NBFC
-
ఎన్బీఎఫ్సీ, సూక్ష్మ రుణాలకు మరింత మద్దతు!
బ్యాంక్లు మంజూరు చేసే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), సూక్ష్మ రుణాలపై రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ తగ్గించింది. కన్జ్యూమర్ మైక్రోఫైనాన్స్ రుణా లు, ఎన్బీఎఫ్సీలకు ఇచ్చే రుణాలపై 25 శాతం తగ్గించడంతో రిస్క్ వెయిట్ 100కు దిగొచ్చింది. దీంతో ఆయా రుణాల కోసం బ్యాంక్లు పక్కన పెట్టాల్సిన నిధుల పరిమాణం తగ్గుతుంది. తద్వారా బ్యాంక్ల లిక్విడిటీ మెరుగవుతుంది. ఆయా విభాగాలకు రుణ వితరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.2023 నవంబర్లో ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణ సంస్థలకు రిస్క్ వెయిటేజీని ఆర్బీఐ పెంచడం గమనార్హం. అప్పటి నుంచి వాటి రుణ వితరణ కుంటుపడింది. ఎన్బీఎఫ్సీలకు వాణిజ్య బ్యాంక్ల రుణాలపై రిస్క్ వెయిట్ను 25 శాతం పాయింట్లను పెంచింది. అదే ఏడాది వ్యక్తిగత రుణాలకు సైతం 25 శాతం మేర వెయిట్ను పెంచి 125 చేసింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం రుణాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. కఠిన నిబంధనలతో ఎన్బీఎఫ్సీలకు బ్యాంక్ల నుంచి రుణాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణాలకు గతంలో పెంచిన మేర వెయిటేజీని తాజా తగ్గించగా, దీన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు.భారత్పై టారిఫ్ల ప్రభావం తక్కువేఆసియా పసిఫిక్ ప్రాంతంలోని (ఏపీఏసీ) ఇతర దేశాలతో పోలిస్తే ఎగుమతుల కోసం అమెరికాపై భారత్ ఆధారపడటం తక్కువగానే ఉంటోంది కాబట్టి, కొన్ని రంగాలు మినహా చాలా రంగాలపై ప్రతిపాదిత టారిఫ్ల ప్రభావం మరీ అంతగా ఉండకపోవచ్చని మూడీస్ రేటింగ్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఆహారోత్పత్తులు, జౌళి, ఫార్మా మొదలైన ఉత్పత్తులకు టారిఫ్ రిసు్కలు ఉండొచ్చని వివరించింది.ఇదీ చదవండి: రూ.8.6 లక్షల కోట్ల ఎగుమతులుతాము రేటింగ్ ఇచ్చే భారతీయ కంపెనీలు చాలా మటుకు దేశీ మార్కెట్పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయని, అవి అమెరికా మార్కెట్పై ఆధారపడటం తక్కువేనని పేర్కొంది. టారిఫ్ల విషయంలో అమెరికాతో అత్యధిక వ్యత్యాసాలున్న ఏపీఏసీ దేశాల్లో భారత్, వియత్నాం, థాయ్లాండ్ మొదలైనవి ఉన్నట్లు వివరించింది. ఎల్రక్టానిక్స్, మోటర్ సైకిల్స్, ఫుడ్, టెక్స్టైల్స్ విభాగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వివాదానికి తావివ్వకుండా, ద్వైపాక్షిక చర్చల ద్వారా బేరసారాలాడుకోవడం ద్వారా ప్రభుత్వాలు టారిఫ్ల విషయంలో వివేకవంతంగా వ్యవహరించే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ తెలిపింది. -
లైసెన్స్లు వెనక్కి ఇచ్చేసిన ఎన్బీఎఫ్సీలు
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, ఐడీఎఫ్సీ లిమిటెడ్ తమ ఎన్బీఎఫ్సీ లైసెన్స్లను వెనక్కిచ్చేశాయి. ఇలా మొత్తం 20 బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (సీవోఆర్)లను స్వాధీనం చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇందులో మనోవే ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎన్బీఎఫ్సీ వ్యాపారం నుంచి తప్పుకున్నాయి.ఐడీఎఫ్సీ లిమిటెడ్, ఐడీఎఫ్సీ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ తదితర 16 సంస్థలు విలీనాల కారణంగా సీవోఆర్ను స్వాధీనం చేశాయి. వీటికి అదనంగా ఆర్బీఐ తనంతటగా 17 ఎన్బీఎఫ్సీల సీవోఆర్లను రద్దు చేసింది. వీటి రిజిస్టర్డ్ కార్యాలయం పశ్చిమబెంగాల్లో ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. మరోవైపు కామధేను ఫైనాన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ లైసెన్స్ను పునరుద్ధరించినట్టు ప్రకటించింది.ఎన్బీఎఫ్సీ అంటే.. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) అనేది కంపెనీల చట్టం, 1956 కింద నమోదైన ఒక కంపెనీ. ఇది రుణాలు ఇవ్వడం, ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలు జారీ చేసిన షేర్లు, స్టాక్లు, బాండ్లు, డిబెంచర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, బీమా వ్యాపారం, చిట్ వ్యాపారం వంటి కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులకు తేడాఎన్బీఎఫ్సీలు రుణాలు ఇస్తాయి. పెట్టుబడులు పెడతాయి. కాబట్టి వాటి కార్యకలాపాలు బ్యాంకుల కార్యకలాపాలను పోలి ఉంటాయి. అయితే వీటి మధ్య ప్రధానంగా కొన్ని తేడాలు ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ డిమాండ్ డిపాజిట్లను అంగీకరించదు. ఎన్బీఎఫ్సీలు చెల్లింపు, సెటిల్మెంట్ వ్యవస్థలో భాగం కావు. తమపైనే చెక్కులను జారీ చేయలేవు. బ్యాంకుల మాదిరిగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఎన్బీఎఫ్సీల డిపాజిటర్లకు అందుబాటులో లేదు. -
బంగారం వేలం నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
న్యూఢిల్లీ: బంగారం వేలం విషయంలో బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. బంగారం తనఖాపై రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే, బ్యాంక్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) ఆ బంగారాన్ని వేలంలో విక్రయించి రుణ బకాయిలతో సర్దుబాటు చేసుకుంటుంటాయి. ఇందుకు నిర్దేశిత ప్రక్రియలు, నిబంధనలను బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు అనుసరించాల్సి ఉంటుంది. ఈ విషయమై లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నకు ఆర్థిక మంత్రి బదులిచ్చారు. ఎన్బీఎఫ్సీలు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్లకు ఈ విషయంలో నిబంధనలు ఒకే విధంగా ఉన్నట్టు చెప్పారు. రుణ చెల్లింపులు సరిగ్గా లేవంటూ ఖాతాదారులకు బ్యాంక్లు తగినన్ని సార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ రుణ గ్రహీత చెల్లింపులకు ముందుకు రాకపోతే అప్పుడు బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ బంగారం వేలానికి వెళ్లాల్సి ఉంటుందని వివరించారు. నిబంధనలను బ్యాంక్లు ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బంగారానికి డిమాండ్: దేశంలో బంగారానికి డిమాండ్ తగ్గలేదని, పెరుగుతూ వెళుతోందని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ప్రశ్నకు సమాధానంగా మంత్రి సీతారామన్ బదులిచ్చారు. ‘‘దేశంలో వ్యక్తులు, చిన్న వర్తకులు సురక్షితమైన, లిక్విడ్ సాధనమన్న ఉద్దేశ్యంతో బంగారంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు’’అని వివరించారు. -
'ఏఏ' వ్యాపారానికి ఫోన్పే గుడ్బై.. లైసెన్స్ వెనక్కి..
ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ఫోన్పే (PhonePe) అకౌంట్ అగ్రిగేషన్ (ఏఏ) వ్యాపారం నుంచి వైదొలిగినట్టు ప్రకటించింది. ఈ సేవలు అందించేందుకు సరిపడా భాగస్వాములను పొందలేకపోయినట్టు తెలిపింది. ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్ను (license) ఆర్బీఐకి (RBI) స్వాధీనం చేయాలని నిర్ణయించినట్టు, అకౌంట్ అగ్రిగేషన్ కార్యకలాపాలను మూసివేసే చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది.తన యూజర్ల ఆమోదం మేరకు వారి ఆర్థిక సమాచారాన్ని బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లతో పంచుకోవడం ద్వారా రుణాలు, క్రెడిట్ కార్డులు తదితర సేవలు అందించేందుకు ఈ లైసెన్స్ కింద అనుమతి ఉంటుంది. 2023 జూన్లో ఫోన్పేకు ఎన్బీఎఫ్సీ–ఏఏ లైసెన్స్ రావడం గమనార్హం. ‘‘రెండేళ్లలోపే మా ఏఏ ప్లాట్ఫామ్పై 5 కోట్ల మంది భారతీయులను చేర్చుకోవడం గర్వకారణంగా ఉంది. పోటీ ప్రాధాన్యతల దృష్ట్యా ఎక్కువ మంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్లను మా ప్లాట్ఫామ్ వైపు ఆకర్షించలేకపోయాం. దీంతో ఫోన్పే గ్రూప్ అకౌంట్ అగ్రిగేషన్ వ్యాపారం నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికి బదులు మార్కెట్లో ఉన్న ఇతర ఏఏలతో జట్టు కడతాం’’అని ఫోన్పే ప్రకటించింది. తమ ఏఏ యూజర్లకు త్వరలోనే ఈ విషయాన్ని తెలియజేస్తామని తెలిపింది. -
గరిష్ట వడ్డీరేట్లను బహిర్గతం చేయాలని ఆదేశాలు
రుణాలపై విధించే వడ్డీరేట్లలో పారదర్శకతను పెంపొందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. విభిన్న రుణాలపై వసూలు చేసే గరిష్ట వడ్డీ రేట్లను బహిర్గతం చేయాలని బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (NBFC) ఆదేశించింది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, బీమా, ఇతర ఛార్జీలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.ఆర్బీఐ ఆదేశాల్లోని కీలక అంశాలుతనఖా, వాహనం, ఆస్తి, బంగారం, విద్యా రుణాలు వంటి వివిధ రుణ కేటగిరీలకు కాంపోజిట్ సీలింగ్ రేట్ల(గరిష్ట వడ్డీరేట్లు)ను ఎన్బీఎప్సీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ గరిష్ట రేట్లను సంబంధిత డైరెక్టర్ల బోర్డులు ఆమోదించాలి. ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఆర్బీఐ ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్కు అనుగుణంగా ఉండాలి. ఇది వివిధ కేటగిరీల రుణగ్రహీతలకు వేర్వేరు రేట్లను వసూలు చేసే విధానాలపై స్పష్టతను ఇస్తుంది. రుణ రేట్లపై ఆర్బీఐ పరిమితులు విధించనప్పటికీ, బోర్డు ఆమోదం లేకుండా ఎన్బీఎఫ్సీలు వెల్లడించిన గరిష్ట రేట్లను మించరాదు.ఇదీ చదవండి: కోటక్ బ్యాంకు అలెర్ట్.. ‘డెబిట్ కార్డులు పని చేయవు’పెరుగుతున్న గృహ రుణభారం, రుణగ్రహీతలకు వారి రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంది. దీనిపై కొంత ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో దానికి ప్రతిస్పందనగా ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. ఆర్బీఐ నేరుగా రుణ రేట్లను నియంత్రించనప్పటికీ ఎన్బీఎఫ్సీలు తమ రుణ ధరల్లో పారదర్శకతను కొనసాగించడానికి ఈ ఆదేశాలు ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది సంస్థలపై కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఇక లోన్లు ఇవ్వొద్దు.. 4 కంపెనీలపై ఆర్బీఐ బ్యాన్
నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. రుణాల మంజూరు, పంపిణీని నిలిపివేయాలని ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్, ఆరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, డీఎంఐ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నవీ ఫిన్సర్వ్ లిమిటెడ్లకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది . అక్టోబరు 21న వ్యాపార కార్యకలాపాలు ముగిసిన అనంతరం నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని పేర్కొంది.ఈ కంపెనీల వెయిటెడ్ యావరేజ్ లెండింగ్ రేట్ (WALR), వాటి నిధుల వ్యయంపై విధించే వడ్డీ స్ప్రెడ్ పరంగా ఈ కంపెనీల ప్రైసింగ్ పాలసీలో గమనించిన మెటీరియల్ సూపర్వైజరీ లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: ఏటీఎంలో చిరిగిన నోట్లు వస్తే.. ఆర్బీఐ రూల్స్ తెలుసా?అయితే ఆయా కంపెనీలు తమ కస్టమర్లకు ఇతర సేవలను, రుణాల వసూలు, రికవరీ కార్యకలాపాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్థిక రంగంలో స్థిరత్వం కోసం, సంస్థలన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఆర్బీఐ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై చర్యలు చేపడుతూ వస్తోంది. -
ముందస్తు విత్డ్రాకు ఆర్బీఐ నిబంధనలు
ముంబై: ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్స్పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) పాటించాల్సిన లిక్విడ్ అసెట్స్ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ రేటింగ్ పొందాలని హెచ్ఎఫ్సీలకు సూచించింది. పబ్లిక్ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. -
ఆర్బీఐ కఠిన చర్యలు.. నాలుగు కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఓ ప్రైవేటు బ్యాంక్పై కఠిన చర్యలు తీసుకుంది. నాలుగు ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను రద్దు చేసింది. అలాగే ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.1కోటి జరిమానా విధించింది. ఆర్బీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీలలో ఉత్తరప్రదేశ్కు చెందిన కుండల్స్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడుకు చెందిన నిత్య ఫైనాన్స్ లిమిటెడ్, పంజాబ్ ఆధారిత భాటియా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్ ఆధారిత జీవన్జ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిటెడ్ ఉన్నాయి. ఆర్బీఐ చట్టంలో నిర్వచించిన విధంగా ఈ కంపెనీలు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు. ఇక 'రుణాలు, అడ్వాన్సులు - చట్టబద్ధమైన ఇతర పరిమితులు'పై ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు గానూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు రూ.1కోటి పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుకు ఇదివరకే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. -
టాటా సన్స్ మెగా ఐపీవో!
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు ఈక్విటీ మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్పార్క్ క్యాపిటల్ పేర్కొంది. టాటా గ్రూప్ ఎన్బీఎఫ్సీ హోల్డింగ్ కంపెనీ విలువను రూ. 7.8 లక్షల కోట్లుగా మదింపు చేసింది. గ్రూప్ కంపెనీల ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం విలువ మదింపు చేయగా.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం రానున్న 18 నెలల్లో టాటా సన్స్ ఐపీవో చేపట్టనున్నట్లు తెలియజేసింది. అప్పర్లేయర్ ఎన్బీఎఫ్సీగా ఆర్బీఐ గతేడాది గుర్తింపునిచి్చన నేపథ్యంలో 2025 సెపె్టంబర్కల్లా తప్పనిసరిగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ కావలసి ఉన్నట్లు స్పార్క్ పేర్కొంది. ఇందుకు ఏడాదిన్నర కాలంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. దీంతో సంక్లిష్టంగా ఉన్న గ్రూప్ హోల్డింగ్ నిర్మాణం సరళతరమయ్యేందుకు వీలుంటుందని అభిప్రాయపడింది. కాగా.. ఇటీవల వెలువడిన సమాచారం ప్రకారం కంపెనీ రూ. 11 లక్షల కోట్ల విలువను అందుకోగలదని వెల్లడించింది. వెరసి ఐపీవో పరిమాణం రూ. 55,000 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. టాటా సన్స్ హోల్డింగ్స్లో 80 శాతం మోనిటైజబుల్ కానప్పటికీ పునర్వ్యవస్థీకరణ కారణంగా కంపెనీ రీరేటింగ్ను సాధించే వీలున్నట్లు పేర్కొంది. విలువ జోడింపు అన్లిస్టెడ్ పెట్టుబడులతో పలు మార్గాల ద్వారా టాటా సన్స్కు అదనపు విలువ జమకానున్నట్లు స్పార్క్ క్యాపిటల్ తెలియజేసింది. ఇటీవల సెమీకండక్టర్స్ తదితర ఆధునికతరం విభాగాలలోకి టాటా గ్రూప్ ప్రవేశించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. టాటా ఎలక్ట్రానిక్స్.. చిప్ తయారీ ప్రణాళికలు ప్రకటించిన విషయం విదితమే. టాటా టెక్నాలజీస్, టాటా మెటాలిక్స్, ర్యాలీస్ తదితర అనుబంధ సంస్థలను పేర్కొంది. ఫలితంగా టాటా గ్రూప్ మరో రూ. 1–1.5 లక్షల కోట్ల విలువను జోడించుకోనున్నట్లు అంచనా వేసింది. లిస్టెడ్, అన్ లిస్టెడ్ కంపెనీలు, ప్రిఫరెన్స్ షేర్లు, ఫండ్స్లో పెట్టుబడులను పరిగణించి విలువను మదింపు చేసింది. టీసీఎస్ బలిమి టాటా సన్స్ విలువలో సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ అతిపెద్ద వాటాను ఆక్రమిస్తోంది. టీసీఎస్ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం టాటా సన్స్ వాటా విలువ రూ. 10 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. అన్లిస్టెడ్ కంపెనీలు, పెట్టుబడులుకాకుండా గ్రూప్లోని ఇతర లిస్టెడ్ దిగ్గజాలు టాటా మోటార్స్, టాటా పవర్, ఇండియన్ హోటల్స్లో యాజమాన్య వాటాలు కలిగి ఉంది. టాటా కెమికల్స్లో అత్యధిక స్థాయి(కంపెనీ విలువలో 80 శాతం)లో యాజమాన్య హక్కులను కలిగి ఉంది. కాగా.. టాటా సన్స్లో దొరాబ్జీ టాటా ట్రస్ట్ 28 శాతం, రతన్ టాటా ట్రస్ట్ 24 శాతం, సైరస్ మిస్త్రీ కుటుంబ పెట్టుబడి సంస్థ(స్టెర్లింగ్ ఇన్వెస్ట్మెంట్) 9 శాతం, ఇతర ప్రమోటర్లు 14 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. -
బ్యాంక్ లైసెన్స్లు కోరుకోవడం అసాధారణం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఒకవైపు నియంత్రణపరమైన ప్రయోజనాలను అనుభవిస్తూనే మరోవైపు బ్యాంకింగ్ లైసెన్స్ కోరుకోవడం అనుచితమని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్బీఎఫ్సీలపై సీఐఐ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వడ్డీ రేట్లపై నియంత్రణ సంస్థ (ఆర్బీఐ) ఇచి్చన స్వేచ్ఛను కొన్ని సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) దురి్వనియోగం చేస్తున్నాయని, అధిక రేట్లను వసూలు చేస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. పీర్ టు పీర్ (పీటుపీ) రుణ ప్లాట్ఫామ్లు లైసెన్స్ మార్గదర్శకాల పరిధిలో లేని వ్యాపార విధానాలను అనుసరిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి ఉల్లంఘనలను ఆమోదించేది లేదని హెచ్చరించారు. ఎన్బీఎఫ్సీలు బ్యాంక్లుగా మారే విషయంలో వస్తున్న డిమాండ్పై రాజేశ్వరరావు మాట్లాడారు. టాప్ టైర్ ఎన్బీఎఫ్సీలకు సైతం నియంత్రణ విధానాలు యూనివర్సల్ బ్యాంకుల మాదిరిగా లేవని స్పష్టం చేస్తూ, ఎన్బీఎఫ్సీలు కొన్ని ప్రయోజనాలను అనుభవిస్తున్నట్టు చెప్పారు. ‘‘ఎన్బీఎఫ్సీలు కీలక సంస్థలుగా మారి ప్రత్యేకమైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కనుక అవి బ్యాంక్గా మారాలని అనుకోవడం సముచితం కాదు’’అని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న బజాజ్ ఫిన్సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్లు ఎందుకు కోరుకోరాదంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా రాజేశ్వరరావు మాట్లాడడం గమనార్హం. బ్యాంక్గా ఎందుకు మారకూడదు? ఆర్బీఐ పటిష్ట నియంత్రణల మధ్య ఎన్బీఎఫ్సీలు పెద్ద సంస్థలుగా, బలంగా మారినట్టు సంజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘‘కొన్ని ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ లైసెన్స్ గురించి ఎందుకు ఆలోచించకూడదు?. ముఖ్యంగా ఈ ఎన్బీఎఫ్సీలు పదేళ్లకు పైగా సేవలు అందిస్తూ, నిబంధనలను సరిగ్గా అమలు చేస్తూ, తమను తాము నిరూపించుకున్నాయి’’అని సంజీవ్ బజాజ్ అన్నారు. దీనికి రాజేశ్వరావు స్పందిస్తూ.. ‘‘యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్లను ఆన్టాప్ విధానం కిందకు కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ మార్చింది. కానీ, ఏ ఒక్క సంస్థ కూడా బ్యాంక్గా పనిచేసేందుకు ఆమోదం పొందలేదు’’అని చెప్పారు. ప్రవేశించడం, తప్పుకోవడానికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎన్బీఎఫ్సీలకు లేవని, యూనివర్సల్ బ్యాంక్ ఏర్పాటుకు రూ.1,000 కోట్ల అవసరం ఉంటే, ఎన్బీఎఫ్సీ ఏర్పాటుకు ఇది రూ.10 కోట్లుగానే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్బీఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం బ్యాంక్లపై ఎక్కువగా ఆధారపడకుండా ఇతర మార్కెట్ సాధనాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని రాజేశ్వరరావు సూచించారు. -
అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆంక్షలు విధించినప్పటి నుంచి పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ తమ వాలెట్ బిజినెస్ ముకేశ్ అంబానీకి చెందిన NBFCతో పాటు HDFC బ్యాంకుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తీవ్ర సంక్షోభంలో ఉన్న కంపెనీ తమ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీకి విక్రయిస్తుందనే పుకార్లు వెల్లువెత్తడంతో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 14 శాతం పెరిగి 288.75 రూపాయల గరిష్ఠానికి చేరుకున్నాయి. పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జియో ఫైనాన్షియల్లు ముందున్నాయని, కంపెనీ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ బృందం ఈ విషయాన్నే.. గత నవంబర్ నుంచి జియో ఫైనాన్షియల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. RBI నిషేధానికి ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మొత్తం మీద పేటీఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి జియో కూడా సుముఖత చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్బీఐ పేటీఎం లైసెన్స్ రద్దు చేస్తుందా.. పేటీఎంలో మనీలాండరింగ్, కేవైసీ ఉల్లంఘనల కారణంగా బ్యాంకింగ్ లైసెన్స్ను కూడా రద్దు చేసే విషయాన్ని RBI పరిశీలిస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు.. ఫిబ్రవరి 29 తరువాత నుంచి కస్టమర్ అకౌంట్లు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్ల వంటి వాటి ద్వారా డిపాజిట్లు, టాప్ అప్లను స్వీకరించకూడదనే నియమాలు అమలులోకి వస్తాయా? అనేది తెలియాల్సి ఉంది. పేటీఎం సీఈఓ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 29 తరువాత కూడా పేటీఎం యధాతధంగా పనిచేస్తుందని, ప్రతి సవాలుకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేయడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని విజయ్ శేఖర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. పేటీఎం ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా భారత్కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఆర్థిక లావాదేవీల్లో ఈ యాప్ ఇతర యాప్స్ కంటే అద్భుతంగా పనిచేస్తుండటం వల్ల ఎక్కువ మంది దీని వినియోగానికి ఆసక్తి చూపుతున్నారని, పేటీఎం కరో ఓ ఛాంపియన్గా నిలుస్తుందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: జేఈఈ, యూపీఎస్సీలలో ఏది కష్టం?.. ఆనంద్ మహీంద్రా ఏం చెప్పారంటే.. -
ఆశీర్వాద్ మైక్రోకు సెబీ బ్రేకులు
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ.. మణప్పురం ఫైనాన్స్ అనుబంధ సంస్థ ఆశీర్వాద్ మైక్రో ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలకు తాజాగా సెబీ బ్రేకు వేసింది. సంస్థ దాఖలు చేసిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. అయితే వెబ్సైట్లో సెబీ ఇందుకు కారణాలను వెల్లడించలేదు. ఈక్విటీ జారీ ద్వారా రూ. 1,500 కోట్ల సమీకరణకు వీలుగా ఆశీర్వాద్ మై క్రో 2023 అక్టోబర్లో సెబీకి దరఖాస్తు చేసింది. సాధారణంగా ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన 30 రోజుల్లోగా సెబీ పరిశీలనా పత్రాన్ని జారీ చేస్తుంది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు అనుమతిస్తుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్లో ఆశీర్వాద్ మైక్రో పే ర్కొంది. 2008లో తమిళనాడులో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం 1,684 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది. గతేడాది(2022–23)కల్లా నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 10,041 కోట్లకు చేరాయి. ఈ వార్తల నేపథ్యంలో మణప్పురం ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం పతనమై రూ. 168 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 163 వద్ద కనిష్టాన్ని తాకింది. -
ఎన్బీఎఫ్సీ వృద్ధి అంతంతే..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ)పై ప్రభావం చూపనుంది. కఠిన నిబంధనల వల్ల రుణాల మంజూరు నెమ్మదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీ రంగ వృద్ధి ఒక మోస్తరుగానే ఉండనుంది. 16–18 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల్లో వైవిధ్యం, రుణాల ప్రొఫైల్ వంటివి వృద్ధి వ్యూహాల్లో కీలకంగా ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన స్థూల, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు .. రిటైల్ రుణాల వృద్ధికి ఊతమివ్వగలవని వివరించింది. రిటైల్గా గృహాలు, వాహనాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై చేసే వ్యయాలు పటిష్టంగా ఉండటంతో ప్రైవేట్ వినియోగమనేది దీర్ఘకాలిక సగటుకు పైన కొనసాగుతోందని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ గుర్ప్రీత్ చత్వాల్ తెలిపారు. అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం అయినప్పటికీ హామీతో కూడుకున్న రుణాలపై ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (హెచ్ఎఫ్సీ) ప్రభావం ఉండదని తెలిపారు. పటిష్టమైన అమ్మకాల దన్నుతో వాహన రుణాల విభాగం ఈ ఆర్థిక సంవత్సరం 18–19 శాతం వృద్ధి చెందగలదని వివరించారు. వచ్చే ఏడాది గృహ రుణాలు 14 శాతం అప్.. ఎన్బీఎఫ్సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) ప్రస్తుతం గృహ, వాహన రుణాలకు చెరో 25–27 శాతం వాటా ఉన్నట్లు క్రిసిల్ తెలిపింది. ఈ రెండూ స్థిరంగా వృద్ధి చెందగలవని వివరించింది. అఫోర్డబుల్ గృహ రుణాలపై (రూ. 25 లక్షల కన్నా లోపు) హెచ్ఎఫ్సీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం హోమ్ లోన్ సెగ్మెంట్ 12–14 శాతం వృద్ధి చెందగలదని క్రిసిల్ తెలిపింది. వాహన రుణాల విభాగం 2024–25 మధ్యకాలంలో స్థిరంగా 17–18 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీ ఏయూఎంలో అసురక్షిత రుణాల సెగ్మెంట్ మూడో అతి పెద్ద విభాగంగా ఉంది. మరోవైపు, బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీల నిధుల సమీకరణ వ్యయాలు 25–50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే, అవి ఎంత మేర బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉన్నాయనే అంశంపై వాటి ఆర్థిక పనితీరు మీద ప్రభావం ఉంటుందని వివరించింది. -
సూక్ష్మ రుణాల్లో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐల ప్రధాన పాత్ర
కోల్కతా: దేశంలో సూక్ష్మ రుణాల పంపిణీలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2022–23 సంవత్సరానికి సూక్ష్మ రుణ పరిశ్రమకు (ఎంఎఫ్ఐలు) సంబంధించి నివేదికను రూపొందించి విడుదల చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.1,38,310 కోట్ల రుణాలను ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అందించాయి. మొత్తం సూక్ష్మ రుణాల్లో ఇది 39.7 శాతానికి సమానం. సూక్ష్మ రుణాల్లో బ్యాంక్ల వాటా 34.2 శాతంగా ఉంది. ఇవి రూ.1,19,133 కోట్ల రుణాలను సమకూర్చాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లు అందించిన సూక్ష్మ రుణాలు రూ.57,828 కోట్లుగా (16.6 శాతం వాటా) ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఎంఎఫ్ఐల మొత్తం పోర్ట్ఫోలియో (రుణాలు) రూ.3,48,339 కోట్లుగా ఉంది. ఎంఎఫ్ఐ రంగానికి అపార వృద్ధి అవకాశాలు ఉన్నాయని, 2024 మార్చి నాటికి సూక్ష్మ రుణ పరిశ్రమ పరిమాణం రూ.13 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. నూతన నియంత్రణలు సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాలను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడింది. కరోనా తర్వాత నిధుల వితరణ, పోర్ట్ఫోలియో నాణ్యత, క్లయింట్ల చేరికలో ఎంఎఫ్ఐ పరిశ్రమ బలంగా పుంజుకున్నట్టు తెలిపింది. -
చిన్న ఎన్బీఎఫ్సీలకు సిడ్బీ సాయం
ముంబై: చిన్న ఎన్బీఎఫ్సీల వృద్ధిని వేగవంతం చేసేందుకు చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా బ్యాంక్ల నుంచి నిధుల పొందే అర్హతను వాటికి కలి్పంచనుంది. ఈ కార్యక్రమంలో తొలుత 18 చిన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్బీఎఫ్సీలు) చేర్చింది. చిన్న ఎన్బీఎఫ్సీలు మరింత విస్తరించేందుకు వీలుగా, వాటి అర్హతలను పెంచేందుకు ఐదు నెలల కార్యక్రమాన్ని రూపొందించినట్టు సిడ్బీ చైర్మన్, ఎండీ శివసుబ్రమణియన్ రామన్ తెలిపారు. రిస్క్, కార్యకలాపాలు, పరిపాలన, టెక్నాలజీ తదితర అంశాల్లో నిపుణుల మార్గదర్శకత్వాన్ని వాటికి అందించనున్నట్టు చెప్పారు. దేశంలో 8 కోట్ల చిన్న వ్యాపార సంస్థలు ఉంటే, కేవలం 15 శాతం వాటికే సంఘటిత మార్కెట్ (ఇనిస్టిట్యూషన్స్) నుంచి రుణ సాయం అందుతున్నట్టు రామన్ తెలిపారు. దీంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ వితరణ విభాగంలో భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. గడిచిన మూడేళ్లలో ఎంఎస్ఎంఈలకు సిడ్బీ రుణ వితరణ రూ.50,000 కోట్ల మార్క్ను అధిగమించినట్టు తెలిపారు. వ్యవస్థ మొత్తం మీద ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉండగా, వచ్చే రెండేళ్లలో రెట్టింపు అవుతుందన్నారు. ఇప్పుడున్న ఎంఎస్ఎంఈ రుణాల్లో కేవలం 28 శాతమే ఎన్బీఎఫ్సీలు సమకూర్చినవిగా తెలిపారు. తాము చేపట్టిన కార్యక్రమంలో భాగంగా.. ఎంఎస్ఎంఈలు ప్రధాన లక్ష్యంగా పనిచేసే ఎన్బీఎఫ్సీలకు సంఘటిత మార్కెట్ నుంచి నిధులు పొందే అర్హతను కలి్పంచడం ప్రధాన లక్ష్యమని రామన్ చెప్పారు. -
వారికి 6 నెలలే సమయం.. ఆర్బీఐ కీలక నిబంధనలు
అప్పుల ఎగవేతదారులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిబంధనలు ప్రతిపాదించింది. అకౌంట్లు నిరర్థకంగా మారిన ఆరు నెలల్లోపు సదరు రుణగ్రహీతలను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (Wilful Defaulters)గా ప్రకటించాలని బ్యాంకులకు, రుణ సంస్థలకు సూచించింది. (20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..) బకాయిలను చెల్లించగల సామర్థ్యం ఉండీ కూడా రుణాలు తిరిగి చెల్లించకుండా నిధులను ఇతర మార్గాలకు మళ్లీంచేవారిని ఆర్బీఐ ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారులు’ పరిగణిస్తుంది. అయితే దీనికి నిర్ధిష్ట కాల వ్యవధిని మాత్రం ఆర్బీఐ ఇంతవరకూ నిర్దేశించలేదు. ఇప్పుడు ప్రతిపాదించిన 6 నెలల కాలవ్యవధి నిబంధనలకు అనుగుణంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC) కూడా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా సమీక్షా కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ సూచించింది. అలాగే రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానమిచ్చేందుకు 15 రోజుల సమయం ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగతంగా విచారణకు సైత అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలలో పేర్కొంది. ఒక ఖాతా ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయినట్లు ప్రకటిస్తే.. తిరిగి ఆ ట్యాగ్ తొలగించిన ఒక సంవత్సరం వరకు బ్యాంకులు అదనపు రుణాలు మంజూరు చేయకూడదని ఆర్బీఐ నిర్దేశించింది. డిఫాల్ట్ అయిన ఖాతాను మరొక బ్యాంకుకు, రుణ సంస్థకు లేదా అసెట్ రీకన్స్ట్రక్షన్కు బదిలీ చేయడానికి ముందు 'విల్ఫుల్ డిఫాల్ట్'ని నిర్ధారించడానికి లేదా తోసిపుచ్చడానికి దానిపై విచారణ పూర్తి చేయాల్సి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అటువంటి ఖాతాలను రీస్ట్రక్చర్ చేయడానికి వీలుండదని స్పష్టం చేసింది. ముసాయిదా నిబంధనలపై వాటాదారులు అక్టోబర్ 31 వరకు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. -
కొత్త వ్యాపారంలోకి బంధన్ బ్యాంక్.. త్వరలో ఒప్పందాలు
కోల్కతా: కో లెండింగ్ (ఇతర సంస్థలతో కలసి రుణాలు ఇవ్వడం) వ్యాపారంలోకి తాము అడుగు పెడుతున్నట్టు బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ ప్రకటించారు. ఇందుకోసం తాము ఎన్బీఎఫ్సీలతో జట్టు కడతామని తెలిపారు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం గురువారం కోల్కతాలో జరిగింది. ఈ సందర్భంగా ఘోష్ ఈ ప్రకటన చేశారు. కో లెండింగ్ కింద అన్ని రకాల రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పటికే కొన్ని ఎన్బీఎఫ్సీలను ఎంపిక చేశామని, త్వరలోనే వారితో ఒప్పందాలు చేసుకోనున్నట్టు తెలిపారు. 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు ఎనిమిదేళ్ల క్రితం బంధన్ బ్యాంక్ తన కార్యకలాపాలు ప్రారంభించగా, నేడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 6,100 బ్యాంకింగ్ అవుట్లెట్లు కలిగి ఉన్నట్టు చెప్పారు. జమ్మూ కశ్మీర్లోని లేహ్లో తాజాగా ఒక శాఖను తెరవగా, సెప్టెంబర్లో కార్గిల్లో ఒకటి ప్రారంభించనున్నట్టు తెలిపారు. తమకు 3 కోట్ల కస్టమర్లు ఉన్నారని, వ్యాపారం రూ.2 లక్షల కోట్లు అధిగమించిందని వెల్లడించారు. కాసా డిపాజిట్ల రేషియో 39 శాతంగా ఉందన్నారు. బ్యాంకు లావాదేవీల్లో 94 శాతం డిజిటల్గా నమోదవుతున్నట్టు తెలిపారు. భౌగోళికంగా, రుణ విభాగాల పరంగా తాము మరింత వైవిధ్యాన్ని అమలు చేస్తామని, అందరికీ ఆర్థిక సేవలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఇదీ చదవండి: ఫోన్పే, గూగుల్పే, పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్! ఇకపై మరింత.. -
ఎన్బీఎఫ్సీలకు భారీగా బ్యాంకు రుణాలు
ముంబై: బ్యాంకుల నుంచి ఎన్బీఎఫ్సీలు భారీగా నిధుల సమీకరణ చేస్తున్నాయి. ఎన్బీఎఫ్సీలకు బ్యాంకుల రుణాలు జూన్లో 35 శాతం పెరిగి రూ.14.2 లక్షల కోట్లకు చేరినట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు అంతర్జాతీయ రుణాలపై ఆ ధారపడడాన్ని తగ్గించినట్టు ఇది తెలియజేస్తోందని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా 2022 జూన్ నాటికి ఉన్న 8.5 శాతం నుంచి ఈ ఏడాది జూన్ నాటికి 9.9 శాతానికి పెరిగినట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం జూలై 1 నుంచి అమల్లోకి వచి్చనందున.. బ్యాంకుల రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా తగ్గుతుందని అంచనా వేసింది. హెచ్డీఎఫ్సీ రుణాలు పునర్వర్గీకరణకు గురవుతాయని పేర్కొంది. ఎన్బీఎఫ్సీలకు మ్యూచువల్ ఫండ్స్ డెట్ పథకాల ఎక్స్పోజర్ సై తం జూన్లో 14.5 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేర్ రేటింగ్స్ వివరించింది. బ్యాంకుల రుణాల్లో ఎన్బీఎఫ్సీల వాటా 2018 ఫిబ్రవరి నాటికి 4.5 శాతంగా ఉంటే, అది ఈ ఏడా ది జూన్ నాటికి 10 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. 2021–22 ద్వితీయ ఆరు నెలల కాలం నుంచి ఎన్బీఎఫ్సీలకు బ్యాంకుల రుణాలు పెరుగుతూ వ స్తున్నట్టు కేర్రేటింగ్స్ వెల్లడించింది. కరోనా తర్వా త ఆరి్థక కార్యకలాపాలను తిరిగి పూర్తి స్థాయిలో తెరవడం ఇందుకు అనుకూలించినట్టు తెలిపింది. -
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీవో కుదింపు
ముంబై: ఎన్బీఎఫ్సీ.. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ గతేడాది నవంబర్లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్–డిసెంబర్ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది. -
ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్కు నిధుల్లేక సుస్తీ
సాక్షి, హైదరాబాద్: నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్నపరిశ్రమలను ఆదుకుని వాటి కార్యకలాపాలు కొనసాగించేందుకు వీలుగా రాష్ట్రప్రభుత్వం 2018లో ‘ది తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్’(టీఐహెచ్సీఎల్)ను ఏర్పాటు చేసింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)గా ప్రస్థానం ప్రారంభించిన హెల్త్ క్లినిక్ నిధుల కొరత ఎదుర్కొంటోంది. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్తో హెల్త్ క్లినిక్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా పదోవంతు అనగా రూ.10 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నుంచి మరో రూ.50 కోట్లు, ఎంఎస్ఎంఈలు, బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.40 కోట్లు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో రూ.10 కోట్లు విడుదల చేసినా కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. మరోవైపు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి కూడా స్పందన శూన్యం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మరో రూ.10 కోట్లు విడుదల చేసింది. ఈ కొద్ది నిధులతోనే ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ నష్టాల అంచులో ఉన్న పరిశ్రమలకు కన్సల్టింగ్, కౌన్సెలింగ్, మార్గదర్శనం వంటి సేవలను అందిస్తోంది. నిధుల సేకరణ కోసం ప్రయత్నాలు పారిశ్రామికంగా శరవేగంగా పురోగమిస్తున్న తెలంగాణలో సూక్ష్మ, చిన్న పరిశ్రమలే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఉద్యమ పోర్టల్ వివరాల ప్రకారం రాష్ట్రంలో 3.25 లక్షల సూక్ష్మ, చిన్న పరిశ్రమలు నమోదయ్యాయి. అయితే కరోనా పరిస్థితుల్లో అనేక సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పెట్టుబడి వ్యయం(వర్కింగ్ క్యాపిటల్) దొరక్కపోవడం, ఇతరత్రా కారణాలతో నష్టాల బాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల అంచులో ఉన్న సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ను ఆశ్రయిస్తున్నా నిధుల కొరతమూలంగా ఆశించిన సాయం అందడంలేదు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రభుత్వ ఆర్థిక సంస్థ ‘జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ’(జికా)తో రుణ వితరణ ఒప్పందం కోసం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ప్రయత్నిస్తోంది. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే ‘స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’(సిడ్బి)తో కూడా సంప్రదింపులు చేస్తోంది. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యకలాపాలు మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు నష్టాల అంచులో ఉన్న 45 పరిశ్రమలకు రూ.5.50 కోట్ల మేర ఆర్థిక సాయం లభించింది. నష్టాల అంచులో ఉన్న మరో 430 వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేసినట్లు సమాచారం. ఆదుకునేందుకు అన్ని రకాల ప్రయత్నం ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్పస్ ఫండ్ కోసం ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నాం. నష్టాల అంచు లో ఉన్న పరిశ్రమల వివరాలను బ్యాంకర్ల ద్వారా సేక రించడంతోపాటు సర్వేల ద్వారా కూడా గుర్తిస్తున్నాం. అయితే చాలా పరిశ్రమలు మూసివేతకు గురైన తర్వాతే యాజమాన్యాలు మా దగ్గరకు వస్తున్నాయి. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ కార్యకలాపాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత వర్గాలను కోరాం. – వెంకటేశ్వర్లు శిష్లా్ట, సీఈవో, ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ -
కార్ల అమ్మకాల్లో కార్స్24 దూకుడు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఎన్బీఎఫ్సీ విభాగం ఆకర్షణీయ ఫలితాలు సాధించనున్నట్లు సెకండ్హ్యాండ్(ప్రీఓన్డ్) వాహనాల ఈకామర్స్ ప్లాట్ఫామ్ కార్స్24 అంచనా వేస్తోంది. వినియోగించిన కార్లకు కనిపిస్తున్న భారీ డిమాండు నేపథ్యంలో 80–100 శాతం వృద్ధిని సాధించే వీలున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఎంవో గజేంద్ర జంగిడ్ పేర్కొన్నారు. గతేడాది(2021–22) నాన్బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) విభాగం రూ. 75 కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందుకు ప్రీఓన్డ్ కార్ల ఫైనాన్సింగ్ బిజినెస్ దోహదం చేసింది. 2019లో కంపెనీ ఎన్బీఎఫ్సీ లైసెన్సును పొందింది. తద్వారా కన్జూమర్లకు రుణాలివ్వడం ప్రారంభించినట్లు గజేంద్ర తెలియజేశారు. కంపెనీ ద్వారా విక్రయమవుతున్న ప్రతీ 2 కార్లలో ఒకదానికి ఫైనాన్స్ అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీయంగా ప్రీఓన్డ్ కార్ల విభాగంలో ఫైనాన్సింగ్ అవకాశాలు అతిస్వల్పమని వివరించారు. దీంతో ఎన్బీఎఫ్సీ లైసెన్సును తీసుకున్నట్లు వెల్లడించారు. -
ఎన్బీఎఫ్సీల ఆస్తులు రూ.54 లక్షల కోట్లు
ముంబై: ఎన్బీఎఫ్సీల ఆస్తులు 2022 మార్చి నాటికి రూ.54 లక్ష కోట్లకు చేరాయని, వాణిజ్య బ్యాంకుల బ్యాలన్స్ షీట్ పరంగా చూస్తే పావు శాతం మేర ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కృష్ణారావు కరాడ్ తెలిపారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీలు కుప్పకూలిపోవడంతో, ఎన్బీఎఫ్సీ రంగం దీర్ఘకాలంగా సంక్షోభాన్ని చూడడం తెలిసిందే. దీన్నుంచి ఈ రంగం బయటకువచ్చి మెరుగైన పనితీరు చూపిస్తుండడాన్ని మంత్రి ప్రస్తావించారు. సీఐఐ నిర్వహించిన ఎన్బీఎఫ్సీ సదస్సులో భాగంగా మంత్రి మాట్లాడారు. సూక్ష్మ, మధ్య స్థాయి కంపెనీలకు రుణాలు అందించడం ద్వారా ఎన్బీఎఫ్సీలు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈల కార్యకలాపాల విస్తరణకు, మరింత మందికి ఉపాధి కల్పనకు ఎన్బీఎఫ్సీలు సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకులతో పోలిస్తే రుణాల మంజూరులో ఎన్బీఎఫ్సీలే అధిక వృద్ధిని చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు రుణాల పరంగా 10 శాతం వృద్ధిని చూపిస్తే, బ్యాంకుల రుణ వితరణ వృద్ధి ఇందులో సగమే ఉందన్నారు. -
ఎన్బీఎఫ్సీల కోసం క్యాష్ఫ్రీ డిజిటల్ సొల్యూషన్
హైదరాబాద్: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), వాటి భాగస్వామ్య సంస్థల కోసం కొత్తగా డిజిటల్ సొల్యూషన్ను ప్రవేశపెట్టినట్లు క్యాష్ఫ్రీ పేమెంట్స్ సీఈవో ఆకాష్ సిన్హా తెలిపారు. రుణ వితరణ, వసూళ్ల కోసం ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత డిజిటల్ లెండింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సొల్యూషన్స్ పని చేస్తుందని సిన్హా వివరించారు. రుణగ్రహీత గుర్తింపు, బ్యాంకు ఖాతా ధృవీకరణ, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా నేరుగా రుణ గ్రహీత ఖాతాలోకే రుణాల బదలాయింపు మొదలైనవి దీనితో సులభతరం అవుతాయని పేర్కొన్నారు. -
ఎన్బీఎఫ్సీ కంపెనీలకు మంచి రోజులు
ముంబై: ఎన్బీఎఫ్సీ రంగానికి సంబంధించి క్రిసిల్ రేటింగ్స్ సానుకూల అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) వాటి ఆస్తులు నాలుగేళ్ల గరిష్ట స్థాయి అయిన 11–12 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. కరోనా కారణంగా వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల పాటు ఎన్బీఎఫ్సీ ఆస్తుల వృద్ధి కుంటుపడిందని, 2021–22లో కేవలం 5 శాతం వృద్ధికి పరిమితమైనట్టు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆస్తులు రెండంకెల స్థాయిలో పెరగొచ్చని అంచనా వేస్తూ.. అయినప్పటికీ కరోనా ముందున్న 20 శాతం వృద్ధి కంటే తక్కువేనని పేర్కొంది. బ్యాంకుల నుంచి తీవ్ర పోటీ ఉండడం, వడ్డీ రేట్ల పెరుగుదల కొన్ని విభాగాల్లో ఎన్బీఎఫ్సీల పోటీతత్వాన్ని ప్రభావితం చేస్తాయని అంచనా వేసింది. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు అధిక రాబడులు వచ్చే విభాగాలపై దృష్టి సారించొచ్చని పేర్కొంది. వాహన రుణాల్లో మెరుగైన వృద్ధి.. ఎన్బీఎఫ్సీ ఆస్తుల్లో (అవి ఇచ్చిన రుణాలు) సగం మేర వాహన రుణాలే ఉంటాయి. ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 11-13 శాతం వరకు పెరుగుతాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. క్రితం రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ వాహన రుణాల్లో వృద్ధి 3–4 శాతంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. పునర్వినియోగ వాహన రుణాల్లో అధిక వృద్ధిని ఎన్బీఎఫ్సీలు చూస్తాయని, వీటిల్లో అధిక మార్జిన్లు ఉంటాయనే విషయాలను ప్రస్తావించింది. వాహన రుణాలు ఆశాజనకంగా ఉండడం, ఇన్ఫ్రా రంగం నుంచి వాహనాలను మార్చేందుకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ తెలిపింది. తీవ్ర పోటీ, పెరిగే వడ్డీ రేట్ల వల్ల కొత్త వాహన రుణాల్లో బ్యాంకులు పైచేయి చూపించొచ్చని పేర్కొంది. -
ప్రస్తుత డిజిటల్ రుణాలకూ కొత్త నిబంధనలు
ముంబై: డిజిటల్ రుణాలకు సంబంధించి ఇటీవల ప్రకటించిన కొత్త నిబంధనలను, ఇప్పటికే పంపిణీ చేసిన డిజిటల్ రుణాలకు సైతం వర్తింపజేయాలని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకు నవంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అసాధారణ స్థాయిలో వడ్డీ రేట్లు, అనైతిక రుణ వసూళ్లను కట్టడి చేస్తూ నూతన నిబంధనలను ఆర్బీఐ గత నెలలో ప్రకటించింది. డిజిటల్ రుణాలకు మధ్యవర్తులుగా వ్యవహరించే ఫిన్టెక్ సంస్థలు కస్టమర్ల నుంచి చార్జీ వసూలు చేయకూడదని కూడా ఆదేశించింది. బ్యాంకులే ఈ చార్జీలను చెల్లించాలని నిర్దేశించింది. మొబైల్ యాప్లు, డిజిటల్ మాధ్యమాల ద్వారా మంజూరు చేసే రుణాలకు ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే తీసుకున్న డిజిటల్ రుణాలు, తాజాగా తీసుకునే వాటికి కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. ప్రస్తుత రుణాలనూ కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చేందుకు తగిన సమయం ఇస్తున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. కొత్త నిబంధనల కింద రుణాన్ని బ్యాంకు నేరుగా రుణ గ్రహీత ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ లేదా డిజిటల్ లెండింగ్ యాప్ (డీఎల్ఏ) ద్వారా రుణ దరఖాస్తు వచ్చినప్పటికీ, ఆ రుణాన్ని మంజూరు చేసే సంస్థ, నేరుగా రుణ గ్రహీతకు అందించాలి. -
పేదల నడ్డి విరుస్తున్న అడ్డగోలు వడ్డీ వసూళ్లు, ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: డిజిటల్గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్టెక్లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలన్నది ఆర్బీఐ కార్యాచరణగా ఉంది. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలు.. ► రుణ ఒప్పందానికి ముందు రుణ గ్రహీతకు కీలకమైన వాస్తవ సమాచార స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్) ఇవ్వాలని ఆర్బీఐ నిర్ధేశించింది. ఆర్బీఐ నియంత్రణల కింద పనిచేసే సంస్థలు, డిజిటల్ లెండింగ్ యాప్లు, వీటి కింద పనిచేసే రుణ సేవల సంస్థలు (థర్డ్పార్టీ) దీన్ని తప్పక పాటించాలి. ► రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిక్గా రుణ పరిమితి పెంచడాన్ని నిషేధించింది. ► డిజిటల్ రుణాలను అసలుతోపాటు, అప్పటి వరకు వడ్డీతో చెల్లించి (ఎటువంటి పెనాల్టీ లేకుండా) క్లోజ్ చేసేందుకు వీలుగా కూలింగ్ ఆఫ్/ లుక్ అప్ పీరియడ్ను కల్పించాలి. ► రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే.. అంబుడ్స్మన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ► డిజిటల్ లెండింగ్ యాప్లు, రుణ సేవల సంస్థలు రుణ గ్రహీత అనుమతితో, కావాల్సిన వివరాలను మాత్రమే తీసుకోవాలి. డేటా వినియోగంపై రుణ గ్రహీత అనుమతి తీసుకోవాలి. ► ఫిన్టెక్, డిజిటల్ లెండింగ్ సేవలపై ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా నియంత్రిత సంస్థలు, వాటి కింద రుణ సేవలను అందించే సంస్థలు తగిన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించే రుణాలను డిజిటల్ లెండింగ్గా పరిగణిస్తారు. -
Foreclosure: వేలంలో ‘ప్రాపర్టీ’ కొనొచ్చా?
సొంతిల్లు ప్రతి ఒక్కరి లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. కానీ, మార్కెట్లో ఇళ్ల ధరలు చూస్తే.. అంత పెట్టి కొనగలమా? అనేట్టు ఉన్నాయి. మధ్యతరగతి వారు కూడా కొనలేని విధంగా కొన్ని ప్రాంతాల్లో రేట్లు ఉన్నాయంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ పరిస్థితుల్లో కొంచెం అందుబాటు ధరల ఇళ్లు ఎక్కడ ఉన్నాయి? కొన్నేళ్ల పాతది అయినా ఫర్వాలేదని భావించే వారికి.. ‘ఫోర్ క్లోజ్డ్’ ప్రాపర్టీలు (జప్తు చేసిన ఆస్తులు) ఒక మార్గం. బ్యాంకులు జప్తు చేసిన ఈ ఆస్తులలో తమ స్థోమతకు తగ్గట్టు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకు ఏం చేయాలి? అనుసరించాల్సిన ప్రక్రియ ఏంటి? ఇందులో ఉండే లాభ, నష్టాల వివరాలను తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇళ్లు, ఫ్లాట్ల కొనుగోలుకు రుణాలు ఇస్తుంటాయి. రుణ గ్రహీతలు నెలవారీ ఈఎంఐల చెల్లింపుల్లో విఫలమైతే ఆయా ఆస్తులను బ్యాంక్లు స్వాధీనం చేసుకుంటాయి. నిర్ణీత కాలం పాటు రుణ వాయిదాలు చెల్లించకపోతే రుణ గ్రహీతకు నోటీసు ఇచ్చిన తర్వాత బ్యాంకులు ఈ చర్యలు చేపడతాయి. ఇలా బ్యాంకుల స్వాధీనంలోకి వెళ్లిన వాటిని ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీస్గా చెబుతారు. ఇలాంటి ఆస్తులకు బ్యాంకులు వేలం నిర్వహిస్తుంటాయి. వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రుణ వసూలుగా అవి ఖాతాల్లో చూపిస్తాయి. అంటే తాము ఇచ్చిన రుణాన్ని ఈ రూపంలో అవి రికవరీ చేసుకుంటాయి. ఒక్కసారి బ్యాంక్ ఓ ఇంటిని స్వాధీనం చేసుకుందంటే.. సర్ఫేసీ చట్టం కింద దానికి యజమానిగా మారిపోతుంది. అటువంటి ఇళ్లను విక్రయించేందుకు నూరు శాతం హక్కులు వాటికి దఖలు పడతాయి. ఈ తరహా ప్రాపర్టీలను మార్కెట్లో పలుకుతున్న రేటు కంటే తక్కువకే బ్యాంకులు సాధారణంగా విక్రయిస్తుంటాయి. ఎందుకంటే తమ రుణ బకాయిలను రాబట్టుకోవడమే ఇక్కడ బ్యాంకులకు ప్రాధాన్యంగా ఉంటుంది. అంతేకానీ, మార్కెట్ రేటు కంటే మెరుగైన ధరకు విక్రయించుకుని, కాస్త లాభపడదామన్న సగటు వినియోగదారుని ధోరణి బ్యాంకులకు ఉండదు. పైగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 70–80 శాతానికే రుణం ఇస్తాయి. అది కూడా ప్రభుత్వ రికార్డుల్లోని వ్యాల్యుయేషన్ ఆధారంగానే ఉంటుంది. మార్కెట్ రేటు ఆధారంగా రుణాలు ఇవ్వవు. ప్రాపర్టీని సగం ధరకు విక్రయించినా వాటి రుణం మొత్తం వసూలైపోతుంది. అందుకనే తక్కువ రేటుకు ఫోర్క్లోజ్డ్ ప్రాపర్టీలు లభిస్తుంటాయి. అనుకూలతలు... ప్రతికూలతలు బ్యాంకులు వేలానికి పెట్టే ఇళ్ల ధరలు మార్కెట్ రేటు కంటే తక్కువకు లభించడమే ప్రధాన అనుకూలతగా చెప్పుకోవాలి. ఎంత మేర తక్కువకు వస్తాయంటే..? కచ్చితంగా ఇంత శాతం అని కాకుండా, సంబంధిత ప్రాపర్టీ పట్టణంలోనా, పట్టణ శివారులోనా, మండల కేంద్రంలోనా అనే దాని ఆధారంగా రేట్ల వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా 20–30 శాతం వరకు మార్కెట్ రేటు కంటే చౌకగా ఇవి లభిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే రుణ బకాయి ఎంత మేరకు బ్యాంకుకు వసూలు కావాల్సి ఉందన్న అంశం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఇచ్చిన రుణంలో సగమే తిరిగి రావాలనుకుంటే బ్యాంకులు ఇంకాస్త తక్కువ ధరకే వాటిని విడిచిపెట్టొచ్చు. ఇలా వేలంలో కొనుగోలు చేసే జప్తు ఆస్తులకు న్యాయపరమైన చిక్కులు దాదాపుగా ఉండవు. ఎందుకంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఆయా ప్రాపర్టీలకు రుణాలు ఇచ్చే ముందు న్యాయపరమైన అన్ని కోణాలను పరిశీలిస్తాయి. పైగా బ్యాంక్ వేలాలకు చట్టపరమైన రక్షణ ఉంది. ఇవి సర్ఫేసీ చట్టం, డీఆర్టీ చట్టం పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల వేలంలో కొనుగోలు చేసిన వాటి బదిలీ ప్రక్రియ రెండు మూడు నెలల్లో పూర్తయిపోతుంది. యాజమాన్య హక్కులు ఒక నెలలోనే లభిస్తాయి. కాకపోతే వాటి స్వాధీనానికి మరో నెల, రెండు నెలలు పట్టొచ్చు. ∙ బ్యాంకులు స్వాధీనం చేసుకుని విక్రయించే ఇళ్ల నాణ్యత ఏ మేరకు అన్నది సందేహమే. బ్యాంకులు రుణం వసూలు కాకపోతే రుణ గ్రహీత నుంచి ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని వేలం పెడతాయే కానీ, దాని వయసు ఎంత? కండీషన్ బాగుందా, లేదా, నాణ్యత ఇత్యాది అంశాలేవీ అవి పట్టించుకోవు, ఆ వివరాలను వెల్లడించవు. ఏవైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే అవి వేలంలో కొనుగోలు చేసుకున్న వ్యక్తే భరించాల్సి ఉంటుంది. బ్యాంకులు చేయించి ఇవ్వవు. వాటిపై ఆ బాధ్యత కూడా ఉండదు. ఉన్నది ఉన్న స్థితిలోనే వేలం పెడుతున్నట్టు నియమ, నిబంధనల్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు స్పష్టంగా పేర్కొంటాయి. కనుక నాసిరకం నిర్మాణం అయితే ఆ మేరకు కొనుగోలుదారు నిరాశకు గురికావచ్చు. చూడాల్సినవి.. ముందు జాగ్రత్తలు.. జప్తు చేసిన ఇంటికి పూర్వపు యజమాని (రుణం చెల్లించలేకపోయిన) నుంచి కొన్ని బాకీలు ఉండొచ్చు. ప్రాపర్టీ పన్నులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్రా ఏవైనా బకాయిలు ఉంటే వాటికి బ్యాంకులు బాధ్యత వహించవు. వేలంలో కొనుగోలు చేసిన వారే స్వయంగా ఆయా బకాయిలు తీర్చేయాల్సి ఉంటుంది. వేలానికి పెట్టిన ఇల్లు, ధర ఆకర్షణీయంగా ఉన్నాయని, ఇంకేవీ తెలుసుకోకుండా ఉత్సాహంగా పాల్గొని కొనేయడం కాకుండా.. ముందస్తుగా ఈ వివరాలు అన్నీ ఆరాతీయాలి. కనుక ప్రాపర్టీ వ్యవహారాల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. వారితో డాక్యుమెంట్లను తనిఖీ చేయించాలి. మరీ పాత ఇళ్లను కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే 20–30 ఏళ్లు దాటిన ఇళ్లకు ఏమంత విలువ ఉండదు. అందులో నివాసం ఉండేట్టు అయితే పూర్తిగా నవీకరించుకోవాల్సి రావచ్చు. అందుకోసం ఖర్చు అంచనా ఉండాలి. వేలానికి వచ్చే ఇళ్లు/ఫ్లాట్లలో ఎవరైనా అద్దెకు ఉంటే, వారిని ఖాళీ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా కొనుగోలుదారుపైనే ఉంటుంది. చాలా కాలంగా కిరాయిదారు ఉంటే, కొన్ని సందర్భాల్లో ఖాళీ చేసి వెళ్లిపోవడానికి నిరాకరించొచ్చు. అందుకని వేలానికి ఉంచిన ఇళ్లల్లో కిరాయిదారు ఉంటున్నట్టు అయితే వాటిని ఎంపిక చేసుకోకుండా ఉండడమే మంచి నిర్ణయం అవుతుంది. గుర్తించడం ఎలా..? జప్తు చేసిన ఆస్తులకు సంబంధించిన సమాచారం అంతగా ప్రచారంలో ఉండదు. వీటి గురించి తెలియజేసే ఓ ఏకీకృత డేటాబేస్ అంటూ లేదు. అందుకని ఫోర్ క్లోజ్డ్ ఆస్తులకు సంబంధించిన సమాచారం కోసం ప్రత్యేకంగా కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. ‘ఫోర్క్లోజర్ఇండియా డాట్ కామ్’, ఎన్పీఏసోర్స్ డాట్ కామ్, బ్యాంక్ ఈఆక్షన్స్, బ్యాంకుడీఆర్టీ డాట్ కామ్ పోర్టళ్లను పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే, స్థానిక పత్రికల్లోనూ బ్యాంకులు ప్రకటనలు ఇచ్చి వేలం నిర్వహిస్తుంటాయి. వీటికి సంబంధించి బ్యాంక్ శాఖల వద్ద బ్యానర్లు కూడా కనిపిస్తుంటాయి. ఎస్బీఐ అయితే తన పోర్టల్లోనే ఇలాంటి వేలం ఆస్తులకు ప్రత్యేక పేజీ నిర్వహిస్తోంది. బ్యాంకు శాఖలను సంప్రదించడం ద్వారా వేలానికి వచ్చే ప్రాపర్టీల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రాపర్టీ ఎంపిక, వేలంలో పాల్గొనడం..? వేలానికి సంబంధించి ప్రాథమిక సమాచారం తెలుసుకున్న తర్వాత బ్యాంక్ అధికారితో కలసి జప్తు చేసిన ఇంటిని సందర్శించొచ్చు. వేలం పోర్టల్లో ఇంటిపై రుణం తీసుకుని చెల్లించలేకపోయిన వ్యక్తి పేరు, ప్రాపర్టీ ఏ ప్రాంతంలో ఉంది?, రిజర్వ్ ధర, వేలం తేదీ, సమయం, ముందస్తుగా చేయాల్సిన డిపాజిట్, ఇలాంటి వివరాలు అన్నీ ఉంటాయి. వేలంలో పాల్గొనాలని నిర్ణయించుకుంటే దరఖాస్తుతోపాటు, కేవైసీ డాక్యుమెంట్లను బ్యాంక్కు సమర్పించాలి. అలాగే బిడ్ విలువలో 5–20 శాతాన్ని వేలానికి ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. వేలం రోజున అధికంగా బిడ్ చేసిన వ్యక్తిని విజేతగా బ్యాంక్ ప్రకటిస్తుంది. సంబంధిత వ్యక్తి బిడ్ ధరలో ముందుగా చెల్లించింది మినహాయించగా, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు చెప్పిన తేదీలోపు చెల్లించాలి. దీనికి ఎంత వ్యవధి, నియమ, నిబంధనలను బ్యాంకులు ముందే ప్రకటిస్తాయి. అవసరమైతే అప్పుడు రుణ మార్గాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, ముందుగా సంబంధిత ప్రాపర్టీకి సరిపడా తమ వంతుగా సమకూర్చుకునే సామర్థ్యం ఉంటేనే వేలంలో పాల్గొనాలి. -
ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు సానుకూలం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), గృహ రుణ సంస్థలు (హెచ్ఎఫ్సీలు) నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం మేర వృద్ధిని చూస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల ఏయూఎం వృద్ధి ప్రధానంగా చివరి త్రైమాసికం (2022 జనవరి-మార్చి)లో నమోదైనట్టుగా పేర్కొంది. హెచ్ఎఫ్సీల ఆస్తులు 10 శాతం పెరగ్గా, ఎన్బీఎఫ్సీల రిటైల్ ఆస్తులు 8.5 శాతం, హోల్సేల్ ఆస్తులు 12 శాతం చొప్పున వృద్ధి చెందాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు (ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు కాకుండా) మొత్తం మీద 9–11 శాతం మేర వృద్ధిని నమోదు చేయగలవని అంచనా వేస్తున్నట్టు ఇక్రా వివరించింది. ఈ సంస్థలు ఇచ్చిన రుణాలనే ఆస్తులుగా పరిగణిస్తారు. నిధుల మార్గాలు ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు తమ నిధుల అవసరాల కోసం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ (ఎన్సీడీలు) ఇష్యూలను చేపట్టడం అన్నది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎన్నో త్రైమాసికాల కనిష్టానికి చేరినట్టు ఇక్రా నివేదిక తెలియ జేసింది. 2021-22 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 28 శాతం తగ్గాయని, 2020-21 మొదటి త్రైమాసికంలోని ఇష్యూలతో పోల్చినా 65 శాతం తక్కువగా ఉన్నట్టు వివరించింది. ఆర్బీఐ ఈ ఏడాది మే, జూన్ నెలల్లో రెపో రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణం పెరిగిన పరిస్థితుల్లో వీటి ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతగా లేదని తెలిపింది. కమర్షియల్ పేపర్ల రూపంలో నిధుల సమీకరణ గత కొన్ని నెలల్లో కొంత పుంజుకున్నట్టు పేర్కొంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమం, పోటీ ఒత్తిళ్ల నేపథ్యంలో ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు మార్జిన్లను కాపాడుకు నేందుకు స్వల్పకాల నిధుల వాటాను పెంచుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. -
పెరిగిపోతున్న ఆర్ధిక నేరాలు, బ్యాంకులకు ఆర్బీఐ కీలక నిబంధనలు!
ముంబై: బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సహా తన నియంత్రణలో ఉన్న ఇతరత్రా సంస్థలు ఆర్థిక, పరపతిపరమైన రిస్కుల్లో పడకుండా చూసేలా..ఐటీ సర్వీసుల అవుట్సోర్సింగ్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు మొదలైనవి బోర్డు ఆమోదిత సమగ్ర ఐటీ అవుట్సోర్సింగ్ విధానాన్ని పాటించాల్సి ఉంటుంది. ఏ కార్యకలాపాలనైనా అవుట్సోర్సింగ్కు ఇచ్చినంత మాత్రాన సదరు నియంత్రిత సంస్థ (ఆర్ఈ) తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కుదరదని, అంతిమంగా ఆయా అంశాలకు సంబంధించి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని ఆర్బీఐ స్పష్టం చేసింది. అవుట్సోర్సింగ్ సంస్థ కచ్చితంగా ఆర్ఈ ప్రమాణాలతోనే కస్టమర్లకు అందించాల్సి ఉంటుందని, అలా చేసేలా చూడాల్సిన బాధ్యత ఆర్ఈదేనని తెలిపింది. బోర్డు .. సీనియర్ మేనేజ్మెంట్ పాత్ర, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల వినియోగం, సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్వోసీ) అవుట్సోర్సింగ్ మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలను ముసాయిదా ప్రతిపాదనలో ఆర్బీఐ పేర్కొంది. ఆర్ఈలు పటిష్టమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వీటిపై జూలై 22లోగా పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉంటుంది. -
అన్ని రుణాలూ భారమే
న్యూఢిల్లీ: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు హెచ్డీఎఫ్సీ ఇప్పటికే రేట్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాల రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువగా రెపో ఆధారిత రేట్ల విధానాన్నే రుణాలు, డిపాజిట్లకు అనుసరిస్తున్నాయి. జూన్ 8నాటి సమీక్షలో ఆర్బీఐ అర శాతం మేర రెపో రేటును పెంచింది. దీనికి నెల ముందు 0.40 శాతం పెంచడంతో నెలన్నర వ్యవధిలోనే 0.90 శాతం రేటు పెంపు అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంతో కమోడిటీల ధరలు అదుపు తప్పాయి. అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధి దాటిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రేట్ల పెంపు బాట పట్టింది. ఒక్కో బ్యాంకు.. ► ఐసీఐసీఐ బ్యాంకు రెపో అనుసంధానిత ‘ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు’ (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతం నుంచి 8.60 శాతం చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 8 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ► పీఎన్బీ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.90% నుంచి 7.40% చేసింది. ► బ్యాంకు ఆఫ్ బరోడా సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.40 శాతానికి సవరించింది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటును 7.05 శాతానికి సవరిస్తూ ఆర్బీఐ జూన్ పాలసీకి ముందే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా కలిపి రుణాలపై వడ్డీ రేటును అమలు చేయనుంది. ► హెచ్డీఎఫ్సీ.. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై అర శాతం పెంచింది. ఇది జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల కాల గృహ రుణాలపై ప్రతీ రూ.లక్షకు రూ.31 పెరిగినట్టయింది. ► ఇండియన్ బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్ను 7.70 శాతానికి, బ్యాంకు ఆఫ్ ఇండియా 7.75 శాతానికి పెంచాయి. ► ఐఓబీ ఆర్ఎల్ఎల్ఆర్ను జూన్ 10 నుంచి 7.75%కి సవరించినట్టు తెలిపింది. ► బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.20 శాతం నుంచి 7.70 శాతానికి సవరించినట్టు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రుణాలపైనా 0.30% మేర రేటును పెంచింది. ► కెనరా బ్యాంకు ఏడాది ఎంసీఎల్ఆర్ను 7.35 శాతం నుంచి 7.40 శాతం చేస్తూ, జూన్ 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ► 2019 అక్టోబర్ 1 నుంచి రెపో, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటును బ్యాంకులు అమలు చేస్తున్నాయి. అంతక్రితం ఎంసీఎల్ఆర్ విధానం ఉంది. -
హోమ్లోన్.. భారంగా మారుతోంది!
నాలుగేళ్ల విరామం తర్వాత కీలక రెపో రేటును ఆర్బీఐ 0.40 శాతం పెంచడం ఆలస్యం.. వరుసగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణ రేట్ల పెంపును అమల్లోకి తెస్తున్నాయి. ముఖ్యంగా 2020 నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగాయి. మంచి క్రెడిట్ స్కోరుతో మూడు నెలల క్రితం బ్యాంకును సంప్రదించి ఉంటే 6.5 శాతానికే గృహరుణం లభించేది. కానీ, ఇప్పుడు వెళ్లి అడిగితే 6.9–7 శాతం కంటే చౌక ఆఫర్ వినిపించకపోవచ్చు. ప్రముఖ గృహ రుణ సంస్థ హెచ్డీఎఫ్సీ సైతం రుణ రేట్లను 7–7.45 శాతానికి పెంచింది. ఎస్బీఐ సహా ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా రేట్లను సవరించాయి. రుణాల రేట్లే కాదు డిపాజిట్ రేట్లు కూడా పెరుగుతున్నాయి. దీంతో గృహ రుణం తీసుకోవాలని భావించే వారు ఇప్పుడు అప్రమ్తతం కావాలి. ఎందుకంటే గత ఏడాది కాలంలో మంజూరు చేసిన రుణాల్లో సగానికి సగం రెపో రేటు ఆధారితమే. కనుక రెపోతో పాటు రెపో రుణ రేట్లు కూడా వెనువెంటనే సవరణకు లోనవుతాయి. ఇది రుణ గ్రహీతలకు భారంగా మారుతుంది. కనుక గృహ రుణ గ్రహీతలు ఈ తరుణంలో ఏది చేస్తే బావుంటుంది..? నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయి..? వేచి చూస్తే లాభం లేదు.. వడ్డీ రేటు తక్కువకు లభిస్తుందేమో..? అని వేచి చూడడం పొరపాటే అవుతుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంటున్న వేళ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం అసాధ్యం. రానున్న ఏడాది కాలంలో పలు విడతలుగా ఆర్బీఐ కీలక రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ రెండు, మూడో ఇల్లు కొనుగోలు చేస్తుంటే కనుక వేచి చూస్తానంటే అది వేరే విషయం. కానీ, మొదటి ఇల్లు సమకూర్చుకోవాలన్నది మీ ప్రాధాన్య జాబితాలో ఉంటే వెంటనే గృహ రుణంతో ఇల్లు సమకూర్చుకోవడమే రైట్. ఇక్కడ గృహ రుణ రేటే కాదు.. ప్రాపర్టీ రేటు కూడా చూడాలి. కరోనా సంక్షోభానంతరం రియల్టీ మార్కెట్లో ధరలు పడిపోయి అక్కడి నుంచి కోలుకున్నాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. కనుక ప్రాపర్టీ ధరలతో ముడిపెట్టి గృహ రుణ రేటును చూడాలి. వేచి చూస్తే ప్రాపర్టీ ధరలు దిగొస్తాయా..? లేక రెక్కలు విప్పుకుంటాయా..? ఎవరు చెప్పగలరు. ఆలస్యం చేస్తే ముందు ముందు మరింత అధిక రేటుపై రుణం తీసుకోవాల్సి రావచ్చు. ప్రతి 10 బేసిస్ పాయింట్లు (అంటే 0.1 శాతం) రుణ రేటు పెరిగితే రూ.లక్షపై ఒక ఏడాదికి పడే అదనపు భారం రూ.100. రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే అప్పుడు రూ.5000 భారం అవుతుంది. కనుక మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారు రుణదాతలతో సంప్రదింపులు చేయడం వల్ల కనిష్ట రేటుపై గృహ రుణం లభించే అవకాశం లేకపోలేదు. రుణ రేట్లను తగ్గించే అధికారం అందరికీ ఉండదు. బ్యాంకు హోంశాఖ లేదంటే ప్రత్యేక రిలేషన్షిప్ మేనేజర్ను ఈ విషయమై సంప్రదించొచ్చు. ఫోన్ కాల్స్తో రుణ రేట్ల గురించి బేరమాడడం ఫలితాలనివ్వదు. మరోవైపు కమోడిటీల మంటలతో నిర్మాణ వ్యయాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ భారాన్ని ఇళ్ల విక్రయధరలతో డెవలపర్లు సర్దుబాటు చేసుకోవాల్సిందే. అందుకే ఆలస్యం చేస్తే రెండు విధాలుగా భారం పడొచ్చు. రుణ కాలవ్యవధి గృహ రుణం తీసుకునే సమయంలో సాధారణంగా ఈఎంఐ(ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్) ఎంతన్నది చూసి చెల్లించగలిగే సామర్థ్యం ఆధారంగా కాలవ్యవధిని నిర్ణయించుకుంటూ ఉంటారు. తక్కువ టర్మ్ పెట్టుకుంటే ఎక్కువ ఈఎంఐ చెల్లించాలి. అప్పుడు వడ్డీ భారం తక్కువగా ఉంటుంది. అదే ఎక్కువ కాల వ్యవధిని నిర్ణయించుకోవడం వల్ల ఈఎంఐ భారం తగ్గినట్టు అనిపించొచ్చు. కానీ, దీర్ఘకాలంలో వడ్డీ రూపంలో చెల్లించే మొత్తం పెరిగిపోతుంది. అయితే, ఎంత గృహ రుణం తీసుకోవాలి, ఈఎంఐ ఎంత నిర్ణయించుకోవాలన్నది అంత సులభంగా తేలే అంశం కాదు. కచ్చితంగా నిపుణుల సాయం తీసుకోవడం మంచిది. ఇక్కడ పన్ను ఆదా ప్రయోజనాన్ని కూడా చూడాలి. రిటైర్మెంట్కు ఎన్నేళ్ల కాలం మిగిలి ఉంది? చెల్లింపుల సామర్థ్యం, ఇతర జీవిత లక్ష్యాలు, వాటికి సంబంధించి చేయాల్సిన కేటాయింపులు అన్నీ చూసుకున్న తర్వాత గృహ రుణాన్ని అనుకూలమైన కాలవ్యవధికి తీసుకోవాలి. నిపుణుల అవసరం వద్దనుకుంటే మధ్యే మార్గంగా మీడియం టర్మ్ను ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.50 లక్షల రుణాన్ని 6.99 శాతం వడ్డీ రేటుపై తీసుకుంటే పదేళ్ల టర్మ్లో చెల్లించే వడ్డీ రూ.19 లక్షలుగా ఉంటుంది. రుణ కాలాన్ని 20 ఏళ్లకు పెంచుకుంటే చెల్లించే వడ్డీ మొత్తం రూ.43 లక్షలు. కనుక వెసులుబాటు ఉంటే అధిక ఈఎంఐను నిర్ణయించుకోవడమే సరైనది. ఒకవేళ టర్మ్ ఎక్కువ పెట్టుకున్నా.. వెసులుబాటు ఉన్నప్పుడల్లా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం మంచి ఐడియా. లోన్ టు వ్యాల్యూ ప్రాపర్టీ విలువలో బ్యాంకు మంజూరు చేసే రుణాన్ని లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ)గా చెబుతారు. సాధారణంగా బ్యాంకులు ప్రాపర్టీ విలువలో 60–65 శాతం వరకు రుణంగా మంజూరు చేస్తుంటాయి. అదే ఎన్బీఎఫ్సీలు అయితే ఇంకొంచెం రిస్క్ చేసి 75 శాతం వరకు రుణంగా ఇస్తాయి. మిగిలిన మేర రుణ గ్రహీత స్వయంగా సమకూర్చుకోవాలి. ఉదాహరణకు రూ.1.50 కోట్ల విలువ చేసే ఫ్లాట్ను కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. బ్యాంకులు రుణదాత వంతుగా రూ.60 లక్షలు సమకూర్చుకోవాలని కోరొచ్చు. బ్యాంకులు కొంచెం అధికంగా ఇచ్చినా.. రుణదాత తనవైపు నుంచి వీలైనంత అధిక భాగాన్ని సమకూర్చుకుని, మిగిలిన మేరే బ్యాంకు నుంచి తీసుకోవడం మంచిది. దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది. ముఖ్యంగా రుణ రేట్లు పెరిగే కాలంలో రుణ గ్రహీతలు తమ భాగం ఎక్కువ ఉండేలా చూసుకోవడం ఒక మార్గం. లేదంటే అధిక పన్ను శ్లాబు (30 శాతం) పరిధిలోకి వచ్చి.. భారీగా ఆదాయపన్ను కడుతూ ఎక్కువ ఆదా చేసుకోవాలని అనుకునే వారు బ్యాంకులు ఇచ్చే గరిష్ట ఎల్టీవీవైపే మొగ్గు చూపించడం మంచిది. దీనివల్ల వడ్డీకి చేసే చెల్లింపులు, అసలుపై క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఫిక్స్డ్ టెన్యూర్ దాదాపు చాలా బ్యాంకులు గృహ రుణాలను రెపో రేట్లతో అనుసంధానించాయి. రెపోను ఆర్బీఐ 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచిన తర్వాత పలు బ్యాంకులు రెపో ఆధారిత రుణ రేటును పెంచాయి. రెపో రేటు మార్పునకు లోనైతే త్రైమాసికం వారీగా గృహ రుణ రేటు కూడా సవరణకు లోను కావచ్చు. బ్యాంకులు రెపో రేటు సవరణను వెంటనే ఆచరణలో పెట్టే విధంగా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. కనుక ఇక మీదట వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో గృహ రుణ రేట్లు కూడా ఆ మేరకు సవరణకు లోనవుతాయి. ఇది రుణాలు తీసుకున్న వారి నగదు ప్రవాహాలపై ప్రభావం చూపిస్తుంది. ఫ్లోటింగ్ రుణంలో సహజం గానే ఈ రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ రేటు రుణాలను ఇప్పుడు బ్యాంకులు దాదాపుగా ఆఫర్ చేయడం లేదు. చేస్తే కనుక ఫిక్స్డ్ రేటుపై రుణం తీసుకోవడమే లాభదాయకం. ఫ్లోటింగ్ రేటుకు వెళ్లాలా? కొన్ని బ్యాంకులు 2–3 ఏళ్లపాటు ఫిక్స్డ్ రేటును, ఆ తర్వాత నుంచి ఫ్లోటింగ్ రేటును అమలు చేస్తున్నాయి. రుణ గ్రహీతపై ఒకేసారి భారం పెరగకుండా ఈ విధానాన్ని అనుసరిస్తుంటాయి. ఉదాహరణకు 15 ఏళ్ల గృహ రుణ కాలంలో మొదటి ఐదేళ్లు చేసే చెల్లింపుల్లో అధిక భాగం వడ్డీకే వెళుతుంది. కనుక ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని టైమ్బౌండ్ ఫిక్స్డ్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక ఫ్లోటింగ్ రేటు రుణానికే వెళ్లాలా? అన్నది నిర్ణయించుకోవాలి. ఎన్బీఎఫ్సీలు టైమ్బౌండ్ ఫిక్స్డ్ రేటు విధానంపై రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. ఒకవేళ కొనుగోలు చేసే ప్రాపర్టీ ధర రూ.2–3 కోట్లు అంతకుమించి ఉండి, లోన్ వ్యాల్యూ రూ.1.5 కోట్లకు పైన ఉంటే బ్యాంకులు సైతం టైమ్బౌండ్ ఫిక్స్డ్ రేటుపై ఆఫర్ చేయవచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు, గృహ రుణ సంస్థల రుణ రేట్లు 25–35 బేసిస్ పాయింట్లు అధికంగా ఉంటాయి. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల రూపంలో తక్కువకే నిధుల లభ్యత ఉంటుంది. కనుక అవి కొంచెం తక్కువ రేటుకు రుణాలను ఇస్తుంటాయి. ఇది అటు బ్యాంకులు, ఇటు రుణ గ్రహీతలకూ మంచిదే. . భారం దింపుకోవాలంటే..? కొత్తగా రుణాలు తీసుకునే వారే కాకుండా.. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి కూడా బ్యాంకులు కొత్త రేట్లను అమలు చేస్తున్నాయి. మరి ఈ తరుణంలో గృహ రుణంపై పడే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. ఈఎంఐ పెరగకూడదని అనుకుంటే ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకోవాలి. ఈఎంఐ పెరిగినా ఫర్వాలేదు కట్టగలిగే స్వేచ్ఛ ఉందంటే అది కూడా నయమే. అదనంగా చెల్లించే వెసులుబాటు ఉందంటే.. అటువంటి వారు ఈఎంఐకి అదనంగా కొంత మొత్తాన్ని ప్రతి నెలా చెల్లిస్తూ వెళ్లొచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నిర్ణీత కాలవ్యవధికి ముందే గృహ రుణాన్ని ముగించేయవచ్చు. ఫలితంగా వడ్డీ రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. లేదంటే ప్రతి నెలా అదనంగా చెల్లిస్తూ వెళ్లడం వల్ల.. భవిష్యత్తులో ఏవైనా కారణాల వల్ల ఆదాయం తగ్గినా.. కొంతకాలం పాటు ఉపాధి కోల్పోయినా పరిమిత కాలం పాటు తక్కువ ఈఎంఐ చెల్లించుకోవచ్చు. ఏటా సంస్థ ఇచ్చే బోనస్లు, ఇతరత్రా వచ్చే అదనపు ఆదాయాన్ని రుణ చెల్లింపులకు వినియోగించుకోవాలి. టాపప్ రెండో ప్రాపర్టీ కొనుగోలు చేసే వారు లేదంటే అప్పటికే సమకూర్చుకున్న ప్రాపర్టీ విస్తరణ కోరుకునే వారు ప్రస్తుత గృహ రుణానికి టాపప్ లోన్ తీసుకోవచ్చు. అది కూడా తక్కువ రేటుకే. సాధారణంగా ఇంటి నవీకరణ కోసం పొదుపు చేసుకున్న మొత్తాలను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. లేదంటే వ్యక్తిగత రుణానికి వెళ్లేవారు కూడా ఉన్నారు. వాటికి బదులు గృహ రుణానికి అనుబంధంగా వచ్చే టాపప్లోన్ తీసుకోవచ్చు. టాపప్పై గృహ రుణం మాదిరే తక్కువ వడ్డీ రేటు అమలవుతుంది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఎక్కువగా హోమ్లోన్ టాపప్లోన్స్ ఆఫర్ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు టాపప్ రుణాలు ఆఫర్ చేస్తున్నాయి. కానీ, వీటిపై అప్పటికే తీసుకున్న గృహ రుణంతో పోలిస్తే 10–15 బేసిస్ పాయింట్లు అధిక రేటును అమలు చేస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ప్రత్యేక రుణంగా పరిగణించి అధిక రేట్లను చార్జ్ చేస్తున్నాయి. అయినా, వ్యక్తిగత రుణ రేట్ల కంటే తక్కువే ఉన్నాయి. కనుక అవసరమైతేనే ఈ మార్గాన్ని పరిశీలించాలి. గృహ రుణం తీసుకున్న సమయంలోనే ఈ యాడాన్ లోన్ సదుపాయాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే యాడాన్ రుణం తీసుకోకుండా ఫ్రీజ్ చేసుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తులో కావాల్సినప్పుడు వినియోగించుకునేందుకు రుణదాతలు అనుమతిస్తారు. ఒక్క ప్రాసెసింగ్ ఫీజు మినహా అదనంగా చెల్లించే పని ఉండదు. 10–15 బేసిస్ పాయింట్లు అధికంగా ఉన్నా సరే గృహ రుణం సమయంలోనే యాడాన్ను కూడా ఓకే చేసుకుని ఉంచుకోవాలి. -
బ్యాంకుల బాదుడు.. పెరుగుతున్న వడ్డీరేట్లు..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంకు కీలక రెపో రేటు పెంపు తర్వాత బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రైవేటురంగ గృహ రుణాల దిగ్గజం హెచ్డీఎఫ్సీ తన బెంచ్మార్క్ లెండింగ్ (రుణాలు) రేట్లను 30 బేసిస్ పాయింట్లు (0.30 శాతం) పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలపై ఈ మేరకు అదనపు భారం పడనుంది. ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంకు సైతం 0.40 శాతం రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనికంటే ముందు ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయాలు ప్రకటించడాన్ని గమనించాలి. అనూహ్యంగా ఆర్బీఐ రెపో రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు గత వారం ప్రకటించడం తెలిసిందే. అలాగే, సీఆర్ఆర్ను 0.50 శాతం పెంచింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై 30 బేసిస్ పాయింట్లు పెంచినట్టు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. కొత్తగా రుణాలు తీసుకునే వారికి 7% నుంచి 7.45 శాతం మధ్య రేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారికి 0.30 శాతం పెంపు అమలవుతుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. ప్రస్తుతం గృహ రుణాలపై ఈ సంస్థ 6.70–7.15% మధ్య రేట్లను అమలు చేస్తోంది. హెచ్డీఎఫ్సీ తన రుణాలకు మూడు నెలల సైకిల్ను అమలు చేస్తుంటుంది. అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రుణాలపై రేట్లు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సవరణకు గురవుతుంటాయి. ఇండియన్ బ్యాంకు పెంపుబాట.. ఇండియన్ బ్యాంకు రెపో అనుసంధానిత లెండింగ్ రేటును 0.40 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ నెల 9 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. రెపో రుణాల రేట్లు ఆర్బీఐ రెపో రేటును సవరించిన ప్రతిసారీ మార్పునకు లోనవుతాయి. ‘‘బ్యాంకు అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ రెపో రేటుకు లింక్ అయిన అన్ని రుణాల రేట్లను సమీక్షించింది. రెపో రేటును 4 శాతం నుంచి 4.40 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది’’అని ఇండియన్ బ్యాంకు ప్రకటన విడుదల చేసింది. -
సెక్యూరిటైజ్డ్ ఆస్తల విలువ...రూ.1.25 లక్షల కోట్లు!
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), గృహ రుణ సంస్థల (హెచ్ఎఫ్సీలు) సెక్యూరిటైజ్డ్ (రక్షణతో కూడిన) రుణ ఆస్తులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 43 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం కలిసొచ్చింది. 2020–21 సంవత్సరానికి సెక్యూరిటైజ్డ్ రుణ ఆస్తులు రూ.87,300 కోట్లుగా ఉన్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరికి ఇవి కరోనా ముందున్న రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటాయని అంచనా వేసింది. ‘‘2021–22లో సెక్యూరిటైజ్డ్ రుణ ఆస్తుల వృద్ధికి ప్రధాన కారణం.. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో బేస్ తక్కువగా ఉండడంతోపాటు.. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం. కరోనా మూడో విడతలో అవరోధాలు తక్కువగా ఉండడమే’’ అని ఇక్రా తెలిపింది. చెల్లింపులు సక్రమంగా జరిగే రుణాలనే సెక్యూరిటైజ్డ్ రుణ ఆస్తులుగా పేర్కొంటారు. మోర్ట్గేజ్, రుణాలు, బాండ్లు, క్యాపిటల్ మార్కెట్లలో జారీ చేసే సెక్యూరిటీలు వీటి కిందకు వస్తాయి. ఈ తరహా రిటైల్ రుణాలు రూ.1.1 లక్షల కోట్లుగా ఉంటే, హోల్సేల్ రుణ ఆస్తులు రూ.15,000 కోట్లుగా ఉన్నాయి. -
కొంటే ఖర్సయిపోతారు..!
ఆన్లైన్ షాపింగ్. ముందు రూపాయి కట్టక్కర్లేదు. వడ్డీ కూడా లేదు. తీరిగ్గా తర్వాత ఇద్దురు. ఏంటి ఇదంతా.. అనుకుంటున్నారా..? అదే బై నౌ పే లేటర్. లేదా స్పెండ్ నౌ పే లేటర్. అమెజాన్ వంటి దిగ్గజాలు, బడా బ్యాంకుల నుంచి, చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల వరకు క్రెడిట్ ఇచ్చేందుకు బారులు తీరాయి. వినియోగం ఆధారంగా అవి అరువు ఇచ్చేస్తాయి. కాకపోతే వాడేసుకోవడమా.. లేక వేరే మార్గం చూసుకోవడమా? అన్న విచక్షణ వినియోగదారులదే. బీఎన్పీఎల్ రూపంలో లభించే క్రెడిట్ స్వల్ప మొత్తమే. కానీ, వీటిని సరిగ్గా నిర్వహించకపోతే తెలియకుండానే బ్యాలన్స్ కరిగిపోతుంది. 15–30 రోజుల వరకు వడ్డీ ఉండదు. మర్చిపోయారా..? అరువు ఇచ్చిన కంపెనీలకు అవకాశం ఇచ్చినట్టే. అవి తమకు నచ్చిన వడ్డీ బాదుడు షురూ చేస్తాయి. పెనాల్టీ అంటాయి. చెల్లించాల్సింది రూ.200 అయినా.. రూ.50–100 వరకు పిండేస్తాయి. కొరివితో తలగోక్కున్నట్టు కోరి క్రెడిట్ స్కోరును దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ∙ బ్యాంకు ఖాతాలో రూపాయి లేకపోయినా కొనుగోళ్లకు వీలు కల్పించేది క్రెడిట్ కార్డు. అయితే, ఇప్పటికీ దేశంలో క్రెడిట్ కార్డు విస్తరణ చాలా పరిమితంగానే ఉంది. ఇదే చక్కటి అవకాశంగా భావించి ఫిన్టెక్ సంస్థలు బీఎన్పీఎల్ రూపంలో మార్కెట్లో చొచ్చుకుపోయే క్రమంలో ఉన్నాయి. క్రెడిట్ కార్డుపై లభించేది రుణమే. బై నౌ పే లేటర్ రూపంలో వచ్చేదీ కూడా రుణమే. రెండింటిపైనా నిర్ణీత కాలం పాటు వడ్డీ ఉండదు. సారూప్యతలు అంతవరకే. కంటికి కనిపించని అంశాలు బీఎన్పీఎల్ సదుపాయంలో ఎన్నో ఉన్నాయి. ∙ ఇప్పుడు కొను, తర్వాత చెల్లించు (బై నౌ.. పే లేటర్/బీఎన్పీఎల్) చాలా మందిని ఆకర్షిస్తున్న సదుపాయం. క్రెడిట్ కార్డు మాదిరి ముందు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ సంస్థలు, ఆన్లైన్ మార్కెట్ ప్లాట్ఫామ్లతో జతకట్టి ఎన్బీఎఫ్సీ సంస్థలు ఇస్తున్న ముందస్తు రుణ సదుపాయం. దీనికి పాన్ నంబర్ ఉంటే సరిపోతుంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మధ్య పోటీ వల్ల పుట్టుకొచ్చిన కొత్త సాధనమే ఇది. చార్జీలు/ఫీజులు 15–30 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయమే బీఎన్పీఎల్. ఇచ్చిన గడువులోపు చెల్లిస్తే రూపాయి అదనంగా కట్టాల్సిన పరిస్థితి ఉండదు. రుణం కనుక అశ్రద్ధ చూపినా, సకాలంలో చెల్లింపులు చేయకపోయినా తర్వాత భారాన్ని మోయాల్సి రావచ్చు. గడువు దాటితే మిగిలిన బ్యాలన్స్ మొత్తంపై 10–30 శాతం మేర వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. గడువు తర్వాత చెల్లించేవారు వడ్డీకి అదనంగా లేట్ ఫీజు కూడా కట్టాలి. కన్వినియన్స్ ఫీజు పేరుతో నెలవారీ వ్యయంపై 1–3 శాతం మధ్య వసూలు చేసే సంస్థలు కూడా ఉన్నాయి. బీఎన్పీఎల్ సంస్థలు ఓలా పోస్ట్పెయిడ్, జెస్ట్మనీ, ఫ్లిప్కార్ట్, అమెజాన్ పే లేటర్, యూని, పేటీఎం పోస్ట్పెయిడ్, స్లైస్, యూనికార్డ్స్ ఇలా ఎన్నో సంస్థలు బై నౌ పే లేటర్ పేరుతో క్రెడిట్ను ఆఫర్ చేస్తున్నాయి. రుణ సదుపాయం ఆన్లైన్లో వస్తువులు లేదా సేవల కోసం బీఎన్పీఎల్తో ఆర్డర్ చేసేయవచ్చు. నిర్ణీత కాలంలోపు వడ్డీ లేకుండా తీర్చేయాలి. ఇది అన్సెక్యూర్డ్ రుణం. దీంతో ఆన్లైన్ మార్కెట్లో ఈ సదుపాయాన్ని వినియోగించుకునే వారు పెరుగుతున్నారు. క్రెడిట్ కార్డుపై రూ.లక్షల రుణ సదుపాయం లభిస్తుంది. కానీ, బీఎన్పీఎల్ అలా కాదు. ఇవి చిన్న రుణాలు. ఎక్కువ శాతం రూ.2,000 నుంచి రూ.15,000 మధ్య రుణ సదుపాయం (క్రెడిట్లైన్) ఉంటుంది. స్మాల్ టికెట్ లోన్స్గా చెబుతారు. పేమెంట్ ఆప్షన్ పేజీలో బీఎన్పీఎల్ ఫీచర్ కనిపిస్తుంది. ఈ సదుపాయం కోసం కస్టమర్ ఆయా ప్లాట్ఫామ్లపై ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయితే అది మీ క్రెడిట్ రిపోర్ట్లో రుణ సదుపాయంగానే ప్రతిఫలిస్తుంది. రుణ గ్రహీతలు బీఎన్పీఎల్ కింద పొందిన రుణ సదుపాయాన్ని ఒకే సారి తీర్చే వెసులుబాటు లేకపోతే అప్పుడు ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణం కనుక గడువులోపు తీర్చేయడమే మంచిది. లేదంటే క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. కొన్ని సంస్థలు ఎటువంటి వడ్డీ విధించకుండా బిల్లు మొత్తాన్ని మూడు, నాలుగు నెలల సమాన వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. బీఎన్పీఎల్ రూపంలో వచ్చే రుణాన్ని ఎన్బీఎఫ్సీలు లేదా బ్యాంకులు అందిస్తుంటాయి. ఉదాహరణకు పేటీఎం బీఎన్పీఎల్ అన్నది ఆదిత్య బిర్లా ఫైనాన్స్తో ఒప్పందంపై అందిస్తున్న సదుపాయం. అమెజాన్ బీఎన్పీఎల్ అన్నది అమెజాన్ ఇండియా అందిస్తున్న సదుపాయం. ఇక ఫ్లిప్కార్ట్ పే లేటర్ సదుపాయాన్ని ఆ సంస్థతో ఒప్పందంపై ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు సమకూరుస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం ఇలా ఆన్లైన్ ప్లాట్ఫామ్/ఈకామర్స్ సంస్థ ఏదైనా కావచ్చు.. రుణ గ్రహీత, రుణదాతలను కలిపే వేదికలుగానే పనిచేస్తాయి. రుణ సదుపాయంతో వాటికి ప్రత్యక్ష సంబంధం ఉండదు. చెల్లింపుల్లో విఫలమైతే.. మొదట లేట్ ఫీజు పడుతుంది. ఫ్లిప్కార్ట్ అయితే తీర్చాల్సిన బ్యాలన్స్ రూ.100–500 మధ్య ఉంటే, విఫలమైన రుణగ్రహీతలకు రూ.60 చార్జీ విధిస్తోంది. రూ.5,000 అంతకుమించి మొత్తం చెల్లించడంలో విఫలమైతే అప్పుడు రూ.600 వరకు చార్జీ పడుతుంది. అమెజాన్ పే లేటర్ అయితే చెల్లించని మొత్తం రూ.200లోపు ఉంటే ఆలస్యపు రుసుం అమలు చేయడం లేదు. కానీ, పెనాల్టీ రూపంలో రూ.100–600 వరకు రాబడుతోంది. జీఎస్టీ అదనం చెల్లించాల్సి రావచ్చు. దీనికితోడు రుణం ఇచ్చిన సంస్థ వసూలుకు చర్యలు ప్రారంభించొచ్చు. రుణ గ్రహీత వివరాలను అవి క్రెడిట్ బ్యూరోలకు పంపిస్తాయి. ఇది క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుంది. దీంతో భవిష్యత్తు రుణాలు మరింత భారంగా మారతాయి. క్రెడిట్ డీలింక్వెన్సీగా క్రెడిట్ బ్యూరోలకు రుణ సంస్థలు సమాచారం ఇస్తాయి. కనీస బ్యాలన్స్ చెల్లించి మిగిలిన రుణాన్ని క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. అయినప్పటికీ అది కూడా క్రెడిట్ స్కోరును ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోవాలి. కస్టమర్ రిజిస్టర్ చేసుకున్న, వినియోగించుకున్న ప్రతీ బీఎన్పీఎల్ కూడా ఒక రుణం కింద వారి క్రెడిట్ రిపోర్ట్లో చేరుతుంది. కొద్ది బ్యాలన్స్ కోసం బీఎన్పీఎల్ను వాడేసుకుని మర్చిపోయారనుకోండి. ఇలా ఒకటికి మించిన రుణ సదుపాయాలు అన్నీ కలసి తలనొప్పిగా మారొచ్చు. క్రెడిట్ స్కోరు క్షీణిస్తుంది. దీనికంటే క్రెడిట్కార్డు మెరుగైన సాధనం అవుతుంది. 30–45 రోజుల క్రెడిట్ పీరియడ్తో వస్తుంది. కావాలంటే ఈఎంఐ కిందకు బ్యాలన్స్ను మార్చుకోవచ్చు. రుణ పరిమితి అధికంగా ఉంటుంది. యాక్టివేట్ అయినట్టే.. శ్రీరామ్ ఏప్రిల్ నెల క్రెడిట్ స్కోరు క్షీణించడాన్ని గమనించాడు. కారణం ఏంటా అని క్రెడిట్ రిపోర్ట్ను పరిశీలించగా.. ఆశ్చర్యపోవడం అతని వంతు అయింది. ‘‘క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్యా బ్యాంకు (కేవీబీ) నుంచి రెండు రుణాలు అతడి రిపోర్ట్లో యాక్టివ్గా కనిపించాయి. ఆయా సంస్థల నుంచి శ్రీరామ్ రుణాలు తీసుకోలేదు. దాంతో అవి ఎందుకు తన రిపోర్ట్లో వచ్చాయో మొదట అర్థం కాలేదు. క్రెడిట్ కార్డు తప్పించి అతడి పేరిట మరే రుణం లేదు. ఈ రెండూ బీఎన్పీఎల్ రుణాలని అతడికి తర్వాత తెలిసింది. అమెజాన్ పే లేటర్ సదుపాయం కోసం ఒకటి రెండు సార్లు అతడు లాగిన్ అయ్యాడు కానీ, బ్యాంకు ఖాతాను లింక్ చేయలేదు. అయినా కానీ, క్రెడిట్ సదుపాయాన్ని యాక్టివేస్ చేసేసింది సదరు సంస్థ. ఇది శ్రీరామ్ ఒక్కడి విషయంలోనే కాదు. చాలా మందికి ఎదురవుతున్న అనుభవం. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలపై ప్రస్తావిస్తున్నారు. తమ తరఫున బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి రుణ సదుపాయాన్ని పలు ప్లాట్ఫామ్లు పొందుతున్నట్టు ఆరోపిస్తున్నారు. తమ అనుమతి లేకుండా రుణ సదుపాయాన్ని పొందినట్టు చేస్తున్న ఆరోపణ నిజం కాదు. ‘‘వినియోగదారులు తాము క్రెడిట్లైన్ కోసం సైనప్ చేసుకున్నామే కానీ, రుణం కోసం కాదని భావిస్తుంటారు. క్రెడిట్లైన్ అన్నది ఒక రుణ పరిమితి. వినియోగదారులు దీన్ని వినియోగించుకోవచ్చు. వినియోగించుకోకపోవచ్చు. కానీ, దీన్ని బుక్స్లో రుణంగానే పేర్కొంటారు’’ అని ‘యూని’ సంస్థ సీఈవో, వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా తెలిపారు. అందుకే వీటిని క్రెడిట్ నివేదికల్లో పేర్కొనడం జరుగుతుందన్నారు. ఆయా అంశాల నేపథ్యంలో ఈ కొత్త వ్యవస్థ పట్ల తస్మాత్ జాగ్రత్త. -
2022-23లో పెరగనున్న ఎన్బీఎఫ్సీ ఆస్తులు
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్బీఎఫ్సీలు) నిర్వహణలోని ఆస్తులు(రుణాలు/ఏయూఎం) వచ్చే ఆర్థిక సంవత్సరంలో(2022–23)లో 8-10 శాతం వరకు పెరుగుతాయని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఆస్తుల వృద్ధి 5-7 శాతంగా ఉండొచ్చని తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (గృహ రుణాలు ఇచ్చే సంస్థలు/హెచ్ఎఫ్సీలు) ఆస్తులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9-11 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది. ఎన్బీఎఫ్సీలలో రిటైల్ విభాగం, వ్యక్తిగత రుణాలు, మైక్రోఫైనాన్స్, బంగారం రుణాలు ప్రధానంగా వృద్ధికి దోహదపడతాయని వివరించింది. వాహన రుణాలు, వ్యాపార రుణాలు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొంది. ఈ విభాగాల్లో ఆస్తుల నాణ్యత అంశాలు ఇంకా సమసిపోలేదని గుర్తు చేసింది. ఎన్బీఎఫ్సీ హోల్సేల్ రుణాల ఏయూఎం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్షీణిస్తుందని అంచనా వేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికంలో రుణాల పంపిణీ అంచనాలను సవరించామని.. కరోనా మూడో విడత ప్రభావం తక్కువగానే ఉండడంతో నాలుగో త్రైమాసికంలో (2022 జనవరి-మార్చి) సవరించొచ్చని పేర్కొంది. రుణాల మంజూరులో వృద్ధి ఆరోగ్యకరంగా ఉన్నట్టు తెలిపింది. ‘‘ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యాపార వృద్ధి కోసం రూ.1.8-2.2 లక్షల కోట్ల తాజా నిధులు అవసరమవుతాయి’’ అని ఈ నివేదిక వెల్లడించింది. (చదవండి: దేశంలో క్రిప్టోకరెన్సీ ప్రవేశపెట్టే ఆలోచన లేదు: కేంద్రం) -
వాహనాల ఫైనాన్స్ విభాగంపై దెబ్బే, క్యూ3పై క్రిసిల్ రేటింగ్ కీలక వ్యాఖ్యలు!
మొండిపద్దుల వర్గీకరణ నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ సవరించడం వల్ల మూడో త్రైమాసికంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 1.50 శాతం ఎగిసి 6.80 శాతానికి చేరిందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఒకవేళ నిబంధనలను సవరించకపోయి ఉంటే స్థూల ఎన్పీఏలు (జీఎన్పీఏ) 0.30 శాతం మేర తగ్గి 5.3 శాతానికి దిగి వచ్చేవని పేర్కొంది. అయితే, ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు మెరుగుపడుతుండటం, చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు .. తమ వసూళ్ల ప్రక్రియను పటిష్టం చేసుకోవడం తదితర పరిణామాల కారణంగా రాబోయే రోజుల్లో ఎన్బీఎఫ్సీల జీఎన్పీఏలు క్రమంగా తగ్గగలవని క్రిసిల్ ఒక నివేదికలో వివరించింది. డిసెంబర్ క్వార్టర్కి ఎన్పీఏల వర్గీకరణ విధానాన్ని సవరిస్తూ ఆర్బీఐ గతంలో ఒక సర్క్యులర్ జారీ చేసింది. పలు విభాగాలపై దీని ప్రభావం వివిధ రకాలుగా ఉందని క్రిసిల్ తెలిపింది. బంగారం రుణాల విభాగం మెరుగ్గానే ఉండగా.. వాహనాల ఫైనాన్స్ విభాగంపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. అయితే, సర్క్యులర్లో నిబంధనల అమలును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ ఆర్బీఐ వాయిదా వేయడంతో ఎన్బీఎఫ్సీలకు కాస్త వెసులుబాటు లభించవచ్చని క్రిసిల్ తెలిపింది. -
కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త..!
న్యూఢిల్లీ: కొత్త ఇల్లు కొనేవారికి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ శుభవార్త తెలిపింది. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అర్హులైన గృహ రుణ దరఖాస్తుదారులకు తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇవ్వనున్నట్లు గతంలో పేర్కొంది. ఈ ఆఫర్ కింద గృహ రుణాలపై వడ్డీ రేట్లు 6.65% నుంచి ప్రారంభమవుతాయి. అయితే, ప్రస్తుతం ఉన్న ఆఫర్ గడువు తేదీని ఫిబ్రవరి 28 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఆఫర్ పొందాలంటే కొన్ని షరతులు కూడా విధించింది. ఈ ఆఫర్ పొందాలంటే రుణ దరఖాస్తుదారుడు వేతన ఉద్యోగి, వైద్యుడు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యి ఉండాలి. వేతన దరఖాస్తుదారులు కనీసం 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగ సంస్థ లేదా బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేసి ఉండాలి. ఎంబిబిఎస్ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగిన వైద్యులు, ఆసుపత్రి లేదా రిజిస్టర్డ్ హెల్త్ కేర్ ప్రొవైడర్తో లేదా వారి స్వంత ప్రాక్టీస్లో కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం వైద్యులకు ఉండాలి. ప్రాక్టీస్ సర్టిఫికేట్, 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ఈ ఆఫర్ పొందవచ్చు. కొత్త ఏడాది సందర్భంగా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్ కేవలం క్రెడిట్ స్కోర్ 800 లేదా అంతకంటే ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది అని తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 750 - 799 మధ్య సిబిల్ స్కోరు ఉన్నవారికి రుణదాత గృహ రుణాలను 6.65% కంటే స్వల్ప మొత్తంలో ఎక్కువగా వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ ద్వారా ఫిబ్రవరి 28 నాటికి దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు, మార్చి 31 వరకు పంపిణీ చేసిన రుణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా, కొత్త గృహ రుణం కోసం చూస్తున్న వారు, అలాగే తమ ప్రస్తుత గృహ రుణాన్ని మరొక రుణదాత నుంచి బదిలీ చేయాలని చూస్తున్నవారు ఈ ఆఫర్కు అర్హులు. (చదవండి: ఎన్ఎస్ఈ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..!) -
జొమాటో సంచలన నిర్ణయం..!
రెస్టారెంట్ అగ్రిగేటర్, ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సేవల వ్యాపారంలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. జొమాటో యాజమాన్యంలోని అనుబంధ సంస్థగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలను కంపెనీ ముమ్మరం చేసింది. ఫుడ్ డెలివరే కాదు..లోన్లను కూడా..! నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్క్రెడ్తో జొమాటో 2020లోనే ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా జొమాటోకు చెందిన రెస్టారెంట్ భాగస్వాములకు రుణాలను అందజేస్తుంది. ప్రస్తుతం జొమాటో తీసుకున్న నిర్ణయంతో త్వరలోనే రుణాలను అందజేసే అవకాశం ఉంది. కరోనావైరస్ (కోవిడ్-19) మహమ్మారి ఫుడ్ డెలివరీ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసింది. ఇది స్థూల సరుకుల విలువలో గణనీయమైన క్షీణతకు దారితీసింది. పేరు ఇంకా ఖరారు కాలేదు..! రూ.10 కోట్లతో ఎన్బీఎఫ్సీని ఏర్పాటు చేయాలని జొమాటో భావిస్తోంది. ఇది పూర్తిగా జొమాటో అనుబంధ సంస్థగా ఉండనుంది. కాగా సబ్సీడరీ కంపెనీకి ఏ పేరు పెట్టాలనేది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని సమాచారం.ఈ సంస్థకు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు మంత్రిత్వశాఖ, ఆర్బీఐ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి కంపెనీ పేరు ఖరారు చేయబడుతుందని జొమాటో బిఎస్ఇకి ఇచ్చిన ఫైలింగ్లో తెలిపింది. ఇదిలా ఉండగా హైదరాబాద్కు చెందిన యాడ్ఆన్మో అనే స్టార్టప్లో జొమాటో వాటాలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అర్భన్ పైపర్ కంపెనీలో కూడా 5 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఇప్పటికే షిస్రాకెట్, సామ్సెట్ టెక్నాలజీస్, క్యూర్ ఫిట్ వంటి సంస్థల్లో వాటాలు కొనుగోలు చేసింది. చదవండి: ప్రభుత్వం చేయలేనిది.. టాటా గ్రూపు చేసి చూపింది -
బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి
ముంబై: బ్యాంకుల్లో కార్పొరేట్గవర్నెన్స్ (పాలన) మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఆర్బీఐ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే క్రమంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా తమ మూలధన నిధులను బలోపేతం చేసుకోవాలని, తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ‘భారత్లో బ్యాంకింగ్ ధోరణులు, పురోగతి 2020–21’ పేరుతో వార్షిక నివేదికను ఆర్బీఐ మంగళవారం విడుదల చేసింది. ‘‘కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం వల్ల కార్పొరేట్, గృహాలు ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, ఆర్బీఐ కలసికట్టుగా ఆర్థిక స్థిరత్వ సవాళ్లను కట్టడి చేయగలిగాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో వచ్చే సవాళ్లకు తగ్గట్టు బ్యాంకులు బ్యాలన్స్షీట్లను బలోపేతం చేసుకోవాలి’’అని అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధిపైనే.. ఇకమీదట బ్యాంకు బ్యాలన్స్ షీట్లు పుంజుకోవడం అన్నది ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. 2021–22లో ఇప్పటి వరకు చూస్తే రుణ వృద్ధి పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఆరు నెలల్లో డిపాజిట్లు 10 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 11 శాతం మేర ఉంది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్పీఏల నిష్పత్తి 2020 మార్చి నాటికి 8.2 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 7.3 శాతానికి తగ్గింది. 2021 సెప్టెంబర్ నాటికి 6.9 శాతానికి దిగొచ్చింది’’ అని వివరించింది. సవాళ్లను అధిగమించేందుకు వ్యూహాత్మక విధానం భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు శ్రద్ధతో కూడిన వ్యూహాత్మక విధానం అనుసరణీయమని ఆర్బీఐ పేర్కొంది. వాతావణం మార్పులు, టెక్నాలజీ ఆవిష్కరణలు, కరోనా మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను నివేదికలో ప్రస్తావించింది. వాతావరణ మార్పుల తాలూకు సంస్థాగత ప్రభావం ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వంపై ఏ మేరకు ఉంటుందో మదింపు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు రుణాలు (గ్రీన్ ఫైనాన్స్), ద్రవ్యోల్బణం, వృద్ధి తదితర స్థూల ఆర్థిక అంశాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నట్టు వివరించింది. ఎన్బీఎఫ్సీలు నిలదొక్కుకోగలవు రానున్న రోజుల్లో బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) నిలదొక్కుకుని బలంగా ముందుకు సాగుతాయన్న విశ్వాసాన్ని ఆర్బీఐ వ్యక్తం చేసింది. టీకాలు విస్తృతంగా ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థ పుంజకుంటూ ఉండడం అనుకూలిస్తుందని పేర్కొంది. కరోనా మహమ్మారి ఎన్బీఎఫ్సీల సామర్థ్యాన్ని పరీక్షించినప్పటికీ.. ఈ రంగం బలంగా నిలబడి, తగినంత వృద్ధితో కొనసాగుతున్నట్టు తెలిపింది. కోపరేటివ్ బ్యాంకులు విస్తరించాలి కరోనా మహమ్మారి కాలంలో పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకింగ్ (కోపరేటివ్ బ్యాంకులు) రం గం బలంగా నిలబడినట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే కొద్దీ ఇవి మరింత బలోపేతమై, విస్తరించాల్సి ఉందని పేర్కంది. వీటి నిధుల స్థాయి, లాభాలు మెరుగుపడినట్టు తెలిపింది. ప్రాథమిక నమూనాలోనే డిజిటల్ కరెన్సీ సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విషయంలో తొలినాళ్లలో ప్రాథమిక నమూనాతోనే వెళ్లడం సరైనదన్న అభిప్రాయంతో ఆర్బీఐ ఉంది. ‘సమగ్రంగా పరీక్షించాలి. అప్పుడే ద్రవ్య విధానం, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం పరిమితంగా ఉంటుంది’ అని పేర్కొంది. నగదుకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, బలమైన, సౌకర్యవంతమైన సాధనంగా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. పౌరులకు, ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మక సీబీడీసీని అందించడంపైనే భారత చెల్లింపుల పురోగతి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రూ.36,342 కోట్ల మోసాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల్లో బ్యాంకింగ్ రంగంలో మోసాలకు సంబంధించి 4,071 కేసులు నమోదయ్యాయి. మోసపోయిన మొత్తం రూ.36,342 కోట్లుగా ఉందని ఆర్బీఐ తన నివేదికలో వెల్లడించింది. వీటిల్లో రుణ మోసాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మోసపూరిత కేసులు 3,499తో పోలిస్తే పెరిగాయి. కానీ, గతేడాది మోసాల విలువ రూ.64,261 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గింది. వీటిని మరింత వివరంగా చూస్తే.. ‘‘2021–22 మొదటి ఆరు నెలల్లో రుణ మోసాలకు సంబంధించి 1,802 కేసులు నమోదు అయ్యాయి. వీటితో ముడిపడిన మొత్తం రూ.35,060 కోట్లు. కార్డు, ఇంటర్నెట్ రూపంలో మోసాలకు సంబంధించి నమోదైన కేసులు 1,532. వీటి విలువ రూ.60 కోట్లే’’ అని నివేదిక తెలియజేసింది. డిపాజిట్లకు సంబంధించి 208 మోసాలు నమోదైనట్టు, వీటి విలువ రూ.362 కోట్లుగా పేర్కొంది. -
ఎన్బీఎఫ్సీల రుణ వృద్ధి 10శాతం!
ముంబై: బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రుణ వృద్ధి 2021–22 ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వరకూ నమోదవుతుందని క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక తెలిపింది. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడ్డం, పటిష్ట బ్యాలెన్స్ షీట్స్ నిల్వలు ఇందుకు కారణంగా పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే... - ఎన్బీఎఫ్సీల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6 నుంచి 8 శాతం ఉంటుందని భావిస్తున్నాం. కరోనా తీవ్ర సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు కేవలం 2 శాతం. - నాన్ బ్యాంక్ రుణదాతల స్థూల మొండి బకాయిలు (జీఎన్పీఏ) 25 నుంచి 300 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగే అవకాశం ఉంది. - అధిక లిక్విడిటీ, మూలధనం, ప్రొవిజినింగ్ బఫర్స్ (ఎన్పీఏలకు కేటాయింపులు) వంటి అంశాల్లో ఇటీవలి కాలంలో ఎన్బీఎఫ్సీలు పటిష్టంగా ఉన్నాయి. దీనికితోడు ఆర్థిక క్రియాశీలత కూడా తోడవడంతో, వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వాటికి తగిన పటిష్ట స్థితి నెలకొంది. - ప్రస్తుత, రానున్న త్రైమాసికాల్లో రిటైల్ రుణాలు భారీగా పెరిగే వీలుంది. డిమాండ్, విక్రయాలు పెరిగడం దీనికి కారణం. - బంగారం, గృహ, అన్సెక్యూర్డ్ రుణాల విషయంలో వృద్ధి వేగం అధికంగా ఉండవచ్చు. కాగా, కోవిడ్–19 తాజా వేరియంట్ ప్రస్తుత ఆందోళనలకు కారణం అవుతోంది. వ్యవస్థలపై ఇది ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని వేచిచూడాల్సి ఉంది. చదవండి:HDFC Report: బేస్ ఎఫెక్ట్ ప్రభావంతో 9.4 శాతం వృద్ధి -
ఇంటి ఈఎమ్ఐ సరైన సమయానికి చెల్లించకపోతే ఏమవుతుంది..?
ప్రజలు సాధారణంగా తమ కలల గృహాన్ని కొనుగోలు చేయడం కోసం గృహ రుణం(Home Loan) తీసుకుంటారు. గృహ రుణాలు ఎక్కువగా దీర్ఘకాలం వరకు ఉంటాయి. అయితే గృహరుణం తీసుకున్న తర్వాత కొందరు ఉపాధి కోల్పోవడం, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాల వల్ల రుణ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలా వాయిదాలు.. వాటిపై వడ్డీ, రుసుములు పెరిగి ఓ పెద్ద గుదిబండగా మారతాయి. ఒక్కోసారి తిరిగి చెల్లించలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మనం గృహ రుణాల ఈఎమ్ఐ చెల్లించకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురు అవుతాయి. అవేంటో తెలుసుకుందాం.. క్రెడిట్ స్కోరుపై ప్రభావం మీరు గనుక హోమ్ లోన్ ఈఎమ్ఐ కట్టకపోతే ఆలస్య ఫీజులు కింద జరిమానాలు విధిస్తారు. ఈ పెనాల్టీ ఛార్జ్ సాధారణంగా ఈఎమ్ఐలో 1-2% వరకు ఉంటుంది. అయితే, పరిస్థితిని బట్టి, కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ కాలానికి మొత్తం బకాయి మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రుణదాత వసూలు చేసే ఆలస్య ఫీజులకు ఇది అదనంగా ఉంటుంది. ఒక్క ఈఎమ్ఐ పేమెంట్ కట్టకపోయిన అది మీ క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపిస్తుంది. మీ ఇంటి రుణంపై సింగిల్ డిఫాల్ట్ వల్ల మీ క్రెడిట్ స్కోరు 50-70 పాయింట్ల వరకు తగ్గవచ్చు. అటువంటి పరిస్థితి వల్ల తర్వాత ఏదైనా లోన్ పొందే అవకాశం కోల్పోతారు.(చదవండి: ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త కంపెనీలు) నిరర్ధక ఆస్తిగా లోన్ అయితే, ఒకవేళ మీరు ఈఎమ్ఐని మిస్ అయినట్లయితే చివరి పేమెంట్ చేసిన 90 రోజుల్లోగా కట్టాల్సి ఉంటుంది. ఇది చిన్న డిఫాల్ట్ గా వర్గీకరిస్తారు. మీరు సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లయితే దాని ప్రభావం నుంచి మీరు కోలుకోవచ్చు. మిస్ అయిన ఈఎమ్ఐని తర్వాత గడువు తేదీనాటి నుంచి చెల్లించండి. అలాగే, మిగతా ఈఎమ్ఐలను మిస్ కాకుండా చూసుకోండి. ఉద్యోగ నష్టం/ ఆరోగ్య పరిస్థితుల వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే రుణదాతను సంప్రదించండి. వారిని ఏదైనా పరిష్కారం చెప్పమనండి. మీ రుణం నిరర్ధక ఆస్తి(ఎన్పిఎ)గా మారడానికి ముందు మీ బకాయిలను చెల్లించడానికి మీకు 90 రోజుల గడువు ఉంది. ఒకవేళ మీరు 90 రోజుల తర్వాత కూడా మీ ఈఎమ్ఐ బకాయిలను తిరిగి చెల్లించలేకపోతే SARFAESI 2002 చట్టం ప్రకారం.. మీ ఆస్తిని వేలం వేసే హక్కు రుణదాతకు లభిస్తుంది. కాబట్టి, అలా౦టి పరిస్థితుల నుంచి తప్పి౦చుకోవడానికి ము౦దుగానే చర్యలు తీసుకో౦డి. గృహ రుణ ఎగవేత నుంచి తప్పించుకోవడం కోసం మీరు మీ రుణదాతను తక్కువ ఈఎమ్ఐ కోసం అభ్యర్థించవచ్చు.ఒకవేళ మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయిన/మీ వ్యాపార కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లయితే ఈఎమ్ఐ చెల్లింపులపై బ్యాంకులు మీకు మూడు నుంచి ఆరు నెలల మాఫీని ఇవ్వవచ్చు. అయితే, రుణదాత తర్వాత ఈ కాలానికి బకాయి రుణ మొత్తంపై వడ్డీని వసూలు చేయవచ్చు. (చదవండి: రిలయన్స్ జియో సరికొత్త రికార్డు..!) ఆస్తిపై హక్కులు చేజారిపోతాయి మీరు ఇక రుణం చెల్లించని పక్షంలో మీకు రుణం ఇచ్చిన బ్యాంకులు, ఇతర సంస్థలు గానీ ఇంటి వాస్తవ విలువను అంచనా వేసి తర్వాత వేలం ప్రక్రియను ప్రారంభిస్తాయి. వేలానికి సంబంధించిన వివరాలను దినపత్రికలో ప్రచురిస్తాయి. ఒకవేళ వేలంలో పేర్కొన్న విలువ వాస్తవ విలువ కంటే తక్కువ అని యజమాని భావిస్తే ఆ సంస్థలను సంప్రదించవచ్చు. ఒకసారి ఇలా ఆస్తిని స్వాధీనం చేసుకున్న సంస్థలు దాన్ని విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం లేదా ఆ ఆస్తిపై హక్కులను వేరే సంస్థకు అప్పగించే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంత వేలం ద్వారా జరుగుతుంది. సంబంధిత ఇంటిని వేలంలో విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి బ్యాంకు ముందుగా తన రుణ బకాయిలను సర్దుబాటు చేసుకున్న తర్వాత అదనంగా ఏమైనా మిగిలితే ఆ మొత్తాన్ని మీకు పంపిస్తుంది. మరో మార్గం ఇలాంటి సమస్య నుంచి మీరు బయటపడటానికి మీకు మరో మార్గం ఉంటుంది. బ్యాంక్/రుణం తీసుకున్న సంస్థ వేలం వేయడానికి ముందే మీరు ఆ ఇంటిని విక్రయించండి. ఎందుకంటే, రుణదాతలు ఎక్కువ సార్లు మార్కెట్ విలువ కంటే తక్కువకు ఆ ఇంటిని విక్రయిస్తాయి. దీని వల్ల మీరు మరింత నష్టపోయే అవకాశం ఉంది. అందుకని మీరు ఆ ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఈఎమ్ఐని ఒకేసారి క్లియర్ చేయండి. దీని వల్ల మీరు కొంత లాభపడే అవకాశం ఉంది. మీకు ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి గృహ రుణం తీసుకునే ముందు మీ ఆదాయంలో 40% ఈఎమ్ఐ చెల్లింపులు ఉండే విధంగా చూసుకోండి. (చదవండి: ఆహా ఏమి అదృష్టం! ఏడాదిలో వారి దశ తిరిగింది) -
క్యూ2లో పెరగనున్న సెక్యూరిటైజేషన్
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల సెక్యూరిటైజేషన్ భారీగా ఎగసే వీలున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. క్యూ2(జులై–సెపె్టంబర్)లో సెక్యూరిటైజేషన్ 45 శాతం జంప్చేయనున్నట్లు ఇక్రా రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. వీటి విలువ రూ. 25,000 కోట్లను తాకవచ్చని అంచనా వేసింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 17,200 కోట్ల విలువైన సెక్యూరిటైజేషన్ నమోదుకాగా.. గతేడాది(2020–21) క్యూ2లో ఈ విలువ రూ. 15,200 కోట్లకు చేరింది. ఒకేతరహా ఇల్లిక్విడ్ ఫైనాన్షియల్ అసెట్స్ను క్రోడీకరించి మార్కెట్లో విక్రయించగల సెక్యూరిటీలుగా రీప్యాకేజింగ్ చేయడాన్ని సెక్యూరిటైజేషన్గా పేర్కొనే సంగతి తెలిసిందే. వీటిని సంబంధిత ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఆర్బీఐ తీసుకువచి్చన తాజా మార్గదర్శకాల నేపథ్యంలో సెక్యూరిటైజేషన్ మార్కెట్ విస్తరించనున్నట్లు ఇక్రా తెలియజేసింది. దీంతో గత నెలలో పరిమాణరీత్యా 60 శాతం సెక్యూరిటైజేషన్ నమోదైనట్లు వెల్లడించింది. తొలి అర్ధభాగంలో... సెకండ్ వేవ్ పరిస్థితుల్లోనూ ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య రూ. 42,200 కోట్ల సెక్యూరిటైజేషన్కు వీలున్నట్లు ఇక్రా అంచనా వేసింది. గతేడాది ఇదే కాలంలో ఈ విలువ రూ. 22,700 కోట్లు మాత్రమేకాగా.. ఈ ఏడాది సెక్యూరిటైజేషన్ పరిమాణం రూ. 1.2 లక్షల కోట్లను తాకనున్నట్లు తాజాగా అభిప్రాయపడింది. ఇది 40% అధికమని తెలియజేసింది. -
ఎన్బీఎఫ్సీల ఏయూఎం డౌన్
ముంబై: నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వెనకడుగు వేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రుణ పంపిణీ తగ్గడం, పోర్ట్ఫోలియో విలువలు క్షీణించడం ప్రభావం చూపినట్లు రేటింగ్స్ సంస్థ ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే గతేడాది(2020–21) ద్వితీయార్థంలో ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ(హెచ్ఎఫ్సీ)ల రుణ మంజూరీ పుంజుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. అంటే గత క్యూ3(అక్టోబర్–డిసెంబర్), క్యూ4(జనవరి–మార్చి)లతో పోలిస్తే త్రైమాసిక ప్రాతిపదికన ఈ క్యూ1లో 55 శాతం తిరోగమించినట్లు తెలియజేసింది. గతేడాది క్యూ1తో పోలిస్తే మారటోరియంలు లేని పరిస్థితుల్లో ఈ క్యూ1లో ఎన్బీఎఫ్సీల ఏయూఎం నీరసించినట్లు నివేదిక వివరించింది. హెచ్ఎఫ్సీల ఏయూఎం మాత్రం దాదాపు యథాతథంగా నమోదైనట్లు పేర్కొంది. పెంటప్ డిమాండ్ .. పెంటప్ డిమాండ్ కారణంగా ఈ జులైలో రుణ విడుదల ఒక్కసారిగా ఊపందుకున్నట్లు ఇక్రా నివేదిక వెల్లడించింది. ఈ స్పీడ్ కొనసాగేదీ లేనిదీ స్థూల ఆర్థిక సంకేతాలపై ఆధారపడి ఉంటుందని తెలియజేసింది. కోవిడ్–19 సెకండ్ వేవ్ ఎన్బీఎఫ్సీ రంగంలో రికవరీని తాత్కాలికంగా దెబ్బతీసినట్లు ఇక్రా వైస్ప్రెసిడెంట్, ఫైనాన్షియల్ రంగ హెడ్ మనుశ్రీ సగ్గర్ పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలో రుణ మంజూరీ వార్షిక ప్రాతిపదికన 6–8 శాతం పుంజుకోగలదని అంచనా వేశారు. ఇక ఏయూఎం అయితే 8–10 శాతం స్థాయిలో బలపడవచ్చని అభిప్రాయపడ్డారు. గతే డాది లోబేస్ కారణంగా పలు కీలక రంగాల నుంచి డిమాండ్ మెరుగుపడనున్నట్లు తెలియజేశారు. ఆస్తుల నాణ్యతపై.. స్థానిక లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో ఎన్బీఎఫ్సీల ఆస్తుల(రుణాల) నాణ్యత భారీగా బలహీనపడినట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. అయితే వసూళ్లు ప్రోత్సాహకరంగానే ఉన్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది నికర రికవరీలు, రద్దులతో కూడిన ఓవర్డ్యూస్లో 0.5–1 శాతం పెరుగుదల నమోదుకావచ్చని అంచనా వేసింది. ఇవి ఇకపై లాక్డౌన్లు ఉండబోవన్న అంచనాలుకాగా.. రుణ నాణ్యతపై ఒత్తిళ్లు కొనసాగనున్నట్లు తెలియజేసింది. ప్రస్తుత అనిశి్చతుల నేపథ్యంలో రైటాఫ్లు అధికంగా నమోదుకావచ్చని అభిప్రాయపడింది. -
‘స్కోర్’ బాగుంటే రుణం ఈజీ!
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచి్చతంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం... ఎలా లెక్కిస్తారంటే.. రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిరీ్ణత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కలి్పస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కలి్పస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధ్రువీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ను అందుకుంటారు. స్కోర్ను మెరుగుపరుచుకోవాలంటే.. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించడమే స్కోర్ను పెంచుకోవడానికి ప్రాథమిక సూత్రం. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా పొరపాటు వల్ల, మర్చిపోవడం కారణంగానే వాయిదా రోజున చెల్లింపులు చేయలేకపోతే.. కంపెనీ నుంచి మీ కాల్ వచ్చిన తర్వాత అయినా వెంటనే ఆ వాయిదాను చెల్లించేయాలి. రీపేమెంట్లో ఎలాంటి జాప్యం చేసినా సరే రుణదాతలు దీన్ని ప్రతికూల అంశంగా పరిగణిస్తుంటారు. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్సెక్యూర్డ్గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచి్చన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచి్చన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా మీ స్కోర్ను పెంచుకోవాలంటే.. వ్యక్తిగత రుణం, క్రెడిట్కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్కార్డు లేకపోతే దాన్ని తీసుకుని పరిమిత వినియోగంతోపాటు సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్ను పెంచుకోవచ్చు. -
బ్యాంకింగ్ అవుట్లుక్... స్టేబుల్
ముంబై: భారత బ్యాంకింగ్ రంగానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్లుక్ను కొనసాగిస్తున్నట్లు ఇండియా రేటింగ్స్ ప్రకటించింది. అయితే రిటైల్, సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి బ్యాంకింగ్ 2022 మార్చి ముగిసే నాటికి కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా పేర్కొంది. బ్యాంకింగ్పై దేశీయ రేటింగ్ సంస్థ విడుదల చేసిన అర్థవార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూలంగా మొండిబకాయిలు (జీఎన్పీఏ) ఇచ్చిన రుణాల్లో 8.6 శాతంగా కొనసాగవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే రుణాల విషయంలో ఈ శాతం 10.3 శాతంగా ఉండే వీలుంది. - కోవిడ్–19 ప్రేరిత సవాళ్లను ఎదుర్కొనే విషయంలో బ్యాంకింగ్ పటిష్టంగా ఉండడం అవుట్లుక్ యథాతథ కొనసాగింపునకు కారణం. - బ్యాంకులకు తగిన మూలధనం అందే అవకాశం ఉంది. అందువల్ల వాటి ఫైనాన్షియల్ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతాయి. - మొండిబకాయిలకు సంబంధించి కూడా గత నాలుగు సంవత్సరంల్లో తగిన ప్రొవిజన్స్ (కేటాయింపులు) జరుగుతున్నాయి. - రుణాలు, డిపాజిట్ల విషయంలో ప్రైవేటు బ్యాంకుల మార్కెట్ షేర్ పెరుగుతుందని వాటికి సంబంధించి ‘స్టేబుల్’ అవుట్లుక్ సూచిస్తోంది. దిగ్గజ ప్రైవేటు బ్యాంకులు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) గట్టి పోటీని ఇవ్వగలుగుతాయి. ఆయా బ్యాంకులు మూలధన నిల్వలను పెంచుకోగలుగుతున్నాయి. తమ పోర్ట్ఫోలియోను సానుకూలంగా, క్రియాశీలంగా నిర్వహించుకోగలుగుతున్నాయి. - భారీ మూలధన కేటాయింపుల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వ మద్దతు కొనసాగుతుందని భావిస్తున్నాం. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ.2.8 లక్షల కోట్ల మూలధనం అందించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 0.2 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి. - బ్యాంకింగ్ వ్యవస్థ డిపాజిట్లలో 6.5 శాతం వాటా కలిగిన ఐదు బ్యాంకుల విషయంలో ఇండియా రేటింగ్స్ ‘నెగిటివ్ అవుట్లుక్’ను కలిగిఉంది. బలహీన మూలధనం, ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితుల విషయంలో బలహీనతలు దీనికి కారణం. - రిటైల్ రంగంలో రుణ నాణ్యత విషయానికి వస్తే, ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో ఈ విలువ 2020–21తో పోల్చితే 2021–22లో 100 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో ఇది 45 శాతానికి పరిమితం కావచ్చు. - గృహ రుణాలుసహా రిటైల్ రుణాల విషయంలో బ్యాంకులు రుణ పునర్వ్యవస్థీకరణ జరిపే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల తక్షణం డిఫాల్డ్లకు అవకాశం ఉండదు. ఈ విభాగంలో ఒత్తిడిలో ఉన్న రుణాలు, పునర్వ్యవస్థీకరణలో ఉన్న రుణాలు కలిపి 2021–22 ముగిసే నాటికి 5.8 శాతానికి (మొత్తం రుణాల్లో) చేరవచ్చు. - ఎంఎస్ఎంఈ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పెద్ద నోట్ల రద్దు నుంచీ ఈ సమస్య తలెత్తింది. దీనికితోడు జీఎస్టీ, ఆర్ఈఆర్ఏలూ ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ఇప్పడు కోవిడ్–19తో సవాళ్లు మరింత తీవ్రమయ్యాయి. అయితే సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అందుతోంది. ఇందులో అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద తగిన లిక్విడిటీ లభ్యం అవుతుండడం గమనార్హం. రుణ పునర్వ్యవస్థీకరణ కూడా ఆయా రంగాలకు ప్రయోజనం కలిగిస్తోంది. - ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చిన మొత్తం రుణాల్లో స్థూలంగా మొండిబకాయిలు (జీఎస్పీఏ) 2021–22 ముగిసేనాటికి 13.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2020–21 ముగిసే నాటికి ఈ రేటు 9.9 శాతం. ఇక ఇదే సమయంలో ఒత్తిడిలో ఉన్న రుణాల శాతం 11.7 శాతం నుంచి 15.6 శాతానికి చేరవచ్చు. కార్పొరేట్ రుణాల విషయంలో ఇది జీఎన్పీఏ 10.2 శాతానికి, ఒత్తిడి ఉన్న రుణాలు 11.3 శాతానికి ఎగసే వీలుంది. ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకోవడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రుణ వృద్ధి 8.9 శాతం 2021–22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 8.9 శాతంగా ఉంటుందన్న తమ అంచనాల్లో ఎటువంటి మార్పూ ఉండబోదని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాలు ప్రత్యేకించి మౌలిక రంగంలోకి వెళుతున్న పెట్టుబడులు, రిటైల్ రుణాలకు డిమాండ్ పునరుద్దరణ వంటి అంశాలు దీనికి దోహదం చేసే అంశాలుగా పేర్కొంది. స్టేబుల్ టూ ఇంప్రూవింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించి 2021–22 అవుట్లుక్ను గత వారమే ఇండియా రేటింగ్స్ ‘‘స్టేబుల్’’ నుంచి ‘‘ఇంప్రూవింగ్’’కు మార్చింది. నిర్వహణా పరమైన, తక్కువ వడ్డీరేటు చర్యల వల్ల నాన్ బ్యాంకింగ్ తగిన లిక్విడిటీ, మూలధన నిల్వలు, స్థిర మార్జిన్లు కలిగి ఉందని కూడా ఇండియా రేటింగ్స్ తెలిపింది. సవాళ్లను తట్టుకుని నిలబడగలిగిన స్థాయిలో నాన్స్ బ్యాంక్ ఉన్నాయని విశ్లేషించింది. చదవండి : టీప్లస్1 సెటిల్మెంట్కు సెబీ గ్రీన్సిగ్నల్ ఎకానమీ వృద్ధిరేటు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్ రా) ఇటీవలే 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇంతక్రితం 9.1 శాతం ఉన్న అంచనాలను 9.4 శాతానికి అప్గ్రేడ్ చేసినట్లు తన తాజా నివేదికలో పేర్కొంది. అధిక ఎగుమతులు, తగిన వర్షపాతం నేపథ్యంతో కోవిడ్–19 సెకండ్వేవ్ సవాళ్ల నుంచి దేశం ఆశ్చర్యకరమైన రీతిలో వేగంగా కోలుకుంటుండడమే తమ అంచనాల పెంపునకు కారణమని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్నది ‘వీ’ ( ఠి) నమూనా రికవరీ కాదని, ‘కే’ ( జు) నమూనా రికవరీ అని సంస్థ పేర్కొంటోంది. వృద్ధి నుంచి కొందరు మాత్రమే ప్రయోజనం పొందే పరిస్థితి ‘కే’ నమూనా రికవరీలో ఉంటుంది. -
బంగారంపై రుణం అందరికీ ఆమోదమే!
భారతీయులకు బంగారంతో అనుబంధం ఎంతో ప్రత్యేకం. ఆభరణాలు, బంగారంతో చేసిన వస్తువులు.. ఇలా ఏదో ఒక రూపంలో బంగారం కలిగి ఉండడాన్ని హోదాగానూ చూస్తారు. బంగారాన్ని సంపదగా భావిస్తుంటారు. అందుకే సామాన్యుడి కుటుంబంలోనూ ఎంతో కొంత బంగారం ఉంటుంది. ఇదే బంగారం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు మరో రూపంలో ఆదుకుంటోంది. ఆదాయాలు పడిపోయి, ఉపాధి కరువైన వేళ బంగారంపై సులభంగా రుణాలు పొందే పరిస్థితి వారికి కొంత ఊరటనిస్తోంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) సైతం బంగారం రుణాలు ఆమోదనీయంగా ఉంటున్నాయి. రుణ గ్రహీతలు చెల్లింపులు చేయలేని పరిస్థితుల్లో వారు తనఖాగా ఉంచిన బంగారాన్ని వేలం వేసుకునే సౌలభ్యం వాటికి ఉంటుంది. కనుక రిస్క్ తక్కువ. రుణ గ్రహీతలకూ తక్కువ రేటుపైనే రుణాలు లభించే పరిస్థితి. వెరసి ఇరువురికీ ఆమోదనీయమైన బంగారం రుణాల మార్కెట్ భారీగా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి రాకతో బంగారం రుణ మార్కెట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారీ వృద్ధిని చూసిందని చెప్పుకోవాలి. ఆర్బీఐ గణాంకాలను పరిశీలించినట్టయితే.. బ్యాంకుల రుణ పుస్తకంలో 2020 మార్చి నాటికి రూ.33,303 కోట్లుగా ఉన్న బంగారం రుణాలు.. 2021 మార్చి నాటికి ఏకంగా 86 శాతం పెరిగి రూ.60,464 కోట్లకు విస్తరించాయి. 2019 మార్చి నుంచి 2020 మార్చి మధ్యన చూసినా కానీ బ్యాంకుల బంగారం రుణాలు 33.9 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. ఇవి కేవలం ఆర్బీఐ వద్దనున్న బ్యాంకుల రుణ పుస్తకాల్లోని గణాంకాలే. ప్రత్యేకంగా బంగారం రుణాలను మంజూరు చేసే ముత్తూట్, మణప్పురం ఇతర ఎన్బీఎఫ్సీల పరిధిలోని గణాంకాలనూ కలిపి చూస్తే ఈ వృద్ధి మరింత ఎక్కవగానే ఉంటుంది. కరోనా కష్టాల్లో ఆసరా.. బంగారం రుణాల మార్కెట్ ఏటేటా భారీ వృద్ధినే నమోదు చేస్తోంది. ఇందుకు పెరిగిన బంగారం ధరలు రూపంలో అనుకూలత ఏర్పడింది. ఇక 2020 మార్చిలో కరోనా నియంత్రణకు లాక్డౌన్లు విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధిని కోల్పోగా.. కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో బంగారం తనఖా పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తీసుకున్న రుణాలపై ఆరు నెలల మారటోరియంను బ్యాంకులు కల్పించాయి. గతేడాది ఆగస్ట్లో మారటోరియం ముగిసిన తర్వాత వ్యాపార కార్యకలాపాల కోసం ఈ బంగారం రుణాలే చాలా పరిశ్రమలను, వ్యాపారులను ఆదుకున్నాయి. అదే సమయంలో ఆర్బీఐ సైతం బంగారం రుణాల విషయంలో నిబంధనలను సడలించి ఆశలు కలి్పంచింది. లోన్ టు వ్యాల్యూ (అంటే బంగారం విలువలో మంజూరు చేసే రుణం పరిమాణం/ఎల్టీవీ)ను పెంచుతూ 2020 ఆగస్ట్లో ఆర్బీఐ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయేతర అవసరాల కోసం మంజూరు చేసే బంగారం రుణాలకు ఎల్టీవీని 75 శాతం నుంచి 90 శాతానికి పెంచింది. ప్రభుత్వ బ్యాంకుల పాత్ర బంగారం ఆభరణాలు, వస్తువుల తాకట్టుపై ఎస్బీఐ మంజూరు చేసిన రుణాలు (సాధారణ అవసరాల కోసం ఇచ్చినవి) మార్చి 31 నాటికి ఏడాది కాలంలో ఏకంగా 465 శాతం పెరిగి రూ.20,987 కోట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి వి రూ.3,715 కోట్లుగానే ఉండడం గమనార్హం. బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర రిటైల్ బంగారం రుణాలు 2021 మార్చి నాటికి రూ.1,370 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవతత్సరంలో 11 రెట్ల వృద్ధి నమోదైంది. బ్యాంకు ఆఫ్ బరోడా రిటైల్ బంగారం రుణాల పోర్ట్ఫోలియో కూడా 2020 మార్చి నాటికి ఉన్న రూ.436 కోట్ల నుంచి.. 2021 మార్చి నాటికి రూ.1,101 కోట్లకు వృద్ధి చెందింది. ప్రైవేటురంగంలోని ఫెడరల్ బ్యాం కు 70 శాతం, సీఎస్బీ బ్యాంకు 61 శాతం మేర బంగారం రుణాల్లో ప్రగతిని చూపించాయి. లిక్విడిటీ ఎక్కువ.. బంగారం రుణాలకు సంబంధించి పూర్తి సామర్థ్యాలను గతంలో తమ బ్యాంకు చూడలేదని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర ఎండీ, సీఈవో రాజీవ్ ఎండీ పేర్కొన్నారు. దీంతో బంగారం రుణాల్లో మార్కెట్ను పెంచుకునేందుకు సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో, కస్టమర్లకు అనుకూలమైన పథకాన్ని రూపొందించినట్టు చెప్పారు. ‘‘క్లిష్ట సమయాల్లో చాలా మంది వ్యక్తులు, చిన్న వ్యాపారస్థులు నగదు కొరతను ఎదుర్కొంటున్నారు. తక్షణ నిధుల అవసరాలను బంగారం రుణాలు తీరుస్తున్నాయి. మా బంగారం రుణాల పోర్ట్ఫోలియో 2021 మార్చి నాటికి రూ.1,939 కోట్లకు పెరిగింది. అంటే 2020–21 ఆర్థిక సంవత్సరంలోనే ఏడు రెట్ల వృద్ధి నమోదైంది. ఇప్పటికైతే బంగారం రుణ పుస్తకం రూ.2,100 కోట్లుగా ఉంటుంది’’ అని రాజీవ్ బంగారం రుణాల విస్తృతి గురించి వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి బంగారం రుణాల పోర్ట్ఫోలియో రూ.5,000 కోట్లకు విస్తరిస్తుందని అంచనా వ్యక్తం చేశారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో పెరిగిన తమ రుణ పుస్తకంలో ఎక్కువ వృద్ధి బంగారం రుణాల విభాగం నుంచే ఉన్నట్టు సీఎస్బీ బ్యాంకు ఎండీ, సీఈవో రాజేంద్రన్ సైతం ఇటీవలే పేర్కొనడం గమనార్హం. 76 శాతం వృద్ధి బంగారం రుణాల నుంచే వచ్చినట్టు చెప్పారు. ‘‘బంగారం రుణాల్లో వృద్ధి ఎంతో బాగుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలో అంత చురుగ్గా లేవు. ఒక్క సారి కస్టమర్ ఎన్బీఎఫ్సీ నుంచి బ్యాంకుకు బంగారం రుణం కోసం వస్తే.. ఇక తిరిగి ఎప్పటికీ ఎన్బీఎఫ్సీ సంస్థల వద్దకు వెళ్లరు. ఎందుకంటే చాలా ఆకర్షణీయమైన వడ్డీ రేటుకే బ్యాంకులో బంగారంపై రుణాలు లభిస్తాయి’’ అంటూ బంగారం రుణాలకు సంబంధించి బ్యాంకులు మంచి ఎంపిక అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బంగారం రుణాలు సురక్షితమైనవి (సెక్యూర్డ్ లోన్స్). డిఫాల్ట్ (రుణ ఎగవేతలు) రిస్క్ చాలా తక్కువ. దీంతో బ్యాంకులకు బంగారం రుణాలు ఆకర్షణీయంగా మారాయి. పెరిగిన ధరలతో అధిక రుణం ఒకవైపు అధిక ఎల్టీవీ, మరోవైపు పెరిగిన బంగారం మార్కెట్ ధరలు.. తనఖా బంగారంపై ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే పరిస్థితికి దారితీశాయి. మరోవైపు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు సైతం ఎక్కువ మందికి బంగారంపై రుణాలు అనుకూల మార్గంగా తోచాయి. ప్రభుత్వరంగంలోని బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర అయితే 7.35 శాతం, ఎస్బీఐ 7.50 వార్షిక వడ్డీ రేటుపై బంగారం రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా బంగారం రుణాల మార్కెట్ను అధిక శాతం ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ సంస్థలే శాసిస్తుంటాయి. కానీ, ఆకర్షణీయమైన రుణ రేట్లతో ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం ఈ మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోతున్నాయి. దీంతో వినియోగదారులు కష్ట సమయాల్లో తక్కువ రేటుపైనే రుణాలు పొందే సౌలభ్యం ఏర్పడింది. నిజానికి ఎన్బీఎఫ్సీ సంస్థలైన ముత్తూట్, మణప్పురం సంస్థలు బంగారం రుణాలపై అధిక రేట్లను వసూలు చేస్తుంటాయి. ప్రకటనల్లోనే 12 శాతం వడ్డీ రేటు అని చెబుతాయి కానీ.. ఒక్కో కస్టమర్కు గరిష్టంగా రూ.30వేలకు మించి ఈ రేటుపై రుణాలను ఇవ్వవు. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే 18, 24 శాతం వడ్డీ రేటును చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. కానీ, బ్యాంకుల్లో 60 పైసల వడ్డీ రేటుకే బంగారంపై రుణాలు లభిస్తున్నాయి. ఇక్కడ కాల వ్యవధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్బీఎఫ్సీలు మూడు నెలలు, ఆరు నెలలకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీని ప్రతీ నెలకోసారి చెల్లించుకోవాలి. లేదంటే దానిపై మరింత చార్జీలను బాదుతాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అలా కాదు. ఏడాది, రెండేళ్లకూ రుణాలను ఇవ్వడమే కాకుండా.. వడ్డీని ఏడాదికోసారి చెల్లించే విధంగా పథకాలను రూపొందిస్తున్నాయి. కాకపోతే కాలవ్యవధి తీరిన తర్వాత వడ్డీ మాత్రమే చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలంటే ప్రక్రియను మొదటి నుంచి బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీంతో తిరిగి బంగారం అప్రైజర్ (విలువ మదింపుదారు) చార్జీలు, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ చార్జీల రూపంలో భారాన్ని భరించాల్సి ఉంటుంది. -
మొండిబకాయిలు, బంగారం విషయాల్లో రిస్క్ తక్కువేనంట
ముంబై: కరోనా సెకండ్వేవ్ నాన్బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్బీఎఫ్సీ) రుణాలపైనా ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసే మార్చి నాటికి ఎన్బీఎఫ్సీల మొండిబకాయిలు (ఎన్పీఏ) ఒక శాతం వరకూ పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. ఇదే జరిగితే ఒత్తిడిలో ఉన్న ఎన్బీఎఫ్సీల రుణ శాతం దాదాపు 8 శాతం వరకూ (దాదాపు రూ.2 లక్షల కోట్లు) పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ పునర్ వ్యవస్థీకరణసైతం రెట్టింపై 3.3 శాతానికి చేరవచ్చని అంచనావేసింది. 2020–21లో ఇది 1.6 శాతం మాత్రమే కావడం గమనార్హం. తగ్గిన వసూళ్ల సామర్థ్యం.. ఎన్బీఎఫ్సీలతోపాటు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) వసూళ్ల సామర్థ్యం మహమ్మారి వల్ల తీవ్రంగా పడిపోయినట్లు ఇక్రా పేర్కొంది. మూడవవేవ్ సమస్యలు లేకుండా ఉంటే, ఈ రంగం కొంత మెరుగుపడే అవకాశం ఉందని విశ్లేషించింది. ఆయా అంశాల నేపథ్యంలో ఈ రంగానికి ‘‘నెగటివ్’’ అవుట్లుక్ ఇస్తున్నట్లు పేర్కొంది. నాన్ బ్యాంకింగ్ రూ.24 లక్షల కోట్ల రుణాల్లో 30 శాతం ‘‘హై రిస్క్ కేటగిరీ’’ (తీవ్ర ఇబ్బందికరమైన)లో ఉన్నాయని పేర్కొంది. ఆయా రంగాలను పరిశీలిస్తే, సూక్ష్మ, వ్యక్తిగత, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చిన రుణాలు ఇందులో ఉన్నాయని పేర్కొంది. రియల్టీ కూడా ఇదే కోవలోకి వస్తుందని తెలిపింది. అయితే బంగారం, హౌసింగ్ విషయాల్లో రిస్క్ కొంత తక్కువగా ఉందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగానికి రూ.2 లక్షల కోట్ల అదనపు మూలధనం అవసరం అవుతుందని కూడా ఇక్రా అంచనావేస్తోంది. -
ఎన్బీఎఫ్సీల అసెట్స్లో 15 శాతం వృద్ధి
ముంబై: బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) సుమారు 42 శాతం సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తమ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎ) 15 శాతం పైగా వృద్ధి చెందుతుందని ఆశాభావంతో ఉన్నట్లు ఇక్రా రేటింగ్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఎన్బీఎఫ్సీలపై కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావాలను, వాటి భవిష్యత్ అంచనాలను తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించినట్లు సంస్థ వివరించింది. పరిశ్రమ ఏయూఎంలో 60 శాతం వాటా ఉన్న 65 ఎన్బీఎఫ్సీలు ఇందులో పాల్గొన్నట్లు తెలిపింది. చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు తమ ఏయూఎం 10 శాతం దాకా వృద్ధి చెందవచ్చని అంచనా వేసుకుంటున్న నేపథ్యంలో మొత్తం పరిశ్రమ వృద్ధి 7–9 శాతం స్థాయిలో ఉండవచ్చని భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మనుశ్రీ సగ్గర్ తెలిపారు. ఎన్బీఎఫ్సీ సెగ్మెంట్లో అంతర్గతంగా సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ), చిన్న సంస్థలకు రుణాలిచ్చేవి, అఫోర్డబుల్ హౌసింగ్ రుణాలిచ్చే సంస్థలు మిగతా వాటికన్నా మరింత అధిక వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. లాక్డౌన్ల సడలింపు, కొత్త కోవిడ్ కేసులు ఒక మోస్తరు స్థాయికి పరిమితం అవుతుండటం, టీకాల ప్రక్రియ పుంజుకోవడం వంటి అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మిగతా భాగంలో గత ఆర్థిక సంవత్సరం కన్నా వృద్ధి మెరుగ్గా ఉండవచ్చని ఎన్బీఎఫ్సీలు భావిస్తున్నట్లు ఇక్రా రేటింగ్స్ తెలిపింది. -
మరింత చౌకగా హోమ్లోన్స్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే!
ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక సొంతిళ్లు ఉండాలని చాలా కలలు కంటుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ కలలను నిజం చేసుకుంటారు. తమ కలను నిజం చేసుకోవడానికి తగినంత డబ్బు లేక, బ్యాంకు వడ్డీ రేట్లు చూసి వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి ఇది మంచి సమయం అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేట్లు నాలుగు దశాబ్ధాల కనిష్టానికి పడిపోయాయి. ఈ సమయంలో అతి తక్కువ వడ్డీకే గృహ రుణాలను పొందవచ్చు. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజులను కొంత మేరకు తగ్గించాయి. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ వడ్డీకే హోమ్లోన్స్ అందిస్తున్న బ్యాంకుల జాబితాను ఒకసారి పరిశీలిద్దాం. బ్యాంకులు/ రుణదాతలు వడ్డీ రేట్లు Kotak Mahindra Bank 6.65% Punjab & Sind Bank 6.65% State Bank of India 6.70% HDFC Bank 6.75% ICICI Bank 6.75% Bank of Baroda 6.75% Union Bank of India 6.80% Punjab National Bank 6.80% Central Bank of India 6.85% IDBI Bank 6.85% Axis Bank 6.90% Canara Bank 6.90% LIC Housing Finance 6.90% UCO Bank 6.90% Bank of India 6.95% Indian Overseas Bank 7.05% PNB Housing Finance 7.35% Karnataka Bank 7.50% Federal Bank 7.65% Standard Chartered Bank 7.99% YES Bank 8.95% బ్యాంకుకు, బ్యాంకుకి మధ్య ప్రాసెసింగ్ ఫీజులు అనేవి మారుతుంటాయి కాబట్టి ఆ ఫీజుల గురుంచి ముందుగా తెలుసుకోవాలి. అలాగే, వీలైనంత తక్కువ మొత్తంలో గృహ రుణం తీసుకుంటే మంచిది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చదవండి: బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత? -
బంగారం రుణాలపై వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంతెంత?
భారతీయులకు చాలా కాలం నుంచి బంగారం పట్ల బలమైన అనుబంధం ఉంది. అందుకే బంగారం ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఇలా కొన్న బంగారాన్ని ప్రజలు అమ్మడానికి ఇష్టపడరు. దానికి ఒక కారణం ఉంది. ఒకవేల ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆర్ధికంగా ఇబ్బందులు గురైనప్పుడు బంగారం ఆదుకుంటుంది అనే భరోసా వారిది. వారి ఆలోచనలకు తగ్గట్టుగానే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కఠిన పరిస్థితులలో డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అంతే తప్ప ఎక్కువగా అమ్మడానికి ఇష్టపడరు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. అందుకే కరోనా సమయంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి. సాధారణ వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే బంగారం రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్లను తాకట్టు పెడతారు కాబట్టి బ్యాంకులు కూడా తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ ఇచ్చే సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లోనే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. సాధారణంగా బంగారం మార్కెట్ విలువలో 75శాతం కంటే ఎక్కువ రుణ మొత్తాన్ని ఇవ్వరు. బంగారు రుణాలకి సంబందించి బ్యాంక్కి, బ్యాంక్కి మధ్య మధ్య వ్యత్యాసం ఉంటుంది. వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ-క్లోజర్ మరియు పార్ట్ ప్రీపేమెంట్ ఛార్జీలు, ఆలస్యంగా చెల్లింపు ఛార్జీలు, రుణ ధరఖాస్తు సౌలభ్యం మొదలైన వాటి కోసం ముందే తనిఖీ చేసుకోవాలి. తక్కువ వడ్డీకే బంగారం రుణాలు ఇస్తున్న ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల గురుంచి ఈ క్రింద తెలుసుకోండి. జూన్ 1, 2021న సంబంధిత వెబ్సైట్ల నుండి సేకరించిన డేటా ఇది. బ్యాంకు పేరు వడ్డీ రేటు (ఏడాదికి) Punjab & Sind Bank 7.00% Bank of India 7.35% State Bank of India 7.50% Canara Bank 7.65% Union Bank 8.20% Karnataka Bank 8.49% Indian Bank 8.50% UCo Bank 8.50% Federal Bank 8.50% Punjab National Bank 8.75% Jammu & Kashmir Bank 8.85% Central Bank 8.85% Indian Overseas Bank 8.85% HDFC Bank 8.95% Bank of Baroda Bank 9.00% Dhanalaxmi Bank 9.50% Karur Vyasya Bank 10.10% ICICI Bank 11.00% South Indian Bank 11.95% AXIS Bank 12.50% NBFCs IIFL Finance 9.24% Muthoot Finance 11.90% Bajaj Finserv 12.00% Manappuram Finance 12.00% చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
మూడు నెలల్లో రూ.404 కోట్ల విలువైన బంగారం వేలం
ముంబై: పసిడి రుణాల విషయంలో బ్యాంకింగ్లో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్న పరిస్థితి కనిసిస్తోంది. మణప్పురం ఫైనాన్స్ వంటి పసిడి హామీగా రుణాలను మంజూరుచేసే బ్యాంకింగ్యేతర ఫైనాన్షియల్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ) బంగారాన్ని పెద్ద ఎత్తున వేలం వేసే పరిస్థితి నెలకొంది. ఒక్క మణప్పురం ఫైనాన్స్ 2021 జనవరి-మార్చి మధ్య రికార్డు స్థాయిలో దాదాపు రూ.404 కోట్ల విలువైన టన్ను బంగారాన్ని వేలం వేసింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. 2021-22 సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకింగ్కూ మొండిబకాయిల(ఎన్పీఏ) సెగ తీవ్రమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మహమ్మారి వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రజానీకం కష్టాల నుంచి గట్టెక్కడానికి 2020లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు చర్యలు తీసుకుంది. తనఖాలకు సంబంధించి పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలను అందించవచ్చన్నది ఆర్బీఐ సడలించిన నిబంధనల్లో ఒకటి. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో (ఆగస్టులో గ్రాముకు గరిష్టంగా రూ.5,600 పలికింది) కష్టకాలంలో ఈ మెటల్ ప్రజలను ఆదుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పసిడి పోర్ట్ ఫోలియోలూ భారీగా పెరిగాయి. 2020-21లో ఈ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లకు పెరిగింది. 2019-20లో ఈ విలువ రూ.1.6 లక్షల కోట్లు కావడం గమనార్హం. పసిడి రుణ పరిశ్రమ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఇందులో 75 శాతం వాటా అసంఘటిత, చిన్నపాటి రుణదాతలదే. బ్యాంకింగ్ వంటి వ్యవస్థీకృత సంస్థల వాటా కేవలం 25 శాతం (రూ.2 లక్షల కోట్లు). 2020-21లో వ్యవస్థీకృత రంగంలో బ్యాంకింగ్ పసిడి రుణ పోర్ట్ఫోలియో వాటా రూ.1.2 లక్షల కోట్లయితే, ఎన్బీఎఫ్సీల వాటా రూ.80,000 కోట్లు. ఇటీవల మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విడుదల చేసిన ఒక నివేదిక ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఈ నివేదిక ప్రకారం భారత్లో 2020 మహమ్మారి విసిరిన సవాళ్లలో (మొదటి వేవ్లో) ప్రైవేటు రంగమే 80 శాతం ఆదాయం నష్టపోయింది. ప్రభుత్వం భరించిన నష్టం 20 శాతమే. ఇందులోనూ కార్పొరేట్ రంగం కేవలం 12 నుంచి 16 శాతం భరిస్తే, మిగిలినది కుటుంబాలు భరించాయి. త్రైమాసికాల్లోనే టాప్... మార్చి త్రైమాసికంలో మేము దాదాపు రూ.404 కోట్ల విలువైన 1,000 కేజీల తనఖా బంగారాన్ని వేలం వేశాము. అంతక్రితం మూడు త్రైమాసికాల్లో కేవలం రూ.8 కోట్ల విలువచేసే పసిడినే వేలం వేశాం. ఒక త్రైమాసికంలో వేలం ద్వారా రూ.404 కోట్ల రికవరీ ఇదే తొలిసారి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రికవరీలు రికార్డు స్థాయిలో రూ.1,932 కోట్లు. ఇక ఇప్పటికి మా ఖజానాలో 300 టన్నుల పసిడి ఉంది. కాగా, బ్యాంకులు, ఇతర పోటీ సంస్థలు ఆరు నుంచి 12 నెలల కాలానికి పసిడీ రుణ కాలపరిమితులను అనుసరిస్తుండగా, మేము మూడు నెలల కాలపరిమితినే అనుసరిస్తున్నాం. అందువల్ల మేము ప్రతి నేలా పసిడి వేలం నిర్వహిస్తాము. నిజానికి 2020లో ధరలు భారీగా పెరిగాయి. పసిడి విలువలో 90 శాతం వరకూ రుణాలకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పుడు ధరలు అప్పటితో పోల్చితే భారీగా పడిపోయాయి. దీనితో ఈ రుణాల విషయంలో ‘బబుల్’ ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఏడాది వరకూ రుణ కాలపరిమితి ఉన్నందున, బ్యాంకులు అలాగే ఇతర ఎన్బీఎఫ్సీలు తమ రుణ నాణ్యత సమస్యలపై మార్చి లేదా జూన్ త్రైమాసికం వరకూ తమ రుణ నాణ్యతను తెలియజేయవు. అయితే ఈ విషయంలో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ ఎన్పీఏల సెగ తీవ్రమయ్యే అవకాశం ఉంది. తమ గోల్డ్ రుణ పుస్తకంలో దాదాపు 90 శాతాన్ని బ్యాంకులు ప్రాధాన్యతా పూర్వక రుణంగా పేర్కొన్నాయి. - వీపీ నందకుమార్, మణప్పురం ఎండీ, సీఈఓ బ్యాంకులకు ఎన్పీఏల తీవ్రత! గ్రాము ధర రూ.5,600 ఉన్న గరిష్ట స్థాయిల నుంచి చూస్తే, ఇప్పుడు ధరలు 10 నుంచి 13 శాతం పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ త్రైమాసికం నుంచీ బ్యాంకుల రుణ నాణ్యత సమస్యలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఇప్పటికి మా సంస్థ భారీ వేలాలు ఏవీ నిర్వహించలేదు. మా రుణ కాలపరిమితి 9 నుంచి 12 నెలలు ఉండడమే దీనికి కారణం. - థామస్ జాన్ ముత్తూట్, ముత్తూట్ గ్రూప్ చైర్మన్ -
మెరుపు తగ్గిన బంగారం..బ్యాంకింగ్కు ఇబ్బందే!
సాక్షి, ముంబై: బంగారం ధర తగ్గడం వల్ల బ్యాంకింగ్ యేతర ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) రుణ నాణ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. బంగారం హామీగా రుణాలు ఎన్బీఎఫ్సీల ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో ఒకటన్న సంగతి తెలిసిందే. కాగా, బంగారాన్ని తాకట్టుగా ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరం (2020–21) భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకుల రుణ నాణ్యతకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని అంచనావేసింది. ఈ నేపథ్యంలో క్రిసిల్ విడుదల చేసిన నివేదిక ముఖ్యాంశాలు చూస్తే... ♦ గత కొన్ని ఆర్థిక సంవత్సరాలగా బంగారం హామీగా ఎన్బీఎఫ్సీలు ఇస్తున్న రుణ తీరును పరిశీలిస్తే, పసిడి ధరపై రుణ విలువ (లోన్-టూ-వ్యాల్యూ-ఎల్టీవీ) 75 శాతం దిగువనే ఉంది. దీనికితోడు క్రమానుగతంగా వడ్డీని సంస్థలు సక్రమంగా వసూలు చేస్తున్నాయి. ♦ 2020 డిసెంబర్ 31వరకూ పరిశీలిస్తే, ఎన్బీఎఫ్సీల సగటు ఎల్టీవీ 63 నుంచి 67 శాతం వరకూ ఉంది. అయితే కేవలం 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికాన్ని చూస్తే, ఇది 70 శాతంగా ఉంది. ♦ ఎల్టీవీ విషయంలో ఎన్బీఎఫ్సీలు చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి లోన్ బుక్స్ను పరిశీలిస్తే, బంగారంపై వడ్డీ ఆదాయాలు స్థిర రీతిన 2 నుంచి 4 శాతంగా ఉంటున్నాయి. ♦ మరోవైపు గడచిన ఆర్థిక సంవత్సరం ఎన్బీఎఫ్సీలతో పోల్చితే బంగారం హామీగా బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేశాయి. వీటి ఎల్టీవీ ఏకంగా 78 నుంచి 82 శాతం వరకూ ఉంది. ♦ ఫిబ్రవరి 2021 వరకూ గడచిన 11 నెలల్లో బంగారం హామీగా బ్యాంకుల రుణ మంజూరీ దాదాపు 70 శాతం పెరిగి రూ.56,000 కోట్లకు చేరాయి. బ్యాంకులకు 90శాతం వరకూ ఎల్టీవీ వెసులుబాటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కల్పించడం ఈ భారీ మంజూరీలకు ఒక కారణం. 2021 మార్చి 31 వరకూ బ్యాంకులకు ఈ వెసులుబాటు లభించింది. ♦ 2020 ఆగస్టు నుంచీ బంగారం ధరల 18 నుంచి 20 శాతం వరకూ పడిపోయాయి. దీనికితోడు బంగారంపై ఇచ్చిన రుణాలకు వడ్డీలు కూడా సరిగా వసూలు కాకపోతే, రుణ నాణ్యతపై కొంతమేర ప్రతికూల ప్రభావం తప్పకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ పేర్కొన్నారు. ♦ ఆయా అంశాలను పరిశీలిస్తే, బంగారం ధరల్లో అస్థిరతల సమస్య నుంచి బయటపడ్డానికి రెండు కీలక మార్గాలు కనబడుతున్నాయి. పటిష్టమైన ‘ఇబ్బందుల నిర్వహణా వ్యవస్థ ఏర్పాటు’ ఇందులో ఒకటి. సకాలంలో కుదువ పెట్టిన బంగారాన్ని వేలం వేసేలా చర్యలు తీసుకోవడం రెండవ కీలక చర్య. పసిడి ధరల్లో ఒడిదుడుకులు ఇలా... కరోనా తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లను ‘సురక్షిత పెట్టుబడుల సాధనంగా’ పసిడి ఆకర్షించింది. గత సంవత్సరం ఆగస్టులో అంతర్జాతీయ కమోడిటీస్ ఫ్యూచర్స్ మార్కెట్-న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్చేంజ్ (నైమెక్స్)లో ఔన్స్ (31.1గ్రాము) చరిత్రాత్మక గరిష్ట స్థాయి రూ.2,089 డాలర్లను తాకింది. అయితే అమెరికా ఆర్థిక ఉద్దీపన, తిరిగి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటాయన్న విశ్వాసం బలపడ్డం, ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి, డాలర్ ఇండెక్స్ (89 నుంచి 92 పైకి అప్) బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో పసిడి ధర క్రమంగా భారీగా తగ్గింది. ఈ వార్తరాసే సోమవారం (12 ఏప్రిల్) రాత్రి 8 గంటల సమయంలో నైమెక్స్లో ధర 1,733 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన నెలరోజుల్లో పసిడికి 1,640 డాలర్ల వద్ద రెండుసార్లు పటిష్ట మద్దతు లభించింది. ఈ స్థాయి కిందకు పడితే పసిడి మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా పసిడి చరిత్రాత్మక గరిష్టం వద్ద ఉన్నప్పుడు దేశీయంగా ధర 10 గ్రాములు పూర్తి స్వచ్చత ధర రూ.56,000 పలికింది. ప్రస్తుతం కొంచెం అటుఇటుగా రూ.46,500 వద్ద ధర ఉంటోంది. ఈ వార్త రాస్తున్న సమయంలో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్-మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ధర రూ.46,578 వద్ద ట్రేడవుతోంది. ఎన్బీఎఫ్సీలు పటిష్టం: ఇండియా రేటింగ్స్ ఇదిలాఉండగా, కరోనా సెకండ్వేవ్ను తట్టుకోగలిగిన సామర్థ్యంలో ఎన్బీఎఫ్సీలు ఉన్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందుకు తగిన పటిష్ట మూలధనం, ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఎన్బీఎఫ్సీలు కలిగి ఉన్నట్లు వివరించింది. సెకండ్ వేవ్తో వ్యాపార కార్యకాలాపాలకు తిరిగి కఠిన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషించింది. ఎన్బీఎఫ్సీలు తమ కస్టమర్లకు చక్కటి సేవలు అందించగలుతున్నట్లు వివరించింది. రిటైల్ విభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎన్బీఎఫ్సీలకు ప్రస్తుతం తాను ఇస్తున్న ‘స్టేబుల్ అవుట్లుక్’ను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అలాగే 2021-22కు హోల్సేల్ ఎన్బీఎఫ్సీలకు నెగటివ్ అవుట్లుక్ను కొనసాగుతుందని వివరించింది. సెకండ్వేవ్ విసిరే కొత్త సవాళ్లు వృద్ధి రికవరీపై ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న విషయాన్ని వేచి చూడాల్సి ఉందని పేర్కొంది. -
బీమా సంస్థలలో భారీ వాటాల విక్రయం!
ముంబై: కీలకం కాని బీమా బిజినెస్లలో బ్యాంకింగ్ సంస్థలు నియంత్రిత స్థాయిలో వాటాలను కలిగి ఉండటంపై రిజర్వ్ బ్యాంక్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీమా వెంచర్లకు బ్యాంకింగ్ సంస్థలు అధిక పెట్టుబడులను వెచ్చించాల్సి రావడంతో వాటాలపై పరిమితి విధించే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి బీమా రంగ సంస్థలలో బ్యాంకుల వాటాను గరిష్టంగా 20 శాతానికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించాయి. ఈ బాటలోనే ఇటీవల మ్యాక్స్ లైఫ్ను కొనుగోలు చేసేందుకు ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ను అనుమతించినట్లు పేర్కొన్నాయి. మ్యాక్స్ లైఫ్లో ప్రత్యక్షంగా 10 శాతం వాటాను మాత్రమే కలిగి ఉండేందుకు యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదించింది. అంతేకాకుండా 20 శాతానికి వాటాను పరిమితం చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలియజేశాయి. ప్రస్తుతం 50 శాతం ప్రస్తుతం బీమా రంగ వెంచర్లలో బ్యాంకులు 50 శాతం వరకూ వాటాను పొందేందుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఈ వాటాను 20 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర బ్యాంకు భావిస్తున్నట్లు ఒక నివేదిక అభిప్రాయపడింది. ఇది జరిగితే కేవలం మూడు బ్యాంకింగ్ దిగ్గజాలు విక్రయించే వాటా విలువే రూ.1.21 లక్షల కోట్లుగా ఉండగలదని విశ్లేషకులు అంచనా వేశారు. తాజా ప్రతిపాదనల ప్రకారం బీమా అనుబంధ సంస్థలలో పీఎస్యూ దిగ్గజం ఎస్బీఐ, ప్రయివేట్ రంగ బ్లూచిప్స్ హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వాటాలను విక్రయించవలసి వస్తే వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని పేర్కొన్నారు. బీమా వెంచర్లలో వాటాను 20 శాతానికి పరిమితం చేసుకోమంటూ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ ఆదేశిస్తే.. ఈక్విటీ ఫ్రీఫ్లోట్ భారీగా పెరుగుతుందని తెలియజేశాయి. దిగ్గజాల తీరిలా లిస్టెడ్ కంపెనీలలో హెచ్డీఎఫ్సీకి బీమా అనుబంధ సంస్థ హెచ్డీఎఫ్సీ లైఫ్లో 50 శాతం వాటా ఉంది. తాజా ప్రతిపాదనలకు అనుగుణంగా ఈక్విటీని తగ్గించుకోవలసి వస్తే రూ. 44,100 కోట్ల విలువైన వాటాను విక్రయించవలసి ఉంటుంది. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్లో 51 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత ధర ప్రకారం రూ.22,100 కోట్ల విలువైన షేర్లను అమ్మకానికి ఉంచవలసి వస్తుంది. ఇదే విధంగా ఐసీఐసీఐ లంబార్డ్లోనూ 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ వెంచర్లో రూ. 21,700 కోట్ల విలువైన ఈక్విటీని ఆఫ్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ బాటలో ఎస్బీఐ లైఫ్లో 55 శాతం వాటాను సొంతం చేసుకున్న స్టేట్బ్యాంక్ అయితే రూ. 32,200 కోట్ల విలువైన వాటాను తగ్గించుకోవలసి వస్తుంది. ఈ నాలుగు దిగ్గజాల వాటాలను పరిగణించినప్పటికీ వీటి విలువ రూ. 1.21 లక్షల కోట్ల వరకూ నమోదు కావచ్చని విశ్లేషకులు మదింపు చేశారు. పలు సంస్థలు.. అన్ని పీఎస్యూ బ్యాంకులతోపాటు.. పలు ప్రయివేట్ రంగ బ్యాంకులు సైతం బీమా రంగంలో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేశాయి. అయితే.. కోవిడ్–19 నేపథ్యంలో మొండి రుణాలు తదితర సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా బ్యాంకులకు బీమా రంగ వెంచర్లు ఉపయోగపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. బీమా రంగ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకున్న నిధులను ప్రొవిజనింగ్ తదితరాలకు బ్యాంకులు వినియోగించుకునేందుకు వీలు చిక్కుతున్నట్లు తెలియజేసింది. ఉదాహరణకు 2016–18 కాలంలో హెచ్డీఎఫ్సీ ఇలా సమీకరించిన నిధులను 40 శాతం వినియోగించుకోగా.. ఐసీఐసీఐ బ్యాంక్ సైతం ఇదే స్థాయిలో ప్రొవిజన్లకు కేటాయించింది. జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలలో వాటాల విక్రయం ద్వారా 2016 నుంచి చూస్తే హెచ్డీఎఫ్సీ రూ. 10,900 కోట్లు సమకూర్చుకోగా.. ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 15,300 కోట్లు, ఎస్బీఐ రూ. 12,670 కోట్లు అందుకున్నట్లు నివేదిక తెలియజేసింది. చదవండి: డెస్క్ టాప్లోనూ వాయిస్, వీడియో కాల్స్ ఇండియాలోకి ఎఫ్డిఐ పెట్టుబడుల జోరు -
బంగారంపై రుణమా?.. ఇవి గుర్తుంచుకోండి
మన దేశంలో అందరికి బంగారంపై మక్కువ ఎక్కువ. తరతరాల నుంచి బంగారాన్ని కొని దాచుకోవడం ఒక అలవాటు. ఇంట్లో ముఖ్యమైన వేడుకలు జరిగినప్పుడు బంగారం కొనుగోలుకు ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఇది ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా తాత్కాలికంగా సమస్యలు ఎదురైనప్పుడు దీనిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. ఇది చాలా సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు(ఎన్బీఎఫ్సీ) కూడా బంగారంపై రుణాలు ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. బంగారంపై రుణాలను జారీ చేసేందుకు బ్యాంకులు కూడా క్రెడిట్ స్కార్లను పరిగణలోకి తీసుకోవు. బంగారంపై రుణం ఇచ్చేటప్పుడు రుణ గ్రహిత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేయవు. ప్రస్తుతం మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటివి బంగారు రుణ వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. అయితే మనం బంగారంపై కొన్ని విషయాలు గురుంచుకోండి. బ్యాంకులు వర్సెస్ ఎన్బీఎఫ్సీ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే ఎన్బీఎఫ్సీలు ఎక్కువ మొత్తంలో రుణాలు అందజేస్తాయి. అలాగే బ్యాంకులు ఎక్కువ మొత్తం రుణాలు అందజేస్తాయి. కాకపోతే బ్యాంకులతో పోలిస్తే వడ్డీరేటు 1 నుంచి 2 శాతం ఎక్కువ ఉంటుంది. ఉదాహారణకు మీ దగ్గర ఉన్న 20గ్రాముల బంగారానికి రుణాలు తీసుకుంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ రెండు వాస్తవిక బంగారం విలువలో 75 శాతం అందిస్తుంటాయి. మీకు ప్రభుత్వ బ్యాంకులు 10 గ్రాముల బంగారానికి రూ.40వేలు అందిస్తే, ఎన్బీఎఫ్సీలు కొంచెం ఎక్కువ అందించే అవకాశం ఉంటుంది. కానీ ఎన్బీఎఫ్సీల కంటే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. రుణ మంజూరు విషయంలో ఎన్బీఎఫ్సీలు ముందు ఉంటాయి. ఎలాంటి బంగారం తాకట్టు పెట్టొచ్చు? బంగారం రుణం కావాలంటే బంగారం కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. మనం సాధారణంగా ధరించే బంగారం 22 క్యారెట్లు ఉంటుంది. 18 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత ఉంటే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలు మంజూరు చేయవు. అభరణాలు, బంగారు నాణేలను తాకట్టు పెట్టవచ్చు కానీ బంగారు కడ్డీలపై చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అలాగే తనఖా పెట్టిన అభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండదు. కేవలం బంగారం విలువను మాత్రమే లెక్కిస్తారు. నాణేల విషయంలో కూడా స్వేచ్ఛత అడగవచ్చు. 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణేలను అంగీకరించరు. బంగారంపై ఛార్జీలు బ్యాంకులను, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతుంటాయి. వ్యాల్యుయేషన్ ఛార్జెస్, ప్రాసెసింగ్ ఫీజ్ లాంటివి ఉంటాయి. రీపేమెంట్ రుణం తిరిగి చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. నెలవారీగా వాయిదాలలో(ఈఎంఐ) చెల్లించవచ్చు లేదా రుణ కాలపరిమితి ఉన్నంత వరకు వడ్డీని మాత్రమే చెల్లించి చివరలో ఒకేసారి మొత్తం రుణం చెల్లించవచ్చు. అసలుతో పాటు వడ్డీ కలిపి చివరలో చెల్లించవచ్చు. గోల్డ్ లోన్ చెల్లించకపోతే ఏమవుతుంది? రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించకెపోతే రుణదాతలకు మీ బంగారాన్ని విక్రయించే హక్కు ఉంటుంది. విక్రయించే ముందు బ్యాంకు లేదా ఫైనాన్సింగ్ సంస్థలు నోటీసులు ఇస్తాయి. బంగారం ధర పడిపోతే రుణదాత అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల కోరే అవకాశం ఉంది. రుణం, బంగారం విలువ నిష్పత్తిని ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కొనసాగించాలని బ్యాంకులు కోరుతుంటాయి. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!
బంగారం విషయంలో భారత ప్రజలకు ఎక్కువగా భావోద్వేగపరమైన సంబంధం ఉంటుంది. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారం అమ్మటానికి ఇష్టపడరు. ఒకవేల ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. మన దేశంలో ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని ఒక ఆస్తిగా వాడుకోవటానికే ఇష్ట పడుతారు. అప్పులు ఇచ్చే వాళ్లు కూడా బంగారాన్ని మంచి తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. అందుకే కరోనా సమయంలో మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మరింత ఎక్కువగా రుణాలు ఇస్తూ వాటిపై వడ్డీలు ఆర్జిస్తున్నాయి. సాధారణంగా వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్ల కంటే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్లను తాకట్టు పెడతారు కాబట్టి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. భవిష్యత్ లో వీటి ధరలు పెరుగుతుంటాయి కాబట్టి బ్యాంకులు కూడా త్వరగా రుణాలు ఇవ్వడానికి చూస్తాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ సంస్థల కన్నా బ్యాంకుల్లోనే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. తక్కువ వడ్డీకే బంగారం రుణాలు ఇస్తున్న ఎన్బీఎఫ్సీలు, బ్యాంకుల గురుంచి ఈ క్రింద తెలుసుకోండి. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ - 7 శాతం. బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.35 శాతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 7.50 శాతం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర- 7.50 శాతం. కెనెరా బ్యాంక్- 7.65 శాతం. కర్నాటక బ్యాంక్- 8.38 శాతం. ఇండియన్ బ్యాంక్- 8.50 శాతం. యూకో బ్యాంక్- 8.50 శాతం. ఫెడరల్ బ్యంక్- 8.50 శాతం. పంజాబ్ నేషనల్ బ్యాంక్- 8.75 శాతం. యూనియన్ బ్యాంక్- 8.85 శాతం. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్- 8.90 శాతం. సెంట్రల్ బ్యాంక్- 9.05 శాతం. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్- 9.25 శాతం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్- 9.50 శాతం. బ్యాంక్ ఆఫ్ బరోడా- 9.60 శాతం. యెస్ బ్యాంక్- 9.99 శాతం. ఐసీఐసీఐ బ్యాంక్- 10 శాతం. ఇండస్ ఇండ్ బ్యాంక్- 10 శాతం. కొటక్ మహీంద్రా బ్యాంక్- 10.50 శాతం. ముత్తూట్ ఫైనాన్స్- 11.99 శాతం. మణప్పురం ఫైనాన్స్- 12 శాతం. యాక్సిస్ బ్యాంక్- 13 శాతం.చదవండి చదవండి: బంగారం కొనుగోలుదారులకు తీపికబురు -
పిరమల్ చేతికి దివాన్ హౌసింగ్
న్యూఢిల్లీ: దివాళా చట్ట చర్యలకు లోనైన ఎన్బీఎఫ్సీ.. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్(డీహెచ్ఎఫ్ఎల్)ను పిరమల్ గ్రూప్ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఆర్బీఐ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రుణ భారంతో కుదేలైన డీహెచ్ఎఫ్ఎల్ను కొనుగోలు చేసేందుకు పిరమల్ గ్రూప్ ప్రతిపాదించిన రుణ పరిష్కార ప్రణాళికకు ఇప్పటికే రుణదాతల కమిటీ(సీవోసీ) ఆమోదముద్ర వేసింది. పిరమల్ గ్రూప్ కంపెనీ పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ రూపొందించిన రుణ పరిష్కార ప్రణాళికను జనవరి 15న సీవోసీ ఆమోదించింది. భారీ నష్టాలు..: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో డీహెచ్ఎఫ్ఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,095 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ3లో రూ. 934 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే ఈ ఏడాది క్యూ2(జూలై–సెప్టెంబర్)లోనూ డీహెచ్ఎఫ్ఎల్ రూ. 2123 కోట్ల నష్టాలు ప్రకటించడం గమనార్హం! ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్పై దివాళా చర్యలకు వీలుగా 2019 నవంబర్లో జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు సిఫారసు చేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో డీహెచ్ఎఫ్ఎల్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 18 వద్ద ముగిసింది. -
రుణ అర్హతలను పెంచుకోండిలా..
మీరు తీసుకున్న రుణమే మీ అర్హతలను నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో మీకు అవసరం ఏర్పడితే రుణదాతలు క్యూ కట్టి ‘బాబ్బాబు మేము ఇస్తాం’ అనే విధంగా చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. నేటి రోజుల్లో రుణం లభించడం ఎంత సులభమో.. అంత కష్టం కూడా. ఎందుకంటే ఓ వ్యక్తి రుణ చరిత్ర అంతా క్రెడిట్ బ్యూరోల రికార్డుల్లో వివరంగా నమోదవుతుంటుంది. రుణాల మంజూరుకు ముందు బ్యాంకు అయినా ఎన్బీఎఫ్సీ అయినా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోరును కచ్చితంగా పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోరు మీ రుణ అర్హతను నిర్ణయించడమే కాదు.. ఎంత వడ్డీ రేటు వసూలు చేయాలనే విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత బాగుంటే.. మీకు అంత ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు, కోరుకున్నంత రుణం లభిస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మీ రుణ దరఖాస్తు స్వీకరణ లేదా తిరస్కరణ అనేది మీ క్రెడిట్ స్కోర్ మీదే ఆధారపడి ఉంటుంది. అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు? మీ స్కోర్ను ఎలా పెంచుకోవాలన్నది ఓసారి చూద్దాం. ఎలా లెక్కిస్తారంటే... రుణ గ్రహీతల విశ్వసనీయతను.. చెల్లింపుల సామర్థ్యాన్ని కొలిచే ప్రమాణాల్లో క్రెడిట్ స్కోర్ ఒకటి. దరఖాస్తుదారుల రుణ అర్హతను అంచనా వేయడానికి, రుణ మొత్తాన్ని నిర్ణయించడానికి బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు క్రెడిట్ స్కోర్ను తనిఖీ చేస్తుంటాయి. దీనికితోడు, ఇతర సమాచారం ఆధారంగా రుణాలకు అర్హులా, కాదా? అన్నది నిర్ణయిస్తారు. వడ్డీ రేటుకూ ఇదే ప్రామాణికం అవుతుంది. రుణాల మంజూరు, తిరిగి చెల్లింపుల సమాచారాన్ని రుణ గ్రహీతల పాన్ నంబర్ ఆధారంగా.. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) క్రమం తప్పకుండా నిర్ణీత కాలానికోసారి క్రెడిట్ బ్యూరో సంస్థలకు (సిబిల్ తదితర) అందిస్తుంటాయి. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రెడిట్ స్కోరును నిర్ణయిస్తుంటాయి బ్యూరోలు. సాధారణంగా గత 36 నెలల రుణ చరిత్ర ఆధారంగా క్రెడిట్ స్కోర్ ఉంటుంది. చెల్లింపుల తీరు, సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ రుణాల మిశ్రమం ఎలా ఉంది, రుణాల కోసం విచారణలు, రుణాల వినియోగం.. ఈ నాలుగు అంశాలు మీ క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుంటాయి. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆల్గోరిథమ్ల సాయంతో.. రుణ చరిత్రతోపాటు వినియోగదారుల దీర్ఘకాలిక ఔట్స్టాండింగ్ బ్యాలెన్స్ (చెల్లించాల్సిన బకాయిలు), క్రెడిట్ కార్డ్ల లావాదేవీల చరిత్ర, కొత్త ఖాతాల ప్రారంభం లేదా తొలగింపులు, తిరిగి చెల్లింపుల నిష్పత్తి వంటివి కూడా క్రెడిట్ బ్యూరోలకు ప్రామాణికంగా మారాయి. సాధారణంగా.. 300 నుంచి 900 వరకు క్రెడిట్ స్కోర్ ఉంటుంది. రుణదాతలకు వ్యక్తిగత రుణాలు లభించాలంటే.. కనీస సిబిల్ స్కోర్ 720 నుంచి 750 మధ్య అయినా ఉండాలి. ఇంతకంటే ఎక్కువ స్కోర్ ఉంటే రుణాన్ని అధిక మొత్తంలో పొందే అర్హత ఉంటుంది. స్కోర్ తక్కువగా ఉంటే రుణం కూడా తక్కువే వస్తుంది. స్కోర్ను మెరుగుపరుచుకోవాలంటే.. రుణ వాయిదాల చెల్లింపుల్లో డిఫాల్ట్ కాకుండా చూసుకోవాలి. గృహ, వాహన రుణాలు సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ రుణాలు అన్సెక్యూర్డ్గా ఉంటాయి. సెక్యూర్డ్ రుణాల్లో రుణదాత విఫలమైనా, రుణమిచ్చిన సంస్థలకు రిస్క్ పెద్దగా ఉండదు. ఎందుకంటే హామీగా ఆస్తులు ఉంటాయి. వాటిని విక్రయించి సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, అన్సెక్యూర్డ్ రుణాలను ఎగ్గొడితే.. వసూలు చేసుకోవడం రుణమిచ్చిన సంస్థలకు తలనొప్పిగా పరిణమిస్తుంది. అందుకే రుణదాతలు అన్సెక్యూర్డ్స్ రుణాలు, వాటిని తిరిగి ఏ విధంగా చెల్లిస్తున్నారన్న చరిత్ర గురించి లోతైన విశ్లేషణ చేస్తుంటారు. మీ సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించేవి కూడా ఈ అన్సెక్యూర్డ్ రుణాలే. ముఖ్యంగా..జాయింట్ బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉన్న వారికి హామీ ఇవ్వటంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఆయా ఖాతా చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులెదురైనా ఆ బాధ్యత జాయింట్ ఖాతాదారులైన మీ మీద కూడా పడుతుంది. అంతిమంగా దీని ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద కూడా ఉంటుంది. వ్యక్తిగత రుణం, క్రెడిట్కార్డు వినియోగం, వాహన రుణం, గృహ రుణం ఇలా రుణ పోర్ట్ఫోలియో వైవిధ్యంగా ఉండడం కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్కార్డు విషయంలో సకాలంలో చెల్లింపులతోనూ స్కోర్ పెంచుకోవచ్చు. స్కోర్ను చెక్ చేసుకోవచ్చు.. క్రెడిట్ బ్యూరో సంస్థలు ఏటా ఒక్కసారి ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇక వివిధ రకాల ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ పోర్టళ్ల నుంచి, యాప్స్ నుంచి క్రెడిట్ స్కోరును ఉచితంగా తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. తద్వారా రుణాల ఆఫర్లను అందించొచ్చన్న ప్రయోజనం అందులో దాగుంటుంది. మీకు రుణ అవసరం ఉన్నా, లేకపోయినా క్రెడిట్ స్కోర్ను ఉచితంగా తెలుసుకునే సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. పాన్ నంబర్ సాయంతో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. మొబైల్ నంబరుకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా మీ గుర్తింపును ధృవీకరించిన అనంతరం క్షణాల్లో ఉచితంగా మీ క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ను అందుకుంటారు. -
ఆర్బీఐ లోపాలే.. లోన్ యాప్లకు లాభాలు!
సాక్షి, హైదరాబాద్: అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ వ్యవహారాలకు పాల్పడిన చైనా లోన్ యాప్స్ కేసుల దర్యాప్తులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. అవసరార్థులకు రుణాల మంజూరు, వడ్డీ వసూళ్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల్లో ఉన్న లోపాలనే చైనా యాప్స్ తమకు అనుకూలంగా మార్చుకున్నాయని తేల్చారు. వీటికి దేశంలోని వివిధ మెట్రో నగరాలకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) సహకరించినట్లు గుర్తించారు. ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఆర్బీఐ సహా వివిధ సంస్థలతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు విభాగం తమ దర్యాప్తులో గుర్తించిన వ్యవస్థాగత లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లింది. రాజధానిలోని మూడు కమిషనరేట్లలోనూ నమోదైన కేసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను రూపొందించి ఆర్బీఐకి పంపాలని నిర్ణయించింది. ఒప్పందం చేసుకుని జంప్.. ఇక అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్తో పాటు బలవంతపు రివకరీల కోసం కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది చైనాకు చెందిన సంస్థలే అని తేలింది. అయితే రుణాలు ఇవ్వడానికి వినియోగించిన నగదు మాత్రం దేశం బయట నుంచి రాలేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా మరికొన్ని మెట్రో నగరాల్లో ఉన్న ఎన్బీఎఫ్సీలతో చైనా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రుణాలు అందించడానికి, తిరిగి వసూలు చేయడానికి అవసరమైన ఫ్లాట్ఫామ్స్ (యాప్స్, కాల్ సెంటర్లు) తాము రూపొందిస్తామని, ఆయా కస్టమర్లకు రుణాలు మాత్రం మీరు ఇవ్వాలంటూ చైనా కంపెనీలు ఎన్బీఎఫ్సీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ పత్రాలపై సంతకాలు చేసిన సమయంలో మాత్రమే సూత్రధారులైన చైనీయులు ఎన్బీఎఫ్సీ నిర్వాహకుల్ని కలిశారు. ఆపై వాళ్లు పత్తాలేకుండా పోయి తమ అనుచరుల ద్వారా ఇక్కడి వ్యవహారాలు చక్కబెట్టారు. సర్వీసు చార్జీల కింద కొంత.. వడ్డీ పేరిట అంత! ఇక ఎన్బీఎఫ్సీలు - చైనా కంపెనీలు ఆర్బీఐ నిబంధనల్లో ఉన్న లోపాలను అధ్యయనం చేశాయి. అప్పులపై వసూలు చేసే వడ్డీ ఏడాదికి 36 శాతం దాటకూడదంటూ ఆయా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లలో రుణాలు మంజూరు చేసేప్పుడు ఆయా కంపెనీలు సర్వీస్ చార్జ్ కింద గరిష్టంగా ఎంత మొత్తం వసూలు చేయాలనేది మాత్రం ఆర్బీఐ నిబంధనల్లో ఎక్కడా లేదు. దీన్నే చైనా కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు తమకు కలసి వచ్చే అంశంగా మార్చుకున్నాయి. రూ.5 వేల రుణానికి రూ.1200 చొప్పున సర్వీసు చార్జ్ కింద మినహాయించుకుని రుణగ్రహీతకు రూ.3,800 మాత్రమే చెల్లించాయి. ఈ రుణాన్నీ వారం రోజుల్లో తిరిగి చెల్లించేలా నిబంధన విధించాయి. ఆ సమయంలో వడ్డీగా మాత్రం కేవలం రూ.15 నుంచి రూ.20 మాత్రమే వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తం సరాసరిన చూస్తే ఏడాదికి 25 శాతం లోపే ఉంటోంది. వడ్డీ మొత్తం ఎన్బీఎఫ్సీలకే వెళ్తున్నప్పటికీ సర్వీస్ చార్జీని మాత్రం వీరిలో పాటు యాప్, కాల్ సెంటర్ల నిర్వాహకులు పంచుకుంటున్నారు. మరోపక్క ఈ లోన్ యాప్స్ లావాదేవీలపై పోలీసులకు ఇప్పటివరకు స్పష్టత రాలేదు. 3 వీటి ద్వారా రుణగ్రస్తులకు నగదు ఇచ్చిన, ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించిన రోజర్పే సంస్థ అందించిన వివరాల ప్రకారం ఆయా ఎన్బీఎఫ్సీల టర్నోవర్ రూ.25 వేల కోట్ల వరకు ఉంది. అయితే ఎన్బీఎఫ్సీలు కేవలం లోన్ యాప్స్ ద్వారా అప్పులు ఇవ్వడమే కాకుండా ఇతర ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తుంటాయి. అవన్నీ కలుపుకుంటే ఈ మొత్తం వస్తోందని పోలీసులు చెప్తున్నారు. ఇందులో కేవలం రుణ యాప్ల ద్వారా మాత్రమే జరిగిన లావాదేవీలు ఎంత అనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదని పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ లోన్ యాప్స్కు సంబంధించిన వ్యవహారశైలిలో మార్పు వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. ఒకప్పుడు ఇవి ఫోన్లు, సందేశాలు, సోషల్ మీడియా ద్వారా డిఫాల్టర్లను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా చేశాయి. అయితే వీటిపై కేసుల నమోదు, నిందితుల అరెస్టులు, ఎన్బీఎఫ్సీల బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్ వంటి చర్యల్ని పోలీసులు తీసుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఎగవేతదారులకు ఫోన్లు చేస్తున్న కాల్ సెంటర్ల వారు చాలా మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. మొత్తం కట్టలేకుంటే సర్వీసు చార్జ్, వడ్డీ మినహాయించి అప్పుగా తీసుకున్న నగదు చెల్లించాలని కోరుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీటిపై వచ్చే ఫిర్యాదులు లేవని పేర్కొంటున్నారు. రూ.320 కోట్లు ఫ్రీజ్ చేశాం.. లోన్ యాప్స్ కేసులకు సంబంధించి ఇప్పటివరకు చైనా జాతీయుడి సహా 20 మందిని అరెస్టయ్యారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.320 కోట్లు ఫ్రీజ్ చేశాం. గతంలో నమోదైన కలర్ ప్రిడెక్షన్ కేసులో రూ.105 కోట్లు హాంకాంగ్లోని బ్యాంకు ఖాతాలకు మళ్లినట్లు గుర్తించాం. ఏదైనా యాప్ వ్యవహారాలపై అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. అక్కడ ఓ బృందం వీటిపైనే 24 గంటలూ పని చేస్తుంటుంది. -- అంజనీకుమార్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ చదవండి: "వికీలీక్స్" వీరుడి కోసం వేట మొదలైంది! తీపి కబురు: దిగొచ్చిన బంగారం ధరలు! -
ఎన్బీఎఫ్సీలు : ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు
సాక్షి, ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) వ్యవస్థ మరింత పటిష్టవంతం కావడానికి తగిన చొరవలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీకారం చుడుతోంది. ఈ దిశలో నాలుగు అంచెల నియంత్రణా వ్యవస్థను ప్రతిపాదించింది. ఆర్బీఐ విడుదల చేసిన చర్చా పత్రం ప్రకారం- ‘బేస్ (ఎన్బీఎఫ్సీ-బీఎల్), మిడిల్ (ఎన్బీఎఫ్సీ-ఎంఎల్), అప్పర్ (ఎన్బీఎఫ్సీ-యూఎల్), టాప్ (ఎన్బీఎఫ్సీ-టీఓపీ)’ అనే నాలుగు అంచల నియంత్రణలోకి ఎన్బీఎఫ్సీలు వెళతాయి. వారి పరిమాణం, నిధుల సమీకరణ పరిస్థితులు, అనుసంధాన విధాన ప్రక్రియలు, స్థిరత్వం, క్లిష్టత, క్రియాశీలత విషయంలో తీరు తెన్నులు వంటి అంశాల ప్రాతిపదికన ఈ వర్గీకరణ ఉంటుంది. ‘‘ఎన్బీఎఫ్సీలకు సవరించిన నియంత్రణా వ్యవస్థ– అంచలవారీ ధోరణి’’ అన్న పేరుతో వెలువడిన ఈ ఆర్బీఐ చర్చా పత్రంపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను నెలరోజుల్లో పంపాల్సి ఉంటుంది. (రూ.100 నోటు షాకింగ్ న్యూస్!) ఎన్బీఎఫ్సీల ప్రయాణం... పలు సంవత్సరాలుగా పటిష్ట నియంత్రణలు, పారదర్శకత దిశగా ఎన్బీఎఫ్సీ రంగం అడుగులు వేస్తూ వస్తోంది. 1964 నుంచీ ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐ నియంత్రణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2006లో సెంట్రల్ బ్యాంక్ సమగ్ర రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ను ప్రవేశపెట్టింది. 2014లో దీనిని మరోసారి సమీక్షించి, మార్పులూ చేర్పులూ చేయడం జరిగింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్బీఐ నియంత్రణా పరమైన చర్యలను తీసుకుంటూనే ఉంది. పెద్ద ఎన్బీఎఫ్సీలకు అదనపు నియంత్రణలూ అమలు జరుగుతున్నాయి. ‘‘సంస్థల వ్యాపార వృద్ధిపై తగిన నియంత్రణలు లేకపోతే, అనుసంధాన ఫైనాన్షియల్ వ్యవస్థలో వ్యవస్థాకతమైన ఇబ్బందులు తలెత్తుతాయి. భారీగా విస్తరించిన ఎన్బీఎఫ్సీలో ఏదైనా సమస్య తలెత్తితే, అది మొత్తం ఫైనాన్షియల్ వ్యవస్థపై ప్రతికూలత చూపుతుంది. ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. చిన్న, మధ్య స్థాయి ఎన్బీఎఫ్సీలపై కూడా ఈ ప్రభావం కనబడుతుంది’’ అని ఆర్బీఐ తన చర్చా పత్రంలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణా పరమైన పటిష్టతా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపింది. జాగ్రత్తలతో కూడిన, వర్గీకృత నియంత్రణా వ్యవస్థలు ఎన్బీఎఫ్సీల పటిష్టతకు దారితీస్తాయన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేసింది. వర్గీకరణ విధమిది... ఎన్బీఎఫ్సీ-బీఎల్: రూ.1,000 కోట్ల వరకూ అసెట్ సైజ్ పరిమాణం ఉంటుంది. ఎన్బీఎఫ్సీలు అత్యధిక భాగం ఇదే కేటగిరీలోకి వెళతాయి. డిపాజిట్లు స్వీకరించని 9425 ఎన్బీఎఫ్సీల్లో 9209 ఇదే విభాగం కిందకు వస్తాయి. ఎన్బీఎఫ్సీ-ఎంఎల్: ‘వ్యవస్థాగతంగా ప్రాముఖ్యత కలిగిన’’ ప్రస్తుత అన్ని నాన్–డిపాజిట్ టేకింగ్ ఎన్బీఎఫ్సీలు అలాగే డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలోకి వస్తాయి. ఎన్బీఎఫ్సీ-యూఎల్: ‘‘వ్యవస్థాగతంగా కీలకంగా గుర్తించిన 25 నుంచి 30 టాప్ ఎన్బీఎఫ్సీలు ఈ పరిధిలోకి వస్తాయి. బ్యాంకుల విషయంలో ఎలాంటి రెగ్యులేషన్లు ఉంటాయో, వీటికీ అవే వర్తిస్తాయి. టాప్ లేయర్: ఈ విభాగం ప్రస్తుతానికి ఖాళీగా ఉంటుంది. ఎన్బీఎఫ్సీలకు సంబంధించి చోటుచేసుకునే సవాళ్లకు అనుగుణంగా ఈ విభాగాన్ని పునర్నిర్వచించడం జరుగుతుంది. -
రెండు నిమిషాల్లోనే పేటిఎమ్ పర్సనల్ లోన్!
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరంలో పేటిఎమ్ తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్ పేటిఎమ్ తన 1 మిలియన్ కస్టమర్లకు ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అర్హత గల వినియోగదారులు కేవలం 2 నిమిషాల్లోనే వ్యక్తిగత రుణాలను 365రోజుల్లో ఎప్పుడైనా పొందవచ్చు అని పేటీఎం పేర్కొంది. రుణాలను వినియోగదారులు 18-36 నెలల్లో వాయిదా పద్దతిలో తీర్చవచ్చు. పేటిఎమ్ యొక్క ఇన్స్టంట్ పర్సనల్ లోన్ ఎన్బీఎఫ్సీలచే ప్రాసెస్ చేయబడతాయి. యూజర్లు తీసుకునే వాయిదాను బట్టి ఈఎంఐను నిర్ణయిస్తారు.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్) ఈ చర్యవల్ల ‘క్రెడిట్ టు న్యూ’ కస్టమర్లు అధికారిక ఆర్థిక మార్కెట్ పరిధిలోకి వస్తారు. పేటిఎమ్ యొక్క ఈ క్రొత్త సేవల ద్వారా బ్యాంకింగ్ సంస్థలు అందుబాటులో లేని చిన్న చిన్న పట్టణాల వారికీ ఆర్థిక సహాయం అందనున్నట్లు పేర్కొంది. రుణ దరఖాస్తు కోసం ఎటువంటి పేపర్ డాక్యుమెంటేషన్ లేకుండా మొత్తం ప్రక్రియను డిజిటలైజ్ చేసింది. ఈ ప్రక్రియ కోసం అత్యాధునిక టెక్ ప్లాట్ఫామ్ను నిర్మించినట్లు పేటిఎమ్ పేర్కొంది. కొత్త ఇన్స్టంట్ పర్సనల్ లోన్ పథకం కింద అర్హులు గల ఉద్యోగులు, చిన్న వ్యాపారులకు, ఇతరులకు 2 నిమిషాల్లోనే రూ.2 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు పేటీఎం ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన కస్టమర్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం కింద 'పర్సనల్ లోన్' టాబ్ ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఈ సేవల సులభతరం చేయడానికి పేటీఎం వివిధ ఎన్బిఎఫ్సిలు, బ్యాంకులతో భాగస్వామ్యం కలిగి ఒప్పందం కుదుర్చుకుంది. -
బ్యాంకింగ్ రేస్లో... టాటా, బిర్లా, బజాజ్!
ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే ఆర్థిక రంగం ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం బలంగా ఉండాలి. అయితే ప్రస్తుతం మన దేశంలో బ్యాంకింగ్ రంగం బలహీనంగానే ఉంది. మన బ్యాంకింగ్ రంగంలో అధిక ప్రభావం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్లు మొండిబకాయిల భారంతో కునారిల్లుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదకత రంగాల ఆర్థిక అవసరాలను తీర్చడానికి మరిన్ని ప్రైవేట్ బ్యాంక్లు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దిశగా ఇటీవల ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. భారీ కార్పొరేట్ సంస్థలను బ్యాంకింగ్ రంగంలోకి అనుమతించడం, రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్లుగా మారే వెసులుబాటును ఇవ్వడం, ప్రమోటర్ వాటాను 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునే ప్రతిపాదనలు వాటిల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయానికి మరో మూడు నెలలు పట్టవచ్చు. ముందు వరుసలో భారీ ఎన్బీఎఫ్సీలు... బ్యాంక్ లైసెన్స్లు పొందడానికి టాటా, బిర్లా, బజాజ్, పిరమళ్ సంస్థలు రేసులో ఉన్నాయి. ఈ దిగ్గజ సంస్థలకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్(ఎన్బీఎఫ్సీ) సంస్థలున్నాయి. రూ.50,000 కోట్ల పైబడిన ఆస్తులున్న ఎన్బీఎఫ్సీలను బ్యాంక్లుగా మార్చుకునే వెసులుబాటు ఉండటం ఈ సంస్థలకు కలసివస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన టాటా క్యాపిటల్ ఆస్తులు రూ.83,280 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ అనుబంధ సంస్థ టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ ఆస్తులు రూ.46,807 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఆసక్తిగా ఉన్నామని టాటా గ్రూప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్లకు సంబంధించి ప్రస్తుతానికి ప్రతిపాదనలే వెలువడ్డాయని, ఈ దశలో తమ బ్యాంకింగ్ ప్రణాళికలను వివరించడం సముచితం కాదని ఆయన పేర్కొన్నారు. పూర్తి స్పష్టత వచ్చాక ఈ విషయమై పరిశీలన జరుపుతామని వివరించారు. 2012లో కూడా కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్లు ఇస్తామని ఆర్బీఐ ప్రకటించింది. అప్పుడు టాటా గ్రూప్ కూడా దరఖాస్తు చేసింది. అయితే నిబంధనలు మరీ కఠినంగా ఉన్నాయంటూ 2013లో తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. ఇక బిర్లా గ్రూప్నకు చెందిన ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆస్తులు రూ.70,015 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ లైసెన్స్ పొందడానికి ఈ సంస్థ కూడా రేసులో ఉంటుందని నిపుణులంటున్నారు. మరోవైపు పిరమళ్ గ్రూప్ కూడా బ్యాంక్ లైసెన్స్ రేసులో ఉంది. సంక్షోభంలో కూరుకుపోయిన డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయాలనుకుంటున్న ఈ గ్రూప్ ఎన్బీఎఫ్సీ ఆస్తులు రూ.50,000 కోట్ల మేర ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ రంగంలో పిరమళ్ గ్రూప్నకు మంచి అనుభవం ఉంది. అయితే ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ రంగానికి ఎక్స్పోజర్ బాగా ఉండటం ఆందోళన కలిగించే అంశమని కొంతమంది నిపుణులంటున్నారు. డీహెచ్ఎఫ్ఎల్ రిటైల్ ఆస్తుల్ని కొనుగోలు చేస్తే, పిరమళ్ గ్రూప్నకు నిలకడైన క్యాష్ ఫ్లోస్ ఉంటాయని వారంటున్నారు. బ్యాంక్ లైసెన్స్ల కోసం 2012లోనే బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ సంస్థలు ప్రయత్నాలు చేశాయి. కానీ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్లకు మాత్రమే అప్పుడు లైసెన్స్లు లభించాయి. తాజా ప్రతిపాదనల కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ తదితర సంస్థలు తమ ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే ప్రయత్నాలు చేయవచ్చని నిపుణులంటున్నారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్...! కార్పొరేట్ సంస్థలకు బ్యాంక్ లైసెన్స్లు ఇచ్చే దిశగా ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సూచనలు చేసింది. అయితే ఈ కమిటీలో ఒక్క వ్యక్తి మినహా మిగిలిన వారందరూ కార్పొరేట్లకు బ్యాంక్ లైసెన్స్లు ఇవ్వొద్దనే సూచించారు. అయితే బ్యాంకింగ్ చట్ట సవరణ అంశాన్ని ఈ కమిటీ ప్రభుత్వ అభీష్టానికే వదిలేసింది. కాగా ఇవి సాహసోపేత ప్రతిపాదనలని నిపుణులంటున్నారు. అయితే కార్పొరేట్ హౌజ్లకు బ్యాంక్ లైసెన్స్లు లభించడం కష్టమేనని మాక్వెరీ క్యాపిటల్ పేర్కొంది. అంతే కాకుండా యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ల సంక్షోభం నేపథ్యంలో ఉదారంగా బ్యాంక్ లైసెన్స్లు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని వివరించింది. కాగా కార్పొరేట్ హౌజ్లకు బ్యాంక్ లైసెన్స్లు ఇవ్వడం ప్రమాదకరమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్సులు సరికాదు..! రేటింగ్ దిగ్గజం ఎస్ అండ్ పీ ప్రకటన బడా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకింగ్ లైసెన్సులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాన్ని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) వ్యక్తం చేసింది. భారత్ కార్పొరేట్ పాలన బలహీనంగా ఉందని, అలాగే గత కొన్ని సంవత్సరాలుగా రుణ చెల్లింపుల్లో వైఫల్యం చెందుతున్నాయని సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదన పలు అనుమానాలకు తావిస్తుందని తెలిపింది. కొత్తగా బ్యాంకులను నెలకొల్పడానికి బడా కార్పొరేట్ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంతర్గత కార్యాచరణ బృందం సమర్పించిన ఒక నివేదికను శుక్రవారం సెంట్రల్ బ్యాంక్ ప్రజాబాహుళ్యంలో ఉంచింది. దీనిపై ఒక నిర్ణయానికి ముందు సంబంధిత వర్గాలు, నిపుణుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. నివేదికపై 2021 జనవరి 15వ తేదీలోపు అభిప్రాయాలను తెలపాలని కోరింది. ఎస్అండ్పీ ప్రకటనలో ముఖ్యాంశాలు ... ► కార్పొరేట్లే బ్యాంకింగ్ నిర్వహించే అంశంలో పలు క్లిష్టతలు ఉంటాయి. అంతర్గత గ్రూప్లకు రుణం, నిధుల మళ్లింపు, పరస్పర ప్రయోజనాల కోణంలో ప్రశ్నలు, ఆర్థిక స్థిరత్వం వంటి ఎన్నో అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. రుణ బకాయిల చెల్లింపుల్లో కార్పొరేట్ల వైఫల్యాల వల్ల ఫైనాన్షియల్ వ్యవస్థలో నెలకొనే ప్రతికూలతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలూ ఉంటాయి. ► 2020 మార్చి నాటికి మొత్తం కార్పొరేట్ రుణాల్లో దాదాపు 13% మొండిబకాయిలు(ఎన్పీఏ)గా మారడం ఇప్పుడు చర్చనీయాంశం. ఇతర దేశాలతో పోల్చితే భారత్లో ఎన్పీఏల సమస్య తీవ్రంగా ఉంది. ► అయితే రూ.50,000 కోట్లు, ఆపైన భారీ రుణ పరిమాణం కలిగి, 10 సంవత్సరాలకు పైగా చక్కటి వ్యాపార నిర్వహణ కలిగిన పెద్ద బ్యాంకింగేతర ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) బ్యాంకులగా మార్చే ప్రతిపాదన మంచిదే. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. అది పిడుగుపాటే..! కార్పొరేట్ బ్యాంకింగ్పై రఘురామ్ రాజన్, విరాల్ ఆచార్య ఆర్బీఐ మాజీ గరవ్నర్ రఘురామ్ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్యలు కూడా ఈ అంశంపై తీవ్ర ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిని అమలుచేస్తే, అది బ్యాంకింగ్పై పిడుగుపాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇరువురు సంయుక్తంగా రాసిన ఒక ఆర్టికల్ సోమవారం రాజన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పోస్ట్ అయ్యింది. బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ సంస్థల జోక్యం ఎంతమాత్రం సమంజసం కాదని ఆర్టికల్ పేర్కొంది. ఇలాంటి క్లిష్ట రుణదాత–గ్రహీత అనుసంధాన వ్యవస్థ సజావుగా మనుగడ సాగించిన చరిత్ర ఏదీ లేదనీ పేర్కొంది. రుణ గ్రహీతే యజమానిగా ఉన్న ఒక బ్యాంక్ మంచి వ్యాపారం ఎలా చేయగలుగుతుందని ఆర్టికల్ రచయితలు ప్రశ్నించారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట జరిగే ‘పేలవ రుణ తీరు’ను ప్రతిసారీ కట్టడి చేయడం సాధ్యంకాదని ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువయ్యిందని ఆర్టికల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్ ప్రతిపాదన మంచిదికాదని స్పష్టం చేసింది. ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలిస్తే, ‘‘అసలు ఇప్పుడు ఈ అవసరం ఏమి వచ్చింది...’’ అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోందని ఆర్టికల్ పేర్కొంది. ఆర్బీఐ అధికారాల పెంపు అవశ్యం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారాలను మరింత పెంచాలన్న సూచించిన ఆర్టికల్, ఈ పరిస్థితి ఉన్నట్లయితే, మొండిబకాయిల సమస్య ఇంతలా పెరిగేది కాదనీ స్పష్టం చేసింది. ఆర్బీఐకి మరిన్ని అధికారాలు, మొండిబకాయల తగ్గింపునకు ఆర్బీఐ వర్కింగ్ కమిటీ చేసిన పలు ప్రతిపాదనలను తొలుత అమలు చేయాలని, ‘కార్పొరేట్లకు బ్యాంకింగ్ లైసెన్స్’ను ప్రస్తుతం పక్కనపడేయాలనీ తమ ఆర్టికల్లో ఆర్థిక నిపుణులు సూచించారు. ప్రపంచంలో పలు దేశాల తరహాలోనే భారత్లో కూడా బ్యాంకింగ్ వైఫల్యం వల్ల ఖాతాదారులు నష్టపోయే పరిస్థితి ఉండదని వారు అన్నారు. ఇందుకు యస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంకులను ప్రస్తావించారు. అందువల్ల బ్యాంకుల్లో తమ డబ్బుకు భద్రత ఉంటుందని డిపాజిటర్లు భావిస్తారని పేర్కొన్నారు. అందువల్లే బ్యాంకులు పెద్ద ఎత్తున డిపాజిట్లను సమీకరించగలుగుతున్నాయని కూడా విశ్లేషించారు. ప్రస్తుతం రాజన్, ఆచార్యలు ఇరువురూ అమెరికాలో ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఫైనాన్స్ విభాగానికి సంబంధించి ప్రొఫెసర్గా రాజన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, స్టెర్న్ స్కూల్ ప్రొఫెసర్గా ఆచార్య పనిచేస్తున్నారు. -
ప్రాధాన్యతా రంగాలకు మరిన్ని రుణాలు
ముంబై: ప్రాధాన్యతా రంగాలకు మరిన్ని రుణాలు అందించే దిశలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం ఒక కీలక విధానాన్ని ప్రకటించింది. బ్యాంకులు–బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కలిసి ఆయా రంగాలకు రుణ లభ్యత కల్పించడానికి వీలుగా ‘కో–లెండింగ్ నమూనా (సీఎల్ఎం) పథకాన్ని ఆవిష్కరించింది. విధివిధానాలు ఇలా... సహ–రుణాలను అందించడానికి ఆయా బ్యాంకులు–ఎన్బీఎఫ్సీ మధ్య ఒక ముందస్తు అవగాహన ఉండాలి. రుణాలకు సంబంధించి లాభ–నష్టాలను వాటి వాటి వాటాల ఆధారంగా బ్యాంకులు–ఎన్బీఎఫ్సీ పంచుకుంటాయి. కో–లెండింగ్ విషయంలో ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం, రుణ గ్రహీతతో ఎన్బీఎఫ్సీ ఒక స్పష్టమైన అవగాహన కుదుర్చుకోవాలి. ఒప్పంద స్వభావం స్పష్టంగా ఉండాలి. రుణ ఒప్పందంలో బ్యాంకులు–ఎన్బీఎఫ్సీల పాత్ర, బాధ్యతలు సవివరంగా ఉండేలా చూడాలి. అటు బ్యాంకులకు ఇటు ఎన్బీఎఫ్సీలు రెండింటికీ వర్తించే నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా, పరస్పర అవగాహనా పూర్వక వడ్డీరేటును రుణగ్రహీత నుంచి వసూలు చేయాలి. బ్యాంకులతో కలిసి నిర్వహించే ఒక ఎస్క్రో ఖాతా ద్వారా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మధ్య అన్ని లావాదేవీలు (పంపిణీలు, పునఃచెల్లింపులు) జరగాలి. ఫిర్యాదుల పరిష్కారానికి వస్తే, రుణగ్రహీత ఎన్బీఎఫ్సీలో నమోదు చేసిన ఏదైనా ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించాలి. ఇందుకు సహ–రుణదాతలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఒక వేళ ఈ స్థాయిలో ఫిర్యాదు పరిష్కారం జరక్కపోతే, సమస్యను రుణ గ్రహీత సంబంధిత బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ లేదా ఎన్బీఎఫ్సీకి సంబంధించి అంబుడ్స్మెన్ లేదా ఆర్బీఐలోని కస్టమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ సెల్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ప్రాధాన్యతా రంగాలంటే..: సమాజంలో బలహీన వర్గాలు, వ్యవసాయం, లఘు మధ్య చిన్న తరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, సామాజిక మౌలిక వసతులు వంటి వాటిని ప్రాధాన్యతా రంగాలుగా పరిగణిస్తారు. దేశాభివృద్ధి లో ఆయా వర్గాలు, విభాగాలకు కీలక పాత్ర ఉంటుంది. ఈ రంగాలకు తగిన రుణ సౌలభ్యత సకాలంలో కలగాలి. ఈ దిశలో బ్యాంకులు తమ వార్షిక రుణాల్లో 40 శాతాన్ని తప్పనిసరిగా ప్రాధాన్యతా రంగాలకు మంజూరు చేయాల్సి ఉం టుంది. సాధ్యమైనంత తక్కువ వడ్డీరేటుకు అందించాలి. -
గోల్డ్ లోన్ కంపెనీలు జిగేల్!
సాక్షి,ముంబై: బంగారంపై రుణాలిస్తున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణలో ఉన్న ఆస్తులు 15-18 శాతం వృద్ధి సాధిస్తాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక వెల్లడించింది. వ్యక్తులు, చిరు వర్తకుల నుంచి గోల్డ్ లోన్ల డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది. నివేదిక ప్రకారం.. లాక్డౌన్ కారణంగా తక్కువ పంపిణీతో ఏప్రిల్-జూన్ కాలంలో బంగారంపై రుణాల వృద్ధి స్థిరంగా ఉంది. లాక్డౌన్ సడలింపుతో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయి. దీంతో బంగారంపై రుణాలు అధికమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాలతోపాటు వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు కావాల్సిన మూలధనం కోసం ఈ రుణాలను తీసుకుంటున్నారు. చిరుద్యోగులు, సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు, వ్యాపారులకు ఇచ్చే రుణాల విషయంలో ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు పూచీకత్తు నిబంధనలు కఠినం చేశాయి. దీంతో వినియోగదార్లు గోల్డ్ లోన్లను ఎంచుకుంటున్నారు. పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలకే.. ఇతర లోన్లతో పోలిస్తే వసూళ్లు, పంపిణీ, తిరిగి తనఖా విషయంలో గోల్డ్ లోన్లు పెద్దగా సమస్యలను ఎదుర్కోలేదని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ క్రిష్ణన్ సీతారామన్ వెల్లడించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు చాలామటుకు వసూళ్లు చేయలేకపోతున్నాయని, వీటికి రాని బాకీలు అధికమవుతాయని అన్నారు. దీంతో ఎంఎస్ఎంఈలకు కొత్త రుణాలు, తనఖా రహిత రుణాలు తక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. తద్వారా పుత్తడిపై రుణాలిచ్చే కంపెనీలు ప్రయోజనం పొందుతాయని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఎన్బీఎఫ్సీల వద్ద తిరిగి తనఖా పెట్టి తీసుకున్న గోల్డ్ లోన్లతోసహా బంగారంపై రుణాల పంపిణీ వరుసగా సెప్టెంబరు త్రైమాసికంలో రెండింతలకు పైగా అధికమైంది. 12 నెలల కాలానికి తీసుకున్న రుణంలో 60-65 శాతం మొత్తాన్ని కస్టమర్లు ఆరు నెలల్లోనే తిరిగి చెల్లిస్తున్నారని క్రిసిల్ తెలిపింది. చాలా లోన్లు తక్కువ నిడివి ఉండడం, ముందస్తుగా చెల్లించే వెసులుబాటు, రిబేట్ల మూలంగా ఎన్బీఎఫ్సీలు అనుకూలమైన ఎంపిక అని వివరించింది. -
మిడ్క్యాప్ ఎన్బీఎఫ్సీ షేర్లు ఆకర్షణీయం: మోర్గాన్ స్టాన్లీ
రాబోయే రెండేళ్ళలో మధ్యతరహా ఎన్బీఎఫ్సీ షేర్లలో రిస్క్తో పోలిస్తే రివార్డ్ రేషియో ఎక్కువగా ఉంటుందని మోర్గాన్ స్లాన్లీ తెలిపింది. ఎన్బీఎఫ్సీ సెక్టార్కు చెందిన మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్సియల్, శ్రీరాం ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, శ్రీరామ్ సిటి యూనియన్ ఫైనాన్స్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు తమ టాప్పిక్లుగా ఉన్నట్లు బ్రోకరేజ్ పేర్కోంది. వచ్చే ఏడాదిలోగా షేర్లు 30-45శాతం రాబడులను ఇస్తాయని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. డీప్ వాల్యూ, మిస్-ప్రైస్డ్ స్టాకుల కోసం అన్వేషిస్తున్న ఇన్వెస్టర్లకు ఈ స్టాకులను సిఫార్సులు చేస్తున్నట్లు మోర్గాన్స్టాన్లీ తెలిపింది. రెండేళ్ల పాటు సెక్టార్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోన్న ఈ షేర్ల వాల్యూయేషన్లు ఇప్పుడు జీవితకాల కనిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ప్రీ-కోవిడ్19కి ముందు 2020 గరిష్టాలతో పోలిస్తే మిడ్క్యాప్ షేర్లు 95-190శాతం అప్సైడ్ ఉండగా, లార్జ్క్యాప్ షేర్లు కేవలం 22-77శాతం మాత్రమే అప్సైడ్లో ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. కోవిడ్ -19తో వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో బలహీనత కారణంగా వివిధ ఎన్బీఎఫ్సీలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని బ్రోకరేజ్ తెలిపింది. అధిక మూలధనం, లిక్విడిటీ, బలమైన వ్యాపార నమూనాతో పాటు మాతృసంస్థకు మార్కెట్ మంచి స్థాయి ఉండటంతో ఈ స్టాక్స్లు రానున్న రోజుల్లో మంచి స్థాయిలో ఉంటాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. మూడవ త్రైమాసిక ఫలితాల అనంతరం సెప్టెంబరులో ఎన్పీఏల గుర్తింపు తర్వాత సెక్టార్ ఎంతమేర నష్టాన్ని చవిచూచూసిందో అంచనావేయవచ్చని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. -
ఫార్మా షేర్లలో వాటాను తగ్గించుకున్న ఫండ్స్
మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు షేర్ల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ జూన్లో హెల్త్కేర్, ఫార్మారంగ షేర్లలో తమ వాటాను తగ్గించుకున్నారు. భారీ నష్టాలను చవిచూస్తున్న బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ షేర్లలో వాటాను పెంచుకున్నారు. నెల ప్రాతిపదికన ఫండ్ మేనేజర్ల ఫోర్ట్ఫోలియోలో హెల్త్కేర్, ఫార్మా రంగాల వెయిటేజీ 50బేసిస్ పాయింట్ల క్షీణించింది. అంతకు ముందు నెలలో ఫార్మా, ఐటీ రంగాల వెయిటేజీ 8.3శాతంగా ఉండగా, ఈ జూన్ ముగింపు నాటికి 7.8శాతానికి పరిమితమైంది. వరుస 5నెలల పెంపు తర్వాత ఫండ్మేనేజర్లు 2సెక్టార్లకు వెయిటేజీ తగ్గించడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి వ్యాప్తి ప్రారంభం నుంచి ఫండింగ్ హౌస్లు ఈరెండు రంగాల్లో భారీగా వాటాలను కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే జూన్లో ఆయిల్అండ్గ్యాస్ రంగ షేర్ల కొనుగోళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఫలితంగా ఈ పోర్ట్ఫోలియో ఈ రంగ వెయిటేజీ 40బేసిస్ పాయింట్లు పెరిగింది. అయితే రియలన్స్ షేరు ర్యాలీ కారణంగా వెయిటేజీ పెరిగి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేరు 28శాతం పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు పోర్ట్ఫోలియతో ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్బీఎఫ్సీ షేర్ల వెయిటేజీలు వరుసగా 40 బేసిస్ పాయింట్లు, 50 బేసిస్ పాయింట్లు పెరిగాయి. పోర్ట్ఫోలియోలో వెయిట్ పెంపు అనేది ఒక నిర్దిష్ట రంగంపై లేదా స్టాక్ ఫండ్ మేనేజర్ ఎంత ఎక్స్పోజర్ తీసుకుంటుందో సూచిస్తుంది. -
ఎస్బీఐ డిపాజిట్ రేట్లు 0.40% కోత
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అన్ని కాలపరిమితుల స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 40 బేసిస్ పాయింట్ల (0.40 శాతం) వరకూ తగ్గించింది. డిపాజిట్లపై ఎస్బీఐ రేట్లు తగ్గించడం ఇది వరుసగా రెండవసారి. తాజా నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది. రెండు కోట్లు ఆపైబడిన బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటును బ్యాంక్ ఏకంగా 50 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించడం గమనార్హం. ఈ కేటగిరీ కింద బ్యాంక్ ఆఫర్ చేస్తున్న గరిష్ట వడ్డీరేటు మూడు శాతం. ఈ నిర్ణయం కూడా తక్షణం అమలోకి వచ్చింది. సీనియర్ సిటిజన్లకు అదనం.. సీనియర్ సిటిజన్లకు పైన పేర్కొన్న వడ్డీరేటు కన్నా అరశాతం (50 బేసిస్ పాయింట్లు) అదనంగా అందుతుంది. సీనియర్ సిటిజన్ల విషయంలో 50 బేసిస్ పాయింట్ల అదనంతోపాటు, మరో 30 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు ప్రీమియంగా ఇచ్చే ఒక ప్రత్యేక పథకాన్ని ‘ఎస్బీఐ వెల్ఫేర్’ పేరుతో ఇప్పటికే బ్యాంక్ ప్రకటించింది. ఐదేళ్లు, ఆపైన డిపాజిట్లకు వర్తించే ఈ పథకాన్ని తీసుకోడానికి గడువు ఈ ఏడాది సెప్టెంబర్ 30. ఎస్ఎంఎస్కు ‘ఎస్’ అంటే... వాయిదా కాగా రుణ బకాయిల ఈఎంఐ చెల్లింపులపై మారటోరియం అమలు విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. దీని ప్రకారం... దాదాపు 85 లక్షల మంది అర్హత కలిగిన రుణ గ్రహీతలకు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్కు ప్రతిగా కస్టమర్ ‘ఎస్’ అని సమాధానం ఇస్తే చాలు... నెలవారీ చెల్లింపులపై మారిటోరియం వారికి అమలవుతుంది. రేట్ల కోత ప్రయోజనం దక్కట్లేదు కస్టమర్లు, డెవలపర్లకు బదలాయించడం లేదు... బ్యాంకులపై ఆర్బీఐకి క్రెడాయ్ ఫిర్యాదు న్యూఢిల్లీ: రుణాలపై వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గినప్పటికీ బ్యాంకులు ఆ ప్రయోజనాలను కస్టమర్లు, నిధుల కొరతతో కటకటలాడుతున్న డెవలపర్లకు బదలాయించడం లేదంటూ రియల్టీ సంస్థల సమాఖ్య క్రెడాయ్ తాజాగా రిజర్వ్ బ్యాంక్కు ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్ డెవలపర్ల నిధుల అవసరాలకు కీలకమైన నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) కూడా రేట్ల కోత ప్రయోజనాలను బ్యాంకులు అందించేలా చూడాలంటూ కోరింది. ఆర్బీఐకి క్రెడాయ్ ఈ మేరకు లేఖ రాసింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు రుణాల చెల్లింపుపై మారటోరియం వంటి చర్యలు కూడా తీసుకున్నప్పటికీ రియల్టీ రంగానికి మాత్రం ఆ ప్రయోజనాలేమీ దక్కడం లేదని క్రెడాయ్ పేర్కొంది. ‘2019 జనవరి నుంచి ఆర్బీఐ 2.50 శాతం మేర రెపో రేటును తగ్గించింది. కానీ గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటిదాకా బ్యాంకులు గరిష్టంగా 0.7–1.3 శాతం స్థాయిలో మాత్రమే బదలాయించాయి’ అని క్రెడాయ్ పేర్కొంది. అధిక వడ్డీ రేటు కట్టాల్సి వస్తోంది.. గృహ రుణాలపై వడ్డీ రేట్లను ఎక్స్టర్నల్ బెంచ్మార్క్కు అనుసంధానించాలని బ్యాంకులకు సూచించినా ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు మాత్రం ఆర్బీఐ దీన్ని వర్తింపచేయడం లేదని తెలిపింది. బ్యాంకులు సైతం తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనాలను ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు ఇవ్వకపోతుండటంతో వాటి నుంచి తాము తీసుకునే రుణాలపై భారీ వడ్డీ రేటు కట్టాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. -
ఎన్బీఎఫ్సీలకు కేంద్రం ఊరట
న్యూఢిల్లీ: బ్యాంకింగ్యేతర ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలు (హెచ్ఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థలకు ఊరటనిచ్చేలా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మరిన్ని సంస్థలు పాక్షిక రుణ హామీ పథకం (పీసీజీఎస్) పరిధిలోకి వచ్చేలా నిబంధనలు సడలించడంతో పాటు కాల వ్యవధిని జూన్ 30 దాకా పొడిగించింది. దీని కాలపరిమితి వాస్తవానికి మార్చి 31తో తీరిపోయింది. సవరించిన పీసీజీఎస్ ప్రకారం ఏఏ కన్నా తక్కువ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐ, హెచ్ఎఫ్సీ బాండ్లను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టం వాటిల్లితే.. అందులో సుమారు 20 శాతం దాకా భర్తీ అయ్యేలా ప్రభుత్వం పూచీకత్తునిస్తుంది. మరోవైపు, కరోనా వైరస్ సంక్షోభాన్ని అధిగమించే దిశగా రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు ప్రకటించిన రూ. 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. 2018 సెప్టెంబర్లో ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీల డిఫాల్ట్తో మొదలుపెట్టి ఆ తర్వాత చోటుచేసుకున్న అనేక పరిణామాలతో ఎన్బీఎఫ్సీలు నిధులు దొరక్క సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు, సూక్ష్మ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు రూ. 10,000 కోట్లతో కొత్త పథకానికి కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనితో 2,00,000 యూనిట్లకు రుణ ఆధారిత సబ్సిడీని అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. 2024–25 దాకా అయిదేళ్లు ఈ స్కీము అమలవుతుంది. ఆదాయంలో ప్రభుత్వానికి వాటాలిచ్చే ప్రాతిపదికన వాణిజ్య కార్యకలాపాల కోసం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ విధానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారన్న అంశం ఆధారంగా కంపెనీలు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. నాలుగు శాతం వాటా కనీస స్థాయిగా ఉంటుంది. -
ఎన్బీఎఫ్సీలకు... నిధుల కటకట
ముంబై: నిధుల సమస్యలతో సతమతమవుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తాజాగా కరోనా వైరస్ పరమైన లాక్డౌన్, రుణాల చెల్లింపులపై మారటోరియం తదితర పరిణామాలతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నాయి. కొన్ని సంస్థలు ఈ పరిస్థితిని తట్టుకోలేక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను వాపసు చేస్తుండగా.. సంక్షోభంలో ఉన్న మరికొన్నింటి రిజిస్ట్రేషన్ను రిజర్వ్ బ్యాంకే రద్దు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్బీఎఫ్సీల అసెట్ క్వాలిటీ క్షీణించి, నిధుల కొరత మరింత తీవ్రం కానున్నదంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. ఎన్బీఎఫ్సీలు బలహీనపడటం వల్ల వాటికి రుణాలిచ్చిన బ్యాంకులకు కూడా గణనీయంగా రిస్కులు పొంచి ఉన్నాయని హెచ్చరించింది. 2018లో ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ డిఫాల్ట్ అయినప్పట్నుంచీ ఇన్వెస్టర్లు రిస్కీ సాధనాలకు దూరంగా ఉంటుండటంతో ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ’గడిచిన కొన్నాళ్లుగా ఆర్థిక మందగమనం నెమ్మదిగా కమ్ముకొస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆర్థిక పరిస్థితులు మరింతగా దెబ్బతింటాయి. ఫలితంగా ఎన్బీఎఫ్సీల అసెట్ నాణ్యత కూడా ఇంకా దిగజారుతుంది’ అని మూడీస్ పేర్కొంది. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు అత్యధిక రిస్కులు ఉన్న వర్గాలకు రుణాలిస్తాయి కాబట్టి సగటున వాటి అసెట్ క్వాలిటీ క్షీణత మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. మారటోరియం దెబ్బ...: ఇక రుణాల చెల్లింపునకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) 3 నెలల పాటు మారటోరియం ప్రకటించడం కూడా ఎన్బీఎఫ్సీలకు స్వల్పకాలిక నిధుల లభ్యతపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుందని మూడీస్ తెలిపింది. చాలా మటుకు ఎన్బీఎఫ్సీలు తమకు వసూలయ్యే బాకీల నుంచే తాము కట్టాల్సిన రుణాలను చెల్లిస్తుంటాయి. వాటి దగ్గర భారీ స్థాయిలో నిధులు ఉండవు. ప్రస్తుతం మారటోరియం కారణంగా తమకు బాకీలు వసూలు కాకపోవడం వల్ల ఎన్బీఎఫ్సీలు తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కూడా సకాలంలో తిరిగి చెల్లించలేని పరిస్థితి తలెత్తుతుందని మూడీస్ తెలిపింది. మారటోరియం వల్ల రాబోయే మరికొన్ని నెలల పాటు ఎన్బీఎఫ్సీలకు రావాల్సిన నిధుల ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొంది. రుణ చెల్లింపులపై మారటోరియం ఎత్తివేసినా, ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఎంత ఎక్కువ కాలం కొనసాగితే .. రుణాల రీపేమెంట్ తిరిగి సాధారణ స్థాయికి రావడానికి అంత ఎక్కువ సమయం పట్టేసే అవకాశం ఉందని తెలిపింది. మారటోరియం వ్యవధిలో రుణాల రీపేమెంట్లు కనీసం 50 శాతం పడిపోవచ్చని అంచనా వేసింది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వాపసు చేసిన 9 ఎన్బీఎఫ్సీలు.. తాజా పరిస్థితుల నేపథ్యంలో తొమ్మిది ఎన్బీఎఫ్సీలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను వాపసు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రిలయన్స్ నెట్, నిశ్చయ ఫిన్వెస్ట్, పెన్రోజ్ మెర్కంటైల్స్, మనోహర్ ఫైనాన్స్ ఇండియా, షాండిలియర్ ట్రాకోన్, సంఘి హైర్ పర్చేజ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ను ఆర్బీఐకి తిరిగి ఇచ్చేయడం వల్ల ఈ కంపెనీలు బ్యాంకింగ్యేతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఉండదు. 14 ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ను రద్దు చేసినట్లు ఆర్బీఐ మరో ప్రకటనలో తెలిపింది. ప్రైమస్ క్యాపిటల్ (గతంలో ర్యాపిడ్ గ్రోత్ క్యాపిటల్), భారత్ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రీస్, సిగ్నేచర్ ఫైనాన్స్, డీ బీ లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్, జిందాల్ ఫిన్లీజ్, బీఎల్ఎస్ ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. నిధుల సమీకరణ కష్టమే.. గడిచిన కొన్నాళ్లుగా తమకు రావాల్సిన బాకీలను తనఖా పెట్టి ఎన్బీఎఫ్సీలు కాస్త అదనంగా నిధులను సమీకరించుకోగలుగుతున్నాయి. అయితే, మారటోరియం కారణంగా వసూళ్లు పడిపోవడం వల్ల ఈ మార్గంలో నిధుల సమీకరణ కూడా కష్టంగా మారగలదని మూడీస్ పేర్కొంది. ఎన్బీఎఫ్సీల రుణపత్రాల కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం ఇటీవల ప్రకటించిన చర్యలు సమీప భవిష్యత్తో వాటికి ఊరట కలిగించేవే అయినప్పటికీ.. వ్యవస్థాగతమైన నిధుల కొరత కష్టాలు తీర్చేందుకు సరిపోవని అభిప్రాయపడింది. -
చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దెబ్బతో అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించిన కేటాయింపులను రంగాలవారీగా వెల్లడించే ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో భాగంగా చిన్న సంస్థలు, ఎన్బీఎఫ్సీలు, రియల్టీ మొదలైన రంగాలకిస్తున్న ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. చిన్న సంస్థలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు, నిల్చిపోయిన రియల్టీ ప్రాజెక్టుల డెడ్లైన్ పొడిగింపు, ఎన్బీఎఫ్సీల కోసం ప్రత్యేక లిక్విడిటీ పథకం, సంక్షోభంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చడం మొదలైన వరాలు వీటిలో ఉన్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి దిశగా .. మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని మినహాయింపులనిస్తూ రెండు విడతల్లో లాక్డౌన్ను మే 17 దాకా కేంద్రం పొడిగించింది. లాక్డౌన్ దెబ్బతో ఏప్రిల్లో 12.2 కోట్ల మంది ఉద్యోగాలకు కోత పడి ఉంటుందని, వినియోగ డిమాండ్ పూర్తిగా పడిపోయిందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశ ఎకానమీకి ఊతమిచ్చేలా రూ. 20 లక్షల కోట్లతో (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 10 శాతం) ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఎంఎస్ఎంఈలకు వరాలు చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల కోట్ల మేర రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో 45 లక్షలకు పైగా చిన్న సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆమె వివరించారు. రుణాల చెల్లింపునకు 4 ఏళ్ల కాలవ్యవధి, 12 నెలల మారటోరియం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఉంటుంది. ఇక, ఎంఎస్ఎంఈల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా కేంద్రం ఏర్పాటు చేస్తోంది. వృద్ధి సామర్థ్యం ఉన్న చిన్న సంస్థలకు ఇది దాదాపు రూ. 50,000 కోట్ల మేర పెట్టుబడులు సమకూర్చనుంది. తీవ్ర రుణ ఒత్తిళ్లలో ఉన్నవి, డిఫాల్ట్ అవుతున్న సంస్థలకు రూ. 20,000 కోట్ల మేర రుణ సదుపాయంతో .. రెండు లక్షల పైచిలుకు వ్యాపారాలకు తోడ్పాటు లభించనుంది. చిన్న సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1 లక్ష కోట్ల బకాయీలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లో విడుదల చేస్తాయి. స్థూల దేశీయోత్పత్తిలో చిన్న, మధ్య స్థాయి కంపెనీల వాటా మూడో వంతు ఉంటుంది. ఈ రంగంలో 11 కోట్ల మంది పైగా ఉపాధి పొందుతున్నారు. భారీ పెట్టుబడులున్న వాటిని కూడా ఎంఎస్ఎంఈల కింద వర్గీకరించేందుకు వీలుగా ఎంఎస్ఎంఈల నిర్వచనాన్ని కూడా కేంద్రం సవరించింది. టర్నోవరును ప్రాతిపదికగా తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా మరిన్ని సంస్థలు ఎంఎస్ఎంఈల పరిధిలోకి వచ్చి, ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా ప్రయోజనాలను కూడా పొందేందుకు వీలు లభించనుంది. దేశీయంగా చిన్న సంస్థలకు ఊతమిచ్చేలా రూ. 200 కోట్ల దాకా విలువ చేసే ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించే విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. మరోవైపు, డిజిటల్ పేమెంట్స్ వంటి సంస్కరణలను అమలు చేసే డిస్కమ్లకు తోడ్పాటు లభించనుంది. వాటికి రావాల్సిన బకాయీల ప్రాతిపదికన ప్రభుత్వ రంగ పీఎఫ్సీ, ఆర్ఈసీ రూ. 90,000 కోట్ల మేర నిధులు సమకూర్చనున్నాయి. ఎన్బీఎఫ్సీలకు తీరనున్న నిధుల కష్టాలు.. తీవ్రంగా నిధుల కొరత కష్టాలు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణాల సంస్థలు (హెచ్ఎఫ్సీ), సూక్ష్మ రుణాల సంస్థల(ఎంఎఫ్ఐ)కు బాసటనిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వీటి కోసం రూ. 30,000 కోట్లతో ప్రత్యేక లిక్విడిటీ పథకాన్ని ప్రకటించింది. ఈ సంస్థలకు రుణాల తోడ్పాటుతో పాటు మార్కెట్లో విశ్వాసం పునరుద్ధరించడానికి కూడా ఇది తోడ్పడుతుందని మంత్రి తెలిపారు. అలాగే, తక్కువ స్థాయి క్రెడిట్ రేటింగ్ ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు, ఎంఎఫ్ఐలు కూడా వ్యక్తులు, ఎంఎస్ఎంఈలకు మరింతగా రుణాలు ఇవ్వగలిగేలా రూ. 45,000 కోట్లతో పాక్షిక రుణ హామీ పథకం 2.0ని కేంద్రం ప్రకటించింది. పీఎఫ్ భారం తగ్గింది.. 100 మంది కన్నా తక్కువ ఉద్యోగులున్న కంపెనీలకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులపరంగా ఊరటనిచ్చారు. పీఎఫ్ చందాలకు సంబంధించి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరో మూడు నెలల పాటు ఆగస్టు దాకా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. దీనితో 3.67 లక్షల సంస్థలు, 72.22 లక్షల మంది ఉద్యోగులకు రూ. 2,500 కోట్ల మేర నిధుల లభ్యతపరమైన ప్రయోజనాలు లభించనున్నాయి. ఇక, బేసిక్ వేతనంలో తప్పనిసరిగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)కు జమ చేయాల్సిన మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలు, ఉద్యోగుల చేతిలో కాస్త నిధులు ఆడేందుకు ఇది ఉపయోగపడనుంది. ‘ఇది సుమారు 6.5 లక్షల సంస్థలు, 4.3 కోట్ల పైచిలుకు ఉద్యోగులకు తోడ్పడనుంది. మూడు నెలల వ్యవధిలో రూ. 6,750 కోట్ల మేర లిక్విడిటీపరమైన లబ్ధి చేకూరుతుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం యథాప్రకారంగా 12% చందా జమ చేయడం కొనసాగిస్తాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊపిరి.. కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా నిర్మాణాలు నిల్చిపోయి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న నిర్మాణ రంగానికి తోడ్పాటు లభించింది. ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు డెడ్లైన్ను ఆరు నెలల పాటు పొడిగిస్తూ ఊరట కల్పించారు. రైల్వే సహా రహదారి రవాణా శాఖ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మొదలైనవన్నీ కూడా నిర్మాణ పనులు, వస్తు.. సేవల కాంట్రాక్టులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఈ వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇందుకు సంబంధించి బిల్డర్లు .. రియల్టీ చట్టం రెరాలో ఫోర్స్ మెజూర్ నిబంధనను ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రియల్టీ నియంత్రణ సంస్థలకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ తగు సూచనలు జారీ చేస్తుంది. దీని ప్రకారం.. మార్చి 25తో లేదా ఆ తర్వాత (లాక్డౌన్ అమల్లోకి వచ్చిన రోజు) గడువు ముగిసిపోయే ప్రాజెక్టులన్నింటికీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనక్కర్లేకుండా.. రిజిస్ట్రేషన్, కంప్లీషన్ తేదీలను సుమోటో ప్రాతిపదికన 6 నెలల పాటు నియంత్రణ సంస్థలు పొడిగించవచ్చు. అవసరమైతే మరో 3 నెలల గడువు కూడా ఇవ్వొచ్చు. పన్ను చెల్లింపుదారులపై పెద్ద మనసు వేతనయేతర చెల్లింపులకు సంబంధించిన టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) రేటును 2021 మార్చి 31 దాకా 25 శాతం మేర తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. దీంతో వ్యవస్థలో రూ. 50,000 కోట్ల నిధుల లభ్యత పెరుగుతుందన్నారు. కాంట్రాక్టులకు చెల్లింపులు, ప్రొఫెషనల్ ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమీషను, బ్రోకరేజీ మొదలైన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు ఆదాయ పన్ను రిటర్నులు, ఇతర అసెస్మెంట్స్ను దాఖలు చేసేందుకు తేదీలను కూడా పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీని ప్రకారం.. వివిధ వర్గాలకు సంబంధించి 2019–20 ఆర్థిక సంవత్సర ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును జూలై 31 నుంచి అక్టోబర్ 31, నవంబర్ 30 దాకాను, ట్యాక్స్ ఆడిట్ తుది గడువును సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31 దాకా పొడిగించారు. ‘వివాద్ సే విశ్వాస్‘ స్కీమును డిసెంబర్ దాకా పొడిగించారు. వివద్ సే విశ్వాస్ పేరుతో కేంద్ర సర్కారు గతంలో ప్రకటించిన పథకం గడువును మరో 6 నెలలు అంటే 2020 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ తాజా నిర్ణయం వెలువడింది. రిఫండ్స్ సత్వరమే దాతృత్వ సంస్థలు, ఎల్ఎల్పీలు, నాన్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు, ప్రొప్రయిటర్షిప్ సంస్థలకు అపరిష్కృతంగా ఉన్న రిఫండ్స్ను ఆదాయపన్ను శాఖ వెంటనే పరిష్కరించనున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. రూ.5 లక్షల్లోపు ఉన్న వాటికి సంబంధించి ఇప్పటికే రూ.18,000 కోట్ల రిఫండ్స్ను పూర్తి చేసినట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈలకు మేలు... ఆర్థిక మంత్రి సీతారామన్ నేడు ప్రకటించిన నిర్ణయాలు.. వ్యాపార సంస్థలు ముఖ్యంగా ఎంస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు దీర్ఘకాలం పాటు పరిష్కారాలు చూపుతాయి. లిక్విడిటీని వ్యాపారవేత్తల సాధికారతను పెంచుతాయి. వారి పోటీతత్వాన్ని బలోపేతం చేస్తాయి. – ప్రధాని నరేంద్రమోదీ వృద్ధికి ఊతమిస్తుంది... స్వయం సమృద్ధమైన భారత్ను నిర్మించేందుకు, వృద్ధికి ఊతమిచ్చేందుకు ఇవి తోడ్పడతాయి. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడంతో పాటు స్థానిక బ్రాండ్స్ను నిర్మించేందుకు తోడ్పాటునిస్తాయి – నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి డెవలపర్లకు బూస్ట్... రెరా కింద ప్రాజెక్టు పూర్తి చేసే గడువును పొడిగించడం, కరోనాను ఊహించని విపత్తుగా ప్రకటించడం అన్నవి రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కీలకమైన నిర్ణయాలు. – జక్సయ్ షా, క్రెడాయ్ చైర్మన్ చిన్న సంస్థలకు తక్షణ శక్తి... ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఎంఎస్ఎంఈలకు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు, సమస్యల్లో ఉన్న రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు వెంటనే పెద్ద ఊరటనిస్తాయి. – దీపక్సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ కరోనాను ఎదుర్కొనే వ్యూహం... నేటి సమగ్రమైన నిర్ణయాలు దేశీయ పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి వీలు కల్పిస్తాయి. ఆర్థిక మంత్రి ప్రకటించిన చర్యల తీరు చూస్తుంటే మన ప్రభుత్వం భారత్ను కరోనా బారి నుంచి బయటపడవేసేందుకు, మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం కలుగుతోంది. – సంగీతారెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్ దీర్ఘకాల ప్రభావం ఉంటుంది... చాలా ముఖ్యమైన నిర్ణయం, దీర్ఘకాలం పాటు ప్రభావం చూపించేది.. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మార్చడం. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006 నుంచి ఇది మారలేదు. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరెక్టర్ జనరల్ -
తగ్గిపెరిగిన ఎస్బీఐ ‘రేటు’
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4.4 శాతం) ఆధారిత గృహ రుణ రేటును 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కోవిడ్–19 నేపథ్యంలో రుణ గ్రహీతల నుంచీ, రియల్టీ సంస్థల నుంచీ క్రెడిట్ రిస్క్ (రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యంలో ఇబ్బంది) పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల నుంచి వస్తున్న విశ్లేషణలు ఎస్బీఐ తాజా నిర్ణయానికి నేపథ్యమని సంబంధిత ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. ఆస్తిని తనఖా పెట్టుకుని ఇచ్చే వ్యక్తిగత రుణాలపై సైతం వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లమేర ఎస్బీఐ పెంచింది. మే 1వ తేదీ నుంచీ తాజా రేట్లు అమల్లోకి వస్తాయని బ్యాంక్ తెలిపింది. ఎస్బీఐ తాజా నిర్ణయం బాటలో మిగిలిన బ్యాంకులూ నడిచే అవకాశం ఉంది. గృహ రుణాల్లో భారీ మొత్తం అటు రెపో రేటుకో లేక ఎంసీఎల్ఆర్కో అనుసంధానమై ఉంటాయి. మరోపక్క, బెంచ్మార్క్ రుణ రేటు–ఎంసీఎల్ఆర్ను స్వల్పంగా 0.15% (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. ప్రస్తుతం 7.40% ఉంటే దీనిని 7.25%కి తగ్గించింది. మే 10వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం– ఒక వ్యక్తి 30 ఏళ్లలో తీర్చే విధంగా రూ.25 లక్షల గృహ రుణం తీసుకుంటే (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన వడ్డీ రేటుకు) అతనికి నెలవారీ వాయిదా చెల్లింపులపై దాదాపు రూ.255 భారం తగ్గుతుంది. వృద్ధులకు ఊరట: రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో సీనియర్ సిటిజన్లకోసం ‘ఎస్బీఐ వియ్కేర్ డిపాజిట్’ పథకం ఒకటి ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో వడ్డీరేట్లు భారీగా తగ్గిపోయిన నేపథ్యంలో వృద్ధులకు ఊరటనిచ్చే నిర్ణయం ఇది. ఐదేళ్లు, ఆపైన కాలపరిమితికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లకు మామూలుగా వచ్చే వడ్డీకన్నా 30 బేసిస్ పాయింట్ల అదనపు ప్రీమియం వడ్డీ చెల్లించడమే ఈ కొత్త ప్రొడక్ట్ ప్రత్యేకత. అయితే ఈ స్కీమ్ సెప్టెంబర్ 30వరకూ మాత్రమే అమల్లో ఉంటుంది. ఇప్పటికే మామూలుగా వచ్చే డిపాజిట్లరేటుకన్నా సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు అదనంగా అందుతుంది. తాజా నిర్ణయం ప్రకారం... ఐదుళ్లు, ఆపైన కాలపరిమితికి డిపాజిట్ చేస్తే 80 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు (50 బేసిస్ పాయింట్లకు 30 బేసిస్ పాయింట్లు ప్రీమియం) అందుతుంది. మూడేళ్లలోపు రేటు తగ్గింపు: మరోపక్క, మూడేళ్ల కాలపరిమితిలోపు రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మే 12వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఎన్బీఎఫ్సీలకూ ‘రుణ మారటోరియం’ వర్తింపు కోల్కతా: కరోనా కష్టాల నేపథ్యంలో రుణ బకాయిల చెల్లింపులపై మే 31వ తేదీ వరకూ మూడు నెలల పాటు విధించిన ‘మరటోరియం’ను ఎన్బీఎఫ్సీ (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు)లకూ వర్తింపజేయాలని ఎస్బీఐ గురువారం నిర్ణయించింది. కరోనా కష్టాల్లో ఉన్న రుణ గ్రహీతలకు ఊరటనిచ్చేలా ‘బకాయిల చెల్లింపులపై’ 3 నెలలు(మార్చి–ఏప్రిల్–మే) మారటోరియం విధించడానికి ఆర్బీఐ బ్యాంకింగ్కు అనుమతి నిచ్చింది. అయితే ఈ మారటోరియంను ఎన్బీ ఎఫ్సీలకు వర్తింపజేసేలా ఆర్బీఐ అనుమతి నివ్వడంతో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. ఇదే బాటలో మరికొన్ని బ్యాంకులూ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) విషయంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఎన్బీఎఫ్సీలకు ఊరట కలుగుతుంది. దీనితోపాటు 3 నెలల మారటోరియం ప్రయోజనాన్ని ఎన్బీఎఫ్సీలూ తమ కస్టమర్లకు అందించగలుగుతాయి. మేతో ముగియనున్న మూడు నెలల మారటోరియం మరో మూడు నెలలు పొడిగించవచ్చంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. -
కరోనా కష్టాల్లో రుణగ్రహీతలు
ముంబై: కరోనా వైరస్ పరిణామాలతో రుణగ్రహీతలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రుణాలను 2021 దాకా వన్–టైమ్ ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించేందుకు అనుమతించాలంటూ రిజర్వ్ బ్యాంక్ను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కోరాయి. అలాగే రుణ వాయిదాలపై మారటోరియం వెసులుబాటు తమకూ ఇవ్వాలని, ప్రొవిజనింగ్ నిబంధనల సడలింపునివ్వాలని విజ్ఞప్తి చేశాయి. ఆర్బీఐతో జరిగిన సమావేశంలో పరిశ్రమ వర్గాలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేసినట్లు ఎన్బీఎఫ్సీల సమాఖ్య ఆర్థిక రంగ అభివృద్ధి మండలి (ఎఫ్ఐడీసీ) వెల్లడించింది. లాక్డౌన్తో తమ కస్టమర్ల ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలం కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐకి తెలిపాయి. ప్రధానంగా రవాణా ఆపరేటర్లు, కాంట్రాక్టర్లు, లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మొదలైన వాటిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం ఉందని ఎన్బీఎఫ్సీలు వివరించాయి. ‘ఈ నేపథ్యంలో మొండిపద్దుల కింద వర్గీకరించే పరిస్థితి రాకుండా.. 2021 మార్చి దాకా రుణాల రీపేమెంట్ షెడ్యూల్స్ను సవరించేందుకు లేదా వాయిదాలను పొడిగించేందుకు లేదా ఈఎంఐలను పునర్వ్యవస్థీకరించేందుకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్కు అనుమతివ్వాలి‘ అని కోరినట్లు ఎఫ్ఐడీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు ఇచ్చిన రుణాలను 2020 డిసెంబర్ దాకా వన్–టైమ్ పునర్వ్యవస్థీకరణ చేసేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు ఆర్బీఐ అనుమతించింది. దీన్ని మిగతా రుణ గ్రహీతలందరికీ కూడా వర్తింపచేయాలని ఎన్బీఎఫ్సీలు కోరుతున్నాయి. ఇక మూడు నెలల పాటు ఈఎంఐలను వాయిదా వేసుకునేందుకు ఆర్బీఐ ప్రకటించిన మారటోరియంతో రుణగ్రహీతలకు కాస్త ఉపశమనం లభించిందని ఎఫ్ఐడీసీ తెలిపింది. అయితే, పరిస్థితులు ఇంకా చక్కబడనందున నాలుగో నెలలోనూ వారు వాయిదాలు చెల్లించగలిగే అవకాశాలు ఉండకపోవచ్చని పేర్కొంది. నిధుల లభ్యత పెంచాలి .. తమ రుణ వితరణ కార్యకలాపాలు యథాప్రకారం సాగేలా తోడ్పడేందుకు రీఫైనాన్స్ మార్గం ద్వారా చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (సిడ్బి).. నాబార్డ్ నుంచి మరిన్ని నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎన్బీఎఫ్సీలు కోరాయి. టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (టీఎల్టీఆర్వో 2.0)కి సగం స్థాయిలోనే బిడ్లు రావడమనేది .. బ్యాంకులు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడకపోవడాన్ని సూచిస్తోందని ఎఫ్ఐడీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా మొత్తాన్ని సిడ్బి, నాబార్డ్లకు కేటాయించి తద్వారా తమకు నిధుల లభ్యత మెరుగుపడేలా చూడాలని కోరింది. ఇక, గడువు తీరి 1 రోజు దాటిన రుణ పద్దులన్నింటికీ 10 శాతం దాకా ప్రొవిజనింగ్ చేయాలన్న ఆదేశాలను కాస్త సడలించాలని కోరింది. తమ దగ్గర రుణాలు తీసుకునే ట్రక్కు ఆపరేటర్లు లాంటి వివిధ వర్గాలవారు పలు కారణాలతో ఈఎంఐలను కాస్త ఆలస్యంగా చెల్లించడం సాధారణమేనని పేర్కొంది. కొంత ఆలస్యమైనా 30 రోజుల్లోపే చెల్లించేస్తుంటారు కాబట్టి, ఈ పద్దులను క్రెడిట్ రిస్కు కింద పరిగణించడానికి లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రొవిజనింగ్ నిబంధనను 30 రోజులు దాటిపోయిన రుణాలకు మాత్రమే వర్తింపచేసేలా అనుమతినివ్వాలని ఎన్బీఎఫ్సీలు విజ్ఞప్తి చేశాయి. పీఎస్బీలకు మొండిపద్దుల భారం ► ఈసారి 2–4% పెరుగుతాయి ► బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబాకీల భారం 2–4 శాతం మేర పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజి దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్ఏ) హెచ్చరించింది. దీనితో బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కింద ప్రభుత్వం 7–15 బిలియన్ డాలర్ల దాకా అదనపు మూలధనం సమకూర్చాల్సి రావొచ్చని పేర్కొంది. ఉద్దీపన ప్యాకేజీలు, పన్ను వసూళ్లు పడిపోవడం, డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాలు నెరవేరే అవకాశాలు లేకపోవడం తదితర అంశాల కారణంగా ద్రవ్య లోటు 2 శాతం మేర పెరగవచ్చని బీవోఎఫ్ఏ తెలిపింది. బ్యాంకులకు అదనపు మూలధనం అందించడానికి అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం వివిధ మార్గాలు అన్వేషించాల్సి రావచ్చని వివరించింది.రీక్యాపిటలైజేషన్ బాండ్లను జారీ చేయడం లేదా ఆర్బీఐ దగ్గరున్న నిల్వల నుంచి కొంత భాగాన్ని వినియోగించడం వంటి అంశాలు పరిశీలించవచ్చని తెలిపింది. కరోనా వైరస్ కట్టడికి సంబంధించిన పరిణామాలతో బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు భారీగా పెరగవచ్చంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో బీవోఎఫ్ఏ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
రుణాల మారటోరియం మోసాలతో జాగ్రత్త
న్యూఢిల్లీ: రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మారటోరియం అమలు నేపథ్యంలో మోసగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఖాతాదారులను బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఈఎంఐ మారటోరియం మోసాల గురించి అవగాహన పెంచుతున్నాయి. కీలకమైన ఓటీపీ, పిన్ నంబర్ల వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని సూచిస్తున్నాయి. ఖాతాల వివరాలను చోరీ చేసేందుకు సైబర్ క్రిమినల్స్, మోసగాళ్లు అనుసరిస్తున్న కొంగొత్త విధానాల గురించి అవగాహన కల్పించే దిశగా యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు గత కొద్ది రోజులుగా ఖాతాదారులకు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపిస్తున్నాయి. ఈఎంఐల మారటోరియంపై సహకరిస్తామనే పేరుతో మోసగాళ్లు .. ఓటీపీ, సీవీవీ, పాస్వర్డ్ లేదా పిన్ నంబర్ల వివరాలను ఇవ్వాలంటూ ఫోన్లు చేసే అవకాశాలు ఉన్నాయని బ్యాంకులు తెలిపాయి. ఇలాంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అటు కరోనా వైరస్ బాధితులకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి ప్రధాని ప్రారంభించిన పీఎం–కేర్స్ నిధికి చందాల సేకరణ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయని, వీటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాయి. ఎన్బీఎఫ్సీలకూ మారటోరియం... రుణాలపై మూడు నెలల మారటోరియం వెసులుబాటును నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కూడా వర్తింపచేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిధిలోని బ్యాంకులు యోచిస్తున్నాయి. తద్వారా కరోనా వైరస్ సంక్షోభం నుంచి అవి గట్టెక్కేందుకు తోడ్పాటు అందించాలని భావిస్తున్నాయి. తాము కూడా రుణగ్రహీతల కోవలోకే వస్తాం కాబట్టి తమకు కూడా మారటోరియం ఇవ్వాలంటూ ఎన్బీఎఫ్సీలు డిమాండ్ చేస్తున్నాయి. వివిధ వర్గాలకు రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీలు ప్రధానంగా నిధుల కోసం బ్యాంకులపైనే ఆధారపడుతుంటాయి. డిజిటల్ చెల్లింపులపై ప్రచారం... కరోనా వైరస్ కల్లోలాన్ని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్డౌన్ సమయంలో డిజిటల్ చెల్లింపులను అనుసరించాలని ప్రజలను ఆర్బీఐ కోరింది. ఈ మేరకు అమితాబ్ బచ్చన్తో ట్విట్టర్ ప్రచారాన్ని ఆర్బీఐ ప్రారంభించింది. కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి సామాజిక దూరం పాటించడం సరైన చర్య అని ఆర్బీఐ తెలిపింది. -
బ్యాంకింగ్ బోర్లా!
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ రంగ దృక్పథాన్ని స్థిరం నుంచి ప్రతికూలానికి (నెగెటివ్) మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తగ్గించేసింది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన అవరోధాలతో వృద్ధి మందగిస్తుందని.. దీంతో బ్యాంకుల ఆస్తుల నాణ్యత తగ్గిపోవచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. కార్పొరేట్, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు, రిటైల్ విభాగంలోని మొండిబాకీలు పెరగవచ్చని.. ఫలితంగా బ్యాంకుల లాభాలు, నిధులపై ఒత్తిళ్లు పెరిగిపోతాయని మూడీస్ నివేదికలో పేర్కొంది. ‘‘ఉన్నట్టుండి ఆర్థిక కార్యకలాపాలు ఒకేసారి ఆగిపోవడంతో నిరుద్యోగం పెరుగుతుంది. ఇది గృహాలు, కంపెనీల ఆదాయాలు తగ్గిపోయేందుకు దారితీస్తుంది. దీంతో చెల్లింపుల్లో జాప్యం పెరిగిపోయేందుకు కారణమవుతుంది. ఎన్బీఎఫ్సీ సంస్థల్లో నిధుల ఒత్తిళ్లు బ్యాంకుల రిస్క్ను పెంచుతుంది. ఎందుకంటే ఎన్బీఎఫ్సీ రంగానికి బ్యాంకుల ఎక్స్పోజర్ (రుణ పోర్ట్ఫోలియో) ఎక్కువగా ఉంది’’ అని మూడీస్ వెల్లడించింది. ఈ అంశాలు బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీయడంతోపాటు రుణ వృద్ధికి విఘాతం కలిగిస్తాయని అంచనా వేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిధుల లభ్యత స్థిరంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. యస్ బ్యాంకు డిఫాల్ట్తో రిస్క్ తీసుకోవడానికి కస్టమర్లు వెనుకాడడం చిన్న ప్రైవేటు బ్యాంకులకు నిధుల ఒత్తిళ్లు పెరగవచ్చని అంచనా వేసింది. ఈ బ్యాంకుల పట్ల నెగెటివ్.. ఇండస్ ఇండ్ బ్యాంకు రేటింగ్స్ను డౌన్గ్రేడ్ చేసేందుకు పరిశీలనలో పెడుతున్నట్టు మూడీస్ ప్రకటించింది. ఇండస్ ఇండ్ బ్యాంకు పోర్ట్ఫోలియో ఎక్కువగా వాహన రుణాలు, సూక్ష్మ రుణాలు కావడంతో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులతో బ్యాంకుపై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. అలాగే, ప్రస్తుత సవాళ్లతో కూడిన వాతావరణంలో ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు రేటింగ్లను డౌన్గ్రేడ్ చేసింది. యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకుల రేటింగ్ను స్థిరం (స్టేబుల్) నుంచి నెగెటివ్కు తగ్గించింది. ఐడీబీఐ బ్యాంకు రేటింగ్ను పాజిటివ్ నుంచి స్టెబుల్కు డౌన్గ్రేడ్ చేసింది. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకుల గ్లోబల్ రేటింగ్స్లో మార్పులు చేయలేదు. లౌక్డౌన్ కారణంగా రుణ గ్రహీతల వేతనాలకు ఇబ్బందులు ఎదురైతే అది రిటైల్, క్రెడిట్కార్డు రుణాల చెల్లింపులపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేసింది. ఈ రంగాలపై ఎక్కువ ప్రభావం.. ఎయిర్లైన్స్, ఆటోమొబైల్ ఓఈఎం కంపెనీలు, ఆటో విడిభాగాల సరఫరా కంపెనీలు, ఆయిల్ అండ్ గ్యాస్ తయారీదారులు, గేమింగ్, గ్లోబల్ షిప్పింగ్, విచక్షణా రహిత రిటైల్ వినియోగం, ఆతిథ్య రంగాలు కరోనా వైరస్ కారణంగా ఎక్కువ ప్రతికూలతలను చవిచూసే రంగాలుగా మూడీస్ పేర్కొంది. -
విదేశీ పెట్టుబడులకు చర్యలు: శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్బీఐ సత్వర చర్యలను పూనుకుంటోంది. ఇందులో భాగంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందకు కసరత్తును ముమ్మరం చేసింది. తాజాగా విదేశీ మదుపర్లను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ బాండ్లను అంతర్జాతీయ సూచీలో ప్రవేశపెట్టడానికి చర్చలు కొనసాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ సూచీలో విదేశీ నిధులు తప్పనిసరి కావడంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఈ చర్యల వల్ల విదేశీ నిధులు దేశంలోకి ప్రవేశించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అంతర్జాతీయ సూచీలో అత్యధిక విదేశీ నిధులు పొందుతున్న దేశాల నిపుణులతో చర్చిస్తున్నామని, దేశీయ ప్రభుత్వ బాండ్ల ద్వారా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఆర్థిక వ్యవస్థను బలపరిచే క్రమంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లో నిధులు ప్రవాహాన్ని విశ్లేషిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న విదేశీ పెట్టుబడుదారుల సలహాను ఈ ఏడాది బడ్జెట్లో ప్రస్తావించినట్టు శక్తికాంత దాస్ గుర్తు చేశారు. ఈ పనిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బ్యాంకింగ్ రంగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో రుణ వృద్ధి లేకపోవడం వల్ల బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని, వీటన్నింటికి పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్హెచ్బీ)ను ప్రారంభించిందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చదవండి: త్వరలో రూ.50 నోటు కొత్త సిరీస్ -
ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టాలి
మొండిబాకీల సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కొంత గాడిలోకి వస్తున్న బ్యాంకింగ్ రంగం రానున్న బడ్జెట్లో భారీస్థాయి ఆశలేవీ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే మూలధన నిధులను అందించడం, బలహీన బ్యాంకులను విలీనం చేయడం తదితర చర్యలతో ప్రభుత్వం తన ప్రాధాన్యతలను చెప్పకనేచెప్పింది. అయితే, ఎన్పీఏ భయాలతో కార్పొరేట్ రంగానికి రుణాలను ఇచ్చేందుకు ఇప్పటికీ బ్యాంకులు జంకుతున్నాయి. ఈ తరుణంలో బడ్జెట్లో బ్యాంకులు ఏం కోరుకుంటున్నాయి? ఈ రంగంలో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం... హౌసింగ్కు ప్రోత్సాహకాలివ్వాలి... ‘ఆర్థిక రంగానికి బ్యాంకులు జీవనరేఖ లాంటివి. ఎకానమీ పుంజుకుంటే ముం దుగా లాభపడేవి బ్యాంకులే. అందుకే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే చర్యలను బడ్జెట్లో చేపడతారని భావిస్తున్నాం. అయితే, నేరుగా బ్యాంకులకు సంబంధించి భారీ ప్రకటనలేవీ ఉండకపోవచ్చు’ అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ, సీఈఓ శ్యామ్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. కీలకమైన రంగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంపై ప్రభావం చూపుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే లక్ష్యంగా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఇందులో విఫలమైతే మున్ముందు నిరుద్యోగం మరింతగా పెరుగుతుంది. నాన్బ్యాంకింగ్ సంస్థల ద్వారా నేరుగా రుణాలిచ్చిన తనఖాల్లేని రుణాలు(అన్సెక్యూర్డ్)తో బ్యాంకుల రిస్కులు మరింత తీవ్రం అవుతాయి’ అని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. ఇప్పటికే మంచి కార్పొరేట్ కంపెనీల నుంచి రుణాలకు సంబంధించి డిమాండ్ ఘోరంగా పడిపోవడంతో దీన్ని భర్తీ చేసుకోవాడానికి రిటైల్ రుణాలపై బ్యాంకులు అత్యధికంగా దృష్టిసారిస్తున్నాయి. ‘వాహన, గృహ రుణాలకు సంబంధించి ఎలాంటి ఆందోళనా లేదు. అయితే, వ్యక్తిగత రుణాల చెల్లింపుల్లో మొండి బాకీలు గనుక పెరిగాయంటే బ్యాంకింగ్కు కొత్త సమస్యలు తప్పవు’ అని మరో బ్యాంక్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇంకా ఏం ఆశిస్తున్నారంటే... ► హౌసింగ్ రంగానికి ప్రోత్సాహం ఇచ్చే చర్యలు తీసుకోవాలి. దీనివల్ల బ్యాంకింగ్కు పరోక్షంగా ప్రయోజం ఉంటుంది. ► నిలిచిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.25,000 కోట్ల ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి(ఏఐఎఫ్)ను మరింతగా పెంచాలి. దీనివల్ల రియల్టీ రంగం పునరుత్తేజంతో పాటు బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీల సమస్యలకు కూడా అడ్డుకట్టపడుతుంది. ► ద్రవ్యలోటు కట్టడితో పాటు బడ్జెట్లో ప్రకటించబోయే ఇతరత్రా విధానపరమైన చర్యల ఆధారంగానే... ఆర్బీఐ తదుపరి పాలసీ చర్యలు(వడ్డీరేట్ల విషయంలో) ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీరేట్ల తగ్గింపునకు గత పాలసీ సమీక్షలో ఆర్బీఐ విరామం ప్రకటించింది. తదుపరి సమీక్ష ఫిబ్రవరి 6న జరగనుంది. ► ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లకు సంబంధించి పాక్షిక హామీ పథకం(పీసీజీ)ని ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉంది. సంక్షోభంతో నిధుల సమస్యలను ఎదుర్కొంటున్న ఎన్బీఎఫ్సీలకు ద్రవ్య సరఫరా పెంచేందుకు కేంద్రం ఈ స్కీమ్ను తీసుకొచ్చింది. -
బంగారం రుణాలు @ 4.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: బంగారం రుణాల మార్కెట్ శరవేగంగా మన దేశంలో వృద్ధి చెందుతోంది. 2022 నాటికి ఈ మార్కెట్ రూ.4,617 బిలియన్ రూపాయిలకు (రూ.4,61,700 కోట్లు) చేరుకుంటుందని కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రుణాల వృద్ధి వార్షికంగా 13.4 శాతం మేర ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను కేపీఎంజీ శుక్రవారం విడుదల చేసింది. నివేదికలోని అంశాలు - 2018–19లో బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీలు దేశంలోని ఉత్తరాది, తూర్పు ప్రాంతాల్లోకి తమ శాఖలను వేగంగా విస్తరించాయి. - ఎన్బీఎఫ్సీలు, ఇంటి వద్దకే వచ్చి రుణాలను అందించే నూతన తరం ఫిన్టెక్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడంతో డిజిటల్ వేదికగా కొత్త కస్టమర్లను చేరుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. - బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ కంపెనీలతో కూడిన వ్యవస్థీకృత రంగం వాటా 35 శాతంగా ఉంది. బంగారం రుణ మార్కెట్లో సంఘతిత రంగంతో పోలిస్తే అసంఘటిత రంగ మార్కెట్ రెండు రెట్లు అధికంగా ఉంది. దీంతో సంఘటిత రంగం విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయి. - ఇంత కాలంగా బంగారం రుణాలకే పరిమితమైన పెద్ద కంపెనీలు తమ వృద్ధిని కాపాడుకునేందుకు సూక్ష్మ రుణాలు, ఎస్ఎంఈ రుణాలపైనా దృష్టి పెట్టాయి. - బంగారం రుణ మార్కెట్ ధరల పరంగా అస్థిరత, ఎన్బీఎఫ్సీ రంగంలో నిధుల లభ్యత సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే, బంగారం రుణాలను ఇచ్చే కంపెనీలు లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణ నిష్పత్తి)ను తక్కువగా నిర్ణయించడం, తక్కువ కాల వ్యవధికే రుణాలను ఇవ్వడం ద్వారా ధరల అస్థిరతలను అధిగమిస్తున్నాయి. -
భారత్లో ఆర్థిక మందగమనం
వాషింగ్టన్: భారత్లో ఆర్థిక మందగమన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభిప్రాయపడింది. దీర్ఘకాల ఈ ధోరణిని అరికట్టడానికి కేంద్రం తక్షణం విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఐఎంఎఫ్ డైరెక్టర్స్ నివేదిక వెలువరించిన అంశాలను సంస్థ ఆసియా, పసిఫిక్ శాఖలో భారత్ వ్యవహారాల చీఫ్ రానిల్ సల్గాడో విలేకరులకు తెలిపారు. దీని ప్రకారం– భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... ► నిజానికి భారత్ ఇటీవలి సంవత్సరాల్లో భారీ ఆర్థిక విస్తరణ బా టలో ముందడుగు వేసింది. దీనితో లక్షలాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే 2019 సంవత్సరం నుంచీ దేశంలో ఆర్థిక వృద్ధి పూర్తి మందగమనంలో జారిన జాడలు సుస్పష్టమయ్యాయి. తగిన విధానపరమైన చర్యలు తీసుకోకపోతే, ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ► అయితే భారీ వృద్ధి తర్వాత వచ్చే దిగువబాటగానే (సైక్లికల్) మేము ఈ పరిస్థితిని ఇంకా పరిగణిస్తున్నాం. వ్యవస్థాగతమైన ఇబ్బందులు కనబడ్డంలేదు. అయితే ఈ సైక్లికల్ ప్రతికూలతలను ఎదుర్కొనడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఫైనాన్షియల్ రంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. ► ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 4.5 శాతానికి పడిపోయింది. దేశీయంగా ప్రైవేటు డిమాండ్లో కేవలం ఒక శాతం వృద్ధి రేటు నమోదయ్యిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. పరిస్థితి చూస్తుంటే, డిసెంబర్ త్రైమాసికంలోనూ ప్రతికూల జీడీపీ గణాంకాలే వెలువడతాయని భావించాల్సి వస్తోంది. ► బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థల్లో (ఎన్బీఎఫ్సీ) రుణ వృద్ధి లేకపోవడం, ఆదాయాల వృద్ధి ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పడిపోవడం మొత్తంగా ప్రైవేటు వినియోగంపై కనబడుతోంది. ► తగినంత వ్యాపార విశ్వాసం లేకపోవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో రుణ వృద్ధి మందగమనం కొనసాగుతోంది. ► వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మంచి వ్యవస్థాగత సంస్కరణే అయినప్పటికీ, అమల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. వృద్ధి మందగమనంలో దీనిపాత్ర కూడా ఉండొచ్చనిపిస్తోంది. ► బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిల సమస్య పరిష్కార దిశలో తగిన చర్యలు ఉండాలి. ► ప్రస్తుతం 2019–20లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.1% ఉంటుందని అంచనా. అంచనాల సవరణ నిర్ణయం జనవరిలో ఉంటుంది. గత వృద్ధి అంచ నాలను గణనీయంగా తగ్గించే అవకాశాలే ఉన్నా యి. ప్రస్తుతం వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్ వృద్ధి అంచనాలను దాదాపు 5% దిగువనకు కుదించిన సంగతి తెలిసిందే. ► భారత్ ఆర్థిక రంగానికి సంబంధించి కొన్ని సానుకూల అంశాలూ ఉన్నాయి. అందులో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో ఉండడం ఒకటి. నవంబర్ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్ డాలర్లకు ఎగశాయి. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం కరెంట్ అకౌంట్ లోటు కూడా కట్టడిలోనే ఉంది. కూరగాయల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఇటీవల కట్టుతప్పినప్పటికీ, గడచిన కొన్ని సంవత్సరాలుగా పూర్తి నియంత్రణలో ఉంది. కార్పొరేట్ పన్ను రేటును 30 నుంచి 15 శాతానికి తగ్గించడమూ సానుకూలాంశమే. ఇన్ని చర్యలు ఉన్నా... ఆర్థిక మందగమనం ఆశ్చర్యకరమే. అందువల్ల ఈ మందగమనాన్ని ఆర్థిక సంక్షోభంగా అభివర్ణించలేం. ► కార్మిక, భూ, ప్రొడక్ట్ మార్కెట్ వంటి విభాగాల్లో భారత్ సంస్కరణలు తీసుకురావాలని ఐఎంఎఫ్ భావిస్తోంది. అలాగే మార్కెటింగ్లో ప్రత్యేకించి అంతర్జాతీయంగా పోటీతత్వాన్ని ఎదుర్కొనేందుకూ చర్యలు అవసరం. ఇక విద్యా, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లోనూ సంస్కరణలు అవసరం. ► అయితే ఇక్కడ ఒక అంశాన్ని ఐఎంఎఫ్ విశ్వసిస్తోంది. ప్రస్తుతం భారత్ ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనలు ప్రకటించడానికి పరిమితులు ఉన్నాయి. 2019– 20 ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. ద్రవ్యలోటు కట్టడికి తగిన చర్యలపై దృష్టి పెట్టాలి. -
సహకార బ్యాంకుల పనితీరుపై ఆర్బీఐ సమీక్ష
భువనేశ్వర్: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ) స్కామ్తో లక్షల మంది డిపాజిటర్లు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అర్బన్ సహకార బ్యాంకుల పనితీరును రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు శనివారం సమీక్షించింది. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, అంతర్గతంగాను.. అంతర్జాతీయంగాను దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మొదలైన అంశాలు కూడా చర్చించింది. గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలో సమావేశమైన సెంట్రల్ బోర్డు.. పట్టణ ప్రాంత కోఆపరేటివ్ బ్యాంకులు, వాటితో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల్లో నిబంధనల అమలు తదితర అంశాలను సమీక్షించిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రియల్టీ సంస్థ హెచ్డీఐఎల్కు మొత్తం రూ. 6,226 కోట్ల మేర రుణాలిచ్చినప్పటికీ .. పీఎంసీ బ్యాంకు కేవలం రూ. 440 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు ఆర్బీఐకి చూపించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ బైటపడటంతో పీఎంసీ బ్యాంకు ఖాతాదారుల విత్డ్రాయల్స్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. -
దివాలా కోడ్కు మరిన్ని సవరణలు
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియను క్రమబద్ధీకరించే దిశగా దివాలా కోడ్ (ఐబీసీ)లో మరిన్ని సవరణలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీనితో పాటు ఇతరత్రా పలు ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలుపుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఐబీసీ సవరణలకు సంబంధించి.. దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేసిన బిడ్డర్లకు ఊరట లభించే ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రకారం ఆయా కంపెనీల గత ప్రమోటర్లు చేసిన తప్పిదాలకు కొత్త యాజమాన్యం.. క్రిమినల్ విచారణ ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. 2016లో అమల్లోకి వచ్చిన ఐబీసీకి ఇప్పటికే మూడు సార్లు సవరణలు చేశారు. తాజాగా కొన్ని సెక్షన్లను సవరించడంతో పాటు కొత్తగా మరో సెక్షన్ను చేర్చారు. ఐబీసీ (రెండో సవరణ) బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దర్యాప్తు సంస్థలు ఆయా కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడం కొనసాగిస్తున్నాయి. దీంతో దివాలా సంస్థల కొనుగోలుకు ఇన్వెస్టర్లు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా సవరణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్బీఎఫ్సీలకు బాసట.. సంక్షోభంలో ఉన్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు(ఎన్బీఎఫ్సీ), గృహ రుణ సంస్థలకు (హెచ్ఎఫ్సీ) ఊరటనిచ్చే స్కీమునకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ఆర్థికంగా బలంగా ఉన్న ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు సంబంధించిన అత్యధిక రేటింగ్ గల ఆస్తులను కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) ప్రభుత్వం పాక్షికంగా రుణ హామీ కల్పిస్తుంది. ఆయా అసెట్స్ విలువలో పది శాతం లేదా రూ. 10,000 కోట్ల దాకా (ఏది తక్కువైతే అది) నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఈ పూచీకత్తు ఉపయోగపడుతుంది. 2020 జూన్ దాకా ఆరు నెలల పాటు లేదా రూ. 1,00,000 కోట్ల అసెట్స్ కొనుగోలు పూర్తయ్యేదాకా ఈ స్కీము అమల్లో ఉంటుంది. అవసరమైతే దీన్ని మరో మూడు నెలల పాటు ఆర్థిక మంత్రి పొడిగించవచ్చు. ఎన్హెచ్ఏఐ ‘ఇన్విట్’... ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ఏర్పాటు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐకి అనుమతినిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఇది కూడా పలువురు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించి, ఇన్ఫ్రా అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు రాబడులు అందిస్తుంది. దాదాపు రూ. 5,35,000 కోట్ల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 24,800 కి.మీ. మేర రహదారులు అభివృద్ధి చేసే దిశగా 2017 అక్టోబర్లో కేంద్రం భారత్మాలా పరియోజన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఈ ప్రాజెక్టుల పూర్తికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయి. -
అలా ఎలా రుణాలిచ్చేశారు?
ముంబై: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) వివాదం... తాజాగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మెడకు కూడా చుట్టుకుంటోంది. తనఖా పెట్టిన షేర్ల గురించి పూర్తిగా మదింపు చేయకుండా అవి కార్వీకి ఎలా రుణాలిచ్చాయన్న అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. దీనికి సంబంధించి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై విచారణ జరపాలంటూ రిజర్వ్ బ్యాంక్కు సెబీ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్రమంగా క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నప్పుడే బ్యాంకులు అప్రమత్తం కావాల్సిందని సెబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కార్వీ తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించాలంటూ డిసెంబర్ 2న సెబీ ఆదేశించటంతో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) దాదాపు 90 శాతం మంది క్లయింట్లకు షేర్లను బదలాయించడం తెలిసిందే. అయితే, తమకు పూచీకత్తుగా ఉంచిన షేర్లను క్లయింట్లకెలా బదలాయిస్తారంటూ బ్యాంకులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ‘ఆ షేర్లపై కార్వీకే అధికారాల్లేనప్పుడు.. వాటిని తనఖా పెట్టుకుని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలెలా ఇచ్చాయి? వాటిని క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించొద్దంటూ ఎలా చెబుతాయి?‘ అని సెబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. షేర్లన్నింటికీ రిస్కు.. భారీ ఆస్తులను తనఖా పెట్టి స్వల్ప మొత్తంలో రుణాలు తీసుకుంటున్నప్పుడే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు అనుమానం రావాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. దాదాపు రూ.5,000 కోట్ల విలువ చేసే ప్రమోటర్ అసెట్స్కు ప్రతిగా కార్వీకి బ్యాంకులు రూ.1,200 కోట్లు రుణమిచ్చాయి. అలాగే రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి కార్వీ మరో రూ.600 కోట్లు రుణం తీసుకుంది. కార్వీ తీసుకున్న రుణాల్లో ఏ కొంచెం ఎగ్గొట్టినా.. ఇంత భారీ స్థాయిలో తనఖా పెట్టిన షేర్లన్నింటినీ బ్యాంకులు అమ్మేసే ప్రమాదం ఉంటుంది. పైపెచ్చు కార్వీ సొంత బ్యాలెన్స్ షీట్లో రూ.27 లక్షల విలువ చేసే షేర్లు మాత్రమే ఉండటం చూసైనా.. ఏదో పొరపాటు జరుగుతోందని బ్యాంకులు మేల్కొని ఉండాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కచ్చితంగా తప్పు చేశాయని ఇలాంటి ఉదంతాలు రుజువు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో పాటు బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు షేర్లను తనఖా పెట్టుకుని కార్వీకి దాదాపు రూ.1,800 కోట్ల మేర రుణాలిచ్చాయి. ఈవోడబ్ల్యూకీ సెబీ ఫిర్యాదు..? కార్వీ కేసుకు సంబంధించి ముంబై పోలీస్లో భాగమైన ఆర్థిక నేరాల విభాగానికి (ఈవోడబ్ల్యూ) కూడా సెబీ ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘కార్వీ కేసు కేవలం సెక్యూరిటీస్ చట్టానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది సివిల్ కేసు కూడా కనక సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్కు (శాట్) ఆదేశాలిచ్చే అధికారాల్లేవు. కాబట్టి క్లయింట్ల షేర్లను దొంగిలించిందంటూ కార్వీపై ఈవోడబ్ల్యూకి సెబీ ఫిర్యాదు చేయొచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్న ఇతర బ్రోకరేజీ సంస్థలపైనా సెబీ దృష్టి సారించింది. సెక్యూరిటీలను తనఖా పెట్టి రూ.50 కోట్ల పైగా రుణాలు తీసుకున్న సంస్థలు నాలుగే ఉన్నాయని, మిగతా సంస్థలన్నీ సొంత షేర్లనే పూచీకత్తుగా పెట్టాయని తేలినట్లు సమాచారం. -
మీ రుణం ‘బంగారం’ గాను..
ఎవరికైనా అత్యవసరంగా డబ్బులు అవసరం పడితే వెంటనే తెలిసిన వారి దగ్గర చేబదులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. పర్సనల్ లోన్కు వెళ్లాలంటే అందుకు కొన్ని రోజుల సమయం తీసుకుంటుంది. వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణం తెచ్చుకోవడం వల్ల ఆర్థికంగా ఎంతో భారం పడుతుంది. ఇటువంటి అవసరాల్లో అన్నింటికంటే మెరుగైన మార్గంగా బంగారంపై రుణాన్ని చెప్పుకోవాలి. గోల్డ్లోన్ ఇతర రుణాలతో పోలిస్తే ఎన్నో విధాలుగా సౌకర్యమైనదే కాదు, మన డబ్బును కొంత ఆదా చేస్తుంది. పర్సనల్ లోన్, ఇతర వ్యక్తిగత రుణాల్లో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది 12.75 శాతం నుంచి 19 శాతం వరకు ఉండొచ్చు. అదే గోల్డ్ లోన్స్పై వడ్డీ రేటు 12 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఇతర రుణాలతో పోలిస్తే ఈ విషయంలో గోల్డ్లోన్ చౌక అని చెప్పుకోవాలి. ఇతర రుణాలతో పోలిస్తే ఆ మేరకు ఆదా చేసుకోవచ్చు. కాకపోతే బంగారం విలువలో గరిష్టంగా ఎంత మేరకు రుణాన్ని తీసుకుంటున్నారు? అనే అంశమే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మణప్పురం సంస్థ బంగారం విలువలో 45 శాతం వరకు రుణం తీసుకుంటే కేవలం 12 శాతం రేటునే చార్జ్ చేస్తోంది. ఇంకాస్త అదనంగా కావాలనుకుంటే అప్పుడు 18 శాతం వడ్డీ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక బంగారం విలువలో 75 శాతం వరకు రుణం కోరుకుంటే అప్పుడు 24–26 శాతం వరకు వడ్డీ రాబడుతోంది. కనుక రుణం తీసుకునే వారు ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. తమవద్దనున్న బంగారం విలువలో సగానికి మించకుండా రుణం తీసుకుంటే అధిక వడ్డీ బాదుడు ఉండదు. గంటలోపే రుణం వ్యక్తిగత రుణం తీసుకోవాలని భావిస్తే అందుకు ఎంతలేదన్నా కనీసం రెండు మూడు రోజుల సమయం తీసుకుంటుంది. మధ్యలో సెలవు రోజు ఉంటే ఇంకా ఒకటి రెండు రోజుల అదనపు సమయం తీసుకోవచ్చు. కానీ, బంగారంపై రుణానికి ఇంత సమయం వేచి ఉండక్కర్లేదు. మీ వద్దనున్న బంగారం, ఆధార్ కార్డు, మీ చిరునామా వివరాలతో ఎన్బీఎఫ్సీ సంస్థను ఆశ్రయిస్తే అరగంట నుంచి గంటలోపే రుణంతో తిరిగి వెళ్లిపోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ అయినా మణప్పురం ఫైనాన్స్ అయినా గంటలోపే ప్రాసెస్ చేస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు పర్సనల్ లోన్పై కచ్చితంగా ప్రాసెస్ ఫీజు భరించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రుణం మొత్తంలో 1–2.5 శాతం వరకూ ఉండొచ్చు. గృహ, వాహన రుణాల్లోనూ ఈ చార్జీ తప్పదు. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండకపోవడం ఎంతో వెసులుబాటు. కొన్ని సందర్భాల్లో చార్జీ తీసుకున్నా, ఆ మొత్తం రూ.10–50 మధ్యే ఉంటోంది. క్రెడిట్ స్కోరు అవసరం లేదు బంగారంపై రుణం అన్నది సెక్యూర్డ్ లోన్. పర్సనల్ లోన్ అన్నది అన్సెక్యూర్డ్ లోన్. బంగారంపై రుణం ఎగవేతకు అవకాశాలు చాలా చాలా తక్కువ. రుణ గ్రహీత చెల్లింపులు చేయడంలో విఫలమైతే సంస్థ తనఖాగా ఉంచిన బంగారాన్ని విక్రయించి రుణం కింద సర్దుబాటు చేసుకుంటుంది. అందుకే దీన్ని సెక్యూర్డ్ లోన్ అంటారు. తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించడం ఇందువల్లే. ముఖ్యంగా ఇతర ఏ రుణానికైనా క్రెడిట్ స్కోరు చాలా కీలకం అవుతుంది. స్కోరు బాగాలేకపోతే దరఖాస్తును తిరస్కరించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ, బంగారంపై రుణానికి క్రెడిట్ స్కోరుతో పనిలేదు. తనఖాగా బంగారం ఉంచితే చాలు. ముందుగా రుణాన్ని తీర్చేయవచ్చు.. వ్యక్తిగత, వాహన, గృహ రుణాలను నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే తీర్చివేస్తే అందుకు కొంత మొత్తం చార్జీలను భరించాల్సి వస్తుంది. అదే బంగారంపై రుణాన్ని ఈ రోజు తీసుకుని రేపు తీర్చివేసినా ఎటువంటి చార్జీల్లేకపోవడం మరో సానుకూలత. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంటే.. మణప్పురం, ముత్తూట్ వంటి సంస్థలు పట్టణాలకే పరిమితం. బ్యాంకులు మండల స్థాయి వరకు విస్తరించాయి. కనుక పట్టణాలకు కొంచెం దూరంలో ఉండే గ్రామీణులకు.. సమీపంలో ఉండే బ్యాంకుల నుంచి గృహ రుణం తీసుకోవడం కొంచెం సౌకర్యంగా ఉండొచ్చు. ఇంటివద్దకే రుణం కావాలంటే.. రుపీక్ అనే స్టార్టప్ ఇంటి వద్దకే వచ్చి బంగారంపై రుణాన్ని ఆఫర్ చేస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాది వరకు కాల వ్యవధిపై రుణాలను ఇస్తోంది. వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే వడ్డీరేటును పెంచే చర్యలను అమలు చేయడం లేదు. పైగా ఆరు నెలలకు ఒకేసారి చెల్లించే సదుపాయాన్ని కూడా ఇస్తోంది. సేవల నాణ్యత బంగారంపై రుణం కోరుకునే వారు సేవల నాణ్యతను కూడా చూడాల్సిందే. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీల సేవలు కాస్త మెరుగ్గా ఉంటాయి. ముత్తూట్ వంటి సంస్థలు మొబైల్ అప్లికేషన్ ద్వారా రుణంపై వడ్డీ చెల్లింపులు, అసలు చెల్లింపు తదితర ఎన్నో సేవలను అందిస్తున్నాయి. ఆదాయంతో కూడా పనిలేదు రుణం కావాల్సిన వారిలో గృహిణులు, వితంతువులు, వృద్ధులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఉండొచ్చు. మరి రుణం కోసం ఆదాయ ధ్రువీకరణ చూపించడం అంటే వీరికి కష్టమే. పర్సనల్ లోన్, వాహన రుణం, గృహ రుణాలకు ఆదాయాన్ని (బ్యాంకు స్టేట్మెంట్, పేస్లిప్ తదితర) కూడా చూపించాలి. కానీ, బంగారంపై రుణానికి ఎటువంటి ఆదాయ ధ్రువీకరణలు కూడా అవసరం లేదు. వడ్డీ వరకే.. బంగారంపై రుణంలో ఉన్న మరో సాకర్యం.. కేవలం వడ్డీ మాత్రమే చెల్లించే అవకా శం ఇవ్వడం. ఉదాహరణకు బంగారాన్ని తనఖా గా ఉంచి రూ.లక్ష రుణాన్ని తీసుకున్నారనుకోం డి. 12 శాతం వడ్డీ రేటు ఆధారంగా ప్రతీ నెలా రూ.1,000 మొత్తాన్ని చెల్లిస్తూ వెళ్లొచ్చు. అసలు మొత్తాన్ని బంగారం విడిపించుకోవాలనుకునే సమయంలో చెల్లించేందుకు అవకాశం ఉంది. కాకపోతే గోల్డ్ లోన్ 3 నెలలు, 6 నెలల కాల వ్యవధితో ఉంటుంటాయి. లోన్ టర్మ్ అయిన తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. మణప్పురం, ముత్తూట్ వంటి ఎన్బీఎఫ్సీ సంస్థల్లో ఇలా ఉంటుంది. అదే బ్యాంకుల్లో అలా కాదు అసలు, వడ్డీతో కలసిన ఈఎంఐ మొత్తాన్ని ప్రతీ నెలా చెల్లిస్తూ వెళ్లాలి. ఒకవేళ విఫలమైతే చార్జీలు బాదేస్తాయి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే అవకాశం లేని వారికి ఇది ఇబ్బందే. అందుకే అటువంటి వారు ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకోవడం సౌకర్యం. కాల వ్యవధి బ్యాంకులు సాధారణంగా దీర్ఘకాలానికి అంటే – ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధికి బంగారం రుణాలను మంజూరు చేస్తుంటాయి. వ్యాపారానికి బంగారాన్ని తనఖాగా ఉంచి రుణా న్ని పొందే వారికి దీర్ఘకాలం అనుకూలం. కనుక అటువంటి వారికి బ్యాంకులే అనుకూలం. వీటిని గమనించాలి.. ► బంగారు ఆభరణాలు, బంగారం కాయిన్లపై బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. అయితే, మణప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ వంటి సంస్థలు బంగారు ఆభరణాలపైనే రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. బంగారం స్వచ్ఛత 18–24 క్యారెట్ల మధ్య ఉండాలి. ► చిరునామా, గుర్తింపు ధ్రువీకరణలు, ఇందులో ఆధార్ తప్పనిసరి, ఒక పాస్పోర్ట్ సైజు ఫొటో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ► ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి తీసుకున్న బంగారం రుణంపై అసలు తర్వాత చెల్లించినా కానీ, వడ్డీని 30 రోజులు మించకుండా చెల్లించేయాలి. లేదంటే వడ్డీపై వడ్డీ పడుతుంది. అంతేకాదు, 12 శాతం వడ్డీ రేటు తీసుకుని 30 రోజులు దాటినా వడ్డీని చెల్లించకపోతే అప్పుడు ఆ రేటు కాస్తా 18 శాతానికి పెరిగిపోతుంది. ► అసలు, వడ్డీ చెల్లింపుల్లో విఫలమైతే మూడు, ఆరు నెలల పాటు వేచి చూసి అప్పటికీ చెల్లించకపోతే.. ఆ తర్వాత సంస్థలు వేలానికి వెళ్లొచ్చు. ► మీ వద్ద రూ.లక్ష బంగారం ఉంటే రూ.లక్ష రుణంగా లభించదు. బంగారం విలువలో 60–75 శాతం వరకు రుణంగా (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) ఎన్బీఎఫ్సీలు ఇస్తున్నాయి. పెద్ద మొత్తంలో రుణం కోరుకుంటే అప్పుడు 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. అదే బ్యాంకులు అయితే బంగారం విలువలో 65 శాతానికే రుణాన్ని పరిమితం చేస్తున్నాయి. ► బ్యాంకులతో పోలిస్తే, సులభంగా, వేగంగా రుణం కోరుకుంటే గోల్డ్లోన్ కంపెనీలను ఆశ్రయించడమే మంచిది. కొన్ని బ్యాంకులు బంగారం రుణాలపైనా ప్రాసెసింగ్ చార్జీని రాబడుతున్నాయి. ► బంగారం రుణాలను టర్మ్ లోన్స్గానే బ్యాంకులు పరిగణిస్తున్నాయి. కనుక వడ్డీ, అసలు కలిపి వాయిదాలుగా చెల్లించాల్సి ఉంటుంది. ► బ్యాంకుల్లో బంగారం రుణాలపై వడ్డీ 14–18 శాతం మధ్య ఉంది. కానీ, ఎన్బీఎఫ్సీల్లో ఇది గరిష్టంగా 26 శాతం వరకు ఉండడం గమనార్హం. -
తొలి ఎన్బీఎఫ్సీ కమర్షియల్ పేపర్ల లిస్టింగ్
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ (ఎన్బీఎఫ్సీ) ఆదిత్య బిర్లా ఫైనాన్స్ (ఏబీఎఫ్ఎల్) తమ కమర్షియల్ పేపర్స్ను (సీపీ) స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్ట్ చేసింది. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయిన తొలి ఎన్బీఎఫ్సీగా నిలి్చంది. ఈ సీపీ ద్వారా ఏబీఎఫ్ఎల్ రూ. 100 కోట్లు సమీకరించింది. వీటి మెచ్యూరిటీ గడువు 2020 ఫిబ్రవరి 7గా ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన కమర్షియల్ పేపర్ల లిస్టింగ్కు తగిన విధానాలు రూపొందించాలంటూ స్టాక్ ఎక్సే్ఛంజీలకు నియంత్రణ సంస్థ సెబీ ఈ ఏడాది అక్టోబర్లో సూచించింది. సెబీ నిబంధనల ప్రకారం.. కనీసం రూ. 100 కోట్ల నికరవిలువ ఉన్న ఎన్బీఎఫ్సీలు, కంపెనీలకు లిస్టింగ్ అర్హత ఉంటుంది. -
ఆర్బీఐతో ఎన్బీఎఫ్సీ ఆస్తుల కొనుగోలు?
న్యూఢిల్లీ: తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) చేదోడుగా నిలవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్బీఎఫ్సీ రంగానికి చెందిన నాణ్యమైన ఆస్తులను (రుణాలు) ప్రభుత్వరంగ బ్యాంకులతో కొనుగోలు చేయించే దిశగా గతంలోనే ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా ఈ రంగానికి సంబంధించి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఆస్తులను (మొండి బకాయిలు) ఆర్బీఐతో కొనుగోలు చేయించే దిశగా కార్యాచరణపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. చర్చలు ఉన్నత స్థాయిలో మొదలయ్యాయని, 2008లో అమెరికా ప్రభుత్వం అనుసరించిన ట్రబుల్డ్ అస్సెట్ రిలీఫ్ ప్రొగ్రామ్ (సమస్యాత్మక ఆస్తులకు సంబంధించి ఉపశమనం కల్పించే కార్యక్రమం/టీఏఆర్పీ) తరహాలో ఇది ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అగ్ర స్థాయి 25 ఎన్బీఎఫ్సీ సంస్థల సమస్యాత్మక ఆస్తులను కొనుగోలు చేసే పథకంపై ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. ఆర్బీఐ మద్దతుతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ/ప్రత్యేక అవసరాల కోసం ఉద్దేశించిన వేదిక) లేదా విడిగా ఒక ఎస్పీవీని ఏర్పాటు చేసి, దానితో ఎన్బీఎఫ్సీ సంస్థల ఒత్తిడి రుణాలను కొనుగోలు చేయించాలన్నది ప్రభుత్వం ఆలోచన. తద్వారా ఎన్బీఎఫ్సీ రంగం ఇబ్బందులను తొలగించొచ్చని భావిస్తోంది. ‘‘చర్చలు మొదలయ్యాయి. చిన్నపాటి టీఏఆర్పీ తరహా కార్యక్రమంపై ఇప్పటికే ఆర్బీఐతో పలు విడతల పాటు చర్చలు జరిగాయి’’ అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఆ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో జరిగినట్లే.... 2008 లెహమాన్ సంక్షోభ సమయంలో అమెరికా కేంద్ర బ్యాంకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ టీఏఆర్పీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆరి్థక సంస్థల వద్దనున్న సమస్యాత్మక రుణ ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆరి్థక రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇదే విధంగా మన దేశంలోనూ ఎన్బీఎఫ్సీ సంస్థల నుంచి ఒత్తిడిలోని రుణాలను ఆర్బీఐతో కొనుగోలు చేయించాలన్నది కేంద్రం ప్రయత్నంగా తెలుస్తోంది. అయితే, తన బ్యాలన్స్ షీటులోని నిధులతో ఎన్బీఎఫ్సీ సమస్యాత్మక రుణ ఆస్తులను కొనుగోలు చేయించే ఆలోచనను ఆర్బీఐ వ్యతిరేకించినట్టు ఓ అధికారి తెలిపారు. అయినప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొ న్నారు. ఎన్బీఎఫ్సీ రంగానికి కేంద్రం ఇప్పటికే పలు విధాలుగా సహకారం అందించింది. ప్రభుత్వరంగ బ్యాంకులతో రూ.21,850 కోట్ల విలువైన ఎన్బీఎఫ్సీ రుణ ఆస్తులను అక్టోబర్ 16 నాటికి కొనుగోలు చేయించింది. అలాగే, నేషనల్ హౌసింగ్ బ్యాంకు రూ.30,000 కోట్ల వరకు అదనంగా ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల సాయాన్ని పెంచింది. -
మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి ముత్తూట్ ఫైనాన్స్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) ముత్తూట్ ఫైనాన్స్ కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రూ.215 కోట్లతో ఐడీబీఐ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఐడీబీఐ ఏఎంసీ), ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ట్రస్టీ కంపెనీలో నూరు శాతం ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఈ డీల్కు సెబీ తదితర నియంత్రణ సంస్థల ఆమోదం అవసరమని, వచ్చే ఫిబ్రవరి నాటికి కొనుగోలు పూర్తవుతుందని పేర్కొంది. ఐడీబీఐ ఏఎంసీ 2010లో ఏర్పాటు కాగా, రూ.5,300 కోట్ల పెట్టుబడులు నిర్వహణలో ఉన్నాయి. -
అక్టోబర్లో రుణాల పంపిణీ రూ.2.5 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: పండుగ సీజన్లో భాగంగా అక్టోబర్లో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీలు) రూ.2.5 లక్షల కోట్ల రుణాలను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. నిదానించిన ఆర్థిక వ్యవస్థకు, వినియోగానికి ప్రేరణనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు.. పీఎస్బీలు దసరా, దీపావళి పండుగల సమయంలో 374 జిల్లాల పరిధిలో రుణ మేళాలను నిర్వహించిన విషయం గమనార్హం. ‘‘ఈ సందర్భంగా పీఎస్బీలు రూ.2,52,589 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. ఇందులో రూ.1,05,599 కోట్లు నూతన టర్మ్ రుణాలు కాగా, రూ.46,800 కోట్లు మూలధన రుణాలు’’అని కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీలు) కూడా రూ.19,627 కోట్లను సమకూర్చాయి. బ్యాంకుల వద్ద పుష్కలంగా నిధులు ఉన్నాయని, రుణ డిమాండ్లను అవి తీర్చే స్థితిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్కుమార్ పేర్కొన్నారు. అక్టోబర్లో ఎవరికి ఎంత మేర.. ♦ కార్పొరేట్లకు రూ.1.22 లక్షల కోట్ల రుణాలు ♦ వ్యవసాయ రుణాలు రూ.40,504 కోట్లు ♦ ఎంఎస్ఎంఈ రంగానికి రూ.37,210 కోట్లు ♦ గృహ రుణాలు రూ.12,166 కోట్లు ♦ వాహన రుణాలు రూ.7,058 కోట్లు ♦ ఎన్బీఎఫ్సీ రంగానికి రూ.19,627 కోట్లు -
‛దివాన్’..దివాలా!
ముంబై: తీవ్రమైన రుణ సంక్షోభంలో చిక్కుకున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్(డీహెచ్ఎఫ్ఎల్)పై ఆర్బీఐ కొరడా ఝళిపించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డును రద్దు చేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు మాజీ ఎండీ ఆర్ సుబ్రమణియకుమార్ను పాలనాధికారిగా (అడ్మినిస్ట్రేటర్) నియమించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో డీహెచ్ఎఫ్ఎల్ దివాలా పరిష్కార ప్రణాళిక త్వరలోనే ప్రారంభమవుతుందని ఆర్బీఐ ప్రకటించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన సమస్యాత్మక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను (హెచ్ఎఫ్సీలు) దివాలా చట్టం (ఐబీసీ) కింద పరిష్కార చర్యల కోసం ఎన్సీఎల్టీకి ప్రతిపాదించే అధికారాన్ని ఆర్బీఐకి కట్టబెడుతూ కేంద్ర సర్కారు గత వారమే నిర్ణయం తీసుకుంది. వెనువెంటనే డీహెచ్ఎఫ్ఎల్ విషయంలో ఆర్బీఐ తన అధికారాల అమలును ఆరంభించింది. దీంతో దివాలా చర్యల పరిష్కారానికి వెళ్లనున్న తొలి ఎన్బీఎఫ్సీ/హెచ్ఎఫ్సీ డీహెచ్ఎఫ్ఎల్ కానుంది. ‘‘బ్యాంకు రుణాలు, మార్కెట్ రుణాలకు చెల్లింపుల్లో డీహెచ్ఎఫ్ఎల్ విఫలమైంది. కంపెనీ నిర్వహణ తీరుపై ఇది తీవ్ర ఆందోళనలను కలిగిస్తోంది. అందుకే డీహెచ్ఎఫ్ఎల్ బోర్డును రద్దు చేయడమైంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద డీహెచ్ఎఫ్కు పరిష్కారం కోసం త్వరలోనే చర్యలను ప్రారంభిస్తాం’’ అని ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది. 2019 జూలై నాటికి బ్యాంకులు, నేషనల్ హౌసింగ్ బోర్డ్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్ హోల్డర్స్కు రూ.88,873 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.74,054 కోట్లు సెక్యూర్డ్ కాగా, రూ.9,818 కోట్లు అన్సెక్యూర్డ్ రుణాలు. వీటిలో బ్యాంకులకు చెల్లించాల్సినది రూ. 38,342 కోట్లుగా అంచనా. ఒక్క ఎస్బీఐకే రూ.10,000 కోట్ల మేర డీహెచ్ఎఫ్ఎల్ బకాయి పడింది. చాలా బ్యాంకులు డీహెచ్ఎఫ్ఎల్ రుణ ఆస్తులను నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు)గా గుర్తించడంతోపాటు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని ఈ పనిని మొదలు పెట్టాయి. ఆల్టికో సైతం.. ఆల్టికో క్యాపిటల్, రెలిగేర్ ఫిన్వెస్ట్లను సైతం దివాలా పరిష్కార చర్యలకు ప్రతిపాదించాలని ఆర్బీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం. కానీ, దీనిపై ప్రకటనేమీ వెలువడలేదు. ఆల్టికో రుణ భారం 2019 మార్చికి రూ.5,319 కోట్లు. మాష్రెక్ బ్యాం కుకు రూ.347 కోట్ల అసలు, రూ.19.97 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలూ చేరొచ్చు: త్యాగి ఐబీసీ కింద పరిష్కారంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలూ భాగం కావొచ్చని సెబీ చైర్మన్ అజయ్త్యాగి పేర్కొన్నారు. ‘‘ఐబీసీ కింద మ్యూచువల్ ఫండ్స్ను కూడా రుణదాతలుగా పరిగణించడం జరుగుతుంది. ఈ విషయంలో ఇంతకుమించి చెప్పేదేమీ లేదు’’ అని త్యాగి అన్నారు. అందలం నుంచి పాతాళానికి... హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ అయిన డీహెచ్ఎఫ్ఎల్ను రాజేష్ కుమార్ వాధ్వాన్ 1984లో ప్రారంభించారు. అల్పాదాయ, మధ్యతరగతి వర్గాలకు గృహ రుణాలిచ్చే ఉద్దేశంతో ఇది ఏర్పాటైంది. దివాన్ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్గాను, ఆ తర్వాత దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్గాను పేర్లు మార్చుకుంది. దేశీయంగా 50 భారీ ఆర్థిక సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ఏకంగా రూ. 31,000 కోట్లను డొల్ల కంపెనీ ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ మళ్లించిందంటూ కోబ్రాపోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది. అయితే, జూన్లో జరపాల్సిన రుణ చెల్లింపు విషయంలో డిఫాల్ట్ కావడంతో సంస్థపై సందేహాలు తలెత్తాయి. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కంపెనీలో అవకతవకలు ఒక్కొక్కటిగా బయటికొచ్చాయి. కేంద్రం ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. ఇప్పుడు ఆర్బీఐ కంపెనీని తన గుప్పిట్లోకి తీసుకొని దివాలా ప్రక్రియను ప్రారంభించనుండటంతో డీహెచ్ఎఫ్ఎల్ కథ ముగిసినట్లేనన్నది పరిశీలకుల అభిపారయం. ఎప్పుడేం జరిగిందంటే... ► 2018 సెప్టెంబర్ 21: డీహెచ్ఎఫ్ఎల్ జారీ చేసిన డెట్ పేపర్లు రూ.300 కోట్ల విలువైన వాటిని సెకండరీ మార్కెట్లో డీఎస్పీ మ్యూచువల్ ఫండ్ విక్రయించింది. డీహెచ్ఎఫ్ఎల్ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న ఆరోపణలు వచ్చాయి. ► 2019 జనవరి 29: డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు వారికి సంబంధించిన షెల్ కంపెనీలకు రుణాలు ఇవ్వగా, ఆ నిధులను దేశీయంగా, విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు ప్రమోటర్లు వినియోగించినట్టు ఆన్లైన్ పోర్టల్ ‘కోబ్రాపోస్ట్’ సంచలనాత్మ క కథనాన్ని ప్రచురించింది. యథావిధిగా దీన్ని సైతం కంపెనీ ఖండించింది. ► జనవరి 30: కోబ్రాపోస్ట్ ఆరోపణలు అవాస్తవం, హానికారకమని డీహెచ్ఎఫ్ఎల్ ప్రకటించింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారన్న ఆరోపణలను కొట్టిపడేసింది. ► జనవరి 31: డీహెచ్ఎఫ్ఎల్కు సంబంధించిన ఆరోపణలపై విచారణ మొదలు పెట్టిన కార్పొరేట్ శాఖ. ► ఫిబ్రవరి 4: కంపెనీకి చెందిన కొన్ని ఆస్తులను విక్రయించడం ద్వారా నిధుల లభ్యతను పెంచుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ► ఫిబ్రవరి 11: కొన్ని ఖాతాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ. ► ఫిబ్రవరి 13: కంపెనీ సీఈవో హర్షిల్ మెహతా రాజీనామా ► మార్చి 7: డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన డెట్ ఇన్స్ట్రుమెంట్ల రేటింగ్ ను ఏజెన్సీలు డౌన్గ్రేడ్ చేయడంతో షేరు ధర మరింత క్షీణత. ► మే 21: ఫిక్స్డ్ డిపాజిట్ల స్వీకరణ, రెన్యువల్ను డీహెచ్ఎఫ్ఎల్ నిలిపివేసింది. అప్పటికే ఉన్న డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకోవడాన్ని కూడా నిలిపివేసింది. ► జూన్ 4: రూ.960 కోట్ల మేర బాండ్లపై వడ్డీ చెల్లింపులు, బాండ్ల చెల్లింపుల్లో విఫలమైంది. ► జూన్ 5: ఇక్రా, క్రిసిల్, కేర్, బ్రిక్వర్క్ రేటింగ్స్ సంస్థలు డీహెచ్ఎఫ్ఎల్కు చెందిన కమర్షియల్ పేపర్ల రేటింగ్ను డీ (డిఫాల్ట్) రేటింగ్కు తగ్గించేశాయి. ► జూన్ 7: 750 కోట్ల కమర్షియల్ పేపర్లకు చెల్లింపుల్లో విఫలం. ► అక్టోబర్ 10: అన్సెక్యూర్డ్ క్రెడిటర్లు, డిపాజిట్ హోల్డర్లకు డీహెచ్ఎఫ్ఎల్ చెల్లింపులు చేయకుండా బాంబే హైకోర్టు ఆదేశాలు. ► నవంబర్ 1: నిధుల దారి మళ్లింపునకు ఆధారాలు ఉండడంతో తీవ్ర నేరాల దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు కార్పొరేట్ శాఖ ఆదేశం. అప్పుడు 692... ఇప్పుడు 20 కుప్పకూలిన షేరు ధర... డీహెచ్ఎఫ్ఎల్ సంక్షోభంతో కంపెనీ షేరు ధర కుప్పకూలింది. గతేడాది సెప్టెంబర్లో ఆల్టైం గరిష్ట స్థాయి రూ. 692ని తాకింది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ 30న కనిష్ట స్థాయి రూ. 15కి పడిపోయింది. బీఎస్ఈలో బుధవారం సుమారు 4% క్షీణించి రూ. 20 వద్ద ముగిసింది. -
నేటి నుంచే రుణ మేళాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రకటించిన రుణ మేళా కార్యక్రమాలు గురువారం నుంచి దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో ప్రారంభమవుతాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థలతో కలసి వీటిని నిర్వహిస్తాయి. రిటైల్ కస్టమర్లతోపాటు వ్యాపారస్థులకు కూడా రుణాలను అప్పటికప్పుడు మంజూరు చేయడమే వీటి నిర్వహణ ఉద్దేశ్యం. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, వ్యవసాయ రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) వ్యాపార పరమైన రుణాలను బ్యాంకులు అందించనున్నాయి. ముఖ్యమైన పండుగల సమయంలో రుణాల మంజూరీని పెంచడం ద్వారా నిదానించిన డిమాండ్ను, ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ప్రభుత్వరంగ బ్యాంకులను రుణ మేళాలు నిర్వహించాలని కోరింది. దీంతో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో రుణమేళాల నిర్వహణకు ప్రభుత్వరంగ బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత ఇందులో పాలు పంచుకునేందుకు ప్రైవేటు బ్యాంకులు కూడా ఆసక్తి తెలిపాయి. 48 జిల్లాల్లో ఎస్బీఐ... ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంకు ఆఫ్ బరోడా(బీవోబీ), కార్పొరేషన్ బ్యాంకులు పండుగల సమయంలో రుణాల డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా 48 జిల్లాల్లో ఎస్బీఐ లీడ్ బ్యాంకర్గా ముందుండి నడిపించనుంది. 17 జిల్లాల్లో బీవోబీ లీడ్బ్యాంకర్గా వ్యవహరించనుంది. ఇదే సమయంలో బరోడా కిసాన్ పఖ్వాడా పేరుతో వ్యవసాయ రుణాల మంజూరీపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్టు బీవోబీ ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకు సేవలు కస్టమర్లకు మరింత చేరువ కానున్నాయి. తొలి దశలో రుణ మేళాలు జరిగే 250 జిల్లాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను బ్యాంకులు చేపట్టనున్నాయి. స్థానిక వర్తకుల ద్వారా రుణ మేళాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయనున్నట్టు ఓ బ్యాంకర్ తెలిపారు. ఇక రెండో దశ కింద దేశవ్యాప్తంగా మరో 150 జిల్లాల్లో రుణ మేళాలు ఈ నెల 21 నుంచి 25 వరకు జరుగుతాయి. -
ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం...
న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎంఎస్ఎంఈ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ/హెచ్ఎఫ్సీ ఇలా ఎన్నో రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇవి ఉన్నాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్చార్జీని భారీగా పెంచుతూ గత బడ్జెట్లో చేసిన ప్రకటన దేశ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా నష్టపరిచింది. దీంతో సర్చార్జీ పెంపును తొలగించాలన్న ఎఫ్పీఐల డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గింది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్చార్జీ అదనపు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పరిశ్రమలకు చౌకగా మూలధన నిధుల రుణాలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల(హెచ్ఎఫ్సీ)కు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్హెచ్బీ) నుంచి అదనంగా రూ.20,000 కోట్ల నిధుల మద్దతు (మొత్తం రూ.30,000 కోట్లు అవుతుంది), సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు నిధుల కొరత సమస్య తీర్చేందుకు గాను వారికి జీఎస్టీ రిఫండ్లను 30 రోజుల్లోనే చేసేయడం, ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయం, ఇన్ఫ్రా, హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల లభ్యత పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు సవరణను 2020 జూన్ వరకు వాయిదా వేయడం, రిజిస్టర్డ్ స్టార్టప్లపై ఏంజెల్ట్యాక్స్ రద్దు, సహా ఎన్నో నిర్ణయాలు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లపై సర్చార్జీ భారం తొలగింపు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం మన్నించింది. రూ.2–5 కోట్ల మధ్య ఆదాయంపై సర్చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల పైన ఆదాయం కలిగిన వారిపై సర్చార్జీని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి అదనంగా ఆర్థిక రంగ పునరుత్తేజానికి ఎటువంటి చర్యల్లేకపోవడంతో... నాటి నుంచి ఎఫ్పీఐలు మన మార్కెట్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.25,000 కోట్ల వరకు నిధులను వెనక్కి తీసుకున్నారు. సర్చార్జీ పెంపును ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా కేంద్రాన్ని డిమాండ్ కూడా చేశారు. ‘‘క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఫైనాన్స్ యాక్ట్ 2019 ద్వారా స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై విధించిన సర్చార్జీ పెంపును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల మేర ఆశించిన ఆదాయం రాకుండా పోతుంది. సర్చార్జీ ఉపసంహరణ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందరికీ వర్తిస్తుంది. స్టార్టప్లకు ఊరట రిజిస్టర్డ్ స్టార్టప్లకు ఏంజెల్ ట్యాక్స్ నుంచి ఉపశమనం కల్పించడం ప్రభు త్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. ‘‘స్టార్టప్లు, వాటిల్లో ఇన్వెస్ట్ చేసే వారు ఎదుర్కొంటున్న నిజమైన ఇబ్బందులను తొలగించేందుకు గాను, డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్లకు ఆదాయపన్ను చట్టంలోని 56(2)(7బీ)ను అమలు చేయరాదని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి వెల్లడించారు. ఆదాయపన్ను సర్చార్జీ పెంపు, ఏంజెల్ ట్యాక్స్ రద్దును నిపుణులు స్వాగతించారు. క్యాపిటల్ మార్కెట్లకు ఇవి జోష్నిస్తాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రాజేష్ గాంధీ అభిప్రాయపడ్డారు. రుణాలు ఇక చౌక! గృహ, వాహన, వినియోగ రుణాలు చౌకగా మా రనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ రేట్ల కోతను బ్యాంకులు ఎంసీఎల్ఆర్ విధానంలో రుణ గ్రహీతలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెపో రేటు, ఎక్స్టర్నల్ బెంచ్మార్క్తో అనుసంధానమైన రుణ ఉత్పత్తులను బ్యాంకులు ప్రారంభిస్తాయని, ఫలితంగా గృహ, వాహన, ఇతర రిటైల్ రుణాల ఈఎంఐలు తగ్గుతాయని పేర్కొన్నారు. అలాగే, వ్యవస్థలో రుణ వితరణను పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు చెప్పారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో రూ.5 లక్షల కోట్ల వరకు అదనపు లిక్విడిటీ, రుణ వితరణ సాధ్యపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇక రుణాల వితరణ ప్రక్రియను మరింత సులభంగా మార్చేందుకు పీఎంఎల్ఏ, ఆధార్ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేయనుంది. రుణాలను తీర్చేసిన 15 రోజుల్లోపు వాటి డాక్యుమెంట్లను రుణ గ్రహీతలకు ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం ఇకపై తప్పనిసరి. దీనివల్ల కస్టమర్లు బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పిపోతాయి. ఎన్బీఎఫ్సీలకు నిధుల మద్దతు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్సీలు) అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్హెచ్బీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎఫ్సీలకు లోగడ ఎన్హెచ్బీ ప్రకటించిన రూ.10,000 కోట్లకు ఇది అదనపు సాయం. దీనివల్ల హౌసింగ్ రంగానికి నిధుల వితరణ పెరగనుంది. ఆధార్ ఆధారిత కేవైసీని వినియోగించేందుకు ఎన్బీఎఫ్సీలను అనుమతించనున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఆస్తులను బ్యాంకులు కొనుగోలు చేసేందుకు పాక్షిక క్రెడిట్ స్కీమ్ను ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించగా, ప్రతీ బ్యాంకు స్థాయిలో దీనిపై అత్యున్నత స్థాయిలో సమీక్ష చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మన దగ్గరే వృద్ధి వేగం... అంతర్జాతీయంగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థతో పోల్చి చూసినా భారత జీడీపీయే వేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి అంచనాలను 3.2 శాతానికి సవరించే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సగటు కంటే భారత ఆర్థిక రంగం వృద్ధి వేగంగా ఉందన్నారు. ఆటో రంగానికి ఉద్దీపనలు దేశంలో వాహన విక్రయాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ రంగానికి ఉద్దీపనం కల్పించే నిర్ణయాలను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వన్టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజును వాయిదా వేసింది. ప్రభుత్వ విభాగాలు పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలన్న డిమాండ్ను మాత్రం పట్టించుకున్నట్టు లేదు. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్–6 వాహనాలనే కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా బీఎస్–4 వాహనాల నిల్వలు పెరిగిపోతుండడం, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో... 2020 మార్చి 31 వరకు కొనుగోలు చేసే వాహనాలను వాటి రిజిస్ట్రేషన్ గడువు వరకు రోడ్లపై తిరిగేందుకు అనుమతించనున్నట్టు మంత్రి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటర్నల్ కంబస్టన్ వాహనాలకూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆటో రంగంలో ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలకు గండి పడినట్టు నివేదికలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. మార్చి వరకు కొనుగోలు చేసే వాహనాలపై తరుగుదలను 15 శాతానికి బదులు 30 శాతానికి పెంచుతున్నట్టు మంత్రి చెప్పారు. వాహనాలను తుక్కుగా మార్చడం సహా పలు చర్యలను పరిశీలించనున్నట్టు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు వేగంగా రిఫండ్లు ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ రిఫండ్లను ప్రభుత్వం ఇకపై 30 రోజుల్లోపు చెల్లించనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ సంబంధిత బకాయిలు అన్ని వేళలా సగటున రూ.7,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. జీఎస్టీ బకాయిలను 30రోజుల్లోపు పూర్తి చేయడం అన్నది ఎంఎస్ఎంఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని, అంతిమంగా ఉపాధి అవకాశాల పెంపునకు దారితీస్తుందని ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఎంఎస్ఎంఈలకు ఒకటే నిర్వచనం ఇచ్చే దిశగా చట్ట సవరణను పరిశీలించనున్నట్టు చెప్పారు. మరిన్ని ముఖ్యాంశాలు... ► రూ.100 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల రంగంపై వెచ్చించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... ఇన్ఫ్రా ప్రాజెక్టులను షార్ట్లిస్ట్ చేసేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ టాస్క్ ఫోర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ► అలాగే, మౌలికరంగ, హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల వితరణ పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయనుంది. ► కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనలను ఉల్లంఘించడాన్ని నేరపూరిత చర్యగా పరిగణించబోమని, సివిల్ లయబులిటీగానే చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. సంపద సృష్టికర్తలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. ► ఆదాయపన్ను శాఖ నుంచి ఆదేశాలు, నోటీసుల జారీకి కేంద్రీకృత వ్యవస్థ. ► స్టార్టప్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సీబీడీటీలో సెల్ ఏర్పాటు. భారతీయ కంపెనీలను కాపాడాలి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంపిటిషన్ కమీషన్ సన్నద్ధం కావాలని మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. మారిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ సంస్థల నుంచి పోటీ పరంగా భారత కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ శాఖ వ్యవహరాలనూ కూడా మంత్రి నిర్మలా సీతారామనే చూస్తున్నారు. సీసీఐ పదో వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ... పోటీ పరంగా దేశీయ మార్కెట్పై అంతర్జాతీయ సంస్థల ప్రభావాన్ని తెలుసుకునేందుకు సీసీఐ స్వచ్చందంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. భారతీయ వినియోగదారులను, భారత కంపెనీలను పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఊతమిస్తాయి... ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు విశ్వాసాన్ని పెంచి, ఆర్థిక రంగంలో సహజ స్ఫూర్తి ఫరిడవిల్లేలా చేస్తాయని దేశీయ పరిశ్రమలు అభిప్రాయపడ్డాయి. ఆటో రంగం టర్న్ అరౌండ్ అయ్యేందుకు తోడ్పడుతుందని పరిశ్రమ పేర్కొంది. ఎఫ్పీఐలు, దేశీయ ఇన్వెస్టర్ల లాభాలపై సర్చార్జీని తొలగించడం కీలకమైన ప్రకటన. ఇది తిరిగి ఉత్సాహాన్ని పాదుకొల్పుతుంది. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్ అద్బుతమైన ప్యాకేజీ. ఆర్థిక రంగాన్ని తదుపరి దశకు తీసుకెళుతుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ మందగమనం సంకేతాలను ఇస్తున్న ఆర్థిక రంగ పునరుత్తేజానికి ప్రభుత్వ చర్యలు ఎంతో మేలు చేస్తాయి. వ్యాపారాలు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఈ చర్యలు తప్పకుండా నిలబెడతాయి. – సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్. ప్రభుత్వ ప్యాకేజీ మొత్తం మీద ఆర్థిక రంగానికి భారీగా మేలు చేస్తుంది. ఎందుకం టే ఇది వాస్తవంగా నిర్వహణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. రాష్ట్రాలు సైతం తమవంతుగా రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించేందుకు ముందుకు రావాలి. – భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ప్రభుత్వ చర్యలు ఆటో పరిశ్రమకు తక్షణ ఉపశమనాన్నిస్తాయి. – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఆటో రంగానికి తోడ్పాటునివ్వడంతోపాటు స్పష్టమైన రోడ్ మ్యాప్నకు వీలు కల్పిస్తాయి. ఈ నిర్ణయాలు అమలైతే వృద్ధికి, ఆటో రంగంలో డిమాండ్కు దారితీస్తాయి. – మార్టిన్ ష్యూవెంక్, మెర్సెడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్కెట్లకు ఉద్దీపనల ప్యాకేజీ మేలు చేస్తుంది. ఎఫ్ఫీఐలపై సర్చార్జీని తొలగించడం తిరిగి విదేశీ నిధులు మన మార్కెట్ల వైపు వచ్చేలా చేస్తుంది. పండుగల సీజన్కు ముందు ఈ ఉద్దీపనల ప్యాకేజీ ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. – గౌతం ష్రాఫ్, ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ కోహెడ్ -
ఆర్బీఐ ప్రతిపాదనలపై ఫిచ్ హెచ్చరిక
సాక్షి, ముంబై : బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), రిటైల్ రుణ గ్రహీతలకు బ్యాంకులు మరిన్ని రుణాలు పంపిణీ చేసే దిశగా ఆర్బీఐ ఇటీవల తీసుకున్న పలు చర్యలు అంతిమంగా బ్యాంకింగ్ రంగానికి సమస్యలు తెచ్చిపెట్టేలా ఉన్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. గతేడాది ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంక్షోభం బారిన పడిన తర్వాత నుంచి ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో... ఈ రంగానికి ఉపశమనం కల్పించే పలు నిర్ణయాలను ఆర్బీఐ ఎంపీసీ ఈ నెల మొదటి వారంలో ప్రకటించింది. ఇందులో బ్యాంకుల టైర్1 మూలధనంలో 15 శాతం వరకు ఒక ఎన్బీఎఫ్సీ సంస్థకు నిధులు సమకూర్చవచ్చన్న పరిమితిని 20 శాతానికి పెంచింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలకు ఎన్బీఎఫ్సీ ఇచ్చే రుణాలను ప్రాధాన్యం రంగ రుణాలుగా పరిగణించడం, కన్జ్యూమర్ రుణాల రిస్క్ వెయిటేజీని 125 శాతం నుంచి 100 శాతానికి తగ్గించడం జరిగింది. మందగమన సంకేతాల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలోకి రుణ వితరణ పెరిగేలా చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఫిచ్ అభివర్ణించింది. అయితే, ఇలా అధికంగా రుణాలు మంజూరు చేయడం చివరకు బ్యాంకులకు ముప్పుగా పరిణమిస్తుందని, బ్యాంకులు అధిక క్రెడిట్ రిస్కును అంగీకరించాల్సి వస్తుందని ఫిచ్ తెలిపింది. అంతర్జాతీయంగా ఎన్బీఎఫ్సీలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానతకు చెక్ పెట్టాలన్న ప్రయత్నాలకు, భారత్లో తాజా చర్యలు వైరుధ్యంగా ఉన్నట్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల ఎన్బీఎఫ్సీల సమస్యలు బ్యాంకులకు కూడా పాకుతాయని హెచ్చరించింది. -
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్..
న్యూఢిల్లీ: మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసానిచ్చారు. ఎకానమీకి తోడ్పాటునిచ్చే చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఆమె చెప్పారు. శుక్రవారం జరిగిన పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘ఎకానమీకి ఊతమిచ్చే చర్యలు తీసుకునే విషయంలో రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో ఉన్నాయి‘ అని ఆమె తెలిపారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య సుహృద్భావ వాతావరణమే ఉందన్నారు. పరిశ్రమ వర్గాలకు పరిస్థితులను కఠినతరం చేయాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సూచనగా నిలిచే కీలక రంగాల వృద్ధి గణాంకాలు, ఆటోమొబైల్ తదితర రంగాల పనితీరు నానాటికి దిగజారుతుండటంతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ) పలు సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నామని, రాబోయే వారాల్లో పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాస్త మందగించినా భారత్ .. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని ఈ సందర్భంగా సీతారామన్ చెప్పారు. సీఎస్ఆర్పై భరోసా.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత మొత్తం కేటాయించకపోతే తీసుకునే కఠిన చర్యలను ప్రభుత్వం మరోసారి సమీక్షిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఎవరిపైనా క్రిమినల్ కేసులు పెట్టాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదు‘ అని ఆమె స్పష్టం చేశారు. ఆదాయ పన్ను శాఖపరమైన వేధింపుల ఆరోపణల గురించి తెలుసుకునేందుకు వచ్చే వారం నుంచి పరిశ్రమ వర్గాలతో సమావేశం కానున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఆమె వివరించారు. ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు కూడా తీసుకోనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. అప్పటికప్పుడు పన్ను అధికారులకు ఆయా అంశాలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. పన్నులపరమైన వేధింపు ఉదంతాలను స్వయంగా తానే పరిశీలించేందుకు వీలుగా టెక్నాలజీ ఆధారిత ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇక కార్పొరేట్ ట్యాక్స్ను తగ్గించాలని ప్రభుత్వానికి కూడా ఉందని, అయితే.. కార్పొరేట్లు ఇందుకోసం కొంత ఓపిక పట్టాల్సి ఉంటుందని ఆమె వివరించారు. మరోవైపు, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి కార్పొరేట్లు, సరఫరాదారులకు రావాల్సిన బకాయిల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు మంత్రి చెప్పారు. చిన్న, మధ్యతరహా సంస్థలకు రావాల్సిన బకాయిలు ఏకంగా రూ. 48,000 కోట్ల మేర ఉంటాయని అంచనా. పన్ను ఊరట కల్పించండి: ఎఫ్పీఐల వినతి అధిక ఆదాయవర్గాలపై అదనపు సర్చార్జీలు తదితర అంశాలతో ఆందోళన చెందుతున్న మార్కెట్ వర్గాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. అదనపు సర్చార్జీ నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐ) మినహాయింపునివ్వాలని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) సమీక్షించాలని, దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)ని పూర్తిగా ఎత్తివేయడం లేదా కనీసం తగ్గించడమైనా చేయాలని కోరుతూ డిమాండ్ల చిట్టాను మంత్రికి అందజేశారు. గోల్డ్మన్ శాక్స్, నొమురా, బ్లాక్రాక్, సీఎల్ఎస్ఏ, బార్క్లేస్, జేపీ మోర్గాన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎఫ్పీఐల అభిప్రాయాలను మంత్రి సావధానంగా విన్నారని.. అయితే ఎటువంటి హామీ మాత్రం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 2 కోట్ల పైగా ఆదాయం ఉన్న వారికి వర్తించే పన్నులతో పాటు అదనపు సర్చార్జీ కూడా విధించాలని బడ్జెట్లో చేసిన ప్రతిపాదనతో ఆందోళన చెందుతున్న ఎఫ్పీఐలు స్టాక్మార్కెట్లలో భారీగా విక్రయాలు జరపడం, మార్కెట్లు భారీగా పడటం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రితో ఎఫ్పీఐల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నిధుల అవసరాల కోసం ఎన్బీఎఫ్సీలు కేవలం బ్యాంకులపైనే ఆధారపడకుండా ఇతరత్రా సాధనాలూ పరిశీలించాలని, అలాగే ఈ రంగానికి కూడా నేషనల్ హౌసింగ్ బోర్డు (ఎన్హెచ్బీ) తరహాలో ప్రత్యేక నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవ సరం ఉందని ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ రామన్ అగర్వాల్ చెప్పారు. -
విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలుస్తున్న వినియోగ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులను చవిచూస్తోంది. దేశీయ వినియోగం, ఉత్పాదకతపైనే ఎక్కువగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి క్షీణతను చవిచూస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి కొలువు దీరిన ఎన్డీయే సర్కారు కుంగిన ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించే చర్యలు చేపడుతుందన్న ఆకాంక్షలు బలంగా ఉండగా, బడ్జెట్ తర్వాత నిరాశ చెందాల్సి వచ్చింది. ముఖ్యంగా వ్యవస్థలో నిధుల లభ్యత పడిపోవడం, ఎన్బీఎఫ్సీ రంగం సంక్షోభం వినియోగాన్ని దెబ్బతీశాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. తగ్గిన డిమాండ్... జూలై 5న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి చూస్తే నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ 5.7 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ 9.4 శాతం నష్టపోగా, ఇదే కాలంలో నిఫ్టీ–50 3.8 శాతం మేర పెరిగింది. దేశ ఆర్థిక రంగ విస్తరణలో బ్యాంకులతోపాటు ఎన్బీఎఫ్సీ సంస్థలది కీలకపాత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం నుంచి లోటు ఉన్న రంగాలకు రుణ అవసరాలను ఎన్బీఎఫ్సీ విభాగమే తీరుస్తోంది. ఎన్బీఎఫ్సీ రంగం నిధుల కటకటతో ఆర్థిక రంగ విస్తరణ కూడా ఆగిపోయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వినియోగం తగ్గుదల అన్నది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2019–20 ఆర్థిక సంవత్సరానికి 0.3 శాతం మేర తగ్గించి 7%గా పేర్కొనడం గమనార్హం. డిమాండ్ తగ్గడమే అంచనాలను తగ్గించడానికి కారణమని ఐఎంఎఫ్ తెలిపింది. మరికొంత కాలం పాటు... కొత్త ఉద్యోగాలు లేకపోవడం, నగదు లభ్యత తక్కువగా ఉండడం తదితర కారణాలతో డిమాండ్/వినియోగం మరికొంత కాలం బలహీనంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగడం సానుకూల చర్య అని, అయితే గతంలో అధిక బేస్తోపాటు ప్రభుత్వ వ్యయాలు గణనీయంగా లేని అంశాలను వారు గుర్తు చేస్తున్నారు. కంపెనీల పరంగా చూస్తే... ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) 2019–20లో తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో గత ఏడు త్రైమాసికాల్లోనే తక్కువ విక్రయాలను నమోదు చేసింది. ఇక వినియోగంలో భాగమైన ఆటోమొబైల్ రంగం కూడా గడ్డు పరిస్థితులను చూస్తోంది. వాహన అమ్మకాలు గత కొన్ని నెలలుగా అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. ‘‘ప్రస్తుతం వినియోగ రంగంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే... రానున్న త్రైమాసికాల్లోనూ అమ్మకాల వృద్ధి పెద్ద సవాలుగానే కనిపిస్తోంది. కన్జ్యూమర్ స్టాపుల్స్, ఆటో, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) జ్యుయలరీ విభాగాలు ఇప్పటికే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత మందగమనం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించనుంది’’ అని ఈక్విరస్ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొంది. అప్రమత్తంగా ఉండాలి... సమీప కాలంలో ఆర్థిక వ్యవస్థ మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్న నేపథ్యంలో వినియోగ రంగ కంపెనీల ఫలితాల వృద్ధి పుంజుకోకవచ్చు. దీంతో స్టాక్స్ ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నా యని ఈ రంగం షేర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. దీర్ఘకాల దృష్టితోనే కొనుగోళ్లకు దిగాలని సూచిస్తున్నారు. ఈ విభాగంలో ఎంఅండ్ఎం, టీవీఎస్ మోటార్, మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్, గోద్రేజ్ కన్జ్యూమర్, కోల్గేట్ పామోలివ్, బ్రిటానియా, డీమార్ట్, యునైటెడ్ స్పిరిట్స్, హెచ్యూఎల్ షేర్లు నిఫ్టీ కన్జంప్షన్ సూచీలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయిన షేర్లు. -
రీఫైనాన్స్ సదుపాయం కల్పించండి
ముంబై: నిధుల కొరతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) తమకు ముద్రా స్కీము కింద రీఫైనాన్స్ సదుపాయాన్ని కల్పించాలంటూ కేంద్రాన్ని కోరాయి. అలాగే, లిక్విడిటీ అవసరాలు తీర్చేందుకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ) తరహాలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసేలా రిజర్వ్ బ్యాంక్లో ప్రత్యేక రీఫైనాన్స్ విండో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాయి. ఎన్బీఎఫ్సీ సంస్థల సమాఖ్య ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎఫ్ఐడీసీ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్బీఐలో నమోదైన అన్ని ఎన్బీఎఫ్సీలకు ముద్రా స్కీము కింద రీఫైనాన్స్ సదుపాయం కల్పించాలని, స్ప్రెడ్స్ మధ్య (ఎన్బీఎఫ్సీలు తీసుకునే రుణాలు, ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం) గరిష్ట పరిమితి 6 శాతమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేయాలని కోరింది. మార్కెట్కు అనుగుణంగా వడ్డీ రేట్లు ఆమోదయోగ్య స్థాయిల్లోనే ఉండేలా సాధారణంగానే సంస్థలు జాగ్రత్తపడతాయని పేర్కొంది. అలాగే, వ్యవస్థలో కీలకమైన భారీ ఎన్బీఎఫ్సీలు చిన్న, మధ్య స్థాయి షాడో బ్యాంకులకు రుణాలివ్వడానికి ముద్రా స్కీము కింద రీఫైనాన్స్ సదుపాయం పొందే వెసులుబాటు కల్పించాలని ఎఫ్ఐడీసీ చైర్మన్ రామన్ అగర్వాల్ తెలిపారు. ఎన్బీఎఫ్సీలు దివాలా తీసే పరిస్థితి ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. రుణ వృద్ధి మాత్రమే మందగించిందని దివాలా పరిస్థితులేమీ లేవని స్పష్టం చేశారు. సమస్యల వలయం.. గతేడాది సెప్టెంబర్లో ఐఎల్అండ్ఎఫ్ఎస్ సంస్థ దివాలా తీసినప్పట్నుంచి మొత్తం షాడో బ్యాంకింగ్ రంగం నిధుల కొరతతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. డీహెచ్ఎఫ్ఎల్ వంటి పెద్ద సంస్థలు కూడా డిఫాల్ట్ అవుతున్నాయి. వీటికి తోడ్పాటు అందిస్తామంటూ ఆర్బీఐ ప్రకటించినప్పటికీ నిర్మాణాత్మక చర్యలేమీ లేకపోవడంతో సంక్షోభం మరింత ముదురుతోంది. ఎన్బీఎఫ్సీలు ఒకవైపు మార్కెట్ వాటా పోగొట్టుకుంటూ ఉండగా.. మరోవైపు వాటి షేర్ల ధర కూడా భారీగా పతనమవుతోంది. పరిశ్రమ గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీల రుణ వితరణ 19 శాతం తగ్గింది. గతంలో రుణ వృద్ధి ఏటా 15% పైగా ఉండేది. -
ఆర్బీఐకి మరిన్ని అధికారాలు!
సాక్షి, న్యూఢిల్లీ : నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)ల పై మరింత పర్యవేక్షణ, మరిన్ని నియంత్రణ అధికారాలను ఆర్బీఐకి కట్టబెట్టే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఎన్బీఎఫ్సీల లిక్విడిటీ పరిస్థితిని ఆర్బీఐ నిశితంగా పరిశీలిస్తోందని, ఈ రంగం పనితీరును, కార్యకలాపాల పర్యవేక్షణను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఎన్బీఎఫ్సీలకు మూలధన నిధులు సమకూర్చే యోచనేదీ లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్కు ఈ వివరాలను ఆమె వెల్లడించారు. వివిధ అంశాలపై వివరణలను ఆమె పార్లమెంట్కు నివేదించారు. మూత పడ్డ 6.8 లక్షలకు పైగా కంపెనీలు భారత్లో ఇప్పటివరకూ 6.8 లక్షలకు పైగా కంపెనీలు మూతపడ్డాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఆర్ఓసీ కింద మొత్తం 18.9 లక్షల కంపెనీలు నమోదయ్యాయని, దీంట్లో 36 శాతం మేర కంపెనీలు మూతపడ్డాయని ఆమె పార్లమెంట్కు వెల్లడించారు. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల పాటు వార్షిక నివేదికలను సమర్పించని కంపెనీలను గుర్తించి, రద్దు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుందని పేర్కొన్నారు. 19 కోట్ల ‘ముద్ర’ రుణాలు ... ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎమ్ఎమ్వై) కింద ప్రభుత్వ రంగ బ్యాంక్లు ఈ ఏడాది జూన్ 21 వరకూ 19 కోట్ల ముద్ర రుణాలు మంజూరు చేశాయి. వీటిల్లో 2,313 ముద్ర ఖాతాలు మోసపూరితమైనవిగా గుర్తించామని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. వీటిల్లో అత్యధికంగా తమిళనాడు(344)లో చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. నకిలీ ఐటీసీ క్లెయిమ్లు రూ.2,565 కోట్లు... రూ.2,565 కోట్ల ఇన్పుట్ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)క్లెయిమ్ చేస్తూ, దాఖలు చేసిన 535 నకిలీ ఇన్వాయిస్లను జీఎస్టీ అధికారులు గుర్తించారని ఆర్థిక మంత్రి నిర్మల సీతారమన్ పార్లెమెంట్లో వెల్లడించారు. దీనికి సంబంధించి 40 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు. పెరుగుతున్న కంపెనీ మోసాలు... కంపెనీల మోసాలు పెరిగిపోతున్నాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఈ మోసాలకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 594 కంపెనీలకు పాత్ర ఉన్న 79 కేసులను గత మూడేళ్లలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్ట్గేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) దర్యాప్తు చేసిందని ఆమె పార్లమెంట్కు వెల్లడించారు. ఈ కాలంలోనే రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ఓసీ) 256 కేసులను దర్యాప్తు చేసిందని తెలిపారు. వైట్ కాలర్ నేరాల నియంత్రణ నిమిత్తం సెబీ, కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు డేటా బదిలీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని తెలిపారు. రూ.14,578 కోట్లకు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు.... బ్యాంకింగ్ రంగంలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు గత ఏడాది 27 శాతం ఎగసి రూ.14,578 కోట్లకు పెరిగాయని పార్లమెంట్కు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నివేదించారు. 2016లో రూ.8,928 కోట్లుగా ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు 2017లో రూ.11,494 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఏడాది చివరినాటికి ఒక్క ఎస్బీఐలోనే రూ.2,516 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా జీవిత బీమా రంగంలో రూ.16,888 కోట్లు, సాధారణ బీమారంగంలో రూ.990 కోట్ల అన్క్లెయిమ్డ్ మొత్తాలున్నాయని తెలిపారు. 23 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలను కనుగొన్న ఓఎన్జీసీ... ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ కంపెనీ గత మూడేళ్లలో 23 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలను కనుగొన్నది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నాటికి ఓఎన్జీసి వద్ద 459.84 మిలయిన్ టన్నుల చమురు నిక్షేపాలున్నాయని పెట్రోలియమ్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభకు రాతపూర్వకంగా వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ 21.11 మిలిన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసిందని, గత మూడేళ్లలో మొత్తం 65.66 మిలియన్ టన్నుల చమురును ఉత్పత్తి చేసిందని పేర్కొంది. ఇంధన దిగుమతులను తగ్గించుకునే ప్రణాళిక కోసం ఓఎన్జీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. 2017–18లో రూ.5.66 లక్షల కోట్లుగా ఉన్న ముడిచమురు దిగుమతుల బిల్లు గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.83 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. 2013–14లో ముడి చమురు దిగుమతుల బిల్లు అత్యధికంగా రూ.8.64 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. -
త్వరలో హెచ్డీబీ ఐపీఓ !
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ), హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానుంది. 2007లో ప్రారంభమైన హెచ్డీబీ వ్యక్తిగత రుణాలతో పాటు, వాణిజ్య వాహనాలతో పాటు, బంగారంపై రుణాలివ్వటం చేస్తోంది. ఆస్తులు తనఖాగా కూడా రుణాలిస్తోంది. కాగా హెచ్డీబీ ఐపీఓ కోసం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత నెల రోజులుగా వివిధ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో చర్చలు జరుపుతోందని సమాచారం. ఈ ఐపీఓ ద్వారా రూ.7,000– 8,000 కోట్ల మేర నిధులు సమీకరించాలని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భావిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ఐపీఓ ఉండొచ్చని అంచనా. హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు 95.53 శాతం వాటా ఉంది. హెచ్డీబీ స్టాక్ మార్కెట్లో లిస్టయితే స్టాక్మార్కెట్లో లిస్టైన హెచ్డీఎఫ్సీ గ్రూప్ కంపెనీల సంఖ్య ఐదుకు చేరుతుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్లు లిస్టయ్యాయి. -
స్వల్ప లాభాలతో సరి
రోజంతా ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. మరోవైపు డాలర్తో రూపాయి మారకం ఇంట్రాడేలో 20 పైసలు నష్టపోవడం, ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 423 పాయింట్ల మేర కదలాడిన సెన్సెక్స్ చివరకు 86 పాయింట్ల లాభంతో 39,616 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 11,871 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఐటీ, ఆర్థిక రంగ షేర్లు లాభపడగా, ఫార్మా, లోహ షేర్లు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 98 పాయింట్లు నిఫ్టీ 52 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. రోలర్ కోస్టర్ రైడ్లా ట్రేడింగ్: సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. కానీ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ పుంజుకొని లాభాల్లోకి వచ్చింది. ఇలా లాభ, నష్టాల మధ్య దోబూచులాడింది. సెన్సెక్స్ ఏడు సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిందంటే, మార్కెట్లో ఏ రేంజ్లో ఒడిదుడుకులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 251 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 173 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 424 పాయింట్ల రేంజ్లో కదలాడింది. బడ్జెట్పైనే దృష్టి.... నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిధుల సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా లేకపోవడంతో ఎంపిక చేసిన బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. రూపాయి పతనం కారణంగా ఐటీ షేర్లు లాభపడ్డాయని వివరించారు. అమెరికా ఉద్యోగ గణాంకాలు, రానున్న కేంద్ర బడ్జెడ్ మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలతో గట్టెక్కినా, వందకు పైగా షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. డీహెచ్ఎఫ్ఎల్, లుపిన్, బేయర్ క్రాప్ సైన్స్, క్యాడిలా హెల్త్కేర్, మన్పసంద్ బేవరేజేస్, రాడికో ఖైతాన్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ఇన్ఫ్రా, ఫోర్టిస్ హెల్త్కేర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు హావెల్స్ ఇండియా, అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్, చంబల్ ఫెర్టిలైజర్స్, తదితర 30కు పైగా షేర్లు తాజా ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ► ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా షేర్లు శుక్రవారం కూడా 20 శాతం లోయర్ సర్క్యూట్ను తాకాయి. 14% నష్టంతో రూ.45 వద్ద ముగిసింది. ► ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ 13 శాతం నష్టపోయి 15 ఏళ్ల కనిష్ట స్థాయి, రూ.74కు పతనమైంది. గత రెండు రోజుల్లో ఈ షేర్ 25 శాతం క్షీణించింది. -
ఎన్బీఎఫ్సీలకు కొత్తగా ఎల్సీఆర్
న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) సంబంధించి లిక్విడిటీ కవరేజీ రేషియో (ఎల్సీఆర్)ను ఆర్బీఐ తీసుకురానుంది. డిపాజిట్లు తీసుకునే అన్ని ఎన్బీఎఫ్సీలతోపాటు, రూ.5,000 కోట్ల ఆస్తులున్న ప్రతీ ఎన్బీఎఫ్సీ కూడా ఈ విధానం పరిధిలోకి రానుంది. ఈ మేరకు ఆర్బీఐ నూతన మార్గదర్శకాలను రూపొందించింది. ఇందుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఎన్బీఎఫ్సీ రంగంలో లిక్విడిటీ సమస్యలకు ముగింపు పలకడం, ఐఎల్ఎఫ్ఎస్ తరహా సంక్షోభాల నివారణ కోసం ఆర్బీఐ ఈ చర్యలను చేపట్టింది. ఎల్సీఆర్ విధానానికి ఎన్బీఎఫ్సీ రంగం సాఫీగా మారేందుకు వీలుగా... 2020 ఏప్రిల్ నుంచి 2014 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల కాలంలో అంచలంచెలుగా అమలు చేయాలన్నది ఆర్బీఐ ప్రణాళిక. ‘‘ఎన్బీఎఫ్సీలు తప్పనిసరిగా తగినంత అధిక నాణ్యత కలిగిన లిక్విడ్ ఆస్తులను (హెచ్క్యూఎల్ఏ) కలిగి ఉండాలి. తీవ్రమైన నిధుల లభ్యత సమస్య ఏర్పడినప్పుడు ఈ ఆస్తులను 30 రోజుల అవసరాలకు సరిపడా నగదుగా మార్చుకోవచ్చు’’ అని ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాల్లో తెలియజేసింది. 60 శాతం ఎల్సీఆర్ ‘‘2020 ఏప్రిల్ 1 నుంచి ఎల్సీఆర్ నిబంధనలకు ఎన్బీఎఫ్సీలు కట్టుబడి ఉండాలి. కనీసం 60 శాతంగా ఎల్సీఆర్ ఉండాలి. క్రమంగా 2024 ఏప్రిల్ నాటికి ఈ కవరేజీని 100 శాతానికి చేరాల్సి ఉంటుంది’’అని ఆర్బీఐ పేర్కొంది. ఎన్బీఎఫ్సీ రంగంలో ఇటీవలి పరిణామాల విశ్లేషణ తర్వాతే ఈ మార్గదర్శకాలను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఇక అప్లికేషన్ ఆఫ్ జనరిక్ అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ (ఏఎల్ఎమ్) తదితర ఇతర మార్గదర్శకాలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ ఉన్నత స్థాయి యాజమాన్యంతో కూడిన అస్సెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ కమిటీ (ఏఎల్సీవో)ని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. లిక్విడిటీ రిస్క్ నిర్వహణ కోసం దీన్ని సూచించింది. ఎన్బీఎఫ్సీ రుణ కార్యకలాపాలపై ఇబ్బందులు ఎదురైతే ఎదుర్కొనేందుకు అత్యవసర నిధి ప్రణాళికను కూడా రూపొందించుకోవాలని పేర్కొంది. -
ఎన్బీఎఫ్సీలకు సెక్యూరిటైజేషన్ దన్ను
న్యూఢిల్లీ: నిధుల లభ్యత కష్టంగా మారినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ) రుణాల పోర్ట్ఫోలియోను విక్రయించడం ద్వారా (సెక్యూరిటైజేషన్) దాదాపు రూ. 26,200 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గంలో సమీకరించిన నిధులతో పోలిస్తే ఇది 170 శాతం అధికం. 2017–18లో సెక్యూరిటైజేషన్ ద్వారా ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐలు రూ. 9,700 కోట్లు సమీకరించాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ (ఐఎల్అండ్ఎఫ్ఎస్) పలు రుణాల చెల్లింపులో డిఫాల్ట్ అయిన దరిమిలా గత ఆర్థిక సంవత్సరం ఎన్బీఎఫ్సీలు, సూక్ష్మ రుణాల సంస్థలకు నిధులు లభ్యత కష్టసాధ్యంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో అవి ఫండ్స్ సమీకరణ లక్ష్యాల సాధన కోసం ప్రధానంగా సెక్యూరిటైజేషన్పై ఆధారపడినట్లు ఇక్రా పేర్కొంది. ‘2018 ఆర్థిక సంవత్సరంలో, 2019 ప్రథమార్ధంలో మొత్తం నిధుల సమీకరణలో సెక్యూరిటైజేషన్ వాటా 18–20 శాతమే ఉంది. కానీ మూడో త్రైమాసికంలో ఇది 37 శాతానికి, నాలుగో త్రైమాసికంలో 50 శాతానికి పెరిగింది‘ అని ఇక్రా గ్రూప్ హెడ్ (స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ రేటింగ్స్ విభాగం) విభోర్ మిట్టల్ తెలిపారు. 2017–18లో సెక్యూరిటైజేషన్ ద్వారా నిధులు సమీకరించిన సంస్థల సంఖ్య 24గా ఉండగా.. 2018–19లో 43కి చేరిందని ఆయన పేర్కొన్నారు. -
గోల్డ్ స్కీమ్స్తో జాగ్రత్త!
బంగారు వర్తకులు ఆఫర్ చేసే బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా...? ఏడాది పాటు పొదుపు చేయడం వల్ల ఒక నెల మొత్తం బోనస్గా లభించడం, ఎటువంటి తరుగు లేకుండా నగలు కొనుగోలుకు అవకాశం కల్పించే ఆఫర్లు ఆకర్షిస్తున్నాయా..? కానీ, జ్యుయలర్స్ ఆఫర్ చేసే సేవింగ్స్ పథకాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలన్నది నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి లేని డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. వాస్తవానికి అనుమతి లేని అన్ని పథకాలకు ఇది వర్తిస్తుందని భావించారు. జ్యుయలరీ సంస్థల పథకాలకు కూడా బ్రేక్ పడుతుందనుకున్నప్పటికీ... అవి మాత్రం ఇంతకుముందు మాదిరే నిధులను సమీకరిస్తూనే ఉన్నాయి. కాకపోతే చట్టంలో ఉన్న చిన్న వెసులుబాటును అనుకూలంగా మలచుకుని జ్యూయలరీ సంస్థలు తమ పొదుపు పథకాలను కేవలం పదకొండు నెలల కాలానికే పరిమితం చేస్తున్నాయి. చట్టానికి అతీతంగా జ్యుయలరీ సంస్థలు వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. కంపెనీల చట్టం 2014... బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించే ఇతర సంస్థలకు షరతులు విధించింది. 365 రోజులకు మించిన కాలానికి డిపాజిట్లు తీసుకునే రిజిస్టర్డ్ సంస్థలు అన్నీ కూడా కచ్చితంగా తిరిగి చెల్లించే సామర్థ్యంపై రేటింగ్ తీసుకోవడంతోపాటు, డిపాజిట్ ఇన్సూరెన్స్ను కూడా తీసుకోవాలి. పైగా డిపాజిట్పై వడ్డీని ఎన్బీఎఫ్సీల కంటే ఎక్కువ ఆఫర్ చేయరాదు. కానీ, జ్యుయలరీ సంస్థలు మాత్రం గతంలో 12, 24, 36 నెలల పథకాలను నిర్వహించగా, చట్టంలోని నిబంధనలు కఠినతరం కావడంతో తమ పథకాల కాల వ్యవధిని 11 నెలలకు కుదించుకున్నాయి. సంస్థ బిచాణా ఎత్తేస్తే? ఆభరణాల సంస్థలు వినియోగదారులను మోసం చేసిన ఘటనలు కూడా లేకపోలేదు. ఇందుకు నిదర్శనం తమిళనాడుకు చెందిన నాదెళ్ల సంపత్ జ్యుయలరీ సంస్థ వ్యవహారమే. తమిళనాడులో బంగారు ఆభరణాల మార్కెట్లో మంచి పేరున్న సంస్థ. 75 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లో ఉన్న సంస్థ. కానీ 2017 అక్టోబర్లో రాష్ట్రవ్యాప్తంగా ఆభరణాల దుకాణాలను ఆర్థిక సమస్యల కారణంగా ఈ సంస్థ మూసేసింది. ఖాతాల్లో అవకతవకలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడం వెలుగు చూశాయి. నాదెళ్ల బంగారు పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ఉసూరుమనక తప్పలేదు. కంపెనీ 2018 మే నెలలో దివాలా పిటిషన్ వేసింది. ఈ తరహా పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి ఈ సంఘటన ఓ హెచ్చరిక వంటిది. బంగారు ఆభరణాల సంస్థ దివాలా పిటిషన్ దాఖలు చేస్తే, ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తం నుంచి ఖర్చులు పోను, ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లిస్తారు. మిగిలి ఉంటే సెక్యూర్డ్ రుణదాతలకు చెల్లింపులు చేస్తారు. ఆ తర్వాత అన్సెక్యూర్డ్ రుణదాతల వంతు వస్తుంది. బంగారం పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు అన్సెక్యూర్డ్ ఆపరేషనల్ క్రెడిటర్ల కిందకు వస్తారని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కనుక కస్టమర్ల వంతు ఆఖరు అవుతుంది. లొసుగులు.. అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్... డిపాజిట్కు నిర్వచనం ఇచ్చింది. అడ్వాన్స్ రూపంలో తీసుకోవడం లేదా రుణం, తిరిగి నగదు లేదా సేవ రూపంలో ఇస్తానన్న హామీతో తీసుకునే మొత్తాన్ని డిపాజిట్గా పేర్కొంది. ఎవరు డిపాజిట్ తీసుకున్నారన్నది ఇక్కడ అంశం కాదు. వ్యక్తి లేదా యాజమాన్య సంస్థ, భాగస్వామ్య సంస్థ, కోపరేటివ్ సొసైటీ లేదా ట్రస్ట్ అయినా కావచ్చు. కనుక జ్యుయలర్స్ నిర్వహించే పథకాలు ఈ చట్టం పరిధిలోకే వస్తాయంటున్నారు కొందరు. అయితే, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. బంధువుల నుంచి రుణాల రూపంలో తీసుకోవడం, వ్యాపార సరుకుల సరఫరా కోసం అడ్వాన్స్ రూపంలో తీసుకోవడానికి డిపాజిట్ నిర్వచనం నుంచి మినహాయింపు ఉంది. భవిష్యత్తులో ఆభరణాల కొనుగోలు సాధనాలుగా తాము బంగారం పొదుపు పథకాలను విక్రయిస్తున్నట్టు జ్యుయలరీ వర్తకులు సమర్థించుకుంటున్నారు. కనుక దీన్ని ముందస్తు వాణిజ్యంగా చూడాలని పేర్కొంటున్నాయి. డిపాజిట్లు కాదు... ‘‘జ్యుయలర్ల పొదుపు పథకాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకురాలేదు. జ్యుయలర్స్ సమీకరించే నిధులు కేవలం ముందస్తు వాణిజ్య రూపంలోనే. దీన్ని డిపాజిట్గా చూడరాదు. ఈ పథకాల కింద కస్టమర్లకు తగ్గింపులు, బహుమానాలు ఆఫర్ చేయవచ్చా, స్పష్టం చేయాలని కోరుతూ కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశాం’’ అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ తెలిపారు. నిపుణుల అభిప్రాయాలు వేరు అయితే, బంగారం డిపాజిట్ పథకాలు అనుమతి లేని డిపాజిట్ పథకాల నిషేధ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయా అన్న దానిపై అస్పష్టత నెలకొందని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ముందస్తు వాణిజ్యం పేరుతో తప్పించుకోవడం కుదరదని మరో నిపుణుడు పేర్కొన్నారు. ‘‘ఓ కస్టమర్ కొన్ని నెలల పాటు నగదు ఉంచి, చివర్లో ఏది కొనుగోలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. లేదా ఆ డబ్బులను వెనక్కి తీసుకోవచ్చు. అన్ని నెలల పాటు అతడు చెల్లించినది డిపాజిట్కు భిన్నమేమీ కాదు. వస్తువులకు ముందస్తుగా చెల్లించడం అంటే... మా అభిప్రాయం ప్రకారం ఆ సరుకులు ఏంటన్నది ముందే గుర్తించాల్సి ఉంటుంది. ఏదన్నది గుర్తించకుండా ముందుగానే అడ్వాన్స్గా ఎవరూ చెల్లించరు. కనుక ఈ తరహా పథకాలను నిషేధించాలి’’ అని వినోద్ కొతారి అండ్ కంపెనీ సీనియర్ అసోసియేట్ సీఎస్ శిఖా బన్సాల్ అభిప్రాయపడ్డారు. ఎవరి నియంత్రణ? బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ లేదా కంపెనీల చట్టం కింద నమోదైన ఓ కంపెనీ, మ్యూచువల్ ఫండ్ పథకాల్లో డిపాజిట్ చేసి చేతులు కాల్చుకుంటే... సంబంధిత నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, కార్పొరేట్ శాఖ, సెబీ ఫిర్యాదుల పరిష్కార బాధ్యత చూస్తాయి. బంగారం పొదుపు పథకాల విషయానికొస్తే వీటిని నియంత్రించే సంస్థ లేదు. చాలా వరకు ఈ జ్యుయలరీ సంస్థలు కంపెనీలుగా రిజిస్టర్డ్ అయినవి కావు. కనుక కార్పొరేట్ వ్యవహారాల శాఖ జోక్యం చేసుకోదు. ఈ తరహా అనియంత్రిత డిపాజిట్ పథకాలకు సంబంధించి సమస్య ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం తప్ప పరిష్కారం లేదు. కనుక పరిష్కారానికి సమయం తీసుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
మున్ముందు మరిన్ని రేటు కోతలు!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మున్ముందు మరిన్ని రేటు కోత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తాజాగా విడుదలైన మినిట్స్ సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకూ జరిపిన విధాన సమీక్ష, నిర్ణయాలపై గురువారం ఆర్బీఐ మినిట్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 6.50 శాతం నుంచి 6.25 శాగానికి తగ్గించింది. వృద్ధి మందగమనం, తక్కువగా ఉన్న ధరల స్పీడ్ నేపథ్యంలో వృద్ధి స్పీడ్కు రేటు తగ్గింపు సరైన నిర్ణయమని ఎంపీసీలో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడిన విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. దీనితోపాటు గురువారం నాడు జరిగిన బ్యాంకర్ల సమావేశంలో రేటు తగ్గింపు అవసరాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేయడాన్నీ వీరు ప్రస్తావిస్తున్నారు. -
‘హ్యాపీ’ న్యూ ఇయర్ షేర్లివి..!
మార్కెట్లు... అంటే సెన్సెక్స్, నిఫ్టీ వంటి ఇండెక్స్లు మరీ అంతగా పడలేదు. లార్జ్ క్యాప్ షేర్లు కొన్ని పెరిగాయి... కొన్ని తగ్గాయి. కానీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లు మాత్రం ఘోరంగా పతనమయ్యాయి. మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిల నుంచి 9 శాతం వరకూ పతనమైతే ఈ షేర్లు మాత్రం చాలావరకూ 50– 60– 70 శాతం కూడా పతనమయ్యాయి. మ్యూచ్వల్ ఫండ్ పథకాలు చాలావరకూ ఈ ఏడాది నష్టాలనే ఇచ్చాయి. నిజం చెప్పాలంటే ఏ షేర్లలో పెట్టుబడి పెట్టాలి? ఏ ఫండ్స్ మంచివి? అనేది 2018లో ఇన్వెస్టర్లకు ఎంత బుర్రబద్దలుకొట్టుకున్నా అర్థం కాలేదు. ఒకేరోజు సెన్సెక్స్ 600 పాయింట్లు పెరిగితే... మరోరోజు 500 పాయింట్లకు పైగా పతనం!!. ఇలాంటి ఎగుడు దిగుళ్లెన్నో సర్వసాధారణమైపోయాయి. దీనికి అంతర్జాతీయ వాణిజ్య యుద్ధభయాలు... ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు.. దేశీయంగా ఎన్బీఎఫ్సీ సంక్షోభం వంటివన్నీ కారణమని చెప్పొచ్చు. కాకపోతే ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లు సంతోషించదగ్గ అత్యంత కీలక పరిణామం ఒకటుంది. అది... మార్కెట్లు పరిణితితో వ్యవహరించటం. గతానికి భిన్నంగా.. అగ్రరా జ్యం అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందన్న నానుడికి విరుద్ధంగా, దేశీ ఇన్వెస్టర్లు ఈసారి మరీ భయపడిపోకుండా కాస్త తట్టుకుని నిలబడ్డారు. అమెరికా మార్కెట్లు ఎలా ఉన్నా... మన మార్కెట్లు మాత్రం ఇక్కడి పరిణామాలకు అనువుగా స్పందించటం మొదలుపెట్టాయి. పైపెచ్చు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో (సిప్) వస్తున్న పెట్టుబడులు మరింత పెరిగాయి తప్ప నిలిచిపోలేదు. అందుకే మన ఇండెక్స్లు అంతర్జాతీయ మార్కెట్ల మాదిరి మరీ ఎక్కువ పతనం కాలేదన్నది వాస్తవం. ఇక 2019లో మరో ఐదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. క్రూడ్ ధరలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరో రెండుమూడు సార్లు వడ్డీ రేట్లు పెంచుతామనే సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించటం కాస్త కష్టం. కాకపోతే కంపెనీల ఆదాయాల్ని బట్టి ఆయా షేర్లు రాణిస్తాయనేది బ్రోకరేజీ సంస్థల మాట. ఆయా బ్రోకరేజీ సంస్థలు కొత్త సంవత్సరం కోసం సిఫార్సు చేస్తున్న షేర్లలో కొన్ని ‘సాక్షి’ ప్రాఫిట్ పాఠకులకు ప్రత్యేకం.. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆశావహంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్... 2018లో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. వాణిజ్య యుద్ధ భయాలు మార్కెట్లను వెంటాడగా, ప్రపంచ వృద్ధి రేటుపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుతం వాణిజ్య యుద్ధ భయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రూడ్ ధరలూ తగ్గుతున్నాయి. 2019లో దేశీయంగా అంతర్గత అంశాల ప్రభావం మార్కెట్లపై గణనీయంగా ఉంటుంది. ఎన్నికల దరిమిలా కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందనేది కీలకంగా మారింది. ఒకవేళ బలహీన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఎకానమీ వృద్ధి పైనా ప్రభావం పడుతుంది. 2018–20 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నిఫ్టీ 18.5 శాతం వృద్ధి నమోదు చేయొచ్చు. ఇందుకు బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగాల షేర్లు తోడ్పడవచ్చు. 2019లో ఆటోమొబైల్ రంగం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్ రంగాలు ఆశావహంగా ఉంటాయని భావిస్తున్నాం. అలాగే, కన్సూ్యమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల షేర్లు కూడా సానుకూలంగా ఉండొచ్చు. మెటల్, మైనింగ్, రియల్ ఎస్టేట్, టెలికం, ఐటీ రంగాల పనితీరు తటస్థంగా ఉండవచ్చు. 2019లో బీజేపీ కూటమికి అత్యధికంగా సీట్లొచ్చే అవకాశం ఉంది. స్టాక్మార్కెట్పై దీని ప్రభావం కూడా ఉంటుంది. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్ బెస్ట్ రాష్ట్రాల ఎన్నికలు, ఆర్బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్లో స్టాక్ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే. సిఫార్సులు 1. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 265 ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్ వాటాతో ఎక్సైడ్.. లీడర్ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. 2. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రస్తుత ధర రూ. 148 ఎందుకంటే..?: ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్పోర్ట్ రన్వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా. 3. పీఐ ఇండస్ట్రీస్ ధర రూ. 857 ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్అండ్డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్ బుక్ వంటివి ఈ షేర్కు సానుకూలాంశాలు. యాక్సిస్ డైరెక్ట్ ఎన్నికల దాకా ఒడిదుడుకులు ప్రస్తుత ఒడిదుడుకులు సార్వత్రిక ఎన్నికల దాకా కొనసాగే అవకాశాలున్నాయి.ఫెడ్ నిర్ణయాలు, వాణిజ్యయుద్ధం, క్రూడ్ ధరలు, ద్రవ్యోల్బణం, ఆర్బీఐ నిర్ణయాలు వంటివి ప్రభావం చూపుతాయి. గ్రామీణ ప్రాంతాల వృద్ధితో భారీ డిమాండ్ కొనసాగిన పక్షంలో మార్కెట్లు మరింతగా పెరగొచ్చు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో చూడతగ్గ స్టాక్స్ కొన్ని... 1. ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 1,583 టార్గెట్ రూ. 1,876 రాబడి: 18 శాతం ఎందుకంటే..?: మెరుగైన మార్జిన్లు, అత్యధిక వడ్డీయేతర ఆదాయాలు, స్థిరమైన అసెట్ క్వాలిటీ వంటివి బ్యాంకుకు సానుకూలాంశాలు. 2. వోల్టాస్ ప్రస్తుత ధర రూ. 551 టార్గెట్ ధర రూ. 672 రాబడి: 22 శాతం ఎందుకంటే..?: సుమారు మూడు నుంచి అయిదేళ్ల వ్యవధికి సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్లో వోల్టాస్ మెరుగ్గా ఉంది. పటిష్టమైన నెట్వర్క్, విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణి, మెరుగైన ఆర్డర్ బుక్ సానుకూలాంశాలు. 3. స్టెరిలైట్ టెక్నాలజీస్ ప్రస్తుత ధర రూ. 289 టార్గెట్ ధర రూ. 410 రాబడి: 41 శాతం ఎందుకంటే..?: ఆప్టికల్ ఫైబర్ కేబుల్ తదితర ఉత్పత్తుల సరఫరాదారు స్థాయి నుంచి డేటా నెట్వర్క్ సొల్యూషన్స్ అందించే సంస్థగా రూపాంతరం చెందుతుండటం కంపెనీకి సానుకూలాంశం. మిలిటరీ, ఏరోస్పేస్, హెల్త్కేర్ వంటి విభాగాల నుంచి కూడా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటం కంపెనీకి లాభించనుంది. సంస్థకు దేశీయంగా 40 శాతం, అంతర్జాతీయంగా 10 శాతం మార్కెట్ వాటా ఉంది. దాదాపు రూ. 6,000 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. 4. ఆర్తి ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,421 టార్గెట్ ధర రూ. 1,740 రాబడి 22 శాతం ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య విస్తరణ, డిమాండ్ వృద్దితో ఆదాయాలు మెరుగుపడగలవు. కొత్త టాలీన్ వ్యాపారం వచ్చే రెండు, మూడేళ్లలో గరిష్ట స్థాయిలో రాబడులివ్వొచ్చు. 5. టేక్ సొల్యూషన్స్ ప్రస్తుత ధర రూ. 149 టార్గెట్ ధర రూ. 178 రాబడి 19 శాతం ఎందుకంటే..?: భారీ మార్కెట్ లభ్యత, టీఎస్ఎల్ విభాగంలో అపార అనుభవం, కార్యకలాపాల విస్తరణపై ప్రధానంగా దృష్టి పెట్టడంతో ఆదాయాలు మెరుగుపడగలవు. 6. మారికో ప్రస్తుత ధర రూ. 378 టార్గెట్ ధర రూ. 428 రాబడి 12 శాతం ఎందుకంటే..?: కొబ్బరి ధరలు తగ్గనుండటం (గడిచిన పది నెలల్లో కేజీకి రూ. 90 పలికిన రేటు.. 30 శాతం తగ్గొచ్చని అంచనా) సంస్థకు సానుకూలం. ప్రధాన బ్రాండ్స్, అంతర్జాతీయ మార్కెట్లలో పనితీరు మెరుగ్గా ఉండటం.. ప్రయోజనకరం. 7. అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర రూ. 912 టార్గెట్ రూ. 1,106 రాబడి 21 శాతం ఎందుకంటే..?: రూమ్ ఎయిర్ కండీషనర్స్ (ఆర్ఏసీ) పరిశ్రమలోని ప్రధాన కంపెనీల్లో అంబర్ కూడా ఒకటి. ఇటీవల ఇతర కంపెనీల కొనుగోలుతో ఇన్వర్టర్ ఆర్ఏసీ విభాగాన్ని పటిష్టపర్చుకుంది. బ్రాండ్ ఓనర్లు అవుట్సోర్సింగ్ చేసే ధోరణి పెరుగుతుంటం కంపెనీకి లాభించే అంశం. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సానుకూలం.. 1. ఏసీసీ ప్రస్తుత ధర రూ. 1,478 ఎందుకంటే..?: ఉత్పత్తి సామర్ధ్య వినియోగం పదేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో సిమెంటు రేట్లు మెరుగుపడ్డాయి. కొంగొత్త ప్రీమియం ఉత్పత్తులు, మెరుగైన ధర అంచనాలు, కార్యకలాపాల విస్తరణ, తక్కువ వేల్యుయేషన్లో లభిస్తుండటం దీనికి సానుకూలాంశాలు. 2. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర రూ. 625 ఎందుకంటే..?: రెండేళ్ల పాటు 17 శాతం అసెట్ వృద్ధి సాధనకు సరిపడేంతగా మూలధన నిల్వలున్నాయి. తదుపరి వృద్ధికి అవకాశమిచ్చే సాధనాల్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేసింది. కొత్తగా మరిన్ని మొండిబాకీలు తలెత్తకుండా ఉండటంతో పాటు రుణ వ్యయాలు తగ్గుతుండటం మూలంగా ఆదాయాలు ద్వితీయార్ధంలో మెరుగుపడే అవకాశాలున్నాయి. ఇక, టాప్ మేనేజ్మెంట్ మారడంతో స్టాక్ రీరేటింగ్ జరగొచ్చు. ప్రస్తుతం షేరు ఆకర్షణీయ వేల్యుయేషన్స్లో లభిస్తోంది. 3. ఐటీసీ ప్రస్తుత ధర రూ. 282 ఎందుకంటే..?: ఈ షేరు అవుట్పెర్ఫార్మ్ చేయడానికి అయిదు కారణాలు కనిపిస్తున్నాయి. 1) మూడింట రెండొంతుల మంది స్మోకర్స్ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం, వీరు బీడీల నుంచి అప్గ్రేడ్ అవుతుండటం. 2) పన్నుల విధానం స్థిరంగా ఉంటుందన్న అంచనాలు 3) సానుకూలమైన బేస్ 4) అక్రమ వ్యాపారాలను కట్టడి చేయడం 5) ఎఫ్ఎంసీజీ వ్యాపార వాటా పెరుగుతుండటం. ఈ అంశాల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా మెరుగైన రాబడులు రావొచ్చు. ప్రస్తుతం ఈ రంగంలో మిగతా వాటితో పోలిస్తే 35 శాతం డిస్కౌంట్తో ట్రేడవుతోంది. 4. ముత్తూట్ ఫైనాన్స్ ప్రస్తుత ధర రూ. 504 ఎందుకంటే..?: గోల్డ్ లోన్ సెగ్మెంట్లో దీర్ఘకాలికంగా కార్యకలాపాలు, మంచి అనుభవం ఉండటం దీనికి సానుకూలాంశం. బంగారంయేతర రుణాల వాటా పెరుగుతుండటంతో.. పోర్ట్ఫోలియోకు రిస్కులు తగ్గుతున్నాయి. ఇతరత్రా పథకాలను విక్రయించడానికి ప్రస్తుతం ఉన్న అసెట్స్నే ఉపయోగించుకునేందుకు వీలుండటంతో.. ఆదాయాలతో పోలిస్తే వ్యయాలు తక్కువగా ఉండొచ్చు. పసిడి రుణాల విభాగం పునర్వ్యవస్థీకరణ కారణంగా రాబోయే రోజుల్లో మొండిబాకీల స్థాయి తగ్గుతుంది. 5. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 1,125 ఎందుకంటే..?: కన్జూమర్, టెలికం సెగ్మెంట్ విస్తరించే కొద్దీ కంపెనీ ఆదాయాలు గణనీయంగా వృద్ధి చెందనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2021 దాకా టెలికం విభాగం ఆర్జియో ఆదాయం 27 శాతం మేర, లాభాలు 77 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని అంచనా. 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రిలయన్స్ జియో సబ్స్క్రయిబర్స్ సంఖ్య 41 కోట్లకు చేరొచ్చు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వినియోగ వస్తువులు, ఐటీ స్టాక్స్ బెస్ట్ రాష్ట్రాల ఎన్నికలు, ఆర్బీఐ గందరగోళం, చమురు ధరల పతనం, తగ్గిన ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగ్గా ఉండటం వంటివి డిసెంబర్లో స్టాక్ మార్కెట్లు హెచ్చు తగ్గులకు కారణమయ్యాయి. నిఫ్టీ 6 శాతం శ్రేణిలో తిరిగింది. రైతు రుణ మాఫీలు, జీఎస్టీ రేట్ల కోత మొదలైన పరిణామాలన్నీ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక వినియోగం ద్వారా ఎకానమీకి ఇవి సానుకూలమైనవే అయినప్పటికీ.. సమీప భవిష్యత్లో ఈ ప్రజాకర్షక పథకాలతో దేశ ఆర్థిక విధానాలపై ప్రతికూల ప్రభావాలు పడవచ్చు. ఇప్పటికే వృద్ధి మందగించడం, వచ్చే 6 నెలల్లో మరింత నెమ్మదించనుండటంతో.. ఈ రిస్కులు మరింత పెరుగుతాయి. ఈ పరిస్థితుల్లో కొత్త ఏడాది ఐటీ కంపెనీలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ రంగాల షేర్లూ ఆకర్షణీయమే. సిఫార్సులు 1. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ధర రూ. 265 ఎందుకంటే..?: స్టోరేజీ బ్యాటరీ వ్యాపారంలో దేశీయంగా 60 శాతం మార్కెట్ వాటాతో ఎక్సైడ్.. లీడర్ స్థానంలో ఉంది. క్యూ2లో అధిక ఇంధన ధరలు, రూపాయి పతనంతో ఎబిటా 30 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే.. బ్యాటరీ ఇంజినీరింగ్ ఆమోదయోగ్యత పెరుగుతుండటం వంటి అంశాల వల్ల ఎక్సైడ్ దీర్ఘకాలిక అంచనాలు సానుకూలంగా ఉన్నాయి. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆదాయాలు, నికర లాభం 15–16 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంది. 2. పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ ప్రస్తుత ధర రూ. 148 ఎందుకంటే..?: ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ, అభివృద్ధి, నిర్వహణ రంగ కంపెనీ ఇది. హైవేలు, వంతెనలు, ఎయిర్పోర్ట్ రన్వేల నిర్మాణంలో అపార అనుభవం ఉంది. పెద్ద ఆర్డర్లను పూర్తి చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆదాయం 108 శాతం మేర పెరిగింది. సుమారు రూ.10,632 కోట్ల కాంట్రాక్టులతో ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉంది. 85 శాతం మేర స్థల సమీకరణ పూర్తవడంతో.. చాలా మటుకు ప్రాజెక్టులు ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2018–20 మధ్య ఆదాయాలు 39 శాతం మేర ‡వార్షిక వృద్ధి సాధించవచ్చని అంచనా. 3. పీఐ ఇండస్ట్రీస్ ధర రూ. 857 ఎందుకంటే..?: పంటల సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే సంస్థ ఇది. దేశ, విదేశ అమ్మకాలు మెరుగ్గా ఉండటంతో 2018–19 క్యూ2లో విక్రయాలు 29 శాతం వృద్ధి చెందాయి. కొత్త ఉత్పత్తులు, సీఎస్ఎం వ్యాపార విభాగంలో పటిష్టమైన ఆదాయ అవకాశాలు సంస్థకు సానుకూలాంశాలు. 2018–2020 ఆర్థిక సంవత్సరాల మధ్యలో నికర లాభం 19 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా. ఎగుమతులు పెరుగుతుండటం, మెరుగైన ఆర్అండ్డీ కార్యకలాపాలు, కొత్త ప్లాంట్ల రాక, పటిష్టమైన ఆర్డర్ బుక్ వంటివి ఈ షేర్కు సానుకూలాంశాలు. – సాక్షి, బిజినెస్ విభాగం గమనిక: ఇవన్నీ బ్రోకరేజి సంస్థల సిఫార్సులు మాత్రమే. రిస్కులను బేరీజు వేసుకుని ఇన్వెస్టర్లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. -
ఎన్బీఎఫ్సీ, హెచ్ఎఫ్సీలకు మరింత చేయూత
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ) ప్రతినిధులు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్న ఈ రంగాల పునరుద్ధరణకు సూచనలు చేశారు. అతిపెద్ద బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) అయిన ఐఎల్ఎఫ్ఎస్ వరుసగా రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో, అది ఆర్థిక సేవల మార్కెట్లో ద్రవ్య లభ్యత సమస్యకు దారితీసిన విషయం తెలిసిందే. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రధానికి తెలియజేసినట్టు అసోచామ్ ప్రెసిడెంట్ బీకే గోయంకా చెప్పారు. ‘‘ఐఎల్ఎఫ్ఎస్ సంక్షో భం తర్వాత ప్రభుత్వం పలు సానుకూల చర్యలను తీసుకుంది. అయితే, ఇవి సరిపోవని సంకేతమిస్తున్నాం. అందుకే దీన్ని ఉన్నత స్థాయి దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చింది’’ అని ఆయన చెప్పారు. పరిశ్రమల ఆందోళనల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చినట్టు తెలిపారు. వ్యవస్థాపరంగా అతి ముఖ్యమైన ఎన్బీఎఫ్సీలను ప్రజల నుంచి డిపాజిట్ల సేకరణకు అనుమతించాలని, నేషనల్ హౌసింగ్ బ్యాంకు నుంచి రుణాలు పొందే అవకాశం హెచ్ఎఫ్సీలకు కల్పించాలని కంపెనీల ప్రతినిధులు ప్రధానిని కోరారు. మొత్తం రుణాల్లో వ్యక్తుల గృహ రుణాల వాటా 50%కి మించి ఉండాలన్న నిబంధనకు 2020 డిసెం బర్ వరకు గడువు ఇవ్వాలని కూడా కోరారు. ఇండియాబుల్స్ గ్రూపు చైర్మన్ సమీర్ గెహ్లాట్, డీహెచ్ఎఫ్ఎల్ చైర్మన్ కపిల్ వాద్వాన్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ ఎండీ దినంత్ దుబాసీ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి రుణం.. ఉభయకుశలోపరి
సొంతింటిని సమకూర్చుకోవాలన్న కల ఎందరికో వుంటుంది. అయితే సొంతంగా ఇంటి కొనుగోలుకు సరిపడా డబ్బులను సమకూర్చుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఇప్పటికే గణనీయంగా పొదుపు చేసి ఉన్నవారు, వేరే ఆస్తులను విక్రయించడం ద్వారా సమకూర్చుకునే వారికి ఇది సాధ్యమే అయినా, మిగిలిన వారి ముందున్న ఏకైక మార్గం గృహ రుణమే. అందుకే నేడు విక్రయం అవుతున్న కొత్త ప్రాజెక్టుల్లో మూడింట రెండొంతులు గృహ రుణాలపైనే ఉంటున్నాయి. ఇందులో ఇద్దరు కలసి తీసుకునే గృహ రుణాలు కూడా ఉన్నాయి. మరొకరితో కలసి గృహ రుణం తీసుకోవాల్సిన అవసరం ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఉండొచ్చు. కారణం ఏదైనా జాయింట్ హోమ్లోన్ విషయంలో ఉండే సానుకూల ప్రతికూలతలు ఏంటన్నవి తెలుసుకుంటే గృహ రుణ గ్రహీతలకు సాయంగా ఉంటుంది. వాటిని తెలియజేసే కథనమే ఇది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం జాయింట్హోమ్ లోన్ అన్నది మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణం. సాధారణంగా జీవిత భాగస్వామి లేదా తోడబుట్టిన వ్యక్తితో కలసి జాయింట్ హోమ్లోన్ తీసుకోవచ్చు. విడిగా ఒక్కరే తీసుకునే రుణంతో పోలిస్తే, ఇతరులతో కలసి ఉమ్మడిగా తీసుకునే రుణానికి ఎన్నో కారణాలు ఉంటాయి. విడిగా తీసుకునేందుకు అనుకూలమైన క్రెడిట్ స్కోరు లేకపోవచ్చు. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు) దరఖాస్తుదారుల రుణ చరిత్ర (క్రెడిట్ స్కోరు)ను చూసిన తర్వాతే రుణంపై తేలుస్తాయి. వారి క్రెడిట్ రిపోర్ట్ను పరిశీలించి ఒకవేళ రుణం మంజూరు చేస్తే తిరిగి చెల్లించే సామర్థ్యం వారికి ఉందా అని ఆరాతీస్తాయి. రుణ ఎగవేతల నివారణకు తీసుకునే చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నాయి. ఒకవేళ ఒకరి క్రెడిట్ రిపోర్ట్ మంచిగా ఉండి, గతంలో తీసుకున్న రుణాలకు చెల్లింపులు సకాలంలో చేసి ఉంటే, సహజంగానే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది. ఇటువంటి వారికి గృహ రుణం సులభంగానే లభిస్తుంది. అయితే, క్రెడిట్ స్కోరు తగినంత లేని వారి పరిస్థితి ఏంటి? వీరు ఆశ కోల్పోనవసరం లేదు. క్రెడిట్ స్కోరు మంచిగా ఉన్న మరో వ్యక్తితో కలసి ఉమ్మడిగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవడమే పరిష్కారం. మీరు ఎంచుకునే ఆ భాగస్వామి క్రెడిట్ స్కోరు మంచిగా ఉంటే, అప్పుడు సులభంగానే రుణం లభిస్తుంది. ఇక తీసుకున్న రుణాన్ని తాము ఒక్కరమే తిరిగి చెల్లించడం కష్టమని భావించే వారు కూడా ఉమ్మడిగా రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాగే, భార్యాభర్తలు ఇరువురూ వేతన జీవులు అయి ఉంటే, పన్ను ప్రయోజనం ఇరువురికీ అవసరం కనుక జాయింట్ హోమ్లోన్కు మొగ్గు చూపుతారు. సానుకూలతలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే సాధారణ హోమ్లోన్తో పోలిస్తే ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు లభించే అవకాశాలు ఎక్కువ. ఖరీదైన ప్రాపర్టీ అయితే పెద్ద మొత్తంలోనే గృహ రుణాన్ని పొందొచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం జాయింట్ హోమ్లోన్లో ఇద్దరూ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. రుణంపై చేసే వడ్డీ చెల్లింపులకు గాను ఒక్కొక్కరు విడిగా రూ.2లక్షలను మినహాయింపు చూపించుకోవచ్చు. అలాగే, రుణం అసలుకు చేసే చెల్లింపులు రూ.1.5 లక్షలపై అదనంగా తమ ఆదాయం నుంచి పన్ను మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది. బలహీన క్రెడిట్ స్కోరు ఉన్న వారికి కూడా జాయింట్ హోమ్లోన్లో సులభంగా రుణం లభిస్తుంది. ప్రతికూలతలు జాయింట్ లోన్ తీసుకునే వారు గుర్తించుకోవాల్సిన ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న తర్వాత వారిలో ఒకరు తమవాటా చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే ఇద్దరి క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. ఇక భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని, అది చెల్లించే కాలంలో విభేదాల కారణంగా వారు విడిపోతే న్యాయపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రాపర్టీ అనేది ఒకరి పేరిట నమోదై ఉండి, ఇద్దరూ కలసి రుణం తీసుకుని పూర్తిగా చెల్లించారనుకోండి. అయినప్పటికీ ప్రాపర్టీ ఉన్న వారికే దానిపై చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. అపోహలకు చెక్ ► జాయింట్ హోమ్లోన్ విషయంలో ఎన్నో సందేహా లు ఉన్నాయి. రుణం తీసుకునే వారు ముందుగా వీటిపై స్పష్టత తెచ్చుకోవాలి. ప్రాథమిక రుణ దరఖాస్తుదారునితో సమానంగా సహ దరఖాస్తుదారునిపైనా గృహ రుణం చెల్లించాల్సిన బాధ్యత సమంగానే ఉంటుంది. అందుకే రుణ డాక్యుమెంట్పై సంతకం చేయడానికి ముందే నిబం ధనలపై పూర్తిగా స్పష్టత తెచ్చుకోవాలి. బ్యాంకుతో చేసుకునే ఒప్పందం గురించి సందేహాలు తీర్చుకోవాలి. ► ఉమ్మడిగా తీసుకునే రుణంలో ఒక్కరికే పన్ను ప్రయోజనాలు లభిస్తాయా? అంటే... ఇద్దరు గ్రహీతలకూ ప్రయోజనాలు సమానంగా వర్తిస్తాయి. కానీ, ఉమ్మడిగా తీసుకునే రుణాలపై పన్ను స్పష్టత కోసం ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 24ను చూడాల్సి ఉంటుంది. ఆదాయపన్ను శాఖ మార్గదర్శకాల ప్రకారం... సహ రుణ గ్రహీత పన్ను ప్రయోజనాలు క్లెయి మ్ చేసుకోవాలనుకుంటే సంబంధిత ఆస్తికి అతను లేదా ఆమె సైతం సహ యజమాని అయి ఉండాలి. ► ఒక్కరు విడిగా దరఖాస్తు చేయడంతో పోలిస్తే మరొకరితో కలసి జాయింట్గా దరఖాస్తు చేసుకుంటే రుణాన్ని సులభంగా పొందడం అన్నది నిజమే. అయితే, కచ్చితంగా రుణం వస్తుందన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఎందుకంటే గృహ రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అధిక రిస్క్తో కూడినవిగానే పరిగణిస్తాయి. కనుక సహ దరఖాస్తుదారునితో కలసి రుణం తీసుకునే ప్రయత్నం చేసే వారు... వారి క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండి, ఈఎంఐ చెల్లించేంత ఆదాయం కలిగి ఉంటేనే రుణాన్ని పొందగలరు. ఉమ్మడి గృహ రుణం విషయంలో ఈ అంశాలతోపాటు వడ్డీ రేటు సహా చూడాల్సినవి మరి కొన్ని కూడా ఉన్నాయి. ఒక్కసారి రుణం తీసుకుంటే వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు కనుక ముందే సమగ్రంగా విచారించుకుని నిర్ణయం తీసుకోవాలి. గృహ రుణానికి అర్హతలు ఇంటి రుణం దరఖాస్తును ఆమోదించడానికి ముందు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఏఏ అంశాలను చూస్తాయి? రుణం ఇస్తే ఎగవేతకు అవకాశం లేదని ఎలా తేలుస్తాయి? ఇవి తెలిస్తే దరఖాస్తుదారులు తమకు రుణం వస్తుందో లేదో తెలుసుకోవడం సులభం. ఇంటి రుణం విషయానికి వస్తే ప్రతీ దరఖాస్తుదారుని అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. వీటిని ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. వయసు దరఖాస్తుదారుని వయసు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంటి రుణంలో గరిష్ట టర్మ్ 30 ఏళ్ల వరకే ఉంటుంది. చిన్న వయసులో ఉన్న వారు అయితే దీర్ఘకాలానికి ఇంటి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే మధ్య వయసుకు వచ్చిన వారికి దీర్ఘకాలిక రుణానికి అవకాశం ఉండదు. ఎందుకంటే 25 ఏళ్ల వయసుతో పోలిస్తే, 40–45 ఏళ్ల వయసున్న వ్యక్తి పదవీ కాలం తక్కువగా ఉంటుంది కనుక. ఈ నేపథ్యంలో యుక్తవయసులో ఉన్న వారికి ఎక్కువ మొత్తంలో రుణం, దీర్ఘకాలానికి లభించే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు, ప్రాపర్టీ వయసు, సైజును కూడా బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి తీసుకున్న రుణాన్ని క్రమం తప్పకుండా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాలంటే గ్రహీత ఆదాయం దాన్ని నిర్దేశిస్తుంది. అందుకే ఎంత ఆదాయం వస్తోంది, స్థిరత్వం ఏ మేరకు తదితర అంశాలు రుణం మొత్తాన్ని నిర్ణయిస్తాయి. క్రెడిట్ హిస్టరీ దరఖాస్తుదారుని రుణ చరిత్ర కూడా కీలకం అవుతుంది. గతంలో తీసుకున్న రుణాలు, వాటికి చెల్లింపులు ఏ విధంగా చేశారన్నది క్రెడిట్ రిపోర్ట్లో తెలుస్తుంది. మంచి స్కోరు ఉందంటే రుణ ఎగవేత అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉన్న వారికి బ్యాంకులు సులభంగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఇతర బాధ్యతలు అలాగే, దరఖాస్తుదారునిపై ఇప్పటికే ఉన్న ఆర్థిక, రుణ బాధ్యతలు కూడా పరిశీలనకు వస్తాయి. కారు రుణం, క్రెడిట్ కార్డు వంటివి తీసుకుంటే వాటిని కూడా ఇంటి రుణం దరఖాస్తు పరిశీలనలో భాగంగా బ్యాంకులు చూసి, చెల్లింపుల సామర్థ్యంపై అంచనాకు వస్తాయి. వ్యక్తిగత ప్రొఫైల్ వీటితోపాటు దరఖాస్తుదారుని వ్యక్తిగత ప్రొఫైల్ కూడా కీలకం అవుతుంది. విద్యార్హతలు, బ్యాక్గ్రౌండ్ను రుణదాతలు చెక్ చేసుకుంటారు. మంచి విద్యార్హతలు కలిగిన వారికి ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయి. వీరికి రుణం ఇచ్చినా తిరిగి చెల్లించగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే బ్యాంకులు వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. హామీదారుగా ఉంటే ఇప్పటికే ఏదైనా రుణానికి హామీదారుగా ఉన్నారనుకుంటే... ఆ మేరకు దరఖాస్తుదారుని అర్హత నుంచి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మినహాయించి చూస్తాయి. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించలేని పరిస్థితుల్లో ఆ బాధ్యత హామీగా ఉన్న వారిపైనే పడుతుంది. కనుక ఇది కూడా రుణ దరఖాస్తుదారుని అర్హతలను ప్రభావితం చేసే అంశంగా గుర్తు పెట్టుకోవాలి. అర్హత ఉంటే... అర్హత ఉందని నిర్ధారణకు వస్తే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తర్వాతి అంశాలపై దృష్టి పెడతాయి. వీటిల్లో ఆదాయంతో రుణ వాయిదా రేషియో ఒకటి. రుణ వాయిదా చెల్లింపుల కోసం వచ్చే ఆదాయంలో పక్కన పెట్టాల్సిన మొత్తం. ఆదాయంలో సగాన్ని సాధారణ ఖర్చుల కింద మినహాయించి మిగిలిన మొత్తంలో బాధ్యతలను చూస్తాయి. అంటే అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని వాటికి వాయిదాలు చెల్లిస్తున్నట్టయితే ఆదాయంలో కచ్చితమైన బాధ్యతల కింద ఆ మొత్తాన్ని మినహాయిస్తాయి. లోన్ కాస్ట్ రేషియో కూడా ఒకటి. ప్రాపర్టీకి ఇచ్చే రుణంలో దరఖాస్తుదారుని వాటాను చూస్తాయి. అర్హతను పెంచుకునే మార్గాలు ► జీవిత భాగస్వామి లేదా కుటుంబంలో సన్నిహిత వ్యక్తిని సహ దరఖాస్తుదారునిగా చేర్చుకుంటే రుణం లభించడం సులువు అవుతుంది. ► క్రమం తప్పకుండా ఆదాయం, పొదుపు, పెట్టుబడుల చరిత్ర ఉంటే రుణం లభించడం తేలిక. ► అదనపు ఆదాయ వనరుల గురించి కూడా దరఖాస్తుతోపాటు తెలియజేయడం అవసరం. అద్దె ఆదా యం, వ్యాపారం, వృత్తి పరంగా ఇతర ఆదాయ వనరుల గురించి తప్పక తెలియజేయడం లాభిస్తుంది. ► ఇక ఇంటి రుణం అవసరం అనుకునే వారు ముందు నుంచే తమ క్రెడిట్ స్కోరును పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. రుణాలు ఏవైనా తీసుకుని ఉంటే ముందుగా చెల్లించేయడం, బకాయిలు ఉంటే వెంటనే తీర్చేయడం చేయాలి. చాలా వరకు రుణమిచ్చే సంస్థలు క్రెడిట్స్కోరును తెలుసుకునే అవకాశాన్ని ఆన్లైన్లో ఉచితంగానే కల్పిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. -
కొంచెం కనికరించండి..!
ముంబై: ఆర్బీఐ నూతన గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ముంబైలో ప్రభుత్వరంగ బ్యాంకుల సారథులతో భేటీ అయ్యారు. అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. ఆర్బీఐ అనుసరిస్తున్న కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ), రుణ చెల్లింపుల్లో ఒక్క రోజు ఆలస్యమైనా ఆయా ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరించడమనే నిబంధనలను సడలించాలని ఈ సందర్భంగా ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులు కోరారు. అలాగే, బ్యాంకులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై దాస్తోపాటు ఆర్బీఐకి చెందిన నలుగురు డిప్యూటీ గవర్నర్లు చర్చించారు. వీటిల్లో ద్రవ్య లభ్యత, ఎన్బీఎఫ్సీల సంక్షోభం వంటి అంశాలున్నాయి. ఎస్బీఐ, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, దేనా బ్యాంకు చీఫ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీసీఏ నిబంధనలను సరళించాలని గవర్నర్ను కోరినట్టు వీరు తెలిపారు. బ్యాలన్స్ షీట్లను చక్కదిద్దుకోలేక, ఎన్పీఏలు భారీగా పెరిగిపోయిన ప్రభుత్వరంగ బ్యాంకులను ఆర్బీఐ పీసీఏ పరిధిలోకి తీసుకొచ్చి కఠినంగా వ్యవహరిస్తోంది. 21 ప్రభుత్వరంగ బ్యాంకులకు 11 బ్యాంకులు పీసీఏ పరిధిలో ఉన్నాయి. దీంతో ఈ బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడంపై ఆంక్షలు అమలవుతున్నాయి. కాగా, నియంత్రణ సంస్థ, బ్యాంకుల మధ్య చర్చలకు వీలు కల్పించడమే ఈ సమావేశం ఉద్దేశమని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా మీడియాకు తెలిపారు. దాస్కు నేడే తొలి పరీక్ష! గవర్నర్గా తొలి బోర్డు సమావేశం నేడు న్యూఢిల్లీ: నూతన గవర్నర్ శక్తికాంత్దాస్ ఆధ్వర్యంలో ఆర్బీఐ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం సమావేశం కాబోతుంది. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యాంకు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియపై డైరెక్టర్ల నుంచి ప్రశ్నలు ఎదురుకానున్నాయి. నవంబరు 19న జరిగిన గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రగతిపై సమీక్ష జరగనుంది. డీమోనిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాల కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)కు ఉపశమనం కల్పించే చర్యలు, ఆర్బీఐ విధాన నిర్ణయాల్లో సెంట్రల్ బోర్డు పాత్రపైనా చర్చ జరగనుంది. ప్రస్తుత నిర్మాణంలో, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం అవుతోంది. ప్రభుత్వ ప్రాతినిధ్యం కూడా ఉన్న బోర్డును ఆర్బీఐ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ భాగస్వామిని చేయాలన్న ప్రతిపాదన ఉంది. ఒక్కరోజు రుణ చెల్లింపుల్లో విఫలమైనా దాన్ని ఎన్పీఏగా వర్గీకరించడం వంటి ఎన్నో కీలక అంశాల్లో ప్రస్తుతం బోర్డు జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయితే, ఆర్బీఐ బోర్డు కేవలం సలహా పాత్రకే పరిమితం కావాలని, ఆర్బీఐ స్వతంత్రత, స్వయంప్రతిపత్తిని కాపాడాలన్నది మాజీ గవర్నర్లు, నిపుణుల అభిప్రాయం. ఆర్బీఐ స్వతంత్రతను, విశ్వసనీయతను తాను కాపాడతానని గవర్నర్ బాధ్యతల తర్వాత దాస్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను సమయానుకూలంగా పరిష్కరిస్తామని కూడా ఆయన చెప్పారు. ఆర్బీఐ సెంట్రల్ బోర్డుకు గవర్నర్ అధిపతిగా వ్యవహరిస్తారు. ఇందులో ఇద్దరు ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు, 11 ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉంటారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టిన రెండోరోజే ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో దాస్ సమావేశం కాగా, మూడో రోజు ఆర్బీఐ బోర్డు కీలక సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వానికి ఆర్బీఐ మద్దతివ్వాలి ఏ సంస్థనూ నిర్వీర్యం చేయలేదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముంబై: ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వీర్యం చేయబోదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆర్బీఐ ప్రభుత్వంలో ఒక భాగమని, అది ప్రభుత్వ ఆర్థిక విధానానికి మద్దతుగా నిలవాలని అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదాల వల్ల ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసిన నేపథ్యంలో మంత్రి గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉర్జిత్ పటేల్ స్థానంలో శక్తికాంత దాస్ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర బ్యాంకు స్వతంత్ర సంస్థగానే పనిచేయాలని, అదే సమయంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలకు కూడా మద్దతు నివ్వాలన్న అభిప్రాయాన్ని గడ్కరీ వ్యక్తం చేశారు. ఏ విధంగానూ సెంట్రల్ బ్యాంకును తాము దెబ్బతీయలేదన్నారు. దేశం కోసం ఆర్థిక మంత్రి ఓ విధానాన్ని ప్రతిపాదిస్తే దానికి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఆర్బీఐపై లేదా? అని గడ్కరీ ప్రశ్నించారు. ‘‘ఎక్కడైనా ఎగుడుదిగుళ్లు సహజమే. ఏ సంస్థనూ మేం నిర్వీర్యం చేయలేదు. ఆర్బీఐ నిర్వహణలో మేమేమీ రాజకీయంగా జోక్యం చేసుకోలేదు. పారదర్శకమైన, అవినీతి రహిత వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉంది. వేగంగా నిర్ణయాలు తీసుకునే ప్రక్రియకు తోడు, ప్రభుత్వ నిర్ణయాలకు ప్రతీ సంస్థ కట్టుబడాలి’’ అని గడ్కరీ చెప్పారు. ఒకవేళ ఆర్బీఐ పూర్తి సర్వస్వతంత్రంగా ఉండాలనుకుంటే, ఆర్థిక అనారోగ్యానికి అదే బాధ్యత వహించాలని, ఆర్థిక శాఖ కాదని చెప్పారాయన. ‘‘ఒకవైపు ఆర్థిక వ్యవస్థలో అనారోగ్యాలకు బాధ్యత మాదంటారు. దాంతో మేము నిర్ణయాలు తీసుకుంటే ఆర్బీఐ స్వతంత్రత ప్రమాదంలో పడిందంటారు’’ అని గడ్కరీ పేర్కొన్నారు. మాల్యాకు మద్దతు! వ్యాపారంలో ఎత్తు పల్లాలు ఉంటాయని, అది బ్యాంకింగ్ అయినా, బీమా అయినా తప్పిదాలు జరిగితే క్షమించి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. ఓ కంపెనీ వ్యాపార పరంగా గడ్డు పరిస్థితుల్లోకి వెళితే ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాలా కాలం క్రితం మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ సికామ్ విజయ్ మాల్యాకు రుణం ఇచ్చిందని, మాల్యా దానికి 40 ఏళ్ల పాటు వడ్డీ కట్టారని చెప్పారు. ‘‘ఒక వ్యక్తి రుణానికి 40 ఏళ్లు చెల్లింపులు చేసి, ఆ తర్వాత ఏవో కారణాల వల్ల రుణ చెల్లింపులు చేయలేకపోతే అతన్ని ఉద్దేశపూర్వక ఎగవేతదారు అని నిర్ధారించడం సరికాదన్నారు. ‘‘నీరవ్మోదీ లేదా విజయ్ మాల్యా మోసానికి పాల్పడితే వారిని జైలుకు పంపించాలి. కానీ, ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రతీ ఒక్కరినీ మోసగాళ్లుగా చిత్రీకరిస్తే ఆ ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందలేదు’’ అని గడ్కరీ అభిప్రాయపడ్డారు. -
దిగజారిన సీఎఫ్వోల ఆశావాదం
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఎదుర్కొంటున్న నిధుల లభ్యత సమస్య, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాల కారణంగా దేశంలో కంపెనీల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్వో) ఆశావాదం 19 త్రైమాసికాల కనిష్ట స్థాయికి దిగజారింది. దేశంలో అన్ని రంగాలకు చెందిన 300 మంది సీఎఫ్వోల నుంచి వారి కంపెనీల ఆరోగ్య స్థితి, వ్యాపార రిస్క్ పరిస్థితులు, స్థూల ఆర్థిక పరిస్థితులపై అభిప్రాయాలను డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది. సీఎఫ్వోల ఆశావాద సూచీ సెప్టెంబర్ త్రైమాసికంలో 17 శాతం తగ్గి 90.2కు చేరింది. నిధుల లభ్యత తగ్గొచ్చని లేదా ప్రస్తుత స్థాయిలోనే ఉండొచ్చన్న అభిప్రాయాన్ని 72 శాతం మంది సీఎఫ్వోలు తెలియజేశారు. -
బ్యాంక్లకు భలే అవకాశం
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) తాజా సంక్షోభం బ్యాంక్లకు మంచి అవకాశంగా మారనున్నట్లు సింగపూర్కు చెందిన డీబీఎస్ అంచనా వేసింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రుణాల్లో 12–15 శాతం వాటా ఎన్బీఎఫ్సీలదేనని డీబీఎస్ ఆర్థిక వేత్త రాధిక రావు పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ఎన్బీఎఫ్సీలకు లిక్విడిటీ సమస్యలు తలెత్తడంతో ఈ వాటా రుణాలు బ్యాంక్లకు దక్కనున్నాయి. కాకపోతే ఈ రుణ డిమాండ్ను తట్టుకునే పరిస్థితుల్లో బ్యాంక్లు లేవు. మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో పలు ప్రభుత్వ రంగ బ్యాంక్లపై ఆర్బీఐ కఠిన చర్యల చట్రాన్ని బిగిస్తోంది. ఫలితంగా తాజా రుణాలను బ్యాంక్లు జారీ చేయలేవు’’ అని రాధిక వివరించారు. సూక్ష్మ, గృహ, వాహన గ్రామీణ రుణాలిచ్చే ఎన్బీఎఫ్సీలు బాగా విస్తరించాయని, భౌగోళికంగా బ్యాంక్లు ఈ స్థాయిలో చొచ్చుకుపోలేదని తెలిపారు. ఎన్బీఎఫ్సీల తాజా సంక్షోభం కారణంగా జీడీపీ అంచనాలను డీబీఎస్ తగ్గించే అవకాశాలున్నాయని కూడా చెప్పారామె. జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.4%గా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతంగా ఉండొచ్చని డీబీఎస్ అంచనా వేస్తోంది. ఎన్బీఎఫ్సీల సంక్షోభంపై ఆమె ఇంకా ఏం చెప్పారంటే... ►ఈ సంక్షోభం కారణంగా ఎన్బీఎఫ్సీల ఆర్థిక స్థితిగతులు కుదేలయ్యాయి. ఫలితంగా ఈ షాడో బ్యాంక్ల రుణ వితరణ మందగిస్తుంది. ► తాజా పరిస్థితుల కారణంగా ఎన్బీఎఫ్సీలపై నియంత్రణలు మరింత కట్టుదిట్టమవుతాయి. ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నిర్వహణ పనితీరు కఠినంగా మారనున్నది. ► ఫలితంగా ఎన్బీఎఫ్సీల రుణ వితరణ తగ్గుతుంది. దీంతో వాటి జోరుకు అడ్డుకట్ట పడటమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థలో రుణ వితరణ మందగిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ► రుణ వృద్ధి మందగమనం కారణంగా రుణ నాణ్యతపై ఆందోళన తగ్గుముఖం పడుతుంది. నష్ట భయం అధికంగా ఉన్న రుణాలు తగ్గి నాణ్యత గల రుణాలు పెరుగుతాయి. ► సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలకు రెండేళ్ల క్రితం ఎన్బీఎఫ్సీల రుణాలు 8.4 శాతంగా ఉండగా, ఈ ఏడాది ఇది 11.3 శాతానికి పెరిగింది. ఈ వాణిజ్య సంస్థలకు బ్యాంక్లిచ్చిన రుణాలు 60 శాతం నుంచి 51 శాతానికి పడిపోయాయి. ► ఈ ఏడాది సెప్టెంబర్లో 12.5 శాతంగా ఉన్న బ్యాంక్ రుణ వితరణ ఈ అక్టోబర్లో 14.4 శాతానికి పెరిగింది. ఎన్బీఎఫ్సీలు క్యాపిటల్/మనీ మార్కెట్ల నుంచి కాకుండా బ్యాంక్ల నుంచి రుణాలు తీసుకోవడం పెరగడమే దీనికి ప్రధాన కారణం. ► మార్కెట్ ఆధారిత రుణాలపై వడ్డీ వ్యయాలు పెరగడంతో పలు ఎన్బీఎఫ్సీలు బ్యాంక్ రుణాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ► పెద్ద ఎన్బీఎఫ్సీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులు సమీకరించి, వ్యయాలను నియంత్రణలో ఉంచుకోగలవు. కానీ చిన్న ఎన్బీఎఫ్సీలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధులు సమీకరణ కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారమే. -
గృహరుణాలకు ఎన్బీఎఫ్సీ దెబ్బ
ముంబై: నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) నిధుల కొరతతో అల్లాడుతుండటం.. వాటిపై ఆధారపడిన పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా గృహ రుణాలు, ద్విచక్ర వాహనాలు మొదలైన విభాగాలపై ఇది మరింతగా కనిపించనుంది. వివిధ కన్సల్టెన్సీలు విడుదల చేసిన నివేదికల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నిధుల కొరత కారణంగా కొన్ని ఎన్బీఎఫ్సీల.. గృహ రుణాల మంజూరీ కార్యకలాపాలు మందగించే అవకాశాలున్నాయని జపనీస్ బ్రోకరేజి సంస్థ నొమురా పేర్కొంది. ఇప్పటికే గృహాల ధరల్లో వృద్ధి మందగించిందని, తాజా పరిణామాలతో ఆ ఒత్తిడి ఇకపైనా కొనసాగవచ్చని తెలిపింది. దీన్ని బ్యాంకులు అందిపుచ్చుకుని, ఆ మేరకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవచ్చని నొమురా వివరించింది. కానీ, అంతిమంగా రుణగ్రహీతలు అధిక వడ్డీలు చెల్లించాల్సి రావొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీలు రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న కారణంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లకు కూడా సమస్యలు ఎదురుకావచ్చని వివరించింది. అమ్ముడు కాని గృహాల సంఖ్య పెరిగిపోతూ ఒత్తిడిలో ఉన్న రియల్టర్లకు ఇది మరింత సమస్యాత్మకంగా మారవచ్చని పేర్కొంది. మరోవైపు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల నిధుల కొరత కష్టాలను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ మరిన్ని చర్యలు ప్రకటించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్యేతర ఫైనాన్సింగ్ కార్యకలాపాల్లోని ఎన్బీఎఫ్సీలకి బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలకూ ప్రతికూలం ఎన్బీఎఫ్సీలకు నిధుల సమస్యలు అటు ద్విచక్రవాహనాల అమ్మకాలకు కూడా ప్రతికూలం కానున్నాయి. కమర్షియల్ పేపర్స్ ద్వారా సమీకరించిన రుణాలను చాలామటుకు ఎన్బీఎఫ్సీలు త్వరలో తిరిగి చెల్లించాల్సి రానుందని, దీంతో వాటి వద్ద నిధుల కొరత ఏర్పడి రుణాల మంజూరీ సామర్ధ్యం తగ్గొచ్చని క్రెడిట్ సూసీ పేర్కొంది. దీంతో ఈ మధ్యకాలంలో ఎన్బీఎఫ్సీల ఫైనాన్సింగ్తో గణనీయంగా పెరిగిన టూ–వీలర్ల అమ్మకాలపై ప్రభావం పడొచ్చని వివరించింది. 2014 ఆర్థిక సంవత్సరంలో 30 శాతంగా ఉన్న టూవీలర్ ఫైనాన్సింగ్.. ఎన్బీఎఫ్సీల ఊతంతో 2018 ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి చేరింది. ప్రస్తుతం టూవీలర్ ఫైనాన్సింగ్లో ఎన్బీఎఫ్సీల వాటా దాదాపు 60 శాతంగా ఉన్నట్లు క్రెడిట్ సూసీ తెలిపింది. కార్లు, వాణిజ్య వాహనాలు మొదలైన వాటికి కూడా ఫైనాన్సింగ్ జరుగుతున్నప్పటికీ ఇటు బ్యాంకులు, అటు ఎన్బీఎఫ్సీల రుణాల వాటా దాదాపు సమస్థాయిలోనే ఉంటోందని, కానీ టూవీలర్ రుణాల సెగ్మెంట్లో నాన్–బ్యాంకింగ్ సంస్థల వాటా అధికంగా ఉందని వివరించింది. టూవీలర్ల అమ్మకాల్లో దాదాపు 25 శాతం ఉండే పండుగ సీజన్లోనే ఉంటాయని, అయితే సరిగ్గా ఇదే సమయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో వాటి అమ్మకాలకు ప్రతికూలం కాగలదని తెలిపింది. టూ వీలర్లలో ఐషర్ వాహనాలు ఎక్కువగా ఫైనాన్స్పై అమ్ముడవుతుంటాయని.. బజాజ్ తదితర సంస్థల తరహాలో ఆ కంపెనీకి సొంత ఫైనాన్స్ సంస్థ లేకపోవడంతో అమ్మకాలపై అత్యధికంగా ప్రభావం ఉండొచ్చని క్రెడిట్ సూసీ వివరించింది. -
రూ.45,000 కోట్ల ఎన్బీఎఫ్సీ ఆస్తులను కొంటాం
న్యూఢిల్లీ: నిధుల కటకటతో కష్టాలుపడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లను ఆదుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ముందుకు వచ్చింది. ఎన్బీఎఫ్సీల ఆస్తులను(రుణ పోర్ట్ఫోలియోలను) రూ.45,000 కోట్ల మేర కొనుగోలు చేయాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్వీట్ చేశారు. ఈ ఎస్బీఐ నిర్ణయంతో ఎన్బీఎఫ్సీల లిక్విడిటీ సమస్య తీరుతుందని ఆయన పేర్కొన్నారు. ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలు రుణాల చెల్లింపుల్లో విఫలం కావడం.. ఈ ప్రభావం ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్పై తీవ్రంగా ఉండటం తెలిసిందే. మాకూ ప్రయోజనకరమే... ప్రస్తుత ఏడాది రూ.15,000 కోట్ల మేర పోర్ట్ఫోలియో ఆస్తులు కొనుగోలు చేయాలని గతంలోనే నిర్ణయించామని ఎస్బీఐ ఎమ్డీ పి.కె. గుప్తా తెలిపారు. అయితే తాజా అంతర్గత మదింపు కారణంగా ఈ మొత్తాన్ని రూ.20,000 నుంచి రూ.30,000 కోట్లకు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. ఎన్బీఎఫ్సీల ఆస్తులు ఆకర్షణీయ ధరలకు లభిస్తుండటంతో ఇది తమకు మంచి వాణిజ్య అవకాశమని వివరించారు. ఎన్బీఎఫ్సీల ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల ఎస్బీఐకీ, ఎన్బీఎఫ్సీలకు ప్రయోజనకరమేనని తెలిపారు. ఎన్బీఎఫ్సీలకు లిక్విడిటీ సమస్య తీరుతుందని, మరోవైపు తమకు ఉత్తమమైన రుణ పోర్ట్ఫోలియోలు లభిస్తాయని వివరించారు. మరోవైపు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల నియంత్రణ సంస్థ నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్హెచ్బీ) సోమవారమే మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల రీఫైనాన్స్ పరిమితిని రూ.24,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు పెంచింది. దీంతో ఎన్బీఎఫ్సీలకు కొంత ఊరట లభించనున్నది. -
ఎన్బీఎఫ్సీల సంక్షోభం.. బ్యాంకులకు వరం
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) సంక్షోభం మరింతగా ముదురుతుండటం.. వాణిజ్య బ్యాంకులకు వరంగా మారొచ్చని సింగపూర్కి చెందిన బ్రోకింగ్ సంస్థ డీబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. దీన్ని అవకాశంగా మల్చుకుని బ్యాంకులు మళ్లీ కార్పొరేట్ల రుణాల మార్కెట్లో తమ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల రుణ అవసరాలు తీర్చేందుకు బ్యాంకులే ప్రధాన వనరుగా మారవచ్చని వివరించింది. మొండిబాకీల సమస్యలతో 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆర్బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్నప్పటికీ ఇది సాధ్యమేనని డీబీఎస్ పేర్కొంది. 2016 ఆర్థిక సంవత్సరంలో వ్యాపార సంస్థలకు రుణాల్లో బ్యాంకుల మార్కెట్ వాటా 55 శాతంగా ఉండగా.. 2017 ఆర్థిక సంవత్సరంలో 34 శాతానికి తగ్గింది. మళ్లీ 2018 ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి చేరిందని డీబీఎస్ వివరించింది. -
ఆర్బీఐ పాలసీ, ఎన్బీఎఫ్సీలపై దృష్టి!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష, స్థూల ఆర్థిక సమాచార వెల్లడి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) రంగంలో చోటుచేసుకోనున్న పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్కు అత్యంత కీలకంగా ఉండనున్నట్లు దలాల్ స్ట్రీట్ పండితులు అంచనావేస్తున్నారు. అమెరికా–చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం, పెరుగుతున్న ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 72.48 వద్ద ముగియడం లాంటి ప్రతికూల అంశాలు మార్కెట్ను వెంటాడుతున్న నేపథ్యంలో బలహీన సెంటిమెంట్ కొనసాగేందుకే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. ‘బోటమ్ ఫిషింగ్కు ఇన్వెస్టర్లలో మార్కెట్పై ఇంకా భరోసా పెరగాల్సిఉంది. ద్రవ్య లభ్యత కొరత, మార్జిన్ ఫండింగ్ తక్కువగా ఉండటం, షార్ట్ సెల్లింగ్ వంటి పలు కారణాలు వల్ల ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగానే ఉండేందుకు ఆస్కారం ఉంది. అంగీకార స్థాయికి విలువ చేరుకునే వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. ఆర్బీఐ పాలసీ సమీక్ష ఈ వారంలో కీలకంగా ఉంది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. సెప్టెంబరు నెలకు సంబంధించిన ఆటో రంగ అమ్మకాల గణాంకాలు నేడు (సోమవారం) వెల్లడికానున్నాయి. అదే నెలకు చెందిన తయారీ రంగ కార్యకలాపాలను సూచించే నికాయ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సమాచారం నేడు వెల్లడికానుండగా.. సేవల రంగ పీఎంఐ గణాంకాలు 4న (గురువారం) విడుదలకానుంది. ఇక మంగళవారం (అక్టోబరు 2న) గాంధీ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. టారిఫ్ విధించే యోచనలో అమెరికా ‘అమెరికా ఉత్పత్తులపై భారత్ 60% టారిఫ్ విధిస్తోంది. అవే ఉత్పత్తులను మళ్లీ అమెరికాకు ఎగుమతి చేసినప్పుడు మేము ఎటువంటి టారిఫ్ విధించడం లేదు. వీటిపై 10–25% పన్నులు విధించే యోచనలో ఉన్నాం. అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యాలు చేశారు. ఈ అంశం సైతం మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం..! ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈనెల 3న సమావేశంకానుంది. అక్టోబరు 5న (శుక్రవారం) భేటీ ముగింపు తర్వాత.. మధ్యాహ్నం 2.30కి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షపై కమిటీ కీలక ప్రకటన చేయనుంది. ఆగస్టులో రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ ఈసారి సమావేశంలో కూడా పెంపు ప్రకటన చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి కూడా 25 బేసిస్ పాయింట్లు పెంపు ఉండవచ్చని హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘నిధుల ప్రవాహం, కొనసాగుతున్న యుద్ధభయాలు, ముడిచమురు ధరల్లో పెరుగుదల, రూపాయి బలహీనత వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టులో మరోసారి వడ్డీ రేట్ల పెంపు ప్రకటన ఉండవచ్చు.’ అని ఎస్ఎమ్సీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్ డీ కే అగర్వాల్ విశ్లేషించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరగవచ్చని, మార్కెట్కు ఆర్బీఐ నిర్ణయం కీలకంగా ఉందని డెల్టా గ్లోబల్ పాట్నర్స్ ప్రిన్సిపల్ పాట్నర్ దేవేంద్ర నెవ్గి అన్నారు. 10,850 వద్ద కీలక మద్దతు ‘దిగువస్థాయిలో నిఫ్టీకి ఈవారం 10,850 పాయింట్లు కీలక మద్దతుగా ఉంది. ఈ వారం మార్కెట్ పుంజుకున్న పక్షంలో అత్యంత కీలక నిరోధం 11,050 పాయింట్ల వద్ద ఉంది.’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. 4–నెలల గరిష్టస్థాయికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) సెప్టెంబరులో రూ.21,023 కోట్లను భారత మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. రూ.10,825 కోట్లను ఈక్విటీ మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్న వీరు.. రూ.10,198 కోట్లను డెట్ మార్కెట్ నుంచి వెనక్కుతీసుకున్నారు. ఈఏడాదిలో ఇప్పటివరకు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.13,000 కోట్లను, డెట్ మార్కెట్ నుంచి రూ.48,000 కోట్లను ఉపసంహరించు కుని నికర అమ్మకందారులుగా నిలిచారు. -
ఎన్బీఎఫ్సీలకు ‘ఐఎల్ఎఫ్ఎస్’ ముప్పు!
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి రుణాలు, నిర్మాణ రంగంలో కార్యకలాపాలు నిర్వహించే ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూపు... తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడం యావత్ ఎన్బీఎఫ్సీ రంగాన్నే తీవ్రంగా కుదిపేస్తోంది. క్రెడిట్ రిస్క్పై సరికొత్త ఆందోళనలకు తావిచ్చింది. అంతేకాదు, ఈ పరిణామం ఎన్బీఎఫ్సీ సంస్థలకు మరణశాసనం కానుంది! సుమారు 1,500 చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థల లైసెన్స్లను ఆర్బీఐ రద్దు చేసే అవకాశం ఉందని, కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టే వాటికి అనుమతులు కూడా మరింత కష్టతరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిధుల బలం ఉండి, సంప్రదాయంగా నడిచే ఫైనాన్స్ కంపెనీలు చిన్న సంస్థలను మింగేయవచ్చన్నది నిపుణులు అంచనా కడుతున్నారు. దీంతో చిన్న మొత్తాల్లో రుణాలు తీసుకునే వారికి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని, ఇది ప్రైవేటు వినియోగం పెరుగుదలను అడ్డుకునే అంశంగా భావిస్తున్నారు. ‘‘వెలుగుచూస్తున్న పరిణామాలు కచ్చితంగా ఆందోళన కలిగించేవి. ఈ రంగం స్థిరకీరణకు గురవుతుంది’’ అని బంధన్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హరూన్ రషీద్ ఖాన్ తెలిపారు. ఆస్తులు, అప్పుల మధ్య అంతరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. బ్యాంకులకు మించి ఎదుగుదల గ్రామీణంగా అధిక రిస్క్తో రుణాలిస్తున్న వేలాది సంస్థల మనుగడను ఐఎల్అండ్ఎఫ్ఎస్ అంశం ప్రశార్థకం చేసింది. దేశవ్యాప్తంగా 11,400 ఎన్బీఎఫ్సీ సంస్థల ఉమ్మడి బ్యాలన్స్ షీటు మొత్తం 22.1 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. బ్యాంకుల కంటే వీటిపై నియంత్రణలు తక్కువే. దీంతో బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీల రుణ పుస్తక మొత్తం రెండు రెట్ల మేర వృద్ధి చెందడం గమనార్హం. అందుకే ఈ విభాగం కొత్త పెట్టుబడిదారులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే, ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభంతో చాలా సంస్థల క్రెడిట్ రేటింగ్కు డౌన్గ్రేడ్ ముప్పు ఏర్పడింది. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, ఐఎల్ ఎఫ్ఎస్ తరహా సంక్షోభాలతో రుణాలకు కటకట ఏర్పడుతుందని, తగినన్ని నిధుల్లేని సంస్థలు నిలదొక్కుకోవడం కష్టమేనన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ‘‘చిన్న ఎన్బీఎఫ్సీ సంస్థలు వ్యయాల పరంగా సమస్యను ఎదుర్కోనున్నాయి. వాటి లిక్విడిటీ (నగదు లభ్యత) ప్రస్తుత స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ, మధ్య, పెద్ద స్థాయి ఎన్బీఎఫ్సీ సంస్థలు తమ లక్ష్యాలను సాధించగలవు. నిధులను పొందగలవు’’ అని క్యాప్రి గ్లోబల్ క్యాపిటల్ ఎన్బీఎఫ్సీ సంస్థ అధిపతి రాజేష్ శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎన్బీఎఫ్సీలకు ఎటువంటి రాయితీలు లేనందున, తమ పోర్ట్ఫోలియో పనితీరును సరిగ్గా నిర్వహించలేని సంస్థలు కనుమరుగవుతాయన్నారు. చిన్న సంస్థలకు అస్తిత్వ ముప్పు కనీసం రూ.2 కోట్ల నిధుల్లేని ఎన్బీఎఫ్సీల రిజిస్ట్రేషన్ను ఆర్బీఐ రద్దు చేసే ప్రక్రియలో ఉందంటున్నారు నిపుణులు. ‘‘ఆర్బీఐ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు వాటి రిజిస్ట్రేషన్ను రద్దు చేసే ప్రక్రియలో ఉంది. 1,500 సంస్థలు కనుమరుగు కానున్నాయి’’ అని ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఈ రంగానికి చెందిన సంఘం) చైర్మన్ రామన్ అగర్వాల్ తెలిపారు. అయితే, ఇదే సమయంలో ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్ కోసం ఆర్బీఐ వద్దకు వందలాది నూతన దరఖాస్తులు వరదగా వస్తున్నట్టు చెప్పారు. ‘‘దేశంలో సుమారు 11,000 వరకు ఎన్బీఎఫ్సీలు 500 కోట్ల రూపాయల్లోపు ఆస్తులు కలిగిన చిన్న, మధ్య స్థాయి సంస్థలే. కానీ, అగ్ర స్థానంలో ఉన్న 400 ఎన్బీఎఫ్సీల్లో చాలా వరకు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలకు చెందినవి. 90 శాతానికి పైగా ఆస్తులు వీటి నియంత్రణలోనే ఉన్నాయి’’ అని రామన్ అగర్వాల్ వివరించారు. కస్టమర్లకు 2 శాతం అదనపు వడ్డీ రేటు విధించినప్పటికీ, ఎన్బీఎఫ్సీలకు కస్టమర్లతో సన్నిహిత సంబంధాలుంటాయన్నారు. తాజా పరిణామాలను ఆర్థికంగా దిగ్గజ సంస్థలైన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ వంటి సంస్థలు తట్టుకుని నిలబడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. గత రెండేళ్ల కాలంలో ఐడీఎఫ్సీ బ్యాంకు, కోటక్ మహింద్రా బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు ఒక్కో మైక్రోఫైనాన్స్ సంస్థను కొనుగోలు చేశాయి. ఇండస్ఇండ్ బ్యాంకు సైతం భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో కొంతమేర స్థిరీకరణ ఉంటుందని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా పేర్కొన్నారు. దీర్ఘకాలంలో ఈ రంగానికి ఇది మేలు చేస్తుందన్నారు. రూ. 300 కోట్లు చెల్లించిన ఐఎల్ఎఫ్ఎస్ ముంబై: పలు రుణ చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూపు, ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్కు మాత్రం రూ.300 కోట్ల బకాయిలను చెల్లించింది. ఆగస్టు 27 నుంచి ఏడు చెల్లింపుల్లో వైఫల్యం చెందినట్టు ఐఎల్ ఎఫ్ఎస్ గ్రూపు స్వయంగా ప్రకటించింది. ‘‘ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు సంస్థ ఐఎల్ అండ్ఎఫ్ఎస్ సెక్యూరిటీస్ నుంచి మా వడ్డీ చెల్లింపులు, మెచ్యూరిటీ తీరిన వాటి చెల్లింపులు జరిగాయి. ఇందులో తుదిగా రూ.300 కోట్లు శుక్రవారం చెల్లించడం జరిగింది’’ అని ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఐఎల్ఎఫ్ఎస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం: గార్గ్ ఐఎల్ఎఫ్ఎస్ కారణంగా ఏర్పడిన పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, ఫైనాన్షియల్ సిస్టమ్పై ఎటువంటి అసాధారణ ప్రభావం లేకుండా చర్యలు తీసుకుంటామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్చంద్ర గార్గ్ చెప్పారు. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు విభాగాలు కొన్ని రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో ఆర్థిక రంగంలో లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎల్ఎఫ్ఎస్ వాటాదారులైన ఎల్ఐసీ, ఎస్బీఐ, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియాల చీఫ్లతో ఆర్థిక శాఖ చర్చించింది. ఈ సమస్య వ్యవస్థలో ఇతర విభాగాలకు వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇన్ఫ్రా విభాగంలో ఇది అతిపెద్ద కంపెనీ అని, ప్రభుత్వ విభాగాలతో ఎక్కువగా భాగస్వామ్యం కలిగి ఉందని గార్గ్ చెప్పారు. చాలా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులను ఈ సంస్థ నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. ఐఎల్ఎఫ్ఎస్ వాటాదారులతో ఆర్బీఐ మంతనాలు ముంబై: తీవ్ర రుణ భారంలో కూరుకుపోయి చెల్లింపుల్లో వైఫల్యం చెందిన ఐఎల్అండ్ఎఫ్ సంస్థను ఒడ్డున పడేయడం, నిధుల సాయం ప్రణాళికలపై ప్రధాన వాటాదారులతో ఆర్బీఐ చర్చించింది. ఐఎల్అండ్ఎఫ్ఎస్ వాటాదారులైన ఎల్ఐసీ, జపాన్కు చెందిన ఓరిక్స్ కార్పొరేషన్ ప్రతినిధులతో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎన్ విశ్వనాథన్, ఎంకే జైన్ శుక్రవారం భేటీ అయి చర్చించారు. ఐఎల్ఎఫ్ఎస్లో ఎల్ఐసీకి 25.34 శాతం, ఓరిక్స్కు 23.54 శాతం వాటాలున్నాయి. అయితే, చర్చల సారాంశం బయటకు రాలేదు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, హెచ్డీఎఫ్సీ, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎస్బీఐలకూ ఈ సంస్థలో వాటాలున్నాయి. తొలుత అందరు వాటాదారులను ఆర్బీఐ భేటీకి ఆహ్వానించగా, ఆ తర్వాత రెండు ప్రధాన వాటాదారులతోనే సమావేశాన్ని పరిమితం చేసింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపు రూ.91,000 కోట్ల రుణ భారాన్ని మోస్తోంది. -
ఎన్బీఎఫ్సీ... ఏం జరుగుతోంది?
స్టాక్ మార్కెట్లను గత ఐదేళ్లుగా చూస్తున్న వారినెవరినైనా అత్యద్భుతంగా పెరిగిన రంగమేదని అడిగితే ఠక్కున ‘ఎన్బీఎఫ్సీ’ అని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ రంగంలోని షేర్లు ఎన్నో రెట్లు పెరిగాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని జనానికిచ్చే ఈ సంస్థలు... బ్యాంకులకన్నా వేగంగా వృద్ధి చెందాయి. అందుకే వీటి షేర్లూ అలానే పెరిగాయి. ఐఎల్ఎఫ్ఎస్... తన చెల్లింపుల్లో తొలిసారి డిఫాల్టయింది ఆగస్టులో. ఆ తరవాత ఐదుసార్లు ఇలాంటి పరిస్థితే వచ్చినా... బయటపెట్టలేదు. అయితే ఈ నెల్లో హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) నుంచి కొన్న రూ.300 కోట్ల రుణపత్రాల్ని మ్యూచ్వల్ ఫండ్ సంస్థ డీఎస్పీ బ్లాక్రాక్ కొంత నష్టానికి మార్కెట్లో ఒకేసారి తెగనమ్మేసింది. దీంతో ఎన్బీఎఫ్సీల విషయంలో భయాలు రేగాయి. పలువురు విశ్లేషకులు... ఇవి చెబుతున్న ఆస్తులకు, వీటి రుణాలకు పొంతన లేదని వ్యాఖ్యానించటంతో పరిస్థితి మరింత దిగజారింది. అప్పటి నుంచి మొదలు... ఎన్బీఎఫ్సీ షేర్లు పేకమేడల్లా కూలుతున్నాయి. ఇది ఇతర ఆర్థిక సంస్థల షేర్లకూ పాకింది. సూచీలు పతనమవటంతో భయాలు మరింత పెరుగుతున్నాయి. నిజానికి తాము డీఎస్పీ బ్లాక్రాక్ విక్రయంతో... డీహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్ అవుతుందేమోనన్న భయాలు పెరిగాయి. కానీ డీహెచ్ఎఫ్ఎల్ వీటిని ఖండిస్తోంది. తమ పరిస్థితి చాలా పటిష్ఠంగా ఉందని చెబుతోంది. ఆ సంస్థ షేరు మాత్రం దాదాపు వారంరోజుల్లో సగానికిపైగానే పతనమైంది. డీఎస్పీ కూడా... వడ్డీ రేట్లు పెరుగుతాయేమోనన్న ఉద్దేశంతో తాము విక్రయించామే తప్ప ఆ సంస్థపై అపనమ్మకంతో కాదని చెబుతోంది. కానీ ఈ షేరు పతనం ఆగటం లేదు. అదే దార్లో పీఎన్బీ హౌసింగ్, కెన్ఫిన్ హోమ్స్ వంటివీ పతనమవుతున్నాయి. నిధులు సమీకరించేదిలా... ఎన్బీఎఫ్సీలు తమకు కావాల్సిన నిధులను బాం డ్లు, డిబెంచర్లు విక్రయించటం ద్వారా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటం ద్వారా సమీకరిస్తుంటాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు పెరిగితే వీటి సమీకరణ రేటు కూడా పెరుగుతుంది. అప్పుడు ఎన్బీఎఫ్సీలు ఇచ్చే రుణాలు మరింత ప్రియమవుతాయి. అందుకే ఈ షేర్లలో అమ్మకాలు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సంస్థలు గనక దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటే వాటిపై వడ్డీ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దాదాపు 1 శాతం తక్కువకు వస్తాయన్న కారణంతో ఇవి స్వల్పకాలిక రుణాలు తీసుకుంటున్నాయి. ఇపుడు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కనక వీటికి నిధుల సమీకరణ భారమవుతుంది. నిజానికి ఇక్కడే అసలు సమస్య వస్తుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్న కొద్దీ... వీటి అప్పుల విలువ పెరిగి, ఆస్తుల విలువ తగ్గుతుంది. ఇప్పటికే చాలా సంస్థలు ఈ పరిస్థితికి వచ్చేశాయని, ఇదే ఈ షేర్ల పతనానికి అసలు కారణమని మరికొందరు చెబుతున్నారు. ‘‘డీహెచ్ఎఫ్ఎల్ అప్పుల్లో దాదాపు 12 శాతం మరో మూడు నెలల్లో మెచ్యూరిటీకి రానున్నాయి. వీటికి సంబంధించిన ఆస్తులు మాత్రం 9 శాతమే కావటం గమనార్హం. అంటే మూడునెలల్లో మెచ్యూరిటీకి వచ్చేవాటిలోనే 3 శాతం అప్పులు ఎక్కువగా ఉన్నట్లు లెక్క’’ అని బ్రోకరేజీ సంస్థ ఎంకే గ్లోబల్ తెలియజేసింది. చోళమండలం ఫైనాన్స్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇలా ఆస్తులకన్నా అప్పులు స్వల్పంగా ఎక్కువ ఉన్నవే. పైపెచ్చు ఐఎల్ఎఫ్ఎస్ నేపథ్యంలో బ్యాంకుల వద్ద తగినంత నిధులు లేవని, అవి ఎన్బీఎఫ్సీలకు నిధులివ్వలేవని వినిపిస్తోంది. ఇవన్నీ కలిసి ఎన్బీఎఫ్సీ షేర్లలో అమ్మకాలకు కారణమవుతున్నాయి. -
ఎన్బీఎఫ్సీలకు ఇక మొండి బండ
సాక్షి, బిజినెస్ విభాగం : లిక్విడిటీ సమస్య కారణంగా భారీగా నష్టపోతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) మరో పిడుగు పడటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటిదాకా బ్యాంకులను వణికించిన మొండి బకాయిల సమస్య ఇప్పుడు బ్యాంకేతర ఆర్థిక సంస్థలపై (ఎన్బీఎఫ్సీ– నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ) కూడా గట్టిగానే ప్రభావం చూపించనున్నదనేది నిపుణుల మాట. దీనికి ప్రధాన కారణం... కొత్త అకౌంటింగ్ నిబంధనలు. పాత అకౌంటింగ్ పద్ధతిలో బకాయిలు మొండి బకాయిలుగా మారేంత వరకూ వేచి చూసి అప్పుడు కేటాయింపులు జరిపాల్సి ఉండేది. కానీ కొత్తగా అమల్లోకి రానున్న ‘ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్’ (ఇండ్ యాజ్) ప్రకారం భవిష్యత్తులో మొండి బకాయిలుగా మారనున్న బకాయిలను ఇప్పుడే గుర్తించి... రాబోయే నష్టాలకు ముందుగానే కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. బ్యాంకులకైతే ఈ ఇండ్ యాజ్ నిబంధనలను పాటించడానికి ఆర్బీఐ మరో ఏడాది దాకా వెసులుబాటునిచ్చింది. ఎన్బీఎఫ్సీలకు మాత్రం ఈ జూన్ క్వార్టర్ నుంచే ఈ కొత్త నిబంధనలు అమలు కానున్నాయి. ఈ జూన్ క్వార్టర్ నుంచి ఇండి యాజ్ అమల్లోకి రానుండటంతో, ఈ ఏడాది జూన్– సెప్టెంబర్ క్వార్టర్, గత ఏడాది ఇదే క్వార్టర్ల మధ్య వచ్చే అసెస్మెంట్ తేడాలను కూడా ఎన్బీఎఫ్సీలు వెల్లడించాల్సి ఉంటుంది. మొత్తం మీద కొత్త అకౌంటింగ్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో మొండి బకాయిలయ్యే వాటికి ఎన్బీఎఫ్సీలు చేయాల్సిన కేటాయింపులు కనీసం రూ.3,400 కోట్ల మేర ఉండొచ్చని అంచనాలున్నాయి. ఇది ఎన్బీఎఫ్సీలకు మరింత అదనపు భారం కానుంది. ఇండ్ యాజ్ ఎందుకు ? ఇప్పటివరకూ కంపెనీలన్నీ గ్యాప్ (జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్) ప్రమాణాలను పాటిస్తున్నాయి. 2008 నాటి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు కంపెనీలన్నీ, ముఖ్యంగా ఆర్థిక రంగానికి చెందిన కంపెనీలన్నీ తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి. భవిష్యత్తులో అలాంటి తీవ్ర పరిణామాలు తలెత్తకుండా ఉండటానికి గాను ‘ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్’ (ఇండ్ యాజ్) అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్డాండర్డ్స్కు అనుగుణంగా ఇండ్ యాజ్ నిబంధనలను రూపొందించారు. ఈ నిబంధనల కారణంగా మొండి బకాయిలకు కేటాయింపులు అధికంగా జరపాల్సి ఉంటుంది. దీంతో ఆయా కంపెనీల లాభదాయకత దెబ్బతింటుంది. ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ (ఈసీఎల్) విధానంలో రుణ నష్ట కేటాయింపులు జరపాల్సి ఉంది. 10 శాతం నెట్వర్త్ ఆవిరి.... ఈ కొత్త నిబంధనల కారణంగా ఎన్బీఎఫ్సీల నెట్వర్త్ కనీసం 10 శాతం హరించుకుపోతుందని నిపుణులంటున్నారు. అయితే విభిన్న రకాల రుణాలిచ్చే కంపెనీలకు మాత్రం ఒకింత ఊరట లభిస్తుందని వారి అంచనా. పాత అకౌంటింగ్ నిబంధన ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ కంపెనీ కేటాయింపులు రూ.1,200 కోట్లుగా ఉన్నాయి. కొత్త అకౌంటింగ్ నిబంధనల ప్రకారం ఈ కేటాయింపులు రూ.1,800 కోట్లకు పెరగనున్నాయి. ఈ భారం మహీంద్రా అండ్ మహీంద్రాపై రూ.1,357 కోట్లు, బజాజ్ ఫైనాన్స్పై రూ.270 కోట్ల మేర ఉండొచ్చని అంచనాలున్నాయి. టాప్ టెన్ ఎన్బీఎఫ్సీల్లో ఆరింటిపై ఈ కొత్త అకౌంటింగ్ నిబంధనల భారం ఉండనున్నదని నిపుణులు చెబుతున్నారు. అయితే రిజర్వ్ నిధులకు సంబంధించి కొత్త అకౌంటింగ్ విధానాలు ఎన్బీఎఫ్సీలపై సానుకూల ప్రభావం చూపించనుండటం ఒకింత ఊరటనిచ్చే విషయమనేది వారి మాట. అయితే అంచనా రుణనష్టాలు ఎంతనేది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఏం మార్పులు వస్తాయంటే... ♦ పాత ఖాతా నిబంధనల నుంచి కొత్త ఖాతా నిబంధనలకు మారే దశలో నిర్వహణ లాభం తక్కువగా ఉంటుంది. ♦ మొండి బకాయిలకు కేటాయింపులు ముందే జరపాల్సి ఉంటుంది ♦ ఎసాప్స్ జారీ కారణంగా సిబ్బంది వ్యయాలు పెరుగుతాయ్ ♦ పన్ను వ్యయాలూ పెరుగుతాయ్ ఎన్బీఎఫ్సీల జోరుకు కళ్లెం...? నెలవారీ క్రమబద్ధంగా వేతనం రాని వ్యక్తులు, అల్పాదాయ వర్గాల వ్యక్తులు, చిన్న వ్యాపార సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తులకు బ్యాంక్లు రుణాలివ్వవు. ఇలాంటి వారికి రుణాలివ్వడం ద్వారా ఎన్బీఎఫ్సీలు గత రెండేళ్లలో మంచి వృద్ధి సాధించాయి. మరోవైపు మొండి బకాయిల సమస్యతో బ్యాంక్ షేర్లు కుదేలవడంతో పలువురు ఇన్వెస్టర్లు ఈ ఎన్బీఎఫ్సీ షేర్లవైపే మొగ్గు చూపారు. బజాజ్ ఫైనాన్స్, కెన్ఫిన్ హోమ్స్, ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ కంపెనీలు మంచి లాభాలు సాధించాయి. తాజాగా లిక్విడిటీ ఆందోళనలు వ్యక్తం కావడంతో ఈ షేర్లు ఇటీవల బాగా నష్టపోయాయి. తాజాగా ఇండ్ యాజ్ నిబంధనల కారణంగా చాలా ఎన్బీఎఫ్సీల ప్రభ మసకబారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
చిన్న సంస్థలకు రుణాల్లో ప్రైవేట్ బ్యాంకుల జోరు
ముంబై: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణాల మంజూరులో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మార్కెట్ వాటాను ప్రైవేట్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ) కొల్లగొడుతున్నాయి. 2016 లో ఈ విభాగానికి సంబంధించి 59.4 శాతంగా ఉన్న 21 పీఎస్బీల వాటా 2017 జూన్ నాటికి 55.8 శాతానికి తగ్గింది. తాజాగా 2018 జూన్ నాటికి ఇది 50.7 శాతానికి పడిపోయింది. ఆర్థిక సేవల సంస్థ ట్రాన్స్యూనియన్ సిబిల్, సిడ్బి రూపొందించిన త్రైమాసిక నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాదిలో జూన్ దాకా ఎంఎస్ఎంఈ విభాగానికి రుణాలు 16.1 శాతం మేర పెరిగాయి. ఈ విభాగానికి పీఎస్బీల రుణాల వృద్ధి 5.5 శాతం, ప్రైవేట్ బ్యాంకుల వృద్ధి 23.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద ఈ విభాగానికి రుణాల విషయంలో 2017 జూన్లో 28.1 శాతంగా ఉన్న ప్రైవేట్ బ్యాంకుల మార్కెట్ వాటా ఈ ఏడాది జూన్ నాటికి 29.9 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఎన్బీఎఫ్సీల వాటా 9.6 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగింది. ఎంఎస్ఎంఈలకు దూకుడుగా రుణాలిస్తున్నప్పటికీ.. ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల రుణ నాణ్యత మెరుగ్గానే కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ విభాగంలో పీఎస్బీల మొండిబాకీలు 14.5 శాతం నుంచి 15.2 శాతానికి పెరగ్గా, ప్రైవేట్ బ్యాంకులవి స్వల్పంగా 4 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గాయి. రుణ మంజూరుకు సంబంధించి దరఖాస్తు ప్రాసెసింగ్కి పట్టే టర్నెరౌండ్ సమయం (టీఏటీ) గణనీయంగా తగ్గింది. -
ఈ ఎన్బీఎఫ్సీలన్నీ హైరిస్క్ ఉన్నవే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9,491 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) హై రిస్క్ ఉన్నవిగా పేర్కొంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఓ జాబితా విడుదల చేసింది. ఇవన్నీ యాంటీ మనీ లాండరింగ్ నిబంధనలను పాటించడం లేదని ఆర్థిక శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం (ఎఫ్ఐయూ) గుర్తించింది. తదనంతరం వీటితో ఓ జాబితాను రూపొందించి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్బీఎఫ్సీలు (కోపరేటివ్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు) తమ ఆర్థిక కార్యకలాపాల వివరాలను, లావాదేవీల వివరాలను తప్పనిసరిగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన ఎఫ్ఐయూ ప్రధానంగా ప్రిన్సిపల్ ఆఫీసర్ను నియమించాలన్న నిబంధనను పాటించడం లేదని గుర్తించింది. సంబంధిత అధికారి రూ.10 లక్షలకు పైబడిన లావాదేవీలను పరిశీలించి అనుమానాస్పదమైతే వాటి గురించి ఎఫ్ఐయూకి నివేదించాల్సి ఉంటుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ కంపెనీల లావాదేవీలపై ఎఫ్ఐయూ నిఘా వేసి, పలు మార్గాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నిబంధనలు పాటించడం లేదని, హైరిస్క్ ఉన్నవిగా నిర్ధారించి జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థలతో లావాదేవీలు నిర్వహించడం ద్వారా నష్టపోవద్దని ప్రజలను అప్రమత్తం చేయడమే ఎఫ్ఐయూ ఉద్దేశం. ఈ సంస్థల పూర్తి జాబితాను www.sakshibusiness.com లో చూడొచ్చు -
ఐడీఎఫ్సీ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ విలీనం
సాక్షి, ముంబై: ఐడీఎఫ్సీ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ విలీనంపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ క్యాపిటల్ ఫస్ట్, ఐడీఎఫ్సీ సంస్థలు శనివారం ధృవీకరించాయి. ఈ వీలీనం ద్వారా ఒక జాయింట్ వెంచర్గా ఏర్పడనున్నట్టు వెల్లడించాయి. వీటి ఆమోదానికి సంబంధించిన అన్నిఅనుమతులను పొందిన తరువాత సుమారు 64లక్షల మంది వినియోగదారులు రూ. 1.4కోట్ల ఆస్తులతో ఈ జాయింట్ సంస్థ ఆవిర్భవిస్తుంది. మరోవైపు ఈ కంపెనీకి బిపిల్ జెమానీ మధ్యంతర సీఈవోగా ఉండనున్న నేపథ్యంలో తక్షణమే ఆయన ఐడీఎఫ్సీ సీఎఫ్వో పదవికి రిజైన్ చేశారు. అలాగే క్యాపిటల్ ఫస్ట్ ఫౌండర్ వైద్య నాథన్ కొత్త సంస్థకు ఎండీ, సీఈవోగాను, ఐడీఎఫ్సీకు చెందిన రాజీవ్ లాల్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉంటారు. ఈ ఒప్పందం ప్రకారం 10 క్యాపిటల్ ఫస్ట్ షేర్లకు గాను, ఐడీఎఫ్సీ 139 షేర్లు దక్కనున్నాయి. కొత్త ఇటీవల శ్రీరామ్ సిటీ యూనియన్తో విలీనాన్ని రద్దు చేసుకున్న ఐడీఎఫ్సీ ఇదే విధంగా క్యాపిటల్ ఫస్ట్తో విలీనాన్ని కూడా రద్దు చేసుకోనుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ అధికారిక ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ఐపీఓ మార్కెట్కు ఎన్బీఎఫ్సీల దన్ను
ప్రాథమిక మార్కెట్లో పెట్టుబడులు పెరిగే అంశాలకు ఆర్థిక మంత్రి ప్రాధాన్యతను ఇచ్చారు. కంపెనీలు మార్కెట్లో తొలిసారిగా ఇచ్చే ఆఫర్ (ఐపీఓ)లో పెట్టుబడులు పెట్టేందుకు క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐబీ)కు స్థానం ఉండగా.. ఈ కోటాలో ఇప్పటి వరకు బ్యాంకులు, బీమా కంపెనీలకు మాత్రమే అర్హత ఉంది. వీటితో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)లకు కూడా ఐపీఓ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశం కల్పించిన అరుణ్ జైట్లీ, సెబీ దగ్గర రిజిస్టర్ అయిన పెద్ద ఎన్బీఎఫ్సీలు క్యూఐబీ కోటాలో ప్రాథమిక మార్కెట్కు అండగా నిలవవచ్చని బడ్జెట్లో ప్రకటించారు. -
ఈజీగా లోన్ ఇక కష్టమే!
ఒకప్పుడు అప్పు కోసం చెప్పులరిగేదాకా తిరగాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరంలేకుండా మొబైల్ యాప్స్ ద్వారా అవసరమైనప్పుడు సులభంగా, వేగంగా రుణం(లోన్) అందిస్తున్నాయి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు. బ్యాక్ స్టేట్ మెంట్, పే స్లిప్, పాన్, ఆధార్ కార్డులాంటి చిన్నచిన్న వెరిఫికేషన్లతోనే రుణాలు అందించే ఆన్ లైన్ లెండర్(ఆన్ లైన్ ద్వారా అప్పిచ్చే) కంపెనీలు రోజురోజుకూ వృద్ధిచెందుతున్న సంగతి తెలిసిందే. ఇన్స్టా-పైసా, గో-పే సెన్స్, ఫెయిర్ సెంట్, క్యాష్ కేర్, వోట్ 4క్యాష్, ఈజీసాలరీ, బ్యాంక్ బజార్, క్రెడిట్ మంత్రి లాంటి డజనుకుపైగా ఆన్ లైన్ లెండర్స్ ఇప్పటికే కోట్లరూపాయల రుణాలను కస్టమర్లకు అందించాయ. అయితే ఇకముందు కూడా ఈజీగా లోన్ పొందాలంటే మాత్రం కొన్నికఠిన నిబంధనలు పాటించాలి. నిబంధనలంటే గ్యారంటీ చూపడమో మరొకటో కాదు.. జస్ట్ మన ప్రవర్తన కాపాడుకోవడం! అవును. ఆన్ లైన్ క్రెడిట్ పొందాలంటే సోషల్ మీడియాలో మీ ప్రవర్తన బాగుండాలి. మీరు పెట్టే స్టేటస్ లు, రాసే కామెంట్లు, తిరిగే ప్రదేశాలు.. అన్నీ క్రమపద్ధతిలో ఉండాలి. ఏమాత్రం మోసపూరితంగానో, అక్రమంగానో ఉంటే లోన్ దక్కదు. కొన్నిసార్లు అధిక వడ్డీ తప్పదు! ఈ మేరకు కస్టమర్ల సోషల్ మీడియా బిహేవియర్ ను సమగ్రంగా పరిశీలించేందుకు ఆయా ఆన్ లైన్ లెండర్స్ ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసుకున్నాయి. లోన్ అప్లై చేసిన కస్టమర్ల అనుమతితో వాళ్ల ఫేస్ బుక్, ట్విట్టర్, మెయిల్స్ ను ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్స్(ఏఐ) ద్వారా తనిఖేచేస్తామని, 'ఆల్ ఈజ్ వెల్' అనుకుంటే తప్ప లోన్ ఇవ్వబోమని ఇన్స్టా-పైసా సీఈవో నిఖిల్ సామా తెలిపారు. కస్టమర్లు డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ రూల్స్ వాయిలేషన్స్ కు పాల్పడ్డారా లేదా అనేది కూడా తాము కనిపెట్టగలమని, ఇంతకుముందు ఏదైనా యాప్ లేదా సాధారణ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టిన విషయాన్ని కూడా పసిగట్టగలమని ఇన్స్టా పైసా, క్యాష్-ఈ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. కస్టమర్ ఎలాంటివాడో పరిశీలించిన తర్వాతే రుణం మంజూరుచేస్తామని, అయితే ఇదంతా గంటల వ్యవధిలోనే పూర్తిచేస్తామని పేర్కొన్నారు. నమ్మకం- రుణం విడదీయరానివని, అందుకే నమ్మదగిన కస్టమర్లకు మాత్రమే రుణం అందిస్తామని ఈజీసాలరీ డాట్ కామ్ సహవ్యవస్థాపకుడు అక్షయ్ మెహ్రోత్రా తెలిపారు. ఏఐ ద్వారా సేకరించే సమాచారాన్ని మూడో వ్యక్తితో పంచుకోమని, కస్టమర్ల వ్యక్తిగత మెయిల్స్, మెసేజెస్ జోలికి పోబోమని, వ్యవహారాలన్నీ పూర్తిపారదర్శకంగా ఉంటాయని ఆన్ లైన్ రుణదాతలు అంటున్నారు. ఇదంతా చదివాక 'ఈజీగా లోన్ తీసుకోవడం కష్టమే!' అని అనుకుంటున్నారా? 'అవసరానికి అప్పు కావాలంటే తప్పదుకదా!' అని నిట్టూరుస్తున్నారా? -
స్మార్ట్ఫోన్లపై హోమ్ క్రెడిట్ జీరో శాతం వడ్డీ ఆఫర్
పండుగ సీజన్ సందర్భంగా స్మార్ట్ఫోన్ కొనుగోళ్లకు సంబంధించి ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ)- హోమ్ క్రెడిట్... తన వినియోగదారులకు ఆకర్షణీయమైన స్కీమ్ను ప్రకటించింది. పలు స్మార్ట్ఫోన్ బ్రాండ్ల కొనుగోళ్లకు సంబంధించి జీరోశాతం వడ్డీని ఆఫర్ చేసింది. ఈ మేరకు జియోనీ, ఇంటెక్స్, లివా, మైక్రోమ్యాక్స్, ఒప్పో, శ్యామ్సంగ్, వివో కంపెనీల ప్రతినిధులతో అవగాహన కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 50 పట్టణాల్లో 6,000 పాయింట్-ఆఫ్-సేల్స్ (పీఓఎస్) వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఏగాన్ లైఫ్... సరికొత్త ఆన్లైన్ ప్రొటెక్షన్ ప్లాన్ ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ తాజాగా అత్యుత్తమ ఫీచర్లు, ప్రీమియంలతో సరికొత్త ఆన్లైన్ ప్రొటెక్షన్ ప్లాన్ను ఆవిష్కరించింది. పరిశ్రమలో అతి తక్కువ ప్రీమియం ధర దీని ప్రత్యేకత. వినియోగదారులకు అదనపు లైఫ్ స్టేజ్ ప్రయోజనం ఉంటుంది. దీనిలో భాగంగా తమ జీవితంలో ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రొటెక్షన్ కవర్ను పెంచుకునే వీలుంది. ప్రీమియంను నెలసరి, అర్ధ సంవత్సరం, వార్షిక పద్ధతిలో చెల్లించొచ్చు. గతంలో ఇది వార్షిక పద్ధతిన చెల్లించాల్సి వచ్చేది. గరిష్ట మెచ్యూరిటీ వయసును 80 ఏళ్లకు పెంచారు. గరిష్ట పాలసీ టర్మ్ 62 సంవత్సరాలు. డెత్ బెనిఫిట్ చెల్లింపులను ఏక మొత్తంలో లేదా 100 నెలల కోసం నిద్ధిష్ట నెలసరి ఆదాయ రూపంలో లేదా ఈ రెండింటి సమ్మేళనంగా ఎంచుకునే వీలుంది. ఆన్లైన్ రుణ సంస్థలతో వైడర్ భాగస్వామ్యం... మొబైల్ హోల్సేల్ బీ2బీ మార్కెట్ప్లేస్... ‘వైడర్’ పండుగల సందర్భాన్ని పురస్కరించుకుని పలు ఆన్లైన్ రుణ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. లెండింగ్ కార్ట్, క్యాపిటల్ ఫ్లోట్, ఇండిఫై, ఫ్లెక్సీ లోన్స్ వంటి సంస్థలు ఇందులో ఉన్నాయి. తక్కువ డాక్యుమెంటేషన్తోనే రిటైలర్లకు వర్కింగ్ క్యాపిటల్ లోన్ ఇవ్వడం ఈ భాగస్వామ్యం ఉద్దేశమని సంస్థ ప్రతినిధి తెలిపారు. సంబంధిత రిటైలర్లు వైడర్ వేదికపై వస్తువుల్ని క్రెడిట్ ప్రాతిపదికన కొనుగోలు చేసినప్పుడు ఇది వర్తిస్తుంది. దీపావళి వరకు కొనుగోలు మొత్తంపై వచ్చే వడ్డీని వైడర్ చెల్లిస్తుంది. బిర్లా సన్లైఫ్ ఫండ్ నుంచి స్మార్ట్ బిజినెస్ యాప్ బిర్లా సన్లైఫ్ మ్యూచ్వల్ ఫండ్కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తున్న బిర్లా సన్లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తాజాగా మొబైల్ అప్లికేషన్ ‘ఫిన్గో పార్ట్నర్’ను ఆవిష్కరించింది. ఈ యాప్ను స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్గా సంస్థ వర్ణించింది. వివిధ ప్రక్రియలను సులభతరం చేసే ఈ యాప్... డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో తోడ్పాటునందిస్తుందని పేర్కొంది. కస్టమర్లను ట్రాక్ చేసేందుకు, వారికి సేవలు అందించేందుకు, విలువైన వ్యాపార సమాచారాన్ని తక్షణం యాక్సెస్ చేసుకోవటం ద్వారా వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకోడానికి ఈ యాప్ దోహదపడుతుందని తెలిపింది. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్, ఐవోఎస్ నుంచి డౌన్లోడ్ చేసేకోవచ్చు. -
ఎన్బీఎఫ్సీ రిజిస్ట్రేషన్ ఇక ఎంతో సులువు!
ముంబై: నాన్ బ్యాకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నమోదు ప్రక్రియను సులభతరం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎన్బీఎఫ్సీ లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 45 డాక్యుమెంట్లతో కూడిన భారీ చిట్టాను సమర్పించాల్సి వచ్చేది. దీన్ని ఎనిమిది డాక్యుమెంట్లకు కుదించినట్టు ఆర్బీఐ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏదేనీ అదనపు సమాచారం, పత్రాన్ని కోరినట్టయితే సంస్థలు 30 రోజుల్లోపు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, ఎన్బీఎఫ్సీలకు సంబంధించి రెండు వేర్వేరు దరఖాస్తులు ఉంటాయని స్పష్టం చేసింది. టైప్-1 విధానంలో నిధులు సమీకరణకు అవకాశం లేని (ఎన్బీఎఫ్సీ-ఎన్డీ) సంస్థల దరఖాస్తు పరిశీలనను వేగంగా పూర్తిచేయనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ సంస్థలు ప్రజల నుంచి నిధులు సేకరించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ భవిష్యత్తులో ఈ విధమైన లావాదేవీలు కూడా నిర్వహించుకోవాలని భావిస్తే అందుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
సహారా ఇండియా ఫైనాన్షియల్ రిజిస్ట్రేషన్ రద్దు
ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న సహారా గ్రూప్నకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్లో భాగమైన సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్కి సంబంధించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఎన్బీఎఫ్సీ) రిజిస్ట్రేషన్ను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. సెప్టెంబర్ 3 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లవుతుందని పేర్కొంది. వ్యాపార నిర్వహణ సమర్ధత కోల్పోయిందనే కారణంతో జులైలోనే సహారా మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్ను కూడా ఆర్బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇన్వెస్టర్లకు వేల కోట్ల రూపాయలు తిరిగివ్వాల్సిన కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ గతేడాది మార్చి 4 నుంచి జైల్లోనే ఉన్నారు. -
ఇన్వర్టర్ల కొనుగోలుకు రుణం
* ఇందుకోసం ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు * రూఫ్ టాప్ సోలార్ విభాగంపై దృష్టి * సుకామ్ ఫౌండర్ కున్వర్ సచ్దేవ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వర్టర్ల విక్రయాల్లో ఉన్న సుకామ్ పవర్ సిస్టమ్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీని మార్చికల్లా (ఎన్బీఎఫ్సీ) ఏర్పాటు చేస్తోంది. ఈ కంపెనీ ద్వారా కస్టమర్లకు రుణ సహాయం అందిస్తారు. తక్కువ ఆదాయం గల ఉద్యోగులు, చిన్న వర్తకులకు రుణం ఇవ్వడం ద్వారా అమ్మకాలను పెంచుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. తొలుత రూ.20 కోట్లతో ఎన్బీఎఫ్సీ ప్రారంభిస్తామని సుకామ్ ఫౌండర్, ఎండీ కున్వర్ సచ్దేవ్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ మొత్తాన్ని పెంచుతూ పోతామన్నారు. రూ.7 వేలలోపు ఉత్పత్తులకే వాయిదా చెల్లింపు (ఈఎంఐ) సౌకర్యం ఉంటుందని చెప్పారు. 150 వీఏ సామర్థ్యం గల ఇన్వర్టర్ను బ్యాటరీతో సహా కంపెనీ రూ.6 వేలకే విక్రయిస్తోంది. 500 కేవీఏ సామర్థ్యం గల ఇన్వర్టర్ను అభివృద్ధి చేస్తోంది. భారత ఇన్వర్టర్లదే.. అభివృద్ధి చెందిన దేశాల్లో భారతీయ కంపెనీల ఇన్వర్టర్ల హవా నడుస్తోంది. సుకామ్, లూమినస్, మైక్రోటెక్ వంటి కంపెనీలు ఎగుమతుల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. సుమారు రూ.400 కోట్ల విలువైన ఇన్వర్టర్లు ఎగుమతి అవుతున్నట్టు సమాచారం. సుకామ్ 70 దేశాలకు ఇన్వర్టర్లను సరఫరా చేస్తోంది. ఇన్వర్టర్లు, బ్యాటరీలతో కలిపి 2014-15లో రూ.150 కోట్లు ఎగుమతుల ద్వారా వస్తుందని ఆశిస్తోంది. కాగా, భారత్లో ఇన్వర్టర్ల విపణి రూ.4,000 కోట్లు, బ్యాటరీల మార్కెట్ రూ.10,000 కోట్లకుపైగా ఉంది. సౌర విద్యుత్పై.. భవిష్యత్ సౌర విద్యుత్దేనని కున్వర్ సచ్దేవ్ తెలిపారు. రూఫ్టాప్ సోలార్ విభాగంపై పెద్ద ఎత్తున దృష్టిసారించినట్టు చెప్పారు. ‘గుర్గావ్లో మెట్రో స్టేషన్లతో పాటు డీఎల్ఎఫ్ భవనంపైన సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఒక్కో యూనిట్ విద్యుత్ను రూ.7కు విక్రయిస్తున్నాం. ఈ ధర వస్తే ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి ప్రాజెక్టులు చేపడతాం’ అని తెలిపారు. నెట్ మీటరింగ్ అమలైతేనే భారత్లో సౌర విద్యుత్ విజయవంతం అవుతుందని అన్నారు. 2014-15లో సోలార్ ద్వారా రూ.300 కోట్లు ఆశిస్తున్నట్టు చెప్పారు. టర్నోవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధితో రూ.1,200 కోట్లను కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. సోలార్ ప్యానెళ్ల తయారీ ప్లాంటును హిమాచల్ ప్రదేశ్లోని బడ్డి వద్ద ఏప్రిల్కల్లా నెలకొల్పుతోంది. తమిళనాడులో ఇన్వర్టర్లు, బ్యాటరీ తయారీ ప్లాంటును పెట్టే యోచనలో ఉంది. సుకామ్కు ఇప్పటికే నాలుగు ప్లాంట్లున్నాయి. వీటి వార్షిక సామర్థ్యం 15 లక్షల యూనిట్లు. -
ఎన్బీఎఫ్సీల నిబంధనలు కఠినతరం
ముంబై: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను రిజర్వ్ బ్యాంక్ కఠినతరం చేసింది. తాజా మార్పుల ప్రకారం ఎన్బీఎఫ్సీలు 2017 నాటికల్లా నెట్ ఓన్డ్ ఫండ్ (ఎన్వోఎఫ్)ను దశలవారీగా రూ. 2 కోట్లకు పెంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది రూ. 25 లక్షలుగా ఉంది. ఇందుకు సంబంధించి నిర్దేశిత మైలురాళ్లను అధిగమించలేని పక్షంలో వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేసే ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే, బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే సంస్థలు ఈక్విటీ మూలధనాన్ని కనీసం 12 శాతం మేర ఉండేలా చూసుకోవాలి. ప్రస్తుతం ఇది 10 శాతంగా ఉంది. డిపాజిట్లు స్వీకరించే ఎన్బీఎఫ్సీలయితే ఈక్విటీ మూలధనాన్ని రెండేళ్లలో ప్రస్తుతం ఉన్న 7.5 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఇక 0.25 శాతంగా ఉన్న ప్రొవిజనింగ్ని 2018 మార్చి నాటికి 0.4 శాతానికి పెంచుకోవాల్సి ఉంటుంది. -
బంగారంపై రుణ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల తాకట్టుపై బ్యాంకులు ఇచ్చే రుణాల పరిమితిని రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సడలించింది. ‘ఆయా బ్యాంకుల బోర్డులు ఆమోదించిన విధానాల ప్రకారం వ్యవసాయేతర అవసరాలకు బంగారు ఆభరణాలపై రుణ పరిమితిని బ్యాంకులు నిర్ణయించుకోవచ్చు..’ అని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. ఇలాంటి రుణాల కాలపరిమితి 12 నెలలకు మించకూడదని పేర్కొంది. బంగారం విలువలో 75 శాతం వరకు రుణం ఇవ్వవచ్చని తెలిపింది. ప్రస్తుత రుణాలకు కూడా కొత్త నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. బంగారంపై రుణాన్ని రూ.లక్షకు పరిమితం చేస్తూ ఆర్బీఐ గత డిసెంబర్ 30న ఆదేశాలు జారీచేసింది. దీంతో, పరిమితి పెంచాలనీ, ఇతర నిబంధనలను పునఃసమీక్షించాలనీ పలు బ్యాంకులు ఆర్బీఐని అభ్యర్థించాయి. దాంతో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. పసిడి దిగుమతులపై ఆంక్షల కొనసాగింపు న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై మునుపటి యూపీఏ ప్రభుత్వం విధించిన నిబంధనలు కొనసాగనున్నాయి. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)ను అదుపు చేసేందుకు తెచ్చిన ఈ నిబంధనలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రాజ్యసభలో తెలిపారు. 2012-13లో స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో 4.7 శాతానికి (8,820 కోట్ల డాలర్లు) క్యాడ్ చేరుకుందనీ, క్యాడ్ అదుపునకు యూపీఏ చేపట్టిన చర్యలన్నిటినీ కొనసాగించేందుకు యత్నిస్తున్నామనీ జైట్లీ చెప్పారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని మూడురెట్లు పెంచడం, దిగుమతుల్లో 20 శాతాన్ని ఎగుమతి చేయాలన్న నిబంధన విధించడంతో కరెంట్ అకౌంట్ లోటు అదుపులోకి వచ్చిందని తెలిపారు. 2013-14లో క్యాడ్ 3,240 కోట్ల డాలర్లకు తగ్గిందన్నారు. విదేశీ మారక నిల్వలు కూడా ఈ నెల 4వ తేదీకి 31,640 కోట్ల డాలర్లకు పెరిగాయని తెలిపారు. -
2 నిమిషాల్లో గోల్డ్ లోన్స్.. నో చాన్స్
రెండు నిమిషాల్లో గోల్డ్ లోన్స్... అధిక మొత్తానికి రుణం అంటూ ఊదొరగొట్టిన గోల్డ్లోన్స్ ప్రచార ప్రకటనలకు అడ్డుకట్ట పడింది. గోల్డ్లోన్స్ మంజూరుపై ఆర్బీఐ నిబంధనలకు కఠినతరం చేసింది. బంగారం ధరలు గరిష్ట స్థాయిలో ఒడిదుడుకుల మధ్య కదులుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా గోల్డ్లోన్స్పై ఆంక్షలను పెంచింది. రెండు మూడు నిమిషాల్లోనే బంగారం ఆభరణాలపై రుణాలంటూ ఇచ్చే ప్రకటనలను తక్షణం నిలిపేయాల్సిందిగా ఆదేశించింది. అంతేకాదు రుణం ఇచ్చే విలువను కూడా భారీగా తగ్గించేసింది. 60 శాతం దాటకూడదు గరిష్ట స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలితే గోల్డ్ లోన్స్ సంస్థలు మూసుకుపోయే పరిస్థితి ఉండటంతో రుణ విలువపై పరిమితులు విధించింది. బంగారం ఆభరణాలపై రుణాలను ఇచ్చే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ) బం గారం విలువలో 60% మించి రుణం మంజూరు చేయడానికి వీలు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంటే లక్ష రూపాయల విలువైన ఆభరణాలను తనఖా పెడితే గరిష్టంగా రూ.60,000 మించి రుణం వచ్చే పరిస్థితి లేదు. అంతేకాదు ఒక వ్యక్తి 20 గ్రాములు మించి తనఖా పెడితే ఆ ఆభరణాలు తనవే అని నిరూపించే పత్రాలను చూపించాల్సి ఉంటుంది. గతంలో కేవలం ఈ ఆభరణాలు నావే అని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే వారు. కాని ఇప్పుడు కంపెనీలు ఆ ఆభరణాలను గురించి పూర్తి వివరాలను పరిశీలించి, వాటికి సంబంధించి రికార్డులను తప్పకుండా నిర్వహించాలి. చెక్ తప్పనిసరి ఇచ్చే రుణం విలువ లక్ష రూపాయలు దాటితే నగదు రూపంలో చెల్లించడానికి వీలు లేదు. ఆ మొత్తం చెక్ రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఎంత మొత్తమైనా సరే నగదు రూపంలో తీసుకోవడానికి వెసులుబాటు ఉండేది. దొంగ బంగారం, నల్లధనం వంటి వాటిని అరికట్టడానికి ఈ నిబంధనలను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. పాన్ ఉండాల్సిందే.. రుణ విలువ ఐదు లక్షలు దాటితే తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డు వివరాలు లేకుండా రూ.5 లక్షలకు మించి రుణాలను ఇవ్వరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణం చెల్లించకపోవడంతో విఫలమైన వారి ఆభరణాలను వేలం వేసే విషయంలో కూడా మరింత పారదర్శకత ఉండాలని, వీటికి సంబంధించిన వివరాలను వార్షిక నివేదికలో పేర్కొనాలని సూచించింది. వేలం వేసేటప్పుడు నిర్ణయించే రిజర్వ్ ప్రైస్ 30 రోజుల సగటు బంగారం ధరలో(22 క్యారెట్లు) 85 శాతం లోపే ఉండాలి.