలను తీసుకొచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని దశల వారీగా అమలు చేస్తోంది. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ అమలు చేస్తోంది. పునాది స్థాయి నుంచే విద్యా రంగాన్ని పటిష్టం చేసేలా కరిక్యులమ్ సంస్కరణలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఉన్నత పాఠశాలలో పదో తరగతి పాసైన బాలికలందరూ చదువుకు దూరం కాకూడదని ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైసూ్కల్ ప్లస్గా అప్గ్రేడ్ చేసింది. మొత్తం 352 కేజీబీవీలలో ప్లస్ 2 ప్రవేశపెట్టింది. మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం కనీసం ఒక జూనియర్ కళాశాల ఉంది. కోవిడ్ అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం డిజిటల్ లెర్నింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు రూ.686 కోట్లతో బైజూస్ కంటెంట్తో కూడిన 5.18 లక్షల ట్యాబులను ఉచితంగా అందించింది. వీటితో పాటు నాడు–నేడు మొదటి దశలో అభివృద్ధి చేసిన 15,715 పాఠశాలల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి రూ.132.41 కోట్ల లబ్ధి చేకూరింది. -
విద్యావ్యవస్థను సమష్టిగా అభివృద్ధి చేద్దాం
సాక్షి, అమరావతి: విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా సంస్కరణలను కూడా మనమే మొదటిసారి అమలు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఆంధ్రా లయోలా కళాశాలల్లో ‘డిజిటల్ విద్యావిధానం–సాంకేతికతతో కూడిన బోధన–అభ్యాసం’పై మాస్టర్ రిసోర్స్ పర్సన్లకు (ట్రైనర్లకు) శుక్రవారం శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ప్రపంచమంతా పయనిస్తున్న డిజిటల్ బాటలో మన రాష్ట్రం ముందుండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని, అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన సంస్కరణలను, పథకాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. మూడు నాలుగేళ్లలో ‘మన బడి నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా ప్రతి విద్యార్థికి సొంతబిడ్డలా ఉన్నతమైన విద్యను అందించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఏ స్థాయిలో విద్య అందుతుంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు తనిఖీ చేస్తుంటారన్నారు. జగనన్న అమ్మఒడి, మన బడి నాడు–నేడు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశ సంస్కరణల ద్వారా ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. ఇప్పుడు డిజిటల్ విద్యాబోధన ద్వారా తరగతిలో విద్యార్థులకు ఉపాధ్యాయులు మరింత ప్రభావవంతంగా బోధించే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా డిజిటల్ కంటెంట్ను యాక్సెస్ చేయడానికి బైజూస్తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా అందించిన ట్యాబ్లలో బైజూస్ ప్రీమియం కంటెంట్ను సక్రమంగా అందించడం ద్వారా 2024–25 నాటికి విద్యార్థులు సీబీఎస్ఈ సిలబస్తో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేలా సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ ట్యాబుల కోసం రూ.686 కోట్లు వెచ్చించినట్టు చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఎఫ్పీ, స్మార్ట్ టీవీలతో బోధన అన్ని ప్రీ–హైస్కూళ్లు, హైస్కూళ్లలో 6 నుంచి 10 తరగతుల వరకు 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల (ఐఎఫ్పీ)ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి వీటిద్వారా బోధన ఉంటుందన్నారు. ఫౌండేషనల్, ఫౌండేషనల్ ప్లస్ పాఠశాలలకు 10,038 స్మార్ట్ టీవీలు ఇవ్వనున్నట్టు చెప్పారు. మన బడి నాడు–నేడు మొదటివిడత పాఠశాలల్లో వీటిని బిగించేందుకు రూ.352 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు మెరుగైన డిజిటల్ బోధన అందించేందుకు శిక్షణలో పాల్గొన్న జిల్లా రిసోర్సు పర్సన్లు ప్రతి పాఠశాలలో డిజిటల్ విద్యావిధానం చక్కగా అమలయ్యేలా తర్ఫీదు ఇవ్వాలని ఆయన కోరారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ప్రకాశ్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, పాఠశాలవిద్య కమిషనర్ (ఇన్ఫ్రా) కాటమనేని భాస్కర్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రతాప్రెడ్డి, జాయింట్ డైరెక్టర్ (సర్వీసులు) మువ్వా రామలింగం పాల్గొన్నారు. -
ఒకటి, ఒకటి, రెండు, రెండు.. ‘చై-నా’ ర్యాంకులు కాదు.. జగనన్న ఆణిముత్యాలు
ఒకటి.. ఒకటి.. ఒకటి.. రెండు.. రెండు.. రెండు.. అన్నీ చైనా (చైతన్య, నారాయణ) ర్యాంకులు.. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు సాధించిన ర్యాంకులివి... ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ స్కూళ్లు విజయదుందుభి మోగించాయి. వాటిలో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మునుపెన్నడూ ఎరుగని రీతిలో సత్తా చాటారు... రాష్ట్రప్రభుత్వం తల్లిదండ్రులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు.. సంక్షేమ పథకాలు ఒకవైపు.. మౌలిక సదుపాయాలతో సహా స్కూళ్లను సమూలంగా మార్చేస్తున్న నాడు నేడు వంటి కార్యక్రమాలు మరోవైపు.. దారితప్పిన విద్యావ్యవస్థను పట్టాలపైకి ఎక్కించాయి.విద్యార్థులలో పెల్లుబికిన ఉత్సాహం చదువుల విప్లవాన్ని సృష్టించింది. అందుకు పది ఫలితాలు ప్రత్యక్ష నిదర్శనం.. అద్భుతమైన ప్రతిభ చూపించిన ఈ ప్రతిభామూర్తులను ‘జగనన్న ఆణిముత్యాలు’గా ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలతో సత్కరించనుంది. వారిలో కొంతమందితో సాక్షి ముచ్చటించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే... ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది.. పేరు:మిట్టు మహాపాత్రో పాఠశాల: పాతపట్నంప్రభుత్వ స్కూల్ శ్రీకాకుళం జిల్లా మాది పేద కుటుంబం. మా నాన్న వాహనాల టైర్లకు పంచర్లు వేస్తుంటారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాను. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ ఒడియా పాఠశాలలోనూ, 6 నుంచి 10వ తరగతి వరకు పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. చిన్నతనం నుంచి మా చిన్నాన్న రవి మహాపాత్రో ఎక్కువగా చదువుకోవాలని ప్రోత్సాహం అందించారు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. జగనన్న విద్యా కానుక కింద నాకు, అక్కకు పుస్తకాలు, బ్యాగ్, షూ, డ్రస్లు అందించారు. ♦ పదో తరగతిలో 600కు 570 వస్తాయని అనుకున్నాను. 594 మార్కులు వస్తాయని ఊహించలేదు. ప్రశ్నలవారీగా కాకుండా పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకునేవాడిని. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకునేలా పాఠ్యాంశాలను బోధించారు. దీనివల్ల పాఠ్యాంశంలో ఏ ప్రశ్న ఇచ్చినా రాయగలిగాను. సకాలంలో సిలబస్ను పూర్తి చేయడంతో రివిజన్కు ఎక్కువ సమయం కేటాయించేందుకు అవకాశం ఏర్పడింది. రివిజన్లో వెనుకబడిన సబ్జెక్టులకు ఎక్కువ సమయం వెచ్చించాను. ♦ మంచి మార్కులు రావడం పట్ల సంతోషంగా ఉంది. ట్రిపుల్ ఐటీలో చదివి ఇంజనీర్ను కావడమే నా లక్ష్యం. తొలి రోజే విద్యా కానుక అందింది.. పేరు: గోవుల గోకుల కృష్ణారెడ్డి పాఠశాల: కేఎన్నార్ మున్సిపల్ స్కూల్, నెల్లూరు పాఠశాల ప్రారంభం రోజే జగనన్న విద్యాకానుక కింద అన్ని పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, తదితర వస్తువులు ఇచ్చారు. అలాగే నాడు – నేడు కింద పాఠశాలలో అన్ని వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. బెంచీలు, బ్లాక్బోర్డు, సరిపడా గదులు ఉండటం వల్ల ఎలాంటి అసౌకర్యం కలగలేదు. మినిరల్ వాటర్తో పాటు నాణ్యమైన భోజనం అందించారు. అమ్మఒడి కింద రూ.15 వేల నగదును ప్రభుత్వం అందించింది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 593 మార్కులు సాధించడానికి పాఠశాల హెడ్మాస్టరు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. ప్రతి సబ్జెక్టుకు టైమ్ టేబుల్ వేసుకుని దాని ప్రకారం చదివాను. సబ్జెక్టులకు వాటి ప్రాధాన్యత ప్రకారం సమయం కేటాయించా. ముందు ఇంటర్లో మంచి మార్కులు సాధించడమే నా లక్ష్యం. ఆ తర్వాత బెస్ట్ ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతా. నాడు–నేడుతోఅన్ని వసతులు పేరు: పి.శ్రీనివాసరావు పాఠశాల: బీఎన్ఆర్ మున్సిపల్ స్కూల్, గుంటూరు ఒకటో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాను. అయితే అప్పట్లో పాఠ్యపుస్తకాలు మినహా మాకు ఏమీ ఇవ్వలేదు. అదికూడా స్కూళ్లు తెరిచిన రెండు నెలల కానీ చేతికి ఇచ్చేవారు కారు. పాత కాలం బెంచీలు, బల్లలపై కూర్చోవాల్సి వచ్చేది. అయితే గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా జగనన్న విద్యాకానుక కింద కిట్ అందుకున్నాను. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చదువు చెప్పడంతో పాటు టెక్ట్స్బుక్స్, యూనిఫామ్, నోట్బుక్స్, బ్యాగు, బూట్లు వంటివన్నీ ఉచితంగా ఇచ్చారు. జగనన్న గోరుముద్దతో నాణ్యమైన భోజనాన్ని అందించారు. అధిక మార్కులు తెచ్చుకునేందుకు జగనన్న విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇచ్చారు. నాడు–నేడు ద్వారా పాఠశాల రూపురేఖలను ప్రభుత్వం మార్చేసింది. కూర్చునేందుకు డ్యూయల్ డెస్క్లు ఏర్పాటు చేసింది.క్లాస్ రూమ్లో ఫ్యాన్లు, లైట్లతో ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించింది. ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ వసతులు అన్నీ ఉపయోగపడ్డాయి. కార్పొరేట్ స్కూళ్లతో పోల్చితే ఎక్కడా తగ్గకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. మా స్కూల్లో వసతులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయి. ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటా. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం. ‘కార్పొరేట్’లో చదివినఅనుభూతి.. పేరు: ఎ.వైష్ణవి పాఠశాల: జెడ్పీహెచ్ స్కూల్, పొదలకూరు, నెల్లూరు జిల్లా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులకు క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. వారు అర్థమయ్యే రీతిలో మెరుగ్గా బోధించారు. నాడు – నేడు కింద మా పాఠశాలలో ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పించింది. బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు ఇలా అన్ని సదుపాయాలు ఉన్నాయి. దీంతో నాకు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న అనుభూతి ఉండేది.పేద విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి పథకాలను అందజేస్తోంది. ప్రభుత్వ పథకాలే ఆదుకున్నాయి పేరు: పేడాడ షణ్ముఖ వికాస్ పాఠశాల: లక్ష్మీనగర్ మున్సిపల్ హైసూ్కల్, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా జగనన్న విద్యాకానుక కింద నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలతోపాటు అమ్మఒడి, మధ్యాహ్న భోజన పథకం వంటివి పేద విద్యార్థినైన నన్ను ఆదుకున్నాయి. దీంతో ఎలాంటి ఒత్తిడి, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం కలిగింది. నా తల్లిదండ్రుల పైన ఎలాంటి ఆర్థిక భారం పడకపోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇందుకు సీఎం వైఎస్ జగన్కు నా కృతజ్ఞతలు. మా పాఠశాలలో ఉపాధ్యాయులు.. విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. సందేహాలు ఉంటే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ సందేహాలు నివృత్తి చేసుకునేవాళ్లం. పాఠశాలలో మొదటి నాలుగు నెలల్లోనే సిలబస్ పూర్తి చేశారు. తర్వాత రివిజన్ చేస్తూ ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించేవారు. ‘ఆక్స్ఫర్డ్’తోనే అధిక మార్కులు పేరు: సోముల వెంకట రామ శరణ్య పాఠశాల: వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్, ప్రొద్దుటూరు,వైఎస్సార్ జిల్లా ప్రభుత్వం జగనన్న విద్యా కానుకలో భాగంగా అందించిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడింది. దీంతో ఇంగ్లి‹Ù సబ్జెక్టులో వందకు 99 మార్కులు సాధించగలిగాను. నాడు–నేడు కింద ప్రభుత్వం మా పాఠశాలను సమగ్రంగా అభివృద్ధి చేసింది. అలాగే జగనన్న గోరుముద్ద కింద మంచి పౌష్టికాహారాన్ని అందించారు. ప్రభుత్వ పథకాలతో మా తల్లిదండ్రులపై రూపాయి భారం కూడా పడలేదు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడంతోపాటు తెల్లవారుజామున 2 గంటలు, రాత్రి 2 గంటలు, పాఠశాలలో స్టడీ అవర్స్లో బాగా చదివాను. ఇంగ్లి‹Ù, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ట్రిపుల్ ఐటీలో బీటెక్ సీఎస్ఈ చదువుతా. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా. ప్రభుత్వమేఅన్ని సౌకర్యాలు కల్పిస్తోంది.. పేరు: నాగరాజుగారి ఐశ్వర్య పాఠశాల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రొళ్ల, శ్రీసత్యసాయి జిల్లా ‘అనంత సంకల్పం’ పేరుతో అధికారులు 100 రోజుల ప్రణాళిక అమలు చేశారు. పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి అధికారులు ప్రత్యేకంగా అందించిన బుక్లెట్ ఎంతగానో ఉపయోగపడింది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు బాగా చదువుకోవాలని ఎంతో ప్రోత్సహించారు. దీంతో 590 మార్కులు సాధించగలిగాను. గతంలో మా పాఠశాలలో అరకొర సౌకర్యాలు ఉండేవి. ఇటీవల ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కింద అన్ని వసతులు కల్పించింది. దీంతో మంచి వాతావరణంలో చదువుకునే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో మాలాంటి పేద పిల్లలకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు కూడా ఇస్తున్నారు. అలాగే జగనన్న విద్యాకానుక కింద స్కూల్ బ్యాగు, నోటు పుస్తకాలు, షూ..ఇలా అన్నీ అందిస్తున్నారు. ఇప్పుడు చదువుకోవాలనే తపన ఉంటే చాలు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలోనే బాగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ బడి బాగుండదని అనుకున్నా పేరు: షేక్ మహ్మద్ సమీర్ పాఠశాల: మోడల్ స్కూల్, అవుకు,నంద్యాల జిల్లా మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో నన్ను ఆరో తరగతి నుంచి ఆదర్శ పాఠశాలలో చేరి్పంచారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఉండవేమో, మంచిగా చెప్పరేమోనని ఆందోళనపడ్డాను. అయితే నేను ఊహించినట్టు ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు లేవు. ప్రభుత్వం నాడు–నేడు కింద మా పాఠశాలలో అన్ని వసతులు కల్పించింది. ప్రభుత్వ చర్యలతో ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే ఎంతో బాగున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన పుస్తకాలను, దుస్తులను, షూ, బెల్ట్, టై లాంటివి ఉచితంగా అందించింది. అంతేకాకుండా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందజేసింది. అంతేకాకుండా అమ్మఒడి పథకం ద్వారా మా చదువులకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించింది. భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. ప్రభుత్వ మెటీరియల్ బాగుంది పేరు: ఎస్.హరిణి పాఠశాల: ఎస్పీసీఎన్ మునిసిపల్ హైసూ్కల్, ప్రొద్దుటూరు రామేశ్వరం,వైఎస్సార్ జిల్లా పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం డీసీఈబీ మెటీరియల్ అందించింది. ఇది మాకు ఎంతో ఉపయోగపడింది. అలాగే ప్రభుత్వం జగనన్న విద్యా కానుకతో అందించిన ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీతో ఇంగ్లిష్ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించగలిగాను. ప్రభుత్వ పథకాలతో ఎంతో లబ్ధి కలిగింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మా పాఠశాలలో విద్యాబోధన చేయడం వల్లే 590 మార్కులు వచ్చాయి. రోజూ తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10.30 గంటల వరకు చదివాను. స్టడీ టైమ్ టేబుల్ను అనుసరించడంతోపాటు పాఠ్యాంశాల్లో వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృతి చేసుకున్నాను. ప్రతి పాఠ్యాంశాన్ని రివైజ్ చేశాను. ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. స్టడీ అవర్స్ నిర్వహించి పాఠ్యాంశాల్లో పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చారు. దీంతో మ్యాథ్స్లో 100కు 100 మార్కులు సాధించాను. ట్రిపుల్ ఐటీలో చేరి భవిష్యత్తులో ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. -
జగనన్న అమ్మఒడితో అందరికీ చదువుకునే అవకాశం
-
చదువుపై ఇష్టం... రామోజీకి కష్టం!
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ కొత్త చరిత్రవైపు అడుగులేస్తోంది. ‘నాడు–నేడు’తో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. అమ్మ ఒడి నుంచి మొదలుపెడితే జగనన్న విద్యా కానుక వరకూ అన్ని పథకాలూ చదువుపై ఇష్టం పెంచుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో విద్య అంటే ప్రేమగా దగ్గరకెళ్లే పరిస్థితులు వచ్చాయి. ఇదో గొప్ప ముందడుగు. కొత్త చరిత్ర. ఫలితాలు కూడా మొదలయ్యాయి. కానీ... రెండు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను రాక్షసంగా నలిపేసిన తెలుగుదేశం మాఫియాకు ఇదెంతమాత్రమూ రుచించటం లేదు. విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని విషసర్పాలుగా ఎదిగిన చంద్రబాబు నాయుడి బినామీల పని అయిపోతున్నదనే భయం ఎల్లో ముఠాను వణికిస్తోంది. ఫలితమే... కొద్దిరోజులుగా ‘ఈనాడు’ పత్రికలో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై వస్తున్న నెగెటివ్ కథనాలు. జూనియర్ కాలేజీలు పెట్టారు తప్ప సౌకర్యాలను పట్టించుకోలేదని ఒకనాడు... ప్రభుత్వ స్కూళ్లలో ఉత్తీర్ణతలు అంతంతమాత్రమేనని మరోనాడు... ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఇంకోనాడు... ఇలా రోజుకొక విష గుళికను పాఠకుల మెదళ్లలో వేస్తున్నారు రామోజీరావు!. ఏం? రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యను ప్రయివేటు మాఫియా చేతుల్లో పెట్టిందెవరు? విశాలమైన ప్రాంగణాల్లో ఉన్న జూనియర్ కాలేజీలను పరాధీనం చేసిందెవరు? కార్పొరేట్ మాఫియా చేతుల్లో విద్యార్థుల తలరాతల్ని పెట్టింది చంద్రబాబు నాయుడు కాదా? విద్యార్థులపై ఒత్తిడిని పెంచి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నది అదే కార్పొరేట్ మాఫియా కాదా? వారిలో నారాయణ వంటివారు చంద్రబాబు బినామీలు కారా? అంటే ఈ ఆత్మహత్యలకు బాధ్యుడు చంద్రబాబు కాదా? ఎందుకీ దౌర్భాగ్యపు కథనాలు? ఎందుకీ విషపు రాతలు? మీ మాఫియా మనగలిగే రోజులు పోతున్నాయనా? మీ రాతలింకా జనం నమ్ముతున్నారనే అనుకుంటున్నారా రామోజీరావు గారూ?? రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకముందు వరకు... అంటే 2019 వరకు 10వ తరగతి విద్యార్థుల్లో 65 శాతం మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా ప్రయివేటు స్కూళ్లలో 35 శాతం వరకు ఉండేవారు. కానీ ఇంటర్మీడియెట్కు వచ్చేసరికి అది పూర్తిగా తారుమారయ్యేది. ఇంటర్ విద్యార్థుల్లో కేవలం 25 శాతం మంది ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా... 75 శాతం మందిది ప్రయివేటు కాలేజీల బాటే. 1996లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు నాటి నుంచి మెల్లగా తన బినామీ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ కాలేజీలను ఏర్పాటు చేయకుండా ప్రయివేటు కాలేజీలే విద్యార్థులకు దిక్కయ్యేలా చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,600 వరకు జూనియర్ కాలేజీలుండగా అందులో 290 మాత్రమే ప్రభుత్వ కాలేజీలు. మిగతావన్నీ ప్రయివేటువే. దీన్నిబట్టే చంద్రబాబు ప్రయివేటు రంగానికి ఏ స్థాయిలో మేలు చేశారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సరైన సదుపాయాలు కల్పించక... అక్కడ చదివితే భవిష్యత్తు ఉండదన్న భావనను ప్రజల్లో ఏర్పడేలా చేసి వాటిని నిర్వీర్యపరిచారు. దీంతో టెన్త్ పాసైన ప్రతి ఒక్కరూ కార్పొరేట్ కాలేజీలనే ఆశ్రయించాల్సిన దుస్థితి. అక్కడేమో లక్షల్లో ఫీజులు... అడ్డగోలు దోపిడీ!!. ఈ పరిస్థితి మారాలనుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి... పునాది స్థాయి నుంచే వ్యవస్థను బలోపేతం చేసేలా ఫౌండేషన్ విద్యకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే వాతావరణం ఉండేలా వాటిని వేలకోట్ల రూపాయలతో ‘నాడు–నేడు’ పేరిట సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన విద్య అందేలా కరిక్యులమ్లోనూ సంస్కరణలు తెచ్చారు. ఊహించని స్థాయిలో వేలకోట్ల రూపాయలతో విద్యాభివృద్ధి కార్యక్రమాలు మొదలెట్టారు. ఫలితాన్నిచ్చిన పథకాలు... ప్రభుత్వ విద్యను మెరుగు పరిచేందుకు... పాఠశాలలపై ఇష్టం పెంచేందుకు అమ్మ ఒడి, నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి, పాఠశాల నిర్వహణ నిధి వంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్కూళ్లకు పరిమితమైన ఇంగ్లీషు మీడియాన్ని ఎన్నో న్యాయపోరాటాలను కూడా తట్టుకుని అమల్లోకి తెచ్చారు. డిజిటల్ విద్యకూ శ్రీకారం చుట్టారు. వీటిల్లో కొన్ని పథకాలు విద్యా రంగ పరిస్థితులను సమూలంగా మార్చాయి. అవొక్కసారి చూస్తే... జీఈఆర్ పెంచిన అమ్మ ఒడి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో, ప్రాథమిక విద్యలో ఆంధ్రప్రదేశ్ జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) 84.48. జాతీయ సగటు 99.21తో పోలిస్తే ఇది తక్కువ. పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డురాకూడదన్న ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని తెచ్చారు జగన్. ఈ పథకం కింద ప్రతి తల్లి/సంరక్షకుడికి ఏటా రూ.15 వేలు అందిస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం రూ.19,617.6 కోట్లు ఇలా తల్లుల ఖాతాల్లో జమ చేసింది. పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి ఇస్తున్న ఈ సాయంతో... ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్థాయిల్లో జీఈఆర్ గడిచిన మూడేళ్లుగా గణనీయంగా పెరిగింది. నిపుణులు మెచ్చిన ‘విద్యా కానుక’ పాఠశాలల్లో పిల్లల భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం విద్యార్థులకు కిట్ల రూపంలో బోధన–అభ్యాస సామగ్రిని అందిస్తోంది. ప్రతి విద్యార్థి కిట్లో ఒక స్కూల్ బ్యాగ్, స్టిచింగ్ ఛార్జీతో కూడిన 3 జతల యూనిఫారాలు, ఒక బెల్ట్, ఒక జత షూ, రెండు జతల సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, వర్క్బుక్లు ఇంగ్లీష్– తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటోంది. గడిచిన మూడేళ్లుగా రూ.2,323.99 కోట్లు ఖర్చు చేసి ఏడాదికి 47 లక్షల మంది చొప్పున పిల్లలకు ‘కిట్లు’ అందించింది. స్కూళ్లు మొదలైన ఆరు నెలలకు కూడా అందరికీ పుస్తకాలు అందని గతమెక్కడ? ఆరంభమయ్యేనాటికే బుక్స్తో సహా బ్యాగులు, యూనిఫామ్, షూతో స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులున్న ప్రస్తుతమెక్కడ? ఏ కొంచెమైనా పోలిక ఉందా? ఇంతటి నవశకాన్ని కనీసం ప్రశంసించని రామోజీరావును ఏమనుకోవాలి? ఇందులో కూడా రంధ్రాలు వెదికి... కొందరి బ్యాగులు పాడయ్యాయని, కొందరికి షూలు పెద్దవయ్యాయని పతాకస్థాయి కథనాలు రాసే నీచపు పాత్రికేయాన్ని ఏం చేయాలి? ఇలాంటివేవీ చేయకున్నా అధికారంలో చంద్రబాబు ఉంటే ఆహా ఓహో అనే రామోజీరావును అసలు మనిషనుకోవచ్చా? అది.. ఆడపిల్లల గౌరవం సీఎం స్వయంగా చొరవ తీసుకుని... ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రత్యేక ని«ధిని ఏర్పాటు చేయించారు. గడిచిన రెండేళ్లుగా రూ.874 కోట్లు ఈ నిధికి జమయ్యాయి. చదువుకునే పిల్లలు టాయిలెట్ల కోసం ఇళ్లకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదని, ఆ విషయంలో వారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్నది సీఎం జగన్ ఉద్దేశం. అందుకే గతంలో అధ్వాన్నంగా ఉండి, శిథిలమైపోయిన టాయిలెట్ల స్థానంలో కొత్తవి నిర్మించటం, మరమ్మతులు చేయించటంతో పాటు... వాటికి రన్నింగ్ వాటర్ ఉండేలాంటి ఏర్పాట్లూ చేశారు. వాటి నిర్వహణ కోసం 44,748 స్కూళ్లలో 47,277 మంది ఆయాలను సైతం ఏర్పాటు చేశారు. ఒక్కో ఆయాకు నెలకు రూ.6 వేలు చెల్లిస్తున్నారు. దీనికోసం రూ.442 కోట్లతో స్కూల్ నిర్వహణ నిధిని (ఎస్ఎంఎఫ్) ఏర్పాటు చేశారు. ఆత్మవిశ్వాసం పెంచిన ఇంగ్లీషు మీడియం ఇంగ్లీషు విద్య అందరికీ అందాలన్నది సీఎం కల. దాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా, కార్పొరేట్ మాఫియా కలిసి రకరకాలుగా చేసిన పోరాటాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు జగన్. ప్రభుత్వ చిత్తశుద్ధి ఫలితంగా అమల్లోకి వచ్చిన ఇంగ్లీషు మీడియం విద్య... రాష్ట్రంలో ఎన్నో స్కూళ్లలో విద్యార్థుల మాట తీరునే మార్చేసింది. ప్రపంచంలో ఎక్కడైనా తాము పోటీపడగలమన్న ఆత్మ విశ్వాసాన్ని వారిలో అణువణువునా నింపింది. అంతేకాదు! ఉన్నత ప్రమాణాలు, బోధనా పద్ధతులు ఉత్తమ మూల్యాంకన విధానానికి వీలుగా ప్రభుత్వ స్కూళ్లు దశల వారీగా సీబీఎస్ఈకి అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇప్పటికే 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈకి శ్రీకారం చుట్టింది కూడా. సీబీఎస్ఈ సిలబస్ను దృష్టిలో ఉంచుకుని, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)–హైదరాబాద్, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్ (ఆర్ఎల్సీ)– అహ్మదాబాద్, సహకారంతో టీచర్లకు శిక్షణ ఇచ్చారు. హిందూ గ్రూప్తో కలిసి టీచర్లు స్టాండర్డ్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీలో (ఎస్టీఈపీ) శిక్షణ పొందారు. ఇవన్నీ కార్పొరేట్ స్కూళ్ల మనుగడనే ప్రశ్నిస్తుండటం... రామోజీ ఎదుర్కొంటున్న అసలు సమస్య. వినూత్నంగా డిజిటల్ తరగతులు... పాఠశాలలన్నిటా 6వ తరగతి నుంచి పైతరగతుల్లో ప్రతి తరగతి గదికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, అంతకన్నా కింది తరగతులకు స్మార్ట్ టీవీలను ప్రభుత్వం ఏర్పాటుచేయిస్తోంది. మనబడి నాడు–నేడు... తొలిదశ పూర్తయిన 15,715 స్కూళ్లలో రూ.352.32 కోట్ల అంచనాతో 10,038 స్మార్ట్ టీవీలు, 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వచ్చే ఈ డిజిటల్ తరగతులతో పిల్లలకు నాణ్యమైన ఈ–కంటెంట్... దానిద్వారా అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వస్తాయి. దీనికోసం విద్యా సమీక్షా కేంద్రాన్ని (కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్) కూడా ఏర్పాటుచేస్తోంది. 4 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ ఈ–కంటెంట్ను ఉచితంగా అందుబాటులోకి తేవటంతో... స్కూలు ముగిశాక విద్యార్థులకు వారి ఇళ్లలోనే సందేహాల నివృత్తికి ఇది ఉపయోగపడుతోంది. మారిన పాఠ్యాంశాలు... పెరిగిన ప్రమాణాలు ప్రభుత్వం 2020–21 నుండి పాఠ్యాంశాల్లో అనేక సంస్కరణలు తెచ్చింది. 1 నుంచి 7 తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఫలితాలొచ్చే పాఠ్యాంశాలపై దృష్టి సారించి మార్పులు చేయించింది. ప్రస్తుత కాలానికి అవసరమైన నైపుణ్యాలను పొందడమే లక్ష్యంగా 8, 9 తరగతులకు ఎన్సీఈఆర్టీ సిలబస్ పుస్తకాలు అందుబాటులోకి తెచ్చింది. సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యపుస్తకాలన్నిటినీ రెండు భాషల్లో (ఇంగ్లీషు– తెలుగు, హిందీ–తెలుగు మాదిరి) ఉండేలా అందిస్తోంది. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా 3 నుండి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుల ద్వారా బోధనను అందిస్తున్నారు. ఆయా సబ్జెక్ట్లలో నిష్ణాతులైన ఉపాధ్యాయులు పాఠాలు చెబితే పిల్లల్లో ప్రమాణాలు మెరుగువుతాయనేది ప్రభుత్వ యోచన. ఇవన్నీ ఫలితాలనిస్తుండటమే... ప్రయివేటు విద్యా రంగ మాఫియాను కొమ్ముకాస్తున్న ఎల్లో ముఠాకు నచ్చటం లేదు. మండలానికి రెండు కాలేజీలు.. అందులో ఒకటి బాలికలకే తెలుగుదేశం హయాంలో ఉన్నవి మూతపడ్డాయి తప్ప ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ కూడా రాలేదు. విశాలమైన స్థలాలతో ఉండే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పరాధీనమైపోయాయి. కార్పొరేట్ల జెండా పైపైకి ఎగిరింది. చదివించే స్థోమత లేనివారు మగపిల్లలనైతే అప్పులు చేసి కాలేజీల్లో చేర్పించటం... ఆడపిల్లలనైతే చదువు మాన్పించటం చేసేవారు. దీంతో టెన్త్ తరువాత బాలికలు డ్రాపవుటవ్వడం పెరిగింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్ కాలేజీలుండాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందులో ఒకటి హైస్కూల్ను అప్గ్రేడ్ చేసి కాలేజీగా మార్చటం ద్వారా చేయాలనుకున్నారు. రెండు కాలేజీల్లో ఒకటి బాలికలకే. దీనివల్ల హైస్కూల్లో ఉత్తీర్ణులైన బాలికలందరూ తమ విద్యను కొనసాగించడానికి వీలుంటుందన్నది సీఎం జగన్ ఉద్దేశం. ఇందులో భాగంగా 292 ఉన్నత పాఠశాలల్ని బాలికల కోసం హైస్కూల్ ప్లస్గా అప్గ్రేడ్ చేశారు. మొత్తం 352 కస్తూర్బాగాందీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్లస్2ను ప్రవేశపెట్టారు. 2022–23 నుండి 14 కో–ఎడ్ జూనియర్ కాలేజీలనూ బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. ఇలా మొత్తం 679 మండలాలలో రెండేసి జూనియర్ కాలేజీలుండేలా చేస్తున్నారు. విచిత్రమేంటంటే... అసలు కాలేజీలే లేనప్పుడు రామోజీరావు ఒక్క అక్షరం కూడా రాయలేదు. ఇలా కాలేజీలు ఏర్పాటు చేసినపుడు మంచి చర్యంటూ ఒక్క కథనమూ వేయలేదు. కానీ కొన్ని కాలేజీల్లో ఫలితాలు బాగా రాలేదంటూ మాత్రం ఓ కథనాన్ని అచ్చేసేశారు. అదీ.. ‘ఈనాడు’ అంటే. విద్యారంగ పథకాలకు రూ.54వేల కోట్ల ఖర్చు.. ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు రూ.54,023 కోట్లు వెచ్చించింది. చరిత్రలో ఎన్నడూ ఇంతటి భారీ మొత్తాన్ని విద్యపై ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. తరగతి గదుల కొరతను దృష్టిలో ఉంచుకొని ‘నాడు నేడు’ కింద జూన్ నాటికి 24వేల అదనపు గదుల నిర్మాణాన్ని చేపట్టారు. ‘నాడు నేడు’ రెండు, మూడు దశలు కూడా పూర్తయితే ప్రభుత్వ స్కూళ్లు కాలేజీల్లో విద్యార్థులకు, టీచర్లకు అవసరమైన సదుపాయాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలే... రామోజీ ముఠాకు భవిష్యత్తుపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కేజీబీవీలను నిర్లక్ష్యం చేసింది చంద్రబాబే... చంద్రబాబు హయాంలో కేజీబీవీలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. అనా«థ, నిరుపేద అణగారిన వర్గాలకు చెందిన బాలికలకు విద్యనందించే ఈ సంస్థలకు కనీస నిధులు కూడా ఇవ్వలేదు నాటి ప్రభుత్వం. ఇక్కడ 6 నుంచి 10 వరకే తరగతులుండడంతో... ఆ చదువు పూర్తిచేసిన వారికి పై చదువులకు ఆస్కారం ఉండేదికాదు. డ్రాపవుట్ అయ్యేవారు. చంద్రబాబు వీటిని పట్టించుకుంటే ఒట్టు!. రాష్ట్రంలో 352 కేజీబీవీలు ఉండగా వాటిలో 84,923 మంది బాలికలు చదువుతున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దశలవారీగా మొత్తం 321 కేజీబీవీల్లో ఇంటర్మీడియెట్ను అందుబాటులోకి తెచ్చారు. సిబ్బంది ఖాళీలను చంద్రబాబు అలాగే వదిలేయగా గడిచిన మూడున్నరేళ్లలో 1,377 పోస్టులను భర్తీ చేశారు. ఇంటర్మీడియెట్ను దృష్టిలో పెట్టుకొని అదనంగా గెస్టు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో అధ్యాపకులను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఈ విద్యార్థినులకు సరైన సదుపాయాలు లేవు. ఈ ప్రభుత్వం వీరికి జగనన్న విద్యాకానుక కింద అన్నీ సమకూరుస్తోంది. ఇక వీరికి హాస్టల్తో కూడిన చదువులు అందిస్తున్నా.. వీరి తల్లులకోసం అమ్మ ఒడినీ అందిస్తుండడం విశేషం. అమ్మ ఒడి ద్వారా 2020–21లో 55వేల మందికి, 2021–22లో 67వేల మందికి, 2022–23లో 84వేల మందికి రూ.15వేల చొప్పున రూ.312.80 కోట్ల లబ్ధి చేకూరింది. కాకుంటే రామోజీరావు మాత్రం ఈ వాస్తవాలేవీ చెప్పరు. విషపు రాతలే అచ్చేస్తారు. అదే పాఠకుల దౌర్భాగ్యం. పోటీపడేలా చేసిన ‘నాడు–నేడు’ ‘మన బడి నాడు– నేడు’ పేరిట ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్టారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్న 44,703 స్కూళ్లలో తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో పనులు పూర్తిచేయించారు. నాడు–నేడు 2వ దశలో రూ.4,100 కోట్లతో 17,500 స్కూళ్లలో పనులు చేయిస్తున్నారు. ఇవి రాబోయే విద్యా సంవత్సరానికల్లా అందుబాటులోకి వస్తాయి. మిగిలిన స్కూళ్లలో ‘నాడు–నేడు’ పనులన్నీ ఆ తరువాతి విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. కొంచెం ఖాళీ స్థలం కూడా లేకుండా ఇరుకిరుకు భవనాల్లో నడిపిస్తున్న కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా విశాలమైన ప్రాంగణాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న స్కూళ్లపై విద్యార్థులకెంత ఇష్టం పెరగిందంటే... సీట్లు లేవు అని స్కూళ్లకు బోర్డులు పెట్టేంతగా!. ఇదొక్కటి చాలు ఈ సంస్కరణల ఫలితమేంటో చెప్పడానికి. హాజరు పెంచిన ‘గోరుముద్ద’ ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనంపై సీఎం జగన్ ఎంతశ్రద్ధ పెట్టారంటే... వారికి అందించే భోజనం మెనూను స్వయంగా తానే మార్పు చేయించారు. ఎందుకంటే... కడుపు నిండితేనే చక్కని చదువు కూడా వంటబడుతుందన్నది ఆయన మాట. స్వయంగా తానే మెనూ తయారు చేయించి... ‘జగనన్న గోరుముద్ద’ పేరిట రోజుకోరకమైన ఆహారాన్ని అందించేలా చేశారు. వారానికి ఐదు గుడ్లు, రోజూ చిక్కీలతో పాటు ఇటీవల బ్రేక్ఫాస్ట్గా రాగి జావను కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. వీటికి ప్రభుత్వం ఏటా రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. గుడ్డు నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లను అందించాలని కూడా ఆలోచిస్తోందంటేనే సర్కారు చిత్తశుద్ధి అర్థమవుతుంది. డిజిటల్ లెర్నింగ్... కొత్త చరిత్ర కోవిడ్తో ప్రపంచవ్యాప్తంగా పిల్లలు దెబ్బతిన్నారు. అభ్యసన స్థాయిలు దిగజారాయి. అందుకే విద్యార్థులకు గూగుల్ రీడ్ ఎలాంగ్ పీఎఎల్, బైజూస్ తదితర మార్గాల్లో చదువులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 4 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు బైజూస్ పాఠ్యాంశాలను అందుబాటులోకి తెచ్చారు. 2022–23లో 8వ తరగతి విద్యార్థులకు, వారికి బోధన చేసే టీచర్లకు ప్రభుత్వం రూ.686 కోట్లతో 5.18 లక్షల ట్యాబులను అందించింది. ఈ ఏడాది కూడా 8వ తరగతిలోకి వచ్చేవారికి రూ.750 కోట్లతో ట్యాబులు అందించనుంది. ప్రతి ఏటా ఇలా 8వ తరగతిలో ఇచ్చే ట్యాబులు వారికి 10వ తరగతి వరకూ డిజిటల్ లెర్నింగ్కు పనికొస్తాయి. తరవాత ఇంటర్మీడియెట్ ఎలాగూ అందుబాటులో ఉంటుంది. అంటే... కార్పొరేట్ స్కూళ్లలో సైతం వేలకు వేలు అదనపు ఫీజులు కడితే తప్ప అందని ట్యాబులు, బైజూస్ వంటి ఎడ్యుటెక్ దిగ్గజ సంస్థ పాఠాలు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగానే అందుతున్నాయి. తద్వారా వారికి ఏ స్థాయిలోనైనా పోటీపడే సామర్థ్యం వస్తోంది. -
నాణ్యమైన విద్యను అందించడంలో భారత్ విధానం: యునెస్కో ఛీఫ్
ప్రధాని నరేంద్ర మోదీ మన్కి బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్కు చేరుకోవడం చారిత్రాత్మకం. ఈసందర్భంగా ఈ వందవ ఎపిసోడ్ని ఇండియాలోని వివిధ భాషలతో సహా 11 విదేశీ భాషల్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారత్ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రసారమైంది. ఈ నేపథ్యంలో యునెస్కో చీఫ్ ఆడ్రీ అజౌలే మోదీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మోదీని పలు ప్రశ్నలు అడిగారు. 2030 నాటికి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలనే యునెస్కో లక్ష్యం గురించి అజౌలే మోదీతో మాట్లాడారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భారత్ అనుసరించే మార్గం ఏమిటని మోదీని ప్రశ్నించారు. అందుకు మోదీ బదులిస్తూ..విద్యను అందించడంలో నిస్వార్థంగా పనిచేసిన వారి పేర్లను మోదీ గుర్తు చేస్తుకున్నారు. ఈ మేరకు దివంగత డి ప్రకాశ్ రావుని గుర్తుతెచ్చుకుంటూ..ఆయన టీ అమ్మేవాడు. నిరుపేద పిల్లలను చదివించడమే అతని జీవిత లక్ష్యం అని చెప్పారు. అలాగే జార్ఖండ్ గ్రామాల్లో డిజిటల్ లైబ్రెరీని నిర్వహిస్తున్న సంజయ్ కశ్యప్ , కోవిడ్-19 సమయంలో ఇ లెర్నింగ్ ద్వారా పిల్లలకు సహాయం చేసిన హేమలత గురించి మాట్లాడారు మోదీ. ఇంకా అజౌల్ ఈ ఏడాది భారత్ నేతృత్వంలోని జీ 20 శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుతూ..అతర్జాతీయా ఎజెండాలో దేశ సంస్కృతి, విద్యను మోదీ ఎలా అత్యున్నత స్థానంలోకి తీసుకువెళ్లబోతున్నారనే దాని గురించి కూడా అడిగారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతికి పరిరక్షణ, విద్య రెండూ ఇష్టమైన అంశాలుగా నిలిచాయి. అది లక్ష్యద్వీప్లోని కుమ్మెల్ బ్రదర్స్ చాలెంజర్ క్లబ్ లేదా కర్ణాటక కావెంశ్రీకీ కళా చేతన్ మంచ్ కూడా కావచ్చు అన్నారు. అలాగే దేశం నలుమూలల నుంచి ప్రజలు లేఖలు ద్వారా అలాంటి వాటి గురించి తెలియజేశారు. అందులో భాగంగా మేము రంగోలి, దేశ భక్తిగీతాలు, లాలి పాటలు కంపోజ్ చేయడం గురించి మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమం వల్లే విభిన్న ప్రపంచ సంస్కృతిని మరింత సుసంపన్నం చేయాలనే సంకల్పం బలపడిందని మోదీ చెప్పారు. (చదవండి: మన్ కీ బాత్ @100.. మోదీ కామెంట్స్ ఇవే..) -
నేడు జగనన్న వసతి దీవెన
సాక్షి, అమరావతి: చెప్పిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జగనన్న వసతి దీవెన అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం జిల్లా నార్పల వేదికగా కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. విప్లవాత్మక సంస్కరణలు కరిక్యులమ్లో మార్పులు, నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కోర్సులు, తప్పనిసరిగా ఇంటర్న్షిప్ తదితర విప్లవాత్మక కార్యక్రమాలతో విద్యా రంగాన్ని బలోపేతం చేస్తోంది. డిజిటల్ విద్యలో భాగంగా 8 వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్లు, నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్రూమ్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై రూ.58,555.07 కోట్లు వెచ్చించింది. కాగా, బుధవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.20 గంటలకు నార్పల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం నార్పల క్రాస్రోడ్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, జగనన్న వసతి దీవెన కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. తిరిగి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
రాజమండ్రి జైలు చూశారా? ఎంతలో ఎంత మార్పు.?
(డెస్క్–రాజమహేంద్రవరం): చదువు దారి చూపుతుంది. దారి తప్పిన వారిని సన్మార్గంలోనూ నడుపుతుంది. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలోని కొందరు ఖైదీల గురించి తెలుసుకుంటే ఇది అక్షర సత్యమని అర్థమవుతుంది. వివిధ పరిస్థితుల నేపథ్యంలో.. క్షణికావేశంలో కొందరు నేరానికి పాల్పడుతుంటారు. వీరంతా జైలుకు వచ్చి శిక్ష అనుభవిస్తారు. అయితే ఇక్కడి కారాగారం అధికారులు మాత్రం వీరి శిక్షను శిక్షణగా మారుస్తున్నారు. ఇందులో భాగంగా వీరిలో విద్యావెలుగులు నింపుతున్నారు. జైలులో జీవితం వృథా కాకుండా ఖైదీలను విద్యాబాట పట్టిస్తున్నారు. పరివర్తన దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఆగిన చదువకు నడక సెంట్రల్ జైలుకు రాకమునుపు ఆపేసిన విద్యను చాలామంది ఇక్కడికి వచ్చాక కొనసాగించగలుగుతున్నారు. డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ద్వారా వీరంతా పట్టభద్రులవుతున్నారు. కొందరు పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం 135 మంది డిగ్రీ చదువుతుండగా 87మంది ఎంఏ చదువుతున్నారు. 638 మంది ఇప్పటికే డిగ్రీ పూర్తి చేయడం విశేషం. వీరికోసం జైలు ప్రాంగణంలోనే పరీక్ష సెంటరు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్గా వీరికి క్లాసులు చెప్పడానికి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుంచి ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకుంటున్నట్లు సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ రాజకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. పెద్ద వయసుండీ నిరక్షరాస్యులైన ఖైదీలకు సైతం రాయడం చదవడం నేర్పుతున్నారు. ప్రస్తుతం 28మంది ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అనంతలక్ష్మి అనే టీచరు బోధిస్తున్నారు. అబ్బురపరిచే లైబ్రరీ ఖైదీలు చదువుకునేందుకు లైబ్రరీ ఉంది. ఇందులో 4,300 పుస్తకాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు..ఆధ్మాత్మిక భావన కలిగించేందుకు దోహదపడే పుస్తకాలు ఉన్నాయి. లక్ష రూపాయల విలువైన పుస్తకాలను జైలు అధికారులు కొనుగోలు చేశారు. చదువుతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచేందుకు ఒక సెంటరును నిర్వహిస్తున్నారు. వెల్డింగ్..ప్లంబింగ్ కోర్సులకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. ఖరీదైన శిక్షణ పరికరాలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం 30 మంది వంతున ఖైదీలు ఈ కోర్సులు నేర్చుకుంటున్నారు. గోల్డు మెడలిస్టులూ ఉన్నారు సెంట్రల్జైలులో శిక్షను అనుభవిస్తూ పట్టభద్రులైన కొందరు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. షేక్ అజారుద్దీన్ బీఏలో స్వర్ణ పతకాన్ని సాధించారు. షేక్ సుభానీ ..టి వెంకటేశ్వరరావులు కూడా ఇదీ డిగ్రీలో గోల్డు మెడల్ సాధించారు. విజయవాడకు చెందిన జీ విజయరామ్ జైలులోనే పీజీ చదివి విడుదలయ్యాక వీఆర్ఓ ఉద్యోగాన్ని పొందారు. సారేపల్లి శ్రీనివాస్ మూడు డిగ్రీలు చదివారు. రంపచోడవరానికి చెందిన శ్రీనివాస్ కూడా మూడు పీజీలు చేశారు. ఇక్కడ పీజీ చదివాను మాది గుంటూరు. 30సంవత్సరాలుగా ఇక్కడ జైలులో ఉంటున్నాను. జైలుకు రాకమునుపు కరస్పాండెన్స్ కోర్సు డిగ్రీ చేయాలనుకున్నాను. ఇక్కడకు వచ్చాక పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాను. ఎంఏ చదివాను. ఇక్కడి అధికారుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని పెంచింది. నాకు ఇప్పుడు 54 సంవత్సరాల వయసు వచ్చింది. చదవడం వల్ల చాలా తెలుసుకున్నాను. విద్య మనిషిలో సత్ప్రవర్తనను పెంచుతుందని గ్రహించాను. విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. – గంటెల విజయవర్దన్ మూడు ఎంఏలు చేశాను మాది రంప చోడవరం. నేను జైలుకు వచ్చి 11 సంవత్సరాలు అవుతోంది. ఓ హత్య కేసులో నాకు శిక్ష పడింది. జైలుకు వచ్చే ముందు ఎమ్మెస్సీ బీఈడీ చదివాను. ఇప్పుడు మూడు ఎంఏలు చేశాను. పాలిటిక్స్..పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్..సోషియాలజీలతో ఈ పీజీలు చదివాను. ఈ శిక్షా కాలం నా జీవితంలో ఊరికే పోలేదని భావిస్తున్నాను. జైలు అధికారుల తోడ్పాటుతో మళ్లీ చదువుకోగలిగాను. చదువు వల్ల ఆత్మవిశ్వాసం పెరిగింది. గౌరవమూ పొందగలుగుతుండటం నాకు సంతోషం కలిగిస్తోంది. – శ్రీనివాస దొర పరివర్తనే ధ్యేయంగా.. ఖైదీలలో పరివర్తనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. శిక్షాకాలంలో విద్య లేదా నైపుణ్య కోర్సు నేర్చుకునో బయటకు వెళ్లాక ఉపాధిబాట పట్టేలా తీర్చిదిద్దేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలను రూపొందించి అనుసరిస్తున్నాం. మళ్లీ నేరాల వైపు మనసు మళ్లకుండా ఉద్యోగం లేదా ఉపాధి వైపు దృష్టి పెట్టాలనేది మా అభిమతం. అందుకే జైలులో శిక్షాకాలం వృథా కానీయడం లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఇందుకు మంచి సహకారం లభిస్తోంది. ఖైదీలు చదువుకోడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిని ఉత్సాహపరిచేలా సహకారం అందిస్తున్నాం. – రాజారావు, జైలు సూపరింటెండెంట్ -
కొత్త పాఠాలు.. కొంగొత్త విషయాలు
సాక్షి, అమరావతి: నూతన జాతీయ కరిక్యులమ్ ఫ్రేమ్వర్కు– 2020 ప్రకారం పాఠశాల విద్యలో పాఠ్యాంశాల సవరణ ప్రక్రియను జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) చేపట్టింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి నూతన పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తెస్తోంది. ‘నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి అనుగుణంగా సవరించిన కొత్త పాఠ్యాంశాలు ఉంటాయని ఎన్సీఈఆర్టీ ప్రకటించింది. కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పాఠ్య పుస్తకాల రూపకల్పనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్సీఈఆర్టీ వినియోగిస్తోంది. విద్యా సంస్థలు తెరిచి ఉన్నా, తెరవలేని పరిస్థితులు వచ్చినా అభ్యసనకు ఆటంకం లేకుండా పాఠ్య పుస్తకాలను రూపొందిస్తోంది. కొత్త పుస్తకాలు ప్రింటుతో పాటు డిజిటల్ రూపంలోనూ అందుబాటులో ఉంటాయని ఎన్సీఈఆర్టీ వివరించింది. ఎవరైనా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత 2024–25 విద్యా సంవత్సరం నుంచి అన్ని స్థాయిల్లోని పాఠశాల విద్యార్థులకు కొత్త పాఠ్య పుస్తకాలను ఎన్సీఈఆర్టీ రూపొందిస్తోంది. ఇప్పటివరకు ఎన్సీఈఆర్టీ ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో మాత్రమే పాఠ్య పుస్తకాలను అందిస్తోంది. ఇప్పుడు 22 భారతీయ భాషల్లో వీటిని అందించనుంది. జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం 5వ తరగతి వరకు మాతృ భాషల్లో బోధన సాగాలన్న నిబంధనను అనుసరించి ప్రీప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 22 భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్ను బాలలకు అందించనున్నట్లు ఎన్సీఈఆర్టీ వివరించింది. ఈ పుస్తకాలు ప్లే బుక్ల మాదిరిగా, నాటక ఆధారితంగా రూపొందిస్తున్నట్లు పేర్కొంది. ఈ పుస్తకాలు ప్లే–వే పద్ధతిలో ఉంటాయి. విద్యార్థుల్లో సమస్యలను పరిష్కరించే మెళకువలు, సామాజిక భావోద్వేగ సామర్థ్యాలను పెంపొందించేలా వీటిని రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రీ–సూ్కల్ నుండి 2వ తరగతి వరకు పుస్తకాల రూపకల్పనకు కరిక్యులమ్ ఫ్రేమ్వర్కును ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది. ఇతర తరగతుల కోసం ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తోంది. ప్రైవేటు పబ్లిషర్లకూ ఎన్ఈపీ మార్గదర్శకాలు ప్రైవేటు పబ్లిషర్లు ముద్రించే వివిధ విద్యా సంబంధిత పుస్తకాలు జాతీయ విద్యా విధానాని (ఎన్ఈపీ)కి అనుగుణంగా ఉండేలా ఎన్సీఈఆర్టీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేటు పబ్లిషర్లు ప్రీసూ్కల్, 1, 2 తరగతుల పుస్తకాలను ఎన్ఈపీకి అనుగుణంగా రూపొందిస్తున్నట్లు వివరించింది. మిగతా పబ్లిషర్లు కూడా ఎన్ఈపీ మార్గదర్శకాల ప్రకారం పుస్తకాలు ప్రచురిస్తున్నారా? లేదా అనే విషయాన్ని ఎన్సీఈఆర్టీ పరిశీలిస్తోంది. -
గిరిజన భాషలో విద్యార్థులకు పాటలు
-
గెలుపు గ్రామర్
విజయం సాధించడంలో ఎంత కిక్ ఉందో....ఇతరులను విజయం సాధించేలా చేయడంలో అంత కంటే ఎక్కువ కిక్ ఉంది!ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ప్రిప్ఇన్స్టా’తో ఆశయ్ మిశ్రా, కౌశిక్, మనీష్ అగర్వాల్లు విజయం సాధించడమే కాదు యువత తమ కలలు సాకారం చేసుకోవడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు... కౌశిక్, ఆశయ్ మిశ్రా, మనీష్ అగర్వాల్లు వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విఐటీ యూనివర్శిటీ, తమిళనాడు)లో కలిసి చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత బెంగళూరులో వేరు వేరు కంపెనీలలో ఉద్యోగాలు చేసేవారు.‘చాలామంది స్టూడెంట్స్లో ప్రతిభ ఉన్నా తమ ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీనికి కారణం వారిలో సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో పాటు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించడంలో అనుసరించాల్సిన వ్యూహంపై అవగాహన లేకపోవడం...’ ఇలాంటి ఆలోచనలను రెగ్యులర్గా బ్లాగ్లో రాసేవాడు గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న కౌశిక్.తన బ్లాగ్ ఎంత హిట్ అయిందంటే సంవత్సరం తిరిగేసరికల్లా నెలకు లక్ష వ్యూలు వచ్చేవి.ఆ టైమ్లోనే కౌశిక్కు ‘ఫ్లిప్కార్ట్’ నుంచి మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. అయితే దాన్ని కాదనుకొని ఇద్దరు మిత్రులతో మాట్లాడాడు.అలా ఈ ముగ్గురి మేధో మథనం నుంచి పుట్టిందే... ప్రిప్ఇన్స్టా.ప్రిప్ఇన్స్టా(ప్రిపేర్ ఫర్ ప్లేస్మెంట్స్ ఇన్స్టంట్లీ) అనేది వోటీటీ ఫార్మట్ ప్లాట్ఫామ్. యూజర్లు డబ్బులు చెల్లించి ఫిక్స్డ్ టైమ్లో(నెలలు లేదా సంవత్సరాలు) 200 కోర్సులతో యాక్సెస్ కావచ్చు. అప్స్కిలింగ్ సబ్జెక్ట్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ (లాజిక్, వెర్బల్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్)...మొదలైనవి ఆ కోర్సులలో ఉంటాయి.‘ఎన్నో ప్లాట్ఫామ్స్లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్ఇన్స్టా తీసుకువచ్చాం. యూత్ తమ డ్రీమ్ జాబ్స్ను గెలుచుకునేలా చేయడంలో మా ప్లాట్ఫామ్ విజయం సాధించింది’ అంటున్నాడు కో–ఫౌండర్ ఆశయ్ మిశ్రా. నోయిడా(ఉత్తర్ప్రదేశ్), బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్లాట్ఫామ్ యాభైకి పైగా కాలేజీలతో కలిసిపనిచేస్తుంది. రాబోయే కాలంలో మూడు వందల కాలేజీలతో కలిసి పనిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.‘మాది సెల్ఫ్–పేస్డ్ ప్లాట్ఫామ్. స్టూడెంట్స్ తమకు అనుకూలమైన టైమ్, షెడ్యూల్లో చదువుకోవచ్చు.బీ2సీ (బిజినెస్–టు–కన్జ్యూమర్) మోడల్లో ఈ ప్లాట్ఫామ్కు 2.25 లక్షల పెయిడ్ యాక్టివ్ సబ్స్రైబర్లు ఉన్నారు. కోవిడ్ కల్లోల కాలంలో మాత్రం ఈ స్టార్టప్ తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం సగానికి సగం పడిపోయింది. పేరున్న ఎడ్టెక్ కంపెనీలు కూడా మూతపడుతున్నాయి. ‘నిరాశ’ మెల్లిగా దారి చేసుకొని దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే ఆ సమయంలో గట్టిగా నిలబడ్డారు ముగ్గురు మిత్రులు. కంపెనీని రీవ్యాంప్ చేశారు. ఉద్యోగుల సంఖ్యను పెంచారు.‘ఇక కనిపించదు’ అనుకున్న కంపెనీ లేచి నిలబడి కాలర్ ఎగరేసింది! 25 కోట్ల క్లబ్లో చేరిన ఈ స్టార్టప్ తన విస్తరణలో భాగంగా వెంచర్ క్యాపిటల్, ఏంజెల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది.రిస్క్ అనిపించే చోట ‘ప్లాన్ బీ’ను దృష్టిలో పెట్టుకోవడం మామూలే. అయితే ‘ప్లాన్ ఏ’ పకడ్బందీగా ఉంటే ‘బీ’తో ఏంపని? అని ఈ ముగ్గురు అనుకున్నారు. వారి నమ్మకం నిజమైంది . ఎన్నో ప్లాట్ఫామ్స్లో ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే గ్రామీణ, చిన్న పట్టణాలకు చెందిన వారు ఆ ఖర్చును భరించే స్థితిలో లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందుబాటు ధరల్లో ఉండేలా ప్రిప్ఇన్స్టా తీసుకువచ్చాం. – ఆశయ్ మిశ్రా -
డాక్టర్ చదువుల్లో సమానం!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో మహిళలు దూసుకెళ్తున్నారు. కొన్ని కోర్సుల్లో యువకులను మించి యువతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక 2022 వెల్లడించింది. దేశంలో 1,59,69,571 మంది యువకులు, 1,50,77,414 మంది యువతులు ఉన్నత విద్య అభ్యసిస్తుండగా ఆర్ట్స్, సైన్స్, మెడికల్, సోషల్ సైన్స్ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య అధికంగా ఉంది. కామర్స్, ఐటీ, కంప్యూటర్స్, మేనేజ్మెంట్, న్యాయవాద విద్యలో అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. ♦ బీఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు (పురుషులు) 109 మంది విద్యార్థినులున్నారు. ♦ బీఈడీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 182 మంది విద్యార్థినులున్నారు. ♦ బీఎస్సీ (నర్సింగ్లో)లో అత్యధికంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 308 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎంబీబీఎస్లో పురుషులతో సమానంగా ప్రతి వంద మంది విద్యార్థులకు 100 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎంఏలో ప్రతి వంద మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థినులున్నారు. ♦ మ్కాంలో ప్రతి వంద మంది విద్యార్థులకు 198 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎమ్మెస్సీలో ప్రతి వంద మంది విద్యార్థులకు 156 మంది విద్యార్థినులున్నారు. ♦ బీటెక్లో ప్రతి వంద మంది విద్యార్థులకు అత్యల్పంగా 40 మంది విద్యార్థినులున్నారు. ♦ ఎల్ఎల్బీలో కూడా యువతులు తక్కువగా ఉన్నారు. ప్రతి వంద మంది విద్యార్థులకు 49 మంది విద్యార్థినులున్నారు. -
ఉన్నత విద్య మరింత బలోపేతం
సాక్షి, అమరావతి:ఉన్నత విద్యను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ రంగానికి గతంలో కన్నా ఎక్కువ కేటాయింపులు చేసింది. వర్సిటీలు, కాలేజీ విద్య, సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి విభాగాలకు ఇతోధికంగా నిధులను కేటాయించింది. అత్యున్నత నైపుణ్యాలతో ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. అందుకనుగుణంగా ఉన్నత విద్యారంగానికి బడ్జెట్లో సముచిత స్థానం కల్పి స్తూ నిధులు కేటాయించారు. ఉన్నత విద్యలోని అన్ని విభాగాలకు రూ.2,064.71కోట్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు రూ.1,166.64 కోట్లు కలిపి మొత్తంగా రూ.3,231.35 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 2021–22లో ఉన్నత విద్యకు ప్రభుత్వం రూ.1,973.15 కోట్లు కేటాయించింది. ఆ ఏడాది కేటాయింపులకన్నా అధికంగా రూ.2,031.24 కోట్లు ఖర్చుపెట్టింది. ఇక 2022–23లో రూ.2,014.30 కోట్లు కేటాయించగా ఈసారి అంతకన్నా అత్యధిక నిధులను బడ్జెట్లో పొందుపరిచింది. సంప్రదాయ వర్సిటీలకు, సాంకేతిక విశ్వవిద్యాలయాలకు ఈసారి బడ్జెట్లో నిధులు పెంచింది. రూసా కింద రూ.150 కోట్లతో వివిధ కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ప్రత్యేకంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల భవనాల నిర్మాణం కోసం డిజిటల్ తరగతులు, వర్చువల్ లేబొరేటరీస్, ట్రైబల్ డిగ్రీ కాలేజీల కోసం అదనంగా రూ.9.98 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ కాలేజీల నిర్వహణ ఇతర అవసరాల కోసం రూ.785.89 కోట్లు కేటాయించింది. (వివిధ ఆస్తుల కల్పనకు మూలధన కేటాయింపులు ఇలా..) ఆదికవి నన్నయ వర్సిటీ 4.00 క్లస్టర్ వర్సిటీ 52.00 సెంట్రల్ వర్సిటీలకు మౌలిక సదుపాయాలు 12.66 అబ్దుల్హక్ ఉర్దూ వర్సిటీ 5.00 రూసా కింద భవనాల నిర్మాణం 150.00 రాయలసీమ వర్సిటీ 7.94 పద్మావతి మహిళా వర్సిటీ 1.35 ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, కురుపాం 33.00 -
చదువుకు బడ్జెట్ భరోసా
విద్యపై చేసే ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి అన్నది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రగాఢ విశ్వాసం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అందుకు తగ్గట్లుగానే ఆయన అడుగులు వేస్తున్నారు. ఏటా విద్యారంగానికి బడ్జెట్లో అత్యధిక నిధులు కూడా కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగానే 2023–24 ఆర్థిక సంవత్సరానికి కూడా గతంలో కన్నా అధిక నిధులను కేటాయించి బడ్జెట్కు ఆమోదం తెలిపారు. ఇక గురువారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.32,921 కోట్లను కేటాయించింది. ఇందులో పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలకు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను కేటాయించింది. పాఠశాల, ఉన్నత విద్యలకు కలిపి సాధారణ విద్య పద్దు కింద రూ.32,198.39 కోట్లు, సాంకేతిక, విద్య పద్దు కింద రూ.512.37 కోట్లుగా ఉంది. వీటితో పాటు నైపుణ్యాభివృద్ధికీ నిధులు కేటాయించింది. మరోవైపు.. విద్యార్థులకు సంక్షేమ విభాగాల ద్వారా అందించే జగనన్న విద్యాదీవెన (రూ.2,841 కోట్లు), జగనన్న వసతి దీవెన (రూ.2,200 కోట్లు).. అమ్మఒడి (రూ.6,500 కోట్లు) పథకాల నిధులు రూ.11,541 కోట్లను కూడా కలుపుకుంటే ఈ కేటాయింపులు మరింత పెరుగుతాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు బలోపేతం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విద్యారంగానికి అరకొర కేటాయింపులు చేసి ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది. కానీ, ప్రస్తుత సర్కారు ప్రభుత్వ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ అందుకు తగ్గట్లుగా నిధులూ కేటాయిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడమే కాకుండా అందులో చదువుకునే పేద విద్యార్థులకు అనేక రకాల కార్యక్రమాలు అమలుచేయిస్తూ అండదండలు అందిస్తోంది. అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక.. జగనన్న అమ్మఒడి కింద రానున్న ఏడాదిలో కూడా రూ.6,500 కోట్లను విద్యార్థుల తల్లులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జగనన్న గోరుముద్ద కింద రూ.1,164 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో అచ్చంగా అదనపు మెనూ కోసమే రూ.611.23 కోట్లను ప్రభుత్వం కేటాయించడం గమనార్హం. ఇక జగనన్న విద్యాకానుక కింద రూ.560 కోట్లను ఖర్చుచేయనుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మనబడి నాడు–నేడు కార్యక్రమం కోసం రూ.3,500 కోట్లను అందించనుంది. ఇంటర్మీడియెట్ విద్యకు రూ.779.47 కోట్లు అందించనుంది. -
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్లు, బూట్లు, సాక్స్లు, పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు, స్కూల్ బెల్ట్, మాస్క్ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. -
Andhra Pradesh చక్కని చదువు.. సొంతిల్లు
సాక్షి, అమరావతి: విద్య, గృహ నిర్మాణ రంగాలు సామాజిక ఆర్థిక ప్రగతిలో కీలకమని, ఈ రెండు రంగాల పట్ల బ్యాంకింగ్ రంగం మరింత సానుకూల దృక్పథంతో.. అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. శుక్రవారం తన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగిన 222వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది ఎంత మేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నారు.. ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారో వివరిస్తూ మార్గ నిర్దేశం చేశారు. రాష్ట్రంలో బ్యాంకింగ్ వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించిందని, ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉందని ప్రశంసించారు. అయితే విద్య, గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయి కన్నా రుణాలు తక్కువగా ఉన్నాయని అన్నారు. విద్యా రంగానికి కేవలం 42.91 శాతం, గృహ నిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారని.. సామాజిక–ఆర్థిక ప్రగతిలో ఈ రెండు కీలక రంగాలు అయినందున బ్యాంకింగ్ రంగం వీటి పట్ల మరింత సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ గృహ నిర్మాణాలకు ఊతమివ్వాలి ► 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ప్రభుత్వమే ఈ ఇళ్ల స్థలాలు సేకరించి, లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ ఏప్రిల్లో మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నాం. వీటితో కలిపి దాదాపు 25 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీలు సబ్సిడీ ధరలకు అందిస్తోంది. వీటికి అదనంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.35 వేలు రుణం 3 శాతం వడ్డీతో అందించాలని బ్యాంకులతో చర్చించాం. ఈ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. ► ఈ ఇళ్ల లబ్ధిదారులందరూ మహిళలే. వారి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రూ.35 వేల రుణం తీసుకోని వారికి త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నాం. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటే.. స్టీల్, సిమెంట్ వినియోగం వల్ల గ్రామీణ ఆర్థిక రంగ అభివృద్ధికి గణనీయమైన ఊతమొస్తుంది. మొత్తం 30.75 లక్షల ఇళ్ల నిర్మాణం జరగబోతుంది. ఇలా కడుతున్న ఒక్కో ఇంటి మార్కెట్ విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండబోతుంది. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ రంగానికి బ్యాంకులు మరింతగా సహకరించాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులకు మరింత బాసట ► వ్యవసాయ రంగంలో స్వల్ప కాలిక పంట రుణాల విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో 83.36 శాతానికి చేరుకున్నాం. వంద శాతానికి చేరుకోక పోవడంపై దృష్టి పెట్టి ఎస్ఎల్బీసీ సరైన చర్యలు తీసుకోవాలి. ► కౌలు రైతుల రుణాలకు సంబంధించి 2022 డిసెంబర్ వరకు కేవలం 49.37% మాత్రమే వార్షిక లక్ష్యాన్ని సాధించాం. 1,63,811 మంది కౌలు రైతు ఖాతాలకు మాత్రమే క్రెడిట్ను పొడిగించారు. కౌలు రైతుల రుణాల లక్ష్యం రూ.4,000 కోట్లు కాగా, మొదటి 9 నెలల్లో కేవలం రూ.1,126 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈ దృష్ట్యా వీరికి బ్యాంకులు మరింత బాసటగా నిలవాలి. ► రాష్ట్రంలో సాగయ్యే ప్రతి ఎకరా భూమికి ఇ–క్రాపింగ్ చేస్తున్నాం. డిజిటల్, ఫిజికల్ రశీదులు కూడా ఇస్తున్నాం. సాగు చేసే రైతు పేరు, విస్తీర్ణం, సాగు చేసిన పంట వివరాలన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నాం. విత్తనం నుంచి పంట విక్రయం దాకా తోడుగా నిలిచే ఆర్బీకే వ్యవస్థ రాష్ట్రంలో సమర్థవంతంగా పని చేస్తోంది. ► కౌలు రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నాం. భూ యజమానుల హక్కులకు భంగం లేకుండా కౌలు చేసుకునేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అవసరమైన పత్రాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాం. అందువల్ల కౌలు రైతులకు రుణాల విషయంలో బ్యాంకులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ వడ్డీతో మహిళలకు రుణాలు ► మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ విషయంలో బ్యాంకులు పునః పరిశీలన చేయాలి. మహిళలు దాచుకున్న డబ్బుపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తున్నారు. కానీ వారికిచ్చే రుణాలపై అధిక వడ్డీ వేస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించి, తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేలా చూడాలి. ► ఈ వడ్డీ రేట్లను పర్యవేక్షించడానికి.. అధికారులు, బ్యాంకర్లు కలిసి సమావేశం కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. దాదాపు కోటి మందికి పైగా మహిళలు ఉన్న ఈ రంగంలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ రంగంలో ఇప్పుడు ఎన్పీఏలు లేరు. వీరిపట్ల బ్యాంకులు ఉదారతతో ఉండాలి. సున్నా వడ్డీ, చేయూత, ఆసరా వంటి పథకాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్లో స్వయం సహాయక సంఘాల మహిళలు దేశానికే రోల్ మోడల్గా నిలిచారు. జూలైలో జగనన్న తోడు ► చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారి అవసరాలు తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.10,000 చొప్పున రుణాలు అందిస్తూ.. వీటిపై వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకూ 25 లక్షల మంది రుణాలు పొందారు. ► వీరికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్ రంగం కూడా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. జగనన్న తోడు తదుపరి దశను 2023 జూలైలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ► ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, వ్యవసాయ శాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు, ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్, యూనియన్ బ్యాంకు ఎండీ అండ్ సీఈఓ ఏ.మణిమేకలై, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్ కుమార్, నాబార్డు సీజీఎం ఎం ఆర్ గోపాల్, ఆర్బీఐ డీజీఎం వికాస్ జైస్వాల్, పలువురు బ్యాంకర్లు పాల్గొన్నారు. డిజిటల్ లైబ్రరీలకు సహకరించాలి ► సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు నిర్మించాం. ప్రతి ఊళ్లో ఇంగ్లిష్ మీడియం స్కూలు, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్లు కనిపిస్తాయి. అక్కడే డిజిటల్ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ లిమిటెడ్ బ్యాండ్విడ్త్తో వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించనున్నాం. కంప్యూటర్లు, వర్క్ ఫ్రం హోం సౌలభ్యంతో డిజిటల్ లైబ్రరీలు గ్రామాల స్వరూపాన్ని మార్చబోతున్నాయి. వీటి నిర్మాణానికి నాబార్డు, బ్యాంకులు సహకరించాల్సిన అవసరం ఉంది. ► యువతీ యువకులను సుశిక్షితంగా తయారు చేసేందుకు, వారికి ఉపాధి కల్పనను మెరుగు పరిచేందుకు ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పాఠ్య ప్రణాళిక, కోర్సుల బోధన, శిక్షణ కార్యక్రమాలను నిర్దేశించేందుకు ఒక యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ కార్యక్రమాలకు బ్యాంకులు బాసటగా నిలవాలి. గత ఏడాది లక్ష్యం మేరకు రుణాలు : ఎస్ఎల్బీసీ వెల్లడి ► ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపు ఇచ్చాం. మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కంటే ఎక్కువ రుణాలు ఇచ్చాం. ప్రాథమిక రంగానికి 2022–23 రుణ ప్రణాళిక లక్ష్యం రూ.2,35,680 కోట్లు కాగా, రూ.2,34,442 కోట్ల రుణాలు ఇచ్చాం. 99.47 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. ► వ్యవసాయ రంగానికి రుణాల లక్ష్యం రూ.1,64,740 కోట్లు కాగా 1,72,225 కోట్లతో 104.54 శాతం మేర ఇచ్చాం. ఎంఎస్ఎంఈ రంగానికి రుణాల లక్ష్యం రూ.50,100 కోట్లు కాగా, రూ.53,149 కోట్లతో 106.09 శాతం ఇచ్చాం. ► ప్రాథమికేతర రంగానికి రూ.83,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ.1,63,903 కోట్లు ఇచ్చాం. దాదాపుగా రెట్టింపు స్థాయిలో 195.59 శాతం మేర ఇచ్చాం. -
‘అట్టడుగు’కు చేరేలా అంతరాలు తగ్గేలా..
ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఆఫీసులో పనులు చక్కబెట్టుకోవచ్చు.. సంగీతం, సినిమాల వంటి వినోదమూ దొరుకుతుంది. మరి ఇంటర్నెట్ కారణంగా కూలీల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, వారి ఆరోగ్యం బాగుపడుతుందని ఎంత మందికి తెలుసు? అట్టడుగు వర్గాల వారికి చదువు అవకాశాలతోపావారిజీవితాలు బాగుపడతాయనీఎందరికి తెలుసు? కొన్ని సంస్థలు, ప్రభుత్వాల కృషితో ఇంటర్నెట్ విషయంలో ధనికులు– పేదలు, విద్యావంతులు– అత్తెసరు చదువరుల మధ్యఇప్పుడు అంతరం తగ్గుతోంది! 2025 నాటికి ఇది మరింత తగ్గనుంది! ఇందుకు బాటలు వేస్తున్న ‘ఎడిసన్ అలయన్స్’గురించి ఈ ప్రత్యేక కథనం.. ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు! వీరిలో 270 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనికి కారణాలెన్నో. ఈ పరిస్థితిని మార్చేందుకు 2021లో ఓ పెద్ద ప్రయత్నమే మొదలైంది. అదే ‘ఎడిసన్ అలయన్స్ (ఎసెన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వి సెస్ నెట్వర్క్ అలయన్స్’. 2025 నాటికి అదనంగా కనీసం వంద కోట్ల మందిని ఇంటర్నెట్ సూపర్ హైవేలోకి చేర్చాలన్నదే దీని లక్ష్యం. ఏదో వినోదం పంచేందుకు ఈ ప్రయత్నం జరగడం లేదు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక సేవలు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికీ చేరాలన్న ఉదాత్త లక్ష్యాన్ని ఈ అలయన్స్ తన భుజాలపైన వేసుకుంది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రుణాల వంటి ఆర్థిక సేవలు అందుబాటులోకి వస్తే వారి జీవితాలు మారిపోతాయని భావించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలోని ఆసక్తికరమైన అంశం.. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలూ భాగస్వాములు కావడం. పేద దేశాలు, లేదా డిజిటల్ సేవలు అందుబాటులో లేనివారికి వాటిని సులువుగా అందించడం, వాడుకునేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయి. సూటిగా చెప్పాలంటే ఇంటర్నెట్ సౌకర్యం చౌకగా అందించేందుకు, డిజిటల్ నైపుణ్యాలను నే ర్పించేందుకు, విద్య, వైద్యం అందించేందుకు జరుగుతున్న కృషి ఇది. రెండేళ్ల క్రితం మొదలైన ఎడిసన్ అలయన్స్ ఇప్పటివరకూ సాధించిందేమిటన్న దానిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఇటీవలే ఒక నివేదికను విడుదల చేసింది. రానున్న రెండేళ్లలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను సమీక్షించింది. లక్ష్యంలో ఇప్పటికే సగం.. 2021 జనవరిలో ప్రారంభమైన ఎడిసన్ అలయన్స్ తన భాగస్వాముల సాయంతో ఇప్పటివరకు సుమారు 45.4 కోట్ల మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపిందని వరల్ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. మొత్తం 90 దేశాల్లో 250కిపైగా కార్యక్రమాలు మొదలయ్యాయి. 2021లో మొత్తం 140 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ కానీ, రుణ వసతి గానీ లేకపోయింది. ఎడిసన్ అలయన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకూ కనీసం 28 కోట్ల మందికి ఈ–బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్స్, ఎల్రక్టానిక్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే సుమారు తొమ్మిది కోట్ల మంది ఆరోగ్యాన్ని డిజిటల్ ఆరోగ్య సేవల రూపంలో పరిరక్షించడం సాధ్యమైంది. టెలిహెల్త్, టెలిమెడిసిన్ వంటి టెక్నాలజీల సాయంతో వేర్వేరు ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. విద్య విషయానికొస్తే 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.4 కోట్ల మంది (ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు) పాఠశాలలకు దూరం కాగా.. ఎడిసన్ అలయన్స్ భాగస్వాములు ఆన్లైన్ విద్య, రిమోట్ లెర్నింగ్ సొల్యూషన్స్ సాయంతో కోటీ 18 లక్షల మందికి విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఉద్యోగం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపైనా శిక్షణ ఇవ్వడం గమనార్హం. ఎంతమందికి.. ఏయే రకంగా? ఎడిసన్ అలయన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి డిజిటల్ టెక్నాలజీ లాభాలు అందాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. డిజిటల్ రంగం మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టిన ఖర్చుతోనే 6.4 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక చెబుతోంది. అయితే 250 మంది భాగస్వాముల్లో మూడొంతుల మంది ఆన్లైన్ విద్యపై దృష్టిపెట్టినా దీనివల్ల బాగుపడిన వారి సంఖ్య కొంచెం తక్కువగానే ఉంది. నాణ్యమైన ఆన్లైన్ విద్యకు అవసరమైన వనరులు లేకపోవడం దీనికి కారణంగా చెప్తున్నారు. మొబైల్ బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు, ఆన్లైన్ సర్వి సుల ఖర్చులు తగ్గడం 12.8 కోట్ల మందికి ఉపయోగపడింది. దాదాపు 27 కోట్ల మందికి కనెక్టివిటీ లేదా డిజిటల్ సేవలు లభించడం మొదలైంది. ముందున్న సవాళ్లు.. ఇంకో మూడేళ్లలో 55 కోట్ల మందికి డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎడిసన్ అలయన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా మరిన్ని కంపెనీలను ఆహా్వనిస్తోంది. ప్రస్తుత భాగస్వాముల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే 50 శాతం మేర లక్ష్యాన్ని అందుకోవడంపై అలయన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగం మంది భాగస్వాములు లక్ష్యంలో 20 శాతాన్ని మాత్రమే చేరుకోవడంపై అసంతృప్తిగా ఉంది. వచ్చే రెండేళ్లలో పాత, కొత్త భాగస్వాములు వేగంగా లక్ష్యాల సాధనకు పూనుకోవాలని కోరింది. పర్వత ప్రాంతాలకు అపోలో ఆరోగ్య సేవలు ప్రఖ్యాత వైద్యసేవల సంస్థ అపోలో హాస్పిటల్స్, అపోలో టెలిహెల్త్ సర్వి సులను ఎడిసన్ అలయన్స్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాల్లో అందిస్తోంది. ఆ రాష్ట్రంలో వైద్యసేవలు, నిపుణుల కొరత ఎక్కువగా ఉండటంతో.. ఆ సమస్యను అధిగమించేందుకు డిజిటల్ టెక్నాలజీల సాయం తీసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నాలుగు కీలక ప్రాంతాల్లో టెలిమెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2021 జూలై నాటికి 22,727 టెలికన్సల్టేషన్లు అందించారు. 1,300కుపైగా ఎమర్జెన్సీ కేసులను డిజిటల్ పద్ధతిలోనే ఎదుర్కొని పరిస్థితిని చక్కదిద్దారు. టెలి డిస్పెన్సరీల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం ఒక విశేషమైతే.. రక్తహీనత, అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 4,000 మందితో విస్తృత ప్రయత్నం జరుగుతుండటం ఇంకో విశేషం. ‘‘ఎడిసన్ అలయన్స్లో భాగస్వామి అయిన మేం మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు డిజిటల్ డిస్పెన్సరీలు ప్రారంభించాం. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధుల నివారణ, నిర్దిష్ట సమస్యలపై టెలికన్సల్టేషన్ సర్వి సులు కూడా అందిస్తున్నాం’’అని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని చెప్పారు. అగ్రరాజ్యంలో వెరిజాన్ సేవలు అమెరికా టెక్ దిగ్గజ సంస్థ వెరిజాన్ ఆ దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని విద్యార్థులకు ఎడిసన్ అలయన్స్లో భాగంగా కనెక్షన్లు అందించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో లక్షల మంది విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదని.. ఈ కాలపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా నైపుణ్యాలు లేక విద్యార్థులు నష్టపోతున్నారని వెరిజాన్ గుర్తించింది. దీనిని అధిగమించేందుకు వెరిజాన్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ సాయంతో స్కూల్ డిస్ట్రిక్స్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా టెక్నాలజీ వినియోగంలో శిక్షణ ఇస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ (స్టెమ్) రంగాలకు సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 2021–22లో ఆ దేశవ్యాప్తంగా సుమారు 500 పాఠశాల్లో 6.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని అంచనా. ఈ కార్యక్రమం కోసం వెరిజాన్ వందకోట్ల డాలర్లకుపైగా ఖర్చు పెడుతోంది. - కంచర్ల యాదగిరిరెడ్డి -
ఆమె అక్షర... లక్ష్మి
సాక్షి, హైదరాబాద్: ఆడపిల్ల పాఠశాల విద్య పూర్తి చేయడమే గగనం. అవును నిజం.. కానీ ఇప్పుడది గతం. నేడు అగ్రభాగం ఆమె సొంతం. బడిలో బాలికలదే ముందంజ. ఉన్నత చదువు ల్లోనూ వనితే ఫస్ట్. అక్షరాన్ని ఆయుధంగా భావిస్తున్న నేటి మహిళలు విద్యారంగంలో సత్తా చాటుతున్నారు. ఇంకా ‘సగభాగమేంటి?’.. అంతకు మించే అని గర్వంగా చెబుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు..ఏ విశ్వవిద్యాలయాని కెళ్ళినా ప్రవేశాల సంఖ్యలో అమ్మాయిలదే మొదటి స్థానం. వందేళ్ళు దాటిన ఉస్మానియా సహా చాలా వర్సిటీల్లో వారే అధిక సంఖ్యలో ఉన్నారు. సంప్రదాయాల సంకెళ్లు తొలగి అవగాహన, ఆధునికత పెరగడం, దానికి తగినట్టుగా బడులు, కళాశాలలు పెద్ద సంఖ్యలో అందుబాటులోకి రావడం, ప్రత్యేక పాఠశాలలు, కాలేజీలు కూడా ఏర్పాటు కావడం, విద్య అవసరం అనే భావన పెంపొందడం..ఇవన్నీ మహిళలను ఉన్నత విద్య వైపు నడిపిస్తున్నాయి. అందుకే ఏ వర్సిటీ చూసినా, ఏ కోర్సు పరిశీలించినా మహిళల శాతమే మెరుగ్గా ఉంటోంది. అబ్బురపరిచే అంకెలు ► ఉస్మానియా వర్సిటీ పరిధిలో లా, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, బీఎడ్కు సంబంధించిన 20 కాలేజీలుంటే, అందులో 18,763 సీట్లున్నాయి. 2022లో వీటిల్లో 10,897 సీట్లు (58.09 శాతం) అమ్మాయిలే దక్కించుకున్నారు. ఓయూ క్యాంపస్లో 1,599 సీట్లుంటే 1,083 సీట్లు వారివే. పీజీ సెంటర్స్లోని 202 సీట్లలో అమ్మాయిల వాటా 107. ► జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో 2010–11లో 58 శాతం సీట్లు అబ్బాయిలతో భర్తీ అయ్యాయి. 2022లో సీన్ దాదాపు రివర్స్ అయ్యింది. చేరికల్లో అబ్బాయిలది 45 శాతం అయితే, అమ్మాయిలది 55 శాతం. ► పీజీలోనూ అమ్మాయిలదే హవా. వివిధ కోర్సుల్లో దాదాపు 80 శాతం మహిళలే ఉండటం విశేషం. కరోనా తర్వాత బాలురు ఇంజనీరింగ్, డిగ్రీతో ఉపాధి వైపు వెళ్తుంటే, అమ్మాయిలు మాత్రం పీజీలో చేరుతున్నారు. పరిశోధనల వరకూ వెళ్ళాలి మహిళల్లో ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. పోస్టు–గ్రాడ్యుయేషన్ వరకూ ఎక్కడా ఆగకుండా ముందుకెళ్తున్నారు. కానీ రీసెర్చ్ వరకూ వెళ్ళలేకపోతున్నారు. ఆరేళ్ళ వరకూ సమయం వెచ్చించాల్సి రావడం కొంత ఇబ్బందిగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉవంచుకుని మహిళలు, వారి తల్లిదండ్రుల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. – ప్రొఫెసర్ విజ్జులత, వీసీ, తెలంగాణ మహిళా యూనివర్సిటీ సాధికారత సాధించాలి విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. సామాజిక మార్పులు, ప్రభుత్వాల ప్రోత్సాహం వల్లే సమాజంలో మహిళలు ముందడుగు వేస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళలూ పోటీ పడుతున్న తీరు అభినందనీయం. మహిళాలోకం ఇదే స్ఫూర్తితో మరింత ముందడుగు వేయాలి. సాధికారిత సాధించాలి. – వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డిజిటల్ టెక్నాలజీ వైపు అడుగులేయాలి విద్యా రంగంలో అనునిత్యం వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలూ ముందుకెళుతున్నారు. వృత్తి విద్యా కోర్సుల్లో రాణించేలా ప్రస్తుత సమాజ పోకడలను అవగతం చేసుకుంటున్నారు. విద్యావంతులైన తల్లిదండ్రుల శాతం పెరగడమూ మహిళా విద్యకు ఊతం ఇస్తోంది. ప్రతి మహిళా డిజిటల్ టెక్నాలజీలో మరింత ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మా క్యాంపస్లో ప్రత్యేక కోర్సును డిజిటల్ టెక్నాలజీలో ప్రవేశపెడుతున్నాం. భవిష్యత్లో అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. – ప్రొఫెసర్ కవిత దార్నా, వీసీ, జేఎన్ఎఫ్ఏ విధాన నిర్ణేతలుగా ఎదగాలి చదువుతో సామాజికంగా మహిళ ఉన్నత శిఖరాలనే అధిరోహిస్తోంది. అయితే క్రిటికల్ జాబ్స్లో ఇంకా మహిళకు ఎదురీత తప్పడం లేదు. విధాన పరమైన నిర్ణయాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే ఈ పరిస్థితి మారుతుంది. అత్యున్నత పదవుల్లో ఉన్నా మహిళకు ఇంటి బాధ్యతలు తప్పడం లేదు. పురుషాధిక్య మానసిక ధోరణే దీనికి ప్రధాన కారణం. – సూర్యదేవర నీలిమ, సీఈఓ, అనురాగ్ యూనివర్సిటీ -
త్వరలో ‘నైపుణ్యాల హబ్’గా భారత్
న్యూఢిల్లీ: ప్రజల్లో అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యాలు, అవగాహనను పెంపొందించేందుకు విద్య, నైపుణ్యాల కల్పనపై మరింతగా ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యమని కేంద్ర నైపుణ్యాల అభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్షిప్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అప్పుడే వారు 21వ శతాబ్దంలో అవకాశాలను దక్కించుకోవడానికి సర్వసన్నద్ధులుగా ఉండగలరని పేర్కొన్నారు. ఈ దిశగా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న భారత్.. అతి త్వరలోనే ప్రపంచ నైపుణ్యాల హబ్గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్విట్జర్లాండ్కి చెందిన హోటల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ (హెచ్టీఎంఐ) భాగస్వామ్యం కుదుర్చుకున్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఆతిథ్య రంగంలో విద్యార్థులు కెరియర్ను ఏర్పర్చుకోవడానికి, అంతర్జాతీయంగా నిపుణుల కొరతను తగ్గించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని పేర్కొన్నారు. దీనితో డ్యుయల్ డిగ్రీ విధానంలో విద్యాభ్యాసం చేస్తున్న వారికి కచ్చితమైన ఉద్యోగావకాశాలు లభించగలవని, పరిజ్ఞానం పెంపొందించుకోగలరని ప్రధాన్ వివరించారు. హెచ్టీఎంఐకి ఆస్ట్రేలియా, చైనా, దుబాయ్, మారిషస్ తదితర దేశాల్లో క్యాంపస్లు ఉన్నాయి. స్విస్–యూరోపియన్ కలినరీ ఆర్ట్స్ మొదలైన విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులు అందిస్తోంది. -
5జీతో విద్య, వైద్యంలో పెను మార్పులు
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులతో హెల్త్కేర్, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ మొదలైన విభాగాల్లో భారీ మార్పులు రాగలవని టెలికం సంస్థ రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. వీటితో నగరాలు స్మార్ట్గా, సొసైటీలు సురక్షితమైనవిగా మారగలవని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబినార్లో పాల్గొన్న సందర్భంగా ఆకాశ్ అంబానీ ఈ విషయాలు చెప్పారు. ఆరోగ్యసంరక్షణ రంగంలో 5జీ వినియోగంతో అంబులెన్సులు డేటా, వీడియోను రియల్ టైమ్లో వైద్యులకు చేరవేయగలవని, రిమోట్ కన్సల్టేషన్లు, వేగవంతమైన రోగనిర్ధారణ విధానాలతో మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందించడం సాధ్యపడుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం విషయానికొస్తే వాతావరణం తీరుతెన్నులు, నేలలో తేమ స్థాయి, పంటల ఎదుగుదల మొదలైన వాటి గురించి డేటా ఎప్పటికప్పుడు పొందడం ద్వారా సరైన సాగు విధానాలు పాటించేందుకు వీలవుతుందని ఆకాశ్ చెప్పారు. అంతిమంగా సమాజంపై 5జీ, అనుబంధ టెక్నాలజీలు సానుకూల ప్రభావాలు చూపగలవని వివరించారు. -
ఎన్ని విమర్శలు వచ్చినా.. విద్యార్థులకు మంచి చేయాలనేదే లక్ష్యం
సాక్షి, విజయవాడ: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకువచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్య ఒక్కటే అనే విధానంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందులో భాగంగా విద్యా రంగంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మొదట అమలు చేసేది ఆంధ్రప్రదేశ్లోనేనని వ్యాఖ్యానించారు. మేధావులు, విద్యావేత్తలు అయిన సి.వి.రామన్, అబ్దుల్ కలాం, రామానుజన్ జీవితాలను ప్రతి ఒక్క విద్యార్ధి ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. విద్యార్థులంతా తమ దైనందిన కార్యక్రమాల్లో సైన్సుకు సంబంధించిన అంశాలను గుర్తించి.. వాటిపై పరిశోధనలు చేసే స్థాయికి రావాలన్నారు. ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా విద్యార్థుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని.. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన వంటి పథకాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయన్నారు. విద్యా రంగంలో చేస్తున్న మార్పుల వల్ల విమర్శలు వస్తున్నా.. లెక్క చేయకుండా విద్యార్థులకు మంచి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. విద్యార్థులు మరింత హుందాగా కనిపించాలన్న యోచనతో వచ్చే సంవత్సరం విద్యార్థుల యూనిఫామ్లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గతంలో ఢిల్లీలో విద్యా విధానం బాగుందని వార్తల్లో చూసే వాళ్ళం.. నేడు ఏపీలో ఢిల్లీని మించిన విద్యను ప్రభుత్వం అందిస్తోందన్నారు. సమాజ శ్రేయస్సు, పిల్లల భవిష్యత్తు ప్రధాన ఆశయంగా పాఠశాల విద్యను మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు : మంత్రి బొత్స
-
బాబుకు స్క్రిప్టు కోసమే! మనబడి నాడు–నేడుపై ‘ఈనాడు’ కబోది కథనం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లు బాగు పడుతుంటే ఆనందించాల్సింది పోయి.. అదెక్కడ టీడీపీ కొంప ముంచుతుందోనని ‘ఈనాడు’ పనిగట్టుకుని తప్పుడు రాతలు రాస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సకల వసతులతో తీర్చిదిద్దుతుండటం కళ్లెదుటే కనిపిస్తున్నా, లేదు లేదంటూ ప్రజల్లో విష బీజాలు నింపడానికి విఫలయత్నం చేస్తోంది. నాడు–నేడు రెండో దశ కింద ఏకంగా 22,344 స్కూళ్లలో పనులు జరుగుతుంటే.. అక్కడెక్కడో పనులు ఆగిపోయాయని యాగీ చేస్తోంది. చంద్రబాబు హయాంలో కనీసం చాక్పీస్లకు కూడా గతిలేని వైనాన్ని మరచిపోయి.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ కోడి గుడ్డుపై ఈకలు పీకుతోంది. వేల కోట్ల రూపాయలతో ఊరూరా ప్రభుత్వ స్కూళ్లలో పనులు జరుగుతుండటం ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా దిగజారుడు రాతలు రాస్తోంది. ప్రజలేమనుకుంటారోనన్న భయం లేకుండా తన చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలని ఉవ్విళ్లూరుతూ రోజుకో రీతిలో తప్పుడు కథనం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగం అనూహ్య రీతిలో అద్భుత ఫలితాలిస్తోందని వేనోళ్లా ప్రశంసలు వ్యక్తమవుతుండటాన్ని జీర్ణించుకోలేని రామోజీ రావు ఏదో ఒక రీతిలో ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేయడమే పనిగా పెట్టుకుని ముందుకు వెళుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ‘నాడు–నేడుకు నిధుల్లేవ్’ అంటూ తాజాగా తన అక్కసు వెళ్లగక్కింది. ఒక్క అధికారితో మాట్లాడకుండా, విద్యా శాఖ నుంచి వివరాలు తీసుకోకుండా తనకు తోచిన లెక్కలతో బాబుకు స్క్రిప్టు అందిస్తోంది. ఆరోపణ: నాడు–నేడుకు నిధులు లేవు వాస్తవం: ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా తీర్చిదిద్దేలా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. పేదల బతుకులు మార్చే ఏకైక సాధనం విద్య మాత్రమే అని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మార్చే నాడు–నేడు కార్యక్రమంతో పాటు, మరెన్నో సంస్కరణలు, గొప్ప గొప్ప మార్పులు తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరించాక ప్రభుత్వ విద్యా రంగంపై ఇంతటి వ్యయం కాని, దృష్టి కాని ఎన్నడూ.. ఎవ్వరూ పెట్టలేదు. మన బడి నాడు – నేడు మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,713 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి, 2021–22లో పూర్తి చేశారు. 2021–22లో 22,344 విద్యా సంస్థల్లో రూ.8,000 కోట్లతో రెండవ దశ పనులు చేపట్టారు. విద్యా రంగం నాడు–నేడు ఇదీ పరిస్థితి ► గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య ఐదేళ్లపాటు పాఠశాలల్లో అభివృద్ధి కోసం రూ.1,709.64 కోట్లు మాత్రమే కేటాయించారు. అవీ పూర్తిగా ఖర్చు చేయలేదు. ఉదాహరణకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2014–2019 వరకు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచడానికి ఐదేళ్ల కాలంలో నాటి ప్రభుత్వం రూ.76.85 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్–1, ఫేజ్–2లో చిత్తూరు జిల్లాకు ఏకంగా రూ.1,133.09 కోట్లు కేటాయించింది. ఫేజ్ –1 కింద ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ► రూ.668 కోట్లతో ట్యాబులను, రూ.778 కోట్ల విలువగల బైజూస్ కంటెంట్తో ఎనిమిదో తరగతి చదివే 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 మంది ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరం పంపిణీ చేశారు. ► 5,800 పాఠశాలలకు 6వ తరగతిపైన ఉన్న 30,302 తరగతి గదులకు డిజిటల్ బోర్డు (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్) 2023 జూన్ నాటికే అందించేలా సన్నాహాలు చేపట్టారు. దిగువ తరగతులు ఉన్న స్కూళ్లకు అంటే, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలలో 10 వేల స్మార్ట్ టీవీలను అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ► పిల్లల చదువుకు తల్లిదండ్రుల పేదరికం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘జగనన్న అమ్మఒడి’ అనే వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. ఈపథకం కింద అర్హులైన తల్లులు, సంరక్షకులకు ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తోంది. 2019–20లో 42,33,098 మంది, 2020–21లో 44,48,865, 2021–22లో 43,96,402 మంది తల్లులకు సాయం అందించారు. ► రాష్ట్రంలోని లోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యా బోధనను ప్రవేశ పెట్టారు. 1 నుంచి 6 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలను ఆంగ్లం, తెలుగు మాధ్యమంలో, ద్విభాషా విధానంలో రూపొందించారు. 1 నుంచి 5 తరగతుల వరకు పాఠ్య పుస్తకాలతో పాటు వర్క్ బుక్ లను ప్రవేశపెట్టారు. ► ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంచడం కోసం ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు చిత్రాలతో కూడిన డిక్షనరీ ఇస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇస్తున్నారు. విద్యార్థులకు మిర్రర్ ఇమేజ్లో ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇంతకుముందు 3, 4, 5 తరగతులకు ఇంటర్మీడియట్, డీఎడ్ మాత్రమే విద్యార్హతలుగా ఉన్న ఉపాధ్యాయులు బోధించేవారు. ఇప్పుడు, ఈ తరగతులకు బీఎస్సీ, బీఈడీ అర్హతలున్న ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నారు. ప్రభుత్వం 10,114 మంది సబ్జెక్ట్ టీచర్లను ఏర్పాటు చేసింది. ► జగనన్న విద్యా కానుక కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రు.2323.99 కోట్లు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి స్కూలు ప్రారంభం రోజు 3 జతల బట్టలు, షూస్, బెల్ట్, స్కూల్ బ్యాగ్, డిక్షనరీ, టెక్స్ బుక్స్, తదితరాలను ఇస్తోంది. 2016–17లో ప్రభుత్వ బడులలో 37,57,474 విద్యార్థులు ఉండగా, ఈ కార్యక్రమాలన్నింటి వల్ల విద్యార్థుల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆరోపణ: రంగులు వెలుస్తున్నాయి వాస్తవం: పనులే జరగలేదని చెబుతున్న ఈనాడు రంగులు వెలిసిపోతున్నాయని చెప్పడం విడ్డూరం. ప్రభుత్వ పాఠశాలల్లో రన్నింగ్ వాటర్తో టాయిలెట్లు, తాగునీటి సరఫరా, చిన్న, పెద్ద మరమ్మతులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, ప్రహరీ, ఫర్నీచర్, క్యాంపస్ మొత్తానికి పెయింటింగ్, గ్రీన్ బోర్డు, ఇంగ్లిష్ ల్యాబ్ (స్మార్ట్ టీవీలు), కిచెన్ షెడ్లు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతులు (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు) ఇలా 12 రకాల సదుపాయాలను కల్పిస్తోంది. వేలాది స్కూళ్లలో ఇంతగా మేలు చేస్తుండటం రామోజీరావుకు కనిపించడం లేదు కాబోలు. రంగులు ఎక్కడ వెలిసిపోయాయో చెప్పకుండా, చూపకుండా ఆవు కథ రాశారు. ఆరోపణ : రూ.1,000 కోట్ల చెల్లింపులు ఆగిపోయాయి వాస్తవం: మన బడి నాడు – నేడు రెండవ దశ కింద రూ.8,000 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు రూ.3,750 కోట్లు విడుదల చేశారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయనే కనీస పరిజ్ఞానం లేని వారెవరూ ఉండరు. ఈనాడు చెబుతున్న రూ. వెయ్యి కోట్ల చెల్లింపులు గత నెలవి అయ్యుంటాయి. అవి ఈ నెలలోనో.. వచ్చే నెలలోనో విడుదలవుతాయి. రూ.8 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నప్పుడు రూ.వెయ్యి కోట్లు పెండింగ్లో ఉంటే.. మొత్తం నాడు–నేడు కార్యక్రమమే ఆగిపోయినట్లు తప్పుడు రాతలు రాయడం చంద్రబాబు కోసమే కదా! ఆ తప్పుల తడక చిట్టా పట్టుకుని చంద్రబాబు ఊదరగొట్టాలనేగా! ఈ లెక్కన బిల్లులు రావని కాంట్రాక్టర్లలో భయం పెంచి, ఎలాగైనా సరే ఆ పనులు ఆపేయించాలన్నది రామోజీ పన్నాగం అని స్పష్టమవుతోంది. ఇది నిజం కాకపోతే రూ.3,750 కోట్లు చెల్లించారనే వాస్తవాన్ని ఎందుకు రాయలేదు రామోజీ? ఆరోపణ : విద్యార్థుల అవస్థలు వాస్తవం: పెద్ద ఎత్తున్న పనులు జరుగుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న పాటి అసౌకర్యాలు సహజం. దాన్ని కూడా భూతద్దంలో చూపడం దారుణం. ఈనాడు చెబుతున్నట్లు రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలోనూ పిల్లలు ఇబ్బంది పడటం లేదు. చంద్రబాబునాయుడి ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేసినా, తూతూమంత్రంగా నిధులు విదిలించినా ఒక్క మాటా రాయని ఈనాడు నేడు వేల కోట్లతో అన్ని విద్యా సంస్థలనూ సర్వాంగ సుందరంగా మారుస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. -
ఏపీ విద్యా వ్యవస్థ భేష్.. స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ప్రత్యేకించి విద్యా వ్యవస్థ అద్భుతమని స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ కొనియాడారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అయితే ఇండియాలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఆ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయని కొనియాడారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చుతోందని, ఇది గర్వించదగ్గ విషయం అని అన్నారు. కొంత కాలం తర్వాత ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా నిలుస్తారని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అందరి వల్లా కాదని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి ఉన్న వారికే సాధ్యమవుతుందని చెప్పారు. ఆకట్టుకున్న ఏపీ స్టాల్ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్టాల్ పలువురిని ఆకట్టుకుంది. స్వయంగా దేశాధ్యక్షుడే ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు వ్యక్తం చేయడంతో స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ స్టాల్ను సందర్శించారు. ప్రభుత్వ పథకాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఎడ్యుకేషన్ కోసం నాడు–నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాలు మెరుగుదల.. తదితర విషయాలపై ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. డిజిటల్ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్లో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ల పంపిణీ, పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్ బోర్డుల ఏర్పాటు, ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన తదితర కార్యక్రమాలన్నీ పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో న్యూట్రిషన్ ఫుడ్ అందించడం మంచి పరిణామం అన్నారు. చదవండి: టీడీపీకి పుట్టగతులుండవని ‘ఈనాడు’ భయం లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ‘ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్’ విధానం చాలా నచ్చిందన్నారు. ఏపీ స్టాల్ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. గరŠల్స్ ఎడ్యుకేషన్ విధానంతో అసమానతలను రూపుమాపవచ్చని అభినందించారు. డిజిటల్ ఎడ్యుకేషన్లో భాగంగా బైజూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో గొప్పగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియా నుండి ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు వున్నవ షకిన్ కుమార్ పాల్గొన్నారు. -
జెనీవా ఇంటర్నేషనల్ వేదికపై ఏపీ విద్యా విధానం స్టాల్
-
అటు మూత.. ఇటు కోత
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏటా కనీసం 50కిపైగా ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత కోసం దరఖాస్తు చేసుకుంటున్నాయి. మరికొన్ని వేల సంఖ్యలో కోర్సులను రద్దు చేసుకుంటున్నాయి. ఇబ్బడిముబ్బడిగా కాలేజీలు ఏర్పాటు కావడం, కొన్ని కోర్సులకే ఆదరణ ఉండటం, చేరికలు తగ్గి కాలేజీల నిర్వహణ భారంగా మారడం, నైపుణ్యాలు కొరవడి ప్లేస్మెంట్లు తగ్గిపోవడం ఈ దుస్థితికి కారణమని నిపుణుల కమిటీలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల కమిటీల సూచనల మేరకు ఏఐసీటీఈ 2019లో కొత్త కాలేజీలకు అనుమతులపై మారటోరియం విధించింది. 2014–15 నుంచి జాతీయస్థాయిలో 767 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడినట్లు అఖిల భారత సాంకేతిక విద్యామండలి 2021–22 నివేదికలో వెల్లడించింది. మరికొన్ని కాలేజీలు ఆదరణ లేకపోవడంతో 10,539 కోర్సులను రద్దు చేసుకున్నాయి. 2021–22 నాటికి దేశంలో ఇంజనీరింగ్ తదితర సాంకేతిక కోర్సుల్లో 24 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2014–15లో మొత్తం సీట్ల సంఖ్య 31.8 లక్షలు కాగా తరువాత నుంచి ఏటా తగ్గుతూ వస్తోంది. ఏడెనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో సగం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. ఇదీ జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సుల పరిస్థితి నేడు రాష్ట్రంలో వెన్నుతట్టి ప్రోత్సాహం విద్యారంగ సంస్కరణలు చేపట్టి ఉన్నత చదువులు ఏమాత్రం భారం కాకుండా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నారు. విద్యార్థి చదువుకు అయ్యే మొత్తం ఫీజును జగనన్న విద్యాదీవెన కింద ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రతి త్రైమాసికంలో నిర్దిష్టంగా చెల్లిస్తూ చదువులకు భరోసా కల్పిస్తోంది. అంతేకాకుండా వసతి దీవెన కింద రూ.20 వేలు చొప్పున విద్యార్థులకు అందజేస్తోంది. మరోవైపు గత సర్కారు బకాయిపెట్టిన ఫీజులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వమే చెల్లించి విద్యార్థులను ఆదుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 తరువాత రాష్ట్రం నుంచి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ కూడా మూసివేత కోసం దరఖాస్తు చేయలేదని ఏఐసీటీఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. ► అన్ని కాలేజీల్లో నిబంధనల ప్రకారం సదుపాయాలు, బోధనా సిబ్బంది, న్యాక్ అక్రిడిటేషన్ తప్పనిసరి. ► సిలబస్లో సంస్కరణలు. కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి. ► ఇంటర్న్షిప్ తప్పనిసరి. స్కిల్ ఆధారంగా 30 శాతం కోర్సులకు రూపకల్పన. ► మైక్రోసాఫ్ట్ ద్వారా 1.62 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధిపై ఉచిత శిక్షణ. ► నాస్కామ్, ఏపీఎస్ఎస్డీసీ సంస్థల ద్వారా యువతకు శిక్షణ కార్యక్రమాలు. ► 2018–19లో రాష్ట్రంలో ప్లేస్మెంట్ల సంఖ్య 37 వేలు కాగా 2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు, 2021–22లో 85 వేలకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయనేందుకు నిదర్శనం. నాడు 65 కాలేజీల మూసివేత టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 65 కాలేజీల యాజమాన్యాలు తమ విద్యా సంస్థలను మూసివేసినట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత సర్కారు విద్యారంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేయడంతో ఇంజనీరింగ్ విద్య ప్రమాణాలు కొరవడి అధ్వానంగా మారింది. కాలేజీల ఫీజు ఎంత ఉన్నా రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్గా ఇస్తామనడం, అరకొర ఫీజులు కూడా ఏటా సక్రమంగా ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ విద్య అస్తవ్యస్థమైంది. 2019లో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి కాలేజీలకు రూ.1,800 కోట్ల మేర ఫీజులు బకాయి పెట్టడం గమనార్హం. దీంతో మూసివేత దిశగా విద్యాసంస్థలు సాగాయి. ► పుట్టగొడుగుల్లా వెలిసిన కాలేజీల్లో ఏఐసీటీఈ / ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రకారం మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బంది ఉండడం లేదు. ధనార్జనే ధ్యేయంగా మొక్కుబడిగా నిర్వహించడంతో ప్రమాణాలు పడిపోయి విద్యార్థులకు నైపుణ్యాలు కొరవడ్డాయి. ఫలితంగా ప్లేస్మెంట్లు సన్నగిల్లాయి. చదువులు ముగియగానే ఉద్యోగావకాశాలు దొరకడం గగనంగా మారింది. అదనపు నైపుణ్యాలు, సర్టిఫికేషన్ కోర్సులను కూడా పూర్తి చేస్తే కానీ ఉద్యోగాలు దక్కడం లేదు. ► ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ నిరంతరం కొత్త అంశాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో నైపుణ్యాలను సాధించిన వారికి అవకాశాలు లభిస్తున్నాయి. పలు కాలేజీల్లో కోర్సులు, బోధనా వనరులు, సదుపాయాలు లేవు. వరుసగా మూడేళ్లు 25 శాతం కన్నా చేరికలు తక్కువగా ఉండే కాలేజీలు, కోర్సులకు ఏఐసీటీఈ అనుమతులు రద్దు చేస్తోంది. ► ఇండియా స్కిల్ నివేదిక ప్రకారం ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారిలో 48శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. -
అత్యున్నత ప్రమాణాలతో సర్కారు విద్య
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొనేలా అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పిల్లలకు మేలు చేసేలా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ రంగంలో ఎక్కడా అమలు కాని రీతిలో మనబడి నాడు–నేడు, జగనన్న అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక వంటి అనేక విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. తాజాగా జగనన్న గోరుముద్ద కింద విద్యార్థులకు మరింత పౌష్టిక ఆహారాన్ని ఇవ్వడంలో భాగంగా ప్రస్తుత మెనూకు అదనంగా వచ్చే నెల 2 నుంచి రాగిజావను కూడా అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్న శ్రీ సత్యసాయి చారిటబుల్ ట్రస్టు, విద్యా శాఖ అధికారులు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎంమాట్లాడుతూ.. సత్యసాయి ట్రస్టు భాగస్వామ్యం కావడం ద్వారా.. భగవాన్ సత్యసాయి కూడా ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి ముందుకు తీసుకుపోతున్నారని చెప్పవచ్చన్నారు. గోరుముద్ద కార్యక్రమంలో రాగి జావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టికాహారం పిల్లలకు అందుతుందన్నారు. కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1,700 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. మూడున్నరేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే మన ప్రభుత్వ హయాంలో ఆ ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగిందని వివరించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విద్యా రంగంలో కీలక సంస్కరణలు ► విద్యా రంగంలో అనేక కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి మొదలు.. నాడు–నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్థను మార్పు చేసే వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ►6వ తరగతి, ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ఫ్లా్లట్ ప్యానల్స్(ఐఎఫ్పీ)ను ఏర్పాటు చేస్తున్నాం. 30,230 తరగతి గదుల్లో వీటిని పెడుతున్నాం. నాడు–నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15 వేల స్కూళ్లలో జూన్ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ►నాడు–నేడులో ఆఖరు కాంపొనెంట్ కింద 6వ తరగతి, ఆపై తరగతులను డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంతకంటే దిగువ తరగతుల వారికి స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్ల పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్నాం. పిల్లల కరిక్యులమ్ను బైజూస్ కంటెంట్తో అనుసంధానం చేస్తూ.. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. ►గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత విద్యలో చేరే పిల్లలందరికీ ప్రభుత్వం పూర్తి స్థాయి అండదండలు అందిస్తోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పిల్లల కోసం విద్యా దీవెన కింద 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నాం. రూ.20 వేల వరకు వసతి దీవెన అమలు చేస్తున్నాం. ►విదేశీ విద్యా దీవెన కూడా అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమమైన 50 కాలేజీలలో, 21 రకాల విభాగాలు, లేదా కోర్సులకు సంబంధించి సీట్లు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి రూ.1 కోటి వరకు ప్రభుత్వం అందిస్తుంది. ►రేపు (నేడు) కళ్యాణమస్తు ప్రారంభిస్తున్నాం. ఈ పథకంలో అర్హత పొందాలంటే కనీసం పదోతరగతి పాస్ కావాలనే నిబంధన విధించాం. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీ ఎన్ దీవాన్రెడ్డి, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 37,63,698 విద్యార్థులకు పౌష్టికాహారం జగనన్న గోరుముద్ద ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో 37,63,698 మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. పిల్లల్లో ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి ఈ పథకం కింద తాజాగా రాగి జావను చేర్చింది. బడి ఈడు పిల్లల నమోదును పెంచడంతో పాటు వారిలో ధారణ సామర్థ్యం మెరుగుపర్చి, డ్రాపౌట్స్ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూల్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. రోజుకో మెనూలో భాగంగా పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు, మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ.. చిక్కీ ఇవ్వని రోజుల్లో చిరుధాన్యాలను మధ్యాహ్న భోజనంలో భాగం చేయించారు. తాజాగా వారంలో మూడు రోజులు రాగి జావ ఇవ్వనున్నారు. ఒప్పందం మూడేళ్లు సీఎం ఆలోచనలు, ఆదేశాలతో మార్చి 2 నుంచి రాగి జావను జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అందించనున్నాం. దీనికి రూ.86 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. ఇందులో సత్యసాయి ట్రస్టుకు భాగస్వామ్యం కల్పించాం. దీనికి అవసరమైన రాగి పిండి, బెల్లం పిండి ట్రస్టు సరఫరా చేస్తుంది. దీని ఖరీదు సుమారు రూ.42 కోట్లు ఉంటుంది. మూడేళ్ల పాటు వీరు సరఫరా చేస్తారు. దీనికి సంబంధించి ఇవాళ ఒప్పందం చేసుకుంటున్నాం. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి సీఎం కృషితో విద్యా రంగానికి పునరుజ్జీవం పిల్లలకు రాగి జావ ఇవ్వడం మంచి కార్యక్రమం అని మా ట్రస్టు సభ్యులందరూ చెప్పడంతో ముందుకొచ్చాం. సీఎం జగన్ నాయకత్వంలో విద్యా రంగానికి పునరుజ్జీవనం వచ్చింది. సీఎం చెబుతున్న ప్రతి మాట అమలు చేసి చూపిస్తున్నారు. విద్యా రంగంలో పథకాలన్నీ అద్భుతం. అమ్మచేతి గోరుముద్ద గుర్తుకు వచ్చేలా మధ్యాహ్న భోజనానికి మంచి పేరు పెట్టారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారుస్తున్నారు. కొత్త జిల్లాకు శ్రీ సత్యసాయి జిల్లాగా పేరు పెట్టినందుకు ధన్యవాదాలు. – రత్నాకర్, శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ -
గాడిలో పడ్డ చదువులు.. సత్ఫలితాలిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా విపత్తు అన్ని రంగాలనూ అతలాకుతలం చేసింది. దాని ప్రభావం విద్యా రంగం పైనా తీవ్రంగా పడింది. దేశవ్యాప్తంగా విద్యా రంగం రెండుళ్లు దాదాపు స్తంభించిపోయింది. స్కూళ్లు, ఆట పాటలు లేక విద్యార్థులు మానసికండా కుంగిపోయారు. కరోనా సమయంలో పాఠశాలల విద్యార్థులకు బోధన పూర్తిస్థాయిలో అందక తరగతికి తగ్గ సామర్థ్యాలు దెబ్బతిన్నాయి. మన రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. చదువులకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. చదువుల్లో విద్యార్థులు ఎక్కడా వెనకబడకుండా త్వరితగతిన చర్యలు చేపట్టేలా విద్యా శాఖను సమాయత్తం చేశారు. కరోనా విజృంభణ సమయంలో ఆన్లైన్ తరగతులు, ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాల్లోని విద్యార్థులకు వీడియోలతో పాఠాలు చెప్పించారు. కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో పలు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని రాష్ట్రాలకంటే ముందుగానే స్కూళ్లు తెరిపించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూనే, తరగతుల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించారు. ఇది సత్ఫలితాలనిచ్చింది. విద్యార్థులు ఉల్లాసంగా పాఠశాలలకు రావడం ప్రారంభించారు. ఇప్పుడు రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ, బోధనాభ్యసన కార్యక్రమాలు క్రమపద్ధతిలో సాగుతున్నాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. కరోనాతో తగ్గిన పాఠశాలల పనిదినాలు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రతి ఏటా జూన్ 12న ప్రారంభమై మరుసటి ఏడాది ఏప్రిల్ చివరి వరకు ఉంటుంది. పర్వదినాలు, జాతీయ దినోత్సవాలు, ఇతర సెలవులు అన్నీ పోను 220 రోజులు తరగతులు తప్పనిసరిగా జరగాలి. 2019 సంవత్సరంలో కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని రంగాలతో పాటు విద్యా రంగమూ అతలాకుతలమైంది. 2019 – 20 విద్యా సంవత్సరం చివర్లో (2020 మార్చి 24న) కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. దీంతో అన్ని రంగాలతో పాటు పాఠశాలలూ మూతపడ్డాయి. 203 రోజులే పాఠశాలలు నడిచాయి. 2020 – 21 విద్యా సంవత్సరంలో రెండోసారి కరోనా వైరస్ విజృంభణతో మళ్లీ పాఠశాలల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలిగింది. ఆన్లైన్లోనే బోధన సాగింది. పాఠశాలలు లేక విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. పిల్లల చదువులకే అత్యధిక ప్రాధాన్యమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక ముందు జాగ్రత్తలతో పాఠశాలలను తెరిపించేలా ఆదేశాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లోకన్నా ముందుగా స్కూళ్లు తెరిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. స్కూళ్లను పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయించడం, అందరికీ మాస్కులు తప్పనిసరి చేయడంతో సహా అనేక ముందు జాగ్రత్తలతో స్కూళ్లను తెరిచింది. పబ్లిక్ పరీక్షలుండే 10వ తరగతితో పాటు 8, 9 తరగతులు ముందుగా ప్రారంభించింది. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాత మిగతా తరగతులనూ ప్రారంభించింది. ఈ ఏడాది ఇతర రాష్ట్రాలకన్నా ముందుగా అన్ని జాగ్రత్తలతో నవంబర్ 2 నుంచి స్కూళ్లను పునఃప్రారంభించారు. విద్యార్ధులందరూ ఒకేసారి కాకుండా భౌతిక దూరం పాటించేలా కొన్ని తరగతులను ఉదయం, మరికొన్ని తరగతులను మధ్యాహ్నం నిర్వహించింది. పై తరగతుల వారికి ఎక్కువ రోజులు బోధన జరిగేలా చర్యలు చేపట్టింది. కనిష్టంగా ప్రైమరీ తరగతులకు 50 పని దినాలు, గరిష్టంగా పై తరగతులకు 130 వరకు పనిదినాలు ఉండేలా చూశారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లు యథాతథంగా సాగేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆ సంవత్సరంలో 180 రోజుల పాటు పాఠశాలలు నడిచాయి. ప్రస్తుత (2022–23) విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో తరగతులు జరుగుతున్నాయి. పాఠశాలల పనిదినాలకు ఇబ్బంది రాకుండా పర్వదినాల్లోని సెలవులను కూడా సర్దుబాటుచేసి తరగతులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఈ ఏడాది 220 రోజులు స్కూళ్లు కొనసాగనున్నాయి. కోవిడ్లో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సహాయ కార్యక్రమాలు కోవిడ్ కారణంగా 2019–20, 2020–21లో పాఠశాలల నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో పిల్లల చదువులు దెబ్బతినకుండా ఏ రాష్ట్రంలోనూ లేని అనేక చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. వాటిలో ప్రధానమైనవి.. ► దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా టెన్త్ విద్యార్థులకు ఆన్లైన్లో వీడియో పాఠాలను ప్రసారం చేయించింది. ► విద్యామృతం అనే నూతన కార్యక్రమాన్ని నిర్వహించింది. ► టీవీ ప్రసారాలు అందుకోలేని టెన్త్ విద్యార్థుల కోసం విద్యా కలశం పేరుతో రేడియో ద్వారా పాఠాలను ప్రసారం చేసింది ► ఇంటర్నెట్, టీవీ ప్రసారాలు లేని మారుమూల కొండ ప్రాంతాలకు ప్రత్యేకంగా స్క్రీన్ ప్రొజెక్టర్తో కూడిన వాహనాలను పంపించి, అక్కడి విద్యార్థులకు వీడియో ద్వారా పాఠాలు బోధించింది ► ఎస్సీఈఆర్టీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాఠాలు, ఇతర విద్యా కార్యక్రమాలను ప్రసారం చేయించింది ► టీచర్లలో బోధనా విధానాలపై నూతన ఒరవడులను పెంచేందుకు వెబినార్ల ద్వారా శిక్షణ ఇచ్చింది. వీటి ద్వారా 1.30 లక్షల మంది ఉపాధ్యాయులు ఇంగ్లీషులో ప్రావీణ్యం సంపాదించారు. ► పాఠశాలలు తెరిచాక తదుపరి విద్యా సంవత్సరాల్లో పై తరగతులకు వెళ్లే విద్యార్థుల్లో లోపాల సవరణకు బ్రిడ్జి కోర్సులను నిర్వహించింది. ► 2020 – 21 విద్యా సంవత్సరంలో విద్యా వారధి పేరుతో దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ ద్వారా ఆన్లైన్ తరగతులు ప్రసారం చేయించింది ► విద్యార్థులకు సందేహా నివృత్తికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కేటాయించింది. ఈ నంబర్కు ఫోన్ చేసిన వారికి విద్యావేత్తల ద్వారా సందేహాలు నివృత్తి చేయించింది. ► టీఎల్ఎం పోటీలు, కవర్ పేజీ డిజైన్లు, పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలతో విద్యార్థులను ప్రోత్సహించింది. ► కోవిడ్ సమయంలో ఇళ్లకే పరిమితమైన ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందిపడకుండా సుమారు 36,88,610 మందికి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా రోజువారీ బియ్యం, గుడ్లు చిక్కీలతో కూడిన డ్రై రేషన్ పంపిణీ చేయించింది. -
పెట్టుబడులు, ఆవిష్కరణలతో ఉపాధికి ఊతం
న్యూఢిల్లీ: వ్యవసాయం, విద్య, ఇంధన రంగాలు వచ్చే దశాబ్ద కాలానికి ఉపాధి పరంగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవిగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) పేర్కొంది. ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ రంగాల్లో సాంకేతికత, ఆవిష్కరణలను పెట్టుబడులతో ప్రోత్సహించాల్సిన అవసరాన్ని సూచించింది. వీటిని రేపటి ఉపాధి మార్కెట్లుగా అభివర్ణించింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది కంపెనీల ఎగ్జిక్యూటివ్లతో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 120 ఆర్థిక వ్యవస్థల్లో అగ్రిటెక్, ఎడ్టెక్, ఇంధన ఆధారిత టెక్నాలజీలు వచ్చే పదేళ్ల కాలానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని డబ్ల్యూఈఎఫ్ సర్వే గుర్తించింది. ‘రేపటి మార్కెట్లు 2023’, ‘ప్రపంచ వృద్ధి, ఉపాధి కల్పనకు కావాల్సిన సాంకేతికతలు, రేపటి ఉద్యోగాలు’ పేరుతో రెండు నివేదికలను డబ్ల్యూఈఎఫ్ విడుదల చేసింది. భవిష్యత్తు మార్కెట్లు, ఉపాధి కల్పన కోసం ప్రభుత్వాలు, వ్యాపారవేత్తలు రెట్టింపు స్థాయిలో టెక్నాలజీలను అమల్లో పెట్టాలని సూచించింది. కేవలం 10 ఆర్థిక వ్యవస్థల్లోనే విద్య, వ్యవసాయం, హెల్త్, ఎనర్జీ సహా పర్యావరణ అనుకూల, సామాజిక రంగాల్లో 2030 నాటికి 7.6 కోట్ల ఉద్యోగాల అవసరం ఉంటుందని తెలిపింది. భారత్తోపాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండియా, జపాన్, దక్షిణాఫ్రికా, స్పెయిన్, యూకే, అమెరికాలను పది ఆర్థిక వ్యవస్థలుగా ఉదహరించింది. హెల్త్కేర్లో వ్యక్తిత సంరక్షకులు 1.8 కోట్లు, చిన్నారుల సంరక్షకులు, శిశువిద్యా టీచర్లు 1.2 కోట్లు, ప్రాథమిక, సెకండరీ విద్యా టీచర్లు 90 లక్షల మంది అవసరమని పేర్కొంది. -
విద్యార్థులు పెరిగితే మీ బాధేంటి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను, వాటిలోని విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నాలు చరిత్రలో ఇదివరకెన్నడూ జరగలేదు. అసలు ఆ ఆలోచనే చెయ్యలేదు. ఇక్కడి విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్ల పిల్లలకన్నా ఒక మెట్టు పైనే ఉండేలా... ప్రభుత్వమిస్తున్న జగనన్న విద్యాకానుక పైనా ‘ఈనాడు’ దుష్ప్రచారానికి దిగింది. వాస్తవాలకు మసిపూసి... ‘కిట్లు కొన్నారు–కోట్లు తిన్నారు’ అంటూ పచ్చి అబద్ధాల వంటకాన్ని జనంలోకి వదిలింది. జగనన్న విద్యాకానుక కింద... బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలతో పాటు 3 జతల యూనిఫారం, షూలు, సాక్సులు, బెల్టు, బ్యాగు, నోటు పుస్తకాలు, వర్కుబుక్కులు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అందిస్తూ విద్యార్థుల చదువుల్లో విప్లవాత్మకమైన మార్పు తెచ్చారని ఎన్నడూ ఒక్క మంచిమాట కూడా రాయని రామోజీరావు... అసత్య సమాచారంతో మాత్రం బాగానే చెలరేగిపోయారు. గతంలో అరకొరగా ఇచ్చే పాఠ్యపుస్తకాలు... 8 నెలలు గడిచినా, కొన్ని సందర్భాల్లో విద్యా సంవత్సరం ముగిసిపోయినా అందేవి కావు. తన పాదయాత్రలో ఈ పరిస్థితిని గమనించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని చక్కదిద్దే పని మొదలెట్టారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన తొలి రోజే పుస్తకాలు అందించాలనుకున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫారమే కాకుండా విద్యార్థులకు అవసరమైన ఇతర వస్తువులనూ కిట్లో చేర్చి ‘జగనన్న విద్యాకానుక’గా అందిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఆయా వస్తువుల నాణ్యతను పరిశీలించిన అనంతరం టెండర్ల ద్వారా ఏటా విద్యార్థులకు సకాలంలో కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా నాణ్యతలో లోపాలుంటే వాటిని తిరిగి సరిచేసి మళ్లీ కొత్తవి విద్యార్థులకు అందేలా చేస్తున్నారు. ఇవి వచ్చే ఏడాది కోసమని మరిచారా? ఇలా విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే అందరికీ కిట్లు అందించాలంటే ఆరేడు నెలల ముందు నుంచే కసరత్తు మొదలుకావాలి. అంటే... వచ్చే విద్యా సంవత్సరం కోసం ఈ ఏడాదే కసరత్తు మొదలవుతుంది. మరి ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటుంది కదా? అప్పటికప్పుడు పెంచటం సాధ్యం కాదు కదా? అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రస్తుత సంఖ్యకు 5 శాతం జోడిస్తున్నారు. ఆ మేరకు పెరుగుదలను అంచనా వేసి టెండర్లు పిలుస్తున్నారు. ఒకవేళ పిల్లలకు ఇచ్చాక మిగిలిపోతే వాటిని తదుపరి ఏడాదికి సర్దుబాటు చేస్తూ... ఈ మేరకు కొత్తగా కొనే వాటి సంఖ్యను తగ్గిస్తున్నారు. ఇది ప్రతి ఏటా జరుగుతున్న వాస్తవం కాగా... దీనికి ‘ఈనాడు’ మసిపూసింది. ఇలా మిగిలిపోయిన వస్తువుల వల్ల రూ.162 కోట్లు వృథా అంటూ తప్పుడు సమాచారంతో ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేసింది. నిజానికి వస్తువుల్లో నాణ్యత లోపాలుంటే వాటిని వాపస్ తీసుకొని కొత్తవివ్వాలన్న నిబంధన సైతం ప్రతి ఏటా తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగుల్లో లోపాలు కనిపించగా ఆయా కంపెనీల ద్వారా తిరిగి కొత్తవి పంపిణీ చేయించారు. ‘ఈనాడు’ మాత్రం అవాస్తవాల ప్రచారమే లక్ష్యంగా చెలరేగిపోయింది. ఈ మంచిని ఏనాడైనా ప్రశంసించారా? ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందించడానికి, కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగానే వారికి మౌలిక సదుపాయాలను అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దార్శనిక ఆలోచనలతో ప్రభుత్వం ‘నాడు–నేడు’ పేరిట మహాయజ్ఞాన్ని ఆరంభించటం తెలిసిందే. గోరుముద్ద ద్వారా మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యతను తెచ్చారు. న్యాయ పోరాటాలను సైతం దాటుకుని... ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించారు. సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన బోధన కోసం అంతర్జాతీయ ఎడ్యుటెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకున్నారు. బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబులను విద్యార్థులకు ఉచితంగా అందించారు. త్వరలో డిజిటలీకరణ పద్ధతుల్లో బోధనకోసం ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్, టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తోంది. వీటన్నిటి ఫలితంగానే ఇటీవలి పెర్ఫార్మెన్సు గ్రేడింగ్ ఇండెక్సులో కానీ, అసర్ సర్వే నివేదికలో కానీ, అంతకు ముందు ఇండియాటుడే వంటి సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కానీ పాఠశాల విద్యాప్రమాణాలు ఎంతో మెరుగుపడి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఒక్క విద్యారంగంలో సంస్కరణలకే రూ.55వేల కోట్ల వరకు ఖర్చు చేశారంటే ముఖ్యమంత్రి ఈ రంగానికిస్తున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో పాఠశాల విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసినా... విద్యాసంవత్సరం చివరి వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారం వంటివి ఇవ్వకపోయినా అద్భుతంగా ఉందంటూ కథనాలు రాసిన ‘ఈనాడు’ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమాలను ఒక్కనాడూ ప్రశంసించకపోవటమే విచిత్రం. అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ విద్యాకానుక కొనుగోళ్ల విషయంలో టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాల తనిఖీకి ఈ ఏడాది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే... విద్యార్థులు ఇబ్బంది పడకుండా వెంటనే రీప్లేస్ చేయడానికి... అదనంగా తెప్పించుకున్న నిల్వలు ఉపయోగపడుతున్నాయి. బెల్టులు, నోటు పుస్తకాలు, బూట్లు, డిక్షనరీలలో ఎటువంటి మార్పులు లేనందున వాటిని తర్వాతి విద్యా సంవత్సరంలో వాడుకునేలా ఇప్పటికే ఆదేశాలిచ్చారు. 10 రకాల వస్తువుల పంపిణీ జగనన్న విద్యాకానుక ద్వారా మొత్తం 10 రకాల వస్తువులను ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ప్రతిఏటా పాఠశాలలు ప్రారంభానికి ముందే అందిస్తోంది. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, వర్క్స్ బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ ( 1–5 తరగతులకు), ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ( 6 –10 తరగతులకు), స్కూలు బ్యాగు, షూ, 2 జతల సాక్సులు, యూనిఫాం, కుట్టుకూలి డబ్బులు, బెల్టు మొత్తం పదిరకాలు మూడేళ్లనుంచి విజయవంతంగా అందిస్తోంది. మొత్తంగా మూడేళ్లలో విద్యాకానుక కోసం సుమారు రూ.2,324 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. వరుసగా నాలుగో ఏడాది 2023–24 విద్యా సంవత్సరంకోసం మరో రూ.1042.53 కోట్లు ఖర్చు చేసేందుకు ఇప్పటికే టెండర్లను పూర్తి చేసింది. ఏటా స్కూళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అదనంగా 5 శాతం కలుపుకుని ఆ మేరకు పంపిణీ చేయాల్సిన సంఖ్యను నిర్ణయిస్తోంది. ఒకవేళ పంపిణీ అనంతరం విద్యాకానుక వస్తువుల్లో ఏం మిగిలిపోయినా కూడా... వాటిని తదుపరి సంవత్సరంలో వాడుకుంటున్నారు. విద్యాకానుక విప్లవాత్మక పథకం విద్యాకానుక విషయమై తమ నుంచి ఎలాంటి వివరణ కూడా అడగకుండా అభూత కల్పనలతో కథనాన్ని రాశారని విద్యాశాఖ తప్పుబట్టింది. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాలు, యూనిఫారం.. మొత్తం 10 రకాల వస్తువులను ప్రభుత్వం అందిస్తోందని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని విద్యాశాఖ పేర్కొంది. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా... పరీక్షలు వస్తున్నా... పాఠ్యపుస్తకాలు సహా ఏవీ అందని పరిస్థితి గతంలో ఉండేదని వివరించింది. -
సత్ఫలితాలనిస్తున్న ఏపీ ప్రభుత్వ సంస్కరణలు
-
డిజిటల్ బాట.. తొలి విడతలో 6,511 ప్రభుత్వ స్కూళ్లు డిజిటల్ విధానంలోకి..
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఇప్పటికే అనేక విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సైతం భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు అందుకునేలా డిజిటల్ విద్యను వారికి చేరువ చేస్తోంది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులను అన్ని విషయాల్లో మేటిగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో దశల వారీగా ఫౌండేషనల్ స్థాయి నుంచి ఇంటర్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతులను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే అత్యున్నత ప్రమాణాలు ఉన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) డిజిటల్ కంటెంట్ను ఇప్పటికే సిద్ధం చేసింది. ముందుగా మనబడి నాడు–నేడు మొదటి దశ స్కూళ్లలో.. డిజిటల్ తరగతులను ముందుగా మనబడి: నాడు–నేడు కింద తొలిదశ పనులు పూర్తయిన స్కూళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు (ఐఎఫ్పీ) ఏర్పాటు చేసి డిజిటల్ విద్యాబోధన చేస్తారు. విద్యాశాఖ అంచనాల ప్రకారం.. దశలవారీగా 45,328 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు అంచనాలు రూపొందించారు. ఇందులో భాగంగా వచ్చే జూన్ నాటికి 6,511 స్కూళ్లలో ఆయా ఆధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కూళ్లలోని డిజిటల్ తరగతి గదులలో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు అమరుస్తారు. ఇందుకోసం రూ.302.13 కోట్ల మేర ప్రభుత్వం వెచ్చించనుంది. కాగా, 13,301 నాడు–నేడు తొలివిడత స్కూళ్లలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా 65 ఇంచులతో ఉండే 10,038 స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తెస్తారు. ప్రభుత్వ టీచర్లకు శిక్షణ డిజిటల్ పరికరాల ద్వారా విద్యా బోధన, ఉపకరణాల వినియోగంపై పలువురు ప్రభుత్వ టీచర్లకు ఇప్పటికే అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో డిజిటల్ పరికరాలను సక్రమంగా వినియోగించడంలో 30 శాతం మంది పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారు. 20 శాతం మందికి మరికొంత శిక్షణ అవసరమని గుర్తించారు. మిగతా వారందరికీ కూడా శిక్షణ అందించనున్నారు. మూడు దశల్లో అన్ని స్కూళ్లూ.. మొత్తం మూడు దశల్లో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. తొలి దశ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటును మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేనున్నారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు. బ్రాడ్ బ్యాండ్ /లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్బీ మోడెమ్/డాంగిల్/పోర్టబుల్ హాట్స్పాట్, వీఎస్ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని సమకూర్చనున్నారు. డిజిటల్ కంటెంట్ సిద్ధం డిజిటల్ విద్యా బోధనకు వీలుగా విద్యాశాఖ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ కంటెంట్ను సిద్ధం చేయిస్తోంది. ఇప్పటికే 6, 7 తరగతులకు సంబంధించి ఈ–కంటెంట్ను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ద్వారా రూపొందింపజేసింది. సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో విద్యాశాఖ ఆ సిలబస్కు అనుగుణంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో ఎన్సీఈఆర్టీ ఈ–కంటెంట్ను రూపొందిస్తోంది. ఇతర సబ్జెక్టులు ఎస్సీఈఆర్టీ పుస్తకాలకు అనుగుణంగా రూపొందనున్నాయి. ఇతర తరగతుల్లోనూ సీబీఎస్ఈ విధానం ప్రకారం ఈ–కంటెంట్ను రూపొందిస్తున్నారు. వీటిలో ఆడియో, వీడియోల తరహాలో కంటెంట్ ఉండనుంది. నాణ్యమైన పరికరాల ఏర్పాటు.. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్ల నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ► తరగతి గదుల్లోని విద్యార్థులకు 170 డిగ్రీల యాంగిల్లో కూడా స్పష్టంగా కనిపించేలా 65 ఇంచుల స్క్రీన్తో ఈ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లుంటాయి. ► యాంటీ గ్లేర్ టెక్నాలజీ ► కంపాటబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఆండ్రాయిడ్) ► వైఫై, హెచ్డీఎంఐ, లాన్, యూఎస్బీ, వీజీఏ కనెక్టివిటీ ► రికార్డెడ్ బోర్డు వర్క్ ► డిజిటల్ బోర్డును బ్లాక్ లేదా గ్రీన్ బోర్డులుగా మార్చుకోవడానికి అవకాశం ► ఆడియో, వీడియోల ప్రదర్శనకు వీలు ► ప్యానల్లోనే స్పీకర్ల ఏర్పాటు ► స్పెసిఫికేషన్లలో ఇంటెల్కోర్ ఐ–5, ఏఎండీ రీజెన్5 ప్రాసెసర్ ► 8 జీబీ రామ్.. 512 జీబీ ఎస్ఎస్డీ ఇంటర్నల్ స్టోరేజీ ► వైర్డ్, వైర్లెస్ కమ్యూనికేషన్ విధానం ► మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ప్రో ఆపరేటింగ్ సిస్టమ్ ► 5 ఏళ్ల వారంటీ