rumours
-
విజయ్ వర్మతో బ్రేకప్ రూమర్స్.. అలా అనిపిస్తేనే చెబుతా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. తన బాయ్ఫ్రెండ్, నటుడు విజయ్ వర్మతో బ్రేకప్ చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల రవీనా టాండన్ నిర్వహించిన హోలీ వేడుకల్లో వీరిద్దరూ జంటగా కనిపించలేదు. విడివిడిగానే హోలీ ఈవెంట్లో సందడి చేశారు. దీంతో ఈ జంట బ్రేకప్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమన్నా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తలపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. నా పర్సనల్ లైఫ్ను సీక్రెట్గా ఉంచడానికే ఎక్కువగా ఇష్టపడతానని అంటోంది తమన్నా. నాకు ఏదైనా సౌకర్యంగా అనిపిస్తేనే ఆ విషయాన్ని అందరితో పంచుకుంటానని తెలిపింది. అది నా లైఫ్ను బ్యాలెన్స్ చేస్తుందని.. అందుకే నాపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.తమన్నా మాట్లాడుతూ..'నేను ప్రజల మనిషిని. వారితో మాట్లాడాటాన్ని ఆస్వాదిస్తా. నేను ఎయిర్పోర్ట్లో ఒక పెద్దమనిషిని కలిశాను. నా వద్దకు వచ్చిన వ్యక్తులకు ఫోటోగ్రాఫ్లు కూడా ఇచ్చా. ఇవన్నీ నేను సంతోషంగా చేస్తున్నా. నేను ఎంచుకున్న దానితో ప్రస్తుతం సంతోషంగా ఉన్నా. అలాగే నాకు నచ్చిన వ్యక్తులనే ఇష్టపడతా. అంతే కాకుండా యాదృచ్ఛికంగా జరిగే విషయాల పట్ల విముఖత చూపను. అపరిచితులతో మాట్లాడటం వల్ల విలువైన విషయాలు కూడా తెలుసుకోవచ్చని' తన మనసులో మాటను వెల్లడించింది. కాగా.. తమన్నా భాటియా, విజయ్ వర్మ వర్మ 2022లో డేటింగ్ ప్రారంభించారు.2023లో విడుదలైన నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్- 2లో జంటగా కలిసి నటించారు. -
మీ కోసం నా భర్త ఫోటోలు షేర్ చేయాలా?.. విడాకులపై మహాత్మ హీరోయిన్
తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ భావన. శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ చిత్రంలో ఆడియన్స్ను మెప్పించింది. కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన 2018లో కన్నడ నిర్మాత నవీన్ రమేశ్ను పెళ్లాడింది. గతేడాది 'నడికర్' అనే మలయాళ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భావన తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. ఇంతకీ ఆ ముచ్చట ఏంటో తెలుసుకుందాం పదండి.ఈ మలయాళీ భామ త్వరలోనే తన భర్త నవీన్ రమేశ్తో విడిపోనుందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో తమపై వస్తున్న వార్తలపై భావన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది. అలాగే తన భర్తతో దిగిన ఫోటోలను కూడా తాను షేర్ చేయకపోవడం వల్లే ఇలా మాట్లాడుకుంటున్నారని భావన వెల్లడించింది.భావన మాట్లాడుతూ..' నా భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు ఇష్టముండదు. అందుకే మేము విడాకులు తీసుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గోప్యతను పాటిస్తా. నేను యాదృచ్ఛికంగా ఫోటోలు పోస్ట్ చేసినా ఏదో తప్పు జరిగిందని ఊహాగానాలు సృష్టిస్తారు. అలా అని మా బంధం నిరూపించడానికి మేము సెల్ఫీలు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా?" అంటూ విడాకులపై వస్తున్న రూమర్స్పై క్లారిటీ ఇచ్చేసింది. భావన తన సినీ కెరీర్ను మలయాళ చిత్రం నమ్మల్ (2002)తో ప్రారంభించింది. తరువాత చితిరం పెసుతడితో తమిళ సినిమాల్లోకి ప్రవేశించింది. తమిళంలో అజిత్ కుమార్ సరసన కూడా నటించింది. ఆ తర్వాత ఒంటరి మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ తెలుగులో ఆమెకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆమె ప్రస్తుతం కన్నడ చిత్రం పింక్ నోట్, తమిళ చిత్రం ది డోర్ సినిమాలో కనిపించనుంది. -
మలయాళ మెగాస్టార్పై రూమర్స్.. స్పందించిన టీమ్!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న రూమర్స్పై ఆయన టీమ్ స్పందించింది. గత కొద్ది రోజులుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారని కథనాలొచ్చాయి. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారంటూ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన స్టార్ సెలవుల్లో ఉన్నారని తెలిపింది. రంజాన్ కోసం ఉపవాసంలో ఉన్నారని పేర్కొంది. త్వరలోనే తిరిగి సినిమాల్లో నటిస్తారని వెల్లడించింది.మమ్ముట్టి టీమ్ తమ ప్రకటనలో రాస్తూ.. 'ఆయన ప్రస్తుతం రంజాన్ ఉపవాసం ఉన్నందున సెలవుల్లో ఉన్నారు. ఆ కారణంతోనే అతను తన షూట్ షెడ్యూల్ నుంచి కూడా విరామం తీసుకున్నారు. విరామం తర్వాత మోహన్ లాల్- మహేష్ నారాయణన్ సినిమా షూటింగ్కి తిరిగి వెళ్తారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్" అని స్పష్టం చేశారు.కాగా.. మమ్ముట్టి, మోహన్లాల్లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్ మమ్ముట్టి, మోహన్లాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ (మమ్ముట్టి, మోహన్లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు. కాగా.. మమ్ముట్టి చివరిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన కామెడీ చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్లో కనిపించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 23న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. -
అమ్మాయితో కనిపించిన చాహల్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య ధనశ్రీ వర్మ!
భారత స్టార్ క్రికెటర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మరింత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆట కంటే వ్యక్తిగత విషయాలతో చాహల్ మరింత ఫేమస్ అవుతున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఛాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓ అమ్మాయితో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇంతకీ ఆమె ఎవరా అని ఆరా తీస్తే ఆర్జే మహ్వాష్గా గుర్తించారు. ఇంకేముంది ఆమెతో మనోడు పీకల్లోతు డేటింగ్లో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తోంది.ఈ సంగతి పక్కనపెడితే.. యుజ్వేంద్ర చాహల్ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ తాజాగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తన భర్త చాహల్ దిగిన ఫోటోలను ఇన్స్టాలో రీ లోడ్ చేసింది. అతనితో ఉన్న ఫోటోలతో పాటు పెళ్లి ఫోటోలు కూడా అన్ని ధనశ్రీ వర్మ ఇన్స్టాగ్రామ్లో మళ్లీ దర్శనమిచ్చాయి. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా చాహల్ ఫోటోలు రీ లోడ్ చేయడంతో వీరిద్దరు విడాకుల రూమర్స్కు చెక్ పడే అవకాశముంది. వాటిని ఫుల్స్టాప్ పెట్టేందుకే ఇచ్చేందుకే ధనశ్రీ వర్మ ఫోటోలన్నింటినీ రీ స్టోర్ చేసినట్లు తెలుస్తోంది.కాగా.. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ 2020లో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరు ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేసినట్లు తెలుస్తోది. ఇటీవల ధనశ్రీ న్యాయవాది అదితి మోహోని ఈ విషయాన్ని వెల్లడించారు. 2024లోనే విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. మరోవైపు ధనశ్రీ వర్మ రూ. 60 కోట్ల భరణం డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆమె కుటుంబం ఖండించింది. View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
హీరోయిన్తో శుభ్మన్ గిల్ డేటింగ్.. ఆ ఒక్క ఫోటో వల్లే !
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని మరోసారి సగర్వంగా ముద్దాడింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్గా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన తుదిపోరులో న్యూజిలాండ్పై ఘనవిజయం సాధించిన. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఫైనల్ మ్యాచ్లో నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో విజయం భారత్ను వరించింది. దీంతో టీమిండియా ఖాతాలో మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరింది. దుబాయ్లో జరిగిన పలువురు బాలీవుడ్ సినీ తారలు సైతం ఈ మ్యాచ్ను వీక్షించారు.అయితే ఈ మ్యాచ్ తర్వాత భారత ఓపెనర్ బ్యాట్స్మన్ శుభ్మన్ గిల్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అవనీత్ కౌర్తో శుభ్మన్ గిల్ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ చూసిన ఫోటోలను అవనీత్ కౌర్ ఇన్స్టాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలు భారత్- ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ సందర్బంగా అవనీత్ కౌర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది.తాజాగా టీమిండియా కప్ గెలవడంతో మరోసారి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అంతేకాకుండా గతేడాది శుభ్మన్ బర్త్ డే సందర్భంగా అవనీత్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది. గిల్తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై మరోసారి డేటింగ్పై చర్చ మొదలైంది. ఈ రూమర్స్ నేపథ్యంలో ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా.. క్రికెటర్ గిల్పై గతంలో కూడా సారా అలీ ఖాన్తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్తో రిలేషన్లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. 26 ఏళ్ల అవనీత్ కౌర్ బాలీవుడ్లో పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ల్లోనూ కనిపించింది. ఎనిమిదేళ్ల వయసులో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అవనీత్ కౌర్ మొదటిసారిగా 2010లో 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ షోలో కనిపించింది. ఆ తర్వాత ఆమె 'డ్యాన్స్ కే సూపర్స్టార్స్'లో పాల్గొంది. ఆ తర్వాత 2012లో 'మేరీ మా' టీవీ షోతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఝలక్ దిఖ్లా జా (2012), మసావిత్రిక్, ఏక్ ముత్తి ఆస్మాన్ లాంటి సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత 'మర్దానీ' మూవీతో బిగ్ స్క్రీన్లోకి అడుగుపెట్టింది. 2023లో కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షేరు చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన రొమాంటిక్ పాత్రలో కనిపించింది. కౌర్ చివరిసారిగా 2024లో వచ్చిన 'పార్టీ టిల్ ఐ డై'అనే మర్డర్ మిస్టరీలో నటించింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) -
బర్త్ డే పార్టీలో జంటగా సమంత, రాజ్ నిడిమోరు.. మరోసారి డేటింగ్ వార్తలు!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే చెన్నైలో జరిగిన బిహెండ్వుడ్స్ హాల్ ఆప్ ఫేమ్ అవార్డుల వేడుకకలో మెరిసింది. ఈ వేదికపై సిటాడెల్ వెబ్ సిరీస్లో నటనకు అవార్డ్ కూడా అందుకుంది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 ఏళ్లు పూర్తి కావడంతో ప్రత్యేకమైన అవార్డ్తో సమంతను సత్కరించారు. అయితే ఈ వేడుకల్లో సిటాడెల్ డైరెక్టర్లలో ఒకరైన రాజ్ నిడిమోరు సైతం సందడి చేశారు. సమంతతో కలిసి వేదికపై కనిపించారు.అయితే గత కొన్ని నెలలుగా సమంత- రాజ్ నిడిమోరుపై డేటింగ్ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే పికిల్ బాల్ టోర్నమెంట్లోనూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కనిపించారు. ఆ సమయంలోనూ సమంతపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. తాజాగా మరోసారి సామ్- రాజ్ నిడిమోరు ఓ పార్టీలో మెరిశారు. తన స్నేహితురాలు, డిజైనర్ క్రేషా బజాజ్ పుట్టినరోజు వేడుకలకు సమంత, నిడిమోరు హాజరయ్యారు. దీంతో మరోసారి వీరిద్దరిపై నెట్టింట చర్చ మొదలైంది. నెల రోజుల్లోపే రెండోసారి జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. తాజాగా వీరిద్దరు కలిసి బర్త్ డే పార్టీలో దిగిన ఫోటో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఏదేమైనా సమంత, రాజ్ నిడిమోరు క్లారిటీ ఇస్తే కానీ ఈ వార్చలకు ఇప్పట్లో చెక్ పడేలా లేదు. అయితే తమపై వస్తున్న డేటింగ్ రూమర్స్పై ఇప్పటి వరకు సామ్ కానీ, రాజ్ ఎవరూ కూడా స్పందించలేదు.ఇక సినిమాల విషయానికొస్తే సమంత గతేడాది సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీలో కనిపించింది. ఈ సిరీస్లో వరుణ్ ధావన్కు జోడీగా నటించింది. ప్రస్తుతం సమంత తెలుగులో ఓ మూవీని నిర్మిస్తున్నారు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషిలో నటించింది. -
పద్మ విభూషణ్ గ్రహీత, సీనియర్ నటిపై మరణ వార్తలు.. కుమారుడు క్లారిటీ
అలనాటి నటి, పద్మ విభూషణ్ వైజయంతి మాల పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1955లో బాలీవుడ్లో దిలీప్ కుమార్ నటించిన దేవదాస్ చిత్రం హీరోయిన్గా కనిపించారు. అంతేకాకుండా నయా దౌర్, మధుమతి, జ్యువెల్ థీఫ్, సంగం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె నటనకు గానూ పద్మ శ్రీ, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. అంతేకాకుండా ఆమెను అభిమానులు ముద్దుగా డ్యాన్సింగ్ క్వీన్ అని పిలుచుకుంటారు.తాజాగా ఈ సీనియర్ నటి వైజయంతిమాల చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరలయ్యాయి. దీంతో ఆమె కుమారుడు స్పందించారు. ఆమె మరణించారన్న వార్తలను వైజయంతిమాల కుమారుడు సుచింద్ర బాలి ఖండించారు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. ఆమె మరణ వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల్ మీడియాలో వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఆమె వయస్సు 91 ఏళ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది.డాక్టర్ వైజయంతిమాల బాలి ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆ వార్తలు షేర్ చేసే ముందు ఒకసారి ధృవీకరించుకోవాలని ఆమె కుమారుడు సుచింద్ర బాలి హితవు పలికారు. కాగా.. ఇటీవలే జనవరిలో చెన్నైలోని కళా ప్రదర్శినిలో వైజయంతిమాల భరతనాట్యం ప్రదర్శించారు. ఆమె ఆరోగ్యంగానే కనిపించారు. వైజయంతిమాల తన నటనకు గాను పద్మభూషణ్ అవార్డ్ను దక్కించుకుంది. -
ఐదుగురు హీరోయిన్స్ తో బన్నీ రొమాన్స్..!
-
అభిషేక్ - ఐశ్వర్యపై విడాకుల రూమర్స్.. ఇకపై తెరపడినట్లే!
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్పై గత కొన్ని నెలలుగా విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అనిల్ అంబానీ కుమారుడి పెళ్లి సమయంలోనూ వీరిద్దరు విడిపోనున్నారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ బర్త్ డే రోజు ఆలస్యంగా విషెస్ చెప్పడంతో మరోసారి డివోర్స్ వార్తలు వినిపించాయి. అలా ఏదో ఒక సందర్భంలో వీరిద్దరిపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి.విడాకుల వార్తల నేపథ్యంలో స్టార్ కపుల్ బాలీవుడ్ డైరెక్టర్ కుమారుడి పెళ్లిలో సందడి చేశారు. దర్శకుడు అశుతోష్ గోవారికర్ కుమారుడి పెళ్లిలో జంటగా కనిపించారు. చాలా రోజుల తర్వాత ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఓ శుభ కార్యానికి హాజరు కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి నుంచైనా విడాకుల వార్తలకు చెక్ పెట్టినట్లు పడుతుందని భావిస్తున్నారు. ఐశ్వర్య, అభిషేక్ పెళ్లికి హాజరైన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లికి అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, కిరణ్ రావ్, గాయత్రీ ఒబెరాయ్, జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్ముఖ్, విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ లాంటి సినీతారలు హాజరయ్యారు. అశుతోష్ కుమారుడు కోణార్క్ మార్చి 2న నియతిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.అభిషేక్-ఐశ్వర్యల పెళ్లి 2007లో జరిగింది. వీరిద్దరికి 2011లో ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె జన్మించారు. జూలై 2024లో అనంత్ అంబానీ పెళ్లి నుంచి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్పై విడాకుల రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా ఈ జంట పెళ్లికి హాజరవ్వడంతో ఆ వార్తలకు దాదాపు చెక్ పడినట్లే. View this post on Instagram A post shared by Aishwarya Rai Team🇲🇺 (@aishwarya_raifan) -
రెండో భర్తతో బుల్లితెర నటి విడాకులు.. స్పందించిన భామ!
సినీ ఇండస్ట్రీలో విడాకులు అనే పదం కామన్ అయిపోయింది. పలువురు సినీతారలు తమ వివాహ బంధానికి మధ్యలోనే ముగించేస్తున్నారు. గతేడాది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సైతం తన భార్య సైరా భానుతో విడిపోయారు. దాదాపు 27 వారి వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. తాజాగా మరో బాలీవుడ్ జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెళ్లైన ఏడేళ్లకు వీరిద్దరు విడిపోతున్నారంటూ టాక్ నడుస్తోంది. ప్రముఖ బుల్లితెర నటి దీపికా కకర్ ఆమె రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులు రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో తమపై వస్తున్న విడాకుల రూమర్స్పై బుల్లితెర జంట స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలన్నీ ఫేక్ అన్ని కొట్టిపారేశారు. అవీ చూస్తుంటే తమకు నవ్వాలనిపిస్తోందని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన దీపికా ఆమె భర్త షోయబ్ విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చారు. 2018లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించారు.దీపిక కక్కర్, షోయబ్ ప్రముఖ బాలీవుడ్ సీరియల్ ససురల్ సిమర్ కా సెట్స్లో కలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అంతకుముందు దీపిక కక్కర్ పైలట్ రౌనక్ శాంసన్ను 2011లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2015లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షోయబ్ను పెళ్లాడగా..2023లో కుమారుడు రుహాన్ను స్వాగతించారు. -
అతనితో హీరోయిన్ డేటింగ్.. ఊహించని విధంగా దొరికేసింది!
బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ పేరు ఇటీవల తెగ మార్మోగిపోతోంది. కొద్ది రోజుల క్రితమే ఓ పెళ్లిలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. మరోసారి తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రాహుల్ మోడీతో కనిపించింది. వీరిద్దరు కలిసి జంటగా సన్నిహితుల వివాహా వేడుకలో పాల్గొన్నారు. దీంతో మరోసారి వీరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. గతంలోనూ అనిల్ అంబానీ పెళ్లి వేడుకలోనూ జంటగా కనిపించారు. అంతేకాదు పలు ఈవెంట్లలో శ్రద్ధా కపూర్ అతనితో పాటు కనిపించింది. దీంతో వీరిద్దరి డేటింగ్ నిజమేనని బాలీవుడ్లో టాక్ తరచుగా వినిపిస్తూనే ఉంది.అయితే తాజాగా శ్రద్ధాకపూర్ మరోసారి హాట్టాపిక్గా మారింది. ముంబయిలో ఓ ఈవెంట్కు హాజరైన ఈ ముద్దుగుమ్మ ఫోటోగ్రాఫర్ల చేతికి చిక్కింది. దీంతో ఆమెను తమ కెమెరాల్లో బంధిస్తుండగా తన ఫోన్ కూడా కనిపించింది. ఆ ఫోన్లో తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న రాహుల్ మోడీతో దిగిన ఫోటో వాల్పేపర్గా కనిపించింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ వీరిద్దరి డేటింగ్ నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే శ్రద్ధా కపూర్ చివరిసారిగా హారర్ కామెడీ ఫిల్మ్ స్త్రీ- 2లో కనిపించింది. రాజ్ కుమార్ రావు కీలక పాత్రలో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో మరో మూడు సినిమాల్లో కనిపించనుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
గోవిందాతో విడాకులు.. అలాంటి వాళ్లు నా ముందుకు రండి: సునీత అహుజా
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడు గోవింద పేరు తెలియని వారు ఉండరు. ఇటీవల ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తన పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పనున్నారని బీటౌన్లో టాక్ నడుస్తోంది. దీంతో తనపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు కూడా. కొద్దిరోజుల కిందట తన ఇంటికి చాలామంది ప్రముఖులు రావడంతో ఇలాంటి వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. వారందరూ కూడా కేవలం వ్యాపార విషయాల గురించి మాట్లాడేందుకే వచ్చారని ఆయన తెలిపారు. తాను కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల వారందరూ వస్తున్నారని చెప్పారు.అయితే తమపై వస్తున్న విడాకుల వార్తలపై గోవింద భార్య సునీతా అహుజా కూడా స్పందించారు. గోవిందా, తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది.ఎందుకంటే మేమంతా ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్లు ధరించి తిరుగుతూ ఉంటాం.. ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది.. అందుకే ఆయన ప్రత్యేకంగా ఆఫీస్ కూడా తీసుకున్నారని పేర్కొంది. ఈ ప్రపంచంలో నన్ను, గోవిందాను విడదీయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే నా ముందుకు రండి అంటూ నవ్వుతూ మాట్లాడింది సునీత అహుజా. గతంలోనూ తామిద్దరం వేర్వేరు ఇళ్లలోనే నివసిస్తున్నట్లు వెల్లడించింది. మాకు రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయని.. ఆయనకు మీటింగ్స్ ఉండటం వల్ల మా ఇంటి ఎదురుగా ఉన్న బంగ్లాలోనే ఉంటారని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు. -
యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ విడాకులు.. తాజా పోస్ట్తో క్లారిటీ!
ప్రముఖ కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ ధనశ్రీ వర్మపై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తన భర్త, టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్తో వివాహ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ వార్తలో నేపథ్యంలో ఇటీవల ఆమె చేసిన పోస్టులు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తన బామ్మ, తాతయ్యల ఇంటికెళ్లిన ధనశ్రీ నిజమైన ప్రేమ అంటే ఇదేనంటూ ఫోటోలను షేర్ చేసింది. అంతే చాహల్ సైతం తన భార్యతో దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తొలగించాడు. దీంతో ఈ జంట దాదాపు విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ధనశ్రీ వర్మ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ధనశ్రీ ఇన్స్టాగ్రామ్లో రాస్తూ.. "ఒత్తిడి నుంచి ఆశీర్వాదం లభించింది. దేవుడు మన చింతలను, పరీక్షలను ఎలా ఆశీర్వాదాలుగా మార్చగలడనేది ఆశ్చర్యంగా లేదా? మీ జీవితంలో ఏ రోజైనా ఒత్తిడికి గురైతే.. మీకు మరో ఛాయిస్ ఉంటుందని తెలుసుకోండి. మీరు బాధలను అన్నింటినీ ఆ దేవునికి వదిలేయండి. అన్ని విషయాల గురించి కలిసి ఆ దేవుడిని ప్రార్థించండి. దేవుడు మీరు ఉంచిన విశ్వాసం మీకు ఎప్పుడు మంచి చేస్తుంది.' అంటూ ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఇటీవల యుజ్వేంద్ర చాహల్ కూడా ఇన్స్టాగ్రామ్లో భగవంతుడే మనల్ని రక్షిస్తాడంటూ పోస్ట్ను పంచుకున్నారు. నేను లెక్కించగలిగిన దానికంటే ఎక్కువ సార్లు ఆ దేవుడు నన్ను రక్షించాడు.. నాకు తెలియకుండా నాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు ధన్యవాదాలు దేవా అంటూ పోస్ట్ చేశారు. తాజా పోస్ట్లతో ధనశ్రీ వర్మ, చాహల్ విడిపోవడం ఖాయమైనట్లేనని తెలుస్తోంది. విడాకులపై అధికారిక ప్రకటన కోసం మాత్రమే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీరిద్దరు డిసెంబర్ 2020లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఇన్స్టాలో పికిల్ బాల్ టోర్నీ ఫోటోలు షేర్ చేసిన సామ్
-
వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటించారు. అతని సరసన పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. 2023లో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇదిలా ఉండగా.. గతేడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ధడక్-2లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది. ఇదిలా ఉండగా యానిమల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ తన ఇన్స్టాలో స్టోరీస్ బర్త్ డే విషెల్ చెబుతూ పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్కు ఇన్స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్రిప్తి డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ అతని బర్త్ డే రోజును విష్ చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా నోరు విప్పలేదు.సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్లు, హోటళ్ల బిజినెస్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్గా రాణిస్తున్నారు.ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. -
నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు
-
విడాకుల ప్రచారంపై ఒబామా రియాక్షన్ ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కారు. సతీమణి మిషెల్లీ నుంచి ఆయన విడిపోబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. అందుకు గత కొంతకాలంగా మీడియా ముఖంగా కనిపించిన సందర్భాలే కారణం. కచ్చితంగా హాజరు కావాల్సిన కార్యక్రమాలకు కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించకపోవడమే విడాకులు రూమర్లకు బలం చేకూర్చింది. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ జంటగా ఎక్కడా మీడియా కంటపడలేదు. పైగా జనవరి 9వ తేదీన జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు, వాళ్ల వాళ్ల సతీమణులంతా(మాజీ ప్రథమ మహిళలు) హాజరయ్యారు. అయితే ఒబామా(Obama) మాత్రం ఒంటరిగానే ఆ ఈవెంట్కు హాజరయ్యారు. దానికి కొనసాగింపుగా.. జనవరి 20వ తేదీన వైట్హౌజ్(White House)లో జరగబోయే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్వీకరణ కార్యక్రమానికి తాను హాజరు కావట్లేదని తన కార్యాలయం నుంచి మిషెల్లీ ఒక ప్రకటన విడుదల చేయించారు. అయితే ఆ ఈవెంట్కు ఒబామా ఒంటరిగానే హాజరవుతారనే కథనాలు ఒక్కసారిగా విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చాయి.There are strong rumors circulating about a possible divorce between Michelle "Big Mike" Obama and Barack Obama. Speculation is growing as Michelle has already missed Jimmy Carter’s funeral and will once again be skipping Donald Trump’s upcoming inauguration, which Barack will… pic.twitter.com/qP3V7jqh14— Shadow of Ezra (@ShadowofEzra) January 16, 2025 I think Barack and Michelle Obama are heading for divorce. His letters talking about how he fantasizes about sex with men "every day" had to be the icing on the cake for her. What woman wants to deal with that, especially in the public eye?— Freedom Party! (@DavidJo1960) January 14, 2025వీళ్ల వ్యక్తిగత జీవితంపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో గత ఐదారు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ లోపు సందర్భం రావడంతో ఈ రూమర్స్కు తనదైన శైలిలో స్పందించారు ఒరాక్ ఒబామా. జనవరి 17వ తేదీన మిషెల్లీ(Michelle) పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.నా ప్రేమ జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్ ఫోజులో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసి లవ్ యూ అంటూ సందేశం ఉంచారాయన. దానికి అంతే స్పీడ్గా లవ్ యూ హనీ.. అంటూ మిషెల్లీ ఒబామా బదులిచ్చారు. తద్వారా విడాకుల రూమర్స్కు ఒకేసారి ఇద్దరూ చెక్ పెట్టారన్నమాట.Happy birthday to the love of my life, @MichelleObama. You fill every room with warmth, wisdom, humor, and grace – and you look good doing it. I’m so lucky to be able to take on life's adventures with you. Love you! pic.twitter.com/WTrvxlNVa4— Barack Obama (@BarackObama) January 17, 2025చికాగోలో ఓ పంప్ ఆపరేటర్-గృహిణి దంపతులకు జన్మించారు మిషెల్లీ. ఓ లా కంపెనీలో ఒబామా-మిషెల్లీ తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్ల తర్వాత తమ ప్రేమను బయటపెట్టుకుని.. వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు మలియా(23),సాషా(23). అమెరికా హైప్రొఫైల్ జంటల్లో.. వన్ ఆఫ్ ది ‘ఆదర్శ జంట’గా వీళ్లకు పేరుంది. గతంలో చాలా సందర్భాల్లో ఈ జంట తమ వైవాహిక జీవితం గురించి సరదాగా చర్చించేవారు. Happy anniversary, @MichelleObama! 32 years together, and I couldn’t have asked for a better partner and friend to go through life with. pic.twitter.com/04t41YYfN6— Barack Obama (@BarackObama) October 3, 2024అయితే ఒక్కోసారి ఆయన వ్యవహార శైలి చిరాకు తెప్పించేదని.. ఆ కోపంతో ఆయన్ని బయటకు విసిరేయాలన్నంత కోపం వచ్చేదని మిషెల్లీ ఓ పాడ్కాస్ట్లో సరదాగా మాట్లాడడం చూసే ఉంటారు. అయితే ఎన్ని కష్టకాలమైనా.. ఆమె తన వెంటే నడిచిందని, బహుశా ఆ ప్రేమే జీవితాంతం ఆమె వెంట ఉండేలా తనను చేస్తోందంటూ ఒబామా కూడా అంతే సరదాగా బదులిచ్చేవారు. ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో తొలిసారి! -
ఆ హీరోయిన్తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేశ్(Suresh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో ఒక నటుడిగా, విలన్గా పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్లో దాదాపు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు.ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు సురేశ్. మొదట్లో హీరోగా, తర్వాత విలన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు తన గొంతు అరువిచ్చాడు కూడా. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సురేశ్ ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. అటు బుల్లితెరపై సీరియల్స్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేశ్ తన కెరీర్లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు. ముఖ్యంగా మరో నటి, అత్తారింటికి దారేది చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నదియా(Nadiya) గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరోయిన్గా ఉన్న నదియాతో సురేశ్ లవ్లో ఉన్నారని వినిపించాయి కదా? దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నంచిగా ఆయన క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!)ఈ విషయంపై సురేశ్ మాట్లాడుతూ..'అలాంటిదేం లేదు. నదియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. ఆమె బాయ్ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరు లాగే ఉండేది. నదియా బాయ్ఫ్రెండ్ పేరు శిరీశ్. తను షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం శిరీశ్తోనే ఫోన్ మాట్లాడేది. అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారు. కానీ తర్వాత నదియా అతన్ని పెళ్లి చేసుకుంది. నదియా నాకు సిస్టర్తో సమానం. తాను సినిమాలో సాఫ్ఠ్గా ఉన్నప్పటికీ.. నాతో మాత్రం కాస్తా గట్టిగానే మాట్లాడుతుంది. తను జీవితంపై ఫుల్ క్లారిటీతో ఉండేది. సినిమాల్లో నటిస్తూనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పేది. ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది' అని అన్నారు.తామిద్దరం ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని సురేశ్ అన్నారు. మా 1980 నటీనటులకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని ఆయన అన్నారు. ఆ వాట్సాప్ గ్రూప్లో రజనీకాంత్ సర్ కూడా ఉన్నారని సురేశ్ వెల్లడించారు.సురేశ్ సినీప్రస్థానం..ఏపీలోని శ్రీకాళహస్తిలో జన్మించిన సురేశ్ తమిళ చిత్రంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1981లో పన్నీర్ పుష్పంగల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో రామదండు అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్లో పలు చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. తెలుగులో జిన్నా, స్పై చిత్రాల్లో కనిపించిన సురేశ్.. చివరిసారిగా రివైండ్ అనే మూవీలో నటించారు. కాగా.. హరితా రెడ్డిని పెళ్లాడిన సురేశ్.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత సురేశ్ రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శక రచయిత్రి రాశిని ఆయన పెళ్లాడారు. -
ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట జూన్లో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తోంది బాలీవుడ్ భామ. దీంతో నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ కూడా తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది సోనాక్షి. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం గర్భవతిని కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేమిద్దరం సరదాగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నామని చెప్పింది. పెళ్లి తర్వాత తాను కొంత బరువు పెరగడంతో పాటు లావుగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. అందువల్లే తనను గర్భవతి అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారని వివరించింది. ప్రస్తుతం తామిద్దరం వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నామని సోనాక్షి తెలిపింది.కాగా.. తన భర్త బర్త్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్. డిసెంబర్ 10న జరిగిన జహీర్ ఇక్బాల్ పుట్టిన రోజు వేడుకలో సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 23న ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి రిసెప్షన్ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, హుమా ఖురేషి, ఆదిత్య రాయ్ కపూర్ పాల్గొన్నారు. -
టీమిండియా స్టార్ సిరాజ్పై రూమర్లకు కారణం ఈ ఫొటోలే! (ఫొటోలు)
-
బిగ్బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్గా మారింది. బాలీవుడ్కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.రూమర్లకు కారణం ఇదే!అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్తో గ్లామరస్ లుక్లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు. లైక్ కొట్టినంత మాత్రానఅంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. క్రికెట్కు- బాలీవుడ్కు విడదీయరాని అనుబంధంకాగా క్రికెట్కు- బాలీవుడ్కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమేఇక భారత ఆల్రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది. అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్మన్ గిల్- సారా అలీఖాన్ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.ఆస్ట్రేలియా పర్యటనలోఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..! View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
అక్కినేని హీరోతో పెళ్లి.. ఆ వార్తలపై స్పందించిన మీనాక్షి చౌదరి
ఇటీవల లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ మీనాక్షి చౌదరి. మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.ఇటీవల వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవల సుశాంత్ను మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు గుంటూరు కారం భామను ప్రశ్నించారు.దీనికి మీనాక్షి చౌదరి స్పందిస్తూ..'అదంతా ఫేక్. నేను పెళ్లి చేసుకోవడం లేదు. గతనెల కూడా ఒక రూమర్ వచ్చింది. ఓ తమిళ నటుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు రాశారు. ప్రతినెల నాపై ఏదో ఒక రూమర్ వస్తోంది. అలాగే ఇప్పుడు నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని అన్నారు. కాగా.. మెకానిక్ రాకీలో మరో హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా మరో ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. -
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లకు చెక్..
-
'క' ఓటీటీ రిలీజ్పై రూమర్స్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
గత వారం థియేటర్లలో రిలీజైన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. తర్వాత అది హిట్ టాక్గా మారింది. అన్ని చిత్రాలకు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కిరణ్ అబ్బవరం 'క' మూవీనే దీపావళి విన్నర్గా తేలింది.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)థియేటర్లలో సక్సెస్ఫుల్ ఆడుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వచ్చేస్తున్నాయి. నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయిపోతుందనే పోస్టులు ఎక్కువగా కనిపించాయి. ఈటీవి విన్ ఓటీటీలోకి వస్తుందని తెగ హడావుడి చేస్తున్నారు.ఇప్పుడు ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చేసింది. 'క' మూవీని థియేటర్లలోనే చూడండి. ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నట్లు ట్వీట్ చేసింది. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పుడు ఈ రూమర్స్ రావడం పర్లేదు. కానీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది కూడా వైరల్ చేసేయడం చేజేతులా వసూళ్లని అడ్డుకున్నట్లే. మరి ట్వీట్ చేసినట్లు నిర్మాత మాట మీద నిలబడతారో లేదో చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)#KA We are not coming to OTT any time soon..we want you all to experience our movie in theatres only. Please discard any fake news in this regards— srichakraas entertainments (@srichakraas) November 6, 2024 -
దివాళీ పార్టీలో మెరిసిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీపై క్రేజీ కామెంట్స్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం కుటుంబంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ భర్తతో కలిసి దిపావళీ పార్టీలో తళుక్కున మెరిసింది. ముంబయిలో జరిగిన దివాళీ బాష్లో అనార్కలీ సూట్ ధరించి కనిపించింది. ఇద్దరు కలిసి తమ పెట్ డాగ్తో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. గెస్ దిస్ అంటూ సోనాక్షి క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఇది చూసిన నెటిజన్స్ సోనాక్షి సిన్హాను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి బేబీ బంప్తో ఉందంటూ ఇన్స్టాలో రిప్లై ఇస్తున్నారు. తన భర్త జహీర్ ఇక్బాల్తో కలిసి త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ గురించి ఇప్పటి వరకు సోనాక్షి నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.(ఇది చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్)కాగా.. ఈ ఏడాది జూన్ 23న హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్మెంట్లోనే జరిగింది. మరోవైపు సోనాక్షి ది బుక్ ఆఫ్ డార్క్నెస్లో అనే చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయం రవి విడాకుల తర్వాత తనపై వచ్చిన రూమర్స్పై తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.జయం రవి మాట్లాడుతూ.. 'మేము పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. నేను బయట టీ తాగినా..ఏ చేసినా తెలిసిపోతుంది. ఎందుకంటే మేము సినిమా వ్యక్తులం. మమ్మల్ని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. వారి అభిప్రాయాలు కూడా వెల్లడిస్తుంటారు. మేమైతే వాటిని అడ్డుకోలేం కదా. కొంతమంది పరిణితి చెందిన వారు ఇలాంటి రూమర్స్ను పట్టించుకోరు. పరిపక్వత లేని కొద్దిమంది మాత్రమే రూమర్స్ వ్యాప్తి చేయడం చేస్తుంటారు. కొంతమంది ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. కానీ నా గురించి నాకు పూర్తిగా తెలిసినప్పుడు ఇలాంటి వాటి గురించి తెలుసుకుని ఎందుకు బాధపడతాం' అని అన్నారు.(ఇది చదవండి: మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి)కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్లో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అనుమతి లేకుండానే విడాకుల ప్రకటన విడుదల చేశారని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. అయితే ఆమె మాటల్లో ఎలాంటి నిజం లేదని జయం రవి క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. -
విడాకులు క్యాన్సిల్! ధనుష్-ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కానున్నారా? (ఫొటోలు)
-
టెలిగ్రామ్ సీఈవో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా?
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్లైన్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్లో దురోవ్ అరెస్టయ్యారు.రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్ను మెసేజింగ్ యాప్గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్కి చెందిన ఈ బిలియనీర్ను వారం రోజుల క్రితం పారిస్లో అదుపులోకి తీసుకున్నారు.దురోవ్ 2011 నుంచి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.సోషల్ మీడియాలో వైరల్ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn— Creepy.org (@creepydotorg) September 1, 2024 -
అది వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం: విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీకి కీలక నేతల వలసలు ఉండబోతున్నాయంటూ ఈ ఉదయం నుంచి టీడీపీ అనుకూల మీడియా తెగ హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ఐ-టీడీపీ, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలు సైతం ఆ ప్రచారానికి కొన్ని పేర్లను జోడించి పోస్టులు వైరల్ చేస్తున్నాయి. అయితే..ఆ దుష్ప్రచారం తీవ్రంగా స్పందించారు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైఎస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.తాను ఎప్పటికీ వైస్సార్సీపీలోనే ఉంటానని.. మరో పార్టీలో చేరబోతున్నారంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు. I wish to make it clear that I am a loyal, dedicated, and committed worker of the YSRCP. I will remain with YSRCP and work under the leadership of Sri @ysjagan Garu. I condemn the baseless speculation and misinformation being spread by a section of the media about me quitting…— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2024 -
హీరో భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన నటి!
సెలబ్రిటీలపై రూమర్స్ రావడమనేది సహజం. వారిపై ఏదో ఒక రూమర్ రావడం.. దానికి మళ్లీ క్లారిటీ ఇవ్వడం ఇలా సర్వసాధారణంగా మారింది. తాజాగా బాలీవుడ్ హీరో భార్య, నటి పాత్రలేఖపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. 2021లో రాజ్ కుమార్ రావును పెళ్లాడిన ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.పాత్రలేఖ మాట్లాడుతూ..' నా కడుపులో ఉబ్బినట్లుగా కనిపించినప్పుడల్లా గర్భవతిని అయిపోతానా? నేను కూడా ఒక అమ్మాయినే కదా? నా జీవితంలో సంతోషంగా లేని రోజులు కూడా ఉన్నాయి. కానీ నా లైఫ్ కోరుకున్న విధంగా ఉండాలనుకున్నా. అయితే మొదటి నుంచి నాపై వస్తున్న రూమర్లను నేను పట్టించుకోను. అందుకే కామెంట్స్ కూడా చదవటం మానేశా. కేవలం ఫోటోలు మాత్రమే చూస్తున్నా. నేను ఎలాంటి దుస్తులు ధరించినా మీరు ఇలానే ఊహించుకుంటారా?' అని ఘాటుగానే ప్రశ్నించింది.తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలు అవాస్తమని పాత్రలేఖ కొట్టిపారేసింది. కాగా.. రాజ్ కుమార్ రావు ఇటీవలే స్త్రీ-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 15 ఏళ్ల డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2021లో వివాహం చేసుకున్నారు. మరోవైపు పాత్రలేఖ నెట్ఫ్లిక్స్ సిరీస్ 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్'లో కనిపించనుంది. ఈ సిరీస్లో విజయ్ వర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. -
‘జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!’ ఎపిసోడ్లో ట్విస్ట్!
తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెప్పిన 34 ఏళ్ల టెక్కీ విపిన్ గుప్తా ఎపిసోడ్పై ఆయన భార్య శ్రీపర్ణ దత్త స్పందించారు. తాను భర్తను వేధించానంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. భార్య వేధిస్తుంది కాబట్టే ఆమె నుంచి తప్పించుకునేందుకు భర్త తిరుగుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తన భర్త గత కొంత కాలంగా కెరియర్ గురించి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. గతంలో తన భర్తపై మిస్సింగ్ కేసు వేసిన శ్రీపర్ణ దత్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నా భర్త విపిన్ రెండుసార్లు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తండ్రికి అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్సకు డబ్బు అవసరం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఉపశమనం పొందేందుకు తిరుమల దర్శనం అనంతరం నోయిడా వెళ్లినట్లు చెప్పారు. అన్నీ అవాస్తవాలేఈ సందర్భంగా తాను విపిన్ను వేధిస్తున్నానంటూ వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. ‘నేను నా భర్తను వేధిస్తే.. ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తాను. నేను నా భర్తను ఎప్పుడూ వేధించలేదు. అదే జరిగితే, అతనిని వెతకాలని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తాను? ఆచూకి కోసం సోషల్ మీడియాలో పోస్ట్లు ఎందుకు పెడతాను’ అని ప్రశ్నించారు. మానసికంగా కృంగిపోయాడు కాబట్టే భర్తను పునరావాస కేంద్రానికి పంపించినట్లు ఆమె చెప్పారు.బెదిరింపులు ఎక్కువయ్యాయ్తన భర్త దొరికిన తర్వాత కూడా తనకు బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని వాపోయారు శ్రీపర్ణ దత్త. నా భర్తను కిడ్నాప్ చేశామంటూ పలువురు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు సైబర్ నేరస్తులు మెసేజ్లు పంపినట్లు వెల్లడించారు. భార్య పోరు పడలేకేగతవారం బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహించే ఐటీ ఉద్యోగి విపిన్ గుప్త ఇంటి నుంచి నోయిడా వెళ్లాడు. అయితే విపిన్ జాడకోసం ఆయన భార్య శ్రీపర్ణ దత్తా పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరుకు రప్పించగా, ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని పోలీసుల్ని కోరాడు. అయితే పోలీసులు విపిన్ను బుజ్జగించడంతో కష్టం మీద ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. భార్యే విపిన్ మానసిక సమస్యకు చికిత్స ఇప్పించేందుకు పునరావస కేంద్రానికి పంపించారు. -
నా భర్త నన్ను మోసం చేయలేదు.. షకీబ్ భార్య క్లారిటీ (ఫోటోలు)
-
టీడీపీ నేతల్లా పారిపోయే రకం కాదు: దేవినేని అవినాష్
విజయవాడ, సాక్షి: తనపై తెలుగు దేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ఉత్త ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, ఆ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియో విడుదల చేశారాయన.‘‘నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలకు , కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నా. పనీపాటా లేని కొన్ని మీడియా సంస్థలు , టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను దేనికి పారిపోవాలి...ఎందుకు పారిపోవాలి?.... నేను తప్పుచేశానని కోర్టు భావిస్తే.. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దమ్ముగా స్వీకరిస్తాం. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. సమస్యలొస్తే టీడీపీ నేతల్లా నేను పారిపోయేరకం కాదు. నా తండ్రి నాకు జన్మనివ్వడంతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మా పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ. వైసీపీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటాం. మరోసారి చెబుతున్నా.. టీడీపీ , ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు అంటూ ఆ వీడియో సందేశంలో కోరారాయన.టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అందులో దేవినేని అవినాష్ పేరు కూడా ఉంది. మొన్నీమధ్యే వల్లభనేని వంశీ విషయంలోనూ అతి ప్రదర్శించిన ఎల్లో మీడియా.. ఇప్పుడు దేవినేని అవినాష్ విషయంలోనూ తప్పుడు రాతలతో అలాగే ప్రవర్తించింది. -
'ఐ యామ్ నాట్ సింగిల్'.. దసరా భామ ఆసక్తికర కామెంట్స్!
దసరా హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుమన్కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ తొలిసారి కోలీవుడ్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా కీర్తి సురేశ్ తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరు సింగిల్గా ఉంటున్నారు కదా? అని ఆమెను ప్రశ్నించారు. దీంతో తన రిలేషన్షిప్ గురించి దసరా భామ నోరువిప్పారు. దీనికి బదులిస్తూ.. 'నేనేప్పుడు సింగిల్ అని చెప్పలేదుగా' అమటూ సమాధానమిచ్చింది.కాగా.. గతంలో ఆమె పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి ఫ్రెండ్ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ చేసిన కామెంట్స్ నెట్టంటి తెగ వైరలవుతున్నాయి. అయితే తాను సింగిల్ కాదని చెప్పడంపై.. ఇప్పటికే రిలేషన్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పరోక్షంగా హింట్ ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు కీర్తి సురేశ్ బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. బేబీ జాన్ సినిమాతో వరుణ్ ధావన్ సరసన నటించనున్నారు. -
గ్రీస్లో ఆదిపురుష్ భామ.. అతనితో డేటింగ్ నిజమేనా!
ఆదిపురుష్ భామ, బాలీవుడ్ నటి కృతి సనన్ తెలుగువారికి సుపరిచితమే. ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీతగా మెప్పించింది. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో అభిమానులను అలరించలేకపోయింది. ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇటీవల క్రూ మూవీతో ఫ్యాన్స్ను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గ్రీస్లో విహరిస్తోంది. తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న కబీర్ బహియాతో చిల్ అవుతోన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.గతంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పలుసార్లు రూమర్స్ వినిపించాయి. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లోనూ ఈ జంట పార్టీలో సందడి చేశారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్లో ఉన్నారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే కబీర్తో రిలేషన్పై ఇప్పటివరకు కృతి సనన్ స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరు జంటగా గ్రీస్లో కనిపించడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా కృతి సనన్ ఇటీవల తన పుట్టినరోజును కబీర్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.పదేళ్ల ఏజ్ గ్యాప్..అయితే ఈ జంట మధ్య వయసు అంతరం ఎక్కువగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కృతి సనన్ వయస్సు 34 ఏళ్లు కాగా.. కబీర్ బహియాకు వయస్సు 24 ఏళ్లు మాత్రమేనని తెలుస్తోంది. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇది చూస్తుంటే తనకంటే పదేళ్లు చిన్నవాడైన కబీర్తో ఆదిపురుష్ భామ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి సనన్ దో పట్టి మూవీలో కనిపించనుంది. ఇందులో కాజోల్, షహీర్ షేక్ కూడా నటించారు. -
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. నటి ఏమన్నారంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రఘు తాత. ఈ చిత్రానికి సుమన్కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో చిత్రయూనిట్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా వరుసగా ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేశ్ అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'నాపై వచ్చే రూమర్స్పై క్లారిటీ ఇస్తే అదే నిజమనుకుంటారు. అందుకే వాటిపై నేను రియాక్ట్ అవ్వను. కేవలం నా సినిమాల ఎంపిక, నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తా. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతా. నా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా పట్టించుకోను. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్ను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు' అని తెలిపింది.కాగా.. గతంలోనూ కీర్తి సురేశ్ పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. వాటిన్నింటినీ ఆమె తల్లిదండ్రులు సైతం కొట్టిపారేశారు. కాగా.. రఘుతాత చిత్రంలో పోరాటం చేసే మహిళ పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే టీజర్ను విడుదల చేయగా.. విద్యాభ్యాసం, ఉద్యోగంలో ఓ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
సానియాతో పెళ్లి?.. మీకు దమ్ముంటే ముందుకు రండి: షమీ వార్నింగ్ (ఫొటోలు)
-
కత్రినా కైఫ్కు ప్రెగ్నెన్సీ.. విక్కీ కౌశల్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ కాగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రబృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ ఢిల్లీ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆయనకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది. మీ భార్య ప్రస్తుతం గర్భంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి శుభవార్త లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టిపారేశారు.ఇప్పటికైతే బ్యాడ్ న్యూజ్ను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి విక్కీ, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బేబీ బంప్తో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. దీంతో తాజాగా మరోసారి విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. బ్యాడ్ న్యూజ్ జూలై 19, 2024న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. డిసెంబర్ 9, 2021న రాజస్థాన్లోని ఈ జంట వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
అలాంటి డ్రెస్లో కత్రినా కైఫ్.. ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ బీటౌన్లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. అయితే హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె ముంబయిలోని ఎయిర్పోర్ట్లో కనిపించింది.అయతే కత్రినా కైఫ్ వదులుగా ఉండే జాకెట్ ధరించిన విమానాశ్రయంలో కనిపించింది. అలా ఆమెను నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే వీటిపై విక్కీకౌశల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. గత నెలలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్తో లండన్ వెకేషన్కు వెళ్లిన సంగతి తెలిసిందే.కాగా.. కత్రినా 'మెర్రీ క్రిస్మస్' తర్వాత కొత్త ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఆమె భర్త విక్కీ కౌశల్, ట్రిప్తీ డిమ్రీతో కలిసి 'బాడ్ న్యూస్'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత రష్మిక మందన్నతో 'ఛవా', సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ కూడా భాగం కానున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఈ చిన్నారి ఇప్పుడు టాప్ సెలబ్రిటీ.. కొడుకే తన ప్రపంచం (ఫొటోలు)
-
ఐకానిక్ భవనంపై టీడీపీ రచ్చ..
-
ప్రముఖ సింగర్పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు హాలీవుడ్లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్ తీసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.కాగా.. ఇప్పటికే జెన్నిఫర్ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. ఈ బంధానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 2021లో డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గత నెల రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీ, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటించిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. పాకిస్తాన్లో లాహోర్లో జరిగిన స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కించారు. అయితే సిరీస్లో షర్మిన్ సెగల్(ఆలంజేబ్) ప్రియుడిగా తహా షా బాద్షా నటించారు.అయితే తాజాగా అతను మరో నటితో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్లో రూమర్స్ మొదలయ్యాయి. హీరామండి నటి ప్రతిభా రంతాతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో తనపై వస్తున్న వార్తలపై హీరామండి నటుడు తహా షా బాద్షా స్పందించారు. ఆమెతో పరిచయం కేవలం నటన వరకు మాత్రమేనని అన్నారు. ఆమెతో నా రిలేషన్ కేవలం షూట్ వరకే ఉంటుందని బాద్షా అన్నారు. ముందుగా నేను జీవితంలో స్థిరపడాలని.. ఆ తర్వాతే ప్రేమ, కుటుంబం గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. కాగా.. ముంబయిలో ఇద్దరు కలిసి డిన్నర్ డేట్లో కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చేశాడు. హీరామండిలో తాజ్దార్ పాత్రలో మెప్పించాడు. షర్మిన్ సెగల్ ప్రియుడిగా.. స్వాతంత్ర్య ఉద్యమ కారుడిగా ఈ సిరీస్లో మెప్పించారు. ఇటీవల జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తాహా షా బాదుషా సందడి చేశారు. ప్రతిభా రంతా హీరామండిలో షామా పాత్రలో కనిపించింది. -
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ భామ సోనాలి బింద్రే తెలుగువారికి సైతం సుపరిచితమే. మహేశ్ బాబు సరసన మురారి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఆ తర్వాత మెగాస్టార్ మూవీ ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయిత 2002లోనే నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీబెల్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా అప్పటి నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేశారు.సోనాలి బింద్రే మాట్లాడుతూ.. '1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చా. ఇప్పటికంటే అప్పటి పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండేవి. అప్పట్లో సహనటులతో నాపై ఎన్నో రూమర్స్ సృష్టించారు. కానీ వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. 1990ల్లో సినిమా నిర్మాతలే కావాలనే హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ క్రియేట్ చేసేవారు. వాటిని మీడియాకు చెప్పేవాళ్లు. సినిమా ప్రమోషన్స్ కోసం ఈ విధంగా చేసేవారని తెలిసి ఆశ్చర్యపోయా' అని తెలిపారు.అయితే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సన్నగా ఉన్నందుకు అవహేళన చేసేవారని సోనాలి బింద్రే తెలిపారు. ఆ రోజుల్లో హీరోయిన్లు కాస్తా బొద్దుగా ఉండేవారని పేర్కొన్నారు. నేను సన్నాగా విషయాన్ని కొందరు నిర్మాతలు మొహం మీదే చెప్పేవారని వెల్లడించింది. నేను అలాంటివాటిని పట్టించుకునే దాన్ని కాదని వివరించింది. అంతేకాదు.. ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని.. నటనలోనూ ఎలాంటి శిక్షణ తీసుకోలేదని.. అసలు స్టార్ హీరోయిన్గా అవుతానని ఊహించలేదని సోనాలి ఆ రోజులను మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. -
బుల్లితెర నటిపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. కానీ!
బాలీవుడ్ బుల్లితెర భామ దీపికా కక్కర్ బీటౌన్లో సుపరిచితమే. ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్- 12లో కంటెస్టెంట్గా పాల్గొని విజేతగా నిలిచింది. అయితే 2018లో రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ గతేడాది జూన్లో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఇదిలా ఉండగా దీపికా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఆమె ఇటీవలే తన బిడ్డ రుహాన్ను తన చేతుల్లో పట్టుకుని వీడియోలో కనిపించింది. అందులో దీపికా వదులుగా ఉన్న తెల్లటి సూట్ ధరించి కనిపించింది. ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ 'బేబీ బంప్' దుపట్టాతో దాచి ఉంచారంటూ కామెంట్స్ చేశారు. అయితే దీపికా కక్కర్ తనపై వస్తున్న రూమర్స్పై స్పందించలేదు. కాగా.. దీపికకు ఇప్పటికే రౌనక్ సామ్సన్ అనే వ్యక్తితో మొదటి పెళ్లి కాగా.. అతనితో 2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2018లో షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. -
హీరోయిన్కు ప్రెగ్నెన్సీ.. వైరలవుతోన్న పోస్ట్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్ దోసాంజ్కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ సింగ్ బయోపిక్గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. (ఇది చదవండి: ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ..!) అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. ఎయిర్పోర్ట్లో వైట్ కలర్ అవుట్ఫిట్లో కనిపించడంతో నెటిజన్స్ అలాంటి కామెంట్స్ చేశారు. తేలికైన దుస్తుల్లో ఎయిర్పోర్ట్కు రాగా ప్రెగ్నెన్సీ టాపిక్ కాస్తా వైరలైంది. తాజాగా ఈ వార్తలపై నటి పరిణీతి స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతోనే ఉన్నట్లేనా? అంటూ రాసుకొచ్చింది. అందులో తాను ధరించే మూడు రకాల డ్రెస్సులను ప్రస్తావిస్తూ ఫన్నీ ఎమోజీని జత చేసింది. అంటే తాను వేసుకునే డ్రెస్సును చూసి మీరు అలా అనుకుంటే కామెడీగా ఉందంటూ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. -
'మౌనిక ప్రెగ్నెన్సీపై అలాంటి వార్తలు'.. స్పందించిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. గతేడాది డిసెంబర్లోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ విషయంలో టాలీవుడ్ దంపతులపై వస్తున్న వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. దయచేసి మా విషయంలో మీరు ఎలాంటి రూమర్స్ను నమ్మకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. తమకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ఏడో నెల గర్భంతో ఉందని.. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ..!
బాలీవుడ్ భామ, హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించనుంది. ఇటీవల ఎయిర్పోర్ట్లో వైట్ కలర్ అవుట్ఫిట్లో కనిపించింది. తేలికైన దుస్తుల్లో పరిణీతి కనిపించడంతో అభిమానులు ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పెద్దఎత్తున సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న అమర్ సింగ్ బయోపిక్ చమ్కీలా ఏప్రిల్ 12న విడుదల కానుంది. కాగా.. గతేడాది మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. సెప్టెంబర్లో మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విషయంపై పరిణీతి చోప్రా ఇంత వరకు స్పందించలేదు. ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్స్పై స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) Parineeti Chopra's fashion perfection ♥️😍#ParineetiChopra #Fashion #Celebrity #ViralVideo #Trending #BollyTadka24 pic.twitter.com/XUQcZhXAY1 — Bolly Tadka24 (@bollytadka24) March 6, 2024 -
వరలక్ష్మి ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త గురించి విస్తుపోయే నిజాలు!
ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. పెళ్లిపై గతంలో చాలాసార్లు దాటవేస్తూ వచ్చిన వరలక్ష్మి ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ను పెళ్లాడనుంది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ను పెళ్లాడబోయే వ్యక్తిగా గురించి ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయాలపై ఆడియన్స్ నెట్టింట చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్దేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అసలు అతనెవరు? వరలక్ష్మీకి ఎలా పరిచయమయ్యాడు? అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి వెతకగా.. ఆశ్చర్యపోయే నిజం బయటికొచ్చింది. వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోనుందన్న వార్త తెలియగానే.. నికోలయ్ సచ్దేవ్ గురించి ఆమె ఫ్యాన్స్ నెట్టింట వెతకడం మొదలెట్టారు. అయితే ఆయన గురించి అభిమానులకు గుండె పగిలే నిజం తెలిసింది. అతనికి ఇంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. దీంతో విషయం తెలుసుకున్న వరలక్ష్మి ఫ్యాన్స్ కాబోయే భర్తకు ఇది రెండో పెళ్లా? అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై నికోలయ్, వరలక్ష్మీ కానీ ఇంకా స్పందించలేదు. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో వరలక్ష్మి ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
నయన్ - విఘ్నేశ్ జంటపై రూమర్స్.. ఆ ఫోటో షేర్ చేసిన భర్త!
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది షారుక్ సరసన జవాన్తో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె నటించిన అన్నపూరణి పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో ఓ వర్గం వారిని కించపరిచేలా సీన్స్ ఉన్నాయంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో నెట్ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీ నుంచి తొలగించింది. అయితే ఇటీవల నయన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన భర్తను ఇన్స్టాలో అన్ఫాలో చేయడంతో పెద్ద ఎత్తున రూమర్స్ మొదలయ్యాయి. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట విడిపోనుందా? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ అంతలోనే మళ్లీ తన భర్తను ఫాలో చేసింది. దీంతో ఈ జంట విడాకుల రూమర్స్కు చెక్ పెట్టింది. కానీ తాజా పరిణామాలతో వాటికి చెక్ పెడుతూ.. విఘ్నేశ్ శివన్ ఆమె ఫొటోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్స్కు తెరపడింది. కాగా.. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా.. గత నెల ప్రేమికుల రోజు నయనతార.. తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. -
హీరోయిన్ పెళ్లి అంటూ వార్తలు.. కాస్త గట్టిగానే ఇచ్చిపడేసింది!
ఇటీవల పలువురు సినీ తారలు పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో త్వరలోనే పెళ్లాడనుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్ ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోబోతోందని తెగ ప్రచారం జరుగుతోంది. తనపై పెళ్లి వార్తల నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ స్పందించారు. ఇలాంటి వార్తలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. ఇక నుంచి భవిష్యత్తులోనూ ఎలాంటి స్పష్టత ఇవ్వనని తేల్చి చెప్పారు. తాజా కామెంట్స్తో తన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ. కాగా.. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వారి రిలేషన్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సౌత్ నుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత అతడితో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్లో వచ్చిన షారుక్ మూవీ డంకీ చిత్రంలో మెరిసింది తాప్సీ. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ హిరాణీ రూపొందించారు. ప్రస్తుతం తాప్సీ ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా చిత్రంలో నటిస్తున్నారు. హసీన్ దిల్రుబాకు సీక్వెల్గా వస్తోన్న ఈ చిత్రానికి జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
త్వరలోనే అనుష్క శెట్టి పెళ్లి?
సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ రావడం సర్వ సాధారణం. బాలీవుడ్ మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఇటీవల ఎక్కువయ్యాయి. డేటింగ్, పెళ్లి, విడాకులు అంటూ సినీ తారలపై మనం తరచు వార్తలు వింటుంటాం. స్టార్ నటీనటుల విషయంలో ఇవీ కాస్తా ఎక్కువగానే ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం అని అందరికీ తెలుసు. కెరీర్ ప్రధానంగా సాగే ఈ రంగంలో చాలామంది వయసు పెరుగుతునప్పటికీ పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ల విషయంలో తరచుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇటీవల రష్మిక- విజయ్ ఎంగేజ్మెంట్ అంటూ పెద్దఎత్తున రూమర్స్ వచ్చాయి. అలాంటిదేమీ లేదంటూ విజయ్ టీం క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్పై త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న టాక్ తెగ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో స్వీటీగా తన పేరును ముద్రించుకున్న హీరోయిన్ అనుష్క. విక్రమార్కుడు నుంచి బాహుబలి దాగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పించింది. అరుంధతి చిత్రంతో జేజమ్మగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ద్వారా పలకరించింది. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమాలో డిఫరెంట్ రోల్లో కనిపించి అలరించింది. అయితే ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంలో గతంలో చాలాసార్లు ఆమెపై రూమర్స్ కూడా వచ్చాయి. అవీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయంపై చర్చ మొదలైంది. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్తో రిలేషన్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో ఏకంగా ఓ స్టార్ క్రికెటర్తో అనుష్క పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతే కాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కాగా.. గతంలో అనుష్క పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లిపై నాకు నమ్మకముంది. వివాహానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క పెళ్లిపై మరోసారి వార్తలు రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. -
వదంతులపై స్పందించే గడువు పెంపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో వ్యాపించే వదంతులపై తప్పనిసరిగా స్పందించాల్సిన గడువును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పొడిగించింది. దీంతో టాప్–100 లిస్టెడ్ కంపెనీలకు వెసులుబాటు లభించింది. వెరసి మార్కెట్లో పుట్టే రూమర్లను ధ్రువ పరచడం, ఖండించడం లేదా స్పష్టతనివ్వడం వంటి చర్యలను తప్పనిసరిగా చేపట్టాలనే నిబంధన అమలుకు మరింత గడువు లభించింది. సెబీ ప్రతిపాదిత ఈ నిబంధనలు తొలుత టాప్ ర్యాంక్లోని 100 లిస్టెడ్ కంపెనీలకు అమలుకానున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)రీత్యా అగ్రభాగంలో నిలిచే 100 కంపెనీలు 2024 ఫిబ్రవరి 1 నుంచి రూమర్లపై తప్పనిసరిగా స్పందించాలంటూ సెబీ ఇంతక్రితం గడువు విధించింది. తాజాగా ఈ డెడ్లైన్ను జూన్ 1వరకూ పొడిగిస్తూ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఈ బాటలో మార్కెట్ విలువలో టాప్–250 ర్యాంకు లిస్టెడ్ కంపెనీలకు రూమర్లపై స్పందించాల్సిన నిబంధనలు 2024 డిసెంబర్ 1 నుంచి అమలుకానున్నాయి. నిజానికి 2024 ఆగస్ట్ 1 నుంచి నిబంధనలు అమలు చేయవలసిందిగా టాప్–250 సంస్థలను సెబీ గతంలో ఆదేశించింది. లిస్టెడ్ కంపెనీలు కార్పొరేట్ పాలనను మరింత పటిష్టంగా అమలు చేసే లక్ష్యంతో సెబీ తాజా నిబంధనలకు తెరతీసిన విషయం విదితమే. -
Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్పై పుకార్లు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్లు బంద్ అంటూ మళ్లీ పుకార్లు వ్యాపించడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జనం పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు సైతం వెలిశాయి. అయితే, పెట్రోల్ బంక్లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని ఇవి పుకార్లేనని బంక్ల యాజమాన్యం స్పష్టం చేశారు. ఇక.. ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో.. కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన కఠిన నిబంధనలను నిరసిస్తూ అయిల్ ట్రాక్కుల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చదవండి: Banjara Hills: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య.. -
దిల్ రాజు అంటే బ్రాండ్ ఎవ్వరినీ వదలను
-
మాజీ భర్త రెండో పెళ్లి.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ బ్రేకప్!
సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్లు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. బాలీవుడ్లో అయితే కాస్తా ఎక్కువగానే ఇలాంటి వార్తలు తరచుగా వస్తుంటాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఓ యంగ్ హీరోకు స్టార్ హీరోయిన్ దూరంగా ఉంటున్నట్లు లేటెస్ట్ టాక్. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ భామ మలైకా అరోరా. ప్రస్తుతం ఈ టాపిక్ బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న మలైకా.. ఇప్పటికే తన మొదటి భర్తతో అర్బాజ్ ఖాన్తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ కొనసాగిస్తోంది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న భామ.. 2019లో తమ రిలేషన్ను బయటపెట్టారు. గతంలో చాలాసార్లు ఈవెంట్లలో ఈ జంట కనిపించి సందడి చేశారు. తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే మలైకా తన స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంది. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లోనూ అర్జున్ కపూర్, మలైకా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై బాలీవుడ్ భామ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ఇటీవలే మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మలైకా అరోరాకు నటుడు అర్బాజ్ ఖాన్ 1998 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత అర్బాజ్, మలైకా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. -
పీకల్లోతు ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఏడాదిలోనే!
హీరోయిన్ శ్రద్ధాదాస్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రంలో మెరిసింది. ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాదాస్.. రెబల్ స్టార్ నటించిన డార్లింగ్ మూవీలో నటించి అభిమానులను అలరించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన మెప్పించిన ముంబై ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పెద్ద సినిమాల్లో కనిపించడం లేదు. అయితే తాజాగా తాను సింగర్ అవతారమెత్తింది. త్వరలోనే లండన్లో జరగనున్న మ్యూజిక్ కన్సార్ట్లో సింగర్గా సినీ ప్రియులను అలరించనుంది. (ఇది చదవండి: ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) సినిమాలకు కాస్తా దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లోనే ఉంటోంది. ఇటీవల కేరళలో చిల్ అవుతూ ఫోటోలు, వీడియోలను పంచుకుంది. వయసు మూడు పదులు దాటినా.. తన అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు డార్లింగ్ హీరోయిన్. ఫుల్గా చిల్ అవుతూ నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ డార్లింగ్ భామ పెళ్లికి రెడీ అయినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఓ బిజినెస్మెన్తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అంతే కాదు కొత్త ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. అంతే కాదు.. ఈ ఏడాది సమ్మర్లోనే వివాహం కూడా జరగనుందని సమాచారం. అయితే ఈ విషయంపై శ్రద్దాదాస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
సినిమాల్లోకి జాన్వీ కపూర్ చెల్లెలు ఎంట్రీ.. అప్పుడే డేటింగ్ రూమర్స్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్ ఎక్కువ సినిమాల్లో కనిపించిన జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఆమె చెల్లెలు కూడా అక్కా బాటలోనే పయనిస్తోంది. శ్రీదేవి చచిన్న కూతురిగా ఖుషీ కపూర్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ది ఆర్చీస్ మూవీతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమాల్లో అలా ఎంట్రీ ఇచ్చిందో.. లేదో అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ది ఆర్చీస్ సహా నటుడు వేదంగ్ రైనాతో డేటింగ్లో ఉందంటూ బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఖుషీ కపూర్ తన మొదటి సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తుండగా.. మరోవైపు రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి.అయితే ఈ వార్తలను నటుడు వేదాంగ్ రైనా ఖండించారు. వేదాంర్ రైనా మాట్లాడుతూ ఖుషీ కపూర్, నేను చాలా సందర్భాల్లో కనెక్ట్ అయ్యాం. సంగీతంలో మా ఇద్దరికీ అభిరుచులు ఓకేలా ఉన్నాయి. అలాగని మేమిద్దరం డేటింగ్ చేయడం లేదు. ఆమెతో నాకు చాలా రోజుల నుంచి తెలుసు. మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. ప్రస్తుతానికి నేను సింగిల్గానే ఉన్నా. ఆ టైం వస్తే నేనే మీ ముందుకొచ్చి చెబుతా' అన్నారు. కాగా.. ది ఆర్చీస్ మూవీలో ఖుషీతో పాటు అగస్త్య నందా, డాట్, మిహిర్ అహుజా, సుహానా ఖాన్ నటించారు. -
విడాకులంటూ బ్రేకింగ్ ఇచ్చేశారు.. వెంటనే ఫోన్ చేసి చెప్పా: శ్రీకాంత్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోగా, ప్రతినాయకుడిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్గా ఎదిగారు. ఇటీవలే కోటబొమ్మాళి పీఎస్తో అభిమానులను అలరించిన శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు. అక్కడే సీనియర్ హీరోయిన్ రాశి కూడా కనిపించింది. ఈవెంట్లో వీరిద్దరూ చాలా సరదాగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పాల్గొన్న రాశి.. శ్రీకాంత్ భుజంపై కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు చిన్నప్పటి స్నేహితుల్లా సందడి చేశారు. ఆ వీడియో పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాశి కొట్టడంపై శ్రీకాంత్ స్పందిస్తూ.. 'చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఫంక్షన్లో కలిశాం. అక్కడ ఉన్న హీరోయిన్ రాశిని అమ్మ అన్నది. దీంతో నేను కూడా సరదాగా రాశి అమ్మా అన్నా.. దానికే తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి ఏం లేదు. నేను నటించిన వారిలో సౌందర్య, ఉమతో చాలా కంఫర్ట్గా ఫీలయ్యేవాన్ని. మా ఇంటికి కూడా ఒక ఫ్యామిలీలాగా వచ్చేవారు. సైడ్ ఆర్టిస్టులతో అందరితో బాగా ఉండేవాన్ని' అని అన్నారు. విడాకుల రూమర్స్పై మాట్లాడుతూ.. 'ఊహాతో నాకు విడాకులు అంటూ వార్తలొచ్చాయి. టీవీలలో బ్రేకింగ్లు కూడా వేశారు. అప్పుడే నేను, నా భార్య అరుణాచలం వెళ్తున్నాం. అప్పుడు వెంటనే ప్రభుకు ఫోన్ చేసి చెప్పా. చూడరా బాబు మేమిద్దరం అరుణాచలం వెళ్తున్నామని చెప్పా. వెంటనే ఆ వార్తలను ఖండించాం.' అని తెలిపారు. పెళ్లికి ముందు మీకు ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా సరదాగా నవ్వుతూ ఆన్సరిచ్చారు. బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు?.. మీకు తెలిస్తే చెప్పండని నవ్వుతూ మాట్లాడారు. బాలీవుడ్ చిత్రాల్లో అవకాశమొస్తే తప్పకుండా చేస్తానని శ్రీకాంత్ అన్నారు. పోలీస్ ఆఫీసర్గా నచ్చిన చిత్రాల్లో ఖడ్గం అని తెలిపారు. ఇటీవలే పోలీస్గా కొటబొమ్మాళి అనే సినిమాను చేశా.. పోలీసులు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో చూపించామని అన్నారు. -
బాయ్ఫ్రెండ్తో ఆలయానికి జాన్వీ కపూర్..!
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయింది. దేశంలోని ప్రధాన ఆలయాలను సందరిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన భామ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు జాన్వీని ఆశీర్వదించి ఆమెకు బాబా మహకాళ్ ఫోటోను బహుకరించారు. అయితే ఆలయానికి గులాబీ రంగు చీరలో వెళ్లిన జాన్వీ స్వామివారి హారతి పూజలో పాల్గొన్నారు. అయితే ఆలయానికి వెళ్లిన జాన్వీ పక్కనే.. తన ప్రియుడిగా భావిస్తున్న శిఖర్ పహారియా కూడా ఉన్నారు. దీంతో మరోసారి జాన్వీ కపూర్పై డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. అయితే వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే చాలా ఏళ్ల క్రితమే జాన్వీతో శిఖర్ రిలేషన్ షిప్లో ఉన్నాడని సమాచారం. -
నా పెళ్లి జీవితంపై అలాంటి రూమర్స్: ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్
బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేనిపేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే చిత్రంతో అభిమానులను పలకరించింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు మరో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్తో పాటు హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తన పెళ్లి జీవితంపై వచ్చిన రూమర్స్పై అలియా భట్ క్లారిటీ ఇచ్చింది. ఆలియా మాట్లాడుతూ.. 'ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్ కాలం. ప్రతి రోజు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. నేను సన్నగా మారడానికి.. అంతే కాకుండా తెల్లగా అయ్యేందుకు సర్జరీలు చేయించుకున్నట్లు ప్రచారం చేశారు. అలాగే మ్యారేజ్ లైఫ్పై రూమర్స్ వచ్చాయి. నేను గతంలో రణ్బీర్కు లిప్స్టిక్ నచ్చదని.. వేసుకున్న వెంటనే తీసేయాలంటాడని చెప్పాను. అయితే ఈ విషయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను వేధిస్తున్నాడంటూ రాశారు. రణ్బీర్ మంచి వ్యక్తి. ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది. కానీ అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. అందుకే వాటిని నేను పట్టించుకోను. ' అని అన్నారు. -
మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!
బాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇండస్ట్రీలో అమితాబ్ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. గతంలో ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 2న 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ మాజీ ప్రపంచ సుందరి తన పుట్టిన రోజున సియోన్లోని జీఎస్బీ సేవా మండల్లో క్యాన్సర్ పేషెంట్లతో కలిసి వేడుక చేసుకుంది. ఇందులో ఆమెతోపాటు కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ ఉన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. భార్య పుట్టిన రోజు వేడుకల్లో భర్త అభిషేక్ బచ్చన్ కనిపించకపోవడం ఫ్యాన్స్కు ఆశ్చర్య కలిగించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిషేక్పై నెటిజన్స్ మండిపడ్డారు. భార్య పుట్టినరోజున విషెస్ చెప్పిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా లేటుగా ఆమెకు విషెస్ చెప్పడమేంటని ప్రశ్నించారు. ఆమె 50వ పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుకుంటారని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. దీంతో అభిషేక్ వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ తప్పుబడుతున్నారు. కాగా.. ఇటీవలే ముంబయిలో మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి బాష్లో ఐశ్వర్య సింగిల్గానే కనిపించింది. పార్టీలో ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ రాలేదు. దీంతో మరోసారి ఈ జంటపై విడాకుల రూమర్స్ తెరపైకొస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు వేడుకలకు భర్త దూరంగా ఉండడం, అంతే కాకుండా ఎప్పుడో అర్ధరాత్రి విష్ చేయడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి డైవర్స్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ జంటకు ఏమైందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
శుభమన్తో సారా డేటింగ్.. నేను కాదన్న హీరోయిన్!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ షోకు హాజరైంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ భామ అనన్య పాండేతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. శుభమన్తో డేటింగ్? అయితే ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్లో సారా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో మీరు శుభ్మన్ గిల్తో డేటింగ్లో ఉన్నారా? అంటూ సారాను కరణ్ అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానమిచ్చింది సారా అలీ ఖాన్. ఆ సారాను నేను కాదంటూ చెప్పేసింది. అందరూ నా పేరు వెనకాలే పడ్డారంటూ నవ్వేసింది. అంతే కాకుండా ఆదిత్య రాయ్కపూర్తో అనన్య డేటింగ్పై కూడా క్లారిటీ ఇచ్చింది. అనన్యకు ది నైట్ మేనేజర్ ఉన్నారంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. వెబ్ సిరీస్ నైట్ మేనేజర్లో ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. సారాపై రూమర్స్! ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా ఆడే అన్ని మ్యాచులకు సచిన్ కూతురు సారా టెండూల్కర్ హాజరవుతోంది. శుభ్మన్ గిల్ ఆడేటప్పుడు సారా హావభావాలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా సారా సారా అంటూ గిల్ను ఆట పట్టిస్తున్నారు. ఇండియా ఆడిన ఓ మ్యాచ్లో సారా టెండూల్కర్ రావడంతో కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం విశేషం. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం గిల్ బ్యాటింగ్ను అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక
హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఇప్పటికే 50 సినిమాల మార్క్ దాటేసింది. దక్షిణాదితో పాటు హిందీలోనూ నటించింది. అయితే ఈమె పెళ్లి టైంలో కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. వాటి వల్ల తన తల్లి ఎలా బాధపడిందో కూడా చెప్పుకొచ్చింది. ఏంటా రూమర్స్? ముంబయికి చెందిన హన్సిక.. పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లోనూ యాక్ట్ చేసింది. కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత 2007లో 'దేశముదురు' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!) పెళ్లి టైంలో అలా దాదాపు 20 ఏళ్లుగా హన్సిక సినిమాలు చేస్తోంది. గతేడాది డిసెంబరులో ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది. సరిగ్గా ఆ సమయంలో హన్సిక.. అప్పట్లో ఎదగడానికి ఇంజెక్షన్స్ తీసుకుందనే పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. దీనిపై హన్సిక తల్లి స్పందించింది. ఇప్పుడు ఈ రూమర్స్పై తన అభిప్రాయాన్ని హన్సిక చెప్పేసింది. హన్సిక కామెంట్స్ 'నేను ఇలాంటి రూమర్స్ అస్సలు పట్టించుకోను. కానీ మా అమ్మ మాత్రం చాలా బాధపడుంటుంది. కానీ నాకు ఆ బాధని ఎప్పుడూ చూపించలేదు. ఎందుకంటే నన్ను రక్షించేది ఆమెనే కదా. అయితే ప్రశంసలు వచ్చినప్పుడు నేను తీసుకున్నా. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా అలానే తీసుకుంటా. వాటి విషయంలో నేను చాలా స్ట్రాంగ్ అయిపోయా' అని హన్సిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: ఊహించని సర్ప్రైజ్.. హౌస్లోకి కొత్త కంటెస్టెంట్లు!) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
స్టార్ క్రికెటర్ను పెళ్లాడనున్న బుట్ట బొమ్మ..!!
అక్కినేని హీరో నాగచైతన్య జంటగా ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. ఆ తర్వాత దువ్వాజ జగన్నాధం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ఆచార్య చిత్రాల్లో నటించింది. టాలీవుడ్తోపాటు బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఇటీవల ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్... కిసీ కీ జాన్ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో బుట్టబొమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. మహేశ్ బాబు సరసన గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చినా.. అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్పై అలాంటి కామెంట్స్!) ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని బీటౌన్ టాక్. త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబయికి చెందిన ఓ ప్రముఖ క్రికెటర్తో ఏడడుగులు వేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇంతకీ బుట్టబొమ్మను చేసుకోబోయే ఆ స్టార్ క్రికెటర్ ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంపై పూజా హేగ్డే ఇంతవరకు స్పందించలేదు. ఇటీవలే ముంబయిలోని సేవా మండల్ను సందర్శించిన ఆమె గణేశున్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుని పూజలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లి గణపతికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే పెళ్లి విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం బుట్టబొమ్మ స్పందించాల్సిందే. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్కు రజినీకాంత్ వార్నింగ్.. ఆమె కోసమేనా?) -
ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్?
బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ జెనిలీయా. సిద్ధార్థ్కు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులో సత్యం చిత్రంతో పరిచయమైన జెనిలీయా.. ఆ తర్వాత సాంబ, హ్యాపీ, సై, మిస్టర్ మేధావి, రెడీ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 2012లో రితేష్ దేశ్ముఖ్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ల్లో నటిస్తూ సందడి చేస్తోంది.తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబయిలో ఓ ఈవెంట్లో జెనీలియాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'బేబి' హీరోయిన్కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) గత రాత్రి ముంబయిలోని ఈవెంట్లో ఫోటోలకు పోజులిచ్చింది ఈ బాలీవుడ్ జంట. అయితే ఆ ఫోటోల్లో బ్లూ డ్రెస్లో ఉన్న జెనీలియాకు బేబీ బంప్తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా.. మూడోసారి ప్రెగ్నెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. ఓ నెటిజన్ కామెంట్స్లో రాస్తూ..'జెనీలియా గర్భవతి అయి ఉండొచ్చు' అని రాయగా.. మరో నెటిజన్ 'అవును ఆమె మూడోబిడ్డను ఆశిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రితేష్, జెనీలియా కలిసి రితీష్ మరాఠీలో దర్శకత్వం వహించిన వేద్లో నటించారు. మరోవైపు జెనీలియా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్లో నటించింది. అక్షయ్ కుమార్తో కలిసి హౌస్ఫుల్ 5తో రితేష్ నటించనున్నారు. (ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పాకిస్థాన్పై ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్.. గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్!
టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ రేంజే వేరు. రెండు దేశాల్లోని అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్పైనే అందరిదృష్టి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ మ్యాచ్లో ఇండియా-పాకిస్థాన్ తలపడ్డాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. కానీ ఆ తర్వాతే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు మన యువకెరటం ఇషాన్ కిషన్. స్టార్స్ ఔటైన చోటే దూకుడు ప్రదర్శించాడు. 82 పరుగులతో అద్భుతంగా రాణించి అందరినీ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పట్ల అభిమానం చాటుకుంది ఓ మోడల్. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్న అదితి హుండియా అతని ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అదితి ఎవరు? కాగా.. అదితి హుండియా వృత్తిరీత్యా మోడల్ కాగా.. ఆమె ఇషాన్తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్లు జరిగినప్పుడు ఇషాన్కు మద్దతుగా నిలిచింది. అంతేకాకుండా ఇషాన్, అదితి చాలా సార్లు కలిసి బయట కనిపించారు. వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే వారి రిలేషన్పై అదితి, ఇషాన్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. -
పెళ్లిపై కాంచన నటి ఆసక్తికర కామెంట్స్.. గట్టిగానే కౌంటర్!
‘కళవాణి’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది తమిళ నటి ఓవియా. ఆ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. కొన్ని చిత్రాల్లో నటించినా హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న ఓవియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె అసలు పేరు హెలెన్ నెల్సన్ కాగా.. కేరళలోని త్రిసూర్లో జన్మించింది. మలయాళం, తమిళ, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనిన ఓవియా.. తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గతంలో ఆమె బిగ్ బాస్ విన్నర్ అరవ్తో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొనిన ఓవియా సహా-కంటెస్టెంట్ ఆరవ్తో సన్నిహితంగా ఉందని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్దఎత్తున వార్తలు వైరలయ్యాయి. అయితే వీటిపై ఇద్దరూ మౌనంగానే ఉంటూ వచ్చారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత వీరిద్దరూ తమ కెరీర్పైనే దృష్టి సారించారు. ఆ ఆ తర్వాత ఓవియా కాంచన -3, 90 ఎంఎల్ సహా చిత్రాల్లో నటించింది. రెండు సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. పెళ్లి కాలేదు.. కానీ బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో ఓవియా పెళ్లి చేసుకోనున్నట్లు గాపిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఓవియా స్పందించింది. నాకు పెళ్లి ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని.. నటనపైనే దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. మీకు పెళ్లై ఓ పాప కూడా ఉందని వార్తలొచ్చాయని ప్రశ్నించగా.. వాటికి ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది మలయాళీ భామ. ఓవియా మాట్లాడుతూ.. 'అవును నాకు ఓ పిల్లాడు ఉన్నాడు. కానీ నాకు పెళ్లి కాలేదు. అది నా కుక్కపిల్ల. దానిని నేను చిన్న పిల్లలానే చూసుకుంటా. అన్నం తినిపిస్తాను. అంతే కాకుండా కుక్కపిల్ల నా పక్కనే పడుకుంటుంది.' అని సమాధానమిచ్చింది. అయితే నెటిజన్స్ మాత్రం ఆమెపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తనకు పెళ్లయిందని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. -
అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!
లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన కొత్త హీరోయిన్ అనన్య పాండే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది భామ. అయితే ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్లో ఉందంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) అయితే ప్రస్తుతం డ్రీమ్ గర్ల్-2 నటిస్తోన్న భామ ఆ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అతను ఎలా ఉండాలో వివరించింది. అతనిలో తాను కోరుకునే లక్షణాల గురించి వెల్లడించింది. కాగా.. అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్- 2 ఆగస్ట్ 25న శుక్రవారం విడుదలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని 2019 హిట్ ఫిల్మ్ డ్రీమ్ గర్ల్కి సీక్వెల్గా తెరకెక్కించారు. అనన్య మాట్లాడుతూ..' ఓ గాడ్. నాకు మా నాన్నే ఆదర్శం. నాకు కాబోయే వారు మా నాన్నలా దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉండాలి. ఆయనే నాకు బెంచ్మార్క్. మా నాన్న అత్యుత్తమ వ్యక్తి. అందుకే అతనికి అలాంటి లక్షణాలే ఉండాలి. అయితే ఇటీవల నా సినిమాలు లేకపోవడంతో నా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా వారి దృష్టి నా సినిమాలపై పెడతారేమో వేచి చూడాలి.' అని అన్నారు. ఆదిత్య రాయ్ కపూర్తో రిలేషన్పై మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే డ్రీమ్ గర్ల్-2 తర్వాత ఫర్హాన్ అక్తర్ చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించే సైబర్ థ్రిల్లర్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఇంతదాకా వచ్చాకా సిగ్గెందుకు? ప్రియుడితో అనన్య షికారు!) -
హీరోయిన్తో సింగర్ డేటింగ్.. వైరలవుతున్న ఇన్స్టా పోస్ట్!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన అక్టోబర్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన భామ బనితా సంధు. ఆమె విక్కీ కౌశల్ నటించిన సర్దార్ ఉదమ్లో కూడా నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రం ఆదిత్య వర్మలోనూ కనిపించింది. అంతే కాకుండా సీడబ్ల్యూ సిరీస్ పండోరలో నటించింది. అయితే తాజాగా ఆమె పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్తో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసిన పిక్స్తో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్పై సంచలన కామెంట్స్!) ముంబయిలో ఇటీవల రిలీజైన డాక్యు-సిరీస్కు కూడా ఆమె హాజరైన బనితా సంధు అతని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ముంబయిలోని హోటల్లో బనితా సంధు అతనితో ఉన్న సన్నిహిత ఫోటోలను కూడా పంచుకున్నారు. అంతే కాకుండా విత్ మీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సింగర్ అమృత పాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ ఏపీ ధిల్లాన్ పంజాబీ సంగీతంలో బాగా పేరు సంపాదించారు. ఇండో-కెనడియన్ రాపర్గా అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంటరీ సిరీస్, ఏపీ ధిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్తో మరింత ఫేమస్ అయ్యాడు. View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) -
షోయబ్ మాలిక్తో సానియా విడాకులు?
-
Sania Mirza And Shoaib Divorce Rumours: సానియా, మాలిక్ విడాకుల రూమర్స్.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
సానియా, మాలిక్ విడాకులు నిజమేనా..!? మరోసారి తెరపైకి
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా విడాకుల ఆంశం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా షోయబ్ మాలిక్ తన ఇన్స్టాగ్రామ్ బయోలో మార్పు చేయడమే ఇందుకు కారణం. ఇంతకుముందు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయోలో 'సూపర్ ఉమెన్ సానియా మీర్జా' అని ఉండేది. అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని బయో నుంచి తొలగించి.. తన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచాడు. బయోలో ఇతర వివరాలతో పాటు "ఓ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ" మాలిక్ రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మాలిక్, సానియా విడాకులు తీసుకోవడం ఖాయమని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో కూడా.. కాగా కొన్ని నెలల క్రితం కూడా సానియా,షోయబ్ మధ్య విభేదాలు తలెత్తాయనీ, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు తెగ షికార్లు చేశాయి. పాకిస్తానీ నటి అయేషా ఉమర్తో మాలిక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలను అయేషా కొట్టిపారేసింది. అవన్నీ పుకార్లే అని ఆమె సృష్టం చేసింది. అయితే ఇదే సమయంలో సానియా,షోయబ్ల కొత్త టాక్ షో 'ది మీర్జా మాలిక్ షో'రావడంతో వారి విడాకుల ఊహాగానాలకు తెరపడింది. అయితే తాజాగా మాలిక్ చర్యతో మళ్లీ వారి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు సానియా, షోయబ్ ఎవరూ స్పందించలేదు. కాగా సానియా, షోయబ్ 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఇజహాన్ జన్మించాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ -
కమెడియన్తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్ సౌత్ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మామనితమ్, విక్రమ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గాయత్రీ 2012లో '18 వయసు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి.. 'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ హీరోయిన్పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అర్వింద్తో డేటింగ్లో కోలీవుడ్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. (ఇది చదవండి: కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) ఆమె ఇటీవల తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఫోటోలో గాయత్రి, అరవింద్ ఎస్ఏను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఈ జంట డేటింగ్లో ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్స్టాలో గాయత్రి రాస్తూ.. 'కమెడియన్గా అతని ఎదుగుదలను ప్రశంసించింది. అతని పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అసలు అరవింద్ ఎవరు? తన కామెడీతో అందరినీ నవ్వించే అరవింద్ ఎవరో తెలుసుకుందాం. అతని అసలు పేరు అరవింద్ సుబ్రమణ్యం. అందరూ అతన్ని అరవింద్ ఎస్ఏ అని పిలుస్తారు. ఈ స్టాండప్ కమెడియన్ మొదట 2013లో తమిళ చిత్రం ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. యూట్యూబ్లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందాడు. అరవింద్ మద్రాసీ డా లాంటి షోలో కూడా కనిపించాడు. ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్లో "ఐ వాజ్ నాట్ రెడీ డా" షోను విడుదల రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 'వీ నీడ్ టూ టాక్' అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నాడు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) -
Colors Swathi On Divorce Rumours: కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
ఫిబ్రవరిలో హీరోయిన్ పెళ్లి.. అప్పుడే ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కియారా అద్వానీ బీ టౌన్తో పాటు టాలీవుడ్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ ఛేంజర్లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లోనూ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. మరోసారి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో జతకట్టింది. ఇప్పటికే భూల్ భూలయ్యా-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ జంట మరోసారి 'సత్యప్రేమ్ కి కథ' చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: ఆదిపురుష్పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే.. ) తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కియారా, కార్తీక్. ప్రమోషన్లలో భాగంగా రాజస్థాన్లో జైపూర్లో సందడి చేశారు. దీనికి సంబంధించి కియారాతో ఉన్న ఫోటోలను కార్తీక్ తన ఇన్స్టాలో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కియారా అద్వానీ మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఆమె ఆ ఫోటోల్లో బేబీ బంప్తో ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కియారా అద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా శుభవార్త ఉందా? కియారా జీ.. అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్లో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో అనిల్ అంబానీ, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్ సహా బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా.. కియారా, సిద్ధార్థ్ 'షెర్షా' మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఆ తర్వాత వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే జపాన్ వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఈ బాలీవుడ్ జంట సినిమాలతో బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్ ఫిక్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. ఇటీవలే తాను హీరోగా నటించిన చిత్రం ‘టక్కర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. (ఇది చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..) చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్లో సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సిద్ధార్థ్.. బాలీవుడ్ భామ ఆదితి రావు హైదరితో డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ జంట చాలాసార్లు ఫంక్షన్లలో తళుక్కున మెరిశారు. గతంలో ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ కలిసి టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్కు కూడా హాజరయ్యారు. ఇటీవలే రాజస్థాన్లో జరిగిన పెళ్లిలోనూ జంటగా పాల్గొన్నారు. దీంతో ఈ జంట పీకల్లోతు డేటింగ్లో ఉన్నట్లు మరోసారి వార్తలు వైరలయ్యాయి. అయితే తాజాగా ఓ టీవీ షోలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూస్తే ఈ రూమర్స్ నిజమనే తెలుస్తోంది. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఓ టీవీ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ను యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. జీవితాంతం మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకునే ఆమె ఎవరైనా ఉన్నారా? అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ..'మా ఊర్లో అందరూ 'ఆదితి దేవో భవ అంటారు' కదా అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో అతిథిని ఆదితి పేరుతో పిలవడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సిద్ధార్థ్ సమాధానంతో ఆదితి రావు హైదరీతో డేటింగ్ ఖాయమని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) Awwww did he just accept?? CUTE. ❤️❤️🧿#Siddharth pic.twitter.com/x9pVfv8SHT — Shravani (@shravd05) June 9, 2023 -
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ?
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపధ్యంలో వారి మధ్య చర్చలు నిర్వహించి సమన్వయము కుదిర్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పెద్దలు. అయినా కూడా సమస్య పరిష్కారం కాని కారణంగా సచిన్ పైలట్ వేరుకుంపటి పెట్టనున్నారని ఈ మేరకు తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీంతో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కె.సి.వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగి సచిన్ పైలట్ కొత్త పార్టీ పుకార్లను కొట్టి పారేశారు. అవన్నీ సత్యదూరమైన ప్రచారాలని తేల్చి చెప్పారు. కలిసే ఉన్నాం.. కలిసే పోటీ చేస్తాం.. త్వరలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడుతున్నారనే వార్త జోరుగా ప్రచారంలో ఉండి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని అన్నారు కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్. ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. " నేను ఈ పుకార్లను నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరితో జరిపిన చర్చల్లో మనం కలిసే పోటీ చేద్దామన్న ప్రతిపాదనకు వారిద్దరూ సానుకూలంగా స్పందించారు. నాకు తెలిసి సచిన్ కొత్త పార్టీ అనేది పూర్తిగా అవాస్తవం. మా పార్టీ ఐక్యంగానే ఉంది మేము వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని కరాఖండిగా తేల్చిచెప్పారు. సచిన్ అసంతృప్తి.. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సచిన్ పైలట్ గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అవినీతి అంశాలతో పాటు పేపర్ లీకేజీ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పునర్వ్యవస్థీకరణ అంశాలపై తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదన గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ అంశాలనే అదనుగా చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయని సచిన్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని వదంతులు పుట్టుకొచ్చాయంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. -
సహనటుడితో హీరోయిన్ డేటింగ్.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవలే దహాద్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. అయితే దబాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాధోడ్ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. జూన్ 2న సోనాక్షి సిన్హా తన 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ తారలు శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి) అయితే ఆమె సహనటుడు జహీర్ ఇక్బాల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సోనాక్షి, జహీర్ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఈ జంట పలు ఈవెంట్లలో కనిపించారు. దీంతో ప్రతిసారీ సోషల్ మీడియాలో రిలేషన్ షిప్పై గాసిప్స్ వినిపించాయి. తాజాగా సోనాక్షి సిన్హా పుట్టినరోజు సందర్భంగా జహీర్ చేసిన పోస్ట్ డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తోంది. బర్త్ డే విషెష్ చెబుతూనే 'ఐ లవ్ యూ' అంటూ నోట్లో రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆమెతో దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. కాగా.. గత నెలలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ జహీర్ ఇక్బాల్తో సోనాక్షి సిన్హా సంబంధాన్ని దాదాపుగా ధృవీకరించారు. కాగా.. వీరిద్దరు కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. సోనాక్షి సిన్హా ప్రస్తుతం హర్రర్-కామెడీ చిత్రం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనుంది. ఆ తర్వాత నికితా రాయ్ మూవీ ది బుక్ ఆఫ్ డార్క్నెస్లో నటించనుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన బెస్ట్ ఫ్రెండ్.. వైరలవుతున్న ఫోటోలు) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
'త్వరలోనే కీర్తి సురేశ్ పెళ్లి .. క్లారిటీ ఇచ్చిన నటి!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. మహానటిగా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న కీర్తి సురేశ్.. ఇటీవలే దసరా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిత్రం భోళాశంకర్లో చిరు చెల్లెలిగా కనిపించనుంది. అంతేకాకుండా కోలీవుడ్లో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం మామన్నన్లో హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేశ్కు మరోసారి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని ప్రశ్నించగా.. దీనిపై కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చింది. (ఇది చదవండి: కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!) పెళ్లి వార్తలపై కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'నా పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చా. మీరంతా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు? నా పెళ్లిపై మీరెందుకు అంత ఆసక్తి చూపుతున్నారు? నా వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నాక నేనే స్వయంగా ప్రకటిస్తా. దీని గురించి ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ప్రెస్ మీట్లో ప్రశ్నించాల్సిన పని లేదు.' అంటూ సమాధానమిచ్చింది. ఈ మాటలతో కీర్తి సురేశ్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టమవుతోది. దీంతో ఆమె పెళ్లిపై కొనసాగుతున్న ఊహాగానాలన్నింటికీ తెరపడినట్లైంది. కాగా.. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా.. కీర్తి దసరా సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రం తమిళంలో అజిత్ కుమార్ నటించిన వీరమ్ చిత్రానికి తెలుగు రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్తో కలిసి నటించిన మామన్నన్ ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: Simbu: సైడ్ అయిన బాలీవుడ్ బ్యూటీ, శింబు మూవీలో కీర్తి సురేశ్!) -
జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్, వాళ్లకు మాత్రమే ఆహ్వానం..!
-
అలా చేయడంతో అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: బుల్లితెర నటి
బుల్లితెర నటి కరిష్మా తన్నా ప్రధానంగా హిందీ సినిమాలు, టెలివిజన్ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 2001లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో టెలివిజన్లోకి అడుగుపెట్టింది. ఆమె నాగిన్ 3, ఖయామత్ కీ రాత్లలో తన పాత్రలకు బాగా ఫేమ్ సాధించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు బుల్లితెర నటిగా రాణిస్తోంది. ఇదిలా ఉండగా ఆమె ప్రస్తుతం గర్భవతి అంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరిష్మా ఆశ్చర్యకరమైన ప్రశ్న ఎదురైంది. గతంలో మీరు ప్రెగ్నెంట్ అని మీడియాలో వార్తలొచ్చాయని ప్రశ్నించగా.. వాటికి సమాధానమిచ్చింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై నటి క్లారిటీ ఇచ్చింది. మీరంతా తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ రూమర్లకు చెక్ పెట్టింది. (ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!) నటి కరిష్మా తన్నా మాట్లాడుతూ.. 'నేను ఓ రెస్టారెంట్లో బాగా తిని బయటికొచ్చా. అదే సమయంలో బాగా ఎక్కువగా తిన్నట్లు అనిపించింది. అందుకే నా చేతితో అలా ఒక్కసారి బెల్లీని తాకా. దీంతో నేను ప్రెగ్నెంట్ అని భావించారు. దీనికి నేను ఆశ్చర్యపోయా. ఒకసారి నా పొట్ట వైపు చూసుకున్నందుకు అలా అనుకోవడమేనా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది కరిష్మా తన్నా. ప్రస్తుతం స్కూప్ అనే వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలో కనిపించనుంది. దీనికి హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె నటిస్తున్న స్కూప్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో జూన్ 2న విడుదల కానుంది. (ఇది చదవండి: లైవ్ షోలో సింగర్కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!) -
కీర్తి సురేష్ పెళ్లి పై ఆమే తండ్రి సీరియస్
-
తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర యాంకర్గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్కు దూరంగా ఉన్న నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: భర్తతో విడాకులు? నిహారికను సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్) అయితే గత కొంతకాలంగా ఆమె డైవర్స్ తీసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తరచుగా వార్తల్లో నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటోందని.. త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీటిపై ఇంతవరకు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే తాజాగా నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియా వారిని పలకరించగా ఫోటోలకు ఫోజులిచ్చారు. భర్త జొన్నలగడ్డ వెంట నిహారిక లేకపోవడంతో మరోసారి డైవర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిహారిక లేకుండా చైతన్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం మరోసారి అనుమానాలకు తావిస్తోంది. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?) అంతే కాకుండా ఈ మధ్యకాలంలో నిహారి-చైతన్య జంటగా ఎక్కడా కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం మరో కారణం. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. -
నేను ఆరోగ్యంగా ఉన్నాను.. ఆ వార్తలు నమ్మకండి: నటుడు సుధాకర్
సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుధాకర్ అనారోగ్యంతో బాధడపడుతున్నారని, ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు పరిస్థితి విషమించి ఆయన చనిపోయినట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ తప్పుడు వార్తలపై సుధాకర్ స్వయంగా స్పందించారు. కొంతకాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, తప్పుడు వార్తలను దయచేసి నమ్మవద్దని కోరారు. ఈ మేరకు స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి రూమర్స్ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా నటుడు సుధాకర్ చనిపోయినట్లు వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సర్యులేట్ అయ్యాయి. ఈమధ్యే నటుడు కోట శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బతికున్న మనుషుల్ని కూడా చంపేస్తున్నారంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. I have always enjoyed working with @AnilRavipudi sir. I have huge respect for both him and Nandamuri Balakrishna sir. So reading these baseless news articles about me and a song in their new film, is very upsetting. Please do your research before you make baseless allegations. — Tamannaah Bhatia (@tamannaahspeaks) May 20, 2023 -
నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం యంగ్ హీరోకు సంబంధించి సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అడివి శేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అయితే ఇంతకీ అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు. సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (ఇది చదవండి: మంచి జోడీ కోసం వెతుకుతున్నా: సమంత) కాగా.. అడివి శేష్, సుప్రియ గతంలో కూడా రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరీ ఈ రూమర్స్పై అడివి శేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ) కాగా.. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటున్న సుప్రియ హీరోయిన్గానూ నటించింది. అడివి శేష్, సుప్రియ గూఢచారి చిత్రంలో నటించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్గా నటించింది. -
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?
-
సల్మాన్తో రిలేషన్లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్
మైనే ప్యార్ కియా చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. ఈ సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో రిలీజైంది. సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. తెలుగులో ఓంకారం, యువరత్న రాణా, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్లో ఎదురైన చేదు సంఘటనలను పంచుకుంది. (ఇది చదవండి: ఏజెంట్పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..) మైనే ప్యార్ కియా సినిమా తనకు సక్సెస్తోపాటు కొన్ని ఇబ్బందులు కూడా తీసుకువచ్చిందని భాగ్యశ్రీ వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు సల్మాన్తో రిలేషన్లో ఉందని బీటౌన్లో మాట్లాడుకున్నారు. పలు పత్రికల్లోనూ వీరిద్దరి గురించి పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై తన భర్తను ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ' నా కుమారుడు అభిమన్యు పుట్టిన తర్వాత రోజు నన్ను కలవడానికి ఒక మహిళా రిపోర్టర్ వచ్చారు. విషెస్ చెప్పిన ఆమె అక్కడే ఉన్న నా భర్తను ఓ ప్రశ్న అడిగింది. సల్మాన్ఖాన్తో మీ భార్య రిలేషన్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించింది. ఆ క్షణం నేను షాకయ్యాను. నా జీవితంలో అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. అప్పటి నుంచి నేను ఫిల్మ్ మ్యాగజైన్స్ చదవడం మానేశా. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: బాలీవుడ్ క్వీన్.. సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్!) అంతేకాకుండా.. సల్మాన్ ఎంతో మంచి వ్యక్తి అని.. అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘మైనే ప్యార్ కియా’ రిలీజైన కొంతకాలానికే తన స్నేహితుడు హిమాలయ దాసానిని వివాహం చేసుకున్నారు భాగ్యశ్రీ. ఇక పెళ్లి తర్వాత కూడా భాగ్యశ్రీ తక్కువ సినిమాలే చేశారు. గతేడాది విడుదలైన ‘రాధేశ్యామ్’తో ఆమె తెలుగు తెరపై సందడి చేశారు. ఇందులో ఆమె ప్రభాస్కు తల్లిగా కనిపించారు. ఇటీవల విడుదలైన హిందీ వర్షన్ ఛత్రపతి హీరోకు తల్లి పాత్రలో నటించారు. -
ఆమె ప్రెగ్నెంటా?.. స్టార్ హీరోయిన్పై నెటిజన్స్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె గతేడాది హీరో విక్కీ కౌశల్ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట బాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరు పొందారు. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న 2021 డిసెంబర్9న రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో వీరిద్దరూ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ పార్టీకి హాజరైన కత్రినాపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోదరి ఇచ్చిన ఈద్ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ విందుకు కత్రినా కైఫ్ కూడా హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ సూట్ను ధరించిన కత్రినా చాలా బ్యూటీఫుల్గా కనిపించింది. కాస్తా బొద్దుగా కూడా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కత్రినాను చూస్తుంటే ప్రెగ్నెంట్లా కనిపిస్తోందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ..' కత్రినా ప్రస్తుతం గర్భవతినా? కొంత బరువు పెరిగినట్లు కనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. మరొకరు రాస్తూ.. కత్రినా చాలా అందంగా ఉంది.. ఆమె గర్భవతి అయి ఉండొచ్చు' అని కామెంట్ చేశాడు. కాగా.. కత్రినా కైఫ్ చివరిగా సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్లతో కలిసి ఫోన్ భూత్ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సత్యపాల్ మాలిక్ను అరెస్ట్ చేయలేదు: ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్తో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్గా పని చేసిన సత్యపాల్ మాలిక్.. శనివారం ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తన ఇంట్లో జరగాల్సిన రైతు సంఘాల నేత భేటీని పోలీసులు అడ్డుకోవడంపై పీఎస్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయాన. ఈ క్రమంలో.. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరగ్గా ఢిల్లీ పోలీసులు దానిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను మేం అదుపులోకి తీసుకోలేదు. ఆయనంతట ఆయనగా పీఎస్కు వచ్చారు. తోడు మద్ధతుదారులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా మేం ఆయన్ని కోరాం సీనియర్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఆర్కేపురంలో ఉన్న తన ఇంట్లో సత్యపాల్ మాలిక్ శనివారం రైతు సంఘాల నేలతో భేటీ కావాల్సి ఉంది. హర్యానా నుంచి రైతు సంఘాల నేతలు తమ పోరాటానికి మాలిక్ మద్దతు కోరే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణ సరిపోక.. భోజనాలను బయట ఉన్న పార్క్లో ఏర్పాటు చేశారు. అయితే అది పబ్లిక్ స్పేస్ అని, అక్కడ అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో.. స్థానిక పీఎస్కు తన మద్దతుదారులతో చేరుకున్న సత్యపాల్ మాలిక్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈలోపు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారంటూ ప్రచారం నడిచింది. దీంతో ఢిల్లీ పోలీసులు ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈయన గవర్నర్గా ఉన్న టైంలో జమ్ము కశ్మీర్లో జరిగిన ఓ భారీ అవినీతి స్కాంకు సంబంధించి సీబీఐ సాక్షిగా ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. ఈ అంశం రాజకీయంగానూ హాట్ టాపిక్ అయ్యింది. విచారణలో స్పష్టత కోసమే తనను పిలిచారని, ఏప్రిల్27, 28, 29 తేదీల్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని బదులు ఇచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. थाना आर.के. पुरम के सामने पूर्व राजयपाल चौ सत्यपाल मलिक के समर्थन में पहुंचे समर्थक ।@SatyapalMalik_1#SatyapalMalik #CBISummonedSatyapalMalik#सत्यपाल_मलिक #PulwamaAttack #देश_सत्यपाल_मलिक_के_साथ_है pic.twitter.com/qR1XLbFAXg — DU JAT STUDENTS UNION (@du_jat) April 22, 2023 సంచలనాల సత్యపాల్ మాలిక్ -
విడాకుల రూమర్స్.. అదే సమస్య అంటూ ఓపెన్ అయిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో కంటే ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నిహారిక యాంకర్గా కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్సిరీస్లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్కు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు భార్యభర్తలిద్దదరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, మొదట చైతన్య పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేయడంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ఇక రీసెంట్గా నిహారిక కూడా ఒక్క ఫోటో మినహా పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసేసింది. నెట్టింట వీరి విడాకుల రూమర్స్ హాట్టాపిక్గా మారినా ఇంతవరకు స్పందించని నిహారిక హాట్ ఫోటోషూట్స్తో మాత్రం రచ్చ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్న ఆమె లేటెస్ట్ ఫోటోలతో ఫిదా చేస్తుంది. తాజాగా డెనిమ్ అవుట్ఫిట్లో గ్లామర్ ట్రీట్తో ఎక్స్పోజింగ్లో నో కాంప్రమైజ్ అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
భర్త బాటలోనే నిహారిక.. విడాకులపై క్లారిటీ ఇచ్చిందా?
మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. 2020లో చైతన్య జొన్నలగడ్డను నిహారిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద సమక్షంలో నిహారిక-చైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: హౌజ్ కీపర్గా, సేల్స్ గర్ల్గా చేశా: ప్రముఖ నటి పవిత్ర ఈ వార్తలకు నిహారిక భర్త చైతన్యే ఆజ్యం పోశాడు. పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో కలిసి షికార్లకు, వెకేషన్కు వెళ్లిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలిగించాడు. దీంతో మెగా డాటర్ విడాకుల రూమర్స్ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తూ నిహారిక కూడా భర్త బాటలోనే నడిచింది. ఇప్పటి వరకు పెళ్లి ఫొటోలు డిలిట్ చేయని ఆమె ఇన్స్టాగ్రామ్ నుంచి తాజాగా ఆ ఫొటోలు మాయమయ్యాయి. భర్త చైతన్య లాగే నిహారిక కూడా పెళ్లికి సంబంధించిన పోస్ట్స్తో పాటు భర్తతో కలిసి వెళ్లిన వెకేషన్ పిక్స్ తొలగించింది. అంతేకాదు చైతన్యకు సంబంధించిన పోస్ట్స్ కూడా డిలిట్ చేసింది. చదవండి: బేబీబంప్తో బిగ్బాస్ బ్యూటీ పూజా.. ఫొటోలు వైరల్ దీంతో మరోసారి మెగా డాటర్ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. నిజంగానే వీరిద్దరు విడిపోయారా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డైవర్స్ రూమర్స్పై స్పందించని నిహారిక ఇలా తన విడాకులపై క్లారిటీ ఇచ్చిందా? అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో వీరి విడాకులు వార్తలు నిజం కాకుండ ఉంటే బాగుండు అంట మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతేకాదు విడాకుల అబద్ధం అని చెప్పండి మేడం అంటూ నిహారికి పోస్ట్కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిహారిక తన తల్లి చీర కట్టుకుని పెళ్లికూతురిగా ముస్తాబైన ఫొటో మాత్రం డిలిట్ చేయకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
కాదు.. లేదు అంటూనే!
కాదంటే అవుననిలే...అనే సూపర్ హిట్ పాట ఉంది కదా. ఇప్పుడు నటుడు సిద్ధార్థ్, నటి అతిథి రావ్ హైదరి పరిస్థితి ఇలానే ఉంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. సినీ వివాహ వేడుకల్లో తళుక్కున మెరుస్తూ ఫొటోగ్రాఫర్లకు ఫోజులిస్తారు. లవ్వా అంటే చా..చా... అలాంటిదేమీ లేదు....మంచి స్నేహితులం అంటారు. మీడియాలో మాత్రం సిద్ధార్థ్, అతిథి రావ్ హైదరి సహజీవనం అంటూ వార్తలు హల్చల్ చేస్తుంటాయి. ఈ సంచలన జంట గురించి కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన నటుడు సిద్ధార్థ్. మణిరత్నం దర్శకత్వం వహించిన కాట్రు వెలియిడై చిత్రంతో కోలీవుడ్కు అతిథి రావ్ హైదరి పరిచయం అయ్యింది. అయితే వీరిద్దరూ కలిసి తెలుగులో సముద్రం అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ప్లాప్ అయినా వీరి మధ్య పరిచయం బలపడిందంటారు. మరో విషయం ఏంటంటే సిద్ధార్థ్కి ఇప్పటికే పెళ్లి, విడాకులు కావడం జరిగిపోయింది. నటి అతిథి రావ్ హైదరిదీ ఇదే పరిస్థితి. దీంతో ఈ జంట ముచ్చట చూసి ప్రేమలో ఉన్నారని, పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా తాజాగా వీరిద్దరూ కలిసి ఒక పాటకు చేసిన డాన్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతంది. అయితే దీనిపై వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. -
ఐశ్వర్యరాయ్తో విడాకులు? అభిషేక్ బచ్చన్ ట్వీట్ వైరల్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ల వైవాహిక జీవితం గురించి కొద్దిరోజులుగా తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిమధ్య మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు ప్రస్తుతం బీటౌన్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన నీతా-ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంఛ్ ఈవెంట్కు ఐష్ అభిషేక్ లేకుండా కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లడంతో వీరి విడాకుల అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొంతకాలంగా సినిమా ఫంక్షన్లు, పార్టీలు, ఈవెంట్లకు ఐశ్వర్య ఒక్కతే హాజరవుతుంది. లేదా కూతుర్ని వెంటేసుకొని వెళ్తుంది. దీంతో ఐష్-అభిషేక్ల మధ్య పొసగడం లేదని, త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ అనుమానాలను అభిషేక్ ఖండించారు. ఓ ఈవెంట్లో ఆరాధ్యతో కలిసి ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఓ నెటిజన్ మై ఫేవరెట్ పీపుల్(My Fav People)అని పేర్కొనగా..దీనికి అభిషేక్ స్పందిస్తూ.. నాకు కూడా ఫేవరెట్(Mine Too) అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఐశ్వర్య-అభిషేక్ విడిపోనున్నారనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా 2007లో ప్రేమ వివాహం చేసుకున్న ఐష్-అభిషేక్లకు కూతురు ఆరాధ్య సంతానం. My fav people ❤️♥️ @juniorbachchan pic.twitter.com/hAoODtjuTD — Shruti (@Shrutibwb) April 1, 2023 -
మిహికా ఇన్స్టా పోస్ట్.. ప్రెగ్నెన్సీ అంటూ నెటిజన్స్ కామెంట్స్!
రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ జంట టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో ఒకరు. 2020 ఆగస్టు 8న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. మిహికా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను మిహికా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేశారు. ఏమీ చేయకుండా ఉండటంలో కూడా ఓ స్వీట్నెస్ ఉంటుంది అంటూ క్యాప్షన్ జోడించింది. మిహికా ప్రెగ్నెంటా? ఈ వీడియోలో ఆమె బీచ్లో నడుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మిహికా గర్భవతిలా కనిపిస్తోంది, అందుకే వదులైన డ్రెస్ వేసుకుంది కాబోలు అంటూ ఏకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతంలో కూడా చాలా సార్లు మిహికాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ వచ్చాయి. కానీ అవి వట్టి పుకారుగానే మిగిలిపోయాయి. గతంలో మిహికా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించడంతో ప్రెగ్నెన్సీ గాసిప్స్ గుప్పుమన్నాయి. అంతే కాకుండా ఓ పాపని ఎత్తుకున్న ఫోటోని మిహికా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా.. కొందరైతే ఏకంగా కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆ పాప తమ బిడ్డ కాదని.. తన మేనకోడలు అంటూ క్లారిటీ ఇచ్చింది మిహికా. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫుల్స్టాప్ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్ మీడియాతో పాటు యెల్లో బ్యాచ్ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన. సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్ఛార్జిలు పాల్గొన్న సమావేశంలో సీఎం జగన్.. తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన సీఎం జగన్.. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: గేరు మార్చండి.. జెట్ స్పీడ్తో పని చేయండి: సీఎం జగన్ -
అవును డేటింగ్ నిజమే.. తొలిసారి నోరు విప్పిన హీరోయిన్..!
నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక వ్యక్తితో డేటింగ్లో ఉన్నట్లు ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో తాను ఓ వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నానని వెల్లడించింది. మాధవిలత వీడీయోలో మాట్లాడుతూ..' నేను ఒక వ్యక్తిని కలిశా. ముందు అతడిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత రెండువైపుల తల్లిదండ్రుల అనుమతి పొందాలి. ఇది అంత త్వరగా జరిగే పని కాదు. మరో ఏడాది సమయం పట్టొచ్చు. అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తప్పకుండా చెబుతా. అయితే పెళ్లి తేదీ గురించి మాత్రం అడగొద్దు. అయితే అసలు అతడు తెలుగువ్యక్తి అయితే కాదు. నేను నా నమ్మకాలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. 2018లో రాజకీయాల్లో ప్రవేశించింది. బీజేపీలో చేరిన ఆమె గత ఎన్నికల్లో పోటీ కూడా చేసింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll orator ll sanathani ll BJP Women ll (@actressmaadhavi) -
డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు
-
పెళ్లికి సిద్ధమైన అంజలి.. ఈ సారైనా..!
నటి అంజలి పరిచయం అక్కర్లేని పేరు. అటు టాలీవుడ్.. ఇటు కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె సినిమాలు చేయకపోయినా.. వెబ్ సిరీస్ ఝాన్సీతో ప్రేక్షకులను అలరించింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా మరోసారి అంజలి పెళ్లి రూమర్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాాగా.. గతంలో ఆమె ఓ డైరెక్టర్ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని కొట్టిపారేసింది అంజలి. కానీ తాజాగా మరోసారి వార్తలు గుప్పుమనడంతో అతను ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్లో మహేష్ బాబు-వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలో వెబ్ సిరీస్ల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లాడబోతోందని సమాచారం. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అంజలి తల్లిదండ్రులు యుఎస్లో ఉన్నారు. గతంలో పలుసార్లు పెళ్లి వార్తలొచ్చినప్పటికీ మరోసారి పెళ్లి చేసుకోబోతోందని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ ఆర్సీ15లో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అంజలి పెళ్లి చేసుకోనుందని సమాచారం. -
భయం వద్దు..తమిళులు మంచివారు
చెన్నై: తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని, స్నేహభావంతో ప్రవర్తిస్తారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని వారిని కోరారు. అభద్రతా భావానికి, భయాందోళనలకు లోనుకావద్దన్నారు. ఈ మేరకు ఆయన పలు ట్వీట్లు చేశారు. కాగా, వలసకార్మికుల భద్రతపై పుకార్ల నేపథ్యంలో బిహార్ అధికారుల బృందం తిరుపూర్లోని దుస్తుల కర్మాగారాలను సందర్శించింది. అక్కడి దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే వలస కార్మికుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చలు జరిపి, సంతృప్తి వ్యక్తం చేసింది. వదంతులకు కారకులుగా హిందీ వార్తా పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై అన్నామలై స్పందించారు. ‘ఉత్తరాది సోదరులకు వ్యతిరేకంగా డీఎంకే 7 దశాబ్దాలుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. చేతనైతే అరెస్ట్ చేయాలి’అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో వలసకార్మికులపై దాడులు వార్తలకు కేంద్రంపై కారణమని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
పులిని చంపి వండుకుని తిన్నారు?
యర్రగొండపాలెం:(ప్రకాశం జిల్లా): పులిని చంపి వండుకుని తిన్నారని అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. పుల్లలచెరువు మండలంలోని అక్కచెరువు చెంచుగూడెంకు సమీపంలోని ఈతల కొండ, ఎర్రదరి ప్రాంతాల్లో దుప్పులు, మనపోతులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆ ప్రాంతానికి చెందిన గిరిజనులు కొంతమంది విద్యుత్ తీగలుపెట్టి జంతువులను వేటాడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన ఆ ప్రాంతంలో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులకు తెలిసింది. ఈ మేరకు ఆ ప్రాంతంలో పులి పాదముద్రలు కూడా ఫారెస్ట్ అధికారులు సేకరించారు. ఈ పులిని కరెంటు తీగలు పెట్టి చంపారని, తోలును అడవిలో ఉన్న బావిలో వేసి, మాంసాన్ని వండుకుని తిన్నారని యర్రగొండపాలెంలోని అటవీశాఖ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ధ్రువీకరించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మూడు పులులు సంచరిస్తున్నాయి పులిని చంపి దాని మాంసం వడుకుని తిన్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.నీలకంఠేశ్వరరెడ్డి వివరణ ఇచ్చారు. తమకు అందిన సమాచారం మేరకు అక్కపాలెం ప్రాంతంలో విచారణ చేపట్టామని ఆయన తెలిపారు. పులి సంచరిస్తోందని తెలిసిన వెంటనే పాదముద్రలు సేకరించామని, తద్వారా అక్కడ రెండు ఆడ పులులు, ఒక మగపులి సంచరిస్తోందని తేలిందని ఆయన వివరించారు. అటవీ జంతువులు ఎక్కువగా సంచరిస్తున్న ఆ ప్రాంతంలో సహజంగానే పులులు తిరుగుతుంటాయన్నారు. అడవి జంతువులను వేటాడేందుకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమకు కూడా తెలిసిందని, దీనివల్ల పులులకు ప్రాణహాని ఉంటుందన్నారు. విద్యుత్శాఖ అధికారులతో మాట్లాడి అటవీ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. పులిని చంపినట్లు వస్తున్న వదంతులపై తమ దర్యాప్తు ఇంకా ముగియలేదని ఎఫ్ఆర్ఓ చెప్పారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? -
కీర్తి సురేశ్ పెళ్లి.. వరుడు ఎవరో తెలిసిపోయింది..!
నేను శైలజా సినిమాతో టాలీవుడ్ ఫేమ్ సాధించిన నటి కీర్తి సురేశ్. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. సావిత్రి బయోపిక్లో మహానటి సినిమాతో జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై నెట్టింట్లో చర్చ నడుస్తోంది. గతంలో ఓ సంగీత దర్శకుడితో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపించాయి. కీర్తి సురేశ్ దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోను పెళ్లి చేసుకోబోతుందని గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఆమె సన్నిహితులు మాత్రం నటి తన క్లాస్మేట్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు వెల్లడించారు. వీరిద్దరి వివాహానికి ఆమె తల్లిదండ్రులు కూడా ఒకే చెప్పినట్లు సమాచారం. కీర్తి తన క్లాస్మేట్తో పదమూడు సంవత్సరాలకు పైగా రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నందున పెళ్లిని వాయిదా వేసుకుంది భామ. కాగా.. కీర్తి సురేశ్ క్లాస్మేట్ కేరళలోని ఓ రిసార్ట్ యజమానిగా తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. కీర్తి సురేష్ తర్వాత వెండితెరపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ దసరాతో అలరించనుంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో ఆమె నేచురల్ స్టార్ నానితో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్లో కనిపంచనున్నారు. వీటితోపాటు పలు తమిళచిత్రాల్లో నటిస్తున్నారు. -
Sneha- Prasanna: వివాహ బంధానికి గుడ్ బై!.. రూమర్స్కు నటి స్నేహ సమాధానం
నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సహజ నటనతో తెలుగు, తమిళం తదితర భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో కమలహాసన్, విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేశారు. తెలుగలోనూ నాగార్జున, వెంకటేష్, రవితేజ వంటి ప్రముఖ నటుల సరసన నటించారు. నటుడు ప్రసన్నకు జంటగా అచ్చముండు అచ్చముండు చిత్రంలో నటించారు. భర్త ప్రసన్నతో స్నేహ ఆ సమయంలోనే వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు తమ మధ్య ప్రేమను రహస్యంగా ఉంచిన ఈ జంట చివరకు 2012లో పెళ్లి పీటలు ఎక్కారు. వీరికి ఇద్దరు పిల్లలు. వివాహానంతరం స్నేహ నటనను కొనసాగిస్తున్నారు. అలా ప్రసన్న, స్నేహల దాంపత్య జీవితం సంతోషంగా సాగుతోంది. అలాంటిది రెండు నెలలుగా వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే అదంతా అబద్ధమని స్నేహ సన్నిహితులు కొట్టిపారేశారు. ఈ వదంతులకు ఇదే తమ సమాధానం అన్నట్లు ప్రసన్న, స్నేహ ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. ఆ ఫొటోల్లో స్నేహ ఇప్పటికీ తాను హీరోయిన్నే అన్నట్లుగా కొత్త అందాలతో మెరిసిపోతోంది. చదవండి: (Sneha: తగ్గేదేలే.. 40 ప్లస్లోనూ అదే అందం) -
శాంతనుకు శ్రుతి బ్రేకప్ చెప్పిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతోనే కాదు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శ్రుతి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటు ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్, రిలేషన్ షిప్ విషయానికి వస్తే శ్రుతి కొంతకాలంగా శాంతను హజారిక అనే చిత్రకళాకారుడితో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా శ్రుతి షేర్ చేసిన పోస్ట్ ఆమె బ్రేకప్ రూమర్లకు తెరలేపాయి. ‘నాతో నేను ఉంటేనే సంతోషం.. నా విలువైన సమయాన్ని, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో శ్రుతి మరోసారి ప్రేమలో విఫలం అయ్యిందని, శాంతనుతో తెగదెంపుల చేసుకుంది? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తన బ్రేకప్ రూమర్లకు తాజాగా శ్రుతి క్లారిటీ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో శాంతనుతో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి ‘ఎప్పుడు నేను కోరుకునేది ఇదే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఒక్క ఫొటోతో శ్రుతి వీరి బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టింది. చదవండి: చాలా గ్యాప్ తర్వాత మూవీ ప్రమోషన్లో నయన్, హాలీవుడ్ నటిలా లేడీ సూపర్ స్టార్ అయినప్పటికీ ఇద్దరి మధ్య ఏమైన మనస్పర్థలు వచ్చి ఉంటాయని, అవి సద్దుమనగడంతో కలిసిపోయారంటూ ఆమె ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రుతి శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అతడి కొంతకాలం డేటింగ్ అనంతరం సడన్గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. అయితే తన బ్రేకప్ కారణం చెప్పలేదు. ఆ తర్వాత కొంతకాలనికి శాంతనుతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్ ప్రదీప్? ఆమెతోనే ఏడడుగులు! View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
విడాకులపై స్పందించిన 'ఉరీ' నటుడు.. త్వరలోనే అది జరగనుంది..!
'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' నటుడు మోహిత్ రైనా దంపతులపై విడాకులు తీసుకుంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అతని భార్య అదితి శర్మతో విడాకులపై గాసిప్స్ గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా నటుడు మోహిత్ రైనా స్పందించారు. ఆ రూమర్లను ఆయన కొట్టిపారేశారు. 'నా మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నానని వెల్లడించారు. మోహిత్ రైనా, భార్య అదితి శర్మ విడాకుల తీసుకుంటున్నట్లు వార్తలొచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 1న అదితి శర్మతో తన పెళ్లిని ప్రకటించి మోహిత్ తన అభిమానులను ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేశారు. హిమాచల్ ప్రదేశ్లో తన మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఓ మీడియాకు వివరించారు. అయితే గతంలో మోహిత్ తన సోషల్ మీడియాలో అదితితో తన పెళ్లి ఫోటోలన్నింటినీ తొలగించిన తర్వాత రూమర్లు వచ్చాయి. అంతే కాకుండా మోహిత్, అదితి కూడా ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో కావడం విడాకులకు మరింత బలాన్ని చేకూర్చింది. మోహిత్ రైనా - అదితి శర్మల ప్రేమకథ: అదితి శర్మతో స్నేహం వల్లే మేమిద్దరం ఒక్కటైనట్లు మోహిత్ పేర్కొన్నాడు. కొన్నేళ్ల పాటు స్నేహితులుగా ఉన్న వీరిద్దరు.. కొవిడ్ (రెండో వేవ్)లో మోహిత్ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. కాగా.. మోహిత్ టెలివిజన్ ధారావాహిక 'దేవోన్ కే దేవ్ మహాదేవ్'లో లార్డ్ శివగా నటించారు. అతను 'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్', 'షిద్దత్' వంటి అనేక బాలీవుడ్ చిత్రాలతో పాటు 'కాఫిర్', 'బౌకాల్', 'ముంబయి డైరీస్ 26/11' వంటి వెబ్ సిరీస్లలో కూడా నటించాడు. -
బాయ్ఫ్రెండ్తో ప్రముఖ నటి బ్రేకప్.. క్లారిటీ ఇదే..!
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఆమె ప్రియుడితో బ్రేకప్ చేసుకుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించింది. సోషల్ మీడియాలో అభిమానులు పెద్దఎత్తున కామెంట్స్ చేయడంతో రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ప్రియుడు రాకీతో బ్రేకప్పై హీనా ఖాన్ స్పందిస్తూ.. ' బ్రేకప్ గురించి కొన్ని కథనాలు విన్నా. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మేం ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడు మా పట్ల దయతో ఉన్నారు. కానీ ఇది విని నా స్నేహితులు చాలా భయపడ్డారు. రాకీ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఇలాంటి వాటిని పట్టించుకోడు. నా స్నేహితులు చాలామంది ఈ విషయంపై ఆరా తీశారు.' అని అన్నారు. హీనా ఖాన్, చిత్రనిర్మాత రాకీ చాలా ఏళ్లుగా డేటింగ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె 'శడ్యంత్ర' అనే వెబ్ సిరీస్లో నటిస్తోంది. ఆ షో ప్రమోషన్లలో భాగంగా ఇదంతా ప్రచారంలో వ్యూహమని నటి తెలిపింది. వీరిద్దరు యే రిష్తా క్యా కెహ్లతా హై షూటింగ్ సెట్స్లో మొదటిసారి కలుసుకున్నారు. -
మాజీ లవర్తో జాన్వీ కపూర్ డేటింగ్.. వీడియో వైరల్..!
బాలీవుడ్ అందాల భామ, దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది అమ్మడు. సోషల్ మీడియాలో ఫోటోలతో హల్చల్ చేస్తూ ఉంటోంది. ఇటీవలే ముంబైలో జరిగిన ఓ షోలో బాయ్ఫ్రెండ్తో తళుక్కున మెరిసింది. తాజాగా తన మాజీ లవర్తో కలిసి దిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో సందడి చేసింది. దీనికి సంబంధంచిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. శనివారం దిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తన మాజీ ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి కనిపించింది. శిఖర్తో ఉన్న పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మళ్లీ డేటింగ్లో ఉన్నారా అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల జాన్వీ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేసినప్పుడు.. శిఖర్ 'వావ్ వావ్' అంటూ రెడ్ హార్ట్ ఎమోజీలు జతచేశారు. ఇటీవలే ఇద్దరూ కలిసి మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. శిఖర్ ఎవరంటే.. శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. జాన్వీ బాలీవుడ్లో అరంగేట్రం చేయడానికి ముందు శిఖర్తో డేటింగ్ చేసినట్లు సమాచారం. శిఖర్ సోదరుడు వీర్ పహారియా.. జాన్వీ ప్రాణ స్నేహితురాలు సారా అలీ ఖాన్ మాజీ ప్రియుడు. జాన్వీ తర్వాత వరుణ్ ధావన్తో కలిసి బవాల్ చిత్రంలో కనిపించనుంది. ఇటీవలే పోలాండ్లో సినిమా షూటింగ్ను పూర్తి చేసుకుంది ముద్దుగుమ్మ. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఆమె తన తదుపరి చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి కోసం శిక్షణా కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ మూవీలో రాజ్కుమార్ రావు కీలక పాత్రలో నటించారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన దీనికి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
సానియా- షోయబ్ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్త షోయబ్ మాలిక్తో విభేదాల కారణంగా విడాకులకు సిద్ధమయ్యారనే వార్తలు కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వారు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఈ విడాకుల వార్తల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయో చూసి ఆయన ఇచ్చిన కొత్త ట్విస్ట్కు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన ఇన్స్టా బయోలో తాను సూపర్వుమన్ సానియా మిర్జాకు భర్తను అంటూ రాసుకొచ్చారు షోయబ్. ‘అథ్లెట్, సూపర్వుమన్ సానియామిర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రి’ అని పేర్కొన్నారు. విడాకుల విషయంపై ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో..కొద్ది రోజుల క్రితం పుకార్ల నుంచి తనను, మీర్జాను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి చేశారు షోయబ్ మాలిక్. ‘ఇది మా వ్యక్తిగతం. ఈ ప్రశ్నకు నేను, నా భార్య సమాధానం ఇవ్వటం లేదు. మమ్మల్ని వదిలేయండి.’ అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. టెన్నిస్ స్టార్ మీర్జా సోలోగా ఫోటోషూట్స్ చేస్తుండటం రూమర్లకు మరింత బలం చేకూర్చుతున్నట్లవుతోంది. ఇది ఇలా ఉండగా.. ఖతర్ వేదికగా మంగళవారం జరిగిన అర్జెంటీనా, క్రొయేషియా మ్యాచ్ మైదానంలో తన సోదరితో పాటు సానియా తళుక్కుమనటం ప్రస్తుతం వైరల్గా మారింది. ఇదీ చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ.. -
అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
తమిళసినిమా: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అయితే నటి అంజలి విషయంలో ఇది తారుమారైంది. పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఈ బ్యూటీ. మొదట్లో తెలుగులో ఒకటి రెండు చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో కోలీవుడ్పై దృష్టి పెట్టింది. కట్రదు తమిళ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలికి ఆ తర్వాత అంగాడి తెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చదవండి: అనుపమ పరమేశ్వరన్పై నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు దీంతో ఇక్కడ స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత తెలుగులోనూ మంచి అవకాశాలు వరించాయి. దీంతో గుర్తింపు పొందిన అంజలి కొన్ని వివాదాస్పద సంఘటనల్లో చిక్కుకుని హైదరాబాద్కు మకాం మార్చారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ మధ్యలో ఐటెం సాంగ్స్లోనూ మెరుస్తూ బిజీగానే ఉన్నారు. ఆ మధ్య ప్రేమ వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచిన అంజలిని నటుడు జయ్తో కలుపుతూ ప్రచారం జరిగింది. కాగా ఇటీవల అంజలి నటించిన వెబ్ సిరీస్ ఫాల్ ఓటీటీలో విడుదలైంది. చదవండి: ‘కాంతార’ మూవీపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు దీని ప్రమోషన్లో భాగంగా చెన్నైకి వచ్చిన అంజలి మీడియాతో ముచ్చటించారు. ప్రేమ పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు ఈ బ్యూటీ బదిలిస్తూ తనకు ఇదివరకే పెళ్లి జరిగిపోయిందని, అమెరికాలో నివాసం ఉంటున్నట్టు ఇప్పటికే రకరకాల ప్రచారం జరిగిందన్నారు. నిజానికి అవన్నీ వదంతులేనని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అయితే పెళ్లి కచ్చితంగా చేసుకుంటానని, ఆ టైం వచ్చినప్పుడు అందరికీ చెబుతానని అంజలి పేర్కొన్నారు. -
అవన్ని పుకార్లే.. మీరే చూడండి అలా ఉన్నానా?: హీరోయిన్
‘యమదొంగ’ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ మమతా మోహన్ దాస్. ఆ తర్వాత ఆమె చింతకాయల రవి సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత సడెన్గా ఆమె తెరపై కనుమరుగైంది. గొంతు క్యాన్సర్ కారణంగా మమతా మోహన్ దాస్ నటనకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు క్యాన్సర్తో పోరాడి గెలిచింది. ఈ వ్యాధి నుంచి బయట పడిన ఆనంతరం చికిత్స సమయంలో తీసుకున్న తన ఫొటోలను తరచూ షేర్ చేస్తూ క్యాన్సర్పై అవగాహన కల్పిస్తోంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆమె ఆరోగ్యంపై గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. మమతా మరోసారి క్యాన్సర్ బారిన పడిందని, తన ఆరోగ్యం క్షీణించిందంటూ రకరకాలు పుకార్లను ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై మమత స్పందించింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ షేర్ చేసింది. ఈ సందర్భంగా తన ఆరోగ్యంపై వస్తున వార్తలను ఆమె ఖండిచింది. ‘‘ఇటీవల నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలు చూసి నా అభిమానులు.. సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. వారు నాకు డీఎంఎస్, మెయిల్స్ చేస్తున్నారు. రీసెంట్గా నన్ను ఇంటర్వ్యూ చేశామని చెప్పుకుంటున్న కొన్ని యూట్యూబ్ ఛానల్సే ఈ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మళ్లీ నేను క్యాన్సర్ బారిన పడలేదు. నా ఆరోగ్యం గురించి నేను చెప్పేవరకు ఎలాంటి వార్తలను నమ్మకండి. ఇదిగో నా తాజా ఫొటోలను షేర్ చేస్తున్నాను. ఇందులో నేను అనారోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నానా? నేను మరోసారి క్యాన్సర్కు లొంగిపోయేందుకు సిద్ధంగా లేను’’ ఆంటూ ఆమె స్పష్టం చేసింది. View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) చదవండి: వైష్ణవిని హీరోయిన్గా పెట్టినప్పటి నుంచి బయటినుంచి ఫుల్ నెగిటివిటీ: దర్శకుడు అరుణాచలేశ్వరుని సేవలో శ్రీకాంత్ దంపతులు -
విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్
సీనియర్ హీరో, నటుడు శ్రీకాంత్- ఊహ విడాకులు తీసుకుంటున్నారనే రూమర్స్ కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన విడాకుల వార్తలపై హీరో శ్రీకాంత్ స్పందించారు. తాను-ఊహా విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ వారి గుంరించిన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వటం పట్ల హీరో శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రెస్నోట్ విడదుల చేశారు. ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను? అని ప్రశ్నించారు. ‘‘గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ను నా ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. దీంతో నేను ‘ఇలాంటివి ఏమాత్రం నమ్మోద్దు. ఆందోళన పడోద్దు’ అని తనను ఓదార్చాను . అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వతున్నాయి. దీంతో మా బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్గా అనిపిస్తుంది . ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని శ్రీకాంత్ తన లేఖలో పేర్కొన్నారు. చదవండి: బిజినెస్ విమెన్తో పెళ్లి.. నాగశౌర్యకు కట్నం ఎంత ఇచ్చారో తెలుసా? ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే -
తన ప్రెగ్నెన్సీ రూమర్స్పై స్పందించిన హీరోయిన్
హీరో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. నిక్కీ గల్రానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్స్ నిక్కీ గల్రానీ సోషల్ మీడియా వేదిక స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ తాను గర్భవతి అంటూ వస్తున్న వార్తలను ఖండించింది. ‘నేను ప్రెగ్నెంట్ అంటూ కొందరు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఓ పని చేయండి డెలివరి డేట్ కూడా మీరే చెప్పేయండి’ అంటూ స్మైలీ ఎమోజీని జత చేసింది. చదవండి: ఆ డైరెక్టర్ నన్ను చూడగానే ముందు ముఖం శుభ్రం చేసుకో అన్నాడు: నిధి అగర్వాల్ అదే విధంగా ‘ప్రస్తుతానికి నేను ప్రెగ్నెంట్ కాదు. కానీ భవిష్యత్తులో మాత్రం ఇది తప్పకుండ జరుగుతుంది. అప్పడు నేనే స్వయంగా చెప్తాను. అప్పటి వరకు ఇలాంటి పుకార్లను నమ్మకండి’ అంటూ తన ప్రెగ్నెంట్ రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది. కాగా కొన్నేళ్ల డేటింగ్ అనంతరం ఈ ఏడాది మేలో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టిలు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నిక్కీ, ఆది కలిసి ‘యగవరయినమ్ నా క్కాక’, ‘మరగధ నానయమ్’ సినిమాల్లో నటించారు. అదే సమయంలో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే వారి రిలేషన్పై ఈ జంట ఎప్పుడూ బయటకు చెప్పలేదు. సీక్రెట్గా డేటింగ్ చేసిన ఆది-నిక్కీ ఈ ఏడాది పెళ్లి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చదవండి: తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్న జబర్దస్త్ కమెడియన్, నడవలేని స్థితిలో.. pic.twitter.com/1tucglygut — Nikki Galrani Pinisetty (@nikkigalrani) November 18, 2022 -
Sania Mirza: సానియా మీర్జాతో విభేదాలు!? నటితో షోయబ్ మాలిక్ ఫొటోలు వైరల్
Sania Mirza- Shoaib Malik- Ayesha Omar: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు అభిమానులకు మరింతగా చేరువయ్యే అవకాశం దొరికింది. తమ వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు పంచుకునే వెసలుబాటు కలిగింది. అయితే, ఒక్కోసారి నోరు తెరచి స్వయంగా ఏ విషయం చెప్పకపోయినా.. నేరుగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా సరే.. వాళ్లు షేర్ చేసే ఫొటోలు, వాటికి జత చేసే క్యాప్షన్లు చాలు.. వాళ్ల పర్సనల్ లైఫ్ గురించి వదంతులు వ్యాపించడానికి! క్రీడా జంట సానియా మీర్జా- షోయబ్ మాలిక్ విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులకు సిద్ధమయ్యారంటూ రూమర్లు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే వీరిద్దరు విడిగా ఉంటున్నారని, విడాకులకు సంబంధించిన ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రకటన చేయనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమే కారణం అంటూ! అంతేకాదు.. ఓ పాకిస్తాన్ మోడల్ ఇందుకు కారణమని పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె పేరు తెరపైకి రావడానికి కారణం ఏమిటంటే.. సదరు మోడల్ పేరు ఆయేషా ఒమర్. స్థానిక మ్యాగజీన్ కోసం షోయబ్ ఆమెతో కలిసి 2021లో ఓ బోల్డ్ ఫొటోషూట్ చేశాడు. హెల్త్ అండ్ ఫిట్నెస్పై అవగాహనలో భాగంగా రూపొందించిన వీడియోలో తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వీళ్లు ఆ ఫొటోషూట్లో చాలా సన్నిహితంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయేషా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. షోయబ్ రెండో పెళ్లికి సిద్దమైనట్లుగా కనిపిస్తోంది అంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. స్విమ్మింగ్పూల్లో దిగి ఇలా ఫోజులివ్వడమే ప్రొఫెషనలిజమా అంటూ ప్రశ్నించారు. మీ భర్త కూడా ఇలాగే చేస్తే ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో షోయబ్ మాలిక్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ఫొటోషూట్ సమయంలో ఆయేషా తనకు సహకరించారంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫొటోషూట్ గురించి మీ భార్య సానియా ఎలా స్పందించారని హోస్ట్ ప్రశ్నించగా.. సమాధానం దాటవేసిన షోయబ్.. ‘‘మీ భర్త కూడా ఇలాంటి ఫొటోషూట్లో పాల్గొంటే మీ రియాక్షన్ ఏంటీ’’అంటూ ఎదురు ప్రశ్నించాడు. PC: Ayesha Omar Instagram ఇందుకు వెంటనే స్పందించిన ఆమె..‘‘నాకింకా పెళ్లి కాలేదు’’అని సమాధానమిచ్చింది. అవునా.. మీ లాగే సానియా కూడా రియాక్ట్ అవ్వలేదు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు తోడు ఇటీవల సానియా.. ‘‘హృదయం ముక్కలైందంటూ’’వరుస పోస్ట్లు చేస్తూ ఉండటం ఈ రూమర్లకు ఊతమిచ్చింది. భార్యా కొడుకుతో షోయబ్ మాలిక్ ఆయేషా ఎవరంటే ఆయేషా ఒమర్ నటి, గాయని, యూబ్యూబర్. 1981లో జన్మించిన ఆమె తొలుత వీడియో ఆల్బమ్లతో లైమ్లైట్లోకి వచ్చారు. 2015లో కరాచీ సే లాహోర్ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇక సానియా- షోయబ్ మాలిక్ విడాకుల వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయేషా- షోయబ్ మాలిక్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా 2010లో పెళ్లి చేసుకున్న సానియా- షోయబ్కు కుమారుడు ఇజహాన్ సంతానం. చదవండి: T20 WC 2022 Final: ఇంగ్లండ్- పాక్ ఫైనల్కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దు అయితే? IND vs NZ: టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్! View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) View this post on Instagram A post shared by Ayesha Omar (@ayesha.m.omar) -
Sania Mirza: విడాకులకు సిద్ధమైన సానియా? ‘భర్త మోసాన్ని తట్టుకోలేకే’ అంటూ..
Sania Mirza- Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వ్యక్తిగత జీవితానికి సంబంధించి సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తున్నాయి. భర్త షోయబ్ మాలిక్తో విభేదాల కారణంగా ఆమె విడాకులకు సిద్దమయ్యారనేది వాటి సారాంశం. కాగా టెన్నిస్లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా పలు ఘనతలు అందుకున్న సానియా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా 2010 ఏప్రిల్లో ఈ క్రీడా జంట వివాహ బంధంలో అడుగుపెట్టింది. వీరికి కుమారుడు ఇజహాన్ సంతానం. ఇక పెళ్లైన నాటి నుంచి.. ముఖ్యంగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ సమయంలో సానియాను ఉద్దేశించి కొంతమంది ఆకతాయిలు విపరీతమైన ట్రోల్స్ చేసేవారు. అయితే, అవేమీ తమ బంధం మీద ప్రభావం చూపలేవంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ.. ట్రోల్స్కు కౌంటర్ ఇచ్చేవారు సానియా. కానీ గత కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నట్లు ఇన్సైడ్ స్పోర్ట్ తన కథనంలో పేర్కొంది. అనుమానాలు పెంచిన ఆ కామెంట్! ఇటీవల దుబాయ్లో తమ కుమారుడి పుట్టినరోజు(అక్టోబరు 30) సెలబ్రేట్ చేసింది ఈ జంట. ఈ క్రమంలో షోయబ్ తన సోషల్ మీడియా అకౌంట్లో ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేయగా.. సానియా మాత్రం తాను, తన కొడుకు మాత్రమే కలిసి ఉన్న ఫొటో పంచుకున్నారు. ఇందుకు స్పందించిన సానియా బెస్ట్ ఫ్రెండ్, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్.. ‘‘నీ జీవితంలో ఉన్న ఒకే ఒక, నిజమైన ప్రేమ.. ఇజహాన్తో నిన్ను చూసినప్పుడల్లా నాకిలాగే అనిపిస్తుంది’’ అని కామెంట్ చేశారు. దీనితో పాటు ఇటీవల కొడుకు తనను ఆప్యాయంగా ముద్దాడుతున్న ఫొటోను ఇన్స్టాలో షేర్ చేసిన సానియా.. ‘‘కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చే క్షణాలు’’ అంటూ క్యాప్షన్ జతచేశారు. అంతేకాదు.. ‘ముక్కలైన హృదయం ఎక్కడికి వెళ్తుంది’ అంటూ ఇన్స్టా స్టోరీలో రాయడం అనుమానాలను మరింత పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో భర్తను ఉద్దేశించే సానియా ఇలాంటి పోస్టులు చేస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా షోయబ్ మోసాన్ని తట్టుకోలేక సానియా విడాకులకు సిద్ధమయ్యారని.. గత కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంట.. కొడుకు కోసం మాత్రమే అప్పుడప్పడూ కలుస్తున్నారంటూ పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఇటు సానియా గానీ.. అటు షోయబ్ గానీ ఈ రూమర్లపై నోరు మెదపకపోవడం గమనార్హం. కాగా వెటరన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్కు జాతీయ జట్టులో ఇటీవల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. టీ20 ప్రపంచకప్-2022కు అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. చదవండి: WC 2022: ఇంగ్లండ్తో సెమీస్కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ! రోహిత్కు గాయం? Aus Vs Eng: ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. ఆసీస్ జట్టు ప్రకటన.. ప్రపంచకప్ లక్ష్యంగా! View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) Sania Mirza Instagram story. pic.twitter.com/BBKEztyCa6 — Avinash Aryan (@AvinashArya09) November 6, 2022 -
23 ఏళ్ల యువతిని సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్న ‘బబ్లూ’ పృథ్వీరాజ్
నటుడు బబ్లూ పృధ్వీ రాజ్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. తమిళ నటుడైన ఆయన తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా కూడా పలు చిత్రాలు చేసి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అవకాశాలు తగ్గడంతో కొంతకాలంగా ఆయన తెలుగు తెరపై కనిపించడం లేదు. ఇటీవల ఇంటింటి గృహలక్ష్మీ అనే సీరియల్తో తెలుగులో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు ఆయన. చదవండి: జపానీస్లో మాట్లాడి అదరగొట్టిన తారక్, ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొంతకాంలగా పృథ్వీరాజ్ భార్యతో దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. 50 ఏళ్ల పృథ్యీరాజ్ 23 ఏళ్ల యువతిని రెండవ వివాహం చేసుకున్నాడంటూ తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, మెయిన్ స్ట్రీమ్లో ఆర్ఆర్ఆర్, అఖండ చిత్రాలు ఈ తాజా బజ్ ప్రకారం.. మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని ఆయన సీక్రెట్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రెండో భార్యతోనే కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండో పెళ్లి గురించి ఆయన అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పృధ్వీరాజ్కు 1994లో బీనా అనే మహిళతో పెళ్ల కాగా వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. -
ఇకనైనా నోళ్లు మూస్తారా...చిన్మయి వైరల్ ఫోటోలు
చెన్నై: సరోగసీ ఒక విలాసవంతమైన వ్యాపారంగా మారిపోతున్న వైనం, సరోగసీ వివాదం, సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న వేధింపుల నేపథ్యంలో గాయని చిన్మయి శ్రీపాద బేబీ బంప్తో ఒక సెల్ఫీని ఇన్స్టాలో షేర్ చేశారు. తద్వారా అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కన్నారన్న పుకార్లకు చెక్ చెప్పారు. అంతేకాదు ఇద్దరు బిడ్డలకు పాలిస్తున్న ఫోటోను కూడా చిన్మయి షేర్ చేశారు. దీంతోపాటు తన అభిపప్రాయాలతో ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ట్విన్స్కు పాలు పట్టడంలోని ఇబ్బందులు, బ్యాక్పెయిన్, షోల్టర్స్ పెయిన్ గురించి కూడా ఆమె చెప్పకనే చెప్పారు. దీంతో నిజంగా మీరు రియల్ శివగామి అంటున్నారు ఫ్యాన్స్. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్పే క్యాష్ బ్యాక్ ఆఫర్) ‘ఓన్లీ సెల్ఫీ’ అటూ ప్రెగ్నెన్సీ సమయంలో తీసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో ఒక నోళ్లు మూత పడ్డాయి. నిజంగా ఇది 'ఐకానిక్' పిక్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. “సరోగసీ అంటూ కారు కూతలు కూసిన వాళ్లంతా ఇకనైనా నోరు మూయండి” అని మరొకరు వ్యాఖ్యానించారు. చిన్మయి శ్రీపాద, నటుడు, నిర్మాత రాహుల్ రవీంద్రన్ దంపతులు ఈ ఏడాది జూన్లో ద్రిప్తా, శర్వాస్ అనే కవలలకు జన్మనిచ్చారు. వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కనడం సాధారణంగా మారిపోయింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారనీ, కుటుంబ అవసరాల కోసం, డబ్బు సంపాదన కోసం సరోగేట్గా మారుతున్నారనేది ఒక వాదన. ఇందుకు పరిస్థితులను బట్టి కనీసం రూ.15 లక్షల నుంచి 30 లక్షల వరకు లేదా అంతకు మించి డబ్బు వసూలు చేస్తారట. అయితే దీనిపై నియంత్రణ లేకపోవడంతో భారత్ లో సరోగసీ దుర్వినియోగం అవుతుందన్న వాదనలు ఉన్నాయి. దీంతో భారత ప్రభుత్వం 2019లో సరోగసీని నిషేధించి, నియమ నిబంధనలను కఠినతరం చేసింది. (Motorola Edge 30 Ultra: కొత్త వేరియంట్, 200 ఎంపీ కెమెరా, భారీ లాంచింగ్ ఆఫర్) అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కనడం(సరోగసీ) అనేది వ్యాపారంగా మారిపోయిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల సినీ నటులు నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించిన వివరణ కోరింది. అయితే ఆరేళ్ల క్రితమే తమ పెళ్లిన రిజిస్టర్ చేసుకున్నామని నయన్ దంపతులు ప్రకటించారు. ఇంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. వీరే కాదు, నటుడు షారుఖ్ ఖాన్ దంపతులు, శిల్పాశెట్టి దంపతులతోపాటు, తెలుగు నటి మంచు లక్ష్మి దంపతులు సైతం సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిచ్చారు.(Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా? ) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) > View this post on Instagram View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
హీరోయిన్తో మెగా అల్లుడు కల్యాణ్ ఫోటో వైరల్
మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిరంజీవి చిన్నకూతురు శ్రీజను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కల్యాణ్ దేవ్ పర్సనల్ లైఫ్కు సంబంధించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ హీరోయిన్తో కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వర్ణిక రాథోర్ అనే హీరోయిన్తో దిగిన ఓ ఫోటోను షేర్ చేసిన కల్యాణ్ దేవ్ దీనికి నా లైఫ్ను మార్చేసిన కళల రాణి అంటూ క్యాప్షన్తో ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీంతో కల్యాణ్ దేవ్ మాటల వెనకున్న అర్థమేంటని నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఆయన మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చిన నేఫథ్యంలో కల్యాణ్ దేవ్ షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరల్గా మారింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఆమె కల్యాణ్ దేవ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్గా ఎంపికయ్యిందని, ఈ క్రమంలోనే ఫోటో బయటికొచ్చిందని తెలుస్తుంది. -
ఎట్టకేలకు విడాకుల వార్తలపై స్పందించిన దీపికా
బాలీవుల్ స్టార్ కపుల్ దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్లు విడాకులు తీసుకోబుతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్వీర్ నగ్న ఫొటోషూట్ వివాదం నుంచి వారి వైవాహిక బంధంలో మనస్పర్థలు వచ్చాయని, అందువల్లే వీరు విడిపోతున్నారనే వాదనలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన రణ్వీర్-దీపికా విడాకుల వార్తలే దర్శనం ఇచ్చాయి. అయితే ఇప్పటి వరకు దీపికా-రణ్వీర్లు ఈ రూమర్లపై స్పందించలేదు. దీంతో ఈ వార్తలపై క్లారిటీ లేక ఈ జంట ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తమ విడాకుల రూమర్స్పై దీపికా స్పందించింది. చదవండి: కాస్టింగ్ కౌచ్పై స్పదించిన బిగ్బాస్ దివి.. ఇటీవల ఓ ఎగ్జిబిషన్ ఈవెంట్లో పాల్గొన్న దీపికాకు ఓ విలేకరి నుంచి విడాకులపై ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అలాంటిది ఏం లేదని, అవన్ని వట్టి పుకార్లనంటూ కొట్టిపారేసింది. ‘మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేం చాలా హ్యాపీగా ఉన్నాం. గత వారం రణ్వీర్ ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో భాగంగా ఇంటికి దూరంగా ఉన్నారు. ఆయన తిరిగి ఇంటికి రాగానే నన్ను చూసి పట్టలేనంద ఆనందం చూపించాడు’ అంటూ డైవర్స్ రూమర్లకు చెక్ పెట్టింది. కాగా ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన దీపికా-రణ్వీర్లు నవంబర్ 14, 2018లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. షారుక్ ఖాన్ పఠాన్, ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రాలతో దీపికా బిజీగా ఉంది. చదవండి: నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం? -
ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలవబోతున్నారా? ఇదిగో క్లారిటీ..
కోలీవుడ్ మాజీ దంపతులు ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్లు విడాకులు రద్దు చేసుకుంటున్నారంటూ కొన్ని రోజులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమైతే బాగుండని ఫ్యాన్స్తో పాటు సెలబ్రెటీలు సైతం ఆశపడుతున్నారు. అయితే వారిద్దరు మళ్లీ కలుస్తున్నారా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఈ వీరిద్దరు మళ్లీ కలవడంపై వారి సన్నిహితుల నుంచి స్పష్టత ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: అను ఇమ్మాన్యుయేల్కు మరో చాన్స్ ధనుష్-ఐశ్యర్య మళ్లీ కలుస్తున్నారని, వారు విడాకులు రద్దు చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వారిద్దరు మళ్లీ కలిసే ఆలోచనలో లేరని, ప్రస్తుతం ఎవరి జీవితం వారిది అన్నట్లుగా ధనుష్-ఐశ్వర్యలు వ్యవహరిస్తున్నారని సన్నిహితుల నుంచి సమాచారం. కనీసం ఎదురుపడిన వారు మాట్లాడుకోవడం లేదట. పిల్లల విషయంలో మాత్రమే వారిద్దరు అప్పుడప్పుడు కలుస్తున్నారని, బహుశా ఆ సమయంలో వారిని చూడటం వల్లే ఈ వార్తలు పుట్టుకొచ్చి ఉంటాయని సన్నిహితులు అభిప్రాయపడ్డారట. చదవండి: త్రిష చిత్రంలో నయనతార?.. ఆ పాత్రకు అంగీకరిస్తారా..? కాగా 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్-ఐశ్వర్యలు తమ 18ఏళ్ల వైవాహిక బంధానికి ఈ ఏడాది ప్రారంభంలో స్వస్తి పిలికారు. తాము విడాకులు తీసుకుంటున్నామంటూ జనవరిలో ప్రకటించారు వీరిద్దరు ప్రకటించడం వారి ఫ్యాన్స్తో సినీ సెలబ్రెటీలు సైతం షాకయ్యారు. కానీ వీరి విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి మళ్లీ కలిస్తే బాగుండూ అంటూ ధనుష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే వారు మళ్లీ కలుస్తున్నారనే వార్తలు నెట్టింట పుట్టుకొస్తున్నాయి. -
దీపికా -రణ్వీర్లు విడాకులు తీసుకోబోతున్నారా? కారణం ఇదేనా!
బాలీవుడ్ క్యూట్ కపుల్లో దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్ జంట ఒకటి. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏ అవార్డు ఫంక్షన్స్, సినిమా ఈవెంట్స్లో చూసిన వీరిద్దరు చాలా అన్యోన్యంగా కనిపించేవారు. అలాంటి ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతుందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పమన్నాయి. దీపికా-రణ్వీర్ల మధ్య మనస్పర్థలు వచ్చాయని, ప్రస్తుతం వీరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారంటూ బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: ‘పొన్నియన్ సెల్వన్’పై ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ, మండిపడ్డ సుహాసిని అలాగే రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ వల్లే వీరిమధ్య విభేదాలు వచ్చాయంటున్నారు. అంతేకాదు ఉమైర సంధూ అనే రివ్యూవర్, ఫిలిం క్రిటిక్ దీపికా-రణ్వీర్ల బంధం చెడిందని, త్వరలోనే వారి విడాకుల ప్రకటన రానుందంటూ ట్వీట్ చేయడంతో ఈ వార్తలు ఒక్కసారి వైరల్గా మారాయి. దీంతో ఈ జంట ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై దీపికా ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ రీసెంట్గా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న రణ్వీర్ తమ విడాకుల రూమర్స్పై స్పందించాడు. చదవండి: పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ‘దీపికాతో నాకు 2012లో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ పదేళ్లలో తనపై ఇంకా ప్రేమ పెరిగింది. దీపికా నా లైఫ్లోకి వచ్చాక నా జీవితం ఇంకా అందంగా మారింది. మా మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు’ అని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే ఈ రోజు(శుక్రవారం) ఉదయం దీపికా తన తల్లి ఉజ్జల పదుకొనెతో ఎయిర్పోర్ట్లో దర్శనం ఇచ్చింది. ఈ వీడియోలో దీపికా చేతికి వెడ్డింగ్ రింగ్ కనిపించలేదు. అది పట్టేసిన నెటిజన్లు ’హో.. దీపికా వెడ్డింగ్ రింగ్ తీసేసింది.. అంటే వీరి విడాకుల వార్తలు నిజమేనా?’ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by HT City (@htcity) -
యాక్టింగ్కు గుడ్బై!.. నయనతార అభిమానుల్లో టెన్షన్..
సాక్షి, చెన్నై: మాలీవుడ్ టూ టాలీవుడ్ వయా కోలీవుడ్ అంటూ తన నట జీవితాన్ని అందమైన ప్రయా ణంగా మార్చుకున్న నయనతార తాజాగా బాలీవుడ్లోనూ అడుగు పెట్టారు. గ్లామరస్ పాత్రలతో కెరీర్ ను ప్రారంభించి పెర్ఫార్మెన్స్ పాత్ర ల వరకు శభాష్ అని ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్న తార ఈ నయనతార. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయకి ఈమెనే. ఇప్పుడు ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేసే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నయనతార సినిమాల్లో సంపాదించినదంతా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. ప్రస్తుతం భర్త విఘ్నేష్ శివన్తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న నయనతార త్వరలో నటనకు గుడ్బై చెప్పబోతుందన్నదే అభిమానులను కలతకు గురి చేస్తున్న వార్త. ఆమె నటనకు స్వస్తి చెప్పి తన ఇతర వ్యాపారాల వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే నటనకు గుడ్బై చెప్పినా నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత? అని తెలియాలంటే నయనతార, విఘ్నేష్ శివన్ స్పందించాల్సి ఉంది. వాళ్లు ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్: ఫ్యాన్స్కు సారీ చెప్పిన తారక్ -
ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్బాస్ బ్యూటీ!
బిగ్బాస్ ఫేం, సినీ, టీవీ నటి భానుశ్రీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. పలు షోలకు యాంకర్గా చేసిన భాను టీవీ సీరియల్స్ కూడా నటించింది. అలాగే సినిమాల్లో సహానటి పాత్రలు చేస్తూ నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో బిగ్బాస్ షోలో అడుగుపెట్టిన భాను ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చింది. బిగ్బాస్ తెచ్చిపెట్టిన ఫేంతో ఆమె పలు సినిమాల్లో హీరోయిన్గా కూడా చాన్స్ కొట్టేసింది. ఇటీవల మౌనం, నల్లమల వంటి చిత్రాల్లో హీరోయిన్గా చేసి ఫ్యాన్స్ను అలరించింది. ప్రస్తుతం నటిగా, హీరోయిన్గా కెరీర్లో బిజీ అయిపోయిన భాను అటూ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. చదవండి: అందుకే సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది: కత్రినా కైఫ్ తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకునే భాను పెళ్లి వార్త ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. త్వరలోనే ప్రియుడితో ఏడడుగులు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో తాను ఓ వ్యక్తి వల్లే ఇలా ఉన్నానని, హైదరాబాద్లో తనకంటూ ఒకరు ఉన్నారనే ధైర్యం ఇచ్చాడని చెప్పింది. ఇక తాను అతడినే పెళ్లి చేసుకుంటానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతడితోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే భానుశ్రీ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘తమ్ముడు’కి చిరంజీవి స్పెషల్ బర్త్డే విషెస్ -
రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుంది, నేనేమో హైదరాబాద్లో..: కృష్ణవంశీ
టాలీవుడ్లో క్రియేటివ్ డైరెక్టర్గా కృష్ణవంశీకి పేరుంది. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం వంటి సినిమాలతో ఇండస్ట్రీకి హిట్స్ ఇచ్చిన కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'రంగమర్తాండ'. నక్షత్రం సినమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెఫ్ట్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబంధించిన విశేషాలతో పర్సనల్ లైఫ్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'రమ్యకృష్ణ రేంజ్ని మ్యాచ్ చేయాలనే టెన్షన్ నాకు ఉంటుంది. నాకు ఆమెతో కాంపిటిషన్ ఉంటుంది. కొడుకుతో కలిసి రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది. నేనేమో హైదరాబాద్లో ఉంటున్నా. ఎప్పుడూ ఖాళీ దొరికినా నేను అక్కడికి వెళ్తుంటా. లేదా వాళ్లే నా దగ్గరికి వస్తుంటారు. ఇక మా అబ్బాయి రిత్విక్ చాలా యాక్టివ్. ఎంతైనా క్రాస్బ్రీడ్ కదా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రమ్యకృష్ణ, మీరు వేరేవేరుగా ఉంటే పుకార్లు వస్తుంటాయి కదా అని అడగ్గా.. అలాంటివి తాము పట్టించుకోమని, ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ కామన్' అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అందరికీ గాసిప్స్ అంటేనే ఇంట్రెస్ట్ కదా అంటూ సమాధానమిచ్చారు. -
సౌందర్యతో అలాంటి రిలేషన్ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్
లెజెండరి నటుడు జగపతి బాబుకు పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో స్టార్ హీరోలకు విలన్గా నటిస్తూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ‘మావిడాకులు, శుభలగ్నం, సర్దుకుపోదాం రండి, ఫ్యామిలీ సర్కస్’ కుటుంబ కథా చిత్రాలతో జగపతి బాబు ఎంతో గుర్తింపు పొందారు. అయితే అప్పట్లో జగపతి బాబు, దివంగత నటి సౌందర్యలది హిట్ పెయిర్ అనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్ని మంచి విజయం సాధించాయి. చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ దాదాపు తెరపై భార్యభర్తలుగా నటించిన వీరిద్దరిపై అప్పట్లో రూమర్స్ కూడా బాగానే వచ్చేవి. అయితే సౌందర్య పెళ్లి అనంతరం వాటికి చెక్ పడింది. కానీ పెళ్లికి ముందు మాత్రం వీరిద్దరి పెయిర్, ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ చూసి సౌందర్య, జగపతి బాబు మధ్య ఏదో స్పెషల్ బాండింగ్ ఉందంటూ అప్పట్లో అందరూ చెవులు కొరుక్కునేవారు. అంతేకాదు తరచూ సౌందర్య ఇంటికి జగపతి బాబు, ఆయన తన ఇంటికి వెళ్లడం చూసి వారిద్దరి రిలేషన్ గురించి పుకార్లు షికారు చేస్తుండేవనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న జగపతి బాబుకు దీనిపై ప్రశ్న ఎదురైంది. ఆయన స్పందిస్తూ.. తనకు, సౌందర్యకు మధ్య రిలేషన్ ఉన్నమాట నిజమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు ‘కానీ అది మీరు అనుకున్నది కాదు. మేమిద్దరం మంచి స్నేహితులం. ఆమె అన్యయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్. సౌందర్య వ్యక్తిగతంగా చాలా మంచి అమ్మాయి. మేము మాత్రమే కాదు మా ఫ్యామిలీలు కూడా చాలా క్లోజ్. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా కుటుంబ సమేతంగా హాజరయ్యేవాళ్లం. ఈ క్రమంలో సౌందర్య తరచూ మా ఇంటికి వస్తుండేవారు. నేను వాళ్ల ఇంటికి వెళ్తుండేవాడిని. అది చూసి జనాలు తప్పుగా అర్ధం చేసుకున్నారు. సౌందర్య అలాంటిది కాదు. మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని వచ్చిన వార్తలు నేను కూడా విన్నా. కానీ వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ ఆయన వివరించారు. కాగా ప్రస్తుతం జగపతి బాబు ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇండస్ట్రీలో అలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా : నిత్యామీనన్
హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ పెళ్లి వార్తలపై గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిపై ఆమె క్లారిటీ ఇచ్చినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. తాజాగా దీనిపై స్పందించిన నిత్యామీనన్ తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చేసింది. చదవండి: కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత.. 'కాలు బాలేక రెస్ట్ తీసుకుంటే.. పెళ్లి చేసుకుంటుంది కాబట్టే కథలు వినట్లేదు అని రూమర్స్ పుట్టించారు' అని తెలిపింది. మరి పెళ్లి చేసుకోమని దుల్కర్ మీకు సూచించారట కదా అని అడగ్గా..'తను నాకు మంచి ఫ్రెండ్. అందుకే పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సంతోషంగా ఉండమని నాకు చెబుతుంటాడు. ప్రస్తుతానికి నాకు పెళ్లి ఆలోచన లేదు కానీ భవిష్యత్తులో చేసుకుంటానేమో తెలీదు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలి కాలంలో తనపై వస్తున్న రూమర్స్పై స్పందిస్తూ..నేను ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే..''నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు పుట్టించారు. కావాలనే తప్పుగా ప్రచారం చేశారు. మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కిందకి లాగాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. అందరి గురించి నేను ఆలోచిస్తూ పోతే నా పనులు చేసుకోవడానికి సమయం దొరకదు’’ అన్నారు.చదవండి: అందుకే నిత్యామీనన్ను వద్దనుకున్నారా? రివీల్ చేసిన నిర్మాత -
ఏఎన్ఐ పేరిట ట్వీట్! విడాకులంటూ వార్తలు.. స్పందించిన చహల్!
Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్, అతడి సతీమణి, యూట్యూబర్ ధనశ్రీ వర్మ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారారు. కొన్ని రోజుల క్రితం ధనశ్రీ వర్మ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇంట్లో పార్టీకి హాజరైన నాటి నుంచి వీరి గురించి వదంతులు వ్యాపిస్తున్నాయి. చహల్ లేకుండానే పార్టీకి హాజరైన ధనశ్రీ వర్మ.. భారత జట్టు మరో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో కలిసి సూర్య దంపతులతో ఫొటో దిగింది. దీనిని సూర్య భార్య దేవిషా శెట్టి ఇన్స్టాలో షేర్ చేయడంతో రూమర్లు వ్యాపించాయి. అదే సమయంలో ధనశ్రీ తన ఇన్స్టా బయో నుంచి చహల్ ఇంటిపేరును తొలగించడంతో వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. (PC: Yuzvendra Chahal) ఈ నేపథ్యంలో.. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ పేరిట నకిలీ అకౌంట్ల నుంచి వచ్చిన ట్వీట్ చహల్ అభిమానుల గుండెల్లో గుబులు రేపింది. ‘‘బ్రేకింగ్: క్రికెటర్ యజువేంద్ర చహల్ నటి ధనశ్రీ వర్మ పంజాబ్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేశారు’’ అంటూ మూడు అకౌంట్ల నుంచి ట్వీట్ షేర్ అయింది. దీంతో చహల్- ధనశ్రీ పేర్లు ట్విటర్లో ట్రెండ్ అవుతున్నాయి. క్షణాల్లో ఈ వార్త వైరల్ అయింది. ఈ విషయాన్ని గమనించిన ఏఎన్ఐ వెంటనే రంగంలోకి దిగింది. ఆ మూడు ఫేక్ అకౌంట్లు అంటూ వివరణ ఇచ్చింది. ఈ మేరకు.. ‘‘ఏఎన్ఐ పేరును వాడుతూ ఈ మూడు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు. ఇలాంటి వార్త అసలు ఎక్కడా రాలేదు’’ అని అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ట్వీట్ చేసింది. ఇది చూసిన చహల్ అభిమానులు ఫేక్ రాయుళ్లను ఏకిపారేస్తున్నారు. ‘‘మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.. పచ్చని జంట కాపురంలో నిప్పులు పోసేలా ఆ వార్తలు ఏంటి? మీకు బుద్ధిరాదా? సిగ్గు పడండి’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆసియా కప్-2022 ఆడే భారత జట్టుకు ఎంపికైన యజువేంద్ర చహల్.. మెగా ఈవెంట్లో సత్తా చాటేందుకు సంసిద్ధమవుతున్నాడు. ఇక ధనశ్రీని ప్రేమించిన చహల్ 2020 డిసెంబరులో ఆమెను వివాహమాడిన విషయం తెలిసిందే. సన్నిహితుల నడుమ అత్యంత వైభవోపేతంగా వీరి పెళ్లి జరిగింది. స్పందించిన చహల్.. తమ గురించి వస్తున్న రూమర్లపై యజువేంద్ర చహల్ స్పందించాడు. తమ బంధం గురించి పుట్టుకొస్తున్న ఇలాంటి పుకార్లు నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. దయచేసి ఇలాంటి వదంతులకు ముగింపు పలకాలంటూ గాసిప్ రాయుళ్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఇన్స్టాలో స్టోరీ షేర్ చేశాడు. చదవండి: Yuzvendra Chahal: ఆ క్రికెటర్తో చహల్ భార్య ఫొటో! ఇన్స్టాలో ఇంటిపేరు తొలగించిన ధనశ్రీ.. హాట్టాపిక్గా.. IND vs ZIM ODI Series: సిరాజ్ గొప్ప బౌలర్.. అతడి బౌలింగ్లో ఎక్కువ పరుగులు సాధిస్తే: జింబాబ్వే బ్యాటర్ Please note: All three are fake accounts impersonating ANI. No such news has been flashed. pic.twitter.com/rIRwhzneit — ANI (@ANI) August 18, 2022 -
మరో బ్రేకప్.. షెడ్యూల్స్ కారణంగా విడిపోయిన లవ్బర్డ్స్!
Kim Kardashian Pete Davidson Break Up After 9 Months Dating: సినీ ఇండస్ట్రీలో మరో బ్రేకప్ చోటుచేసుకుంది. రియాలిటీ స్టార్గా పేరు తెచ్చుకుంది కిమ్ కర్దాషియన్. పలు కామెడీ షోలతో, స్టాండప్ కమెడియిన్గా పాపులరయ్యాడు పీట్ డేవిడ్సన్. వీరిద్దరూ తొమ్మిది నెలలుగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కిమ్-పీట్ బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారని హాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'కిమ్ కర్దాషియన్, పీట్ డేవిడ్సన్ విపరీతమైన షెడ్యూల్స్ కారణంగా సంబంధాన్ని కొనసాగించలేకపోతున్నారు. షెడ్యూల్స్ ద్వారా రిలేషన్షిప్ను కొనసాగించడం సవాలుగా మారింది. అందుకే విడిపోయి స్నేహితులుగా మారాలని నిర్ణయించుకున్నారు' అని మీడియా సంస్థలు పేర్కొన్నట్లు సమాచారం. కాగా 2021 అక్టోబర్లో నిర్వహించిన సాటర్డే నైట్ లైవ్లో కిమ్ కర్దాషియన్ అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో కిమ్కు పీట్ డేవిడ్సన్తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఈ సంవత్సరం జరిగిన మెట్ గాలా ఈవెంట్లో వీరిద్దరూ రెడ్ కార్పెట్పై నడిచి తమ రిలేషన్షిప్ను బహిర్గతంగా వ్యక్తపరిచారు. తాజాగా వీరు 9 నెలల డేటింగ్కు స్వస్తి పలికి బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం పీట్ డేవిట్సన్ ఆస్ట్రేలియాలో 'విజార్డ్స్' షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. చదవండి: సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇది చాలా అవసరం: మంచు మనోజ్ హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్? ప్రమాదం నుంచి బయటపడిన నేచురల్ స్టార్ నాని! -
బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే!
హిందీ చిత్రపరిశ్రమలోని అందమైన జంటల్లో యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, బ్యూటీఫుల్ హీరోయిన్ దిశా పటానీ పెయిర్ ఒకటి. సినిమాల్లో వీరి ఆన్స్క్రీన్ కెమిస్ట్రీతో విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసి టైగర్ ష్రాఫ్-దిశా పటానీ డేటింగ్లో ఉన్నట్లు ఎప్పటినుంచో రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే గత కొంత కాలంగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. టైగర్ ష్రాఫ్-దిశా బ్రేకప్ చెప్పుకున్నట్లు గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలతో వారి అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే వారిద్దరు విడిపోవడానికి వివాహమే కారణమని ఓ ఇంగ్లీష్ వెబ్సైట్ పేర్కొంది. వివాహం చేసుకునేందుకు దిశా పటానీ సిద్ధంగా ఉన్న.. టైగర్ ష్రాఫ్ మాత్రం రెడీగా లేడట. కెరీర్ను గాడిలో పెట్టేందుకు ట్రై చేస్తున్న టైగర్.. ఈ సమయంలో పెళ్లికి నో అంటున్నాడని టాక్. చదవండి: ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే.. రొమాంటిక్గా 'లైగర్' సాంగ్ ఇదిలా ఉంటే మరోవైపు వారిద్దరి రిలేషన్ సరిగ్గానే ఉందని ఇటీవల టైగర్ షేర్ చేసిన ఓ వీడియో పోస్ట్ చెబుతోంది. మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తున్న వీడియోను టైగర్ ష్రాఫ్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. 'నిజానికి ఇవాళ ట్రైనింగ్ తీసుకున్నట్లు లేదు. ఎందుకంటే తమను కొట్టాల్సిందిగా వారు చెప్పారు. అది నా ఐడియా అయితే కాదు' అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్ట్కు నేను కూడా ఇలా చేయాలనుకుంటున్నాను అని దిశా పటానీ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో, రిప్లై నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దిశా పటానీ రిప్లైతో వారి మధ్య ఎలాంటి బ్రేకప్ జరగలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారట. ఇక వారు డేటింగ్లో ఉన్నారా? లేదా బ్రేకప్ చెప్పుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే. చదవండి: ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) -
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హన్సిక?
‘దేశముదురు’ మూవీతో కుర్రకారు మనసులను కొల్లగొట్టిన బ్యూటీ హన్సిక. బాల నటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయమైంది. తొలి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోలతో జతకట్టి స్టార్ హీరోయిన్గా ముద్ర వేసుకున్న హాన్సికకు ఆ తర్వాత అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఆమె కోలీవుడ్పై ఫోక్స్ పెట్టింది. చదవండి: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్కు మెరుగులు లేడీ ఓరియంటెడ్, గ్లామర్ రోల్స్ పోషిస్తూ తమిళంలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. రెండేళ్ల గ్యాప్ అనంతరం ఆమె నటించిన తాజా చిత్రం మహా. త్వరలోనే ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించబోతోంది ఆమె. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకాశాలను అందుకుంటున్న హాన్సిక ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైందని తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. చదవండి: తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్ రామ్ సౌత్కు చెందిన ఓ బడా పోలిటీషియన్ కుమారుడితో ఏడడుగులు వేసేందుకు హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిలిం దూనియాలో వినికిడి. అయితే ఆమె కాబోయే భర్త వ్యాపార రంగంలో రాణిస్తున్నట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకున్నారని, అతిత్వరలోనే నిశ్చితార్థానికి తేదీ కూడా ఖరారు చేయనున్నారని వినికిడి. ఇక దీనిపై హాన్సిక త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వబోతుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే హన్సిక స్పందించే వరకు వేచి చూడక తప్పదు. -
మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య?.. వీడియో వైరల్
అందాల తార ఐశ్వర్యరాయ్ మరోసారి గర్భవతి అయ్యిందా? అంటూ కొద్ది రోజులుగా బి-టౌన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. గతంలోనూ ఐష్ రెండోసారి తల్లికాబోతుందంటూ వార్తలు వచ్చినా ఈసారి మాత్రం కాస్తా గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఇటీవల విమానాశ్రయంలో కనిపించిన ఐశ్వర్య వీడియోనే. ముంబై విమానాశ్రయంలో భర్త అభిషేక్ బచ్చన్, కూతరు ఆరాధ్యలతో కలిసి ఐశ్వర్య దర్శనం ఇచ్చింది. చదవండి: నటికి షాకిచ్చిన కొత్త బాయ్ఫ్రెండ్, 2 గంటల పాటు ఎయిర్ పోర్టులోనే.. ఇందులో ఐష్ కాస్తా బొద్దుగా, పొట్ట భాగంగా ముందుకు ఉన్నట్లుగా అనిపించింది. అంతేకాదు ఈ వీడియోలో ఆమె తన పొట్టను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా కనిపించడంతో అందరూ ఆమె ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయిపోయారు. దీంతో తాను మరోసారి గర్భవతి అయ్యిందని, అందుకే పొట్ట భాగాన్ని కవర్ చేసుకుంటుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొరపాటు పడ్డ ఈ సారి మాత్రం ఐష్ నిజంగానే ప్రెగ్నెంట్ అయ్యిందంటూ ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. ‘బచ్చన్ ఫ్యామిలీ బుల్లి వారసుడు రావాలని, ఆరాధ్య పాపకు తమ్ముడు వస్తున్నాడు’ అంటూ ఆ వీడియోకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తన ప్రెగ్నెన్సీ రూమర్లపై ఐష్ స్పందించకపోవడం గమనార్హం. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే బచ్చన్ ఫ్యామిలీ స్పందించేవరకు వేచి చూడక తప్పదు. కాగా 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లకు వివాహం కాగా.. 2011 నవంబర్ 16న వీరికి ఆరాధ్య జన్మించింది. Is Aishwarya Rai Bachchan pregnant? Viral videos, pictures spark speculations Read @ANI Story | https://t.co/jeCE6Ilkqi#AishwaryaRai #AishwaryaRaiBachachanPregnant #AbhishekBachchan #Bollywood pic.twitter.com/Lzf58ir3qE — ANI Digital (@ani_digital) July 20, 2022 -
పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర బ్యూటీ!.. ఫొటోలు వైరల్
Jabardasth Lady Comedian Rithu Chowdary Getting Married: బుల్లితెర షో జబర్దస్త్తో ఫేమ్ సంపాదించిన వారిలో రీతూ చౌదరి ఒకరు. లేడీ కమెడియన్గా ప్రేక్షకులను ఆకట్టుకున్న రీతూ చౌదరి పలు సీరియల్స్తోనూ తెలుగు ఆడియెన్స్కు దగ్గరైంది. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు తదితర సీరియల్స్లో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అప్పుడప్పుడు గ్లామర్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ నెటిజన్స్ను అట్రాక్ట్ చేస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా రీతూ పెట్టిన ఓ పోస్ట్ హాట్ టాపిక్గా మారింది. ఈ ఫొటో చూసిన వారంతా రీతూ చౌదరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని ఊహిస్తున్నారు. అయితే ఆమె ఈ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు కానీ, ఈ ఫొటోకు రితూ ఇచ్చిన క్యాప్షన్ చూస్తే దాదాపు ఆమె పెళ్లి కాయమైనట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తితో రీతూ దిగిన ఫొటోను షేర్ చేస్తూ 'మా బంధం కంటే గొప్పగా ఇంకేదీ ఉండదు' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పలువురు నెటిజన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు. చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్ పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ ఫొటోలో రీతూతో ఉన్నది ఎవరా ? అనే ఆసక్తి నెటిజన్స్లో మొదలైంది. వివరాల్లోకి వెళితే రీతూతో ఉన్న వ్యక్తి పేరు శ్రీకాంత్ అని, అతను సంపన్న వ్యాపారస్థుడని, ప్రస్తుతం రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. చదవండి: రామ్ గోపాల్ వర్మకు షాక్.. 'లడ్కీ' సినిమాపై కోర్టు స్టే.. బ్యాడ్ న్యూస్ చెప్పిన నటి వరలక్ష్మి శరత్ కుమార్.. View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
రమ్యకృష్ణతో విడాకులు? స్పందించిన కృష్ణవంశీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రంగమర్తాండ'. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబందించిన విశేషాలతో పాటు మ్యారేజ్ లైఫ్పై వస్తోన్న రూమర్స్పైనా స్పందించారు. గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ- నటి రమ్యకృష్ణ విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఈ వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'బాధ్యతలంటే భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నా. కానీ చివరకు రమ్యకృష్ణతో వివాహం జరిగింది. ఇదంతా లైఫ్ డిజైన్ అని భావిస్తాను. పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులా ఉండనిచ్చింది. ఇక ఆమెతో విడాకులు అంటారా? ఇందులో నిజం లేదు. పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. కానీ మేం పెద్దగా పట్టించుకోం. అందుకే ఖండించాలని కూడా అనుకోము. జస్ట్ నవ్వి ఊరుకుంటాం' అంతే అంటూ చెప్పుకొచ్చారు. -
అందరూ పుతిన్ నాశనాన్ని కోరుకుంటున్నారు! యూకే చీఫ్
Britain's armed forces has dismissed as "wishful thinking: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను యూకే మిలటరీ చీప్ టోనీ రాడాకిన్ తోసిపుచ్చారు. అందరూ పుతిన్ ఆరోగ్యం పై దృష్టిసారించారని, పైగా ఆయన హత్య కావింపబడతాడు లేదా పరారవుతాడంటూ వస్తున్న పుకార్లన్ని చూస్తేంటే అందరూ ఆయన నాశనాన్నే ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. మిలటరీ నిపుణుడిగా రష్యాలో పుతిన్ పాలనను దగ్గరగా చూశానని చెప్పారు. ఆయన ఎటువంటి వ్యతిరేకతనైనా అణిచివేయగలరని కూడా అన్నారు. అంతేకాదు రష్యాని సవాలు చేసే శక్తి కూడా ఎవరికీ లేదని చెప్పారు. అంతేగాదు రష్యా అణుశక్తిగా కొనసాగడమే కాకుండా సైబర్ సామర్థ్యాలు కూడా ఉన్నాయని చెప్పారు. పైగా అంతరిక్ష సామర్థ్యంతో పాటు నీటి అడుగున ప్రత్యేకమైన ప్రోగామింగ్ కేబుళ్లు ఉన్నాయని అందువల్ల ప్రపంచాన్ని శాసిస్తోందన్నారు. అదే సమయంలో సెప్టెంబర్ 6న కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వారసుడిని ఎన్నుకున్నందున రష్యాకి కచ్చితంగా ముప్పు ఉంటుందన్నారు. అంతేగాదు బోరిస్ వారసురాలు బాధ్యతలు చేపట్టంగానే ఉక్రెయిన్కి సైనిక సాయం అందించి రష్యాని నియంత్రిస్తామన్నారు. ఆ తర్వాత యూకే కచ్చితంగా అణుశక్తిగా అవతరించడం పై దృష్టిసారిస్తుందని యూకే మిలటరీ చీప్ అన్నారు. (చదవండి: హఠాత్తుగా ‘కదిలిన’ పురాతన భవనం: వీడియో వైరల్!) -
ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..
Rashmika Mandanna Shoot With Tiger Shroff: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నేషనల్ క్రష్. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల రష్మిక మందన్నాపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అందులో ఒక రూమర్ నిజమే అని తేల్చి చెప్పింది ఈ బ్యూటీ. రష్మిక మందన్నా, బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కలిసి ఒక యాడ్లో కలిసి నటించారు. దీనికి సంబంధించిన బూమరాంగ్ వీడియోను ఇన్స్టా వేదికగా పంచుకుంది రష్మిక. ఈ వీడియో పోస్ట్ చేస్తూ 'ఆ రూమర్లు నిజమే.. చాలా నవ్వోస్తోంది. నేను, టైగర్ ష్రాఫ్ ఒక యాడ్ కోసం కలిసి నటించాం. టైగర్ ష్రాఫ్తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. ఈ యాడ్ కోసం ఎదురుచూస్తున్నాను' అని రాసుకొచ్చింది. ఈ స్టోరీని టైగర్ ష్రాఫ్ షేర్ చేస్తూ 'షూట్ చేయడం సరదాగా ఉంది. నువ్ ఎప్పటిలాగే అదరగొట్టావ్' అని క్యాప్షన్ ఇచ్చాడు. సో.. రష్మిక నిజమని చెప్పిన రూమర్ ఇదన్నమాట. చదవండి: అలా మరిచిపోతే విలువ ఉండదు: నాగ చైతన్య ప్రేమ భాష మాత్రమే తెలుసు: హీరోయిన్ 'ఆర్ఆర్ఆర్'పై పోర్న్ స్టార్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ View this post on Instagram A post shared by 🆃🅸🅶🅴🆁🆂🅷🆁🅾🅵🅵 (@tigershroff_fp__) -
కుల పంచాయితీలో మహిళపై దాడి.. నిండు ప్రాణం తీసిన వాట్సాప్ ప్రచారం
సాక్షి, మహబూబాబాద్: వాట్సాప్ వేదికగా జరిగిన ప్రచారంపై నిర్వహించిన కులపంచాయితీలో కొందరు ఓ మహిళపై దాడి చేశారు. ఆ మహిళ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముక్తి స్వాతి(38) తన పెద్ద కుమార్తె రాజేశ్వరికి మే నెలలో వివాహం జరిపించింది. ప్రభుత్వం ఇస్తున్న కల్యాణలక్ష్మి పథకం డబ్బుల కోసం పంచాయతీ కార్యదర్శి సంతకం అవసరం ఉండడంతో గ్రామంలోని ఆఫీసుకు వారంరోజుల క్రితం వెళ్లింది. ఈ సమయంలో పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్వాతి తనతో సన్నిహితంగా ఉండే అదే గ్రామానికి చెందిన చింత అరవింద్కు తెలిపింది. దీంతో అరవింద్.. పంచాయతీ కార్యదర్శి మంగీలాల్కు ఫోన్ చేసి చంపుతానని బెదిరింపు కాల్స్తోపాటు మెసెజ్లు పెట్టాడు. ఈక్రమంలో అరవింద్ ఇంటికి పంచాయతీ కార్యదర్శి వెళ్లి అతడి తల్లి భద్రమ్మతో బెదిరిస్తున్న విషయం తెలిపి పోలీసులకు ఫిర్యా దు చేస్తానని అన్నారు. తను తన కొడుకుకు నచ్చజెప్తానని పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని భద్రమ్మ కోరడంతో అతను విషయాన్ని గ్రామ సర్పంచ్ వెంకన్నకు చెప్పాడు. సర్పంచ్ తను మాట్లాడుతానని తెలిపారు. చదవండి: Hyderabad: ఓ వైపు కరోనా.. మరోవైపు అంటువ్యాధులు.. స్వాతి నంబర్తో వాట్సాప్ క్రియేట్ చేసిన అరవింద్ స్వాతికి చిన్న ఫోన్ ఉంది. సిమ్ను తన సెల్ఫోన్లో వేసుకున్న అరవింద్ వాట్సాప్ను ఆదివారం క్రియేట్ చేశాడు. దాని ఆధారంగా పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, మహిళలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనే సారాంశంతో గ్రామంలోని పెద్దమనుషులకు మెసెజ్లు పంపాడు. దీంతోపాటు పంచాయతీ కార్యదర్శిపై స్వాతి సర్పంచ్కు ఫిర్యాదు చేసిన ఆడియో, తదితర సందేశాలు సోషల్మీడియాలో వైరల్గా మారడంతో పంచాయతీ కార్యదర్శి ఈ విషయాన్ని మళ్లీ గ్రామసర్పంచ్ వెంకన్నకు తెలిపాడు. సర్పంచ్.. స్వాతితోపాటు ఆమె కులపెద్దమనుషులను పంచాయితీకి పిలిచారు. పంచాయితీలో స్వాతిపై దాడి వాట్సాప్లో వచ్చిన వాటిపై ఆదివారం సాయంత్రం గ్రామంలో పంచాయితీ నిర్వహిస్తుండగా ‘ఇంత జరగడానికి కారణం నువ్వే’అంటూ స్వాతిపై అరవింద్ తల్లి భద్రమ్మ, స్వాతి ఆడపడుచు సైదమ్మ దాడి చేసి కొట్టారు. పదిమంది దూషిస్తూ కొట్టడాన్ని అవమానంగా భావించిన స్వాతి ఇంటికి వెళ్లింది. రేకులరాడ్డుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు భార్య ఉరివేసుకున్న విషయాన్ని గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చే వరకు మృతి చెందింది. కాగా, తనపై కావాలని వాట్సాప్లో తప్పుడు ప్రచారం చేశారని, తాను ఎవరిపట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని పంచాయతీ కార్యదర్శి మంగీలాల్ తెలిపారు. చదవండి: మెదక్లో విషాదం: విద్యార్థులపై దూసుకెళ్లిన ట్రాక్టర్.. ఇద్దరు మృతి నలుగురిపై పోలీసులకు ఫిర్యాదు తన అక్క స్వాతి అవమానభారంతో ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన చింత అరవింద్, చింత భద్రమ్మ, చింత పుల్లయ్య, ఇర్ప సైదమ్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు కల్తి ప్రవీణ్ బయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గార్ల–బయ్యారం సీఐ బాలాజీ తెలిపారు. -
ఇమ్రాన్ ఖాన్ని హత్య చేసేందుకు స్కెచ్...పట్టుబడ్డ ఉద్యోగి
spying attempt on Pakistan’s former Prime Minister: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ని హత్య చేసేందుకు పథకం రచిస్తున్నారంటూ...ఇటీవల పలురకాల వదంతులు వ్యాపించాయి. ఐతే ఆయన పదవీచ్యతుడు కావడంతో ఆయన అభిమానులు, అనుచరులు పుట్టిస్తున్న పుకార్లుగా పాకిస్తాన్ కొట్టిపారేసింది. కానీ అది నిజమే అనేలా ప్రస్తుతం ఖాన్ పై గూఢచర్య ప్రయత్నం జరిగింది. ఈ మేరకు ఒక ఉద్యోగి ప్రధాని ఖాన్ గదిని శుభ్రం చేసే నిమిత్తం వచ్చి అయనపై నిఘా కోసం ఒక రహస్య పరికరాన్ని అమర్చడానికి యత్నించాడు. ఈక్రమంలోనే ఆ ఉద్యోగి పట్టుబడ్డాడు. దీంతో బనిగాలా భద్రతా బృందం సదరు ఉద్యోగిని ఫెడరల్ పోలీసులకు అప్పగించారు. అంతేకాదు పాక్ మాజీ ప్రధాని పరిసర ప్రాంతాలలో భద్రతా ఏజెన్సీలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ప్రమాదం ఉందని పలువురు పీటీఐ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పీటీఐ నాయకుడు షెహబాజ్గిల్ మాట్లాడుతూ..ఈ విషయమై ప్రభుత్వంతో సహా సంబంధిత అన్ని ఏజెన్సీలకు సమాచారం ఇచ్చాం. పట్టుబడిన ఉద్యోగి ఈ రహస్య పరికరాన్ని అమర్చేందకు డబ్బులు ఇచ్చారంటూ కొన్ని కీలక విషయాలు బయటపెట్టాడన్నారు. ఈ చర్య హీనమైనది అంటూ...ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు మానుకోవల్సిందిగా సూచించారు షహబాజ్ గిల్. (చదవండి: మానవాళి భవిష్యత్తు ‘గుట్టు’ నేనే..) -
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ !
Is Senior Actor Naresh Getting Married With Pavithra Lokesh: ప్రేమకు వయసుతో సంబంధం లేదు అనే మాట చాలా సార్లు వింటుంటాం. కానీ అప్పుడప్పుడు కొన్ని సార్లు అది ప్రూవ్ అవుతుంటుంది కూడా. ప్రస్తుతం టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సీనియర్ హీరో, నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీళ్లు చాలా కాలంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో జంటగా కనిపించారు. ఆ పరిచయంతో నిజ జీవితంలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారని భోగట్టా. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి మహాబలేశ్వర్ వెళ్లి ఒక స్వామిజీని దర్శించుకోవడంతో ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త గుప్పుమంది. నటుడు, విజయ నిర్మల తనయుడు నరేశ్ ఇప్పటికే దాదాపుగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారనే టాక్ ఉంది. కానీ తన భార్యలతో మనస్పర్థలు రావడంతో ఆయన విడాకులు ఇచ్చి ఒంటరి జీవితం గడుపుతున్నారు. అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతున్న నరేష్ తనకు ఈ వయసులో ఒక మంచి వ్యక్తి తోడుగా ఉండాలని భావిస్తున్నారని, అందుకే పలు సినిమాల్లో తనతో కలిసి నటించిన పవిత్ర లోకేష్ ని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్ ఇక పవిత్ర లోకేష్ విషయానికి వస్తే ఆమె 2007లో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుచేంద్ర ప్రసాద్ను వివాహం చేసుకుంది. కానీ భర్తతో మనస్పర్థల కారణంగా ఒంటరిగా జీవిస్తోంది. కాకపోతే ఇంకా ఆమెకు చట్టబద్ధంగా విడాకులు రాలేదు. కోర్ట్ త్వరలో విడాకులు మంజూరు అవ్వగానే వీరు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్. అయితే ఈ వార్తను ఇద్దరూ ఖండించకపోవడం, కలిసి నటిస్తుండడం, కలిసి కనిపిస్తుండడంతో ఈ టాక్ మరింతగా పెరిగింది. అయితే ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఒక్క కాలం మాత్రమే. చదవండి: చెత్త ఏరిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్ సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
ఎన్టీఆర్ చిత్రంలో సోనాలి బింద్రే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
Sonali Bendre Reacts On Acting In NTR 30 Movie With koratala Siva: ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూలైలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఇందులో ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించనున్నారని టాక్. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే నటిస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సోనాలిని ఈ విషయం గురించి అడగ్గా స్పందించారు. ఏంటి ? నేనా ? అసలు దాని గురించే నాకు తెలియదు. దయ చేసి దాని గురించి మీరే చెప్పండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు కొంచెం కూడా తెలియదు. నిజంగా అది నేను కాదేమో. ఇవన్ని తప్పుడు వార్తలు. ఒకవేళ అది నిజమైతే నన్ను ఎవరు సంప్రదించలేదు. ఇదంతా ఏదో థ్రిల్లర్లా ఉంది. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు సోనాలి బింద్రే. ప్రస్తుతం సోనాలి బింద్రే ది బ్రోకెన్ న్యూస్ అనే వెబ్ సిరీస్లో జర్నలిస్ట్ అమీనా ఖురేషీ పాత్రలో నటిస్తోంది. వినయ్ వైకుల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జీ5లో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. చదవండి:👇 నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో యాంకర్ గొడవ.. ఏడ్చేసిన కృతి శెట్టి అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్ అలీ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_811248975.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Fact Check: విజయ్, సామ్కు గాయాలు.. నిజమా ? ఇదిగో క్లారిటీ..
Fact Check: Samantha Vijay Devarakonda Injured In Kushi Shooting Is Fake: విజయ్ దేవరకొండ, సమంత జంటగా కలిసి నటించిన చిత్రం 'ఖుషి'. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కశ్మీర్ తొలి షూటింగ్ షెడ్యూల్ను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో పలు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా హీరో విజయ్, సమంతకి గాయలయ్యాయని, ఆ వెంటనే వీరిద్దరినీ సమీప ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై మూవీ పీఆర్ టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పేసింది. 'ఖుషి సినిమా షూటింగ్లో విజయ్ దేవరకొండ, సమంతలకు గాయాలు అయినట్టు కొన్ని వెబ్ సైట్లల్లో వార్తలు వస్తున్నాయి. అందులో ఎలాంటి వాస్తవం లేదు. టీం అంతా సక్సెస్ ఫుల్గా కశ్మీర్లో 30 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకొని నిన్ననే (మే 23) హైదరాబాద్ తిరిగి వచ్చారు. రెండో షెడ్యూల్ అతి త్వరలోనే మొదలు కానుంది. దయచేసి ఎలాంటి పుకార్లు నమ్మొద్దు. అని ఖుషీ పీఆర్ టీమ్ పేర్కొంది. కాగా ‘ఖుషి’ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 23, 2022న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. విజయ్, సామ్కి గాయాలు? Team #Kushi has wrapped up a wondeful first schedule in the exotic and beautiful locales of Kashmir ❤️ Second schedule begins soon!@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @MythriOfficial @HeshamAWMusic pic.twitter.com/IZx3lKCRP0 — GSK Media (@GskMedia_PR) May 24, 2022 -
విజయ్ దేవరకొండతో సమంత లిప్లాక్ సీన్ ?
Rumours: Samantha Lip Lock Scene With Vijay Devarakonda In Kushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటంగా కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ 'ఖుషి'. ప్రేమ కథా చిత్రాలకు మారుపేరైన శివ నిర్వాణ ఈ మూవీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విజయ్-సమంత కలిసి నటిస్తున్నాన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై ఎంతో ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంటెన్స్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్-సామ్ మధ్య ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కథ డిమాండ్ చేయడంతోనే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సీన్స్ క్రియేట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ సన్నివేశాలకు ఉన్న డెప్త్ను అర్థం చేసుకున్న విజయ్-సమంత లిప్లాక్ సీన్లలో నటించేందుకు ఒప్పుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఈ వార్తల్లో ఎంత నిజముందో డైరెక్టర్ క్లారిటీ ఇస్తే గానీ, మూవీ విడుదలయ్యాక కానీ చెప్పలేం. కాగా గత కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కశ్మీర్ బ్యాక్డ్రాప్లో సాగే ప్రేమకథగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ స్టైలిష్గా కనిపించగా, సామ్ సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా ఆకట్టుకుంది. చదవండి: టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్.. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
బ్రేకప్ కాదు.. బ్రేక్ ఇచ్చారంతే.. జంటగా కియారా-సిద్ధార్థ్.. వీడియో వైరల్
Sidharth Malhotra Kiara Advani Back Together After A Break: బీటౌన్లో అప్పటిదాగా జంటగా కలిసి కనిపించిన లవ్ బర్డ్స్, దంపతులు ఒక్కసారిగా విడిపోతున్నారని రూమర్స్ రావడం పరిపాటే. ఇలాంటి సంఘటన ఇటీవల బీటౌన్లో జరిగింది. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా బ్రేకప్ చెప్పుకున్నారన్న వార్తలు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏ ఒక్కరు స్పందించలేదు. తాజాగా ఈ రూమర్స్కు చెక్ పెడుతూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కియారా-సిద్ధార్థ్ విడిపోయారని వార్తలు వచ్చి ఫ్యాన్స్ను షాక్ గురి చేయగా వారు కలిసి చెట్టాపట్టాలేసుకుని కనిపించిన వీడియో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇటీవల సల్మాన్ ఖాన్ నిర్వహించిన ఓ వేడుకలో సిద్ధార్థ్ మల్హోత్రా-కియరా అద్వానీ తళుక్కుమన్నారు. ఒకరొకరు నవ్వుకుంటూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ లోపలికి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఇది చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఒకవైపు రొహిత్ శెట్టి పోలీస్ సిరీస్ కోసం సిద్ధార్థ్ ఇస్తాంబుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు భూల్ భులయా 2 ప్రమోషన్లలో కియరా బిజీగా మారింది. ఈ టైట్ షెడ్యూల్స్ వల్ల వారి మధ్య కొంత బ్రేక్ వచ్చినట్లయింది. ఈ బ్రేక్ వల్లే వారు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయని వారి సన్నిహితులు తెలిపారు. ఇప్పుడు ఈ వీడియోతో వారు చెప్పిందే నిజమని తెలుస్తోంది. చదవండి: సౌత్ ఇండస్ట్రీపై కియారా ఆసక్తికర వ్యాఖ్యలు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ షేర్షాలో కలిసి నటించారు. ప్రమోషన్ల సమయంలో వారి మధ్య సన్నిహిత్యం చూసి వారు లవ్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్యాన్స్. తర్వాత వచ్చిన బ్రేకప్ పుకార్లు అభిమానులను అసంతృప్తికి గురిచేశాయి. చదవండి: ఈ లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారా? అసలేం జరిగిందంటే.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
అదానీకి రాజ్యసభ సీటు?.. క్లారిటీ ఇచ్చిన సంస్థ
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. రాజకీయాల్లోకి రానున్నారా..? ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తున్నారా..? దీనిపై కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అదానీ సంస్థ తరఫున ఓ ప్రకటన విడులైంది. ఏపీ నుంచి గౌతమ్ అదానీ లేదా అతడి భార్య ప్రీతి అదానీలలో ఒకరికి రాజ్యసభ సీటు గ్యారెంటీ అంటూ వస్తున్న వార్తలపై అదానీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేసింది. గౌతమ్ అదానీకి గానీ, అతడి భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం అదాని సంస్థ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అదానీ ఫ్యామిలీలో ఎవరికీ రాజకీయాల మీద ఆసక్తి లేదని, ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని సంస్థ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫేక్ వార్తలకు అదాని చెక్ పెట్టారు. Media Statement on false news about Rajya Sabha Seat pic.twitter.com/GK4y3uIWGL — Adani Group (@AdaniOnline) May 14, 2022 -
అందుకే నాకింకా పెళ్లి కావట్లేదు : కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఏం చేసినా, ఏం చెప్పినా అది సెన్సేషన్ అవుతుంది. తాజాగా తన పెళ్లిపై కంగనా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవలె కాంట్రవర్సీ లాకప్ షోను కంప్లీట్ చేసిన కంగనా త్వరలోనే ధాకడ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె ఏజెంట్ అగ్ని అనే గూడఛారి పాత్ర పోషించింది. చదవండి: షారుక్ ఖాన్తో విభేదాలపై స్పందించిన కాజోల్ భర్త మూవీ ప్రమోషన్స్లో భాగంగా కంగనా సిద్ధార్థ్ కన్నన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మీరు నిజజీవితంలో కూడా టామ్ బాయ్ మాదిరే ఉంటారా అని ప్రశ్నించగా.. 'నిజజీవితంలో నేను ఎవరిని కొట్టాను చూపించండి.. మీరు ఇలాంటి పుకార్లు సృష్టించడం వల్లే నాకింకా పెళ్లి కావడం లేదు. నేను ఊరికే అందరితో గొడవ పడతానేమో అని జనాలు అనుకుంటున్నారు' అంటూ నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలోఎ వైరల్గా మారాయి. చదవండి: 'ఆట' డ్యాన్స్ షో విన్నర్ టీనా కన్నుమూత -
Vladimir Putin: క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం?
రష్యాకు హెచ్చరికలు.. పాశ్చాత్య దేశాలకు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిహెచ్చరికల నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధం కీలక మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో.. పుతిన్ ఆరోగ్యం మీద సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మొదయ్యాక రష్యా అధ్యక్షుడు పుతిన్(69) వ్యక్తిగత జీవితంతో పాటు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే.. యుద్ధం తారాస్థాయికి చేరుతున్న తరుణంలో పుతిన్ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోందన్న పుకార్లు సుడులు తిరుగుతున్నాయి. ఈమధ్యకాలంలో పుతిన్ పాల్గొన్న సమావేశాలు, హాజరైన బహిరంగ ర్యాలీలను అందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. పుతిన్ తాజా ఫొటోలు, వీడియో ఫుటేజీల ఆధారంగా.. పుతిన్ బాడీ లాంగ్వేజ్లో తీవ్రమైన మార్పులు వచ్చాయనేది ఆరోగ్య నిపుణులు చెప్తున్నమాట. ఎక్కువ సేపు నిల్చోలేకపోతుండడం, ఆయన చేతులు వణుకుతుండడం, ఆయాస పడుతుండడం, అలాగే ఆయన ముఖం ఏదో ఒక రకమైన కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు కనిపిస్తుందని వాదిస్తున్నారు. అంతేకాదు.. ఒలింపిక్ అథ్లెట్స్ను గౌరవించే ఓ కార్యక్రమంలో పుతిన్ పాల్గొనగా.. ఆ ఈవెంట్ ఫొటోల ఆధారంగా శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చాయని న్యూయార్క్ పోస్ట్ సైతం ఓ కథనం ప్రచురించింది. బెలారస్ అధ్యక్షుడితో భేటీ సందర్భంలోనూ.. పుతిన్ టేబుల్ను సపోర్ట్గా పట్టుకోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ పుతిన్ ఆరోగ్యంపై కథనం ప్రచురించింది న్యూస్ వీక్. ఇదిలా ఉంటే.. వైట్హౌజ్ మాత్రం రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై స్పందించేందుకు నిరాకరిస్తోంది. ఇదంతా పాశ్చాత్యదేశాల కల్పిత కథనాలంటూ క్రెమ్లిన్ కొట్టిపాడేస్తుండగా.. వయసు పైబడుతున్న పుతిన్లో పార్కిసన్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కొందరు నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. dictators can be brutal they can be capricious but they can’t be weak serious problem for putin pic.twitter.com/OGFejK09i9 — ian bremmer (@ianbremmer) April 22, 2022 View this post on Instagram A post shared by Cosmetic doctor in Sydney (@drjakesloane) -
ఆ వెబ్ సిరీస్ చూసి గర్ల్ఫ్రెండ్పై హృతిక్ రోషన్ వ్యాఖ్యలు..
Hrithik Roshan Praises Saba Azad Acting In Rocket Boys Web Series: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్ఫ్రెండ్ సబా ఆజాద్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల నెటిజన్స్ను అలరిస్తోన్న మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ 'రాకెట్ బాయ్స్'. సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ వెబ్ సిరీస్.. ప్రఖ్యాత భారతీయ సైంటిస్టులు హోమీ జె. బాబా, విక్రమ్ సారాబాయ్ జీవితాలకు సంబంధించిన కథగా తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ను పొగుడ్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు హృతిక్ రోషన్. 'మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొత్తం టీం వర్క్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇండియాలోని మనవాళ్లే ఇది చేశారంటే గర్వంగా ఉంది.' అని రాసుకొచ్చాడు. చదవండి: నా కొడుకు హృతిక్ రోషన్లా ఉండాలి.. కానీ: స్టార్ హీరోయిన్ ఈ రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్లో హృతిక్ రూమర్డ్ గర్ల్ఫ్రెండ్ సబా ఆజాద్ నటించింది. తన నటనను మెచ్చుకుంటూ ప్రశంసించాడు హృతిక్. సబా ఆజాద్ గురించి 'నేను చూసిన అత్యుత్తమ నటులలో మీరు ఒకరు. మీరు నాకు స్ఫూర్తినిస్తున్నారు.' అంటూ కితాబిచ్చాడు ఈ బాలీవుడ్ గ్రీక్ గాడ్. అలాగే ఈ వెబ్ సిరీస్లో సౌత్ బ్యూటీ రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4, 2022 నుంచి ప్రసారం అవుతోంది. చదవండి: రెండో పెళ్లికి సిద్ధమంటున్న హృతిక్.. ఆమెతోనే ఏడడుగులు? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ స్టార్ హీరో గే అంటూ ట్రోలింగ్.. అలాగే ఉంటాడన్న భార్య
Hugh Jackman Wife Deborra Reacts To Rumours About His Sexuality: హాలీవుడ్లో 'ఎక్స్ మెన్' చిత్రాలతో సూపర్ పాపులర్ అయిన స్టార్ హీరో హ్యూ జాక్మన్. ఇటీవల ఈ హీరో స్వలింగ సంపర్కుడని ట్రోలింగ్కు గురయ్యాడు. హ్యూ జాక్మన్ ఒక గే అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ విషయంపై అతని భార్య, నటి, డైరెక్టర్, చిల్డ్రన్ లాయర్ డెబోరా లీ ఫర్నెస్ క్లారిటీ ఇచ్చింది. 'ఇది చాలా వెర్రి (సిల్లీ), విసుగు తెప్పించే విషయం. ప్రజలు ఇలా ఎలా మాట్లాడతారు ? పత్రికలు కూడా ఇలాంటివి పబ్లిష్ చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది. వారు అమ్ముతున్నది ఒక చెత్త. ప్రజలు ఎప్పుడూ ఇలాంటి వార్తలు చదువుతారనే అలా రాసుకొస్తారు. ఇలాంటి వార్తలతో మీ పత్రికలు ఎక్కువ అమ్ముడుపోయి, మీకు మంచి అనుభూతి కలుగుతుంది కదా. కానీ మీరు ఒకరి దుఃఖాన్ని విక్రయిస్తున్నారు.' అని హ్యు జాక్మన్ గురించి తప్పుగా ప్రచురించిన మ్యాగజైన్స్పై విరుచుకుపడింది. చదవండి: అమ్మాయిపై దాడి.. రెండోసారి అరెస్టయిన హీరో.. హ్యూ జాక్మన్, డెబోరా 1996లో వివాహం చేసుకున్నారు. వారికి ఆస్కార్ మాక్సిమిలియన్ జాక్మన్, అవా ఎలియట్ జాక్మన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్యుూ జాక్మన్ స్వలింగ సంపర్కుడనే పుకార్లపై హ్యూ జాక్మన్ చమత్కారంగా స్పందించాడని డెబోరా తెలిపింది. ఒకవేళ అతను గే అయితే హీరో బ్రాడ్పిట్తో డేటింగ్ చేసేవాడినని చెప్పాడని డెబోరా పేర్కొంది. 'అతను స్వలింగ సంపర్కుడైతే అలాగే ఉంటాడు. ఈ విషయాన్ని అతనికి దాచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా లేదు. అతను బ్రాడ్పిట్తో లేదా ఇంకేవరితో అయినా డేటింగ్ చేస్తాడు.' అని డెబోరా పేర్కొంది. వీరిద్దరూ 1995లో ఆస్ట్రేలియన్ టీవీ సిరీస్ కొరెల్లి సెట్లో కలుసుకున్నారు. నాలుగు నెలల డేటింగ్ తర్వాత డెబోరా ఫర్నెస్కు హ్యూ జాక్మన్ మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. చదవండి: ఇప్పటికే 9 మంది భార్యలు, మరో ఇద్దరు కావాలట.. ఆ కోరిక తీర్చుకోవాలట పుట్టినరోజుకు 2 రోజుల ముందు చనిపోయిన పాపులర్ నటి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_771247577.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కత్రీనా కైఫ్ ప్రెగ్నెంట్ ? నెట్టింట వీడియో వైరల్..
Is Katrina Kaif Pregnant Rumours On Her Airport Look Video Viral: సోషల్ మీడియాలో నెటిజన్ల ఫోకస్ సాధారణంగానే ఎక్కువ ఉంటుంది. ఇక సినీ తారలపై అయితే వారి ఫోకస్ ఒక్కోసారి సైంటిస్ట్లను తలపించేలా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి కాలుకు వేసుకున్న ఫుట్వేర్ వరకు నిశితంగా పరిశీలించి ట్రోలింగ్ చేయడమో, బాగుంటే ప్రశంసించడమో చేస్తుంటారు నెటిజన్స్. ఇలా సెలబ్రిటీల మిస్టేక్లను కనిపెట్టిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా వీరి ఫోకస్ బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్పై పడింది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగుతోంది. ఇటీవలే హీరో విక్కీ కౌశల్ను వివాహం చేసుకున్న కత్రీనా కైఫ్ పలు వెకేషన్స్కు వెళ్లిన విషయం తెలిసిందే. తమ జీవితంలో జరిగే ప్రతీ చిన్న ఆనందాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటోంది ఈ జంట. తాజాగా కత్రీనా కైఫ్ ఎయిర్పోర్టులో దర్శనమిచ్చింది. ఆమె ఎయిర్పోర్టులో కనిపించిన వీడియోను ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కత్రీనా ప్రెగ్నెంట్ అయిందని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. చదవండి: కత్రీనా పెళ్లిపై సల్మాన్ ఖాన్ రియాక్షన్.. కమిటెడ్ అని హింట్ ! నెటిజన్లలో ఒకరు 'ఓరీ దేవుడా.. ఆమె ప్రెగ్నెంట్లా ఉంది' మరొకరు 'త్వరలో ఆమె తల్లి కాబోతుంది. కత్రీనా పాపను చూడాలని ఎంతో ఆతృతగా ఉంది', 'కత్రీనా నిజంగా ప్రెగ్నెంటా ? లేకుంటే తను ధరించిన డ్రెస్ వల్ల అలా అనిపిస్తుందా. ఏదైతేనే తను చాలా అందంగా ఉంది' అని ఆ వీడియోకు రిప్లై ఇస్తున్నారు. మరీ ఈ కామెంట్స్పై కత్రీనా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. చదవండి: కత్రీనా పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
విక్ట్రీనా బాటలోనే అలియా-రణ్బీర్?, ఆ సెంటిమెంట్తో పెళ్లి!
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియా భట్-రణ్బీర్ కపూర్ల పెళ్లి ఎప్పుడెప్పుడాని ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020 డిసెంబర్లో జరగాల్సి వీరి వివాహం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఎంతో కాలంగా డేటింగ్లో ఉన్న ఈ జంజ పెళ్లికి ఇరు కటుంబాలు సైతం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చాయి. దీంతో ఇంకేందుకు వీరు ఆలస్యం చేస్తున్నారని ఓ వర్గం ఫ్యాన్స్ అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా అలియా-రణ్బీర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వినిపిస్తుండగా.. ఇప్పటికే వారి పెళ్లి అయిపోయిందంటూ ఫేక్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: నిహారికపై వస్తున్న వార్తలపై నాగబాబు స్పందన.. దీంతో వీరి పెళ్లిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏప్రిల్ రణ్బీర్-అలియా పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యిందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ మాదిరిగా వీరు కూడా పెళ్లి విషయంలో గొప్యత పాటిస్తున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏప్రిల్లో వీరిద్దరూ పెళ్లి పీటల ఎక్కడం ఖాయమనే వార్తలు బీ-టన్లో బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరి పెళ్లి ఓ సెంటిమెంట్ ప్లేస్లో జరుగుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యిందట. అలియా-రణ్బీర్లు డెస్టినేషన్ వెడ్డింగ్ కాకుండా తమ ఫ్యామిలీ సెంటిమెంట్కి ప్రాధాన్యత ఇస్తూ పెళ్లి వేడుకను జరపుకొనున్నారట. ఇక కపూర్ వంశానికి చెందిన పురాతన వారసత్వ నివాసం ఆర్కే హౌస్లో రణ్బీర్- ఆలియా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా కపూర్ కుటుంబ సభ్యులు ముంబైలోని ఆర్కే హౌస్ను సెంటిమెంట్గా భావిస్తుంటారు. అంతేకాదు రణ్బీర్ తల్లిదండ్రులు రిషి కపూర్, నీతూ కపూర్ల పెళ్లి కూడా అక్కడే జరిగిందట. చదవండి: డ్రగ్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు: నటి హేమ ఈ క్రమంలోనే రణ్బీర్ పెళ్లి కూడా అక్కడే జరిపించాలని కపూర్ ఫ్యామిలీ అనుకుంటుందట. అందుకే ఎలాంటి డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేసుకొకుండా కుటుంబ సభ్యుల సెంటిమెంట్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ లవ్ బర్డ్స్ తమ వివాహన్ని ఆర్కే హౌజ్లో కొద్దిమంది సన్నిహితులు, బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. కాగా రణ్బీర్-అలియా తొలిసారి జంటగా నటించిన బ్రహ్మస్త్ర తొలి పార్ట్ షూటింగ్ రీసెంట్గా పూర్తయ్యింది. దీంతో ఈ లవ్బర్డ్స్పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలనుకుంటున్నారని బీ-టౌన్లో చర్చించుకుంటున్నారు. -
నేను కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశించా.. కానీ: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లు తన ఫోటోలు మార్ఫింగ్ చేసి ట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్మీడియలో తనపై చేస్తున్న అసత్య ప్రచారాలను జగ్గారెడ్డి ఖండించారు. కొందరు కావాలనే తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తాను కూడా పీసీసీ చీఫ్ పదవి ఆశించానని, అయితే రాహుల్తో పోట్లాడే స్థాయి తనది కాదని అందుకు మౌనంగా ఉన్నట్లు చెప్పారు. తన పంచాయితీ రేవంత్తో మాత్రమేనని కాంగ్రెస్తో కాదని చెప్పారు. అందర్నీ కలుపుకుని పోయే తత్వం రేవంత్కు ఉందా అని ప్రశ్నించాడు. 20 రోజుల క్రితం రేవంత్ ఫోన్ చేశారని, మెదక్ సీఎస్ఐ చర్చికి వెళ్తన్నట్లు చెప్పినట్లు తెలిపారు. కానీ దామోదర రాజనర్సింహతో మరో రకంగా చెప్పారని అన్నారు.