India vs Srilanka
-
Asia Cup Final: టాస్ గెలిచిన టీమిండియా.. తుది జట్లు ఇవే..!
మహిళల ఆసియా కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జులై 28) భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం శ్రీలంక ఓ మార్పు చేయగా.. భారత్ గత మ్యాచ్లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. లంక జట్టులో అచిని కులసూర్య స్థానంలో సచిని నిసంసల తుది జట్టులోకి వచ్చింది. కాగా, సెమీఫైనల్లో భారత్.. బంగ్లాదేశ్పై, శ్రీలంక.. పాకిస్తాన్పై విజయాలు సాధించి ఫైనల్స్కు చేరిన విషయం తెలిసిందే.తుది జట్లు..శ్రీలంక: విష్మి గుణరత్నే, చమారి అటపట్టు(కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, కవిష దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(వికెట్కీపర్), హాసిని పెరీరా, సుగందిక కుమారి, ఇనోషి ప్రియదర్శని, ఉదేశిక ప్రబోధని, సచిని నిసంసలభారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ఉమా చెత్రీ, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్కీపర్), దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, తనూజా కన్వర్, రేణుకా ఠాకూర్ సింగ్ -
మీరు చూశారా? తీవ్ర అసహనానికి గురైన అయ్యర్.. అంత కోపమెందుకో?
ICC WC 2023- Ind vs SL- Shreyas Iyer: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్లో అయ్యర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఓపెనర్ శుబ్మన్ గిల్(92), వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి(88) టీమిండియా భారీ స్కోరుకు పునాది వేయగా.. అయ్యర్ ఆ పని పూర్తి చేశాడు. వాంఖడేలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ నలువైపులా షాట్లు బాదుతూ చూడముచ్చటైన ఆటతో ఆకట్టుకున్నాడు. ముంబై మ్యాచ్లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్ 3 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో ఏకంగా 82 పరుగులు రాబట్టాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తనదైన షాట్లు బాదుతూ సొంతమైదానంలో ప్రేక్షకులకు కనువిందు చేశాడు శ్రేయస్ అయ్యర్. View this post on Instagram A post shared by ICC (@icc) గత మ్యాచ్లో 4 పరుగులకే అవుటై తీవ్ర విమర్శలపాలైన అతడు గురువారం నాటి మ్యాచ్లో తిట్టిన నోళ్లతోనే ప్రశంసించేలా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో లంకపై ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన శ్రేయస్ అయ్యర్కు.. ‘‘ఈ వరల్డ్కప్ ఆరంభం నుంచి షార్ట్బాల్ ఎదుర్కోవడంలో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా?’’ అని ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. ప్రాబ్లం అంటే అర్థం ఏమిటి? ఈ ప్రశ్నను మధ్యలోనే కట్చేసిన అయ్యర్.. ‘‘షార్ట్బాల్స్ ఎదుర్కోవడం ప్రాబ్లం అంటే అర్థం ఏమిటి? ’’ అని ఎదురు ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. అది సమస్య అని చెప్పడం లేదు కాదు.. ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నా అని సదరు జర్నలిస్టు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) మీరు చూశారా? ఎందుకీ ప్రచారం? దీంతో తీవ్ర అసహనానికి గురైన అయ్యర్.. ‘‘నేను ఎన్నిసార్లు పుల్షాట్లు ఆడాను.. ముఖ్యంగా ఆ తరహాలో ఎన్ని ఫోర్లు కొట్టాను మీరు చూశారా? బంతిని బాదాలని ఫిక్స్ అయితే.. అది షార్ట్బాలా లేక ఇంకేదైనానా అని చూడను. హిట్ చేయాలనుకుంటే చేస్తానంటే.. ఆ క్రమంలో ఓ రెండు మూడుసార్లు నేను బౌల్డ్ అయితే.. ఇక అప్పటి నుంచి.. ‘‘ఇతడు ఇన్స్వింగింగ్ బాల్ ఆడలేడు.. కట్ షాట్ ఆడలేడు..’’ అంటూ ప్రచారాలు మొదలుపెడతారా? ఆటగాళ్లుగా పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎలా ఆడాలో మాకు తెలుసు. కానీ మీరు ఇలా.. ‘‘అయ్యర్ షార్ట్ బాల్ ఆడలేడు’’ అంటూ ఇష్టారీతిన మీకు నచ్చినట్లు రాసేస్తారు. మిమ్మల్ని చూసి మరికొంత మంది ఇలాగే మాట్లాడతారు’’ అని కౌంటర్ ఇచ్చాడు. నిజమే కదా! నిజానికి అయ్యర్ షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో గతంలో చాలాసార్లు విఫలమయ్యాడు. అయితే, వాంఖడేలో లంకతో మ్యాచ్లో మాత్రం షార్ట్ బంతులను కూడా షాట్లుగా మలిచాడు. ఈ నేపథ్యంలో తన ఆట తీరును సమర్థించుకున్న శ్రేయస్ అయ్యర్.. ఇకపై ఇలాంటి ప్రచారాలు మానేయాలంటూ మీడియాకు విజ్ఞప్తి చేశాడు. మీకు ఇబ్బంది.. నాకు కాదు ‘‘షార్ట్ బాల్స్ ఆడే క్రమంలో కొన్నిసార్లు అవుటైన కారణంగా మీరలా భావిస్తున్నారే తప్ప.. నాకు మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు’’ అని పేర్కొన్నాడు. అయితే, అయ్యర్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. ‘వాస్తవాలు మాట్లాడితే అంత కోపమెందుకు అయ్యర్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో లంకను 302 పరుగుల తేడాతో చిత్తు చేసి టీమిండియా సెమీస్ చేరిన విషయం తెలిసిందే. చదవండి: అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్ల్లో స్మృతి మంధాన కెప్టెన్గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్కు షూటింగ్లోనే రెండు కాంస్యాలు, రోయింగ్లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ సొంతం
ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఈవెంట్లో టీమిండియా మొట్టమొదటి గోల్డ్ మెడల్ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 25) జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. INDIA Women's Cricket Team wins 𝐆𝐎𝐋𝐃 at the 𝐀𝐬𝐢𝐚𝐧 𝐆𝐚𝐦𝐞𝐬 𝟐𝟎𝟐𝟑🥇 pic.twitter.com/o4NPpbqFix — CricTracker (@Cricketracker) September 25, 2023 కాంస్య పతకం కోసం ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఆసియా క్రీడల్లో భారత్కు ఇవాళ ఇది రెండో స్వర్ణ పతకం కావడం విశేషం. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత్ తొలి స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్లతో కూడిన జట్టు భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. India women's team defeated Sri Lanka in the Asian Games 2023 final by 19 runs and clinched the Gold medal for the first time.🥇 pic.twitter.com/5Uf3CP1H9Q — CricTracker (@Cricketracker) September 25, 2023 -
'అతడు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్.. చాలా గర్వంగా ఉంది'
ఆసియాకప్-2023ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో శ్రీలంకను 10వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. 8వ సారి ఆసియా విజేతగా నిలిచింది. కాగా ఈ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో 6 మ్యాచ్లు ఆడిన గిల్.. 302 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. పాకిస్తాన్తో తొలి మ్యాచ్లో విఫలమైన గిల్.. ఆ తర్వాత అద్భుతమైన కమ్బ్యాక్ ఇచ్చాడు. కాగా గిల్ ఒక్క టోర్నీలో మాత్రమే కాకుండా అంతకుముందు విండీస్ సిరీస్లో కూడా అద్భుతంగా రాణించాడు. ఓవరాల్గా ఈ ఏడాది ఇప్పటివరకు 17 ఇన్నింగ్స్లు ఆడిన గిల్ 68.33 సగటుతో 1025 పరగులు చేశాడు. ఈ నేపథ్యంలో శుభ్మన్ గిల్పై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. గిల్ను ఫ్యూచర్ ఆఫ్ భారత్ క్రికెట్ అని కపిల్ దేవ్ అభివర్ణించాడు. "శుబ్మన్ గిల్ ఒక అద్భుతం. అతడు భారత్ క్రికెట్ భవిష్యతు. ఈ యువ క్రికెటర్ కచ్చితంగా భారత క్రికెట్ను అత్యున్నత స్ధాయికి తీసుకువెళ్తాడు. ఇండియాలో ఇటువంటి అద్భుతమైన ఆటగాడు ఉన్నందుకు చాలా గర్వంగా ఉందంటూ" పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్దేవ్ పేర్కొన్నాడు. చదవండి: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.. అశ్విన్ రీఎంట్రీ -
Asia Cup 2023 Final: వన్డే క్రికెట్లో అతి భారీ విజయం
ఓ వన్డే క్రికెట్ టోర్నీ ఫైనల్లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన 2023 ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు ఈ ఘనతను సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 263 పరుగులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి, వన్డే క్రికెట్ టోర్నీ ఫైనల్స్ చరిత్రలో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2003 వీబీ సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్ నిర్ధేశించిన 118 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా మరో 226 బంతులు మిగిలుండగానే ఛేదించింది. టీమిండియాకు అతి భారీ విజయం.. వన్డే క్రికెట్లో టీమిండియా బంతుల పరంగా అతి భారీ విజయాన్ని సాధించింది. శ్రీలంకతో జరిగిన ఇవాల్టి మ్యాచ్లో భారత్ 263 బంతులు మిగిలుండగానే, వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్కు ముందు బంతుల పరంగా టీమిండియాకు అతి భారీ విజయం 2001లో కెన్యాపై దక్కింది. నాటి మ్యాచ్లో భారత్ 231 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. వన్డే టోర్నీ ఫైనల్స్లో మూడవది.. ఈ మ్యాచ్లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. ఓ వన్డే టోర్నీ ఫైనల్స్లో ఈ ఘనత (10 వికెట్ల తేడాతో విజయం) మూడో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఓ వన్డే టోర్నీ (కోకో కోలా కప్) ఫైనల్స్లో 1998లో భారత్ తొలిసారి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాటి ఫైనల్స్ భారత్.. జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2003 వీబీ సిరీస్ ఫైనల్లో ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. కేవలం 129 బంతుల్లో మ్యాచ్ ముగిసింది.. భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఆసియాకప్ 2023 ఫైనల్స్ బంతుల పరంగా మూడో అతి చిన్న మ్యాచ్గా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 129 బంతుల్లో (రెండు ఇన్నింగ్స్) ముగిసింది. శ్రీలంక 15.2 ఓవర్లు.. భారత్ 6.1 ఓవర్లు బ్యాటింగ్ చేశాయి. బంతుల పరంగా అతి చిన్న మ్యాచ్ 2020లో నేపాల్-యూఎస్ఏ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ కేవలం 104 బంతుల్లో ముగిసింది. ఇదిలా ఉంటే, 2023 ఆసియా కప్ టైటిల్ను భారత్ ఎనిమిదో సారి ఎగరేసుకుపోయింది. ఇవాళ జరిగిన ఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఆతిథ్య శ్రీలంకను మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలగా.. టీమిండియా ఆడుతూ పాడుతూ 6.1 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్ (23), శుభ్మన్ గిల్ (27) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు మహ్మద్ సిరాజ్ (7-1-21-6), బుమ్రా (5-1-23-1), హార్దిక్ పాండ్యా (2.2-0-3-3) చెలరేగడంతో శ్రీలంక 15.2 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. కేవలం కుశాల్ మెండిస్ (17), దుషన్ హేమంత (13 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
Asia Cup 2023 IND VS SL: చరిత్ర సృష్టించిన లంక యువ స్పిన్నర్
20 ఏళ్ల శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే చరిత్ర సృష్టించాడు. లంక తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో దునిత్ ఈ ఘనత సాధించాడు. దునిత్ 20 ఏళ్ల 246 రోజుల్లో ఈ ఘనత సాధించగా.. దీనికి ముందు ఈ రికార్డు చరిత బుద్ధిక పేరిట ఉండేది. బుద్ధిక 2001లో జింబాబ్వేపై 21 ఏళ్ల 65 రోజుల వయసులో 5 వికెట్ల ఘనత సాధించాడు. ఇతనికి ముందు తిసార పెరీరా (21 ఏళ్ల 141 రోజులు), ఉవైస్ కర్నైన్ (21 ఏళ్ల 233 రోజులు) లంక తరఫున పిన్న వయసులో ఐదు వికెట్ల ఘనత సాధించిన వారిలో ఉన్నారు. ఈ మ్యాచ్లో దునిత్ (10-1-40-5) ఐదు వికెట్ల ఘనత సాధించి, టీమిండియా టాపార్డర్ను కకావికలం చేశాడు. ఇతన్ని ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు. దునిత్ సంధించిన బంతులకు సమాధానం లేక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి వారే చేతులెత్తేశారు. యువ కెరటం శుభ్మన్ గిల్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్టార్ ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా వెల్లలగే మాయాజాలానికి చిక్క వికెట్లు సమర్పించుకున్నారు. బ్యాటింగ్ హేమహేమీలైన రోహిత్, గిల్, విరాట్, రాహుల్, హార్దిక్లను అంతుచిక్కని బంతులు వేసి ఔట్ చేసిన వెల్లలగేపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో ప్రశంసల వర్షం కురుస్తుంది. దునిత్కు మరో స్పిన్నర్ మహీష్ తీక్షణ (8-0-29-4) కూడా తోడవ్వడంతో భారత్ 47 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 197 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో వర్షం ప్రారంభంకావడంతో మ్యాచ్కు అంతరాయం కలిగింది. రోహిత్ శర్మ (53), ఇషాన్ కిషన్ (33), కేఎల్ రాహుల్ (39), శుభ్మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3), హార్దిక్ (5), జడేజా (4), బుమ్రా (5), కుల్దీప్ (0) ఔట్ కాగా.. అక్షర్ (15), సిరాజ్ (2) క్రీజ్లో ఉన్నారు. -
Asia Cup 2023: లంకేయుల జైత్రయాత్రకు టీమిండియా అడ్డుకట్ట వేస్తుందా..?
వన్డేల్లో వరుసగా 13 విజయాలు సాధించి జోరుమీదున్న శ్రీలంకకు టీమిండియా అడ్డుకట్ట వేస్తుందా అన్న ప్రశ్నపై ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో జోరుగా చర్చ సాగుతుంది. టీమిండియా తాజా ఫామ్ను పరిగణలోకి తీసుకుని మెజార్టీ శాతం లంకేయుల జైత్రయాత్రకు బ్రేక్ పడటం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. కొందరేమో లంకేయులు హోమ్ అడ్వాంటేజ్ తీసుకుని టీమిండియాకు షాకిస్తుందని అంటుంటే, మరికొందరు శ్రీలంకకు అంత సీన్ లేదని ఆ జట్టును తేలిగ్గా తీసిపారేస్తున్నారు. మరి ఆసియా కప్-2023లో భాగంగా కొలొంబో వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న మ్యాచ్లో ఏ జట్టు విజయం సాధిస్తుందో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. Can Sri Lanka continue their winning streak against India?#INDvSL pic.twitter.com/wcUfm1yRxJ— CricTracker (@Cricketracker) September 12, 2023 పై పేర్కొన్న అంశంపై మెజార్టీ శాతం అభిప్రాయం మేరకు టీమిండియాకే విజయావకాశాలు అధికంగా ఉన్నప్పటకీ, ఒక్క విషయంలో మాత్రం లంకేయుల విన్నింగ్ ఛాన్సస్ను కొట్టిపారేయడానికి వీళ్లేదు. ఆ విషయం ఏంటంటే.. టీమిండియా ఎంతటి ఫామ్లో ఉన్నా, గంటల వ్యవధిలో బరిలోకి దిగాల్సి రావడం (నిన్ననే పాక్తో మ్యాచ్) ఆ జట్టుకు పెద్ద ప్రతికూలాంశంగా మారింది. ఎంతటి మేటి జట్టైనా ఇలా గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడితే సత్ఫలితాలు రావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైపెచ్చు శ్రీలంకకు హోమ్ అడ్వాంటేజ్ ఉండనే ఉంది. దీనికి తోడు ఆ జట్టు ఇటీవలికాలంలో అద్భుతమైన క్రికెట్ ఆడుతుంది. ప్రస్తుత మ్యాచ్లోనూ వారు టీమిండియా టాప్-3 బ్యాటర్లను కేవలం 11 పరుగుల వ్యవధిలో పెవిలియన్కు పంపారు. యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే (4-1-10-3) భారత టాపార్డర్కు చుక్కలు చూపించాడు. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత్ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (53), శుభ్మన్ గిల్ (19), విరాట్ కోహ్లి (3) ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ (11), కేఎల్ రాహుల్ (7) క్రీజ్లో ఉన్నారు. -
వన్డే ర్యాంకింగ్స్లో అదరగొట్టిన విరాట్ కోహ్లి.. టాప్-5లోకి ఎంట్రీ
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అదరగొట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్లో రెండు సెంచరీలతో చెలరేగిన విరాట్ కోహ్లి.. బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో 283 పరుగులు చేసిన విరాట్ కోహ్లి.. సిరీస్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక రాబోయే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్లో కోహ్లి అద్భుతంగా రాణిస్తే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్ను వెనుక్కి నెట్టి రెండో ర్యాంక్కు చేరే అవకాశం ఉంది. టాప్ ర్యాంక్లో 887 పాయింట్లతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం కొనసాగుతున్నాడు. కాగా కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 750 రేటింగ్ ఉంది. విరాట్ ఇదే ఫామ్ను మరో ఏడాది పాటు కొనసాగిస్తే బాబర్ను అధిగమించడం పెద్ద విషయం ఏమీ కాదు. మరోవైపు మహ్మద్ సిరాజ్ కూడా బౌలర్ల ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను సిరాజ్ సాధించాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శన కనబరిచిన సిరాజ్.. మూడో ర్యాంక్కు చేరుకున్నాడు. చదవండి: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్గా! ఆ ఒక్క లోటు తప్ప! కెప్టెన్ మాటలు వింటే.. -
మా సంజూ ఎక్కడ? ఇదిగో ఇక్కడ .. శభాష్ సూర్య! వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ను తన సొంత రాష్ట్రం కేరళలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేరళలో మ్యాచ్ జరిగిందింటే చాలు సంజూ జట్టులో లేకపోయినా అభిమానుల సందడి మాములుగా ఉండదు. తాజాగా మరోసారి సంజూ అభిమానులు అతడిపై ప్రేమను చాటుకున్నారు. భారత్-శ్రీలంక మధ్య మూడో వన్డే తిరువనంతపురం వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టేడియమంతా సంజూ పేరుతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ను.. మా సంజూ ఎక్కడ? అని అభిమానులు ప్రశ్నించారు. ఈ క్రమంలో సూర్యకుమార్ తన సమాధానంతో అభిమానుల మనసును గెలుచుకున్నాడు. సంజూ మా గుండెల్లో ఉన్నాడంటూ సూర్య సైగ చేశాడు. దీంతో ఒక్క సారిగా అభిమానుల కేకలతో స్టేడియం దద్దరిల్లపోయింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు శాంసన్ భారత జట్టులో చోటుదక్కించుకున్నాడు. అయితే ముంబై వేదికగా తొలి టీ20లో గాయపడిన సంజూ.. సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అనంతరం న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఈ కేరళ ఆటగాడికి జట్టు దక్కలేదు. అయితే సంజూను ఎందుకు ఎంపిక చేయలేదన్న సృష్టత బీసీసీఐ ఇవ్వలేదు. కాగా సంజూ ఇంకా మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs SL 3rd ODI: టీమిండియా ప్రపంచ రికార్డుతో పాటు.. ఈ ఘనతలు కూడా! ఆసీస్ను దాటేసి.. "Where is Sanju?" and Surya replied "He is in our heart". 😍#SanjuSamson 🤝#SuryakumarYadav pic.twitter.com/CZ3vuDWQRK — Heart Broken 💔 (@Sachin_Gandhi7) January 16, 2023 -
IND vs NZ: హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్
శ్రీలంకతో వన్డే సిరీస్ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలకపోరుకు సిద్దమైంది. స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జనవరి18(బుధవారం)న జరగనుంది. ఈ క్రమంలో భారత జట్టు సోమవారం హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్లో అడుగుపెట్టిన భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇక రోహిత్ సేన మంగళవారం మధ్యాహ్నం తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక ఇప్పటికే బాగ్యనగరానికి చేరుకున్న ప్రత్యర్ధి న్యూజిలాండ్ జట్టు ప్రాక్టీస్లో మునిగితేలుతుంది. కాగా ఈ సిరీస్కు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ సో షిప్లీ చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్పై మైదానం బయటకు! Virat Kohli Has Arrived In Hyderabad Ahead Of The ODI Series Against NZ.#ViratKohli #INDvNZ @imVkohli pic.twitter.com/RXZuQrbuCu — virat_kohli_18_club (@KohliSensation) January 16, 2023 -
సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది.. ప్రతి 4-7 రోజులకోసారి వెటాడ్తది..!
Wasim Jaffer On Virat Kohli: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకం బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేల భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చేసిన కొన్ని ఆసక్తికర ట్వీట్లు ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వన్డేల్లో 46వ శతకాన్ని, ఓవరాల్గా 74వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకుని, పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లిని ఉద్దేశిస్తూ జాఫర్ ఈ రకంగా ట్వీటాడు. "Tiger hunts every 4-7 days". Must be true as it's been 4 days since this knock 😉 #INDvSL https://t.co/OzhCRl7sGz — Wasim Jaffer (@WasimJaffer14) January 15, 2023 సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది, ఈ ఏడాది ఈ పులి వేట పెద్ద ఎత్తున సాగుతుంది.. పులి ఏరకంగా అయితే ప్రతి 4-7 రోజులకోసారి వేటాడ్తదో, కోహ్లి కూడా అదే గ్యాప్లో తన సెంచరీల దాహాన్ని తీర్చుకుంటాడు.. బహుపరాక్ అని అర్ధం వచ్చేలా జాఫర్ తన ట్వీట్ల ద్వారా ప్రత్యర్ధులను హెచ్చరించాడు. ఈ ట్వీట్లకు కోహ్లి ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతూ, కోహ్లి-పులి కామెంట్స్ను ఆస్వాధిస్తున్నారు. కాగా, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన కెరీర్లో 71వ అంతర్జాతీయ సెంచరీ (టీ20 ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్పై) పూర్తి చేసిన కోహ్లి, ఆ తర్వాత మూడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్పై వన్డే సెంచరీ, ఆతర్వాత మూడు వారాల బ్రేక్లో శ్రీలంకపై తొలి వన్డేలో సెంచరీ, ఆతర్వాత నాలుగు రోజుల గ్యాప్లో మరో సెంచరీ సాధించాడు. మొత్తంగా మూడేళ్ల తర్వాత మునుపటి ఫామ్ను అందుకున్న కింగ్ కోహ్లి.. గత 4 వన్డే ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు చేసి, కోహ్లి ఈజ్ బ్యాక్ అని చాటుకున్నాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ చూస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్లోనూ సెంచరీల మోత మోగడం ఖాయమని అర్ధమవుతుంది. -
సంక్రాంతి అంటే కోహ్లికి పూనకాలే.. పండగ రోజు కింగ్ ఎన్ని శతకాలు కొట్టాడంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (110 బంతుల్లో 166 నాటౌట్; 13 ఫోర్లు, 8 సిక్సర్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించడంతో పాటు పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కింగ్ బద్దలు కొట్టిన అరుదైన రికార్డుల జాబితాలో ఓ అసాధారణ రికార్డు దాగి ఉందన్న విషయం మనలో చాలామంది గమనించి ఉండరు. Virat Kohli on 15th January:- In 2017 - 122(102) vs ENG in ODIs. In 2018 - 153(217) vs SA in Tests. In 2019 - 104(112) vs AUS in ODIs. In 2023 - 166*(110) vs SL in ODIs. pic.twitter.com/1e9qG6KoYW — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 అదేంటంటే.. కింగ్ కోహ్లికి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పూనకం వస్తుంది. ఈ పర్వదినాన (జనవరి 15) కోహ్లి ఏకంగా 4 సెంచరీలు బాదాడు. 2017 సంక్రాంతి రోజున ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో 102 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లి.. 2018 సంక్రాంతికి సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లో 217 బంతుల్లో 153 పరుగులు చేశాడు. Declare 15th January as "Virat Kohli Day"@imVkohli pic.twitter.com/DVHA476m5E — Pratham. (@75thHundredWhen) January 15, 2023 2019 సంక్రాంతికి ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో 112 బంతుల్లో 104 పరుగులు చేసిన కింగ్.. మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ 2023 సంక్రాంతికి సెంచరీ బాది సంక్రాంతి తనకెంత అచ్చొచ్చిన పండగో మరోసారి చాటాడు. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ పరిమాణాలను ఓ అభిమాని సోషల్మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. A good day on the field and it was wonderful to watch @ShubmanGill & @imVkohli bhai bat today. Congratulations on your 100s and thanks to the almighty for giving me this opportunity to contribute in team’s biggest win. Shukar 🙏🇮🇳 @BCCI pic.twitter.com/ZDAVMRL250 — Mohammed Siraj (@mdsirajofficial) January 15, 2023 సంక్రాంతి రోజు కోహ్లి శతక్కొట్టుడు గణాంకాలను చూసిన అభిమానులు జనవరి 15ను 'విరాట్ కోహ్లి డే' గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. వేదిక ఏదైనా.. ప్రత్యర్ధి ఎవరైనా.. సంక్రాంతి రోజు మ్యాచ్ ఉందంటే కింగ్కు పూనకం వస్తుంది.. ఈ రోజు ప్రత్యర్ధులు ఎంతటి వారైనా జాగ్రత్తగా ఉండాలని కోహ్లి ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. Milestone of Virat Kohli today: 46th ODI Hundreds. 74th International Hundred. Most Hundreds in 2023. His 2nd highest score in ODIs. 10th ODI Hundred vs SL, first ever. Highest ever score in Greenfield. Most Sixes in an innings in his ODI career. 2nd Hundred in this series. pic.twitter.com/mES2axrI9N — CricketMAN2 (@ImTanujSingh) January 15, 2023 కాగా, లంకపై సూపర్ సెంచరీతో పలు రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లి.. కెరీర్లో 46వ వన్డే శతకాన్ని, ఓవరాల్గా 74వ అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే ఈ సెంచరీతో శ్రీలంకపై 10వ వన్డే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. ఓ ప్రత్యర్ధిపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ సెంచరీ సాధించే క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనే(12,650)ను వెనక్కు నెట్టి ఐదో స్థానానికి ఎగబాకాడు. ఇదిలా ఉంటే, లంకతో మూడో వన్డేలో కోహ్లి విధ్వంసకర శతకంతో పాటు శుభ్మన్ గిల్ సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక.. సిరాజ్ (4/32), షమీ (2/20), కుల్దీప్ (2/16) ధాటికి 73 పరుగులకే ఆలౌటై, 317 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. -
సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేస్తాడు: సునీల్ గవాస్కర్
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి దుమ్మురేపుతున్నాడు. వరుసగా సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో మరో అద్భుతమైన శతకంతో విరాట్ చెలరేగాడు. అతడి గత నాలుగు వన్డే ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు ఉండడం గమానార్హం. కాగా కింగ్ కోహ్లికి ఇది 46వ వన్డే సెంచరీ. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(49) అత్యధిక వన్డే సెంచరీల రికార్డుకు విరాట్ మరింత చేరువయ్యాడు. మరో నాలుగు సెంచరీలు ఈ రన్మిషన్ సాధిస్తే ప్రపంచ వన్డే క్రికెట్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లి ఎప్పుడు బ్రేక్ చేస్తాడనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేస్తాడని గవాస్కర్ జోస్యం చెప్పాడు. అదే విధంగా విరాట్ మరో 5-6 ఏళ్లు ఆడితే సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దల కొట్టగలడని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్కు ముందు భారత జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో మూడేసి వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి కావల్సిన సెంచరీలు కేవలం మూడు మాత్రమే. కాబట్టి ఐపీఎల్కు ముందు సచిన్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లి బద్దలు కొడతాడని నేను భావిస్తున్నాను. కోహ్లి విశ్రాంతి తీసుకుని వచ్చినప్పటి నుంచి అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో సచిన్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేస్తడనడంలో ఎటువంటి సందేహం లేదని" గవాస్కర్ పేర్కొన్నాడు. అదేవిధంగా సచిన్ 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు గురించి సన్నీ మాట్లాడుతూ.. ఒక వేళ కోహ్లి మరో 5-6 ఏళ్ల పాటు క్రికెట్ ఆడితే కచ్చితంగా సచిన 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు సగటున సంవత్సరానికి సెంచరీలు చేసినా సచిన్ను ఈజీగా అధిగమిస్తాడు. అతడు తన వయస్సు 40 ఏళ్ల వచ్చే వరకు ఆడితే వచ్చే 5-6 సంవత్సరాలలో మరో 26 సెంచరీలు సాధించగలడు. సచిన్ కూడా 40 ఏళ్ల వరకు క్రికెట్ ఆడాడు. కోహ్లికి కూడా అద్భుతమైన ఫిట్నెస్ ఉంది. కాబట్టి విరాట్ సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది అని అతడు అన్నాడు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! -
శ్రేయస్ అయ్యర్ సూపర్ బౌలింగ్.. కోహ్లి షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్
శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త అవతారమెత్తాడు. ఈ మ్యాచ్లో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసిన అయ్యర్ అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్లో 18 ఓవర్ వేసేందుకు బంతిని కెప్టెన్ రోహిత్ శర్మ అయ్యర్ చేతికి అందించాడు. ఈ క్రమంలో వేసిన తొలి బంతినే అయ్యర్ అద్భుతంగా టర్న్ చేశాడు. అయితే స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్.. అయ్యర్ వేసిన బంతిని చూసి షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. కాగా ఒక్క ఓవర్ మాత్రమే వేసిన అయ్యర్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో లంకపై 317 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన భారత్.. సిరీస్ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. కాగా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇక శ్రీలంకతో వన్డే సిరీస్ను విజయంతో ముగించిన భారత్.. తమ తదుపరి పోరులో న్యూజిలాండ్తో తలపడనుంది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. చదవండి: సిరాజ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు: రోహిత్ శర్మ Shreyas Iyer's bowling spin and Virat Kohli were surprised that it turned so much😂. PS- He bowls both legs and off-spin#INDvSL #ViratKohli𓃵 #ShreyasIyer pic.twitter.com/RuYJqMfTiC — Gaurav jain (@GauravJ43304117) January 15, 2023 -
సిరాజ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు: రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను టీమిండియా ఘనంగా ముగించింది. తిరువంతపురం వేదికగా ఆదివారం లంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. ఆఖరి వన్డే విజయంలో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లి, గిల్, సిరాజ్ కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్లో కోహ్లి, గిల్ సెంచరీలతో చెలరేగగా.. అనంతరం బౌలింగ్లో సిరాజ్ లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా సిరాజ్ తన తొలి ఐదు వికెట్ల ఘనతను సాధించిడానికి ఆఖరి వరకు ప్రయత్నించాడు. ఇక తన బౌలింగ్తో ప్రత్యర్ది బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెట్టిన సిరాజ్పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్ లాంటి టాలెంట్ ఉన్న చాలా అరుదగా ఉంటాడాని రోహిత్ కొనియాడాడు. ఇక ఓవరాల్గా ఈ సిరీస్లో 9 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. సిరీస్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హిట్మ్యాన్ మాట్లాడుతూ.. "ఇది మాకు అద్భుతమైన విజయం. ఈ సిరీస్లో మాకు చాలా పాజిటివ్ ఆంశాలు ఉన్నాయి. బ్యాటింగ్ పరంగా కూడా మేము చక్కగా రాణించాం. అదే విధంగా మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. కీలక సమయాల్లో వికెట్లు సాధించారు. ముఖ్యంగా సిరాజ్ ఈ సిరీస్ అసాంతం అదరగొట్టాడు. గత కొన్ని రోజులుగా సిరాజ్ లో చాలా మార్పు వచ్చింది. అతడు రోజురోజుకూ మరింత రాటుదేలుతున్నాడు. అతడు తన ఇన్స్వింగ్ బౌలింగ్తో జట్టుకు పవర్ ప్లేలో శుభారంభం అందిస్తున్నాడు. సిరాజ్ లాంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. అదే విధంగా ఆఖరి మ్యాచ్లో సిరాజ్ ఐదు వికెట్లు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అది జరగలేదు. అతడు ఇదే ఫామ్ను కొనసాగిస్తే భారత జట్టుకు మరింత లాభం చేకూరుతుంది. ప్రస్తుతం మా దృష్టి అంతా న్యూజిలాండ్ సిరీస్పై ఉంది. పాకిస్తాన్పై చారిత్రాత్మక విజయం సాధించి వచ్చిన న్యూజిలాండ్ను ఓడించడం అంత సులభం కాదు"అని పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli: అరుదైన ఘనతకు చేరువలో! రికార్డుల కోసం వెంపర్లాడేవాడిని కాదు.. అయితే! Captain @ImRo45 collects the trophy as #TeamIndia seal the @mastercardindia #INDvSL ODI series 3️⃣-0️⃣👏👏 Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2 pic.twitter.com/KmCAFDfpUe — BCCI (@BCCI) January 15, 2023 -
శ్రీలంక చిత్తు.. వన్డే సిరీస్ క్లీన్స్వీప్ చేసిన టీమిండియా (ఫొటోలు)
-
వారెవ్వా సిరాజ్.. శ్రీలంక బ్యాటర్కు ఊహించని షాక్! వీడియో వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో తన 10 ఓవర్ల కోటాలో సిరాజ్ 32 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. సంచలన రనౌట్తో మెరిసిన సిరాజ్.. ఏక పాక్షంగా సాగిన ఈ మ్యాచ్లో సిరాజ్ ఈ మ్యాచ్లో సంచలన రనౌట్తో మెరిశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్లో నాలుగో బంతిని కరుణరత్నే నాన్స్ట్రైకర్ వైపు డిఫెన్స్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న సిరాజ్ సమయస్ఫూర్తితో రెప్పుపాటులోనే స్ట్రైకర్ వైపు స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ థర్డ్ అంపైర్కు రిఫర్ చేశాడు. అయితే తను క్రీజులో ఉన్నానని భావించిన కరుణరత్నేకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. ఎందుకంటే కరుణరత్నే క్రీజుకు కొంచెం వెలుపుల ఉన్నట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు. దీంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND vs SL: ఇదేం ఆనందంరా బాబు.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్! కోహ్లి రియాక్షన్ వైరల్ pic.twitter.com/F3EpqK649o — The sports 360 (@Thesports3601) January 15, 2023 -
ఇదేం ఆనందం.. బంతిని ఫొటో తీసిన ఫ్యాన్! కోహ్లి రియాక్షన్ వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, శుబ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. కోహ్లి 110 బంతుల్లో 166 నాటౌట్ (13 ఫోర్లు, 8 సిక్స్లు), గిల్ 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. బంతికి ఫోటో తీసిన ఫ్యాన్ కాగా ఈ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత ఇన్నింగ్స్లో 45 ఓవర్ వేసిన కరుణరత్నే బౌలింగ్లో తొలి బంతిని కోహ్లి లాంగ్ ఆన్ దిశగా స్టాండ్స్కు తరిలించాడు. ఈ క్రమంలో స్టాండ్స్లో ఉన్న అభిమాని బంతిని అందుకున్నాడు. అయితే ఆ ఫ్యాన్ బంతిని తిరిగివ్వకుండా ఫోటో తీసుకుంటూ ఉండి పోయాడు. దీంతో తరువాతి బంతిని ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్న కోహ్లి.. అభిమాని చర్యను చూసి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికి అతడు బంతిని తిరిగి అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND vs SL: ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్తో భారీ సిక్స్! వీడియో వైరల్ pic.twitter.com/Vn6k6xPwFT — MINI BUS 2022 (@minibus2022) January 15, 2023 pic.twitter.com/PeolYUFd4T — IPLT20 Fan (@FanIplt20) January 15, 2023 -
ధోనిని గుర్తు చేసిన కోహ్లి.. హెలికాప్టర్ షాట్తో భారీ సిక్స్! వీడియో వైరల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్లో విరాట్కు ఇది 46 సెంచరీ. ఈ సిరీస్లో కింగ్కు ఇది రెండో సెంచరీ. ఓవరాల్గా ఇప్పటివరకు విరాట్ కోహ్లి కెరీర్లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. ఇక ఈ మ్యాచ్లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఈ మ్యాచ్తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. హెలికాప్టర్ షాట్ కొట్టిన విరాట్ ఈ మ్యాచ్లో అద్భతమైన హెలికాప్టర్ షాట్ బాదిన విరాట్ కోహ్లి.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తు చేశాడు. భారత ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన కసున్ రజిత బౌలింగ్లో నాలుగో బంతిని ఫ్రంట్ఫుట్ వచ్చిన విరాట్ లాంగ్ ఆన్ దిశగా 97 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. విరాట్ అద్భుతమైన షాట్ చూసిన అభిమానులు ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IND vs SL: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే? 📹 Mighty Maximum - a 97m SIX from Virat Kohli 👀👀 Live - https://t.co/q4nA9Ff9Q2 #INDvSL @mastercardindia pic.twitter.com/R3CzXTWBT5 — BCCI (@BCCI) January 15, 2023 -
గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. విరాట్ ఏం చేశాడంటే?
తిరువనంతపురం వేదికగా ఆదివారం జరిగిన శ్రీలంక- భారత్ మూడో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్ జరుగుతుండగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి మైదానంలోకి పరుగులు తీశాడు. నేరుగా కోహ్లి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లిన అభిమాని.. విరాట్ కాళ్లకు దండం పెట్టాడు. వెంటనే కోహ్లి అతడిని పైకి లేవదీశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇక శ్రీలంకతో ఆఖరి వన్డేల్లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో సంచలన సెంచరీతో కోహ్లి చెలరేగాడు. ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్లో 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్తో పాటు సిరీస్ అసాంతం రాణించిన కోహ్లికే ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు దక్కింది. A fan invaded the field and touched Virat Kohli's feet. pic.twitter.com/wualIoFgZ8 — Mufaddal Vohra (@mufaddal_vohra) January 15, 2023 చదవండి: IND vs SL: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్లో ఏకైక ఆటగాడిగా -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డులు.. ప్రపంచ క్రికెట్లో ఏకైక ఆటగాడిగా
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో విరాట్కు ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే ►శ్రీలంకపై విరాట్కు ఇది 10వ వన్డే సెంచరీ. తద్వారా ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్తో కలిసి విరాట్ సమంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు చేయగా.. విరాట్ కూడా వెస్టిండీస్పై 9 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లి(10).. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ►ఇక భారత గడ్డపై విరాట్కు ఇది 21 వన్డే సెంచరీ. దీంతో స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో సెంచరీ చేసిన కింగ్ సచిన్ను అధిగిమించాడు. ►అదేవిధంగా స్వదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత రికీ పాటింగ్ 5521 పరుగులతో రెండో స్థానంలో నిలవగా.. 5303 రన్స్తో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. ►అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు. చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ప్రపంచ వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈ ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2008లో ఐర్లాండ్పై కివీస్ 290 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే తాజా మ్యాచ్తో కివీస్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. చెలరేగిన సిరాజ్, షమీ 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. . భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అదరగొట్టిన కోహ్లి, గిల్ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. చదవండి: IND vs SL: మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. 317 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం -
మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. 317 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. కాగా ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే పరుగుల తేడాతో ఇదే భారీ విజయం కావడం విశేషం. తద్వారా మూడు వన్డేల సిరీస్ను 3-0 తేడాతో భారత్ క్లీన్స్వీప్ చేసింది. 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్ ఆషాన్ బండారకు గాయం కావడంతో బ్యాటింగ్కు రాలేదు. దీంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు. లంకబ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్పై మైదానం బయటకు! -
తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్పై మైదానం బయటకు!
తిరువనంతపురం వేదికగా శ్రీలంక-భారత్ మూడో వన్డే సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చేసుకుంది. భారత ఇన్నింగ్స్లో శ్రీలంక ఆటగాళ్లు అషెన్ బండార, జెఫ్రీ వాండర్సే తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరిగిందంటే? భారత ఇన్నింగ్స్ 43వ ఓవర్ వేసిన చమికా కరుణరత్నే బౌలింగ్లో విరాట్ కోహ్లి స్క్వేర్ లెగ్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో బంతిని ఆపడానికి వచ్చిన వాండర్సే, బండారా ఒకరిని ఒకరు బలంగా ఢీకొన్నారు. దీంతో వీరిద్దరూ తీవ్రమైన నొప్పితో విలవిల్లాడారు. వెంటనే పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చిన ఫిజియో పరిశీలించాడు. అనంతరం వీరిద్దరిని స్ట్రెచర్పై బయటకు తీసుకువెళ్లారు. సెంచరీలతో చెలరేగిన గిల్, కోహ్లి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు. -
కింగ్ కోహ్లి అరుదైన ఘనత.. జయవర్ధనే రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 85 బంతుల్లో కోహ్లి తన 46 వన్డే సెంచరీని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. జయవర్ధనే రికార్డు బద్దలు ఇక ఈ మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు. అదే విధంగా శ్రీలంకపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్ బ్యాటర్గా కూడా విరాట్ కోహ్లి(2503) నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(2383) రికార్డును రన్మిషన్ బ్రేక్ చేశాడు. చదవండి: IND vs SL: ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి -
IND vs SL: శ్రీలంక బౌలర్లకు చుక్కలు.. సెంచరీలతో చెలరేగిన కోహ్లి, గిల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా ఈ సిరీస్లో ఇది విరాట్కు రెండో సెంచరీ కావడం గమానార్హం. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 116 పరుగులు చేశాడు. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: IND vs SL: వన్డేల్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోని రికార్డు సమం -
వన్డేల్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ధోని రికార్డు సమం
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో వన్డే క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును రోహిత్ సమం చేశాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో మూడు సిక్సర్లు బాదిన హిట్మ్యాన్ ధోనితో సమంగా నిలిచాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 73 వన్డేల్లో 123 సిక్సర్లు బాదగా.. ధోని 116 ఇన్నింగ్స్లలో 123 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్లో 49 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 3 సిక్స్లు, రెండు ఫోర్లతో 42 పరుగులు సాధించాడు. ఇక ఇదే మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 85 బంతుల్లో కోహ్లి సెంచరీ సాధించాడు. అతడి సెంచరీ ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. 147 పరుగులతో విరాట్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. చదవండి: IND vs SL: ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి -
ఆగని పరుగుల యంత్రం.. మరో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మరో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో 85 బంతుల్లో కోహ్లి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్లో ఓవరాల్గా 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ సిరీస్లో కోహ్లికి ఇది రెండో సెంచరీ. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో కింగ్ కోహ్లి అద్భుతమైన శతకం సాధించిన సంగతి తెలిసిందే. కాగా అతడి గత నాలుగు వన్డే ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు ఉండడం విశేషం. అదే విధంగా వన్డేల్లో విరాట్కు ఇది 46 సెంచరీ. ఇక ఓవరాల్గా ఇప్పటివరకు విరాట్ కోహ్లి కెరీర్లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ కావడం గమానార్హం. చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. రవీంద్ర జడేజా కీలక నిర్ణయం -
IND VS SL 3rd ODI: శతక్కొట్టిన ఓపెనర్ శుభ్మన్ గిల్
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (89 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో విరుచుకుపడటంతో టీమిండియా స్కోర్ 31 ఓవర్ల తర్వాత 202/1గా ఉంది. గిల్కు జతగా విరాట్ కోహ్లి (48 బంతుల్లో 50; 5 ఫోర్లు) క్రీజ్లో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసి చమిక కరుణరత్నే బౌలింగ్లో అవిష్క ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి రెండు వన్డేలు నెగ్గిన భారత్ ఇదివరకు 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా.. 2 మార్పులు, తుది జట్టు ఎలా ఉందంటే..?
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. హార్ధిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్లకు రెస్ట్ ఇచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లకు అవకాశం కల్పించింది. మరోవైపు శ్రీలంక సైతం రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే తుది జట్టులోకి వచ్చారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్ను భారత్ 2-0 తేడాతో ఇదివరకే కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ఆషేన్ బండార, జెఫ్రీ వాండర్సే, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, లహిరు కుమార, కసున్ రజిత -
లంకతో మూడో వన్డే.. క్లీన్స్వీప్ లక్ష్యంగా బరిలోకి భారత్
తిరువనంతపురం: భారత్, శ్రీలంక మధ్య టి20 సిరీస్లోనైనా ఫలితం చివరి మ్యాచ్ వరకు ఆగాల్సి వచ్చింది. ఇప్పుడు వన్డే సిరీస్లో మాత్రం రెండో మ్యాచ్కే ఫలితం తేలిపోయింది. టీమిండియా 2–0తో సిరీస్ గెలుచుకోగా, చివరి పోరుకు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మూడో వన్డేలో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. మరో విజయంతో సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, టి20ల తరహాలో కనీసం ఒక విజయంతోనైనా ముగించి పరువు నిలబెట్టుకోవాలని లంక కోరుకుంటోంది. మార్పు ఉంటుందా... ‘అవసరమైతే తర్వాతి మ్యాచ్లో మార్పులు చేస్తాం’... రెండో వన్డే ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్య ఇది. సిరీస్ ఇప్పటికే చేతికందడంతో స్వల్ప మార్పులతో రిజర్వ్ ఆటగాళ్లను పరీక్షించాలనేది ఆలోచన. గత రెండు మ్యాచ్లలోనూ అవకాశం దక్కకుండా అర్షదీప్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్ బెంచీపై వేచి చూస్తున్నారు. వీరిలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. ముగ్గురికీ అవకాశం ఇవ్వాలనుకుంటే ఉమ్రాన్, రాహుల్, అక్షర్లను పక్కన పెట్టవచ్చు. మరోవైపు భుజం నొప్పితో గత మ్యాచ్కు దూరమైన చహల్ పూర్తిగా కోలుకున్నాడు. అతడిని ఆడిస్తారా లేక రెండో వన్డే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ను కొనసాగిస్తారా అనేది ఆసక్తికరం. ఇతరత్రా భారత జట్టుకు ఎలాంటి సమస్యలు లేవు. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లంతా ఫామ్లో ఉన్నారు. కాబట్టి ప్రధాన బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. వీరంతా తమ స్థాయికి తగినట్లు ఆడితే నిలువరించడం లంకకు చాలా కష్టమవుతుంది. నిసాంక పునరాగమనం... గత మ్యాచ్లో భారత బ్యాటింగ్ను కాస్త ఇబ్బంది పెట్టి మ్యాచ్ను హోరాహోరీగా మార్చగలిగినా... శ్రీలంక అసలు సమస్య బ్యాటింగ్లోనే ఉంది. ఆశించిన స్థాయిలో కీలక ఆటగాళ్లు ప్రదర్శన ఇవ్వకపోవడంతో పేలవ స్కోరుకే పరిమితమైన జట్టు ఏమీ చేయలేకపోయింది. అందరికంటే సీనియర్ కుశాల్ మెండిస్ మరింత బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరు చేయాల్సి ఉంది. గాయంతో రెండో వన్డేకు దూరమైన నిసాంక తిరిగి జట్టులోకి వస్తున్నాడు. అతని స్థానంలో ఆడిన నువనిదు ఫెర్నాండో అరంగేట్ర మ్యాచ్లోనే అర్ధసెంచరీ సాధించడంతో పక్కన పెట్టలేని పరిస్థితి. దాంతో అసలంకను తప్పించవచ్చు. బౌలింగ్లో అంతంత మాత్రంగానే ఉన్న లంక భారత బ్యాటింగ్ను ఎంత వరకు నిలువరించగలదో చూడాలి. -
పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న భారత క్రికెటర్లు
తిరువనంతపురం వేదికగా ఆదివారం (జనవరి15) శ్రీలంకతో నామమాత్రపు మాడో వన్డేలో టీమిండియా తలపడనుంది. మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. కనీసం ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టకోవాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే తిరువనంతపురంకు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్లో మునిగితేలుతున్నాయి. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొంతమంది శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. వారిలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. వీరందరూ సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మూడో వన్డేకు తుది జట్లు(అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్,, కేెెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ షమీ. శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, నువానిడు ఫెర్నాండో, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, వానిందు హసరంగా, కసున్ రజిత, లాహిరు కుమార, దునిత్ వెలాలెజ్. చదవండి: SL vs IND: శ్రీలంకతో మూడో వన్డే.. గిల్, శ్రేయస్కు నో ఛాన్స్! కిషన్, సూర్య ఎంట్రీ -
శ్రీలంకతో మూడో వన్డే.. గిల్, శ్రేయస్కు నో ఛాన్స్! కిషన్, సూర్య ఎంట్రీ
తిరువనంతపురం వేదికగా ఆదివారం(జనవరి15)న శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ తలపడనుంది. ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేల సిరీస్ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇక నామమాత్రపు మూడో వన్డేలో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు వన్డేలకు దూరమైన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఆఖరి వన్డేకు జట్టులోకి రానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఓపెనర్ శుబ్మాన్ గిల్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మూడో వన్డేకు విశ్రాంతి ఇవ్వాలని జట్టు మెనేజెమెంట్ నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తొలి రెండు వన్డేల్లో గిల్ పర్వాలేదనిపించినప్పటికీ.. అయ్యర్ మాత్రం నిరాశపరిచాడు. రెండు వన్డేల్లో కలిపి కేవలం 56 పరుగులు మాత్రమే అయ్యర్ చేశారడు. ఇక ఆఖరి వన్డేలో పలు మార్పులు చేయనున్నట్లు రెండో వన్డే పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ సందర్భంగా రోహిత్ శర్మ కూడా తెలిపాడు. భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్,మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ చదవండి: బాబర్ ఆజమ్పై వేటు, పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే..? -
'జడేజా, చాహల్కు నో ఛాన్స్.. వరల్డ్ కప్కి ఆ నలుగురు స్పిన్నర్లే బెస్ట్'
వన్డే ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో తలపడుతోంది. ఇప్పటికే వరుసగా రెండు వన్డేలు గెలిచిన భారత్.. 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఇక సిరీస్లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్.. వన్డే ప్రపంచకప్లో భారత్ తరుపున బరిలోకి దిగే నలుగురు స్పిన్నర్లరను ఎంచుకున్నాడు. కాగా ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. గంభీర్ స్టార్ స్పోర్ట్ షోలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్లో మణికట్టు స్పిన్నర్ అక్షర్ పటేల్కు కచ్చితంగా చోటు ఇవ్వాలి. అక్షర్ గత కొన్ని సిరీస్ల నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. అదే విధంగా స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ కూడా జట్టులో ఉండాలి. ఇక కుల్దీప్ యాదవ్కు స్వదేశంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. భారత్లో అతడు బంతితో మ్యాజిక్ చేయగలడు. కాబట్టి కుల్దీప్ కూడా ప్రపంచకప్ భారత జట్టులో అవకాశం ఇవ్వాలి. ఇక ఆఖరిగా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ని జట్టులోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. రవి ప్రస్తుతం భారత్ సన్నాహాకాల్లో లేనప్పటికీ.. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది" అని పేర్కొన్నాడు. కాగా భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్కు గంభీర్ ఎంపిక చేయకపోవడం గమానార్హం. చదవండి: Virat Kohli: 'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు' -
వన్డేల్లో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిన రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక పరాజాయం పాలైంది. దీంతో అత్యంత చెత్త రికార్డును శ్రీలంక తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డే మ్యాచ్ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక ఇప్పటివరకు 880 మ్యాచ్లు ఆడగా.. అందులో 437 వన్డేల్లో ఓటమిపాలైంది. తద్వారా ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు టీమిండియా పేరిట ఉండేది. భారత్ ఇప్పటి వరకు 436 వన్డేల్లో ఓటమి చవిచూసింది. తాజా ఓటమితో భారత్ను లంక జట్టు అధిగిమించింది. ఇక మూడో 419 ఓటములతో పాకిస్తాన్ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా రికార్డును సమం చేసిన భారత్ ఇక ఇదే మ్యాచ్లో టీమిండియా కూడా ఓ అరుదైన రికార్డు సాధించింది. లంకపై రెండో వన్డేలో గెలుపొందిన రోహిత్ సేన.. వన్డేల్లో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాతో సంయుక్తంగా నిలిచింది. శ్రీలంకపై అత్యధికంగా 95 వన్డేల్లో భారత్ గెలవగా.. ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్పై ఇప్పటివరకు 95 వన్డేల్లో విజయం సాధించింది. చదవండి: Virat Kohli: ఇషాన్తో కలిసి డాన్స్ అదరగొట్టిన కోహ్లి! వీడియో వైరల్ -
టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శన.. సిరీస్ చిక్కింది
భారత్ లక్ష్యం 216 పరుగులే...కానీ ఏమాత్రం బ్యాటింగ్కు అనుకూలంగా లేని పిచ్పై షాట్లు ఆడటమే కష్టంగా మారిపోయింది.. ఇలాంటి స్థితిలో విజయం కోసం భారత్ 43వ ఓవర్ వరకు శ్రమించింది... స్వల్ప ఛేదనలోనూ కాస్త తడబడినా, రాహుల్ పట్టుదలగా నిలబడటంతో చివరకు భారత్ గెలుపును అందుకొని సిరీస్ను తమ ఖాతాలో వేసుకుంది. అంతకు ముందు సిరాజ్, కుల్దీప్లు చక్కటి బౌలింగ్తో ప్రత్యరి్థని కట్టిపడేశారు. దాంతో కనీస స్కోరు కూడా సాధించలేక శ్రీలంక చేతులెత్తేసింది. కోల్కతా: టి20 మ్యాచ్లోనే 228 పరుగులు నమోదై వారం కూడా కాలేదు. అదే వన్డేలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. శ్రీలంక కనాకష్టంగా స్కోరు చేయగా, దానిని ఛేదించేందుకు భారత్ 6 వికెట్లు చేజార్చుకుంది. గురువారం జరిగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్లతో శ్రీలంకను ఓడించింది. మొదట శ్రీలంక 39.4 ఓవర్లలోనే 215 పరుగుల వద్ద ఆలౌటైంది. నువనిదు ఫెర్నాండో (63 బంతుల్లో 50; 6 ఫోర్లు) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్, సిరాజ్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (103 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. సిరీస్ 2–0తో భారత్ గెలుచుకోగా, చివరి వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరుగుతుంది. భుజం గాయంతో దూరమైన చహల్ స్థానంలో కుల్దీప్ ఈ మ్యాచ్లోకి వచ్చాడు. రాణించిన నువనిదు అవిష్క ఫెర్నాండో (20; 4 ఫోర్లు) ఎక్కువ సేపు నిలబడలేకపోగా, అరంగేట్రం చేసిన నువనిదు ఫెర్నాండో పిచ్ పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు. తన ఓవర్లోనే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన అవిష్కను సిరాజ్ మరుసటి ఓవర్లో బౌల్డ్ చేశాడు. తర్వాత కుశాల్, నువనిదు ఓవర్కు 6 పైచిలుకు రన్రేట్తో జట్టు స్కోరును వంద పరుగులకు చేర్చారు. అంతలోనే కుశాల్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్)ను కుల్దీప్ ఎల్బీగా పంపడంతో 73 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత స్పిన్, పేస్ల వైవిధ్యం లంకను కుదురుకోనివ్వలేదు. ధనంజయ (0)ను అక్షర్ డకౌట్ చేయగా, అసలంక (15), కెపె్టన్ షనక (2)లను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. హసరంగ (21; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటికి ఉమ్రాన్ బ్రేకులేయగా, లోయర్ ఆర్డర్లో దునిత్ వెలలగే (34 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) చేసిన స్కోరుతో లంక కష్టంగా 200 పరుగులు దాటింది. హార్దిక్ సహకారం లక్ష్యం చిన్నదే అయినా గెలుపు సులువుగా ఏమీ రాలేదు. గత మ్యాచ్ ‘టాప్ 3’ రోహిత్ (17; 2 ఫోర్లు, 1 సిక్స్), శుబ్మన్ గిల్ (12 బంతుల్లో 21; 5 ఫోర్లు), కోహ్లి (4) తొలి పది ఓవర్లలోపే అవుటైతే గానీ పిచ్ సత్తా తెలియలేదు. 62 పరుగులకే వీళ్లంతా పెవిలియన్లో కూర్చున్నారు. మిగిలిన ప్రధాన బ్యాటర్స్ ముగ్గురే... అయ్యర్, రాహుల్, పాండ్యా! కానీ లక్ష్యదూరం మాత్రం 154 పరుగులు. కీలక దశలో శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 28; 5 ఫోర్లు) కూడా వెనుదిరిగాడు. అయితే రాహుల్, హార్దిక్ పాండ్యా (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ఈ జోడీ ఐదో వికెట్కు 75 పరుగులు జోడించింది. 161 స్కోరు వద్ద పాండ్యా అవుటైనా... రాహుల్ కడదాకా నిలబడ్డాడు. అక్షర్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్), కుల్దీప్ (10 నాటౌట్; 2 ఫోర్లు)లతో కలిసి జట్టును గెలిపించాడు. 93 బంతుల్లో (3 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: అవిష్క (బి) సిరాజ్ 20; నువనిదు రనౌట్ 50; మెండిస్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 34; ధనంజయ (బి) అక్షర్ 0; అసలంక (సి) అండ్ (బి) కుల్దీప్ 15; షనక (బి) కుల్దీప్ 2; హసరంగ (సి) అక్షర్ (బి) ఉమ్రాన్ 21; దునిత్ (సి) అక్షర్ (బి) సిరాజ్ 32; కరుణరత్నే (సి) అక్షర్ (బి) ఉమ్రాన్ 17; రజిత నాటౌట్ 17; లహిరు (బి) సిరాజ్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (39.4 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1–29, 2–102, 3–103, 4–118, 5–125, 6–126, 7–152, 8–177, 9–215, 10–215. బౌలింగ్: షమీ 7–0–43–0, సిరాజ్ 5.4–0–30–3, పాండ్యా 5–0–26–0, ఉమ్రాన్ 7–0–48–2, కుల్దీప్ 10–0–51–3, అక్షర్ 5–0–16–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మెండిస్ (బి) కరుణరత్నే 17; గిల్ (సి) అవిష్క (బి) లహిరు 21; కోహ్లి (బి) లహిరు 4; అయ్యర్ (ఎల్బీ) (బి) రజిత 28; రాహుల్ నాటౌట్ 64; పాండ్యా (సి) మెండిస్ (బి) కరుణరత్నే 36; అక్షర్ (సి) కరుణరత్నే (బి) ధనంజయ 21; కుల్దీప్ నాటౌట్ 10; ఎక్స్ట్రాలు 18; మొత్తం (43.2 ఓవర్లలో 6 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–33, 2–41, 3–62, 4–86, 5–161, 6–191. బౌలింగ్: కసున్ రజిత 9–0–46–1, లహిరు 9.2–0–64–2, కరుణరత్నే 8–0–51–2, హసరంగ 10–0–28–0, దునిత్ 2–0–12–0, షనక 2–0–6–0, ధనంజయ 3–0–9–1. చదవండి: IND vs SL: సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు.. -
సిరాజ్ సూపర్ డెలివరీ.. దెబ్బకు ఎగిరిపోయిన మిడిల్ స్టంప్! వీడియో వైరల్
శ్రీలంకతో తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. కోల్కతా వేదికగా రెండో వన్డేలో కూడా సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్లో లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండోను సిరాజ్ను ఓ సంచలన బంతితో పెవిలియన్కు పంపాడు. ఫెర్నాండోను సిరాజ్ అద్బుతమైన ఇన్స్వింగర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ వేసిన ఆఖరి బంతిని ఫెర్నాండో కవర్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి స్వింగ్ అయ్యి మిడిల్ స్టంప్ను గిరాటేసింది. దీంతో అవిష్క ఫెర్నాండో ఒక్క సారిగా షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: IND vs SL: సహాచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు.. Timber Strike, the @mdsirajofficial way 👌👌 Relive how he dismissed Avishka Fernando 🔽 Follow the match 👉 https://t.co/MY3Wc5253b#TeamIndia | #INDvSL pic.twitter.com/ZmujAITsco — BCCI (@BCCI) January 12, 2023 -
సహచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు..
కోల్కతా వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన సహానాన్ని కోల్పోయాడు. శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా వాటర్ బాటిల్ అందించడం ఆలస్యం కావడంతో హార్ధిక్.. సహచర సబ్స్టిట్యూట్ ఫీల్డర్ ఒకరిపై గట్టిగా అరుస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. హార్దిక్ ఆడిన మాటలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి. ఈ సంఘటన శ్రీలంక ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరిలో చోటు చేసుకుంది. ఇక హార్దిక్ వాయిస్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్గా మారింది. ఈ క్రమంలో హార్దిక్ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. కేవలం వాటర్ కోసం సహచర ఆటగాడిని అలా దుర్భాషలాడం మంచి పద్దతి కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. ఇక లంక బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు నువానీడు ఫెర్నాండో(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కుశాల్ మెండిస్(34), డివెల్లలాగే(32) పరుగులతో రాణించారు. చదవండి: Virat Kohli: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్ ఎక్స్ప్రెషన్.. వైరల్ Hardik Pandya said "paani manga tha last over gaa*d marwa rahe ho udhar" 😂🤣🤣🤣 btw to whom he said these beautiful words 😂😂#HardikPandya#INDvsSL #HardikPandya #viratkholi pic.twitter.com/4NDLR2H8lg — 𝓚𝓪𝓹𝓲𝓵𝓮𝓷𝓭𝓻𝓪 𝓓𝓪𝓼 (@KapilendraDas3) January 12, 2023 -
వారెవ్వా అక్షర్! గాల్లోకి డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 34 ఓవర్ వేసిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో.. కరుణరత్నే పాయింట్ దిశగా కట్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ఎడమవైపు డైవ్ చేస్తూ స్టన్నింగ్ క్యాచ్ను అందుకున్నాడు. దీంతో 17 పరుగులు చేసిన కరుణరత్నే నిరాశతో పెవిలియన్కు చేరాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం అక్షర్ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. ఇక లంక బ్యాటర్లలో అరంగేట్ర ఆటగాడు నువానీడు ఫెర్నాండో(50) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. కుశాల్ మెండిస్(34), డివెల్లలాగే(32) పరుగులతో రాణించారు. Sharp catch alert 💥@akshar2026 dives to his left and takes a fine catch as @umran_malik_01 gets his second wicket 👌👌#TeamIndia | #INDvSL | @mastercardindia pic.twitter.com/R4bJoPXNM3 — BCCI (@BCCI) January 12, 2023 చదవండి: Virat Kohli: ఇదెలా సాధ్యమైంది? కోహ్లి షాకింగ్ ఎక్స్ప్రెషన్.. వైరల్ -
Team India: స్వదేశంలో బెబ్బులి.. మరి విదేశాల్లో, మెగా టోర్నీల్లో..?
స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో, చిన్న జట్లతో జరిగే వన్ టు వన్ సిరీస్ల్లో బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా.. విదేశాల్లో జరిగే సిరీస్ల్లో, అలాగే పెద్ద జట్లు పాల్గొనే నాకౌట్ మెగా టోర్నీల్లో చతికిలపడటం చాలాకాలంగా మనం గమనిస్తూనే ఉన్నాం. టీమిండియా ఆటగాళ్లు సొంతగడ్డపై మాత్రమే పులులు అన్న అపవాదును సైతం మనం చాలాకాలంగా మోస్తూనే ఉన్నాం. ధోని హయాంలో, కొద్దికాలం పాటు విరాట్ కోహ్లి జమానాలో ఈ అపవాదు తప్పని నిరూపించుకోగలిగినప్పటికీ, ఇటీవలి కాలంలో మళ్లీ పాత పరిస్థితే ఎదురవుతూ వస్తుంది. రోహిత్ సారధ్య బాధ్యతలు చేపట్టాక ఆడిన రెండు మెగా టోర్నీల్లో రిక్త హస్తాలతోనే ఇంటి ముఖం పట్టిన టీమిండియా.. చిన్న జట్లపై, అలాగే స్వదేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్ల్లో మాత్రం రెచ్చిపోతుంది. ఎంతలా అంటే.. డబుల్ సెంచరీలు, సెంచరీలు, 5 వికెట్లు తీసిన ఆటగాళ్లను కూడా బెంచ్కు పరిమితం చేసేంతలా సొంతగడ్డపై టీమిండియా దూకుడు ప్రదర్శిస్తుంది. రిజర్వ్ బెంచ్ సైతం ఇంత బలంగా ఉన్న జట్టు విదేశాల్లో, పెద్ద జట్లతో మ్యాచ్ల్లో, మెగా టోర్నీల్లో ఎందుకు ఓటమిపాలవుతుందన్న విషయాన్ని బేరీజు వేసుకుంటే, ఒక్క విషయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. అదేంటంటే.. స్వదేశంలో నాణ్యమైన ఫాస్ట్ బౌలింగ్ పిచ్లు లేకపోవడం. ఇక్కడి సంప్రదాయ స్పిన్ పిచ్లకు అలవాటు పడి, వీటిపై పరుగుల వరద పారించే మన హీరోలు.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ట్రాక్లపై ఆ దేశ పేసర్లకు దాసోహమైపోతున్నారు. ఇక మెగా టోర్నీల్లో టీమిండియా వైఫల్యాల విషయానికొస్తే.. ఆడిన ప్రతి టోర్నీలో భారీ అంచనాలు జట్టు కొంపముంచుతున్నాయి. 130 కోట్లకు పైగా భారతీయులు ప్రతి మ్యాచ్లో జట్టు గెలవాలని కోరుకోవడం, అంచనాలకు తగ్గట్టుగా రాణించాలని ఆటగాళ్లు ఒత్తిడికి లోనవ్వడం సమాంతరంగా జరిగిపోతున్నాయి. విదేశాల్లో, మెగా టోర్నీల్లో టీమిండియా ఓటములకు మరో కారణం బీసీసీఐలో నెలకొన్న రాజకీయాలు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో సెలెక్షన్ కమిటీ కాకుండా స్వయంగా బోర్డు అధ్యక్షుడే జోక్యం చేసుకునేంతలా బీసీసీఐ రాజకీయాలు భ్రష్ఠుపట్టాయి. ఆటగాళ్ల ఎంపికలో, తుది జట్టు కూర్పు విషయంలో బోర్డు పెద్దలు జోక్యం చేసుకోకుంటే.. కోచ్, కెప్టెన్ సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బీసీసీఐ రాజకీయాలు మానుకుని పై పేర్కొన్న మూడు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడితే స్వదేశంలో, చిన్న జట్లపై బెబ్బులిలా రెచ్చిపోయే టీమిండియా ఆటగాళ్లు.. విదేశాల్లో, పెద్ద జట్లపై, మెగా టోర్నీల్లో తమ ప్రతాపం చూపుతారు. -
లంక యువ సంచలనం.. అరంగేట్రంలోనే అదుర్స్! కానీ పాపం..
India vs Sri Lanka, 2nd ODI- Nuwanidu Fernando: శ్రీలంక యువ ఆటగాడు నువానీడు ఫెర్నాండో తన అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్తో జరుగతున్న వన్డేలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఫెర్నాండో.. అర్ధ శతకంతో అందరిని ఆకట్టుకున్నాడు. వెన్ను నొప్పి కారణంగా పాతుమ్ నిసాంక దూరం కావడంతో అతడి స్థానంలో నువానీడు ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్లో 50 పరుగులు చేసిన ఫెర్నాండో దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్లో 6 బౌండరీలు ఉన్నాయి. కాగా వన్డే డెబ్యు మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆరో శ్రీలంక బ్యాటర్గా నువానీడు రికార్డులకెక్కాడు. ఇక తొలి మ్యాచ్లోనే అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఫెర్నాండో గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ నువానీడు ఫెర్నాండో? ఫెర్నాండో అక్టోబర్ 13, 1999న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. అతడు 2016లో కోలంబో తరపున తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అదే విధంగా ఫస్ట్-క్లాస్ క్రికెట్లో ఆకట్టుకున్న ఫెర్నాండోకు 2018 అండర్-19 ప్రపంచకప్ శ్రీలంక జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన 132 పరుగులతో రాణించాడు. అనంతరం 2019లో లిస్ట్-ఏ క్రికెట్లోకి నువానీడు ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 31 మ్యాచ్లు ఆడిన అతడు 1771 పరుగులు సాధించాడు. అదే విధంగా 23 లిస్ట్-ఏ క్రికెట్లో 748 పరుగులు, 34 టీ20ల్లో 760 పరుగులు చేశాడు. కాగా లంక సీనియర్ పేసర్ విశ్వ ఫెర్నాండో సోదరుడే ఈ నువానీడు ఫెర్నాండో కావడం విశేషం. లంక ప్రీమియర్ లీగ్లో అదుర్స్ గతేడాది ఆఖరిలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్లో ఫెర్నాండో అదరగొట్టాడు. గాలే గ్లాడియేటర్స్ తరపున ఆడిన అతడు తొమ్మిది మ్యాచ్ల్లో 211 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే భారత్తో వన్డేలకు శ్రీలంక జట్టులో ఫెర్నాండోకు చోటు దక్కింది. చదవండి: Prithvi Shaw: నాకు తల పొగరా? హర్ట్ అయ్యాను! పర్లేదు.. పంత్ స్థానంలో నువ్వే! జై షా ట్వీట్ వైరల్ -
శ్రీలంకతో రెండో వన్డే.. టాస్ ఓడిన టీమిండియా, ఒక్క మార్పుతో బరిలోకి..!
కోల్కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి, తొలుత బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఓ మార్పు చేసింది. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా గాయపడ్డ చహల్ మ్యాచ్ సమయానికి కోలుకోక పోవడంతో అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగింది. పథుమ్ నిస్సంక, మధుశంక స్థానాల్లో నువనిదు ఫెర్నాండో, లహీరు కుమార తుది జట్టులోకి వచ్చారు. కాగా, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి (113) సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తుది జట్లు.. భారత్: రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ శ్రీలంక: కుశాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వ, నువనిదు ఫెర్నాండో, దసున శనక, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దునిత్ వెల్లలాగే, లహిరు కుమార, కసున్ రజిత -
కింగ్ కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలవాల్సిందే.. అదీ లెక్క..!
IND VS SL 1st ODI: 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా జనవరి 10న శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శతకం బాదిన విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్).. ఈ సెంచరీతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 45వ శతకాన్ని, ఓవరాల్గా 73వ అంతర్జాతీయ సెంచరీని బాదిన కోహ్లి.. శ్రీలంకపై తన 9వ శతకాన్ని నమోదు చేసి క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును (శ్రీలంకపై 8 శతకాలు) బద్దలుకొట్టాడు. ఈ క్రమంలో శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు కోహ్లి మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో కింగ్ సెంచరీ చేసిన 37 సందర్భాల్లో (ఓవరాల్గా 45 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ ఫార్మాట్ చర్రితలో ఇది ప్రపంచ రికార్డుగా నమోదైంది. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ సెంచరీ చేసిన 35 సందర్భాల్లో (ఓవరాల్గా 49 సెంచరీలు) టీమిండియా విజయం సాధించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే, కోహ్లి సెంచరీ కొడితే టీమిండియా గెలుపు డిసైడ్ అయిపోతుందన్నది సుస్పష్టం అవుతుంది. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగులు చేసింది. కోహ్లి సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. ఛేదనలో నిస్సంక (72) అర్ధసెంచరీతో, షనక (108 నాటౌట్) సెంచరీతో పోరాడినప్పటికీ శ్రీలంక గెలవలేకపోయింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే కోల్కతాలో ఇవాళ (జనవరి 12) జరుగనుంది. -
శ్రీలంకతో రెండో వన్డే.. సూర్యకుమార్, ఇషాన్ కిషన్లకు ఛాన్స్.. ఎవరిపై వేటు..?
IND VS SL 2nd ODI: భారత్-శ్రీలంక జట్ల మధ్య కోల్కతా వేదికగా రేపు (జనవరి 12) రెండో వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. తొలి వన్డేలో లంకపై 67 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించిన భారత్.. రేపటి మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు చేయబోతుందోనని క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత మ్యాచ్లో ప్రదర్శనల ఆధారంగా చూస్తే రేపటి మ్యాచ్లో ఎవరినీ తప్పించే అవకాశం లేనప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (లంకతో మూడో టీ20లో మెరుపు శతకం సాధించాడు), ఇషాన్ కిషన్ (బంగ్లాదేశ్తో తన చివరి వన్డేలో డబుల్ సెంచరీ బాదాడు) లతో రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది కాబట్టి, రొటేషన్ పద్దతిలో వీరిద్దరికి ఛాన్స్ లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ వీరిద్దరికి అవకాశం కల్పిస్తే ఎవరిపై వేటు వేస్తారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తొలి వన్డేలో కోహ్లి (113), రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) పరుగుల వరద పారించారు కాబట్టి వీరిని కదిలించే అవకాశం లేదు. బ్యాటింగ్ విభాగంలో ఇక మిగిలింది శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లు మాత్రమే. గత మ్యాచ్లో వీరిద్దరు కూడా ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. శ్రేయస్ 28, రాహుల్ 39 పరగులు చేసి ఔట్ కావడంతో అందరి కళ్లు వీరిద్దరిపై పడ్డాయి. స్కై, ఇషాన్లకు ఛాన్స్ ఇవ్వాలంటే వీరిని తప్పించాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఇషాన్ ఎటూ వికెట్కీపింగ్ చేస్తాడు కాబట్టి రాహుల్ స్థానాన్ని భర్తీ చేస్తాడని, శ్రేయస్ స్థానాన్ని సూర్యకుమార్తో ఫిల్ చేయాలని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిస్తున్నాయి. అయితే కేవలం ఒక్క మ్యాచ్లో పరుగులు చేయనంత మాత్రానా, జట్టును నుంచి తప్పిస్తారా అని ప్రశ్నించే వారు కూడా లేకపోలేదు. తొలి వన్డేలో శ్రేయస్, రాహుల్ బరిలోకి దిగిన సమయానికి ధాటిగా పరుగులు చేయాల్సి ఉండింది, ఆ క్రమంలోనే వారు ఔటయ్యారు, అలాంటప్పుడు వారిని జట్టు నుంచి తప్పించాలనడం ఎంత మాత్రం సమంజసం కాదని వాదిస్తున్నారు. ఇలా వాదించే వారికి స్కై, ఇషాన్ అభిమానులు కూడా తగు రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. ఇషాన్ తాను ఆడిన ఆఖరి వన్డేలో డబుల్ సెంచరీ, స్కై.. తానాడిన చివరి మ్యాచ్లో సెంచరీ చేసినప్పటికీ, జట్టు సమతూకం పేరు చెప్పి వీరిని తప్పించలేదా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్మీడియాలో ఈ ఆసక్తికర చర్చ నేపథ్యంలో రేపటి మ్యాచ్ కోసం జట్టు మేనేజ్మెంట్ ఎలాంటి మార్పులు చేస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు సొంతం
ICC T20 Rankings: టీమిండియా డాషింగ్ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెట్లో భారత్ తరఫున ఎవరికీ సాధ్యం కాని అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో 908 రేటింగ్ పాయింట్స్ సాధించి, పొట్టి ఫార్మాట్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్న స్కై.. 900 అంతకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్స్ సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 45 బంతుల్లోనే విధ్వంసకర శతకం బాదిన సూర్యకుమార్.. తొలిసారి 900 రేటింగ్ పాయింట్స్ మార్కును తాకి, టీ20 ర్యాంకింగ్స్లో ఎవరికీ అంతనంత ఎత్తుకు దూసుకెళ్లాడు. టీ20 ర్యాంకింగ్స్ చరిత్రలో గతంలో డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్లు మాత్రమే 900 రేటింగ్ పాయింట్స్ను సాధించగా.. తాజాగా స్కై వీరిద్దరి సరసన చేరాడు. తాజా ర్యాంకింగ్స్లో స్కై తర్వాత అల్లంత దూరాన పాకిస్తాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. రిజ్వాన్.. 836 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత డెవాన్ కాన్వే, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్, డేవిడ్ మలాన్, గ్లెన్ ఫిలిప్స్, రిలీ రొస్సో, ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 631 రేటింగ్ పాయింట్స్తో 13వ ప్లేస్లో నిలిచాడు. టాప్-20లో టీమిండియా తరఫున స్కై, విరాట్లు మాత్రమే ఉన్నారు. కాగా, లంకపై మూడో టీ20లో మెరుపు శతకం బాదిన సూర్యకుమార్కు అదే జట్టుతో జరిగిన తొలి వన్డేలో చోటు దక్కకపోవడం విశేషం. ఇప్పటివరకు 45 టీ20 మ్యాచ్లు ఆడిన సూర్య.. 46.41 సగటున 180.34 స్ట్రయిక్ రేట్తో 1578 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టీమిండియా తరఫున 16 వన్డేలు ఆడిన స్కై.. 32 సగటున, 100.5 స్ట్రయిక్ రేట్తో 384 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. -
దసున్ షనక సెంచరీ వృధా.. శ్రీలంకపై భారత్ ఘన విజయం
గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 67పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 374 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేయగల్గింది. లంక కెప్టెన్ దసున్ షనక(108) ఆఖరి వరకు పోరాటం చేసినప్పటికీ తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. లంక బ్యాటర్లలో షనకతో పాటు ఓపెనర్ నిస్సాంక 72 పరుగులతో అకట్టుకున్నాడు. ఇక భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ రెండు, షమీ,హార్దిక్, చాహల్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి(113) అద్భుతమైన సెంచరీ సాధించగా.. రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జనవరి 12న జరగనుంది. చదవండి: IND vs SL: వారెవ్వా.. సిరాజ్ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్ -
వారెవ్వా.. సిరాజ్ దెబ్బకు బిత్తరపోయిన లంక బ్యాటర్
గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన బంతితో మెరిశాడు. శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ను అద్భుతమైన ఇన్స్వింగర్తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వేసిన బంతిని మెండిస్ కవర్ ఆడే ప్రమత్నం చేయగా.. బంతి ఇన్స్వింగ్ అయ్యి వికెట్లను వికెట్లను గిరాటేసింది. దీంతో ఒక్క సారిగా మెండిస్ కూడా బిత్తరి పోయాడు. సిరాజ్ దెబ్బకు మెండిస్ డకౌట్గా పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియోను వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు అదిలోనే సిరాజ్ గట్టి షాకిచ్చాడు. లంక ఓపెనర్ల ఇద్దరని సిరాజ్ తొలి ఐదు ఓవర్లలోనే పెవిలియన్కు పంపాడు. అనంతరం ఉమ్రాన్ మూడు వికెట్లతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసే సరికి లంక 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. Mohammed Siraj is breathing fire 🔥 pic.twitter.com/ykjPbSSINE — Emon Mukherjee (@EmonMukherjee21) January 10, 2023 చదవండి: IND vs SL: సచిన్తో కోహ్లిని పోల్చడం సరికాదు.. గౌతం గంభీర్ సంచలన వాఖ్యలు -
నిప్పులు చెరిగిన ఉమ్రాన్.. ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు నమోదు
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్, కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. తాను వేసిన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ 14వ ఓవర్) నాలుగో బంతిని ఏకంగా 156 కిమీ వేగంతో విసిరాడు. టీమిండియా చోటు దక్కించుకున్నప్పటి నుంచి నిలకడైన వేగంతో బంతులు సంధిస్తున్న ఉమ్రాన్.. ఈ సిరీస్కు ముందు లంకతో జరిగిన టీ20 సిరీస్లో 155 కిమీ వేగంతో బంతిని విసిరి టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. ఉమ్రాన్.. ఐపీఎల్లో సైతం టీమిండియా అత్యంత వేగవంతమైన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో ఈ కశ్మీరీ ఎక్స్ప్రెస్ 157 కిమీ వేగంతో బంతిని విసిరాడు. భారత్ తరఫున ఐపీఎల్లో ఉమ్రాన్దే రికార్డు. కాగా, లంకతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లి సెంచరీతో (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్), రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 29 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతుంది. -
సచిన్తో కోహ్లిని పోల్చడం సరికాదు.. గౌతం గంభీర్ సంచలన వాఖ్యలు
కొత్త ఏడాదిని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో ఆరంభించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో విరాట్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 113 పరుగులు చేశాడు. కాగా విరాట్కు ఇది 45వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు రికార్డులను కోహ్లి బ్రేక్ చేశాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్లు అవసరం కాగా.. సచిన్కు 310 మ్యాచ్లు అవసరమయ్యాయి. అదే విధంగా స్వదేశంలో అత్యధిక సెంచరీల చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లి(20) సమం చేశాడు. దీంతో విరాట్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిస్తోంది. ఈ క్రమంలో కోహ్లిపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్తో విరాట్ కోహ్లిని పోల్చడం సరికాదు అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ కాలంలో ఫీల్డ్ ఆంక్షలు బ్యాటర్లకు అంత అనుకూలంగా లేనందున పరుగులు చేయడం కష్టమని గంభీర్ తెలిపాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ.. "కోహ్లిని సచిన్తో పోల్చడం సరికాదు. సచిన్ క్రికెట్ ఆడే కాలంలో ఫీల్డ్ ఆంక్షలు చాలా కఠినంగా ఉండేవి. ఫీల్డ్లో 30 యార్డ్ సర్కిల్ వెలుపల 5 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లు ఉండేవారు. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలా కష్టంగా ఉండేది" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: IND VS SL 1st ODI: రోహిత్.. లంకపై చేసిన హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..? -
రోహిత్.. లంకపై చేసిన హాఫ్ సెంచరీని ఎవరికి అంకితం ఇచ్చాడో తెలుసా..?
గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత మునపటి టచ్లో కనబడిన హిట్ మ్యాన్.. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో ఓవరాల్గా 67 బంతులు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్.. 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్లో బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా, ఈ మ్యాచ్లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే.. నిన్న (జనవరి 9) రోహిత్ అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్ చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్ భార్య రితిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. మ్యాజిక్ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్.. ఫిఫ్టి పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్ పేరును స్మరిస్తూ, చాలాకాలం తర్వాత చేసిన కీలక హాఫ్ సెంచరీని మ్యాజిక్కు అంకితమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. Dedicating this 50 for his pet dog who passed away this week. Rohit is an emotion for cricketing fans!! Love this celebration from skipper.#RohitSharma #INDvSL #RohitSharma𓃵 pic.twitter.com/c7EHEmsFjc — sportsbuzz (@cricket_katta11) January 10, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రోహిత్, శుభ్మన్ గిల్ (70)లు హాఫ్ సెంచరీలతో రాణించగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్) శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. View this post on Instagram A post shared by Ritika Sajdeh (@ritssajdeh) -
లంకతో తొలి వన్డే.. సూపర్ సెంచరీతో పలు రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి
IND VS SL 1st ODI: గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో సెంచరీ చేయడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో కేవలం 80 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. వన్డేల్లో 45వ శతకాన్ని, ఓవరాల్గా 73వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లోనే వన్డేల్లో 12500 పరుగుల మైలరాయిని చేరుకున్న కోహ్లి.. శ్రీలంకపై తన 9వ శతకాన్ని బాదాడు. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ పేరిట ఉన్న ఓ రికార్డును (శ్రీలంకపై 8 శతకాలు) బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును కింగ్ సమం చేశాడు. స్వదేశంలో సచిన్ 164 మ్యాచ్ల్లో 20 సెంచరీలు సాధిస్తే.. రన్మెషీన్ కేవలం 101 మ్యాచ్ల్లోనే 20 శతకాలు పూర్తి చేశాడు. 1214 రోజుల పాటు సెంచరీ లేక ముప్పేట దాడిని ఎదుర్కొన్న కోహ్లి ఆసియా కప్-2022లో ఆఫ్ఘనిస్తాన్పై టీ20 శతకం తర్వాత వన్డేల్లో వరుస మ్యాచ్ల్లో (బంగ్లాదేశ్, శ్రీలంక) శతకాలు బాదాడు. ఈ సెంచరీ ద్వారా కోహ్లి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక, వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. సచిన్ కూడా వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై 9 సెంచరీలు సాధించినప్పటికీ శ్రీలంకపై 8 సెంచరీలతోనే ఆగిపోయాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 113 పరుగులు చేసిన కోహ్లి.. తన వన్డే కెరీర్లో ఓ జట్టుపై అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. కోహ్లి తన వన్డే కెరీర్లో అత్యధికంగా శ్రీలంకపై 2264 పరుగుల చేయగా.. వెస్టిండీస్పై 2261, ఆస్ట్రేలియాపై 2083. సౌతాఫ్రికాపై 1403 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కోహ్లి సెంచరీతో, రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు. -
IND vs SL: దుమ్మురేపిన కోహ్లి, రోహిత్.. శ్రీలంక టార్గెట్ 374 పరుగులు
గౌహతి వేదికగా శ్రీలంకతో మొదటి వన్డేలో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(113) అద్భుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(83), శుబ్మాన్ గిల్(70) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. విరాట్ కేవలం 80 బంతుల్లోనే తన 45 అంతర్జాతీయ వన్డే సెంచరీని అందుకున్నాడు. విరాట్ ఇన్నింగ్స్లో 12 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. ఇక శ్రీలంక బౌలర్లలో కుశాన్ రజితా మూడు వికెట్లు పడగొట్టగా..మధుశంక, కరుణరత్నే, షనక తలా వికెట్ సాధించారు. -
IND Vs SL: వారెవ్వా! సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి..
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన తొలి మ్యాచ్లోనే కోహ్లి సెంచరీ సాధించాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో మొదటి వన్డేలో కింగ్ కోహ్లి సెంచరీ చెలరేగాడు. ఈ మ్యాచ్లో విరాట్ కేవలం 80 బంతుల్లోనే తన 45వ అంతర్జాతీయ వన్డే సెంచరీ అందుకున్నాడు. ఇక ఓవరాల్గా విరాట్కు ఇది 73వ అంతర్జాతీయ సెంచరీ. ఇక ఈ మ్యాచ్లో 87 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 113 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 12 ఫోర్లు,ఒక సిక్స్ ఉన్నాయి. కాగా విరాట్కు ఇది వరుసగా రెండో వన్డే శతకం కావడం గమానార్హం. గతేడాది ఆఖరిలో బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో విరాట్ అద్భుతమైన సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం విరాట్కు ఇదే తొలి వన్డే. Back to back ODI hundreds for @imVkohli 👏👏 Live - https://t.co/MB6gfx9iRy #INDvSL @mastercardindia pic.twitter.com/Crmm45NLNq — BCCI (@BCCI) January 10, 2023 -
సెంచరీ, డబుల్ సెంచరీ చేసినా టీమిండియాలో చోటుకు దిక్కు లేదు.. ఏంటీ పరిస్థితి..?
IND VS SL 1st ODI: భారత్-శ్రీలంక జట్ల మధ్య గౌహతి వేదికగా ఇవాళ (జనవరి 10) తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70), విరాట్ కోహ్లి (79 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 41 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కోహ్లికి జతగా హార్ధిక్ (0) క్రీజ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39)లకు కూడా మంచి ఆరంభమే లభించినప్పటికీ.. అనవసర షాట్లకు ప్రయత్నించి ఔటయ్యారు. లంక బౌలర్లలో మధుశంక, దసున్ షనక, ధనంజయ డిసిల్వలకు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ మ్యాచ్లో భారత తుది జట్టు కూర్పు పలు వివాదాలకు తెరలేపింది. పలువురు ఆటగాళ్లు తమ చివరి మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించినా.. తుది జట్టులో చోటు సంపాదించలేకపోయారు. ఈ విషయమే ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత మ్యాచ్లో (లంకతో మూడో టీ20) విధ్వంసకర శతకం సాధించిన సూర్యకుమార్, తానాడిన చివరి వన్డేలో (బంగ్లాతో మూడో వన్డే) ఏకంగా డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్, బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ (8 వికెట్లు, 40 పరుగులు) లంకతో జరుగుతున్న తొలి వన్డేలో చోటు దక్కించుకోలేకపోయారు. ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నా, జట్టు సమతూకం పేరుతో వారిని పక్కకు పెట్టడం ఎంత మాత్రం సమజసం కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పెద్దగా ఫామ్లో లేని కేఎల్ రాహుల్ కోసం సూర్యకుమార్ యాదవ్ను తుది జట్టు నుంచి తప్పించడం విఢ్డూరంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అలాగే మంచి ఫామ్లో ఉన్న కుల్దీప్ యాదవ్ను కాదని చహల్ను ఆడించడం ఏంటని మేనేజ్మెంట్ను ప్రశ్నిస్తున్నారు. ఇషాన్ కిషన్ విషయంలో జట్టు యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు దారుణమని అంటున్నారు. ఆటగాళ్లు రాణిస్తున్నా ఏదో ఒక కారణం చెప్పి పక్కన పెడితే మిగతా ఆటగాళ్లలో కూడా అభద్రతా భావం పెరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు. -
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లి
గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో శతకం దిశగా దూసుకుపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (92) క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. కోహ్లి ఈ మార్కును అందుకునేందుకు 257 మ్యాచ్లు అవసరం కాగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ఈ ఫీట్ సాధించేందుకు ఏకంగా 310 మ్యాచ్లు అవసరమయ్యాయి. మరోవైపు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్కు 12500 పరుగులు చేసేందుకు 328 మ్యాచ్లు తీసుకున్నాడు. కోహ్లి వన్డేల్లో 57.88 సగటున ఈ పరుగులు స్కోర్ చేశాడు. కాగా, ఈ మ్యాచ్లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. రోహిత్ శర్మ (83), శుభ్మన్ గిల్ (70), విరాట్ కోహ్లి (92 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో 45 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39), హార్ధిక్ పాండ్యా (14) ఔట్ కాగా.. కోహ్లి జతగా అక్షర్ పటేల్ క్రీజ్లో ఉన్నాడు. -
దుమ్ము రేపిన రోహిత్ శర్మ.. అయ్యో! సెంచరీ మిస్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన రోహిత్ తొలి మ్యాచ్లోనే అదరగొట్టాడు. గౌహతి వేదికగా శ్రీలంకతో తొలి వన్డేలో రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 67 బంతులు ఎదుర్కొన్న హిట్మ్యాన్.. 9 ఫోర్లు, 3 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. కాగా ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 83 పరుగులు చేసిన హిట్మ్యాన్ శ్రీలంక పేసర్ మధుశంక బౌలింగ్లో క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ఓ దశలో 150(డాడీ 100)కి పైగా పరుగులు చేస్తాడని భావించగా.. రోహిత్ ఇలా సెంచరీ చేజార్చుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా.. ‘‘హృదయం ముక్కలైంది’’ అంటూ బ్రేకింగ్ హార్ట్ ఎమోజీలు జతచేస్తున్నారు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం.. ‘‘రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.. కానీ.. డాడీ 100 మిస్ అయ్యాడు’’ అని విచారం వ్యక్తం చేశాడు. భారీ స్కోర్ దిశగా భారత్ ఇక లంకతో తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 41 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లి(62), హార్దిక్ పాండ్యా(0) పరుగులతో ఉన్నారు. కాగా అంతకుముందు తొలి వికెట్కు రోహిత్, గిల్ కలిసి 143 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్లో గిల్ 70 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. Vintage Hit-man 🔥🔥🔥#INDvSL #RohitSharma𓃵 pic.twitter.com/JdeqDK3iw3 — Satyan Tripathi (सत्यम) (@AshutoshAbhish8) January 10, 2023 -
India vs Sri Lanka: వన్డేలకు మోగిన విజిల్! లంకకు కష్టమే.. అందరూ అంతంతే!
వన్డే వరల్డ్కప్నామ సంవత్సరమిది... అదీ భారత గడ్డపై... ఈ నేపథ్యంలో అక్టోబరుకు ముందు ఇకపై జరిగే వన్డేలన్నీ భారత్కు సన్నాహకాలే... మధ్యలో ఐపీఎల్ రూపంలో టి20లు ఉన్నా, వన్డే జట్టు ఎంపికకు, తుది జట్టు కూర్పు కొరకు ఈ మ్యాచ్ల ప్రదర్శనే కీలకం అవుతుందనడంలో సందేహం లేదు. ఆసియాకప్ కాకుండా టీమిండియా కనీసం 15 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేటినుంచి జరిగే మూడు వన్డేల సిరీస్లో శ్రీలంకను భారత్ ఎదుర్కొంటుంది. గువహటి: శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ను తమ ఖాతాలో వేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్పై దృష్టి పెట్టింది. నేడు జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రాకతో భారత బృందం మరింత పటిష్టంగా మారగా... లంక దాదాపు అదే జట్టుతో మరో పోరాటానికి సిద్ధమైంది. తొలి రెండు టి20లు హోరాహోరీగా సాగినా... చివరి మ్యాచ్లో ఏకపక్ష విజయంతో భారత్ తమ స్థాయి ఏమిటో ప్రదర్శించింది. అయితే ఆ సిరీస్లో చూపిన ప్రదర్శన లంక జట్టులో ఆత్మ విశ్వాసం పెంచింది. 2017 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. ఓపెనర్గా గిల్... బంగ్లాదేశ్తో చివరి వన్డేలో అద్భుత బ్యాటింగ్తో ‘డబుల్ సెంచరీ’ సాధించినా... ఇషాన్ కిషన్కు ఈ మ్యాచ్లో మాత్రం చాన్స్ లేదు. కెప్టెన్ రోహిత్ రాకతో అతనిపై వేటు ఖాయమైంది. ఇషాన్కు అవకాశం ఇవ్వలేమని రోహిత్ స్పష్టం చేసేశాడు కూడా. వన్డేల్లో ఓపెనర్గా తనను తాను నిరూపించుకున్న శుబ్మన్ గిల్తో పాటు రోహిత్ ఓపెనింగ్ చేస్తాడు. టి20ల్లో ఆడని కోహ్లి తనకు బాగా అచ్చి వచ్చిన ఫార్మాట్లో మళ్లీ చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. లంకపై ఏకంగా 8 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు చేసిన ఘనమైన రికార్డు కోహ్లికి ఉంది. గత ఏడాది 55.69 సగటుతో 724 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్కు మిడిలార్డర్లో చోటు ఖాయం కాగా... వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ కూడా బరిలోకి దిగుతాడు. దాంతో టి20ల్లో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్కు చోటు కష్టమే. పైగా వన్డేల్లో ఇప్పటి వరకు సూర్య ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. రాహుల్, శ్రేయస్లలో ఒకరిని తప్పించి సూర్యను ఆడించే పరిస్థితి ప్రస్తుతానికి లేదు. ఆరో స్థానంలో ఆల్రౌండర్గా కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. బౌలింగ్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో జట్టు కూర్పు ఉండవచ్చు. అక్షర్ పటేల్ ఖాయం కాగా... రెండో స్పిన్నర్గా చహల్, కుల్దీప్ యాదవ్ల మధ్య పోటీ ఉంది. సీనియర్ పేసర్ షమీ, సిరాజ్లతో పాటు మూడో పేసర్గా అర్ష్దీప్, ఉమ్రాన్లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. బంగ్లా చేతిలో సిరీస్ ఓడినా... ఓవరాల్పై లంకపై భారత్దే పైచేయిగా కనిపిస్తోంది. అందరూ అంతంతే... శ్రీలంక జట్టు గత కొంత కాలంగా వన్డేల్లో కాస్త మెరుగైంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవడం ఆ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన. అయితే సమస్యంతా ఒక్కొక్క ఆటగాడి వన్డే రికార్డుతోనే. ప్రస్తుతం ఉన్న జట్టులో అంతా టి20ల్లో ఆకట్టుకున్నవారే అయినా... వన్డేల్లో రెగ్యులర్గా తమను తాను నిరూపించుకున్నవారు ఎవరూ లేరు. టి20లతో పోలిస్తే వన్డేల్లో సుదీర్ఘ సమయం పాటు క్రీజ్లో నిలిచి ఇన్నింగ్స్ను నిర్మించే సమర్థుడైన బ్యాటర్ గానీ... 10 ఓవర్ల పాటు నిలకడగా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగల బౌలర్ గానీ జట్టులో కనిపించడం లేదు. టి20ల్లో సత్తా చాటిన షనక వన్డే రికార్డు పేలవం. పైగా అతను ఇప్పటి వరకు భారత గడ్డపై వన్డే ఆడనే లేదు. అదే తరహాలో జట్టు ప్రధాన అస్త్రం హసరంగ కూడా వన్డేల్లో అంతంతే. ఇద్దరు పేసర్లు రజిత, కుమారలు ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోగా, మదుషంక వన్డేలో అరంగేట్రం చేయలేదు. ఇలాంటి స్థితిలో భారత్కు లంక ఏమాత్రం పోటీనిస్తుందో చూడాలి. ముఖాముఖి పోరులో 162: ఇప్పటి వరకు భారత్, శ్రీలంక జట్ల మధ్య 162 వన్డేలు జరిగాయి. 93 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. 57 మ్యాచ్ల్లో శ్రీలంక నెగ్గింది. ఒక మ్యాచ్ ‘టై’కాగా... 11 మ్యాచ్లు రద్దయ్యాయి. ఇక భారత గడ్డపై ఈ రెండు జట్లు 51 మ్యాచ్ల్లో తలపడ్డాయి. 36 మ్యాచ్ల్లో టీమిండియా గెలుపొందగా... 12 మ్యాచ్ల్లో శ్రీలంక విజయం సాధించింది. మూడు మ్యాచ్లు రద్దయ్యాయి. -
శ్రీలంకతో తొలి వన్డే.. డబుల్ సెంచరీ ఆటగాడికి నో ఛాన్స్! క్లారిటీ ఇచ్చిన రోహిత్
స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్పై కన్నేసింది. ఈ సిరీస్లో భాగంగా భారత్ మూడు వన్డేలు ఆడనుంది. జనవరి 10 (మంగళవారం)న గౌహతి వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి వన్డే సిరీస్కు జట్టులోకి వచ్చారు. ఇక తొలి వన్డేకు ముందు ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో రోహిత్ శర్మ జట్టు కూర్పుతో సహా పలు అంశాలపై మాట్లాడాడు. తొలి వన్డేకు భారత తుది జట్టులో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్కు చోటు దక్కడం కష్టమని రోహిత్ తెలిపాడు. అతడి స్థానంలో మరో యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు హిట్మ్యాన్ అన్నాడు. కాగా ఇటీవలే బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సీనియర్ జట్టులోకి రావడంతో మరోసారి బెంచ్కే పరిమితం కానున్నాడు. రోహిత్ మాట్లాడుతూ.. "గత కొన్ని సిరీస్ల నుంచి గిల్, ఇషాన్ అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే కిషన్ కంటే గిల్కు వన్డేల్లో మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. కాబట్టి గిల్కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నాము. అదే విధంగా కిషన్ కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించడం అంత సులభం కాదు అని నాకు తెలుసు. ఈ సిరీస్లో కిషన్కు కూడా తప్పకుండా అవకాశం దక్కుతుంది" అని పేర్కొన్నాడు. కాగా గిల్కు వన్డేల్లో అద్భుతమైన రికార్డుఉంది. ఇప్పటి వరకు 13 వన్డే మ్యాచ్లు ఆడిన గిల్ 687 పరుగులు సాధించాడు. చదవండి: IND Vs SL: బుమ్రా గాయంపై స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే? View this post on Instagram A post shared by Team India (@indiancricketteam) -
బుమ్రా గాయంపై స్పందించిన రోహిత్ శర్మ.. ఏమన్నాడంటే?
స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ను నెగ్గిన టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్లో భాగంగా మూడు వన్డేలు పర్యాటక జట్టుతో భారత్ ఆడనుంది. జనవరి 10 (మంగళవారం)న గౌహతి వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. వన్డే సిరీస్కు ప్రారంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లంకతో వన్డే సిరీస్కు ఎంపికైన భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోక పోవడంతో ఈ పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమయ్యాడు. ఇకగాయం కారణంగా బుమ్రా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడిని తొలుత లంకతో వన్డే సిరీస్కు ఎంపిక చేయలేదు. అయితే బుమ్రా ఫిట్నెస్ సాధించాడని భావించిన సెలక్టర్లు అతడిని లంకతో వన్డే జట్టులోకి చేర్చారు. కానీ అతడికి ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్యబృందం భావిస్తోంది. ఈ క్రమంలోనే అతడు వన్డే సిరీస్కు దూరంగా ఉండనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఇక వన్డే సిరీస్కు బుమ్రా దూరం కావడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. బుమ్రా వెన్ను గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని రోహిత్ తెలిపాడు. "వన్డే సిరీస్కు బుమ్రా దూరం కావడం చాలా దురదృష్టకరం. అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే కొన్ని రోజులు కిందట అతడు తన వెన్ను నొప్పి పూర్తిగా తగ్గిందని భావించాడు. ఈ క్రమంలో అతడు బీసీసీఐ మెడికల్ టీంకు కూడా సమాచారం ఇచ్చాడు. కానీ మళ్లీ ఇప్పుడు బుమ్రా తన వెన్ను నొప్పి మొదలైందని తెలియజేశాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ అతడిని వన్డే జట్టు నుంచి తప్పించింది. అతడు మా ప్రధాన బౌలర్. కాబట్టి అతడి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని భావించాం" అని తొలి వన్డేకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: 'అతడిని చూస్తే శ్రీనాథ్ గుర్తొస్తున్నాడు.. చాలా అరుదుగా ఉంటారు' -
'అతడిని చూస్తే శ్రీనాథ్ గుర్తొస్తున్నాడు.. చాలా అరుదుగా ఉంటారు'
టీమిండియా ఎక్స్ప్రెస్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ స్కిల్స్తో అందరనీ అకట్టుకుంటున్నాడు. తాజాగా స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఉమ్రాన్ అదరగొట్టాడు. ఈ సిరీస్లో 7 వికెట్లతో ఉమ్రాన్ సత్తాచాటాడు. అంతేకాకుండా ఈ సిరీస్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత్ బౌలర్ కూడా ఉమ్రానే కావడం విశేషం. ఇక లంకతో సిరీస్లో అదరగొట్టిన ఉమ్రాన్పై భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత దిగ్గజ బౌలర్ జవగల్ శ్రీనాథ్తో ఉమ్రాన్ను జడేజా పోల్చాడు. ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్లు చాలా అరుదగా ఉంటారు. భారత్లో మాత్రం చాలా కాలం తర్వాత ఉమ్రాన్ వంటి స్పీడ్ స్టార్ను చూశాను. గతంలో జావగల్ శ్రీనాథ్ కూడా ఈ విధమైన స్పీడ్తో బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం మాలిక్ను చూస్తుంటే నాకు శ్రీనాథ్ గుర్తుస్తున్నాడు. ఉమ్రాన్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి అతడి లాంటి ఆణిముత్యాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ముఖ్యంగా టెయిలండర్లు క్రీజులో ఉన్నప్పుడు అతడిని బౌలింగ్కు తీసుకురండి. ఉమ్రాన్ స్పీడ్కు వాళ్లు తట్టుకోలేరు. అతడిని 10 సార్లు తీసుకువస్తే 8 సార్లు వికెట్లు తీయగలడు అని జడేజా క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఉమ్రాన్ మాలిక్ లంకతో వన్డే సిరీస్కు కూడా ఎంపికయ్యాడు. -
భారత్-శ్రీలంక తొలి వన్డే.. ఏకంగా సెలవిచ్చిన ప్రభుత్వం!
స్వదేశంలో శ్రీలంకతో మరో కీలక పోరుకు టీమిండియా సిద్దమైంది. టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న భారత్.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్లో లంకతో తలపడనుంది. ఇక ఈ సిరీస్లో భాగంగా తొలి టీ20 గౌహతిలోని బర్సపరా స్టేడియం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాంలోని కామ్రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అభిమానులు మ్యాచ్ చూసేందుకు హాఫ్-డే సెలవు ప్రకటించింది. "బర్సపరా స్టేడియం వేదికగా శ్రీలంక-భారత్ తొలి వన్డే జరగనుంది. ఈ సందర్భంగా కామ్రప్ మెట్రోపాలిటిన్ జిల్లాలో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు హాఫ్ డే సెలవు ప్రకటించాం. ఈ నిర్ణయం పట్ల అస్సాం గవర్నర్ కూడా సంతోషం వ్యక్తం చేశారు" అని హిమంత బిస్వా శర్మ సర్కార్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక గతేడాది జూలై తర్వాత తొలి సారి వన్డే సిరీస్లో భారత- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇక ఈ సిరీస్కు టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. అదే విధంగా పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కూడా వన్డే సిరీస్లో భాగం కానున్నారు. చదవండి: IND VS SL ODI Series: టీమిండియాకు భారీ షాక్.. బుమ్రా ఔట్ -
ద్రవిడ్, రోహిత్ కాదు! నా కెప్టెన్సీ సక్సెస్కు కారణం అతడే: హార్దిక్ పాండ్యా
టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్గా వ్యవహారిస్తున్న హార్దిక్ పాండ్యా విజయపథంలో దూసుకుపోతున్నాడు. తాజాగా శ్రీలంకతో టీ20 సిరీస్కు భారత కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించిన హార్దిక్.. తన జట్టుకు 2-1తేడాతో మరో టైటిల్ను అందించాడు. కాగా రోహిత్ వారసుడిగా భావిస్తున్న హార్ధిక్ పాండ్యాకు టీ20 కెప్టెన్గా స్వదేశంలో ఇదే తొలి సిరీస్ విజయం. ఇక మూడో టీ20 మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్.. తన కెప్టెన్సీ సక్సెస్కు గల కారణాన్ని వెల్లడించాడు. టీమిండియా మాజీ బౌలర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా సూచనల వల్లే నేను కెప్టెన్గా విజయవంతమయ్యాను అని హార్ది్క్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్.. అరంగేట్ర సీజన్లోనే తన జట్టుకు టైటిల్ను అందించాడు. అదే విధంగా కోచ్గా నెహ్రా కూడా జట్టును ముందుండి నడిపించాడు. ఇక పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ మాట్లాడుతూ.."ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా విజయవంతం కావడానికి కోచ్ ఆశిష్ నెహ్రానే కారణం. ఇప్పుడు అతడు సూచనల వల్లే మరింత మెరుగ్గా రాణించగల్గుతున్నాను. నెహ్రా వంటి కోచ్తో పని చేయడం నా అదృష్టం. అతడు నా జీవితంలో నేను ఊహించని మార్పులను తీసుకొచ్చాడు. మేమిద్దరం ఒకే విధంగా ఆలోచిస్తాం. అతడితో కలిసి పని చేయడం వల్ల నా కెప్టెన్సీకి విలువ పెరిగింది. అతడు కెప్టెన్గా పనిచేయకపోయనప్పటకీ.. పలు విషయాలు ఆశిష్ దగ్గర నేర్చుకున్నాను. అదే విధంగా కెప్టెన్సీ పరంగా కూడా గతంలో నాకు పెద్దగా అనుభవం లేదు. కేవలం అండర్ -16 జట్టులో ఉన్నప్పుడు బరోడాకు సారథిగా ఉన్నాను. ఆ తర్వాత కేవలం నా ఆట మీదే దృష్టి పెట్టాను అని అతడు పేర్కొన్నాడు. కాగా హార్దిక్ తన వాఖ్యలలో ఎక్కడ కూడా ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ పేరులను ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా హార్దిక్ భారత జట్టుతో పాటు ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలో చాలా సీజన్ల పాటు ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. -
శ్రీలంకతో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్.. బుమ్రా ఔట్
గౌహతి వేదికగా శ్రీలంకతో రేపటి (జనవరి 10) నుంచి ప్రారంభంకానున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్, పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా జట్టులో చేరకుండానే ఔటయ్యాడు. వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న బుమ్రా.. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించలేని కారణంగా జట్టు దూరంగా ఉండాలని సూచించినట్లు బీసీసీఐకి చెందిన కీలక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో బుమ్రా వన్డే జట్టుతో కలవకుండా ఎన్సీఏ (నేషనల్ క్రికెట్ అకాడమీ)లోనే ఉండిపోయాడు. సహచరులు, టీ20 సిరీస్కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే తొలి వన్డేకు వేదిక అయిన గౌహతికి చేరుకున్నారు. కాగా, లంకతో వన్డే సిరీస్ నుంచి బుమ్రాను తప్పించడానికి వేరే కారణాలు ఉన్నట్లు ఎన్సీఏ అధికారుల ద్వారా తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. సమీప భవిష్యత్తులో కీలక సిరీస్లు (ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, వన్డే వరల్డ్కప్) ఆడాల్సి ఉన్నందున మరోసారి గాయాల బారిన పడకుండా ఉండాలని బీసీసీఐ ఉద్దేశపూర్వకంగా అతన్ని తప్పించినట్లు తెలుస్తోంది. లంకతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో పేసర్ స్థానానికి ఎటూ పోటీ ఉన్నందున రిస్క్ తీసుకోవడం ఎందుకని భావించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఒకవేళ ఆసీస్తో టెస్ట్ సిరీస్కు ముందే బుమ్రాను బరిలోకి దించాలని బీసీసీఐ భావిస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లో అతనికి అవకాశం ఇవ్వవచ్చని తెలుస్తోంది. లంకతో వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ -
శ్రీలంకతో వన్డే సిరీస్.. టీమిండియాలో ఎవరెవరు ఉన్నారంటే..?
IND VS SL ODI Series: శ్రీలంకపై 2-1 తేడాతో టీ20 సిరీస్ నెగ్గి ఈ ఏడాది (2023) ఘనంగా బోణీ కొట్టిన టీమిండియా రేపటి నుంచి (జనవరి 10) అదే జట్టుతో వన్డే సిరీస్ ఆడనుంది. రేపు గౌహతి వేదికగా తొలి వన్డే ఆడనున్న భారత్.. జనవరి 12న రెండో వన్డే (కోల్కతా), జనవరి 15న మూడో వన్డే (తిరువనంతపురం) ఆడుతుంది. టీ20 సిరీస్కు రెస్ట్ తీసుకున్న సీనియర్లు వన్డే సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనుండటంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. సీనియర్ల రాకతో టీ20 జట్టులో ఉండిన రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, ముఖేష్ కుమార్, జితేశ్ శర్మ, శివమ్ మావి, సంజూ శాంసన్ పక్కకు తప్పుకోక తప్పలేదు. వన్డే సిరీస్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి సారధ్య బాధ్యతలు చేపట్టనుండగా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు జట్టులో చేరనున్నారు. వీరిలో బుమ్రా చాలాకాలం తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేస్తున్నాడు. యువ పేసర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో బుమ్రా మునుపటి జోరును కనబరుస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ క్రమం తప్పకుండా సత్తా చాటుతుండటంతో వెటరన్ పేసర్ షమీకి తుది జట్టులో చోటు దక్కుతుందో లేదోనన్నది అనుమానంగా మారింది. బ్యాటింగ్ విభాగం విషయానికొస్తే.. సీనియర్లు రోహిత్, కేఎల్ రాహుల్ రాకతో యువ ఓపెనర్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ల స్థానాలు సందిగ్ధంలో పడ్డాయి. రోహిత్, రాహుల్ను కాదని వీరికి తుది జట్టులో ఛాన్స్ దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వన్ డౌన్లో కోహ్లి, నాలుగో స్థానంలో భీకర ఫామ్లో ఉన్న సూర్యకుమార్, ఐదో ప్లేస్లో మిస్టర్ స్టేబుల్ శ్రేయస్ అయ్యర్, ఆల్రౌండర్ల కోటాలో హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో చహల్ లేదా కుల్దీప్, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, షమీ లేదా సిరాజ్, అర్షదీప్ లేదా ఉమ్రాన్ మాలిక్లకు తుది జట్టులో చోటు దొరికే అవకాశం ఉంది. లంకతో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ -
శివమ్ మావి కళ్లు చెదిరే క్యాచ్.. హార్దిక్ షాకింగ్ రియాక్షన్ వైరల్
రాజ్కోట్ వేదికగా శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఆటగాడు శివమ్ మావి సంచలన క్యాచ్తో అందరిని ఆశ్చర్యపరిచాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 10 ఓవర్లో చాహల్ వేసిన ఫుల్ ఆఫ్సైడ్ బంతిని చరిత్ అసలంక భారీ షాట్ ఆడాడు. దీంతో అది బౌండరీ దాటడం ఖాయమని అంతా భావించారు. కానీ స్వీపర్ కవర్లో ఫీల్డింగ్ చేస్తున్న మావి పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి స్టన్నింగ్ క్యాచ్కు అందరూ ఫిదా అయిపోయారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం మావి మెరుపు క్యాచ్ చూసి ఆశ్చర్యపోయాడు. మావి క్యాచ్ పట్టిన హార్దిక్ సూపర్ అంటూ వెరైటీ రియాక్షన్ ఇచ్చాడు. ఇక మావి క్యాచ్కు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో అద్బుత ఇన్నింగ్స్ను ఆడిన సూర్యకుమార్ యాదవ్(112 నాటౌట్)కు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సిరీస్ టోర్నీ ఆసాంతం అదరగొట్టిన భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ది సిరీస్ దక్కింది. చదవండి: IND vs SL: డివిలియర్స్, క్రిస్ గేల్తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు ICYMI - A fine running catch by @ShivamMavi23 near the boundary ends Asalanka's stay out there in the middle. Live - https://t.co/bY4wgiSvMC #INDvSL @mastercardindia pic.twitter.com/hwSrjjsalm — BCCI (@BCCI) January 7, 2023 pic.twitter.com/bmQflv7Q9u — IPLT20 Fan (@FanIplt20) January 7, 2023 -
నేను గనుక సూర్యకి బౌలింగ్ చేసే ఉంటేనా: హార్దిక్ పాండ్యా
స్వదేశంలో టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా తొలి టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేశాడు. శనివారం రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ను 2-1తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య సెంచరీ సాధిచాడు. ఓవరాల్గా 51 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ను భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య ప్రశంసలతో ముంచెత్తాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో హార్దిక్ మాట్లాడుతూ.. "సూర్యకుమార్ తన విధ్వంసకర ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతడు అంత సులభంగా ఎలా బ్యాటింగ్ చేయగల్గుతున్నాడో అర్ధం కావడం లేదు. ఒక వేళ నేను బౌలర్ అయివుంటే అతడు ఆడే షాట్లకు ఖచ్చితంగా భయపడేవాడిని. ఎందుకుంటే ఈ మ్యాచ్లో అతడు ఆడిన షాట్లు అలా వున్నాయి. మైదానం నలుమూలల సూర్య షాట్లు ఆడాడు. అదే విధంగా రాహుల్ త్రిపాఠి కూడా అద్భుతంగా ఆడాడు. తొలుత పిచ్ బౌలర్లకు సహకరించినప్పటికీ.. పవర్ప్లేలో త్రిపాఠి చాలా దూకుడుగా ఆడాడు. అనంతరం సూర్య తన పనిని తను పూర్తి చేసుకుపోయాడు" అని పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: డివిలియర్స్, క్రిస్ గేల్తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు -
డివిలియర్స్, క్రిస్ గేల్తో సూర్యకు పోలికా? అతడు ఎప్పుడో మించిపోయాడు
టీ20ల్లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో సూర్య మెరుపు శతకం సాధించాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య తన మూడో అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. ఇక ఓవరాల్గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఈ టీ20 వరల్డ్ నెం1 బ్యాటర్పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సూర్యను పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసలతో ముంచెత్తాడు. దిగ్గజ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ను సూర్యకుమార్ మించిపోయాడు అని కనేరియా కొనియాడాడు. "ప్రపంచ క్రికెట్లో కొత్త యూనివర్స్ బాస్ వచ్చాడు. అతడు ఎవరో కాదు భారత విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్. సూర్య ఆట గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. నేను ముందే చెప్పాను ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో సూర్య లిఖించుకుంటాడని. అతడు ఈ మ్యాచ్లో కేవలం 51 బంతుల్లోనే 112 పరుగులు సాధించాడు. సూర్య లాంటి మరో ఆటగాడు ప్రపంచంలోనే ఉండడు. తరుచూ అందరూ సూర్యను డివిలియర్స్, క్రిస్ గేల్తో పోలుస్తున్నారు. కానీ, వారిద్దరూ కూడా సూర్య ముందు ప్రస్తుతం తేలిపోతారనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే వారిద్దరిని తన ఆట తీరుతో సూర్యకుమార్ అధిగమించాడు. సూర్య తన విధ్వంసకర ఆటతో టీ20 క్రికెట్ను ఇప్పటికే వేరే స్థాయికి తీసుకువెళ్లాడు" అని కనేరియా తన యాట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్ -
సూర్యకుమార్ చేతికి ముద్దు పెట్టిన చాహల్.. వీడియో వైరల్
రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన కీలకమైన మూడో టీ20లో 91 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను 2-1తేడాతో భారత్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య భాయ్ సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్గా 51 బంతులు ఎదర్కొన్న ఈ ముంబైకర్.. 9 సిక్స్లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగల భారీ స్కోర్ సాధించింది. సూర్య భాయ్ ఇన్నింగ్స్కు చాహల్ ఫిదా ఇక సూర్య సంచలన ఇన్నింగ్స్కు భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఫిదా అయిపోయాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ చేతికి చాహల్ ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన అభిమానులు.. సూర్య భాయ్ ఆటకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే అంటూ సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి వన్డే గౌహతి వేదికగా జనవరి 10న జరగనుంది. pic.twitter.com/NeFHhMq35d — Guess Karo (@KuchNahiUkhada) January 8, 2023 చదవండి: AUS vs SA: వైట్వాష్ నుంచి తప్పించుకున్న దక్షిణాఫ్రికా.. మూడో టెస్టు డ్రా -
ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడు.. సూర్యకుమార్ యాదవ్
Surya Kumar Yadav: రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో నిన్న (జనవరి 7) జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా 91 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను హార్ధిక్ సేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ సునామీ శతకం (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) ధాటికి నిశ్చేష్టులుగా మిగిలిపోయిన లంకేయులు మ్యాచ్లో పాటు సిరీస్ను భారత్ చేతికి అప్పజెప్పారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే శతకంతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్కై ఆకాశమే హద్దుగా చెలరేగితే శుభ్మన్ గిల్ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) తమ పాత్రలను న్యాయం చేశారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులు భారత బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్, ఉమ్రాన్ మాలిక్, చహల్ తలో 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. కాగా, ఈ మ్యాచ్లో సూర్యకుమార్ విధ్వంసకర శతకం సాధించే క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. అవేంటంటే.. పొట్టి క్రికెట్ చరిత్రలో మూడు వేర్వేరు ఖండాల్లో (ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్) శతకాలు సాధించిన అత్యంత అరుదైన ఘనత సొంతం చేసుకున్న సూర్యకుమార్. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు (3) చేసిన రెండో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. రెండు సెంచరీలతో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ (45 బంతుల్లో) చేసిన రెండో భారత క్రికెటర్గా సూర్య కుమార్ యాదవ్ రికార్డుల్లో నిలిచాడు. గతంలో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో (46 బంతుల్లో) ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. గ్లెన్ మ్యాక్స్వెల్ (3), కొలిన్ మన్రో (3), సబావూన్ డావిజీ (3)లతో కలిసి సూర్య భాయ్ రెండో స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారత నాన్ ఓపెనర్గా, అలాగే అత్యంత వేగంగా (843 బంతుల్లో ) 1500 పరుగుల మార్కును (బంతుల ప్రకారం) అందుకున్న ఆటగాడిగా సూర్య భాయ్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు మ్యాక్స్వెల్ పేరిట ఉండేది. మాక్సీ.. 1500 పరుగులు చేసేందుకు 940 బంతులు ఎదుర్కొన్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (9) బాదిన భారత నాన్ ఓపెనర్గా రికార్డు. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ఆటగాడిగా
శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 45 బంతుల్లోనే సూర్య అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 112 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 9 సిక్స్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో తుపాన్ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన తొలి భారత నాన్ ఓపెనింగ్ బ్యాటర్గా సూర్య రికార్డులకెక్కాడు. సూర్య ఇప్పటివరకు టీ20ల్లో మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. తొలి సెంచరీ ఇంగ్లండ్పై చేయగా.. న్యూజిలాండ్పై రెండో సెంచరీ, తాజాగా శ్రీలంకపై తన మూడో సెంచరీ నమోదు చేశాడు. అదే విధంగా టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా ఈ ముంబైకర్ నిలిచాడు. అంతకుముందు 2017లో శ్రీలంకపై రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇక ఓవరాల్గా టీ20ల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా సూర్య నిలిచాడు. తొలి స్థానంలో నాలుగు సెంచరీలతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. ఆతర్వాత స్థానాల్లో వరుసగా మ్యాక్స్వెల్, మున్రో, డేవిజీ, చెరో మూడు సెంచరీలతో ఉన్నారు. చదవండి: IND vs SL: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. 45 బంతుల్లోనే సెంచరీ -
సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం.. 45 బంతుల్లోనే సెంచరీ
శ్రీలంకతో మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో కేవలం 45 బంతుల్లోనే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదుర్కొన్న సూర్య.. 112 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఏకంగా 9 సిక్స్లు, 7 ఫోర్లు ఉన్నాయి. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి లంక బౌలర్లకు సూర్య భాయ్ చుక్కలు చూపించాడు. ఈ మిస్టర్ 360 మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. ఇక ఓవరాల్గా సూర్యకు ఇది మూడో అంతర్జాతీయ సెంచరీ. అయితే మూడు సెంచరీలు కూడా టీ20ల్లో సాధించడం విశేషం. కాగా ఏడాది సూర్యకుమార్కు ఇది తొలి సెంచరీ. కాగా సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. -
శ్రీలంకతో మూడో టీ20.. రుత్రాజ్కు నో ఛాన్స్! గిల్ వైపే మొగ్గు
రాజ్కోట్ వేదికగా సిరీస్ను డిసైడ్ చేసే మూడో టీ20లో భారత్-శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక భారత జట్టు ఎటువంటి మార్పులేమిలేకుండా బరిలోకి దిగింది. కాగా వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన గిల్ స్థానంలో ఆఖరి టీ20లో రుత్రాజ్ గైక్వాడ్కు చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం గిల్ వైపే మొగ్గు చూపింది. ఇక శ్రీలంక మాత్రం ఒక మార్పు చేసింది. వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన రాజపాక్స స్థానంలో అవిష్క ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్క ఫెర్నాండో, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక భారత్: ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివం మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ -
లంకతో మూడో టీ20.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
IND VS SL 3rd T20: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 7) జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో చహల్ (73 మ్యాచ్ల్లో 88) మరో 3 వికెట్లు తీస్తే, భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. భువీ.. 87 మ్యాచ్ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కివీస్ వెటరన్ పేసర్ టిమ్ సౌథీ (107 మ్యాచ్ల్లో 134) అగ్రస్థానంలో ఉండగా.. షకీబ్ అల్ హసన్ (109 మ్యాచ్ల్లో 128), రషీద్ ఖాన్ (74 మ్యాచ్ల్లో 122) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల సిరీస్లో టీమిండియా, శ్రీలంక చెరో మ్యాచ్ గెలువగా, ఇవాళ జరుగబోయే మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. రెండు జట్లు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. తుది జట్ల విషయానికొస్తే.. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్లో విఫలమైన శుభ్మన్ గిల్, అర్షదీప్ స్థానాల్లో రుతురాజ్, ముకేశ్ కుమార్ ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. లంక విషయానికొస్తే.. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే యధాతథంగా కొనసాగవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్/శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, అక్షర్ పటేల్, చహల్, ముఖేశ్ కుమార్/అర్ష్దీప్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్. శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిసాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మదుషంక, కసున్ రజిత. -
అర్షదీప్ను ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి.. నో బాల్స్ ఎలా వేస్తాడో చూద్దాం..!
టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ నో బాల్స్ వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేల ఓ ఆసక్తికర కార్టూన్ ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. శ్రీలంకతో మొన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో ఏకంగా 5 నో బాల్స్ వేసి టీమిండియా ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్కు భారత అభిమాని ఒకరు కార్టూన్ ద్వారా ఓ సలహా ఇచ్చాడు. అర్షదీప్ జీవితంలో ఒక్క నో బాల్ కూడా వేయకుండా ఉండాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయించండి అంటూ ఓ కార్టూన్ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ కార్టూన్లో బౌలర్ పర్వతం అంచున ఉన్న క్రీజ్ గుండా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బౌలర్ క్రీజ్ దాటి నో బాల్ వేస్తే లోయలో పడిపోతాడు. అర్షదీప్ కోసం సరదాగా పోస్ట్ చేసిన ఈ కార్టూన్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇది చూసిన నెటిజన్లు.. అవును ఇది కరెక్టే.. ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తే అర్షదీపే కాదు ప్రపంచంలో ఏ బౌలర్ కూడా క్రీజ్ దాటి నో బాల్ వేసే సాహసం చేయలేడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. This is the Special pitch to practice for #arshdeepsingh #INDvSL #UmranMalik pic.twitter.com/FeqwaZUVeq — Abhijit sarkar (@singlecoreGG) January 6, 2023 కాగా, శ్రీలంకతో మ్యాచ్లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌల్ చేసిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మరో రెండు నో బాల్స్ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 ఇవాళ (జనవరి 7) రాజ్కోట్ వేదికగా జరుగనుంది. -
కెప్టెన్గా తొలి ఓటమి.. హార్దిక్ పాండ్యాపై గంభీర్ కీలక వాఖ్యలు
పుణే వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక టీ20ల్లో భారత కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు ఇదే తొలి ఓటమి కూడా. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వాఖ్యలు చేశాడు. భారత టీ20 కెప్టెన్గా హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించాడని గంభీర్ కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో గంభీర్ మాట్లాడుతూ.. "హార్దిక్కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అయితే ప్రతీ మ్యాచ్ తర్వాత అతడి కెప్టెన్సీ గురించి మనం చర్చించకూడదు. ఈ మ్యాచ్లో భారత్ ఓటమిపాలైనంతమాత్రాన హార్దిక్ ఏదో తప్పు చేశాడని భావించడం సరికాదు. అతడు నో-బాల్స్ వేయకుండా బౌలర్లను నియంత్రించలేడు కదా. అది బౌలర్ బాధ్యత. ఇప్పటివరకు అతడు సారథిగా వ్యవహరించినా ప్రతీ మ్యాచ్లోనే తన కెప్టన్సీ మార్క్ను చూపించాడు. అతడు ఫీల్డ్లో చాలా కూల్గా ఉంటాడు. హార్దిక్ తన సహాచర ఆటగాళ్లకు మద్దతుగా కూడా ఉంటాడు" అని పేర్కొన్నాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో శనివారం రాజ్కోట్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. చదవండి: IND Vs SL: శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్దీప్, గిల్కు నో ఛాన్స్! పేసర్ ఎంట్రీ -
శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్దీప్, గిల్కు నో ఛాన్స్! పేసర్ ఎంట్రీ
పుణే వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో శనివారం రాజ్కోట్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. అయితే కీలకమైన మూడో టీ20లో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో టీ20లో దారుణంగా విఫలమైన అర్ష్దీప్ సింగ్ స్థానంలో పేసర్ ముఖేష్ కుమార్ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమైన యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ స్థానంలో రుత్రాజ్ గైక్వాడ్.. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకురావాలని టీమిండియా మేనేజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అరంగేట్ర మ్యాచ్లో విఫలమైన రాహుల్ త్రిపాఠిని మూడో టీ20లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం మావి, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Hardik Pandya: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్.. ఇప్పుడు హార్దిక్ ఎందుకిలా చేస్తున్నారు? డీకే స్ట్రాంగ్ రిప్లై -
అర్ష్దీప్ సింగ్ అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచ క్రికెట్లోనే తొలి బౌలర్గా
పుణే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అర్ష్దీప్ 37 పరుగులు పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాకుండా ఏకంగా ఐదు నోబాల్స్ వేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును అర్ష్దీప్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నోబాల్స్ వేసిన బౌలర్గా అర్ష్దీప్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు అర్ష్దీప్ తన టీ20 కెరీర్లో 12 నోబాల్స్ వేశాడు. ఇంతకుముందు ఈ చెత్త రికార్డు పాకిస్తాన్ పేసర్ హసన్ అలీ(11) పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో ఏకంగా ఐదు నో బాల్స్ వేసిన అర్ష్దీప్ హసన్ అలీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో భారత్పై 16 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ దషన్ శనక ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. తొలుత బ్యాటింగ్లో 56 పరుగులతో పాటు అదరగొట్టిన షనక.. బౌలింగ్లో కూడా రెండు వికెట్లు సాధించాడు. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20 రాజ్కోట్ వేదికగా శనివారం(జనవరి7) జరగనుంది. చదవండి: Rahul Tripathi: వైరల్.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్! -
అర్షదీప్ నో బాల్స్ వ్యవహారంపై మండిపడ్డ గవాస్కర్.. గల్లీ బౌలర్లా అంటూ..!
క్రికెట్కు సంబంధించి ఎంతటి వారు తప్పు చేసినా పరుష పదజాలంతో మందలించే లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.. తాజాగా టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్పై ఫైరయ్యాడు. శ్రీలంకతో నిన్న (జనవరి 5) జరిగిన రెండో టీ20లో అర్షదీప్ హ్యాట్రిక్ నో బాల్స్తో పాటు మొత్తంగా 5 నో బాల్స్ వేయడంపై సన్నీ ఓ రేంజ్లో మండిపడ్డాడు. ప్రొఫెషనల్ బౌలర్ అయి ఉండి ఇలా చేయడం సరికాదని, పరోక్షంగా గల్లీ బౌలర్ అని అర్ధం వచ్చేలా సంబోధించాడు. నో బాల్స్ వేయకపోవడం అన్నది అంతర్జాతీయ స్థాయి బౌలర్కు ప్రాధమిక సూత్రమని, అది మరిచిన బౌలర్ ఈ స్థాయి క్రికెట్కు పనికిరాడని ఘాటుగా వ్యాఖ్యానించాడు. బౌలర్ తన బేసిక్స్కు స్టిక్ అయి బంతి విసిరిన తర్వాత ఏం జరుగుతుంది, బ్యాటర్ ఏం చేస్తాడన్నది పక్కకు పెడితే.. నోబాల్ వేయకపోవడం అన్నది బౌలర్ బేసిక్స్లో భాగమని అర్షదీప్ను ఉద్దేశించి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ జరుగుతుండగా లైవ్ కామెంట్రీలోనే గవాస్కర్ అర్షదీప్పై విరుచుకుపడ్డాడు. కాగా, నిన్నటి మ్యాచ్లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌల్ చేసిన అర్షదీప్ వరుసగా మూడు నోబాల్స్ సంధించాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో బంతినందుకున్న అర్షదీప్.. ఆ ఓవర్లోనూ మరో రెండు నో బాల్స్ వేసి అభిమానులు, సహచరులతో సహా విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 2 ఓవర్లు వేసిన అర్షదీప్ ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని టీమిండియా ఓటమికి పరోక్ష కారకుడయ్యాడు. ఇదిలా ఉంటే, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైంది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్కోట్ వేదికగా జరుగనుంది. -
IND VS SL 2nd T20: అలా చేయడం పెద్ద నేరం, అందువల్లే ఓడాం..హార్ధిక్
పూణే వేదికగా జరిగిన రెండో టీ20లో శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫార్మాట్ ఏదైనా బౌలర్లు నో బాల్స్ వేయడం పెద్ద నేరమని అన్నాడు. ఈ మ్యాచ్లో నో బాల్సే తమ కొంపముంచాయని పేర్కొన్నాడు. కేవలం నో బాల్స్ కారణంగా తాము ఓటమిపాలయ్యామని తెలిపాడు. అర్షదీప్ సింగ్ వేసిన నో బాల్స్ (2 ఓవర్లలో 5 నో బాల్స్) వల్లే తాము ఓడామని చెప్పడం తన ఉద్దేశం కాదంటూనే పదేపదే అదే విషయాన్ని ప్రస్తావించాడు. యువకుడైన అర్షదీప్ తన బేసిక్ ఎరర్స్ను సరిదిద్దుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ పవర్ ప్లేల్లో కొన్ని అనవసర తప్పిదాలు చేశామని, ఈ స్థాయిలో ఇలా చేయడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డాడు. ఆటలో అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోవడం వాస్తవమే అయినప్పటికీ.. ప్రాధమిక సూత్రాలు మరవడం క్షమించరాని నేరమని అన్నాడు. అక్షర్, స్కై, శివమ్ మావీల పోరాటపటిమను ఈ పందర్భంగా అభినందించాడు. కాగా, లంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో పోరాడి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 207 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), శివమ్ మావీ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతంగా పోరాడినా టీమిండియాకు విజయం దక్కలేదు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను శ్రీలంక 1-1తో సమం చేసుకుంది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 7న రాజ్కోట్ వేదికగా జరుగనుంది.