Lokesh Kanagaraj
-
కూలీ కంప్లీట్
‘కూలీ’ సినిమా షూటింగ్ పూర్తయింది. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, షౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ గెస్ట్ రోల్లో ఆమిర్ ఖాన్, స్పెషల్ సాంగ్లో పూజా హెగ్డే నటించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది.కాగా ఈ సినిమా చిత్రీకరణ ముగిసిన విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ధృవీకరించారు మేకర్స్. పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరోవైపు రజనీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. -
రజినీకాంత్ 'కూలీ' మూవీ వర్కింగ్ స్టిల్స్
-
దిల్లీ రిటర్న్స్
దిల్లీ రిటర్న్స్ అని హీరో కార్తీ అంటున్నారు. హీరో కార్తీ, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘ఖైదీ (2019)’ సినిమా బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో దిల్లీ అనే ఖైదీ పాత్రలో కార్తీ మంచి నటన కనబరిచారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్గా ‘ఖైదీ 2’ చేయాలని కార్తీ, లోకేశ్ ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారు. కానీ లోకేశ్కు ఉన్న ఇతర కమిట్మెంట్స్ కారణంగా ‘ఖైదీ 2’ చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది.కాగా ఈ ఏడాది ‘ఖైదీ 2’ చిత్రీకరణప్రారంభం అవుతుందన్నట్లుగా ‘ఎక్స్’లో ‘దిల్లీ రిటర్న్స్’ అంటూ పేర్కొన్నారు కార్తీ. ‘ఖైదీ’ సీక్వెల్ ‘ఖైదీ 2’ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కేవీన్ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు లోకేశ్ కనగరాజ్. ‘సర్దార్ 2’ మూవీతో బిజీగా ఉన్నారు కార్తీ... వీరిద్దరూ వారి వారి కమిట్మెంట్స్ పూర్తి చేసుకున్న తర్వాత ‘ఖైదీ 2’ చిత్రం సెట్స్పైకి వెళ్తుందని ఊహించవచ్చు. -
భారీ రేటుకు రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రజనీకాంత్(Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కూలీ’ (Coolie). ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రం. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈచిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేయలేదు. కానీ..అప్పుడే డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయట.ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడ్డాయట. చివరకు ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆమిర్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది మే లేదా జూన్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
'రజినీకాంత్ మూవీ సెట్లో సందీప్ కిషన్.. అసలు కారణం ఇదే'
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా మజాకా మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నక్కిన త్రినాథరావు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్గా నటించారు. మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించారు. అయితే ఇటీవల తన మూవీ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకెదురైన ఓ ప్రశ్నకు సందీప్ సమాధానమిచ్చారు. రజినీకాంత్ కూలీ మీరు నటిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలపై సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారో మనం ఓ లుక్కేద్దాం.రజినీకాంత్ మూవీ కూలీలో తాను నటించడం లేదని సందీప్ కిషన్ అన్నారు. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తన ఫ్రెండ్ కావడంతోనే కూలీ సెట్కు వెళ్లానని తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్రపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని వెల్లడించారు. నేను దాదాపు 45 నిమిషాల పాటు కూలీ సినిమాను వీక్షించానని సందీప్ వివరించారు. ఈ మూవీ కచ్చితంగా రూ.1000 కోట్ల మార్క్ను అధిగమిస్తుందని తెలిపారు. రజినీకాంత్ సార్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని మన యంగ్ హీరో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లోకేశ్ కనగరాజ్తో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. కాగా.. కూలీ మూవీ సెట్స్ నుంచి లోకేష్ కనగరాజ్, సూపర్ స్టార్ రజనీకాంత్తో సందీప్ కిషన్ ఉన్న ఫోటో వైరల్ కావడంతో ఆయన నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి.(ఇది చదవండి: నాగచైతన్య తండేల్ మూవీ.. అలాంటి సీన్ రిపీట్!)సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే పూజా హెగ్డే అధికారికంగా ఈ ప్రాజెక్ట్లో చేరింది. ఈ విషయాన్ని ఫిబ్రవరి 27 న మేకర్స్ వెల్లడించారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్కరం బంగారం స్మగ్లింగ్ మాఫియా చుట్టూ తిరిగే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నరు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. -
రెండు వారాల్లో రజనీకాంత్ 'కూలీ' నుంచి అదిరిపోయే గిఫ్ట్
అభిమానులే కాదు, సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురు చూసే కథానాయకుల చిత్రాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో కూలీ ఒకటి. కారణం ఈ చిత్ర కథానాయకుడు రజనీకాంత్ కావడమే. అంతేకాదు. లోకేశ్ కనకరాజ్ వంటి క్రేజీ దర్శకుడు, సన్ పిక్చర్స్ వంటి నిర్మాణ సంస్థ చేస్తున్న చిత్రం ఇది. ఇకపోతే నటి శృతిహాసన్, కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర, తెలుగు స్టార్ నటుడు నాగార్జున, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించడంతో పాటూ ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ఖాన్ కూడా కీలక పాత్రలో మెరవనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే కాదు క్రేజీ నటి పూజాహెగ్డే ఒక ప్రత్యేక పాటలో మెరుపులు మెరిపించనున్నారని సమాచారం. ఇక అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై ఎవరికై నా ఎందుకు ఆసక్తి ఉండదు. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్కు, విడుదలైన గ్లింప్స్కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇందులో రజనీకాంత్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో కూలీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరికుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా కూలీ చిత్ర వర్గాల నుంచి వచ్చిన ఓ అప్డేట్ ఈ చిత్ర టీజర్ను రెడీ చేశారట. ఈ చిత్ర టీజర్ చాలా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు ఫుల్జోష్లో ఉన్నారట. దీన్ని మరో రెండు వారాల్లో విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం. మార్చి 14న లోకేశ్ కనగరాజ పుట్టినరోజు ఉంది. అదే రోజున కూలీ టీజర్ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్లో ఉన్నారు. -
ఖైదీలో..?
ప్రముఖ నటుడు కమల్హాసన్(kamal haasan) ‘ఖైదీ 2’(Khaidi2) సినిమాలో నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. కార్తీ(karthi) హీరోగా లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. 2019లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్గా ‘ఖైదీ 2’ రూపొందనుంది. ఈ మూవీలోనూ కార్తీ హీరోగా నటించనుండగా లోకేశ్ కనగరాజే దర్శకత్వం వహించనున్నారు.కాగా ఈ సీక్వెల్లో కమల్హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. కమల్హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన ‘విక్రమ్’ (2022) సినిమా సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్పుడు వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ కుదిరింది. దీంతో ‘ఖైదీ 2’లోని ఓ కీలక పాత్ర చేయాలని కమల్ని లోకేశ్ అడగడం.. ఆ పాత్ర కూడా ఆయనకు బాగా నచ్చడంతో చేసేందుకు కమల్ ఓకే అన్నారని తమిళ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. త్వరలో ఈ చిత్రం ఆరంభం కానుంది. -
స్టార్ హీరోను లాక్ చేయనున్న 'లోకేశ్ కనకరాజ్'
కోలీవుడ్ నటుడు ధనుష్ పాన్ ఇండియా రేంజ్ సినిమాలో నటించనున్నారని కోలివుడ్లో వార్తలు వస్తున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్కు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. రేర్ కాంబినేషన్లో ఈ చిత్రం రానున్నడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. కోలీవుడ్లో మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి భారీ చిత్రాలను తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా లోకేశ్ కనకరాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రజనీకాంత్ కథానాయకుడిగా కూలీ చిత్రాన్ని ఆయన తెరకెక్కిస్తున్నారు. తరువాత కార్తీ హీరోగా ఖైదీ–2తోపాటు మరో రెండు చిత్రాలు కమిట్ అయ్యారు. కాగా నటుడు ధనుష్ విషయానికి వస్తే ఇటీవల కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అదేవిధంగా తమిళంలో పాటు, తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లోనూ కథానాయకుడిగా నటిస్తూ వరల్డ్ స్టార్గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఇడ్లీ కడై. అదేవిధంగా ఈయన దర్శకత్వం వహించిన మరో చిత్రం నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇక తెలుగులో హీరోగా నటిస్తున్న కుబేర చిత్రం కూడా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఇలా మరిన్ని చిత్రాల్లో ధనుష్ నటించనున్నారు. తాజాగా ఈయన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోకేశ్ కనకరాజ్ నటుడు ధనుష్ను కలిసి కథను వినిపించినట్లు, అది ఆయనకు నచ్చడంతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఈ క్రేజీ కాంబినేషనల్ తెరకెక్కనున్న చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ధనుష్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం కమిటైన చిత్రాలను పూర్తి చేసిన తరువాత వీరి కాంబోలో చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదన్నది గమనార్హం. -
హుకుం.. టైగర్ కా హుకుం...
ఇటీవల సరైన సక్సెస్లు లేక సతమతమవుతున్న నటుడు రజనీకాంత్కు నూతనోత్సాహాన్ని కలిగించిన చిత్రం జైలర్. సన్పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి నెల్సన్ దర్శకుడు. నటి తమన్న ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం 2023లో తెరపైకి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ తరువాత రజనీకాంత్ నటించిన లాల్ సలాం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తరువాత రజనీకాంత్ నటించిన వేట్టైయన్ చిత్రం ఆశించిన రీతిలో ఆడలేదు.ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి శృతిహాసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ మొదటి నుంచి చెబుతున్నారు. కాగా జైలర్ –2 చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ను పొంగల్ సందర్భంగా మంగళవారం చిత్ర వర్గాలు విడుదల చేసి రజనీకాంత్ అభిమానులకు కానుకగా అందించారు. నాలుగు నిమిషాల పాటూ సాగే ఆ ట్రైలర్లో దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుద్ చిత్ర కథా చర్చల కోసం గోవా వెళతారు. అక్కడ వారు మాట్లాడుకుంటుండగా నటుడు రజనీకాంత్ రౌడీలను వెంటాడి వేటాడుతూ వస్తారు. దీంతో భయభ్రాంతులకు గురైన నెల్సన్, అనిరుధ్ ఈ సన్నివేశం బాగుందే దీన్నే కథగా రూపొందిద్దాం అని అనుకుంటారు. ట్రైలర్ చివరిలో రజనీకాంత్ హుక్కుమ్ టైగర్ కా హుక్కుమ్ అంటారు. మాస్ మసాలాగా రూపొందిన ఈ ట్రైలర్కు ఇప్పుడు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జైలర్– 2 చిత్ర షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు వెలువడాల్సి ఉంది. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థనే నిర్మిస్తోంది. -
రోలెక్స్ వచ్చేస్తున్నాడు.
-
జైపూర్కు కూలీ
జైపూర్ వెళ్లనున్నారు కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతీహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ జైపూర్లో జరగనుందని, ఈ షెడ్యూల్లో రజనీకాంత్, ఆమిర్ ఖాన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ షెడ్యూల్తో సినిమా దాదాపు పూర్తవుతుందట. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘కూలీ’ సినిమాను కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న రిలీజ్ చేసే ఆలోచనలో యూనిట్ ఉందని సమాచారం. -
లోకేష్ కనకరాజ్-ప్రభాస్ మూవీ ఓకే చెప్పిన యంగ్ రెబల్ స్టార్..
-
'జైలర్' అభిమానులకు శుభవార్త
సూపర్స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసులోనూ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈయన ఇటీవల జ్ఞానవేల్ దర్మకత్వంలో వేట్టైయన్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మెప్పించారు. అయితే, ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా కూలీ చిత్రం తరువాత రజనీకాంత్ కోసం మరో చిత్రం ఎదురు చూస్తోంది. ఈయన ఇంతకుముందు కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. నెల్సన్ దర్శకత్వం వహించిన అందులో నటి రమ్యకృష్ణ రజనీకాంత్కు భార్యగా నటించగా, నటి తమన్నా ప్రత్యేక పాత్రలో మెరిశారు. కాగా జైలర్ చిత్రం నిర్మా ణ దశలోనే దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు నెల్సన్ పేర్కొన్నారు. దీంతో ఈయన జైలర్– 2 చిత్ర కథను తయారు చేసే పనిలో ఉన్నారు. తా జాగా కథను రెడీ చేసి నెల్సన్ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధం అయ్యారని సమాచారం. ఈ చిత్రానికి 'హుకూమ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల వివరాలు ఇంకా వెల్లడికాకపోయినా ప్రస్తుతం 'హుకూమ్' చిత్రం గురించి అప్ డేట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం డిశంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని, దీనికి సంబంధించిన పనులు స్థానిక పూందమల్లిలోని ఈవీపీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో వీడియోను రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజం అయితే రజనీకాంత్ అభిమానులకు డబుల్ ట్రీట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. -
లోకేష్ కనకరాజ్ చిత్రానికి కొత్త సంగీత దర్శకుడు
మాస్టర్, విక్రమ్,లియో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ దర్శకుడిగా మారిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా 'కూలీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్ కనకరాజ్ ఇంతకు ముందే నిర్మాతగా మారి ఒక చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేశారు. కాగా తాజాగా రాఘవ లారెన్స్ కథానాయకుడిగా 'బెంజ్' అనే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ కథను అందించినప్పటికీ ఈ చిత్రానికి రెమో (శివకార్తికేయన్), సుల్తాన్ (కార్తి) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను నటుడు లారెన్స్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రం ద్వారా నూతన సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ను పరిచయం చేస్తున్నారు. గతంలో ఏఆర్ రెహమాన్, జీవీ ప్రకాష్ కుమార్, సత్య.సీ వద్ద పలు చిత్రాలకు ఆయన పనిచేశారు. అదే విధంగా కట్చిచేర, ఆశ కూడ వంటి ప్రైవేట్ ఆల్బమ్లో పాడి సంగీతాన్ని అందించి పాపులర్ అయ్యారనేది గమనార్హం. లోకేష్ కనకరాజ్ నిర్మిస్తున్న బెంజ్ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా సీనీ రంగప్రవేశం చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఇంతకంటే మంచి అవకాశం తనకు రాదన్నారు. దీంతో ఉత్సాహంతో, మరింత బాధ్యతగా పని చేస్తున్నానన్నారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి సంగీతాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. -
డిల్లీతో రోలెక్స్
తమిళ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో సూర్య, కార్తీలకు ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన వీరు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ‘ఖైదీ 2’ సినిమాలో ఈ అన్నదమ్ములిద్దరూ తెరని పంచుకోనున్నారు. కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఖైదీ’. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో తొలి మూవీగా వచ్చిన ‘ఖైదీ’ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో 2019 అక్టోబరు 25న విడుదలై హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని కార్తీ, లోకేష్ కనగరాజ్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో ‘కూలీ’ సినిమా తెరకెక్కిస్తున్నారు లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రం తర్వాత లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా ‘ఖైదీ 2’ మూవీ చేస్తారట లోకేశ్. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది.అయితే ఈ సినిమాలో హీరో సూర్య కీలక పాత్రలో నటించనున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ చిత్రంలో రోలెక్స్ అనే డాన్ గా అతిథి పాత్రలో మెరిశారు సూర్య. ‘ఖైదీ 2’ లోనూ రోలెక్స్ పాత్రలో సూర్య కనిపిస్తారని టాక్. పైగా ‘ఖైదీ 2’లో రోలెక్స్ను డిల్లీ (’ఖైదీ’ చిత్రంలో కార్తీ చేసిన పాత్ర పేరు డిల్లీ) నేరుగా కలవాల్సి ఉందని ఇటీవల కార్తీ చెప్పడంతో వీరిద్దరూ కలిసి నటించడం పక్కా అని ఖుషీ అవుతున్నారు అభిమానులు. తమ్ముడు కార్తీతో కలిసి ‘ఖైదీ– 2’లో తాను నటిస్తానని సూర్య కూడా ఇటీవల ఓ సందర్భంలో చెప్పడంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలో ఫుల్ క్రేజ్ నెలకొంది. -
'ఖైదీ' సీక్వెల్లో మరో పాన్ ఇండియా హీరో
కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన కెరియర్లో రెండవ సినిమాగా ఖైదీ విడుదలైంది. నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు లోకేష్ కనకరాజ్, నటుడు కార్తీ చెప్పారు. అయితే ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ అయ్యారు. అదే విధంగా లోకేష్ కనకరాజ్ నటుడు కమలహాసన్ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్ చిత్రం ఘనవిజయాన్ని సాధించింది ఆ చిత్రం చివరిలో నటుడు సూర్య రోలెక్స్ పాత్రలో డాన్గా మెరిశారు. అదేవిధంగా ఖైదీ చిత్రంలో కార్తీ పాత్ర పేరు ఢిల్లీ. కాగా అన్నదమ్ములైన సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీంతో సూర్య, కార్తీలను ఎప్పుడు చూసినా రోలెక్స్, డిల్లీ కలిసి నటించే విషయం గురించే అడుగుతుంటారు. ఇటీవల నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నెలో జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కార్తీ అతిథిగా పొల్గొన్నారు. దీంతో అభిమానులు మరోసారి రోలెక్స్, డిల్లీ కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు. దీంతో సూర్య త్వరలోనే ఖైదీ – 2 చిత్రం ప్రారంభం అవుతుందని అందులో తమ్ముడు కార్తీతో కలిసి తాను నటిస్తానని చెప్పారు. అదేవిధంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా వచ్చే ఏడాది ఖైదీ– 2 చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఒక భేటీలో చెప్పారు. దీంతో సూర్య, కార్తీ కలిసి నటించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ నటుడు రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన చేసే చిత్రం ఖైదీ– 2 నే అవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
'ఖైదీ' సీక్వెల్పై లోకేశ్ కనకరాజ్ ట్వీట్
ఖైదీ–2 చిత్రం గురించి తాజా అప్డేట్ వచ్చేసింది. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం అప్పట్లో భారీ విజయం అందుకుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తన కెరియర్లో రెండో చిత్రంగా డ్రీమ్ వారియర్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. విశేషం ఏమిటంటే..? ఈ చిత్రంలో కథానాయకి లేదు, డ్యూయెట్లు ఉండవు, ఇంకా చెప్పాలంటే అసలు గ్లామర్ వాసన లేని చిత్రం ఖైదీ. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తి నటన హైలెట్. ఖైదీ చిత్రానికి సీక్వెల్గా ఉంటుందని అటు దర్శకుడు లోకేశ్ కనకరాజ్, ఇటు కార్తి చెబుతూనే ఉన్నారు. దీంతో ఖైదీ–2 చిత్రం కోసం కార్తి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖైదీ చిత్రం విడుదలై 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ తన ఎక్స్ మీడియాలో పోస్ట్చేస్తూ.. ‘అంతా ఇక్కడ నుంచే ప్రారంభమైంది. కార్తి, ఎస్ఆర్ ప్రభులకు ధన్యవాదాలు. వీరి వల్లే లోకేశ్ యూనివర్శల్ సాధ్యమైంది. త్వరలోనే ఢిల్లీ (ఖైదీ చిత్రంలో కార్త్తి పాత్ర పేరు) తిరిగి రానున్నారు అని పేర్కొన్నారు. అలా ఆయన త్వరలోనే ఖైదీ–2 చిత్రం తెరకెక్కనున్నట్లు ఆయన చెప్పారు. దీంతో కార్తి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం లోకేశ్ కనకరాజ్ రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత ఖైదీ–2కు సిద్ధమయ్యే అవకాశం ఉందని భావించవచ్చు. It all started from here! 💥💥Grateful to @Karthi_Offl sir, @prabhu_sr sir and the ‘universe’ for making this happen 🤗❤️Dilli will return soon 🔥#5YearsOfKaithi pic.twitter.com/Jl8VBkKCju— Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 25, 2024 -
'లియో'కు ఏడాది.. మేకింగ్ వీడియో చూశారా..?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుంది. దీంతో అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక కానుకను అందించింది. లోకేశ్- విజయ్ కాంబోలో మాస్టర్ తర్వాత ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 19న విడుదలైంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లియో రూ. 620 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతటి విజయం సాధించిన సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి కావడంతో 'లియో క్రానికల్స్' పేరుతో సుమారు 8 నిమిషాల నిడివి ఉన్న వీడియోను మేకర్స్ పంచుకున్నారు. సినిమాలో ట్రెండ్ అయిన సీన్స్ను ఎలా తెరకెక్కించారో చూపించారు. నెట్టింట వైరల్గా మారిన మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
కాంబినేషన్ సెట్?
బాలీవుడ్ అగ్ర హీరో ఆమిర్ ఖాన్ , తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. ఈ కథ విషయమై ఇటీవల ఆమిర్ ఖాన్ , లోకేష్ పలుమార్లు చర్చించుకున్నారట. ప్రస్తుతం వీరిద్దరికి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావచ్చని, 2026లో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. ఈ సినిమా సూపర్హీరో జానర్లో ఉంటుందట. మరి.. ఆమిర్, లోకేష్ కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ ఓ అతిథి పాత్ర చేస్తున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. -
ఎల్సీయూపై లోకేశ్ కనగరాజ్ ప్రకటన
కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు కూడా అభిమానులు ఉన్నారు. త్వరలో రజనీకాంత్ 'కూలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు ఆయన డైరెక్ట్ చేసిన ఖైదీ, విక్రమ్, లియో తదితర సినిమాలు టాలీవుడ్లో మంచి విజయాన్ని అందుకున్నాయి. సరికొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ 'సినిమాటిక్ యూనివర్స్' (LCU) అనే కాన్సెప్ట్తో విజయాలను అందుకున్నారు.కూలీ సినిమా గురించి లోకేశ్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ చిత్రం సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)లో భాగం కాదన్నారు. కానీ, కూలీ సినిమా తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్ రానుందని ఆయన ప్రకటించారు. సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగమైన స్టార్ హీరోలందరితో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని రివీల్ చేశారు.ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్కు కాస్త బ్రేక్ ఇచ్చామని లోకేశ్ చెప్పారు. రజనీకాంత్కు ఇటీవల సర్జరీ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 16 నుంచి తలైవా సెట్స్లో ఎంట్రీ ఇస్తారని తెలిపారు. అయితే, ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలన్నీ కూడా కేవలం ఆరు నెలల్లోనే పూర్తిచేశానని, ఇప్పుడు కూలీ చిత్రాన్ని ఈ సమయంలోపే ముగిస్తానని ఆయన పేర్కొన్నారు.సినిమాటిక్ యూనివర్స్ (LCU) ప్లాన్ ఇదేలోకేశ్ కనగరాజ్ రాబోయే సినిమాల గురించి కూడా మాట్లాడారు. రాబోయే ఐదేళ్లపాటు తన సినిమాల్లో బ్లడ్,గన్స్,డ్రగ్స్ ఉంటాయని చెప్పారు. ఆ తర్వాతే మరో భిన్నమైన సినిమాలు తీస్తానన్నారు. ఈ క్రమంలోనే ఖైదీ, విక్రమ్, లియోతో సినిమాటిక్ యూనివర్స్ కథ ప్రారంభమైందన్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ అనే కీలకమైన పాత్ర ఉందని రివీల్ చేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీతో కూలీ సినిమా పూర్తి చేసిన వెంటనే LCUలో భాగమైన హీరోలందరితో ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభమౌతుంది. అంటే ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడు సినిమాలను లింక్ చేస్తూ ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఉండనుంది. అయితే, 'లియో2' కోసం విజయ్ ఒప్పుకుంటే 'పార్తిబన్' పేరుతో తెరకెక్కిస్తానని లోకేశ్ కనగరాజ్ చెప్పారు. -
ఒక్క వీడియోతో రెండు నెలల కష్టం బూడిదలో పోసినట్లైంది: డైరెక్టర్ ఆవేదన
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.. ప్రస్తుతం రజినీకాంత్తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ మూవీని భారీ బడ్జెట్తో సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో సైమన్ పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైజాగ్లో నాగార్జున్పై ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన వీడియో నెట్టింట లీకైంది. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేశారు. అది కాస్తా వైరల్ కావడంతో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ స్పందించారు. దయచేసి ఇలాంటి పనులు చేయవద్దని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.లోకేశ్ తన ట్వీట్లో రాస్తూ..' మేము దాదాపు రెండు నెలల పాటు కష్టపడ్డాం.. ఈ ఒక్క వీడియోతో మా కష్టం వృథా అయింది. మీ అందరికీ నాదొకటే విజ్ఞప్తి.. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు.. దీని వల్ల మేం పడిన కష్టమంతా వృథా అవుతుంది.. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. (ఇది చదవండి: రజినీకాంత్- కనగరాజ్ 'కూలీ'.. నాగార్జున వీడియో లీక్!) కాగా.. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ దేవాగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో జరుగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Two months of hard work by many people have gone in vain because of one recording. I humbly request everyone not to engage in such practices, as they spoil the overall experience. Thank you.— Lokesh Kanagaraj (@Dir_Lokesh) September 18, 2024 -
రజినీకాంత్- కనగరాజ్ 'కూలీ'.. నాగార్జున వీడియో లీక్!
టాలీవుడ్ హీరో, కింగ్ నాగార్జున ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్-8కు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది అంతా సరికొత్తగా బిగ్బాస్ షో ప్రారంభమైంది. ఇప్పటికే హౌస్ నుంచి బేబక్క, ఆర్జే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం మూడోవారంలో నామినేషన్స్ ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. అయితే నాగార్జున.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న కూలీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ప్రస్తుతం నాగార్జున ఈ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నాగ్ యాక్షన్ సీన్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కింగ్ ఫైట్ చేస్తోన్న సీన్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున్ సైమన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వీడియో చూసిన అభిమానులు తమ అభిమాన హీరోను చూసి థ్రిల్ అవుతున్నారు. ఇందులో నాగార్జున పాత్రను విక్రమ్ సినిమాలోని కమల్ హాసన్ రోల్లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు శృతి హాసన్ని, సత్యరాజ్, ఉపేంద్ర నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ దేవాగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో జరుగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది. #Nagarjuna as SIMON in #coolie 🔥💥 ... heavy coat pota #rolex vibes...there's a reason y loki said he'll retire soon. His style of making is gonna get saturated among audiences soon 😢#LokeshKanagaraj #Rajinikanth𓃵 #Suriya #kanguva pic.twitter.com/j7aB1x07zL— Shalzz (@shalu_achar) September 18, 2024 #COOLIE : #Nagarjuna Scenes Leaked🔥This is Gonna Be Bigger This Time🥶#Rajinikanth | #LokeshKanagaraj pic.twitter.com/CqvWZ9SQBT— Prasanna Zone (@JiPrasanna) September 18, 2024 #COOLIE : #Nagarjuna Scenes Leaked🔥This is Gonna Be Bigger This Time🥶#Rajinikanth | #LokeshKanagaraj #GucciIstante#Balochistan #pagers #SB19pic.twitter.com/coFtlcE5WV pic.twitter.com/YBG7GG3QtD— Suresh choudhary (@Sureshrewar03) September 18, 2024 -
'కూలీ' షూటింగ్.. కొద్దిలో తప్పిన అగ్ని ప్రమాదం
తమిళ స్టార్ హీరో రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తీస్తున్న సినిమా 'కూలీ'. ప్రస్తుతం వైజాగ్ పోర్ట్ ఏరియాలో షూటింగ్ జరుగుతోంది. దాదాపు 40 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు. అయితే చిత్రబృందానికి ఇప్పుడు కొద్దిలో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. చిత్రీకరణ జరుగుతున్న ప్రదేశానికి దగ్గరలో కంటైనర్ టెర్మినల్లో మంటలు చెలరేగాయి. చైనా నుంచి గత నెలలో వచ్చిన లిథియం బ్యాటరీల లోడ్ కంటైనర్ ఇది. తొలుత కంటైనర్ లోపల నుంచి పొగ వస్తున్నట్లు గుర్తించిన టెర్మినల్ సిబ్బంది.. వెంటనే పోర్ట్ ఫైర్ విభాగానికి సమాచారం అందించారు. అలా ఫైరింజన్లు వచ్చే సమయానికి కంటైనర్ లోని చాలా బ్యాటరీలని బయటకు లాగేశారు. కానీ కొన్ని బ్యాటరీలు దగ్ధమయ్యాయి. ప్రస్తుతం ఐదు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్కి ముందే 'తంగలాన్'కి దెబ్బ)అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే రజినీకాంత్ 'కూలీ' షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఊహించని ప్రమాదం జరగడంతో సెట్లో ఉన్నవాళ్లందరూ భయబ్రాంతులకు గురయ్యాడు. కాకపోతే ఎవరికీ ఏం కాలేదు కాబట్టి అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఇకపోతే 'కూలీ' సినిమాలో రజినీకాంత్ హీరో కాగా నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్, అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. 'విక్రమ్', 'లియో' చిత్రాలతో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్ ఈసారి అదరగొట్టేస్తాడనే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవిలో ఇది థియేటర్లలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.(ఇదీ చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు) -
రజనీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో ఎంట్రీ..?
సూపర్ స్టార్ రజనీకాంత్- డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల గురించి పలు రూమర్స్ వచ్చాయి. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో తెరపైకి వచ్చింది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై సినీ అభిమానులు ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో నటిస్తున్న తారల గురించీ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇదొక మల్టీస్టారర్ సినిమా తరహాలో తెరకెక్కబోతోందని, ఇందులో టాలీవుడ్ హీరో నాగార్జునతో పాటు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించనున్నారని తమిళ సినీవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే, తాజాగా కన్నడ సూపర్ స్టార్ 'ఉపేంద్ర' ఈ ప్రాజెక్ట్లో నటిస్తున్నట్లు సమాచారం. ఒక కీలకమైన పాత్ర కోసం ఆయన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కొద్దిరోజుల క్రితమే కూలీ సినిమా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో ముగిసింది. దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ ఇక్కడే కొనసాగింది. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం ఉండనున్నట్లు తెలిసింది. -
భారతీయుడు-2 మూవీపై అలాంటి ట్వీట్.. డైరెక్టర్పై నెటిజన్స్ ఫైర్!
కమల్ హాసన్- శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ఇండియన్-2. 1996లో సూపర్ హిట్గా నిలిచిన భారతీయుడు మూవీకి సీక్వెల్గా తీసుకొచ్చారు. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోతోంది. ఈ చిత్రంలో శంకర్ మార్క్ కనిపించలేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.అయితే తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఇండియన్-2 సినిమాపై ట్వీట్ చేశారు. శంకర్ సార్ నిబద్ధతకు.. కమల్ హాసన్ నటనకు భారతీయుడు-2 చిత్రం నిదర్శనమన్నారు. అద్భుతమైన బీజీఎం అందించిన అనిరుధ్ రవిచందర్కు నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ఇండియన్-3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు రాసుకొచ్చారు.అయితే ఇది చూసిన నెటిజన్స్ లోకేశ్ కనగరాజ్ ట్వీట్పై మండిపడుతున్నారు. మీరు ఇలాంటి రివ్యూ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఇలాంటి జోకులు వేయడం అపండి సార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇండియన్-3 కోసం తాము సిద్ధంగా లేమని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. మీరు కమల్ సార్ ఫ్యాన్ అయినప్పటికీ.. ఇలా చెప్పడం తగదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దయచేసి కూలీ మూవీ, ఖైదీ, విక్రమ్ లాంటి సీక్వెల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండని లోకేశ్కు సూచిస్తున్నారు. కాగా.. ఇప్పటికే నిడివి ఎక్కువైందంటూ బాక్సాఫీస్ వద్ద విమర్శలు ఎదుర్కొంటున్న ఇండియన్-2పై పాజిటివ్ రివ్యూ ఇవ్వడంతో నెటిజన్స్ ఇలా రియాక్ట్ అయ్యారు. #Indian2 is proof of our #Ulaganayagan @ikamalhaasan sir’s commitment to his craft. Kudos to @shankarshanmugh sir for bringing grand visions to life on a massive scale with @anirudhofficial’s scintillating background score for the film! 🤗❤️Can’t wait for #Indian3 🔥🔥— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 13, 2024 -
స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్ట్లో పుష్ప విలన్.. ఓకే చెప్పేస్తారా?
పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు ఫాహద్ ఫాజిల్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఫాహద్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలోనూ కనిపించనున్నారు. పుష్ప-2తో పాటు రజినీకాంత్ వెట్టాయన్ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు మరో క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఫహద్ ఫాసిల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కూలీ మేకర్స్ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మరోసారి రజినీకాంత్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టాయన్లో రజినీకాంత్, ఫాహద్ ఫాజిల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరోవైపు ఫాహద్ ఫాజిల్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ 'వెట్టాయన్', అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్తో పాటు తమిళంలో మారీసన్, మలయాళంలో 'ఒడుమ్ కుతిర చదుమ్ కుతిరా', 'బౌగెన్విల్లా' 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాల్లో నటిస్తున్నారు. మరీ ఈ చిత్రాన్ని అంగీకరిస్తాడో లేదో తెలియాల్సి ఉంది. కాగా.. లోకేష్ కనగరాజ్ 'కూలీ' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో ప్రారంభమైంది. -
సామజవరగమన హీరోయిన్కు సూపర్ ఛాన్స్?
‘సామజవరగమన’ సినిమాలో మంచి నటన కనబరచి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ . అయితే ఈ బ్యూటీకి తాజాగా ఓ సూపర్ చాన్స్ లభించిందట. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలోని ఓ కీలక పాత్రకు రెబ్బా మౌనికా జాన్ ను లోకేష్ కనగరాజ్ ఎంపిక చేశారని కోలీవుడ్ సమాచారం. రజనీకాంత్తో స్క్రీన్ స్పేస్ అంటే ఆమెకు కెరీర్ పరంగా ఓ సూపర్చాన్స్ కావొచ్చు. ప్రస్తుతం ‘కూలీ’ చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. రజనీకాంత్, శ్రుతీహాసన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. సత్యరాజ్, మహేంద్రన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
కోలీవుడ్కు కూలి 1000 కోట్లు.. పక్కనా..?
-
Lokesh Kanagaraj: కూలీ ఆగలేదు
రజనీకాంత్ ‘కూలీ’ ఆగలేదు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా ఇటీవల ఓ సందర్భంలో ‘కూలీ’ చిత్రీకరణ జూన్ 10న ప్రారంభం కానున్నట్లు రజనీకాంత్ వెల్లడించారు. కానీ ఈ తేదీకి ‘కూలీ’ సెట్స్పైకి వెళ్లలేదు. ఆ తర్వాత దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ‘ఎక్స్’ బయోలో ‘కూలీ’ సినిమా పేరు కనిపించలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై తాజాగా లోకేశ్ కనగరాజ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘కూలీ’ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ జరుగుతోందని, జూలైలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్తుందని లుక్ టెస్ట్ సెషన్లోని ఫొటోను షేర్ చేశారు లోకేశ్. -
'లియో' పార్ట్ 2 కథ రెడీ అంటూ షాకింగ్ కామెంట్ చేసిన డైరెక్టర్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా 'లియో' గతేడాదిలో విడుదలైంది. సినిమాపై విమర్శలు వచ్చినా కూడా భారీగానే కలెక్షన్స్ రాబట్టింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటించగా సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించారు. ఇప్పుడు లియో సీక్వెల్ కథ రెడీ అంటూ లోకేష్ కనగరాజ్ తెలిపాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్లో ఈ బిగ్ ప్రాజెక్ట్పై అధికారికంగా ప్రకటన ఏమైనా వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' చిత్రంలో విజయ్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో రానున్న ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత కార్తీక్ సుబ్బరాజుతో తన 69వ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. రాజకీయాల కారణంగా ఇదే విజయ్కి చివరి సినిమా అవుతుందని కూడా నెట్టింట వైరల్ అయింది. దీనికి తెలుగు నిర్మాతలు తెరకెక్కించనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ బిగ్ ప్రాజెక్ట్ డీల్కు ఫుల్స్టాప్ పడిందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ప్రకటన రాలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లియో-2 చిత్రం కథ రెడీ అని, విజయ్ ఓకే అంటే వెంటనే ప్రారంభమవుతుందని పేర్కొనడం చర్చినీయాంశంగా మారింది. ఈ ప్రకటనతో విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాల్సి ఉంది.ప్రస్తుతం రజనీకాంత్తో లోకేష్ కనకరాజ్ కూలీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాల్సింది స్క్రీన్ ప్లే ఆలస్యం కావడంతో జూలై నెలలో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
లోకేశ్ కనకరాజ్పై రజనీ ఆగ్రహం?
సినిమా రంగంలో కోపతాపాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు సహజం. ఈ మధ్య నటుడు అజిత్ దర్శకుడు విఘ్నేశ్శివన్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారనే ప్రచారం జరిగింది. అందుకు కారణం చిత్ర కథను అనుకున్న టైంలో రెడీ చేయడంలో దర్శకుడు విఘ్నేశ్శివన్ విఫలం అయ్యారన్నదే. దీంతో ఆ చిత్రం నుంచి విఘ్నేశ్శివన్ను తొలగించారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ చిత్రమే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న విడాముయర్చి. ఇదే పరిస్థితిని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఎదుర్కొంటున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకుముందు ఈయన చేసిన చిత్రాలన్నీ(లియో చిత్రం మినహా) సంచలన విజయాలను సాధించాయన్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ నుంచి, టైటిల్ ప్రకటన వరకూ అనూహ్య క్రేజ్ను తెచ్చుకున్నాయి. కూలీ చిత్రాన్ని జూన్ రెండవ వారంలో ప్రారంభించనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ తన 170వ చిత్రం వేట్టైయాన్ను త్వరగా పూర్తిచేసినట్లు సమాచారం. అయితే కూలీ చిత్రం అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడంతో దర్శకుడు లోకేశ్ కనకరాజ్పై రజనీకాంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూలీ చిత్ర కథనాన్ని మూడు నెలలుగా రాస్తున్నారట. ఇంకా పూర్తికాకపోవడంతో షూటింగ్ ఆలస్యమైందని సమాచారం. ఆయన స్క్రిప్ట్ పక్కాగా పూర్తి అయిన తరువాతనే సెట్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో కూలీ చిత్రం జూలైలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
వారం తర్వాత కూలీగా...
‘కూలీ’గా మారిపోవడానికి రెడీ అవుతున్నారు రజనీకాంత్. ఆయన హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో సత్యరాజ్, శోభన కీలక పాత్రల్లో నటించనున్నారని, కమల్హాసన్ ఓ అతిథి పాత్రలో కనిపిస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. కాగా ‘కూలీ’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఆధ్యాత్మిక గురువు దగ్గర పేర్కొన్నారు రజనీకాంత్.తొలి షెడ్యూల్ చిత్రీకరణ చెన్నైలో ప్రారంభం కానుందని తెలిసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ‘కూలీ’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే రజనీకాంత్ హీరోగా నటించిన మరో చిత్రం ‘వేట్టయాన్’. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయనున్నట్లుగా చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా ‘వేట్టయాన్’ను అక్టోబరు 10న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా రజనీకాంత్ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక ప్రయాణం
ఒక సినిమా షూటింగ్ ఆరంభించే ముందు... లేదా సినిమా పూర్తయ్యాక ఆధ్యాత్మిక యాత్ర చేస్తుంటారు రజనీకాంత్. ఆయన ఎక్కువగా హిమాలయాలకు వెళ్లే విషయం తెలిసిందే. అక్కడి మహావతార్ బాబాజీ గుహలో రజనీ ధ్యానం చేస్తుంటారట. తాజాగా రజనీకాంత్ మరోసారి ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. దాదాపు పది రోజులు హిమాలయాల్లో గడిపి, తిరిగి వచ్చేలా ప్లాన్ చేసుకున్నారట. చెన్నై చేరుకున్న వెంటనే తన తాజా చిత్రం ‘కూలీ’ చిత్రీకరణలో పాల్గొంటారు రజనీకాంత్.లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. మరోవైపు రజనీకాంత్ నటించిన చిత్రం ‘వేట్టయాన్’. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వేట్టయాన్’లో రజనీకాంత్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ ఏడాది అక్టోబరులో ఈ చిత్రం విడుదల కానుంది. -
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఏం చెప్పినా చేస్తా: యువ నటుడు
అర్జున్ దాస్.. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి గొంతు. బయపెట్టేలా ఉండే బేస్ వాయిస్ తనకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. 'ఖైదీ' మూవీలో విలన్గా చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ఇప్పుడు హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అలా తన కొత్త మూవీ 'రసవాది' రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా)ఎక్కడో దుబాయ్లో పనిచేసే అర్జున్ దాస్.. చైన్నెకి వచ్చి డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ తీసిన 'ఖైదీ'తో యాక్టర్ అయ్యాడు. దీని తర్వాత 'మాస్టర్'లోనూ లోకేశ్ ఇతడికి ఛాన్స్ ఇచ్చాడు. అందుకే ఆయనంటే అర్జున్దాస్కు ప్రత్యేక అభిమానం. తాజాగా తన కొత్త మూవీ రిలీజ్ సందర్భంగా అర్జున్ దాస్ పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. విలన్గా చేసే మీరు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. మళ్లీ విలన్గా నటించే అవకాశమొస్తే చేస్తారా? అన్న ప్రశ్నకు బదిలిస్తూ.. లోకేశ్ కనకరాజ్ విలన్గా చేయమని చెబితే కచ్చితంగా నటిస్తానని అన్నాడు.డైరెక్టర్ లోకేశ్ తనకు మంచి మిత్రుడని, ఆయన అవకాశమిస్తే రజనీకాంత్ 'కూలీ'లో నటించడానికి రెడీ అని అర్జున్ దాస్ అన్నాడు. మళ్లీ డబ్బింగ్ చెప్పే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి అవకాశం లేదని, లోకేశ్ కనకరాజ్ తన సినిమాలో డబ్బింగ్ చెప్పమంటే మాత్రం ఎలాంటి పాత్రకై నా చెబుతానని క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) -
రజినీకాంత్ కూతురిగా ఛాన్స్ కొట్టేసిన స్టార్ హీరోయిన్
సూపర్స్టార్ రజినీకాంత్ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలు శృతిహాసన్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టైయాన్' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా దీని తరువాత తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్ను నిర్ణయించినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ నెల 22వ తేదీన చిత్ర టైటిల్ను, టీజర్ను విడుదల చేయనున్నట్లు ఇటీవల దర్శకుడు లోకేష్ కనకరాజ్ చెప్పారు. అలాగే ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుందన్నారు. కాగా తాజాగా ఇందులో రజినీకాంత్ కూతురిగా శృతిహాసన్ నటించనున్నట్లు టాక్ వైరల్ అవుతోంది. కోలీవుడ్లో సినీ దిగ్గజాలైన కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించి 25 ఏళ్లు అవుతోంది. అలాంటిది ఇప్పుడు కమల్ హాసన్ కూతురు రజినీకాంత్ తాజా చిత్రంలో ఆయనకు కూతురుగా నటించనున్నడం విశేషమే. మరో విషయం ఏమిటంటే శృతిహాసన్ తమిళంలో నటించి చాలా కాలం అవుతోంది. లాభం చిత్రం తరువాత ఈమె ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. కాగా సుమారు మూడేళ్ల తరువాత ఈ బ్యూటీకి కోలీవుడ్లో నటించే అవకాశం వచ్చిందన్న మాట. అయితే ఇటీవల ఈమె తన తండ్రి కమల్ హాసన్ రాసి, రూపొందించిన ఇనిమేల్ అనే పాట ఆల్బమ్లో దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కలిసి నటించిన విషయం తెలిసిందే. కాగా శృతిహాసన్, రజినీకాంత్ 171 చిత్రంలో నటించే విషయమై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
లోకేష్ కనగరాజ్, లారెన్స్ కాంబినేషన్లో సినిమా ప్రకటన
కోలీవుడ్లో వరుస హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు లోకేష్ కనగరాజ్.. ఆయన నుంచి సినిమా ప్రకటన వచ్చిందంటే చాలు భారీగా అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలో ఖైదీ, విక్రమ్, మాస్టర్ లాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ క్రియేట్ చేసి సూపర్ స్టార్ రజనీకాంత్తో సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. తాజాగా లోకేష్ కనగరాజ్ కొత్త సినిమాను ప్రకటించాడు. దానికి టైటిల్ కూడా 'బెంజ్' అని ఫిక్స్ చేశాడు. అందులో రాఘవ లారెన్స్ హీరోగా నటుస్తున్నాడు. అయితే ఈ క్రేజీ సినిమాను లోకేష్ డైరెక్ట్ చేయడం లేదు. కేవలం కథను మాత్రమే అందిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ చిత్రాన్ని బక్యరాజ్ కన్నన్ (రెమో) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట.. లోకేష్ డైరెక్ట్ చేసిన ఖైదీ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ఉండదు అనే విషయం తెలిసిందే. రాఘవ లారెన్స్ నుంచి మరో సినిమా ప్రకటన కూడా తాజాగా వెలువడింది. హంటర్ అనే టైటిల్తో ఒక పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. కోలీవుడ్లో కత్తి సినిమాను డైరెక్ట్ చేసిన వెంకట్ మోహన్ ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నాడు. కత్తి సినిమా తెలుగులో ఖైదీ 150 పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. హంటర్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
రజనీకాంత్ కళుగు?
రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ను ఈ నెల 22న అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ పలు పేర్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకు ‘కళుగు’ (తెలుగులో ‘గద్ద’ అని అర్థం) అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట. మరి... ఇదే టైటిల్ ఖరారు అవుతుందా? లేక మరో టైటిల్ ఫిక్స్ అవుతుందా అనేది తెలియాలంటే ఈ నెల 22 వరకు ఆగాల్సిందే. ఈ చిత్రం షూటింగ్ జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలో ్ర΄ారంభం కానుందని తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. -
రజనీకాంత్ 171వ చిత్ర టైటిల్ ఇదేనా?
నటుడు రజనీకాంత్ చిత్రం అంటేనే ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఇటీవల జైలర్ వంటి అదిరిపోయే హిట్ చిత్రానిచ్చిన ఈయన ప్రస్తుతం జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇందులో రజనీకాంత్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. కాగా తదుపరి ఈయన తన 171వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం గురించే పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేశారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రజనీకాంత్ గెటప్ చూస్తేనే ఇదేదో డాన్ కథా చిత్రంగా ఉంటుందనిపించేలా ఉంది. వైరెటీగా రజనీకాంత్ చేతులకు వాచీలతో కూడిన భేడీలు వేసిన ఫొటో ఉన్న పోస్టర్కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇది టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి కథ కాదని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇది మాదకద్రవ్యాలు, కిడ్నాప్కు సంబంధించిన కథ కూడా కాదని చెప్పారు. దీంతో ఈ చిత్ర కథపై మరింత ఆసక్తి నెలకొంది. చిత్రం టైటిల్ను ఈ నెల 22వ తేదీన వెల్లడించనున్నట్లు, షూటింగ్ను జూన్లో ప్రారంభించనున్నట్లు దర్శకుడు ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. కాగా విక్రమ్ చిత్రంతో నటుడు కమలహాసన్కు సంచలన విజయాన్ని అందించిన లోకేశ్కనకరాజ్, ఇప్పుడు రజనీకాంత్ను చాలా డిఫరెంట్గా చూపించడానికి యత్నిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్ను నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో రజనీకాంత్ విలన్గా నటించనున్నారనే ప్రచారం మరోపక్క సాగుతోంది. కాగా 'కళుగు' అంటే ఆంగ్లంలో 'ఈగిల్' అని అర్థం. కాగా ఇదే టైటిల్తో రజనీకాంత్ 1981లో కథానాయకుడిగా నటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. -
లోకేష్ కనగరాజ్తో లారెన్స్ సినిమా.. నయన్ ఒప్పుకుంటుందా?
తమిళసినిమా: కోలీవుడ్లో ప్రస్తుతం స్టార్ దర్శకుడు ఎవరంటే ఠక్కున వచ్చే బదులు లోకేష్ కనకరాజ్ అనే. ఈయన చేసింది ఇప్పటికి అక్షరాలా ఐదు చిత్రాలే. అయితే అన్నీ వసూళ్ల వర్షం కురిపించినవే. మా నగరంతో దర్శకుడిగా పరిచయం అయిన ఒక బ్యాంకు ఉద్యోగి లోకేష్ కనకరాజ్. ఈ చిత్రం విజయం సాధించడంతో ఖైదీ చిత్రాన్ని కార్తీ హీరోగా చేశారు. అదీ సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత విజయ్ కథానాయకుడిగా, విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా చేసిన మాస్టర్ చిత్రం వసూళ్లు కొల్లగొట్టింది. ఆ తరువాత కమలహాసన్ హీరోగా విక్రమ్ 2 చిత్రాన్ని చేశారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నమోదైంది. ఇటీవల మరోసారి విజయ్ హీరోగా చేసిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా, వసూళ్ల విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇలా స్టెప్ బై స్టెప్ స్టార్ హీరోలతో పని చేస్తున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171 చిత్రాన్ని చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా చిత్రంలో భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇంతకు ముందెప్పుడూ చూడని రజనీకాంత్ను ఈ చిత్రంలో చూస్తారని దర్శకుడు చెబుతున్నారు. చిత్ర టైటిల్ను ఏప్రిల్ 22వ తేదీన, షూటింగ్ను జూన్ నెలలో మొదలెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే లోకేష్ కనకరాజ్ చాలా మంది దర్శకుల తరహాలో జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్లో తన శిష్యులు, సన్నిహితులతో చిత్రాలు నిర్మిస్తానని చెప్పారు. ఆ విధంగా ఉరియడి చిత్రం ఫేమ్ విజయకుమార్ హీరోగా అబ్బాస్ ఏ.రఘుమాన్ దర్శకత్వం వహించిన ఫైట్ క్లబ్ చిత్రాన్ని గత ఏడాది చివరిలో విడుదల చేశారు. తాజాగా రత్నకుమార్ దర్శకత్వంలో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రత్నకుమార్ ఇంతకు ముందు మేయాదమాన్, ఆడై, కులు కలు వంటి చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. కాగా తాజా చిత్రంలో నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఇది హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ తరహా చిత్రాలే లారెన్స్ను హీరోగా నిలబెట్టాయన్నది తెలిసిందే. ఇకపోతే ఇందులో ప్రధాన పాత్రలో నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్ర కథను దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాయడం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నయనతార నటుడు లారెన్స్ సరసన నటించడానికి ఒకే అంటారా? అన్న చర్చ జరుగుతోంది. -
ఈ ముగ్గురు సినిమా స్టార్స్ ధరించిన 'కరుంగలి దండ' గురించి తెలుసా..?
చాలామంది ప్రముఖులు తమ మెడలో స్పటిక,రుద్రాక్ష, కరుంగలి మాల ఇలా వారి నమ్మకం కొద్ది వివిధ దండలు ధరిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలీవుడ్కు చెందిన స్టార్స్ లోకేష్ కనగరాజ్, ధనుష్, శివకార్తికేయన్ వంటి వారు కరుంగలి దండను తమ మెడలో ఎప్పటికి ధరించే ఉంటారు. వారు పలు వేదికల మీదికి వెళ్లినా సరే ఈ దండను మాత్రం తొలగించరు. అంతలా ఈ కరుంగలి దండకు వారు ప్రాముఖ్యత ఇస్తారు. అది ఎందుకు ధరిస్తున్నారో అనే విషయాన్ని డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కారణం ఏమిటంటే..: లోకేష్ కనగరాజ్ 'విక్రమ్ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఒక సందర్భంలో షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాధానికి గురయ్యాను. అప్పుడు నా మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ సతీష్ నాకు ఈ కరుంగలి దండను ఇచ్చాడు. అప్పుడు ఈ మాల గురించి నాకు పెద్దగా ఎలాంటి సమాచారం తెలియదు. కానీ ఈ దండను ధరించమని అతను చెప్పడంతో నేను తీసుకున్నాను. ఇక నుంచి నీకు అన్నీ మంచే జరుగుతాయి.. ఎలాంటి ప్రమాధాలు జరగవు అని చెప్పాడు. నాకు అలాంటి వాటి పట్ల పెద్దగా నమ్మకం లేదు. కానీ ఆయన కోరిక మేరకు ఆ మాలను ధరించాను. కానీ ఆ సమయం నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎంతో పేరుప్రతిష్ఠలు వచ్చాయి. దీంతో ఆ దండను నేను ఎప్పడూ తొలగించలేదు.' అని ఆయన చెప్పారు. కరుంగాలి మాల అంటే.. కరుంగలి అంటే జమ్మి చెట్టు అని అర్థం. ఆ చెట్టు కాండం నుంచి ఈ దండను తయారు చేస్తారు. జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగాలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందని జ్యోతిష్య నిపుణుల నమ్మకం. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాలన ధరిస్తారని చెబుతారు.వ్యాపారస్తులతో పాటు నిరుద్యోగులు, జాబ్ హోల్డర్లు కూడా ఈ దండను ధరిస్తారు. అందుకే ఈ దండలకు భారీ డిమాండ్ పెరిగింది. ఆన్లైన్లో దొరికే మాలలన్నీ డూప్లికేట్ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు పలు సందర్భాల్లో హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గర మాత్రమే తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తారు. తమిళనాడులోని సోలైమలై కొండల దిగువన ఈ ఆలయం ఉంది. మదురై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయంలో సుబ్రమణ్య స్వామి ఉన్నారు. శివకార్తికేయన్, ధనుష్ కూడా కరుంగాలి అభిమానులే కరుంగలి మాలను కోలీవుడ నుంచి శివకార్తికేయన్, ధనుష్ కూడా ధరిస్తారు. ఒక ఇంటర్వ్యూలో ఈ దండ గురించి మాట్లాడుతూ.. 'ఈ కరుంగలి మాల ధరించిన సమయం నుంచి నా జీవితం మారిపోయింది. సినిమాల పరంగా మంచి అవకాశాలు దక్కాయి.' అని చెప్పాడు. పలుమార్లు ఈ ఆలయానికి ధనుష్ కాలినడక ద్వారా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. -
ఆ రోజే టైటిల్
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. కాగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ టీజర్ను ఏప్రిల్ 22న రిలీజ్ చేయన్నుట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూన్లో చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సమాచారం. ఇక ప్రస్తుతం ‘వేట్టయాన్’ సినిమాతో బిజీగా ఉన్నారు రజనీకాంత్. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. -
హీరోగా మారిన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్
-
మా జంట నాన్నకు నచ్చింది: శృతిహాసన్
నటి శృతిహాసన్ను చూస్తే పులి కడుపున పులిబిడ్డే పుడుతుందన్న సామెత నిజం అనిపిస్తుంది. కమలహాసన్కు చిత్ర పరిశ్రమలో సకల కళా వల్లభుడు అనే పేరు ఉంది. ఈ విషయంలో ఆయన వారసురాలు శృతిహాసన్ కూడా సరిగ్గా సెట్ అవుతుంది. ఈమె బాలీవుడ్లో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా నటించి అప్పుడే సంచలన నటిగా ముద్రవేసుకున్నారు. ఆ తరువాత సంగీత రంగంలోకి ప్రవేశించి తన తండ్రి కథానాయకుడిగా నటించిన ఉన్నైపోల్ ఒరువన్ (తెలుగులో ఈనాడు) చిత్రం ద్వారా సంగీత దర్శకురాలిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో కథానాయకిగా నటిస్తూనే సంగీతం పైనా దృష్టి సారిస్తున్నారు. ఈమె పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు. శృతిహాసన్లో గీత రచయిత, మంచి గాయని కూడా ఉన్నారు. కాగా తాజాగా ఇనిమేల్ అనే ప్రైవేట్ ఆల్బమ్ కోసం ఆంగ్లమ్లో ఒక పాటను రాశారు. అనంతరం ఆ పాటను తమిళంలోకి నటుడు కమలహాసన్ అనువదించి తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించగా దానికి నటి శృతిహాసన్ సంగీత బాణీలు కట్టి పాడి నటించారు. ఈ ఆల్బమ్లో ప్రస్తుత క్రేజీ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ శృతిహాసన్తో కలిసి నటించడం విశేషం. ఇది ఒక రొమాంటిక్ ఆల్బమ్ ఆన్నది గమనార్హం. ఇటీవల విడుదల చేసిన ఈ ఆల్బమ్ టీజర్కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతకంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది. కాగా తాజాగా ఇనిమేల్ ఆల్బమ్ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చైన్నెలోని ఒక మాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో నటి శృతిహాసన్, దర్శకుడు లోకశ్కనకరాజ్ పాల్గొన్నారు. నటి శృతిహాసన్ మాట్లాడుతూ 4 నిమిషాల్లో ఒక జంట రిలేషన్షిప్లోని భావాలను ఆవిష్కరించే ఆల్బమ్గా ఇనిమేల్ ఉంటుందన్నారు. రిలేషన్షిప్ అనేది ఎలా ఒక లూప్గా మారుతోంది, అందులోని అప్స్ అండ్ డౌన్స్ను ఈ పాట ద్వారా చెప్పదలచానన్నారు. ఈ ఆల్బమ్ చూసిన ప్రేక్షకులు తమ రిలేషన్ఫిప్లోని లోపాలను సరిదిద్దుకుంటారనే నమ్మకంతో రూపొందించినట్లు చెప్పారు. తాను చిన్నతనం నుంచే సంగీతంతో పయనిస్తున్నానని, అది తన అదృష్టం అని పేర్కొన్నారు. సినీ సంగీతం అనేది ఒక మాన్స్టర్ అని, అందులో ప్రైవేట్ ఆల్బమ్స్ అనేవి 30 శాతం అయినా ఉండాలని భావించానన్నారు. ఇనిమేల్ ఆల్బమ్కు ఇంత ప్రచారం రావడానికి కారణం తన తండ్రి, రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ అని పేర్కొన్నారు. దర్శకుడు లోకేశ్కనకరాజ్ను విక్రమ్ చిత్ర షూటింగ్ సమయంలో కెమెరాలో చూశానన్నారు. ఈయన రూపం బాగానే ఉందనిపించిందన్నారు. అలా ఆయన ఈ ఆల్బమ్లోకి వచ్చారన్నారు. ఎంతో మంది అభిమానులు కలిగిన దర్శకుడు ఇందులో నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ప్రేమను ఒక డెల్యూషన్ అంటారని, అది పరిపూర్ణం కాకపోతే మాయగానే అసహనంగా మారుతుందని, అదే పరిపూర్ణం అయితే ఆ మూవెంట్ డ్రీమ్స్ కమ్ ట్రూ అవుతుందని అన్నారు. అదే డెల్యూషన్ నుంచి సొల్యూషన్ వైపునకు సాగే ప్రేమ పయనం అవుతుందన్నారు. ఈ విషయాన్నే ఇనిమేల్ ఆల్బమ్లో చూపించినట్లు చెప్పారు. ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్తో తాను నటించడం సంతోషకరమన్నారు. తమ జంట తన తండ్రి కమలహాసన్కు నచ్చిందని శృతిహాసన్ పేర్కొన్నారు. -
హీరోయిన్తో స్టార్ డైరెక్టర్ రొమాన్స్.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!
హీరోయిన్ శృతిహాసన్, లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటించిన ఆల్బమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇటీవల ఇనిమెల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా.. ఈ జంట రొమాన్స్తో రెచ్చిపోయి నటించారు. తాజాగా ఫుల్ సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటకు కమల్హాసన్ లిరిక్స్ అందించడమే కాకుండా తానే స్వయంగా నిర్మించారు. అయితే ఈ సాంగ్లో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ నటన ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరిద్దరి రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకయ్యారు. లోకేశ్లో ఈ యాంగిల్ కూడా ఉందా కామెంట్స్ చేశారు. అయితే తాజాగా రిలీజైన సాంగ్ కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. సాంగ్ చూస్తే లవ్, రొమాన్స్, పెళ్లి అనే కాన్సెప్స్తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మీరు కూడా ఈ రొమాంటిక్ సాంగ్ను చూసేయండి. ఇక సినిమాల విషయాకొనిస్తే లోకేశ్ కనగరాజ్ నెక్స్ట్ రజినీకాంత్తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. మరోవైపు శృతిహాసన్ అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటించనున్నారు. -
ఆయన్ను ఎవరైనా లవ్ చేస్తారు: శ్రుతిహాసన్
నటి శ్రుతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్. వీరు ఇద్దరూ ఇద్దరే. ఎవరి క్రేజ్ వారికుంది. హీరోయిన్గా శ్రుతిహాసన్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే నాలుగు చిత్రాలతోనే మోస్ట్ పాపులారిటీని దర్శకుడు లోకేష్ కనకరాజ్ సంపాదించుకున్నాడు. ఇక వీరికి లోకనాయకుడు కమలహాసన్ తోడైతే అది ఎలాంటి ప్రాజెక్ట్ అయినా వచ్చే క్రేజ్ వేరే లెవల్. ఇప్పుడు అదే జరిగింది. కమలహాసన్ రాసిన తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందించిన ఈ పాటకు శ్రుతిహాసన్ బాణీలు కట్టి, పాడడంతో పాటు, అందులో దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కలిసి నటించారు. ఈ ప్రత్యేక వీడియో ఆల్బమ్కు 'ఇనిమేల్' అనే టైటిల్ ఖరారు చేశారు. త్వరలో విడుదల కానున్న మ్యూజికల్ వీడియో ఆల్బమ్కు సంబంధించిన చిన్న ప్రమోషన్ టీజర్ను ఇటీవల విడుదల చేశారు. దీనికి భారీ స్పందన వస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ విషయాన్ని పక్కన పెడితే ఇందులో దర్శకుడు లోకేష్ కనకరాజ్, శ్రుతిహాసన్ కలిసి నటించిన సన్నిహిత సన్నివేశాలు పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ఈ పాట ప్రమోషన్లో భాగంగా శ్రుతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ రాజ్ కమల్ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముచ్చటించారు. శ్రుతిహాసన్ పేర్కొంటూ తాను ఆంగ్లంలో రాసి ఈ వీడియో ఆల్బమ్ను రూపొందించదలచినట్లు చెప్పారు. ఆ తర్వాత తన తండ్రి కమల్హాసన్ తో కలిసి చేద్దామని చెప్పగా ఆయన తన ఆంగ్లం పాటను తమిళంలో రాసినట్లు చెప్పారు. అది ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనకరాజ్తో కలిసి మంచి రొమాంటిక్ వీడియో ఆల్బమ్గా మారిందని చెప్పారు. లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ ఈ వీడియో ఆల్బమ్ కోసం శ్రుతిహాసన్ తనను ఎందుకు ఎంపిక చేశారో తెలియలేదన్నారు. అయితే ఆమె క్రియేటివిటీని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ ఆల్బమ్లో అనూహ్యంగా శ్రుతిహాసన్కు లవర్ బాయ్గా ఎలా నటించ గలిగారు అన్న ప్రశ్నకు లోకేష్ కనకరాజ్ కాస్త సిగ్గుపడుతూ బదులిచ్చారు.మీకు ఎక్స్ లవ్ లాంటిది జరిగిందా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఆయన బదిలించారు. దీంతో శ్రుతిహాసన్ కల్పించుకుని లోకేష్ కనకరాజ్ను లవ్ చేయని వారు ఉంటారా అంటూ, ఈయన్ని అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ప్రేమిస్తారు అంటూ పేర్కొన్నారు. -
రొమాన్స్తో రెచ్చిపోయిన స్టార్ డైరెక్టర్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా!
లియో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. తాజాగా నటుడి అవతారమెత్తాడు. తన తొలి వీడియోలోనే రొమాన్స్తో రెచ్చిపోయారు. హీరోయిన్ శృతి హాసన్తో కనగరాజ్ చేసిన రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వీరిద్దరు ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో తీసుకురానుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో ఈ జంట రొమాన్స్లో మునిగితేలారు. తాజాగా రిలీజైన ఇనిమేల్ ప్రోమో చూస్తే లోకేశ్, శృతి రెచ్చిపోయి నటించినట్లు అర్థమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి వీడియోలోనే లోకేశ్ రెచ్చిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. కేవలం 18 సెకన్లు మాత్రమే ఉన్న ప్రోమో తెగ వైరలవుతోంది. కాగా.. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్తో తెరకెక్కించనున్నారు. #Inimel the game begins from 25th March. Mark the Moment! Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq — Raaj Kamal Films International (@RKFI) March 21, 2024 -
రజనీకాంత్ పేరుతో మోసాలు.. రూ. 4 లక్షలు పోగొట్టుకున్న యువతి
సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ అఫీషియల్గా అనౌన్స్ అయ్యింది. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్తో సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్తో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనిని అదునుగా మార్చుకున్న కొందరు తాజాగా రజనీకాంత్ పేరు చెప్పుకొని భారీ స్కామ్కు పాల్పడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాగైన అవకాశాలను దక్కించుకోవాలని చాలామంది కోరికతో వస్తుంటారు. అలాంటి వారిని టార్గెట్ చేస్తూ తాజాగా బెంగళూరులో కొందరు స్కామ్కు పాల్పడ్డారు. 'తలైవర్ 171' సినిమాలో నటించడానికి ఆసక్తి ఉన్నవారు కావాలంటూ బెంగుళూరులో ఒక ఆడిషన్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి ఆడిషన్స్ ప్రకటనలు నెట్టింట చాలానే కనిపిస్తుంటాయి. కానీ రజనీకాంత్ సినిమా అనేసరికి చాలామంది ఆసక్తి చూపించారు. అలా ఆడిషన్స్కు వెళ్లినవారికి క్యాస్టింగ్ డైరెక్టర్స్ అంటూ కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. 'తలైవర్ 171 - కోడ్ రెడ్'లో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారు. మోసపోయిన వారిలో మృదుల అనే ఒక బాధితురాలు ఈ విషయాన్ని బయటపెట్టింది. రజనీకాంత్ సినిమాలో నటించడం కోసం రూ.3.9 లక్షలను వారికి ఇచ్చినట్లు మృదుల తెలిపింది. రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ అనేసరికి డబ్బు ఇచ్చినట్లు ఆమె పేర్కొంది. ఈ స్కామ్కు లీడర్గా సురేశ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నట్లు తానే క్యాస్టింగ్ డైరెక్టర్గా ఆడిషన్స్కు వచ్చిన వారందరినీ పరిచయం చేసుకున్నాడని ఆమె చెప్పింది. సినిమా అవకాశాల పేరుతో మోసపోయిన మృదుల బెంగుళూరులోని సైబర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. కేసును పోలీసులు విచారిస్తున్నారు . -
కమల్ నిర్మాణంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న లోకేష్.. శృతిహాసన్ సంగీతం!
తమిళసినిమా: ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ రాబోతోంది. కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇక ఆయన వారసురాలు శ్రుతిహాసన్ గురించి చెప్పనక్కర్లేదు. అదేవిధంగా ప్రస్తుతం టాప్ మోస్ట్ డైరెక్టర్గా వెలిగిపోతున్న లోకేశ్ కనకరాజ్ క్రేజ్ ఏమిటన్నది అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు కలిస్తే ఆ ప్రాజెక్ట్ మజానే వేరు కదా?. అవును కమలహసన్ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ను నటింపజేశారు. అయితే ఇది చిత్రంలో కాదు. ఒక స్పెషల్ మ్యూజికల్ ఆల్బమ్లో. ఈ ఆల్బమ్ను కమలహాసన్ రూపొందించడంతో పాటు, అందులోని పాటను రాయడం విశేషం. ఇక మరో విశేషం ఏమిటంటే ఈ పాటను శ్రుతిహాసన్ పాడడంతో పాటు సంగీతాన్ని అందించడం. ఈ ఆల్బమ్కు ఇనిమేల్ అనే టైటిల్ను నిర్ణయించారు. దీనికి ద్వారకేశ్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. భువన్గౌడ చాయాగ్రహణం అందించారు. ఆల్బమ్ను త్వరలో విడుదల చేయనున్నట్లు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా శ్రుతిహాసన్కు మ్యూజిక్ ఆల్బమ్లు రూపొందించడం కొత్తేమి కాదు. ఇంతకు ముందు ఎడ్జ్, షీస్ ఏ హీరో, మాస్టర్ మోషన్ పేర్లతో రూపొందించిన మ్యూజికల్ ఆల్బమ్స్ సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. దీంతో తాజాగా క్రేజీ కాంబినేషన్లో రూపొందిన ఇనిమేల్ వీడియో ఆల్బమ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #Inimel all your Delulus become Trulus#Ulaganayagan #KamalHaasan#InimelIdhuvey@ikamalhaasan #Mahendran @Dir_Lokesh @shrutihaasan @RKFI @turmericmediaTM@IamDwarkesh @bhuvangowda84 @philoedit #SriramIyengar @SowndarNallasa1 @gopiprasannaa @Pallavi_offl @iGeneDIandVFX… pic.twitter.com/awY7qzQpHF — Raaj Kamal Films International (@RKFI) March 14, 2024 -
లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ ఫిక్సా?
-
లియో డైరెక్టర్ సూపర్ హిట్ మూవీ.. సీక్వెల్పై క్రేజీ అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గతంలో నటించిన చిత్రం ఖైదీ. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. హీరోయిన్ అంటూ ఎవరూ లేని ఈ చిత్రం రగ్గడ్ పాత్రలో నటించిన కార్తీలోని మరో నటుడిని ఆవిష్కరించింది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే దీనికి సీక్వెల్ ఉంటుందని.. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కార్తీ చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. రియో చిత్రం తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సూపర్స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నటుడు కార్తీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన జపాన్ చిత్రం నిరాశ పరిచినా.. ప్రస్తుతం నలన్ కుమారసామి దర్శకత్వంలో వావాద్థియారే అనే చిత్రంతోపాటు 96 చిత్రం ఫేమ్ ప్రేమ్కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. దీని తరువాత సర్ధార్– 2 చిత్రం లైన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఖైదీ 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న ప్రశ్నకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కార్తీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఖైదీ-2 చిత్రంలో నటిస్తానని చెప్పారు. ఈ లోగా దర్శకుడు లోకేశ్కనకరాజ్ రజనీకాంత్ హీరోగా నటించే చిత్రాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. కాగా ఖైదీ– 2 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని కార్తీ స్పష్టం చేశారు. -
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన 'మీనాక్షి చౌదరి' హిట్ సినిమా
కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన సింగపూర్ సెలూన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి- ఆర్జే బాలాజీ జోడీగా నటించారు. సత్యరాజ్, లాల్ కీలక పాత్రలు పోషించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న తమిళ్లో ఎలాంటి అంచనాలు లేకుండా ఈ చిత్రం విడుదల అయింది. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ.15 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఎలాంటి ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్లో ఈ చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు. సినిమాకు మంచి టాక్ రావడంతో మొదట తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ హాఠాత్తుగా తమిళ వర్షన్ మాత్రమే ఓటీటీలోకి వచ్చేసింది. త్వరలో తెలుగులో కూడా అందుబాటులోకి రావచ్చని సమాచారం. సింగపూర్ సెలూన్ సినిమాలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో పాటు అరవింద్ స్వామి,జీవా అతిథి పాత్రలో మెరిశారు. ఈ సినిమాలో మంచి హెయిర్ స్టైలిస్ట్గా గుర్తింపు పొందాలని, తన వ్యాపారాన్ని విస్తరించాలనే డ్రీమ్స్ ఉన్న యువకుడి పాత్రలో ఆర్జే బాలాజీ కనిపిస్తే.. ఇంజినీరింగ్ చదివిన అతడు ఎందుకు సెలూన్ వృత్తిని కొనసాగిస్తాడు..? పేద కుటుంబానికి చెందిన అతన్ని గొప్పింటి వర్గానికి చెందిన అమ్మాయి (మీనాక్షి చౌదరి) ఎలా ప్రేమలో పడింది..? ఈ క్రమంలో హీరోకు ఎదురయ్యే కష్టాలు, ఎమోషన్స్, కామెడీ వంటి అంశాలతో డైరెక్టర్ గోకుల్ మెప్పించాడని చెప్పవచ్చు. -
రాజకీయాల్లో విజయ్.. లియో సీక్వెల్పై లోకేశ్ వ్యాఖ్యలు వైరల్
లియో మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గతేడాది దసరాకు విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే లియో హిట్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్తో లోకేశ్ ఒక సినిమా తీస్తున్నారు. అయితే తాజాగా లోకేశ్ కనగరాజ్ లియో పార్ట్ -2 గురించి పలు ఆసక్తి విషయాలు పంచుకున్నాడు. లియో సీక్వెల్ తప్పకుండా ఉంటుందని ఆయన తెలిపారు. కానీ ప్రస్తుతం హీరో విజయ్ ఆశయాలు వేరుగా ఉన్నాయి. ఈ విషయం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించాలి కూడా.. విజయ్ ఒప్పుకుంటే లియో 2 తప్పకుండా వస్తుంది. అందుకు సమయం కూడా అనుకూలిస్తుందని ఆశిస్తున్నాను. విజయ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను. లియో సినిమా విడుదల సమయం నుంచి సెకండాఫ్ పట్ల పలు వమర్శలు వచ్చాయి. అవన్నీ నేను కూడా విన్నాను. రాబోయే సినిమాల్లో ఆ తప్పులు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటాను.' లోకేష్ కనగరాజ్ అన్నారు. విజయ్ ఇప్పటికే ఒప్పుకున్న 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' ప్రాజెక్ట్లో ఉన్నాడు. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఇదే చివరి చిత్రం అంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో లియో సీక్వెల్ ఉంటుందా అనే అనుమానాలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో తలైవర్ 171 సిద్ధం అవుతుంది. -
స్టార్ డైరెక్టర్తో శృతిహాసన్.. అసలు సెట్ అవుతుందా?
కోలీవుడ్ భామ శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ సెట్ అయిందా? ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్ ఇదే. మల్టీ టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్. నటిగా మాత్రమే కాదు.. సింగర్, సంగీత దర్శకురాలు అనే విషయం తెలిసిందే. బహుభాషా కథానాయకిగా రాణిస్తున్న భామ తెలుగులో వరుసగా విజయాలను అందుకుంటున్నారు. తమిళంలో మాత్రం మంచి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. అదేవిధంగా లియో డైరక్టర్ లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే మా నగరం చిత్రంతో దర్శకుడుగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన 171వ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం త్వరలోనే సెట్పైకి వెళ్లనుంది. ఆ తర్వాత ఖైదీ–2, విక్రమ్–2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శృతిహాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఉన్న పోస్టర్ సామాజిక మాద్యమాల్లో వైరలవుతోంది. వీరి కాంబినేషన్లో ఒక చిత్రం రాబోతుందా అన్న చర్చ కోలీవుడ్లో మొదలైంది. అయితే ఆ పోస్టర్లో ఇనిమే మాయెమే తీర్వాగుమ్ ఇదువే ఉరువు, ఇదువే సూల్ నిల్ ఇదువే మాయై ( ఇకపై మాయనే పరిష్కారం ఇదే బంధం ఇదే పరిస్థితి ఇదే మాయ) అని పేర్కొన్నారు. దీంతో ఇది చిత్రంగా రూపొందుతుందా? లేక కమలహాసన్కు చెందిన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై శ్రుతిహాసన్తో దర్శకుడు లోకేష్ మ్యూజికల్ ఆల్బమ్ను రూపొందించబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని గురించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
లియో ఎఫెక్ట్.. లోకేష్ కనగరాజ్పై విజయ్ తండ్రి విమర్శలు
కోలీవుడ్లో సీనియర్ దర్శకుడు, విజయ్ తండ్రి అయిన ఎస్ఏ చంద్రశేఖర్ ఒక డైరెక్టర్ను ఉద్దేశించి పలు వ్యాఖ్యాలు చేశారు. విమర్శలను అంగీకరించే ధైర్యం ఈ కాలంలో దర్శకులకు లేదని ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. తన కుమారుడు హీరో విజయ్కు సంబంధించిన కథ వస్తే ఒక తండ్రిలా కాకుండా అభిమానిగా, ఒక దర్శకుడిగా వింటానని ఆయన చెప్పాడు. ప్రస్తుత రోజుల్లో స్క్రీన్ప్లేకి ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన చెప్పాడు. స్టార్ హీరో దొరికితే చాలు. కథ లేకపోయినా ఫర్వాలేదనుకునే దర్శకులు ఇప్పటిరోజుల్లో ఉన్నారని చెప్పారు. దర్శకుడి ప్రతిభలో లోపాలు ఉన్నా.. హీరో ఇమేజ్తో సినిమా హిట్ అయితే అది తన గొప్పతనమే అనుకుంటున్నారు. కథతో పాటు స్క్రీన్ప్లే ఉంటే ఆ సినిమా మరింత హిట్ సాధిస్తుందని తన అభిప్రాయం అంటూ ఎస్ఏ చంద్రశేఖర్ అన్నారు. ఒక సినిమా విషయంలో ఇటీవల ఓ దర్శకుడికి ఫోన్ చేసి అభినందించానని ఆయన ఇలా చెప్పారు.' సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు ఆ సినిమా చూశాను. వెంటనే ఆ డైరెక్టర్కు కాల్ చేశాను. ఫస్ట్ హాఫ్ బాగుందని చెబుతున్నంత సేపు బాగానే నా మాటలు విన్నాడు. కానీ సెకండాఫ్లో కొంత భాగం బాగాలేదని చెప్పాను. కథలో భాగంగా కన్న కుమారుడినే తండ్రి చంపాలనుకోవడం, మూఢనమ్మకాలు వంటి సన్నివేశాలు అంతగా కనెక్ట్ కావడం లేదని సలహా ఇచ్చాను. దీంతో వెంటనే అతను సార్.. భోజనం చేస్తున్నాను.. కొంత సమయం తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. కనీసం తర్వాత కూడా కాల్ చేయలేదు. సినిమా విడుదలయ్యాక నేను ఏదైతే అభిప్రాయపడ్డానో ప్రేక్షకల నుంచి కూడా అలాంటి రెస్పాన్సే వచ్చింది. నేను చెప్పినప్పుడే కొంత సమయం పాటు ఆలోచించి మార్పులు చేసి ఉంటే ఆ సినిమా ఇంకా మరోస్థాయికి చేరుకునేది. విమర్శలను కూడా తీసుకునేంత పరిణీతి అతనిలో లేవు.' అని ఆయన చెప్పారు. విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించే అని కోలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన చెప్పిన అంశాలన్నీ ఆ చిత్రానికి కనెక్ట్ అవుతుండటంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. లియోలో విజయ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అతని ఇమేజ్తోనే సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. సుమారు రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది, కానీ కథలో కొన్ని లోపాలు ఉన్నాయని మొదటిరోజు నుంచే ప్రచారం జరిగింది. దీంతో కొంతమేరకు కలెక్షన్స్ తగ్గాయని చెప్పవచ్చు. -
ఓటీటీలోకి వచ్చేసిన 'లోకేష్ కనగరాజ్' యాక్షన్ థ్రిల్లర్ సినిమా
ఇప్పుడు అంతా ఓటీటీ ట్రెండ్ కొనసాగుతుండటంతో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతున్నాయి. ఇప్పటికే తమిళ చిత్రం అయిన 'జో' హాట్స్టార్లో మంచి టాక్తో స్ట్రీమింగ్ అవుతుంది.తాజాగా నేటి నుంచి (జనవరి 27) మరో ఆసక్తికరమైన చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్గా విక్రమ్, లియో చిత్రాలతో తెలుగు వారికి దగ్గరయ్యాడు. జీ స్క్వాడ్ ప్రొడక్షన్ పేరుతో ఆయన నిర్మాతగా మారాడు. 'ఫైట్ క్లబ్' పేరుతో తమిళ్లో ఒక చిత్రాన్ని ఆయన నిర్మించారు. అబ్బాస్ ఎ. రెహ్మత్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీలో విజయ్ కుమార్ నటించాడు. ఉరియాది మూవీతో డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న విజయ్.. ఈ 'ఫైట్ క్లబ్'లో మెయిన్ రోల్లో కనిపించాడు. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. రూ.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో పాటురూ. 9 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ను అందుకుంది. ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది. ఏదేమైనా నేటి నుంచి హాట్స్టార్లో 'ఫైట్ క్లబ్' స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అందుబాటులో ఉంది. ఇదొక రివేంజ్ డ్రామా కథ రివేంజ్ డ్రామాగా ఫైట్ క్లబ్ చిత్రం ఉంటుంది. కాలేజీలో ఉన్న హీరోపై ఎటాక్ చేసేందుకు విలన్ గ్యాంగ్ ప్రయత్నించే సీన్తో సినిమా మొదలవుతుంది. కథల భాగంగా సినిమా చూస్తున్నంత సేపు ఫస్ట్ హాఫ్లో చాలా ప్రశ్నలు మనకు కలుగుతాయి. వాటంన్నిటికీ సెకండాఫ్లో డైరెక్టర్ రివీల్ చేస్తాడు. ఈ క్రమంలో ఆడియన్స్ను బాగా ఎంగేజ్ చేస్తాడు డైరెక్టర్. ఇందులోని సీన్స్ ఎక్కువగా రివేంజ్లాగే ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్కు ఎవరైనా ఫిదా అవుతారు. కథ పాతదే అయిన టేకింగ్ విధానం బాగుంటుందని టాక్ ఉంది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని తప్పక ఇష్టపడుతారని కామెంట్లు వస్తున్నాయి. -
లియో డైరెక్టర్కు షాక్.. సినిమాను నిషేధించాలంటూ!
లియో మూవీతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. లియో తర్వాత లోకేశ్ తదుపరి చిత్రాన్ని సూపర్స్టార్ తలైవాతో చేయనున్నారు. ప్రస్తుతం ఆ మూవీ స్క్రిప్ట్ తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!) ఇదిలా ఉండగా.. తాజాగా లోకేశ్ కనగరాజ్పై ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. ఆయనకు మానసిక పరీక్షలు చేయాలని కోరుతూ మధురై హైకోర్టు బెంచ్లో మదురైకి చెందిన రాజు మురుగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్రంలో హింసాత్మక కంటెంట్ ఉన్నందున లియోని నిషేధించాలని.. అంతే కాకుండా కనగరాజ్కు మానసికంగా పరీక్షలు నిర్వహించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. లియో చిత్రంలో హింసను ప్రేరేపించేలా సన్నివేశాలు ఉన్నాయని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఆయుధాల వినియోగం, మతపరమైన చిహ్నాలు, మాదకద్రవ్యాల వినియోగం, మహిళలు, పిల్లలపై హింస లాంటి సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ ప్రస్తావించారు. లియో చిత్రంపై పూర్తిగా నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ కేసును కనగరాజ్ న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో వాయిదా వేశారు. (ఇది చదవండి: ఆ నటుడు పిచ్చోడిలా ప్రవర్తించాడు.. అందరూ పారిపోయారు!) -
రజనీకాంత్ సినిమాకు నో చెప్పిన షారుక్ ఖాన్
-
రజనీ సినిమాలో రణ్వీర్?
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది వేసవిలోప్రారంభం కానుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ స్టార్స్ షారుక్ఖాన్, రణ్వీర్ సింగ్లను సంప్రదించారట. అయితే ఇటీవల కాలంలో ఇతర చిత్రాల్లో ఎక్కువగా గెస్ట్ రోల్స్ చేసిన కారణంతో రజనీ సినిమాకు షారుక్ సున్నితంగా నో చెప్పారని, దీంతో రణ్వీర్సింగ్ను లోకేష్ కలిసి కథ వినిపించారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మరి... రజనీకాంత్ సినిమాలో రణ్వీర్సింగ్ నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు రజనీకాంత్ ప్రస్తుతం ‘వేట్టయాన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే రజనీకాంత్ ఓ లీడ్ రోల్ చేసిన ‘లాల్ సలామ్’ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. -
లియో డైరెక్టర్ సంచలన నిర్ణయం.. ఎందుకంటే?
లియో మూవీతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దళపతి విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అయితే లియో హిట్ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్తో జత కట్టనున్నారు. అయితే తాజాగా లోకేశ్ కనగరాజ్ చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇటీవల తన జీ స్క్వాడ్ బ్యానర్లో తెరకెక్కించిన మొదటి చిత్రం ఫైట్ క్లబ్ను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన నెక్ట్స్ ప్రాజెక్ట్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నట్లు ప్రకటించారు. తన రాబోయే ప్రాజెక్ట్ కోసం లోకేశ్ కనగరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తదుపరి సినిమా కోసం సోషల్ మీడియాతో పాటు మొబైల్కు కూడా విరామం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తన ట్విటర్లో ఓ నోట్ రాసుకొచ్చారు. ప్రాజెక్ట్పై పూర్తిస్థాయిలో పని చేసేందుకు ఈ నిర్ణయమని పేర్కొన్నారు. దయచేసి ఈ సమయంలో ఎవరికీ అందుబాటులో ఉండనని చెప్పుకొచ్చారు. నా కెరీర్ ప్రారంభం నుంచి అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం లోకేశ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 🤗❤️ pic.twitter.com/0EL6PAlbdQ — Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 16, 2023 -
తలైవా బర్త్డే నేడు! ఫ్యాన్స్కు సర్ప్రైజ్?
తమిళ సినిమా: రజనీకాంత్ ఈ పేరే ఒక ప్రభంజనం. అశేష ప్రేక్షకుల గుండెల్లో కొలువైన పేరు. శివాజీ రావు గైక్వాడ్ అనే ఒక సాధారణ బస్ కండక్టర్ను దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ 1975లో రజనీకాంత్గా మార్చి నటుడిగా పునర్ఃజన్మను ఇచ్చారు. అలా అపూర్వ రాగంగల్ చిత్రంతో ప్రతి నాయకుడిగా మెరిసిన రజనీకాంత్ ఆ తర్వాత కథానాయకుడిగా అవతారం ఎత్తి తనకు తానుగా ఎదుగుతూ ఇప్పుడు ఎవర్ గ్రీన్ సూపర్స్టార్గా వెలిగిపోతున్నారు. మధ్యలో రాజకీయాల వైపు మొగ్గు చూపినా, ఆ తర్వాత అది తన స్వభావానికి సరిపడదని భావించి అభిమానులను అలరించడమే తన సరైన రూటు అని నటనపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టారు. రజనీకాంత్ ఇటీవల నటించిన చిత్రాలు ఫ్లాప్ కావడంతో ఆయన పని అయిపోయిందని.. ఇక నటన నుంచి స్వచ్ఛందంగా వైదొలగడం మంచిదనే మాటలు వినిపించాయి. అలాంటి వాటికి రజనీకాంత్ జైలర్ చిత్రంతో గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్ర షూటింగ్ను పూర్తిచేసిన రజినీకాంత్ తన 170వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ కథ దర్శకత్వం బాధితులను నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సక్సెస్ఫుల్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. నేడు (డిసెంబర్ 12) రజనీకాంత్ 73వ పుట్టినరోజు. ఈ స్టైల్ కింగ్ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండుగ రోజు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారందరూ రజనీకాంత్ పుట్టిన రోజు పండుగను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వనున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన కొత్త విషయాలను ప్రకటిస్తారా? లేక తన 171వ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. View this post on Instagram A post shared by Sun Pictures (@sunpictures) -
చాలా కష్టాలను అనుభవించాను: లోకేష్ కనకరాజ్
తమిళసినిమా: దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ పేరు ఇప్పుడు భారీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారింది. మానగరంతో ప్రారంభమైన ఈయన దర్శక పయనం మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాల వరకు విజయ పథంలో సాగుతూ వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. 2024 ఏప్రిల్లో ఈ చిత్రాన్ని సెట్స్పైకి తీసుకెళ్లనున్నట్లు ఇటీవల ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తాజాగా నిర్మాతగా అవతారం ఎత్తారు. జీ.స్క్వాడ్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. కాగా ఉయిరడీ చిత్ర పేమ్ విజయకుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఫైట్ క్లబ్. రీల్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య నిర్మిస్తున్న ఇందులో నటి మోనీషా మోహన్ మీనన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం చైన్నెలోని ఒక హోటల్లో నిర్వహించారు. లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. దర్శకుడిగా తనను ఆదరించినట్లే తన నిర్మాణ సంస్థను ఆదరించాలని కోరారు. తాను డబ్బు సంపాదించడానికి చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించలేదన్నారు. దర్శకుడిగా తానిప్పుడు బాగానే సంపాదిస్తున్నానన్నారు. అయితే ఆరంభ కాలంలో తాను చాలా కష్టాలను అనుభవించానని తెలిపారు. తాను రూపొందించిన షార్ట్ ఫిల్మింస్కు తన మిత్రులు ఎంతో సహాయం చేశారన్నారు. వారి సాయంతోనే మానగరం చిత్రాన్ని రూపొందించానని చెప్పారు. అలాంటి మిత్రులు, ప్రతిభావంతులను ప్రోత్సహించడం కోస మే జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా వచ్చిన డబ్బును మళ్లీ చిత్ర పరిశ్రమలోనే పెడతానని లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. అలా తొలి సారిగా ఫైట్ క్లబ్ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. -
'లియో' లోకేశ్ కనగరాజ్ కొత్త మూవీ టీజర్.. టైటిల్ తగ్గట్లు మొత్తం అవే!
లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే తీసింది ఐదు సినిమాలే గానీ కల్ట్ స్టేటస్ సంపాదించాడు. రీసెంట్గా 'లియో' సినిమాతో ఆకట్టుకున్నాడు. మొన్ననే ఈ చిత్రం రిలీజైంది. ఇప్పుడు మరో కొత్త మూవీతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు. తాజాగా టీజర్ రిలీజ్ అది.. అంచనాల్ని పెంచేస్తోంది. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. జీ-స్క్వాడ్ పేరుతో నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఇందులో భాగంగా తన ఫ్రెండ్స్, సహాయకులని ఎంకరేజ్ చేసేందుకు ఈ సంస్థ స్థాపించినట్లు చెప్పుకొచ్చాడు. అలానే 'ఫైట్ క్లబ్' పేరుతో విజయ్ కుమార్ హీరోగా ఓ తమిళ సినిమా తీశారు. (ఇదీ చదవండి: నయనతార 'అన్నపూరణి' సినిమా.. టాక్-రివ్యూ ఏంటంటే?) డిసెంబరు 15న థియేటర్లలో రిలీజ్ అవుతున్న ఈ చిత్ర టీజర్ని తాజాగా విడుదల చేశారు. 'ఫైట్ క్లబ్' అనే టైటిల్కి తగ్గట్లే టీజర్ అంతా యాక్షన్ సీన్స్ గట్టిగానే ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా హీరో విజయ్ కుమార్ పెద్దగా తెలియదు. ఉరయాడి, ఉరయాడి 2 సినిమాలతో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. సూర్య 'సూరరై పోట్రు' మూవీకి డైలాగ్స్ రాశాడు. ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ నిర్మించిన 'ఫైట్ క్లబ్' సినిమాతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. టీజర్ చూస్తుంటే యాక్షన్ డ్రామా అనిపిస్తుంది. ఇందులో లోకేశ్ కనగరాజ్ మార్క్ అక్కడక్కడా కనిపిస్తుంది. మరి దర్శకుడిగా వరస హిట్స్ కొడుతున్న లోకేశ్.. నిర్మాతగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి? (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) -
లోకేష్ కనగరాజ్ మరో భారీ మల్టీస్టారర్ మూవీ
-
ట్రెండ్ మార్చిన రజనీకాంత్
సూపర్స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ట్రెండ్ మార్చారు అనిపిస్తుంది. 50 ఏళ్ల సినీ పయనం, 170 చిత్రాల అనుభవం. ఈయన తాజాగా నటించిన జైలర్ చిత్రం కూడా అనూహ్య విజయాన్ని సాధించింది. రజనీకాంత్ హీరోగా నటించిన ఇందులో కన్నడ స్టార్ హీరో శివరాజ్కుమార్, మలయాళం సూపర్స్టార్ మోహన్లాల్, బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ అతిథులుగా మెరిశారు. ఒక సూపర్స్టార్ చిత్రంలో ఇందరు స్టార్లు నటించడం నిజంగా విశేషమే. ఇలా ఈ చిత్రం నుంచే రజనీకాంత్ ట్రెండ్ మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. జైలర్ చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈయన కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో షూటింగును ప్రారంభించనున్నట్లు దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇటీవల ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. కాగా ఇందులో కూడా రజనీకాంత్తో పాటు యువ నటులు ముఖ్యపాత్రలు పోషించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాఘవ లారెన్స్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఇందులో శివకార్తికేయన్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదన్నది గమనార్హం. ఇందులో మలయాళ భామ మంజువారియర్ రజనీకాంత్తో జతకట్టడానికి రెడీ అవుతున్నట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఈ క్రేజీ భారీ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఆ రంగంలోకి లియో డైరెక్టర్.. అభిమానుల్లో ఆసక్తి!
ఇటీవలే లియో మూవీ సూపర్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. కోలీవుడ్లో ఇప్పుడు ఆయన పేరే సక్సెస్కు కేరాఫ్గా మారింది. మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లోకేశ్ కనగరాజ్.. తొలి చిత్రమే పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత కార్తీ కథానాయకుడిగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించారు. అదీ కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత విజయ్తో మాస్టర్, కమలహాసన్తో విక్రమ్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇలా ఇప్పటికి అదే చిత్రాలు చేసిన లోకేష్ కనకరాజ్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు. అవును ఈ విషయాన్ని ఆయనే తెలుపుతూ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తాను జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ బ్యానర్లో తన శిష్యులకు, మిత్రులకు అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దర్శకుడిగా తనకు అందించిన ఆదరాభిమానాలను తన చిత్రాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా తన సంస్థలో నిర్మించనున్న చిత్రం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. దీంతో లోకేశ్ కనగరాజ్ చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Need all your love and support 🤗❤️@GSquadOffl pic.twitter.com/9NWou59tuE — Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 27, 2023 -
చిన్న సినిమా.. కానీ నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్!
కాళిదాస్ జయరాం హీరోగా నటించిన మూవీ 'అవళ్ పేర్ రజినీ'. తమిళ, మలయాళ భాషల్లో తీసిన ఈ చిత్రాన్ని నవరస ఫిలిమ్స్ పతాకంపై శ్రీజిత్ కేఎస్, జెస్సీ శ్రీజిత్ నిర్మించారు. వినీల్ స్కరియా వర్గీస్ దర్శకత్వం వహించగా.. నమిత ప్రమోద్, రెబా మోనికా జాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నలుగురు సంగీత దర్శకులు పని చేసిన ఈ మూవీకి పనిచేయడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా చెన్నైలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా 'లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ వచ్చారు. ట్రైలర్ బాగుందని, చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ చెప్పకొచ్చాడు. హీరో కాళిదాస్ జయరామ్ మాట్లాడుతూ.. ఇదే వేదికపైకి కమలహాసన్ తనని చేయిపట్టుకుని తీసుకొచ్చి పరిచయం చేశారని అన్నాడు. 'విక్రమ్'లో అవకాశమిచ్చినందుకు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్కి ధన్యవాదాలు చెప్పాడు. కొత్త మూవీలో తాను ఇప్పటి వరకు చేయని పాత్రను ఇందులో పోషించినట్లు కాళిదాస్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!) -
విజయ్ 'లియో' ఓటీటీ విడుదల తేదీని ప్రకటించిన నెట్ఫ్లిక్స్
విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో లియో సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ సినిమా విడుదలైంది. టాలీవుడ్లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కోలీవుడ్లో మాత్రం హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 600 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. విజయ్ కెరియర్లో మరో హిట్ సినిమాగా నిలిచింది. విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలిచింది. అలాగే కోలీవుడ్లో తొలిరోజు తెల్లవారుజామున ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతులివ్వలేదు. వీటన్నింటి మధ్య కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించడంతో లియో మేకర్స్ గ్రాండ్గా అభిమానుల మధ్య విజయోత్సవ వేడుకను కూడా జరుపుకున్నారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదల విషయంలో అధికారిక ప్రకటన వచ్చేసింది. నవంబర్ 24 నుంచి నెట్ఫ్లిక్స్లో లియో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం,హిందీ భాషలలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లియో చిత్రాన్ని చూడని ప్రేక్షకులు ఈ నెల 24 నుంచి నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. కథేంటి? పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ పార్తిబన్ ఎవరు? లియో ఎవరు? అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది సినిమా కథ -
ఇలాంటి నీచమైన వ్యక్తితో ఇకపై నటించను: త్రిష
లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అలా మాట్లాడటంపై కోలీవుడ్ సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండి చేస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. త్రిష ట్వీట్లో రాస్తూ.. 'మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా, అసహ్యకరంగా అనిపిస్తోంది. అతని లాంటి నీచమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్ను ఇకపై ఎప్పుడూ పంచుకోను. నా మిగిలిన సినిమా కెరీర్లో కూడా ఇలా జరగకుండా చూసుకుంటాను. అతని లాంటి వారి వల్ల మానవాళికే చెడ్డపేరు వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సైతం మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలను ఖండించారు. లోకేశ్ తన ట్వీట్లో ప్రస్తావిస్తూ.. "మేమంతా ఒకే టీమ్లో పనిచేశాం. మన్సూర్ అలీ ఖాన్ చేసిన స్త్రీల పట్ల ద్వేషపూరిత వ్యాఖ్యలు చూస్తే చాలా కోపంగా ఉంది. ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా. మహిళలు, తోటి నటీనటులను మనం గౌరవించాలి. ఏ పరిశ్రమలోనైనా ఇలాగే ఉండాలి. ' అని పోస్ట్ చేశారు. కాగా.. లియో చిత్రంలో ఖాన్ మరణశిక్ష విధించబడిన దోషి పాత్రలో కనిపించారు. తమన్నా సాంగ్పై మన్సూర్ కామెంట్స్ అయితే గతంలో జైలర్ సినిమాలోని కావాలయ్యా.. అనే పాటపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట మ్యూజిక్, స్టెప్పులు ఏవీ బాగోలేదని మాట్లాడాడు. 'కావాలయ్యా పాటలో తమన్నా వేసే స్టెప్పు చాలా దరిద్రంగా ఉంటుంది. కావాలా.. అంటూ తన చేతిని ఓరకంగా ఆడించడం అస్సలు బాగోలేదు. చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ఇటువంటి పాటకు, స్టెప్పులకు సెన్సార్ వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని మన్సూర్ అలీ ఖాన్ విమర్శలు చేశారు. A recent video has come to my notice where Mr.Mansoor Ali Khan has spoken about me in a vile and disgusting manner.I strongly condemn this and find it sexist,disrespectful,misogynistic,repulsive and in bad taste.He can keep wishing but I am grateful never to have shared screen… — Trish (@trishtrashers) November 18, 2023 Disheartened and enraged to hear the misogynistic comments made by Mr.Mansoor Ali Khan, given that we all worked in the same team. Respect for women, fellow artists and professionals should be a non-negotiable in any industry and I absolutely condemn this behaviour. https://t.co/PBlMzsoDZ3 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 18, 2023 The thing about men like Mansoor Ali Khan - they have always been talking like this. Never been condemned, with other men in power, money and influence laughing along; eeyy aamaa da macha correct ra maccha sorta thing. Robo Shankar said something on how he wants allowed to touch… pic.twitter.com/ZkRb2qxmMl — Chinmayi Sripaada (@Chinmayi) November 18, 2023 -
రజనీ కొత్త మూవీలో లారెన్స్ విలన్ గా..!
-
Leo Success Meet: విజయ్ ‘లియో’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
నేడు లియో వేడుకలు.. పట్టుబట్టి సాధించుకున్న విజయ్ ఫ్యాన్స్
దళపతి విజయ్ నటించిన 'లియో' చిత్రం థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 12 రోజుల్లో రూ.540 కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు నిర్మాత ప్రకటించారు. ఇది అబద్ధం అని చాలా మంది అంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా చిత్ర బృందం లియో విజయంపై సంబరాలు జరుపుకుంటోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్గా లియో నిలిచింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకే ఇప్పుడు విజయ్ అభిమానులతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ వేడకకు కూడా తమిళనాడు ప్రభుత్వం మొదటగా అనుమతి ఇవ్వలేదు. కానీ అభిమానుల ఒత్తడి వల్ల లియో విజయోత్సవ వేడుకలకు అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. దీనిపై లియో టీమ్ ఓ వీడియోతో అధికారిక ప్రకటన చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన లియో చిత్రం మంచి విజయం సాధించింది. అక్టోబర్ 19న ఈ సినిమా వెండితెరపైకి వచ్చింది. ఈ సినిమా ఘనవిజయం సాధించినందుకు గానూ లియో టీమ్ సక్సెస్ మీట్ను నిర్వహిస్తోంది. నవంబర్ 1వ తేదీ బుధవారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ రోజు సాయింత్రం చెన్నైలో జరగనున్న ఈ షోకు సంబంధించిన చిన్న ప్రోమో వీడియోను కూడా చిత్ర నిర్మాతలు షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం అంతా పాల్గొంటారని సమాచారం. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం క్యాన్సిల్ కావడంతో సక్సెస్ మీట్ ఘనంగా జరగనుంది. #Thalapathy oda kutty story illama epdi nanbaa 🎙️🎤#Leo🙊sry parthiban's moththa family & crew is coming for you all ❤️#TheRoarOfLeo - Bloody sweet Victory 🦁 Tomorrow 🔥 P.S. Intha vaati miss aagaathu👍#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers… pic.twitter.com/KESdWKvHOv — Seven Screen Studio (@7screenstudio) October 31, 2023 -
లియో కొత్తగా మళ్లీ వస్తున్నాడు.. వారికి మాత్రమే ఎంట్రీ.. ఎందుకంటే?
కోలీవుడ్ హీరో ‘లియో’ సినిమా అక్టోబర్ 19న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల మధ్యకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా రూ. 500 కోట్ల మార్క్ను దాటినట్లు తెలుస్తోంది. LCU లో భాగంగా ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాలు బ్లాక్బస్టర్ కొట్టాయి. లియో కూడా తమిళ్ వర్సెన్ బాగానే సక్సెస్ అయింది. కానీ తెలుగు ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేదని చెప్పవచ్చు. లియో సినిమాకు సెన్సార్ వారు సుమరు 15కు పైగా కట్స్ ఇచ్చారు. ఆ సమయంలో ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ వారు కట్ చేసిన సీన్లు ఉండుంటే ఇంకా బాగుండేది అని విజయ్ ఫ్యాన్స్ ఇప్పటికే పలుమార్లు లియో మేకర్స్ను కోరారు. దీంతో లోకేష్ టీమ్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. అభిమానుల కోరుకున్నట్లుగా నవంబర్ 3 నుంచి జీరో కట్స్తో లియో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. కానీ ఈ సినిమా కేవలం 18 ఏళ్లు పూర్తిగా నిండిన వారి కోసం మాత్రమేని షరతు పెట్టారు. కాబట్టి నవంబర్ 3 నుంచి చిన్నపిల్లలతో ఈ సినిమాకు వెళ్తే అనుమతి ఉండదని వారు తెలిపారు. దీనికి ప్రధాన కారణం ఎక్కువగా రక్తపాతం ఉన్న సీన్లు మళ్లీ ఈ సినిమాలో చేర్చుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జంతు నరబలులు లాంటి సీన్లు ఉన్నాయట... వాటిని మొదట సెన్సార్ వారు అంగీకరించలేదు. ప్రస్తుతం వాటిని ప్రసారం చేయాలంటే A సర్టిఫికెట్ తప్పనిసరి అయింది. ఇప్పుడు ఎలాంటి కట్స్ లేకుండా నవంబర్ 3 నుంచి ఆడియన్స్ ముందుకు రానుంది లియో. కాబట్టి మళ్లీ చూడాలంటే పిల్లలతో కాకుండా 18 ఏళ్లు నిండిన వారు థియేటర్కు వెళ్లవచ్చు. By popular demand, #LEO uncut (strictly for ages 18+) is coming to @cineworld cinemas from Friday. The first Tamil film in UK to release with an 18 classification.. 💣🔪🔥🧨🩸 Round two, are you ready? Ticket sales open TOMORROW! 🤜 pic.twitter.com/DfF0FpgkbO — Ahimsa Entertainment (@ahimsafilms) October 31, 2023 -
లియో ఎఫెక్ట్.. రజనీకాంత్ సినిమాపై షాకింగ్ నిర్ణయం తీసుకున్న లోకేష్ కనగరాజ్
నటుడు విజయ్తో దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో చిత్రం అక్టోబర్ 19న విడుదలై మిక్సిడ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా పలు రికార్డులు క్రియేట్ చేసింది. దీని తర్వాత రజనీకాంత్తో లోకేష్ ఒక సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. తలైవా 171 చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడానికి కమిట్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో లోకేష్ నిమగ్నమయ్యారు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని కొన్ని వారాల క్రితం ప్రకటించారు. లియో విడుదల తర్వాత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ పలు విషయాలను పంచుకున్నాడు. ఆరు నెలలపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని లోకేష్ నిర్ణయించుకున్నాడు. రజనీకాంత్తో తీయనున్న సినిమాకు పూర్తి సమయం కేటాయించాలని ఆయన ప్రకటించాడు. లియో గురించి సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు తెలిపిన ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఏప్రిల్లో తలైవా 171 ప్రారంభం కానుంది. ఆ సమయంలోనే మళ్లీ సోషల్ మీడియాకు కనెక్ట్ అవుతాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: వరణ్ తేజ్ పెళ్లికి సమంత, నాగచైత్యన్యతో పాటు మరో క్రేజీ హీరోయిన్) అలాగే ‘లియో’ సినిమాకు కొందరు కావాలనే నెగెటివ్గా రివ్యూలు ఇచ్చారని ఆయన తెలిపాడు. లియో విడుదలైన రోజే కావాలని కొందరు యూట్యూబ్ ఛానల్స్ వారు నెగెటివ్ రివ్యూలు ఇచ్చినా.. కొందరు వాటిని కొట్టిపడేశారని చెప్పాడు. జర్నలిస్ట్లకు ఎప్పటికీ కృతజ్ఞలు చెప్పాలని ఆయన తెలిపాడు. నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రేక్షకులతో పాటు జర్నలిస్ట్లు కూడా ప్రధాన కారణమన్నారు. కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటా.. ఇకపై నా దృష్టి అంతా 'తలైవా171' మీదే ఉంటుందన్నారు. ఈ సినిమాకు రజనీకాంత్ నెగెటివ్ షేడ్ హైలైట్ కానుంది.' అని లోకేష్ చెప్పాడు. రజనీ విలనిజం రజనీకాంత్ విలనిజం అంటే తనకు ఇష్టమని, తలైవా 171లో ఆయన విలనిజంతో భయపెడుతానని లోకేష్ కనగరాజ్ అన్నారు. ప్రస్తుతం సూపర్స్టార్గా కొనసాగుతున్న రజనీకాంత్ ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విలన్. తనకు విలన్గా నటించాలని ఉందని ఓ అవార్డు వేడుకలో ఆయనే పేర్కొన్నాడు. ఆ ఛాన్స్ ఈ సినిమాకు దక్కిందని లోకేష్ అన్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ సినిమా టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. దీని తర్వాత తలైవా 171 ప్రారంభం అవుతుంది. కథ ఇప్పటికే రెడీ చేసిన లోకేష్.. ఆరు నెలలు టైమ్ తీసుకుని మరింత స్ట్రాంగ్గా కథను తెరకెక్కించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. లోకేష్ కనగరాజ్పై లియో ఎఫెక్ట్ లోకేష్ కెరీర్లో ఎక్కువ నెగటివ్ తెచ్చుకున్న సినిమా లియో. ఈ సినిమా విషయంలో జరిగిన అతి పెద్ద తప్పు ముందుగానే విడుదల తేదీ ప్రకటించడం. అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని స్క్రిప్టు, షూటింగ్ విషయంలో హడావుడి జరిగింది. దీంతో 'విక్రమ్' రిలీజైన కొన్ని రోజులకే లియోను ప్రారంభించాడు. షూటింగ్ కూడా హడావుడిగా చేశారని టాక్ ఉంది. రిలీజ్ డేట్ డెడ్ లైన్ ఉండటంతో ఆ ప్రెజర్ లియో రిజల్ట్ మీద పడింది. అందుకే ఈసారి లోకేష్ హడావుడి లేకుండా తలైవా విడుదల తేదీని ప్రకటించకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ సరైన ప్లాన్తో తలైవా 171 చిత్రాన్ని తెరకెక్కించాలని ఉన్నట్లు తెలుస్తోంది. -
లియోకు నో సెలబ్రేషన్స్.. ఆ వేడుక జరుగుతుందా?
విడుదలకు ముందు నుంచే వివాదాల్లో చిక్కుకున్న చిత్రం లియో. కారణం విజయ్ హీరోగా నటించడమే? అనే చర్చ జరిగింది. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్మాతలు భావించారు. అయితే కారణాలేమైనా చివరి క్షణంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. విజయ్ కథానాయకుడిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన భారీ చిత్రం లియో. త్రిష, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మీనన్, మిష్కిన్ తదతర భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాగా ఈ చిత్రం వారంలోనే రూ.461 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాత అధికారికంగా వెల్లడించారు. దీంతో లియో చిత్ర విజయోత్సవాన్ని నవంబర్ ఒకటో తేదీన చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీఎత్తున నిర్వహించ తలపెట్టారు. ఇందుకోసం పోలీస్ బందోబస్తు కోరుతూ నిర్మాత ఆ శాఖాధికారులకు లేఖ రాశారు.ఆ లేఖపై పోలీస్ అధికారులు పలు ప్రశ్నలు స్పందిస్తూ నిర్మాతకు తిరిగి లేఖ పంపారు. ముఖ్యంగా లియో చిత్రం విజయోత్సవానికి వచ్చే సినీ ప్రముఖులు ఎందరు?, అభిమానులు ఎందరు? కార్యక్రమాన్ని ఎన్ని గంటల ప్రారంభించి, ఎన్ని గంటలకు ముగిస్తారు? నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఎన్ని కుర్చీలు ఉంటాయి? స్టేడియం నిర్వాహకులు అనుమతి పొందారా? దానికి సంబంధించిన పూర్తి వివరాలను చర్చించిన తరువాతే పోలీస్ బందోబస్తుపై నిర్ణయం తీసుకుంటామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో లియో చిత్రం విజయోత్సవ వేడుక జరుగుతుందా? అని విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
60 ఏళ్ల వయసులో హీరోలకు మించిన ఫాలోయింగ్.. ఎవరీ 'నెపోలియన్'?
లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్.. ఈ పేరు చెప్పగానే మూవీ లవర్స్ అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే అక్కడున్నది డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాబట్టి. తమిళ స్టార్ హీరోలందరినీ ఒక్కచోటకు చేర్చే పనిలో ఉన్నాడు. ఇందుకోసం ఏకంగా యూనివర్స్నే సృష్టించాడు. ఈ సినిమాల్లో హీరోలతో పాటే నెపోలియన్ అనే ఓ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. ఆ పాత్ర చేసిన నటుడు.. ఓవర్నైట్ స్టార్ అయిపోయాడు. ఇంతకీ అతడెవరో తెలుసా? నెపోలియన్ ఎవరు? లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో నెపోలియన్గా ఓ రేంజులో క్రేజ్ తెచ్చుకున్న ఈ నటుడి అసలు పేరు జార్జ్ మరియన్. చెన్నైలో పుట్టి పెరిగిన ఇతడు.. 1989లో థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. అలా 13 ఏళ్ల పాటు ఇందులోనే కొనసాగాడు. 2002లో 'అళగి' మూవీతో తమిళ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కామెడీ తరహా పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. 70 వరకు చిత్రాల్లో రకరకాల పాత్రలు చేశాడు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్బాబు.. త్వరలో శుభకార్యం!) 60 ఏళ్లలో స్టార్డమ్ 'ఖైదీ' సినిమాలో నెపోలియన్ అనే కానిస్టేబుల్గా నటించిన జార్జ్ మరియన్.. ఈ మధ్యే రిలీజైన 'లియో' సినిమాలోనూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో విజయ్ ఎంట్రీ ఇచ్చిన ఫ్యాన్స్ ఎలా గోలచేశారో.. నెపోలియన్ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పుడు సేమ్ అదే రేంజులో సౌండ్ చేశారు. ఇక మూవీ చివర్లో హీరో ఫ్యామిలీని కాపాడే టైంలో ఇతడి పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ అయితే వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇలా 60 ఏళ్ల వయసులో స్టార్డమ్ సంపాదించాడు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ నెపోలియన్గా వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకున్న జార్జ్ మరియన్.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తర్వాత తీయబోయే ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 చిత్రాల్లోనూ కనిపించడం గ్యారంటీ. ఇలా అస్సలు ఊహించని విధంగా లేటు వయసులో యంగ్ హీరోలకు మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!) -
విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'లియో'. లోకేశ్ కనగరాజ్ దీనికి డైరెక్టర్ కావడం వల్ల విడుదలకు ముందే ఎక్కడలేని హైప్ వచ్చింది. తీరా గతవారం థియేటర్లలో రిలీజైతే.. ప్రేక్షకులు అనుకున్నంతగా నచ్చలేదు. అయితేనేం వసూళ్లు రూ.300 కోట్ల ఎప్పుడో దాటిపోయాయి. ఇలా థియేటర్లలో ఉండగానే తాజాగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 'లియో' సంగతేంటి? తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. 'LCU' పేరుతో డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాడు. ఈ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగానే ఖైదీ, విక్రమ్ సినిమాలు వచ్చాయి. వీటికి లింక్ చేస్తూ 'లియో' మూవీ థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై ఓ రేంజులో అంచనాలు ఏర్పడ్డాయి. మ్యూజిక్, టేకింగ్ విషయంలో సూపర్ అనిపించుకున్న ఈ చిత్రం.. కథ, కథనాల విషయంలో మాత్రం ఫెయిలైందనేది కొందరు ప్రేక్షకుల వాదన. (ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!) కథేంటి? పార్తిబన్(విజయ్).. భార్య పిల్లలతో కలిసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటాడు. కాఫీ షాప్ నడుపుతుంటాడు. ఆ షాప్కి వచ్చిన కొందరు రౌడీలు.. తన కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తారు. దీంతో వాళ్లని చంపేస్తాడు. మరోవైపు ఆంటోనీ దాస్ (సంజయ్ దత్).. పార్తిబన్ దగ్గరకొచ్చి తాను తండ్రినని చెప్తాడు. నువ్వు పార్తిబన్ కాదు.. లియో దాస్ అని అంటాడు. ఇంతకీ పార్తిబన్ ఎవరు? లియో ఎవరు? అసలు వీళ్లిద్దరికీ సంబంధం ఏంటనేది సినిమా కథ. ఓటీటీలోకి అప్పుడేనా? ఇకపోతే థియేటర్ రిలీజ్కి ముందే 'లియో' డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ చేసుకునేలా ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆ అగ్రిమెంట్లో భాగంగానే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అక్టోబరు 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని నవంబరు 21 నుంచి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) -
రికార్డులు కొల్లగొడుతున్న లియో.. కమల్, రజినీ చిత్రాలను వెనక్కినెట్టి!
కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్- దళపతి విజయ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లియో. ఈనెల 19న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపరంగా దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్లో చేరనుంది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ జీవితకాల కలెక్షన్స్ను కేవలం ఐదు రోజుల్లోనే లియో అధిగమించింది. కోలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది. (ఇది చదవండి: గర్భస్రావమని చెప్పినా వినలేదు.. మరుసటి రోజే షూటింగ్: బుల్లితెర నటి) అయితే కలెక్షన్ల పరంగా ఇండియాలో ఆరు రోజుల్లో దాదాపు రూ.250 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇండియాలో ఆరో రోజు రూ.31.50 కోట్లు వసూలు చేసింది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ జోరు ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే రూ.300 కోట్ల మార్క్ను దాటేయనుంది. వసూళ్లపరంగా రజినీకాంత్ నటించిన రోబో 2.0 పేరిట ఉన్న రికార్డ్ను సైతం లియో బద్దలు కొట్టింది. గతంలో ఆరు రోజుల్లో రోబో 2.0 రూ. 400 కోట్లు వసూలు చేస్తే.. లియో కేవలం ఐదు రోజుల్లోనే ఆ మార్కును చేరుకుంది. ఈ వారంలోనే లియో ఐదొందల కోట్ల మార్క్ చేరుకుంటే రోబో 2.0, జైలర్ తర్వాత ఆ లిస్ట్లో మూడో చిత్రంగా లియో నిలుస్తుంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!) -
గాయపడిన 'లియో' డైరెక్టర్.. వాళ్లని కలవడానికి వెళ్లి!
లియో మూవీ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. కలెక్షన్స్లో అదరగొడుతోంది. ప్రస్తుతం రూ.400 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రమోషన్స్లో భాగంగా ఫ్యాన్స్ని కలవడానికి వెళ్లిన లోకేశ్ గాయపడటం కాస్త కలవరపాటుకి గురిచేసింది. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?) 'లియో'తో కలిపి లోకేశ్ కనగరాజ్ తీసింది జస్ట్ ఐదు సినిమాలే. కానీ దక్షిణాదిలో కల్ట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తమిళ హీరోలందరినీ కలిపి లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తీస్తుంటడమే ఇందుకు కారణం. లోకేశ్ తీసిన ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు.. ఈ యూనివర్స్లో భాగమే. ఇకపోతే 'లియో' సక్సెస్లో భాగంగా కేరళలోని పాలక్కాడ్ వెళ్లాడు లోకేశ్. పాలక్కాడ్లోని అరోమా థియేటర్కి వెళ్లి ఫ్యాన్స్తో కలిసి లియో సినిమా చూశారు. ఆ తర్వాత బయటకు వచ్చిన అభిమానులతో కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. అయితే ఊహించిన దానికంటే ఎక్కువమంది జనాలు వచ్చేసరికి పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో తనకు గాయమైందని లోకేశ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. మరోసారి త్వరలో కేరళ వస్తానని అన్నాడు. అతడి ట్వీట్ బట్టి చూస్తుంటే గాయం చిన్నదే అనిపిస్తుంది. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ సీఎం కావాలని నేను ఎప్పటికీ కోరుకోను: రేణు దేశాయ్) Thank you Kerala for your love.. Overwhelmed, happy and grateful to see you all in Palakkad. ❤️ Due to a small injury in the crowd, I couldn’t make it to the other two venues and the press meeting. I would certainly come back to meet you all in Kerala again soon. Till then… pic.twitter.com/JGrrJ6D1r3 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) October 24, 2023 Director lokesh at palakkad,aroma theatre 🤩 " Thalapathy enna sonnaru nu kettaralama when lokesh said he is going to kerala "🤩😍 @actorvijay na come here one time na 🙂 #Leo #LeoIndustryHit pic.twitter.com/87TQJd9kDf — Hari Vj Fanatic (@Vijayfanzh) October 24, 2023 -
'లియో'లో విలన్.. రియల్ లైఫ్లో స్టార్ కొరియోగ్రాఫర్.. ఇతడిని గుర్తుపట్టారా?
మీలో చాలామంది 'లియో' సినిమా చూశారు కదా! ఎలా అనిపించింది? అని అడగ్గానే కొందరు నచ్చిందని చెప్తారు. మరికొందరికి నచ్చలేదని అంటారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడవన్నీ ఇక్కడ డిస్కషన్ ఏం పెట్టడం లేదు గానీ మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. 'లియో' ప్రారంభం సన్నివేశాల్లో సైకో కిల్లర్గా ఓ కుర్రాడు చేశాడు. ఉన్నంతలో తన యాక్టింగ్తో భయపెట్టేశాడు. చెప్పాలంటే వణికించేశాడు. ఇంతకీ అతడెవరో తెలుసా? 'లియో' సినిమాలో యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోపు ఉన్నాయి. మిగతా విషయాల్లో మాత్రం ప్రేక్షకుల్ని అంచనాల్ని అందుకోవడంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఫెయిలయ్యాడని చెప్పొచ్చు. అయితే సినిమా ఫస్టాప్ ఓ రేంజులో ఉంటుంది. యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజులో వర్కౌట్ అయ్యాయి. ఇక మూవీ మొదట్లో కనిపించేది కాసేపే అయినా సైకో కిల్లర్ పాత్ర చాలామందికి గుర్తుండిపోతుంది. అది చేసింది స్టార్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్) తమిళంలో కొరియోగ్రాఫర్గా చాలా గుర్తింపు తెచ్చుకున్న శాండీ మాస్టర్.. కొన్ని సినిమాల్లో కామెడీ తరహా రోల్స్ చేశాడు. కానీ 'లియో'లో మాత్రం సైకో కిల్లర్ పాత్రలో వణికించేశాడు. హీరోతో తలపడే సీన్లో 'చాక్లెట్ కాఫీ' అని రచ్చ లేపాడు. 2005లో 'మానాడా మయిలాడా' అనే డ్యాన్స్ షోతో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. అదే షో హోస్ట్ చేసిన కాలా మాస్టర్ దగ్గర శిష్యరికం చేశాడు. 2014లో 'ఆహ్' సినిమాతో కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏడాదే 'ఇవనుక్కు తన్నిళ్ల గండం' అనే మూవీతో నటుడు కూడా అయిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఓ 20కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాడు. రజనీకాంత్, విశాల్ తదితర సినిమాలకు పనిచేశాడు. ఇక 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో భాగంగా శాండీ మాస్టర్ చేసిన స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇప్పటికీ అలరిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడు ఎంటర్టైన్ చేసే ఇతడు.. ఇలా క్రూరమైన విలన్గా కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్హిట్ దెయ్యం సినిమా) -
Leo రిలీజ్.. థియేటర్లో విజయ్ అభిమాని ఎంగేజ్మెంట్!
హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. త్రిష కథానాయికగా నటించిన ఇందులో ప్రియా ఆనంద్, మడోనా సెబాస్టియన్, బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్, గౌతమ్మీనన్, మిష్కిన్ ముఖ్యపాత్రలు పోషించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గురువారం(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లియో సినిమా ఆడుతున్న థియేటర్ల ముంగిట్లో విజయ్ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ అభిమానులు పండగ చేసుకున్నారు. కేక్లు కట్ చేయడం, స్వీట్స్ పంచడం, బాణసంచా కాల్చడం వంటి కార్యక్రమాలతో హంగామా చేశారు. ఒక్క కోవైలోనే లియో చిత్రం 100 థియేటర్లలో విడుదలైంది. ప్రభుత్వం వేకువజామున 4 గంటల ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోయినా అనేక ప్రాంతాల్లో 9 గంటల షోకు ఉదయం ఆరు, ఏడు గంటల సమయంలోనే అభిమానులు థియేటర్లకు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన విజయ్ అభిమానులే కాకుండా, కేరళ రాష్ట్రానికి చెందిన అభిమానులు కూడా వచ్చి మొదటి షోను చూడడానికి ఆసక్తి చూపడం విశేషం. తమిళనాడు కేరళ సరిహద్దులో గల కుమరి జిల్లాలో అనేకమంది మలయాళ ప్రేక్షకులు లియో చూసేందుకు తరలివచ్చారు. విజయ్ ఫొటోతో 20 అడుగుల కేక్ను కట్ చేసి అభిమానులు అందరికీ పంచిపెట్టారు. (చదవండి: లియో సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అభిమాని నిశ్చితార్థం లియో సినిమా రిలీజ్ రోజు ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పుదుకోటైకి చెందిన వెంకటేష్ అనే విజయ్ అభిమాని తను ప్రేమిస్తున్న మంజుల అనే ప్రేయసితో లియో సినిమా ఆడుతున్న థియేటర్లో నిశ్చితార్థం జరుపుకున్నాడు. అతను మాట్లాడుతూ తనకు తల్లి, తండ్రి ఎవరూ లేరని విజయ్నే తనకు అంతా అని పేర్కొన్నాడు. అందుకే ఈ రోజు తాను వివాహ నిశ్చితార్థం జరుపుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా క్రిష్ణగిరికి చెందిన మరో వీరాభిమాని లియో చిత్రం చూడడానికి థియేటర్కు వచ్చి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని గోడపై నుంచి క్యూలోకి దూకడంతో కాలుకు తీవ్ర గాయమైంది. గాయంతోనే అతను థియేటర్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకొని అతన్ని ఆస్పత్రికి తరలించారు. కోయంబేడు రోహిణి థియేటర్లో పోలీసుల బందోబస్తు.. చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ చైన్నె క్రోంపేటలోని థియేటర్లో చిత్ర మొదటి షోను ప్రేక్షకుల మధ్య చూడడానికి వెళ్లారు. వారిని చూసిన విజయ్ అభిమానులు, ప్రేక్షకులు చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఆ తర్వాత లొకేష్ కనకరాజ్, అనిరుధ్ స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటర్కు వచ్చారు. థియేటర్లో ఉదయం 11.30 గంటలకే లియో చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ విజయ్ అభిమానులు అత్యధిక సంఖ్యలో ఉదయాన్నే అక్కడికి చేరుకుని హంగామా చేశారు. దీంతో వారిని కట్టడి చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇకపోతే ఆ థియేటర్కు దర్శకుడు లోకేష్ కనకరాజ్, సంగీత దర్శకుడు అనిరుధ్ వెళ్లేసరికే త్రిష అక్కడికి చేరుకున్నారు. విడాముయర్చి చిత్ర షూటింగ్ డుమ్మా కొట్టి త్రిష లియో చిత్రాన్ని చూడడానికి వెళ్లడం విశేషం. కాగా పుదుకోట్టైలో లియో చిత్రం చూసే ముందు ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తూ విజయ్ అభిమానులు కొంచెం సేపు మౌనం పాటించడం విశేషం. The makers of #BlockbusterLeo at #FansFortRohini celebrating #Leo in a #Badass way 🔥🔥@Dir_Lokesh @anirudhofficial @trishtrashers PC - @jefferyjoshua pic.twitter.com/BkTc7WpsHG— Rohini SilverScreens (@RohiniSilverScr) October 19, 2023 చదవండి: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ -
LEO Review: ‘లియో’మూవీ రివ్యూ
టైటిల్: లియో నటీనటులు: విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు నిర్మాతలు: ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిసామి తెలుగులో విడుదల: సితార ఎంటర్టైన్మెంట్స్ రచన-దర్శకత్వం: లోకేష్ కనగరాజ్ సంగీతం: అనిరుధ్ రవిచందర్ సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస విడుదల తేది: అక్టోబర్ 19, 2023 కథేంటంటే.. పార్తి అలియాస్ పార్తిబన్(విజయ్) హిమాచల్ ప్రదేశ్లోని ఓ చిన్న పట్టణంలో స్థిరపడ్డ తెలుగువాడు. అక్కడ ఒక కాఫీ షాప్ రన్ చేస్తూ.. భార్య సత్య(త్రిష), ఇద్దరు పిల్లలు(పాప, బాబు)తో సంతోషంగా జీవితం గడుపుతుంటాడు. ఓ సారి తన కాఫీ షాపుకు ఓ దొంగల ముఠా వచ్చి డబ్బును దోచుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. వారిని అడ్డుకునే క్రమంలో తుపాకితో అందరిని కాల్చి చంపేస్తాడు పార్తి. దీంతో అతను అరెస్ట్ అవుతాడు. ఆత్మ రక్షణ కోసమే వారిని చంపినట్లు కోర్టు భావించి..అతన్ని నిర్ధోషిగా ప్రకటిస్తుంది. పార్తి ఫోటో ఓ వార్త పత్రికలో చూసి ఏపీలోని ఆంటోని దాస్(సంజయ్ దత్) గ్యాంగ్.. హిమాచల్ ప్రదేశ్కు వస్తుంది. పార్తిని చంపడమే వారి లక్ష్యం. దీనికి కారణం ఏంటంటే.. పార్తి, 20 ఏళ్ల కిత్రం తప్పిపోయిన ఆంటోని దాస్ కొడుకు లియోలా ఉండడం. అసలు లియో నేపథ్యం ఏంటి? సొంత కొడుకునే చంపాలని ఆంటోని, అతని సోదరుడు హెరాల్డ్ దాస్(అర్జున్) ఎందుకు ప్రయత్నిస్తున్నాడు? పార్తి, లియో ఒక్కరేనా? ఆంటోని గ్యాంగ్ నుంచి తన ఫ్యామిలిని కాపాడుకునేందుకు పార్తి ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లియో.. లోకేష్ కగనరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చిన చిత్రం. అలా అని ఖైదీ, విక్రమ్ చిత్రాలతో దీనికి సంబంధం ఉండదు. ఖైదీలోని నెపోలియన్ పాత్ర, చివర్లో ‘విక్రమ్’(కమల్ హాసన్) నుంచి లియోకి ఫోన్ రావడం.. ఇవి మాత్రమే లోకేష్ కగనరాజ్ యూనివర్స్ నుంచి తీసుకున్నారు. మిగత స్టోరి అంతా డిఫరెంట్గా ఉంటుంది. కథనం మాత్రం లోకేష్ గత సినిమాల మాదిరే చాలా స్టైలీష్గా, రేసీ స్క్రీన్ప్లేతో సాగుతుంది. ఇందులో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్ మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు. ఓ ముఠా కలెక్టర్ని హత్య చేసే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత హైనా(కృర జంతువు)ఫైట్ సీన్తో హీరో ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత పార్తి ఫ్యామిలీ పరిచయం.. భార్య, పిల్లలతో అతనికి ఉన్న అనుబంధాన్ని తెలియజేసే సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. అయితే ఫ్యామిలీ ఎపిసోడ్ కాస్త బోరింగ్ అనిపిస్తుంది. కాఫీ షాపులో యాక్షన్ ఎపిసోడ్ తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. పార్తి ఫోటో పేపర్లో చూసి ఆంటోని గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్కు రావడంతో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అసలు లియో ఎవరు? ఆంటోని నేపథ్యం ఏంటనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. ఆంటోని, పార్తి తొలిసారి కలిసే సీన్ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్ ముందు ఆంటోని, పార్తికి మధ్య వచ్చే ఛేజింగ్ సన్నివేశం అయితే హైలెట్. లియో నేపథ్యం ఏంటి? తండ్రి, కొడుకులను ఎందుకు వైరం ఏర్పడిదనేది సెకండాఫ్లో చూపించారు. కథ పరంగా సినిమాలో కొత్తదనం ఏమి ఉండదు కానీ లోకేష్ మేకింగ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. ‘ఖైది’ నెపోలియన్ పాత్రను ఇందులో యాడ్ చేసిన విధానం బాగుంటుంది. అయితే లియో పాత్ర పండించిన ఎమోషన్ మాత్రం వర్కౌట్ కాలేదు. తండ్రి,బాబాయ్, చెల్లి.. ఏ పాత్రతోనూ ఎమోషనల్గా కనెక్ట్ కాలేదనిపిస్తుంది. క్లైమాక్స్లో హెరాల్డ్ దాస్తో వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే.. లియో, పార్తి.. రెండు విభిన్నమైన పాత్రలో విజయ్ అదరగొట్టేశాడు. స్టార్డమ్ని పక్కకి పెట్టి ఇద్దరు పిల్లల తండ్రిగా నటించాడు. పార్తి పాత్రలో ఆయన లుక్, గెటప్ ఆకట్టుకుంటాయి. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న లియో పాత్రలో అభిమానులు కొరుకునే విజయ్ కనిపిస్తాడు. గెటప్ పరంగానే కాదు యాక్టింగ్ పరంగానూ రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్ చక్కగా నటించాడు. ఇక హీరో భార్య సత్య పాత్రకి త్రిష న్యాయం చేసింది. విజయ్, త్రిషల కెమిస్ట్రీ తెరపై బాగా పండింది. విలన్ ఆంటోనిగా సంజయ్ దత్, అతని సోదరుడు హెరాల్డ్ దాస్గా అర్జున్.. మంచి విలనిజాన్ని పండించారు. కానీ ఆ రెండు పాత్రలను ముగించిన తీరు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ చిత్రానికి ప్రధాన బలం అనిరుధ్ సంగీతం. గత సినిమాల మాదిరే లియోకి కూడా అదరిపోయే బీజీఎం ఇచ్చాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో అనిరుద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
లియో సినిమా.. కథ కొత్తదేమీ కాదు, పాతదే: డైరెక్టర్
విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్దత్, యాక్షన్కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్మీనన్, మిష్కిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్.లలిత్కుమార్ నిర్మించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని పలు వివాదాలను దాటుకుని గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు లోకేశ్ కనకరాజ్ బుధవారం మధ్యాహ్నం చైన్నెలో పత్రికల వారితో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ఇది తన ఐదవ చిత్రం అని తెలిపారు. అందరూ చిత్ర కథ గురించి అడుగుతున్నారని, అయితే ఇది కొత్త కథేమీ కాదని, మొదటి నుంచి వస్తున్న పాత కథలానే ఉంటుందని, అయితే దాన్ని తనస్టైల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తెరకెక్కించినట్లు చెప్పారు. లియో ఎమోషనల్తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. చిత్ర కథ మున్నార్లో జరిగేదిగా ఉంటుందని, అయితే అక్కడ షూటింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో కశ్మీర్లో 60 రోజుల పాటు నిర్వహించినట్లు చెప్పారు. లియో చిత్రానికి ఎదురైన సమస్యల గురించి అడుగుతున్నారని, అవన్నీ నిర్మాత చూసుకుంటారని, చిత్రం ప్రారంభం నుంచి, ఫస్ట్కాపీ వరకూ తన బాధ్యత అని చెప్పారు. అయితే ఇలాంటి చిత్రాలకు సమస్యలన్నవి సాధారణమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా తర్వాత రెండు చిత్రాలకు కమిట్ అయినట్లు చెప్పారు. అందులో రజనీకాంత్ హీరోగా చేసే చిత్రం, కార్తీ కథానాయకుడిగా ఖైదీ 2 చిత్రం ఉంటుందని చెప్పారు. తన చిత్రాలన్నీ ఎమోషన్తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాలుగానే ఉంటాయన్నారు. రజనీకాంత్తో చేసే చిత్రం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పారు. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్లో సెట్పైకి వెళుతుందని లోకేశ్ కనకరాజ్ తెలిపారు. చదవండి: Leo Movie: లియోకు బిగ్ షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!! -
లియోకు మరో షాక్.. రిలీజైన కొద్ది గంటల్లోనే!!
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం థియేటర్లలో రిలీజైంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్పై వివాదం తలెత్తగా.. రిలీజ్ రోజే మరో గట్టి షాక్ తగిలింది. మూవీ రిలీజైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లోకి వచ్చేసింది. అది కూడా హెచ్డీ ప్రింట్ కావడంతో దళపతి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ఇది చదవండి: 'స్కామ్-2003' పార్ట్-2 వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఫిక్స్!) భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ చిత్రం పైరసీ సైట్స్లో కనిపించడంతో చిత్రబృందం షాక్కు గురైంది. అయితే ప్రింట్ను వెబ్సైట్ నుంచి తొలగించేందుకు చిత్ర యూనిట్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. తాజాగా లీక్ అయిన హెచ్డీ ప్రింట్పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనుంది చిత్రయూనిట్. వీరిద్దరి కాంబినేషన్లో మాస్టర్ తర్వాత వచ్చిన చిత్రం లియో. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లియో సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. (ఇది చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) -
లియో మూవీ రిలీజ్ వివాదం.. కొనసాగుతున్న సస్పెన్స్!
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రం గురువారం థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ మూవీ రిలీజ్పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఆటలు ప్రదర్శన వ్యవహారం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. లియో చిత్రానికి ప్రభుత్వం 19వ తేదీ నుంచి 24వ తేది వరకు రోజుకు 5 ప్రదర్శనలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే మరో ఆటను వేకువజామున 4 గంటలకు అనుమతి కోరుతూ చిత్ర నిర్మాత ఎస్ ఎస్.లలిత్ కుమార్ చైన్నె హైకోర్టును ఆశ్రయించగా.. అనుమతి ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఉదయం 9 గంటల ఆటకు బదులు 7 గంటలకు అనుమతించే విషయంపై పరిశీలించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. కాగా మరో పక్క సినీ డిస్ట్రిబ్యూటర్లు తమకు 5 ఆటలు చాలని ప్రకటించడం మరోవైపు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం మారినా..? ఇదిలా ఉంటే విజయ్ చిత్రం అంటేనే సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో విజయ్ నటించిన చిత్రాలు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ అదే పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరుగుతుండడమేనని తెలుస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రఘుపతిని మీడియా ప్రశ్నించింది. లియో చిత్రం విషయంలో రాజకీయం ఉందనే ప్రచారం జరుగుతోందని.. రాజకీయాల్లో కొనసాగుతున్న కొందరు నిర్మిస్తున్న చిత్రాలకు ఎలాంటి సమస్యలు లేకుండా అనుమతిస్తున్నారనే విమర్శకు మీ సమాధానం ఏమిటన్న ప్రశ్నకు చిత్ర పరిశ్రమ విషయంలో విభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోలేదని ఆయన బదులిచ్చారు. చిత్ర పరిశ్రమతో తమకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. అదే సమయంలో ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కాగా.. న్యాయస్థానంలో ఉపశమనం లభించకపోవడంతో లియో చిత్ర నిర్మాత రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని కలిశారు. ఈ క్రమంలో రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అముదను కలవడానికి వచ్చిన నిర్మాత తరపు న్యాయవాదుల కారు యాక్సిడెంట్కు గురైంది. తిరుగుముఖం పట్టిన న్యాయవాదుల కారును డ్రైవర్ మలుపు తిప్పుతుండగా అటుగా వస్తున్న మహిళ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. లియో చిత్రం గురువారం విడుదల అని ప్రకటించినా ఇప్పటి వరకు చాలా థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ చిత్ర విడుదలపై సందిగ్ధత నెలకొంది. -
'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?
ఈ శుక్రవారం తెలుగులో మూడు పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో బాలయ్య 'భగవంత్ కేసరి', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' కంటే విజయ్ 'లియో'కే ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే హైప్, టికెట్ బుకింగ్స్ అవుతున్నాయి. మరోవైపు టైటిల్ మూలాన 'లియో' మూవీ తెలుగులో చెప్పిన టైంకి రిలీజ్ అవుతుందా లేదా అని మరో టెన్షన్. ఇలా 'లియో' విషయంలో విడుదలకు సరిగ్గా రెండు రోజుల ముందు కాస్త హడావుడి ఎక్కువైంది. అయితే చాలామంది తెలుగు ఆడియెన్స్.. ఈ చిత్రాన్ని విజయ్ కోసం కాదు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కోసం చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 'విక్రమ్'తో మెస్మరైజ్ చేసిన ఇతడు.. 'లియో'తో ఏం మ్యాజిక్ చేయబోతున్నాడనేది ఇక్కడ ప్రశ్న. (ఇదీ చదవండి: ‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ) ఇకపోతే బడ్జెట్ పరంగా రూ.300 కోట్ల వరకు 'లియో' కోసం పెట్టారు. అయితే ఇందులో సగం బడ్జెట్ చిత్రబృందం రెమ్యునరేషన్ కోసం ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే హీరో విజయ్ రూ.120 కోట్ల పారితోషికం అందుకున్నాడట. ఇతడి తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్-రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ రూ.10 కోట్లు, సంజయ్ దత్ రూ.8 కోట్లు, త్రిష రూ.5 కోట్లు, అర్జున్ రూ.కోటి, ప్రియా ఆనంద్ రూ.50 లక్షలు తీసుకున్నారట. సహాయ పాత్రల్లో నటించిన గౌతమ్ మేనన్, మిస్కిన్ తదితరులు రూ.30-50 లక్షల మధ్య రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. కొన్నాళ్ల ముందు వరకు వేరే లెవల్ హైప్తో వార్తల్లో 'లియో' సినిమాకు ట్రైలర్ వచ్చిన తర్వాత కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అయితే థియేటర్లలో సినిమా హిట్ అయితే మాత్రం ఈ సంగతులన్నీ ఫ్యాన్స్ మర్చిపోతారు. తెలుగు రిలీజ్ అక్టోబరు 19. అంటే మరో రోజు మాత్రమే గ్యాప్ ఉంది. మరి 'లియో' ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి.. పెద్దమ్మ శ్యామలాదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ
తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’ తెలుగు వెర్షన్ విడుదలపై సిటీ సివిల్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. టైటిల్ వివాదం నేపథ్యంలో డి-స్టూడియోస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన సిటి సివిల్ కోర్టు.. ఈ నెల 20 వరకు లియో తెలుగు వెర్షన్ను విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై తెలుగు నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అనుకున్న సమయానికే లియో విడుదల అవుతుందని స్పష్టం చేశాడు. ‘తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చింది. తెలుగులో లియో టైటిల్ ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారు. వారు మమ్మల్ని సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. టైటిల్ రిజిస్టర్ చేసుకున్నవారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిస్కారం అవుతుంది. విడుదలలో ఎలాంటి మార్పు ఉండదు. అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదల అవుతుంది. (చదవండి: అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్.. లియోకు మరో బిగ్ షాక్!) ఈ సినిమా తెలుగు టైటిల్ ని కూడా తమిళ నిర్మాతలే రిజిస్టర్ చేయించి ఉన్నారు. పైగా ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. కాబట్టి విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఇక్కడ తెలుగులో లియో టైటిల్ ని వేరొకరు కూడా రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి.. వాళ్ళకి గానీ, మాకు గానీ ఎటువంటి నష్టం జరగకుండా సమస్యని పరిష్కరించుకుంటా’ అని నాగవంశీ అన్నారు. -
అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్.. లియోకు మరో బిగ్ షాక్!
దళపతి విజయ్ లియో మూవీ విడుదలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడులో బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిర్మాతలకు చుక్కెదురైంది. తాజాగా తెలుగు వర్షన్ అయినా బెనిఫిట్ షోలు చూడొచ్చని భావించిన అభిమానులకు మరో షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్పై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. (ఇది చదవండి: లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!) లియో తెలుగు వర్షన్ ఈనెల 19న విడుదల చేయవద్దంటూ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. లియో టైటిల్ వివాదం నేపథ్యంలో డి-స్టూడియోస్ ప్రతినిధులు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. డి స్టూడియోస్ పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నెల 20 వరకు విడుదల చేయవద్దని ఆదేశాలిచ్చింది. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్! ఈ నిర్ణయంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమిళంలో బెనిఫిట్ షోలు లేకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తెలుగులోనైనా మార్నింగ్ షోలు చూడొచ్చని అభిమానులు భావించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్స్ కొనుగోలు చేసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్లో లియోకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!) -
రెండేళ్ల తర్వాతే సినిమా ప్రారంభం
-
రిలీజ్కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం లియో. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మూడు రోజుల్లో సినిమా రిలీజవుతుండగా.. తాజాగా చిత్రబృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి) తమిళనాడులో సినిమా విడుదలైన మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సినిమాను ప్రదర్శించేందుకు అనుమతించాలని లియో మేకర్స్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 24 వరకు ఉదయం 7 గంటలకు లియో షోలను అనుమతించాలని నిర్మాతలు కోర్టును అభ్యర్థించారు. కాగా.. చిత్ర నిర్మాతల పిటిషన్పై అక్టోబర్ 17న విచారణ చేపట్టనున్నట్లు మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. అదనపు షోలకు అనుమతి అయితే ఇప్పటికే లియో చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం మొదటి ఆరు రోజుల పాటు ఒక అదనపు షో ప్రదర్శనకు అనుమతి మంజూరు చేసింది. ఈ సినిమా మొదటి షోకు ప్రదర్శనకు ఉదయం 9 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే రిలీజైన లియో ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్తో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. 2021లో విడుదలైన మాస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్, విజయ్ల కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం లియో. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, హెరాల్డ్ దాస్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మాయ ఎస్ కృష్ణన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి) -
‘లియో’పై తగ్గిన ఆసక్తి.. ఎందుకిలా?
లియో.. ఈ సినిమాను ప్రకటిస్తూ మొదట్లో ఓ వీడియోని వదిలారు మేకర్స్. అప్పటి నుంచి ఈ చిత్రంపై తమిళ్లోనే కాదు తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి కారణం హీరో విజయ్తో పాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ ముగ్గురు తెలుగు ప్రేక్షకులను సుపరిచితమే. అందుకే దసరా బరిలో ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఉన్నప్పటికీ..‘లియో’పై మాత్రం క్రేజ్ తగ్గలేదు. కానీ ఎప్పుడైతే ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ‘లియో’పై అంచనాలు తగ్గతూ వచ్చాయి. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన సినీ ప్రేక్షకులను ట్రైలర్ ఆశించిన స్థాయితో మెప్పించలేకపోయింది. తెలుగు ప్రేక్షకులే కాదు తమిళ ఆడియన్స్ని కూడా ఈ ట్రైలర్ మెప్పించలేకపోయింది. ఆకట్టుకోలేకపోయిన ట్రైలర్ ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి సాలిడ్ హిట్లను అందించిన లోకేశ్.. లియోని కూడా అదేస్థాయిలో తీర్చిదిద్దారని అంతా భావించారు. తీరా ట్రైలర్ చూస్తే..ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించలేదు. అయితే ట్రైలర్ చూసి ‘లియో’పై ఒక అంచనాకు రావొద్దని, సినిమాలో అనేక సర్ప్రైజ్లు ఉంటాయని టీమ్ చెబుతుంది. కానీ ఎవరైనా ట్రైలర్ చూసే సినిమాపై ఓ అంచనాకు వస్తారు. అందుకే ట్రైలర్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కానీ లియో విషయంలో మాత్రం ట్రైలర్ బజ్ని క్రియేట్ చేయలేకపోయింది. తగ్గిన ఆసక్తి 'లియో'.. తెలుగు థియేట్రికల్ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. విడుదలకు ఇంకా వారం రోజులు కూడా లేదు..అయినా కూడా ప్రమోషన్స్ ప్రారంభించలేదు. డబ్బింగ్ విషయంలో కూడా క్వాలిటీ లేదనే విషయం ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. ఇక తాజాగా ‘లియో’ నుంచి రిలీజ్ చేసిన ‘నే రెడీ’ పాట కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో లియోపై మొదట్లో ఉన్నంత ఆసక్తి అయితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో లేదు. అయితే లోకేశ్ కనగరాజ్ మేకింగ్పై మాత్రం నమ్మకం ఉంది. కచ్చితంగా తనదైన స్క్రీన్ప్లేతో సర్ప్రైజ్ చేస్తాడని సినీ పండితులు చెబుతున్నారు. తెలుగులో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. -
ఫ్యాన్స్కి 'లియో' షాక్.. అక్కడ టికెట్ రేటు రూ.5 వేలు!
థియేటర్లలో రిలీజయ్యే సినిమాలకు అప్పటితో పోలిస్తే డిమాండ్ తగ్గిన మాట వాస్తవమే. కానీ స్టార్ హీరోల మూవీస్కి మాత్రం వేరే లెవల్ క్రేజ్ ఏర్పడుతోంది. అలా వచ్చే వారం రిలీజ్ కాబోతున్న వాటిలో తెలుగు-తమిళ ప్రేక్షకుల చాలా అంటే చాలా ఎదురుచూస్తున్న మూవీ 'లియో'. ఇప్పుడు ఈ చిత్ర టికెట్ రేట్లు చూస్తుంటే ఒక్కొక్కరికి బుర్ర తిరిగిపోతోంది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా.. హీరోగా 'జబర్దస్త్' కమెడియన్!) 'లియో' సినిమా కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురుచూడటానికి కారణం డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. 'విక్రమ్' సినిమాతో ఒక్కొక్కరిని అవాక్కయ్యేలా చేసిన ఇతడు.. ఈ సినిమాతో రాబోతున్నాడు. దీంతో అంచనాలు గట్టిగా ఉన్నాయి. అలానే 'LCU'తో దీనికి లింక్ ఉందని, ఇందులో రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేశాడని రూమర్స్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా ఉన్నాయి. ఇలా పలు కారణాల వల్ల 'లియో'పై బీభత్సమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు అడ్డదారులు ఎంచుకున్నారు. అభిమానులు ఎలాగైనా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఎగబడతారని తెలిసి, ఏకంగా ఒక్కో టికెట్ని రూ.5 వేలకు అమ్ముతున్నారనట. తమిళనాడులోని ప్రధాన నగరాలైన చెన్నై, మధురై, కోయంబత్తూరులో ఈ దందా నడుస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ మొదలు కావాల్సి ఉంది. మన దగ్గర అంతంత టికెట్ ధరలు ఉండకపోవచ్చులే! (ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమా) -
మొదటి 10 నిమిషాల్లోనే ఈ సీన్.. ఎవరూ మిస్ కాకండి: లోకేశ్ కనగరాజ్
దసరా బరిలో ఈసారి మూడు సినిమాలు ప్రధానంగా బరిలో ఉన్నాయి. తెలుగుతో పాటు, తమిళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'లియో' అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా పూర్తి రన్ టైమ్ 2 గంటల 44 నిమిషాలు కాగా మొత్తం 13 సన్నివేశాల్లో సెన్సార్ కోత పెట్టింది. ముఖ్యంగా వాటిలో రక్తం, హింస కనిపించే వంటి సీన్స్ తొలగించారు. కానీ ఇవన్నీ కూడా ఒక నిమిషం లోపే ఉన్నాయని సమాచారం. (ఇదీ చదవండి: దిల్రాజు అల్లుడి కారు చోరీ.. దొంగిలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) ఇదంతా ఒకపక్క అయితే ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు సినిమా ఎవరూ మిస్ అవ్వకండి అంటూ అలర్ట్ ఇచ్చారు. లియో విజయం కోసం తిరుమలకు విచ్చేసిన లోకేష్ కనగరాజ్ ఇప్పటికే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. లియో సినిమా ఆడియో ఆవిష్కరణ ఈసారి జరగకపోగా, నటుడు విజయ్ ఇంటర్వ్యూ కూడా చివరి వరకు విడుదల కాకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నటుడు అజిత్ లాగా ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా సినిమా ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి అనే నిర్ణయానికి విజయ్ వచ్చినట్లు సమాచారం. మొదటి 10 నిమిషాల్లో హైనా సీన్? లియో సినిమాలో మొదటి 10 నిమిషాలు ఎవరూ మిస్ కాకూడదని లోకేష్ కనగరాజ్ చెబుతుండగా, గత అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ వరకు ఆ 10 నిమిషాల సీన్ కోసం సుమారు వెయ్యి మందికి పైగా పనిచేశారని లోకేశ్ తెలిపాడు. హైనాతో విజయ్ ఫైట్ చేసిన సీన్ అందరినీ మెప్పిస్తుందని ఆయన చెప్పాడు. సినిమాలో తన కుటుంబాన్ని రక్షించడానికి విజయ్ ఆ ఫైట్ చేసినట్లు సమాచారం. ఈ ఒక్క సీన్ కోసం సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ 10 నిమిషాల సీన్ అభిమానులను మరొసారి థియేటర్కి రప్పించేలా మ్యాజిక్ చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. (తమిళ్లో నా రెడీ అంటూ.. వచ్చి మంచి హిట్ అయ్యిన సాంగ్ తాజాగా తెలుగులో విడుదల అయింది. ఇక్కడ చూడండి) -
'లియో' బుకింగ్ స్టార్ట్.. వార్నింగ్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం
దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో (సింహం). నటి త్రిష, ప్రియాఆనంద్ హీరోయిన్లుగా నటించిన ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్మీనన్, మిష్కిన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 7స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ భారీ ఎత్తున నిర్మించారు. (ఇదీ చదవండి: దిల్రాజు అల్లుడి కారు చోరీ.. దొంగలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. లియో చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర వర్గాలు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సాధారణంగా విజయ్ చిత్రం విడుదలవుతుందంటే అభిమానుల హంగామా మాములుగా ఉండదు. ఆలయాల్లో పూజలు, థియేటర్ల వద్ద కటౌట్లకు పాలాభిషేకాలు బాణసంచా మోత మోగుతుంటుంది. అయితే విజయ్ ఆదేశాల మేరకు ఉత్తర చైన్నె అభిమానులు ఇప్పుడు ఎలాంటి హంగామాలు చేయడం లేదంటున్నారు. లేకపోతే చిత్ర విడుదలకు మరో ఆరు రోజులు ఉండగా శుక్రవారం నుంచే చైన్నె, మదురై, కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాల్లో చిత్రం అడ్వాన్న్స్ బుకింగ్ ప్రారంభమైనట్టు తెలిసింది. సాధారణంగా రెండు మూడు రోజులముందు అడ్వాన్న్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది అలాంటిది ఆరు రోజుల ముందే బుకింగ్ మొదలు అన్నది అరుదైన విషయమే అవుతుంది. లియోకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్ తమిళనాడు ప్రభుత్వం లియో సినిమా స్పెషల్ షోలపై ఆంక్షలు విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో విజయ్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. తమిళనాడులో లియో చిత్రం ప్రదర్శనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ అముత IAS అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు.లియో స్పెషల్ షోలకు ఎలాంటి అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా బెదిరింపులకు దిగి ప్రత్యేక షోలు వేయాలని థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగితే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అముత ఆదేశించారు. థియేటర్లలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. -
Lokesh Kanagaraj Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లియో డైరెక్టర్ (ఫోటోలు)
-
విజయ్ 'లియో' మూవీ.. సామాన్యుడిలా తిరుమలకు డైరెక్టర్!
తమిళ స్టార్, దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. ఈ చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్ సర్జా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ను పూర్తిచేసుకుని అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: 'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!) ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఓ సామాన్యుడిలా తిరుమలకు వెళ్లారు. శ్రీవారి మెట్లమార్గంలో కాలినడకన వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. లియో మూవీ సక్సెస్ కావాలని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాలినడక మార్గంలో ఇటీవల చిరుతల దాడి నేపథ్యంలో ఆయన చుట్టూ కర్రలు పట్టుకుని ఉన్న యువకులు రక్షణగా వెళ్లారు. కాగా.. ఈ చిత్రంపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Director Lokesh Kanagaraj visited Sami in Tirupati to pray for the success of the film #Leo 🧊🔥 @actorvijay @Dir_Lokesh#LokeshKanakaraj #LeoFDFS#LeoFilm #LeoThirdSingle pic.twitter.com/uViS5SIrd3 — Tamil Cine Hub (@tamilcinehub) October 12, 2023 Lokeshkanagaraj Recent Video 👀🔥🔥#LeoThirdSingle #Anbenum #LeoFDFS #Trisha #ThalapathyVijay𓃵 #AnbenumAayudham #LeoFromOctober19 @actorvijay @7screenstudio @Dir_Lokesh #LokeshKanakaraj#LeoFilm #LeofromOct19 pic.twitter.com/7BIs6oKh4B — Popcorn 🍿 (@popcorn1903) October 12, 2023 Our @Dir_Lokesh and @MrRathna walking to Tirupathi Tirumala for the mega success of #Leo Leo sure shot 1000cr movie 🔥🔥 Surprise cameo enjoy in theatres 🔥💯🥵🥵🥵🥵#LeofromOct19#LeoFDFS#LeoFilmpic.twitter.com/sPYr5oUsrq — Sudeep cherry (@Sudeepcherry) October 12, 2023 -
విజయ్కు వాటితో సంబంధం లేదు.. బాధ్యత అంతా నాదే: లోకేష్ కనకరాజ్
విజయ్ చిత్రాలు విడుదలకు ముందు ఆ తర్వాత కూడా వివాదాస్పదం కావడం కొత్తకాదు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన లియో కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాస్టర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకుడు గౌతమ్ మేనన్, మిష్కిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల) నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రం సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఇక ఎలాంటి సమస్య లేదు అనుకుంటున్న సమయంలో లియో చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. అందులో విజయ్ చెప్పే పవర్ ఫుల్ డై లాగ్స్ ఆయన అభిమానులకు విపరీతంగా నచ్చింది. అయితే ఇందులో విజయ్ చెప్పిన కొన్ని అనుచిత డైలాగులే ఇప్పుడు పెద్ద దుమారానికి దారి తీస్తున్నాయి. వీటిపై ఒక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్పందించారు. ఆ సంభాషణలతో నటుడు విజయ్కి ఎలాంటి సంబంధం లేదని, ఈ డైలాగులు చెప్పాలా అని ఆయన సందేహాన్ని వ్యక్తం చేశారని, తానే కథకు అవసరమని ఒప్పించానని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే అవి విజయ్ చెప్పిన సంభాషణ కాదని, లియో చిత్రంలోని పార్తిపన్ అనే పాత్ర చెప్పిన సంభాషణలని పేర్కొన్నారు. దానికి తానే బాధ్యత వహిస్తున్నానన్నారు. అయితే చిత్ర టైలర్లో చోటు చేసుకున్న ఆ వివాదాస్పద సంభాషణలు చిత్రంలో మ్యూట్ చేసినట్లు తెలిపారు. ఇకపోతే నటుడు విజయ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ల మధ్య విభేదాలు అంటూ ఒక పోస్టు ట్విట్టర్లో వైరల్ అయ్యింది. దాన్ని దర్శకుడు విగ్నేష్ శివన్ లైక్ కొట్టడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇక ఈ ట్వీట్ను రజనీకాంత్ అభిమానులు ఎంజాయ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. దీంతో చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. తాను ఆ ట్వీట్ను సరిగా చూడకుండా లైక్ కొట్టారని, అందుకు క్షమాపణ చెప్పుకుంటున్నానని ఆయన మరో ట్వీట్ చేయడం గమనార్హం. -
ఆ స్టార్ డైరెక్టర్కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా?
హీరోయిన్లే అందంగా ఉంటారని మనందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఇండస్ట్రీలో హీరోల దగ్గర నుంచి డైరెక్టర్స్ వరకు ఆయా వ్యక్తులు కుటుంబ సభ్యుల్లోనూ హీరోయిన్లని మించి అందంగా ఉండేవాళ్లు ఉంటారు. వాళ్లకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం మరే కారణం తెలీదు గానీ స్క్రీన్పై కనిపించేందుకు ఇష్టపడరు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలాంటి బాపతే. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆ హిట్ మూవీ) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అవంతిక కనగరాజ్. ఆ గుర్తొచ్చింది కదా! అవును మీరు ఊహించింది కరెక్టే. 'లియో' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్కి ఈమె స్వయానా చెల్లి అవుతుంది. సినిమాపై రోజుకి రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. అలానే లోకేశ్ గురించి తెలుగు ప్రేక్షకులు కూడా తెగ మాట్లాడుకుంటున్నారు. అలా ఈమె ఫొటో బయటకొచ్చింది. ఆ తర్వాత మనోళ్లు ఊరుకోరుగా! ఎవరనేది ఆరా తీయడంతో ఆమె డీటైల్స్ తెలిసిపోయాయి. ఇక అవంతిక విషయానికొస్తే.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత స్టూడెంట్ మార్కెటీర్గా రెండేళ్లకు పైగా పనిచేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చేసింది. టాలెంట్ మేనేజర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా పనిచేస్తోంది. తాజాగా ఈమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లోకేష్ కనగరాజ్కి ఇంత అందమైన చెల్లెలు ఉందని అందరికీ తెలిసింది. హీరోయిన్ల కంటే అందంగా ఉన్న ఈ బ్యూటీకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేకపోవడం విశేషం. (ఇదీ చదవండి: ఆ వార్తల వల్ల చాలా బాధపడ్డాను: మెగాస్టార్ చిరంజీవి) View this post on Instagram A post shared by Avantika Kanagaraj (@avantika_kanagaraj) -
లోకేష్ కానగరాజ్, లారెన్స్ కు బిగ్ షాక్ ఇచ్చిన నయనతార
-
వేసవిలో 171 షురూ
బ్రేక్ తీసుకునేది లేదు అన్నట్లు రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘జైలర్’ ఇటీవల విడుదలై, బంపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170వ సినిమా చేస్తున్నారు రజనీ. ఇప్పటికే తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలాం’ చిత్రంలో కీ రోల్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఇక 170వ సినిమా పూర్తయిన వెంటనే 171వ సినిమాతో బిజీ అవుతారు రజనీ. ఈ చిత్రదర్శకుడు లోకేశ్ కనగరాజ్ వెల్లడించిన ప్లాన్ ప్రకారం వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రం షూటింగ్ ఆరంభమవుతుంది. ఏప్రిల్లో చిత్రీకరణ ఆరంభించేలా లోకేశ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేశ్ దర్శకత్వం వహించిన ‘లియో’ ఈ నెల 19న రిలీజ్ కానుంది. కొన్ని నెలలుగా ‘లియో’తో బిజీగా గడిపిన లోకేశ్ ఈ చిత్రం విడుదల తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని, రజనీ 171వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆరంభిస్తారట. నిజానికి ఈ చిత్రకథను తాను దర్శకత్వం వహించిన ‘మానగరం’ (2017)కి ముందే రాశారట. ఒక ఫ్రెండ్ కోసం రాసిన ఈ కథను రజనీకాంత్కి వినిపించగా ఆయనకు నచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల్లో కొన్నింటిని ‘ఐమ్యాక్స్ కెమెరా’తో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నామని లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక్క ట్వీట్తో గుడ్బై చెప్పాలనుకున్నా! ‘‘దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలనుకోవడం లేదు.. కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్నప్పుడు ఒక్క ట్వీట్తో దర్శకత్వానికి గుడ్బై అని అనౌ¯Œ ్స చేయాలనుకున్నా’’ అన్నారు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. దర్శకుడిగా త్వరగా రిటైర్మెంట్ తీసుకుంటా అని గతంలో ఓసారి చెప్పిన లోకేశ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ఇదే విషయంపై స్పందించారు. ‘‘సినిమా ఇండస్ట్రీలో నేను ఎక్కువ కాలం ఉండాలనుకోలేదు. 10 మంచి సినిమాలు చేసి వీలైనంత త్వరగా రిటైర్ అవ్వాలనుకున్నాను. కెరీర్ పరంగా గర్వపడే స్థాయిలో ఉన్నప్పుడు ఒక్క ట్వీట్తో గుడ్బై అని అనౌన్స్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత ఎన్నో ప్రదేశాలకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాను. అయితే, ఇటీవల ఓ వేడుకలో దర్శకులందరం కలిశాం. రిటైర్మెంట్ ప్రయత్నాలను విరమించుకోవాలని వాళ్లు సూచించారు.. వాళ్ల మాటలపై ఉన్న గౌరవంతో రిటైర్మెంట్ గురించి ఇప్పుడే మాట్లాడాలనుకోవడం లేదు’’ అన్నారు. -
లోకేష్ కనగరాజ్ చిత్రం.. స్టార్ హీరోయిన్ అవుట్!!
కోలీవుడ్లో ప్రస్తుతం క్రేజీ దర్శకుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు లోకేష్ కనగరాజ్. సినిమా ఆశతో బ్యాంకు ఉద్యోగాన్ని వదిలి చిత్రరంగ ప్రవేశం చేసిన ఈయన తొలి చిత్రం మా నగరం నుంచి విక్రమ్ వరకు ఒకదాని మించిన ఒక హిట్ అందుకుంటూ వచ్చారు. తాజా విజయ్ కథానాయకుడిగా లియో చిత్రాన్ని పూర్తి చేశారు. ఈనెల 19వ తేదీన తెరపైకి రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఇది చదవండి: ఎలిమినేషన్కి ముందే మరో ట్విస్ట్.. ఆ ముగ్గురిపై వేలాడుతున్న కత్తి!) ఈ మూవీ తర్వాత రజినీకాంత్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది దర్శకుల బాటలోనే లోకేష్ కనగరాజ్ కూడా నిర్మాతగా అవతారం ఎత్తుతున్నారు. ఈయన తన శిష్యుడు రత్నకుమార్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రాఘవ లారెన్స్, నయనతార ప్రధాన పాత్రలో ఒక హారర్, థ్రిల్లర్ కథా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈచిత్రానికి లోకేష్ కనకరాజ్ కథ, కథనం బాధ్యతలను నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నుంచి నయనతార వైదొలగినట్లు తెలిసింది. ఇటీవలే జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టిన నయనతార ఆ చిత్ర సంచలన విజయంతో భారతీయ సినిమాలో మరింత పాపులారిటీ తెచ్చుకున్నారు. కాగా జయం రవి సరసన నటించిన ఇరైవన్ చిత్రం ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నయనతార క్రేజ్ మాత్రం తగ్గలేదు. తన 75వ చిత్రంతో పాటు టెస్ట్, మన్నాంగట్టి సీన్స్ 1960 పెదరా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: నాపై రాసిన ఆ వార్తలు చదివి కుమిలిపోయా: స్వాతి) జవాన్ చిత్రం తర్వాత హిందీలోనూ అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. మరోపక్క తన సొంత నిర్మాణ సంస్థ రవి పిక్చర్స్ పతాకమైన చిత్రాలు నిర్మించడం డిస్ట్రిబ్యూషన్ చేయడం కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే ఇతర వ్యాపార రంగంలోనూ విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా కొంత సమయాన్ని తన పిల్లల కోసం కేటాయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ కనగరాజ్ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి అని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. -
Thalapathy Vijay's Leo: దళపతి విజయ్ ‘లియో’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
'సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా లియో ట్రైలర్!
తమిళ స్టార్, దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్దత్, అర్జున్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ప్రారంభంలోనే.. 'ఒక సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు.. ఆల్రెడీ రోడ్డుమీద చాలామంది చనిపోయారు' అనే డైలాగ్తో ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ సినిమాగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్ సర్జా, సంజయ్ దత్ ఈ సినిమాలో నటించడం మరింత ఆసక్తి పెంచుతోంది. ఫైట్ సీన్స్ తోడేళ్లతో కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. కథ మొత్తం గ్యాంగ్స్టార్ల చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ చెప్పిన ఓ బూతు డైలాగ్ ఆడియన్స్లో షాక్కు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: లియో ఆడియో వేడుక రద్దు) ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ను పూర్తిచేసుకుని అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని నా రెండు వరువా అనే పాట ఇప్పటికీ విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
వాళ్లే టార్గెట్.. బీ కేర్ఫుల్.. వైరలవుతోన్న బ్రహ్మజీ ట్వీట్!
ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రతి రోజు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. చదవుకున్న వాళ్లు సైతం సైబర్ ఉచ్చులో పడి లక్షల్లో మోసపోతున్న సంఘటనలు చూశాం. అయితే సినీ తారలు సైతం వీరి మోసాల పడుతూనే ఉన్నారు. సైబర్ మోసాలు పెరుగుతున్న ఈ రోజుల్లో.. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ తెగ వైరలవుతోంది. సైబర్ తరహాలో సినీ రంగంలో జరుగుతున్న సరికొత్త దోపిడీని తెరపైకి తీసుకొచ్చారు. సినిమా అవకాశాల పేరిట మోసగిస్తున్నారంటూ అలాంటి వారి వివరాలను ట్వీట్లో ప్రస్తావించారు. (ఇది చదవండి: ఆ హీరోతో తొలిసారి జోడీ కడుతున్న నిత్యామీనన్..) బ్రహ్మజీ ట్వీట్లో రాస్తూ..' అందరికీ హెచ్చరిక.. ఈ సెల్ నంబర్(78268 63455 ) డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మేనేజర్ నంబర్లా ఉంటుంది. అతని పేరు నటరాజ్ అన్నాదురై. అతను కాల్ చేసి.. సార్ నేను లోకేశ్ మేనేజర్ను. మీ ప్రొఫైల్ ఆయన తదుపరి సినిమా కోసం ఎంపిక చేయబడింది. ఈ సినిమా కోసం కాస్ట్యూమ్లు అవసరమవుతాయి. ఆడిషన్ కాస్టూమ్స్ కోసం మీరు డబ్బులు చెల్లించండి. ఆడిషన్స్ అయ్యాక మీరు చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామని అంటారు. ప్రస్తుతం ఇది చలనచిత్ర పరిశ్రమలో జరుగుతున్న కొత్త తరహా మోసం.. అబ్బాయిలు జాగ్రత్త..' అంటూ షేర్ చేశారు. అంతేకాకుండా ఆ వ్యక్తిలాగే ఇంకొకరు ఉన్నారంటూ ఫోన్ నెంబర్ వివరాలతో సహా బ్రహ్మజీ ట్వీట్ చేశారు. సత్యానంద్(90877 87999) అనే వ్యక్తి సినిమాల్లోకి రావాలనుకునే వారే లక్ష్యంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారంటూ తెలిపారు. అతన ఓ ప్రముఖ సంస్థ జర్నలిస్ట్లా చెప్పుకుంటూ మోసాలకు చేస్తున్నారని.. ఇలాంటి వారి పట్ల బీ కేర్ఫుల్ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం బ్రహ్మజీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. (ఇది చదవండి: బిగ్ బాస్ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?) Another fraud guy from Tamilnadu Satydev 90877 87999.. these guys target upcoming actors.. now am getting compliments from new actors.. be careful guys.. — Brahmaji (@actorbrahmaji) October 5, 2023 Alert .. Ph no.. 78268 63455 Name-Natraj Annadurai - Hi everyone, the above number will pose as @Dir_Lokesh sir manager and tell your profile was selected for his next movie.. nd exact costumes will be required for they will bring as rent for which you need to pay and then… — Brahmaji (@actorbrahmaji) October 5, 2023 -
విజయ్ 'లియో' సినిమాపై పొలిటికల్ దెబ్బ
తమిళ చిత్రసీమలో టాప్ స్టార్లలో నటుడు విజయ్ ఒకరు. మల్టీ టాలెంటెడ్ నటుడు అయిన విజయ్కి తమిళ చిత్రసీమలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో విజయ్ నటించాడు. ఈ చిత్రంలో త్రిష, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్, అర్జున్, మన్సూర్ అలీఖాన్ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ రెండోసారి జతకట్టారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దీంతో లియో ఆడియో విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో లియో ఆడియో వేడక జరగనున్న నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్ అందింది. లియో సినిమా మ్యూజికల్ లాంచ్ కార్యక్రమం లేదని వార్త వచ్చింది. ఇదే విషయాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ప్రకటించింది. తన ఎక్స్ (ట్విటర్) ద్వారా ఒక పోస్ట్లో, వారు ఇలా అన్నారు. 'పాస్ల కోసం ఎక్కువ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చాయి. అంతే కాకుండా భద్రతా కారణాల వల్ల, మేము లియో మ్యూజిక్ లాంచ్ను నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాము. అభిమానుల కోరిక మేరకు మేము తరచుగా అప్డేట్లతో మీతో టచ్లో ఉంటాము. చాలామంది అనుకుంటున్నట్లుగా మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలేదు. అంతేకాకుండా మరేదైనా కారణం కూడా కాదు.' అని తెలిపారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!) ఈ పరిస్థితిలో విజయ్ అభిమానులు లియో విడుదల కార్యక్రమం రద్దు కావడం వెనుక స్టాలిన్ డీఎంకే ప్రభుత్వం ఉందని విజయ్ ఫ్యాన్స్ చెబుతూ #DMKFearsThalapathyVIJAY అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ అభిమానులు #LeoAudioLaunch #westandWithLeoతో సహా హ్యాష్ట్యాగ్లను వారు ట్రెండింగ్ చేస్తున్నారు. #DMKFearsTHALAPATHYVijay pic.twitter.com/VODZwCGNI9 — 𝙍ᴀᴊᴀ𝘿ᴜʀᴀɪ 💥🌐 (@rajubhaii09) September 26, 2023 .@actorvijay Na ❤️ Political Announcements Pannu Na **Thaa Ivanugala Senjividalam.#DMKFearsThalapathyVIJAY#WeStandWithLEO pic.twitter.com/8gZ4hJ53ol — AJITH Kumar (@ActorAJlTH) September 26, 2023 -
విజయ్ ‘లియో’కి బాయ్కాట్ సెగ.. కారణం ఆ గొడవేనా?
వారసుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. విక్రమ్తో కమల్హాసన్కు భారీ విజయాన్ని అందించిన లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత విజయ్కి జోడీగా త్రిష నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్ని క్రియేట్ చేశాయి. తమిళ్ ప్రేక్షకులే కాదు ఆలిండియా సినీ అభిమానులు సైతం లియో చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి తరుణంలో ఈ చిత్రానికి కేరళలో బాయ్కాట్ సెగ తగిలింది ట్రెండింగ్లో #KeralaBoycottLEO హ్యాష్ట్యాగ్ విజయ్కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన నటించిన సినిమాలు తెలుగు, కన్నడ, కేరళలో డబ్ అయి విజయం సాధించాయి. అందుకే లియో చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియా వైడ్గా విడుదల చేస్తున్నారు. కేరళలో కూడా విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కేరళలో లియో సినిమాకు వ్యతిరేకత ఎదురవుతుంది. లియో సినిమాను బహిష్కరించాలంటూ కొంతమంది కేరళ వాసులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ వ్యతిరేకతను తెలియజేయడంతో.. #KeralaBoycottLEO హ్యాష్ట్యాగ్ ఎక్స్(ట్విటర్)లో ట్రెండ్ అవుతోంది. మోహన్లాల్ అభిమానులే ఈ చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. కారణమేంటి? పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న లియో సినిమాకు కేరళలో వ్యతిరేకత ఎదురవడానికి మోహన్లాల్ అభిమానులే కారణం. వాళ్లు అలా ట్రోల్ చేయడానికి కూడా కారణం ఉంది. 2014లో మోహన్లాల్, విజయ్ కలిసి ‘జిల్లా’ అనే సినిమాలో నటించారు. ఆ చిత్రం విడుదలయ్యాక కొంతమంది విజయ్ ఫ్యాన్స్.. మోహన్లాల్ నటనను అవమానిస్తూ ట్వీట్లు చేశారు. అప్పట్లో ఆ ట్వీట్స్ బాగా వైరల్ అయ్యాయి. తమ హీరోని అవమానించారు కాబట్టే.. విజయ్ సినిమాను ఇక్కడ ఆడనివ్వమని మోహల్లాల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విజయ్కి వ్యతిరేకంగా #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి బాయ్కాట్ హీట్ తగిలితే మాత్రం నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. -
తమిళ్ సైమా విజేతలు వీరే.. బెస్ట్ హీరో, హీరోయిన్ ఎవరంటే?
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2023 తమిళం, మలయాళ సినిమాలలో తమ సత్తా చాటిన నటీనటులకు సెప్టెంబర్ 16న అవార్డులు ప్రదానం చేశారు. ఇప్పటికే తెలుగు,కన్నడ సినిమాలకు చెందిన అవార్డులు కార్యక్రమం పూర్తి అయిన విషయం తెలిసిందే. దీంతో సైమా అవార్డ్స్ 2023 వేడుక ముగిసింది. తమిళ్ నుంచి విక్రమ్ సినిమాకు గాను కమల్ హాసన్కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ సారి త్రిష,అనిరుధ్, కీర్తి సురేష్, మణిరత్నం,మాధవన్ వంటి సూపర్ స్టార్స్కు అవార్డ్స్ దక్కాయి. తమిళ చిత్ర సీమలో సైమా విజేతలు.. వారి వివరాలు * ఉత్తమ చిత్రం (తమిళం): (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ దర్శకుడు (తమిళం): లోకేష్ కనగరాజ్ (విక్రమ్) * ఉత్తమ నటుడు (తమిళం): కమల్ హాసన్ (విక్రమ్) * ఉత్తమ నటి (తమిళం): త్రిష కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ -1) * ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆర్ మాధవన్ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నటి (క్రిటిక్స్): కీర్తి సురేష్ (సాని కాయిదం) తెలుగులో చిన్ని * ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (విక్రమ్) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్-1) * ఉత్తమ సహాయ నటి : వాసంతి (విక్రమ్) ఏజెంట్ టీనా * ఉత్తమ సహాయ నటుడు (తమిళం): కాళీ వెంకట్ (గార్గి) * ఉత్తమ విలన్: ఎస్.జె.సూర్య (డాన్) * ఉత్తమ హాస్యనటుడు: యోగి బాబు (లవ్ టుడే) * ఉత్తమ గాయకుడు : కమల్ హాసన్ (విక్రమ్) పాతాళ పాతాల * ఉత్తమ గేయ రచయిత: ఇళంగో కృష్ణన్ (పొన్నియిన్ సెల్వన్ - 1) * ఉత్తమ నూతన నిర్మాత : గౌతం రామచంద్రన్ (గార్గి) * ఉత్తమ నూతన దర్శకుడు: ఆర్ మాధవన్ (రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్) * ఉత్తమ నూతన నటుడు: ప్రదీప్ రంగనాథన్ (లవ్ టుడే) * ఉత్తమ నూతన నటి: అదితి శంకర్ (విరుమాన్) * ఎక్స్ట్రార్డినరీ అచీవ్మెంట్ అవార్డు : మణిరత్నం * ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి (పొన్నియిన్ సెల్వన్ - 1) (ఇదీ చదవండి: శ్రావణ భార్గవికి రెండో పెళ్లి.. హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్) -
విజయ్ సినిమాకు షాకిచ్చిన సెన్సార్ బోర్డ్.. ఆ సీన్లు కట్!
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లియో. ఈ చిత్రంలో హీరోయిన్స్గా త్రిష, ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. (ఇది చదవండి: ఫైర్ మీదున్న అమర్.. రెండో వారం నామినేషన్స్లో ఎవరున్నారంటే?) అనిరుధ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలోని నాన్ రెడీ వరవా అనే పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. అయితే ఈ పాట మొదటి నుంచి వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ పాటలో విజయ్ పొగ తాగే సన్నివేశాలతో పాటు వివాదాస్పద పదాలు చోటు చేసుకోవడంతో పలు తమిళ సంఘాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా అనొచ్చు మక్కళ్ కట్చి నిర్వాహకురాలు రాజేశ్వరి ప్రియ చిత్రంలోని నాన్ రెడీ పాటకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్ సభ్యులు ఆ పాటలోని కొన్ని అభ్యంతర సన్నివేశాలను.. పాటలోని వివాదాస్పద పదాలను కట్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా విజయ్ సిగరెట్ పట్టుకుని క్లోజప్ సన్నివేశాలను తొలగించినట్లు తెలిసింది. అయితే ఈ పని పాట విడుదలకు ముందే చేస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ , దర్శకుడు మిష్కిన్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. (ఇది చదవండి: స్టైలిష్ లుక్లో ఉపాసన.. డ్రెస్ ధరెంతో తెలుసా?) -
రజనీకాంత్ 171 సినిమా ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ప్రకటన వచ్చేసింది. తన 171 చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్లు అదికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన X వెబ్సైట్లో ప్రచురించింది. సన్ పిక్చర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: పంచ్ ప్రసాద్కు ఆపరేషన్ పూర్తి.. అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం) సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహింస్తుండటంతో ఒక్కసారిగా భారీ అంచనాలు పెరిగిపోయాయి. కార్తీతో ఖైదీ, విజయ్తో మాస్టర్, కమల్ హసన్తో విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన డైరెక్ట్ చేసిన విషయం తెలిసందే. విక్రమ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఆయనకు రజనీకాంత్ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. అలాగే ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో రజనీకాంత్ 170వ చిత్రం జైలర్ ఆగస్టు 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది. జైలర్ విజయాన్ని పురస్కరించుకుని, సన్ పిక్చర్స్ చైర్మన్ కళానిధి మారన్, రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్లకు చెక్తో పాటు కార్లను బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత సినిమాలో పనిచేసిన 300 మందికి జైలర్ పేరుతో బంగారు నాణేన్ని బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంలో, సూపర్ స్టార్ రజనీకాంత్ 171 చిత్రాన్ని సన్ పిక్చర్స్ 'తలైవర్ 171' గా నిర్మించబోతున్నట్లు చిత్ర సంస్థ X వెబ్సైట్లో అధికారిక సమాచారాన్ని పోస్ట్ చేసింది. #Thalaivar171 అనే హ్యాష్ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. We are happy to announce Superstar @rajinikanth’s #Thalaivar171 Written & Directed by @Dir_Lokesh An @anirudhofficial musical Action by @anbariv pic.twitter.com/fNGCUZq1xi — Sun Pictures (@sunpictures) September 11, 2023 -
ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార రేంజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రేమ వ్యవహారం, పెళ్లి, పిల్లలు ఇలా అన్ని విషయాల్లోనూ తాను సంచలనమే. వయసు నాలుగు పదుల దగ్గర్లో ఉన్నా.. హీరోయిన్గా 75 చిత్రాల మైల్ స్టోన్ టచ్ చేసింది. అయినప్పటికీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆమె షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటించింది. తాజాగా సామాజిక మాధ్యమాల్లో నయన్ సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఆ ఇద్దరు కాదు.. స్టార్ హీరో సినిమాలో బాలీవుడ్ భామ..!) కోలీవుడ్లో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో నయన్ నటించబోతున్నారన్నదే లేటెస్ట్ టాక్. తొలి చిత్రం మా నగరం నుంచి ఈ మధ్య విడుదలైన విక్రమ్ వరకు అపజయం అనేది ఎరుగకుండా సక్సెస్ ఫుల్ ప్రయాణం చేస్తున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న లియో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా తదుపరి లోకేష్ కనకరాజు కోసం చాలా చిత్రాలు ఎదురుచూస్తున్నాయి. అందులో కమలహాసన్ నటించిన విక్రమ్ 2, కార్తీ హీరోగా ఖైదీ 2 వంటి భారీచిత్రాలు ఉన్నాయి. అలాంటిది అనూహ్యంగా నయనతార హీరోయిన్గా మరో చిత్రం గురించి వార్త వెలుగులోకి వచ్చింది. మరో విషయం ఏమిటంటే ఇందులో నటుడు లారెన్స్ కథానాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతన్నది తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: 'బిగ్బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే) -
తమిళ స్టార్ డైరెక్టర్స్తో రామ్చరణ్.. ఎందుకు కలిశాడు?
మెగా పవర్స్టార్ రామ్చరణ్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. అలానే తన తర్వాతి చిత్రం కోసం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి పనిచేయబోతున్నాడు. దీని తర్వాత చేయబోయే మూవీ కోసం లోకేశ్ కనగరాజ్ లాంటి దర్శకులు పేర్లు వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?) ఇలా రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో తమిళ టాప్ డైరెక్టర్స్తో కలిసి రామ్ చరణ్ కనిపించాడు. దీనికి కారణం దర్శకుడు శంకర్ పుట్టినరోజు కావడం. 'గేమ్ ఛేంజర్' సెట్లో ఆల్రెడీ బర్త్ డే జరుపుకొన్న శంకర్.. చెన్నై స్పెషల్గా పార్టీ అరేంజ్ చేశారు. ఈ పార్టీలో లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, వెట్రిమారన్, వెంకట్ ప్రభు, ఎస్జే సూర్య లాంటి దర్శకులు కనిపించారు. అయితే ఇది కేవలం పార్టీగా అయితే ఉండిపోదు. బహుశా ఈ దర్శకుల్లో చరణ్ తో సినిమా చేసే ప్లాన్ కూడా ఉండొచ్చు. కాబట్టి త్వరలో చరణ్-మరో తమిళ స్టార్ డైరెక్టర్ కాంబోలో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. (ఇదీ చదవండి: మెగాస్టార్ కొత్త సినిమా.. హారర్ థ్రిల్లర్ కథతో!) -
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కొత్త కారు.. ఎన్ని కోట్లో తెలుసా?
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ పేరు చెప్పగానే తమిళ్ వాళ్ల కంటే తెలుగు ప్రేక్షకులు అలెర్ట్ అయిపోతారు. ఎందుకంటే గ్యాంగస్టర్ సినిమాలతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. 'ఖైదీ', 'విక్రమ్'తో మన దగ్గర కోట్లాది మంది ప్రేక్షకుల్ని సొంతం చేసుకున్న లోకేశ్.. ఇప్పుడు కోట్లు విలువ చేసే ఖరీదైన కారు కొన్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: పెళ్లిపై హీరో వరుణ్తేజ్ కామెంట్స్.. అలా చేసుకుంటానని!) ప్రస్తుతం లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో డిఫరెంట్ సినిమాలు తీస్తున్న లోకేశ్ కనగరాజ్.. కార్తీతో 'ఖైదీ' తీశాడు. దానికి కమల్హాసన్ 'విక్రమ్' మూవీతో లింక్ చేశాడు. ఇప్పుడు దళపతి విజయ్తో 'లియో' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 20న ఇది థియేటర్లలోకి రానుంది. అంటే రెండు నెలల టైముంది. ఈ గ్యాప్లో కాస్ట్ లీ బీఎండబ్ల్యూ కారు కొనేశాడు. కార్లలో లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారుని ఇప్పుడు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత రూ.కోటి 70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. విజయ్ 'లియో' కోసం రూ.70 కోట్లు అందుకున్నాడనే టాక్ నడుస్తోంది. ఇలా హీరోలని మించి లోకేశ్ క్రేజ్ సంపాదించాడు. Lokesh Kanagaraj gets a brand new BMW 7 series car priced at ₹1.70 cr [Ex Showroom] pic.twitter.com/B2g7gehRfR — Manobala Vijayabalan (@ManobalaV) August 17, 2023 (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!) -
అర్జున్ బర్త్ డే.. అదిరిపోయిన గ్లింప్స్!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటిస్తోన్న చిత్రం లియో. ఈ చిత్రాన్ని లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిస్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఇవాళ ఆయన బర్త్ డే కావడంతో లియో మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. (ఇది చదవండి: విజయ్ 'లియో' కోసం మరోసారి కశ్మీర్కి!) అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ఆయన హరోల్డ్ దాస్ అనే క్యారెక్టర్లో అర్జున్ కనిపించనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేశ్ తన ట్విటర్లో షేర్ చేశారు. హ్యా బర్త్ డే అర్జున్ సార్ అంటూ.. థ్యాంక్యూ ఫర్ ఎక్స్ట్రార్డినరీ ఏఫర్ట్ అంటూ విషెస్ తెలిపారు. అయితే గ్లింప్స్ చూస్తే అర్జున్ ఫుల్ యాక్షన్ రోల్లో కనిపిస్తున్నారు. ప్రతి నాయకుడిగా ఓ రేంజ్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్ర దసరా సందర్భంగా అక్టోబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!) And now meet #HaroldDas 🔥🔥 Thank you @akarjunofficial sir for the extraordinary efforts you’ve put in for this film! Wishing our #ActionKing a very happy birthday! 🤜🤛 #Leo🔥🧊#GlimpseOfHaroldDas#HBDActionKingArjun pic.twitter.com/DQnhxXbRkh — Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 15, 2023 -
సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. క్రేజీ రోల్ చిత్రంపై క్లారిటీ!
కోలీవుడ్తో పాటు టాలీవుడ్లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూర్య ఒకరు. గతంలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ చిత్రంలో కమల్ హాసన్ రోలెక్స్ పాత్రలో అభిమానులను మెప్పించిన సంగతి తెలిసిందే. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న లుక్లో కమల్ హాసన్ కనిపించారు. డ్రగ్ మాఫియాను శాసించే రోలెక్స్ పాత్రలో సినిమా చూడాలని సూర్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే తాజాగా ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న సూర్య.. రాబోయే ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (ఇది చదవండి : పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ యంగ్ హీరో.. పోస్ట్ వైరల్!) సూర్య మాట్లాడుతూ..' ప్రస్తుతం నేను కంగువా సినిమాతో బిజీగా ఉన్నా. మేము అనుకున్న దానికంటే వందరెట్లు బాగా వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నా. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తా. దర్శకుడు వెట్రిమారన్ విడుదలై -2 చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత మా ఇద్దరి కాంబోలో వాడి వసల్ మొదలవుతుంది. ఇకపోతే లోకేశ్ కనగరాజ్ రోలెక్స్పై కథ చెప్పారు. అది చాలా బాగా నచ్చింది. అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఇరుంభుకై మాయావి చేస్తామని.' అన్నారు. ఈ వార్త విన్న సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మరోవైపు లోకేశ్ ప్రస్తుతం.. విజయ్తో లియో మూవీ చేస్తున్నారు. కాగా.. సూర్య ప్రస్తుతం నటిస్తోన్న కంగువ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయికగా నటిస్తోంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పది భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. (ఇది చదవండి : చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య, వీడియో కాల్ చేసి..) -
విజయ్ 'లియో' కోసం మరోసారి కశ్మీర్కి!
దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లియో. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. త్రిష, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్, మిష్కిన్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం, మనోజ్ పరమహంస ఛాయగ్రహణం అందిస్తున్నారు. కాగా ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో భారీ ఎత్తున నిర్మించడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' కొత్త పోస్టర్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్!?) లియో చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన విడుదల చేయనున్నట్లు నిర్మాత ఇప్పటికే వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన విజయ్.. విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన యూనిట్తో మళ్లీ షూటింగ్ చేయడానికి కశ్మీర్కు వెళ్లారన్నది తాజా సమాచారం. ఇప్పుడిదే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు విషయం ఏమిటంటే 'లియో' షూటింగ్ ఇంతకు ముందు కశ్మీర్లో చేశారు. అయితే అక్కడ ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉందట. దీంతో ఆ వర్క్ పూర్తి చేయడానికి లియో చిత్ర యూనిట్ మళ్లీ కశ్మీర్కు వెళ్లారు. అక్కడ 10 రోజులు షూటింగ్ నిర్వహించి చైన్నె తిరిగి వస్తారని తెలిసింది. ఇందులో విజయ్ పార్ట్ ఏం లేదని తెలుస్తోంది. ఇకపోతే 'లియో'పై తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలున్నాయి. 'విక్రమ్', 'ఖైదీ' చిత్రాలతో దీనికి లింక్ ఉండటమే కారణంగా తెలుస్తోంది. (ఇదీ చదవండి: మహేశ్బాబు గురించి ఇవి మీకు తెలిసే ఛాన్స్ లేదు!) -
విక్రమ్ కోసం కథ సిద్ధం చేస్తున్న స్టార్ డైరెక్టర్
సినిమా పరిశ్రమలో వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్ నటుడు విక్రమ్. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం 'తంగలాన్'. ఈ చిత్రం కోసం విక్రమ్ చాలా ఢిపరెంట్గా మేకోవర్ అయ్యారు. ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో ఆ చిత్రం మూడ్ నుంచి బయటపడ్డ విక్రమ్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది ఆయన నటించనున్న 62వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి క్రేజీ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తాజా సమాచారం. ప్రస్తుతం ఈయన విజయ్ కథానాయకుడిగా 'లియో' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: రవితేజని ఫాలో అయిపోతున్న తమ్ముడి కొడుకు) ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 'లియో' చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత విక్రమ్ కోసం లోకేష్ కనకరాజ్ కథను సిద్ధం చేసే పనిలో ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని ఆయన శిష్యుడు మహేష్ బాలసుబ్రమణ్యం దర్శకత్వం వహించినట్లు సమాచారం. అదే విధంగా ప్రస్తుతం విజయ్ హీరోగా 'లియో' చిత్రాన్ని నిర్మిస్తున్న సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత లలిత్కుమార్ విక్రమ్ హీరోగా నటించే చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటుడు విక్రమ్ ప్రస్తుతం ప్రత్యేకంగా పొటో సెషన్ ఏర్పాటు చేసుకుని దిగిన డిఫరెంట్ గెటప్లలో ఫొటోలను తీయించుకుని వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఆ స్టైలిష్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నారు. -
ఫాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన విజయ్
-
విజయ్ 'లియో' ఫస్ట్లుక్.. ఇది గమనించారా?
దళపతి విజయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. పాజిటివో, నెగిటివో ఎప్పటికప్పుడు మన దగ్గర సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాడు. మరీ ముఖ్యంగా మన దగ్గర కొందరు నెటిజన్స్ ఇతడిని తెగ ట్రోల్స్ చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న ఓ మూవీ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ పేరుకే తమిళ డైరెక్టర్. కానీ తెలుగులోనూ కల్ట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలే దీనికి కారణం.. ఈ రెండు చిత్రాల్ని లింక్ చేస్తూ LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) సృష్టించాడు. ఇప్పుడు విజయ్ తో చేస్తున్న 'లియో' కూడా ఇందులో భాగమేనని అంటున్నారు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా లియో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: హద్దులు దాటేస్తున్న తమన్నా.. 'లస్ట్ స్టోరీస్ 2'లో కూడా!) ఈ పోస్టర్ లో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్లు చూపించారు. వెనక మంచు కొండలు, ఓ తోడేలు, ఓ వ్యక్తి ఊడిన పళ్లు, చేతిలో సుత్తి, దానితో పాటు గాల్లో రక్తం చూస్తుంటే.. విలన్ గ్యాంగ్ మనుషులు విజయ్ పై దాడి చేయడానికి వస్తే వాళ్లని తుక్కురేగ్గొట్టినట్లు కనిపిస్తుంది. గతంలో మూవీ నుంచి ఓ వీడియో రిలీజ్ చేసినప్పుడు టైటిల్ గోల్డ్ కలర్ లో ఉంది. ఈ ఫస్ట్ లుక్ లో మాత్రం రక్తంతో నిండిపోయింది. అయితే విజయ్ తో పాటు ఈ ఫొటోలో ఉన్న పన్ను, రక్తంతో ఉన్న చేయి సంతానం(విజయ్ సేతుపతి) దే అని తెలుస్తోంది. విక్రమ్ లో సంతానం పాత్రని ఓ సారి గుర్తుచేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా స్పష్టత రావాలంటే మాత్రం ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబరు 19న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్ నెలకొంది. దాదాపు రూ.27 కోట్ల వరకు పలుకుతున్నాయని అంటున్నారు. #LeoFirstLook pic.twitter.com/zephjhBVbu — Vijay (@actorvijay) June 21, 2023 (ఇదీ చదవండి: ఆ బిజినెస్లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?) -
ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.!
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2017లో తమిళంలో విడుదలైన మానగరం సినిమా ద్వారా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఖైదీ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు చూసేలా చేశాడు లోకేశ్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో లియో సినిమా చేస్తున్నారు. అయితే ఇటీవల హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా లోకేశ్ అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. హాలీవుడ్ డైరెక్టర్ క్వింటెన్ టరెంటీనోలా మాదిరిగానే పది సినిమాలు మాత్రమే చేస్తానని వెల్లడించారు. ఆ తర్వాత డైరెక్షన్ ఆపేస్తానని ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ( ఇది చదవండి: Adipurush: సినిమాను బ్యాన్ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ) లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ..'నాకు ఎలాంటి సుదీర్ఘమైన ప్రణాళికలు లేవు. సినిమా ఇండస్ట్రీలో శాశ్వతంగా ఉండిపోవాలని నాకు ఆలోచన లేదు. నేను సినిమాలు తీయాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చా. అందుకే మొదట షార్ట్ ఫిల్మ్స్ చేశా. నా టార్గెట్ కుదిరాకే ఈ పనిని వృత్తిగా స్వీకరించా. నేను పది సినిమాలు మాత్రమే చేస్తా. ఆ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తా.' అని అన్నారు. కాగా.. లోకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లియో కశ్మీర్లో భారీ షెడ్యూల్ను ఇటీవలే పూర్తి చేశారు. ప్రస్తుతం చెన్నైలోనే షూటింగ్ జరుగుతోంది. జులై చివరి నాటికి సినిమా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. సంజయ్ దత్, ప్రియా ఆనంద్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ మేనన్, మన్సూర్ అఖీఖాన్, శాండీ మాస్టర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ( ఇది చదవండి: ఒక్క నిమిషంలో 20 చీరలు.. ఆలియా అసలు ఎలా!?) -
హీరో విజయ్ ఇలా చేస్తారనుకోలేదు.. పోస్టర్పై తీవ్ర విమర్శలు!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'లియో'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎస్ లలిత్కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటి త్రిష , ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్దత్, నటుడు అర్జున్, మన్సూర్ అలీఖాన్ దర్శకుడు మిష్కిన్, గౌతమ్ వాసుదేవన్, శాండీ మాస్టర్, మాథ్యూథామస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: జీవితంలో ఏదీ అంతా ఈజీ కాదు: హీరోయిన్) మాస్టర్ చిత్రం తర్వాత విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రం చివరి దశకు చేరుకుంది. దీంతో చిత్రం గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఆడియో హక్కులు, ఓటీటీ హక్కును అంటూ ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు టాక్ వైరల్ అవుతోంది. తాజాగా మరో అప్డేట్ వెల్లడించారు. ఈనెల 22న నటుడు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని అలర్ట్ ఈగో నా రెడీ అనే పల్లవితో సాగే తొలి పాటను విడుదలైనట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో విజయ్ చేతుల్లో గన్ను, నోట్లో సిగరెట్ పెట్టుకుని ఫోర్స్గా కనిపించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పీఎంకే పార్టీ నేత రామదాసు విజయ్పై విమర్శలు గుప్పించారు. ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ విజయ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. చాలా కాలం క్రితం తన చిత్రాల్లో సిగరెట్లు కాల్చే సన్నివేశాలను, మద్యం తాగే సన్నివేశాలను చోటు చేసుకోవడాన్ని తాను అనుమతించనని వాగ్దానం చేశారన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ మాట తప్పి ఇప్పుడు లియో చిత్రంలో అలా రెండు అంశాలు చోటు చేసుకోవడం ఆయన అభిమానులను చెడు త్రోవ పట్టించడం కాదా అని ప్రశ్నించారు. (ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్) First Single #NaaReady on @actorvijay Anna's Birthday #Leo 🔥🧊 pic.twitter.com/xG5T46GWyR — Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 16, 2023 -
సినిమాలకు గుడ్బై చెప్పనున్న రజనీకాంత్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో సినిమాలకు గుడ్బై చెప్పనున్నారంటూ ఓ వార్త ఫిల్మీ దునియాలో వైరల్గా మారింది. 170కు పైగా సినిమాలు చేసిన ఆయన త్వరలో రిటైర్మెంట్ తీసుకోనున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్న చందంగా డైరెక్టర్ మిస్కిన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఈ ప్రచారం మొదలైంది. ఓ ఇంటర్వ్యూలో మిస్కిన్ మాట్లాడుతూ.. 'రజనీకాంత్ లియో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయితే బహుశా ఇదే ఆయన ఆఖరి చిత్రం కావచ్చు' అన్నాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇది చూసిన రజనీ ఫ్యాన్స్ 'మా తలైవా అప్పుడే సినిమాలకు బ్రేక్ తీసుకుంటాడా?', 'మీరు అబద్ధం చెప్తున్నారు, రజనీ అలాంటి నిర్ణయం తీసుకోడు' అంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి దీనిపై తలైవా ఏమని స్పందిస్తారో చూడాలి! ఇకపోతే రజనీకాంత్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. మరోపక్క రజనీ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో అతిథి పాత్ర పోసిస్తున్నాడు. ఆ తరువాత జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో నటించేందుకు కమిటయ్యాడు. చదవండి: పుష్ప శ్రీవల్లితో ఐశ్వర్య పంచాయితీ.. స్పందించిన రష్మిక మందన్నా -
రజనీకాంత్ సినిమాకు ఆ కండీషన్ పెట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్
తమిళ సినిమా: తాజాగా కోలీవుడ్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే అది రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజు కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం గురించే అన్నది గమనార్హం. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోపక్క తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రంలో రజినీకాంత్ అతిథి పాత్రను పోషిస్తున్నారు. తదుపరి జై భీమ్ చిత్రం జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రంలో నటించడానికి కమిట్ అయ్యారు. తాజాగా రజనీకాంత్ 171వ చిత్రం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. దీన్ని నిర్మించడానికి పలువురు నిర్మాతలు క్యూ కడుతున్నారు. అందులో నటుడు కమలహాసన్కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థ కూడా ఉండటం విశేషం. అయితే ఇప్పుడు సన్ పిక్చర్స్ సంస్థ ఈ అవకాశాన్ని తన్నుకుపోయినట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ నిర్మాతకు ఓ కండిషన్ పెట్టినట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనకు రూ. 40 కోట్లు పారితోషికం ఇస్తేనే రజిని చిత్రానికి దర్శకత్వం ఇస్తానని లోకేష్ కనకరాజ్ డిమాండ్ చేశారన్నదే ఆ టాక్. అయితే అంత మొత్తం ఇవ్వడానికి సన్ పిక్చర్స్ సంస్థ సుముఖంగా లేదని, దీంతో మరో దర్శకుడితో ఈ చిత్రాన్ని చేయాలని భావించినట్లు సమాచారం. కానీ తనకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావాలని రజనీకాంత్ పట్టుపట్టారని, దీంతో వేరే దారి లేక లోకేష్ కనకరాజ్ డిమాండ్కు తలొగ్గిన సన్ పిక్చర్స్ సంస్థ ఆయనకు రూ.40 కోట్లు పారితోషికం ఇవ్వడానికే సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. -
గేమ్ ఛేంజర్?
-
క్రేజీ కాంబో: రజనీకాంత్తో లోకేశ్ కనగరాజ్ భారీ ప్రాజెక్ట్!
ఏడుపదుల వయసులోనూ రజనీకాంత్ జోరుగా హుషారుగా సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతూ, బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే ‘జైలర్’ చిత్రంలో హీరోగా, ‘లాల్సలామ్’ చిత్రంలో అతిథి పాత్ర చేస్తున్నారాయన. ఇవి కాకుండా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న చిత్రం అంగీకరించారు. తాజాగా మరో సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో మంచి ఫామ్లో ఉన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల రజనీకాంత్ను కలిసి ఓ కథ వినిపించారని, ఈ స్క్రిప్ట్ రజనీకాంత్కి నచ్చిందని టాక్. ఈ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉందంటోంది చెన్నై సినిమా సర్కిల్. ఈ చిత్రాన్ని కమల్హాసన్ నిర్మించనున్నారని సమాచారం. -
'ఎముకలు కొరికే చలి, ముక్కులో రక్తం.. అయినా అన్నీ భరించారు'
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం 'లియో'. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష నటిస్తోంది. ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ జమ్మూ-కశ్మీర్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. అయితే ఈ మూవీ షూటింగ్కు సంబంధించి మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చిత్రబృందం పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తెల్లవారుజామున 3 గంటలకే జమ్మూ-కశ్మీర్లో ఎముకలు కొరికే చలిలో తెల్లవారుజామున 3 గంటలకే లేచి పనులు ప్రారంభించేవారమని చిత్రబృంద సభ్యులు తెలిపారు. సాయంత్రం అవ్వగానే ముక్కు నుంచి రక్తం కారేదని.. అయినా దాన్ని లెక్క చేయలేదని వివరించారు. చిత్రీకరణకు రాత్రిపూటే అనుకూలంగా ఉండేదని తెలిపారు. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్నందుకు కెమెరా లెన్స్లు స్పష్టంగా కనిపించేవి కావని వెల్లడించారు. ఈ షూటింగ్ జరుగుతుండగానే అసిస్టెంట్ డైరెక్టర్లలో ఒకరికి పెళ్లయింది. అయినా రెండు రోజులకే స్పాట్కు తిరిగొచ్చారు. మా టీమ్లో ఒకరికి బిడ్డ పుడితే ఇప్పటి వరకూ ఇంటికి కూడా వెళ్లలేదని తెలిపారు. అలాగే ఫోటోగ్రాఫర్ మనోజ్ తన తల్లిని కోల్పోయారు. ఆమె అంత్యక్రియలు ముగిసిన వెంటనే మళ్లీ వచ్చి చిత్రీకరణలో పాల్గొన్నారు.' అని చిత్రబృందంలోని సభ్యులు ఒకరు తెలిపారు. దీన్ని బట్టి సినిమాపై వారికి ఎంత ప్రేమో అర్థమవుతోంది. We take a bow ❤️ ▶️ https://t.co/ciFbaM6Shx Thank you to the amazing crew who poured their heart & soul into this project! Huge respect to our dedicated crew whose hard work has brought the magic to life on screen 🙏#TheCrewBehindLEO#Thalapathy @actorvijay @Dir_Lokesh #Leo — Seven Screen Studio (@7screenstudio) March 23, 2023 -
దటీజ్ విజయ్.. విడుదలకు ముందే రూ.400 కోట్ల బిజినెస్!
హిట్, ఫ్లాప్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టే అతికొద్ది మంది హీరోలలో కోలివుడ్ స్టార్ విజయ్ ఒకరు. ఆయన చిత్రానికి టాక్తో సంబంధం ఉండకుండా మొదటి మూడు రోజులు భారీగా కలెక్షన్స్ వస్తాయి. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం వసూళ్ల సునామే క్రియేట్ చేస్తుంది. సంక్రాంతికి విడుదలైన వారిసు(తెలుగులో వారసుడు) చిత్రమే అందుకు మంచి ఉదాహరణ. ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా.. అక్కడ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి విజయ్ స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. వారిసు తర్వాత విజయ్ ‘లియో’ అనే సినిమాలో నటిస్తున్నాడు. విక్రమ్ లాంటి సూపర్ హిట్ తర్వాత లోకేశ్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో నెట్టింట ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో అయిందట. ఇప్పటికే థియేట్రికల్, డిజిటల్, ఆడియో, శాటిలైట్ హక్కులతో సహా రూ. 400 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. కేవలం డిజిటల్ స్ట్రీమింగ్ కోసమే ప్రముఖ ఓటీటీ నెటిఫ్లిక్స్ రూ.120 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను సన్ టీవీ 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా సోనీ మ్యూజిక్ 18 కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసింది. ఇక హిందీ శాటిలైట్ హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయని సమాచారం. ఇలా మొత్తంగా రూ.240 వరకు నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రాగా, థియేట్రికల్ రైట్స్ రూ.175 కోట్ల వరకు అమ్ముడు పోయాయట. మొత్తానికి విడుదలకు ముందే విజయ్, లోకేశ్ల సినిమా సెన్సెషన్ క్రియేట్ చేసింది. మరి విడుదల తర్వాత ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. -
డైరెక్టర్తో గొడవలు.. లియో నుంచి తప్పుకున్న త్రిష?
హీరో విజయ్ తాజా చిత్రం లియో షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్ఎస్ లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. త్రిష కథానాయికగా కనిపించనుంది. మరో హీరోయిన్గా ప్రియా ఆనంద్ను ఎంపిక చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్దత్, మన్సూర్ అలీఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఇటీవలే కాశ్మీర్కు వెళ్లింది. అక్కడ నెలకుపైగా భారీ షెడ్యూల్ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇక్కడే సమస్య మొదలైంది. కాశ్మీర్లో చలి వణికిస్తోందట. లియో చిత్ర యూనిట్ చలితో ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. దీంతో చిత్ర యూనిట్ అక్కడ షూటింగ్ను త్వరగా పూర్తి చేసుకుని అనుకున్న దాని కంటే ముందుగానే చెన్నైకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే త్రిష మాత్రం ఇప్పటికే చెన్నైకి వచ్చేసిందని ప్రచారం జరుగుతుండగా, ఆమె రావడానికి చలి కారణం కాదని, చిత్రంలో త్రిష పాత్ర పరిధి తక్కువని, నటి ప్రియా ఆనంద్నే ప్రధాన హీరోయిన్ అని టాక్ వైరల్ అవుతోంది. త్రిష ఫ్లాష్బ్యాక్లో మాత్రమే కనిపిస్తుందని తెలియడంతో ఆమె దర్శకుడు లోకేశ్ కనకరాజ్తో గొడవ పడినట్లు, దీంతో చిత్రం నుంచి వైదొలగినట్లు మరో పక్క ప్రచారం వైరల్ అవుతోంది. దీని గురించి త్రిష తల్లి ఉమ స్పందించారు. త్రిషపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఆమె లియో చిత్రం నుంచి వైదొలగలేదని వివరణ ఇచ్చారు. కాగా సుమారు 14 ఏళ్ల తరువాత త్రిష, విజయ్తో జత కడుతున్న చిత్రం లియో కావడం గమనార్హం. చదవండి: ఉలవచారు బిర్యానీ ఇష్టం: రాజ్కుమార్ -
Vijay67: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ కొత్త చిత్రం ప్రారంభం (ఫొటోలు)
-
Thalapathy67: అప్పుడు ‘మాస్టర్’.. ఇప్పుడు గ్యాంగ్స్టర్!
‘మాస్టర్’ తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కుతుందనే విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ని ఇచ్చింది నిర్మాణ సంస్థ 7స్క్రీన్ స్టూడియో. ‘మాస్టర్, వారిసు తర్వాత విజయ్తో కలిసి పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. #Thalapathy37(వర్కింగ్ టైటిల్)కు లోకేశ్ కనగరాజ్దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 2 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందన్ , సినిమాటోగ్రఫీ మనోస్ పరమహంస అందిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’అని 7స్క్రీన్ స్టూడియో ఒక ప్రకటనలో తెలిపింది. గ్యాంగ్స్టర్ థ్రిల్లర్గా ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. The one & the only brand #Thalapathy67, is proudly presented by @7screenstudio 🔥 We are excited in officially bringing you the announcement of our most prestigious project ♥️ We are delighted to collaborate with #Thalapathy @actorvijay sir, for the third time. @Dir_Lokesh pic.twitter.com/0YMCbVbm97 — Seven Screen Studio (@7screenstudio) January 30, 2023 -
అవకాశాలు రావడం లేదంటూ నటి ఆవేదన
'మసాలా పాదం' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది తమిళ నటి రేష్మ పసుపులేటి. పలు సినిమాల్లో నటించిన ఆమె తమిళ బిగ్బాస్ షోలోనూ పాల్గొంది. ప్రస్తుతం భాగ్యలక్ష్మి సీరియల్ చేస్తున్న ఆమె తనకు పెద్దగా అవకాశాలు రావడం లేదని వాపోయింది. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టింది. 'నాకు లోకేశ్ కనగరాజన్ సినిమాలో నటించాలనుంది. కానీ ఆయన్ను ఎలా సంప్రదించాలో తెలియడం లేదు. ఎవరైనా నన్ను ఆయన దగ్గరకు చేర్చండి. ఇండస్ట్రీకి వచ్చి 12 ఏళ్లవుతోంది.. కానీ సరైన అవకాశాలు లేవు. మా కంటే కొత్తగా వచ్చినవారికే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. దాన్ని నేను పూర్తిగా తప్పుపట్టడం లేదు. కానీ ఇది నిజంగా అన్యాయం. ఈ అసమానతలు లేని సిస్టమ్ రావాలి' అని ట్వీట్ చేస్తూ దానికి కొన్న ఫోటోలు జత చేసింది రేష్మ. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. 'ఇప్పటిదాకా నటించింది చాలులే.. నిన్ను టీవీలో చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది నేరుగా చూస్తే ఏమైపోవాలో!పైగా నీకంత యాక్టింగ్ కూడా రాదు. ముందు నీ వృత్తి మార్చుకో' అని సెటైర్లు వేస్తున్నారు. Wanna be a part @Dir_Lokesh I don’t know how to get to him. Someone hook up a sista #pro #ontheprowl #beenintheindustry12years someone’s gotta do me rite I mean the new bees get more opportunities than us. No offence but it’s https://t.co/mzW9lpLfRw gotta change y’all ❤️ pic.twitter.com/KeJHQOmhjF — Reshma Pasupuleti (@reshupasupuleti) January 24, 2023 చదవండి: అతియా- రాహుల్ పెళ్లి.. ఆడి కారు, లక్షల విలువైన బైకు, ఫ్లాట్.. ఇంకా.. -
రోలెక్స్ కథలోకి విక్రమ్.. కమల్, సూర్యలతో స్క్రీన్ షేరింగ్!
గతేడాది కోలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలల్లో విక్రమ్ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెల్సిందే. ఈ ఒక్క సినిమాతో కమల్ మళ్లీ స్టార్ డమ్ అందుకున్నాడు.ఇదే సినిమాతో సూర్య కూడా రోలెక్స్గా ఫుల్లుగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఒక్క సినిమా ఇంత మంది స్టార్స్ లైఫ్స్ మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు.అందుకే ఇప్పుడు విక్రమ్ వరల్డ్ లోకి నిజంగానే విక్రమ్ అడుగు పెడుతున్నాడు. వాస్తవానికి ఈ రోలెక్స్ క్యారెక్టర్ కోసం ముందుగా విక్రమ్ని సంప్రదించారట దర్శకుడు లోకేశ్. అయితే క్యారెక్టర్ చిన్నగా ఉందని విక్రమ్ రిజెక్ట్ చేసాడట. దాంతో సేమ్ క్యారెక్టర్ కోసం సూర్య దగ్గరికి వెళ్లగా,ఆయన కమల్ మీద అభిమానంతో రోలెక్స్ క్యారెక్టర్ చేశాడు. క్లైమాక్స్ లో ఈ క్యారెక్టర్ పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అందుకే ఫ్యూచర్ లో రోలెక్స్ క్యారెక్టర్ తోనే పూర్తిస్థాయి సినిమా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.ఇదంతా గతం.ఇప్పుడు లేటెస్ట్ స్టోరీ ఏంటంటే విక్రమ్ లో హీరో విక్రమ్ ఛాన్స్ మిస్ అయ్యాడు. అందుకే అతడిని కమల్ హీరోగా తెరకెక్కే విక్రమ్ -2లో నటింపజేస్తున్నాడట లోకేశ్. ఒకే సినిమాలో కమల్, విక్రమ్, సూర్య కలసి నటిస్తే ఆ సినిమా పై ఎక్స్ పెక్టేషన్స్ ఏ లెవల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. -
వారీసు సినిమా చూశా.. త్వరలోనే గుడ్ న్యూస్: లోకేశ్
తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం వారిసు. భారీ అంచనాల మధ్య ఈనెల 11న ఈ చిత్రం విడుదలైంది. అయితే విజయ్.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించడానికి విజయ్ సిద్ధమైనట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు మాస్టర్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది విజయ్ 67వ చిత్రం కాగా.. ఇందులో త్రిష హీరోయిన్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ గ్యాంగ్స్టర్గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధింన పూర్తి వివరాలు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూడా ఈ చిత్రంపై మౌనం వహిస్తున్నారు. కాగా బుధవారం విడుదలైన వారిసు చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనకరాజ్ చెన్నైలోని థియేటర్లో ప్రేక్షకుల మధ్య చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..'వారిసు చిత్రం విడుదల కోసం ఎంతో అత్రుతగా ఎదురు చూశా. ఇకపై విజయ్ 67వ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. ఇది విజయ్ అభిమానుల్లో జోష్ నింపుతుంది.' అని అన్నారు. గ్యాంగ్స్టర్ థ్రిల్లర్గా ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మాస్టర్ భారీ విజయం తర్వాత దళపతి విజయ్తో లోకేష్ కనగరాజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ ప్రాజెక్ట్తో తమిళ సినిమా రంగ ప్రవేశం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, అర్జున్ దాస్ సహా స్టార్ తారాగణం నటిస్తున్నారు. -
'విక్రమ్' డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో జయంరవి
తమిళసినిమా: మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ నాలుగే ఛిత్రాలతో స్టార్ దర్శకుల పుట్టింట్లో చేరిన యువదర్శకుడు లోకేష్ కనకరాజ్. తాజాగా రెండోసారి విజయ్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే సైలెంట్గా మొదలైంది. ఇందులో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇతర ముఖ్య పాత్రల్లో బాలీవుడ్ నటుడు సంజయ్దత్, దర్శకుడు గౌతమ్మీనన్, అర్జున్, దర్శకుడు మిష్కిన్ భారీ తారాగణం నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 7స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రారంభం దశలోనే లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రానికి స్కెచ్ వేసినట్లు తాజా సమాచారం. ఈయన తదుపరి హీరో జయంరవి అనే విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు కలిసిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయమై జయంరవి ఒక భేటీలో పేర్కొంటూ లోకేష్ కనకరాజ్ తనకు ఇటీవల ఒక కథ చెప్పారని, అది తనను విస్మయపరిందన్నారు. దీంతో వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుంది అనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఈయన సైరన్, ఇరైవన్, ఎం.రాజేష్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. ఇకపోతే ఈయన నటింన అఖిలన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
విజయ్ క్రేజ్ మామూలుగా లేదుగా
దళపతి విజయ్ చిత్రం అంటేనే క్రేజ్. ఆయన చిత్రాల కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తుంటారో, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతగా ఎదురు చూస్తుంటారు. ఆయన చిత్రాలు హిట్, ప్లాప్లకు అతీతం అనవచ్చు. అలాంటి నటుడు తాజాగా వారసుడు చిత్రంతో టాలీవుడ్లో వసూళ్లు కొల్లగొట్టడానికి సిద్ధం అవుతున్నారు. పొంగల్కు తమిళంతో పాటు తెలుగు, మళయాళం తదితర భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో విజయ్ నటించనున్న ఆయన 66వ చిత్రంపైనా ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. కారణం విజయ్ మాత్రమే కాదు దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కూడా. ఈ దర్శకుడు చేసింది నాలుగే చిత్రాలైనా, లేటెస్ట్గా కమలహాసన్ కథానాయకుడిగా తెరకెక్కించిన విక్రమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. తాజాగా నటుడు విజయ్తో చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు రూపొందిన మాస్టర్ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా క్రేజీ కాంబినేషన్లను కల్పించడంలో లోకేశ్ కనకరాజ్ దిట్ట. ఇప్పుడు విజయ్ హీరోగా చేస్తున్న కాంబో అంతకు మించి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ ముంబాయి డాన్గా నటించబోతున్నారని తెలిసింది. చదవండి: (ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్) ఇందులో బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్, నటుడు విశాల్ విలన్లుగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. అదే విధంగా ఉలగనాయకుడు కమలహాసన్ గెస్ట్ రోల్లో మెరవబోతున్నట్లు వార్త వైరల్ అవుతోంది. ఇకపోతే నటి త్రిష కథానాయకిగా ఇదివరకే ఎంపికయ్యారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభానికి ముందు వ్యాపార పరంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. చిత్ర శాటిలైట్ హక్కులను సన్ పిక్చర్స్ సంస్థ, డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. చిత్ర ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ బిజీగా ఉన్నారు. డిసెంబర్ నెలలో ఈ చిత్రం వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. -
ప్రభాస్ ప్యాన్స్ కు గుడ్ న్యూస్ ..!
-
లోకేశ్ కనగరాజ్ సినిమా: విజయ్కి గెస్ట్గా కమల్
విజయ్కి కమల్హాసన్ గెస్ట్ కానున్నారట. కోలీవుడ్లో ప్రచారంలో ఉన్న వార్త ఇది. ‘మాస్టర్’ వంటి హిట్ తర్వాత విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలోనే కమల్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారని టాక్. కమల్ గత చిత్రం ‘విక్రమ్’కి లోకేశ్ కనగరాజ్ దర్శకుడనే విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్టయింది. మూడువందల కోట్లకు పైగా వసూలు చేసి, సంచలనం సాధించింది. ఒక సీనియర్ నటుడు నటించిన చిత్రం ఈ స్థాయి వసూళ్లు సాధించడం అంటే సంచలనమే కదా. అందుకే విజయ్ హీరోగా తాను రూపొందించనున్న తాజా చిత్రంలో గెస్ట్ రోల్ చేయమని లోకేశ్ కోరితే కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
బాలీవుడ్లో దూసుకెళ్తున్న కోలీవుడ్ డైరెక్టర్స్.. స్టార్ హీరోలతో సినిమాలు!
బాలీవుడ్ హీరోలు కొందరు తమిళం నేర్చుకునే పనిలో ఉన్నారు. కానీ వారు తమిళ సినిమాల్లో నటించడం లేదు. మరి ఎందుకు భాష నేర్చుకుంటున్నారంటే తమిళ దర్శకులతో సెట్స్లో కమ్యూనికేషన్ కోసం అన్నమాట. ఎందుకంటే ఆ తమిళ దర్శకులతో ఈ హీరోలు ‘వాంగ వణక్కం’ (రండి.. నమస్కారం) అంటూ హిందీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్లు–బాలీవుడ్ హీరోల కాంబినేషన్ చిత్రాల గురించి తెలుసుకుందాం. బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ ప్రస్తుతం మూడు (పఠాన్, జవాన్, డంకీ) సినిమాలు చేస్తున్నారు. వీటిలో ‘జవాన్’ సినిమాకు అట్లీ దర్శకుడు. తమిళంలో ‘రాజా రాణి’, ‘తేరి’, ‘మెర్సెల్’, ‘బిగిల్’ వంటి హిట్ చిత్రాలను అట్లీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హిందీలో అట్లీకి ‘జవాన్’ తొలి చిత్రం. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా అగ్రతార నయనతార నటిస్తున్నారు. హిందీలో నయనతారకు కూడా ‘జవాన్’ తొలి చిత్రం కావడం ఓ విశేషం. ‘జవాన్’ చిత్రం వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ కానుంది. (చదవండి: మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా?) ఇంకోవైపు తమిళ దర్శకుడు శంకర్తో సినిమాకి సై అన్నారు రణ్వీర్ సింగ్. 2005లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) మంచి విజయం సాధించింది. పదిహేను సంవత్సరాల తర్వాత ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లుగా ప్రకటించారు దర్శకుడు శంకర్. ఈ సినిమా షూటింగ్ ఈపాటికే ఆరంభం కావాల్సింది కానీ ‘అన్నియన్’ హిందీ రీమేక్ హక్కుల విషయంలో చిన్న వివాదం నడుస్తోంది. ప్రస్తుతం కమల్హాసన్తో శంకర్ ‘ఇండియన్ 2’, రామ్చరణ్తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చాక శంకర్ ‘అన్నియన్’ హిందీ రీమేక్ను ఆరంభిస్తా రని ఊహించవచ్చు. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత హిందీలో శంకర్ చేయనున్న సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ‘ఒకే ఒక్కడు’ని హిందీలో ‘నాయక్’ (2001)గా తెరకెక్కించారు శంకర్. ఇక 2017లో విడుదలైన ‘విక్రమ్ వేదా’ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. పుష్కర్–గాయత్రి ద్వయం ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ అయ్యింది. సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించారు. తమిళ ‘విక్రమ్ వేదా’కు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే హిందీ రీమేక్నూ తెరకెక్కించారు. పుష్కర్– గాయత్రి ద్వయానికి హిందీలో ఇదే తొలి సినిమా. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 30న విడుదల కానుంది. మరోవైపు తక్కువ టైమ్లో కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్ హిందీలో ఓ సినిమా చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో లోకేశ్ కనగరాజ్ ఓ సినిమా (తమిళ సినిమా ‘మాస్టర్’ హిందీ రీమేక్) చేయాల్సింది. కానీ కుదర్లేదు. అయితే సల్మాన్తో లోకేశ్ వేరే ఓ సినిమా చేయనున్నారని కోలీవుడ్ టాక్. ఇంకోవైపు రజనీకాంత్తో ‘కబాలి’, ‘కాలా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్ హిందీలో ఓ సినిమా కమిట్ అయ్యారు. జార్ఖండ్కు చెందిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ బిర్సా జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా, ‘జై భీమ్’ సినిమాతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ రాజా హిందీలో ఓ సినిమా చేయనున్నారు. ‘దోసా కింగ్’గా చెప్పుకునే పి. రాజగోపాల్ జీవితంలోని ముఖ్య ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. రాజగోపాల్, జీవ జ్యోతి శాంతకుమార్ల కోర్టు కేసు ప్రధానాంశంగా ఈ సినిమా రూపొందనుంది. వీరితోపాటు మరికొందరు తమిళ దర్శకులు హిందీలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. -
విజయ్-లోకేశ్ కనకరాజుల మూవీ.. వైరల్గా స్క్రిప్ట్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వరీసు(తెలుగులో వారసుడు) మూవీతో బీజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత ‘విక్రమ్’ డైరెక్టర్ లోకేశ్ కనకరాజుతో ఓ సినిమా చేయనున్నాడు. విజయ్-లోకేశ్ కనకరాజ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మాస్టర్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెపన్కర్లేదు. దీంతో వీరిద్దరు కాంబో వచ్చే ఈ చిత్రంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ను ప్రకటించినప్పుటి నుంచి ఈ మూవీ కథేంటి, ఈసారి ఏ థీమ్తో రాబోతున్నారనేది ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. చదవండి: శృంగార జీవితంపై హీరోయిన్ తాప్సీ బోల్డ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో ఈ మూవీ సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టించ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం.. ఈ సినిమా గ్యంగ్స్టర్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దళపతి 67వ చిత్రంగా రాబోతున్న ఇందులో విజయ్ ఓ దాదాగా కనిపించనున్నాడట. ఇక ఇందులో విజయ్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడని సమాచారం. అంతేకాదు దాదాగా రేంజ్ తగ్గట్టుగా ఆరుగురు పవర్ఫుల్ విలన్స్ విజయ్ తలబోతున్నాడట. ఈ క్రమంలో విజయ్ వారిపై వేసే ఎత్తులు సస్పెన్స్ థ్రిల్లర్ ఉండనున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. చదవండి: హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటి మాలాశ్రీ కూతురు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ మెయిన్ విలన్గా కనిపంచనున్నాడని వినికిడి. సంజయ్తో పాటు మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్, టాలీవుడ్ నుంచి కూడా ఓ ప్రముఖ నటుడిని ప్రతికథానాయకులుగా ప్లాన్ చేస్తున్న ఫిలిం దూనియాలో గుసగుల వినిపిస్తున్నాయి. మరి ఈ కథపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఇటీవల విజయ్తో తన ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన లోకేశ్ కనకరాజు ఇటీవల తాత్కాలికంగా సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించి స్రీప్ట్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో కథ ఇలా బయటకు రావడంపై పలు సందేహాలు నెలకొన్నాయి. మరి దీనిపై దర్శకుడు, మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
విజయ్తో త్రిష.. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు
హీరో విజయ్తో హీరోయిన్ త్రిష మరోసారి జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ‘మాస్టర్’ (2021) తర్వాత విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుందని టాక్. ఆల్రెడీ ఈ చిత్రంలో సమంత ఓ హీరోయిన్గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ మూవీలో మరో హీరోయిన్ పాత్రలో త్రిష యాక్ట్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. లోకేష్ అండ్ టీమ్ ఇప్పటికే త్రిషను సంప్రదించారట. కాగా ‘గిల్లి’ (2004), ‘తిరు పాచ్చి’ (2005), ‘ఆతి’(2006), ‘కురివి’(2008) చిత్రాల్లో విజయ్, త్రిష కలిసి నటించారు. తాజా సినివలో మరోసారి వీరిద్దరూ నటిస్తే దాదాపు 14 సంవత్సరాల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. మరి.. విజయ్తో త్రిష ఐదోసారి జోడీ కడతారా? వే చూడాలి. -
ఫ్యాన్స్కి షాక్.. సోషల్ మీడియాకు ‘విక్రమ్’ డైరెక్టర్ బ్రేక్..
మాస్టర్, విక్రమ్ వంటి చిత్రాలతో కోలీవుడ్కు బ్లాక్బస్టర్ హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ లోకేశ్ కనకరాజు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ షాక్కు గురవుతున్నారు. ఆయన తదుపరి సినిమా ఎప్పుడేప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆయన తాజా నిర్ణయంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘హే గాయ్స్.. నేను అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి చిన్న విరామం తీసుకుంటున్నాను. నేను నా నెక్ట్స్ సినిమా ప్రకటనతో తిరిగి వస్తాను. అప్పటి వరకు అందరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా. లవ్ యూ’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా దాదాపు నాలుగేళ్లుగా సక్సెస్ లేని కమల్ హాసన్కు ఈ యంగ్ డైరెక్టర్ విక్రమ్తో బ్లాక్బస్టర్ హిట్ అందించాడు. ఈ మూవీ దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళు చేసి సంచలన రికార్డు క్రియేట్ చేసింది. లోకేశ్ ‘విక్రమ్’ తెరకెక్కించిన తీరుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో తెలుగు, తమిళంలో ఆయన పేరు మారిమ్రోగిపోతుంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! ఆయన నేరుగా తెలుగు హీరోతో ఓ సినిమా చేస్తే బాగుండు అని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటుంటే.. విజయ్తో చేసే ఆయన నెక్ట్ మూవీ అప్డేట్ ఎప్పుడేప్పుడా కోలీవుడ్ ఆడియన్స్ వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాక షార్ట్ బ్రేక్ తీసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకు ఆయన సడెన్ నిర్ణయం తీసుకున్నారని, అంటే ఇప్పుట్లో విజయ్ సినిమా రానట్టేనా? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా విజయ్తో తన తదుపరి ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ఇటీవల లోకేశ్ కనకరాజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. Hey guys ✨ I'm taking a small break from all social media platforms... I'll be back soon with my next film's announcement 🔥 Till then do take care all of you.. With love Lokesh Kanagaraj 🤜🏼🤛🏼 — Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 1, 2022 -
‘విక్రమ్’ మేకింగ్ వీడియో చూశారా?.. డైరెక్టర్ ఫోకస్కు నెటిజన్లు ఫిదా!
ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 350 కోట్లకు పైగా వసూళు సాధించి కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చదవండి: కానిస్టెబుల్గా విశాల్.. ఏడేళ్ల పిల్లాడికి తండ్రిగా హీరో రోల్ ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా డిస్నీప్లస్ హాట్స్టార్ విడుదల చేసింది. 6 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో దాదాపు యాక్షన్ సీన్స్కు సంబంధించిన మేకింగ్ సన్నివేశాలను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. ఫహద్ ఫాజిల్ సీన్తో మొదలైన ఈ మేకింగ్ వీడియోలో విజయ్ సేతుపతి, కమల్కు సంబంధిచిన పలు భారీ యాక్షన్ సీన్స్తో పాటు మూవీలో హైలేట్గా నిలిచి ఫైట్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరును చూపించారు. చదవండి: ‘ధాకడ్’ మూవీ ఫ్లాప్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా ఇందులో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ను చూస్తుంటే ప్రతి సీన్లో కోసం ఆయన ఎంతటి జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. మేకింగ్తో పాటు హీరో, విలన్ లుక్స్లోనూ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొన్ని చోట్ల ఫైట్ సీన్స్ కోసం లోకేశ్.. కమల్ లుక్కు స్వయంగా మెరుగులు దిద్దుతూ కనిపించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి మేకింగ్కు ఫిదా అవుతున్నారు. దీంతో ఆయనపై నెట్టింట ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘విక్రమ్ మేకింగ్, ప్రతి ఫ్రేమ్లో విషయంలో మీరు పెట్టిన ఫోకస్ కనిపిస్తుంది’,‘ఈ సినిమా కోసం మీరు పెట్టిన ఎఫర్టే విక్రమ్ సక్సెస్’ అంటూ లోకేశ్ కనకరాజ్ను కొనియాడుతున్నారు. -
అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు
ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సూపర్ హిట్ కమ్బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్గా మారింది. జూన్ 3న విడుదలై సక్సెస్ సాధించడమే కాకుండా జులై 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టిన 'విక్రమ్' సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ మూవీపై టాలీవుడ్ సూపర్స్టార్ మహేశ్ బాబు పొగడ్తల వర్షం కురిపించాడు. ఇప్పటి సినిమాల్లో న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ మూవీగా అభివర్ణించాడు. 'విక్రమ్ బ్లాక్బస్టర్ సినిమా. ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం. లోకేశ్ కనకరాజ్.. నేను మిమ్మల్ని కలిసి విక్రమ్ మూవీ ప్రారంభం నుంచి చివరి వరకు షూటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ తమ అద్భుతమైన నటనతో మెరిపించేశారు. అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. చాలాకాలం తర్వాత నా ప్లే లిస్ట్ టాప్లో విక్రమ్ ఉంది. ఇక చివరిగా లెజెండ్ కమల్ హాసన్ నటన గురించి చెప్పేందుకు నాకు అర్హత లేదు. ఒక అభిమానిగా చాలా గర్వంగా ఉంది. మీకు, మీ అద్భుతమైన బృందానికి శుభాకాంక్షలు.' అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చదవండి: ఫ్రెండ్తో బెడ్ షేర్.. అబార్షన్.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి 3 సార్లు పెళ్లి వరకు.. దేవుడు దయతో బయటపడ్డ: స్టార్ హీరోయిన్ And finally about the legend @ikamalhaasan... not qualified enough to comment about the acting 😊 All I can say is.. as your biggest fan, it was one of my proudest moments!! Congrats to you Sir and your wonderful team. 👍👍👏👏👏@RKFI @Udhaystalin — Mahesh Babu (@urstrulyMahesh) July 2, 2022 -
‘విక్రమ్’ మూవీలో విలన్స్తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా?
‘లోక నాయకుడు’ కమల్ హాసన్ విక్రమ్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగేళ్లుగా ఒక్క హిట్ లేని కమల్కు ఈ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అందించింది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ మూవీ రూ. 300 కోట్లు వసూళు చేసింది. ప్రస్తుతం మూవీ టీం విక్రమ్ బ్లాక్బస్టర్ హిట్ను ఆస్వాధిస్తోంది. లోకేశ్ కనగరాజు దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళం స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, కోలీవుడ్ స్టార్స్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించగా.. సూర్యలు కీ రోల్లో కనిపించాడు. చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్లో కరణ్ జోహార్.. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ పని మనిషిగా కనిపించిన ఎజెంట్ టీనా పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇందులో ఆమె విలన్ గ్యాంగ్పైకి శివంగిలా విరుచుకుపడి వారికి చెమటలు పట్టించింది. దీంతో సినిమా అనంతరం చాలామంది పని మనిషి ఎజెంట్ టీనా గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకి ఆమె ఎవరా? అని అందరు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకి ఎజెంట్ టీనా అసలు పేరు ఎంటంటే వాసంతి. కోలీవుడ్ ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్లో ఆమె ఒకరు. తమిళంలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు ఆమె కోరియోగ్రఫి అందించింది. ఈ క్రమంలో విక్రమ్ మూవీతో ఆమె నటిగా వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు రావడంతో మురిసిపోతూ డైరెక్టర్ లోకేశ్ కనగరాజుకు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ..‘విక్రమ్ వంటి ప్రాజెక్ట్లో తాను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజు గారికి కృతజ్ఞతలు. నా అసలు పేరు వాసంతి. కానీ అందరూ నన్ను ఎజెంట్ టీనా అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులంత నన్ను టీనాగా గుర్తిస్తున్నారు’ అంటూ రాసుకొచ్చింది. కాగా విక్రమ్ మూవీలో హీరో మీద పగతో ఆయన తనయుడిని విలన్లు చంపేస్తారు. చదవండి: 16 రోజుల్లో రూ. 300 కోట్లు.. బాహుబలి 2 రికార్డు బద్దలు.. దీంతో విక్రమ్ కోడలు ఆయనని ద్వేషిస్తూ కొడుకుతో ఒంటరిగా ఉంటుంది. అయితే కోడలికి, మనవడికి తోడుగా ఒక పనిమనిషి ఉంటుంది. విక్రమ్ ఫ్యామిలీపై పగతీర్చుకోవడానికిగాను వారిపై విలన్ అనుచరులు దాడికి యత్నిస్తారు. అయితే పని మనిషి విక్రమ్ సార్కి కాల్ చేయమని ఎంతగా చెప్పినా ఆయనపై సరైన అభిప్రాయం లేని కారణంగా కోడలు ఆ మాటలు పట్టించుకోదు. అప్పుడు విలన్ గ్యాంగ్పైకి ఆ పని మనిషి ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. అయితే చివరిలో ఆమె 'ఏజెంట్ టీనా' అనీ.. కోడలు, మనవడికి రక్షణ ఆమెను హీరో ఆ ఇంటికి పనిమనిషిగా పింపించాడనే విషయాన్ని దర్శకుడు రివీల్ చేస్తాడు. సస్పెన్స్తో ముడిపడిన ఈ సీన్ సినిమాలోని యాక్షన్ సీన్స్లో ఒకటిగా నిలిచింది. Am proud be a part of #Vikram thanks #LokeshKanakaraj sir given me a opportunity for Vikram and my name is vasanthi but create new name agent Tina every one wishing me as Tina. Am so happy.Audience recognize me Tina. pic.twitter.com/MI0pPPUSoH — Agent_Tina vasanthi (@Agent_Tena) June 19, 2022 -
'విక్రమ్' సక్సెస్ డిన్నర్ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే..
Kamal Haasan Vikram Success Meet Dinner Party Photos Goes Viral: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఇప్పటివరకు సుమారు రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సక్సెస్ జోష్తో చిత్రబృందం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. తియనైన వేడుకకు బదులు మంచి మాంసాహారంతో విందు జరుపుకుంది. చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి, థియేటర్ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది. చెన్నైలో నిర్వహించిన ఈ పార్టీకి కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్, అనిరుధ్ రవిచందర్, విజయ్ సేతుపతి, ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. మూవీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. విక్రమ్ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని కమల్ హాసన్ పేర్కొన్నారు. విజయ్తో లోకేష్ కనకరాజ్ తెరకెక్కించనున్న తదుపరి చిత్రం విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. విక్రమ్ సక్సెస్ తనపై బాధ్యతను పెంచిందని, ఇకపై మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించేందుకు శ్రమిస్తానని డైరెక్టర్ లోకేష్ తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ డిన్నర్ పార్టీలో పాల్గొన్న వారి కోసం స్పెషల్ మెనూను ఏర్పాటు చేసింది. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్తోపాటు మటన్ కీమా బాల్స్, వంజరం తవా ఫిష్ ఫ్రై, నాటు కోడి సూప్, ప్రాన్ పచ్చడి, మైసూర్ మసాల దోశ, పన్నీర్ టిక్కా ఇలా చాలా వెరైటీలు ఉన్నాయట. How it Started? How it is Going!!!@ikamalhaasan @Dir_Lokesh @DirLokeshFC @DiehardKamalian @RKFI @RedGiantMovies_ @turmericmediaTM #VikramSuccessMeet #VikramMovie #VikramInAction #Vikram pic.twitter.com/97v0NJyWqB — உத்தமன் | Villain (@mr_king_mr) June 17, 2022 ఈ విందులో కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్, అనిరుధ్, ఉదయనిధి స్టాలిన్ పాల్గొని అందరితో కలిసి భోజనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. ఈ విందుని చూసి 'విక్రమ్ అలా మొదలై.. ఇలా కొనసాగుతోంది' అని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా విజయ్ సేతుపతి, లోకేష్, అనిరుధ్ను కమల్ హాసన్ ఆప్యాయంగా ముద్దు పెట్టుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. #VikramSuccessMeet - Menu of #Sappad served! pic.twitter.com/pUfrp32WnD — Sreedhar Pillai (@sri50) June 17, 2022 #Vikram team @ikamalhaasan @Dir_Lokesh @anirudhofficial @Udhaystalin sat with distributors, exhibitors and media for an excellent non-vegetarian #ChettinadSappad #Vikramsuccessmeet pic.twitter.com/eff50gMUQZ — Sreedhar Pillai (@sri50) June 17, 2022 Dinner 🥘 is on 😍#VikramSuccessMeet ✨@Udhaystalin @ikamalhaasan @Dir_Lokesh @RKFI pic.twitter.com/TclFkI7Ri5 — Vinodth Vj... (@Vinodth_Vj) June 18, 2022 #Aandavar entry with @Udhaystalin sir & @Dir_Lokesh bro !!!#VikramSuccessMeet pic.twitter.com/Vj7y62hluF — Rakesh Gowthaman (@VettriTheatres) June 17, 2022 #Loki style balamana virundhu for theatre owners / distributors / press media for #VikramRoaringSuccess !!! Whattah feast was that 😍😋 Thank You @RKFI & @RedGiantMovies_ #VikramSuccessMeet pic.twitter.com/EQT9HqW0OM — Rakesh Gowthaman (@VettriTheatres) June 17, 2022 Vikram... Vikram... Vikram..... ! Organic & Perfect Industry hit in recent times for Kollywood. That's #KamalHaasan𓃵 for you💥❤️ Thanks @Dir_Lokesh 🙏 @anirudhofficial ❤️#IndustryHitForKH #Vikram #VikramSuccessMeet pic.twitter.com/bs4JMdG0Eq — Movie Meter (@MovieMeterOff) June 18, 2022 -
విజయ్ సినిమాలో విలన్గా స్టార్ హీరో!
మల్టీస్టారర్ మూవీస్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాయి. టాలీవుడ్ నుంచి వచ్చిన ఆర్ ఆర్ ఆర్, కోలీవుడ్ నుంచి వచ్చిన విక్రమ్ ఏ రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టాయో తెల్సిందే. అందుకే విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన తదుపరి సినిమాలోనూ ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకంటున్నాడట. కొత్త సినిమాలో విజయ్ కు పోటీగా మరో హీరోను రంగంలోకి దింపబోతున్నాడట. లోకేష్ సినిమాల్లో ఇద్దరు హీరోలు అనేది కామన్ అయిపోయింది. మాస్టర్ లో విజయ్ హీరోగా నటిస్తే, విజయ్సేతుపతి విలన్ రోల్ చేశాడు. విక్రమ్ లో కమల్ హీరో, మళ్లీ విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు.ఇప్పుడు విజయ్ నటించే కొత్త చిత్రంలో కూడా స్టార్ హీరో ధనుష్ని విలన్గా చూపించబోతున్నాడట. ఇప్పటికే ధనుష్కు కథ వినిపించాడట. ఆయనకు పాత్ర బాగా నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే త్వరలోనే వెండితెరపై ‘మాస్టర్’ వర్సెస్ ‘మారి’ ఫైట్ చూడొచ్చు. -
ఏమాత్రం తగ్గని 'విక్రమ్'.. 10 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే..
Vikram Movie Collections Worldwide: ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత విక్రమ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. ముఖ్యంగా కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక 'విక్రమ్' బాక్సాఫీస్ కలెక్షన్లలో ఏమాత్రం తగ్గట్లేదు. కమల్ హాసన్ కెరీర్లోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల్లో ఒకటిగా 'విక్రమ్' నిలిచింది. ఈ సినిమా విడుదలైన తొలి రోజు రూ. 45 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం. ఒక్క తమిళనాడులోనే పది రోజుల్లో రూ. 100 కోట్లను కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఆదివారం రోజే రూ. 11 కోట్ల కలెక్షన్లతో 'విక్రమ్' దుమ్ములేపాడు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాడు విక్రమ్. గత 10 రోజుల్లో రూ. 25 కోట్లకుపైగా వసూలు చేసినట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. ఇక కేరళలో ఇప్పటివరకు రూ. 30 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టగా, కర్ణాటకలో సుమారు 15 కోట్లు సాధించినట్లు సమాచారం. అయితే ఈ వీకెండ్ పూర్తయ్యేవరకూ మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. చదవండి: సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు? At the end of 2nd weekend, #Vikram has crossed the ₹ 300 Cr gross mark at the WW Box office.. 🔥 A first for #Ulaganayagan @ikamalhaasan and rest of the cast and crew! @VijaySethuOffl #FahadhFaasil @Suriya_offl @Dir_Lokesh @anirudhofficial @RKFI @turmericmediaTM — Ramesh Bala (@rameshlaus) June 13, 2022 Looks like #Vikram is gonna break more box office records this weekend ! Unbelievable collections ! Ulaganayakan @ikamalhaasan sir @Dir_Lokesh @anirudhofficial @VijaySethuOffl @turmericmediaTM #Fahad @RedGiantMovies_ — Udhay (@Udhaystalin) June 10, 2022 -
Vikram Success Party: చిరు ఇంట్లో గ్రాండ్ పార్టీ విక్రమ్ టీం,సల్మాన్ ఖాన్ సందడి (ఫొటోలు)
-
విక్రమ్ మూవీకి టీమ్కు మెగాస్టార్ గ్రాండ్ పార్టీ.. స్నేహితుడిని సన్మానించిన చిరు
-
చిరు ఇంట్లో విక్రమ్ టీంకు గ్రాండ్ పార్టీ, సల్మాన్ ఖాన్ సందడి
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజు దర్శకత్వం వహించాడు. గత శుక్రవారం(జూన్ 3న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్లోకి చేరింది. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్లో సైతం విక్రమ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న కమల్ ఈ మూవీ నటీనటులతో పాటు డైరెక్టర్, మూవీ బృందానికి బహుమతులు అందించాడు. చదవండి: అలాంటి వారిని దగ్గరికి రానివ్వకండి: ఆసక్తిగా హీరోయిన్ ట్వీట్ ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి లోకనాయకుడిని సత్కరించాడు. విక్రమ్ మంచి విజయం అందుకున్న సందర్భంగా కమల్ హాసన్తో పాటు డైరెక్టర్ లోకేశ్ కనగరాజును చిరు ఇంటికి ఆహ్వానించి అభినందనలు తెలిపాడు. అనంతరం ఇంట్లో వారికి గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా వచ్చి విక్రమ్ మూవీకి అభినందలు తెలిపాడు. ఈ సందర్భంగా చిరు ట్వీట్ చేస్తూ విక్రమ్ టీంను సత్కరించిన ఫొటోలను షేర్ చేశాడు. ‘నా పాత స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. చదవండి: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించినందుకు నిన్న రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశాను. కమల్హాసన్తో పాటు సల్మాన్ ఖాన్, లోకేష్ కనగరాజ్ మా ఇంటికి రావడంతో చాలా సంతోషంగా ఉంది. విక్రమ్ మూవీ చాలా అద్భుతంగా, థ్రిల్లింగ్గా ఉంది. అభినందనలు మిత్రమా. ఈ సినిమా విజయం నీకు మరింత శక్తిని ఇస్తుంది’ అంటూ చిరు ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా కమల్ తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రల్లో నటించారు. తమిళ స్టార్ సూర్య కీలకపాత్రలో నటించాడు. Absolute joy,celebrating & honouring my dearest old friend @ikamalhaasan for the spectacular success of #Vikram along with my dearest Sallu Bhai @BeingSalmanKhan @Dir_Lokesh & team at my home last night.What an intense & thrilling film it is!!Kudos My friend!! More Power to you! pic.twitter.com/0ovPFK20r4 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 12, 2022 -
ఆ ప్రశ్నకు నేనెప్పుడూ సిద్ధమే: కమల్ హాసన్
తమిళసినిమా: ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యునికి ఉత్తర దక్షిణాయనాలు ఉన్నట్లే.. సినీరంగంలో సక్సెస్లు మారిమారి వస్తుంటాయని నటుడు, నిర్మాత, మక్కల్ నీదిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ అన్నారు. ఈయన కథానాయకుడిగా రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నిర్మించిన విక్రమ్ చిత్రం ఈ నెల 3న విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కమలహాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ గురువారం చెన్నైలో గ్రాండ్ సక్సెస్ మీట్ను నిర్వహించారు. కమలహాసన్ మాట్లాడుతూ ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపా. మంచి విజయాన్ని సాధించాను.. ఇది చాలు అన్న ఆలోచన తనకు ఎప్పుడూ రాదన్నారు. దీనికంటే మరింత విజయవంతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యంతో తన పయనం సాగుతుందన్నారు. చదవండి: (Nayanthara-Vignesh Shivan wedding: భారీ ఆఫర్తో ప్రచార హక్కులు) తదుపరి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్తో కలిసి నటిస్తారా ? అన్న ప్రశ్నకు తానెప్పుడూ సిద్ధమేనని, దర్శకుడే రజనీకాంత్కు కథ చెప్పి ఒప్పించాలని, అలాగే తనకు కథ నచ్చాలని అన్నారు. సమీప కాలంలో మన చిత్రాల కంటే ఇతర భాషా చిత్రాల గురించే చర్చించుకోవడం గురించి మీ స్పందన..? అన్న ప్రశ్నకు ఇంతకు ముందు అపూర్వ సహోదరులుగళ్, అవ్వై షణ్ముఖుని, ఏక్ దూజ్ కేళియే వంటి చిత్రాలు దేశం దాటి విజయం సాధించాయని, సూర్యునికి కూడా ఉత్తర దక్షిణాయనాలు ఉంటాయని, అదే విధంగా సక్సెస్లు కూడా మారి మారి వస్తాయని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. -
‘విక్రమ్’.. 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్స్
Kamal Haasan Gifts New Bikes to 13 Assistant Directors: విక్రమ్ మూవీ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు హీరో కమల్ హాసన్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో కమల్ బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం విక్రమ్ టీం, కమల్ హాసన్ మూవీ సక్సెస్ను ఆస్వాధిస్తున్నారు. విక్రమ్ మూవీ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో కమల్ హాసన్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్కు మంగళవారం ఖరీదైన లగ్జరీ కారు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు కోటీకి పైగా విలువ చేసే లెక్సాస్ లగ్జరీ కారును గిఫ్ట్గాఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. చదవండి: ‘విక్రమ్’ భారీ విజయం, దర్శకుడికి కమల్ లెక్సాస్ లగ్జరీ కారు బహుమతి అలాగే విక్రమ్ మూవీకి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చాడు కమల్ హాసన్. ఈ సినిమాకు పని చేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు అపాచీ ఆర్టీఆర్ 160 (Apache RTR 160)బైక్లను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఒక్కో బైక్ ధర సుమారుగా రూ. 1.45 లక్షలు ఉంటుందని సమాచారం. కాగా విక్రమ్ మూవీ కోసం వీరు చాలా హర్డ్ వర్క్ చేశారని, వారి శ్రమ ఫలితమే మూవీ బాగా వచ్చిందని కమల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా అసిస్టెంట్ డైరెక్టర్లకు కమల్ బైక్ కీ అందిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. చదవండి: సాయి పల్లవికి పెద్ద ఫ్యాన్ని: బాలీవుడ్ డైరెక్టర్ విడుదలైన నాలుగు రోజుల్లో ఈ మూవీ దాదాపు రూ. 200 కోట్లు వసూళ్లు చేసింది. ఇక వీకెండ్స్లో (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్: హిట్ లిస్ట్' పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ఇందులో కమల్ 67 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సీన్స్ చేయడం విశేషం. https://t.co/zrQRWQN1Ta pic.twitter.com/dSi5jTXkVc — Ramesh Bala (@rameshlaus) June 7, 2022