Indore
-
నేడు ఇండోర్కు సీఎం, డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు సోమవారం మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్కు సమీపంలోని అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఇతర మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. -
Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్ వీడియో
ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవోపేతంగా సాగుతు మహాకుంభమేళా సాగుతోంది, పవిత్ర త్రివేణిసంగమానికి కోట్లదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తజన సందోహం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించు కుంటోంది. ఈ మేళాలో ఇప్పటికే దేశానికి చెందిన సాధువులతో పాటు, విదేశాలకుచెందిన సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నెట్ను ఆకర్షిస్తోంది.ఇండోర్ నుండి మహాకుంభమేళాకు వచ్చిన యువతి నెట్టింట సంచలనంగా మారింది. ఆమె తేనె రంగు కళ్లతో డస్కీ బ్యూటీ వెలిగిపోతోంది. కోటేరు ముక్కు, చంద్రబింబం లాంటి మోము, తేజస్సుతో వెలిగిపోతున్న కళ్లు ‘మోనాలిసా’ ను తలపిస్తోంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వుతో, పొడవాటి, సిల్కీ, జడ జుట్టు అద్బుతమైన ఆమె సౌందర్యానికి మరింత వన్నెతీసుకొచ్చింది.దీంతో మేళాకు హాజరయ్యే ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, ఆమెతో సెల్ఫీలు , వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోనాలిసా ఆఫ్ మహాకుంభ్’, ‘ఏంజలీనా జోలీ’, ‘‘ఎంత అందమైన కళ్లు’’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ‘‘ఎందుకలా ఆమె వెంటపడుతున్నారు.. సిగ్గుచేటు" అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. (Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి)కాగా ఈ ఏడాది మహాకుంభమేళాలో ఐఐటీ బాబా, విదేశీ బాబా,అందమైన సాధ్వి, కండల బాబా ఇలా చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యాకు చెందిన బాబా కండలు దీరిన దేహంతో మహాకుంభమేళాలో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.एक गरीब लड़की इंदौर(MP) से महाकुंभ आती है, मालाएं बेचती है और दिन के 2 से ढाई हजार कमा लेती है।ये मेले हमारी सांस्कृतिक पहचान ही नहीं बल्कि आर्थिक समृद्धि के भी प्रतीक हैं। pic.twitter.com/BGhwuFbm0D— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) January 17, 2025 పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఈ ఏడాది జనవరి 13 సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది తరలి వస్తున్నారు. इनसे मिलिए ये हैं महाकुंभ मेला में माला बेचने वाली वायरल गर्ल मोनालिसा.. इनकी आंखे बहुत सुंदर है.. इसको कहते हैं किस्मत बदलते देर नहीं लगती.. #महाकुम्भ_अमृत_स्नान #महाकुंभ2025 #MahaKumbhMela2025 pic.twitter.com/Et87nnpRql— 🌿🕊️RACHNA MEENA 🌿❤️ (@RACHNAMEENA34) January 18, 2025 -
యాచకులకు డబ్బులిస్తే జైలుకే.. జనవరి ఒకటి నుంచి అమలు
దేశంలోని పలు నగరాల్లో యాచన అనేది వ్యాపారంగా మారింది. బిక్షాటన కోసం యాచకులు పలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్న ఉదాహరణలు అనేకం కనిపిస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలను నివారించేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఒక ముందడుగు వేసింది.ఇండోర్ జిల్లా యంత్రాంగం నగరాన్ని యాచకరహితంగా మార్చేందుకు బిచ్చగాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై 2025 జనవరి ఒకటి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్టు కింద ఇండోర్ను యాచక రహితంగా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి.జిల్లా యంత్రాంగం ఇప్పటికే నగరంలో భిక్షాటనపై నిషేధం విధించింది. దేశంలోని 10 నగరాల్లో ఇటువంటి ప్రచారం జరుగుతోంది. ఇండోర్లో బిచ్చగాళ్లకు ఆశ్రయం కల్పించేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఇండోర్ ఇప్పటికే భారతదేశపు అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరొందింది. ఇకపై యాచకరహిత నగరంగా మారనుంది. జనవరి 1 నుంచి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని, ఇండోర్లో భిక్షాటనపై నిషేధం విధిస్తూ పరిపాలన ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఆశిష్ సింగ్ తెలిపారు.దేశంలో ఈ ప్రాజెక్ట్ 10 నగరాల్లో అమలుకానుంది. ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్పూర్, పట్నా, అహ్మదాబాద్ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇండోర్లో ఈ ప్రాజెక్టు అధికారి దినేష్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ నగరంలో కొంతమంది యాచకులకు శాశ్వత ఇళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. కొందరు యాచకుల పిల్లలు బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. మరికొందరు వడ్డీలకు అప్పులు ఇస్తున్నారన్నారు. భిక్షాటన చేసేందుకు రాజస్థాన్ నుంచి పిల్లలతో ఓ ముఠా ఇక్కడికి వచ్చిందని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు.మధ్యప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా మాట్లాడుతూ నగరాన్ని యాచక రహితంగా మారుస్తున్న తరుణంలో బిచ్చగాళ్లకు ఒక స్వచ్ఛంద సంస్థ ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పించనున్నదని తెలిపారు. వారిలో అర్హులైనవారికి వివిధ పనుల్లో ఆ సంస్థ శిక్షణ ఇవ్వనున్నదన్నారు. ఇక్కడి ప్రజలు బిచ్చగాళ్లకు డబ్బులు ఇవ్వడం మానుకోకపోతే ఈ పథకం విజయవంతం అవదన్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్కు ప్లాన్ చేసుకోవచ్చు -
చూస్తే చెయ్యెత్తి మొక్కుతారు! (ఫొటోలు)
-
అతడిదో ‘చెత్త’ కల(ళ) : గట్టిగా కొట్టాడు సక్సెస్!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇండోర్కు చెందిన యువకుడికి చిన్నప్పటినుంచీ ఒక అలవాటు ఉండేది. తన పరిసరాల్లో కనిపించిన పనికి రాని వస్తువుల ద్వారా ఏదో ఒక ఉపయోగపడే వస్తువును తయారు చేసేవాడు. ఆ అలవాటే అతడిని అద్భుత కళకారుడిగా తీర్చిదిద్దింది. స్క్రాప్ మెటల్తో తన కలలకు ప్రాణం పోసి, అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నాడు. దేశ విదేశాల్లో అతని కళాఖండాలకు ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఎవరా యువకుడు? అతని కథేంటి తెలుసుకుందాం ఈ కథనంలో.దేశంలో చాలా మంది కళాకారులు మట్టి , రాయి, చెక్క, ఇలా అనేక రకాల వస్తువులతో విగ్రహాలు తయారు చేయడం మనకు తెలుసు. ఇండోర్లో నివసిస్తున్న ఈ కళాకారుడి విగ్రహాలు మాత్రం చాలా స్పెషల్. ఇండోర్కు చెందిన దేవల్ వర్మకు చిన్నప్పటినుంచీ ఫిక్షన్ సినిమాలు, బైక్లు అంటే ఇష్టం. చిన్నతనంలో, దేవల్ వారాంతాల్లో తన ఇల్లు ,పాఠశాల చుట్టూ దొరికిన స్క్రాప్లను ఉపయోగించి తనకు నచ్చిన విధంగా చిన్న చిన్న వస్తువులను తయారు చేసేవాడు. అదే అతణ్ని గొప్పవాడిగా మలుస్తుందని అస్సలు ఊహింఛలేదు.యువకుడిగా మారిన కొద్దీ, కాస్త విజ్ఞానం అలవడుతున్న కొద్దీ తను చేస్తున్న పనిపై మరింత ఆసక్తి పెరిగింది. కళాశాలకు చేరుకునే సమయానికి, ట్రాన్స్ఫార్మర్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల పట్ల ప్రేమతో ప్రేరణ పొంది స్క్రాప్ మెటల్తో క్లిష్టమైన నమూనాలను తయారు చేసేశాడు. దీనికి తోడు ప్రముఖ టీవీ షో M.A.D (సంగీతం, కళ , నృత్యం), దాని హోస్ట్ హరున్ రాబర్ట్ నుంచి మరింత ప్రేరణ లభించింది. అలా వ్యర్థ పదార్థాలతో కార్లు, మోటార్ సైకిళ్ల సూక్ష్మ నమూనాలను తయారు చేస్తూ ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు దేవల్ వర్మ. View this post on Instagram A post shared by Deval Verma (@devalmetalart) ఈ ఆసక్తి తగ్గట్టుగానే దేవల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు,స్థానిక గ్యారేజీలు . ఆటోమోటివ్ ఫ్యాక్టరీల దృష్టిని ఆకర్షించాయి. వారినుంచి మెటల్ స్క్రాప్ సేకరించి హార్లే డేవిడ్సన్ అధికారిక లోగో రూపకల్పన గొప్ప మైలురాయిగా నిలిచింది. వారి షోరూమ్ కోసం ఈ స్క్రాప్ ఇన్స్టాలేషన్ను ప్రత్యేకంగా రూపొందించాడు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత దేవల్ క్రియేటివ్ జర్నీ మరింత వేగం పుంజుకోవడమే కాదు, కీలక మలుపు తిరిగింది. తన కళను కరియర్గా మలుచుకోవాని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో తల్లిదండ్రుల నుండి ప్రారంభ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, చివరికి కుమారుడికి అండగా నిలిచారు. పూణేలోని MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో ప్రోడక్ట్ డిజైన్లో కోర్సును అభ్యసించాడు. అలా దుబాయ్లో తొలి ప్రదర్శన సక్సెస్ అయింది. మెటల్ స్క్రాప్తో రూపొందించిన రెండు గిటార్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకోవడంతో మెటల్ ఆర్టిస్ట్గా వృత్తిపరమైన ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.ఈరంగంలో నిపుణుల సలహాలను తీసుకుంటూ మరింత పట్టుదల ఎదిగాడు. కళా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు పొందాడు. మినీ-రోబోట్ ప్లాంటర్ మొదలు అందమైన శిల్పాల వరకు కొలువు దీరాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అద్భుత కళాఖండాలుగా నిలిచాయి. సింగపూర్, ఇటలీ, అమెరికాలోని కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి.దేవల్ వర్మ స్టార్టప్2017 నుండి ఒక సొంత స్టార్టప్ను నడుపుతున్నాడు. అతను ఇప్పటివరకు అనేక రకాల శిల్పాలు , కళాఖండాలను తయారు చేశాడు. ఏనుగు, నెమలి, చిలుక, గిటార్, డేగ, ఇండియా మ్యాప్, పువ్వులు ఇలా ఒకటేంటి అనేక రకాల జంతువులు, పక్షుల బొమ్మలను రూపొందించాడు. ముఖ్యంగా హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.అద్భుతమై హనుమాన్ విగ్రహంగుజరాత్లోని గోద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త సోషల్ మీడియా ద్వారా దేవల్ గురించి తెలుసుకుని హనుమంతుని విగ్రహాన్ని తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. దీన్ని సవాల్గా తీసుకున్న దేవల్ 350 కిలోల స్క్రాప్ ఉపయోగించి, ఏడాది పాటు శ్రమించి హనుమాన్జీ విగ్రహాన్ని రూపొందించాడు. ఇత్తడి స్టీల్ వస్తువులు, గేర్-బేరింగ్లతో కండలు తిరిగిన దేహంతో అందమైన హనుమాన్ విగ్రహం చూస్తే ఎవరైనా చేయొత్తి మొక్కాల్సిందే. -
13 బంగారు పతకాలు, తొలి ప్రయత్నంలోనే సివిల్స్ : ఎవరీ శ్రద్ధా
సాధించాలన్న పట్టుదల, కృషి,అచంచలమైన సంకల్ప శక్తి ఇవి ఉంటే చాలు. ఎలాంటి వారైనా తమ కలలను సాకారం చేసుకోవచ్చు. ఈవిషయాన్నే తన విజయం ద్వారా నిరూపించింది ఓ యువతి. ఒకటి కాదు రెండు ఏకంగా 13 బంగారు పతకాలను సాధించింది. CLATలలో అగ్రస్థానంలో నిలిచి, బంగారు పతకాలు సాధించడమే కాకుండా, యూపీఎస్సీలో మంచి (60) సాధించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన శ్రద్ధా గోమె సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం రండి!శ్రద్ధా గోమ్ తండ్రి రిటైర్డ్ SBI అధికారి. ఆమె తల్లి వందన గృహిణి. శ్రద్ధా చిన్నప్పటినుంచీ తెలివైన విద్యార్థిని. ఇండోర్లోని సెయింట్ రాఫెల్స్ హెచ్ఎస్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. 10వ తరగతి, ఇంటర్మీడియట్ అగ్రస్థానంలో నిలిచింది.తరువాత శ్రద్ధా గోమ్ న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించాలని బావించింది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT)లో టాపర్గా నిలిచింది. ఈ ఘనత ఆమె ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU), బెంగుళూరు, భారతదేశంలోని అత్యుత్తమ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందింది. అత్యుత్తమ ప్రతిభకు గాను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రచేతులమీదుగా 13 బంగారు పతకాలను అందుకుంది. ఇలాంటి అవార్డులు, రివార్డుల పరంపరకొనసాగుతూనే ఉంది. (మసాబా మెచ్చిన చ్యవన ప్రాశ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా!)హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేసింది. ముంబై, లండన్లో విలువైన అనుభవాన్ని పొందింది. తరువాత తన స్వస్థలమైన ఇండోర్కు తిరిగొచ్చి, 2021లొ సివిల్ సర్వీసెస్కు (సీఎస్ఈ) ప్రిపేర్ అయింది. ఇంటర్నెట్ ద్వారా స్టడీ మెటీరియల్ సమకూర్చుకుని స్వయంగా పరీక్షకు సిద్ధమైంది. మొక్కవోని దీక్షతో చదివి తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించడం ద్వారా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రద్ధా మంచి ఆర్టిస్ట్ కూడా. -
ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్.. సుడిగాలి ఇన్నింగ్స్!
భారత క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. సర్వీసెస్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల సునామీ సృష్టించాడు. అయితే, శతకానికి కేవలం మూడు పరుగుల దూరంలో ఉన్నప్పుడు రుతురాజ్ అవుట్ కావడం దురదృష్టకరం.కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. ఇటీవల రంజీ ట్రోఫీ(ఫస్ట్క్లాస్ క్రికెట్)లో అదరగొట్టాడు. అయితే, దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రం రుతుకు శుభారంభం లభించలేదు. గత నాలుగు మ్యాచ్లలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చేసిన పరుగులు వరుసగా.. 1, 19, 4, 2.48 బంతుల్లోనే 97 పరుగులుఈ నేపథ్యంలో రుతు టీ20 బ్యాటింగ్ తీరుపై విమర్శలు రాగా.. సర్వీసెస్తో మ్యాచ్ సందర్భంగా బ్యాట్తోనే సమాధానమిచ్చాడు. ఆష్రిన్ కులకర్ణి(29)తో కలిసి మహారాష్ట్ర ఇన్నింగ్స్ ఆరంభించిన రుతు.. 48 బంతుల్లోనే 97 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి.ఇక 202కు పైగా స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టిన రుతు.. సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఉన్నపుడు అవుటయ్యాడు. సర్వీసెస్ బౌలర్ మోహిత్ రాఠీ బౌలింగ్లో వికాస్ హథ్వాలాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్ త్రిపాఠి విఫలంమిగతా వాళ్లలో రాహుల్ త్రిపాఠి(13) విఫలం కాగా.. సిద్ధార్థ్ మాత్రే మెరుపు ఇన్నింగ్స్(19 బంతుల్లో 32), ధన్రాజ్ షిండే(14 బంతుల్లో 32) ధనాధన్ బ్యాటింగ్తో ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.చదవండి: టీ20 క్రికెట్లో పెను సంచలనం.. బరోడా జట్టు ప్రపంచ రికార్డు.. హార్దిక్ పాండ్యా లేకుండానే! -
దీపావళి మర్నాడు.. హింగోట్ యుద్ధంలో 15 మందికి గాయాలు
ఇండోర్: మనదేశంలో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని ఎంతో వింతగా అనిపిస్తాయి. ఇటువంటి వింత సంప్రదాయం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కొనసాగుతోంది. దీపావళి మర్నాటి రోజున ఇండోర్ జిల్లా గౌతమ్పురాలో సంప్రదాయం పేరుతో కళంగి- తుర్రా సమూహాల మధ్య హింగోట్ యుద్ధం శుక్రవారం జరిగింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ యుద్ధాన్ని వీక్షించేందుకు ఇండోర్, ఉజ్జయిని, ధార్, దేవాస్ సహా సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో దీపావళి మర్నాడు ఈ తరహా యుద్ధం జరిగే ఏకైక ప్రదేశం గౌతమ్పురా. ఈ యుద్ధంలో 15 మందికి పైగా యోధులు మరియు ప్రేక్షకులు గాయపడ్డారు.ఇండోర్ హింగోట్ యుద్ధం చూసేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం స్టేడియం ప్రాంతంలో 25 అడుగుల ఎత్తులో నెట్ను ఏర్పాటు చేశారు. యుద్ధభూమిలో భద్రతను దృష్టిలో ఉంచుకుని, 300 మందికి పైగా పోలీసులను మోహరించారు. దీంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.గౌతమ్పురాను గౌతమ ఋషి నగరంగా పరిగణిస్తారు. ఏళ్ల తరబడి సాగుతున్న హింగోట్ యుద్ధం ఎలాంటి ప్రచారం లేకుండానే ఉత్కంఠభరితంగా సాగుతుంటుంది. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి వేలాది మంది ప్రేక్షకులు హింగోట్ యుద్ధాన్ని వీక్షించేందుకు తరలివస్తుంటారు. ఈ సారి ఈ యుద్ధాన్ని చూసేందుకు వచ్చేవారితో మైదానం మొత్తం నిండిపోయింది. హింగోట్ యుద్ధంలో ముందుగా ఇరువర్గాల యోధులు డప్పుల మోతతో ఊరేగింపుగా వచ్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తలపై శిరస్త్రాణం, చేతుల్లో కవచాలు, నిప్పుల బాణాలు భుజాలకు తగిలించుకుని యోధులు మైదానంలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రారంభంలో 50 నుండి 60 మంది యోధులు ముఖాముఖి తలపడ్డారు. సుమారు గంటపాటు జరిగిన ఈ యుద్ధం రాత్రి 7.30 గంటలకు ముగిసింది. ఇది కూడా చదవండి: 1,101 మంది మహిళలు.. ఒకే రంగు చీరతో కాళీ పూజలు -
ఇదేం నిరసన..! 'గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’
యువతుల వినూత్న ర్యాలీ... కాలానుగుణంగా యువతలో ఫ్యాషన్ అభిరుచులు మారుతున్నాయి. అబ్బాయిల్లో ఇటీవల ఎక్కువమంది గడ్డం, జుట్టు పెంచి ఫ్యాషన్గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై ఇండోర్లో ఉన్న కొందరు కాలేజీ యువతులు అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాకు గడ్డంలేని బాయ్ఫ్రెండ్స్ కావాలంటూ యువతులు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ‘గడ్డం తొలగించండి.. ప్రేమను కాపాడండి’ అనే నినాదంతో యువతులు ముఖాలకు గడ్డం మేకప్తో ర్యాలీ నిర్వహించారు. వారి చేతిలో ఉన్న ప్లకార్డులపై ’నో క్లీన్ షేవ్.. నో లవ్’, ’మాకు గడ్డంలేని బాయ్ఫ్రెండ్స్ కావాలి’, ‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్ఫ్రెండ్’ వంటి లైన్స్ కనిపించాయి. ఈ ర్యాలీ తాలూకు వీడియోను ఓ ‘ఎక్స్’ యూజర్ నెట్టింట ΄ోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఈ యువతుల డిమాండ్ కరెక్టే. వారానికి ఒక్కసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మన్లా కనిపిస్తాం‘ అని ఒకరు కామెంట్ చేశారు. ‘మా బాడీ మా ఇష్టం’ అని ఒకరు కామెంట్ చేస్తే ‘వారి గడ్డం.. వారి ఇష్టం.. మధ్యలో మీకెందుకు‘ అని ఇంకొకరు కామెంట్ చేశారు. (చదవండి: అతుకులే అదుర్స్! ఏకంగా 180 క్లాత్ ప్యాచ్లు..) -
గడ్డం కావాలా? గర్ల్ ఫ్రెండ్ కావాలా? రోడ్డెక్కిన కాలేజీ అమ్మాయిలు
ఎలాంటి భర్త కావాలి? లేదా ఎలాంటి భార్య కావాలి? అని పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెద్దలు అడగడం సాధారణం. అలాగే నాకు ఎర్రగా, బుర్రగా ఉన్న అమ్మాయి కావాలి అని అబ్బాయిలు, ఆరడుగులుంటాడా? ఆరెంకెల జీతం ఉందా? అని అమ్మాయిలు ఆశపడటం చాలా కామన్. కానీ ఇపుడు ట్రెండ్మారింది అంటున్నారు ఇండోర్ యువతులు. అంతేకాదు ఏకంగా ‘మాకొద్దీ గడ్డం బూచోళ్లు’,‘నో క్లీన్ షేవ్.. నో గర్ల్ఫ్రెండ్' అంటూ రోడ్డుమీద కొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడమే కాదు. ఫ్యాషన్గా గెడ్డం పెంచుకుంటున్న పెళ్లి కాని ప్రసాదుల గుండెల్లో బాంబు పేల్చింది.ఇండోర్లో కొందరు కాలేజీ యువతులు 'గడ్డం తొలిగించండి.. ప్రేమను కాపాడండి' అనే నినాదంతో యువతులు ర్యాలీ తీశారు. ముఖాలకు గడ్డం మేకప్ వేసుకొని మరీ అబ్బాయిల గడ్డం విషయమై ర్యాలీ తీయడం హాట్ టాపిక్గా నిలిచింది., ‘గడ్డం రఖో యా జిఎఫ్ రఖో’(గడ్డం కావాలా? గర్ల్ఫ్రెండ్కావాలా), 'గడ్డం హటావో ప్యార్ బచావో' నినాదాలతో వీధుల్లోకి వచ్చారు. 'నో క్లీన్ షేవ్.. నో లవ్', 'నో క్లీన్ షేవ్.. నో గర్ల్ఫ్రెండ్' అనే ప్లకార్డులతో తీసిన ర్యాలీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీగా స్పందిస్తున్నారు.వారి డిమాండ్ కరెక్టేగా కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ షేవ్ కాకున్నా కనీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మనం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్మెన్లా ఉంటాం అంటూ కామెంట్ చేయడం విశేషం. మరికొందరు దీని వెనుకున్న మతలబు ఏంటి భయ్యా అంటూ దీర్ఘాలోచనలో పడిపోయారు.ఇదీ చదవండి: నిద్రపోనివ్వని కల అంటే ఇదే! శభాష్ మల్లవ్వ! కాగా పురుషులు గడ్డాలతో అందంగా కనిపిస్తారా లేదా గడ్డం లేకపోతే అందంగా కనిపిస్తారా? అనేది పెద్ద చర్చే. గడ్డాలున్న పురుషులనే మహిళలు ఇష్టపడతారని అనేక అధ్యయనాలు చెబుతున్నప్పటికీ, క్లీన్ షేవ్ మెన్ మరింత ఆకర్షణీయంగా ఉంటారని మరికొందరి వాదన.Clean shave ke liye ladkiyon ne kiya kalesh🤯 pic.twitter.com/QkmIROdDyk— Ghar Ke Kalesh (@gharkekalesh) October 17, 2024 -
ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. యువ సైనికాధికారులను తీవ్రంగా కొట్టి, వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇండోర్ సమీపంలోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు అధికారులు, తమ స్నేహితురాళ్లతో కలిసి బుధవారం మధ్యాహ్నం చోటీ జామ్ వద్ద ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రదేశానికి పిక్నిక్కు వెళ్లారు.తుపాకులు, కత్తులు, కర్రలతో వచ్చిన 8 మంది దుండగులు అకస్మాత్తుగా వారిని చుట్టుముట్టారు. నలుగురినీ చితకబాది వారివద్ద డబ్బు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఒక అధికారిని, అతడి స్నేహితురాలిని బందీలుగా ఉంచుకున్న దుండగులు రూ.10 లక్షలు తెస్తేనే విడిచిపెడతామంటూ మరో అధికారి, అతడి స్నేహితురాలిని పంపించారు. బాధితుడు హుటాహుటిన తన యూనిట్కు వెళ్లి కమాండింగ్ అధికారికి సమాచారమిచ్చారు. ఈ మేరకు పోలీసులు, మిలటరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిని చూసి దుండగులు పారిపోయారు. నలుగురు బాధితులను పోలీసులు మోవ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. దోపిడీ, అత్యాచారం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మోవ్ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో శాంతి భద్రతలు మచ్చుకైనా కానరావడం లేదని దుయ్య బట్టారు. మహిళలపై జరుగుతున్న నేరాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకర అంశమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
Madhya Pradesh: ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒకరిపై అత్యాచారం
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మరో ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడిచేశారు. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు.. వారిపై దాడి చేసి ఓ మహిళా అధికారిణిపై అత్యాచారం చేసినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు మంగళవారం జామ్లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులు కర్రలతో వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల డబ్బు, వస్తువులను దోచుకునే ముందు వారిపై దాడి చేశారు. ఒక మహిళను, మరో ఆర్వీ అధికారిని బందీలుగా పట్టుకుని.. మిగతా ఇద్దరు రూ.10 లక్షల ఇవ్వాలని అలాఅయితే వారివద్ద ఉన్న అధికారులను వదిపెడతామని డిమాండ్ చేశారు. ట్రైనింగ్ సెంటర్ వెళ్లిన యువ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీ అధికారులు, పోలీసులకు సమాచారం అధించారు. దీంతో పోలీసులను అప్రమత్తమై.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటాన్ని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసిందని బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.చదవండి: ప్రజ్వల్కు చీర చిక్కు -
ప్రశాంతంగా, కంటికి హాయిగా : బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్
అపార్టమెంట్లలో పచ్చని ప్రకృతి శోభ ఉండేలా, శుభ్రమైన గాలికోసం ఇంట్లోమొక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్. వీటినే ఇండోర్ ప్లాంట్లు అని అంటారు. ఇలాంటి మొక్కలు ఇంటి అందాన్ని ఇనుమడింపజేయడం మాత్రమే కాదు స్వచ్ఛమైన గాలితో కంటికి ఆహ్లాదంగా ఉంటూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇండోర్ ప్లాంట్లు కలిగి ఉంటాయి. మరి అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందామా!పర్యావరణహితమైన ఆరోగ్యకరమైన ఇండోర్ ప్లాంట్లతో ఇంట్లోని గాలి నాణ్యత మెరుగు పడుతుంది. కాలుష్యానికి చెక్ చెప్పవచ్చు. ఒత్తిడి లేకుండా మనసుకు హాయిగా ఉంటుంది. పచ్చని ఇండోర్ వల్ల ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయిస్నేక్ ప్లాంట్అత్తగారి నాలుక అని కూడా పిలుస్తారు. ఇది రాత్రిపూట ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. బెడ్రూమ్లో ఈ మొక్కను పెట్టుకోవచ్చు. గాలిలోని ఫార్మాల్డిహైడ్, జిలీన్, బెంజీన్, టోలున్, ట్రైక్లోరోఎథిలిన్ లాంటి వాటిని ఫిల్టర్ చేస్తుందిఅలోవెరాఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న అలోవెరా ఇండోర్ ప్లాంట్గా బెంజీన్, ఫార్మాల్డిహైడ్ను ఫిల్టర్ చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్ను పీల్చుకుంటుంది. తొమ్మిది ఎయిర్ ప్యూరిఫయర్లు చేసిన పనితో దీని సామర్థ్యం సమానమని చెబుతారు. కొద్దిగా ఎండ, కొద్దిపాటి నీళ్లతో దీన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. కలబంద జెల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి.పీస్ లిల్లీతెల్లటి పువ్వులతో అందంగా కనిపించే ఈ మొక్క కూడా గాలిలో ఉండే కొన్ని విష రసాయనాలను శుద్ధి చేస్తుంది. ఈ సూపర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఇండోర్ ప్లాంట్ను ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ , ఇతర గృహోపకరణాల ద్వారా విడుదలయ్యే ఇండోర్ కాలుష్యాలను సమర్థవంతంగా తొలగించగల క్లెన్సర్లలో ఒకటి.కాలుష్య కారకాలను తొలగించే విషయంలో ఇది పవర్హౌస్. స్పైడర్ ప్లాంట్స్పైడర్ ప్లాంట్ను కూడా ఇంట్లో చక్కగా చేర్చుకోవచ్చు, ప్రత్యేకించి పెంపుడు జంతువులకు విషపూరితం కాని కొన్ని మొక్కలలో ఇది ఒకటి. కార్బన్ మోనాక్సైడ్,జిలీన్తో సహా టాక్సిన్స్తో నివారిస్తుంది.వెదురు మొక్కబటర్ఫ్లై పామ్ లేదా అరేకా పామ్ అని పిలిచే ఈ వెదురు మొక్క భారతదేశంలోని అత్యుత్తమ గాలిని శుద్ధి చేసే మొక్కలలో ఒకటి. ఇది గాలి శుద్దీకరణకు మించిన అదనపు ప్రయోజనంగా, ఇది సహజ హ్యూమిడిఫైయర్ కూడా. ఇది పొడి శీతాకాలంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.పోథోస్ లేదా మనీ ప్లాంట్: డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. ఇంట్లోని టాక్సిన్స్ తొలగించడంలో ప్రసిద్ధి చెందింది, ప్రతి 1-2 వారాలకు ఒకసారి నీళ్లు పోస్తే చాలు. ఇందులో చాలా రకాలున్నాయి.జెడ్ జెడ్ ప్లాంట్ తక్కువ-కాంతిలో కూడా చక్కగా పెరుగుతుంది. జిలీన్, టోలున్ , బెంజీన్ వంటి టాక్సిన్స్ను తొలగిస్తుంది. దీన్ని ఆఫీసుల్లో కూడా పెట్టుకోవచ్చు. వీటితోపాటు స్పైడర్ ప్లాంట్ (క్లోరోఫైటమ్ కోమోసమ్), ఫెర్న్ మొక్కలు కూడా ఈ కోవలోకే వస్తాయి. -
Madhya pradesh: పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ రైలు
భోపాల్: మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్-జబల్పూర్ (సోమనాథ్) ఎక్స్ప్రెస్కు చెందిన రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ఎక్స్ప్రెస్ ఇండోర్ నుండి జబల్పూర్కు వస్తున్న క్రమంలో జబల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున 5. 40 గంటలకు జబల్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉండడంతో రైలు వేగం చాలా తక్కువగా ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.#WATCH | Two coaches of Indore- Jabalpur Overnight Express derailed in Jabalpur, Madhya Pradesh. No casualties/injuries reported. More details awaited pic.twitter.com/A8y0nqoD0r— ANI (@ANI) September 7, 2024 రెండు కోచ్లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులందరినీ హడావుడిగా రైలు ఎక్కించారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, ఉద్యోగులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటి..
మధ్యప్రదేశ్ వ్యాపార రాజధాని ఇండోర్ పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. కేవలం 24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటడం ద్వారా ఈ నగరం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇండోర్ నగరం, పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు, పురుషులు, సామాన్యులు.. అంతా కలసి ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, పట్టణ పరిపాలనా మంత్రి కైలాష్ విజయవర్గీయ, మేయర్ పుష్యమిత్ర భార్గవ తదితరులు ఒక్కరోజులో 11 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 50 వేల మంది శ్రమించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని బహిరంగ ప్రదేశాలు, పార్కులు, ఉద్యానవనాలు, అడవుల్లో మొక్కలు నాటారు.ఇండోర్లోని బీఎస్ఎఫ్ రేవతి రేంజ్లో 11 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పాల్గొన్న విద్యార్థులు ‘మా తుజే సలామ్’ అంటూ దేశభక్తి గీతాలు ఆలపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను మొక్కలు నాటుతూ ఇతరులను ఉత్సాహపరిచారు. -
లోక్సభ ఎన్నికల్లో నోటా సంచలనం
ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే హక్కు ప్రతీ ఓటర్కు ఉంది. అలాగే.. ఏ అభ్యర్థి నచ్చకుంటే నోటా(None Of The Above)కు ఓటేయొచ్చు. ఇందుకోసమే 2013లో నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటా సరికొత్త రికార్డు సృష్టించింది.మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఏకంగా నోటాకు లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి. విశేషం ఏంటంటే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 9,90,698 ఓట్లు పోల్కాగా, రెండో స్థానంలో నోటా ఓట్లు(1,72,798) ఉన్నాయి. మూడో స్థానంలో బీఎస్సీ అభ్యర్థి సంజయ్ సోలంకీ 20,104 ఓట్లతో నిలిచారు.విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ తమ ఓట్లను నోటాకే ఓటేయాలని ప్రచారం చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఇక్కడ నామినేషన్ వేసిన అక్షయ్ కంటీ బామ్.. చివరి నిమిషంలో తన నామినేషన్ విత్డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇది కాంగ్రెస్కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ పరిణామంపై ఇక్కడి నుంచి ఏడుసార్లు నెగ్గిన అభ్యర్థి, లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావించినా.. అందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అంగీకరించలేదు. దీంతో అనివార్యంగా పోటీ నుంచి వైదొలగింది. అయితే బరిలో నిలిచిన వాళ్లకు మద్దతు ఇవ్వకుండా.. నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది కాంగ్రెస్. తద్వారా తమ పార్టీ అభ్యర్థిని లాక్కెల్లిన బీజేపీకి నోటా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది.నోటా చరిత్ర తిరగేస్తే..2019లో బీహార్ గోపాల్గంజ్(ఎస్సీ)లో 51,660 నోటా ఓట్లు పడ్డాయి. ఇది నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో 5 శాతంఅక్కడ జేడీయూ అభ్యర్థి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ 5,68,160 ఓట్లతో గెలుపొందారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నీలగిరిలో 46, 559 నోటా ఓట్లు పడ్డాయి. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం మహీంద్రా ఎస్యూవీను ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.ఈ ఘటనపై అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) రూపేష్ కుమార్ ద్వివేది తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ జిల్లాలోని ఇండోర్-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై ఘటాబిల్లోడ్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నట్టు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. #NewsWithR #MadhyaPradesh: Eight people killed and one injured in road accident.According to Additional Superintendent of Police (ASP) Rupesh Kumar Dwivedi, a jeep collided with an unidentified vehicle near Ghatabillod on the Indore-Ahmedabad National Highway.@MPPoliceDeptt pic.twitter.com/x994AFzsiq— Ravi Rana (@RaviRRana) May 16, 2024 ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే, ప్రమాదం జరిగిన అనంతరం గుర్తు తెలియని వాహనం డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడని చెప్పారు. మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతుండగా.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఇక, సదరు వాహనం గునా అనే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. -
Lok Sabha Election 2024: ఇండోర్లో ఉచిత పోహా, జిలేబీ..
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎవరి స్థాయిలో వారు పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉచితంగా పోహా, జిలేబీ పంచారు. రాష్ట్రంలో 29 లోక్సభ స్థానాలకు గాను.. చివరి 8 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అందులో ఇండోర్ నియోజకవర్గం కూడా ఉంది. అయితే.. ఇక్కడ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రఖ్యాత ఫుడ్ స్ట్రీట్ ‘56 దుకాణ్’ చొరవ తీసుకుంది. ఓటేసి వచి్చనవారికి పోహా, జిలేబీ ఉచితంగా పంచుతామని ప్రకటించింది. అన్నట్టుగానే సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 వరకు ఓటేసిన వారికి పోహా, జిలేబీని అందించింది. దాదాపు 3 వేల మంది ఉచితంగా తిన్నారు. అందుకోసం ఐదు క్వింటాళ్ల పోహా అవసరమైందని వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గుంజన్ శర్మ చెప్పారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువతకు, ఓటేసిన వృద్ధులకు అదనంగా ఐస్క్రీమ్ కూడా అందించారు. 25 లక్షలకు పైగా ఓటర్లున్న ఇండోర్ లోక్సభ స్థానం రాష్ట్రంలోనే పెద్దది. ఇక్కడ 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1989 నుంచి ఇది బీజేపీ కంచుకోటగా ఉంది. -
ఓటర్లకు అల్పాహారం, ఐస్క్రీమ్
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్థానిక దుకాణదారులు వినూత్న ప్రయత్నం చేశారు. '56 దుకాణ్' దుకాణదారుల సంఘం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు ఉచిత అల్పాహారం, ఐస్క్రీమ్లు అందించారు.నగరంలోని 56 దుకాణ్ మార్కెట్లోని దుకాణాల వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఓటర్లు బారులు తీరి కనిపించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఖర్గోన్, ఖాండ్వాతో సహా ఎనిమిది పార్లమెంటు స్థానాలలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది."ఇండోర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఓటింగ్లో కూడా మేము ప్రత్యేకంగా నిలుస్తాం. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం అందించాం. తద్వారా వారు త్వరగా బయటకు వచ్చి ఓటు వేయవచ్చు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఇక్కడి ఓటర్లందరికీ పోహా, జిలేబీ వంటి ఇష్టమైన అల్పాహారాన్ని అందిస్తున్నాం" అని 56 దుకాణ్లోని షాప్ యజమాని శ్యామ్లాల్ శర్మ చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ఆయన అన్నారు. -
ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం ‘నోటా’కే..
ఇండోర్ (మధ్యప్రదేశ్): లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాత్రం నోటాకే ఓటేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ తాము నిలబెట్టిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి బీజేపీలో చేరడమే ఇందుకు కారణం.ఇండోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా అక్షయ్ కాంతి బామ్ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అయితే ఆయన నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ విత్డ్రా చేసుకని కాషాయ పార్టీలోకి చేరారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నియోజకవర్గానికి నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది.“గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయినప్పటికీ, కాషాయ పార్టీ తమ అభ్యర్థి బామ్ను అన్యాయంగా ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా పీటీఐతో అన్నారు.తమ పార్టీ ఏ అభ్యర్థికీ మద్దతివ్వదని, బీజేపీని శిక్షించేందుకు ఓటర్లకు నోటా అవకాశం ఉందని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో 'ప్రతికూల వ్యూహాలను' అవలంభిస్తోందని బీజేపీ అభ్యర్థి లాల్వానీ అన్నారు. -
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటర్లకు ఉచితంగా సినిమా టికెట్లు ఇస్తామంటోంది మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం. అయితే ఇది ఓటేసినందుకు కాదు.. మరి ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి..ఇండోర్ లోక్సభ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుండి మే 8 వరకు ఓటరు స్లిప్లను ఇంటింటికీ పంపిణీ చేసే ప్రక్రియను జిల్లా ఎన్నికల యంత్రాంగం చేపట్టనుంది. నిర్ణీత వ్యవధిలోగా బీఎల్ఓలు ఓటరు స్లిప్ను అందిచకపోతే వాట్సాప్ లేదా టెలిఫోన్లో ఫిర్యాదు నమోదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశీష్ సింగ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఓటరు స్లిప్పులు అందని ఓటర్లు తమ అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వివరాలతో జిల్లా ఎన్నికల హెల్ప్లైన్ వాట్సాప్ నంబర్ 9399338398 లేదా ల్యాండ్లైన్ నంబర్ 0731-2470104, 0731-2470105లో మే 10వ తేదీ వరకు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు నిజమైనదని తేలితే బీఎల్ఓపై చర్యలు తీసుకోవడంతోపాటు సరైన సమాచారం ఇచ్చిన ఓటర్లకు బహుమతిగా నగరంలోని సినిమా థియేటర్లో సినిమా చూసేందుకు రెండు సినిమా టిక్కెట్లను ఉచితంగా అందజేస్తారు. -
కాంగ్రెస్కు షాక్.. నామినేషన్ వెనక్కి తీసుకున్న ఇండోర్ అభ్యర్థి
భోపాల్: లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్కు వరుస షాక్ తగులుతున్నాయి. తాజాగా ఇండోర్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇండోర్ ఎంపీ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ చివరి నిమిషంలో తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఆయన హస్తం పార్టీని వీడి అధికార బీజేపీలో చేరారు.మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ స్థానానికి నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇండోర్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా కాంగ్రెస్ కాంతిని బరిలోకి దింపింది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు నేడే (ఏప్రిల్ 29) ఆఖరి తేదీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం అక్షయ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను వెనక్కి తీసుకున్నారు. ఆయన వెంట బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా కూడా ఉన్నారు. కాంగ్రెస్ ఇండోర్ అభ్యర్థి అక్షయ్ బీజేపీలో చేరినట్లు మంత్రి విజయ్వర్గియ పేర్కొన్నారు. అక్షయ్తో ఒకే కారులో వెళ్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. ఆయన్ను పార్టీలోకి స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇండోర్ మరో సూరత్ కానుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుజరాత్లోని సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడం, మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
ప్రాణాలు తీసిన ప్రాంక్.. ఫ్రెండ్ను ఫూల్ చేయబోయి విద్యార్ధి మృతి
సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ప్రాంక్ల హవా బాగా నడుస్తోంది. కుటుంబ సభ్యులు, తెలిసిన వారికి ఏదైనా విషయం గురించి చెప్పి భయపెట్టడం.. తరువాత అదంతా ప్రాంక్ అని చెప్పడం ఫ్యాషన్గా మారింది. అయితే కొన్ని సార్లు ఈ చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్ ఫూల్స్ డే రోజు చేసిన తన స్నేహితుడిని ప్రాంక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. ఇండోర్లోని మల్హర్గంజ్లో 11వ తరగతి చదువుతున్న అభిషేక్ అనే విద్యార్ధి సోమవారం ఏప్రిల్స్ ఫూల్స్డే రోజు తన స్నేహితుడిని ప్రాంక్ చేయాలని ప్రయత్నించాడు. ఫ్రెండ్కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాడు. స్టూల్పై నిల్చొని మెడకు తాడు బిగించి తను చనిపోతున్నట్లు స్నేహితుడిని నమ్మించాడు. ఈ క్రమంలో అనుకోకుండా స్టూల్ జారిపోవడంతో మెడకు తాడు బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సంఘటనను చూసిన వెంటనే స్నేహితుడు.. అభిషేక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు. చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు గమనిక: దయచేసి ఎవరూ ఇలాంటి ప్రాంక్లు ప్రయత్నించవద్దు. చిన్న చిన్న సరదాలకు పోయి.. నిండు ప్రాణాలను బలితీసుకోవద్దు -
ఎన్నికల డ్యూటీ వద్దంటూ వినతుల వెల్లువ
దేశంలో 2024 లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను రద్దు చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడిన వెంటనే పలువురు ఉద్యోగులు తాము తమ ఎన్నికల డ్యూటీకి హాజరకాలేమంటూ ఉన్నతాధికారులకు వినతులు సమర్పించుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల డ్యూటీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే ఈ ఆర్డర్ వచ్చిన వెంటనే పలువురు ఉద్యోగులు సెలవుల కోసం దరఖాస్తు చేయడం మొదలుపెట్టారు. ఒకరు అనారోగ్యం కారణంగా ఎన్నికల విధులు నిర్వహించలేమని పేర్కొనగా, మరొకరు తమ ఇంటిలో పెళ్లి వేడుకలు ఉన్నాయంటూ సెలవుల కోసం అభ్యర్థించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సింగ్ ఉద్యోగుల సెలవులను రద్దు చేసినప్పటి నుండి సెలవులకు సంబంధించిన దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులలో ముగ్గురు తాము విదేశాలకు వెళ్తున్నామని రాశారు. ఒకరు తమ కుమార్తె జపాన్లో డిగ్రీ అందుకోబోతున్నదని రాయగా, మరొకరు అమెరికాలో తమ కుమార్తె డెలివరికీ వెళ్లాలని రాశారు. ఇంకొకరైతే వివాహ శుభలేఖను కూడా జతచేశారు. ఎన్నికల విధులను తప్పించుకునేందుకు పలువురు ఉద్యోగులు తమ ఆనారోగ్యాన్ని సాకుగా చూపుతున్నారు. నిజానికి ఎన్నికల డ్యూటీలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే ఎంతో శ్రద్ధగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఈ కారణంగానే పలువురు ఉద్యోగులు ఎన్నికల విధులను తప్పించుకోవాలని చూస్తారనే మాట వినిపిస్తుంటుంది. -
బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్
షిమ్లా: సుదూరంగా మాటువేసి గురిచూసి షూట్చేసే ‘స్నైపర్’ విధుల్లో చేరి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ సుమన్కుమారి చరిత్ర సృష్టించనున్నారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)లో తొలి స్నైపర్గా కుమారి పేరు రికార్డులకెక్కనుంది. ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్(సీఎస్డబ్ల్యూటీ)లో ఎనిమిది వారాల కఠోర శిక్షణను కుమారి విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. దీంతో శిక్షణలో ఆమె ఇన్స్ట్రక్టర్ గ్రేడ్ సాధించారు. బీఎస్ఎఫ్లో స్నైపర్ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. కుమారి 2021లో బీఎస్ఎఫ్లో చేరారు. నిరాయుధంగా శత్రువుతో పోరాడే ‘నిరాయుధ దళం’కు గతంలోనే ఆమె ఎంపికయ్యారు. పాకిస్తాన్ సరిహద్దుల వెంట మాటువేసి అదనుచూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో స్నైపర్లది కీలక పాత్ర. -
‘బుల్డోజర్ చర్య ఫ్యాషన్ అయింది’.. హైకోర్టు సీరియస్
మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న బుల్డోజర్ చర్యను రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఖండించింది. బుల్డోజర్ చర్యలు ఇటీవల కాలంలో ఒక ఫ్యాషన్గా తయారైందని కోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇల్లును ప్రభుత్వ అధికారులు కూల్చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ తప్పు పట్టింది. సరైన విధానాలు అమలు పర్చకుండా నిందితుడి ఇంటిని కూల్చివేయటం సరికాదని ప్రభుత్వ అధికారులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితుడు రాహుల్ లాంగ్రీ.. ఓ వ్యక్తి వద్ద ఆస్తిని దోచుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తిపై బెదింపులకు పాల్పడగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసులో ప్రస్తుతం రాహుల్ లాంగ్రీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదే సమయంలో తాజాగా రాహుల్ లాంగ్రీ ఇంటిపై ప్రభుత్వ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టి.. అతని ఇంటిని కూల్చేశారు. దీంతో రాహుల్ లాంగ్రీ భార్య రాధా కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ అధికారుల బుల్డోజర్ చర్యలకు వ్యతిరేకంగా రాధా దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. తమ ఇంటి పాత యజమాని అధికారులు నోటీసులు పంపారు. తమ వివరణ వినకుండా ఉజ్జయినిలోని తమ ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారని లాంగ్రీ భార్య పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇల్లు అక్రమంగా కట్టింది కాదని.. ఆ ఇంటికి బ్యాంక్లో లోన్ కూడా తీసుకున్నామని ఆమె పిటిషన్లో తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇండోర్ బెంచ్ ప్రభుత్వ అధికారుల చేపట్టిన బుల్డోజర్ చర్యలను తప్పుపడుతూ.. నష్టపరిహారంగా లాంగ్రీ భార్య, తల్లికి చెరో రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఇక..ఈ కేసులో మరింత నష్టం పరిహారం పొందేందుకు పిటిషన్దారులు సివిల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చదవండి: బిహార్లో మోదీని ఎదుర్కొంటాం: తేజస్వీ యాదవ్ -
'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..!
బిచ్చగాళ్లని చూడగానే జాలిపడి డబ్బులిస్తాం. అందులోనూ పుణ్యక్షేత్రాల్లోనూ, ప్రుమఖ దేవాలయాల వద్ద ఉంటే భక్తులు కచ్చితంగా డబ్బులు ఇస్తారు. భక్తిపారవశ్యంతో ఇంకాస్త ఎక్కువగానే డబ్బులు ఇస్తారు. దీన్నే బిచ్చగాళ్లు క్యాష్ చేసుకుని పిల్లా జల్లాతో సహా అక్కడకి వాలిపోయి వేర్వేరుగా డబ్బులు సంపాదించడం మొదలు పెడతున్నారు. ఒక రకరంగా చెప్పాలంటే భిక్షాటననే ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నారని చెప్పొచ్చు. అందుటోనూ పెట్టుబడి లేని వ్యాపారం. లాభమే గాని నష్టం అంటూ ఉండదు. దీంతో పలువురు వ్యక్తులు భిక్షాటనే వృత్తిగా లక్షల్లో డబ్బులు ఆర్జిస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు. అందుకు సంబంధించిన సంచలన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎంతలా ఆ బిక్షగాళ్లు డబ్బులు ఆర్జిస్తున్నారో వింటే కంగుతింటారు. వామ్మో ఏంటీది..? అని నోటి మీద వేలేసుకుంటారు. అసలేం జరిగిందంటే..ఇండోర్లోని ఓ మహిళ భిక్షాటన ద్వారా కేవలం 45 రోజుల్లో రూ. 2.5 లక్షలు సంపాదించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు సులభమైన మార్గం భిక్షాటనే. దీంతో కొందరూ దీన్నే వృత్తిగా ఎంచుకుని ఇంటిల్లాపాది నెలకు లక్షలు కూడుబెడుతున్నట్లు తేలింది. సెలవు సమయాల్లో వారి ఆదాయం మూడు పువ్వులు ఆరు కాయల్లా సుఖంగా సాగిపోతుంది. అందులోని గుళ్ల వద్ద యాచిస్తుంటారు. దీంతో ఓ పక్క ఆదాయానికి ఆదాయం, మరోవైపు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా భోజనం లభించేస్తోంది. ఇక దీంతో వారి వ్యక్తిగత అవసరాల కంటూ పెద్ద ఖర్చు ఉండదు. అందువల్ల చాలామంది దీన్నే ఆదాయ మార్గంగా ఎంచుకుని డబ్బుల సంపాదిస్తున్న దిగ్బ్రాంతికర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులోకి ముక్కుపచ్చలారని పిల్లలను కూడా దించి లక్షలు సంపాదిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక అధికారులు అదుపులోకి తీసుకున్న మహిళ తన సంపాదనలో ఒక లక్ష రూపాయలను తన పుట్టింట్లో ఉంచిన ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందని, ఇక రూ. 50 వేలు పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా..మిగతా డబ్బు వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెడుతున్నట్లు తెలిపారు. ఈ వృత్తిలోనే ఆమె భర్త, చెల్లి మరో ఇద్దరు పిల్లలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కుటుంబం మొత్తం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే కూడలిలో వేర్వేరు నగరాల్లో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అధికారులు ఇండోర్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగాంగా తనిఖీలు చేస్తుండగా సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె చెల్లి, బావా, మరో ఇద్దరు పిల్లలు పారిపోయారు. కొద్దిసేపటిలోనే అధికారుల బృందం వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పైగా అధికారులు వద్ద ఆ మహిళ తానేమి దొంగతనం చేయడం లేదని అడుక్కుంటాను కదా అని ధర్జాగా వాదిస్తోంది. విచారణలో ఆమె 45 రోజుల్లో రూ. 2.5 లక్షల దాక సంపాదించగలనని ఒప్పుకుంది. అంటే ఏడాదికి ఆమె ఆదాయం దగ్గర దగ్గర రూ. 20 నుంచి రూ. 27 లక్షల దాక ఉంటుందని అంచనా వేశారు అధికారులు. ఇక సెలవు లేదా ఏదైన పర్వదినాల్లో వారి ఆదాయం మరింత ఎక్కువగానే ఉండొచ్చని చెప్పారు అధికారులు. అలాగే ఆమెను అదుపులో తీసుకునే టైంలోనే ఆమె వద్ద రూ. 19,200 లభించినట్లు తెలిపారు. అది కేవలం ఆమె ఏడు రోజుల్లో సంపాదించిన మొత్తం అని చెబుతున్నారు. ఇక ఆమె పిల్లలు ఉదయం నుంచి మధ్యాహ్నాం లోపల రూ. 600 దాక సంపాదిస్తారని అన్నారు. ఇక కుటుంబం మొత్తం మిలియనర్ రేంజ్లో ఉందని, వారికి ఇల్లు, స్మార్ట్ ఫోన్లు, బ్యాంక్ బాలెన్స్లు ఉన్నప్పటికీ నగరంలో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. అంతేగాదు ఈ మహిళ గతేడాది కూడా ఇలాగే పట్టుబడిందని, కౌన్సిలింగ్ ఇచ్చామని అన్నారు. అయినప్పటికీ పోలీసులు కళ్లగప్పి ఇదే యాచక వృత్తిని అవలంభిస్తున్నట్లు తెలిపారు. ఇండోర్లో యాచకులు దాదాపు 7 వేల మంది దాక ఉన్నారు. వీరిలో 98.7% వరకు యాచన ద్వారా దండిగా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఆదాయపు లెక్కల ప్రకారం.. వాస్తవానికి భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను డేటా ప్రకారం..ఏడాదికి రూ. 20 లక్షల పైన సంపాదించేవారు కొద్దిమంది మాత్రమే. దాదాపు 3.25 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల్లో కేవలం 5 లక్షల మంది వ్యక్తుల మాత్రమే 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్నట్లు డేటా చూపిస్తుంది. దీన్ని బట్టి మొత్తం పన్ను చెల్లింపుదారులు సుమారుగా 1.3%గా ఉంటుంది. ఇలా యాచక వృత్తితో లక్షల్లో డబ్బులు గడించే వారే సంగతి బయటకు పొక్కుండా, గణాంకాలకు సైతం దొరక్కుండా తప్పించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. బిచ్చగాళ్లల్లో రకాలు.. బిచ్చగాళ్లలో మూడు వర్గాలు ఉన్నారని చెబుతున్నారు అధికారులు. పెద్ద పెద్ద నగరాల్లో దాదాపు ఆరు వేల నుంచి ఏడు వేల మంది దాక భిక్షాటన చేస్తారని, అందులో పిల్లల సంఖ్యే ఏకంగా మూడువేలకు పైనే ఉన్నట్లు తెలిపారు. వారిలో ఎవ్వరూ లేని అనాధలు మొదటి వర్గం. రాష్ట్రం బయట నుంచి వచ్చి మరీ బిక్షాటన చేసేవారు రెండోవర్గం. యాచక ముఠాలో భాగమైన వారు మూడో వర్గం అని వెల్లడించారు. వారందరి దృష్టిలో యాచక వృత్తి అనేది మంచి ఆదాయ వనరు, పైగా ఎవ్వరూ తమను పట్టుకోరనే ధైర్యంతోనే ఈ యాచక వృత్తిలోకి ప్రజలు వస్తున్నట్లు తెలిపారు. దీనికి తక్షణమే అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని కౌన్సలర్ రూపాలి జైన్ చెబుతున్నారు. భిక్షాటనే సంపాదనగా భావించడం క్షమించరాని చెడు మనస్తత్వం అని అన్నారు. ఇది సమాజంలోని ఒక వర్గానికి తప్పుడు సందేశం ఇస్తుందని కూడా అన్నారు రూపాలి జైన్. (చదవండి: రియల్ ఐరన్ మ్యాన్ సూట్ని రూపొందించిన యూట్యూబర్! నెటిజన్లు ఫిదా) -
అనాథశ్రమం ముసుగులో అరాచకాలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మధ్య ప్రదేశ్లో అనాథాశ్రయం పేరుతో జరుగుతున్న అరాచకాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం నిర్వహిస్తున్న సిబ్బంది చిన్నారులను తీవ్ర వేధింపులకు గురిచేశారు. పసివాళ్లనే జాలి లేకుండా చిన్న చిన్న తప్పుల పేరుతో భయంకరంగా చిత్రహింసలకు గురిచేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ బాగోతం బట్టబయలైంది. ఇండోర్లోని అనాథ శరణాలయంలో సుమారు 21 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. ఆ ఆశ్రమంలో గతవారం సీడబ్ల్యూసీ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దీంతో అనాథ బాలలు తమ బాధలను, వేధింపులను అధికారులకు మొరపెట్టుకున్నారు. చిన్న చిన్న తప్పిదాలకే ఆశ్రమం సిబ్బంది తీవ్రంగా వేధించేవారని వాపోయారు. ‘చిన్నారులను తలకిందులుగా వేలాడదీయడం, వేడి ఐరన్ రాడ్తో కొట్టడం, బట్టలు తీసేసి ఫోటోలు తీయడం వంటివి చేసేవారు. ఎర్ర మిరపకాయలను కాల్చడం వల్ల వచ్చే పొగను కూడా పీల్చుకునేలా చేశారు’ అని అధికారులు తెలిపారు. మరీ దారుణంగా నాలుగేళ్ల పిల్లవాడు ప్యాంట్లో బాత్రూం వెళ్లాడని అతడిని రెండు మూడు రోజులు వాష్రూమ్లో బంధించి ఆహారం ఇవ్వకుండా వేధించినట్లు చెప్పారు. సీడబ్ల్యూసీ అధికారుల ఫిర్యాదు మేరకు అయిదుగురు అనాథాశ్రయం సిబ్బందిపై కేసు నమోదైంది. అనాథ శరణాలయాన్ని వెంటనే సీజ్ చేశారు. చిన్నారులను ప్రభుత్వం షెల్టర్కు తరలించినట్లు ఇండోర్ ఏసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు. చిన్నారులపై వేధింపుల ఆరోపణలపై విచారణ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కాగా హోంలోని పిల్లలు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అనాథలుగా గుర్తించారు. అయితే ఆ అనాథశ్రమాన్ని వాత్సల్యపురం జైన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది, దీనికి బెంగళూరు, సూరత్, జోధ్పూర్, కోల్కతాలో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. చదవండి: ప్రముఖ రియల్టర్ కార్తికేయ మ్యాడంపై కేసు నమోదు -
కోచింగ్ సెంటర్లో కుప్పకూలిన యువకుడు.. కాసేపటికే మృతి
భోపాల్: ప్రమాదం ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అప్పటి వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణాలు విడుస్తున్న సందర్భాలు ఇటీవల అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సడెన్ హార్ట్ ఎటాక్ ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ఈ గుండెపోటు మరణాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఓ యువకుడు గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. 18 ఏళ్ల ఓ విద్యార్ధి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతూ ఉన్నట్టుండి ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు అసుపత్రికి తరలించగా.. గుండెపోటుతో యువకుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బుధవారం సాయంత్రం ఈ విషాద ఘటన జరిగింది. క్లాస్ రూమ్లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. చదవండి: Tammineni: వెంటిలేటర్పైనే తమ్మినేని.. విషమంగా ఆరోగ్యం ఇండోర్లోని భన్వర్కువాన్ ప్రాంతానికి చెందిన మాధవ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్సీ) ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నాడు. రోజులాగే బుధవారం కోచింగ్ సెంటర్కు వెళ్లాడు. తరగతి గదిలో కూర్చొని క్లాస్లు వింటున్న సమయంలో అతనికి ఒక్కసారిగా ఛాతీలో నొప్పి కలగడంతో టేబుల్పై ఒరిగాడు. గమనించిన పక్కనే కూర్చున్న యువకుడు మాధవ్ వీపు మీద రుద్దడం ప్రారంభించాడు. అతనికి ఇంకా నొప్పిగా ఉండటంతో వెంటనే ఈ విషయాన్ని ట్రైనర్కు తెలియజేశాడు. ఆలోపే మాధవ్ పూర్తిగా కుప్పకూలి తన డెస్క్ నుంచి జారీ కింద పడిపోయాడు. అప్రమత్తమైన మిగతా విద్యార్ధులు మాధవ్కు సాయం చేసేందుకు వచ్చారు. అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో తరలించారు. అయితే కొంత సేపటికే యువకుడు మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. Tragic news from #Indore MPPSC aspirant dies from fatal heart attack during coaching class. CCTV footage from classroom shows Raja Lodhi sitting upright focused... Suddenly begins clutching his chest, expressing visible distress. Loses balance within seconds & falls off. Hospital… pic.twitter.com/Xf3ni3fitC — Nabila Jamal (@nabilajamal_) January 18, 2024 -
మరోసారి సత్తా చాటిన ఇండోర్.. వరుసగా ఏడోసారి నెంబర్ వన్..
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరోసారి నెంబర్ వన్గా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డుల్లో వరుసగా ఏడోసారి తొలి స్థానాన్ని దక్కించుకుంది . ఇండోర్తోపాటు గుజరాత్లోని సూరత్ కూడా క్లీనెస్ట్ సిటీ తొలి ర్యాంక్ను సంయుక్తంగా గెలుచుకుంది.ఈ జాబితాలో మహారాష్ట్రలోని నవీ ముంబై మూడో స్థానంలో నిలిచింది. పరిశుభ్రత నగరాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి. ఏపీలో విశాఖపట్నం నాలుగు, విజయవాడ (6), తిరుపతి (8), తెలంగాణ రాజధాని హైదరాబాద్ (9) నగరాలు తొలి 10 సిటీల్లో చోటు దక్కించుకున్నాయి. అయితే టాప్ 100 లిస్ట్లో తమిళనాడు నుంచి ఏ నగరం కూడా ఎంపికవ్వలేదు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో చెన్నై 199 స్థానంలో ఉండటం గమనార్హం. Speaking at the Swachh Survekshan awards event in New Delhi, President Droupadi Murmu said that if we deeply understand the concept of value from waste, it becomes clear that everything is valuable and nothing is waste.https://t.co/l5hs7J7Vmb pic.twitter.com/goP4l8zTyw — President of India (@rashtrapatibhvn) January 11, 2024 విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులను అందజేశారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత పరిశుభ్రత రాష్ట్రంగా మహారాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ గెలుచుకుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. నాల్గో స్థానంలో ఒడిశా, అయిదో స్థానంలో తెలంగాణ నిలిచింది. -
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ.. ఇండోర్లో కోటి దీపాలు!
యూపీలోని అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. సరిగ్గా అదే సమయానికి మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్లో స్థానికులు 1.11 కోట్ల దీపాలను వెలిగించనున్నారు. రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్భంగా స్థానికంగా నిర్వహించబోయే కార్యక్రమాల గురించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాష్ విజయవర్గీయ విలేకరులకు తెలియజేశారు. అయోధ్య రామాలయంలో శ్రీరాముని ప్రతిష్ఠాపన సందర్భంగా జనవరి 22న ఇండోర్లో 1.11 కోట్ల దీపాలు వెలిగించనున్నామన్నారు. ప్రజాప్రతినిధులతోపాటు సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. అయోధ్యలో ఉత్సవాల సందర్భంగా ఇండోర్ నగరంలోని 31 వేల మంది పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించి, గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ ఘనత నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రామునితో పాటు అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయం ఇతివృత్తం ఆధారంగా ఈ పెయింటింగ్ పోటీ ఉంటుందని తెలిపారు. ఇదిలావుండగా అయోధ్యలోని నూతన రామాలయ ప్రాంగణాన్ని అలంకరించేందుకు భోపాల్ నుంచి ప్రత్యేక రకాల పూలను తరలిస్తున్నారు. -
నిరుపేద, అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం: మోదీ
ఇండోర్: సమాజంలో నిరుపేద, అణగారిన వర్గాల సాధికారతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయా వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో హుకుంచంద్ మిల్లు కార్మికులకు రూ.224 కోట్ల మేర బకాయిలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. బకాయిల చెల్లింపుతో 4,800 మంది కారి్మకులకు లబ్ధి చేకూరనుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. డబుల్ ఇంజన్ సర్కార్తో మధ్యప్రదేశ్లో అభివృద్ధి వేగం పుంజుకుందని హర్షం వ్యక్తం చేశారు. బిల్లు కారి్మకులకు చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కరిపించారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. మాలవీయ పుస్తకం ఆవిష్కరణ బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయ రచనలు, లేఖలు, కరపత్రాలు, ప్రసంగాలతో కూడిన పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. మాలవీయ 162వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు. మాలవీయ రచనలను ఆంగ్లం, హిందీ భాషల్లో 11 సంపుటాలుగా ప్రచురించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు సమాజానికి సరైన దశ దిశను చూపడంలో, ప్రజలకు సేవలందించడంలో క్రైస్తవుల పాత్ర పట్ల దేశం గరి్వస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో వారు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆయన క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో క్రైస్తవులతో సమావేశమయ్యారు. క్రైస్తవ వర్గం ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పేదలకు సేవలందించడంలో క్రైస్తవులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటున్నారని కొనియాడారు. విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఎనలేని సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. యేసు ప్రభువు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని చెప్పారు. వాజ్పేయికి ముర్ము, మోదీ నివాళులు దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మారకం ‘సదైవ్ అటల్’ వద్ద సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధి కోసం వాజ్పేయి అహరి్నశలూ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, హర్దీపుసింగ్ పురి, అర్జున్రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో మరణించిన 17 ఏళ్ల అమ్మాయి, ఆ లక్షణాలు కనిపిస్తే..
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాల్లో గుండెపోటు వల్ల చనిపోతున్న సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం. ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా ఇండోర్లో 17 ఏళ్ల అమ్మాయి సంజనా యాదవ్ గుండెపోటుతో మరణించింది. రాత్రి భోజనం తిన్న అనంతరం ఒక్కసారిగా ఛాతిలో నొప్పితో విలవిల్లాడింది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, విపరీతంగా చెమటలు పట్టి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సంజన కుటుంబంలో ఇదివరకు హార్ట్ ఎటాక్ హిస్టరీ కూడా లేదని, అయినా ఇంత చిన్న వయసులో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. సంజనాకు హైపర్టెన్షన్, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే వీటితో చలికాలంలో పరిస్థితి దిగజారిపోతుందని పేర్కొన్నారు. టైఫాయిడ్ వచ్చిన కొన్ని రోజుల్లోనే.. 'సంజనకు నాలుగు నెలల క్రితం టైఫాయిడ్. వచ్చింది. ఆ సమయంలో ఆమె హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 4 g/dlకి పడిపోయింది.కానీ ఆమె కుటుంసభ్యులు స్పెషల్ కేర్ తీసుకోవడంతో త్వరగానే కోలుకుంది. ఇంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం. ఈ ఘటనతో ఆమె ఫ్యామిలి మెడికల్ హిస్టరీని కూడా ఓసారి పరీక్షించాల్సిన అవసరం ఉంది' అని వైద్యులు తెలిపారు. ఈ మధ్యకాలంలో యువతలో ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. గుజరాత్లోనే గత ఆరు నెలల్లో మొత్తం 1,052 మంది గుండెపోటుతో మరణించారు. వీరిలో 80 శాతం మంది 11-25 ఏళ్ల మధ్య ఉన్నవారే అని ఓ నివేదికలో వెల్లడైంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యువతలో గుండెజబ్బులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు గుండె జబ్బులు అంటే వయసు పైబడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ గత దశాబ్ద కాలంగా పరిస్థితి మారింది. యువతలో హార్ట్ ఎటాక్కు ప్రధానంగా హైబీపీ, స్మోకింగ్, కుటుంబంలో హార్ట్ ఎటాక్ హిస్టరీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటివి యువతలో గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. గుండెపోటు లక్షణాలు ఛాతీలో నొప్పిగా అనిపించడమే గుండెపోటుకు పెద్ద ముఖ్యమైన సూచన అని డాక్టర్లు చెబుతున్నారు. గుండె వరకూ రక్తం పూర్తిగా సరఫరా కాకపోవడం వల్లనే గుండెపోటు వస్తుంది. సాధారణంగా ధమనులలో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల రక్తం గుండె వరకు చేరలేదు. అప్పుడు ఛాతీలో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ సమయంలో శ్వాస ఆడకపోవడం, చల్లని చెమట, వికారం, గుండెల్లో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటుతో కుప్పకూలినప్పుడు ఎంత త్వరగా సీపీఆర్ చేశామన్నది చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స అందంచగలిగితే బతికించే ఛాన్సులు మెరుగ్గా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. -
‘స్మార్ట్’ పోలింగ్ స్టేషన్ ప్రత్యేకతలేమిటంటే?
ఇండోర్: ఓటర్లు క్యూలో నిలబడే అవసరం లేకుండానే ఓటేయొచ్చు.., అక్కడే సిరా గుర్తున్న వేలు చూపుతూ కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కెమెరా ద్వారా సెల్ఫీ తీసుకోవచ్చు..! మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోలింగ్ బూత్ ప్రత్యేకతలివీ. నంద నగర్ నియోజకవర్గంలోని ‘మా కనకేశ్వరి దేవి’గవర్నమెంట్ కాలేజీ బూత్లో ఈ ఏర్పాటును అందుబాటులోకి తెచ్చారు. ‘ఓటర్ల క్యూ పెద్దగా అవసరం లేకుండా చేసేందుకు ఆన్లైన్ టోకెన్ విధానాన్ని తీసుకొచ్చాం. పోలింగ్ బూత్కు వచ్చిన వెంటనే ఓటర్లకు టోకెన్లు అందజేశాం. దీంతో, తమ వంతు వచ్చే వరకు వారు పోలింగ్ బూత్ వద్దే కూర్చోవచ్చు’అని రాష్ట్ర ప్రభుత్వ ఇండోర్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ లిమిటెడ్కు చెందిన అసిస్టెంట్ ప్లానర్ రుపాల్ చోప్రా పీటీఐకి చెప్పారు. ‘పోలింగ్ స్టేషన్ ఆవరణలోనే ఏఐ ఆధారిత కెమెరాను ఏర్పాటు చేశాం. ఓటేసిన వారు ఆ పాయింట్ వద్ద నిలబడి ఇంక్ గుర్తున్న వేలిని చూపితే చాలు వెంటనే కెమెరా క్లిక్మనిపిస్తుంది’అని ఆమె వివరించారు. ‘అక్కడే ఉన్న స్క్రీన్పై బార్ కోడ్ ప్రత్యక్షమవుతుంది. ఓటర్ తన ఫోన్తో స్కాన్ చేస్తే ఫొటో వెంటనే మొబైల్లోకి వచ్చేస్తుంది. సోషల్ మీడియాలోకి సైతం షేర్ అవుతుంది’అని రుపాలి పేర్కొన్నారు. -
ఇది పగనా లేక అభిమానమా ?..ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఎమ్మెల్యే షాక్..
-
వారిద్దరే మా కొంపముంచారు.. చాలా విషయాలు నేర్చుకున్నాం: స్మిత్
ఇండోర్ వేదికగా భారత్తో జరిగిన రెండో వన్డేలో 99 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 0-2 తేడాతో ఆసీస్ కోల్పోయింది. బ్యాటింగ్ , బౌలింగ్ రెండు విభాగాల్లో ఆస్ట్రేలియా విఫలమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్(105), శుబ్మన్ గిల్ అద్భుత సెంచరీలతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్( 72 నాటౌట్), కేఎల్ రాహుల్(52) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. అనంతరం వర్షం కారణంగా ఆ్రస్టేలియా లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా (డక్వర్త్ లూయిస్ ప్రకారం) నిర్దేశించారు. ఆసీస్ 28.2 ఓవర్లలో 217 పరగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటరల్లో సీన్ అబాట్(54) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జడేజా, ప్రసిద్ద్ కృష్ణ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు. "ఇండోర్ వికెట్ బ్యాటింగ్కు మంచిగా అనుకూలించింది. నిజంగా గిల్, శ్రేయస్ తమ అద్భుత బ్యాటింగ్తో మ్యాచ్ను మా నుంచి దూరం చేశారు. కేఎల్, సూర్య బ్యాటింగ్ తీరు కూడా అత్యుత్తమం. అయితే వర్షం పడిన తర్వాత పిచ్కు అనుకూలించింది. బంతి అద్బుతంగా స్పిన్ అయింది. మేము దక్షిణాఫ్రికాపై కూడా అన్ని మ్యాచ్లను ఓడిపోయాం. ఇక్కడే అదే కొనసాగిస్తున్నాము. మేము గత కొన్ని ఓటములనుంచి చాలా విషయాలు నేర్చకున్నాం. మా తదుపరి మ్యాచ్లో ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రయత్నిస్తాం. వరల్డ్కప్కు ముందు మా రిథమ్ను తిరిగి పొందడం చాలా ముఖ్యమని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో స్మిత్ పేర్కొన్నాడు. చదవండి: IND vs AUS: రాహులా మజాకా.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్ -
సరికొత్త ఆలోచన!..ఎవ్వరికీ తట్టనది.. రెస్టారెంట్లన్నీ..
రెస్టారెంట్లన్నీ సాధారణంగా కస్టమర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలన్నింటిని ఇస్తుంది. మహా అయితే ప్రత్యేకంగా ఉండేందుకు మరింత హంగులు ఆర్భాటాలతో కస్టమర్లని ఆకర్షించే యత్నం చేస్తాయి అంత వరకే. కానీ దివ్యాంగులు లేదా ప్రత్యేక అవసరం ఉన్న కస్టమర్ల సంగతిని గుర్తించవు అనలా లేక పరిగణించరు అని చెప్పాలో తెలియదు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవాళ్ల గురించి అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు.అలాంటి వాళ్లు రెస్టారెంట్కి వచ్చి.. మెను చూసి ఆర్డర్ ఇవ్వాలంటే మరొకరి సాయం తీసుకోవాల్సిందే. లేదా వారు ఫ్రెండ్స్నో, బంధువులనో తోడు తెచ్చుకోవాల్సిందే. ఇంతవరకు ఎవ్వరికీ.. వారు కూడా మెనుని చూసి ఆర్డర్ చేసుకుంటే బావుంటుంది అనే ఆలోచనే రాలేదు. ఆ దిశగా అడుగులు వేయాలేదు . కానీ ఓ స్వచ్ఛంద సంస్థ ఆ దిశగా అడుగులు వేసి ఆచరణలోకి తీసుకొచ్చి చూపింది. ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. ఇండోర్లోని గురుకృపా రెస్టారెంట్ దృష్టిలోపం ఉన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. వారు కూడా స్వయంగా మెను చూసి ఆర్డర్ చేసుకుని తిసేలా చేసింది ఆ రెస్టారెంట్. మహేష్ దృష్టిహీన్ కళ్యాణ సంఘ నుంచి కొంతమంది దృష్టిలోపం ఉన్న పిల్లలను రెస్టారెంట్కి ఆహ్వానించారు. బ్రెయిలీ లిపిలో చెక్కబడిన మెనూ కార్డ్ సాయంతో ఆ పిల్లలంతా తమ ఆర్డర్లను స్వయంగా వారే తెప్పించుకుని తిన్నారు. ఈ కార్యక్రమాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కొంతమంది రెస్టారెంట్ ఆపరేటర్లు కలిసిన తర్వాత ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. యంగ్ ఇండియన్ గ్రూప్ చైర్పర్సన్ భావన గనేదివాల్ మాట్లాడుతూ..అన్ని రెస్టారెంట్లవారు ఇలా చేసేలా పురికొల్పేందుకు మహేష్ దృష్టిహీన్ కళ్యాణ్ సంఘ్ నుంచి దృష్టి లోపం ఉన్న పిల్లలను పిలిపించి ట్రయల్ వేశాం. అది నిజంగా సక్సెస్ అయ్యింది. వారికోసం ఈ బ్రెయిలీ లిపి మెను కార్డ్లను చండీగఢ్ నుంచి తెప్పించి. అలాంటి పది కార్డ్లను ఇతర రెస్టారెంట్లకు పంపుతాం. ఇక నుంచి రెస్టారెంట్లన్నీంటిలో ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ మెనూ కార్డ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్ని ఇతర ప్రాంతాల్లో కూడా చేయాలనుకుంటున్నాం. రెస్టారెంట్లలో ఆహారాన్ని ఆర్డర్ చేసేందుకు దృష్టిలోపం ఉన్న కస్టమర్లు ఇక ఇబ్బంది పడరు, పైగా ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. అని చెప్పుకొచ్చారు భావన గనేదివాల్. ఇక సదరు గురుకృపా రెస్టారెంట్ యజమాని సిమ్రాన్ భాటియా మాట్లాడుతూ.. యంగ్ ఇండియా గ్రూప్ మమ్మల్ని సంప్రదించి బ్రెయిలీ లిపిలో మెను కార్డ్లను తయారు చేయమని అడిగింది. ఇది మాకు కొత్తగా అనిపించినా.. నచ్చింది. ఇంతవరకు అలాంటి సౌకర్యం ఏ రెస్టారెంట్లలోనూ లేదు. పిల్లలంతా అలా బ్రెయిలీ లిపి మెను కార్డులను చూసి ఆర్డర్ చేసినప్పుడూ చాలా ఆనందంగా అనిపించిందన్నారు రెస్టారెంట్ యజమాని భాటియా. అలాగే దృష్టిలోపం పిల్లలు సైతం తాము మెను కార్డ్ని చదవి ఆర్డర్ చేయడం సంతోషంగా అనిపించిందన్నారు. ఇది తమకి ఎవ్వరిపై ఆధారపడటం లేదన్న ఫీలింగ్ని ఇచ్చిందన్నారు. అందరికీ ఇలాంటి సౌకర్యం అందాలని కోరుకుంటున్నారు. ఏదీఏమైన ఇలాంటి ఆలోచన రావడమే గ్రేట్ అనుకున్నదే తడువుగా ఆచరించి చూపడం ఇంకా గ్రేట్ కదూ!. (చదవండి: వాట్! ఈజిప్టు మమ్మీ నుంచి పరిమిళాలు వెదజల్లే "సెంట్"! షాకింగ్ విషయాలు వెల్లండించిన శాస్త్రవేత్తలు!) -
మొదటి సారి నా భార్యను అక్కడే కలిసాను - ఆనంద్ మహీంద్రా
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అంశాలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల తన ట్విటర్ ఖాతా ద్వారా ఒక పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ సమావేశానికి ఇండోర్కు వచ్చిన మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ నగరంతో అతనికున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం భారీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అత్యధిక జనాభా కలిగిన ఈ నగరంలో పారిశ్రామికీకరణ కూడా డెవలప్ అవుతోంది. ఆరు పదుల వయసులో కూడా ఎంతో హుందాగా.. మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్నారు. కాగా ఇండోర్కి వెళ్లడం ఎల్లప్పుడూ మంచిది. నేను నా భార్యను మొదటిసారి కలిసిన నగరం ఇది. మళ్ళీ ఇప్పుడు RBI బోర్డు సమావేశం కోసం అంటూ ట్వీట్ చేశాడు. ఇదీ చదవండి: నమ్మలేని నిజం.. రూ. 99వేలకే ఎలక్ట్రిక్ కారు - టాప్ స్పీడ్ 120 కిమీ/గం ఇండోర్ ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా పేరు పొందింది. ఇప్పుడు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ రోజు రోజుకి కొత్త రూపురేఖలు పొందుతోంది. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 ఇండియా స్మార్ట్ సిటీస్ అవార్డ్స్లో ఇండోర్ ఉత్తమ 'నేషనల్ స్మార్ట్ సిటీ'గా ఎంపికైంది. Always good to get to Indore. It’s the city where I first met my wife. But here for a less romantic reason this time: The @RBI board meeting…😊 Indore still holds on to its title as India’s cleanest city. Right now it’s a bit like a giant construction site. But that’s to build a… pic.twitter.com/ocwIe6CRGB — anand mahindra (@anandmahindra) September 1, 2023 -
కుక్కల గొడవ కాస్తా ఎంత దూరం వెళ్లిందో చూడండి
భోపాల్: ఇండోర్లో ఒక కాలనీలో కుక్కలను వాకింగ్ కోసమని తీసుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు. కానీ ఆ కుక్కలు ఒక్కసారిగా కయ్యానికి కాలు దూశాయి. వాటి తరపున వకాల్తా పుచ్చుకుని వాటి యజమానులు కూడా గొడవపడ్డారు. అందులో ఒకరు ఆగ్రహంతో పక్కనే ఉన్న తన ఇంటిలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపగా కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆరుగురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇండోర్ కృష్ణ బాగ్ కాలనీలో రాత్రి 11 గంటలకు ఒక ఇరుకైన సందులో రజావత్, విమల్ అచల్ ఇద్దరూ తమ పెంపుడు కుక్కలతో వాకింగ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో రెండు కుక్కలు ఎదురుపడేసరికి పెద్దగా మొరుగుతూ తగువుకు దిగాయి. వాటికంటే గట్టిగా అరుపులతో రజావత్, అచల్ గొడవపడ్డారు. అంతలో ఏమైందో రజావత్ ఆగ్రహంతో పక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోని తన ఇంటిలోకి ఆవేశంగా వెళ్లి బాల్కనీలోకి వచ్చి 12-బోర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అచల్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తోపాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి బులెట్ గాయాలయ్యాయి. రజావత్ కు గన్ లైసెన్స్ ఉన్నందున అతడిని ఒక ప్రయివేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా నియమించింది. మృతుడు అచల్ కు నిపనియాలో కటింగ్ షాపు ఉంది. రజావత్ క్షణికావేశంలో చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రజావత్ ను, అతడి కుమారుడిని, వారి బంధువు శుభంను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. Indore | Dog Fight | कुत्ता घुमाने निकले दो पड़ोसियों के कुत्ते आपस में लड़ गए। दोनों पड़ोसियों के बीच भी हाताहपाई हो गई। इतने में एक पड़ोसी अपने घर गया, बंदूक लाया और गोली चला दी। तमाशा देख रहे 2 लोगों की मौत हो गई और 6 घायल हो गए। गोली चलाने वाले व्यक्ति गिरफ्तार: अमरेंद्र… pic.twitter.com/NhKKSLLBcZ — काश/if Kakvi (@KashifKakvi) August 18, 2023 ఇది కూడా చదవండి: మసాజ్ కోసం కక్కుర్తి పడ్డ బెజవాడ కుర్రాళ్ళు. -
కడుపులో కణితి..ప్రాణాంతకమా? కాదా?
ఇండోర్కి చెందిన ఓ 40 ఏళ్ల మహిళ కడుపులో ఏకంగా 15 కిలోల భారీ కణితిని గుర్తించారు వైద్యులు. రెండు గంటలకు పైగా క్లిష్టమైన శస్త్ర చికిత్స చేసి మరీ ఆ కణితిని తొలగించారు ఇండెక్స్ ఆస్పత్రి వైద్యబృందం. ఆ మహిళ ఆ భారీ కణితితో చాలా ఇబ్బంది పడింది. తినాలన్నా నడవాలన్న చాలా ఆయాసపడేది. గత కొంతకాలంగా ఆ ఇబ్బంది పడలేక చివరికి ఇండెక్స్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా ఈకణితికి గురించి తెలిసింది. చాలా పెద్ద సైజులో ఉందని తొలగించకపోతే ఏ క్షణమైన పగిలిపోయే అవకాశం ఉందని చెప్పడంతో శస్త్ర చికిత్స చేయించకుందామె. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ కణుతులు గురించి. చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య. అసలు ఎందువల్ల వస్తుంది? ఇది ప్రాణాంతకమా? తదితరాల గురించే ఈ కథనం. ఈ కణితి ఎందుకు ఏర్పడుతుందంటే.. శరీరం కొత్త కణాలను తయారు చేసేటప్పుడూ ఆటోమెటిక్గా పాత కణాలు చనిపోతాయి. కానీ ఒక్కొసారి ఆ కణాలు చనిపోకుండా పాతవాటి కంటే వేగంగా పెరగడం జరగుతుంది. అవన్నీ పోగులు మాదిరిగా ఏర్పడి పెరిగి కణితిలా ఏర్పడుతాయి. ఇది చిన్న పిల్లల నుంచి అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తాయి. కణితులు రావడానకి గల కారణాలు శరీరంలో పరివర్తన చెందిన బీఆర్సీఏ జన్యువుల వంటి జన్యు ఉత్పరివర్తనలు లించ్ సిండ్రోమ్ వంటి వారసత్వ పరిస్థితులు రొమ్ము క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల కుటుంబ చరిత్రలో ఉన్నా ధూమపానం బెంజీన్ వంటి టాక్సిన్స్కు గురికావడం హెచ్పీవీ వంటి వైరస్లుస ఊబకాయం సంకేతాలు లేదా లక్షణాలు కణితులు సంకేతాలు లేదా లక్షణాలు ⇒త్వరితగతిన అలసటకు గురవ్వడం ⇒జ్వరం ⇒తొందరగా బరువు తగ్గడం ⇒ఆకలి లేకపోవడం ⇒రాత్రిపూట సడెన్గా చెమటలు పట్టడం ⇒భరించలేని ఒకవిధమైన కడుపు నొప్పి అన్ని రకాల కణితులు ప్రమాదకరమా? ►నిపుణుల అభిప్రాయం ప్రకారం, గడ్డలు లేదా పెరుగుదలలను ఏర్పరిచే అసాధారణ కణాల సమూహాలు. అవి మన శరీరంలోని ట్రిలియన్ల కణాలలో దేనిలోనైనా ప్రారంభమవుతాయి. ►కణితులు పెరుగుతాయి. కానీ కొన్ని భిన్నంగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కోసారి క్యాన్సర్ లేదా ప్రాణాంతకమైనవిగా కూడా ఉంటాయి. మరికొన్ని క్యాన్సర్ కానివి లేదా అపాయకరం కానివి అనే విధానాలపై ఉధారపడి ఉంటాయి కణితులు ►ఈ కణితులు శరీరంపై ఎముకలు, చర్మం, గ్రంథులు, ఇతర అవయవాలతో సహ శరీరం అంతటా ఎక్కడైనా రావచ్చు. ఐతే అది ఎక్కడ ఏర్పడింది అనే దానిపై క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ►ఇలాంటి కణితుల సమస్యను ఎదుర్కొనకూడదంటే మంచి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తూ తగినంతగా వ్యాయామం కూడా చేసి ఫిట్నెస్గా ఉంటే ఈ సమస్య తలెత్తకుండా చూడొచ్చు లేదా ఈజీగా బయటపడొచ్చు. (చదవండి: పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!) -
కార్మికుల్లో నైపుణ్యాలు పెంచాలి
ఇండోర్: అత్యాధునిక సాంకేతికతలను వినియోగించడంలో ఉద్యోగులకు, కార్మికులకు తగిన శిక్షణ ఇవ్వాలని, వారిలో నైపుణ్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కొత్త తరం కార్మికులకు కొత్త తరం విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జి–20 దేశాల కార్మిక, ఉద్యోగ కల్పన శాఖ మంత్రుల సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో మొబైల్ వర్క్ఫోర్స్ అనేది వాస్తవ రూపం దాల్చబోతోందని ఉద్ఘాటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగో పారిశ్రామిక విప్లవ హయాంలో ఉద్యోగాల సృష్టికి టెక్నాలజీకి ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని గుర్తుచేశారు. నూతన ఉద్యోగాల కల్పనలో ఇకపైకూడా టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్తులో ఉద్యోగులకు, కార్మికులకు స్కిల్లింగ్, రీ–స్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ అనేది కీలకం కాబోతోందని అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతికతల వినియోగంలో నైపుణ్యాలు తప్పనిసరిగా పెంచుకోవాలని సూచించారు. వర్క్ఫోర్స్ను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్లో ‘స్కిల్ ఇండియా మిషన్’ ప్రారంభించామని తెలియజేశారు. నైపుణ్యాలను పంచుకోవాలి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని ఇతర దేశాలతో పంచుకొనే విషయంలో జి–20 దేశాలు చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. నైపుణ్యాల సమాచారం ఇచి్చపుచ్చుకోవాలన్నారు. భారత్లో కోవిడ్–19 వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫ్రంట్లైన్ ఆరోగ్య సిబ్బంది, ఇతర ఉద్యోగులు, కార్మికులు ఎనలేని సేవలు అందించారని, వారు తమ నైపుణ్యాలను, అంకితభావాన్ని ప్రదర్శించారని మోదీ కొనియాడారు. సేవా సంస్కృతిని చాటిచెప్పారని, సాటి మనుషుల పట్ల కరుణ కురిపించారని ప్రశంసించారు. నైపుణ్యం కలిగిన కార్మికులను ప్రపంచానికి అందించగల అతిపెద్ద దేశంగా ఎదిగే సామర్థ్యం భారత్కు ఉందని స్పష్టం చేశారు. సాంకేతికతలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని, టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాలను సృష్టించడంలో భారత్కు అపార అనుభవం ఉందని వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధిపై తాము ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. కౌశల్ వికాస్ యోజన కింద కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్ వంటి రంగాల్లో నైపుణ్యాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈ–శ్రమ్ పోర్టల్లో 21.8 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారని మోదీ తెలిపారు. -
ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే!
మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మనవాళ్ల ప్రతిభ అంతంతమాత్రమే. అందునా మహిళల నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్లో బరిలోకి దిగేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎంఎంఏ అనేది సాధారణమైన రెజ్లింగ్ కాదు. పటిష్టమైన దేహదారుడ్యంతో పాటు మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ తెలిసి ఉండాలి. ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యంతో పాటుగా అటు బాక్సింగ్.. ఇటు రెజ్లింగ్ను కలగలిపి ఈ క్రీడను ఆడాల్సి ఉంటుంది. గేమ్లో శరీరంలో ఏ భాగంలోనైనా పంచ్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి నడుము కింది భాగంలో దాడి చేయడం నిషేధం. అందుకే మొహాలు, ముక్కులు పగిలి రక్తాలు కారడం చూస్తుంటాం. ఒక్కోసారి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల ఆటగాళ్లు కోమాలోకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇక మన దేశం నుంచి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్(MMA Fight)లో మహిళల నుంచి వెలుగులోకి వచ్చింది రీతు ఫోగట్ మాత్రమే. మహవీర్ ఫోగట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈమె తొలుత రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్లో పోటీ పడింది. ఆ తర్వాత ఎంఎంఏ ఫైట్పై ఉన్న ఆసక్తి రీతు ఫోగాట్ను MMA Star ఫైటర్గా మార్చింది. తాజాగా ఆ జాబితాలోకి మరో ఆడపులి ప్రవేశించింది. ఆమె పేరే పూజా తోమర్. ఎంఎంఏ ఫైటర్గా దేశం తరపున స్టార్ హోదా పొందిన ఈమె తాజాగా ఎంఎఫ్ఎన్(Matrix Night Fight) టైటిల్ గెలిచి ఔరా అనిపించింది. జూలై 2న(ఆదివారం) ఇండోర్ వేదికగా జరిగిన MFN12(Matrix Night Fight) టైటిల్ పోరులో పూజా తోమర్ చాంపియన్గా నిలిచింది. రష్యాకు చెందిన మాజీ చాంపియన్ అనస్థిషియా ఫెఫనోవాను బౌట్లో ఓడించి స్ట్రావెయిట్ చాంపియన్గా అవతరించింది. మొత్తం నాలుగు రౌండ్లలో జరిగిన ఫైట్లో ఏ దశలోనూ పూజా తోమర్ తగ్గింది లేదు. ప్రతీ రౌండ్లో తన ప్రత్యర్థిపై పంచ్లతో విరుచుకుపడింది. నాలుగో రౌండ్కు వచ్చేసరికి అనస్థిషియా ఇక ఆడలేనంటూ పక్కకు తప్పుకోవడంతో పూజా తోమర్ విజేతగా నిలిచినట్లు రిఫరీ ప్రకటించారు. ఆమె ప్రదర్శనను టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్ సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రత్యక్షంగా వీక్షించారు. దిశా పటానీ, టైగర్ ష్రాఫ్, శిఖర్ ధావన్లు గేమ్ ముగిసిన అనంతరం ఆమెను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. Hard work pays off😊💪 Thanks to @mfn_mma @ayeshashroff @kishushroff for the opportunity. Thanks to my coach @thefighterscoach for motivating and guiding me. Thanks to my Family and Friends for supporting me. Thanks to my Fans for all their love, support and care. @somafightclub pic.twitter.com/zqfL0WQ9CH — puja tomar (@pujatomar19) July 2, 2023 చదవండి: 'ఆ రూమ్లు మెడిటేషన్కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' #Ben Stokes: స్టోక్స్ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా పత్రిక.. ఫోటో వైరల్ -
ఫ్రెండ్ అంకుల్ కోసం: ఇండోర్ అమ్మడి ఘనత
సాక్షి, ముంబై: మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 20 ఏళ్ల అస్మీ జైన్ ప్రఖ్యాత యాపిల్ WWDC23 స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ని గెల్చుకుంది. స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి అద్భుతమైన ఒరిజినల్ యాప్ను రూపొందించనందుకుగాను ఈ ఘనతను దక్కించుకుంది. అస్మి జైన్తో పాటు, ఈ ఏడాది స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ విజేతలలో మార్టా మిచెల్ కాలియెండో , యెమి అజెసిన్ కూడా ఉన్నారు. వార్షిక వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో (ఈసంవత్సరం జూన్ 5న)కి ముందు, యాపిల్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి అసలైన యాప్ ప్లేగ్రౌండ్ చాలెంజ్ను నిర్వహిస్తుంది. గ్లోబల్ యాపిల్ డెవలపర్ కమ్యూనిటీకి WWDC23 ఈవెంట్ను వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఛాలెంజ్ విజేతలకు కూడా అనుమతి ఉంటుంది. బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న తన స్నేహితురాలి మేనమామకు సహాయం చేసేలా యాప్ను రూపొందించి ఈ అవార్డును దక్కించుకుంది. బ్రెయిన్ సర్జరీ కారణంగా కంటి అంగ వైకల్యంతో పాటు ముఖం పక్షవాతానికి గురైంది. దీంతో ఇండోర్లోని మెడి-క్యాప్స్ యూనివర్శిటీకి చెందిన జైన్ రంగంలోకి దిగింది. స్క్రీన్ చుట్టూ కదులుతున్న బంతిని ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్న యూజర్కంటి కదలికలను ట్రాక్ చేయడానికి యాప్ ప్లేగ్రౌండ్ని డిజైన్ చేసింది. దీని ప్రాథమిక ఉద్దేశ్యం కంటి కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడటం. అయితే వివిధ రకాల కంటి పరిస్థితులు, గాయాలైన సందర్భాల్లో కూడా దీనిని ఉపయోగించవచ్చని జైన్ భావిస్తోంది. ఇది ప్రభావవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడడమే తన తదుపరి లక్ష్యం అని కూడా చెప్పింది. (ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు) హెల్త్ చాలెంజెస్ ఎదుర్కొనేలా కోడింగ్ని ఉపయోగించి యాపల్ ప్లే గ్రౌండ్ రూపకల్పనలో పట్ల జైన్కు అభిరుచే ఆమెను ఈ స్థాయిలో ఉంచింది. అలాగే జైన్ తోటి విద్యార్థులతో కలిసి విశ్వవిద్యాలయంలో ఒక ఫోరమ్ను కూడా స్థాపించారు. ఈ ప్లాట్ఫారమ్ సపోర్ట్ సిస్టమ్గా పనిచేస్తుంది. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ఎవరిదో తెలుసా? ) కాగా ప్రతీ ఏడాది వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో భాగంగా, స్విఫ్ట్ కోడింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి అసలైన యాప్ రూపొంచే చాలెంజ్ యాపిల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకిస్తుంది. గతంతో పోలిస్తే విజేతల సంఖ్యను 350 నుంచి 375కి పెంచామనీ, తద్వారా మరింత మంది ఔత్సాహిక విద్యార్థులు ఈ ఈవెంట్లో చేరవచ్చని భావించినట్టు తెలిపింది. 30 కంటే ఎక్కువ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, వినోదం, పర్యావరణం లాంటి విభిన్న టాపిక్స్ ఇందులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. మరిన్ని స్ఫూర్తిదాయక, విజేతల కథనాలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి : సాక్షిబిజినెస్ -
Video: డిన్నర్కు వెళ్లిన జంటపై దాడి.. అడ్డుకున్న వారిపై..
భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న యువతియువకుడిని అడ్డుకున్న కొందరు దుండగులు వారిపై దాడి చేశారు. ఈ క్రమంలో యువతి వారిని ఎంత వారించినా.. దుండగులు రెచ్చిపోయారు. ఆ జంటను రక్షించిన ఇద్దరిని ఆగంతకులు కత్తితో పొడిచారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. ఇండోర్లో యువతి, యువకుడు విందు కోసం హోటల్కు వచ్చారు. వారు డిన్నర్ చేసిన అనంతరం.. హోటల్ నుంచి బయటకు రాగానే వారిని కొందరు దుండగులు అడ్డుకున్నారు. స్కూటీ మీద ఉన్న వారిద్దరిని ఓ గుంపు వెంబడించి వారిని చుట్టుముట్టింది. ఇంతలో కొందరు.. అతడితో ఎందుకు కలిసి తిరుగుతున్నావని ఆమెను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆ జంటను రక్షించేందుకు అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులు ముందుకు వచ్చారు. దీంతో, మరింత రెచ్చిపోయిన దుండగుటు.. వారిద్దరినీ కత్తితో పొడిచారు. అయితే, దుండగుల దాడి అనంతరం డీసీపీ రాజేష్ రఘువంశీ మాట్లాడుతూ.. ఆమె తన పేరెంట్స్ అనుమతితోనే(వారికి సమాచారం ఇచ్చిన తర్వాతే) ఆ వ్యక్తితో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చానని చెప్పింది. వారిని అడ్డుకున్న దుండగులపై సదరు యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతలో జంటను రక్షించడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గుంపులో నుంచి ఎవరో కత్తితో పొడిచారు. దీంతో, వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. In Indore, MP MusIim mobs beat a couple because the girl was a MusIim & the boy was a Hindu. It's becoming a new normal! Imagine the amount of national-international outrage if any Hindu group starts doing this with M boy & H girl couples.. pic.twitter.com/Is0nis1QbJ — Mr Sinha (@MrSinha_) May 26, 2023 ఇది కూడా చదవండి: మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్.. కవిత, కేజ్రీవాల్కు షాక్ -
భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి..
ఓ వ్యక్తి తన భార్య కోసం తన కన్న కొడుకునే చంపేందుకు యత్నించాడు. అభం శుభం తెలియని చిన్నారి అని కూడా లేకుండా దారుణమైన అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ షాకింగ్ గటన మధ్యప్రదేశ్లో ఇండోర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..శశిపాల్ అనే వ్యక్తి మొదటి భార్య కొడుకు ప్రతీక్ ఉన్నాడు. ఐతే అతని మూడోవ భార్య ఈ చిన్నారి విషయమై అతనిపై కోపంతో పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో ఉంటోంది. తనకు ఈ చిన్నారి అంటే ఇష్టం లేదని పదే పదే చెప్పడమే గాక అతన్ని కడతేర్చడం లేదా ఎక్కడికైన పంపిస్తేనే తాను తిరిగి వస్తానని చెప్పాంది. దీంతో విసిపోయిన శశిపాల్ ఈ చిన్నారి లేకపోతేనే తన జీవితం హాయిగా ఉంటుందని భావించి..సదరు చిన్నారిని చంపేందుకు సిద్ధమయ్యాడు. నిజానికి ప్రతీక్ తన తాతయ్య, నానమ్మలతో పడుకునేవాడు. ఐతే తన తండ్రి కూలర్ వద్ద పడుకుందామని చెప్పడంతో.. నాన్నతో హాయిగా కూలర్ దగ్గర పడుకోవచ్చిని ఎంతో ఎగ్జాయిట్మెంట్తో వెళ్లాడు. అయితే ఆ కర్కశ తండ్రి ఆ చిన్నారి నిద్రపోయిన తర్వాత టీవీ వాల్యూమ్ బాగా పెంచి..ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా తన మూడో భార్యకు తెలిపేలా వీడియో తీసి మరీ పంపించాడు. ఐతే ఆమె అతడి వాట్సాప్ నెంబర్ని బ్లాక్ చేయడంతో ఆమె ఆ వీడియోని చూడలేకపోయింది. ఆ తర్వాత శశిపాల్ అక్కడ నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు శశిపాల్ని అతని మూడో భార్య పాయల్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. శశిపాల్ మొబైల్లో ఆ ఘటనకు సంబంధించిన వీడియో లభించిందని పోలీసుల తెలిపారు. కానీ అతడి భార్య పాయల్ మాత్రం ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. తానెప్పుడూ తన కుమారుడిని చంపమని తన భర్తకు చెప్పలేదని వాపోయింది. శశిపాల తల్లిదండ్రులు తన తండ్రితో పడుకోవడానికి ఎంతో ఆనందంగా ప్రతీక్ వెళ్లాడని, అదే చివరిసారి అవుతుందని ఊహించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: సీఎం ప్రసంగిస్తుండగా.. ఏడాది బాలుడిని స్టేజ్పైకి విసిరేసిన తండ్రి) -
Munawar Faruqui: స్టాండప్ కమెడియన్కి ఊరట
ఢిల్లీ: స్టాండప్ కమెడియన్, ర్యాపర్ మునావర్ ఫరూకీకి సుప్రీం కోర్టులో ఊరట దక్కింది. హిందూ దేవుళ్లను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో దేశవ్యాప్తంగా మునావర్కి వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లన్నింటిని ఇండోర్(మధ్యప్రదేశ్)కు బదిలీ చేయాని సోమవారం కోర్టు ఆదేశాలు జారీచేసింది. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఓ షోలో మునావర్ వ్యాఖ్యలు చేశాడని, మతపరమైన మనోభావాలు దెబ్బతీశాడని దేశవ్యాప్తంగా పలు చోట్ల ఫిర్యాదులు అందాయి. ఈ వ్యవహారం పెను దుమారమే రేపింది. ఈ మేరకు బెయిల్ మీద బయట ఉన్న మునావర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. మునావర్కు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్లను ఇండోర్కు బదిలీ చేయాలని బెంచ్ ఆదేశించింది. అంతేకాదు.. ఫరూకీకి కల్పించిన మధ్యంతర బెయిల్ను మరో మూడు వారాలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. 2021, జనవరి1వ తేదీన ఇండోర్లోని 56 దుకాణ్ ఏరియాలోని ఓ కేఫ్లో న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. మునావర్ ఓ కామెడీషో నిర్వహించాడు. ఈ షోలోనే మునావర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు ఆ సమయంలో ఉన్న కరోనా ఆంక్షలను సైతం ఉల్లంఘించి మరీ షోను నిర్వహించినట్లు తేలింది. దీంతో మునావర్పై పలు చోట్ల ఫిర్యాదు వెళ్లాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు మునావర్కు బెయిల్ తిరస్కరించగా.. సుప్రీం కోర్టు మాత్రం 2021, ఫిబ్రవరి 5వ తేదీన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది. -
పోలీస్టేషన్కు చెత్త పంచాయితీ..పారిశుధ్య కార్మికులపై తుపాకీ ఎక్కుపెట్టి..
చెత్త విషయంలో తలెత్తిన వివాదం కాస్త పోలిస్టేష్టన్లో ఫిర్యాదు చేసేంత వరకు వెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఇండోర్కు చెందిన వ్యాపారవేత్త, పెట్రోల్ పంప్ యజమాని మహేష్ పటేల్కి పారిశుధ్య కార్మికులకు మధ్య చెత్త విషయమై వివాదం తలెత్తింది. అతడి ఇంటి వద్ద చెత్తను సేకరిస్తున్నప్పుడూ ఈ ఘటన చోటు చేసుకుంది. పటేల్ భార్య పొడి, తడి చెత్తను వేరు చేయనందున గొడవ జరిగింది. దీంతో ఆమె భర్త పటేల్, అతడి కుమారుడు పారిశుధ్య కార్మికులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో ఆ మహేష్ లోపలి నుంచి తుపాకీ తీసుకుని వచ్చి బెదిరింపులకు గురిచేశాడు. దీంతో అక్కడ నుంచి పారిశుధ్య కార్మికులు ఒక్కసారిగా పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారి సంఘటనా స్థలానికి చేరకుని ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చారు కూడా. గానీ చెత్త వ్యాన్లను నడుపుతున్న డ్రైవర్ల సంఘం సభ్యులు బెదిరింపులకు గురైన పారిశుధ్య కార్మికులతో కలిపి పోలీసులను ఆశ్రయించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారి బీజేపీ మాజీ శాసనసభ్యుడు మనోజ్ పటేల్ బంధువు కావడంతోనే పోలీసులు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోలేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో స్పందించిన పోలీసు అధికారి ఆశిష్ మిశ్రా ఆ ఘటనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముందుగా అక్కడ అసలేం జరిగిందే నిర్థారించడానికి ఫిర్యాదుదారుణ్ణి సంప్రదించి తదుపరి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. (చదవండి: పులి భయంతో హడలిపోతున్న గ్రామాలు..దెబ్బకు కర్ఫ్యూ, పాఠశాలలు మూసివేత) -
అమ్మాయిల దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేత వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకరమైన బట్టలు(డర్టీ క్లాత్స్) ధరించే అమ్మాయిలు రామాయణంలో శూర్పణఖ మాదిరి కనిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గామారింది. మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో మహవీర్ జయంతి సందర్భంగా జైన సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను ఆయన తప్పుపట్టారు. రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులు కనిపిస్తుంటారని.. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.. వారిని చూస్తుంటే గట్టిగా చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలను మనం దేవతలా ఆరాధిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అసభ్యకరంగా దుస్తులు ధరించిన కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే శూర్పణఖలా కనిపిస్తారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్దులు నేర్పాలి’ అని సూచించారు. అయితే విజయ్వర్గియా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల ద్వేషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలతో పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ నేతలు ఇలా మాట్లాడటం సరికాదని.. బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కైలాష్ విజయవర్గియా ఇంలాటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదంలో ఇరుకున్నారు. చదవండి: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం.. BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1 — Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023 -
ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత
మధ్యప్రదేశ్ ఇండోర్లో 36 మందిని బలిగొన్న ఆలయ ప్రాంగణంలోకి బుల్డోజర్లు ప్రవేశించాయి. సోమవారం ఉదయం బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ప్రమాదానికి కారణమైన అక్రమ కట్టడాన్ని కూల్చివేతను అధికారులు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కూల్చివేతను ఎవరూ అడ్డుకోకుండా కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు ఇండోర్ మున్సిపల్ అధికారులు సోమవారం రంగంలోకి దిగారు. కూల్చివేతలకు ఆటంకాలు ఎదురుకాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు.. సుమారు నాలుగు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్సిబ్బంది అక్కడ మోహరించారు. జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా, ఇండోర్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు దగ్గరుండి ఆ కూల్చివేతలను పర్యవేక్షించారు. #WATCH | Madhya Pradesh: Indore municipality deploys bulldozer & demolishes illegal structure at Indore temple where 36 people died after the stepwell collapse there last week. pic.twitter.com/gpRJB6zWhN — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 3, 2023 ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు.. ఆలయంలో మెట్లబావిని మూసేస్తూ కాంక్రీట్స్లాబ్వేయగా.. శ్రీరామ నవమి నాడు ఆ స్లాబ్ ఉన్న ప్రాంతంలోనే యాగం చేయడం, భక్తుల బరువును మోయలేక ఆ పైకప్పు కూలిపోయి భక్తులు బావిలో పడిపోయి మరణించడం తెలిసిందే. స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో.. అది అక్రమ కట్టడం అని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ కిందటి ఏడాది ఆలయ ట్రస్ట్కు నోటీసులు పంపింది. అంతేకాదు.. ఆ పైభాగానికి కూల్చివేసేందుకు మార్క్ కూడా చేసింది. కానీ, ఆ సమయంలో మతపరమైన మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఆలయ ట్రస్ట్ నిరసన వ్యక్తం చేయడంతో.. అధికారులు వెనక్కి తగ్గారు. ఒకవేళ అధికారులు ఆనాడే దూకుడుగా స్పందించి ఉంటే.. నేడు పదుల సంఖ్యలో ప్రాణాలు పోయి ఉండేవి కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.. ఇండోర్ స్నేహ్ నగర్లో పూర్తిగా ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలోనే ఆ ఆలయం నడుస్తోంది. రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న మెట్ల బావిని కేవలం నాలుగు ఐరన్ గ్రిడ్స్తో.. పైన సన్నని కాంక్రీట్ లేయర్, టైల్స్తో కప్పేసి పూజల కోసం ట్రస్ట్ నిర్వాహకులు వినియోగిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ అక్రమ కట్టడంతో పాటు చుట్టుపక్కల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సైతం కూల్చేస్తున్నారు అధికారులు. మరోవైపు.. ఇండోర్ ఆలయ ప్రమాద ఘటనతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మేల్కొంది. రాష్ట్రంలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ఆలయ కట్టడాలను, బావుల్ని గుర్తించి.. తక్షణమే వాటిని మరమ్మత్తులు చేపట్టాలని, అలాగే ఆలయాల ప్రాంగణంలో అక్రమ కట్టడాలు ఉంటే గుర్తించి తక్షణమే వాటిని తొలగించడం లేదంటే పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదివారం ప్రత్యేక సమావేశంలో ఆదేశించారు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. -
ఈ తోడికోడళ్లు రూ.600 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు..
రికా జైన్, కిమీ జైన్ ఇద్దరూ తోడికోడళ్లు.. విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. వీరు 2012లో ప్రీమియం హోటల్ టాయిలెట్రీ (టాయ్లెట్లో ఉపయోగించే సబ్బులు, షాంపులు, హెయిర్ కండీషనర్లు, టూత్ పేస్టులు, టాయ్లెట్ పేపర్లు తదితర వస్తువులు) తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. (క్రిక్పే లాంచ్ ఆలస్యమైంది.. క్షమించండి) కరోనా మహమ్మారి సమయంలో వారు జీవనశైలికి సంబంధించిన వస్తువుల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఈ తోడికోడళ్లకు కెనడాకు చెందిన హాస్పిటాలిటీ ఉత్పత్తుల తయారీ సంస్థలో భాగస్వామ్యం ఉంది. తక్కువ వ్యవధిలోనే వారి వ్యాపార టర్నోవర్ రూ.600 కోట్లకు పెరిగింది. ఇంతకీ వాళ్ల కంపెనీ పేరు ఏంటంటే.. ‘కిమిరికా’. తన భర్త రజత్ జైన్తో కలిసి ఓ హోటెల్కు వెళ్లినప్పుడు రికా జైన్ అక్కడి గదిలోని టాయిలెట్రీ వస్తువులను గమనించారు. వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించారు. అప్పుడే ఆమెకు ఈ వ్యాపార ఆలోచన వచ్చింది. వెంటనే మోహిత్, కిమీ జైన్లతో కలిసి టాయిలెట్రీ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత హంటర్ ఎమినిటీస్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కిమిరికా హంటర్ ఇంటర్నేషనల్, కిమిరికా లైఫ్ స్టైల్ వ్యాపారాల వార్షిక టర్నోవర్ రూ.600 కోట్లు. (‘మారుతీ ఆల్టో 800’ను ఇక కొనలేరు! ఎందుకంటే...) కిమీ జైన్ మధ్య ప్రదేశ్లోని ఒక గ్రామంలో జన్మించారు. తర్వాత 1991లో ఆమె చదువు కోసం కుటుంబమంతా ఇండోర్కు వచ్చేశారు. ఇక రికా ఇండోర్లోనే పుట్టి పెరిగారు. సోదరులైన మోహిత్, రజత్లతో వీరికి వివాహమైంది. కిమీ ఈ-కామర్స్లో ఎంబీఏ పూర్తి చేశారు. రికా ఫార్మసీ డిగ్రీ చేశారు. వీరి కంపెనీలో 600 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది మహిళలే. వారి విక్రయాలలో ఎక్కువ భాగం ఆన్లైన్ ఛానెల్ల నుంచి వస్తుంది. వారు తమ డైరెక్ట్ టు కస్టమర్ లైఫ్స్టైల్ బ్రాండ్ను ప్రారంభించిన తర్వాత మొదటి ఆరు నెలలూ కేవలం 2500 మంది కస్టమర్లు మాత్రమే ఉండేవారు. దీంతో లైఫ్స్టైల్ బ్రాండ్ను ప్రారంభించాలనే తమ నిర్ణయం సరైనదేనా అని అప్పట్లో ఆలోచనలో పడ్డారు. అయితే లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ అమ్మకాలకు ప్రోత్సాహం లభించడంతో దీనిపైనే తమ శక్తిని కేంద్రీకరించి విజయమంతమయ్యారు. రాబోయే రోజుల్లో ఆఫ్లైన్ స్టోర్లకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఈ తోడికోడళ్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) -
గుడిలో ఘోరం.. 35కి చేరిన మృతుల సంఖ్య
ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 35కి చేరింది. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా.. మెట్లబావిను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలి ఈ ఘోరం జరిగిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మెట్ల బావిలో భక్తులు పడిన ఘటనలో ఇప్పటిదాకా 35 మంది దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యల ద్వారా 14 మందిని రక్షించగలిగాం. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మరికొందరు కనిపించడం లేదని వాళ్ల బంధువులు అంటున్నారు. కానీ, అధికారుల దగ్గర ఒక్కరే కనిపించకుండా పోయారన్న సమాచారం ఉంది. అందుకే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అని ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా చెప్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మొదలైన సెర్చ్ ఆపరేషన్.. ఇంకా కొనసాగుతూనే ఉందని మెజిస్ట్రేట్ వెల్లడించారు. ఇండోర్ స్నేహ్నగర్లో పాత కాలనీల నడుమ ఓ ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలో నడుస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం. మెట్ల బావి Stepwell లోతు 40 అడుగులుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అయితే ఇండోర్ మున్సిపల్ అధికారులు మాత్రం కిందటి ఏడాది ఏప్రిల్లోనే ఆలయ ట్రస్ట్కు నోటీసులు జారీ చేశామంటూ అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అక్రమ కట్టడాలను గానూ తాము నోటీసులు పంపినట్లు చెప్తున్నారు. కానీ, ట్రస్ట్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. మతపరమైన విషయాల్లో ఇండోర్ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా.. మెట్లబావిని కవర్ చేస్తూ వేసిన కాంక్రీట్ స్లాబ్పై ఆలయ నిర్వాహకులు హోమం నిర్వహించారు. అయితే అది తేలికపాటి స్లాబ్ అని, 30 నుంచి 40 మందికి మించిన బరువును మోయలేదంటున్నారు స్థానికులు. అందుకే కుప్పకూలి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మరోవైపు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది. -
శ్రీరామనవమి వేడుకల్లో ప్రమాదం.. బావిలో పడి 13 మంది మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా.. ఓ ఆలయంలో పైకప్పు కూలిపోవడంతో అక్కడున్న భక్తులంతా.. కింద ఉన్న మెట్ల బావిలో పడిపోయారు. స్నేహ నగర్ సమీపంలోని పటేల్ నగర్ శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ మందిర్లో గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 30 మందికి పైగా భక్తులు బావిలో పడిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది భక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 17 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు. పైకప్పు శిథిలాల కింద బావిలో భక్తులు ఇరుక్కుని ఉండడంతో.. వాళ్లను రక్షించడం కష్టతరంగా మారిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తొలుత స్థానికులు వాళ్లను బయటకు తీసేందుకు యత్నించారు. కొందరిని రక్షించగలిగారు. ఈలోపు పోలీసులు, వైద్య సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. #WATCH | Madhya Pradesh: Many feared being trapped after a stepwell at a temple collapsed in Patel Nagar area in Indore. Details awaited. pic.twitter.com/qfs69VrGa9 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023 -
ఆరు అంతస్తుల హోటల్లో భారీ అగ్నిప్రమాదం
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బొప్పాయి ట్రీ హోటల్లో భారీ అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఆరు అంతస్తుల హోటల్ ఎగిసిపడిన మంటలను సిబ్బంది ఆర్పేందుకు యత్నించినా నియంత్రణలోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఆరో అంతస్తులో వ్యక్తులు చిక్కుకుపోవడంతో వారిని నిచ్చెన, బెడ్షీట్ల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మందిని రక్షించారు. హోటల్లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో మంటలు భవనాన్ని చుట్టుముట్టిన్నట్లు పేర్కొన్నారు అధికారులు. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా పొగ భవనాన్ని కమ్మేయడంతో ఊపిరాడక పలువురు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ముమ్మరంగా సహాయం చర్యలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఐతే ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు అధికారులు. ఈ మేరకు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు Fire at a multi-storeyed hotel in Rau area of Indore was triggered possibly from hotel's kitchen this morning. Fire brigade and SDERF personnel evacuated 35 plus staff and guests, many of them through the windows. @NewIndianXpress @TheMornStandard @santwana99 @Shahid_Faridi_ pic.twitter.com/gQAtXV7wOR — Anuraag Singh (@anuraag_niebpl) March 29, 2023 (చదవండి: కాంగ్రెస్ కుట్రలో రాహుల్ గాంధీ బాధితుడా? కేంద్ర మంత్రి సెటైర్) -
బీసీసీఐ దెబ్బకు మాట మార్చిన ఐసీసీ!
అంతర్జాతీయ క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషించే ఐసీసీ బీసీసీఐ దెబ్బకు మాట మార్చింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పిచ్కు ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఒప్పుకోని బీసీసీఐ అప్పీల్కు వెళ్లింది. బీసీసీఐ అభ్యర్థన మేరకు ఇండోర్ పిచ్ రేటింగ్ను ఐసీసీ సవరించింది. గతంలో ఇచ్చిన ‘పూర్’ రేటింగ్ని సవరించి ''బిలో యావరేజ్(Below Average)''గా మార్చింది. ఈ మేరకు ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ సభ్యుడు రోజర్ హర్పర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇండోర్ టెస్టులో ఆసీస్ పది వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. పిచ్పై బంతి విపరీతంగా టర్న్ కావడంతో రెండు రోజుల్లోనే 30 వికెట్లు పడ్డాయి. ఇందులో 25 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. దీంతో పిచ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. మూడో రోజు లంచ్ లోపే ఆట ముగియడంతో మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి రిపోర్ట్ పంపించాడు. అందులో.. ''పిచ్ చాలా పొడిగా ఉంది. బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించలేదు. మొదటి నుంచే స్పిన్నర్లకు అనుకూలించింది'' అని తెలిపాడు. దాంతో ఇండోర్ పిచ్ ‘అధ్వానం’గా ఉందని ఐసీసీ పేర్కొంది. అంతేకాదు మూడు డీమెరిట్ పాయింట్లు కూడా విధించింది. చదవండి: చివరి టి20లో ఓడినా ఆఫ్గన్ది చరిత్రే ఆకుల శ్రీజ సంచలనం.. ఒకేసారి మూడు టైటిల్స్ -
'ఇండోర్కే మూడిస్తే.. మరి గబ్బాకు ఎన్నివ్వాలి?'
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో టెస్టుకు వేదికైన ఇండోర్ పిచ్ నాసిరకంగా ఉందని పేర్కొన్న ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు విధించిన విషయం తెలిసిందే. రెండురోజుల్లోనే 30 వికెట్లు కూలడం.. మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోవడం విమర్శలకు దారి తీసింది. అయితే ఐసీసీ డీమెరిట్ పాయింట్లు విధించడంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''ఇండోర్ పిచ్కు ఐసీసీ మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడం నాకు నచ్చలేదు. అయితే ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. గతేడాది నవంబర్లో బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా జరిగిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ రెండురోజుల్లోనే ముగిసింది. మరి ఈ పిచ్కు ఐసీసీ ఎన్ని డీమెరిట్ పాయింట్లు కేటాయించింది.? అప్పుడు మ్యాచ్ రిఫరీ ఎవరు?'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. గతేడాది నవంబర్లో గబ్బాలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఆ మ్యాచ్లో ఆతిథ్య ఆసీస్ విజయం సాధించింది.ఆ తర్వాతి టెస్టుల్లోనూ గెలుపొందిన ఆసీస్ సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. బౌలర్లకు ఎక్కువగా సహకరించిన గబ్బా పిచ్కు ఐసీసీ అప్పట్లో ఒక్క డీమెరిట్ పాయింట్తో తక్కువ యావరేజ్తో రేటింగ్ ఇచ్చింది. ఇదే విషయాన్ని లేవనెత్తిన గావస్కర్ ఐసీసీ వైఖరిని తప్పుబట్టాడు. ఇక మూడో టెస్టులో టీమిండియా అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 2012 నవంబర్ తర్వాత సొంత గడ్డపై భారత్కు ఇది టెస్టుల్లో తొలి ఓటమి కావడం విశేషం. 76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రీలియా తొలి సెషన్లోనే విజయం సాధించింది. మార్నస్ లబుషేన్ (28), ఓపెనర్ ట్రెవిస్ హెడ్ (49) ధనాధన్ ఆడి మ్యాచ్ ముగించారు. 11 వికెట్లు తీసిన నాథన్ లియాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో, నాలుగు టెస్టుల సిరీస్లో ఆసీస్ బోణీ కొట్టింది. భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అహ్మదాబాద్ స్టేడియంలో మార్చి 9న నాలుగో టెస్టు జరగనుంది. చదవండి: 'ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం' -
BGT 2023: పిచ్ పరమ చెత్తగా ఉంది.. అతడు లేడు కాబట్టే ఇలా: టీమిండియా దిగ్గజం
India vs Australia, 3rd Test: ‘‘భారత పిచ్లపై ఇరవై వికెట్లు తీయడమంటే అంత సులువేమీ కాదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి స్టార్ పేసర్లు లేకుండా అస్సలు సాధ్యపడదు. అనుభవం తక్కువైనప్పటికీ మహ్మద్ సిరాజ్ ప్రభావం చూపగలడు. కానీ అనుకున్న ఫలితాలు రాబట్టాలంటే ఇప్పుడున్న బౌలింగ్ విభాగంతో సాధ్యం కాదు. ఈ సిరీస్కు సంబంధించి మన బౌలింగ్ విభాగం మరీ అంత పటిష్టంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే, పిచ్ సహకారం ఉంటే టీమిండియా 20 వికెట్లు తొందరగానే పడగొట్టగలదు. ఇలాంటి పిచ్లు తయారు చేయడం వెనుక అసలు కారణం ఇదేనేమో!’’ అని టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ అన్నాడు. ఒకవేళ బుమ్రా జట్టుతో ఉంటే గనుక కాస్త మెరుగైన పిచ్ తయారు చేసేవాళ్లని అభిప్రాయపడ్డాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరే క్రమంలో బుమ్రా వంటి స్టార్ల గైర్హాజరీలో ఇలాంటి పిచ్లు తయారు చేయడం కంటే టీమిండియాకు మరో అప్షన్ లేదని పేర్కొన్నాడు. ‘‘ఒకవేళ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంటే.. పిచ్ వేరేలా ఉండేదేమో! నిజానికి సొంతగడ్డపై స్పిన్నర్లే టీమిండియాకు బలం. అందుకే వాళ్లు ఇలా చేసి ఉంటారు. ఫ్లాట్ పిచ్లపై బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించడం ఖాయం. కానీ ఈ పిచ్లు బ్యాటర్ల సహనానికి పరీక్షగా నిలిచాయి’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు. ఏదేమైనా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో నాగ్పూర్, ఢిల్లీ పిచ్ల కంటే ఇండోర్ పిచ్ పరమచెత్తగా ఉందని గావస్కర్ కుండబద్దలుకొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అత్యంత నాసికరంగా పిచ్ ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీమిండియా తొలి రెండు టెస్టుల్లో గెలవగా... మూడో మ్యాచ్లో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇండోర్లో తొలి రోజు నుంచే బంతి స్పిన్కు టర్న్ కావడంతో బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు కష్టాలు తప్పలేదు. ఆసీస్ స్పిన్నర్లు విజృంభించగా.. భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యూహాలు పక్కాగా అమలు చేసి.. గెలుపునందుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇండోర్ పిచ్ అత్యంత నాసికరంగా ఉందని ఐసీసీ రేటింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: పరువు తీసుకున్న బంగ్లా; క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూ నోరు మూసుకుని ఆటపై దృష్టి పెట్టండి.... టీమిండియాపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఘాటు వ్యాఖ్యలు -
'ఇండోర్ పిచ్ అత్యంత నాసిరకం'
ఇండోర్ వేదికగా ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా టీమిండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే ముగిసిన మ్యాచ్లో ఉపయోగించిన పిచ్పై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆది నుంచి స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్పై 30 వికెట్లు కేవలం రెండురోజుల్లోనే కూలాయి. ఇందులో 26 వికెట్లు ఇరుజట్ల స్పిన్నర్లు తీయగా.. మిగతా నాలుగు వికెట్లు మాత్రమే పేసర్ల ఖాతాలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇండోర్ పిచ్పై సీరియస్ అయింది. ఆస్ట్రేలియా, టీమిండియా మూడో టెస్టుకు ఉపయోగించిన ఇండోర్ పిచ్ను అత్యంత చెత్తదని ఐసీసీ పేర్కొంది. పిచ్ను మరి నాసిరకంగా తయారు చేశారని.. అందుకే హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. టెస్టుకు ఉపయోగించిన పిచ్పై ఐసీసీ పిచ్ అండ్ ఔట్ఫీల్డ్ మానిటరింగ్ ప్రక్రియ తర్వాత వచ్చిన ఫలితం ఆధారంగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన క్రిస్ బ్రాడ్ ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్లతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ''పిచ్ చాలా డ్రైగా ఉంది. కనీసం బ్యాట్, బంతికి బ్యాలెన్స్ లేకుండా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ప్రారంభమయినప్పటికి క్రమంగా బౌన్స్ వస్తుందన్నారు. కానీ ఆ ప్రక్రియ మ్యాచ్లో ఎక్కడా జరగలేదు. ఎంతసేపు పిచ్ స్పిన్నర్లకు అనుకూలించిందే తప్ప సీమర్లకు కాస్త కూడా మేలు చేయలేదు. బంతి కనీసం బౌన్స్ కూడా కాలేదు. క్యురేటర్ పిచ్ను మరీ నాసిరకంగా తయారు చేశారు'' అంటూ రిఫరీ క్రిస్ బ్రాడ్ ఐసీసీకి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ఐసీసీ పిచ్ అండ్ ఔట్ఫీల్డ్ మానిటరింగ్ ప్రాసెస్ ఇండోర్ పిచ్కు మూడు డీ-మెరిట్ పాయింట్లు కోత విధించింది. నివేదికను బీసీసీఐకి ఫార్వర్డ్ చేసింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే 14 రోజుల లోపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసుకోవచ్చు. '' ఐదు అంతకంటే ఎక్కువ డీ-మెరిట్ పాయింట్లు వస్తే స్టేడియంపై నిషేధం పడుతుంది. కానీ నివేదిక ప్రకారం హోల్కర్ స్టేడియానికి మూడు డీ-మెరిట్ పాయింట్లు విధించాం. మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే మాత్రం ఐదేళ్ల పాటు స్టేడియంపై నిషేధం పడే అవకాశం ఉందని'' ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. చదవండి: టీమిండియాకు సంకట స్థితి.. నాలుగో టెస్టు గెలిస్తేనే తప్పులే ఎక్కువగా.. ఎదురుదెబ్బ తగలాల్సిందే! -
BGT 2023: మా ఓటమికి ప్రధాన కారణం అదే! అందుకే ఇలా: రోహిత్ శర్మ
Rohit Sharma Comments Over Indore Test Loss: ‘‘టెస్టు మ్యాచ్ ఓడటానికి అనేక కారణాలు ఉంటాయి. నిజానికి తొలి ఇన్నింగ్స్లో మా బ్యాటింగ్ అస్సలు బాగోలేదు. మొదటి ఇన్నింగ్స్లో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడం ఎంత ముఖ్యమో మాకు ఇప్పుడు మరింత బాగా అర్థమైంది. వాళ్లకు 80-90 పరుగుల ఆధిక్యం లభించినపుడైనా మేము మెరుగ్గా బ్యాటింగ్ బ్యాటింగ్ చేయాల్సింది. కానీ మరోసారి మేము విఫలమయ్యాం. కేవలం 75 పరుగులు మాత్రమే చేయగలిగాం. ఒకవేళ మేము తొలి ఇన్నింగ్స్లో బాగా ఆడి ఉంటే పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేది. ప్రస్తుతం మేము డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ఆలోచించడం లేదు. మా దృష్టి మొత్తం ప్రస్తుతం నాలుగో టెస్టు మీదే ఉంది. అహ్మదాబాద్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం గురించే మా ఆలోచన. తొలి రెండు టెస్టుల్లో మా ఆట తీరు బాగుంది. అహ్మదాబాద్లోనూ అదే పునరావృతం చేయాలని భావిస్తున్నాం. పిచ్ ఎలా ఉందన్న విషయం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం సరిగ్గా చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత మన ప్రణాళికలు సరిగ్గా అమలయ్యాయా? లేదా అన్న అంశం గురించి మాత్రమే ఆలోచించాలి. బ్యాటర్లకు సవాల్ విసిరే పిచ్లపై ఆడినపుడు మరింత ధైర్యంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. నిజానికి వాళ్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా నాథన్ లియోన్ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, తొలి రెండు మ్యాచ్లలో మా బ్యాటింగ్ ఎలా ఉందో అందరూ చూశారు కదా! అయితే, ఈసారి మెరుగైన భాగస్వామ్యం నమోదు చేయలేకపోయాం’’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇండోర్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఓడిపోయిన రోహిత్ సేన.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరేందుకు ఆసీస్ అవకాశాలను మెరుగుపరిచింది. బ్యాటర్ల వైఫల్యం ఇక బుధవారం(మార్చి 1) మొదలైన మ్యాచ్లో టీమిండియా బ్యాటర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. తొలి ఇన్నింగ్స్లో 109, రెండో ఇన్నింగ్స్లో 163 పరుగులకు ఆలౌట్ కావడమే ఇందుకు నిదర్శనం. రెండు ఇన్నింగ్స్లో కలిపి నయావాల్ ఛతేశ్వర్ పుజారా మొత్తంగా 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. మరోవైపు.. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా తొలి ఇన్నింగ్స్లో 60 పరుగులతో రాణించి జట్టుకు ఆధిక్యం అందించగా.. రెండో ఇన్నింగ్స్లో ట్రవిస్ హెడ్ 49, మార్నస్ లబుషేన్ 28 పరుగులతో అజేయంగా నిలిచి విజయలాంఛనం పూర్తి చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నాథన్ లియోన్ మొత్తంగా 11 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 24 పరుగులు చేశాడు. చదవండి: సికందర్ రజా సునామీ ఇన్నింగ్స్.. వరుసగా నాలుగో విజయం Danielle Wyatt: అప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజల్.. ఇప్పుడు తన ప్రేయసితో ఎంగేజ్మెంట్! -
BGT 2023: ఇండోర్ టెస్టు.. రెండో రోజు ఆటలో హైలైట్స్
-
పుజారా భయపడుతున్నాడు.. అయ్యర్ పిరికిపందలా ఉన్నాడు: ఆసీస్ మాజీ కెప్టెన్
India vs Australia, 3rd Test: ‘‘టీమిండియాలో కొంత మంది స్పిన్ బౌలింగ్లో అద్భుతంగా ఆడగలరని విన్నాను. కానీ వాళ్ల ఆట తీరు మాత్రం నన్ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు ఆస్ట్రేలియన్లు ఇంకాస్త ముందే టీమిండియాను ఆలౌట్ చేస్తారనుకున్నా. పిచ్ సంగతి ఎలా ఉందన్న విషయం కాసేపు పక్కనపెడితే.. ఆస్ట్రేలియా స్పిన్నర్లు సరైన రీతిలో బౌలింగ్ చేశారు. తమకున్న అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. కానీ భారత బ్యాటర్లు మాత్రం ఫెయిలయ్యారు. గత రెండు మ్యాచ్లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా తేలిపోయారో.. వీళ్లు కూడా అలాగే విఫలమయ్యారు. ముఖ్యంగా ఛతేశ్వర్ పుజారా భయపడుతూ బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్ ఆరంభం నుంచే అతడు నెర్వస్గా కనిపిస్తున్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్ స్పిన్ బౌలింగ్లో బాగా ఆడతాడని విన్నాను. కానీ.. ఇప్పటి వరకు అతడి నుంచి మెరుగైన బ్యాటింగ్ చూడలేకపోయాం. నేనైతే అతడి ఆట తీరుతో అస్సలు కన్విన్స్ కాలేకపోయాను. తనని చూస్తే వట్టి పిరికిపందలా అనిపించాడు’’ అని ఆస్ట్రేలియా టెస్టు దిగ్గజం ఇయాన్ చాపెల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. పుజారా భయం భయంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ అంచనాలు అందుకోలేకపోయారని విమర్శించాడు. అదే సమయంలో.. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ చక్కగా సమన్వయం చేసుకుంటూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడారని ప్రశంసించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్లో మార్చి 1న మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, మూడో రోజు నుంచి బంతి స్పిన్కు టర్న్ అవుతుందని భావిస్తే.. తొలిరోజే గింగిరాలు తిరిగింది. దీంతో టీమిండియా బ్యాటర్లకు కష్టాలు తప్పలేదు. అంతా రివర్స్ ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియోన్ 3, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశారు. దీంతో భారత జట్టు 109 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా వన్డౌన్ బ్యాటర్ పుజారా ఒక్క పరుగుకే పరిమితం కాగా.. ఆరోస్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు. విరాట్ కోహ్లి 22, శుబ్మన్ గిల్ 21 పరుగులు చేయగా.. మిగతా వాళ్లెవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. మరోవైపు.. ఆస్ట్రేలియా రెండో రోజు ఆటలో భాగంగా 197 పరుగులకు ఆలౌట్ అయింది. ఖవాజా 60, లబుషేన్ 31 పరుగులతో రాణించి ఆసీస్కు ఆధిక్యాన్ని అందించారు. అయితే, రెండో ఇన్నింగ్స్లో పుజారా రాణిస్తుండటం విశేషం. ముందుందిలే ఈ నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక అయ్యర్ రెండో టెస్టులో కేవలం 16 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఇయాన్ వ్యాఖ్యలపై తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ‘‘వాళ్లిద్దరు విఫలమైన మాట వాస్తవమే! అయినా రెండు టెస్టుల్లో ఏం జరిగిందో చూశారు కదా! ఇప్పుడే ఇంకా అయిపోలేదు. ముందుంది అసలైన సవాల్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఇప్పటికే టీమిండియా రెండు విజయాలతో 2-0తో ఆధిక్యంలో ఉండగా.. మిగిలిన రెండు టెస్టుల్లో సత్తా చాటాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది. చదవండి: BGT 2023: 688వ వికెట్ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన ఘనత! కపిల్దేవ్ను దాటేసి.. BGT 2023: 688వ వికెట్ అత్యంత ప్రత్యేకం.. అశ్విన్ అరుదైన ఘనత! కపిల్దేవ్ను దాటేసి.. -
BGT: ఇప్పటి వరకు చెత్త పిచ్ ఇదే! కానీ 109 పరుగులకే ఆలౌట్ కావడం వారి వైఫల్యమే!
Ind vs Aus 3rd test- Ian Chappell Slams Players, Administrators Over Pitch: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 టెస్టు సిరీస్లో ముగిసిన తొలి రెండు టెస్టులతో పోలిస్తే ఇండోర్ పిచ్ చెత్తగా ఉందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ విమర్శించాడు. మేనేజ్మెంట్, ఆటగాళ్లు పిచ్ రూపకల్పన విషయంలో జోక్యం చేసుకోకూడదని, ఆ విషయాన్ని పూర్తిగా క్యూరేటర్కే వదిలేయాలన్నాడు. మూడో టెస్టు మొదటి రోజు కంగారూ జట్టుకు అదృష్టం కలిసి వచ్చిందని.. ఏదేమైనా 109 పరుగులకే ఆలౌట్ కావడం టీమిండియా వైఫల్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23 సీజన్లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్ల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆది నుంచే పిచ్పై నిందలు సొంతగడ్డపై భారత్ను ఓడించడం తేలికైన విషయం కాదని ఆసీస్కు గతంలో ఎన్నోసార్లు అవగతమైంది. అయితే, ఈసారి మాత్రం ఎలాగైనా గత రికార్డులు చెరిపేస్తామంటూ ప్రగల్భాలు పలికారు ఆస్ట్రేలియా ఆటగాళ్లు. ఈ క్రమంలో సిరీస్ ఆరంభానికి ముందే పిచ్పై నిందలు వేయడం మొదలుపెట్టారు. నాగ్పూర్, ఢిల్లీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసి టీమిండియా విజయం సాధించడంతో ఆస్ట్రేలియా మీడియా సహా మాజీల విమర్శలు ఎక్కువయ్యాయి. ఉపఖండ పిచ్లపై అక్కసు వెళ్లగక్కుతూ అసహనం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఇండోర్ మ్యాచ్లో తొలి రోజు నుంచే బంతి స్పిన్కు టర్న్కు అవుతుండటంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇక మొదటి రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీ చెలరేగడంతో టీమిండియా 109 పరుగులకే తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ నేపథ్యంలో ఇయాన్ చాపెల్ ఈఎస్పీఎన్క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. పిచ్ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అత్యంత చెత్తగా ఉంది.. కానీ ‘‘ఇప్పటి వరకు చూసిన మూడు పిచ్లలో ఇది అత్యంత చెత్తగా ఉంది. కానీ.. మరీ ఇక్కడ 109 పరుగులు మాత్రమే చేయడం అంటే బ్యాటర్ల వైఫల్యమే. టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ కావడానికి పూర్తిగా పిచ్నే కారణంగా చెప్పలేము. నిజానికి ఆస్ట్రేలియాకు అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. అయినా పిచ్ రూపకల్పన అన్న అంశం పూర్తిగా క్యూరేటర్కే వదిలేయాలి. అప్పుడే తమ ఆలోచనలకు అనుగుణంగా వాళ్లు మెరుగైన పిచ్ తయారు చేస్తారు. అప్పుడు ఆటగాళ్లు తమ పని చేసుకుంటారు. చెరువులో దూకమని చెప్పినట్లే అలా కాకుండా మేనేజ్మెంట్, క్రికెటర్లు క్యూరేటర్ దగ్గరికి వెళ్లి మాకు అలాంటి పిచ్ కావాలి! ఇలాంటి పిచ్ కావాలి! అని ఒత్తిడి చేస్తే క్యూరేటర్ను ఇబ్బందుల్లో పడేసినట్లే! మీరిలా చేస్తున్నారు అంటే క్యూరేటర్ను వెళ్లి చెరువులో దూకమని చెప్పడం కిందే లెక్క!’’ అని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. అప్పుడు కూడా ఇలాగే అంటారా? ఈ క్రమంలో టీమిండియా అభిమానులు ఇయాన్ చాపెల్ హితవచనాలకు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు. ‘‘ఆస్ట్రేలియాలో పేస్కు అనూకలించే పిచ్ల విషయంలోనూ పర్యాటక జట్టు ఓడిపోయినప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదంటే అప్పుడు మరోలా మాట మారుస్తావా? ఒకవేళ మొదటి రోజు టీమిండియా బ్యాటర్లు మంచి స్కోరు నమోదు చేస్తే ఏమనేవాడివో! అవును.. నాగ్పూర్, ఢిల్లీ మ్యాచ్లో మీ బ్యాటర్లు ఏం చేశారో గుర్తుందా?’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ఆసీస్ 197 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. చదవండి: Legends League Cricket 2023: ఇండియా, ఆసియా కెప్టెన్లు ఎవరంటే! PSL 2023: రోవమన్ పావెల్ ఊచకోత.. బాబర్ సేన ఘన విజయం -
ముచ్చటగా మూడో టెస్టు.. ఎన్ని రోజుల్లో ముగుస్తుందో?
ఇండోర్లో హోల్కర్ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మూడోటెస్టు బుధవారం మొదలుకానుంది. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. తొలి రెండు టెస్టులు యాదృశ్చికంగా రెండున్నర రోజుల్లోనే ముగియడం గమనార్హం. క్యురేటర్లు పూర్తిగా స్పిన్ పిచ్లను తయారు చేస్తూ బౌలర్లు.. బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టేలా చేస్తున్నారు. ఇక టీమిండియా స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. రెండు టెస్టుల్లోనూ ఘన విజయాలు సాధించిన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు మరింత దగ్గరైంది. మూడో టెస్టులోనూ గెలిచి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుంది. ఈ విషయం పక్కనబెడితే తొలి రెండు టెస్టుల్లో భారత స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్లను తయారు చేశారంటూ ఆసీస్ బహిరంగంగా విమర్శలు చేసింది. అయితే ఉపఖండపు పిచ్లు మాములుగానే స్పిన్నర్లకు అనుకూలిస్తాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్లే కాదు ఆసీస్ స్పిన్నర్లు టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్లు కూడా వికెట్ల తీశారు. ఇండోర్ పిచ్ను పరిశీలిస్తున్న స్టీవ్ స్మిత్ ఇక ఇండోర్ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలంగానే ఉంటుందని పిచ్ క్యూరేటర్ ఇప్పటికే వెల్లడించాడు. '' పిచ్పై కాస్త గడ్డి ఉండడంతో బ్యాటింగ్కు సహకరిస్తుంది. కాస్త భారీగానే పరుగులు వచ్చే అవకాశం ఉంది. అయితే గడ్డి పెరిగితే మాత్రం స్పిన్నర్లు పండగ చేసుకోవడం ఖాయం. సిరీస్లో తొలి రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు నమోదు కాలేకపోయాయని.. కానీ ఇండోర్ టెస్టులో మాత్రం పరుగులు వచ్చే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ ఐదు రోజులు కొనసాగితే చివరి రెండు రోజులు మాత్రం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది అని వెల్లడించాడు. అయితే వ్యక్తిగత పని నిమిత్తం స్వదేశానికి తిరిగి వెళ్లిన ఆసీసీ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇంకా తిరిగి రాకపోవడంతో స్టీవ్ స్మిత్ స్టాండిన్ కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా ఇండోర్ పిచ్ను స్మిత్ పరిశీలించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తొలి టెస్టులో కూడా వార్నర్తో కలిసి స్మిత్ పిచ్ను పరిశీలించడంపై సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. తొలి టెస్టు సందర్భంగా పిచ్ను పరిశీలించిన వార్నర్, స్మిత్ ఇక హోల్కర్ స్టేడియంలో 2019 డిసెంబర్లో చివరిసారి బంగ్లాదేశ్, టీమిండియా మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇదే వేదికలో ఇటీవలే న్యూజిలాండ్తో వన్డే మ్యాచ్ జరగ్గా.. రోహిత్, గిల్లు శతకాలతో విరుచుకుపడడంతో టీమిండియా 90 పరుగులతో గెలుపొందింది. తుది జట్టు విషయానికి వస్తే.. కేఎల్ రాహుల్పై వేటు పడుతుందా లేక జట్టులో కొనసాగుతాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఫామ్లేమితో సతమతమవుతున్న రాహుల్ను పక్కనబెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. దీంతో కేఎల్ రాహుల్ స్థానంలో శుబ్మన్ గిల్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు లేకపోవచ్చు. Australian captain Steve Smith checking the Indore pitch. pic.twitter.com/OvPqHoT6lm — Johns. (@CricCrazyJohns) February 28, 2023 చదవండి: ప్రేయసితో ఘనంగా టీమిండియా ఆల్రౌండర్ పెళ్లి ఓటమి నేర్పిన పాఠం.. ప్రతీసారి 'బజ్బాల్' పనికిరాదు -
BGT 2023: మూడో టెస్టు పిచ్ ఎలా ఉండబోతోంది? ఫొటో వైరల్
Australia tour of India, 2023: భారత్ వేదికగా జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇండోర్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి మూడో టెస్టు ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీసులో తలమునకలయ్యారు. ఇదిలా ఉంటే.. నాగ్పూర్, ఢిల్లీ టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగిసిపోవడంపై ఆస్ట్రేలియా మీడియా, మాజీ క్రికెటర్లు పిచ్ల గురించి రాద్దాంతం చేసిన విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఆసీస్ వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ తదితరులు నాగ్పూర్ను పిచ్ను పరిశీలిస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు. పిచ్పై ఆసీస్ నిందలు ఇందుకు తోడు.. క్రికెట్ ఆస్ట్రేలియా సైతం ‘డాక్టర్డ్ పిచ్’ అంటూ ఆతిథ్య జట్టు తమకు అనుకూలంగా రూపొందించుకుందని నిందలు వేసింది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టుల్లో స్పిన్నర్ల విజృంభణతో టీమిండియా గెలుపొందడం వారి అసహనాన్ని మరింత పెంచింది. అయితే, భారత స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బ్యాట్తోనూ రాణించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన వేళ.. ఆసీస్ స్టార్ బ్యాటర్లు వార్నర్, ఉస్మాన్ ఖవాజా వంటి వాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో పిచ్పై నిందలు వేసే పనిలో పడి ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆటపై దృష్టి పెట్టలేకపోయారంటూ విమర్శల పాలయ్యారు. అలా అయితే నయమే! ఈ క్రమంలో మూడో టెస్టుకు సంబంధించి ఎలాంటి పిచ్ను రూపొందిస్తారా అన్న అంశం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఇండోర్లోని హోల్కర్ స్టేడియం పిచ్ తయారీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని గమనిస్తే పిచ్ ఎలాంటి పగుళ్లూ లేకుండా, కాస్త పచ్చగా కనిపిస్తోంది. మ్యాచ్ సమయానికి ఇలాగే ఉంటే బ్యాటర్లకు కాస్త అనుకూలిస్తుంది. ఇక ఈ సిరీస్లో ఇప్పటి వరకు భారీ స్కోర్లు నమోదు కాలేదన్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ(120) చేయగా.. మిగతా వాళ్లలో ఎవరూ 100 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. ఇరు జట్ల స్పిన్నర్లు మొత్తంగా తొలి టెస్టులో 24.. రెండో టెస్టులో 28 వికెట్లు పడగొట్టారు. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? T20 WC 2023: అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒకే ఒక్కరు! Pitch for 3rd Test between India vs Australia. pic.twitter.com/I91HxQ7s8b — Johns. (@CricCrazyJohns) February 27, 2023 -
కుక్కల కోసం ప్రత్యేక రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
శునకాలు మనుషుల జీవితాల్లో భాగమైపోయాయి. చాలా ఇళ్లలో అవి కూడా సభ్యులుగా ఉంటున్నాయి. వివిధ రకాల జాతుల శునకాలను వేలు.. లక్షల రూపాయలు పెట్టి మరీ కొని ప్రేమగా పెంచుకుంటున్నారు. వాటి పోషణ, సంరక్షణ కోసం ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు డాగ్ లవర్స్. ఈ క్రమంలోనే కుక్కల కోసం ప్రత్యేకమైన స్పాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటవుతున్నాయి. డాగ్ లవర్స్ తమ పెంపుడు శునకాలను తమతో పాటు హోటళ్లకు, రెస్టారెంట్లకు తీసుకెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అయితే వాటికి అక్కడ అనువైన వాతావరణం ఉండదు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శునకాల కోసమే ప్రత్యేకంగా ‘డాగీ దాబా’ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇక్కడ కుక్కల కోసం చాలా రకాల వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాలు లభిస్తాయి. రూ.7 నుంచి రూ.500 వరకు శునకాలకు ఇష్టమైన ఆహారం అందిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ కుక్కల పుట్టినరోజులను జరుపుకోవచ్చు. ఇందు కోసం ప్రత్యేకమైన కేక్లు ఇక్కడ తయారు చేస్తున్నారు. కుక్కలు ఆడుకునేందుకు, విహారం చేసేందుకు అనువైన ఏర్పాట్లు సైతం చేశారు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) బాలరాజ్ ఝాలా అనే వ్యక్తి అతని భార్య కలిసి ఈ డాగీ దాబాను ఏర్పాటు చేశారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో తమకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు. తాను హోటల్లో పనిచేస్తున్న సమయంలో రోజూ ఇంటికి వెళ్లేటప్పుడు కుక్కలకు ఆహారం వేసేవాడినని, ఈ సమయంలోనే కుక్కలకు మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు బాలరాజ్ వివరించారు. -
మార్క్స్ మెమోపై వాగ్వాదం.. ప్రిన్సిపాల్పై స్టూడెంట్ దాడిలో..
భోపాల్: కొన్ని సందర్భాల్లో మనిషి తీసుకునే నిర్ణయాల కారణంగా జీవితమే నాశనం అవతుంది. ఇలాంటి సమయాల్లో ఎదుటి వ్యక్తులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు నెలకొంటాయి. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. బీఫార్మసీ విద్యార్థి క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టాడు. ఆవేశంలో ప్రినిపాల్ను చంపేశాడు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ ఇండోర్లోని బీఫార్మసీ కాలేజీలో అశ్తోష్ శ్రీవాస్తవ అనే విద్యార్థి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే, తన చదువు పూర్తవడంతో శ్రీవాస్తవ.. ఈనెల 20వ తేదీన కాలేజీకి వెళ్లాడు. ఈ క్రమంలో తన మార్కుల మెమోను ఇవ్వాలని కోరాడు. దీంతో, సెవెంత్ సెమిస్టర్ ఫెయిలైన కారణంగా మెమో ఇవ్వడం కుదరదని ప్రిన్సిపాల్ విముక్త శర్మ సమాధానం ఇచ్చారు. ఆమె రిప్లైతో ఆగ్రహానికి లోనైన శ్రీవాస్తవ.. తనకు మార్కుల షీట్ ఇవ్వడంలో కాలేజీ యాజమాన్యం అక్రమంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశాడు. ఇక, ఈ వ్యవహారంపై ఆవేశంలో శ్రీవాస్తవ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రిన్సిపాల్పై పెట్రోల్ పోసి సిగరెట్ లైటర్తో నిప్పంటించాడు. ఈ ఘటనలో విముక్త శర్మ శరీరం 80 శాతం కాలిపోయింది. దీంతో, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమించి శనివారం ఆమె.. ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాద ఘటన జరిగిన రోజునే నిందితుడు శ్రీవాస్తవను పోలీసులు అరెస్ట్ చేశారు. -
BGT: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పొట్లం అయిపోతారు: భారత మాజీ కెప్టెన్
Border Gavaskar Trophy 2023 India vs Australia: ‘‘కాస్త దృష్టి పెట్టండి.. ఏదో ఒక అద్భుతం చేయండి బాస్!’’ అంటూ టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆస్ట్రేలియా మేనేజర్కు సందేశం పంపాడు. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మీకు మరిన్ని చేదు అనుభవాలు తప్పవని హెచ్చరించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2021-23లో భాగంగా ఆస్ట్రేలియా టీమిండియాతో నాలుగు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. స్పిన్నర్ల దెబ్బ.. విలవిల్లాడిన ఆసీస్ ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 9న ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్ ఆరంభమైంది. అయితే, భారత స్పిన్నర్ల మాయాజాలం, స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ల ధాటికి తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ చతికిలపడింది. నాగ్పూర్, ఢిల్లీ టెస్టుల్లో ఓటమిని మూటగట్టుకుంది. ఈ రెండు మ్యాచ్లను రెండున్నర రోజుల్లోనే ముగించిన టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగులు, 6 వికెట్ల తేడాతో గెలిచి 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు మరింత చేరువైంది. మరోవైపు.. మిగిలిన ఇండోర్(మార్చి 1-5), అహ్మదాబాద్(మార్చి 9-13) టెస్టుల్లో గనుక ఆసీస్ ఓడితే.. శ్రీలంకతో ప్రమాదం ఎదుర్కోకతప్పదు. ఆస్ట్రేలియా టీమిండియా చేతిలో వైట్వాష్కు గురై.. లంక న్యూజిలాండ్ గడ్డపై కివీస్ను వైట్వాష్ చేస్తే.. ఫైనల్ చేరడం ఖాయమనుకున్న ఆసీస్కు పరాభవం తప్పదు. ఇక ఇప్పటికే గాయాలు, వ్యక్తిగత కారణాల వల్ల కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సహాఆరుగురు ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆస్ట్రేలియా జట్టును ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పొట్లం అయిపోతారు జాగ్రత్త! తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసీస్ మేనేజర్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మీ సౌలభ్యం కోసం నేను ఇంగ్లిష్లోనే మాట్లాడుతున్నా.. ఏదో ఒకటి చేయండి బాస్! ఈ సిరీస్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఏదో ఒకటి చేయండి అబ్బాయిలు.. లేదంటే మీరు ‘పొట్లం’ అయిపోతారు జాగ్రత్త! పొట్లం అంటే ప్యాకెట్ అని అర్థం. అయినా మీరిప్పటికే ప్యాకెట్ అయిపోయారు లెండి!’’ అని చిక్కా సెటైర్లు వేశాడు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అన్న అర్థంలో ఆసీస్ను దారుణంగా ట్రోల్ చేశాడు. పోటుగాళ్లలా బిల్డప్ ఇచ్చి ఇప్పుడు చతికిలపడ్డారంటూ పరోక్షంగా పంచులు వేశాడు. చదవండి: Azam Khan: తుపాన్ ఇన్నింగ్స్.. 42 బంతుల్లోనే.. 9 ఫోర్లు, 8 సిక్స్ల సాయంతో.. T20 WC 2023 Final: సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో తొలిసారి.. ఆఖరి పోరులో ఆసీస్తో.. -
BGT 2023: నెట్స్లో చెమటోడుస్తున్న పుజారా.. భిన్న షాట్లతో! వీడియో
India vs Australia Test Series- 3rd Test: ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు. తన నైపుణ్యాలకు మరింత మెరుగుపెట్టుకునేందుకు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. గత మ్యాచ్లలో పొరపాట్లు పునరావృతం కాకుండా బ్యాటింగ్ టెక్నిక్పై దృష్టి సారించాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొనేందుకు పుజారా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగా నెట్స్లో భిన్న షాట్లు ప్రయత్నిస్తూ ఆటకు మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను పుజారా తాజాగా షేర్ చేశాడు. ‘‘మూడో టెస్టుకు సిద్ధమవుతున్నా’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. అనుకున్నంత లేదు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాకు బలమవుతాడని భావించిన టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి టెస్టులో ఏడు పరుగులకే పరిమితమైన అతడు.. కెరీర్లో అత్యంత ముఖ్యమైన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. రెండుసార్లు స్పిన్నర్ల చేతికే ఢిల్లీ మ్యాచ్తో వందో టెస్టు పూర్తి చేసుకున్న పుజారా.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం అజేయమైన 31 విలువైన పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, ఇప్పటి దాకా పూర్తిస్థాయిలో తన మార్కు చూపలేకపోయాడు ఈ రైట్హ్యాండ్ బ్యాటర్. ఇక తొలి టెస్టులో ఆసీస్ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి వికెట్ సమర్పించుకున్న పుజారా.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో మరో స్పిన్నర్ నాథన్ లియోన్ చేతికి దొరికిపోయాడు. అందుకే మిగిలిన రెండు టెస్టుల్లో అత్యుత్తమంగా రాణించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. మూడో టెస్టుకు మార్చి 1 నుంచి ఇండోర్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఆరంభం కానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరే క్రమంలో రోహిత్ సేన ముందడుగు వేయగా.. కమిన్స్ బృందం మాత్రం వెనుకబడిపోయింది. నాలుగింట రెండు మ్యాచ్లు గెలిచి 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇదిలా ఉంటే.. ఇండోర్ టెస్టుకు కమిన్స్ దూరం కాగా స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేపట్టనున్నాడు. చదవండి: Ind Vs Aus: మూడో టెస్టుకు కమిన్స్ దూరం.. బీసీసీఐ ట్వీట్! గ్రేట్ అంటున్న ఫ్యాన్స్ Ind Vs Aus: అంత సిల్లీగా అవుటవుతారా? అవునా అలా అన్నాడా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్కు హర్మన్ కౌంటర్.. View this post on Instagram A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) -
400 మీ. పరుగుపందెంలో చరిత్ర.. 31 ఏళ్ల రికార్డు బద్దలు
ఇండోర్ అథ్లెటిక్స్ 400మీ. పరుగుపందెంలో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. నెదర్లాండ్స్కు చెందిన ఫెమ్కె బోల్ డచ్ ఇండోర్ చాంపియన్షిప్లో గమ్యాన్ని 49.26 సెకండ్లలో చేరుకుని నూతన రికార్డును సృష్టించింది. 1982లో చెక్ అథ్లెట్ జర్మిల అక్రతొచిలోవ నెలకొల్పిన 49.59సె. రికార్డును బోల్ చెరిపేసింది. 22 ఏళ్ల బోల్ విజయంపై హర్షం వ్యక్తంచేస్తూ ఇక్కడ హాజరైన ప్రేక్షకుల ప్రోత్సాహంతో రికార్డును సాధించగలిగానని తెలిపింది. ప్రేక్షకుల హర్షధ్వానాలతో తాను రికార్డును నెలకొల్పినట్లు తెలిసిందంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఔట్డోర్లో జర్మనీ అథ్లెట్ మారిట కోచ్ 1985లో నెలకొల్పిన 47.60సె. రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు. ¡Boom! Femke Bol, récord mundial de 400 en pista cubierta. 49.26 en Apeldoorn (Países Bajos) y borra el tope de Kratochvilova. 49.26 Femke Bol (2023) 49.59 Kratochvilova (1982) 49.68 Nazarova (2004) 49.76 Kocembova (1984)pic.twitter.com/RhuWkuBwcE — juanma bellón (@juanmacorre) February 19, 2023 -
BGT 2023: ఆసీస్తో భారత్ మూడో టెస్టు.. వేదిక మారింది: బీసీసీఐ ప్రకటన
India Vs Australia 3rd Test: టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టు వేదిక మారింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా మార్చి 1 నుంచి ఆరంభం కానున్న ఈ మ్యాచ్కు మధ్యప్రదేశ్లోని ఇండోర్ వేదిక కానుంది. హోల్కర్ స్టేడియంలో రోహిత్ సేన- ప్యాట్ కమిన్స్ బృందంతో తలపడనుంది. అందుకే మార్చారు ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ధ్రువీకరించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ)కు చెందిన ధర్మశాల మైదానంలో పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ సహా పిచ్పై పచ్చికను కొత్తగా పరిచారు. వాళ్లకు బ్యాడ్ న్యూస్ పిచ్ పరీక్షించడం సహా మరికొన్ని పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఇక్కడ టెస్టు మ్యాచ్ నిర్వహణ సమంజసం కాదని భావించిన బోర్డు.. వేదికను మారాల్చని నిర్ణయించుకుంది. ధర్మశాలకు ప్రత్యామ్నాయంగా వైజాగ్, బెంగళూరు, ఇండోర్, రాజ్కోట్లను పరిశీలించిన బీసీసీఐ.. ఆఖరికి ఇండోర్ వైపే మొగ్గు చూపింది. హిమాచల్ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు, పిచ్ పూర్తిస్థాయిలో రూపొందని నేపథ్యంలో వేదికను మార్చినట్లు తెలిపింది. దీంతో ప్రతిష్టాత్మక మ్యాచ్ ప్రతక్ష్యంగా చూడాలని భావించిన వైజాగ్, బెంగళూరు, గుజరాత్ ఫ్యాన్స్కు నిరాశే మిగిలింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరువగా ఇదిలా ఉంటే.. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో వరుస విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు మరింత చేరువైంది. మిగిలిన టెస్టులు ఎక్కడంటే మొదటి టెస్టు విజయంలో స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సహా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించారు. ఇక ఇరు జట్ల మధ్య ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. మూడో టెస్టు ఇండోర్, నాలుగో టెస్టు అహ్మదాబాద్లో జరుగనున్నాయి. చదవండి: Ind Vs Aus: ‘డూప్లికేట్’కు.. అసలుకు తేడా తెలిసిందా? ఈసారి జడ్డూ కోసమైతే: భారత మాజీ బ్యాటర్ ILT20 2023 Winner: ఇంటర్నేషనల్ లీగ్ టీ20 తొలి చాంపియన్గా అదానీ గ్రూప్ జట్టు Ind Vs Pak: ప్రపంచకప్లో పాక్పై ఇదే అత్యధిక ఛేదన.. మహిళా జట్టుపై కోహ్లి ప్రశంసలు -
అలా అయితే ఇషాన్ కూడా రాంచీలో నన్ను ఆడించు అంటాడు: రోహిత్
India vs New Zealand ODI Series: ఏ ఆటగాడికైనా తన సొంతమైదానంలో అంతర్జాతీయ క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం వస్తే ఆ అనుభూతే వేరు. సొంత ప్రేక్షకుల నడుమ టీమిండియా క్యాప్ అందుకుంటే ఆ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ఒక్కోసారి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయనిపించినా.. దురదృష్టం వెక్కిరిస్తే.. భంగపడకతప్పదు. మధ్యప్రదేశ్ క్రికెటర్ రజత్ పాటిదార్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్లో ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ సేన ట్రోఫీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నామమాత్రపు మూడో వన్డే ఇండోర్ వేదికగా జరిగింది. పాపం రజత్ ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసిన రజత్కు ఆఖరి మ్యాచ్లో అవకాశం వస్తుందని అభిమానులు భావించారు. అయితే, ఈ ఇండోర్ బ్యాటర్కు మాత్రం మొండిచేయి ఎదురైంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు రజత్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇషాన్ కూడా అలా అంటే.. ఇందుకు బదులుగా.. ‘‘నిజమే.. మేము అతడిని ఇండోర్ మ్యాచ్లో ఆడించాల్సింది. మరి.. ఇషాన్ కూడా నాది రాంచి కదా.. నన్ను రాంచి మ్యాచ్లో ఆడనివ్వండి అంటాడు. అందరూ అలాగే అంటే కుదరదు కదా! మాకంటూ కొన్ని ప్రణాళికలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే జట్టు కూర్పు ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. చాలా మంది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్లందరికి ఛాన్స్ ఇస్తామనే చెబుతాం. అయితే, అందుకు పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా’’ అని హిట్మ్యాన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. క్లీన్స్వీప్ కాగా చివరి వన్డేలో 90 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇండోర్లో జన్మించిన రజత్ పాటిదార్ ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 29 ఏళ్ల ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ పలుమార్లు జట్టుకు ఎంపికైనా తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. చదవండి: Shardul Thakur: ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు ఖాయం! అంతలేదు.. హార్దిక్ ఉండగా.. ICC T20 World Cup: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్తో పోరుకు సై -
మీరంతా భారత అంబాసిడర్లు: ప్రధాని మోదీ
ఇండోర్: ప్రవాస భారతీయులను విదేశీ గడ్డపై భారత్కు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. రాబోయే 25 ఏళ్ల అమృతకాల ప్రయాణంలో వారి పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సోమవారం 17వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రత్యేక గౌరవ అతిథిగా సురినామ్ అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోఖీ, ముఖ్య అతిథిగా గయనా అధ్యక్షుడు మొహమ్మన్ ఇర్ఫాన్ అలీ హాజరయ్యారు. 66 దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే... ప్రవాసీల ఘనతలను రికార్డు చేయాలి ‘‘ఎన్నారైఐలు భారత దూతలు. మన యోగా, ఆయుర్వేదం, హస్తకళలు, చిరుధాన్యాలు, కాటేజీ పరిశ్రమకు మీరు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రపంచ వేదికపై భారత్ పాత్ర మీ వల్లే బలోపేతం కానుంది. స్కిల్ క్యాపిటల్గా కూడా ఎదిగే సామర్థ్యం భారత్కుంది. ప్రపంచ ప్రగతికి ఇంజన్గా మారనుంది. భారత్ గురించి తెలుసుకొనేందుకు ప్రవాసీల సంతానం ఆసక్తి చూపుతుండడం శుభపరిణామం. భారతీయులు ఎన్నో దేశాలకు వలస వెళ్లి శతాబ్దాలుగా స్థిరపడ్డారు. వారి జీవితాన్ని, ఎదుర్కొన్న కష్టానష్టాలు, చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇందుకు భారత వర్సిటీలు చొరవ తీసుకోవాలి. వారి అనుభవాలు, జ్ఞాపకాలను ఆడియో–విజువల్, అక్షరరూపం నమోదు చేయాలి. శతాబ్దాల క్రితమే అంతర్జాతీయ వాణిజ్యం జీ20 సారథ్య బాధ్యతను ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. మన గురించి ప్రపంచదేశాలకు తెలియజేయడానికి ఇది సరైన వేదిక. ప్రపంచంలో భారత్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది. మన మాటకు, సందేశానికి ఎంతో విలువ ఉంది. కరోనా టీకాలను దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నాం. 220 కోట్ల టీకా డోసులను ఉచితంగా అందించాం. మన అభివృద్ధి అసాధారణం, అద్వితీయం ప్రపంచంలోని ఐదు అత్యున్నత ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటిగా మారింది. అత్యధిక స్టార్టప్లు ఉన్న మూడో దేశం మనదే. నేడు ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. కొన్నేళ్లుగా మనం సాధించిన ఘనతలు అసాధారణం, అద్వితీయం. ప్రపంచంలో జరుగుతున్న మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 40 శాతం కేవలం భారత్లోనే జరుగుతున్నాయి. మనకు అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ ఉంది. అంతరిక్షంలోకి ఒకేసారి 100 ఉపగ్రహాలను పంపించగల సత్తా మన సొంతం. ఎన్ఆర్ఐల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం. వారికి అవసరమైన సాయం కచ్చితంగా అందిస్తాం. మన సాంస్కృతిక, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని కాపాడాలని ఎన్ఆర్ఐలను కోరుతున్నాం. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను మరింత పెంచాలని, మన దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని విన్నవిస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. మధ్యప్రదేశ్లో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సందర్శించాలని ఎన్ఐఆర్లకు సూచించారు. సురక్షిత, చట్టబద్ధ వలసల ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను ప్రధాని విడుదల చేశారు. దర్శన్ సింగ్కు ప్రవాసీ సమ్మాన్ అవార్డు విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు ఇచ్చే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును అమెరికా వ్యాపారవేత్త, దాత దర్శన్ సింగ్ దలీవాల్కు ప్రదానం చేశారు. పంజాబ్లోని పటియాలాకు చెందిన ఆయన అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగారు. భారత్తోపాటు పలు దేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారత్లోనే చదివా: గయానా అధ్యక్షుడు భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ పేర్కొన్నారు. ‘‘నేను భారత్లో చదువుకున్నా. భారతీయుల ప్రేమాభిమానాలు నాకు తెలుసు’’ అన్నారు. భారత్ తమకు నమ్మకమైన భాగస్వామి అని సురినామ్ అధ్యక్షుడు సంతోఖీ హర్షం వ్యక్తం చేశారు. -
అమ్మాయిల వీరంగం..ఫుల్లుగా తాగి మరో యువతిపై దాడి..వీడియో వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్ ఇండోర్లో అమ్మాయిలు రెచ్చిపోయారు. ఫుల్లుగా తాగిన నలుగురు యువతులు మరో యువతిని చితకబాదారు. బెల్టుతో కొట్టారు. పబ్బు బయటే ఈ ఘటన జరిగింది. అక్కడున్న వారు చూస్తే ఉండిపోయారే తప్ప.. వాళ్లను ఆపే సాహయం చేయలేదు. నలుగురూ కలిసి దాడి చేయడంతో బాధిత యువతి ఏమీ చేయలేకపోయింది. గతేడాది నవంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్గా మారింది. బాధిత యువతి తనపై దాడి చేసిన నలుగురు అమ్మాయిలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వాళ్లను అరెస్టు చేశారు. 4 girls brutally beating 1 girl with belts and kicks passer-by watching and enjoying #Fights #streetfights #fightingvideos #Girlsfight #India #gemsoffights pic.twitter.com/MVLec2CYai — TheFight1 (@InsanelyIfight3) December 29, 2022 చదవండి: రోడ్డుపై గుంతను తప్పించబోయి ట్రక్కును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి -
బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం
-
బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ ధ్వంసం..ఏకంగా 60 డైనమైట్లతో ..
సాక్షి, ఇండోర్: మధ్యప్రదేశ్ అధికారులు సాగర్ నగర్లో ఉన్న బీజేపీ నాయకుడు మిశ్రీ చంద్ర గుప్తా అక్రమ హోటల్ని కూల్చేసింది. చంద్ర గుప్తా అతని కుటుంబ సభ్యులపై డిసెంబర్ 22న జగదీష్ యాదవ్ అనే వ్యక్తిని ఎస్యూవీతో ఢీకొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు ఈ కేసు విషయమై మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. అందులో ఐదుగురిని అరెస్టు చేయగా, బీజేపీ నాయకుడు చంద్ర గుప్తా పరారీలోనే ఉన్నారు. అయితే దర్యాప్తులో చంద్ర గుప్తా పేరిట ఉన్న హోటల్ అక్రమంగా కట్టిందని అధికారులు గుర్తించారు. దీంతో.. ఇండోర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ జైరామ్ ప్యాలస్ని సుమారు 60 డైనమైట్లను ఉపయోగించి కూల్చేసినట్లు సమాచారం. సెకండ్ల వ్యవధిలో నేలమట్టం అయ్యింది ఆ హోటల్. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సాగర్జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్య స్వయంగా కూల్చివేత ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రత దృష్ట్యా కూల్చివేత సమయంలో హోటల్ కూడలి చుట్టూ బారికేడ్లు వేసి ట్రాఫిక్ను నిలిపేశారు. అలాగే హోటల్ చుట్టూ ఉన్న భవనాల్లో నివశించే ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి నష్టం జరగలేదని, కేవలం భవనం మాత్రమే కూలిందని కలెక్టర్ ఆర్య ప్రకటించారు. హత్యకు గురైన జగదీష్ యాదవ్ స్వతంత్ర కౌన్సిలర్ కిరణ్ యాదవ్ మేనల్లుడు. కిరణ్ యాదవ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్ర గుప్తా భార్య మీనాను సుమారు 83 ఓట్ల ఆధిక్యంతో ఓడించడం గమనార్హం. #WATCH | MP | Police razed illegal hotel of suspended BJP leader Mishri Chand Gupta after public protest over Jagdish Yadav murder case in Sagar "There has been no loss of any kind. Only the building was demolished," said Collector Deepak Arya (03.01) pic.twitter.com/VsAbVhRGi8 — ANI (@ANI) January 4, 2023 (చదవండి: గిరిజనుడికి అన్యాయం.. తప్పుడు రేప్ కేసులో జైలు శిక్ష.. సర్కార్పై పదివేల కోట్లకు దావా) -
షాకింగ్ వీడియో.. బైక్ను వెంబడించి మరీ.. యువకుడిని కత్తితో పొడిచి..
భోపాల్: ఆరుగురు మైనర్లు ఓ బైక్ను వెంబండించి మరీ కాలేజీ విద్యార్థిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపారు. రోడ్డుపై జరిగిన చిన్న వాగ్వాదం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో డిసెంబర్ 31న చోటుచేసుకుంది. భన్వర్ కౌన్ ప్రాంతంలో ఆయుష్(22) అనే యువకుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్పై వెళుతున్నాడు. రద్దీగా ఉన్న రోడ్డుపై కొంత మంది అబ్బాయిలు నిలబడి వాహన రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. దీంతో హారన్ కొట్టిన ఆయుష్..దారి క్లియర్ చేసి వాహనాలను వెళ్లేందుకు దారి ఇవ్వాల్సిందిగా వారిని కోరాడు. ఈ క్రమంలో మైనర్లకు, యువకుడికి మధ్య గొడవకు దారితీసింది. అనంతరం కొంతమంది మైనర్లు బైక్ వెనక పరుగెత్తి బైక్పై వెనకాల కూర్చున్న ఆయుష్పై కత్తితో దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. రద్దీగా ఉన్న రోడ్డుపై కొంతమంది యువకుల బృందం బైక్ వెనకాల పరుగెడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. చివరికి బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తిని పట్టుకొని కత్తితో పొడిచారు. అనంతరం వారందరూ అక్కడి నుంచి వెనక్కి పరుగెత్తారు. ఈ ఘటన అనంతరం ఆయుష్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బాధితుడు మరణించారు. నిందితులైన ఆరుగురు మైనర్లను పోలీసులు అరెస్ల్ చేశారు. అందరిపై హత్యా కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఇద్దరు తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. मध्यप्रदेश इंदौर में रात पौने तीन बजे युवक की हत्या, हार्न बजाने की बात पर हुआ था विवाद#Indore #MadhyaPradesh #MPNews pic.twitter.com/SWpWlC6jB2 — manishkharya (@manishkharya1) January 1, 2023 -
వెజ్ బిర్యానీలో మాంసం బొక్కలు.. కంగుతిన్న వ్యక్తి ఏం చేశాడంటే..
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయాలంటేనే భోజన ప్రియులు కాస్తా వెనకడుగు వేస్తున్నారు. ఒకటి ఆర్డర్ ఇస్తే ఇంకోటి రావడం, భోజనంలో పురుగులు, కుళ్లిన ఆహారం వస్తుందోనని జంకుతున్నారు. తాజాగా రెస్టారెంట్కు వెళ్లిన ఓ శాకాహారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే.. అందులో మాంసం ముక్కలు దర్శనమిచ్చాయి. ఎంతో ఇష్టంగా తిందామనుకున్న వెజ్ బిర్యానీలో నాన్వెజ్ కనిపించడంతో షాకైన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్లోని ఇండోర్ నగరంలో చోటుచేసుకుంది. అక్షయ్ దూబే అనే వ్యక్తి విజయ్ నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్కు వెళ్లి వెజ్ బిర్యాని ఆర్డర్ చేశాడు. అసలే ఆకలి మీదున్న అక్షయ్.. టేబుల్ మీదకొచ్చిన ఘుమఘుమలాడే వెజ్ బిర్యానీని ఓ పట్టున లాగేస్తున్నాడు. అయితే ఒక్కసారిగా బిర్యానీలో మాసం బొక్కలు కనిపించడంతో అతడు కంగుతున్నాడు. వెంటనే ఈ విషయాన్ని రెస్టారెండ్ మేనేజర్, సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా.. పొరపాటు జరిగిందంటూ వారు క్షమాపణలు తెలియజేశారు. అంతేగాక ఆక్షయ్.. విజయ్ నగర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశాడు. శాఖాహారులకు మాంసాహారం అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు రెస్టారెంట్ యజమాని స్వప్నిల్ గుజరాతీపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసల్ సంపత్ ఉపాధ్యాయ తెలిపారు. చదవండి: జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం -
Viral Video: చలానా కట్టమంటే.. ట్రాఫిక్ పోలీసును కారు పై 4కిలోమీటర్లు లాక్కెళ్లాడు
-
ఇంత దారుణమా? చలానా కట్టమన్నందుకు 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు
భోపాల్: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటమే కాకుండా ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. చలాన్ కట్టమన్నందుకు కారు బానట్పై ట్రాఫిక్ కానిస్టేబుల్ను 4 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరిగింది. ఇండోర్ నగరంలోని సత్య సాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివ సింగ్ చౌహాన్(50) విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కారులో వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఫోన్ మాట్లాడటం తప్పు అని చెప్పి జరిమానా కట్టాలని సూచించాడు కానిస్టేబుల్. దీంతో ఆగ్రహించిన కారు డ్రైవర్.. కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగాడు. జరిమానా తప్పించుకునేందుకు కానిస్టేబుల్ అడ్డుగా ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ పోలీసు కారు బానట్పైకి దూకాడు. అయినప్పటికీ.. కారును ఆపకుండా అలానే 4 కిలోమీటర్లు కారు నడిపాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్కు గాయాలైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కారు డ్రైవర్ను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 279, 332 కింద కేసు నమోదు చేసినట్లు లసుదియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ దండోతియా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఓ పిస్తోల్, ఓ రివాల్వర్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, అవి లైసెన్స్తో తీసుకున్నవని నిందితుడు తెలిపాడన్నారు. ग्वालियर के केशव उपाध्याय ने इंदौर में गाड़ी चलाने के दौरान फोन पर बात करते हुए ट्रैफिक तोड़ा और रोकने पर ट्रैफिक कांस्टेबल शिव सिंह चौहान को चार किलोमीटर तक अपने बोनट पर टांग कर ले गए। बताया जा रहा है के FIR कर छोड़ दिया गया।pic.twitter.com/PXEhQ3lm31 — काश/if Kakvi (@KashifKakvi) December 12, 2022 ఇదీ చదవండి: మూన్లైటింగ్ కూలీ: రాత్రి పూట రైల్వే స్టేషన్లో.. మరి పగటి పూట! -
Shalini: ఆమె ముసుగు వెనుక ధైర్యం
భుజాన బ్యాగ్తో ఆమె అందరిలాగే కాలేజీకి వెళ్లింది. క్యాంటీన్లో పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేసింది. అమ్మాయి కావడంతో.. సాధారణంగా కొందరు యువకులు నెంబర్ అడిగి తీసుకున్నారు. ఆమె కూడా వాళ్లతో ఫోన్ ఛాటింగ్లతో గడిపింది. సరదాగా క్లాసులు బంక్ కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లింది. ఇంతా స్టూడెంట్ అనే ముసుగులోనే! కానీ, ఆ ముసుగు వెనుక అసలు రూపం మొన్నటిదాకా ఎవరికీ తెలియదు. షాలినీ చౌహాన్.. గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు. స్టూడెంట్ ముసుగుతో ర్యాగింగ్ భూతం.. కొమ్ములు వంచిన ఈ ఖాకీ చొక్కాకి, ఆ ప్రయత్నంలో ఆమె ప్రదర్శించిన తెగువకి దేశం మొత్తం సలాం కొడుతోంది. మధ్యప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ అయిన షాలినీ చౌహాన్(24).. స్టూడెంట్ వేషంలో ర్యాగింగ్ చేసేవాళ్లను పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ఇండోర్ మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజీలో ఆమె ర్యాగింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. మూడు నెలలుగా కాలేజీ క్యాంపస్లోనే స్టూడెంట్ ముసుగులో ఆమె ఇండోర్ పోలీసులు నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొంది. పదకొండు మంది సీనియర్లు ర్యాంగింగ్ పేరిట వేధిస్తున్న వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది ఆమె. దీంతో.. ఆ విద్యార్థులను కాలేజీ యాజమాన్యం మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇన్స్పెక్టర్ తజీబ్ ఖ్వాజీ నేతృత్వంలో.. కానిస్టేబుల్ షాలినీ ఈ ఆపరేషన్కు దిగింది. తరచూ ఆ కాలేజీలో జూనియర్ల నుంచి ర్యాగింగ్ వ్యవహారం దృష్టికి వస్తుండడం.. అవి మరీ శ్రుతి మించి ఉంటోందన్న విషయం తెలియడంతో పోలీసులు క్యాంపస్లో పర్యటించారు. అయితే భయంతో ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో స్టూడెంట్ మాదిరి ఉన్న షాలినీ రంగంలోకి దించారు ఖ్వాజీ. షాలినీ, మరికొందరు కానిస్టేబుల్స్తో కలిసి క్యాంపస్లో సివిల్ డ్రెస్లో కలియదిరిగింది. విద్యార్థులతో మాట్లాడడం మొదలుపెట్టింది. తాను విద్యార్థుల్లో కలిసి పోయింది. జూనియర్లు, సీనియర్ల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంది. ర్యాంగింగ్ మరీ దారుణంగా ఉంటుందని గుర్తించింది. ఈ క్రమంలో.. ర్యాంగింగ్కు పాల్పడుతున్న ఆకతాయిలను గుర్తించింది. తన ఐడెంటిటీ రివీల్ చేయకుండానే వివరాలను సేకరించింది. అయితే.. ఈ మూడు నెలల కాలంలో ఎవరికైనా అనుమానం రాలేదా? అని షాలినీని అడిగితే.. టాపిక్ మార్చేదానినని చెప్పిందామె. అమ్మాయిని కావడంతో.. స్టూడెంట్స్ కొందరు సొల్లు కార్చుకుంటూ మాట్లాడేవారని, అదే తనకు బాగా కలిసి వచ్చిందని చెప్తోందామె. -
విలన్ రేంజ్లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...
పెద్ద ప్రమాదం కాకపోయినా... నానాబీభత్సం సృష్టించాడు ఒక వ్యక్తి. వృద్ధ దంపతులన్న కనికరం లేకుండా ఘోరంగా దాడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పోలీసులు పెద్ద ప్రమాదం కాదని తేల్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రోడ్డుపై అనుకోకుండా చిన్నప్రమాదం జరిగింది. వాస్తవానికి అది పెద్ద ప్రమాదం కాదు. ఒక వృద్ధ దంపుతులు ప్రయాణిస్తున్న కారు, వ్యాపారీ కారు ఒక దానికొకటి జస్ట్ రెప్పపాటులో రాసుకున్నాయి. అంతే సదరు వ్యాపారి రోడ్డుపై కారు ఆపేసి ఆ వృద్ధ దంపతులపై గొడవకు దిగాడు. ఆ దంపతుల్లో భర్త పిడీయాట్రిక్ వైద్యుడు కాగా, అతడి భార్య ఉపాధ్యాయురాలు. సదరు వ్యక్తి వ్యాపారి దంపతులపై దాడి చేయడం, మహిళను తన్నిడం వంటివి చేశాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్లో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ధర్మేంద్ర కుష్వాపై కేసు నమోదు చేశారు. సదరు వృద్ధ దంపతులు కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లు వాపోయారు. తమకు సాయం చేయడానికి ఎవరు రాలేదని ఆ దంపతులు వాపోయినట్లు పోలీసులు తెలిపారు. వాస్తవానికి అది ఏవిధంగానూ పెద్ద ప్రమాదం కాదని, అతడు కావాలనే వారిపై దాడికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. INDORE ROAD RAGE Viral | मिनी मुंबई Indore में Road Rage, मामूली टक्कर के बाद डॉक्टर और शिक्षिका को पीटा | Indore |MP Oh My God Oh My God Part 1.1 pic.twitter.com/3MQQm8KoTk — Adil INC ( Being Human) (@Adil_INC_) December 6, 2022 (చదవండి: శిక్ష పడుతుందన్న భయంతో.. విచారణ ఖైదీ ఆత్మహత్య) -
19 ఎకరాలు.. దేశంలోనే పెద్ద మాల్.. ఎక్కడో తెలుసా!
దేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అందుబాటులోకి వచ్చింది. షాపింగ్ మాల్స్ అభివృద్ధి, నిర్వహణలో ఉన్న ఫీనిక్స్ మిల్స్ దీనిని ఏర్పాటు చేసింది. 19 ఎకరాల్లో ఫీనిక్స్ సిటాడెల్ మాల్ కొలువుదీరింది. ఈ ప్రాజెక్టుకు కంపెనీ రూ.800 కోట్లు ఖర్చు చేసింది. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ జేవీ ద్వారా ఫినిక్స్ మిల్స్ ఈ మాల్ను అభివృద్ధి చేసింది. మాల్లోని ప్రధాన భవనం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 300 షాప్స్ ఏర్పాటయ్యాయి. వచ్చే ఏడాది ఈ దుకాణాలు రూ.1,000 కోట్ల వ్యాపారం చేసే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. చదవండి: NPCI: ఫోన్పే, గూగుల్పే యూజర్లకు భారీ ఊరట.. -
రేపిస్ట్లతో పాటు పేరెంట్స్ శిక్ష అనుభవించాల్సిందే!
భోపాల్: దేశవ్యాప్తంగా ఈమధ్య వరుసగా ఘోర నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్చ కూడా విస్తృత స్థాయిలో నడుస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనలను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. మధ్యప్రదేశ్ బీజేపీ నేత, ఇండోర్ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్వర్గీయా.. రేపిస్ట్, హంతకులను ఉద్దేశించి వ్యాఖ్యనించే క్రమంలో ఆసక్తికర కామెంట్ చేశాడు. వాళ్లతో(రేపిస్టులు, హంతకులు) పాటు వాళ్ల తల్లిదండ్రులు కూడా శిక్ష అనుభవించాల్సిందేనని డిమాండ్ చేశారాయన. వాళ్లలో అలాంటి నేర ప్రవృతి పెరగడానికి, వాళ్ల ప్రవర్తనకు తల్లిదండ్రులే కారణమని విమర్శించారాయన. బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ్వర్గీయా తనయుడు ఈ ఆకాశ్. ఆదివారం ఇండోర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ‘‘అత్యాచారాలు చేస్తే ఆ వ్యక్తినే కాదు.. నా అభిప్రాయం అతని తల్లిదండ్రుల్ని కూడా ఒకటి రెండేళ్లు జైల్లో పడేయాలి. అలాగే హత్యలు చేసినప్పుడు కూడా నిందితుడితో పాటు రెండు మూడేళ్లు శిక్ష పడేలా చూడాలి. సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులది. మన సంప్రదాయాన్ని నేర్పించాల్సిన బాధ్యత కూడా ఉంది. మంచి చేసినప్పుడు.. ఆ క్రెడిట్ను తల్లిదండ్రులకు ఇచ్చినప్పుడు.. చెడు విషయంలోనూ అలాగే చేయాలి కదా అని వ్యాఖ్యానించారాయన. అయితే.. #BJP नेता #AkashVijayvargiya ने कहा #Shraddha का Murder करने वाले #Aaftab जैसे गुनाहगारों के मां-बाप को भी हो सजा सब्सक्राइब करें #TimesNowNavbharat 👉https://t.co/ZXnljBIIjh#TimesNowNavbharatOriginals #TNNOriginals #ShraddhaWalker #DelhiMurder #AkashVijayvargiyaViralVideo pic.twitter.com/ihK4G0bdIt — Times Now Navbharat (@TNNavbharat) November 21, 2022 Video Credits: Times Now Navbharat ఆయన వ్యాఖ్యలు ప్రముఖంగా రాజకీయ విమర్శలకు దారి తీయడంతో.. అది పూర్తిగా తన వ్యక్తిగత విషయమని, అవకాశం గనుక దొరికితే తాను ఆ చట్టం అమలు చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: శివాజీపై వ్యాఖ్యల దుమారం.. బీజేపీ ఏమందంటే.. -
'ఇండోర్లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు
ఇండోర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో రెండు రోజుల్లో మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో ఆయనను చంపేస్తామని బెదిరింపులు రావడం పార్టీ శ్రేణులకు ఆందోళన కల్గిస్తోంది. మధ్యప్రదేశ్ రాజధాని ఇండోర్ జుని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్వీట్ షాపు ముందు ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షమైంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇండోర్లో అడుగు పెట్టగానే బాంబులేసి చంపేస్తామని లేఖలో ఉంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. ఈ లేఖ ఎవరి పని అయి ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితుడిపై తీవ్ర అభియోగాలు మోపి విచారణ చేపట్టారు. వీర్ సావర్కర్ ప్రాణభయంతో బ్రిటిషర్లను క్షమాభిక్ష కోరిన వ్యక్తి అని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన తరుణంలో ఈ బెదిరింపు లేఖ ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. శుక్రవారం యాత్రలో మహాత్మ గాంధీ మునివనవడు తుషార్ గాంధీ.. రాహుల్తో పాటు పాదయత్రలో పాల్గొన్నారు. నవంబర్ 20న మహారాష్ట్రలో యాత్ర ముగించుకుని మధ్యప్రదేశ్లోకి రాహుల్ అడుగుపెట్టనున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు మహారాష్ట్రలో కేసు పెట్టారు. స్వతంత్ర సమరయోధుడైన తన తాతను రాహుల్ అమమానించారని మండిపడ్డారు. చదవండి: నెహ్రూ మునిమనవడితో గాంధీ మునిమనవడు.. వీడియో వైరల్ -
వీళ్లు ఆడవాళ్లా లేక రౌడీలా?.. తప్పతాగి నడిరోడ్డులో యువతిపై దాడి
భోపాల్: తాగిన మత్తులో అర్ధరాత్రి నలుగురు మహిళలు నడిరోడ్డులో హల్చల్ చేశారు. మరో మహిళపై దాడి చేశారు. కాలితో తన్నుతూ, బెల్టుతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. చుట్టూ చాలా మంది ఉన్నా వారి దుశ్చర్యను ఎవరూ అడ్డుకోకపోగా.. వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. యువతిపై నలుగురు మహిళలు దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇండోర్లోని ఎల్ఐడీ జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. యువతి వెంట్రుకలు పట్టుకుని పిడిగుద్దులతో విరుచుకుపడటం, బెల్టుతో కొట్టటం, కిందపడేసి తన్నుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనపిస్తున్నాయి. ఎలాంటి కారణం లేకుండానే తనపై నలుగురు మహిళలు దాడి చేశారని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు ఇండోర్లోని ఓ ఎరువుల దుకాణంలో సెల్స్పర్సన్గా పని చేస్తోందని, ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. WATCH - Indore: Video of 'drunk' girls beating another girl on road goes viral.#Indore #Fight https://t.co/HBnMtpAWWI pic.twitter.com/Lan7H8IW4i — Md fasahathullah siddiqui (@MdFasahathullah) November 7, 2022 ఇదీ చదవండి: మద్యం మత్తులో ఎమ్మెల్యే కొడుకు హంగామా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ -
మైనర్లను ట్రక్కుకు కట్టి ఈడ్చుకెళ్లారు.. ఏం తప్పు చేశారో?
భోపాల్: ఇద్దరు మైనర్లను ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. దొంగతనం చేశారనే ఆరోపణలతో తీవ్రంగా చితకబాది.. రెండు కాళ్లకు తాళ్లు కట్టి రద్దీగా ఉండే ఛాయ్త్రోమ్ కూరగాయల మార్కెట్ గుండా ఈడ్చుకెళ్లారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇద్దరు మైనర్లపై పోలీసులు దొంగతనం కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఇద్దరిని ట్రక్కుకు కట్టి ఈడ్చకెళ్లిన ఘటనపై వీడియో ఆధారంగా కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఇదీ జరిగింది.. కూరగాయల మార్కెట్లో లోడ్ దింపుతుండగా ఇద్దరు టీనేజర్లు ట్రక్కు నుంచి డబ్బులు దొంగతనం చేశారని ఇద్దరు వ్యాపారులు, డ్రైవర్ ఆరోపించారు. వారు ట్రక్కులోంచి నగదు తీస్తుండగా తాను చూసినట్లు డ్రైవర్ చెప్పాడు. ఈ క్రమంలో వ్యాపారులు, అక్కడే ఉన్న కొందర మైనర్లను చితకబాదారు. వారి కాళ్లకు తాడు కట్టి ట్రక్కుకు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఇలా కూరగాయల మార్కెట్ మొత్తం తిప్పారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు మైనర్లను అదపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ‘మైనర్ల పట్ల ప్రవర్తించిన తీరు భయానకం, హింసాత్మకం. వారిపైనా మేము చర్యలు తీసుకుంటాం. వీడియో ఆధారంగా వారిని గుర్తిస్తున్నాం.’ అని ఇండోర్ పోలీసు అధికారి నిహత్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం -
చిన్న దుకాణానికి రూ.1.72 కోట్ల లీజు.. ఒక్క అడుగు రూ.2.47 లక్షలు
ఇండోర్: గుడి ఆవరణలో కేవలం పూలు, పూజా సామగ్రి, ప్రసాదాలు విక్రయించే 69.50 చదరపు అడుగుల వైశాల్యమున్న చిన్నపాటి దుకాణాన్ని ఓ వ్యాపారి రూ.1.72 కోట్లకు 30 ఏళ్లపాటు లీజుకు దక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని ప్రఖ్యాత ఖజ్రానా గణేశ్ ఆలయ కాంప్లెక్స్లో ఈ లీజు వ్యవహారం చోటుచేసుకుంది. ‘1–ఎ’ దుకాణాన్ని లీజుకు ఇవ్వడానికి ఆలయ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. రూ.30 లక్షలు కనీస మొత్తంగా నిర్ణయించారు. వేలం పాటలో ఇది ఏకంగా రూ.1.72 కోట్లకు చేరింది. అంటే ఒక్కో చదరపు అడుగు స్థలం రూ.2.47 లక్షలు పలికింది. వాణిజ్య స్థలం లీజు కోసం ఈ స్థాయిలో ధర పలకడం అరుదైన సంఘటన అని చెప్పొచ్చు. ఖాజ్రానా వినాయక ఆలయానికి దర్శించుకొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక్కడ వ్యాపారం భారీగానే జరుగుతోంది. -
బుల్లితెర నటి ఆత్మహత్య కేసులో కీలక మలుపు!
నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఇండోర్లోని తన నివాసంలో ఇవాళ ఉరేసుకుని చనిపోగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ నటి నివాసంలో దొరికిన సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకు పొరుగున ఉండే రాహుల్ వేధింపులు తట్టుకోలేకే నటి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇండోర్ ఏసీపీ ఎం. రెహమాన్ తెలిపారు. వైశాలి టక్కర్ ఈ-గాడ్జెట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోర్ ఏసీపీ ఎం. రెహమాన్ వెల్లడించారు. రాహుల్ ఆమెను వేధింపులకు గురి చేసినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని రాహుల్కు తెలియడంతో ఆటంకాలు కలిగించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రస్తుతం రాహుల్ పరారీలో ఉన్నాడని ఏసీపీ రెహమాన్ పేర్కొన్నారు. (చదవండి: ఉరేసుకుంటానని అప్పుడే హింటిచ్చిన నటి! వీడియో వైరల్) కెన్యాలో పనిచేసే అభినందన్ సింగ్ అనే సర్జన్తో వైశాలి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఆమె స్వస్థలం ఉజ్జయిని జిల్లాలోని మహిద్పూర్ పట్టణం. గత రెండేళ్లుగా వైశాలి టక్కర్ ఇండోర్లో నివసిస్తున్నారు. 2015లో 'యే రిష్తా క్యా కెహ్లతా హై'తో టెలివిజన్లోకి అడుగుపెట్టింది. ఆమె 'సూపర్ సిస్టర్స్', 'మన్మోహిని 2' వంటి షోలలో కూడా పనిచేసింది. ఆమె చివరిగా 'రక్షాబంధన్' సీరియల్లో కనిపించింది. అంతేకాకుండా, ఆమె 'యే హై ఆషికి'లోని కొన్ని ఎపిసోడ్లలో కూడా భాగమైంది. #UPDATE | Her (TV actor Vaishali Takkar) e-gadgets will be probed. Her neighbour Rahul harassed her, because of whom she took this extreme step. She was about to get married to another man, but he hindered that too. Rahul is absconding; search on to nab him: Indore ACP M Rahman pic.twitter.com/ttGMak8WJm — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 16, 2022 -
మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై టీచర్ వేధింపులు
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మదర్సాలో 12 ఏళ్ల విద్యార్థినిపై 52 ఏళ్ల ఉపాధ్యాయుడు వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చందన్నగర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అభయ్ తెలిపారు. బాధితురాలి తండ్రి, చిన్నాన్నను కొట్టినందుకు ఉపాధ్యాయుడి ఇద్దరు కుమారులపై కేసు పెట్టినట్లు చెప్పారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు ప్రకారం.. బాలిక గత నెలలో మదర్సాలో చేరింది. పాఠాలు చెప్పే నెపంతో ఉపాధ్యాయుడు ఆమెను అసభ్యంగా తాకేవాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. నిలదీసేందుకు వెళ్లిన బాలిక తండ్రి, చిన్నాన్నను నిందితుడి కుమారులు కొట్టారు. -
టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం
భారతదేశంలోనే స్వచ్ఛ నగరంగా ఇండోర్ వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఇండోర్ నగరమే ఎందుకు ఆ ఘనతను దక్కించుకోగలిగందంటే..ఎక్కడైన పొడిచెత్తను, తడిచెత్తను విభజించడం సర్వసాధారణం. కానీ ఇండోర్లో మాత్రం చెత్త సేకరణ వద్దే ఆరు విభాగాలుగా విభజిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పిలిచే ఇండోర్ సుమారు 35 లక్షల జనాభా కలిగిన అతి పెద్ద నగరం. ప్రతిరోజు దాదాపు 1200 టన్నుల పొడి చెత్త, సుమారు 700 టన్నుల తడి చెత్తను విడుదల చేస్తున్నప్పటికీ చెత్త డబ్బాల్లో చెత్త మాత్రం కనిపించదు. ఎందుకంటే... అక్కడ దాదాపు 850 వాహనాలతో గృహాలు, వ్యాపార సంస్థలను నుంచి సేకరించే వేస్ట్ను ఆరు విభాగాలు విభజించి ఎప్పటికప్పుడూ తరలిస్తారని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మహేష్ శర్మ తెలిపారు. వాహానాల్లోని వ్యర్థాలకు సంబంధించి ప్రత్యేక కంపార్ట్మెంట్లు ఉంటాయి. దీంతో సేకరణ ప్రారంభంలోనే సమర్ధవంతంగా ఆ వేస్ట్ని ప్రాసెస్ చేసేందుకు సులభంగా ఉంటుంది. ప్రధానంగా సేకరించిన తడి చెత్త కోసం బయో సీఎన్జీ(కంప్రెషన్ నేచురల్ గ్యాస్) ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ఆసియాలోనె అతిపెద్దది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రధాని నరేంద్ర మోదీ 150 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ని ప్రారంభించారు. ఈ ప్లాంట్ రోజుకు 550 మిలియన్ టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేయడమే కాకుండా సుమారు 17 వేల నుంచి 18 వేల కిలోల బయో సీఎన్జీ తోపాటు దాదాపు 10 టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేయగలదు. ఈ సీఎన్జీతో దాదాపు 150 సీటీ బస్సులు నడుపుతోంది. దీని ధర వాణిజ్య సీఎన్జీ కంటే రూ. 5లు తక్కువ కూడా. గత ఆర్థిక సంవత్సరంలో వ్యర్థాల తొలగింపుతో సుమారు రూ. 14 కోట్లు ఆర్జించింది. అందులో కార్బన్ క్రెడిట్ అమ్మకం ద్వారానే దాదాపు రూ. 8 కోట్లు కాగా, బయో సీఎన్జీ ప్లాంట్కి వ్యర్థాలను సరఫరా చేసినందుకు ప్రైవేట్ కంపెనీ నుంచి వార్షిక ప్రీమియం సుమారు రూ. 2 కోట్లు ఆర్జించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యర్థాల తొలగింపుతో దాదాపు రూ. 20 కోట్లు ఆర్జించాలని పౌర సంఘం లక్ష్యంగా పెట్టుకుందని సూపరింటెండెంట్ మహేష్ శర్మ చెప్పారు. అంతేకాదు నగరంలో విడుదలయ్యే మరుగు నీటిని సైతం ప్రత్యేక ప్లాంట్లలో శుద్ధి చేసి సుమారు 200 పబ్లిక్ గార్డెన్లు, పొలాలు, నిర్మాణ కార్యకలాపాలకు తిరిగి ఉపయోగిస్తారని ఉద్యానవన అధికారి చేతన్ పాట్ తెలిపారు. (చదవండి: దేశంలోనే స్వచ్ఛ నగరంగా మళ్లీ ‘ఇండోర్’.. విజయవాడకు నాలుగో స్థానం) -
స్వచ్ఛ సర్వేక్షణ్ 2022: వరుసగా ఆరోసారి తొలిస్థానంలో ‘ఇండోర్’
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా ఆరో ఏడాది తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గుజరాత్లోని సూరత్ నగరం తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని నావి ముంబై మూడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నాలుగో స్థానంలో ఉంది. ‘స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్- 2022’లో మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలు నిలిచాయి. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్, సూరత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. నావి ముంబై, విజయవాడలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు.. 100లోపు అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న రాష్ట్రాల జాబితాలో త్రిపురకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లోని మరిన్ని అంశాలు ఇలా ఉన్నాయి.. ► ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ► లక్షలోపు జనాభా కలిగిన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పంచ్గాని నగరం తొలి స్థానం సాధించింది. ఆ తర్వాత పటాన్(ఛత్తీస్గఢ్), కర్హాద్(మహారాష్ట్ర)లు ఉన్నాయి. ► లక్షకుపైగా జనాభా కలిగిన గంగా పరివాహక నగరాల్లో హరిద్వార్ తొలిస్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, రిషికేశ్లు ఉన్నాయి. లక్షలోపు జనాభా కలిగిన నగరాల్లో బిజ్నోర్కు ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత కన్నౌజ్, గర్ముఖ్తేశ్వర్ నగరాలు నిలిచాయి. ► మహారాష్ట్రలోని డియోలాలి దేశంలోనే స్వచ్ఛమైన కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా 2016లో 73 నగరాలను పరిగణనలోకి తీసుకోగా.. ఈ ఏడాది ఏకంగా 4,354 నగరాలను పరిశీలించి అవార్డులు ప్రకటించారు. ఇదీ చదవండి: ‘పోక్సో’ కేసులో సంచలన తీర్పు.. ఆ మానవ మృగానికి 142 ఏళ్ల జైలు శిక్ష -
భార్య పుట్టింటికి వెళ్లిందని... ట్రాన్స్ జెండర్ని ఇంటికి రప్పించి...
Mutilated Body Found In Indore: ఇండోర్లోని పోలీసులు పొదలమాటున చిద్రమైన ట్రాన్స్జెండర్ మృత దేహాన్ని గుర్తించారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించడం ప్రారంభించారు. ఈ మేరకు పోలీసులు ఈ కేసు మిస్టరిని చేధించి నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం....పోలీసుల గుర్తించిన ఆ ట్రాన్స్జెండర్ మృతదేహంలో ఒక భాగం మాత్రమే లభించింది. దీంతో పోలీసుల ఆ పరిసర ప్రాంతాల్లో పీసీఫుటేజ్ని పరిశీలించగా.... చనిపోయిన ట్రాన్స్ జెండర్ ఆగస్టు 28న కనిపించకుండా పోయిన అలియాస్ జోయా కిన్నార్గా గుర్తించారు. ఐతే ఈ కేసులో అనుమానితుడు ఖజ్రానాకు చెందిన నూర్మహ్మద్గా గుర్తించి విచారణకు పిలిపించారు. అతను విచారణలో చెప్పిన విషాయలు విని పోలీసులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. నిందితుడు విచారణలో అతని భార్య పుట్టింటికి వెళ్లిందని, తాను ఆ సమయంలో ట్రాన్స్జెండర్ జోయాతో సోషల్ మీడియాలో చాటింగ్ చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత తాను జోయాను తన ఇంటికి రమ్మని ఆహ్వానించానని చెప్పాడు. ఇంటికి వచ్చాకే జోయా ట్రాన్స్జెండర్ అని తెలిసిందని, దీంతో ఈ విషయమై మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని తెలిపాడు. ఆ కోపంలో తాను ఆమె గొంతుకోసి చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేసి, అందులో ఒక భాగాన్ని సంచిలో వేసి బైపాస్ సమీపంలోని పొదల్లోకి విసిరేసినట్లు తెలిపాడు. మరో భాగాన్ని పారేయలేక తన ఇంట్లోనే పెట్టేలో భద్రపరిచినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు మిగతా భాగం మృతదేహాన్ని నిందితుడు నూర్మహ్మద్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. (చదవండి: గర్భిణి మృతి... దెబ్బకు రాజీనామా చేసిన ఆరోగ్యమంత్రి) -
Photo Feature: కలపపై రాష్ట్రపతి పోట్రెయిట్
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మీద తమ గౌరవాన్ని భిన్నంగా చాటుకున్నది ‘షికుంజ్.కామ్’ అనే సంస్థ. 4 వేల చదరపు అడుగుల ముర్ము కలప పోట్రెయిట్ను గీయించింది. అది కూడా వెస్టీజ్ వుడ్ (వివిధ రకాల కర్ర ముక్కలనుంచి తయారు చేసిన కలప)తో తయారు చేసిన కాన్వాస్ మీద. ఇండోర్కు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ సాహిల్ లహరి, మరో 50 మంది కళాకారులు కలిసి ఈ పోట్రెయిట్ను రూపొందించారు. ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి వారికి ఐదు రోజులు పట్టింది. ‘‘రాజ్యాంగపరంగా ఈ దేశపు అత్యున్నత పదవి రాష్ట్రపతి. ఆ స్థానానికి ఎన్నిౖకైన మొట్టమొదటి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము. మహిళా సాధికారతకోసం పనిచేసే మా సంస్థ మహిళ అయిన రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం ఇది’’ అని నిర్వాహకుల్లో ఒకరైన రాహుల్ భార్గవ్ తెలిపారు. చదవండి: మెట్రో స్టేషన్పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా! -
ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు.. హాస్టల్లో అమ్మాయిలపై పైశాచికత్వం!
Seniors ragging.. కాలేజ్ డేస్ అనగానే చాలా మందికి హ్యాపీడేస్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసే సీన్స్ నవ్వుతో పాటుగా కోపాన్ని కూడా తెప్పిస్తుంది. అలాగే, కొందరు విద్యార్థులు తాము కాలేజీలో చేరిన మొదటి రోజుల్లో సీనియర్ల ర్యాగింగ్ను గుర్తు చేసుకుని కొందరు నవ్వుకుంటే.. మరికొందరు మాత్రం భయంతో వణికిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ మెడికల్లో చోటుచేసుకుంది. మానవత్వం మరిచిన సీనియర్స్.. జూనియర్ల పట్ల వికృత చర్యలకు దిగారు. జూనియర్ అమ్మాయిలతో కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇండోర్లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ పేరుతో సీనియర్లు రెచ్చిపోయారు. హాస్టల్లో జూనియర్లను తమ రూమ్స్లోకి పిలిపించుకుని ఓవర్గా బిహేవ్ చేశారు. దిండ్లతో శృంగారం చేయాలని వారిని బలవంతం చేశారు. ఈ క్రమంలోనే జూనియర్ అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఒకరికొకరు కొట్టుకోవాలని బెదిరించారు. దీంతో, సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్లు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు చెందిన యాంటీ ర్యాగింగ్ హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేసి జరిగిన దారుణాన్ని వివరించారు. విద్యార్థుల ఫిర్యాదులో ర్యాగింగ్ ఘటనను సీరియస్గా తీసుకున్న యూజీసీ.. రంగంలోకి దిగి విచారణ జరిపింది. విద్యార్థులను వేధింపులకు గురిచేసిన సీనియర్లను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యానికి యూజీసీ ఆదేశించింది. దీంతో, పోలీసులు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ -2009 కింద సీనియర్లపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ‘Have sex with pillows, abuse girls’: Freshers allege ragging in Indore's MGM Medical College#indorenews #MadhyaPradesh #CollageRagging #nvbcnews pic.twitter.com/fRiQUIX2gP — NVBC News (@NewsNvbc) July 30, 2022 ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్లో పోలీస్ వీరంగం.. వృద్ధుడ్ని తన్ని ఈడ్చుకెళ్లి టార్చర్.. వీడియో వైరల్ -
Crime News: జొమాటో డెలివరీ బాయ్ దారుణ హత్య
భోపాల్: పొట్టకూటి కోసం డెలివరీ బాయ్గా పని చేస్తున్న కుర్రాడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు దుండగులు. చావు బతుకుల మధ్య ఆస్పత్రికి వెళ్లిన ఆ యువకుడికి అక్కడా నిర్లక్ష్యమే ఎదురైంది. చికిత్స ఆలస్యం కావడంతో ఒక నిండు ప్రాణం బలైంది. మధ్యప్రదేశ్ ఇండోర్ బాన్గంగా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. సునీల్ వర్మ అనే 20 ఏళ్ల యువకుడు డిగ్రీ చదువుతూనే.. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్లో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి తన మోటార్బైక్పై అరబిందో సమీపంలోని కరోల్బాగ్ వద్ద ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్తుండగా.. ముగ్గురు అతన్ని బైకులపై వెంబడించారు. అతన్ని అడ్డగించి కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో స్వయంగా బండి నడుపుతూనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నాడు. అయితే ఆస్పత్రిలోనూ అతనికి సకాలంలో చికిత్స అందలేదు. ఆలస్యంగా చికిత్స ప్రారంభించిన వైద్యులు.. పరిస్థితి విషమించే సరికి మరో ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి అతను కన్నుమూశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా అతన్ని ముగ్గురు వెంబడించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. శరీరంలో ఐదు కత్తిపోట్లు ఉన్నాయని, దొంగతనంలో భాగంగా పెనుగులాటలో అతని బ్యాగ్ చినిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఘటనపై పలు కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టినట్లు, నిందితులను పట్టుకుంటామని ఇండోర్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు టైంకి చికిత్స అందించని ఆస్పత్రి వర్గాలపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జోరు వానలోనూ.. వాళ్ల డెడికేషన్కు అంతా ఫిదా!
వైరల్: పెళ్లంటే.. మామూలు హడావిడి ఉండదు మన దేశంలో. బారాత్లు, ఊరేగింపుల కోసం ప్రిపరేషన్లు కూడా ముందు నుంచే ఉంటాయి కూడా. మరి ఆ జోష్ను దెబ్బ తీసే పరిస్థితులు ఎదురైతే!. భారీగా జోరు వాన కురుస్తుండడంతో ఆ పెళ్లి వేడుకలు నీరుగారినట్లే అని అంతా భావించారు. కానీ, చుట్టాలు ఎవరూ తగ్గలేదు. అంత వానలోనూ పైన పెద్ద టార్ఫలిన్ పట్టాను కప్పేసుకుని మరీ బారాత్ను నిర్వహించారు వాళ్లు. వానలోనే తడుస్తూ.. చిందులేసిన వాళ్లు కొందరైతే.. ఆ కవర్ కింద నిల్చుని వేడుకలను వీక్షిస్తూ వెంట నడిచిన వాళ్లు మరికొందరు. వీళ్ల డెడికేషన్కు ఇంటర్నెట్ ఫిదా అయిపోయింది. అందుకే వీడియో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఊరేగింపు చోటు చేసుకుందని తెలుస్తోంది. This called pure #dedication #Barat #Indore 😂🤣 pic.twitter.com/0AyZxVzRE2 — शैलेंद्र यादव (@ShailenderYadu) July 6, 2022 -
పానీపూరి మైకంలో లక్ష రూపాయలు మరిచిపోయిన నటి..
Actress Kamya Punjabi Forget Rs 1 Lakh At Pani Puri Stall In Indore: పానీపూరి పేరు వింటే చాలు మైమరిచిపోతారు అమ్మాయిలు. వారికి ఇది ఎంతో ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. పానీపూరిని తింటూ లోకాన్నే మరిచిపోతారు అమ్మాయిలు. ఈ విషయంలో సాధారణ యువతులే కాదు సెలబ్రిటీలేం అతీతం కాదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతోంది. ఈ పానీపూరి మైకంలో ఏకంగా లక్ష రూపాయలను అక్కడే మరిచిపోయి వచ్చింది ఓ నటి. ఆ నటి ఎవరో కాదు కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి తదితర హిట్ సినిమాల్లో నటించిన కామ్య పంజాబీ. ఆమె ఇటీవల ఇండోర్కు వెళ్లిన కామ్య ఓ ఈవెంట్లో పాల్గొంది. అక్కడ బయటకు వెళ్లి పానీపూరిలను ఓ పట్టు పట్టింది. పానీపూరిలు ఆస్వాదిస్తూ అక్కడ టేబుల్పై రూ. లక్ష ఉన్న ఎన్వలప్ కవర్ను పెట్టింది. తర్వాత అక్కడ ఫొటోలు తీస్తూ తీస్తూ ఆ ఎన్వలప్ను అక్కడే మరిచిపోయి హోటల్కు తిరిగివెళ్లింది. హోటల్కు వెళ్లిన కొద్దిసేపటికే ఎన్వలప్ను మరిచిపోయిందనే సంగతి గుర్తుకు వచ్చి తన మేనేజర్ను పంపించదట. తాను మరిచిపోయిన చోటుకు వెళ్లిన కామ్య మేనేజర్ ఆ ఎన్వలప్ను తిరిగి తీసుకువచ్చాడు. ఈ విషయాన్ని నటి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఎన్వలప్ మరిచిపోయిన సమయంలో తీవ్ర ఒత్తిడిగి గురైనట్లు కామ్య తెలిపింది. 'నిజానికి ఆ డబ్బు దొరకదనుకున్నాను. అంత రద్దీ ప్రదేశంలో విలువైన ఎన్వలప్ దొరకడం ఆశ్చర్యంగా ఉంది. ఇండోర్ ప్రజలు చాలా మంచివారు, దయగలవారు.' అని కామ్య పంజాబీ తెలిపింది. చదవండి: విపరీతమైన చెమటలు.. కేకే ఆఖరి వీడియో వైరల్ ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ -
ఘోర ప్రమాదం.. గాఢ నిద్రలో అగ్నికి ఆహుతైన ఏడుగురు!
ఇండోర్: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండోర్లో ఓ రెండంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించినట్లు ఇండోర్ కమిషనర్ హరినారాయణ చారి మిశ్రా తెలిపారు. తొమ్మిది మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం వేకువ జామున నాలుగు, ఐదు గంటల మధ్య ఇండోర్ స్వర్ణ్ భాగ్ కాలనీలోని ఓ రెండు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. నిద్రలో ఉండగా జరిగిన ప్రమాదంతో తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షార్ట్సర్క్యూట్తోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. #UPDATE | Seven people died in the fire that broke out in a two-storey building in Indore, Madhya Pradesh: Indore Police Commissioner Harinarayana Chari Mishra to ANI Latest visuals from the spot. pic.twitter.com/E6wXhytkl3 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 7, 2022 -
సోల్ ట్రేడ్..: ఉత్తమ అత్తాకోడళ్లు
చెన్నైలోని ఎస్ఆర్యం యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో సురభి సొంత వ్యాపారం గురించి కల కనేది. నిజానికి ఆమెది వ్యాపారనేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ, తన ఆలోచనకు కుటుంబసభ్యులు పెద్దగా మద్దతు ప్రకటించలేదు. ‘ఉద్యోగం చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కాలం కలిసొస్తే అమెరికా వెళ్లి స్థిరపడిపోవచ్చు. వ్యాపారం చేయడమనేది పెద్ద రిస్క్. అందరికీ అది సాధ్యం కాదు’ అంటుండేవారు. అంతమాత్రాన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు సురభి. నిర్మాణ్ షాతో వివాహం అయిన తరువాత ఆమె ఇండోర్ (మధ్యప్రదేశ్)కు వెళ్లింది. అక్కడ అత్త రూపంలో తనకొక ‘అదృష్టం’ పరిచయం అయింది. అత్త చేత్న షా తనతో ఒక స్నేహితురాలిలా ఉండేది. అత్తగారితో తన ఆలోచన పంచుకుంది సురభి. ‘ఎందుకమ్మా రిస్క్’ అని అత్తగారు అనలేదు. కోడలి ఉత్సాహానికి మరింత ప్రోత్సాహం ఇచ్చింది. అలా ‘కారాగ్రీన్’స్టార్టప్కు అంకురార్పణ జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల జరిగే నష్టాల గురించి పుస్తకాల్లో చదవడమే కాదు, ఆ విషాదాన్ని కళ్లతో చూసింది సురభి. ‘ఎవరికి వారు ఇది నా సమస్య కాదు. ఎవరో వస్తారు. ఏదో చేస్తారు అనుకుంటే సమస్య మరింత పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచనలో నుంచి వచ్చిందే కారాగ్రీన్’ అంటుంది సురభి. ‘కారాగ్రీన్’ అనేది బయోడిగ్రేడబుల్ అంకుర సంస్థ. పర్యావరణహితమైన పెన్నులు, పెన్సిల్స్, సీడ్ పేపర్ డైరీలు, క్యాలెండర్లతో పాటు ప్యాకింగ్ సామాగ్రిని తయారు చేస్తారు. ఊహల్లో ఉన్న ప్రాజెక్ట్ కాగితం మీదికి రావడానికి, అక్కడి నుంచి వాస్తవరూపం దాల్చడానికి మధ్యలో సందేహాలు, సమస్యలు, అవాంతరాలు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో కోడలికి అండగా నిలిచి ముందుకు నడిపించింది చేత్న షా. ‘వ్యాపారంలో మన కుటుంబసభ్యుల అండ అనేది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది సురభి. కట్ చేస్తే... షార్క్ ట్యాంక్ ఇండియా (బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్)లో ‘కారాగ్రీన్’ 50 లక్షల ఫండింగ్ ఆఫర్ను గెలుచుకుంది. -
వివాహితుడితో ప్రేమ.. సరిగ్గా ఎంగేజ్మెంట్కు ముందు!
అతనికే ఇదివరకే పెళ్లి అయ్యింది. అది తెలిసి కూడా ఆమె అతన్నే ప్రేమించింది. రెండో భార్యగా అయినా సరే అతనితో జీవితం పంచుకునేందుకు సిద్ధపడింది. ఇష్టపడ్డ వ్యక్తి సహా సమాజం అందుకు ఒప్పుకోలేదు. మరో వ్యక్తితో మూడు ముళ్లు వేయించుకునేందుకు సిద్ధపడింది. సరిగ్గా నిశ్చితార్థం ముందు.. ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేక, మనసు చంపుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ‘‘నేను నా ఇష్టపూర్వకంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నా... ఐ లవ్ యూ దీపక్. బతికుండగా నీదానిని కాలేకపోయా. ఎందుకంటే.. మీకు ఇప్పటికే పెళ్లయ్యి పోయింది. ఎవరూ అందుకు ఒప్పుకోలేదు. నా తల్లిదండ్రులు చాలా మంచివారు. మా తమ్ముడు ధీరజ్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను మరోలా అర్థం చేసుకోకండి.. ఐ లవ్ యూ దీపక్’’ అంటూ రక్తంతో సూసైడ్ లేఖ రాసి ప్రాణం తీసుకుంది 23 ఏళ్ల శివాని. మధ్యప్రదేశ్ ఇండోర్లోని నాగిన్ నగర్లో ఉంటోంది శివాని కుటుంబం. స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఆమె పీజీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆ ఏరియాలోనే దీపక్కు శానిటరీ షాపు ఉంది. ఆయన వివాహితుడు. అది తెలిసి కూడా శివాని ప్రేమ పేరుతో ఆయన వెంటపడింది. ఈ విషయంపై దీపక్ భార్య, శివాని ఇంటికి వచ్చి గొడవ పడింది కూడా. ఆ సమయంలో.. దీపక్కు రెండో భార్యగా ఉంటానంటూ శివాని చెప్పగా, పెద్ద పంచాయితీయే జరిగింది. ఈ గొడవ తర్వాత కుటుంబ సభ్యులు శివానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆపై శివానికి విజయ్ నగర్ ఏరియాకు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి నిర్ణయించారు. మరికొన్ని రోజుల్లో ఎంగేజ్మెంట్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం.. ఇంట్లో ఎవరూ లేని టైంలో శివాని బలవన్మరణానికి పాల్పడింది. ముందు బ్లేడ్తో చేతులు, కాళ్లు కోసుకున్న శివాని.. ఆ రక్తంతో సూసైడ్ నోట్ రాసింది. ఆపై ఫ్యాన్కు ఉరేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, దీపక్ లేని జీవితం ఊహించుకోలేక చనిపోతున్నట్లు ఆమె అందులో పేర్కొంది. ఈ మేరకు పోలీస్ అధికారి సంజయ్ శుక్లా కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. -
అవాక్కయ్యే ఫిర్యాదు! సార్ మోదీ ఫోటో తీసేయమంటున్నారు
landlords threatened Take Down The photo of PM Modi: పోలీస్స్టేషన్లో కొంతమంది చాలా విచిత్రమైన ఫిర్యాదులు చేస్తుంటారు. ఇవన్నీ పోలీసులకు మాములే. కానీ కొన్ని ఫన్నీగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం పోలీసులు ఆగ్రహానికి గురై సదరు వ్యక్తుల పై చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడొక వ్యక్తి పోలీసులకు ఒక విచిత్రమైన కంప్లైయింట్ ఇచ్చాడు. ఆ ఫిర్యాదు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన ఇండోర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇండోర్లోని పీర్ గలి నివాసి యూసుఫ్ మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఒక విచిత్రమైన ఫిర్యాదు చేశాడు. తనకు ప్రధాని మోదీ అంటే ఇష్టం అని, ఆయన సిద్ధాంతల పట్ల గౌరవంతో తాను అద్దెకు తీసుకుంటున్న ఇంట్లో మోదీ ఫోటోను పెట్టుకున్నాని యాసుఫ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే భూస్వాములు యాకూబ్ మన్సూరి సుల్తాన్ మన్సూరీ ప్రధాని మోదీ చిత్రపటాన్ని తొలగించాలని ఒత్తిడి చేయడమే కాకుండా తీయకపోతే ఇంట్లోంచి గెట్టేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు చెప్పాడు. దీంతో డీసీపీ మనీషా పాఠక్ యూసుఫ్ ఫిర్యాదు మేరకు సదర్ బజార్ టీఐని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. (చదవండి: 74 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్ కోసమే ఇదంతా... నెటిజన్లు ఫిదా) -
పతా.. ఈ అడ్రెస్ ఎక్కడ..?
కావలసిన వారి చిరునామా వెతుక్కుంటూ ఒకరు ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండీ?’’ అని అడిగితే.. ‘‘ఆనందరావు ఇల్లు ఎక్కడండి’’ అని వెటకారంగా సమాధానం చెబుతారు మరొకరు. తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన జోకు ఇది. స్క్రీన్ మీద నటులు పడే తంటాలు మనకు నవ్వు తెప్పిస్తే, రియల్ లైఫ్లో మాత్రం ముచ్చెమటలు పట్టేస్తాయి. ఇల్లు, ఆఫీస్ల అడ్రెస్ను కనుక్కోవాలంటే తిప్పలు తప్పవు. కొత్త ఏరియాలో ఒకరి అడ్రెస్ కనుక్కోవాలన్నా, మన ఆర్డర్ను ఇంటికి తెచ్చి ఇచ్చే డెలివరీ బాయ్కు మన అడ్రెస్ వివరంగా చెప్పాలన్నా, గొంతు నొప్పి పుట్టేలా అరవాల్సిందే. అందరిలాగే ఈ ఇబ్బందులన్నీ కృతికా జైన్ కు కూడా ఎదురయ్యాయి. అడ్రెస్ దొరకగానే సమస్య తీరిపోయిందిలే అనుకోలేదు. తనలా ఇబ్బంది పడేవారందరికీ ఓ చక్కని పరిష్కారం చూపాలనుకుని ‘పతా’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక . ఇండోర్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కృతికా జైన్కు విదేశాల్లో చదువుకోవడం అంటే ఎంతో ఇష్టం. పాఠశాల విద్య అయిన తరువాత పైచదువులు విదేశాల్లో చదువుకుంటానని మారాం చేసింది. ‘నువ్వు ఇంకా చిన్నపిల్లవు, ఒక్కదానివి అంతదూరం వెళ్లి చదువుకోవడం కష్టం’ అని వారించారు తల్లిదండ్రులు. దీంతో డిగ్రీ అయ్యాక విదేశాలకు వెళ్తానని మరోసారి తల్లిదండ్రులను అడిగి ఒప్పించింది. విదేశాలకు వెళ్లేందుకు అన్ని పరీక్షల్లోనూ నెగ్గి, న్యూయార్క్ యూనివర్సిటీలో ‘మేనేజ్మెంట్ టెక్నాలజీ’లో మాస్టర్స్ చేసేందుకు అడ్మిషన్ సంపాదించింది. అడ్రెస్సే కెరియర్గా.. చదువులో భాగంగా న్యూయార్క్లో రెండేళ్లపాటు ఉన్న కృతికను.. అక్కడి రోడ్లు, అడ్రెస్ తెలిపే మార్కింగ్లు ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఈ రంగాన్ని తన కెరియర్గా మలచుకోవాలనుకుంది. కానీ ఇండియా వచ్చిన వెంటనే మంచి సంబంధం రావడంతో కృతికకు వివాహం అయింది. పెళ్లి తరువాత ఒకరోజు కృతిక తనకు తెలిసిన వారింటికి వెళ్లడానికి బయలుదేరింది. అడ్రెస్ దొరకక పోవడంతో, చుట్టుపక్కల వారిని అడిగింది. కానీ వారు చెప్పింది కూడా అర్థంకాకపోవడంతో.. తను వెళ్లాల్సిన అడ్రెస్కు చేరుకొనేందుకు చాలా ఇబ్బంది పడింది. మరోసారి ఆన్ లైన్ లో ఆర్డరిచ్చిన ప్యాకేజీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్కు తన అడ్రెస్ సరిగా అర్థం కాకపోవడంతో, ప్యాకేజీ ఇంటికి రావడానికి చాలా సమయమే పట్టింది. దీంతో న్యూయార్క్లో అడ్రెస్లకు గూగుల్ మార్కింగ్ ఉన్నట్టే, ఇండియాలో కూడా ఉంటే ఈ సమస్యలు తలెత్తవు, అనుకుని సహ వ్యవస్థాపకులు అయిన రజత్, మోహిత్ జైన్ లతో కలిసి ‘పతా’ యాప్ను రూపొందించింది. పతా.. అడ్రెస్ను ఖచ్చితంగా చూపించే యాపే ‘పతా’. మన డిజిటల్ అడ్రెస్ను పతా రూపొందిస్తోంది. ఇది కాంప్లెక్స్ అడ్రెస్కు ఒక కోడ్ను ఇస్తుంది. ఈ కోడ్ ఆఫీసు లేదా ఇంటి అడ్రెస్ను కచ్చితంగా చూపిస్తుంది. ఇంటి చుట్టుపక్కల ఉన్న భవనాలను ఫొటోలతో సహా చూపిస్తుంది. దీనివల్ల అడ్రెస్ను పదేపదే వివరించాల్సిన పని ఉండదు. ఇంకా అడ్రెస్ను మన వాయిస్తో ఒకసారి రికార్డు చేసి షేర్ చేయవచ్చు. ఇదంతా ఒక్క క్లిక్తో అయ్యేలా చేస్తుంది పతా యాప్. ఈ యాప్ కోడ్తోపాటు మన వాయిస్తో అడ్రెస్ డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. పతా యాప్లో మన లొకేషన్స్ కు వచ్చిన కోడ్ లింక్ను.. మన అడ్రెస్ కావాల్సిన వారికి షేర్ చేస్తే, వారు గమ్యస్థానానికి సులభంగా చేరుకోగలుగుతారు. గతేడాది ‘అడ్రెస్ నేవిగేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీని ప్రారంభించి, దీనిద్వారా పతా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది కృతిక. ప్రస్తుతం ఈ యాప్ 50 లక్షలకు పైగా డౌన్ లోడ్స్తో దూసుకుపోతోంది. ‘పతా’ యాప్ సహ వ్యవస్థాపకులతో కృతిక -
కూరగాయలు అమ్ముకునే మహిళపై డాక్టర్ దాడి!
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తోపుడు బండిపై కూరగాయలమ్ముకునే ఒక మహిళపై నలుగురు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి దిగారు. గురువారం సాయంత్రం భన్వర్కువాన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఓ మహిళ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటున్న సమయంలో అక్కడే పార్క్ చేసిన కారు యజమాని అయిన డాక్టర్కు ఆమెకు పార్కింగ్ విషయంలో వాగ్వాదం జరిగింది. కాసేపటికి ఆ డాక్టర్ తన క్లినిక్ నుంచి తన సిబ్బందిని పిలిపించి ఆమెపై దాడి చేశాడు. కూరగాయలు అమ్మే ద్వారకా బాయిని , ఆమె కుమారుడు రాజును కొట్టించాడు. ఆమె బంగాళదుంపల్ని ఉల్లిపాయల్ని గిరాటేస్తూ సదరు మహిళపై దారుణంగా దాడికి దిగారు. తోపుడు బండి ముందు పార్క్ చేసిన కారును తరలించమని డాక్టర్ని కోరినందుకే వారు దాడికి దిగారని స్థానికంగా ఉన్నవారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది ఒక డాక్టర్ స్థాయి వ్యక్తి చేయాల్సిన పని కాదంటూ మండిపడుతున్నారు. Vegetable vendor in Indore,were beaten up mercilessly by a group of men.Witnesses say they asked a doctor to move his car that he had parked in front of their pushcart. Fuming over the argument,the doctor called his staff from his clinic and got the mother and son beaten up. pic.twitter.com/JoluHH67Lq — Anurag Dwary (@Anurag_Dwary) January 15, 2022 -
‘మా అమ్మ పాలు ఇలానే ఊదేది’.. ఆరేళ్ల బాలుడు మృతి!
ఇండోర్: తెలిసీతెలియని వయసది. పొంగుతున్న వేడిపాలను తల్లి ఏవిధంగా ఊదుతుందో చూసి.. తను కూడా అలాగే అనుసరించాలనే ప్రయత్నంలో ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. లసూడియా పోలీసుల కథనం ప్రకారం... ఫీనిక్స్ టౌన్షిప్లో నవంబర్ 23 సాయంత్రం సమయంలో బాలుడి తండ్రి రామ్జీ ప్రసాద్ పనిమీద బయటికి వెళ్లాడు. అతని భార్య రంజూదేవి, కుమారుడు సంజీవ్ కుమార్ (6), రెండున్నరేళ్ల కుమార్తె స్వీటి ఇంటి వద్ద ఉన్నారు. ఆ రోజు సాయంత్రం తల్లి రంజూదేవి గ్యాస్పై పాలు పెట్టి వేరేపని నిమిత్రం వంటగది నుంచి బయటికి వెళ్లడం చూసిన సంజీవ్, బల్లపైకెక్కి ప్లాస్టిక్ పైప్తో పాలను ఊదడం ప్రారంభించాడు. ఆ టైంలో వేడి పాలు పైపులోనుంచి నోట్లోకి వెళ్లడంతో వేగంగా శ్వాసపీల్చుకున్నాడు. దీంతో నోటిలోపలి భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో హుటాహుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స జరుగుతుండగా మూడురోజుల తర్వాత ఆదివారం మృతి చెందాడని వివరించారు. ప్రతిరోజూ తల్లి మరుగుతున్న పాలపై ఊదడం చూసేవాడని, అదేవిధంగా పొంగుతున్నపాలను పైపుతో ఆర్పడానికి ప్రయత్నించి తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి రామ్జీ ప్రసాద్ తెలుపుడూ కన్నీరుమున్నీరయ్యాడు. చదవండి: Bhopal Mass Suicide: నా కుటుంబాన్ని తీవ్రంగా హింసించారు..వాళ్లని వదిలిపెట్టొద్దు! -
దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్.. విజయవాడకు మూడోస్థానం
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరోసారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా ఇండోర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకోవడం ఇది అయిదోసారి విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలో పరిశుభ్ర రాష్ట్రంగా జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2021’ అవార్డులను శనివారం ప్రకటించింది. విజేతలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ కాగా ఇండోర్ సాధించిన విజయానికి నగర ప్రజలకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. ‘ఇండోర్ నగరాన్ని దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఐదవసారి నిలిపినందుకు ఇండోర్ వాసులకు అభినందనలు. పౌరులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం వల్లే ఇది సాధ్యమైంది’ అని కలెక్టర్ మనీష్ సింగ్ ట్వీట్ చేశారు. అంతేగాక ఇంతకుముందు దేశంలోనే తొలి వాటర్ ప్లస్ నగరంగా ఇండోర్ నిలిచింది. ఇదిలా ఉండగా స్వచ్ఛ్ సర్వేక్షణ్ అనేది ‘స్వచ్ఛ భారత్ మిషన్’లో భాగంగా దేశంలోని నగరాలు, పట్టణాలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యానికి సంబంధించిన వార్షిక సర్వే. చదవండి: యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’.. लगातार पाँचवी बार देश का सबसे स्वच्छ शहर घोषित होने पर इंदौर के नागरिकों को बधाई। कलेक्टर श्री मनीष सिंह ने कहा है कि नागरिकों की स्वच्छता जागरूकता के कारण यह संभव हो सका है।@CMMadhyaPradesh @PMOIndia pic.twitter.com/GVaxap54oS — Collector Indore (@IndoreCollector) November 20, 2021 -
చేతిలో భారీ నగదు.. ఆటో డ్రైవర్తో కోటీశ్వరుడి భార్య పరార్
భోపాల్: మధ్యప్రదేశ్, ఇండోర్ పోలీసులు ముందుకు ఓ అసాధారణ కేసు వచ్చింది. కోటీశ్వరుడి భార్య.. వయసులో తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన ఆటో డ్రైవర్తో పరార్ అయ్యింది. వెళ్తూ వెళ్తూ 47 లక్షల రూపాయలు తనతో తీసుకెళ్లింది. దాంతో ఆ కోటీశ్వరుడు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కోటీశ్వరుడి భార్య, ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్కు చెందిన ఓ ఆటో డ్రైవర్కు కొన్ని నెలల క్రితం సదరు కోటీశ్వరుడి భార్యతో పరిచయం ఏర్పడింది. రెండు, మూడు సార్లు ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కోటీశ్వరుడి భార్య, ఆటో డ్రైవర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోతూ పోతూ తనతో పాటు 47 లక్షల రూపాయలు పట్టుకెళ్లింది. (చదవండి: వైరల్: భర్త మరో మహిళతో జిమ్లో.. చెప్పులతో చితకబాదిన భార్య) బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఖంద్వా, ఉజ్జయిని, రత్లామ్ ప్రాంతాల్లో గాలించి.. ఆటోడ్రైవర్ని, సదరు మహిళను అదుపులోకి తీసకున్నారు. ఆటో డ్రైవర్ వద్ద నుంచి 33 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఒంటరి ప్రయాణికులనే సెలక్ట్ చేసుకుని.. ఆపై.. -
ఇన్స్టా వీడియో కోసం నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. చివరికి
-
ఇన్స్టా వీడియో కోసం నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. చివరికి
భోపాల్: తక్కువ కాలంలో పాపులారిటీని సంపాదించాలని అనేకమంది ఆరాటపడుతుంటారు. ఇందుకోసం ఎంతకైనా తెగించి రిస్క్ తీసకుంటారు. కొన్నిసార్లు చేయరాని పనులు చేసి ఇబ్బందులను కొనితెచ్చుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఫేమస్ అవ్వడం కోసం ఓ యువతి రోడ్డుపై రెచ్చిపోయి చిందులేసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే.. రసోమా స్క్వేర్లో శ్రేయా కల్రా అనే యువతి మూడు రోజులక్రితం రద్దీగా ఉండే రోడ్డు మీద డ్యాన్స్ చేసింది. రెడ్ సిగ్నల్ పడటంతో హఠాత్తుగా రోడ్డు మీదకొచ్చి, ముఖానికి మాస్క్ వేసుకొని స్టెప్పులేసింది. ట్రాఫిక్ సిగ్నల్వద్ద వేచి ఉన్న ప్రయాణికులు ఆమె డ్యాన్స్ చూసి ఆశ్చర్చపోయారు. అయితే యువతి తన ఇన్స్టాగ్రామ్ కోసం చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం యువతిని చిక్కుల్లో పడేసింది. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినందుకు పోలీసులు ఆమెకు నోటీసులు జారీచేశారు. అంతేగాక నెటిజన్లు సైతం యువతిపై మండిపడుతున్నారు. వాహనదారులకు ఇబ్బంది కలిగించేలా నడిరోడ్డు మీద గంతులేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తాఫీగా షాపులోకి వెళ్లాడు.. వాటిని చూడగానే భయంతో లగెత్తాడు.. నాకు లవర్ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ -
ప్రతి అక్కా, చెల్లెలి రక్షణ బాధ్యతంతా నాదే..
ఇండోర్: సాధారణంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టు రంగంలో పురుషులే అధికంగా కనిపిస్తారు. అయితే మారుతున్న సమాజంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో ప్రవేశిస్తూ దూసుకేళ్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే చేయగలరనే చాలా పనులను మహిళలు చేసి చూపుతున్నారు. వాహనాలు నడపటంలో కూడా మేము సైతం అంటున్నారు. తాజాగా రితూ నర్వాల్ అనే మహిళ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొదటి మహిళా బస్ డ్రైవర్గా గుర్తింపు పొందారు. అత్యంత రద్దీగా ఉండే బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(బీఆర్టీఎస్) కారిడార్లో గురువారం ఆమె తన మొదటి ట్రిప్ను రాజీవ్ గాంధీ స్క్వేర్ నుంచి నిరంజన్పూర్ స్క్వేర్ వరకు బస్ నడిపి ప్రయాణికులను తీసుకువచ్చింది. బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణించాలని ప్రోత్సహిస్తూ అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్పోర్టు సర్వీస్ లిమిటెడ్( ఏఐసీటీఎల్) కొత్తగా ‘పింక్ బస్’ సేవలను ప్రారంభించింది. అందులో భాగంగానే ఇద్దరు మహిళలకు బస్ డ్రైవింగ్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న నర్వాల్ గురువారం ట్రయల్ రన్లో తొలిసారి బస్ను సురక్షితంగా నడిపారు. ఏఐసీటీఎల్ ఇన్ఛార్జ్ సందీప్ సోని మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసిన ఇద్దరు మహిళ డైవర్లు సోమవారం నుంచి విధుల్లో చేరనున్నారని తెలిపారు. అన్ని పింక్ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లు మహిళలే ఉంటారని పేర్కొన్నారు. పింక్ బస్సులు కేవలం మహిళల కోసం కేటాయించామని, ఇప్పటికే మహిళా కండక్టర్లు ఉన్నారని మరి కొంతమంది మహిళా కండక్టర్ల, డ్రైవర్లను నియమిస్తామని చెప్పారు. అయితే బీఆర్టీఎస్ కారిడార్లో రోడ్డు చాలా క్లిష్టంగా ఉంటుందని, అందుకే మహిళా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. నా కల నిజమైంది ‘నేను ఎప్పటికైనా హెవీ మోటర్ వెహికల్ డ్రైవర్ కావాలకున్నా. బస్ లేదా ట్రక్ ఏదైనా నడపాలని కల కన్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నేను 28ఏళ్ల వయస్సులో.. 2015లో ఓ స్కూల్ బస్ నడపడంతో డ్రైవింగ్ మొదలుపెట్టాను’ అని నర్వాల్ తెలిపారు. బస్సులోని ప్రతీ అక్కా, చెల్లెలి రక్షణ తన బాధ్యత అని పేర్కొన్నారు. సొంత వాహనంతో డ్రైవింగ్ నేర్చుకున్నా మరో మహిళా డ్రైవర్ అర్చనా కాటేరా గతంలో మూడేళ్లు ఓ ఫైవ్ స్టార్ హోటల్కు డ్రైవర్గా పనిచేశారు. ‘నా సొంత వాహనంతో డ్రైవింగ్ నేర్చుకున్నా. మూడే నెలల డ్రైవింగ్ శిక్షణ తర్వాత ఫైవ్ స్టార్ హోటల్కు డ్రైవర్గా మూడేళ్లపాటు పనిచేశాను. తర్వాత మరో హోటల్కి మారాను. కోవిడ్-19 కారణంగా కుటుంబం కోసం ఆ ఉద్యోగం మానేశాను. ప్రస్తుతం నేను పింక్ డ్రైవర్గా నియమించబడ్డాను’ అని అర్చనా పేర్కొంది. -
సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరు కదా!
ప్రేమ-పెళ్లి హామీతో యువతుల మీద అఘాయిత్యాలు జరుగుతున్న తీరుపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లికానీ యువతులు కేవలం సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని, ఈ విషయంలో మగవాళ్లే పర్యవసనాలనెరిగి ప్రవర్తించారని ఇండోర్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘సంప్రదాయాలకు విలువ ఇచ్చే సమాజం మనది. అలాంటిది పెళ్లి కానీ యువతులు దిగజారి ప్రవర్తించేంతకు స్థితికి ఇంకా చేరుకోలేదు. పెళ్లి చేసుకుంటారని, ఏదో ఒక హమీ మీద తప్పించి.. సరదా కోసం ఇలా శారీరక సంబంధం పెట్టుకోరు. అలాగే నిజాన్ని నిరూపించడానికి ప్రతీసారి బాధితులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా తదుపరి పర్యవసానాలను కూడా గమనించాలి’ అని వ్యాఖ్యానించింది జస్టిస్ సుబోధ్ అభయంకర్ నేతృత్వంలోని బెంచ్. కేస్ వివరాలు ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ యువతితో శారీరకంగా కలిశాడు. అయితే పెద్దలు ఒప్పుకోవట్లేదని, తాను వేరేవారిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో.. జూన్ 2న ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న ఆమె నుంచి మహకల్ స్టేషన్ పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ ఆమె బతికింది. ఇక ఆ యువకునిపై అత్యాచారం కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్కు చెందిన జస్టిస్ సుబోధ్ అభయంకర్ విచారణ జరిపారు. ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్టప్రకారమే సంబంధం పెట్టుకున్నామంటూ నిందితుడు చేసిన వాదనను అంగీకరించలేదు. వేర్వేరు మతాలే వాళ్ల పెళ్లికి ఆటంకంగా మారిందన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. దీంతో నిందితుడికి కోర్టు బెయిల్ నిరాకరించింది. అంతేకాదు పలు కేసుల ప్రస్తావన తీసుకొచ్చిన బెంచ్.. ఇలాంటి వ్యవహారాల్లో కక్కుర్తిపడే మగవాళ్లే, అనుమానితులుగా బయటపడ్డ సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని, బాధితులకు అన్యాయం జరిగిన సందర్భాలే ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం విశేషం. -
ఆకతాయిల భరతం పట్టే ‘స్పెషల్ 40’
భోపాల్: అక్షయ్ కుమార్–కాజల్ అగర్వాల్ సినిమా ‘స్పెషల్ చబ్బీస్’ గురించి తెలుసు.. ఈ ‘స్పెషల్ 40’ ఏమిటి? అనే కదా డౌటు. ఆ సినిమాలో ఒక గ్రూప్ సభ్యులు సీబిఐ, ఇన్కామ్టాక్స్ ఆఫీసర్లుగా పోలీసులను బోల్తా కొట్టిస్తుంటారు. అయితే ఈ‘స్పెషల్ 40’ ని మాత్రం పోలీసులే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మహిళలపై జరిగే రకరకాల అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఏర్పాటు చేసిన గ్రూప్ ఇది. మురికివాడల్లో నివసించే ఆడపిల్లలపై రౌడీలు, తాగుబోతుల కన్నుపడింది. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే రకరకాలుగా వేధించడం, అఘాయిత్యాలకు పాల్పడటం లాంటివి జరిగేవి. ‘ఈ దేశంలో ప్రతి పౌరుడు టోపీ ధరించని పోలీసే’ అనేది మన తెలుగు సినిమా డైలాగ్ కావచ్చుగానీ శాంతిభద్రతల సంరక్షణ అనేది మన అందరి బాధ్యత. ‘స్పెషల్ 40’లో ఉన్న మహిళల్లో ఎవరూ పోలిస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వారు కాదు. ఎక్కడో ఏదో సంఘటన చూసి కడుపు రగిలిపోయిన వారు, ‘చూస్తూ కూడా ఏమీ చేయలేమా’ అని నిస్సహాయంగా పిడికిళ్లు బిగించిన వారు, ‘మనకెందుకులే’ అని రాజీపడి, అదో పశ్చాత్తాపమై, భారమై, బాధపడి ‘లేదు. ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నవాళ్లు ఎందరో ఉన్నారు. ‘స్పెషల్ 40’ సభ్యులకు కరాటే, తైక్వాండోలాంటి ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇవ్వడంతో పాటు, చట్టం, న్యాయ సంబంధిత విషయాలపై అవగాహన కలిగిస్తున్నారు. ఎలాంటి చర్యలు నేరాల పరిధిలోకి వస్తాయి? ఏ నేరానికి ఎలాంటి శిక్ష పడుతుంది? ముఖ్యమైన సెక్షన్లు ఏం చెబుతున్నాయి?... మొదలైనవి ‘స్పెషల్ 40’ సభ్యులకు కొట్టిన పిండి. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయి, ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ‘స్పెషల్ 40’ సభ్యులు ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’లాంటి విషయాలపై పిల్లలకు అవగాహన కలిగిస్తున్నారు. అనుకోకుండా ఆపద ఎదురైతే ముందుగా చేయాల్సిన పని ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?... మొదలైన విషయాలను తెలియపరుస్తున్నారు. ఈ గ్రూప్లో 20 ఏళ్ల వయసు నుంచి మొదలు 60 పైబడి ఉన్న మహిళలు కూడా ఉన్నారు. వీరి గ్రూప్లో సీనియర్ అయిన చంద్రకాంత మాలవీయాకు 63 సంవత్సరాలు. ‘ఈ వయసులో ఇదంతా ఎందుకు తల్లీ!’ అన్నవారు లేకపోలేదు. అయితే చంద్రకాంత వారి మాటలను పట్టించుకోలేదు. ‘భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశం గా దీన్ని భావిస్తున్నాను. ఎందరో ఆడపిల్లలు నన్ను సొంత తల్లిలా భావించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు’ అంటుంది చంద్రకాంత. ‘స్పెషల్ 40లో నేను సభ్యురాలిని అనే విషయం తలచుకోగానే చెప్పలేనంత ఉత్సాహం, ధైర్యం ఒంట్లోకి వచ్చి చేరుతాయి. ఆడపిల్లల రక్షణ కు అవసరమైతే ప్రాణాలు కూడా లెక్క చేయను’ అంటుంది సంధ్యా మనోజ్ కాస్త ఉద్వేగంగా.ఒక మురికి వాడలో నివసించే రీతి అనే అమ్మాయి ఒకరోజు పోకిరీల బారిన పడింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే ‘ఈ సమయంలో అటు వైపు ఎందుకు వెళ్లావు?’ అని మందలించాడు నాన్న. నిజానికి అప్పుడు రాత్రి ఎనిమిది కూడా దాటలేదు. మరోసారి ఒకచోట తాగుబోతుల బెడద ఎదురైతే వెంటనే ‘స్పెషల్ 40’కి సమాచారం ఇచ్చింది. ‘స్పెషల్ 40’ ఆ తాగుబోతుల భరతం పట్టింది. ఇప్పుడు ‘స్పెషల్ 40’ సభ్యుల దగ్గర వాకీ–టాకీలు ఉన్నాయి. వాటికంటే మఖ్యంగా అంతులేని ధైర్యం ఉంది. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవాలనే అపారమైన తపన ఉంది. ఇంతకంటే కావల్సింది ఏమిటి! -
ఫాన్సీ నెంబర్లపై ఇంత మోజా! 0001 ధరెంతో తెలుసా?
ఇండోర్: ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్లపై ఉన్న క్రేజ్ మామూలుదికాదు. తమ ముచ్చటైన వాహనానికి లక్కీ నెంబర్ దక్కించుకునేందుకు వాహనదారులు ఎంత సొమ్మైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంటారు. వీఐపీ నంబర్లంటే అంత మోజు! అందుకే వీటిని ఈ-వేలంలో అత్యధిక ధరకు సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ వ్యామోహమే రవాణా కార్యాలయాలకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. తాజాగా ఇండోర్ ఆర్టీఓ కార్యాలయం కూడా వీఐపీ నంబర్ల విక్రయం ద్వారా బంపర్ ఆదాయన్ని సాధించింది. ‘0001’ రిజిస్ట్రేషన్ నంబర్ 5 లక్షల 21 వేల అమ్ముడుబోయింది. అలాగే 0009 నంబర్ లక్షా 82 వేలకు విక్రయించింది. ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ప్రజలు తమ ఆసక్తి కనబర్చడం ఇదే మొదటిసారి కాదు. ఆ స్పెషల్ నంబర్లు గతంలో కూడా రికార్డు ధరకు అమ్ముడు బోయాయి. ఉదాహరణకు, 2017 లో "0001" నంబరు ఢిల్లీలో రూ .16 లక్షలకు వేలం వేయగా, ఈ సిరీస్ 2014 లో రూ .12. 50 లక్షలకు, 2015 ఏడాదిలో రూ.12.05 లక్షలకు విక్రయించబడింది. పుట్టినరోజు, ఇతర ముఖ్యమైన రోజులతోపాటు, ఇంకా వారి వారి జాతకం ఆధారంగా కొందరు కొన్ని లక్కీ నెంబర్లను ఎంచుకుంటారు. -
ఆలయంలోకి ప్రవేశించొద్దని పెళ్లి బృందంపై దాడి..
భోపాల్: దేశంలో దళితులపై వివక్షతను రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికి కొన్ని చోట్ల దళితులు, గిరిజనులు వివక్షతను ఎదుర్కొంటున్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు .. ఇండోర్ జిల్లాకు చెందిన వికాస్ కల్మోడియా అనే గిరిజన యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో, అతను స్థానిక ఆలయానికి చేరుకున్నాడు. కొంత మంది యువకులు పెళ్లి బృందాన్ని ఆలయంలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. వరుడి బంధువులు ఆలయంలో ప్రవేశించేది లేదని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా, వివాహ బృందంపై దాడికి తెగపడ్డారు. ఈ క్రమంలో వరుడి తండ్రి ఓం ప్రకాశ్ తమపై దాడిచేసిన యువకులపై స్థానిక మన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివాహ బృందాన్ని భారీ భద్రత మధ్య ఆలయ దర్శనం కల్పించారు. ఆ తర్వాత నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరితో పాటు మరో 9 మంది గుర్తు తెలియని యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసులను నమోదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న మన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వ్యాక్సినేషన్ పరంగా రికార్డు సృష్టించిన ఇండోర్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా జాతీయ స్థాయిలో వ్యాక్సినేషన్ పరంగా రికార్డు సృష్టించింది. కేవలం ఒకే ఒక్క రోజులో రెండు లక్షల మందికి పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ వేసింది. దేశంలోని ఏ జిల్లాలో కూడా ఒకే రోజులో ఇంత భారీ మొత్తంలో వ్యాక్సినేషన్లు వేయలేదు. కేంద్రం జూన్ 21 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఉచితంగా అన్నీ రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలి రోజే దేశం మొత్తం మీద ప్రజలకు 85.15 లక్షలకు పైగా టీకా డోసులిచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండోర్ కలెక్టర్ మనీష్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్లో "వ్యాక్సిన్ మహాభియాన్" కింద సుమారు 2,21,663 మందికి టీకాలు వేశారు. దేశంలో ఇంత భారీ స్థాయిలో ఒకే జిల్లాలో వ్యాక్సినేషన్ వేసిన సందర్భాలు లేవు అని అన్నారు. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం జిల్లా యంత్రాంగం పగటిపూట రెండు లక్షల మందికి టీకాలు వేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. "నాలుగు రోజుల క్రితం, రెండు లక్షల మందికి టీకాలు వేయాలనే లక్ష్యాన్ని మాకు ఇచ్చారు. ఈ ప్రక్రియ కోసం ఆరోగ్య విభాగాలు, మునిసిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిపాలన, ప్రైవేట్ ఆసుపత్రులు, హోటల్ సంఘాలు బృందాలుగా విడిపోయాం" అని సింగ్ చెప్పారు. "మొత్తం ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే జరిగింది. ఆదివారం రాత్రినే వ్యాక్సిన్ పంపిణీ కోసం జిల్లాలో 40 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు" అని ఆయన తెలిపారు. చదవండి: రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలు -
ఈ మామిడి పండు ఖరీదు రూ.1000 గురూ.. ఎందుకంటే!
ఇండోర్: వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి. పండ్లలో రారాజుగా పిలుచుకునే ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అని ప్రతీతి. బంగిన్పల్లి, రసాల్ వంటి రకారకాల పండ్ల ధరలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే మధ్యప్రదేశ్కు చెందిన ‘నూర్జాహాన్’ రకం మామిడి పండు మాత్రం చాలా ప్రత్యేకం. ఈ మామిడి పండు బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ధర వెయ్యి రూపాయలు పలుకుతోంది. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆప్ఘాన్ మూలానికి చెందిన నూర్జహాన్ మామిడిని అలీరాజ్పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండిస్తారు. అయితే గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం ఈసారి పెద్దగా ఉండడంతో.. నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతులు పేర్కొంటున్నారు. "నా పండ్ల తోటలో మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 మామిడి పండ్లు పండాయి. ఒక్కో పండుకు రూ. 500 నుంచి రూ. 1,000 ధర పలుకుతోంది. ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్లు చేసుకుంటారు. అయితే ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య ఉంటుంది. 2019లో ఒక్కో పండు 2.75 కేజీల బరువుతో పండింది. అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికింది." అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు . (చదవండి: చేతులు చాచారు.. అడ్డంగా బుక్కయ్యారు) -
నా పిల్లలకింత విషం ఇవ్వండి
ఇండోర్: కరోనా వైరస్ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ... లాక్డౌన్ కొందరి ఉపాధికి ఉరి వేస్తోంది. క్లిష్ట సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఉదాసీనత ప్రదర్శిస్తున్నాయి. ఫలితంగా చేయడానికి పని లేక .. తినడానికి తిండి లేక ఎంతో మంది సతమతం అవుతున్నారు. కరోనా రక్కసి తెచ్చిన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ... ఇంత విషం ఇవ్వండి నాకు, నా పిల్లలకు అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశాడు ఓ తండ్రి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. నా వల్ల కావట్లేదు ఇండోర్కి చెందిన ఓ వీధి వ్యాపారి బండి మీద మామిడి పళ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇండోర్లో ఏ మూలకు బండి పెట్టిన ఎవరో ఒక అధికారి వచ్చి అక్కడ నుంచి బండి తీయమంటున్నారు. మరోవైపు ఎండుకు మామాడి కాయలు వాడిపోతున్నాయి. కడుపులో పేగులు ఎండిపోతున్నాయి. ఇంతలో మున్సిపల్ అధికారులు వచ్చి మళ్లీ మామిడి పళ్ల బండి తీయాలంటూ చెప్పడంతో విసిగిపోయాడా చిరు వ్యాపారీ. చుట్టుముట్టిన కష్టాలను తట్టుకోలేక ...నాకింత విషం ఇవ్వండి నేను, నా పిల్లలు తాగి చనిపోతానంటూ బండిపై ఉన్న మామిడి కాయలన్నీ రోడ్డుపైనే పడేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో అతన్ని ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కరోనా కేసులు కంట్రోల్ కాకపోవడంతో మధ్యప్రదేశ్లో లాక్డౌన్ విధించారు. అంతకు రెండు నెలల ముందే ఆ రాష్ట్ర వాణిజ్య రాజధాని ఇండోర్లో కర్ఫ్యూని అమలు చేశారు. దీంతో మూడు నెలలుగా ఇండోర్లో ఉన్న వీధి వ్యాపారులకు సరైన బేరాలు లేక ఇక్కట్లు పడుతున్నారు. లాక్డౌన్ నుంచి వెసులుబాటు ఉన్న కొద్ది సమయంలో వ్యాపారం చేసుందామని ప్రయత్నిస్తే అధికారులు అడ్డుతగులుతున్నారు. దీంతో దిక్కు తోచని స్థితిలోకి వీధి వ్యాపారులు నెట్టివేయబడుతున్నారు. -
నా భర్తకు ఇంజెక్షన్లు ఇవ్వండి.. లేకపోతే చస్తా!
ఇండోర్: బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్మైకోసిస్) బారినపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తకు యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తూ ఓ మహిళ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని బాంబే హాస్పిటల్లో సదరు మహిళ భర్త (40) చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సలో భాగంగా ఇప్పటికే యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షను ఇచ్చారు. మరికొన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ, అందుబాటులో లేవు. ఆందోళనకు గురైన అతడి భార్య ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మంగళవారం వీడియో పోస్టు చేసింది. ‘‘బాంబే హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా.. బ్లాక్ ఫంగస్ సోకడంతో నా భర్తను ఈ ఆసుపత్రిలోనే చేర్పించాం. ఆయనకు కళ్లు, దవడల్లో విపరీతమైన నొప్పి వస్తోంది. ఇక్కడ యాంఫోటెరిసిన్–బి ఇంజెక్షన్లు లేవు. ఈ స్థితిలో నా భర్తను ఎక్కడికి తీసుకెళ్లగలను? ఈ రోజు ఇంజెక్షన్ ఇవ్వకపోతే ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటా. అంతకు మించి మరో మార్గం లేదు’’ అని వీడియోలో ఆమె స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ఇండోర్ కలెక్టర్ను కూడా ఉద్దేశించి మాట్లాడింది. బాధిత మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చామని, భర్తకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో మానసికంగా కలత చెందిందని బాంబే ఆసుపత్రి జనరల్ మేనేజర్ చెప్పారు. ఆమె భర్తకు ఇప్పటివరకు 59 ఇంజెక్షన్లు ఇచ్చామని, మరికొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతానికి తమ వద్ద అవి అందుబాటులో లేవని ఆయన వివరించారు. (చదవండి: Delhi: చేతులపై మోసుకెళ్లి..బామ్మకు కరోనా టీకా) -
అగ్ని ప్రమాదం: 25 లక్షల విలువైన వ్యాక్సిన్లు దగ్దం
భోపాల్ : భారత్లో కరోనా కేసులు, మరణాలు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఓవైపు ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ దొరక్క కోవిడ్ భాదితులు అవస్థలు పడుతుంటే మరోవైపు దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ఇండోర్లోని భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కంపెనీ గోడౌన్లో నిల్వ ఉంచిన కరోనా మెడిసిన్స్, వ్యాక్సిన్తో పాటు బ్లాక్ ఫంగస్కు ఉపయోగించే మందులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఇక ఈ ప్రమాదం వల్ల రూ. 25 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు కంపెనీ యాజమాన్యం ప్రాథమికంగా నిర్ధారించింది. చదవండి: బళ్లారి పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం -
Petrol Price: సెంచరీ కొట్టేసిన పెట్రోలు ధరలు
న్యూఢిల్లీ: పెట్రో ధరల పెరుగుదల ఆగడం లేదు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని... 18 రోజులు పెంపు జోలికి వెళ్లని ఆయిల్ కంపెనీలు తర్వాత రోజువారీగా వడ్డిస్తున్నాయి. మే 4 తేదీ నుంచి పెట్రో ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. దీని ఫలితంగా దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. బోఫాల్లో లీటరు పెట్రోల్ రూ.100.08 ఉండగా ఇండోర్లో రూ.100.16 చేరింది. ఇక రాజస్తాన్లోని. శ్రీగంగానగర్లో దేశంలోనే ఎక్కడా లేనంత అధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.102.96కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.95.89గా ఉంది. నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.95.67, డీజిల్ ధర రూ.90.06గా ఉంది. చదవండి: టెకీలకు బంపర్ ఆఫర్ : డబుల్ హైక్స్ కు ఐటీ దిగ్గజాల మొగ్గు -
కరోనా నిబంధనలు బ్రేక్.. కుక్క అరెస్టు
ఇండోర్: చట్టం ముందు అందరూ సమానమే అని ఓ నిబంధన మన రాజ్యాంగంలో ఉంది. ఇండోర్ పోలీసులు ఈ నిబంధనను తూచా తప్పకుండా పాటించారు. ఎలా అంటారా ? కరోనా నిబంధనలు పాటించలేదని యజమానితో పాటు ఉన్న కుక్కను కూడా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ భారత్లో విలయతాండవం చేస్తోంది. దీంతో వైరస్ కట్టడికి ఇప్పటికే రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకురాగా.. పలు రాష్ట్రాలు లాక్డౌన్ కూడా విధించాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సైతం నైట్కర్ఫ్యూను అమలు చేస్తోంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమలులో ఉండగా ఇండోర్లోని పలాసియా ప్రాంతంలో ఓ వ్యాపారవేత్త తన పెంపుడు కుక్కను తీసుకొని బయటకు తీసుకువచ్చాడు. అదే సమయంలో కర్ఫ్యూను అమలు చేసేందుకు పోలీస్ బృందం పెట్రోలింగ్ వచ్చారు. ఆ బృందానికి ఈ వ్యక్తి కుక్కతో బయట తిరగడం కనిపించింది. ఇంకేముంది యజమానినే గాక కుక్కని కూడా అదుపులోకి తీసుకొని జైలుకు పంపారు. అయితే.. కుక్క అరెస్టుపై జంతు ప్రేమికులు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ అరెస్టు సోషల్ మీడియాల్లో సంచలనంగా మారింది. ( చదవండి: వైరల్: ఈ కుక్కకి రోడ్ల పై చెత్త వేస్తే నచ్చదు.. ) -
జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే!
భోపాల్: కరోనా తీవ్రరూపం దాల్చుతుండటంతో మహమ్మారి కట్టడికి పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాత్రి కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్ వంటి చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రభత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో లాక్డైన్ ఆంక్షలను అతిక్రమించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే కోవిడ్ కర్ఫ్యూను బేఖాతారు చేసిన వారికి గుణపాఠం చెప్పేందుకు మధ్యప్రదేశ్ అధికారులు వినూత్నంగా రీతిలో శిక్ష విధించారు. ఇండోర్ జిల్లాలోని డెబల్పూర్లోని పోలీసులు కోవిడ్ కర్ఫ్యూ సందర్భంగా వీధుల్లో తిరుగుతున్న వారిని రోడ్డుపై కప్ప గంతులు వేయించారు. దీనికితోడు డప్పు చప్పుళ్లు నడుమ వారిని గ్రామంలో కొంతదూరం పరిగెత్తేలా చేశారు. పరిమితికి మించి ఆదివారం సాయంత్రం పెళ్లి నుంచి బైక్, కార్లలో వెళుతుండగా పోలీసులు వీరిని గుర్తించి ఈ శిక్ష వేశారు. ఇలా చేయడం వల్ల ఇతర వ్యక్తులు కోవిడ్ రూల్స్ ఉల్లంఘించకుండా ఉంటుందని ఆ ప్రాంత తహసీల్దార్ జబరంగ్ బహదూర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కాగా ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిపాల్పూర్లో కరనా కర్ఫ్యూ విధించారు. వీటిని ఉల్లంఘించిన వారిపై జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుటోంది. ఇక ఆదివారం మధ్యప్రదేశ్లో 12,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 5,88,368కు చేరుకున్నాయి. మరణాల సంఖ్య 5,812 కు చేరుకుంది. చదవండి: కరోనా అలర్ట్: దేశంలో 2 కోట్లు దాటిన కేసులు In Indore district's Depalpur, tehsildar makes people roaming on the streets during the #COVID19 curfew to do frog jumps. yr jeh sarkari nokar bne ha kya... jeh log to behave ese kr rha jaise raja bn gae ho... #COVIDisAirborne #CovidIndia #CoronaPandemic #CoronaCurfew pic.twitter.com/iebAZZcbaH — rockey singh (@rockeys03560226) May 3, 2021 -
కరోనాతో కేంద్రమంత్రి కుమార్తె కన్నుమూత
ఇండోర్: కేంద్ర మంత్రి తావర్ చంద్ గహ్లోత్ కుమార్తె గోయిత సోలంకి (42) కరోనా బారినపడి కన్నుమూశారు. చికిత్స తీసుకుంటూ ఆమె మరణిం చారని ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. కరోనా సోకిన అనంతరం ఆమెను మొదట గా ఉజ్జయినిలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో వారం క్రితం ఇండోర్లోని మేదాంత ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమె ఊపిరితిత్తుల్లో 80 శాతం వైరస్ బారినపడటంతో రక్షించలేకపోయామని ఆస్పత్రి డైరెక్టర్ సందీప్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఆమె మరణం పట్ల మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, పలువురు పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు. -
యముండ.. వ్యాక్సిన్ వేసుకొనుచుండ...
హెల్మెట్ నుంచి మాస్కు వరకు రకరకాల విషయాలలో ప్రచారానికి ‘యమరాజ్’ వేషం పాపులర్ థీమ్గా మారింది. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పోలిస్ కానిస్టేబుల్ జవహర్సింగ్ కోవిడ్–19 వ్యాక్సిన్ గురించి ప్రచారం కోసం యముడి వేషం వేశాడు. వ్యాక్సిన్పై రకరకాల అపోహలు, భయాలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రచారం ప్రారంభించాడు. యముడి వేషంలోనే వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఈ వేషం ధరించడం జవహర్సింగ్కు కొత్తేమీ కాదు. సామాజిక స్పృహకు సంబంధించిన కార్యక్రమాలలో యమ సీరియన్గా, యమ కమిట్మెంట్తో ప్రచారం చేశాడు. సెహబాష్ సింగ్జీ! -
వీరు విధ్వంసానికి తొమ్మిదేళ్లు
ముంబై : వీరేంద్ర సెహ్వాగ్ అంటేనే విధ్వంసానికి పెట్టింది పేరు. బరిలోకి దిగాడంటే చాలు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఫామ్లో ఉంటే అతన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆరంభం నుంచే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ బౌలర్లను మానసికంగా దెబ్బతీసేవాడు. కాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అప్పటికే డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్గా సచిన్ రికార్డులకెక్కాడు. అప్పటికే వన్డేల్లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడిన సెహ్వాగ్ డబుల్ సెంచరీపై కన్నేశాడు. (చదవండి : 'తన కెరీర్ను తానే నాశనం చేసుకున్నాడు') ఆరోజు రానే వచ్చింది. డిసెంబర్ 8, 2011.. ఇండోర్ వేదికగా వెస్టిండీస్తో నాలుగో వన్డే.. అప్పటికే టీమిండియా ఐదు వన్డేల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఏంచుకుంది. సచిన్ ఈ టోర్నీకి దూరంగా ఉండడంతో గంభీర్తో కలిసి సెహ్వాగ్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. సెహ్వాగ్ విధ్వంసం సృష్టించబోతున్నాడని పాపం విండీస్ ఊహించి ఉండదు. మ్యాచ్ తొలి 5 ఓవర్లు నెమ్మదిగా సాగిన టీమిండియా బ్యాటింగ్ ఆ తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఏ బౌలర్ను వదలని సెహ్వాగ్ ఊచకోత కోశాడు. కొడితే బౌండరీ .. లేదంటే సిక్సర్ అనేంతలా వీరు విధ్వంసం కొనసాగింది. కేవలం 149 బంతుల్లోనే 219 పరుగులు చేసిన సెహ్వాగ్ తన తొలి డబుల్ సెంచరీ.. వన్డే చరిత్రలో రెండో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. సెహ్వాగ్ ఇన్నింగ్స్లో 25 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అప్పటివరకు సచిన్ పేరిట ఉన్న 200 పరుగులు అత్యధిక స్కోరును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా వన్డేలో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా నిలిచాడు. అలా భారత్ నుంచి ముగ్గురు క్రికెటర్లు డబుల్ సెంచరీ ఫీట్ను సాధించడం మరో విశేషంగా చెప్పవచ్చు. కాగా సెహ్వాగ్ వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లోనూ రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అలా వన్డేల్లో, టెస్టుల్లో ఈ అరుదైన ఫీట్ను సాధించిన వారిలో సెహ్వాగ్ తర్వాత గేల్ మాత్రమే ఉన్నాడు. (చదవండి : మీరే కాదు.. నేనూ మిస్సవుతున్నా : కోహ్లి) -
31 మంది ఉద్యోగలకు కరోనా పాజిటివ్
భోపాల్: మధ్యప్రదేశ్లో కోవిడ్ విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. మధ్యప్రదేశలో కోవిడ్ నియంత్రణ లేని పట్టణాల్లో ఇండోర్ ఒకటి. తాజాగా రాష్ట్రంలో ఇండోర్ పట్టణంలోని ఆభరణాల దుకాణంలో 31 మంది ఉద్యోగులకు కరోనా సోకడంతో దాన్ని మూసివేశారు. ప్రస్తుత పరిస్థితిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాడియా విలేకరులతో మాట్లాడుతూ.. గత వారం నుంచి దుకాణాన్ని సందర్శించిన వారిని అలానే వైరస్ సోకిన సిబ్బంది, కస్టమర్లను గుర్తించడం ప్రారంభించామన్నారు. వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు లేదా కోవిడ్ ఇతర లక్షణాలు ఉన్నాయా అని పరీక్షిస్తున్నామన్నారు. ఆభరణాల షోరూమ్ ని శుభ్రం చేస్తున్నామని, అది పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి తెరుస్తారని అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలతో పోల్చితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది దీపావళి, ధన్సార్ పండుగలను జరుపుకున్నారు. పండగ సందర్భంగా చాలా మంది షాపింగ్మాల్స్ని సందర్శించారు. దీని వలన కరోనా వ్యాప్తి పెరిగిందని అలానే ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన పర్యాటకులు, ప్రజలు మాస్క్ లేకుండా వీధుల్లో తిరుగుతూ, ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 1.86 లక్షలకు పైగా కరోనా బారిన పడగా 1,200 మంది మరణించారు. ఇండోర్ లో నిన్న ఒక్కరోజే 194 కొత్త కేసులు వెలుగు చూశాయి. -
అందరం మనమే ఆనందం మనదే
ఇంట్లో ఉన్నది చాలు కాసింత ఊపిరి పీల్చుకుందాం పద అని బయలుదేరారు ఇండోర్ స్త్రీలు. అక్కడి ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ కోవిడ్ వల్ల గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉంది. ఇప్పుడు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే దీపావళి వేళ పండగ పర్యటనకు బయలుదేరారు. ఇండోర్ వ్యాపారవేత్త శ్రేష్టా గోయల్ ఈ గ్రూప్ను నడుపుతారు. స్త్రీలను విహారాలు, పర్యటనలు, యాత్రలు చేసేందుకు ప్రోత్సహిస్తుంటారు. సెప్టెంబర్ 20, 2020న ఇండోర్లో ఒక ఈవెంట్ జరిగింది. దానిని ఆర్గనైజ్ చేసింది ఆ నగరంలో ఉన్న ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’. దాని స్థాపకురాలు శ్రేష్టా గోయల్. ఆ ఈవెంట్ పేరు ‘డ్రైవింగ్ ఈజ్ మై పేషన్’. ఇండియాలో కార్లున్న లక్షలాది ఇళ్లల్లో స్త్రీలకు ఆ ఇళ్లలోని వంట గదులో, వరండాలో అప్పజెబుతుంటారు డ్రైవింగ్ చేయడానికి కారు మాత్రం ఇవ్వరు. ఎంత ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కారులో కూచోబెట్టి ఊరికో, ఉద్యోగానికో తీసుకెళ్లి దింపుతారు కాని స్టీరింగ్ అప్పజెప్పరు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక సర్వేల ప్రకారం పురుషుల కంటే స్త్రీలే సేఫ్ డ్రైవర్లని తేలింది. అయినా సరే స్త్రీలకు కారు డ్రైవింగ్ ఇంకా నిరాకరింపబడే విషయంగానే ఉంది. అందుకే శ్రేష్టా ఈ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసింది. 10 రోజులు 200 మంది సెప్టెంబర్ 10 నుంచి 30వ తేదీ వరకూ దేశంలోని ఐదారు రాష్ట్రాలు, కేరళతో సహా కార్లు డ్రైవ్ చేసే స్త్రీలు వారు గృహిణులు, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు వచ్చి ఇండోర్లో తమ వాహనాలతో తిరిగారు. ‘డ్రైవింగ్ ఈజ్ మై పేషన్’ అని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇండోర్లో, మధ్యప్రదేశ్లో, ఇతరరాష్ట్రాలలో వివిధ శాఖలలో పని చేస్తున్న స్త్రీలు.. ముఖ్యంగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వచ్చే ఉద్యోగులు స్త్రీలను ఉత్సాహపరచడానికి వీడియోలు విడుదల చేశారు. ‘జీవితంలో ముందుకు వెళ్లాలంటే వాహనాన్ని నడపడం తెలియాలి. ఈ స్కిల్ స్త్రీలకు చాలా ముఖ్యం. కారు నడపడం లగ్జరీ కాదు. అవసరం. పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఒంటరి కారు ప్రయాణాలు చేయగలరు. అడ్వంచర్లు చేయగలరు. నేనైతే కారులో జైపూర్ నుంచి బద్రీనాథ్కు, మంగళూరు నుంచి కేరళకు కారులో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాను. రాక్ ది రోడ్స్’ అంటూ ఇండోర్ ఎయిర్పోర్ట్ అథారిటీ డైరెక్టర్ అర్యామా సన్యాల్ ఒక వీడియో విడుదల చేశారు. ‘డ్రైవింగ్ చేస్తే ఫోకస్ తెలుస్తుంది. వాహనాన్నే కాదు జీవితాన్ని కంట్రోల్ చేయడం కూడా తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’ అని కర్ణాటక రాష్ట్రమహిళా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు శిఖ ఒక వీడియో విడుదల చేశారు. మొత్తంగా ఈ ఈవెంట్ విజయవంతమైంది. స్త్రీలు తమ డ్రైవింగ్ అనుభవాలు పంచుకుని స్త్రీలను ఉత్సాహపరిచారు. దీని కారకులలో ముఖ్యురాలు శ్రేష్టా గోయల్. అడ్వెం‘టూర్’ ఇండోర్లో ఒక ఫార్మాసూటికల్ కంపెనీ సి.ఇ.ఓ అయిన శ్రేష్టా గోయల్ తనకు అత్యంత ఇష్టమైన విషయం తన జిప్సీని డ్రైవ్ చేయడమే అని చెప్పుకుంటారు.‘జీవితమే ఒక సాహసం. ప్రయాణాల ద్వారా ఆ సాహసాన్ని కొనసాగించాలి’ అని చెబుతారామె. అందుకనే ఇండోర్లో ఆమె ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ అనే సంస్థను స్థాపించారు. కాళ్లకు చక్రాలున్నాయని నమ్మే స్త్రీలు ఈ గ్రూప్లో సభ్యులు. ఇంటికి, ఉపాధికి సమయం ఇస్తూనే తమదంటూ జీవితాన్ని లోకం చూడటం ద్వారా గడపడానికి ఇష్టపడే స్త్రీలు ఈ గ్రూప్ ద్వారా ఒక చోట చేరారు. ‘మేము పర్యటించడమే కాదు పర్యటించమని స్త్రీలకు స్ఫూర్తినిస్తాం’ అంటారు వాళ్లు. ఈ టూర్లను అడ్వెంటూర్లని అంటారు. రెండు మూడు నెలలకోసారి వీరో పర్యటనను ప్లాన్ చేస్తారు. ‘అందరం మనమే ఆనందం మనదే’ అన్నట్టు తిరుగుతారు. నదులు, పర్వతాలు, అడవులు వీరి పర్యటనా స్థానాలు. అడపాదడపా ఇంటికి వచ్చే బంధువులు, వెళ్లే బంధువులు పిండివంటలు ఇంటి అలంకరణలు... ఈ పని ఎలాగూ తప్పదు. దానికి సిద్ధమయ్యే ముందు ఈ లాక్డౌన్ ఇచ్చిన వొత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఒక విహారం అవసరం అని అక్టోబర్ 9న ‘అడ్వంచరస్ ఉమెన్ గ్రూప్’ సభ్యులు ఇండోర్ నుంచి కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే ఒకరోజు విహారానికి బయలుదేరారు. యాభైకిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాలు చూసి వచ్చారు. చాలా బాగా అనిపించింది’ అంది శ్రేష్టా గోయల్. ఇండోర్లోనే కాదు దేశంలోని ప్రతి చిన్న పట్టణంలో ఇలాంటి బృందాలు అవసరం అనిపిస్తుంది వీరిని చూస్తుంటే. -
పానీపూరీ.. ఇక నో పరేషాన్!
పానీ పూరీ, వావ్.. ఈ పేరు వినగానే స్ర్టీట్ ఫుడ్ లవర్స్ నోట్లో నీళ్లూరడం ఖాయం. గప్చుప్, గోల్ గప్పా, పానీకే పటాషే... ఇలా ప్రాంతాలను బట్టి పేరెలా మారితేనేం? దీని రుచిని ఆస్వాదించే వారిలో మాత్రం ఈ వంటకంపై ఉన్న ప్రేమాభిమానాలు మాత్రం మారవు. రోడ్డు పక్కన ఆ పానీపూరీ బండి దగ్గర నిల్చుని అలా ఒకదాని తర్వాత మరొకటి, నోట్లో వేసుకొని తింటూ ఉంటే.. ఆహా.. ఆ మజానే వేరుగా ఉంటుంది. కానీ, ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది కచ్చితంగా ఈ ఫుడ్ని బీభత్సంగా మిస్సయ్యే ఉంటారు. అందుకే చాలా మంది దీన్ని ఇంట్లోనే తయారు చేయడం కూడా నేర్చేసుకున్నారు కూడా. అయినా పానీపూరి బండి వద్ద దొరికే రుచి దొరకక ఎప్పుడెప్పుడు లాక్డౌన్ ఎత్తివేస్తారా అంటూ ఎదురుచూశారు. కానీ మహమ్మారి కరోనా భయంతో పాటుగా, ఈ మధ్య బండి వాళ్లు ఇష్టానుసారంగా గోల్ గప్పాను తయారు చేస్తున్న విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ దీనిపై ఇష్టాన్ని చంపుకోవాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో ఇండోర్లోని స్వచ్ఛ పానీ పూరీ అనే ఒక ఫుడ్ స్టాల్ సరైన ఇందుకు తగిన పరిష్కారం కనుగొంది. మనుషులతో సంబంధం లేకుండా కేవలం మెషిన్తోనే అన్ని పనులు చక చకా జరిగిపోయేలా, అత్యంత పరిశుభ్రమైన పద్ధతిలో పానీపూరీని తయారు చేసే యంత్రాన్ని రూపొందించింది. ఇందులో, ముందుగానే వారు పూరీని సిద్ధం చేసి పెడతారు. ఎవరైనా కస్టమర్లు వచ్చినప్పుడు వారంతట వారే మెషిన్ ద్వారా పానీని నింపి పూరీ తినవచ్చు. దీంతో సామాజిక దూరం పాటిస్తూ, ఎలాంటి భయం లేకుండా సంతోషంగా పానీపూరిని లాగించేస్తున్నారు అక్కడి కస్టమర్లు. (చదవండి: షాకింగ్.. టాయిలెట్ నీళ్లతో పానీపూరీ!) ఇక మధ్యప్రదేశ్లోని ఇండోర్ కేంద్రంగా ఉన్న ఒక ప్రముఖ ఫుడ్ బ్లాగింగ్ అయిన ఇండోరిజైకా ఈ హైజీనిక్ పానీ పూరి యంత్ర వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి, అది పని చేసే తీరును వివరించింది. అంతే ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసి, మిలియన్ వ్యూస్తో పాటు 55 వేల లైక్లను సంపాదించుకుంది. ఇక పానీ పూరీ ప్రేమికులైతే, ప్లేట్ రేటెంత ? ఎక్కడెక్కడ ఈ హైజీనిక్ పానీ పూరి దొరుకుతుందా అనే ఉత్సాహంతో ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు. ఏదేమైనా, ఎలాంటి బెదురు లేకుండా ఇక గప్చుప్గా ఈ గప్చుప్లను నోట్లో వేసేయొచ్చుఅని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల కొల్హాపూర్లోని ‘ముంబై కా స్పెషల్ పానీ పూరి వాలా’ పేరుతో పానీపూరీ బిజినెస్ వాళ్లు, ఇందుకోసం టాయిలెట్ నీళ్లను వాడటంతో కస్టమర్లు వారిని చితకబాదిన సంగతి తెలిసిందే. -
నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయకుంటే చస్తా!
ఇండోర్ : ఇష్టమైన వాడితో పెళ్లి జరిపించకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ ఓ మైనర్ హోర్డింగ్పైకి ఎక్కి కూర్చుంది. ప్రియుడు వచ్చి బ్రతిమాలితే గానీ కిందకు దిగలేదు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, ఇండోర్లోని పర్దేశీ పురాకు చెందిన ఓ మైనర్ ఓ యువకుడిని ఇష్టపడింది. అతడ్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అయితే ఇందుకు ఆమె తల్లి ససేమీరా అంది. దీంతో ఆగ్రహించిన మైనర్ అక్కడికి దగ్గరలోని హోర్డింగ్పైకి ఎక్కింది. ( వైరల్ : నేను వెళ్లనంటూ ట్రంప్ మారాం ) నచ్చిన వాడితో పెళ్లి చేయకుంటే పైనుంచి కిందకు దూకి చస్తా! అంటూ బెదిరింపులకు దిగింది. తల్లిదండ్రులు, బంధువులు, చుట్టూ మూగిన జనం.. ఆఖరికి పోలీసులు కూడా బ్రతిమాలినా పట్టు వీడలేదు. మొబైల్ ఫోన్ను చూసుకుంటూ పైనే కూర్చుండిపోయింది. చివరకు మైనర్ ఇష్టపడుతున్న యువకుడు రంగంలోకి దిగక తప్పలేదు. అతడు అక్కడికి వచ్చి మైనర్కు నచ్చ చెప్పాడు. అతడి మాట విని బాలిక కిందకు దిగింది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
సెల్ఫీ మోజులో మహిళ మృతి
ఇండోర్ : ఎక్కడ చూసినా, ఎవర్ని చూసిన సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. యువత సమయంతో సంబంధ లేకుండా ఫోన్లోనే కాలక్షేపం చేస్తూ సెల్ఫీలకు బానిసవుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా లేకున్నా సరే సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు నేటి జనం. ఎక్కడ ఉండి సెల్ఫీ దిగుతున్నామన్న ఆలోచన లేకుండా ఎక్కడ బడితే అక్కడ దిగేస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం ఆరాట పడుతూ ప్రమాదకరమైన చోట్ల సెల్ఫీలు దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ప్రాణాలు వదులుకున్న సందర్భాలు గతంలో చాలా ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. ఆలోచించకుండా దిగరాని చోట్ల సాహసాలు చేసి ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. తాజాగా సెల్ఫీ దిగుతూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ నగరానికి చెందిన 30 ఏళ్ల మహిళ పిక్నిక్ స్పాట్ లో సెల్ఫీ దిగుతూ లోయలో జారి పడి గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నీతూ మహేశ్వరి సరదగా గడపడానికి కుటుంబంతో కలిసి పిక్నిక్ కోసం ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్ గేట్ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. కొండ మీద సెల్ఫీ దిగుతూ జారిపడి లోయలో పడిందన్నారు. నాలుగు గంటల గాలింపు తరువాత లోయ నుంచి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
2050 నాటికి తీవ్రమైన నీటి సంక్షోభం..
ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగిన 100 ప్రధాన నగరాలు తీవ్రమైన నీటి సంక్షోభాన్నిఎదర్కోనున్నాయి. దీంతో 2050 నాటికి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న 350 మిలియన్ల ప్రజలు ఈ సమస్యను ఎదర్కోనున్నారు. ప్రపంచ వైల్డ్లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇటీవల నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. వాతావరణ మార్పులకు అనుగుణంగా అత్యవసర చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జాబితాలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్న జైపూర్ 45వ స్థానంలో ఉండగా, 20 లక్షల జనాభాతో ఇండోర్ 75వ స్థానంలో ఉంది. దక్షిణ అమెరికా,దక్షిణ ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలతో పాటు చైనాలోని దాదాపు 50 నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. (ఎల్లో అలర్ట్: చెన్నై ఉక్కిరిబిక్కిరి.. ) ముఖ్యంగా భారత్లోని ప్రధాన నగరాలైన అమృత్సర్, పూణే, శ్రీనగర్, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, సూరత్ సహా కోజికోడ్, విశాఖపట్నం, థానే, వడోదర, రాజ్కోట్, కోటా, నాసిక్, లక్నో, కన్పూర్ సహా మరికొన్ని నగరాలు ఈ అత్యధిక రిస్క్ జోన్లో ఉన్నాయి. దేశంలో పర్యావరణం తీవ్ర సంక్లిష్టంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉండగా మరికొన్ని నగరాల్లో వరదలు ప్రధాన సమస్యగా మరింది. వాటర్ షెడ్డులు, చిత్తడి నేలల పునరుద్ధణ వంటి చర్యలు వెంటనే చేపట్టకపోతే ఇది భవిష్యత్ తరాలకు తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. రిస్క్ జోన్లో ఉన్న నగరాలు 2020లో 17 శాతంగా ఉంటే ఇది 2050 నాటకి 51శాతానికి పెరగనున్నట్లు సర్వే పేర్కొంది. (ఢిల్లీ వాసులను వణికిస్తున్న కరోనా ‘థర్డ్ వేవ్’ ) -
11 రోజులుగా స్ట్రెచర్ మీదే : అస్థిపంజరంలా
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఘోరంగా కుళ్లిపోయి, దయనీయ స్థితిలో మృతదేహం పడి ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. మహారాజా యశ్వంతరావు ఆసుపత్రి మార్చురీలోని స్ట్రెచర్ మీద దాదాపు అస్థిపంజరంలా మారిన డెడ్ బాడీ అక్కడి వారిని షాక్ కు గురిచేసింది. వివరాలను పరిశీలిస్తే..గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గత 11 రోజులుగా అక్కడ పడి ఉంది. కుళ్లి కంపుకొడుతున్నాసిబ్బంది పట్టించుకోలేదు. చివరికి అస్థిపంజరంలా మారి భయం గొల్పుతూ ఉండటంతో ఆసుపత్రిలోని ఇతరులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంచిన ఫోటో వైరల్ అయింది. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఏదైనా ఎన్జీవో, లేదా ఇండోర్కు చెందిన పౌర సంస్థ కోసం వస్తుందని ఎదురుచూస్తున్నామని అందుకే అలా స్ట్రెచర్ మీదే ఉంచినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామని, బాధ్యులైన వారికి నోటీసులు ఇవ్వనున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీఎస్ ఠాకూర్ తెలిపారు. రోజూ సుమారు 16-17మృతదేహాలు వస్తాయనీ, జిల్లాలో కరోనాతో ఈ సంఖ్య రెట్టింపు అయిందని తెలిపారు. దీంతో మార్చురీపై భారం పెరిగిందనీ, ఫ్రీజర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్న ఇప్పటికే కోరామని ఆయన చెప్పారు. కాగా ఒకదానికి బదులుగా మరో మృతదేహాన్ని అప్పగించిన వైనం ఇటీవల కలకలం రేపింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యంతో తమ కుమారుడి బదులుగా వేరే బాడీని అప్పగించిందంటూ ఆ కుటుంబం ఆసుపత్రిపై ఫిర్యాదు చేసింది. -
హృదయ విదారకం.. పెళ్లయిన 15 రోజులకే
-
హృదయ విదారకం: భర్త మరణంతో..
భారతీయ వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారి వివాహం జరిగితే భర్తే సర్వస్వంగా బతికే భార్యలు, భార్యనే తన జీవితంగా భావించే భర్తలు చరిత్ర పుటల్లో ఎంతో మంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరూ విడిచివెళ్లిపోయినా తన జీవితమిక అయిపోందని తనవు చాలించే సహచరులూ ఉన్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటనొకటి మధ్యప్రదేశ్ చోటుచేసుకుంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదం భర్తను బలి తీసుకోగా తానూ భర్త దగ్గరకు చేరాలనుకుంది భార్య. భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించగా.. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. వివరాల ప్రకారం.. ఇండోర్కు చెందిన యువతి (28), ఉజ్జయినికి చెందిన యువకుడికి 15 రోజుల క్రితం వివాహం జరిగింది. నూతన దంపతులు ఇండోర్లో కాపురం పెట్టారు. సంతోషంగా సాగుతున్న వారి వైవాహిక జీవితంలో రోడ్డు ప్రమాదం చీకటిని నింపింది. బుధవారం జరిగిన ప్రమాదంలో భర్త మరణించాడు. ఈ ఘటన భార్యను తీవ్రంగా కలిచివేసింది. జీవితాంత తోడుంటాడునుకున్న భర్త ఇలా అర్థంతరంగా తనువు చాలించడాన్ని తట్టుకోలేపోయింది. తనలో సగమనుకున్న భర్తలేని జీవితాన్ని వద్దూ అనుకుని ప్రాణ త్యాగానికి సిద్ధపడింది. భర్త మృతితో తీవ్ర మనోవేదనకు గురైన భార్య శనివారం అందరూ చూస్తుండగానే షాపింగ్మాల్ మూడో అంతస్తు పైనుంచి దూకింది. అక్కడున్న సెక్యూరిటీ గార్డులు, సిబ్బంది వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. అయితే ఆమె చేతిలోని ఓ లేఖను సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ కుమ్రావత్ స్వాధీనం చేసుకున్నారు. భర్తతో కలిపి తన దహన సంస్కారాలు చేయాలని సూసైట్ నోట్లో రాసుకుంది. కాగా వివాహిత షాపింగ్ మాల్పై నుంచి దూకిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరి మనసులను ఈ ఘటన కదిలిస్తోంది. -
మనిషి పెరిగినా బుద్ధి పెరగకపోతే ఇంతే..
ఇండోర్: చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే స్కూళ్లో టీచర్లు గుంజీలు తీయించేవారు. కానీ మనిషి పెరిగినా బుద్ధి పెరగకపోతే ఇదిగో పై ఫొటోలో కనిపిస్తున్నట్లు పోలీసులు బజారులోనే గుంజీలు తీయిస్తారు. ఈ అరుదైన శిక్ష విధించిన ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. ఆగస్టు 11న ఇండోర్లో ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి వాహనాన్ని అప్పగించమని దబాయించారు. అతడు కుదరదని చెప్పడంతో కత్తితో దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద్వారకాపురి ప్రాంతంలో తిరుగాడుతున్న ఆ ఇద్దరు దుండగులను గురువారం అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ అజయ్ ఠాకూర్, విజయ్ విశ్వకర్మలుగా గుర్తించారు. (కొడుకుతో సైకిల్పై 105 కి.మీ ప్రయాణం.. ఎందుకంటే) అనంతరం రోడ్డు మీదనే వీరికి బుద్ధొచ్చేలా చేయాలని పోలీసులు భావించారు. దీంతో నడిరోడ్డుపైనే చెవులు పట్టుకుని గుంజీలు తీయించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పించారు. ఆ తర్వాత వాళ్లు కత్తి దూసిన చోటే ముక్కు నేలకు రాశేలా చేశారు. దీన్ని అక్కడున్న కాలనీ వాసులు ఇళ్లలో నుంచి చూస్తూ పోలీసుల చర్యను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు. 'నిందితులతో ఇలా చేయించడం వల్ల ప్రజలకు నేరస్థులంటే భయం పోయే అవకాశం ఉంటుంది, అలాగే ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులను సంప్రదించడానికి ప్రజలకు వెనుకాడరు' అని ద్వారకాపురి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో ధరంవీర్ సింగ్ తెలిపారు. నిందితులు గుంజీలు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది (‘ముఖానికి మాస్కు లేదా.. అయితే ఈ యంత్రం పెట్టేస్తుంది’) #WATCH Madhya Pradesh: Police in Indore's Dwarkapuri made two criminals do sit-ups and apologise to people for their crimes. (20/08/20) pic.twitter.com/j1zBBSKgff — ANI (@ANI) August 21, 2020 -
కారంపొడి కొట్టి మరీ దొరికిపోయాడు
ఇండోర్ : బంగారం కొనేందుకు వచ్చినట్లు నటించి జ్యువెల్లరీ షాపు యజమాని కంట్లో కారం కొట్టి ఆభరణాలు చోరీ చేసేందుకు యత్నించాడు. అయితే ఆ యువకుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్లో చోటుచేసుకుంది. సరాఫా ప్రాంతంలో లవీన్ సోని అనే వ్యాపారి జ్యువెల్లరీ షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆభరణాలు కొనేందుకు దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి.. సోని కంట్లో కారం కొట్టి 50 గ్రాముల బంగారు ఆభరణాలతో పారిపోయేందుకు ప్రయత్నించాడు.(డిసెంబరు 3 నాటికి కరోనా కనుమరుగవుతుంది!) ఆ వ్యక్తి బంగారంతో పారిపోవడం గమనించిన స్థానికులు అతడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మొత్తం షాపులోని సీసీకెమెరాల్లో రికార్డు అయ్యింది. పోలీసుల విచారణలో నిందితుడు మధ్యప్రదేశ్ దేవాస్ ప్రాంతానికి చెందిన ఆనంద్గా గుర్తించారు. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నామని, షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సరాఫా పోలీస్ స్టేషన్ ఇన్చార్జీ అమృత సింగ్ సోలంకి తెలిపారు. -
బెస్ట్ సిటీ ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా నాలుగో ఏడాది మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఎంపికైంది. ఆ తర్వాతి స్థానాల్లో సూరత్, నవీముంబై నిలిచాయి. అలాగే, ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం వారణాసి ‘ఉత్తమ గంగా పట్టణం’గా మొదటి స్థానంలో నిలిచింది. 100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీలో ఛత్తీస్గఢ్ అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఉన్నాయి . రాజధానిలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాలు–2020 వివరాలను కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్సింగ్ పూరి వెల్లడించారు. దేశ రాజధానిలోని ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (రాజ్పథ్, ప్రముఖులుండే ల్యుటెన్స్ ప్రాంతం) పరిశుభ్రమైన రాజధాని నగరంగా ఎంపికయింది. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 97 గంగాతీర నగరాలతోపాటు, 1.87 కోట్ల మంది పౌరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విజేతలకు ప్రధాని అభినందనలు స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో మొదటి స్థానాల్లో నిలిచిన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా నగరాలు కూడా మెరుగైన పరిశుభ్రత కోసం కృషి చేయాలని కోరారు. దీంతో కోట్లాది మందికి లాభం కలుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్షకు పైగా జనాభా కలిగినవి) 1. ఇండోర్ 2. సూరత్ 3. నవీముంబై 4. విజయవాడ 5. అహ్మదాబాద్ అత్యంత పరిశుభ్రమైన నగరాలు (లక్ష కంటే తక్కువ జనాభా ఉన్నవి) 1. కరాడ్ 2. సస్వద్ 3. లోనావాలా పరిశుభ్రమైన రాష్ట్రం(100కుపైగా పట్టణ స్థానిక సంస్థలున్న కేటగిరీ) 1. ఛత్తీస్గఢ్ 2. మహారాష్ట్ర 3. మధ్యప్రదేశ్ పరిశుభ్రమైన రాజధాని.. 1. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కంటోన్మెంట్లలో పరిశుభ్రమైనవి 1. జలంధర్ కంటోన్మెంట్ బోర్డ్ 2. ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్ 3. మీరట్ కంటోన్మెంట్ బోర్డ్ ► పౌరుల ఫీడ్బ్యాక్ ఆధారంగా గ్రేటర్ హైదరాబాద్ ‘ఉత్తమ మెగా సిటీ’గా ఎంపికైంది. ► పౌరుల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉత్తమ కేంద్రపాలిత ప్రాంతంగా చండీగఢ్ ఎంపికైంది. ► ఇన్నోవేషన్, ఉత్తమ విధానాలు ఆచరిస్తున్న గుజరాత్ రాజధాని గాంధీనగర్ మొదటి ర్యాంకు సాధించింది. -
దేశంలోనే తొలి స్థానంలో ఇండోర్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ్ సర్వేక్షణ్-2020’ అవార్డులు ప్రకటించింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా నాలుగో సారి ఇండోర్ తొలి స్థానాన్నే కైవసం చేసుకోవడం విశేషం. రెండో స్థానంలో సూరత్(గుజరాత్), మూడో స్థానంలో ముంబై(మహారాష్ట్ర) నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. గురువారం 'స్వచ్ఛ మహోత్సవ్' కార్యక్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈ అవార్డులను ప్రకటించారు. ఈ సందర్భంగా జలందర్ కాంత్ దేశంలోనే అత్యంత పరిశుభ్రత కల కంటోన్మెంట్గా ప్రకటించారు. పరిశుభ్రత గల పట్టణంగా వారణాసి చోటు దక్కించుకుంది. 4,242 నగరాలు, 62 కంటోన్మెంట్ బోర్డు, 92 గంగా సమీపంలోని పట్టణాల నుంచి మొత్తం 1.87 కోట్ల మంది ఇందుకు సంబంధించిన సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వే 28 రోజుల పాటు చేపట్టగా అనంతరం ర్యాంకులు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. ఇండోర్ మళ్లీ తన ఆధిక్యతను ప్రదర్శించడంపై ఆ ప్రాంత ఎంపీ శివరాజ్ చౌహాన్కు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి ప్రజలు తమ నగర శుభ్రత పట్ల చూపిన అంకిత భావాన్ని కొనియాడారు. (రూల్స్ బ్రేక్: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...) ఆంధ్రప్రదేశ్కు స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులు దేశంలో పరిశుభ్ర రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకోగా తెలంగాణ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దేశంలోనే పరిశుభ్రత గల నగరంగా విజయవాడ నాలుగో స్థానం దక్కించుకుంది. తిరుపతి ఆరో ర్యాంకు, విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకు సాధించింది. బెస్ట్ మెగా సిటీ కేటగిరీలో రాజమండ్రి చోటు సంపాదించుకుంది. దీనితో పాటు ఒంగోలు, కాకినాడ, కడప, తెనాలి, చిత్తూరు, హిందూపురం, తాడిపత్రి కూడా స్థానం దక్కించుకున్నాయి -
ప్రాణం పోయాక వెలుగు చూసిన దారుణం
ఇండోర్: మధ్యప్రదేశ్, ఇండోర్లో చోటుచేసుకున్న విషాద ఘటన వెనుక అసలు రహస్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో తప్పుతానేమోననే భయంతో ఉసురు తీసుకుందనుకున్న తమ బిడ్డ అత్యధిక మార్కులు సాధించడంతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు అసలు విషయాన్నిఆరా తీశారు. పొరుగున ఉండే ఇద్దరు వ్యక్తుల వేధింపుల కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని తెలిసి బావురుమన్నారు. ఇండోర్కు చెందిన ఒక యువతి (19) రెండు రోజుల క్రితం (సోమవారం ఉదయం) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోనన్నభయంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఆ తరువాత ప్రకటించిన (సోమవారం మధ్యాహ్నం)12 వ తరగతి పరీక్షా ఫలితాల్లో 74 శాతం మార్కులు సాధించింది. దీంతో అనుమానం వచ్చిన బాధిత యువతి సోదరుడు చుట్టుపక్కల విచారించగా అసలు సంగతి బైటపడింది. తన సోదరిని పొరుగున ఉండే ఇద్దరు యువకులు వేధింపులకు గురి చేయడంతోనే చనిపోయిందని యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను చాలాకాలంగా వేధిస్తున్నారని తెలిపారు. అంతేకాదు దీనికి ఒప్పుకోకపోతే కుటుంబాన్ని చంపేస్తామని బెదరించారని ఆరోపించారు. చివరికి తన సోదరి చనిపోయే ముందు రోజుకూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంబంధిత వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, పెళ్లికి ఒప్పుకోకపోతే భయంకర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించడంతోనే ఆమె ప్రాణాలు తీసుకుందని వాపోయారు. నిందితులకు నేర చరిత్ర కూడా ఉందని పోలీసులకు వివరించారు. మరోవైపు బాలిక సోదరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనీ, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసు అధికారి యోగేశ్ తోమర్ బుధవారం వెల్లడించారు. -
పైశాచికత్వం: యువతుల లోదుస్తులు కాజేసి..
భోపాల్ : బాలికల హాస్టళ్లలోకి ప్రవేశించి వారి లోదుస్తులు కాజేసి పైశాచిక ఆనందం పొందుతున్న ఓ దొంగను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇండోర్ ప్రాంతంలోని లేడీస్ హాస్టల్స్, అమ్మాయిలు అద్దెకు ఉండే నివాసాల్లో గత కొన్ని రోజులుగా లోదుస్తులు మాయం అవుతున్నాయి. అయితే ఈ ఘటనలు రాత్రి వేళల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఇటీవల లోదుస్తుల చోరీలు అధికమవుతున్న నేపథ్యంలో బాధిత మహిళలు విజయ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శ్రీకాంత్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో లోదుస్తులు, బట్టలను దొంగిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. అంతేగాక వాటిని చింపేస్తున్నది కూడా తానేనని ఒప్పుకున్నాడు. (బాలికను బలవంతపు పెళ్లి చేసుకున్న విద్యార్ధి) కాగా ఏడాది క్రితం కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకోగా, ఆ కేసులో కూడా ఇతడే నిందితుడని తేలడంతో నిందితుడిని జైలుకు తరలించారు.ఈ విషయంపై విజయ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి తెమజీబ్ ఖాజీ మాట్లాడుతూ.. తమకు లేడీస్ హాస్టల్స్ నుంచి లోదుస్తులు మాయమవుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డుల సహాయంతో పోలీసు బృందాలను రాత్రి సమయాల్లో బాలికలు నివసించే హాస్టళ్ల ప్రాంతంలో మోహరించామని తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి అనుమానస్పదంగా సంచరిస్తుండటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. (ప్రేమ కథ: యువతి ఆత్మహత్య, యువకుడు హత్య ) -
పీహెచ్డీ చేసి.. కూరగాయలు అమ్ముతోంది
భోపాల్: ఇండోర్లోని ఓ కూరగాయల మార్కెట్లో మున్సిపల్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా ఓ యువతి నిరసన తెలుపుతోంది. చుట్టు ఉన్నవారు ఆమెను చూసి ఆశ్చర్యపోతున్నారు. నిరసన తెలిపితే ఆశ్చర్యం పోవడం ఎందుకు అనుకుంటున్నారా.. కారణం ఉంది. ఆమె స్పష్టమైన ఇంగ్లీష్లో నిరసన తెలుపుతుండటంతో చుట్టు ఉన్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వివరాలు.. రైసా అన్సారీ అనే యువతి ఇండోర్లోని దేవి అహల్య యూనివర్సిటీ నుంచి మెటిరియల్ సైన్స్లో పీహెచ్డీ చేసింది. కానీ ఉద్యోగం లభించలేదు. ఇదిలా ఉండగానే.. కరోనా వచ్చి పరిస్థితులను మరింత దిగజార్చింది. (ఆ కథనంపై చలించిన సోనూసూద్) In Indore a vegetable vendor Raisa Ansari protested against the municipal authorities when they came to remove the handcarts of vegetables.The woman later claimed that she has done Phd in Materials Science from DAVV Indore. @ndtvindia @ndtv @GargiRawat #lockdown #COVID19 pic.twitter.com/RieGffTMyP — Anurag Dwary (@Anurag_Dwary) July 23, 2020 ఈ క్రమంలో సదరు యువతి కుటుంబానికి తోడుగా ఉండాలని భావించింది. దాంతో ఓ తోపుడు బండి మీద కూరగాయలు, పండ్లు అమ్మడం ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. గురువారం మున్సిపల్ అధికారలు వచ్చి.. రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించాల్సిందిగా ఆదేశించారు. దాంతో అన్సారీ మిగితావారితో కలిసి మున్సిపల్ అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నిరసనకు దిగింది. అధికారులు తమను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో స్పష్టమైన ఇంగ్లీష్లో తెలిపింది. ఈ సదర్భంగా అన్సారీ మాట్లాడుతూ.. ‘ఓ పక్క మార్కెట్ను క్లోజ్ చేశారు. కూరగాయలు కొనడానికి ఎవరూ రావడం లేదు. ఇక్కడ నేను, నా కుటుంబ సభ్యులు, స్నేహితులం 20 మంది దాకా ఇలా తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకుంటున్నాం. కానీ అధికారులు వచ్చి బండ్లను తొలగించమంటున్నారు. మరి మేం ఏం తిని బతకాలి’ అని ప్రశ్నించారు. (రాఖీలు అమ్ముకుంటున్న సీరియల్ నటి) ఇంతలో కొందరు ‘ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు.. ఏం చదివారు’ అని అన్సారీని అడిగితే పీహెచ్డీ చేశానని చెప్పారు. ‘మరి ఉద్యోగం చేయవచ్చుగా’ అని అడిగితే.. నా పేరు చూసి ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు. ప్రస్తుం ఈ వీడియో తెగ వైరలవుతోంది. -
రూల్స్ బ్రేక్: నడిరోడ్డుపై పెళ్లికొడుక్కి...
భోపాల్: కరోనా ఆంక్షల నేపథ్యంలో మాస్క్ లేకుండా రోడ్డుపైకి వచ్చిన పెళ్లి కొడుక్కి జరిమానా విధించిన ఘటన సోమవారం రోజున మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. లాక్డౌన్ నిబంధనలు సడలింపుల అనంతరం.. ఇండోర్లో పెళ్లి చేసుకునేందుకు 12 మందికి అనుమతి ఉంది. అయితే పెళ్లి కొడుకు ధర్మేంద్రతో పాటు పెళ్లికి హాజరవుతున్న 12 మంది వ్యక్తులు కూడా ఒకే వాహనంలో మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్నారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన అధికారులు వారికి జరిమానా విధించారు. ఈ సంఘటనపై మన్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వివేక్ గ్యాంగ్రాడే మాట్లాడుతూ.. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బందికి మాస్కులు లేకుండా, నిబంధనలు పాటించకుండా వారు కనిపించడంతో పెళ్లికొడుకుతో పాటు మరో 12 మందికి ఫైన్ వేసినట్లు తెలిపారు. భౌతిక దూరం పాటించనందుకు రూ. 1,100.. మాస్క్లు ధరించనందుకు రూ. 1,000 జరిమానా విధించినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలోనే జరిమానా రుసుమును కూడా వసూలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇండోర్లో ఇప్పటిదాకా 4,069 కరోనా కేసులు నమోదవ్వగా.. 174 మంది మరణించారు. చదవండి: కరోనా: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం -
కార్లు వదిలి.. ఎడ్ల బండ్లపై.. ఎందుకిలా?
ఇండోర్ : మధ్యప్రదేశ్లో ఇండోర్ సమీపంలోని పలాడ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఆడీ, బీఎండబ్ల్యూ కార్లను వదిలి పారిశ్రామికవేత్తలు ఎడ్లబండ్లు పట్టారు. ఇండోర్కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాడ ఇండస్ట్రియల్ పాంతానికి వెళ్లే రోడ్లు ఎన్నో ఏళ్లుగా దుర్బరస్థితిలో ఉన్నాయి. ఒక్క వర్షం కురిస్తే బురదతో కనీసం నడవడం కూడా ఇబ్బంది అయ్యేలా రోడ్లు తయారయ్యాయి. దీంతో ఎన్నోసార్లు రోడ్ల విషయమై ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. (ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాదు: సోనియా గాంధీ) దీంతో పలాడ ఇండస్ట్రియల్ ప్రాంతంలో పరిశ్రమలు నిర్వహిస్తున్న యజమానులు, ఉన్నతాధికారులు ఖరీదైన తమ కార్లను వదిలేసి, ఎడ్లబండ్లు ఎక్కి తమ నిరసనను ప్రభుత్వానికి తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఎడ్లబండి నడుపుతున్న ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.(సరిహద్దుల్లో చైనా సన్నద్ధత?.. నిజమెంత!) -
కలలు నాశనం అంటూ నటి ఆత్మహత్య
ఇండోర్: బుల్లితెర నటి ప్రేక్ష మెహతా(25) ఆత్మహత్య చేసుకుంది. సోమవారం రాత్రి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో తన నివాసంలో ఉరేసుకుని మరణించింది. అయితే ఆమె కుటుంబసభ్యులు నేడు ఉదయం గమనించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు దృవీకరించారు. కాగా ఆమె మరణిండానికి కొన్ని క్షణాల ముందు ఇన్స్టాగ్రామ్లో తన జీవితం గురించి పోస్ట్ పంచుకుంది. "మీ కలలు నాశనమైనపుడు దానంత దరిద్రం మరొకటి ఉండదు" అని ఆమె అందులో పేర్కొంది. (ఆర్థిక ఇబ్బందులతో నటుడి ఆత్మహత్య) నాలుగు రోజుల క్రితం ఓ సెల్ఫీ ఫొటోను చివరిసారిగా అభిమానులతో పంచుకుంది. ప్రేక్ష మెహతా క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గా వంటి పలు కార్యక్రమాల్లో నటించింది. ఇటు టీవీ ప్రేక్షకులనే కాకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ప్యాడ్ మాన్లోనూ తళుక్కున మెరిసి సినీ ప్రేక్షకులనూ అలరించింది. లాక్డౌన్ వల్ల భవిష్యత్తు మీద భయంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రేక్ష బంధువులు భావిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఆర్థిక సమస్యలు తీవ్రతరమై టీవీ నటుడు మన్మీత్ గ్రీవల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 19న టీవీ, చిత్ర షూటింగ్లకు బ్రేక్ పడగా అనేక మంది నటులు, టెక్నీషియన్ల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. (భార్యను కొట్టిన నటుడు అరెస్ట్) View this post on Instagram Meri Taraf Aata Har Gham Phisal Jaaye Aankhon Mein Tum Ko Bharun Bin Bole Baatein Tumse Karun 🥰 A post shared by Preksha Mehta 🎭 (@iamprekshamehta) on May 22, 2020 at 1:01am PDT -
గుండెలు పిండేసే దృశ్యం..
ఇండోర్: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం హడావుడిగా లాక్డౌన్ ప్రకటించడంతో వలసజీవులు అష్టకష్టాలు పడుతున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి తిండి దొరక్క, ఉండటానికి గూడుకరువై లక్షలాది మంది బడుగు జీవులు నగరాల నుంచి కాలినడన గ్రామాల బాట పడుతున్నారు. మూటముల్లె సద్దుకుని పిల్లాపాపలతో వందల కిలోమీటర్లు నడుస్తూ నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలసజీవుల వెతలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వలస కార్మికులకు చెందిన హృదయ విదారక ఘటన ఒకటి మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో వెలుగు చూసింది. నగరం నుంచి తన కుటుంబాన్ని సొంత ఊరికి చేర్చేందుకు వలస కార్మికుడు కాడెద్దులా మారి బండి లాగుతున్న దృశ్యం చూపరులను విస్మయానికి గురిచేసింది. రాహుల్ అనే వ్యక్తి ఇండోర్ జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్తో ఉపాధి లేకపోవడంతో తన రెండెడ్ల బండిపై 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరు మండ్ల నయాత గ్రామానికి వెళ్లిపోవాలనుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఒక అయిన కాడికి ఒక ఎద్దును అమ్మేశాడు. భార్యను, తమ్ముడిని బండిపై కూర్చొబెట్టి మరో ఎద్దుకు జతగా తానే కాడిని ఎత్తుకుని పయనం మొదలుపెట్టాడు. (అవమానాన్ని తట్టుకోలేక బలవన్మరణం) ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై బండిని లాగుతూ మీడియా కంటపడ్డాడు. ప్రతినిధులు అతడిని పలకరించగా తన కష్టాలను కలబోసుకున్నాడు. ‘సొంతూరికి వెళ్లాలని నా ఎద్దును చాలా తక్కువ ధరకు అమ్మేశాను. మామూలు రోజుల్లో అమ్మితే రూ. 15 వేలు వచ్చేవి. కానీ నేను 5 వేలకే నా ఎద్దును విక్రయించాన’ని రాహుల్ తెలిపాడు. తన తండ్రి, సోదరి కాలినడకన ముందే వెళ్లిపోయారని చెప్పాడు. రాహుల్ బండి లాగుతున్న వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి తులసీ సిలావత్ స్పందించారు. రాహుల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇండోర్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు) -
31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్
భోపాల్ : ప్రాణాంతక కరోనా వైరస్పై యుద్ధం చేస్తున్న పోలీసులపై వైరస్ ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పోలీసు అధికారులు వైరస్ బారినపడ్డారు. తాజాగా మధ్యప్రదేశ్లోనూ విధులు నిర్వర్తిస్తున్న ఖాకీలకు కరోనా సోకింది. ఇండోర్లో 31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్గా తేలినట్లు స్థానిక ఎస్పీ మహ్మద్ యూసఫ్ ప్రకటించారు. వీరందరినీ క్వారెంటైన్కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. తాజా ఘటనతో పోలీస్శాఖ మరింత అప్రమత్తమైంది. విధి నిర్వహణలో పోలీసులు, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. (గ్యాస్ లీక్ బాధితుల పట్ల శాపంగా మారిన కరోనా) మరోవైపు మహారాష్ట్రలోనూ గురువారం పలువురు పోలీసు అధికారులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముంబైలోని జెజె మార్గ్ పోలీస్ స్టేషన్కు చెందిన 26 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వీరిలో 12 మంది ఉన్నతాధికారులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,138 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 185 మంది వైరస్ కారణంగా మరణించారు. కాగా బుధవారం ఒక్కరోజే భోపాల్లో 12 మంది మ్యత్యువాడ్డ విషయం తెలిసిందే. అయితే వీరంతా భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులేనని వైద్యులు ధృవీకరించారు. (ఒకే పోలీస్ స్టేషన్లో 26 మందికి కరోనా) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కాంక్రీట్ మిక్సింగ్ ట్రక్కులో 18 మంది
ఇండోర్: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అక్రమ మార్గాన్ని ఆశ్రయించారంటూ పోలీసులు 18 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాంక్రీట్ కలిపే వాహనం లోపల కూర్చున్న వారందరినీ దింపి.. ట్రక్ను పోలీస్ స్టేషనుకు తరలించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి లక్నోకు వెళ్తున్న కాంక్రీట్ ట్రక్కులో ప్రయాణిస్తున్న 18 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఉమాకాంత్ చౌదరి తెలిపారు. ఇండోర్లో తనిఖీ చేయగా డోమ్ లోపల ఉన్నవారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారని వెల్లడించారు. కాగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్లో కొంతమంది కాలినడకన మరికొందరు సైకిళ్లపై స్వస్థలాలకు పయనమవుతున్న విషయం తెలిసిందే.(వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?) ఈ క్రమంలో మార్గమధ్యలోనే కొంతమంది మరణించారు. మరికొంత మంది ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వలస కూలీలను సొంతూళ్లకి పంపడానికి శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పలు రాష్ట్రాలు ఇంకా అనుమతులు ఇవ్వకపోవడంతో వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల్ని రాష్ట్రంలోకి రావడానికి అనుమతించిన కర్ణాటక వంటి రాష్ట్రాలు... సొంతూళ్లకి రావాలని అనుకుంటున్న వారు ఎవరైనా ప్రయాణ ఖర్చులు వాళ్లే భరించుకోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన దాదాపు 18 వేల మందిని ప్రాధాన్యత క్రమంలో రాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ శనివారం తెలిపారు.(కొడుక్కి మాజీ మంత్రి గుణపాఠం) -
కరోనా లక్షణాలతో నర్సు మృతి.. కానీ!
భోపాల్: కరోనా లక్షణాలతో ఇండోర్ ఆసుపత్రిలో చేరిన నర్సు(55) బుధవారం మృతి చెందింది. సదరు మృతురాలిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో మంగళవారం రాత్రి ఇండోర్లోని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆసుపత్రి సూపరిండెంట్ ప్రమేంద్ర ఠాకూర్ తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా చూస్తే కరోనా కేసులు ఇండోర్లోనే అత్యధికంగా నమోదైన సంగతి తెలిసిందే. (కరోనాలో హెచ్ఐవీ వైరస్ ఆనవాళ్లు) దీనిపై ప్రమేంద్ర ఠాకూర్ మాట్లాడుతూ.. మృతురాలైన నర్సు కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతోందని, దీంతో ఆమె నమూనాలను కోవిడ్-19 పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించామని చెప్పారు. అయితే ఆ రిపోర్ట్స్ ఇంకా రాలేదని, అవి వచ్చాకే ఆమె మృతికి గల కారణాలను స్పష్టం చేయగలమన్నారు. కాగా అదే హాస్పిటల్ ఆఫీసులో సూపర్వైజర్గా పనిచేస్తోన్న సదరు మృతురాలు ఏప్రీల్ 1 నుంచి అనారోగ్యం బారిన పడిందని చెప్పారు. ఇక అప్పటీ నుంచి ఆమె విధులకు హాజరు కాలేదని ఆయన పేర్కొన్నాడు. కాగా ఇండోర్ జిల్లాలో ఇప్పటివరకు 923 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. ఇందులో 52 మంది మరణించారు. మరో 73 మంది కోలుకోని డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. (కరోనా పరీక్షల్లో ఏపీకి మొదటి స్థానం) -
మాట వినకపోతే ఇలాంటివే జరుగుతాయి
-
కరోనా : మాట వినకపోతే ఇలాంటివే జరుగుతాయి
ఇండోర్ : 'బయట కరోనా ఉందిరా నాయనా.. ఎవరు బయటికి రాకండి.. ఇంట్లోనే ఉంటూ హాయిగా ఉండండిరా' అంటే ఎవరు మాట వినడం లేదు. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించినా ప్రజలు అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందుల పాలవుతున్నారు. పోలీసులు కూడా చెప్పి చెప్పి విసుగెత్తిపోతున్నారు. ఇక లాభం లేదనుకొని లాక్డౌన్ ఉల్లంఘించి అనవసరంగా బయటికి వస్తున్న వారికి తమదైన శైలిలో బుద్ది చెబుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులు లాక్డౌన్ నిబంధనలను ఉల్లఘించి మార్నింగ్ వాక్కు వచ్చిన కొంతమందిని జంపింగ్ ఫ్రాగ్స్, మొకాళ్ల మీద నడవడం లాంటివి చేపించారు. వీళ్లందరిని వారి ఇంటివరకు జంపింగ్ ఫ్రాగ్స్ చేయించి మరీ తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ 'మంచిగా చెబితే ఎవరు వినడం లేదు.. అందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. వారికి మంచి వ్యాయామంలా ఉంటునే ఇంకెప్పుడు బయటికి రకూడదని వారు భావించాలనే ఇటువంటి చేస్తున్నాం.. దీనితోనైనా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. (‘చైనా కిట్లలో నాణ్యత కలదు’) ఇలాంటి ఘటనలు కొత్తేం కాదని చెప్పవచ్చు. ఇంతకుముందు లాక్డౌన్ ఉల్లఘించారంటూ మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో వ్యాయామం, యోగా కార్యక్రమాలు నిర్వహించారు. లాక్డౌన్ ఉల్లఘించారన్న కారణంతో ఇప్పటికే మహారాష్ట్రలో దాదాపు 35వేల మందిపై , ఉత్తర్ ప్రదేశ్లో 24వేలమందిపై ఎఫ్ఐఆర్లు, 71వేలమందిపై వివిధ రకాల కేసులు నమోదయ్యాయని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. ఇంత చేసినా ప్రజలు ఎప్పటిలాగే మళ్లీ బయటకు వస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20వేలకు చేరుకోగా, మృతుల సంఖ్య 600 దాటేసింది. -
స్వచ్ఛతలో హ్యాట్రిక్.. కరోనాతో కకావికలం
సాక్షి, సిటీబ్యూరో: ఇండోర్.. దేశంలోనే స్వచ్ఛతలో ఈ నగరానిది ప్రథమ స్థానం. వరుసగా మూడుసార్లు (2017, 2018, 2019) నంబర్ వన్ నగరంగా నిలిచింది. అక్కడ అమలు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను, స్వచ్ఛత కోసం పాటిస్తున్న నిబంధనలను తెలుసుకునేందుకు వివిధ నగరాలు అప్పట్లో క్యూ కట్టాయి. అదే దారిలో జీహెచ్ఎంసీ నుంచి సైతం పలువురు అధికారులు, పలు పర్యాయాలు ఇండోర్ను గతంలో చుట్టి వచ్చారు. వీరిలో ఐఏఎస్లు, అడిషనల్, జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీప్లానర్ సహా ఎందరో ఉన్నారు. ఇండోర్లో అమలవుతున్న కార్యక్రమాల అధ్యయన యాత్రలకు జీహెచ్ఎంసీ అప్పట్లో దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేసిందంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛతలో మేటిగా ఉన్న ఆ నగరంలో వ్యాధులుఉండవని, ప్రస్తుతం కరోనా కూడా తక్కువ సంఖ్యలో మాత్రమే ఉండవచ్చని ఎవరైనా భావిస్తారు. కానీ.. అంతటి మహత్తర నగరం ప్రస్తుతం కరోనా కోరల్లో విలవిల్లాడుతోంది. ఎందుకీ పరిస్థితి..? ఇండోర్ నగరంలో సుమారు 900 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎందుకు?. ప్రస్తుతం ఎందరినో తొలుస్తున్న ప్రశ్న ఇది. స్వచ్ఛ కార్యక్రమాల అమలులో గొప్ప గొప్ప నగరాలనే తలదన్నిన ఇండోర్ యంత్రాంగం కరోనాను ఎందుకు కట్టడి చేయలేక పోయిందన్నది అంతు పట్టడం లేదు. కరోనాతో అక్కడ దాదాపు యాభై మంది మరణించారు. మార్చి 25న నాలుగు పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న ఇండోర్ నగరంలో ప్రస్తుతం 200 రెట్లకు మించి పోయాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్,కంటైన్మెంట్ నిబంధనలు, సామాజిక దూరం పాటించకపోవడమే కారణం కావచ్చనిజీహెచ్ఎంసీలో చర్చ నడుస్తోంది. ఇండోర్లో ఇలా.. ♦ స్వచ్ఛతకు సంబంధించి ఇండోర్ విధానాలను జీహెచ్ఎంసీలో అమలు చేసేందుకు అక్కడికి వెళ్లి వచ్చిన అధికారులు గుర్తించిన అంశాలు ఇలా ఉన్నాయి.. ♦ ఇండోర్ నగర జనాభా దాదాపు 35 లక్షలు ♦ అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే రూ. 500– 1000 జరిమానా ♦ రోడ్లపై ప్రతి 100 మీటర్లకు రెండు చెత్త డబ్బాల ఏర్పాటు ♦ చెత్త పరిమాణాన్ని బట్టి తరలింపు చార్జీలు రూ.500 నుంచి రూ.30,000 వరకు ♦ చెత్త తరలింపు వాహనాల్లో తడి పొడితో పాటు న్యాప్కిన్లకు ప్రత్యేక చాంబర్ ♦ ఏదైనా ఫంక్షన్ జరిగితే విందు నిర్వహించినా, ఆహార వ్యర్థాల తరలింపునకు చార్జీలు చెల్లించాలి. హాజరయ్యే వారి సంఖ్యను బట్టి మనిషికి రూ.50 వంతున వసూలు చేస్తారు. ఆదర్శంగా తీసుకుని.. ♦ ఇండోర్ జనాభా హైదరాబాద్లో దాదాపు మూడో వంతే అయినప్పటికీ.. స్వచ్ఛత అమలుకు ఆ నగరాన్ని ఆదర్శంగా తీసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో ఉత్తమస్థానం సాధించేందుకు ఆ విధానాలను అమలు చేసేందుకు అక్కడి నుంచి కన్సల్టెంట్లను సైతం రప్పించారు. ♦ జీహెచ్ఎంసీ స్వతహాగానూ ఏటికేడు ఎన్నో వినూత్య కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ♦ నగర పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను భాగస్వాముల్ని చేసింది. ప్రస్తుతం దేశంతో పాటు మొత్తం ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచిన స్వచ్ఛ నమస్కారాన్ని కూడా ఈ నగరమే ఆరంభించింది. మొదట్నుంచీ ఇక్కడ అమలవుతున్న కంటెయిన్మెంట్ నిబంధనలు, లాక్డౌన్, సామాజిక దూరం వంటి వాటితోనే ఇండోర్ లాంటి పరిస్థితులు రాలేదని అభిప్రాయపడుతున్న వారూ ఉన్నారు. ♦ జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 24వేల మంది కార్మికులు నగరప్రజల ఆరోగ్య భద్రతకు వీర సైనికుల్లా పనిచేస్తున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ.. ఇంకా మరింత అప్రమత్తంగా ఉండాలని.. మరింత పరిశుభ్రంగా, అన్ని ప్రాంతాలను మరింత స్వచ్ఛంగా ఉంచాలని కోరుతున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో విఫలమైన ఇండోర్ పాఠంతో నగర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అన్ని విధాలా ప్రభుత్వానికి సహకరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేస్తోంది. -
కరోనా.. మధ్యప్రదేశ్లో 35 మంది డిశ్చార్జ్
ఇండోర్ : మధ్యప్రదేశ్లో 35 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. పలుమార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వారిని డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో 17 రోజులుగా కోవిడ్ ఆస్పత్రిలో చికిత్సపొందిన వీరు శనివారం డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో 34 మంది ఇండోర్, ఒకరు కర్గొనేకు చెందిన వారున్నారు. 'గత 17 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందాను. అందరూ నాకు అండగా నిలవడం వల్లే తిరిగి కోలుకోగలిగాను. అందరూ ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్యంగా ఉండాలి' అని డిశ్చార్జ్ అయిన కరోనా బాధితురాలు తెలిపారు. 'కరోనా వైరస్ను జోక్లా తీసుకోకండి. అధికారులు ఇచ్చే ఆదేశాలను తప్పకుండా అందరూపాటించండి. మీకుటుంబంతో కలిసి ఆరోగ్యంగా ఉండండి. నా తొమ్మిదేళ్ల కూతురు ఇంకా కరోనాతో పోరాడుతోంది' అని డిశ్చార్జ్ అయిన మరో కరోనా బాధితుడు తెలిపారు. ఇండోర్లో మొత్తం 892 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి డా. ప్రవీణ్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 50 కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇక మధ్య ప్రదేశ్లో మొత్తం 1310 కేసులు నమోదవ్వగా, 69 మంది డిశ్చార్జ్ అవ్వగా, 69 మంది మృతిచెందారు.