rumours
-
ఇన్స్టాలో పికిల్ బాల్ టోర్నీ ఫోటోలు షేర్ చేసిన సామ్
-
వ్యాపారవేత్తతో యానిమల్ బ్యూటీ.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
యానిమల్ మూవీతో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ త్రిప్తి డిమ్రీ. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరెకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ నటించారు. అతని సరసన పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించింది. 2023లో వచ్చిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్గా నిలిచింది. ఇదిలా ఉండగా.. గతేడాది బ్యాడ్ న్యూజ్, విక్కీ విద్యా కా వో వాలా వీడియో చిత్రాల్లో కనిపించిన త్రిప్తి డిమ్రీ ప్రస్తుతం ధడక్-2లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ చతుర్వేది సరసన కనిపించనుంది. ఇదిలా ఉండగా యానిమల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ తన ఇన్స్టాలో స్టోరీస్ బర్త్ డే విషెల్ చెబుతూ పోస్ట్ చేసింది. "హ్యాపీ బర్త్డే సామ్ మర్చంట్, మీకు అందరి ప్రేమ, ఆనందాన్ని దక్కాలని కోరుకుంటున్నా " అని రాసుకొచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త సామ్ మర్చంట్కు ఇన్స్టా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. అతనితో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు త్రిప్తి డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కొంతకాలంగా సామ్ మర్చంట్, త్రిప్తి డిమ్రీ డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ అతని బర్త్ డే రోజును విష్ చేయడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా నోరు విప్పలేదు.సామ్ మర్చంట్ ఎవరంటే?వాస్తవానికి సామ్ మర్చంట్ హోటల్ వ్యాపారం చేస్తున్నారు. హాస్పిటాలిటీ పరిశ్రమలోకి రాకముందు అతను మోడల్గా రాణించాడు. ఆ తర్వాత అతను గోవాలోని లగ్జరీ బీచ్ క్లబ్లు, హోటళ్ల బిజినెస్లో అడుగుపెట్టాడు. ప్రస్తుతం అతను వ్యాపారం చేయడంతో పాటు ట్రావెల్ బ్లాగర్గా రాణిస్తున్నారు.ఇక త్రిప్తి డిమ్రీ విషయానికొస్తే.. ఆమె చివరిగా భూల్ భూలయ్యా -3లో కార్తీక్ ఆర్యన్తో కలిసి కనిపించింది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ నటించిన ఈ హారర్-కామెడీ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఆమె తర్వాత షాహిద్ కపూర్తో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కనిపించనుంది. -
నేను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు
-
విడాకుల ప్రచారంపై ఒబామా రియాక్షన్ ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కారు. సతీమణి మిషెల్లీ నుంచి ఆయన విడిపోబోతున్నట్లు ఆ వార్తల సారాంశం. అందుకు గత కొంతకాలంగా మీడియా ముఖంగా కనిపించిన సందర్భాలే కారణం. కచ్చితంగా హాజరు కావాల్సిన కార్యక్రమాలకు కూడా ఈ ఇద్దరూ జంటగా కనిపించకపోవడమే విడాకులు రూమర్లకు బలం చేకూర్చింది. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ జంటగా ఎక్కడా మీడియా కంటపడలేదు. పైగా జనవరి 9వ తేదీన జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు, వాళ్ల వాళ్ల సతీమణులంతా(మాజీ ప్రథమ మహిళలు) హాజరయ్యారు. అయితే ఒబామా(Obama) మాత్రం ఒంటరిగానే ఆ ఈవెంట్కు హాజరయ్యారు. దానికి కొనసాగింపుగా.. జనవరి 20వ తేదీన వైట్హౌజ్(White House)లో జరగబోయే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష స్వీకరణ కార్యక్రమానికి తాను హాజరు కావట్లేదని తన కార్యాలయం నుంచి మిషెల్లీ ఒక ప్రకటన విడుదల చేయించారు. అయితే ఆ ఈవెంట్కు ఒబామా ఒంటరిగానే హాజరవుతారనే కథనాలు ఒక్కసారిగా విడాకుల అంశాన్ని తెరపైకి తెచ్చాయి.There are strong rumors circulating about a possible divorce between Michelle "Big Mike" Obama and Barack Obama. Speculation is growing as Michelle has already missed Jimmy Carter’s funeral and will once again be skipping Donald Trump’s upcoming inauguration, which Barack will… pic.twitter.com/qP3V7jqh14— Shadow of Ezra (@ShadowofEzra) January 16, 2025 I think Barack and Michelle Obama are heading for divorce. His letters talking about how he fantasizes about sex with men "every day" had to be the icing on the cake for her. What woman wants to deal with that, especially in the public eye?— Freedom Party! (@DavidJo1960) January 14, 2025వీళ్ల వ్యక్తిగత జీవితంపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో గత ఐదారు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. ఈ లోపు సందర్భం రావడంతో ఈ రూమర్స్కు తనదైన శైలిలో స్పందించారు ఒరాక్ ఒబామా. జనవరి 17వ తేదీన మిషెల్లీ(Michelle) పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.నా ప్రేమ జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రొమాంటిక్ ఫోజులో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసి లవ్ యూ అంటూ సందేశం ఉంచారాయన. దానికి అంతే స్పీడ్గా లవ్ యూ హనీ.. అంటూ మిషెల్లీ ఒబామా బదులిచ్చారు. తద్వారా విడాకుల రూమర్స్కు ఒకేసారి ఇద్దరూ చెక్ పెట్టారన్నమాట.Happy birthday to the love of my life, @MichelleObama. You fill every room with warmth, wisdom, humor, and grace – and you look good doing it. I’m so lucky to be able to take on life's adventures with you. Love you! pic.twitter.com/WTrvxlNVa4— Barack Obama (@BarackObama) January 17, 2025చికాగోలో ఓ పంప్ ఆపరేటర్-గృహిణి దంపతులకు జన్మించారు మిషెల్లీ. ఓ లా కంపెనీలో ఒబామా-మిషెల్లీ తొలిసారి కలుసుకున్నారు. మూడేళ్ల తర్వాత తమ ప్రేమను బయటపెట్టుకుని.. వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుళ్లు మలియా(23),సాషా(23). అమెరికా హైప్రొఫైల్ జంటల్లో.. వన్ ఆఫ్ ది ‘ఆదర్శ జంట’గా వీళ్లకు పేరుంది. గతంలో చాలా సందర్భాల్లో ఈ జంట తమ వైవాహిక జీవితం గురించి సరదాగా చర్చించేవారు. Happy anniversary, @MichelleObama! 32 years together, and I couldn’t have asked for a better partner and friend to go through life with. pic.twitter.com/04t41YYfN6— Barack Obama (@BarackObama) October 3, 2024అయితే ఒక్కోసారి ఆయన వ్యవహార శైలి చిరాకు తెప్పించేదని.. ఆ కోపంతో ఆయన్ని బయటకు విసిరేయాలన్నంత కోపం వచ్చేదని మిషెల్లీ ఓ పాడ్కాస్ట్లో సరదాగా మాట్లాడడం చూసే ఉంటారు. అయితే ఎన్ని కష్టకాలమైనా.. ఆమె తన వెంటే నడిచిందని, బహుశా ఆ ప్రేమే జీవితాంతం ఆమె వెంట ఉండేలా తనను చేస్తోందంటూ ఒబామా కూడా అంతే సరదాగా బదులిచ్చేవారు. ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో తొలిసారి! -
ఆ హీరోయిన్తో ప్రేమ.. అసలు విషయం బయటపెట్టిన సురేశ్!
టాలీవుడ్ సీనియర్ నటుడు సురేశ్(Suresh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో ఒక నటుడిగా, విలన్గా పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్లో దాదాపు 270కి పైగా సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను తెరకెక్కించారు.ఒకప్పుడు టాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉన్న నటుడు సురేశ్. మొదట్లో హీరోగా, తర్వాత విలన్గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఇతడు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. ఒకప్పుడు ఏడాదికి ఐదారు సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. గతంలో.. నాగార్జున, అరవింద్ స్వామి, అజిత్ వంటి పలువురు స్టార్లకు తన గొంతు అరువిచ్చాడు కూడా. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సురేశ్ ఆయన తమిళంలో కూడా సత్తా చాటారు. అటు బుల్లితెరపై సీరియల్స్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సురేశ్ తన కెరీర్లో జరిగిన సంఘటనలపై మాట్లాడారు. ముఖ్యంగా మరో నటి, అత్తారింటికి దారేది చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నదియా(Nadiya) గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో హీరోయిన్గా ఉన్న నదియాతో సురేశ్ లవ్లో ఉన్నారని వినిపించాయి కదా? దీనిపై మీరేమంటారు? అని ప్రశ్నంచిగా ఆయన క్లారిటీ ఇచ్చారు.(ఇది చదవండి: వేరే పెళ్లి చేసుకున్నా అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లోనే ఉంటా!)ఈ విషయంపై సురేశ్ మాట్లాడుతూ..'అలాంటిదేం లేదు. నదియా నా బెస్ట్ ఫ్రెండ్, ఆమెతోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. ఆమె బాయ్ఫ్రెండ్ పేరు కూడా దాదాపుగా నా పేరు లాగే ఉండేది. నదియా బాయ్ఫ్రెండ్ పేరు శిరీశ్. తను షూటింగ్ సమయంలో ఎక్కువ సమయం శిరీశ్తోనే ఫోన్ మాట్లాడేది. అది చూసి అందరూ నాతోనే మాట్లాడేవారని అనుకునేవారు. కానీ తర్వాత నదియా అతన్ని పెళ్లి చేసుకుంది. నదియా నాకు సిస్టర్తో సమానం. తాను సినిమాలో సాఫ్ఠ్గా ఉన్నప్పటికీ.. నాతో మాత్రం కాస్తా గట్టిగానే మాట్లాడుతుంది. తను జీవితంపై ఫుల్ క్లారిటీతో ఉండేది. సినిమాల్లో నటిస్తూనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పేది. ఆ తర్వాత కూడా మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది' అని అన్నారు.తామిద్దరం ఇప్పటికీ స్నేహితులుగానే ఉన్నామని సురేశ్ అన్నారు. మా 1980 నటీనటులకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని ఆయన అన్నారు. ఆ వాట్సాప్ గ్రూప్లో రజనీకాంత్ సర్ కూడా ఉన్నారని సురేశ్ వెల్లడించారు.సురేశ్ సినీప్రస్థానం..ఏపీలోని శ్రీకాళహస్తిలో జన్మించిన సురేశ్ తమిళ చిత్రంతోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 1981లో పన్నీర్ పుష్పంగల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో రామదండు అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వందలకు పైగా సినిమాల్లో నటించారు. ఆయన కెరీర్లో పలు చిత్రాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. తెలుగులో జిన్నా, స్పై చిత్రాల్లో కనిపించిన సురేశ్.. చివరిసారిగా రివైండ్ అనే మూవీలో నటించారు. కాగా.. హరితా రెడ్డిని పెళ్లాడిన సురేశ్.. ఆ తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత సురేశ్ రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శక రచయిత్రి రాశిని ఆయన పెళ్లాడారు. -
ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్!
ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లాడింది. దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట జూన్లో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తోంది బాలీవుడ్ భామ. దీంతో నెటిజన్స్ ఆమె డ్రెస్సింగ్ స్టైల్ను చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోనాక్షి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ కూడా తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది సోనాక్షి. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది. తాను ప్రస్తుతం గర్భవతిని కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మేమిద్దరం సరదాగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నామని చెప్పింది. పెళ్లి తర్వాత తాను కొంత బరువు పెరగడంతో పాటు లావుగా కనిపిస్తున్నట్లు వెల్లడించింది. అందువల్లే తనను గర్భవతి అంటూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారని వివరించింది. ప్రస్తుతం తామిద్దరం వేకేషన్ ఎంజాయ్ చేస్తున్నామని సోనాక్షి తెలిపింది.కాగా.. తన భర్త బర్త్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్. డిసెంబర్ 10న జరిగిన జహీర్ ఇక్బాల్ పుట్టిన రోజు వేడుకలో సోనాక్షి తండ్రి శతృఘ్న సిన్హా కూడా హాజరయ్యారు. ఈ ఏడాది జూన్ 23న ఒక ప్రైవేట్ వేడుకలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు, సన్నిహితులు హాజరయ్యారు. వీరిద్దరి రిసెప్షన్ వేడుకలో రేఖ, సల్మాన్ ఖాన్, అదితి రావ్ హైదరీ, హుమా ఖురేషి, ఆదిత్య రాయ్ కపూర్ పాల్గొన్నారు. -
టీమిండియా స్టార్ సిరాజ్పై రూమర్లకు కారణం ఈ ఫొటోలే! (ఫొటోలు)
-
బిగ్బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!
టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్కు ఐపీఎల్ మెగా వేలం-2025లో భారీ మొత్తమే దక్కింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని వదిలేసినా.. గుజరాత్ టైటాన్స్ పట్టుబట్టి మరీ కొనుగోలు చేసింది. రూ.12.25 కోట్లు వెచ్చించి సిరాజ్ను సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది అతడు టైటాన్స్ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.ఇదిలా ఉంటే.. సిరాజ్ వ్యక్తిగత విషయానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్గా మారింది. బాలీవుడ్కు చెందిన ఓ నటితో అతడు డేటింగ్ చేస్తున్నాడనేది దాని సారాంశం. సదరు నటి పేరు మహీరా శర్మ అని, ఆమె హిందీ బిగ్బాస్ 13 కంటెస్టెంట్ అని సమాచారం.రూమర్లకు కారణం ఇదే!అయితే, సిరాజ్ గురించి ఇలాంటి వదంతులు పుట్టుకురావడానికి కారణం మాత్రం మహీరా ఇన్స్టా పోస్టులు. మహీరా తాను బ్లాక్ కలర్ డ్రెస్తో గ్లామరస్ లుక్లో కనిపిస్తున్న ఫొటోలను షేర్ చేయగా.. సిరాజ్ వాటిని లైక్ చేశాడు. లైక్ కొట్టినంత మాత్రానఅంతే.. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్లతో వీరిద్దరి పేర్లను ముడిపెట్టి గాసిప్రాయుళ్లు తమకు నచ్చిన రీతిలో కథనాలు అల్లేస్తున్నారు. దీంతో సిరాజ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. లైక్ కొట్టినంత మాత్రాన ఇలాంటి అసత్యపు ప్రచారం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. క్రికెట్కు- బాలీవుడ్కు విడదీయరాని అనుబంధంకాగా క్రికెట్కు- బాలీవుడ్కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నాటి క్రికెటర్ పటౌడీ అలీఖాన్ నుంచి జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వరకు బాలీవుడ్ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు.గతంలో వీరిపై కూడా ఇలాంటి ప్రచారమేఇక భారత ఆల్రౌండర్, వేలంలో రూ. 23.75 కోట్లతో(కేకేఆర్) జాక్పాట్ కొట్టిన వెంకటేశ్ అయ్యర్ కూడా సిరాజ్ మాదిరే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. టాలీవుడ్ నటి ప్రియాంక జువాల్కర్ ఫొటోలకు లైక్ కొట్టినందుకు వచ్చిన చిక్కు అది. అయితే, ఇటీవలే అతడు పెళ్లి చేసుకోవడంతో రూమర్లకు చెక్ పడింది. శుబ్మన్ గిల్- సారా అలీఖాన్ల పేర్లు కూడా ఇలాగే వైరల్ అయ్యాయి.అంతేకాదు.. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి గతంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. నటి అనుపమా పరమేశ్వరన్ పేరుతో అతడిని ముడిపెట్టగా.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్ను పెళ్లాడిన బుమ్రా.. వదంతులు వ్యాప్తి చేసేవారి నోళ్లు మూయించాడు.ఆస్ట్రేలియా పర్యటనలోఇదిలా ఉంటే.. సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియాతో అక్కడికి వెళ్లాడు. ఇక ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కెప్టెన్గా వ్యవహరించిన బుమ్రా.. జట్టుకు భారీ విజయం అందించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 295 పరుగుల తేడాతో గెలిచి ఆసీస్ గడ్డపై అతిపెద్ద విజయంతో చరిత్ర సృష్టించింది. ఈ టెస్టులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2025: ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, పృథ్వీ షా..! View this post on Instagram A post shared by Tellychakkar Official ® (@tellychakkar) -
అక్కినేని హీరోతో పెళ్లి.. ఆ వార్తలపై స్పందించిన మీనాక్షి చౌదరి
ఇటీవల లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ మీనాక్షి చౌదరి. మరో మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది.ఇటీవల వరంగల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెకానిక్ రాకీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇటీవల సుశాంత్ను మీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు గుంటూరు కారం భామను ప్రశ్నించారు.దీనికి మీనాక్షి చౌదరి స్పందిస్తూ..'అదంతా ఫేక్. నేను పెళ్లి చేసుకోవడం లేదు. గతనెల కూడా ఒక రూమర్ వచ్చింది. ఓ తమిళ నటుడి కుమారుడిని పెళ్లి చేసుకుంటున్నట్లు రాశారు. ప్రతినెల నాపై ఏదో ఒక రూమర్ వస్తోంది. అలాగే ఇప్పుడు నా పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రస్తుతానికి నేను సింగిల్. ఇప్పుడైతే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని అన్నారు. కాగా.. మెకానిక్ రాకీలో మరో హీరోయిన్గా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో మెప్పిస్తున్న ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. తాజాగా మరో ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది. -
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల పుకార్లకు చెక్..
-
'క' ఓటీటీ రిలీజ్పై రూమర్స్.. నిర్మాణ సంస్థ క్లారిటీ
గత వారం థియేటర్లలో రిలీజైన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చింది. తర్వాత అది హిట్ టాక్గా మారింది. అన్ని చిత్రాలకు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కిరణ్ అబ్బవరం 'క' మూవీనే దీపావళి విన్నర్గా తేలింది.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)థియేటర్లలో సక్సెస్ఫుల్ ఆడుతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అప్పుడే సోషల్ మీడియాలో తెగ రూమర్స్ వచ్చేస్తున్నాయి. నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయిపోతుందనే పోస్టులు ఎక్కువగా కనిపించాయి. ఈటీవి విన్ ఓటీటీలోకి వస్తుందని తెగ హడావుడి చేస్తున్నారు.ఇప్పుడు ఈ పుకార్లపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చేసింది. 'క' మూవీని థియేటర్లలోనే చూడండి. ఇప్పట్లో ఓటీటీలోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నట్లు ట్వీట్ చేసింది. సినిమా బాగుందనే టాక్ వచ్చినప్పుడు ఈ రూమర్స్ రావడం పర్లేదు. కానీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది కూడా వైరల్ చేసేయడం చేజేతులా వసూళ్లని అడ్డుకున్నట్లే. మరి ట్వీట్ చేసినట్లు నిర్మాత మాట మీద నిలబడతారో లేదో చూడాలి?(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?)#KA We are not coming to OTT any time soon..we want you all to experience our movie in theatres only. Please discard any fake news in this regards— srichakraas entertainments (@srichakraas) November 6, 2024 -
దివాళీ పార్టీలో మెరిసిన హీరోయిన్.. ప్రెగ్నెన్సీపై క్రేజీ కామెంట్స్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ప్రస్తుతం కుటుంబంతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ భర్తతో కలిసి దిపావళీ పార్టీలో తళుక్కున మెరిసింది. ముంబయిలో జరిగిన దివాళీ బాష్లో అనార్కలీ సూట్ ధరించి కనిపించింది. ఇద్దరు కలిసి తమ పెట్ డాగ్తో ఫోటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. గెస్ దిస్ అంటూ సోనాక్షి క్యాప్షన్ కూడా ఇచ్చింది.ఇది చూసిన నెటిజన్స్ సోనాక్షి సిన్హాను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోనాక్షి బేబీ బంప్తో ఉందంటూ ఇన్స్టాలో రిప్లై ఇస్తున్నారు. తన భర్త జహీర్ ఇక్బాల్తో కలిసి త్వరలోనే మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు ఏకంగా కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ గురించి ఇప్పటి వరకు సోనాక్షి నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.(ఇది చదవండి: పెళ్లి జరిగిన ఇంటిని అమ్మేస్తున్న స్టార్ హీరోయిన్)కాగా.. ఈ ఏడాది జూన్ 23న హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. వీరి పెళ్లి వేడుక ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న సోనాక్షి అపార్ట్మెంట్లోనే జరిగింది. మరోవైపు సోనాక్షి ది బుక్ ఆఫ్ డార్క్నెస్లో అనే చిత్రంలో కనిపించనుంది. View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) -
భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జయం రవి విడాకుల తర్వాత తనపై వచ్చిన రూమర్స్పై తొలిసారి స్పందించారు. ఈ విషయంలో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.జయం రవి మాట్లాడుతూ.. 'మేము పబ్లిక్ డొమైన్లో ఉన్నాం. నేను బయట టీ తాగినా..ఏ చేసినా తెలిసిపోతుంది. ఎందుకంటే మేము సినిమా వ్యక్తులం. మమ్మల్ని ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. వారి అభిప్రాయాలు కూడా వెల్లడిస్తుంటారు. మేమైతే వాటిని అడ్డుకోలేం కదా. కొంతమంది పరిణితి చెందిన వారు ఇలాంటి రూమర్స్ను పట్టించుకోరు. పరిపక్వత లేని కొద్దిమంది మాత్రమే రూమర్స్ వ్యాప్తి చేయడం చేస్తుంటారు. కొంతమంది ఆ విషయంలో ఉన్న తీవ్రత అర్థం చేసుకోకుండా మాట్లాడతారు. కానీ నా గురించి నాకు పూర్తిగా తెలిసినప్పుడు ఇలాంటి వాటి గురించి తెలుసుకుని ఎందుకు బాధపడతాం' అని అన్నారు.(ఇది చదవండి: మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదు: ఆర్తి)కాగా.. ఈ ఏడాది సెప్టెంబర్లో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే తన అనుమతి లేకుండానే విడాకుల ప్రకటన విడుదల చేశారని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. అయితే ఆమె మాటల్లో ఎలాంటి నిజం లేదని జయం రవి క్లారిటీ ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. -
విడాకులు క్యాన్సిల్! ధనుష్-ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కానున్నారా? (ఫొటోలు)
-
టెలిగ్రామ్ సీఈవో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా?
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్లైన్లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్లో దురోవ్ అరెస్టయ్యారు.రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్ను మెసేజింగ్ యాప్గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్కి చెందిన ఈ బిలియనీర్ను వారం రోజుల క్రితం పారిస్లో అదుపులోకి తీసుకున్నారు.దురోవ్ 2011 నుంచి ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. దురోవ్ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.సోషల్ మీడియాలో వైరల్ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తున్నారు. దురోవ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారని, లేదు విగ్ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.Pavel Durov (Telegram CEO) before his hair transplant and plastic surgery. pic.twitter.com/TTb3am2Ddn— Creepy.org (@creepydotorg) September 1, 2024 -
అది వాళ్లు చేస్తున్న తప్పుడు ప్రచారం: విజయసాయిరెడ్డి
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీకి కీలక నేతల వలసలు ఉండబోతున్నాయంటూ ఈ ఉదయం నుంచి టీడీపీ అనుకూల మీడియా తెగ హోరెత్తిస్తోంది. ఈ క్రమంలో ఐ-టీడీపీ, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలు సైతం ఆ ప్రచారానికి కొన్ని పేర్లను జోడించి పోస్టులు వైరల్ చేస్తున్నాయి. అయితే..ఆ దుష్ప్రచారం తీవ్రంగా స్పందించారు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీలో విధేయుడిగా.. నిబద్ధత కలిగిన పార్టీ కార్యకర్తగా అంకితభావంతోనే పని చేస్తానని అన్నారాయన. వైఎస్ జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేశారు.తాను ఎప్పటికీ వైస్సార్సీపీలోనే ఉంటానని.. మరో పార్టీలో చేరబోతున్నారంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఎక్స్ ఖాతాలో సందేశం ఉంచారు. I wish to make it clear that I am a loyal, dedicated, and committed worker of the YSRCP. I will remain with YSRCP and work under the leadership of Sri @ysjagan Garu. I condemn the baseless speculation and misinformation being spread by a section of the media about me quitting…— Vijayasai Reddy V (@VSReddy_MP) August 28, 2024 -
హీరో భార్యపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. స్పందించిన నటి!
సెలబ్రిటీలపై రూమర్స్ రావడమనేది సహజం. వారిపై ఏదో ఒక రూమర్ రావడం.. దానికి మళ్లీ క్లారిటీ ఇవ్వడం ఇలా సర్వసాధారణంగా మారింది. తాజాగా బాలీవుడ్ హీరో భార్య, నటి పాత్రలేఖపై పలు ఊహగానాలు మొదలయ్యాయి. 2021లో రాజ్ కుమార్ రావును పెళ్లాడిన ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది.పాత్రలేఖ మాట్లాడుతూ..' నా కడుపులో ఉబ్బినట్లుగా కనిపించినప్పుడల్లా గర్భవతిని అయిపోతానా? నేను కూడా ఒక అమ్మాయినే కదా? నా జీవితంలో సంతోషంగా లేని రోజులు కూడా ఉన్నాయి. కానీ నా లైఫ్ కోరుకున్న విధంగా ఉండాలనుకున్నా. అయితే మొదటి నుంచి నాపై వస్తున్న రూమర్లను నేను పట్టించుకోను. అందుకే కామెంట్స్ కూడా చదవటం మానేశా. కేవలం ఫోటోలు మాత్రమే చూస్తున్నా. నేను ఎలాంటి దుస్తులు ధరించినా మీరు ఇలానే ఊహించుకుంటారా?' అని ఘాటుగానే ప్రశ్నించింది.తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలు అవాస్తమని పాత్రలేఖ కొట్టిపారేసింది. కాగా.. రాజ్ కుమార్ రావు ఇటీవలే స్త్రీ-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 15 ఏళ్ల డేటింగ్లో ఉన్న వీరిద్దరు 2021లో వివాహం చేసుకున్నారు. మరోవైపు పాత్రలేఖ నెట్ఫ్లిక్స్ సిరీస్ 'ఐసీ 814: ది కాందహార్ హైజాక్'లో కనిపించనుంది. ఈ సిరీస్లో విజయ్ వర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. -
‘జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!’ ఎపిసోడ్లో ట్విస్ట్!
తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెప్పిన 34 ఏళ్ల టెక్కీ విపిన్ గుప్తా ఎపిసోడ్పై ఆయన భార్య శ్రీపర్ణ దత్త స్పందించారు. తాను భర్తను వేధించానంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. భార్య వేధిస్తుంది కాబట్టే ఆమె నుంచి తప్పించుకునేందుకు భర్త తిరుగుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు. తన భర్త గత కొంత కాలంగా కెరియర్ గురించి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. గతంలో తన భర్తపై మిస్సింగ్ కేసు వేసిన శ్రీపర్ణ దత్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నా భర్త విపిన్ రెండుసార్లు ఉద్యోగం కోల్పోయాడు. దీంతో భవిష్యత్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తండ్రికి అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్సకు డబ్బు అవసరం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఉపశమనం పొందేందుకు తిరుమల దర్శనం అనంతరం నోయిడా వెళ్లినట్లు చెప్పారు. అన్నీ అవాస్తవాలేఈ సందర్భంగా తాను విపిన్ను వేధిస్తున్నానంటూ వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. ‘నేను నా భర్తను వేధిస్తే.. ఆయన ఆచూకీ కోసం సోషల్ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తాను. నేను నా భర్తను ఎప్పుడూ వేధించలేదు. అదే జరిగితే, అతనిని వెతకాలని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తాను? ఆచూకి కోసం సోషల్ మీడియాలో పోస్ట్లు ఎందుకు పెడతాను’ అని ప్రశ్నించారు. మానసికంగా కృంగిపోయాడు కాబట్టే భర్తను పునరావాస కేంద్రానికి పంపించినట్లు ఆమె చెప్పారు.బెదిరింపులు ఎక్కువయ్యాయ్తన భర్త దొరికిన తర్వాత కూడా తనకు బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని వాపోయారు శ్రీపర్ణ దత్త. నా భర్తను కిడ్నాప్ చేశామంటూ పలువురు డబ్బుల్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు సైబర్ నేరస్తులు మెసేజ్లు పంపినట్లు వెల్లడించారు. భార్య పోరు పడలేకేగతవారం బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహించే ఐటీ ఉద్యోగి విపిన్ గుప్త ఇంటి నుంచి నోయిడా వెళ్లాడు. అయితే విపిన్ జాడకోసం ఆయన భార్య శ్రీపర్ణ దత్తా పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరుకు రప్పించగా, ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని పోలీసుల్ని కోరాడు. అయితే పోలీసులు విపిన్ను బుజ్జగించడంతో కష్టం మీద ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. భార్యే విపిన్ మానసిక సమస్యకు చికిత్స ఇప్పించేందుకు పునరావస కేంద్రానికి పంపించారు. -
నా భర్త నన్ను మోసం చేయలేదు.. షకీబ్ భార్య క్లారిటీ (ఫోటోలు)
-
టీడీపీ నేతల్లా పారిపోయే రకం కాదు: దేవినేని అవినాష్
విజయవాడ, సాక్షి: తనపై తెలుగు దేశం పార్టీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ఉత్త ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, ఆ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జి దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం తనకు లేదంటూ ఓ వీడియో విడుదల చేశారాయన.‘‘నేను విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించానని వచ్చిన ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. విజయవాడ నుంచి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. నా నియోజకవర్గ ప్రజలకు , కార్యకర్తలకు 24 గంటలూ అందుబాటులోనే ఉన్నా. పనీపాటా లేని కొన్ని మీడియా సంస్థలు , టీడీపీ సామాజిక మాధ్యమాల్లో నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను దేనికి పారిపోవాలి...ఎందుకు పారిపోవాలి?.... నేను తప్పుచేశానని కోర్టు భావిస్తే.. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దమ్ముగా స్వీకరిస్తాం. తప్పుడు కేసులకు భయపడి పారిపోవాల్సిన అవసరం నాకు లేదు. సమస్యలొస్తే టీడీపీ నేతల్లా నేను పారిపోయేరకం కాదు. నా తండ్రి నాకు జన్మనివ్వడంతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చారు. మా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మా పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ. వైసీపీ కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా ఉంటాం. మరోసారి చెబుతున్నా.. టీడీపీ , ఎల్లో మీడియా చేసే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు అంటూ ఆ వీడియో సందేశంలో కోరారాయన.టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పలువురు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. అందులో దేవినేని అవినాష్ పేరు కూడా ఉంది. మొన్నీమధ్యే వల్లభనేని వంశీ విషయంలోనూ అతి ప్రదర్శించిన ఎల్లో మీడియా.. ఇప్పుడు దేవినేని అవినాష్ విషయంలోనూ తప్పుడు రాతలతో అలాగే ప్రవర్తించింది. -
'ఐ యామ్ నాట్ సింగిల్'.. దసరా భామ ఆసక్తికర కామెంట్స్!
దసరా హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రస్తుతం రఘుతాత మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. సుమన్కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ తొలిసారి కోలీవుడ్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.ఇదిలా ఉండగా కీర్తి సురేశ్ తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీరు సింగిల్గా ఉంటున్నారు కదా? అని ఆమెను ప్రశ్నించారు. దీంతో తన రిలేషన్షిప్ గురించి దసరా భామ నోరువిప్పారు. దీనికి బదులిస్తూ.. 'నేనేప్పుడు సింగిల్ అని చెప్పలేదుగా' అమటూ సమాధానమిచ్చింది.కాగా.. గతంలో ఆమె పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి ఫ్రెండ్ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్ చేసిన కామెంట్స్ నెట్టంటి తెగ వైరలవుతున్నాయి. అయితే తాను సింగిల్ కాదని చెప్పడంపై.. ఇప్పటికే రిలేషన్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే పరోక్షంగా హింట్ ఇచ్చిందని చెబుతున్నారు. మరోవైపు కీర్తి సురేశ్ బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది. బేబీ జాన్ సినిమాతో వరుణ్ ధావన్ సరసన నటించనున్నారు. -
గ్రీస్లో ఆదిపురుష్ భామ.. అతనితో డేటింగ్ నిజమేనా!
ఆదిపురుష్ భామ, బాలీవుడ్ నటి కృతి సనన్ తెలుగువారికి సుపరిచితమే. ప్రభాస్ సరసన ఆదిపురుష్ చిత్రంలో సీతగా మెప్పించింది. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో అభిమానులను అలరించలేకపోయింది. ఓం రౌత్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇటీవల క్రూ మూవీతో ఫ్యాన్స్ను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం గ్రీస్లో విహరిస్తోంది. తన బాయ్ఫ్రెండ్గా భావిస్తోన్న కబీర్ బహియాతో చిల్ అవుతోన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.గతంలో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పలుసార్లు రూమర్స్ వినిపించాయి. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకల్లోనూ ఈ జంట పార్టీలో సందడి చేశారు. అప్పటి నుంచే వీరిద్దరిపై డేటింగ్లో ఉన్నారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే కబీర్తో రిలేషన్పై ఇప్పటివరకు కృతి సనన్ స్పందించలేదు. అయితే తాజాగా వీరిద్దరు జంటగా గ్రీస్లో కనిపించడంతో మరోసారి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా కృతి సనన్ ఇటీవల తన పుట్టినరోజును కబీర్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.పదేళ్ల ఏజ్ గ్యాప్..అయితే ఈ జంట మధ్య వయసు అంతరం ఎక్కువగానే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కృతి సనన్ వయస్సు 34 ఏళ్లు కాగా.. కబీర్ బహియాకు వయస్సు 24 ఏళ్లు మాత్రమేనని తెలుస్తోంది. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇది చూస్తుంటే తనకంటే పదేళ్లు చిన్నవాడైన కబీర్తో ఆదిపురుష్ భామ ప్రేమాయణం నడిపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే కృతి సనన్ దో పట్టి మూవీలో కనిపించనుంది. ఇందులో కాజోల్, షహీర్ షేక్ కూడా నటించారు. -
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. నటి ఏమన్నారంటే?
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం రఘు తాత. ఈ చిత్రానికి సుమన్కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో చిత్రయూనిట్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా వరుసగా ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేశ్ అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు.కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'నాపై వచ్చే రూమర్స్పై క్లారిటీ ఇస్తే అదే నిజమనుకుంటారు. అందుకే వాటిపై నేను రియాక్ట్ అవ్వను. కేవలం నా సినిమాల ఎంపిక, నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తా. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతా. నా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా పట్టించుకోను. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్ను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు' అని తెలిపింది.కాగా.. గతంలోనూ కీర్తి సురేశ్ పెళ్లిపై చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. వాటిన్నింటినీ ఆమె తల్లిదండ్రులు సైతం కొట్టిపారేశారు. కాగా.. రఘుతాత చిత్రంలో పోరాటం చేసే మహిళ పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే టీజర్ను విడుదల చేయగా.. విద్యాభ్యాసం, ఉద్యోగంలో ఓ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
సానియాతో పెళ్లి?.. మీకు దమ్ముంటే ముందుకు రండి: షమీ వార్నింగ్ (ఫొటోలు)
-
కత్రినా కైఫ్కు ప్రెగ్నెన్సీ.. విక్కీ కౌశల్ ఏమన్నారంటే?
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రస్తుతం బ్యాడ్న్యూజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఓ సాంగ్ రిలీజ్ కాగా.. వీరిద్దరి కెమిస్ట్రీ ఓ రేంజ్లో అభిమానులను ఆకట్టుకుంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా.. చిత్రబృందం ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా విక్కీ కౌశల్ ఢిల్లీ నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మరోసారి ఆయనకు మరోసారి అలాంటి ప్రశ్నే ఎదురైంది. మీ భార్య ప్రస్తుతం గర్భంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అని విక్కీ కౌశల్ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చాలా సంతోషిస్తాం.. ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికైతే ఎలాంటి శుభవార్త లేదని.. అవన్నీ కేవలం రూమర్స్ అని కొట్టిపారేశారు.ఇప్పటికైతే బ్యాడ్ న్యూజ్ను ఎంజాయ్ చేయండి.. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే మీతో తప్పకుండా పంచుకుంటాం అని నవ్వుతూ అన్నారు. కాగా.. ఇటీవల ముంబైలో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహానికి విక్కీ, కత్రినా కైఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ బేబీ బంప్తో ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. దీంతో తాజాగా మరోసారి విక్కీ కౌశల్ క్లారిటీ ఇచ్చారు. బ్యాడ్ న్యూజ్ జూలై 19, 2024న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. డిసెంబర్ 9, 2021న రాజస్థాన్లోని ఈ జంట వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
అలాంటి డ్రెస్లో కత్రినా కైఫ్.. ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ బీటౌన్లో స్టార్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన మెప్పించింది. తెలుగులోనూ వెంకటేశ్ సరసన మల్లీశ్వరి చిత్రంలో మెరిసింది. అయితే హీరో విక్కీ కౌశల్ ప్రేమాయణం నడిపిన ముద్దుగుమ్మ 2021లో అతన్ని పెళ్లాడింది. గతేడాది మేరీ క్రిస్మస్, టైగర్-3 చిత్రాలతో అభిమానులను అలరించింది. తాజాగా ఆమె ముంబయిలోని ఎయిర్పోర్ట్లో కనిపించింది.అయతే కత్రినా కైఫ్ వదులుగా ఉండే జాకెట్ ధరించిన విమానాశ్రయంలో కనిపించింది. అలా ఆమెను నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం గర్భవతిగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే వీటిపై విక్కీకౌశల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. గత నెలలో కత్రినా కైఫ్, విక్కీ కౌశల్తో లండన్ వెకేషన్కు వెళ్లిన సంగతి తెలిసిందే.కాగా.. కత్రినా 'మెర్రీ క్రిస్మస్' తర్వాత కొత్త ప్రాజెక్ట్ను ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఆమె భర్త విక్కీ కౌశల్, ట్రిప్తీ డిమ్రీతో కలిసి 'బాడ్ న్యూస్'లో కనిపించనున్నాడు. ఆ తర్వాత రష్మిక మందన్నతో 'ఛవా', సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ అండ్ వార్' చిత్రాల్లో నటించనున్నారు. ఇందులో రణబీర్ కపూర్, అలియా భట్ కూడా భాగం కానున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఈ చిన్నారి ఇప్పుడు టాప్ సెలబ్రిటీ.. కొడుకే తన ప్రపంచం (ఫొటోలు)
-
ఐకానిక్ భవనంపై టీడీపీ రచ్చ..
-
ప్రముఖ సింగర్పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు హాలీవుడ్లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్ తీసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.కాగా.. ఇప్పటికే జెన్నిఫర్ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. ఈ బంధానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 2021లో డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గత నెల రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. -
హీరామండి నటితో డేటింగ్.. స్పందించిన నటుడు..!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీ, సోనాక్షి సిన్హా ప్రధానపాత్రల్లో నటించిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. పాకిస్తాన్లో లాహోర్లో జరిగిన స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తెరకెక్కించారు. అయితే సిరీస్లో షర్మిన్ సెగల్(ఆలంజేబ్) ప్రియుడిగా తహా షా బాద్షా నటించారు.అయితే తాజాగా అతను మరో నటితో డేటింగ్లో ఉన్నట్లు బాలీవుడ్లో రూమర్స్ మొదలయ్యాయి. హీరామండి నటి ప్రతిభా రంతాతో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో తనపై వస్తున్న వార్తలపై హీరామండి నటుడు తహా షా బాద్షా స్పందించారు. ఆమెతో పరిచయం కేవలం నటన వరకు మాత్రమేనని అన్నారు. ఆమెతో నా రిలేషన్ కేవలం షూట్ వరకే ఉంటుందని బాద్షా అన్నారు. ముందుగా నేను జీవితంలో స్థిరపడాలని.. ఆ తర్వాతే ప్రేమ, కుటుంబం గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. కాగా.. ముంబయిలో ఇద్దరు కలిసి డిన్నర్ డేట్లో కనిపించడంతో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ మొదలయ్యాయి. తాజాగా వీటికి క్లారిటీ ఇచ్చేశాడు. హీరామండిలో తాజ్దార్ పాత్రలో మెప్పించాడు. షర్మిన్ సెగల్ ప్రియుడిగా.. స్వాతంత్ర్య ఉద్యమ కారుడిగా ఈ సిరీస్లో మెప్పించారు. ఇటీవల జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తాహా షా బాదుషా సందడి చేశారు. ప్రతిభా రంతా హీరామండిలో షామా పాత్రలో కనిపించింది. -
వాళ్లే కావాలని ఎఫైర్స్ అంటగట్టేవారు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
బాలీవుడ్ భామ సోనాలి బింద్రే తెలుగువారికి సైతం సుపరిచితమే. మహేశ్ బాబు సరసన మురారి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైంది. ఆ తర్వాత మెగాస్టార్ మూవీ ఇంద్ర, నాగార్జునతో మన్మధుడు చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అయిత 2002లోనే నిర్మాత,వ్యాపార వేత్త అయినా గోల్డీబెల్ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. చివరిసారిగా 2022లో లవ్ యూ హమేశా చిత్రంలో కనిపించింది. 90ల్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్లో భాగంగా అప్పటి నిర్మాతలపై సంచలన కామెంట్స్ చేశారు.సోనాలి బింద్రే మాట్లాడుతూ.. '1994లో నేను ఇండస్ట్రీలోకి వచ్చా. ఇప్పటికంటే అప్పటి పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండేవి. అప్పట్లో సహనటులతో నాపై ఎన్నో రూమర్స్ సృష్టించారు. కానీ వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. ఇప్పటికీ ఈ చెత్త ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. 1990ల్లో సినిమా నిర్మాతలే కావాలనే హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ క్రియేట్ చేసేవారు. వాటిని మీడియాకు చెప్పేవాళ్లు. సినిమా ప్రమోషన్స్ కోసం ఈ విధంగా చేసేవారని తెలిసి ఆశ్చర్యపోయా' అని తెలిపారు.అయితే సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలినాళ్లలో సన్నగా ఉన్నందుకు అవహేళన చేసేవారని సోనాలి బింద్రే తెలిపారు. ఆ రోజుల్లో హీరోయిన్లు కాస్తా బొద్దుగా ఉండేవారని పేర్కొన్నారు. నేను సన్నాగా విషయాన్ని కొందరు నిర్మాతలు మొహం మీదే చెప్పేవారని వెల్లడించింది. నేను అలాంటివాటిని పట్టించుకునే దాన్ని కాదని వివరించింది. అంతేకాదు.. ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని.. నటనలోనూ ఎలాంటి శిక్షణ తీసుకోలేదని.. అసలు స్టార్ హీరోయిన్గా అవుతానని ఊహించలేదని సోనాలి ఆ రోజులను మరోసారి గుర్తుకు తెచ్చుకుంది. -
బుల్లితెర నటిపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. కానీ!
బాలీవుడ్ బుల్లితెర భామ దీపికా కక్కర్ బీటౌన్లో సుపరిచితమే. ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్ సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్- 12లో కంటెస్టెంట్గా పాల్గొని విజేతగా నిలిచింది. అయితే 2018లో రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ గతేడాది జూన్లో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ఇదిలా ఉండగా దీపికా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే ఆమె ఇటీవలే తన బిడ్డ రుహాన్ను తన చేతుల్లో పట్టుకుని వీడియోలో కనిపించింది. అందులో దీపికా వదులుగా ఉన్న తెల్లటి సూట్ ధరించి కనిపించింది. ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ 'బేబీ బంప్' దుపట్టాతో దాచి ఉంచారంటూ కామెంట్స్ చేశారు. అయితే దీపికా కక్కర్ తనపై వస్తున్న రూమర్స్పై స్పందించలేదు. కాగా.. దీపికకు ఇప్పటికే రౌనక్ సామ్సన్ అనే వ్యక్తితో మొదటి పెళ్లి కాగా.. అతనితో 2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2018లో షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. -
హీరోయిన్కు ప్రెగ్నెన్సీ.. వైరలవుతోన్న పోస్ట్!
బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్ దోసాంజ్కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ సింగ్ బయోపిక్గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. (ఇది చదవండి: ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ..!) అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో ఉందంటూ రూమర్స్ వినిపించాయి. ఎయిర్పోర్ట్లో వైట్ కలర్ అవుట్ఫిట్లో కనిపించడంతో నెటిజన్స్ అలాంటి కామెంట్స్ చేశారు. తేలికైన దుస్తుల్లో ఎయిర్పోర్ట్కు రాగా ప్రెగ్నెన్సీ టాపిక్ కాస్తా వైరలైంది. తాజాగా ఈ వార్తలపై నటి పరిణీతి స్పందించింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతోనే ఉన్నట్లేనా? అంటూ రాసుకొచ్చింది. అందులో తాను ధరించే మూడు రకాల డ్రెస్సులను ప్రస్తావిస్తూ ఫన్నీ ఎమోజీని జత చేసింది. అంటే తాను వేసుకునే డ్రెస్సును చూసి మీరు అలా అనుకుంటే కామెడీగా ఉందంటూ పోస్ట్ ద్వారా స్పష్టం చేసింది. -
'మౌనిక ప్రెగ్నెన్సీపై అలాంటి వార్తలు'.. స్పందించిన మంచు మనోజ్
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. గతేడాది డిసెంబర్లోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ప్రెగ్నెన్సీ విషయంలో టాలీవుడ్ దంపతులపై వస్తున్న వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. దయచేసి మా విషయంలో మీరు ఎలాంటి రూమర్స్ను నమ్మకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. తమకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ఏడో నెల గర్భంతో ఉందని.. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మోహన్బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. View this post on Instagram A post shared by Manoj Manchu (@manojkmanchu) -
ప్రియుడితో పెళ్లి.. స్టార్ హీరోయిన్కు ప్రెగ్నెన్సీ..!
బాలీవుడ్ భామ, హీరోయిన్ పరిణీతి చోప్రా గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ లీడర్ రాఘవ్ చద్ధాను ఆమె పెళ్లాడింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె అమర్ సింగ్ చమ్కీలా అనే చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన కనిపించనుంది. ఇటీవల ఎయిర్పోర్ట్లో వైట్ కలర్ అవుట్ఫిట్లో కనిపించింది. తేలికైన దుస్తుల్లో పరిణీతి కనిపించడంతో అభిమానులు ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో పెద్దఎత్తున సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న అమర్ సింగ్ బయోపిక్ చమ్కీలా ఏప్రిల్ 12న విడుదల కానుంది. కాగా.. గతేడాది మే నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. సెప్టెంబర్లో మూడు ముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ విషయంపై పరిణీతి చోప్రా ఇంత వరకు స్పందించలేదు. ప్రెగ్నెన్సీ అంటూ వస్తోన్న రూమర్స్పై స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) Parineeti Chopra's fashion perfection ♥️😍#ParineetiChopra #Fashion #Celebrity #ViralVideo #Trending #BollyTadka24 pic.twitter.com/XUQcZhXAY1 — Bolly Tadka24 (@bollytadka24) March 6, 2024 -
వరలక్ష్మి ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త గురించి విస్తుపోయే నిజాలు!
ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. పెళ్లిపై గతంలో చాలాసార్లు దాటవేస్తూ వచ్చిన వరలక్ష్మి ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ను పెళ్లాడనుంది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ను పెళ్లాడబోయే వ్యక్తిగా గురించి ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయాలపై ఆడియన్స్ నెట్టింట చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్దేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అసలు అతనెవరు? వరలక్ష్మీకి ఎలా పరిచయమయ్యాడు? అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి వెతకగా.. ఆశ్చర్యపోయే నిజం బయటికొచ్చింది. వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోనుందన్న వార్త తెలియగానే.. నికోలయ్ సచ్దేవ్ గురించి ఆమె ఫ్యాన్స్ నెట్టింట వెతకడం మొదలెట్టారు. అయితే ఆయన గురించి అభిమానులకు గుండె పగిలే నిజం తెలిసింది. అతనికి ఇంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. దీంతో విషయం తెలుసుకున్న వరలక్ష్మి ఫ్యాన్స్ కాబోయే భర్తకు ఇది రెండో పెళ్లా? అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై నికోలయ్, వరలక్ష్మీ కానీ ఇంకా స్పందించలేదు. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో వరలక్ష్మి ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
నయన్ - విఘ్నేశ్ జంటపై రూమర్స్.. ఆ ఫోటో షేర్ చేసిన భర్త!
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది షారుక్ సరసన జవాన్తో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె నటించిన అన్నపూరణి పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో ఓ వర్గం వారిని కించపరిచేలా సీన్స్ ఉన్నాయంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో నెట్ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీ నుంచి తొలగించింది. అయితే ఇటీవల నయన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన భర్తను ఇన్స్టాలో అన్ఫాలో చేయడంతో పెద్ద ఎత్తున రూమర్స్ మొదలయ్యాయి. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట విడిపోనుందా? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ అంతలోనే మళ్లీ తన భర్తను ఫాలో చేసింది. దీంతో ఈ జంట విడాకుల రూమర్స్కు చెక్ పెట్టింది. కానీ తాజా పరిణామాలతో వాటికి చెక్ పెడుతూ.. విఘ్నేశ్ శివన్ ఆమె ఫొటోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్స్కు తెరపడింది. కాగా.. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా.. గత నెల ప్రేమికుల రోజు నయనతార.. తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. -
హీరోయిన్ పెళ్లి అంటూ వార్తలు.. కాస్త గట్టిగానే ఇచ్చిపడేసింది!
ఇటీవల పలువురు సినీ తారలు పెళ్లిబంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సీ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో త్వరలోనే పెళ్లాడనుందని టాక్ వినిపిస్తోంది. అంతే కాదు ఆమె మార్చి చివరి వారంలో రాజస్థాన్ ఉదయ్పూర్లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోబోతోందని తెగ ప్రచారం జరుగుతోంది. తనపై పెళ్లి వార్తల నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ స్పందించారు. ఇలాంటి వార్తలపై ఓ రేంజ్లో ఫైరయ్యారు. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పుడూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.. ఇక నుంచి భవిష్యత్తులోనూ ఎలాంటి స్పష్టత ఇవ్వనని తేల్చి చెప్పారు. తాజా కామెంట్స్తో తన పెళ్లిపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది ముద్దుగుమ్మ. కాగా.. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారు. వారి రిలేషన్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సౌత్ నుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టిన తర్వాత అతడితో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్లో వచ్చిన షారుక్ మూవీ డంకీ చిత్రంలో మెరిసింది తాప్సీ. ఈ చిత్రాన్ని రాజ్కుమార్ హిరాణీ రూపొందించారు. ప్రస్తుతం తాప్సీ ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా చిత్రంలో నటిస్తున్నారు. హసీన్ దిల్రుబాకు సీక్వెల్గా వస్తోన్న ఈ చిత్రానికి జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) -
త్వరలోనే అనుష్క శెట్టి పెళ్లి?
సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ రావడం సర్వ సాధారణం. బాలీవుడ్ మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీలోనూ ఇటీవల ఎక్కువయ్యాయి. డేటింగ్, పెళ్లి, విడాకులు అంటూ సినీ తారలపై మనం తరచు వార్తలు వింటుంటాం. స్టార్ నటీనటుల విషయంలో ఇవీ కాస్తా ఎక్కువగానే ఉంటాయి. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం అని అందరికీ తెలుసు. కెరీర్ ప్రధానంగా సాగే ఈ రంగంలో చాలామంది వయసు పెరుగుతునప్పటికీ పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ల విషయంలో తరచుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇటీవల రష్మిక- విజయ్ ఎంగేజ్మెంట్ అంటూ పెద్దఎత్తున రూమర్స్ వచ్చాయి. అలాంటిదేమీ లేదంటూ విజయ్ టీం క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్పై త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న టాక్ తెగ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో స్వీటీగా తన పేరును ముద్రించుకున్న హీరోయిన్ అనుష్క. విక్రమార్కుడు నుంచి బాహుబలి దాగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పించింది. అరుంధతి చిత్రంతో జేజమ్మగా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకుంది. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ద్వారా పలకరించింది. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమాలో డిఫరెంట్ రోల్లో కనిపించి అలరించింది. అయితే ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంలో గతంలో చాలాసార్లు ఆమెపై రూమర్స్ కూడా వచ్చాయి. అవీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది. తాజాగా మరోసారి స్వీటీ పెళ్లి విషయంపై చర్చ మొదలైంది. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్తో రిలేషన్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో ఏకంగా ఓ స్టార్ క్రికెటర్తో అనుష్క పెళ్లికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతే కాకుండా వీరి పెళ్లికి ఇరు వర్గాల కుటుంబసభ్యులు కూడా ఓకే చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. కాగా.. గతంలో అనుష్క పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'పెళ్లిపై నాకు నమ్మకముంది. వివాహానికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క పెళ్లిపై మరోసారి వార్తలు రావడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. -
వదంతులపై స్పందించే గడువు పెంపు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో వ్యాపించే వదంతులపై తప్పనిసరిగా స్పందించాల్సిన గడువును క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పొడిగించింది. దీంతో టాప్–100 లిస్టెడ్ కంపెనీలకు వెసులుబాటు లభించింది. వెరసి మార్కెట్లో పుట్టే రూమర్లను ధ్రువ పరచడం, ఖండించడం లేదా స్పష్టతనివ్వడం వంటి చర్యలను తప్పనిసరిగా చేపట్టాలనే నిబంధన అమలుకు మరింత గడువు లభించింది. సెబీ ప్రతిపాదిత ఈ నిబంధనలు తొలుత టాప్ ర్యాంక్లోని 100 లిస్టెడ్ కంపెనీలకు అమలుకానున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)రీత్యా అగ్రభాగంలో నిలిచే 100 కంపెనీలు 2024 ఫిబ్రవరి 1 నుంచి రూమర్లపై తప్పనిసరిగా స్పందించాలంటూ సెబీ ఇంతక్రితం గడువు విధించింది. తాజాగా ఈ డెడ్లైన్ను జూన్ 1వరకూ పొడిగిస్తూ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఈ బాటలో మార్కెట్ విలువలో టాప్–250 ర్యాంకు లిస్టెడ్ కంపెనీలకు రూమర్లపై స్పందించాల్సిన నిబంధనలు 2024 డిసెంబర్ 1 నుంచి అమలుకానున్నాయి. నిజానికి 2024 ఆగస్ట్ 1 నుంచి నిబంధనలు అమలు చేయవలసిందిగా టాప్–250 సంస్థలను సెబీ గతంలో ఆదేశించింది. లిస్టెడ్ కంపెనీలు కార్పొరేట్ పాలనను మరింత పటిష్టంగా అమలు చేసే లక్ష్యంతో సెబీ తాజా నిబంధనలకు తెరతీసిన విషయం విదితమే. -
Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్పై పుకార్లు
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్లు బంద్ అంటూ మళ్లీ పుకార్లు వ్యాపించడంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జనం పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టారు. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నోస్టాక్ బోర్డులు సైతం వెలిశాయి. అయితే, పెట్రోల్ బంక్లు బంద్ కాలేదని, వాహనదారులు భయపడాల్సిన పనిలేదని ఇవి పుకార్లేనని బంక్ల యాజమాన్యం స్పష్టం చేశారు. ఇక.. ఇటీవల హిట్ అండ్ రన్ కేసుల్లో.. కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన కఠిన నిబంధనలను నిరసిస్తూ అయిల్ ట్రాక్కుల డ్రైవర్లు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో గత మంగళవారం పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలకు చుక్కలు చూపించింది. ప్రధానంగా హైదరాబాద్, ఇతర నగరాలు, పట్టణాల్లోని బంకులకు వాహనాలు పోటెత్తడం, ప్రధాన రహదారుల పక్కన కూడా బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మధ్యాహ్నానికల్లా చాలావరకు బంకులు మూతపడటం, తెరిచి ఉన్న బంకులను ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు చుట్టు ముట్టడంతో ఒక దశలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. పలుచోట్ల బంకుల సిబ్బంది, వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. చదవండి: Banjara Hills: బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య.. -
దిల్ రాజు అంటే బ్రాండ్ ఎవ్వరినీ వదలను
-
మాజీ భర్త రెండో పెళ్లి.. 50 ఏళ్ల వయసులో హీరోయిన్ బ్రేకప్!
సినీ ఇండస్ట్రీలో లవ్, డేటింగ్, బ్రేకప్లు ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. బాలీవుడ్లో అయితే కాస్తా ఎక్కువగానే ఇలాంటి వార్తలు తరచుగా వస్తుంటాయి. అయితే తాజాగా మరో స్టార్ హీరోయిన్ బ్రేకప్ చెప్పుకున్నట్లు బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఓ యంగ్ హీరోకు స్టార్ హీరోయిన్ దూరంగా ఉంటున్నట్లు లేటెస్ట్ టాక్. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ భామ మలైకా అరోరా. ప్రస్తుతం ఈ టాపిక్ బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం 50 ఏళ్ల వయసులో ఉన్న మలైకా.. ఇప్పటికే తన మొదటి భర్తతో అర్బాజ్ ఖాన్తో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ కొనసాగిస్తోంది. కొన్నేళ్ల పాటు సీక్రెట్ రిలేషన్లో ఉన్న భామ.. 2019లో తమ రిలేషన్ను బయటపెట్టారు. గతంలో చాలాసార్లు ఈవెంట్లలో ఈ జంట కనిపించి సందడి చేశారు. తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే మలైకా తన స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకలు చేసుకుంది. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లోనూ అర్జున్ కపూర్, మలైకా దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్రేకప్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనే దానిపై బాలీవుడ్ భామ క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది. ఇటీవలే మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయస్సులో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మలైకా అరోరాకు నటుడు అర్బాజ్ ఖాన్ 1998 సంవత్సరంలో పెళ్లి జరిగింది. అయితే పెళ్లయిన 18 ఏళ్ల తర్వాత అర్బాజ్, మలైకా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. -
పీకల్లోతు ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఈ ఏడాదిలోనే!
హీరోయిన్ శ్రద్ధాదాస్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన ఆర్య-2 చిత్రంలో మెరిసింది. ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాదాస్.. రెబల్ స్టార్ నటించిన డార్లింగ్ మూవీలో నటించి అభిమానులను అలరించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన మెప్పించిన ముంబై ముద్దుగుమ్మ.. ప్రస్తుతం పెద్ద సినిమాల్లో కనిపించడం లేదు. అయితే తాజాగా తాను సింగర్ అవతారమెత్తింది. త్వరలోనే లండన్లో జరగనున్న మ్యూజిక్ కన్సార్ట్లో సింగర్గా సినీ ప్రియులను అలరించనుంది. (ఇది చదవండి: ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) సినిమాలకు కాస్తా దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లోనే ఉంటోంది. ఇటీవల కేరళలో చిల్ అవుతూ ఫోటోలు, వీడియోలను పంచుకుంది. వయసు మూడు పదులు దాటినా.. తన అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు డార్లింగ్ హీరోయిన్. ఫుల్గా చిల్ అవుతూ నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ డార్లింగ్ భామ పెళ్లికి రెడీ అయినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఓ బిజినెస్మెన్తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. అంతే కాదు కొత్త ఏడాదిలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. అంతే కాదు.. ఈ ఏడాది సమ్మర్లోనే వివాహం కూడా జరగనుందని సమాచారం. అయితే ఈ విషయంపై శ్రద్దాదాస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
సినిమాల్లోకి జాన్వీ కపూర్ చెల్లెలు ఎంట్రీ.. అప్పుడే డేటింగ్ రూమర్స్!
బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. బాలీవుడ్ ఎక్కువ సినిమాల్లో కనిపించిన జాన్వీ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. అయితే ఆమె చెల్లెలు కూడా అక్కా బాటలోనే పయనిస్తోంది. శ్రీదేవి చచిన్న కూతురిగా ఖుషీ కపూర్ సైతం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ది ఆర్చీస్ మూవీతో అరంగేట్రం చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమాల్లో అలా ఎంట్రీ ఇచ్చిందో.. లేదో అప్పుడే డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ది ఆర్చీస్ సహా నటుడు వేదంగ్ రైనాతో డేటింగ్లో ఉందంటూ బీటౌన్లో టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఖుషీ కపూర్ తన మొదటి సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తుండగా.. మరోవైపు రూమర్స్ పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి.అయితే ఈ వార్తలను నటుడు వేదాంగ్ రైనా ఖండించారు. వేదాంర్ రైనా మాట్లాడుతూ ఖుషీ కపూర్, నేను చాలా సందర్భాల్లో కనెక్ట్ అయ్యాం. సంగీతంలో మా ఇద్దరికీ అభిరుచులు ఓకేలా ఉన్నాయి. అలాగని మేమిద్దరం డేటింగ్ చేయడం లేదు. ఆమెతో నాకు చాలా రోజుల నుంచి తెలుసు. మా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. ప్రస్తుతానికి నేను సింగిల్గానే ఉన్నా. ఆ టైం వస్తే నేనే మీ ముందుకొచ్చి చెబుతా' అన్నారు. కాగా.. ది ఆర్చీస్ మూవీలో ఖుషీతో పాటు అగస్త్య నందా, డాట్, మిహిర్ అహుజా, సుహానా ఖాన్ నటించారు. -
విడాకులంటూ బ్రేకింగ్ ఇచ్చేశారు.. వెంటనే ఫోన్ చేసి చెప్పా: శ్రీకాంత్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో హీరోగా, ప్రతినాయకుడిగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని స్టార్గా ఎదిగారు. ఇటీవలే కోటబొమ్మాళి పీఎస్తో అభిమానులను అలరించిన శ్రీకాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓ లుక్కేద్దాం. ఇటీవలే ఓ మూవీ కార్యక్రమంలో శ్రీకాంత్ పాల్గొన్నారు. అక్కడే సీనియర్ హీరోయిన్ రాశి కూడా కనిపించింది. ఈవెంట్లో వీరిద్దరూ చాలా సరదాగా పలకరించుకున్నారు. అంతేకాకుండా ఈవెంట్లో పాల్గొన్న రాశి.. శ్రీకాంత్ భుజంపై కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై హిట్ పెయిర్గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరు చిన్నప్పటి స్నేహితుల్లా సందడి చేశారు. ఆ వీడియో పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాశి కొట్టడంపై శ్రీకాంత్ స్పందిస్తూ.. 'చాలా ఏళ్ల తర్వాత మేమిద్దరం ఫంక్షన్లో కలిశాం. అక్కడ ఉన్న హీరోయిన్ రాశిని అమ్మ అన్నది. దీంతో నేను కూడా సరదాగా రాశి అమ్మా అన్నా.. దానికే తను సరదాగా నవ్వుతూ కొట్టింది. అంతకు మించి ఏం లేదు. నేను నటించిన వారిలో సౌందర్య, ఉమతో చాలా కంఫర్ట్గా ఫీలయ్యేవాన్ని. మా ఇంటికి కూడా ఒక ఫ్యామిలీలాగా వచ్చేవారు. సైడ్ ఆర్టిస్టులతో అందరితో బాగా ఉండేవాన్ని' అని అన్నారు. విడాకుల రూమర్స్పై మాట్లాడుతూ.. 'ఊహాతో నాకు విడాకులు అంటూ వార్తలొచ్చాయి. టీవీలలో బ్రేకింగ్లు కూడా వేశారు. అప్పుడే నేను, నా భార్య అరుణాచలం వెళ్తున్నాం. అప్పుడు వెంటనే ప్రభుకు ఫోన్ చేసి చెప్పా. చూడరా బాబు మేమిద్దరం అరుణాచలం వెళ్తున్నామని చెప్పా. వెంటనే ఆ వార్తలను ఖండించాం.' అని తెలిపారు. పెళ్లికి ముందు మీకు ఇండస్ట్రీలో ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించగా సరదాగా నవ్వుతూ ఆన్సరిచ్చారు. బయట ఎవరో ఏదో రాసింది అడిగితే కాదు?.. మీకు తెలిస్తే చెప్పండని నవ్వుతూ మాట్లాడారు. బాలీవుడ్ చిత్రాల్లో అవకాశమొస్తే తప్పకుండా చేస్తానని శ్రీకాంత్ అన్నారు. పోలీస్ ఆఫీసర్గా నచ్చిన చిత్రాల్లో ఖడ్గం అని తెలిపారు. ఇటీవలే పోలీస్గా కొటబొమ్మాళి అనే సినిమాను చేశా.. పోలీసులు స్ట్రగుల్స్ ఎలా ఉంటాయో చూపించామని అన్నారు. -
బాయ్ఫ్రెండ్తో ఆలయానికి జాన్వీ కపూర్..!
బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న దేవర చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ కూడా మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయింది. దేశంలోని ప్రధాన ఆలయాలను సందరిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లిన భామ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు జాన్వీని ఆశీర్వదించి ఆమెకు బాబా మహకాళ్ ఫోటోను బహుకరించారు. అయితే ఆలయానికి గులాబీ రంగు చీరలో వెళ్లిన జాన్వీ స్వామివారి హారతి పూజలో పాల్గొన్నారు. అయితే ఆలయానికి వెళ్లిన జాన్వీ పక్కనే.. తన ప్రియుడిగా భావిస్తున్న శిఖర్ పహారియా కూడా ఉన్నారు. దీంతో మరోసారి జాన్వీ కపూర్పై డేటింగ్ రూమర్స్ వైరలవుతున్నాయి. అయితే వీరిద్దరు ఇప్పటివరకు తమ రిలేషన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే చాలా ఏళ్ల క్రితమే జాన్వీతో శిఖర్ రిలేషన్ షిప్లో ఉన్నాడని సమాచారం. -
నా పెళ్లి జీవితంపై అలాంటి రూమర్స్: ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్
బాలీవుడ్ భామ ఆలియా భట్ పరిచయం అక్కర్లేనిపేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ అనే చిత్రంతో అభిమానులను పలకరించింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు మరో స్టార్ హీరోయిన్ కరీనా కపూర్తో పాటు హాజరైంది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తన పెళ్లి జీవితంపై వచ్చిన రూమర్స్పై అలియా భట్ క్లారిటీ ఇచ్చింది. ఆలియా మాట్లాడుతూ.. 'ఇప్పుడున్నదంతా సోషల్ మీడియా, ఇంటర్నెట్ కాలం. ప్రతి రోజు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. నేను సన్నగా మారడానికి.. అంతే కాకుండా తెల్లగా అయ్యేందుకు సర్జరీలు చేయించుకున్నట్లు ప్రచారం చేశారు. అలాగే మ్యారేజ్ లైఫ్పై రూమర్స్ వచ్చాయి. నేను గతంలో రణ్బీర్కు లిప్స్టిక్ నచ్చదని.. వేసుకున్న వెంటనే తీసేయాలంటాడని చెప్పాను. అయితే ఈ విషయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నన్ను వేధిస్తున్నాడంటూ రాశారు. రణ్బీర్ మంచి వ్యక్తి. ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయడం బాధ కలిగిస్తుంది. కానీ అవన్నీ కేవలం అపోహలు మాత్రమే. అందుకే వాటిని నేను పట్టించుకోను. ' అని అన్నారు. -
మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!
బాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ జంటల్లో అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ ఒకరు. ఇండస్ట్రీలో అమితాబ్ ఫ్యామిలీకి మంచి గుర్తింపు ఉంది. గతంలో ప్రపంచ సుందరి టైటిల్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 2న 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ మాజీ ప్రపంచ సుందరి తన పుట్టిన రోజున సియోన్లోని జీఎస్బీ సేవా మండల్లో క్యాన్సర్ పేషెంట్లతో కలిసి వేడుక చేసుకుంది. ఇందులో ఆమెతోపాటు కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్ ఉన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. భార్య పుట్టిన రోజు వేడుకల్లో భర్త అభిషేక్ బచ్చన్ కనిపించకపోవడం ఫ్యాన్స్కు ఆశ్చర్య కలిగించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిషేక్పై నెటిజన్స్ మండిపడ్డారు. భార్య పుట్టినరోజున విషెస్ చెప్పిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా లేటుగా ఆమెకు విషెస్ చెప్పడమేంటని ప్రశ్నించారు. ఆమె 50వ పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుకుంటారని భావించిన ఫ్యాన్స్కు నిరాశే ఎదురైంది. దీంతో అభిషేక్ వ్యవహరించిన తీరుపై ఫ్యాన్స్తో పాటు నెటిజన్స్ తప్పుబడుతున్నారు. కాగా.. ఇటీవలే ముంబయిలో మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి బాష్లో ఐశ్వర్య సింగిల్గానే కనిపించింది. పార్టీలో ఆమె భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్ రాలేదు. దీంతో మరోసారి ఈ జంటపై విడాకుల రూమర్స్ తెరపైకొస్తున్నాయి. ఐశ్వర్య రాయ్ పుట్టిన రోజు వేడుకలకు భర్త దూరంగా ఉండడం, అంతే కాకుండా ఎప్పుడో అర్ధరాత్రి విష్ చేయడం ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి డైవర్స్ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ జంటకు ఏమైందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) -
శుభమన్తో సారా డేటింగ్.. నేను కాదన్న హీరోయిన్!
బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్తో కలిసి మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ జోహార్ షోకు హాజరైంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ భామ అనన్య పాండేతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా కరణ్ జోహార్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. శుభమన్తో డేటింగ్? అయితే ఇండియాలో జరుగుతున్న వరల్డ్ కప్లో సారా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో మీరు శుభ్మన్ గిల్తో డేటింగ్లో ఉన్నారా? అంటూ సారాను కరణ్ అడిగారు. దీనికి నవ్వుతూ సమాధానమిచ్చింది సారా అలీ ఖాన్. ఆ సారాను నేను కాదంటూ చెప్పేసింది. అందరూ నా పేరు వెనకాలే పడ్డారంటూ నవ్వేసింది. అంతే కాకుండా ఆదిత్య రాయ్కపూర్తో అనన్య డేటింగ్పై కూడా క్లారిటీ ఇచ్చింది. అనన్యకు ది నైట్ మేనేజర్ ఉన్నారంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. వెబ్ సిరీస్ నైట్ మేనేజర్లో ఆదిత్య రాయ్ కపూర్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. సారాపై రూమర్స్! ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇండియా ఆడే అన్ని మ్యాచులకు సచిన్ కూతురు సారా టెండూల్కర్ హాజరవుతోంది. శుభ్మన్ గిల్ ఆడేటప్పుడు సారా హావభావాలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులంతా సారా సారా అంటూ గిల్ను ఆట పట్టిస్తున్నారు. ఇండియా ఆడిన ఓ మ్యాచ్లో సారా టెండూల్కర్ రావడంతో కెమెరాలు పదే పదే ఆమెను చూపించడం విశేషం. అంతే కాకుండా సారా టెండూల్కర్ సైతం గిల్ బ్యాటింగ్ను అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
నాపై ఆ రూమర్స్.. అమ్మ చాలా బాధపడింది: హన్సిక
హన్సిక గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా ఇప్పటికే 50 సినిమాల మార్క్ దాటేసింది. దక్షిణాదితో పాటు హిందీలోనూ నటించింది. అయితే ఈమె పెళ్లి టైంలో కొన్ని రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. వాటి వల్ల తన తల్లి ఎలా బాధపడిందో కూడా చెప్పుకొచ్చింది. ఏంటా రూమర్స్? ముంబయికి చెందిన హన్సిక.. పలు హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 2003లో రిలీజైన హృతిక్ రోషన్ 'కోయి మిల్ గయా'లోనూ యాక్ట్ చేసింది. కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత 2007లో 'దేశముదురు' సినిమాతో హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల గ్యాప్లో హన్సిక మార్పు చూసి, త్వరగా ఎదిగేందుకు ఆమె ఇంజెక్షన్స్ తీసుకుందని కొందరు కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: 'భీమ్లా నాయక్' నటి విడాకులు? పెళ్లయి ఏడాది తిరగకుండానే!) పెళ్లి టైంలో అలా దాదాపు 20 ఏళ్లుగా హన్సిక సినిమాలు చేస్తోంది. గతేడాది డిసెంబరులో ఓ బిజినెస్మ్యాన్ని పెళ్లి చేసుకుంది. సరిగ్గా ఆ సమయంలో హన్సిక.. అప్పట్లో ఎదగడానికి ఇంజెక్షన్స్ తీసుకుందనే పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. దీనిపై హన్సిక తల్లి స్పందించింది. ఇప్పుడు ఈ రూమర్స్పై తన అభిప్రాయాన్ని హన్సిక చెప్పేసింది. హన్సిక కామెంట్స్ 'నేను ఇలాంటి రూమర్స్ అస్సలు పట్టించుకోను. కానీ మా అమ్మ మాత్రం చాలా బాధపడుంటుంది. కానీ నాకు ఆ బాధని ఎప్పుడూ చూపించలేదు. ఎందుకంటే నన్ను రక్షించేది ఆమెనే కదా. అయితే ప్రశంసలు వచ్చినప్పుడు నేను తీసుకున్నా. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కూడా అలానే తీసుకుంటా. వాటి విషయంలో నేను చాలా స్ట్రాంగ్ అయిపోయా' అని హన్సిక చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలుగులో మూడు, తమిళంలో నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7: ఊహించని సర్ప్రైజ్.. హౌస్లోకి కొత్త కంటెస్టెంట్లు!) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
స్టార్ క్రికెటర్ను పెళ్లాడనున్న బుట్ట బొమ్మ..!!
అక్కినేని హీరో నాగచైతన్య జంటగా ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ పూజా హెగ్డే. ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించింది. ఆ తర్వాత దువ్వాజ జగన్నాధం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ఆచార్య చిత్రాల్లో నటించింది. టాలీవుడ్తోపాటు బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించింది. అయితే ఇటీవల ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటించిన కిసీ కా భాయ్... కిసీ కీ జాన్ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో బుట్టబొమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. మహేశ్ బాబు సరసన గుంటూరు కారంలో ఛాన్స్ వచ్చినా.. అనివార్య కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: ఆమెతో ప్రేమ-పెళ్లి.. 'జవాన్' డైరెక్టర్పై అలాంటి కామెంట్స్!) ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని బీటౌన్ టాక్. త్వరలోనే వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముంబయికి చెందిన ఓ ప్రముఖ క్రికెటర్తో ఏడడుగులు వేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఇంతకీ బుట్టబొమ్మను చేసుకోబోయే ఆ స్టార్ క్రికెటర్ ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంపై పూజా హేగ్డే ఇంతవరకు స్పందించలేదు. ఇటీవలే ముంబయిలోని సేవా మండల్ను సందర్శించిన ఆమె గణేశున్ని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వినాయకుని పూజలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వెళ్లి గణపతికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే పెళ్లి విషయంపై క్లారిటీ రావాలంటే మాత్రం బుట్టబొమ్మ స్పందించాల్సిందే. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్కు రజినీకాంత్ వార్నింగ్.. ఆమె కోసమేనా?) -
ముచ్చటగా మూడోసారి.. హీరోయిన్కు ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్?
బొమ్మరిల్లు చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ జెనిలీయా. సిద్ధార్థ్కు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులో సత్యం చిత్రంతో పరిచయమైన జెనిలీయా.. ఆ తర్వాత సాంబ, హ్యాపీ, సై, మిస్టర్ మేధావి, రెడీ చిత్రాల్లోనూ నటించింది. అయితే ఆ తర్వాత ఫిబ్రవరి 2012లో రితేష్ దేశ్ముఖ్ను పెళ్లాడిన ముద్దుగుమ్మ సినిమాలకు దూరమైంది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ల్లో నటిస్తూ సందడి చేస్తోంది.తాజాగా ఓ ఈవెంట్కు హాజరైన ఈ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబయిలో ఓ ఈవెంట్లో జెనీలియాపై ప్రెగ్నెన్సీ రూమర్స్ ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'బేబి' హీరోయిన్కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) గత రాత్రి ముంబయిలోని ఈవెంట్లో ఫోటోలకు పోజులిచ్చింది ఈ బాలీవుడ్ జంట. అయితే ఆ ఫోటోల్లో బ్లూ డ్రెస్లో ఉన్న జెనీలియాకు బేబీ బంప్తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియా పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉండగా.. మూడోసారి ప్రెగ్నెంట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరలవుతోంది. ఓ నెటిజన్ కామెంట్స్లో రాస్తూ..'జెనీలియా గర్భవతి అయి ఉండొచ్చు' అని రాయగా.. మరో నెటిజన్ 'అవును ఆమె మూడోబిడ్డను ఆశిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రితేష్, జెనీలియా కలిసి రితీష్ మరాఠీలో దర్శకత్వం వహించిన వేద్లో నటించారు. మరోవైపు జెనీలియా ట్రయల్ పీరియడ్ అనే వెబ్ సిరీస్లో నటించింది. అక్షయ్ కుమార్తో కలిసి హౌస్ఫుల్ 5తో రితేష్ నటించనున్నారు. (ఇది చదవండి: డిఫరెంట్ ట్రైలర్.. వినాయక చవితికి మూవీ రిలీజ్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పాకిస్థాన్పై ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్.. గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్!
టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ రేంజే వేరు. రెండు దేశాల్లోని అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్పైనే అందరిదృష్టి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ మ్యాచ్లో ఇండియా-పాకిస్థాన్ తలపడ్డాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. కానీ ఆ తర్వాతే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు మన యువకెరటం ఇషాన్ కిషన్. స్టార్స్ ఔటైన చోటే దూకుడు ప్రదర్శించాడు. 82 పరుగులతో అద్భుతంగా రాణించి అందరినీ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పట్ల అభిమానం చాటుకుంది ఓ మోడల్. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్గా భావిస్తున్న అదితి హుండియా అతని ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఇన్స్టా స్టోరీస్లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అదితి ఎవరు? కాగా.. అదితి హుండియా వృత్తిరీత్యా మోడల్ కాగా.. ఆమె ఇషాన్తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్లు జరిగినప్పుడు ఇషాన్కు మద్దతుగా నిలిచింది. అంతేకాకుండా ఇషాన్, అదితి చాలా సార్లు కలిసి బయట కనిపించారు. వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే వారి రిలేషన్పై అదితి, ఇషాన్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. -
పెళ్లిపై కాంచన నటి ఆసక్తికర కామెంట్స్.. గట్టిగానే కౌంటర్!
‘కళవాణి’ సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది తమిళ నటి ఓవియా. ఆ సినిమా సక్సెస్ సాధించినప్పటికీ ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. కొన్ని చిత్రాల్లో నటించినా హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయితే తమిళ బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్న ఓవియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆమె అసలు పేరు హెలెన్ నెల్సన్ కాగా.. కేరళలోని త్రిసూర్లో జన్మించింది. మలయాళం, తమిళ, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనిన ఓవియా.. తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గతంలో ఆమె బిగ్ బాస్ విన్నర్ అరవ్తో డేటింగ్లో ఉందంటూ రూమర్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొనిన ఓవియా సహా-కంటెస్టెంట్ ఆరవ్తో సన్నిహితంగా ఉందని చాలాసార్లు రూమర్స్ వినిపించాయి. అంతే కాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెద్దఎత్తున వార్తలు వైరలయ్యాయి. అయితే వీటిపై ఇద్దరూ మౌనంగానే ఉంటూ వచ్చారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత వీరిద్దరూ తమ కెరీర్పైనే దృష్టి సారించారు. ఆ ఆ తర్వాత ఓవియా కాంచన -3, 90 ఎంఎల్ సహా చిత్రాల్లో నటించింది. రెండు సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. పెళ్లి కాలేదు.. కానీ బిగ్ బాస్ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవడంతో ఓవియా పెళ్లి చేసుకోనున్నట్లు గాపిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఓవియా స్పందించింది. నాకు పెళ్లి ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని.. నటనపైనే దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది. మీకు పెళ్లై ఓ పాప కూడా ఉందని వార్తలొచ్చాయని ప్రశ్నించగా.. వాటికి ఫన్నీ ఆన్సర్ ఇచ్చింది మలయాళీ భామ. ఓవియా మాట్లాడుతూ.. 'అవును నాకు ఓ పిల్లాడు ఉన్నాడు. కానీ నాకు పెళ్లి కాలేదు. అది నా కుక్కపిల్ల. దానిని నేను చిన్న పిల్లలానే చూసుకుంటా. అన్నం తినిపిస్తాను. అంతే కాకుండా కుక్కపిల్ల నా పక్కనే పడుకుంటుంది.' అని సమాధానమిచ్చింది. అయితే నెటిజన్స్ మాత్రం ఆమెపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తనకు పెళ్లయిందని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. -
అతనితో డేటింగ్.. కాబోయే భర్త గురించి లైగర్ భామ ఆసక్తికర కామెంట్స్!
లైగర్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన కొత్త హీరోయిన్ అనన్య పాండే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది భామ. అయితే ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది ముద్దుగుమ్మ. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తో డేటింగ్లో ఉందంటూ గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ఇటీవలే ఇద్దరు కలిసి కారులో వెళ్తూ కెమెరాలకు చిక్కడంతో ఈ రూమర్స్కు మరింత బలం చేకూరుతోంది. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) అయితే ప్రస్తుతం డ్రీమ్ గర్ల్-2 నటిస్తోన్న భామ ఆ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అతను ఎలా ఉండాలో వివరించింది. అతనిలో తాను కోరుకునే లక్షణాల గురించి వెల్లడించింది. కాగా.. అనన్య పాండే, ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్- 2 ఆగస్ట్ 25న శుక్రవారం విడుదలవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని 2019 హిట్ ఫిల్మ్ డ్రీమ్ గర్ల్కి సీక్వెల్గా తెరకెక్కించారు. అనన్య మాట్లాడుతూ..' ఓ గాడ్. నాకు మా నాన్నే ఆదర్శం. నాకు కాబోయే వారు మా నాన్నలా దయగా, ప్రేమగా, ఫన్నీగా ఉండాలి. ఆయనే నాకు బెంచ్మార్క్. మా నాన్న అత్యుత్తమ వ్యక్తి. అందుకే అతనికి అలాంటి లక్షణాలే ఉండాలి. అయితే ఇటీవల నా సినిమాలు లేకపోవడంతో నా వ్యక్తిగత జీవితంపైనే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా వారి దృష్టి నా సినిమాలపై పెడతారేమో వేచి చూడాలి.' అని అన్నారు. ఆదిత్య రాయ్ కపూర్తో రిలేషన్పై మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే డ్రీమ్ గర్ల్-2 తర్వాత ఫర్హాన్ అక్తర్ చిత్రంలో నటించనుంది. ఆ తర్వాత విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించే సైబర్ థ్రిల్లర్లో కనిపించనుంది. (ఇది చదవండి: ఇంతదాకా వచ్చాకా సిగ్గెందుకు? ప్రియుడితో అనన్య షికారు!) -
హీరోయిన్తో సింగర్ డేటింగ్.. వైరలవుతున్న ఇన్స్టా పోస్ట్!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన అక్టోబర్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన భామ బనితా సంధు. ఆమె విక్కీ కౌశల్ నటించిన సర్దార్ ఉదమ్లో కూడా నటించింది. ఆ తర్వాత తమిళ చిత్రం ఆదిత్య వర్మలోనూ కనిపించింది. అంతే కాకుండా సీడబ్ల్యూ సిరీస్ పండోరలో నటించింది. అయితే తాజాగా ఆమె పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్తో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసిన పిక్స్తో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. (ఇది చదవండి: 'అశ్లీల వీడియోలు తీసి వేధించింది'.. హీరోయిన్పై సంచలన కామెంట్స్!) ముంబయిలో ఇటీవల రిలీజైన డాక్యు-సిరీస్కు కూడా ఆమె హాజరైన బనితా సంధు అతని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ముంబయిలోని హోటల్లో బనితా సంధు అతనితో ఉన్న సన్నిహిత ఫోటోలను కూడా పంచుకున్నారు. అంతే కాకుండా విత్ మీ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ జంట డేటింగ్లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. సింగర్ అమృత పాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ ఏపీ ధిల్లాన్ పంజాబీ సంగీతంలో బాగా పేరు సంపాదించారు. ఇండో-కెనడియన్ రాపర్గా అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంటరీ సిరీస్, ఏపీ ధిల్లాన్: ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్తో మరింత ఫేమస్ అయ్యాడు. View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) View this post on Instagram A post shared by Banita Sandhu (@banitasandhu) -
షోయబ్ మాలిక్తో సానియా విడాకులు?
-
Sania Mirza And Shoaib Divorce Rumours: సానియా, మాలిక్ విడాకుల రూమర్స్.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
సానియా, మాలిక్ విడాకులు నిజమేనా..!? మరోసారి తెరపైకి
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా విడాకుల ఆంశం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే తమ వివాహ బంధానికి స్వస్తి పలకనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా షోయబ్ మాలిక్ తన ఇన్స్టాగ్రామ్ బయోలో మార్పు చేయడమే ఇందుకు కారణం. ఇంతకుముందు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ బయోలో 'సూపర్ ఉమెన్ సానియా మీర్జా' అని ఉండేది. అయితే ఇప్పుడు ఆ వాక్యాన్ని బయో నుంచి తొలగించి.. తన వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచాడు. బయోలో ఇతర వివరాలతో పాటు "ఓ బిడ్డకు తండ్రిగా ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ" మాలిక్ రాసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మాలిక్, సానియా విడాకులు తీసుకోవడం ఖాయమని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో కూడా.. కాగా కొన్ని నెలల క్రితం కూడా సానియా,షోయబ్ మధ్య విభేదాలు తలెత్తాయనీ, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు తెగ షికార్లు చేశాయి. పాకిస్తానీ నటి అయేషా ఉమర్తో మాలిక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలను అయేషా కొట్టిపారేసింది. అవన్నీ పుకార్లే అని ఆమె సృష్టం చేసింది. అయితే ఇదే సమయంలో సానియా,షోయబ్ల కొత్త టాక్ షో 'ది మీర్జా మాలిక్ షో'రావడంతో వారి విడాకుల ఊహాగానాలకు తెరపడింది. అయితే తాజాగా మాలిక్ చర్యతో మళ్లీ వారి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ వార్తలపై ఇప్పటివరకు సానియా, షోయబ్ ఎవరూ స్పందించలేదు. కాగా సానియా, షోయబ్ 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఇజహాన్ జన్మించాడు. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో తొలి టీ20.. చరిత్రకు అడుగు దూరంలో టీమిండియా కెప్టెన్ -
కమెడియన్తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
కోలీవుడ్ నటి గాయత్రీ శంకర్ సౌత్ సినిమాల్లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మామనితమ్, విక్రమ్ సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది. గాయత్రీ 2012లో '18 వయసు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి.. 'నడువుల కొంజం పక్కత కానోమ్' అనే చిత్రంతో గుర్తింపు దక్కించుకుంది. అయితే ఇటీవల ఈ హీరోయిన్పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ప్రముఖ స్టాండప్ కమెడియన్ అర్వింద్తో డేటింగ్లో కోలీవుడ్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. (ఇది చదవండి: కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) ఆమె ఇటీవల తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేసిన ఫోటోను చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ ఫోటోలో గాయత్రి, అరవింద్ ఎస్ఏను కౌగిలించుకుంటూ కనిపించింది. అంతే కాకుండా ఆ ఫోటోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇది చూసిన అభిమానులు ఈ జంట డేటింగ్లో ఉందంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై వీరిద్దరూ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇన్స్టాలో గాయత్రి రాస్తూ.. 'కమెడియన్గా అతని ఎదుగుదలను ప్రశంసించింది. అతని పట్ల తన గర్వాన్ని వ్యక్తం చేసింది. రైల్వే రిజర్వేషన్ సిస్టమ్లో అవకతవకలు జరుగుతున్నాయని మీరు మాట్లాడటం నుంచి ఇంత దూరం ప్రయాణించారు. మీతో మాట్లాడుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. అసలు అరవింద్ ఎవరు? తన కామెడీతో అందరినీ నవ్వించే అరవింద్ ఎవరో తెలుసుకుందాం. అతని అసలు పేరు అరవింద్ సుబ్రమణ్యం. అందరూ అతన్ని అరవింద్ ఎస్ఏ అని పిలుస్తారు. ఈ స్టాండప్ కమెడియన్ మొదట 2013లో తమిళ చిత్రం ఆరంభం మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత 2017లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన అత్యంత ఇష్టపడే వ్యక్తులలో ఒకరిగా నిలిచాడు. యూట్యూబ్లో కామెడీ వీడియోలు, హిందీ పాటలతో ప్రేక్షకాదరణ పొందాడు. అరవింద్ మద్రాసీ డా లాంటి షోలో కూడా కనిపించాడు. ఆ తర్వాత 2020లో అమెజాన్ ప్రైమ్లో "ఐ వాజ్ నాట్ రెడీ డా" షోను విడుదల రిలీజ్ చేశారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు కెనడా, అమెరికా, యూరప్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 'వీ నీడ్ టూ టాక్' అనే కామెడీ షోను ప్రదర్శిస్తున్నాడు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) -
Colors Swathi On Divorce Rumours: కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
ఫిబ్రవరిలో హీరోయిన్ పెళ్లి.. అప్పుడే ప్రెగ్నెన్సీ అంటూ కామెంట్స్!
బాలీవుడ్ భామ కియారా అద్వానీ బీ టౌన్తో పాటు టాలీవుడ్లోనూ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో గేమ్ ఛేంజర్లో నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్లోనూ సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. మరోసారి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో జతకట్టింది. ఇప్పటికే భూల్ భూలయ్యా-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ జంట మరోసారి 'సత్యప్రేమ్ కి కథ' చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: ఆదిపురుష్పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే.. ) తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కియారా, కార్తీక్. ప్రమోషన్లలో భాగంగా రాజస్థాన్లో జైపూర్లో సందడి చేశారు. దీనికి సంబంధించి కియారాతో ఉన్న ఫోటోలను కార్తీక్ తన ఇన్స్టాలో పంచుకున్నారు. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కియారా అద్వానీ మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేశారు. అంతే కాకుండా ఆమె ఆ ఫోటోల్లో బేబీ బంప్తో ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కియారా అద్వానీ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా శుభవార్త ఉందా? కియారా జీ.. అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రియుడు, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 7, 2023న రాజస్థాన్లో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిలో అనిల్ అంబానీ, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్ సహా బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా.. కియారా, సిద్ధార్థ్ 'షెర్షా' మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట ఆ తర్వాత వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే జపాన్ వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఈ బాలీవుడ్ జంట సినిమాలతో బిజీగా ఉన్నారు. (ఇది చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్ హాసన్ ఫిక్స్.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సిద్ధార్థ్. ఇటీవలే తాను హీరోగా నటించిన చిత్రం ‘టక్కర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. (ఇది చదవండి: అదితిపై మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు! రెండో పెళ్లిపై ఏమన్నాడంటే..) చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ టాలీవుడ్లో సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సిద్ధార్థ్.. బాలీవుడ్ భామ ఆదితి రావు హైదరితో డేటింగ్లో ఉన్నట్లు పలుసార్లు రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ జంట చాలాసార్లు ఫంక్షన్లలో తళుక్కున మెరిశారు. గతంలో ఆదితి రావు హైదరీ- సిద్ధార్థ్ కలిసి టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్కు కూడా హాజరయ్యారు. ఇటీవలే రాజస్థాన్లో జరిగిన పెళ్లిలోనూ జంటగా పాల్గొన్నారు. దీంతో ఈ జంట పీకల్లోతు డేటింగ్లో ఉన్నట్లు మరోసారి వార్తలు వైరలయ్యాయి. అయితే తాజాగా ఓ టీవీ షోలో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ చూస్తే ఈ రూమర్స్ నిజమనే తెలుస్తోంది. ఇంతకీ సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఏంటో ఓ లుక్కేద్దాం. ఓ టీవీ షోలో పాల్గొన్న సిద్ధార్థ్ను యాంకర్ ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది. జీవితాంతం మీతో కలిసి డ్యాన్స్ చేయాలనుకునే ఆమె ఎవరైనా ఉన్నారా? అని అడిగింది. దీనికి సమాధానమిస్తూ..'మా ఊర్లో అందరూ 'ఆదితి దేవో భవ అంటారు' కదా అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో అతిథిని ఆదితి పేరుతో పిలవడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సిద్ధార్థ్ సమాధానంతో ఆదితి రావు హైదరీతో డేటింగ్ ఖాయమని నెటిజన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రూమర్స్పై ఈ జంట స్పందించలేదు. కాగా.. అదితి, సిద్ధార్థ్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో మూవీలో నటించారు. ఇందులో శర్వానంద్ కూడా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఈ జంట ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు వార్తలొచ్చాయి. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్.. సోషల్ మీడియాలో వైరల్!) Awwww did he just accept?? CUTE. ❤️❤️🧿#Siddharth pic.twitter.com/x9pVfv8SHT — Shravani (@shravd05) June 9, 2023 -
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ?
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపధ్యంలో వారి మధ్య చర్చలు నిర్వహించి సమన్వయము కుదిర్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పెద్దలు. అయినా కూడా సమస్య పరిష్కారం కాని కారణంగా సచిన్ పైలట్ వేరుకుంపటి పెట్టనున్నారని ఈ మేరకు తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీంతో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కె.సి.వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగి సచిన్ పైలట్ కొత్త పార్టీ పుకార్లను కొట్టి పారేశారు. అవన్నీ సత్యదూరమైన ప్రచారాలని తేల్చి చెప్పారు. కలిసే ఉన్నాం.. కలిసే పోటీ చేస్తాం.. త్వరలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడుతున్నారనే వార్త జోరుగా ప్రచారంలో ఉండి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని అన్నారు కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్. ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. " నేను ఈ పుకార్లను నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరితో జరిపిన చర్చల్లో మనం కలిసే పోటీ చేద్దామన్న ప్రతిపాదనకు వారిద్దరూ సానుకూలంగా స్పందించారు. నాకు తెలిసి సచిన్ కొత్త పార్టీ అనేది పూర్తిగా అవాస్తవం. మా పార్టీ ఐక్యంగానే ఉంది మేము వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని కరాఖండిగా తేల్చిచెప్పారు. సచిన్ అసంతృప్తి.. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సచిన్ పైలట్ గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అవినీతి అంశాలతో పాటు పేపర్ లీకేజీ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పునర్వ్యవస్థీకరణ అంశాలపై తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదన గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ అంశాలనే అదనుగా చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయని సచిన్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని వదంతులు పుట్టుకొచ్చాయంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. -
సహనటుడితో హీరోయిన్ డేటింగ్.. పోస్ట్ వైరల్!
బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఇటీవలే దహాద్ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించనుంది. అయితే దబాంగ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత రౌడీ రాధోడ్ లాంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. జూన్ 2న సోనాక్షి సిన్హా తన 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు బాలీవుడ్ తారలు శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ నటుడు మృతి) అయితే ఆమె సహనటుడు జహీర్ ఇక్బాల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. ఇప్పటికే వీరిద్దరు డేటింగ్లో ఉన్నట్లు బీ టౌన్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై సోనాక్షి, జహీర్ ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఈ జంట పలు ఈవెంట్లలో కనిపించారు. దీంతో ప్రతిసారీ సోషల్ మీడియాలో రిలేషన్ షిప్పై గాసిప్స్ వినిపించాయి. తాజాగా సోనాక్షి సిన్హా పుట్టినరోజు సందర్భంగా జహీర్ చేసిన పోస్ట్ డేటింగ్ వార్తలకు బలం చేకూరుస్తోంది. బర్త్ డే విషెష్ చెబుతూనే 'ఐ లవ్ యూ' అంటూ నోట్లో రాసుకొచ్చారు. అంతే కాకుండా ఆమెతో దిగిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. కాగా.. గత నెలలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ జహీర్ ఇక్బాల్తో సోనాక్షి సిన్హా సంబంధాన్ని దాదాపుగా ధృవీకరించారు. కాగా.. వీరిద్దరు కలిసి డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో నటించారు. సోనాక్షి సిన్హా ప్రస్తుతం హర్రర్-కామెడీ చిత్రం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్లో కనిపించనుంది. ఆ తర్వాత నికితా రాయ్ మూవీ ది బుక్ ఆఫ్ డార్క్నెస్లో నటించనుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ కూడా ఉన్నారు. (ఇది చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన బెస్ట్ ఫ్రెండ్.. వైరలవుతున్న ఫోటోలు) View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero) -
'త్వరలోనే కీర్తి సురేశ్ పెళ్లి .. క్లారిటీ ఇచ్చిన నటి!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. మహానటిగా అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న కీర్తి సురేశ్.. ఇటీవలే దసరా మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిత్రం భోళాశంకర్లో చిరు చెల్లెలిగా కనిపించనుంది. అంతేకాకుండా కోలీవుడ్లో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించిన చిత్రం మామన్నన్లో హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ను చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేశ్కు మరోసారి పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని ప్రశ్నించగా.. దీనిపై కీర్తి సురేశ్ క్లారిటీ ఇచ్చింది. (ఇది చదవండి: కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!) పెళ్లి వార్తలపై కీర్తి సురేశ్ మాట్లాడుతూ..'నా పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చా. మీరంతా పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారు? నా పెళ్లిపై మీరెందుకు అంత ఆసక్తి చూపుతున్నారు? నా వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నాక నేనే స్వయంగా ప్రకటిస్తా. దీని గురించి ప్రతిసారి అడగాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ప్రెస్ మీట్లో ప్రశ్నించాల్సిన పని లేదు.' అంటూ సమాధానమిచ్చింది. ఈ మాటలతో కీర్తి సురేశ్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టమవుతోది. దీంతో ఆమె పెళ్లిపై కొనసాగుతున్న ఊహాగానాలన్నింటికీ తెరపడినట్లైంది. కాగా.. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా.. కీర్తి దసరా సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంతో బిజీగా ఉంది. ఈ చిత్రం తమిళంలో అజిత్ కుమార్ నటించిన వీరమ్ చిత్రానికి తెలుగు రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్తో కలిసి నటించిన మామన్నన్ ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. (ఇది చదవండి: Simbu: సైడ్ అయిన బాలీవుడ్ బ్యూటీ, శింబు మూవీలో కీర్తి సురేశ్!) -
జూన్ 9న వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్, వాళ్లకు మాత్రమే ఆహ్వానం..!
-
అలా చేయడంతో అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: బుల్లితెర నటి
బుల్లితెర నటి కరిష్మా తన్నా ప్రధానంగా హిందీ సినిమాలు, టెలివిజన్ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 2001లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో టెలివిజన్లోకి అడుగుపెట్టింది. ఆమె నాగిన్ 3, ఖయామత్ కీ రాత్లలో తన పాత్రలకు బాగా ఫేమ్ సాధించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు బుల్లితెర నటిగా రాణిస్తోంది. ఇదిలా ఉండగా ఆమె ప్రస్తుతం గర్భవతి అంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరిష్మా ఆశ్చర్యకరమైన ప్రశ్న ఎదురైంది. గతంలో మీరు ప్రెగ్నెంట్ అని మీడియాలో వార్తలొచ్చాయని ప్రశ్నించగా.. వాటికి సమాధానమిచ్చింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై నటి క్లారిటీ ఇచ్చింది. మీరంతా తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ రూమర్లకు చెక్ పెట్టింది. (ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!) నటి కరిష్మా తన్నా మాట్లాడుతూ.. 'నేను ఓ రెస్టారెంట్లో బాగా తిని బయటికొచ్చా. అదే సమయంలో బాగా ఎక్కువగా తిన్నట్లు అనిపించింది. అందుకే నా చేతితో అలా ఒక్కసారి బెల్లీని తాకా. దీంతో నేను ప్రెగ్నెంట్ అని భావించారు. దీనికి నేను ఆశ్చర్యపోయా. ఒకసారి నా పొట్ట వైపు చూసుకున్నందుకు అలా అనుకోవడమేనా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది కరిష్మా తన్నా. ప్రస్తుతం స్కూప్ అనే వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలో కనిపించనుంది. దీనికి హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె నటిస్తున్న స్కూప్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో జూన్ 2న విడుదల కానుంది. (ఇది చదవండి: లైవ్ షోలో సింగర్కు బుల్లెట్ గాయం.. ఆస్పత్రికి తరలింపు!) -
కీర్తి సురేష్ పెళ్లి పై ఆమే తండ్రి సీరియస్
-
తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెర యాంకర్గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ఆ తర్వాత సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత కొద్ది రోజులు యాక్టింగ్కు దూరంగా ఉన్న నిహారిక రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. (ఇది చదవండి: భర్తతో విడాకులు? నిహారికను సూటిగా ప్రశ్నించిన జర్నలిస్ట్) అయితే గత కొంతకాలంగా ఆమె డైవర్స్ తీసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తరచుగా వార్తల్లో నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యతో దూరంగా ఉంటోందని.. త్వరలోనే వీరు విడాకులు తీసుకోనున్నారంటూ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. వీటిపై ఇంతవరకు ఎవరూ కూడా స్పందించలేదు. అయితే తాజాగా నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మీడియా వారిని పలకరించగా ఫోటోలకు ఫోజులిచ్చారు. భర్త జొన్నలగడ్డ వెంట నిహారిక లేకపోవడంతో మరోసారి డైవర్స్ రూమర్స్ ఊపందుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిహారిక లేకుండా చైతన్య తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం మరోసారి అనుమానాలకు తావిస్తోంది. (ఇది చదవండి: లావణ్య త్రిపాఠితో వరుణ్ నిశ్చితార్థం? నిహారిక ఏమందంటే?) అంతే కాకుండా ఈ మధ్యకాలంలో నిహారి-చైతన్య జంటగా ఎక్కడా కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం.. పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం మరో కారణం. వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతోనే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. -
నేను ఆరోగ్యంగా ఉన్నాను.. ఆ వార్తలు నమ్మకండి: నటుడు సుధాకర్
సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుధాకర్ అనారోగ్యంతో బాధడపడుతున్నారని, ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు పరిస్థితి విషమించి ఆయన చనిపోయినట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ తప్పుడు వార్తలపై సుధాకర్ స్వయంగా స్పందించారు. కొంతకాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, తప్పుడు వార్తలను దయచేసి నమ్మవద్దని కోరారు. ఈ మేరకు స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి రూమర్స్ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా నటుడు సుధాకర్ చనిపోయినట్లు వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సర్యులేట్ అయ్యాయి. ఈమధ్యే నటుడు కోట శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బతికున్న మనుషుల్ని కూడా చంపేస్తున్నారంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అందులో నిజం లేదు, ఆ రూమర్స్ నన్నెంతో బాధపెట్టాయి : తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా కొంతకాలంగా తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ఇటీవలె ఆమె బాలకృష్ణ సినిమాలో ఐటెంసాంగ్ చేస్తుందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎన్బీకే 108' ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా, కోటిన్నర డిమాండ్ చేసిందని, దీంతో తమన్నాను తప్పించినట్లు వార్తలు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్స్పై ఘాటుగానే స్పందించింది తమన్నా. 'అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. అలాగే బాలకృష్ణ సార్ అంటే కూడా నాకు ఎంతో గౌరవం ఉంది. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో నేను స్పెషల్ సాంగ్ చేస్తున్నాను అంటూ నా గురించి వార్తలు రాస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నా గురించి ఇలా రాయడం నన్నెంతో బాధించింది. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'విరూపాక్ష' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేముందు దయచేసి రీసెర్చ్ చేసి తెలుసుకోండి' అంటూ తమన్నా ట్వీట్ చేసింది. దీంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. గతంలో అనిల్ రావిపూడితో కలిసి ఎఫ్2, ఎఫ్3, సరిలేరు నీకెవ్వరూ లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. I have always enjoyed working with @AnilRavipudi sir. I have huge respect for both him and Nandamuri Balakrishna sir. So reading these baseless news articles about me and a song in their new film, is very upsetting. Please do your research before you make baseless allegations. — Tamannaah Bhatia (@tamannaahspeaks) May 20, 2023 -
నాగార్జున మేనకోడలితో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి..!
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ వంటి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ప్రస్తుతం యంగ్ హీరోకు సంబంధించి సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అడివి శేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అయితే ఇంతకీ అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మరెవరో కాదు. సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియనే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. (ఇది చదవండి: మంచి జోడీ కోసం వెతుకుతున్నా: సమంత) కాగా.. అడివి శేష్, సుప్రియ గతంలో కూడా రిలేషన్లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. మరీ ఈ రూమర్స్పై అడివి శేష్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: కాల్పుల్లో అభిమాని మృతి.. సూర్య భావోద్వేగ లేఖ) కాగా.. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూసుకుంటున్న సుప్రియ హీరోయిన్గానూ నటించింది. అడివి శేష్, సుప్రియ గూఢచారి చిత్రంలో నటించారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్గా నటించింది. -
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడంటే?
-
సల్మాన్తో రిలేషన్లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్
మైనే ప్యార్ కియా చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ. ఈ సినిమా తెలుగులో ప్రేమ పావురాలు పేరుతో రిలీజైంది. సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తొలి సినిమాకే ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. తెలుగులో ఓంకారం, యువరత్న రాణా, రాధేశ్యామ్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్లో ఎదురైన చేదు సంఘటనలను పంచుకుంది. (ఇది చదవండి: ఏజెంట్పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..) మైనే ప్యార్ కియా సినిమా తనకు సక్సెస్తోపాటు కొన్ని ఇబ్బందులు కూడా తీసుకువచ్చిందని భాగ్యశ్రీ వెల్లడించారు. ఈ చిత్రం విడుదలైనప్పుడు సల్మాన్తో రిలేషన్లో ఉందని బీటౌన్లో మాట్లాడుకున్నారు. పలు పత్రికల్లోనూ వీరిద్దరి గురించి పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి ఈ విషయంపై తన భర్తను ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ' నా కుమారుడు అభిమన్యు పుట్టిన తర్వాత రోజు నన్ను కలవడానికి ఒక మహిళా రిపోర్టర్ వచ్చారు. విషెస్ చెప్పిన ఆమె అక్కడే ఉన్న నా భర్తను ఓ ప్రశ్న అడిగింది. సల్మాన్ఖాన్తో మీ భార్య రిలేషన్ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించింది. ఆ క్షణం నేను షాకయ్యాను. నా జీవితంలో అలాంటి సంఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు. అప్పటి నుంచి నేను ఫిల్మ్ మ్యాగజైన్స్ చదవడం మానేశా. సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.' అని అన్నారు. (ఇది చదవండి: బాలీవుడ్ క్వీన్.. సూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్!) అంతేకాకుండా.. సల్మాన్ ఎంతో మంచి వ్యక్తి అని.. అతడితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ‘మైనే ప్యార్ కియా’ రిలీజైన కొంతకాలానికే తన స్నేహితుడు హిమాలయ దాసానిని వివాహం చేసుకున్నారు భాగ్యశ్రీ. ఇక పెళ్లి తర్వాత కూడా భాగ్యశ్రీ తక్కువ సినిమాలే చేశారు. గతేడాది విడుదలైన ‘రాధేశ్యామ్’తో ఆమె తెలుగు తెరపై సందడి చేశారు. ఇందులో ఆమె ప్రభాస్కు తల్లిగా కనిపించారు. ఇటీవల విడుదలైన హిందీ వర్షన్ ఛత్రపతి హీరోకు తల్లి పాత్రలో నటించారు. -
ఆమె ప్రెగ్నెంటా?.. స్టార్ హీరోయిన్పై నెటిజన్స్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ రాణిస్తున్న ఆమె గతేడాది హీరో విక్కీ కౌశల్ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట బాలీవుడ్ క్యూట్ కపుల్స్గా పేరు పొందారు. పెళ్లికి ముందు కొంతకాలం సీక్రెట్ డేటింగ్లో ఉన్న 2021 డిసెంబర్9న రాజస్థాన్లోని ఓ ప్యాలెస్లో వీరిద్దరూ వివాహా బంధంతో ఒక్కటయ్యారు. అయితే తాజాగా కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ మరోసారి రూమర్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ పార్టీకి హాజరైన కత్రినాపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సోదరి ఇచ్చిన ఈద్ పార్టీకి బాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. ఈ విందుకు కత్రినా కైఫ్ కూడా హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ సూట్ను ధరించిన కత్రినా చాలా బ్యూటీఫుల్గా కనిపించింది. కాస్తా బొద్దుగా కూడా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కత్రినాను చూస్తుంటే ప్రెగ్నెంట్లా కనిపిస్తోందంటూ పోస్ట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ..' కత్రినా ప్రస్తుతం గర్భవతినా? కొంత బరువు పెరిగినట్లు కనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. మరొకరు రాస్తూ.. కత్రినా చాలా అందంగా ఉంది.. ఆమె గర్భవతి అయి ఉండొచ్చు' అని కామెంట్ చేశాడు. కాగా.. కత్రినా కైఫ్ చివరిగా సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్లతో కలిసి ఫోన్ భూత్ చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సత్యపాల్ మాలిక్ను అరెస్ట్ చేయలేదు: ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ: జమ్ము కశ్మీర్తో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్గా పని చేసిన సత్యపాల్ మాలిక్.. శనివారం ఢిల్లీలోని ఆర్కే పురం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తన ఇంట్లో జరగాల్సిన రైతు సంఘాల నేత భేటీని పోలీసులు అడ్డుకోవడంపై పీఎస్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారాయాన. ఈ క్రమంలో.. ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ ప్రచారం జరగ్గా ఢిల్లీ పోలీసులు దానిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను మేం అదుపులోకి తీసుకోలేదు. ఆయనంతట ఆయనగా పీఎస్కు వచ్చారు. తోడు మద్ధతుదారులు కూడా ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కూడా మేం ఆయన్ని కోరాం సీనియర్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు. అసలు విషయం ఏంటంటే.. ఆర్కేపురంలో ఉన్న తన ఇంట్లో సత్యపాల్ మాలిక్ శనివారం రైతు సంఘాల నేలతో భేటీ కావాల్సి ఉంది. హర్యానా నుంచి రైతు సంఘాల నేతలు తమ పోరాటానికి మాలిక్ మద్దతు కోరే యత్నం చేశారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణ సరిపోక.. భోజనాలను బయట ఉన్న పార్క్లో ఏర్పాటు చేశారు. అయితే అది పబ్లిక్ స్పేస్ అని, అక్కడ అనుమతి లేదని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో.. స్థానిక పీఎస్కు తన మద్దతుదారులతో చేరుకున్న సత్యపాల్ మాలిక్, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈలోపు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారంటూ ప్రచారం నడిచింది. దీంతో ఢిల్లీ పోలీసులు ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈయన గవర్నర్గా ఉన్న టైంలో జమ్ము కశ్మీర్లో జరిగిన ఓ భారీ అవినీతి స్కాంకు సంబంధించి సీబీఐ సాక్షిగా ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది. ఈ అంశం రాజకీయంగానూ హాట్ టాపిక్ అయ్యింది. విచారణలో స్పష్టత కోసమే తనను పిలిచారని, ఏప్రిల్27, 28, 29 తేదీల్లో సీబీఐకి అందుబాటులో ఉంటానని బదులు ఇచ్చినట్లు ఆయన మీడియాకు తెలిపారు. थाना आर.के. पुरम के सामने पूर्व राजयपाल चौ सत्यपाल मलिक के समर्थन में पहुंचे समर्थक ।@SatyapalMalik_1#SatyapalMalik #CBISummonedSatyapalMalik#सत्यपाल_मलिक #PulwamaAttack #देश_सत्यपाल_मलिक_के_साथ_है pic.twitter.com/qR1XLbFAXg — DU JAT STUDENTS UNION (@du_jat) April 22, 2023 సంచలనాల సత్యపాల్ మాలిక్ -
విడాకుల రూమర్స్.. అదే సమస్య అంటూ ఓపెన్ అయిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సినిమాల్లో కంటే ముందుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన నిహారిక యాంకర్గా కెరీర్ను ప్రారంభించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్సిరీస్లపై దృష్టి పెట్టిన ఆమె పెళ్లి తర్వాత యాక్టింగ్కు గుడ్బై చెప్పేసి నిర్మాతగా మారింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ను ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. అయితే కొన్నాళ్లుగా నిహారిక భర్త చైతన్యకు దూరంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు భార్యభర్తలిద్దదరూ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం, మొదట చైతన్య పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేయడంతో విడాకుల రూమర్స్ తెరమీదకి వచ్చాయి. ఇక రీసెంట్గా నిహారిక కూడా ఒక్క ఫోటో మినహా పెళ్లి ఫోటోలన్నింటిని డిలీట్ చేసేసింది. నెట్టింట వీరి విడాకుల రూమర్స్ హాట్టాపిక్గా మారినా ఇంతవరకు స్పందించని నిహారిక హాట్ ఫోటోషూట్స్తో మాత్రం రచ్చ చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటున్న ఆమె లేటెస్ట్ ఫోటోలతో ఫిదా చేస్తుంది. తాజాగా డెనిమ్ అవుట్ఫిట్లో గ్లామర్ ట్రీట్తో ఎక్స్పోజింగ్లో నో కాంప్రమైజ్ అంటూ ఫోటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
భర్త బాటలోనే నిహారిక.. విడాకులపై క్లారిటీ ఇచ్చిందా?
మెగా డాటర్ నిహారిక విడాకుల వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్టాపిక్గా నిలిచాయి. 2020లో చైతన్య జొన్నలగడ్డను నిహారిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద సమక్షంలో నిహారిక-చైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: హౌజ్ కీపర్గా, సేల్స్ గర్ల్గా చేశా: ప్రముఖ నటి పవిత్ర ఈ వార్తలకు నిహారిక భర్త చైతన్యే ఆజ్యం పోశాడు. పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో కలిసి షికార్లకు, వెకేషన్కు వెళ్లిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ నుంచి తొలిగించాడు. దీంతో మెగా డాటర్ విడాకుల రూమర్స్ ఒక్కసారిగా గుప్పుమన్నాయి. తాజాగా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తూ నిహారిక కూడా భర్త బాటలోనే నడిచింది. ఇప్పటి వరకు పెళ్లి ఫొటోలు డిలిట్ చేయని ఆమె ఇన్స్టాగ్రామ్ నుంచి తాజాగా ఆ ఫొటోలు మాయమయ్యాయి. భర్త చైతన్య లాగే నిహారిక కూడా పెళ్లికి సంబంధించిన పోస్ట్స్తో పాటు భర్తతో కలిసి వెళ్లిన వెకేషన్ పిక్స్ తొలగించింది. అంతేకాదు చైతన్యకు సంబంధించిన పోస్ట్స్ కూడా డిలిట్ చేసింది. చదవండి: బేబీబంప్తో బిగ్బాస్ బ్యూటీ పూజా.. ఫొటోలు వైరల్ దీంతో మరోసారి మెగా డాటర్ విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. నిజంగానే వీరిద్దరు విడిపోయారా? అంటూ నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డైవర్స్ రూమర్స్పై స్పందించని నిహారిక ఇలా తన విడాకులపై క్లారిటీ ఇచ్చిందా? అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు. దీంతో వీరి విడాకులు వార్తలు నిజం కాకుండ ఉంటే బాగుండు అంట మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతేకాదు విడాకుల అబద్ధం అని చెప్పండి మేడం అంటూ నిహారికి పోస్ట్కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇందులో నిహారిక తన తల్లి చీర కట్టుకుని పెళ్లికూతురిగా ముస్తాబైన ఫొటో మాత్రం డిలిట్ చేయకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela)