Shadnagar
-
స్కూల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్లోని ఓ పాఠశాల భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ఘటన జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థి నీరజ్.. స్కూల్ భవనం రెండో అంతస్తు నుంచి పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని అన్నమాచార్య యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో సీఈసీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అఖిల ఆత్మహత్య చేసుకుంది. ప్రైవేట్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
షాద్ నగర్ పరిధిలోని BRS ఆయిల్స్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
-
షాద్నగర్ వద్ద రోడ్డు ప్రమాదం
-
నిన్న వార్నింగ్.. నేడు క్షమాపణ
-
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
బీఆర్ఎస్ సర్కార్ 5 వేల పాఠశాలలను మూసివేసింది: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్:రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. వైద్య సదుపాయాలు కూడా మెరుగుపరిచి ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరిస్తామని తెలిపారు.తెలంగాణ విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో టీచర్లలో అసహనం ఏర్పడిందన్న సీఎం.. ఈ ప్రభుత్వం 34 వేల మంది టీచర్లను బదిలీ చేసి, 21 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 11 వేల మంది టీచర్లకు నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు.బదిలీలు, ప్రమోషన్ల విషయంలో చిన్న వివాదం కూడా లేకుండా పరిష్కరిస్తున్నామన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.బీఆర్ఎస్ పాలించిన పదేళ్లలో 10 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని మండిపడ్డారు సీఎం. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలల్ని బాగుచేయలేదని విమర్శలు గుప్పించారు. పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతో బీఆర్ఎస్ సర్కార్ పనిచేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కార్ 5 వేల పాఠశాలలను మూసివేసిందని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడికి పదవులు ఇచ్చారు. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలు చేశారు. 1020 రెసిడెన్సియల్ స్కూల్స్లో కనీస వసతులు లేవు. టీచర్లతో పెట్టుకుంటే ఏమీ చేయరు కానీ.. పోలింగ్ రోజు బూత్లలో చేయాల్సింది చేస్తారు. బర్రెలు, గొర్రెలు ఇవ్వాలని కేసీఆర్ చూశారు కానీ ఉద్యోగాలు ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండుసున్నా వచ్చినా.. వాళ్ల బుద్ధి మారలేదని విమర్శించారు.ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. -
దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. షాద్ నగర్ పోలీసులపై కేసు నమోదు
-
మహిళపై థర్డ్డిగ్రీ.! షాద్నగర్ పోలీసులపై కేసు
సాక్షి,షాద్నగర్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్ పోలీసులపై కేసు నమోదైంది. ఇటీవల ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. షాద్నగర్ పీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) రామ్రెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారిపై ఎఫ్ఐఆర్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల షాద్నగర్ పోలీసులు దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి విచారించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. -
కొడుకు కోసం.. తల్లి నిర్బంధం
బషీరాబాద్: షాద్నగర్ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన మరవకముందే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ పోలీస్స్టేషన్లో మరో దారుణం.. పదహారేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడైన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ బాలుడి తల్లిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. రోజూ స్టేషన్కు పిలవడం.. కొడుకు గురించి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేస్తూ సాయంత్రం వరకు కూర్చోబెట్టడం.. మధ్యలో లాఠీలతో విచక్షణారహితంగా కొట్టడం.. గడిచిన మే నుంచి ఆగస్టు 15 వరకూ ఇదే వరస.. కాలూచేయీ కూడ దీసుకోలేని స్థితిలో భర్త.. తను పనికి వెళ్తే కానీ పూట గడవని దుస్థితి.. పోలీసులు మాత్రం ఆమె పొట్టకొడుతూ మూడున్నర నెలలుగా ఠాణా చుట్టూనే తిప్పుతున్నారు.పంద్రాగస్టు సందర్భంగా వార్తా సేకరణకు బషీరాబాద్ పోలీస్స్టేషన్కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు దీనస్థితిలో స్టేషన్ ముందు కూర్చున్న ఆమె కంటపడింది. ఆరా తీస్తే ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కుమారుడిపై కిడ్నాప్ కేసు.. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్ (17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక (16) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మే 2న ఇంట్లోంచి పారిపోయారు. తమ కూతురును నరేష్ కిడ్నాప్ చేశాడంటూ బాలిక కుటుంబసభ్యులు బషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మే 4న నరే‹Ùపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. బాలుడి తల్లి కళావతి, తండ్రి నర్సప్ప కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. పోలీసులు కళావతిని మే నెలలోనే ఠాణాకు పిలిపించారు. ఎస్ఐ రమేశ్కుమార్ ఆమెను విచారిస్తూ.. ‘నీ కొడుకు మైనర్ పిల్లను ఎత్తుకొనిపోయాడు.వాడు ఎక్కడున్నాడో రెండు రోజుల్లో వెతికి తీసుకురావాలి. లేదంటే వాణ్ణి నేనే పట్టుకొచ్చి తుపాకీతో కాల్చి చంపేస్తా..’అంటూ బెదిరించాడు. దీనికి కళావతి స్పందిస్తూ.. ‘కూలి పనులు చేసుకునే మాకు ఏం తెలుసు సారూ.. వాడు పట్నంలో పనిచేసుకునేవాడు. కాశీంపూర్ పిల్లతో ప్రేమ కుదిరింట. అది పిల్ల తల్లికి కూడా తెలుసు. వారు ఎక్కడికి పోయారో నాకు తెలీదు’ అని చెప్పింది. దీంతో ఎస్ఐ ఒక్కసారిగా ఆవేశానికి లోనై లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని, నడవడానికి కూడా రాలేదని బాధితురాలు వాపోయింది. ‘ఆ రోజు నుంచి ప్రతీ రోజు పోలీస్ స్టేషన్కి వస్తున్నా. రోజూ ఉదయం 9 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చోవాలి. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. ఆకలితో రాత్రి 9 గంటల వరకు ఉండి సారుకు చెప్పి ఇంటికెళ్తున్న. నిన్న ఒక్క రోజే (బుధవారం) స్టేషన్కు రాలేదు’అంటూ ఠాణాకు వెళ్లిన విలేకరులకు చెబుతూ కళావతి కన్నీటి పర్యంతమైంది. రోజు కూలి పనులు చేసుకునే తమకు మూడు నెలలుగా పనిలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఎస్ఐపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కళావతికి న్యాయం చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విచారణ జరుపుతాం: అశోక్, సీఐ తాండూరు రూరల్ కిడ్నాప్ కేసు విషయం మా దృష్టిలో ఉంది. కిడ్నాపర్ మైనర్ అయినా అరెస్టు చేయాల్సిందే. విచారణలో భాగంగా బాలుడి తల్లిని బషీరాబాద్ ఎస్ఐ స్టేషన్కు పిలిచి విచారించారు. ఎస్ఐ ఆమెను కొట్టాడనే విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరుపుతాం. -
దళిత మహిళపై షాద్నగర్ పోలీసుల వీరంగం.. సీపీ చర్యలు
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఓదళిత మహిళను కర్రలతో కొట్టి హింసించిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళపై దాడి చేసిన షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంరెడ్డితోపాటు మరో అయిదుగురు కానిస్టేబుళ్లను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.ఏం జరిగిందంటే.. సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. పక్కింట్లో నివాసముంటున్న నాగేందర్ అనే వ్యక్తి తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగిందని గత నెల 24వ తేదీన షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న సునీత, భీమయ్య దంపతులపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో డీఐ రామిరెడ్డి 26వ తేదీన వీరిని పోలీస్స్టేషన్కు పిలిపించారు. తాము చోరీ చేయలేదని వారు చెప్పడంతో ఇంటికి పంపేశారు. అనంతరం జూలై 30వ తేదీ రాత్రి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ, మోహన్ లాల్, కరుణాకర్,అ ఖిల.. మొత్తం ఐదుగురు పోలీసులు సునీత భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు 13 ఏళ్ల జగదీష్ను అదుపులోకి తీసుకున్నారు. ఇష్టమొచ్చినట్లు హింసించారు.. అయితే డిఐ రాంరెడ్డి తనను చిత్రహింసలకు గురి చేసినట్టు బాధితురాలు సునీత పేర్కొంది. పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే అతి దారుణంగా చితకబాదారని ఆరోపించింది. తన చీర విప్పేసి సగం నిక్కరు తొడిగారని, తన భర్త చొక్కా విప్పించి వేసుకోమంటూ కొట్టాురని ఆరోపించింది. ఆ సమయంలో మహిళా పోలీసులెవరూ పక్కన లేరని పేర్కొంది. తన కుమారుడిని కూడా రబ్బరుబెల్టుతో కొట్టారని తెలిపిందిరాత్రి 2 గంటల వరకు చితకబాదడంతో పోలీసుల దెబ్బలకు తాళలేక స్పృహ తప్పి పడిపోగా.. ఫిర్యాదుదారుకు చెందిన వాహనంలోనే తనను ఇంటికి పంపించారని తెలిపింది. మర్నాడు నా భర్తతో కలిసి స్టేషన్కు వెళ్తే.. పిలిచినప్పుడు రావాలని పోలీసులు చెప్పారు. తర్వాత చికిత్స కోసం నేను ఆసుపత్రిలో చేరాను’ అని బాధితురాలు సునీత వివరించారు. -
దళిత మహిళపై పోలీస్ జులుం
-
షాద్నగర్లో రియల్టర్ దారుణ హత్య
సాక్షి, షాద్నగర్: తెలంగాణలో ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రియల్టర్ కమ్మరి కృష్ణను అతి దారుణంగా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.వివరాల ప్రకారం.. షాద్నగర్లోని కేకే ఫామ్హౌస్లో రియల్టర్ కమ్మరి కృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. కాగా, కృష్ణ బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు ఫామ్హౌస్ నుంచి బయటకు వస్తుండగా అటాక్ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణపై విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. మరోవైపు.. కృష్ణ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్, కన్వేషన్ సెంటర్లు, ఫామ్హౌస్లను నిర్వహిస్తున్నట్టు సమాచారం. -
గ్లాస్ పరిశ్రమలో ఘోర ప్రమాదం
-
గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం
షాద్నగర్: గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని బూర్గుల గ్రామశివారులో వాహనాలకు సంబంధించిన గ్లాస్ అద్దాలను తయారుచేసే సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పరిశ్రమలోని ఆటో క్లేవ్ యూనిట్లో అద్దాలను గ్యాస్, వేడితో అతికించి, బాయిలర్ నుంచి బయటకు తీసే క్రమంలో ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో ఆటో క్లేవ్ యూనిట్ వద్ద ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు. యూనిట్లో తయారైన గ్లాస్ను బయటకు తీసే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు. ఈ పేలుడుతో మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా సుమారు వంద మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఓ కార్మికుడి మృతదేహం పరిశ్రమ షెడ్డు రేకులను చీల్చుకొని బయటకు ఎగిరిపడింది. మరో కార్మికుడి మృతదేహం పూర్తిగా యంత్రంలో ఇరుక్కుపోయింది. ముగ్గురి మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి.శరీరాల నుంచి కాళ్లు, చేతులు, తల, తదితర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మృతి చెందినవారిలో బిహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ (25), రాంఆశిష్ (18), రవుకాంత్ (25), రోషన్ (36), రతన్ దేవరియా (30) ఉన్నారు. వీరితోపాటు బిహార్కు చెందిన గోవింద్, మంటు, సమీద్కుమార్, రోషన్కుమార్, సురేంద్ర పాశ్వాన్, జార్ఖండ్కు చెందిన మైకేల్ ఎంబ్రామ్, కార్తీక్, సు¿ోద్, బూర్గుల గ్రామానికి చెందిన పుల్లని సుజాత, కాశిరెడ్డిగూడకు చెందిన నీలమ్మ, మమత, ఒడిశాకు చెందిన రేతికాంత్, రాజేశ్లు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాల్లో భద్రత తీరుపై పరిశీలన చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు: హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పలు పరిశ్రమల్లో ప్రమా దాలు జరుగుతున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా ప్రమా దాలు జరుగుతున్నా, భద్రతా చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు.ప్రమాద ఘటనపై సీఎం ఆరా ప్రమాద ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్న ఆయన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి తగిన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, అగి్నమాపక శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులు, వైద్య బృందాలు ఘటనాస్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. దీంతో కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ రాంకుమార్, ఆర్డీఓ వెంకటమాధవరావులు ఘటనా స్ధలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. -
షాద్నగర్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు కార్మికులు మృతి
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సౌత్ గ్లాస్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో గ్యాస్ కంప్రెష్ చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. పేలుడు తీవ్రతకు ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 30 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన సమయంలో ఫ్యాక్టరీలో 150 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, వారందరూ యూపీ, బీహార్కు చెందిన వారని తెలుస్తోంది. ఇక గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మరోవైపు పేలుడుతో ఫ్యాక్టరీలో పైకప్పు కూలగా..గ్లాస్ ముక్కలు గుచ్చుకుని బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
బిర్యానీ తిని ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్లో
-
ఆస్ట్రేలియాలో తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హైదరాబాద్కు చెందిన వ్యక్తి అనుమానాస్పదం మరణం కలకలం రేపింది. షాద్ నగర్కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అయిదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో అరవింద్ సముద్రంలో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఇంటినుంచి వెళ్లిన అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం అతని మృతదేహం సముద్రంలో కనిపించింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును కూడా గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనేకోణంలో ఆరాతీస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పోలీసులు మృతుడి స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది.కాగా ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీ లో స్థిరపడ్డాడు అరవింద్ 18నెలల క్రితం వివాహం చేసుకున్న అరవింద్ భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్నగర్కు తిరిగి వచ్చింది. ఇంతలోనే అరవింద్ కన్నుమూయడంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన లారీ ప్రమాదంలో బీజేపీ నాయకుడు, అరవింద్ తండ్రి ఆరటి కృష్ణ యాదవ్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్నగర్లో నివసిస్తున్నారు. భర్త మరణం తరువాత ఒక్కగానొక్కకొడుకును పెంచి పెద్ద చేసింది. పెళ్లి చేసి అంతా బావుంది అనుకుంటున్న సమయంలోనే ఇపుడు అరవింద్ కూడా దూరం కావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
షాద్నగర్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 100కుపైగా కార్మికులు ఉండగా.. ప్రాణ భయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయిదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. కొందరు కార్మికులను కిటికీల్లోంచి నిచ్చెనల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బాలుడి సాహసంఅగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన బాలుడు సాయిచరణ్.. కంపెనీ మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడాడు. అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టిన బాలుడు.. భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయచరణ్ సాయం చేశాడు. మొత్తం 50 మందిని కార్మికులను కాపాడాడు. -
మోదీ పాలనలోనే దేశాభివృద్ధి
షాద్నగర్, కొందుర్గు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చేరుకుంది. ఈ సందర్భంగా లాల్పహాడ్, కొందుర్గు, షాద్నగర్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని కోరారు. ప్రజా సంక్షేమం, దేశ భద్ర త, అవినీతి రహిత సమాజం ఆయనతోనే సాధ్యమన్నారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ప్రశ్నించాలని సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీ నేతలు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలవుతున్నా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని దారి మళ్లించి, అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. రామరాజ్యం కావాలంటే.. ‘బీజేపీకి మోదీ ఉన్నాడు.. ఆయన వెనక శ్రీరాముడు ఉన్నాడు.. కాంగ్రెస్కు రాహుల్, కేసీఆర్, ఒవైసీలు ఉన్నారు. దేశంలో రామరాజ్యం కావాలంటే తిరిగి ఎవరు అధికారంలోకి రావాలో ప్రజలే తేల్చుకోవాలి’అని బండి సంజయ్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మళ్లీ మోదీ ప్రధాని అయితేనే రైతులకు సబ్సిడీలు, పేదలకు ఉచిత బియ్యం వస్తాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారని అన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయని, అలా కావాలంటే బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని సీఎం రేవంత్రెడ్డి కోరుకోవాలని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్వాళ్లే రైతుబంధు ఆపారు: కేసీఆర్
సాక్షి, షాద్నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్ షాద్నగర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్నగర్ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్నగర్కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్.. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు. -
అన్ని కులాలకు మతాలకు అతీతంగా కేసీఆర్ పాలన్: అంజయ్య యాదవ్
-
రెండో రోజు రాహుల్ పర్యటన.. పలువురు కాంగ్రెస్లోకి చేరిక
సాక్షి, మహబూబ్నగర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. నేటి (బుధవారం) మధ్యాహ్నం వరకు నొవాటెల్ హోటల్లోనే ఉండనున్న రాహుల్.. పార్టీ నేతలతో పలు అంశాలపై చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెండింగ్ సీట్లపై పీసీసీ నేతలతో సమావేశం కానున్నారు. రాహుల్ భేటీతో వామపక్ష సీట్లపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్లో చేరనున్నారు. మధ్యాహ్నం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్లోకి గడ్డం వివేక్? కాసేపట్లో నోవోటెల్ హోటల్కు మాజీ ఎంపీ వివేక్ వెళ్తారనే ప్రచారం వినిపిస్తోంది. రాహుల్తో వివేక్ భేటీ అవుతారని, కొడుకు వంశీతో సహా కాంగ్రెస్ లో చేరతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాంగ్రెస్లో చేరికను ఖండించిన బీజేపీ నేత గడ్డం వివేక్వెంకటస్వామి.. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫునే పోటీ చేస్తానని ప్రకటించారు. చదవండి: ఏరోజూ పదవి కోరుకోలేదు.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్ -
శ్రీనాద్ రోటాప్యాక్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలిన సిలిండర్
-
ప్యాకేజీ కవర్ల పరిశ్రమలో భారీ పేలుడు
షాద్నగర్: ఆహారాన్ని ప్యాక్ చేసే సిల్వర్ కవర్లను తయారు చేసే ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడగా.. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బాధితులంతా ఇతర రాష్ట్రాల వారేనని తెలిసింది. పరిమితికి మించిన వేడితో.. షాద్నగర్ డివిజన్ పరిధిలోని కాశిరెడ్డిగూడ శివారులో బ్లెండ్ కలర్ పరిశ్రమ ఉంది. ఇందులో ఫుడ్ ప్యాకేజీకి సంబంధించిన సిల్వర్ కవర్లను తయారు చేస్తారు. ఇందుకోసం మెటాలిక్ పొడిని వినియోగిస్తారు. కార్మికులు రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి విధుల్లో ఉండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో జాజిపతుర, పూర్ణాసింగ్, మందిరి,రాజుసాన్, మంజుదాస్, ప్రదీప్మాన్, సత్య, గిరిధర్సింగ్, రాహుల్ఘడ్, సునీల్ ఎంకీతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి, అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం డీఆర్డీఓ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారేనని.. వీరిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రుల వివరాలను తెలుసుకున్నారు. పేలుడు షార్ట్సర్క్యూట్తో జరిగిందా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కంపెనీలో కలర్ తయారు చేసే క్రమంలో వాడే మెటాలిక్ పొడి పరిమితికి మించి వేడి (ఓవర్ హీట్) కావడంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. -
రంగారెడ్డి: భార్యకు కరెంట్ షాక్ పెట్టిన తాగుబోతు
క్రైమ్: ప్రేమించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. పదేళ్లు కాపురం కూడా చేసి పిల్లల్ని కన్నాడు. కానీ, మద్యం మత్తులో కుటుంబాన్ని ఆగం చేస్తూ వచ్చాడు. అయితే భర్త, బిడ్డలూ బాగుండాలని మద్యం తాగొద్దని బతిమాలిందామె. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు కోపంతో ఆమెను కిరాతకంగా హతమార్చాడు భర్త. రంగారెడ్డి షాద్నగర్లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని అన్నందుకు కోపంతో నిద్రలో ఉన్న భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పదేళ్ల కిందట.. కవిత, యాదయ్యలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. యాదయ్య పోనుపోను మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఆ అలవాటు మానుకోవాలని ఆమె కోరింది. పంచాయితీలు జరగ్గా.. పెద్దలు ఆమెకు సర్దిచెప్పి పంపించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకుని కిరాతకంగా చంపాడు. అనంతరం మత్తు దిగడంతో.. భయంతో పోలీస్ స్టేషన్కు వెళ్లి కరెంట్ షాక్తో చనిపోయిందని అబద్ధపు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కొండుర్గు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ బిడ్డను అన్యాయంగా బలిగొన్నాడంటూ కవిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదీ చదవండి: తాగనికి పైసల్లేవని ఆ తాత ఏం చేశాడంటే.. -
షార్ట్ సర్క్యూట్తో 'చవర్లెట్ ఎంజాయ్' కారు దగ్ధం
-
Hyderabad: షార్ట్ సర్క్యూట్తో 'చవర్లెట్ ఎంజాయ్' కారు దగ్ధం
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్లోని రాంనగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్తో 'చవర్ లెట్ ఎంజాయ్' వాహనం దగ్ధమైంది. కొందుర్గు మండలానికి చెందిన నగేష్కు చెందిన ఈ వాహనం నంబర్ టీఎస్ ఓ7 యూసీ 8997 షార్ట్ సర్క్యూట్కు గురైందని డ్రైవర్ అశోక్ తెలిపాడు. ఉదయం రాంనగర్లో తన ఇంటి నుంచి కంపెనీకి బయలుదేరగా కొద్ది దూరం వెళ్ళాక వాహనంలో పొగలు వచ్చాయని, వెంటనే కారు దిగి బానట్ ఓపెన్ చేసి చూసేలోపే మంటలు చెలరేగాయని చెప్పాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, కారు మొత్తం మంటల్లో దగ్ధమైందని వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది వెళ్లే మంటలు ఆర్పారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. చదవండి: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు -
ఎఫ్సీఎన్ ఆధ్వర్యంలో కండర క్షీణిత బాధితులకు ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: షాద్నగర్లో ఎఫ్సీఎన్ హోమ్ ఆధ్వర్యంలో కండర క్షీణిత బాధితులకు నగదు, నిత్యవసరాలను బుధవారం పంపిణీ చేశారు. ఎఫ్సీఎన్ సంస్థ వ్యవస్థాపకులు డా. గీత, తోమాస్ రెడ్డి చిత్తా దంపతులు.. కండర క్షీణిత బాధితులకు ఆర్థిక సాయాన్ని అందించారు. జంట నగరాల పరిసర ప్రాంతాల నుండి వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ. ఐదువేలు చొప్పున నగదు, జత బట్టలు, దుప్పటి, నిత్యావసరాలను అందజేశారు. ఈ కండర క్షీణిత వ్యాధితో దుర్భర జీవితాలను అనుభవిస్తున్న వారిని గుర్తించి మానవతా దృక్పథంతో వారికి తమ వంతు సహాయం అందజేస్తున్నామని వ్యవస్థాపకులు అన్నారు. కండర క్షీణిత వ్యాధితో బాధితులకు మానవత్వంతో తోచిన సాయాన్ని అందించాలని నిర్వాహకులు పిలుపునివ్వగా, కొందరు దాతలు ఉదార స్వభావంతో ముందుకు వచ్చారు. స్థానిక ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు స్లీవా రెడ్డి ఒక్కొక్కరికి రూ.1000 నగదు చొప్పున అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందించిన దాతలకు ఎఫ్సీఎన్ సంస్థ వ్యవస్థాపకులు కృతజ్ఞతలు తెలిపారు. -
షాద్ నగర్: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ
సాక్షి, రంగారెడ్డి: ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత థామస్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో షాద్ నగర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ZPHS హై స్కూల్ కిషన్ నగర్ ఊర్దూ మీడియం, మరియరాని పాఠశాలలో చదువుతున్న 558 మంది విద్యార్థులకు 558 బ్యాగ్స్, ఉచితంగా పంపిణి చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా ఎదిగినప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. విద్యాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మరియరాని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫాదర్ అలెగ్జాండర్, జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివకుమారి, ఇతర సిబ్బంది హాజరై ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
టప్పాఖానాలకు కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: ఇది షాద్నగర్ సమీపంలోని మొగిలిగిద్ద టప్పాఖానా. 1925లో నిజాం ప్రభుత్వం నిర్మించిన భవనం. 97 ఏళ్లుగా అందులోనే తపాలా కార్యాలయం కొనసాగుతోంది. వందేళ్లకు చేరువవుతున్న నేపథ్యంలో దాదాపు రూ.10 లక్షలు వెచ్చించి దీనికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేయాలని, ప్రస్తుత అవసరాలకు వీలుగా మార్చాలని తపాలాశాఖ నిర్ణయించింది. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా మరమ్మతులకు శనివారం శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ రీజియన్ పోస్ట్మాస్టర్ జనరల్ డా‘‘ పీవీఎస్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొగిలిగిద్ద పాత భవనం ముందు పచ్చికతో లాన్ కూడా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో తపాలాశాఖ అధికారులు సంతోశ్కుమార్ నరహరి, వెంకటేశ్వర్లు, గౌస్ పాషా, జుబేర్, హేమంత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా... మొగిలిగిద్దతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నిజాం హయాంలో నిర్మించిన టప్పాఖానాలను అభివృద్ధి చేసేందుకు తపాలాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అందించిన వినతులు, సూచనలకు సంబంధించిన పనులను పూర్తి చేస్తున్నారు. ప్రజలు నేరుగా గానీ, సామాజిక మాధ్యమాల ద్వారా గానీ ఇచ్చిన వినతుల ఆధారంగా పరిష్కరిస్తున్నారు. కార్యాలయాల్లోని తుక్కు, అవసరం లేని కాగితాలు, ఇతర చెత్తను తొలగించి పరిశుభ్రం చేయటంతోపాటు తదుపరి అవసరాలకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
‘దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే
సాక్షి, రంగారెడ్డి: ‘నాన్నా.. దసరా పండగకి నాకు కొత్త దుస్తులు కావాలి..’ ఇదీ కొడుకు కోరిక. తెద్దాంలే నాన్న.. ఈ రోజే తీసుకుందాం.. ఇదీ చిరునవ్వుతో తండ్రి వాగ్దానం. అంతలోనే విధి వక్రీకరించింది. గంట వ్యవధిలోనే కొడుకును నీటి గుంత పొట్టనపెట్టుకుంది. పండుగ దుస్తు లు కావాలన్న కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తండ్రి రోదనకు అంతే లేకుండా పోయింది. షాద్నగర్ మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులో నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటనలో నెలకొన్న విషాదం ఇదీ. వ్యవసాయ కూలీగా పని చేసే భిక్షపతి కుమారుడు అక్షిత్ సోమవారం ఉదయాన్నే పండుగ దుస్తులు అడిగాడు. తీసుకుందాం అనుకున్నంతలోనే ఈ ఘోరం జరిగిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని కన్నీరుమున్నీరయ్యాడు. ముగ్గురు కుమారుల్లో చిన్న వాడైన అక్షిత్ను అల్లారుముద్దుగా చూసుకున్నామని.. ఇలా జరుగుతుందనుకోలేదని తల్లిదండ్రులు భిక్షపతి, శివలీల రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఆ ఇద్దరూ అన్నదమ్ముల కొడుకులు మృతి చెందిన మరో ఇద్దరిలో సైఫ్, ఫరీద్ అన్నదమ్ముల పిల్లలు. మృతుల తండ్రులు సలీం, నయూం వరుసకు అన్నదమ్ములు. ఎక్కడికి వెళ్లినా సైఫ్, ఫరీద్ ఒకరిని విడిచి ఒకరు ఉండే వారు కాదని.. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రాణమని కుటంబ సభ్యులు తెలిపారు. బతుకమ్మలు, నవరాత్రులతో సందడిగా ఉన్న గ్రామంలో ముగ్గురి మరణం ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. -
22 రోజులకు రూ.1,17,694 కరెంట్ బిల్లు.. యాజమాని షాక్
సాక్షి, రంగారెడ్డి: కరెంటు బిల్లు చూసిన ఓ ఇంటి యజమాని గుండె గు‘బిల్లు’మంది. ఏకంగా లక్ష రూపాయల బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. షాద్నగర్ మున్సిపల్ పరిధి చటాన్పల్లిలో రమాదేవి ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ గత నెల కాలిపోయింది. దీంతో ఆశాఖ సిబ్బంది కొత్త మీటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో కాలిపోయిన మీటర్కు సంబంధించిన బిల్లును బుధవారం యజమానికి ఇచ్చివెళ్లారు. ఇందులో ఆగస్టు 16నుంచి ఈనెల 7వ తేదీ వరకు 22 రోజులకు గానూ 10,510 యూనిట్ల విద్యుత్ వాడినట్లు, ఇందుకు రూ.1,17,694 చెల్లించాలని బిల్లులో నమోదైంది. ప్రతి నెల రూ.వందల్లో వచ్చే బిల్లు ఒకేసారి లక్ష రూపాయలు దాటడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై రూరల్ ఏఈ రాకేశ్ను అడగగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, సరిచేస్తామమన్నారు. -
హైవే ఎక్కుతున్నారా.. ఓసారి జేబులు చెక్ చేసుకోండి!
షాద్నగర్: టోల్ బాదుడు ఏటా కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. యథావిధిగా ఈ ఏడాది కూడా టోల్ప్లాజాలో ధరలు పెరుగుతుండటంతో జాతీయ రహదారిపై ప్రయాణం మరింత భారం కానుంది. టోల్ ప్లాజాలో రుసుములు పెరుగుతుండటంతో అటు వాహనదారులు, ఇటు సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ –బెంగళూరు 44వ జాతీయ రహదారిపై షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో రుసుము భారీగా పెరిగింది. పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రయాణికులపై మరింత భారం బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వారిపై భారం మరింత పెరగనుంది. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రస్తుతం టోల్ ధరలు పెంచుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు సరికాదంటున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణికులు, వాహనదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారి వెంట సబ్వే సరిగా లేకపోవడంతో రోడ్డు పక్కన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా తప్పని పెంపు షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు నుంచి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వరకు జాతీయ రహదారిని (సుమారు 58 కి.మీ) రూ.600 కోట్లతో విస్తరించి అవసరమైన చోట బైపాస్ నిర్మించారు. ఈ జాతీయ రహదారిని 2009లో కొత్తూరులో ప్రారంభించారు. షాద్నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులో నిర్మించిన టోల్ ప్లాజాలో ఏటా టోల్ రుసుము పెంచుతూ వస్తున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా.. టోల్ ప్లాజాలో నెలవారీ పాసుల రుసుమును కూడా పెంచుతున్నారు. కారు, ప్యాసింజర్, వ్యాను లేక జీపు రూ.2,115 నుంచి రూ.2,425, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ. 3,700 నుంచి రూ. 4,245, ట్రక్కు, బస్సు రూ.7,395 నుంచి రూ.8,485, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,895 నుంచి రూ.13,635కి పెంచనున్నారు. స్కూల్ బస్సుల నుంచి యథావిధిగా నెలవారీగా రూ.1000 వసూలు చేయనున్నారు. అన్ని వాహనాలపై బాదుడే.. టోల్గేట్లో ఈసారి అన్ని రకాల వాహనాలైన కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాలు (అనేక చక్రాల వాహనం)లకు రుసుములను భారీగా పెంచనున్నారు. దీంతో టోల్ ప్లాజాకు ఆదాయం కూడా పెరగనుంది. నిత్యం ఈ టోల్ ప్లాజా నుంచి సుమారు 15వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు సుమారు రూ.28లక్షల మేర ఆదాయం సమకూరుతుంది. టోల్ ధరలు పెరుగుతుండటంతో మరో రూ.మూ డు లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. (క్లిక్: మందుబాబులకు షాక్.. తాగేదంతా మద్యం కాదు) రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పెట్రోల్, ఢీజిల్ ధరల పెరుగుదల, టోల్ రుసుములు రవాణా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాహనాల యజమానులు తమ లారీలను నడపలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మళ్లీ టోల్ ధరల పెంపుతో భారం తప్పదు. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుసుము తగ్గించాలి కరోనా నేపథ్యంలో సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. టోల్ రుసుము పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం పడుతుంది. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన వస్తోంది. రుసుము తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – శివకుమార్, షాద్నగర్ -
సడన్ బ్రేక్.. ఒకదాని వెనుక మరోటి ఢీ.. వరుసగా 9 వాహనాలు ధ్వంసం
సాక్షి, షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వివరాలివీ.. మహబూబ్నగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న తొమ్మిది వాహనాలు ఒకదానికికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు క్రాసింగ్ ఉండటంతో వాహనాలు కొంతమేర నిదానంగా వెళ్తున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. (క్లిక్: కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు..?) ఓవర్టేక్ చేయబోయి.. అదుపు తప్పిన బైక్.. వ్యక్తి దుర్మరణం చేవెళ్ల: ముదు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బైక్పై ఉన్న వ్యక్తి అదుపుతప్పి కిందిపడిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు.. చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఎల్వేర్తి నరేశ్(30) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం బైక్పై ఆలూరు నుంచి గేట్కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న బోలేరోను ఓవర్టేక్ చేయబోతుడంగా బైక్ ఆదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు అతడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సంతోష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (క్లిక్: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రేమకథ) -
కన్నతండ్రి కళ్ల ముందే విగతజీవిలా మారితే.. దిక్కులు పిక్కటిల్లేలా..
షాద్నగర్ (రంగారెడ్డి): కరోనా సృష్టించిన విషాదం కన్నీటి అక్షరం అయింది. కన్న తండ్రిని పోగొట్టుకున్న ఓ చిన్నారి గుండెలో వేదన లేఖగా మారింది. పాఠశాలలు మూసేసి .. ఇంటికి వెళ్తున్న తరణంలో ఓ విద్యార్థిని తన కన్నీటి గాథకు అక్షర రూపం ఇచ్చింది. కరోనా సమయంలో కన్న తండ్రిని కాపాడుకునేందుకు పడిన వేదన.. ఆస్పత్రి సేవల కోసం చేసిన శోధన.. అంటరాని వాళ్లను చేసి అందరూ దూరం చేస్తే ఒంటరిగా పడిన యాతన.. చివరికి కన్నతండ్రి కళ్ల ముందు విగత జీవిగా పడి ఉంటే దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదన.. అన్నింటినీ తన లేఖలో వ్యక్తపరిచింది. ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడలోని ప్రాథమికోన్నత పాఠశాలలో సుధామాధురి ఐదో తరగతి చదువుతోంది. ఆదివారం నుంచి వేసవి సెలవులు కావడంతో శనివారం చివరి రోజు తన స్నేహితురాలికి లేఖ రాసింది. కరోనా సమయంలో చిన్నారి అనుభవించిన మానసిక వేదన చదివిన వారిని కంటతడి పెట్టించింది. చదవండి: (విషాదం: సంబంధాలు వస్తున్నాయి.. భూమి కొనడానికి ఎవరూ రాక..) -
కూతురి ఉసురు తీసిన తండ్రి.. అదృశ్యమైందంటూ..
సాక్షి, షాద్నగర్: కన్నకూతురును కళ్లలో పెట్టుకొని చూసుకోవాల్సిన తండ్రి కర్కశంగా ఆ చిన్నారి ఉసురు తీశాడు. ఈ ఘటన షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం సాయత్రం వెలుగుచూసింది. ఫరూఖ్నగర్ మండలం బాపన్గుట్ట తండాకు చెందిన నరేశ్, రజిత దంపతులకు కూతురు ప్రియ (9 నెలలు) ఉంది. తన కూతురు కనిపించడంలేదని నరేశ్ ఆదివారం షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా క్లూస్ట్ టీం ,డాగ్ స్క్వార్డ్తో రంగంలోకి దిగిన సీఐ నవీన్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర్లు 24 గంటల్లో కేసును చేధించారు. ప్రియ మిస్సింగ్ కేసు హత్య కేసుగా మార్చి హత్యకు గల కారణాలను ఏసీ కుశల్కర్ మంగళవారం మీడియాకు వెల్లాడించారు. రెండేళ్ల కిత్రం నరేశ్, రజితకు వివాహమైనట్లు తెలిపారు. అయితే నరేశ్ వ్యవహారశైలిని అనుమానించి అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా, చిన్నారిని తానే హత్యచేసినట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే.. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో పరీక్షల్లో ఎయిడ్స్ ఉందని నిర్ధారణ అయ్యినట్లు, దీనితో అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో తమకు ఏమైనా అయితే పాప పరిస్థితి ఏంటని అనాలోచితంగా ఆలోచించిన నరేశ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. హంతకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో తల్లిపాత్ర కూడా ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని షాద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: Extra Marital Affair: స్నేహితుడి ప్రియురాలితో సానిహిత్యం.. ఏడాది తర్వాత! -
జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి.. నిద్రమత్తులో..
Junior Artist Jyothi Reddy Death News: రైలు ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్టు జ్యోతిరెడ్డి మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ స్టేషన్లో మంగళవారం తెల్లవారుజామున రైలు దిగి మళ్లీ ఎక్కుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెడ్కానిస్టేబుల్ కృష్ణ కథనం ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా చిట్వేన్ మండలం సిగమాల వీధికి చెందిన బట్టినపాత జ్యోతి (26) హైదరాబాద్లో జూనియర్ ఆర్టిస్టు. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగిగానూ ఆమె విధులు నిర్వర్తిస్తోంది. సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లిన జ్యోతిరెడ్డి.. సోమవారం రాత్రి తిరుగు పయనమైంది. చిత్తూరు నుంచి కాచిగూడ వస్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఆమె రైల్వేకోడూరులో ఎక్కి హైదరాబాద్కు బయలుదేరింది. రైలు మంగళవారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో షాద్నగర్ రైల్వే స్టేషన్లో ఆగింది. నిద్రమత్తులో ఉన్న జ్యోతిరెడ్డి కాచిగూడ రైల్వేస్టేషన్ అనుకొని షాద్నగర్ స్టేషన్లో దిగింది. చదవండి: (వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్) వెంటనే తిరిగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. అప్పటికే రైలు కదులుతుండటంతో ప్రమాదవశాత్తు ప్లాట్ఫాంపై పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. రైల్వే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతిరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్పత్రి వద్ద ఆందోళన.. చాదర్ఘాట్: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి మృతితో మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. షాద్నగర్ వద్ద చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో జ్యోతిరెడ్డి తీవ్ర గాయాల పాలైంది. చికిత్స నిమిత్తం ఆమెను మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలిస్తుండగా బంధువులు అభ్యంతరం చెబుతూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. చదవండి: (Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం) -
జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పద మృతిపై రగడ
Junior Artist Jyothi Reddy Suspicious Death: Friends Demands Justice: జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి అనుమానాస్పద మృతిపై జూనియర్ ఆర్టిస్టులు, స్నేహితులు ఆందోళన చేపట్టారు. వివరాల ప్రకారం కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి ఈరోజు( మంగళవారం) షాద్నగర్ రైలు పట్టాలపై గాయాలతో పడటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం స్నేహితులు ఆమెను మలక్పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జ్యోతి రెడ్డి మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. దీంతో మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆసుపత్రి ఎదుట జూనియర్ ఆర్టిస్టులు ధర్నా చేపట్టారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
షాద్ నగర్లో క్షుద్ర పూజలు..బయటపడ్డ దొంగ స్వామీజీ బాగోతం
సాక్షి, రంగారెడ్డి: పల్లెల్లో మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. మంత్రతంత్రాలు, గుప్తనిధుల పేరుతో కొందరు గ్రామీణులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంత్రతంత్రాలు, బాణామతి, చేతబడులు అంటూ మూఢ నమ్మకాలను అమాయక ప్రజలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా షాద్నగర్ మండలం కమ్మదనం గ్రామ శివారులు ఓ దొంగ బాబా క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శివస్వామి అనే వ్యక్తి కొంతకాలంగా ఓ ప్రైవేట్ వెంచర్ లో ఇల్లు కట్టుకుని.. కాళికామాత విగ్రహం పెట్టి పూజలు చేస్తున్నాడు. అతని వద్దకు వెళ్లేవారి కళ్లల్లో నిమ్మ రసం పిండి, వెంట్రుకలు పట్టి కొడుతున్నాడు. అమ్మవారి పాదాల కింద పోటోలు పెట్టి వశీకరణ మంత్రం రాగి పూతలతో కూడుకున్న పేర్లు రాసి పెడుతున్నాడు. గతంలో మధురాపూర్ గ్రామంలో ఇలాగే ప్రవర్తించగా.. గ్రామస్తులు బెదిరించడంతో అక్కడి నుండి వెంచర్ దగ్గరకు క్షుద్ర పూజలను షిఫ్ట్ చేశాడు. తాజాగా అతని వద్దకు హైదరాబాద్కు చెందిన ఓ యువతి తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో పూజలు చేయించడానికి తీసుకొచ్చింది. చదవండి: కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్ అయితే డబ్బులు తీసుకొని తల్లి ఆరోగ్యాన్ని నయం చేయలేదని మోపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా నిందితుడు ఎలా క్షుద్ర పూజలు చేస్తాడో ఆ వీడియోతో సహా ఆధారాలు బయటపెట్టింది. దీంతో శివ స్వామీ బాబా బాగోతం వెలుగులోకి వచ్చింది. దొంగ స్వామిపై షాద్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా తాను క్షుద్ర పూజలు చేయలేదని. ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మంత్రిస్తానని స్వామి పోలీసులు తెలిపారు. చదవండి: మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం.. -
వివాహేతర సంబంధం.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు.. చివరకు
సాక్షి, షాద్నగర్ రూరల్: వివాహేతర సంబంధం నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడా.. లేక మరేదైనా ఘటన హత్యకు దాసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో గురువారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు.. కర్నూలుకు చెందిన నాగరాజు(40) కొంతకాలంగా పట్టణంలో రోడ్ల పక్కన చిత్తు కాగితాలు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు పట్టణంలో నివాసం ఉంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. సదరు మహిళ భర్తతో కలిసి పటేల్ రోడ్డులోని అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలియడంతో పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు అతడు భార్యకు సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో నాగరాజును ఎలాగైనా పక్కకు తప్పించాలని మహిళ భర్త పథకం పన్నాడు. అందులో భాగంగానే హత్య చేసినట్లు తెలుస్తోంది. తన భార్య కోసం ఇంటికి వచ్చిన నాగరాజును అతడు కొట్టి చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నాగరాజు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. -
దీపం ఆరింది.. దిశగా వెలిగింది.. ‘దిశ’ విషాదానికి నేటితో రెండేళ్లు
సాక్షి, షాద్నగర్: దేశవ్యాపంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ విషాదాంతానికి నేటితో రెండేళ్లు పూర్తయ్యా యి. నలుగురు మృగాళ్ల వికృత చేష్టలకు ఆమె అసువులుబాసినా మహిళా రక్షణ చట్టాలకు ‘దిశా’నిర్దేశం చేసింది. ఆమె మరణించిన కూతవేటు దూరంలోనే ఆ నలుగురికీ పడిన శిక్ష చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజధాని శివారులోని తొండుపల్లి వద్ద మొదలై.. షాద్నగర్ శివారులో ముగిసి.. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించిన ఈ ఘటనను ఓసారి నెమరువేసుకుంటే.. చదవండి: ‘దిశ’ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు సరిగ్గా రెండేళ్ల క్రితం 2019 నవంబర్ 27న రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో దిశ అత్యవసర పరిస్థితుల్లో తన స్కూటీని శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఆపి పని మీద వెళ్లి నలుగురు నరహంతకుల కంట పడింది. తిరిగి వచ్చి తన స్కూటీని తీసుకుని ఇంటికి వెళ్లే ప్రయత్నం చేసింది. కాపుకాసిన ఆ నలుగురు ఆమెను బలవంతంగా ఓ పాడుబడిన ప్రహరీ పక్కకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేసి అంతమొందించారు. నవంబర్ 28న తెల్లవారుజామున మృతదేహాన్ని లారీలో తెచ్చి షాద్నగర్ శివారులోని బైపాస్ జాతీయ రహదారి చటాన్పల్లి బ్రిడ్జి కింద కాల్చివేశారు. 2019 డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం దిశను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు ఘటనా స్థలికి తీసుకొచ్చారు. పోలీసులపై దాడి చేసి వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడం మరో సంచలనం అయింది. దిశ హత్య ఘటన ఎంతగా కదిలించిందంటే ఎన్కౌంటర్ను ప్రతి ఒక్కరూ సమర్థిస్తూ పోలీసులపై పూల వర్షం కురిపించారు. అంతేకాదు ఈ హత్యోదంతం చట్టాలకు దిశానిర్దేశం చేసింది. కొత్త చట్టాలకు రూపకల్పన దుర్మార్గుల చేతిలో కిరాతకంగా బలైన దిశ పేరిట ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకొచ్చాయి. ఆపదలో ఉన్న ఏ ఆడపిల్లయినా ఫోన్ చేస్తే క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని రక్షించేలా ఫోన్ నంబర్లు, పోలీసు వ్యవస్థను రూపొందించారు. ఇలాంటి సంఘటనలపై వేగంగా తీర్పు ఇచ్చి నిందితులకు శిక్షలు అమలయ్యేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఆడ పిల్లలు ఎక్కడున్నది వాహనాల ద్వార ఎక్కడికి వెళ్తున్నది ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని రక్షించేలా ప్రత్యేక యాప్లను క్రియేట్ చేశారు. మహిళలకు తగిన జాగ్రత్తలను సూచిస్తూ వారికి హాని తలపెడితే వేసే శిక్షలను కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇదీ పరిస్థితి దిశ ఘటన తర్వాత కొంత మార్పు వచ్చినా ఇంకా పూర్థి స్థాయిలో రాలేదని చెప్పాలి. ఈ సంఘటన తర్వాత కూడా ఆగడాలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజధాని సాక్షిగా జరిగిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య ఉదంతమే ఇందుకు ఉదాహరణ. మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపుల వంటివి కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల్లో పూర్తి స్థాయిలో చైతన్యం రాకపోవడం.. పోలీసులు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో దుర్మార్గుల నుంచి రక్షణ పొందలేకపోతున్నారు. ఏది ఏమైనా దిశ హత్యోదంతం పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మార్పునకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. సాగుతున్న విచారణ దిశ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే నిందితులకు శిక్ష అమలైంది. ఇది తమను తాము రక్షించుకోవడంలో భాగంగా చేసిందని పోలీసులు చెబుతున్నా దీనిలో నిజానిజాలు తేల్చే దిశగా మానవ హక్కుల కమిషన్ కోర్టు విచారణ కొనసాగుతున్నాయి. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ వేసింది. కమిటీ సభ్యులు ఇప్పటికే ఎంతో మందిని విచారించారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. -
పరిమళించిన మానవత్వం..యాచకుడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సపర్యలు
సాక్షి, షాద్నగర్: ఆకలితో అలమటిస్తున్న ఓ యాచకుడు రోడ్డు దాటుతూ కిందపడిపోయాడు. వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయం అందించి మానవత్వాన్ని చాటాడు. షాద్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మురళీ శుక్రవారం పట్టణంలోని ముఖ్య కూడలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో డొక్కలు ఎండిపోయి ఆకలితో అలుమటిస్తూ ఓ యాచకుడు రోడ్డు దాటేందుకు యత్నిస్తూ కింద పడిపోయాడు. చదవండి: టీఎస్ఆర్టీసీ: ప్రభుత్వ పూచీకత్తు లేకుండానే రూ.300 కోట్ల రుణం గమనించిన కానిస్టేబుల్ మురళీ ఆ యాచకుడిని పైకి లేపి పక్కన కూర్చోబెట్టాడు. ఆకలితో ఉన్నానని, కళ్లు తిరుగుతున్నాయని ఆ యాచకుడు సైగలు చేయడంతో వెంటనే కానిస్టేబుల్ యాచకుడికి నీళ్లు తాగించి, పక్కనే ఉన్న పండ్లు కొనిచ్చి ఆకలి తీర్చాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఉన్నతాధికారులు అభినందించారు. షాద్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ కానిస్టేబుల్ మురళీకి రివార్డు అందజేశారు. తోటి పోలీస్ సిబ్బంది అతన్ని అభినందించారు. చదవండి: కూకట్పల్లిలో వ్యభిచార దందా.. ఓ మహిళను రప్పించి.. -
పెరిగిన టోల్ప్లాజా ధరలు.. నేటి నుంచి అమల్లోకి!
సాక్షి, షాద్నగర్: ప్రయాణికులు, వాహనదారులపై మరింత భారం పడనుంది. టోల్ ప్లాజా ధరలు పెరగనుండటంతో జేబులు మరింత ఖాళీ కానున్నాయి. ఏటా టోల్ ప్లాజా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 44వ జాతీయ రహదారిపై షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజాలో పెంచిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఏటా పెంపు.. రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొత్తూరు నుంచి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వరకు ఉన్న జాతీయ రహదారిని సుమారు 58 కిలోమీటర్ల మేర రూ.600 కోట్ల వ్యయంతో విస్తరించారు. అవసరమైన చోట్ల బైపాస్లు నిర్మించారు. 2009లో పనులు పూర్తిచేసి కొత్తూరులో ప్రారంభించారు. షాద్నగర్ పరిధిలోని రాయికల్ శివారులో నిర్మించిన టోల్ ప్లాజా రుసుంను ఏటా పెంచుతున్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇప్పటికే అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు టోల్ చార్జీలు కూడ పెంచడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన చార్జీలు సెప్టెంబర్ 1నుంచి అమలులోకి వస్తాయని టోల్ప్లాజా నిర్వాహకులు ప్రకటనలు కూడా జారీ చేశారు. చదవండి: ఇక్కడ బస్టాప్ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు! పెరగనున్న పాసుల రుసుము టోల్ ప్లాజాలో నెల వారీ పాసుల రుసుంను కూడా పెంచనున్నారు. కారు, ప్యాసింజర్ వ్యాను లేక జీపు రూ.1,960 నుంచి రూ.2,115లు, లైట్ కమర్షియల్ వాహనాలు, మినీ బస్సులు రూ.3,430 నుంచి రూ.3,700, ట్రక్కు, బస్సు రూ.6,860 నుంచి రూ.7,395, మల్టీయాక్సిల్ వాహనాలు రూ.11,025 నుంచి రూ.11,895లు పెంచనున్నారు. స్కూల్ బస్సుకు నెలవారీ పాసు రుసుము రూ.1,000 వసూలు చేయనున్నారు. ఈ సారి పెంచేశారు గతేడాది కారు, ప్యాసింజర్ వ్యాన్లతో పాటుగా, లైట్ కమర్షియల్ వాహనాలకు టోల్ రుసుం పెంచలేదు. కానీ ఈసారి మాత్రం కారు, ప్యాసింజర్ వ్యాన్, లైట్ కమర్షియల్ వాహనాలతో పాటు ట్రక్కు, బస్సు, మల్టీయాక్సిల్ వాహనాల (అనేక చక్రాల వాహనం) రుసుం పెంచనున్నారు. అయితే పెంచిన ధరలు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోని రానున్నాయి. పెరగనున్న ఆదాయం షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా మీదుగా నిత్యం సుమారు పదివేల వాహనాలకుపైగా రాకపోకలు సాగిస్తాయి. కరోనా నేపథ్యంలో చాలా మంది తమ సొంత వాహనాలపై ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ టోల్ ప్లాజాలో నిత్యం సుమారు రూ.25 లక్షల రూపాయల వరకు రుసుం వసూలవుతుంది. చార్జీలు పెంచడంతో టోల్ ఆదాయం రోజుకు రూ.2 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈమేర వాహనదారులపై భారం పడనుంది. వాహనం వెళ్లేందుకు రానుపోను (కొత్త చార్జీలు) కారు, జీపు ప్యాసింజర్ వ్యాన్ రూ.70 రూ.105 లైట్ కమర్షియల్, మినీ బస్ రూ.125 రూ.185 ట్రక్కు, బస్సు రూ.245 రూ.370 మల్టియాక్సిల్ వాహనాలు రూ.395 రూ.595 భారం మోపడం సరికాదు ఏటా టోల్ రుసుం పెంచి వాహనదారులపై భారం మోపడం సరికాదు. చార్జీల పెంపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లారీలు, ట్రక్కులకు కిరాయిలే సరిగా రావడం లేదు. ఈ సమయంలో కిస్తులు కట్టడం కూడా గగనమవుతోంది. – సయ్యద్ సాధిక్, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, షాద్నగర్ -
‘ఎన్ని కష్టాలెదురైనా.. ప్రజా ఆశీర్వాదంతో ముందుకు సాగుతాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రజా ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు ముందుకు సాగుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రూ.1 కోటి 88 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా స్థానిక కుంట్ల రాంరెడ్డి గార్డెన్లో జరిగిన షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 3కోట్ల 49 లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా చైర్మన్ పాండురంగారెడ్డి, హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రసంగిస్తూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని, కోట్లాది రూపాయలను వెచ్చించి ప్రజా సంక్షేమాన్ని చేపడుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 4 వేల 70 మందికి కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులను అందించిందని పేర్కొన్నారు. మొదటి విడతగా 6వేల కోట్లు, రెండో విడతగా 2వేల కోట్లు మొత్తం 8వేల కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. పాలనలో తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి ఆదర్శం అని అన్నారు. -
యువతిగా మారాలని యువకుడి కోరిక.. చివరికి
సాక్షి, హైదరాబాద్: యువతిగా మారాలన్న తన కోరికను కుటుంబికులు అంగీకరించట్లేదనే ఉద్దేశంలో షాద్నగర్కు చెందిన ఓ యువకుడు పదేపదే ‘అదృశ్యం’ అవుతున్నాడు. ఎట్టకేలకు ఈ అంశం సైబరాబాద్ ట్రాన్స్జెండర్స్ హెల్ప్డెస్క్ వద్దకు వచ్చింది. అతడి ఆచూకీ కనిపెట్టిన అధికారులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా కుటుంబికులకు కౌన్సెలింగ్ చేసి అతడి కోరిక తీరేలా చేశారు. గత నెల 6 నుంచి పని చేయడం ప్రారంభించిన ఈ డెస్క్కు మొత్తం ఏడు ఫిర్యాదులు వచ్చాయని అధికారులు గురువారం వెల్లడించారు. అయిదుగురికి కౌన్సెలింగ్ చేయగా.. రెండు అంశాల్లో కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. షాద్నగర్కు చెందిన ఓ యువకుడు పదో తరగతిలో ఉండగానే యువతిగా మారాలని భావించాడు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పగా వారు ససేమిరా అన్నారు. దీంతో ఇల్లు విడిచి పారిపోయిన అతగాడు ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్న ఓ ట్రాన్స్జెండర్స్ గ్రూప్లో చేరాడు. అప్పట్లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న షాద్నగర్ పోలీసులు అతడిని గుర్తించి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా గడిచిన కొన్నేళ్ల కాలంలో మూడు నాలుగుసార్లు జరిగింది. ఇటీవల మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయిన అతగాడు సిద్దిపేటకు చేరాడు. అతడి తల్లిదండ్రులు షాద్నగర్ పోలీసుల వద్దకు వెళ్లగా.. అక్కడి అధికారులు గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన ట్రాన్స్జెండర్స్ హెల్ప్ డెస్క్కు పంపారు. సబ్– ఇన్స్పెక్టర్ నేతృత్వంలో సాగుతున్న ఈ డెస్క్ వీరి నుంచి ఫిర్యాదు స్వీకరించింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్వాపరాలను పూర్తిగా పరిశీలించింది. అతడు సిద్దిపేటలో ఉన్నట్లు గుర్తించి తీసుకువచ్చారు. యువతిగా మారాలన్న కోరిక తీరకపోతే ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం కావడంతో పాటు భవిష్యత్లో మరిన్ని తీవ్ర పరిణామాలకు ఆస్కారం ఉందంటూ తల్లిదండ్రులకు హెల్ప్ డెస్క్ కౌన్సెలింగ్ చేసింది. ఫలితంగా పరిస్థితులు అర్థం చేసుకున్న వాళ్లు తమ కుమారుడి కోరికను మన్నించారు. హెల్ప్ డెస్కే చొరవ తీసుకుని అతడికి ఓ ఉద్యోగం ఇప్పించింది. ఎలాంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడనంటూ ‘ఆమె’గా మారిన అతడి నుంచి హామీ తీసుకుని పంపింది. ట్రాన్స్జెండర్స్ అంశాలకు సంబంధించి సహాయ సహకారాలు కావాల్సిన వారు 94906 17121లో వాట్సాప్ ద్వారా (transgender.cybsuprt121@gmail.com) ఇన్స్టాగ్రామ్ (transgender cybsupport), ఫేస్బుక్ ‘Transgender Cyberabad Support) ఖాతాల్లో సంప్రదించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. చదవండి: ట్రాన్స్జెండర్ వైద్యురాలికి కీలక పదవి -
మత్తుమందిచ్చి.. ఆ తర్వాత..
శంషాబాద్ (హైదరాబాద్): ఇంట్లో అద్దెకు దిగుతారు.. ఆపై నమ్మించి మాయచేసి మత్తుమందిస్తారు.. ఆపై దోచుకుంటారు... ఈ క్రమంలో అడ్డుకునే వారిని హత్య చేసేందుకూ వెనుకాడరు. షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లిలో ఓ మహిళ హత్య కేసులో నిందితులైన జంటను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి బుధవారం షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్తో కలిసి తన కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామానికి చెందిన గుంజి వెంకటేశ్వర్రావు అలియాస్ వెంకటేష్ (33) వృత్తిరిత్యా మేస్త్రి. అతడు అనేక నేరాల్లో పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. రొంపిచెర్ల మండలం ఇప్పర్లపల్లి గ్రామానికి చెందిన వివాహిత సానుగొమ్ముల నాగలక్ష్మి (30)తో వివాహేతర సంబంధం పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు తదితర ప్రాంతాల్లో నివాసమున్న తర్వాత షాద్నగర్ చటాన్పల్లికి చేరుకున్నారు. రాంనగర్ కాలనీలోని అవ్వారి బల్రాం ఇంట్లో గతేడాది నవంబర్లో అద్దెకు దిగారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బల్రాం భార్య సువర్ణ ఒంటిపై ఉన్న నగలు దోచేయాలనుకుని ఇద్దరూ పథకం పన్నారు. అప్పటికే ఓ మెడికల్ షాపు వ్యక్తితో పరిచయం పెంచుకున్న వెంకటేశ్వర్రావు నిద్రమాత్రలు కొన్నాడు. నవంబర్ 22న తమ ఇంట్లో చికెన్ వండామని, కల్లు కూడా తెచ్చామని సువర్ణను పిలిచారు. కల్లులో నిద్రమాత్రవేసి ఆమెకు ఇచ్చారు. పూర్తిగా స్పృహ కోల్పోతున్న సమయంలో సువర్ణ ఒంటిపై ఉన్న నగలు తీసే ప్రయత్నంలో జరిగిన ప్రతిఘటనతో ఆమెపై కూర్చుని గొంతునులిమి చంపేశారు. పుస్తెల తాడు, చెవికమ్మలు, మాటీలు తీసుకున్న నిందితులు ఇంటి గుమ్మం పరిసరాల్లో కారం పొడి చల్లి గదికి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆటోలు మారుస్తూ.. హత్య చేసిన తర్వాత నిందితులు ఆటోలో షాద్నగర్ వైన్స్ వద్దకు వెళ్లారు. వెంకటేశ్వర్రావు మద్యం తాగిన తర్వాత మరో ఆటోలో నందిగామ బస్టాప్కు చేరుకున్నారు. అక్కడి నుంచి కూడా మరో ఆటో ఎక్కిన దశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి. అక్కడి నుంచి వెళ్లిన వీరు సూర్యాపేటకు వెళ్లి ఓ వ్యక్తి పరిచయంతో ముత్తూట్ ఫైనాన్స్లో నగలు తాకట్టుపెట్టి రూ.లక్ష రుణం తీసుకుని కొంతకాలం బెంగళూరు, గుంటూరులో గడిపారు. డబ్బులు పూర్తిగా అయిపోయాక ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. ఇంటి యజమానురాలైన వద్ధురాలు ఒంటరిగా ఉండడంతో ఫిబ్రవరి 18న ఆమెకు ఆహారంలో మత్తుమందు ఇచ్చి బంగారు నల్లపూసల దండ, బంగారు గాజులు, చెవికమ్మలు తీసుకుని పరారయ్యారు. నేరం చేసి మూడు నెలల దాటడంతో ఎవరూ గుర్తుపట్టరనే ధీమాతో షాద్నగర్లో సాయన్న అనే వ్యక్తి వద్ద కుదువ పెట్టిన బంగారం విడిపించుకోడానికి బుధవారం ఉదయం అక్కడికి రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వెంకటేశ్వర్రావుపై విశాఖపట్నం, సత్తెనపల్లి, ప్రకాశం, మోత్కూరు, సంతమాగులురు, జిన్నారం, మేడ్చల్, ఎల్లారెడ్డి, పెనిగంజిప్రోలు, బోదన్లలో ఈ తరహా మోసాలకు పాల్పడిన కేసులున్నాయి. అనేక మార్లు జైలుకుపోయి వచ్చిన అతడు నాగలక్ష్మిని తోడుచేసుకుని మరోసారి వరుస నేరాలకు పాల్పడుతున్న తీరుకు పోలీసులు అడ్డుకట్ట వేశారు. నిందితుల నుంచి 10 తులాల బంగారం, 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: కట్టుకథ అల్లేసింది.. సీసీ టీవీ పట్టేసింది.. భార్య తప్పటడుగులు.. మార్పు రాకపోవడంతో.. -
సినిమా థియేటర్లో ఉరి వేసుకున్నాడు
షాద్నగర్రూరల్: కుటుంబ సభ్యులతో జరిగిన గొడవలతో మనస్థాపం చెందిన ఓ యువకుడు పనిచేసే సినిమా థియేటర్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. షాద్నగర్ పట్టణంలోని తిరుమల కాలనీకి చెందిన శ్రీను (22) పరమేశ్వర థియేటర్ క్యాంటీన్లో గత కొంత కాలంగా పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబ సభ్యులతో జరిగిన గొడవల నేపథ్యంలో మనస్థాపం చెందిన శ్రీను బుధవారం తాను పనిచేస్తున్న పరమేశ్వర థియేటర్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒంటరి జీవితంపై విరక్తి చెంది మరొకరు.. చేవెళ్ల: ఒంటరి జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శంకర్పల్లి పోలీస్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచి్చంది. పోలీసులు తెలిపిన వివరాలు... ఒంగోలు జిల్లా టంగులూరు గ్రామానికి చెందిన మేదర్గాం«దీ(48) నాలుగు సంవత్సరాల కిత్రం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూరం గ్రామానికి కుటుంబంతో సహా వచ్చి బతుకుదెరువు నిమిత్తం వచ్చి కుటుంబంతో కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. సంవత్సరం కిత్రం మేదర్గాంధీ భార్య అతనితో విడిపోయి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి అతడు మానసికంగా కుంగిపోయాడు. ఒంటరిగా ఉంటూ తీవ్ర మనస్థాపానికి గురైన మేదర్గాంధీ శంకర్పల్లిలోని వైష్ణవి హోండా షోరూంలో ఖాళీగా ఉండే మూడవ అంతస్తులో ఉరివేసుకున్నాడు. రెండు రోజుల అనంతరం అందులో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఆత్మహత్య చేసుకున్న విషయం బయటపడింది. మృతుడి వద్ద లభించిన ఐడీ కార్డుల ఆధారంగా అతని వివారలను పోలీసులు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమనాటకం.. పెళ్లనగానే ప్రేయసి పరార్ -
లేడీ శ్రీరాం కాలేజీలో ఫీజుల తగ్గింపు
న్యూఢిల్లీ : ఢిల్లీలోని లేడీ శ్రీరాం కాలేజీలో చదువుతోన్న తెలంగాణ విద్యార్థిని ఆర్థిక సమస్యలతో చదువుని కొనసాగించలేక, ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అనంతరం విద్యార్థి సంఘాల ఆందోళనల నేపథ్యంలో లేడీ శ్రీరాం కళాశాల కొన్ని కోర్సులకు ఫీజును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ల్యాప్టాప్లను అందించేందుకు ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. రెండో సంవత్సరం విద్యార్థులను హాస్టళ్ళలో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు కళాశాల పేర్కొంది. కాలేజీలు మూసివేయడంతో విద్యార్థులు కళాశాల సౌకర్యాలను వినియోగించుకోలేకపోతుండడంతో ఈ యేడాది ఫీజులో ఆ చార్జీలను తగ్గిస్తూ కాలేజీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. (ఐఏఎస్ కావాలన్న ఆశలు ఆవిరి..) దీంతో ఫీజు గణనీయంగా తగ్గనుంది. అలాగే మిగిలిన పీజు సైతం వాయిదాల పద్ధతిలో చెల్లించే అవకాశాన్ని సైతం కళాశాల కల్పించింది. కోవిడ్ తగ్గిన తరువాత అవసరాన్ని బట్టి రెండు, మూడో యేడాది విద్యార్థులకు మరింత మందికి హాస్టల్ వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. విద్యార్థుల హాస్టల్ సౌకర్యం పొడిగింపుని నిరోధించే కొన్ని వాక్యాలను సైతం దరఖాస్తు ఫారం నుంచి తొలగిస్తున్నట్లు కళాశాల అధికారులు పేర్కొన్నారు. (చదువుల తల్లి బలవన్మరణం) -
భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా
షాద్నగర్ టౌన్ : తప్పుడు పత్రాలతో రుణాలు కొట్టేస్తూ, రియల్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని డబ్బు ఎగ్గొట్టే నైజం ఆ భర్తది. ఆ మోసాలకు వంతపాడే పాత్ర అతని భార్యది. ఇలా వీరిద్దరూ కలిసి రూ.5 కోట్లకు ఇండియన్ బ్యాంకుకే ఎసరుపెట్టారు. చివరకు గుట్టురట్టయి పోలీసులకు చిక్కారు. ఈ ఉదంతం వివరాలను బుధవారం షాద్నగర్ ఏసీపీ సురేందర్ విలేకరులకు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పబంతి ప్రభాకర్, సరిత దంపతులు హైదరాబాద్లోని టోలిచౌకిలో ఉంటున్నారు. వీరిద్దరూ ప్రొప్రెయిటర్లుగా సాయి ప్రాపర్టీ డెవలపర్స్ సంస్థను ఏర్పాటుచేసి షాద్నగర్, నాగోల్, బండ్లగూడ, రాజేంద్రనగర్, నార్సింగ్, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. భూములను కొని వాటిని వెంచర్లుగా చేసి అమ్మేవారు. అయితే ఇవి గ్రామాలకు చివరన ఉండటంతో అమ్ముడుపోక.. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మోసానికి తెరలేచిందిలా.. షాద్నగర్ పరిధి సోలీపూర్ గ్రామ శివారులో ప్రభాకర్ దంపతులు కొన్నేళ్ల క్రితం 25 ఎకరాల భూమిని కొని వెంచర్ వేసి, ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు అవసరమైన రుణం కోసం 2015లో షాద్నగర్లోని ఇండియన్ బ్యాంక్ను ఆశ్రయించారు. ఇళ్లు అమ్మినట్లు బ్యాంకు వారిని తప్పుదోవ పట్టించడంతో పాటు బోగస్ వ్యక్తుల్ని, వారి ఆధార్కార్డులను, జీతాల ధ్రువీకరణ పత్రాల నకళ్లు సృష్టించి.. విడతలవారీగా రూ.5 కోట్లకుపైగా రుణం పొందారు. ఫతుల్లాగూడలో దివాకర్సింగ్కు చెందిన 9 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్ చేసుకున్న వీరు అతనికి డబ్బులు సరిగా చెల్లించలేదు. అపార్ట్మెంట్ నిర్మాణదారుడు కిరణ్కుమార్రెడ్డిని కూడా మోసం చేశారు. ఇలాగే మరికొన్ని మోసాలకు పాల్పడిన వీరిపై అబ్దుల్లాపూర్మెట్, కేపీహెచ్బీ, రాజేంద్రనగర్, మాదాపూర్, నార్సింగ్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మరోపక్క ప్రభాకర్ దంపతులు ఎంతకీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు.. రుణపత్రాలను పరిశీలించారు. మోసం చేశారని గుర్తించి గత అక్టోబర్లో బ్యాంకు మేనేజర్ మహేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ప్రభాకర్ దంపతులను అరెస్టు చేసేందుకు ఈనెల 17 రాత్రి టోలీచౌకిలోని వారి విల్లాకు వెళ్లారు. ప్రభాకర్ బంధువులు, సన్నిహితులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. షాద్నగర్ పట్టణ సీఐ శ్రీధర్కుమార్, సిబ్బంది చాకచక్యంగా వారిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. అడ్డుకున్న వారిపై కూడా గోల్కొండ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రభాకర్ దంపతులు చేసిన అప్పులను తీర్చేందుకు మరికొన్ని అప్పులు చేస్తూ చిట్టీల వ్యాపారం చేసే వారని, ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఏసీపీ సురేందర్ తెలిపారు. విలాసవంతమైన విల్లా, కార్లు, బైకులు కొన్నారని, ప్రభాకర్ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడని చెప్పారు. -
ఐఏఎస్ కావాలన్న ఆశలు ఆవిరి...
షాద్నగర్ రూరల్: ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ కావాలని ఆమె కల. దాని కోసం శ్రమిస్తోంది. కానీ, ఆర్థిక పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేసి ఆత్మహత్యకు పురికొల్పాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని శ్రీనివాస కాలనీకి చెందిన శ్రీనివాస్రెడ్డి, సుమతి దంపతులకు ఐశ్వర్య(19), వైష్ణవి కూతుళ్లు. శ్రీనివాస్రెడ్డి బైక్ మెకానిక్. ఐశ్వర్య 8వ తరగతి వరకు హైదరాబాద్లో వారి బంధువుల వద్ద చదువుకుంది. ఆ తర్వాత 9, 10 తరగతులు, ఇంటర్ షాద్నగర్లో అభ్యసించింది. ఇంటర్లో 985 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకు సాధించింది. ఢిల్లీ వెళితే డిగ్రీతో పాటు సివిల్స్లో కూడా శిక్షణ తీసుకోవచ్చని ఉపాధ్యాయులు సూచించారు. అయితే, ఐశ్వర్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. షాద్నగర్కు చెందిన కొందరు చదువులకయ్యే ఖర్చును భరిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఐశ్వర్యను తల్లిదండ్రులు ఢిల్లీకి పంపించారు. గత ఏడాదిన్నరగా ఆమె ఢిల్లీ వర్సిటీలోని హాస్టల్లో ఉంటూ డిగ్రీ (రెండవ సంవత్సరం) చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వర్సిటీ వారు సెలవులు ప్రకటించడంతో ఐశ్యర్య షాద్నగర్కు వచ్చింది. ఇటీవల ఆమె ఫోన్కు వర్సిటీ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. వెంటనే హాస్టల్ను ఖాళీ చేయాలని అందులో ఉంది. మరోవైపు కేంద్ర, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చే ఇన్స్పైర్ స్కాలర్షిప్ రాలేదు. బయట అద్దెకు ఉండి చదువుకోవాలంటే డబ్బులు కావాలి. (చదవండి: ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!) దీంతో ఆమె తల్లిదండ్రులు అప్పు కోసం ఎంతో ప్రయత్నించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చిన వారు కూడా ముందుకురాలేదు. ఈ క్రమంలోనే శ్రీనివాస్రెడ్డి అనారోగ్యానికి గురయ్యాడు. తన చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను చూసిన ఐశ్వర్య తీవ్ర మనోవేదనకు గురైంది. తన చదువు తల్లిదండ్రులకు భారమని.. అలా అని చదువు లేకపోతే బతకలేనని.. నన్ను క్షమించండి అని పేర్కొంటూ లేఖ రాసి ఈ నెల 3న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కనీసం ఒక సంవత్సరం ఇన్స్పైర్ స్కాలర్షిప్ వచ్చేలా చూడండి అంటూ ఐశ్వర్య ఆ లేఖలో వేడుకుంది. (చదవండి: ‘అండగా ఉంటామని ముఖం చాటేశారు’) చదువులు కొనసాగవనే బెంగతోనే ఐశ్వర్య చిన్ననాటి నుంచి ఏ పరీక్షలు రాసినా మంచి మార్కులు సాధించేది. ఐఏఎస్ కావాలని కలలు కనేది. తన కలలను సాకారం చేయలేకపోయాం. చదువులు కొనసాగవనే బెంగతోనే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. – శ్రీనివాస్రెడ్డి, ఐశ్వర్య తండ్రి -
ఐశ్వర్యది ప్రభుత్వ హత్యే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన విద్యార్థిని ఐశ్వర్యది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లేడీ శ్రీరాం కళాశాల (ఎల్ఎస్ఆర్ ) స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ఆరోపించింది. కళాశాల ఉదాసీన వైఖరి సరికాదని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నెల 3న ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడింది. దీనికి నిరసనగా కేంద్ర సైన్స్, టెక్నాలజీ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ, జేఎన్యూ విద్యార్థి నేతలు ధర్నా నిర్వహించారు.జేఎన్యూ స్టూడెంట్ యూనియన్, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ), తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ (టీఎస్ఏ), ఐద్వా–ఢిల్లీలు కూడా నిరసన గళం వినిపించాయి. జస్టిస్ ఫర్ ఐశ్వర్య నినాదంతో ఆందోళన చేశారు. ‘కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వైఫల్యం కారణంగా అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఉపకార వేతనం ఆలస్యం కావడం వల్లే ఐశ్వర్య ఆర్థిక ఒత్తిడికి గురైంది. కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి రాజీనామా చేయాలి. ఐశ్వర్య కుటుంబానికి ప్రభుత్వం పరిహారమివ్వాలి. ఆమె కుటుంబానికి న్యాయం జరిగే వరకు తరగతులు బహిష్కరి స్తున్నాం’ అని ఎస్ఎఫ్ఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఐశ్వర్యకు చెల్లించాల్సిన ఉపకార వేతనంతో పాటు అదనంగా కొంత మొత్తాన్ని బాధిత కుటుం బానికి అందజేయాలి. విద్యార్థులందరి ఖాతా ల్లోనూ తక్షణమే ఉపకార వేతనాలు జమచేయాలి. కరోనా మహమ్మారి నేపథ్యంలో విద్యార్థులకు మద్దతుగా కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని ఐద్వా ఢిల్లీ అధ్యక్ష, కార్యదర్శులు మెమూనా మొల్లా, ఆశాశర్మ ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ విద్యా విధానం బాగా సాగుతోందని కేంద్రమంత్రి భావిస్తున్నారని, కానీ విద్యార్థుల ఇబ్బందులు విస్మరిస్తున్నారని జేఎన్యూ ప్రతిని«ధులు పేర్కొన్నారు. ‘రాష్ట్రేతర వర్సిటీలు, విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం విద్యా విధానం తీసుకురావాలి. వేరే ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడమే ఐశ్వర్య ఆత్మహత్యకు కారణం. ఢిల్లీలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఐశ్వర్య కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలి. ఐశ్వర్య చెల్లెల్ని ప్రభుత్వమే చదివించాలి’ అని టీఎస్ఏ ప్రతినిధి వివేక్ తెలిపారు. ఎల్ఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉన్నిమాయ, ఎస్ఎఫ్ఐ ఢిల్లీ సంయుక్త కార్యదర్శి మౌనిక శ్రీసాయి, జేఎన్యూఎస్యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్, అంబేడ్కర్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ కౌన్సిలర్ నవీన లాంబా, ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సంయుక్త కార్యదర్శి దీప్సిత ధర్, ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, ఏపీ బాధ్యురాలు బూస అనులేఖ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. కాగా, కేంద్ర విద్యా మంత్రి పోఖ్రియాల్ నివాసం వద్ద ఎన్ఎస్యూఐ, తెలుగు స్టూడెంట్ అసోసియేషన్ కార్యకర్తలు ఆందోళన చేయడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో కార్యక్రమాన్ని విరమించారు. ఒత్తిడికి లోనై.... ఎస్ఎఫ్ఐ ఢిల్లీ విభాగం నిర్వహించిన వెబ్ మీడియా సమావేశంలో ఐశ్వర్య తల్లి మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో ఇంటికి వచ్చిన ఐశ్వర్యకు వసతి గృహం ఖాళీ చేయాలని ఇటీవల సందేశం వచ్చిందన్నారు. మధ్యలో చదువు మానేస్తే నవ్వులపాలు అవుతామని తీవ్ర ఒత్తిడికి లోనయిందని చెప్పారు. ఉపకార వేతనం సకాలంలో అంది ఉంటే తమ కుమార్తె దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐశ్వర్య మృతికి రాహుల్ సంతాపం ఐశ్వర్వ ఆత్మహత్య పట్ల కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు, లాక్డౌన్ వంటి నిర్ణయాలతో లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిందని, ఇది నిజమని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. -
‘ఐశ్యర్యకి ఫోన్ కూడా కొనివ్వలేకపోయాం’
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక ఇబ్బందులే తమ కూతుర్ని పొట్టనపెట్టుకున్నాయని షాద్నగర్లో ఆత్మహత్యకు పాల్పడిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యారెడ్డి తల్లిదండ్రులు శ్రీనివాస్రెడ్డి, సుమతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులు వినడానికై కనీసం తమ కూతురికి ఫోన్ కూడా కొనివ్వలేకపోయామని కన్నీరుమున్నీరయ్యారు. సోమవారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘:ఐశ్యర్య మొదటి నుంచి చదువులో ఎంతో ముందుండేది. ఉన్నత చదువు కోసం అప్పు చేసి మరీ ఆమెను ఢిల్లీకి పంపించాం. కూతుర్ని ఐఏఎస్ చేయడం కోసం చివరకు మా ఇంటిని కూడా తాకట్టు పెట్టాం. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసులు వినడం కోసం ఫోన్ లేదా ల్యాప్టాప్ అడిగింది. మా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఫోన్ కూడా కొనివ్వలేకపోయాం. చనిపోయే ముందు కూడా ఐశ్యర్య మా అందరితో కలివిడిగానే మాట్లాడింది. స్కాలర్షిప్ రాకపోవడం ఐశ్యర్యను మరింత కుంగదీసింది. గతంలో మా కూతురు టాపర్గా నిలిచినప్పుడు ఎందరో అండగా ఉంటామని ముందుకు వచ్చారు, కానీ కొద్దిరోజులకే ముఖం చాటేశారు. మాకొచ్చిన బాధ ఏ తల్లిదండ్రులకు రావొద్దు’ అని ఐశ్యర్య తల్లిదండ్రులు భోరున విలపించారు. ప్రభుత్వం ఆదుకొని తమ చిన్న కూతురు చదువుకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. (చదవండి : ఐశ్వర్య ఆత్మహత్య.. రాహుల్ స్పందన) షాద్నగర్కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్నగర్ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్ఎస్ఆర్లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్షిప్ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
ఇది నిజం! ఇదే నిజం!!: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా హస్టల్ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చేయించడంతో మనస్తాపానికి గురైన షాద్నగర్ డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఐశ్వర్య కుటుంబానికి తన సంతాపం తెలిపారు. బీజేపీ అనాలోచితంగా విధించిన లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసిందని మండి పడ్డారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. "ఈ విచారకరమైన క్షణంలో విద్యార్థి ఐశ్వర్య కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. బీజేపీ అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం” అని రాహుల్ ట్వీట్ చేశారు. (చదవండి: స్కూల్ ఫీజుకు బదులుగా కొబ్బరి బొండాలు..!) ఈ అత్యంత విచారకరమైన సమయంలో ఈ విద్యార్థిని కుటుంబ సభ్యులకు నా ప్రగాడ సంతాపం తెలుపుతున్నాను. ఉద్దేశ పూర్వకంగా చేసిన నోట్ల రద్దు మరియు లాక్డౌన్ ద్వారా, బీజేపి ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం! ఇదే నిజం!! pic.twitter.com/mSszEES6ha — Rahul Gandhi (@RahulGandhi) November 9, 2020 షాద్నగర్కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ ఖాళీ చేయించింది. ఈ క్రమంలో షాద్నగర్ వచ్చిన ఐశ్వర్య ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబానికి భారం కాకుడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో తెలిపింది. ఇప్పటికే తన చదువు కోసం తల్లిదండ్రులు ఇంటిని తనఖా పెట్టారన్నది. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే ఐశ్వర్య యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్కాలర్షిప్ కింద బీఎస్సీ (హన్స్) గణితం చదవడానికి ఎల్ఎస్ఆర్లో చేరింది. ఇక ఈ ఏడాది మార్చి నుంచి స్కాలర్షిప్ రాకపోవడంతో పుస్తకాలు, హస్టల్ ఫీజు వంటి ఇతర ఖర్చులకు ఇబ్బంది తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుంది. -
షాద్నగర్లో విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: షాద్నగర్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. షాద్నగర్కు చెందిన ఐశ్వర్య ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బలవంతంగా హాస్టల్ను ఖాళీ చేయించింది. యాజమాన్యం తీరుకు మనస్తాపానికి గురైన విద్యార్థిని ఐశ్వర్య షాద్నగర్ వచ్చి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మరణానికి కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చదవండి: (తునిలో ఎన్నారై సురేశ్ మృతి కలకలం.. భార్యే..!) (నంద్యాల కుటుంబం ఆత్మహత్య: సీఐ, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్) (పరిటాల సునీత ముఖ్య అనుచరుడి అరెస్ట్) -
షాద్నగర్లో కిడ్నాప్.. కొత్తూరులో హత్య
షాద్నగర్ రూరల్: భూవివాదాల నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ఓ వ్యాపారిని శుక్రవారం షాద్నగర్లో కిడ్నాప్ చేసిన దాయాదులు కొత్తూరులో హత్య చేశారు. ఫరూఖ్నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రాంచంద్రారెడ్డి (55) కొన్నేళ్లుగా జడ్చర్లలో స్థిరపడి అక్కడే పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. సొంత గ్రామంలో వ్యవసాయ పొలం ఉండటంతో అప్పుడప్పుడు అన్నారానికి వచ్చి వెళ్తుండేవాడు. కాగా పొలం విషయంలో రాంచంద్రారెడ్డికి అన్నారంలోని తన దాయాదులతో గతంలో ఘర్షణలు జరిగాయి. దీనిపై షాద్నగర్ పోలీస్స్టేషన్లో కేసులు సైతం నమోదయ్యాయి. తాజాగా భూ విషయంలో మాట్లాడుకుందామని దాయాదులు చెప్పడంతో రాంచంద్రారెడ్డి మధ్యాహ్నం డ్రైవర్ పాషాతో కలసి తన ఇన్నోవా వాహనంలో షాద్నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ వైపు వచ్చాడు. దీంతో భూమి విషయం మాట్లాడేందుకు దాయాదులు ఇన్నోవా కారు ఎక్కి మాట్లాడుతుండగా వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో వారు తమ వద్ద ఉన్న కత్తులను చూపించి బెదిరించడంతో డ్రైవర్ పాషా వాహనం దిగి పారిపోయాడు. ఇదే అదునుగా భావించిన వారు రాంచంద్రారెడ్డిని ఆయన వాహనంలోనే కిడ్నాప్ చేసి షాద్నగర్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా హైదరాబాద్ వైపునకు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న షాద్నగర్ ఏసీపీ సురేందర్ ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. సెల్ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా రాంచంద్రారెడ్డి కొత్తూరు మండలంలోని పెంజర్ల శివారులోని ఓ వెంచర్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి కారును పరిశీలించగా కత్తిపోట్లకు గురై కొనఊపిరితో ఉన్న రాంచంద్రారెడ్డిని ప్రైవేటు వాహనంలో షాద్నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యలోనే రాంచంద్రారెడ్డి మృతి చెందాడు. గతంలో మృతుడు బాదేపల్లి సింగిల్ విండో చైర్మన్గా బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. కొత్తూరులో సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, ఏసీపీ సురేందర్ పరిశీలించారు. అనంతరం క్లూస్టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. -
షాద్నగర్లో రియల్టర్ దారుణ హత్య!
సాక్షి, హైదరాబాద్: షాద్నగర్కు చెందిన రియల్టర్, కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆయన ఈ సాయంత్రం కిడ్నాపైనట్టు తొలుత వార్తలొచ్చాయి. భూ వివాదం నేపథ్యంలో ఆయనను కిడ్నాప్ చేసినట్టు, రామచంద్రారెడ్డి డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. షాద్నగర్లోని టీచర్స్ కాలనీలో నివాసముండే రామచంద్రారెడ్డిని ఢిల్లీ వరల్డ్ స్కూల్ ముందు ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి కిడ్నాప్ చేసినట్టు అతను పోలీసులకు తెలిపాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన కోసం గాలింపు చేపట్డారు. అంతలోనే కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డి హత్యకు గురైనట్టు సమాచారం అందింది. పోలీసులు మృతదేహాన్ని షాద్నగర్ ఆసుపత్రికి తరలించారు. షాద్నగర్ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో చాలా కాలంగా ఓ భూ వివాదం నడుస్తోంది. ఇరువర్గాల గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామచంద్రారెడ్డి జడ్చర్ల సింగిల్ విండో చైర్మన్గా పనిచేశారు. (చదవండి: చైనా వస్తువుల బ్యాన్ తొందరపాటు చర్య: కేసీఆర్) -
నాన్న వచ్చాడు.. నవ్వులు తెచ్చాడు!
షాద్నగర్ రూరల్: పేదరికం ఓడిపోయింది.. మమకారమే గెలిచింది.. పిల్లలపై ఉన్న ప్రేమ, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయతను కాదనుకోలేక ఆ తండ్రి మనసు మార్చుకున్నాడు. శిశువిహార్కు తరలించిన చిన్నారులను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. తల్లిని కోల్పోయి, తండ్రికి దూరమై అనాథలుగా శిశువిహార్కు వెళ్లిన చిన్నారులపై కథనం ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన విషయం తెలిసిందే. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం) మమకారమే గెలిచింది షాద్నగర్ పట్టణంలో ఉండే గణేశ్, శ్రీలత దంపతులకు పిల్లలు శ్రీగాయత్రి(4), హన్సిక (17 నెలలు) ఉన్నారు. శ్రీలత కొన్నిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూయడంతో పిల్లల బాగోగులు చేసుకునేందుకు గణేశ్కు భారంగా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన అతడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. చిన్నారుల ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో శుక్రవారం వారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించడంతో శిశువిహార్కు తరలించిన విషయం తెలిసిందే. హాస్టల్కు వెళ్లేటప్పుడు చిన్నారుల పరిస్థితి అందరి మనసులను కదిలించిన విషయం విదితమే. (మహిళల రక్షణ కోసం ‘స్త్రీ’) ‘నాన్న నేను మళ్లీ వస్తా.. అమ్మ బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుండె.. ఆమె గుండెనొప్పితో చనిపోయింది.. అందుకే నేను మా చెల్లి హాస్టల్కు వెళ్తున్నాం’ అని చిన్నారి శ్రీగాయత్రి చెప్పడంతో స్థానికులు, అధికారులు భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. అయితే, భార్య మృతిచెందడం, పిల్లలు శిశువిహార్కు తరలివెళ్లడంతో ఒంటరిగా ఉన్న గణేశ్ మనసు చలించిపోయింది. పేదరికంలో ఉన్నా చిన్నారులను పోషించుకుంటానని భావించాడు. ఈనేపథ్యంలో మనసు మార్చుకున్న అతడు తన పిల్లలను తిరిగి అప్పగించాలని కోరుతూ శనివారం శిశువిహార్కు వెళ్లి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. చిన్నారులను తాను జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇచ్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో పేదరికం ముందు తండ్రికి పిల్లలపై ఉన్న మమకారమే గెలిచింది. స్పందింపజేసిన కథనం ‘అమ్మలేదు..నాన్న పోషించ లేడు’ అని సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ప్రజలను స్పందింపచేసింది. హాస్టల్కు వెళ్లేటప్పుడు చిన్నారి శ్రీగాయత్రి చెప్పిన మాటలు అందరి హృదయాలను ద్రవింపజేశాయి. దీంతో గణేశ్ మనసు మార్చుకొని శనివారం శిశువిహార్కు వెళ్లి తన కూతుళ్లు శ్రీగాయత్రి, హన్సికను తిరిగి ఇంటికి తీసురావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. నా పిల్లలను బాగా చూసుకుంటాను.. ‘అనారోగ్యంతో నా భార్య కన్నుమూయటం, ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో పిల్లల పోషణ భారంగా మారింది. చిన్నారుల ఆలనాపాలనా చూసుకునేవారు లేకపోవడంతోనే వారిని శిశువిహార్కు అప్పగించాను. భార్య చనిపోవడం, పిల్లలు లేకపోవడంతో ఒంటరి వాడినయ్యాను. నా పిల్లలపై ఉన్న మమకారం, ప్రేమే వారిని తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేసింది. నా పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాన’ని చిన్నారుల తండ్రి గణేశ్ వివరించాడు. -
ఈ పోలీసులకు ఏమైంది..!
సాక్షి, షాద్నగర్ : ‘దిశ’ కేసులో వారు వ్యవహరించిన తీరుకు ప్రజలు జేజేలు పలికారు. జనారణ్యంలోకి వచ్చిన పులిని ప్రాణాలకు తెగించి ఎవరికీ హాని జరగకుండా పట్టుకున్న ఘనత వారిది.. కిడ్నాప్ అయిన చిన్నారిని గంటల వ్యవధిలో తీసుకొచ్చిన సాహసం వారి సొంతం. కానీ, ఇటీవల జరిగిన ఘటనలతో విమర్శల పాలయ్యారు. ప్రజా రక్షణకు అంకిత భావంతో పనిచేసే పోలీసులు స్వతహాగా క్రమశిక్షణ దిశగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సంఘటనలు సూచిస్తున్నాయి. షాద్నగర్ పరిధిలో ఇటీవల పోలీసులు చేసిన నృత్యాలు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. పట్టణంలో పోలీసులు ఏర్పాటు చేసిన విందులో కొందరు నృత్యాలు చేయడం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ దాకా వెళ్లడంతో సీసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. షాద్నగర్ పట్టణ సీఐ శ్రీధర్కుమార్ను కమిషనరేట్కు అటాచ్ చేసిన సంగతి విధితమే. ఈ వివాదం సమసిపోకముందే.. ఇటీవల రామేశ్వరం శివారులోని తోటలో మద్యం సేవిస్తూ పోలీసులు చేసిన నృత్యాల జోష్ అంతా ఇంకా కాదు. ఈ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. దీనితో మరోసారి పోలీసులపై విమర్శలు వెల్లువెత్తాయి. వరుస ఘటనలతో వచి్చన విమర్శలు పోలీసులను ఊపిరాడనీయకుండా చేశాయి. ఈ సంఘటనలో కొత్తూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్ఐ బాలస్వామి, కానిస్టేబుళ్లు అశోక్రెడ్డి, అమర్రాథ్, చంద్రమోహన్, వెంకటేష్, హోంగార్డు రామకృష్ణలను సైబరాబాద్ కమిషనరేట్కు అటాచ్ చేశారు. షాద్నగర్ సబ్డివిజన్లో ఏం జరుగుతుందని పోలీసు శాఖ ఆరాతీస్తోంది. కొందరు కావాలనే వీడియోలను వైరల్ చేశారనే ఆలోచన పోలీసుల్లో ఉంది. కాగా, పోలీసుల్లో కూడా వర్గాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. రామేశ్వరంలో జరిగిన విందులో పోలీసు శాఖకు సంబందించిన వ్యక్తులే ఉన్నారు. ఇతరులెవరూ లేరు. అలాంటçప్పుడు అక్కడ నృత్యాలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎలా వైరల్ అయ్యిందన్నదే ప్రశ్న. వీడియోలు బయటికి ఎలా వెళ్లాయన్నది పక్కన పెట్టి.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. నిరంతరం ప్రజల కోసం శ్రమించే పోలీసులు ఇలాంటి సరదాలకు దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. -
మందేసి.. చిందేసి..!
నందిగామ: షాద్నగర్ పోలీసులు ఇటీవల నాగిని డ్యాన్స్ చేసిన ఘటన మరవకముందే.. కొత్తూరు పీఎస్లో పనిచేస్తున్న పోలీసులు సైతం ఇలాంటి వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. కొత్తూరు పీఎస్లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్ వివాహం ఈ నెల 12న షాద్నగర్ సమీపంలోని రామేశ్వరం ఆలయంలో జరిగింది. ఈ పెళ్లికి కొత్తూరు పీఎస్లో పనిచేసే 12 మంది పోలీసులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత సమీపంలోని ఓ వెంచర్లో విందు చేసుకున్నారు. ఈ విందులో పాల్గొన్న కొంతమంది పోలీసులు మద్యం బాటిళ్లు చేతపట్టుకొని, మద్యం తాగుతూ, నృత్యాలు చేసిన వీడియోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. ఈ విషయమై కొత్తూరు ఇన్స్పెక్టర్ చంద్రబాబును వివరణ కోరేందుకు ప్రయత్నించగా తాను బిజీగా ఉన్నానని, ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్ నంబర్కు ఫోన్ చేసి మాట్లాడాలని ఫోన్ కట్ చేశాడు. ఏఎస్సై అబ్దుల్లాను అడగగా ఈ నెల 12న ఉన్నతాధికారుల అనుమతితోనే వివాహ వేడుకకు హాజరైనట్లు తెలిపారు. -
అక్రమ బంగారు బిస్కెట్ల పట్టివేత
సాక్షి, హైదరాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు మరో అక్రమ బంగారం రవాణాను భగ్నం చేశారు. బంగారం అక్రమ రవాణా జరుగుతోందన్న ముందస్తు సమాచారంతో డీఆర్ఐ అధికారులు సోమవారం షాద్నగర్ సమీపంలోని చిలకమర్రి గ్రామ సమీపంలోని రాయికల్ టోల్గేట్ వద్ద ఓ ప్రైవేటు క్యాబ్ను ఆపారు. అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 3,099 గ్రాముల బరువున్న 31 విదేశీ బంగారు బిస్కెట్లు లభించాయి. ఎలాంటి రసీదులు లేకుండా తరలిస్తున్న ఆ బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకొని నిందితులని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ బంగారు బిస్కెట్ల విలువ రూ. 1.38 కోట్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
కాళ్లు మొక్కుతాం.. కందులు కొనండి
షాద్నగర్ టౌన్: కందులను అమ్ముకునేందుకు మార్కెట్కు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని.. దళారులతో చేతులు కలిపి దందా నిర్వహిస్తున్నారని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ రైతులు ఆరోపించారు. తాము తెచ్చిన కందులను కొనుగోలు చేయమని కొనుగోలు కేంద్రం ఇన్చార్జి నర్సింహారెడ్డి కాళ్లు మొక్కారు. ఈ నేపథ్యంలో ఇన్చార్జికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ కందులను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట పాత జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. కాగా ఘటనపై విచారణ చేపడతామని ఐపీఎస్ అధికారిణి రితిరాజ్ రైతులకు హామీ ఇచ్చారు. -
విచిత్రం: ‘ఆత్మ’లకు ఓటు!
సాక్షి, షాద్నగర్ : సహకార సంఘాల ఓటరు జాబితాలో అధికారులు మృతిచెందిన వారికి కూడా చోటు కల్పించారు. సంఘంలో సభ్యులై ఉండి చనిపోయిన రైతుల పేర్లను జాబితాలో నుంచి తొలగించలేదు. షాద్నగర్ నియోజకవర్గం పరిధిలో మేకగూడ, నందిగామ, చేగూరు, కొత్తపేట, షాద్నగర్, కొందుర్గులో వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో మొత్తం 16740 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఈసారి ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను తయారు చేశారు. ఈ జాబితాలో చాలా మంది ఫొటోలు కనిపించడం లేదు. అదేవిధంగా చనిపోయిన ఓటర్ల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఒక్కో వార్డులో సుమారు పది నుంచి ఇరవై మంది మృతుల పేర్లు జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే, ఓటరు జాబితాలో ఉన్న మృతులకు సంబంధించిన రుణాలను వారి కుటుంబ సభ్యులు చెల్లిస్తే జాబితాలో నుంచి పేర్లు తొలిగిపోతాయని, ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో రుణాలు చెల్లించకుండా ఉండటంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారికి ఓటు హక్కు ఉన్న దృశ్యం ముందస్తు చర్యలేవీ.. ముందుగా ఓటర్ల జాబితాను రూపొందించి సహకార సంఘం కార్యాలయంలో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండానే ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరి ఓటర్ల ఫొటోలు లేకపోవడంతో ఓటర్లను గుర్తించడం ఇబ్బందిగా మారిందని నాయకులు అంటున్నారు. గ్రామాల్లో తిరిగి విచారణ చేశాం. సహకార ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా తయారు చేసేటప్పుడు గ్రామాల్లో పర్యటించి ఓటర్లను గుర్తించాం. చనిపోయిన వారి వివరాలు మాకు తెలియలేదు. దీంతో ఓటరు జాబితాలో పేర్లు తొలగించలేకపోయాం. – మహ్మద్ షరీఫ్, సీఈఓ, కొందుర్గు సహకార సంఘం -
హడలెత్తించిన చిరుత
షాద్నగర్ టౌన్/రూరల్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఓ చిరుత హడలెత్తించింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక షాద్నగర్లోని పటేల్ రోడ్డుపై ఒక చిరుతవచ్చింది. అక్కడి నుంచి ప్రై వేట్ ఉద్యోగి మన్నె విజయ్కుమార్ ఇంటిపైకి చే రింది. పైపోర్షన్లో ఉండే ఆయన సోమవారం పా లు తీసుకొచ్చి చూడగా వాటర్ ట్యాంక్ పక్కన చి రుత తోక కనిపించింది. వెంటనే ఆయన ఇంట్లోని తన భార్యకు విషయం చెప్పి బయటకు రావొద్దని అప్రమత్తం చేశాడు. అలాగే కాలనీవాసులతో పా టు 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. షాద్నగర్ ఏసీపీ సురేందర్, సీఐ శ్రీధర్కుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకొని మరో ఇంటి పైనుంచి చిరుతను పరిశీలించారు. మత్తు మందు ఇచ్చి..: విషయాన్ని పోలీసులు ఫారెస్టు అధికారులతో పాటు హైదరాబాద్ జూపా ర్కు సిబ్బందికి సమాచారమిచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి బీమానాయక్, శంషాబాద్ రేంజ్ ఆఫీసర్ హరిమోహన్రెడ్డి, రెస్క్యూ టీం అధికారి రమేష్కుమార్, జూపార్కు అసిస్టెంట్ డాక్టర్లు అస దుల్లా, అఖిల్, డిప్యూటీ డైరెక్టర్ ఎండీ హకీం ఘట నా స్థలానికి చేరుకున్నారు. రెస్యూ టీం సిబ్బంది చి రుత ఉన్న ఇంటి చుట్టూ వలలు వేశారు. ఉదయం 8కి చిరుత మెట్ల పైనుంచి కిందికి వచ్చి బాత్రూం ఎదుట పడుకుంది. రెస్యూ టీం ఇంటి లోపలికి వెళ్లి బాత్రూం కిటికీ నుంచి ట్రంక్ లైజర్ సాయంతో షూట్ చేసి రెండు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చారు. చిరుత పరుగులు.. మత్తు ఇంజక్షన్లు ఇచ్చిన వెంటనే పులి ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు పెట్టింది. దీంతో కాలనీలోని జనం భయాందోళనకు గురయ్యారు. చిరుత పరుగెత్తే సమయంలో దానికి ఎదురుపడిన కానిస్టేబుల్ లక్ష్మణ్పై పంజా విసరడంతో ఆయనకు స్వల్ప గాయాలవగా.. చిరుత పక్క వీధిలోని ఓ పాడుపడిన గోడల్లో పడిపోయింది. వెంటనే అటవీ సిబ్బంది, రెస్క్యూ టీం దానిని బంధిం చి ప్రత్యేక అంబులెన్సులో హైదరాబాద్లోని జూపార్కుకు తరలించారు. చిరుత విషయం తెలుసుకొని జనం పటేల్ రోడ్డుకు భారీగా తరలివచ్చారు. పట్టుబడిన చిరుత మగదని, రైల్వేస్టేషన్ సమీపంలోని కమ్మదనం అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని డీఎఫ్ఓ బీమానాయక్ అనుమానం వ్యక్తం చేశారు. చిరుతను బంధిస్తున్న దృశ్యం -
స్మార్టుగా ఎన్నికల ప్రచారాలు!
సాక్షి, షాద్నగర్ టౌన్: మున్సిపాలిటీ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో అభ్యర్థులు స్మార్టుగా ప్రచారం వైపు దృష్టి సారించారు. చాలా మంది స్మార్ట్ ఫోన్లలో ఇంటర్ నెట్ను అధికంగా ఉపయోగిస్తుండటంతో అభ్యర్థులు అన్ లిమిటెడ్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి ఓట్లను అభ్యరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ‘ప్రజాసేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి, ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తాం’ అంటూ అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల్లో గెలిస్తే చేపట్టే అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను తయారు చేసి వాట్సాప్, ఫేస్బుక్ సహాయంతో ఇంటింటికి ప్రతి ఓటరుకు చేరవేస్తున్నారు. అభ్యర్థుల మద్దతుదార్లు వార్డుల వారీగా ఉంటే ఓటర్లకు సంబంధించిన సెల్ ఫోన్ నంబర్లను సేకరించి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కూర్చున్న చోటు నుంచి అభ్యర్థులు ఓటర్లుకు ఫోన్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ సెల్ఫోన్లు వాడుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను పలకరించడం చాలా సులభంగా మారింది. ఇంటింటి ప్రచారాలకు తోడుగా వ్యక్తిగతంగా ఫోన్లు చేసి పలకరిస్తే అధిక ఓట్లు రావచ్చనే భావనతో అభ్యర్థులు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. ఓటరు జాబితాల చేరవేత కొంత మందికి ఓటరు జాబితాలో పేరు ఉందోలేదో అన్న విషయం తెలియదు. ఓటు ఎక్కడ వేయాలో పోలింగ్ కేంద్రాల గురించి ఓటర్లకు చాలా మందికి తెలియదు. దీంతో ఓటరు జాబితాలతో పాటుగా పోలింగ్ స్టేషన్ల వివరాలను వాట్సాప్లలో పంపిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికల సంఘం కొత్తగా రూపొందించిన పోర్టల్ ద్వారా సమాచారాన్ని సేకరించి అభ్యర్థులకు చేరవేస్తున్నారు. ఓటు ఏవార్డులో ఉంది. ఏ కేంద్రంలో ఓటు వేయాలన్న విషయాలను కూడా అభ్యర్థులు ఓటర్లకు వాట్సాప్ల ద్వారా ఇప్పటి నుంచే సూచిస్తున్నారు. హామీలకు వేదిక ఎన్నికల ప్రచారానికి పోస్టులు తయారు చేసుకునేందుకు ఇంటర్ నెట్లో పలు యాప్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆకర్షణీయంగా ప్రచార పత్రాలను తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు తమ పని తీరు చేసిన అభివృద్ధి అంశాలను జోడించి సందేశాలు, వీడియోలు రూపొందిస్తున్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులు హామీలు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు సామాజిక మాధ్యలు హామీలకు వేదికలుగా మారాయి. ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్న విషయాలను సామాజిక మాధ్యమాల ద్వార విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో చేసే ప్రచారం కొన్ని సందర్భాల్లో వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉంది. అభ్యంతరకర అంశాల ప్రచారాల పై ఎన్నికల అధికారులతో పాటుగా, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే ఫిర్యాదులు స్వీకరించిన తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బరిలో దంపతులు పురపోరులో భార్యభర్తలు ఇద్దరు వేర్వేరు వార్డులో కౌన్సిలర్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఇద్దరు కూడా గతంలో మేజర్గ్రామ పంచాయతీలో వేర్వేరు పాలకవర్గాల్లో పంచాయతీ వార్డు సభ్యులుగా పనిచేశారు. పట్టణంలోని సీనియర్ కాంగ్రెస్ నేత గొరిగె నందరాజ్గౌడ్ 14 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోకి దిగగా.. ఆయన సతీమణి గొరిగె అన్నపూర్ణ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు. ఇద్దరు కూడా గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – శంషాబాద్ సెంటిమెంట్పల్లి! శంషాబాద్ పురపోరులో 25 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 20 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. వీరంతా టీడీపీ నాయకులే.. టీడీపీ ప్రభావం కోల్పోవడంతో ఎన్నికల్లో ‘సైకిల్’ గుర్తుపై పోటీచేసేందుకు ఇష్టపడక వీరంతా ఆల్ ఇండియా ఫార్వర్డ్బ్లాక్ పార్టీని ఆశ్రయించారు. జిల్లాలోని తలకొండపల్లి మండలంలో మండల, జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో ఏఐఎఫ్బీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. అదే పార్టీ నుంచి పోటీ చేస్తున్న తాము కూడా అదే తీరుగా ‘సింహం’ గుర్తుతో విజయఢంకా మోగించడం ఖాయమనే ధీమాతో ‘తలకొండపల్లి సెంటిమెంట్’ను ఇక్కడి ఏఐఎఫ్బీ అభ్యర్థులు గుర్తు చేసుకుంటున్నారు. పట్టణ పరిధిలో రెండు జాతీయ పార్టీల కన్నా కూడా వీరే ఎక్కువగా పోటీలో ఉండడం విశేషం, చివరికి ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో... మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే. – శంషాబాద్ టీ తాగండి.. ఓటు వేయండి ఆమనగల్లు పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఓ టీ స్టాల్ వద్ద నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యులు స్వయంగా టీ కాచీ అక్కడే ఉన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్రెడ్డి, బైకని శ్రీనివాస్యాదవ్ తదితరులకు చాయ్ అందించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కార్యకర్తలు, ప్రజలకు అందరూ చాయ్ తాగండీ.. టీఆర్ఎస్కు ఓటేయండీ అంటూ ఎంపీ రాములు అభ్యర్థించారు. – ఆమనగల్లు ఓటర్లకు పండుగ ప్యాకేజీ పురపోరులో సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఓటర్లకు పండుగ “ప్యాకేజీ’ అందింది. పట్టణంలోని ఆయా వార్డులలో పండుగ సందర్భంగా ఒక్కో కుటుంబానికి ఐదు లీటర్ల మంచి నూనె, రెండు కిలోల గోధుమపిండి, కిలో శనగ పిండికి సంబంధించిన ప్రత్యేక ప్యాకెట్లను పట్టణంలోని పలు సూపర్మార్కెట్లలో అభ్యర్థులు తయారు చేయించారు. వీటితో పాటు కిలో మటన్, చికెన్లతో పాటు ప్యాకెట్లను ఓటర్లకు సంబంధించిన కుటుంబాలకు అందజేశారు. గట్టి పోటీ ఉన్న చోట ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కూడా ఇదే తీరుగా పండగ ‘ప్యాకెట్’లను అందజేయడంతో ఓటర్లకు మొత్తం మీద పండుగ ఖర్చు కాస్తా తీరింది. –శంషాబాద్ తల్లీకూతుళ్ల సమరం ఆమనగల్లు: మున్సిపల్ ఎన్నికల సమరంలో తల్లీకూతుళ్లు తలపడుతున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నుంచి తల్లీకూతుళ్లు పోటీకి దిగడం విశేషం. ఎన్నికలలో 5 వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పులికంటి నాగమ్మ, టీఆర్ఎస్ అభ్యర్థిగా పులికంటి అలివేలు పోటీ చేస్తున్నారు. పోటీకి దిగిన పులికంటి నాగమ్మ, పులికంటి అలివేలు సొంత తల్లీకూతుళ్లు. ఎన్నికల సమరంలో తలపడుతున్న తల్లీకూతుళ్ళలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. పోరాడితే పోయేదేమిటి! షాద్నగర్టౌన్: పోరాడితే పోయేదేమిటి అంటూ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేస్తే బరిలో నిలుస్తున్నారు షాద్నగర్ పట్టణానికి చెందిన న్యాయవాది అంజయ్య. తెల్ల వెంట్రుకల అంజయ్యగా పేరు పొందిన ఈయన 1994, 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అదేవిధంగా 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆయన 12వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పోటీ చేసిన అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లోనైనా విజయం లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది. అయితే ఎన్నికల్లో అతి తక్కువ డబ్బులు ఖర్చు చేసి మంచి ఆశయంతో బరిలో నిలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఇతరుల మనోభావాలు దెబ్చతినే విధంగా సామాజిక మాధ్యమాలు పోస్టింగులు చేస్తే చర్యలు తప్పవు. ఎన్నికల సమయం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఎన్నికల నియమావళిని ఉల్లంఘింస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. సామాజిక మాధ్యమాలు విరివిగా ఉపయోగించే వారందరు విధిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – శ్రీధర్కుమార్, సీఐ, షాద్నగర్టౌన్ -
అత్యాచారాల్ని కులంతో ముడిపెట్టొద్దు
కవాడిగూడ: మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలను కులంకోణంతో చూడొద్దని, కేవలం మానవతా దృక్పథంతోనే చూడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు కులమతాలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గొంతెత్తుతున్న చరిత్ర తమదని ఆయన స్పష్టం చేశారు. దిశ ఘటనకు మూడ్రోజుల ముందు మూడు ఘటనలు జరిగినప్పటికీ వాటిపై చర్యలు చేపట్టకుండా దిశ ఘటనపై మాత్రమే ఓ సామాజికవర్గం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకే పోలీసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిందితులను ఎన్కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ఛలో ఇందిరాపార్క్ మహాదీక్షకు వివిధ కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..దేశాన్ని కుదిపేసిన గాంధీ, ఇందిరా, రాజీవ్గాంధీలను హత్యచేసిన నిందితులను చట్టపరంగానే శిక్షించారేతప్ప ఎన్కౌంటర్ చేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాది కసబ్ సజీవంగా దొరికినా కాల్చి చంపలేదెందుకని ప్రశ్నించారు. దేశంలో 15 ఏళ్లలో 3 లక్షల 41 వేలమంది మహిళలపై అత్యాచారాలు జరిగితే అప్పుడు లేని ఎన్కౌంటర్లు దిశా నిందితుల విషయంలో మాత్రమే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులైన ఉత్తమ్ కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దిశ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కానీ అంతకుముందు జరిగిన టేకు లక్ష్మీ, మానస కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నెలరోజుల పాటు 119 నియోజకవర్గాల్లో అత్యాచార ఘటనలపై జరుగుతున్న వివక్ష న్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్య పరచాలన్నారు. దీనిపై త్వరలోనే ‘చలో హైదరాబాద్’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేబీ రాజు అధ్యక్షతన జరిగిన మహాదీక్షలో ఎమ్మెల్సీ రాంచందర్రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, దాసు సురేశ్, ప్రొఫెసర్ గాలి వినోద్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
దిశ కేసు: ఆ దారి మూసివేత
సాక్షి, షాద్నగర్ టౌన్: దిశ కేసు, నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి అడిషనల్ రిపోర్టును పోలీసులు షాద్నగర్ కోర్టుకు సమర్పించారు. దిశ కేసులో నిందితుల కస్టడీ, రిమాండ్ కాలం పూర్తి కావడంతో కేసుకు సంబంధించిన వివరాలు కోర్టుకు తెలియజేయాల్సిన నేపథ్యంలో పోలీసులు అడిషనల్ రిపోర్టును సమర్పించినట్లు సమాచారం. దిశ హత్యాచారం తర్వాత , నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం విదితమే. నిందితుల ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితులు, మృతుల వివరాలు, నిందితుల నుంచి సేకరించిన ఆధారాల వివరాలన్నింటినీ పేర్కొంటూ అడిషనల్ రిపోర్టును పోలీసులు కోర్టులో దాఖలు చేసినట్లు సమాచారం. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత తుది రిపోర్టును కోర్టుకు అందజేయనున్నట్లు తెలిసింది. దారి మూసివేత.. ఎన్కౌంటర్ చేసిన ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు దారి మూసేశారు. చటాన్పల్లి బ్రిడ్జి దగ్గరి నుంచి ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలానికి చెట్ల, పొలం గట్ల మధ్యలో నుంచి దారి ఉంది. ఘటనా స్థలానికి ఎవరూ వెళ్లకుండా ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పోలీ సులు ఘటనా స్థలం వద్ద గుడారాన్ని ఏర్పాటు చేసుకొని బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్కౌంటర్పై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: దిశ నిందితుల ఎన్కౌంటర్పై కె.సజయ తదితరులు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది. పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని, మృతదేహాలు పాడవకుండా ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది బృందా గ్రోవర్ అభ్యర్థించగా.. ఎన్కౌంటర్పై ఇప్పటికే న్యాయ విచారణ కమిషన్ను నియమించామని ధర్మాసనం పేర్కొంది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ అభ్యర్థన మేరకు హైకోర్టుకు వెళ్లే స్వేచ్ఛను ధర్మాసనం కల్పించింది. -
దిశ కేసులో ‘ఫైనల్ రిపోర్ట్’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసు లోని నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో మరణించిన నేపథ్యంలో వీరిపై నేరాభియోగపత్రం (చార్జిషీటు) దాఖలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే సైబరాబాద్ పోలీసులు చార్జిషీటు స్థానంలో ఫైనల్ రిపోర్టును సమర్పించనున్నారని సమాచారం. నవంబర్ 27న శంషాబాద్ తొండుపల్లి టోల్గేట్ వద్ద ‘దిశ’అపహరణ, హత్య నుంచి డిసెంబర్ 6న చటాన్పల్లిలో నిందితుల ఎన్కౌంటర్ వరకు జరిగిన ఘటనలన్నింటిని వివరిస్తూ షాద్నగర్ కోర్టుకు ఫైనల్ రిపోర్టు సమర్పించనున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసులో నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాస్ట్ట్రాక్ కోర్టు ఆరంభానికి ముందే నిలిచిపోయింది. చదవండి: దిశ: ఆ మృతదేహాలను ఏం చేయాలి? కోర్టు ఏర్పాటు ప్రకటన అనంతరం నిందితులంతా హతమవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఫైనల్ రిపోర్టును రూపొందించే పనిలో పడ్డారు. ఇది సమర్పించాక ఇక దర్యాప్తు దాదాపుగా ముగిసినట్లేనని ఓ సీనియ ర్ అధికారి వ్యాఖ్యానించారు. ఎన్కౌంటర్పై విచారణ చేయడానికి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను కొనసాగించనుంది. ఇక ఎన్కౌంటర్ బూటకమంటూ సుప్రీంకోర్టులు పలు పిటిషన్లు దాఖలు కావడంతో దీనిపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కమిటీ వారం రోజుల్లోపు నగరానికి రావొచ్చని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ కమిషన్ సిఫార్సు మేరకే నిందితుల మృతదేహాల అప్పగింతపై తుది నిర్ణయం ఉంటుంది. అయితే తమ కుమారుల మృతదేహాలు త్వరగా అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చదవండి: దిశ: ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి చదవండి: దిశ చట్టం తెచ్చిన సీఎం జగన్కు జేజేలు -
దిశ కేసు: నిందితుల డీఎన్ఏలో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్ : దిశ అత్యాచారం, హత్య కేసు విచారణలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నివేదిక కీలకంగా మారింది. కాలిపోయిన దిశ శరీరం స్టెర్నమ్ బోన్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా.. ఆ మృతదేహం దిశదే అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఘటనాస్థలంలోనే నిందితులు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. దీంతో దిశపై అత్యాచారానికి పాల్పడటానికి ముందు నిందితులు ఆమెకు మద్యం తాగించినట్లుగా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ విషయాన్ని నిందితులు ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక ఎన్కౌంటర్లో మరణించిన దిశ నిందితుల డీఎన్ఏ నివేదికలో సైతం కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో జరిగిన నేరాలతో దిశ నిందితుల డీఎన్ఏ మ్యాచ్ అవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. దీని ఆధారంగా నిందితులకు నేర చరిత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న దిశను నలుగురు నిందితులు చటాన్పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చివేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లగా అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా... విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం... ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ను నియమించింది. -
దిశ నిందితుల ఎన్కౌంటర్ @ ఉ 6:10 గం.
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్పై నమోదైన ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్న సమయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నెల 6న ఉదయం దాదాపు 5:45 గంటల నుంచి 6:15 గంటల మధ్య దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు ఇప్పటికే పేర్కొనగా ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో కచ్చిత సమయం నమోదైంది. దీని ప్రకారం ఎన్కౌంటర్ ఘటనపై అదే రోజు ఉదయం 8.30 గంటలకు పోలీసులపై దాడి విషయాన్ని షాద్నగర్ ఏసీపీ వి. సురేందర్ షాద్నగర్ పోలీసు స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అందులో ఎన్కౌంటర్ జరిగిన సమయాన్ని ఉదయం 6:10 గం.గా పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఈ సమయమే ప్రామాణికం కానుంది. ఈ ఫిర్యాదును ఎస్సై దేవరాజు స్వీకరించి క్రైం నంబర్ 803/2019గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడి, ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులుపై కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ను ఉదయం 9.30 గంటలకల్లా షాద్నగర్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్కు పంపించారు. దిశకు సంబంధించిన ఆధారాల కోసం ఈ నెల 6న ఉదయం 5:30 గంటలు దాటిన తరువాత నిందితులను చటాన్పల్లిలోని ఘటనా స్థలానికి పోలీసులు తీసుకెళ్లడం, నిందితులు పోలీసుల ఆయుధాలు లాక్కొని కాల్పులు జరపడం, పోలీసుల ఎదురుకాల్పుల్లో వారు హతమవడం తెలిసిందే. అత్యాచారాన్ని నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక ఫోరెన్సిక్ నివేదికలో దిశపై అత్యాచారం నిజమేనని తేలింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఫోరెన్సిక్ టీం దిశ దుస్తులు, వస్తువులు, నిందితులు ఉపయోగించిన లారీలో గుర్తించిన రక్తపు మరకలు, వెంట్రుకలు, దుస్తులకు అంటిన వీర్యపు మరకల ఆనవాళ్లను సేకరించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న తరువాత వారి నుంచి సేకరించిన శాంపిళ్లతో అవి సరిపోలినట్లు తెలియవచ్చింది. దీంతో దిశపై అత్యాచారం జరిపింది ఈ నలుగురేనన్న విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది. అలాగే చటాన్పల్లి అండర్పాస్ వద్ద లభించిన కాలిన మృతదేహం దిశదేనని ఫోరెన్సిక్ బృందం తేల్చిందని, మృతదేహం నుంచి సేకరించిన స్టెర్నమ్ బోన్ డీఎన్ఏ దిశ తల్లి దండ్రులతో సరిపోలిందని సమాచారం. ఈ మేర కు ఫోరెన్సిక్ బృందం తమ నివేదికను దర్యాప్తు అధికారులకు సమర్పించినట్లు తెలిసింది. -
దిశ కేసు: స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్కౌంటర్పై భిన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సాక్షి టీవీ చేతికి చిక్కింది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం... బాధితురాలు దిశ వస్తువులను రికవర్ చేయడంలో భాగంగా డిసెంబరు 6న నిందితులను ఘటనాస్థలం చటాన్పల్లికి పోలీసులు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఉదయం ఆరున్నర గంటలకు నిందితులు ఒక్కసారిగా పోలీసులపై తిరగబడ్డారు. ఆయుధాలు లాక్కొన్ని పోలీసులను హతమార్చాలని చూశారు. ఆత్మరక్షణకై పోలీసులు కాల్పులు జరుపగా నలుగురు నిందితులు చనిపోయారు. ఈ మేరకు దిశ నిందితుల ఎన్కౌంటర్పై షాద్నగర్ ఏసీపీ సురేందర్ ఫిర్యాదుతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో నిందితుల వయస్సు 19 సంవత్సరాలుగా పేర్కొన్నారు. కాగా దిశ హత్యానంతరం పోలీసులు మాట్లాడుతూ నిందితుల వయస్సు 20 సంవత్సరాలు అని పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు దిశ అత్యాచారం, హత్య కేసులో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నివేదిక పోలీసులకు అందింది. కాలిపోయిన దిశ శరీరం స్టెర్నమ్ బోన్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా.. ఆ మృతదేహం దిశదే అని నిర్ధారణ అయ్యింది. అదే విధంగా ఘటనాస్థలంలోనే నిందితులు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి. ఈ కేసులో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిజానిజాలు నిర్ధారణ కానున్నాయి. కాగా వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు నిందితులు చటాన్పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడి ఆమె మృతదేహాన్ని కాల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఘటనపై నిరసనలు వెల్లువెత్తగా.. నిందితులను అదపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. ఈ క్రమంలో క్రైం సీన్ రీకన్ష్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లగా అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా... విచారణ జరిపిన న్యాయస్థానం... ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ను నియమించింది.(ఎన్కౌంటర్పై త్రిసభ్య కమిషన్) -
బిడ్డ కంట చెమ్మ.. గాయమైనా వచ్చింది అమ్మ..
షాద్నగర్టౌన్: రోడ్డు ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలియని 8 నెలల చిన్నారి ఆకలితో రోదిస్తోంది. విషయాన్ని గుర్తించిన ఆ తల్లి గాయాలను సైతం లెక్క చేయకుండా.. బిడ్డకు పాలిచ్చింది. ఈ దృశ్యం మంగళవారం షాద్నగర్ బైపాస్ జాతీయ రహదారిపై ఉన్న చటాన్పల్లి బ్రిడ్జి సమీపంలో కనిపించింది. దిశ హంతకుల ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని చూసేందుకు డ్రైవర్ లారీని అపుతుండగా.. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కొత్తకోట వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తకోటకు చెందిన శాంతి టాటా ఏస్ వాహనంలో తన 8 నెలల కూతురితో ప్రయాణం చేస్తోంది. ఈ ప్రమాదంలో శాంతికి తీవ్ర గాయాలయ్యాయి. యాక్సిడెంట్ అయిన సమయంలో చిన్నారి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఆకలితో రోదించింది. దీంతో శాంతి రోడ్డు పక్కనే పడుకొని బిడ్డకు పాలిచ్చి ఆకలి తీర్చింది. ఘటనా స్థలంలో ఉన్న మీడియా ప్రతినిధులు రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించి క్షతగాత్రులను బయటికి తీశారు. గాయపడిన వారిని పోలీసులు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
‘దిశ’ కేసు : ఎన్హెచ్ఆర్సీ ముందుకు షాద్నగర్ సీఐ
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా విచారణను కొనసాగించింది. విచారణలో భాగంగా హైదరాబాద్లోని పోలీస్ అకాడెమీలో ఉన్న ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధుల ముందు షాద్నగర్ సీఐ శ్రీధర్ హాజరయ్యారు. ఇక దిశ హత్యకేసు నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన బంక్ యజమాని ప్రవీణ్ను కూడా ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు విచారించనున్నారు. ఇదిలాఉండగా.. ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్హెచ్ఆర్సీ బృందం మంగళవారం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. (చదవండి : చటాన్పల్లి ఎన్కౌంటర్ కేసులో కీలక మలుపు) (చదవండి : ఎన్కౌంటర్పై గాయపడ్డ పోలీసుల వెర్షన్!) -
ఎన్కౌంటర్పై గాయపడ్డ పోలీసుల వెర్షన్!
సాక్షి, హైదరాబాద్: దిశ కేసులోని నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రశ్నించి పలు వివరాలు సేకరించింది. ఎన్కౌంటర్లో గాయపడిన పోలీసులను బృందం సభ్యులను ప్రధానంగా విచారించారు. సంఘటన జరిగిన తీరు, తాము గాయపడ్డ తీరును పోలీసులు వారికి వివరించారు. చదవండి:చటాన్పల్లి ఎన్కౌంటర్ కేసులో కీలక మలుపు చటాన్పల్లి వద్ద సంఘటనా స్థలికి తెల్లవారుజామున నిందితులను పోలీసులు తీసుకెళ్లారని, అక్కడ పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా ఒక్కసారిగా నిందితులు తిరగబడ్డారని, ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడిచేసి పారిపోయేందుకు ప్రయత్నించారని గాయపడ్డ పోలీసులు వివరించారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారి నుంచి సర్వీస్ రివాల్వర్ను సైతం నిందితులు లాకొని..కొంతదూరం పారిపోయాక కాల్పులు జరిపారని, దీంతో గత్యంతరంలేక పోలీసులు ఆత్మరక్షణ కోసమే ప్రతి కాల్పులు జరిపారని తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు ఎన్హెచ్ఆర్సీకి తెలిపారు. ఈ ఘటనా స్థలిలో పంచనామా నిర్వహించి, ఆధారాలు సేరించామని, సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం ఫోరెన్సిక్ నిపుణులతో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపిన పోలీసులు.. పోస్ట్మార్టం రిపోర్ట్, సీసీటీవీ విజువల్స్, ఇతర కేసు వివరాలను ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. చదవండి: వెంకటేశ్వర్లు, అరవింద్ను ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ -
గాంధీ ఆస్పత్రి వద్ద గట్టి బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: దిశ కేసులో నిందితుల మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య మహబూబ్నగర్ మెడికల్ కాలేజీ నుంచి ప్రత్యేక అంబులెన్స్లో మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మెడికల్ కాలేజీలో లేదంటూ పోలీసుల దృష్టికి కాలేజీ యాజమాన్యం తీసుకువచ్చింది. దీంతో పోలీసులు విషయాన్ని హైకోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలంటూ హైకోర్టు ధర్మాసనం అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని మార్చురీ 7, 8, 9, 10 నంబర్లు గల బాక్సులలో భద్రపరిచారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో షాద్నగర్ పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మార్చురీ వద్ద భద్రతను సికింద్రాబాద్ గోపాలపురం ఏసీపీ వెంకటరమణ పర్యవేక్షించారు. ఇక, దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణ జరుపుతున్న సిట్ బృందం మంగళవారం చటాన్పల్లికి వెళ్లనుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో ఎన్కౌంటర్కు దారితీసిన పరిణామాలపై సిట్ విచారణ జరపనుంది. షాద్నగర్ పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్తో పాటు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను సిట్ పరిశీలించనుంది. -
చటాన్పల్లి ఎన్కౌంటర్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: దిశ కేసులోని నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరుపుతున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందానికి సైబరాబాద్ పోలీసులు మంగళవారం కీలక సాక్ష్యాలు అందజేశారు. ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయిన నిందితులే దిశపై అత్యాచారం జరిపి.. హత్య చేసినట్టు రుజువు చేసే ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిన నివేదికను పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి అందజేశారు. దిశ కిడ్నాప్, అత్యాచారం, హత్య, మృతదేహం కాల్చివేత తదితర పరిణామాలకు సంబంధించి తమ దర్యాప్తులో సేకరించిన ఆధారాలను ఈ నివేదికలో పొందుపరిచారు. ఈ కేసులో అత్యంత కీలకమైన శాస్త్రీయ ఆధారాలు కూడా ఎన్హెచ్చ్ఆర్సీకి అందజేసిన నివేదికలో ఉన్నట్టు సమాచారం. సంఘటనాస్థలంలో దొరికిన రక్తం మరకలను, లారీ క్యాబిన్లో దొరికిన రక్తం మరకలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్ట్, ఘటనా స్థలంలో నిందితుల లారీ సంచరించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఎన్హెచ్ఆర్సీకి పోలీసులు అందజేశారు. చదవండి: దిశ కేసు.. వెలుగులోకి కీలక వీడియో కొత్తూరు సమీపంలో నిందితులు పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీటీవీ ఫుటేజీని సైతం సమర్పించినట్టు తెలుస్తోంది. దిశ హత్యాచారం కేసులో శరవేగంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఈ కేసులో తాము సేకరించిన ఆధారాలు, కేసుకు సంబంధించిన కీలక వివరాలు ఎన్హెచ్ఆర్సీ ముందు పెట్టారు. ఇక, దిశ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలను మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం వరకు మృతదేహాలను గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరచనున్నారు -
దిశ: వెంకటేశ్వర్లు, అరవింద్ను ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, హైదరాబాద్: దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం సోమవారం సాయంత్రం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను కలిసింది. నగరంలోని కేర్ ఆస్పత్రిలో నందిగామ ఎస్సై వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్గౌడ్లను కలిసి వారి నుంచి వాంగ్మూలాన్ని సేకరించింది. చటాన్పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో దిశ కేసు నిందితులు హతమవ్వగా.. నిందితులు జరిపిన ఎదురుకాల్పల్లో వీరిద్దరు గాయపడ్డారు. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్లు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో వీరిని కలిసిన ఎన్హెచ్ఆర్సీ బృందం.. దాదాపు అరగంటపాటు వారిని ప్రశ్నించి.. పలు వివరాలు సేకరించింది. ఇప్పటికే ఎన్హెచ్ఆర్సీ బృందం దిశ కుటుంబసభ్యులు, ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబసభ్యుల వాంగ్మూలం తీసుకొని.. వివరాలు సేకరించిన సంగతి తెలిసిందే. ‘తప్పు చేసిన మా బిడ్డలను శిక్షించమనే చెప్పాం. మా బిడ్డలను అన్యాయంగా కాల్చి చంపారు..’ అంటూ ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులు ఎన్హెచ్ఆర్సీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితోపాటు సోదరిని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అడిగి తెలుసున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో వీరందరి నుంచి ఎన్హెచ్ఆర్సీ బృందం స్టేట్మెంట్ రికార్డు చేసింది. చటాన్పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన నలుగురు యువకుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరిచేందుకు నాలుగు ఫ్రీజర్ బాక్స్లను సిద్ధం చేశారు. ఇందుకోసం గాంధీ ఆస్పత్రి మార్చురీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అర్ధరాత్రి సమయంలో మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశముందని తెలుస్తోంది. నిందితుల మృతదేహాలను వచ్చే శుక్రవారం వరకు గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
దిశ కేసు.. వెలుగులోకి కీలక వీడియో
సాక్షి, హైదరాబాద్: యావత్ దేశాన్ని కదిలించిన దిశ హత్యాచారం కేసులో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. గత నెల 27వ తేదీన రాత్రి సమయంలో నలుగురు నిందితులు వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిందితులు చటాన్పల్లిలోని సంఘటన స్థలంలోనే పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. దిశ హత్యాచారం, నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన కీలక వీడియోను తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు దిశ కేసును ఛేదించి నిందితులను గుర్తించారు. నవంబర్ 27వ తేదీన రాత్రి 10.28 గంటల సమయంలో తొండూపల్లి టోల్గేట్ వద్ద నుంచి వెళ్తున్న ఈ లారీలో దిశ మృతదేహాన్ని నిందితులు తరలించారని పోలీసులు గుర్తించారు. టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో లారీ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది.. తొండూపల్లి టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో నిందితులు దిశపై సామూహిక అత్యాచారం జరిపి.. ఆపై హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. నవంబర్ 27వ తేదీన రాత్రి 10 గంటల తర్వాత దిశను నిందితులు హతమార్చారని, అనంతరం శరీరానికి దుప్పట్లు చుట్టి.. ఆపై కిరోసిన్ పోసి తగులబెట్టారని, ఈ ఘటనలో ఆమె మృతదేహం 70 శాతం కాలినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం.. ఘటనాస్థలం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల వరకు ఆమె మృతదేహాన్ని లారీలో తీసుకువెళ్లినట్లు వెల్లడించారు. ఇలా లారీలో మృతదేహాన్ని తీసుకువెళుతుండగా.. ఆ దృశ్యం తొండూపల్లి టోల్గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. నిందితుల లారీ వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. చదవండి: ఇప్పటికైనా మృతదేహాలు అప్పగించండి! -
అసలు ఇదంతా ఎలా జరిగింది?
సాక్షి, శంషాబాద్ : ‘దిశ’అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) విచారణ మొదలైంది. కమిషన్ ప్రతినిధులు శనివారం మహబూబ్నగర్ లో విచారణ ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధులు సోమవారం వరకు రాష్ట్రంలోనే ఉండి ఎన్కౌంటర్ జరిగిన తీరుపై సమగ్ర విచారణ జరపనున్నారు. తొలిరోజు ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికను అధ్యయనం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎన్కౌంటర్ జరిగిన చటాన్పల్లి సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఆదివారం మృతుల తల్లిదండ్రులతో సమావేశం కానున్నారు. అయితే వారి తల్లిదండ్రులను హైదరాబాద్కు పిలిపించుకుంటారా? లేక మృతుల స్వస్థలమైన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల, జక్లేర్ గ్రామాలకు వెళ్తారా అనే దానిపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. సోమవారం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు, ఎన్కౌంటర్ చేసిన పోలీసులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని పోలీసువర్గాలు తెలిపాయి. విచారణ ప్రక్రియ పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడున్నర గంటల పాటు భేటీ... శనివారం మధ్యాహ్నం 1.20 గంటలకు మహబూబ్నగర్ వచ్చిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు స్థానిక పోలీసు అధికారులు, పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్య బృందం, స్థానిక జనరల్ ఆస్పత్రి వైద్యులతో సుమారు మూడున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ‘దిశ’అత్యాచారం, హత్య మొదలు.. ఎన్కౌంటర్, శవపరీక్ష వరకు అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దిశ హత్య తర్వాత, ఎన్కౌంటర్ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తున్న సమయంలో ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులకు పలు అనుమానాలు రావడంతో పోస్టుమార్టం చేసిన వైద్యులను పిలిపించాలని కోరారు. దీంతో గాంధీ ఆస్పత్రికి చెందిన ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్సింగ్, అసోసియేట్ ప్రొఫెసర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ మహేందర్, మరో వైద్యుడు హుటాహుటిన మహబూబ్నగర్ వచ్చి, వారి సందేహాలను నివృత్తి చేశారు. రెండుసార్లు మృతదేహాలు పరిశీలన.. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే నేరుగా మార్చురీకి వెళ్లిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు.. అక్కడ మృతదేహాలను వారి పేర్లతో సహా వివరాలన్నీ నిర్ధారించుకున్నారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్ చాంబర్కు వెళ్లి పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా చదివారు. ముఖ్యంగా ఎంత దూరం నుంచి కాల్చి ఉండొచ్చు? తూటాలు మృతుల శరీరాల్లో చొచ్చుకుని పోవడంతో ఏ మేరకు రంధ్రం ఏర్పడింది? మృతులు పారిపోతున్నట్టు ధ్రువీకరించే ఆధారాలు ఏవైనా ఉన్నాయా అనే కోణాల్లో ఆరా తీశారు. అనంతరం మరోసారి మార్చురీకి వెళ్లి.. మృతదేహాలను పరిశీలించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. అక్కడ నుంచి చటాన్పల్లి శివారులో దిశను కాల్చివేసిన స్థలానికి చేరుకున్నారు. నిందితులు దిశను శంషాబాద్ నుంచి అక్కడకు ఎలా తీసుకొచ్చారు..? ఆమె మృతదేహాన్ని ఎక్కడ దహనం చేశారు..? అనే విషయాలను శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి వారికి వివరించారు. తర్వాత ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి చేరుకుని.. మృతదేహాలు ఎక్కడ పడి ఉన్నాయి.. ఎన్కౌంటర్ ఎలా జరిగిందనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దిశను కాల్చేసిన స్థలానికి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం ఎంత దూరంలో ఉందనే వివరాలను కూడా సేకరించారు. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆ ప్రదేశాన్ని క్షుణ్నంగా పరిశీలించాక, అక్కడి నుంచి నిందితులు దిశపై హత్యాచారం చేసిన తొండుపల్లిలోని టోల్ప్లాజా వద్దకు వెళ్లారు. దిశపై అత్యాచారం, హత్య జరిగిన ప్రహరీ లోపలి ప్రదేశాన్ని నిశితంగా గమనించారు. నిందితులు ఆమెపై ఘాతుకానికి ఎలా పాల్పడ్డారో డీసీపీ ప్రకాష్రెడ్డి వారికి వివరించారు. నేడు మృతుల తల్లిదండ్రులతో భేటీ... జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రతినిధులు ‘దిశ’ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులతో ఆదివారం సమావేశం కానున్నారు. మృతుల వ్యక్తిత్వం.. అలవాట్ల వివరాలతో పాటు ఎన్కౌంటర్పై వారి అభిప్రాయాలు సేకరించనున్నారు. నిందితులను పోలీసులు ఎప్పుడు తీసుకెళ్లారు? ఎలా తీసుకెళ్లారు? ఏం చెప్పి తీసుకెళ్లారు? ఎన్కౌంటర్ చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారా? చేసిన తర్వాత వారి స్పందన ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తారని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. రహస్యంగా విచారణ.. ఎన్కౌంటర్ నిజానిజాలను నిర్ధారించేందుకు వచ్చిన ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు తమ విచారణను రహస్యంగా నిర్వహించారు. ఎన్కౌంటర్, పోస్టుమార్టంపై తమ అనుమానాలను నివృత్తి చేసుకునే క్రమంలో వైద్యులు, పోలీసు ఉన్నతాధికారులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. మీడియాతో మాట్లాడతారని భావించినా మాట్లాడలేదు. మూడు రోజుల విచారణ పూర్తయిన తర్వాతే వారు మీడియాతో మాట్లాడతారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ క్రమంలో విచారణకు అంతరాయం కలగకుండా పోలీసులు ఆస్పత్రి ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులెవరినీ లోపలికి అనుమతించలేదు. రోగులను క్షుణ్ణంగా పరిశీలించి.. నిర్ధారించుకున్న తర్వాతే వదిలిపెట్టారు. మీడియాను సైతం గేటు బయటకు పంపేశారు. మరోవైపు దిశ తల్లిదండ్రులను కమిషన్ ప్రతినిధులు కలుస్తారని భావించినా.. వారు ఆమె ఇంటికి వెళ్లలేదు. మూడురోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక ‘‘ఎన్కౌంటర్లో చనిపోయిన దిశ నిందితుల పోస్టుమార్టం నివేదికను మరో మూడు రోజుల్లో జిల్లా జడ్జి ద్వారా హైకోర్టుకు సమర్పిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదుగురితో కూడిన వైద్య బృందం నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసింది. ఈ వ్యవహారంలో అన్ని నిబంధనలూ అనుసరించాం. పోస్టుమార్టానికి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశాం’’ – డాక్టర్ కృపాల్సింగ్, గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుడు ఘటన తీరును తెలుసుకునేందుకే వచ్చారు ‘‘దిశ హత్యోదంతం, నిందితుల ఎన్కౌంటర్ జరిగిన తీరును పరిశీలించేందుకే జాతీయ మానవ హక్కుల సంఘం బృందం వచ్చింది. ఏడుగురు సభ్యులతో కూడిన బృందం మధ్యాహ్నం మహబూబ్నగర్ వెళ్లి తిరుగు ప్రయాణంలో చటాన్పల్లి వద్ద దిశను కాల్చిన స్థలాన్ని, ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించింది. విచారణ కమిటీలో ఓ ఫోరెన్సిక్ నిపుణుడితోపాటు ఏడుగురు సభ్యులున్నారు. విచారణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ – ప్రకాష్రెడ్డి, డీసీపీ -
వివరాలు మాత్రమే తీసుకున్నారు: డీసీపీ
సాక్షి, శంషాబాద్: దిశ ఘటన, నిందితుల ఎన్కౌంటర్ స్థలాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పరిశీలించిందని శంషాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి తెలిపారు. అంతకుముందు మహబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రిలో మార్చురీలో ఉన్న నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించిందని పేర్కొన్నారు. అనంతరం నలుగురు నిందింతులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఎన్హెచ్ఆర్సీ బృందానికి సీనియర్ ఎస్పీ నేతృత్వం వహిస్తున్నారని ప్రకాశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ బృందంలో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా ఉన్నారని తెలిపారు. ఘటనకు సంబంధించి వారు తమ దగ్గర వివరాలు మాత్రమే తీసుకున్నారని వెల్లడించారు. వారు మీడియాతో మాట్లాడే వీలు లేనందున వాళ్ల తరఫున తనను మాట్లాడమన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణాధికారిగా రాచకొండ అదనపు డీసీపీ సురేందర్రెడ్డి నియమితులయ్యారు. చటాన్పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్పై ఆయన దర్యాప్తు జరుపనున్నారు. కాగా షాద్నగర్ సమీపంలో గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులు అత్యాచారం చేసి, అనంతరం ఆమెపై పెట్రోలు పోసి తగులబెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం.. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. -
వాళ్లు కేవలం కొంగు కప్పుకొనే తిరుగుతారు
సాక్షి, హైదరాబాద్ : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించాలని నటి, సామాజిక వేత్త రేణూ దేశాయ్ అన్నారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. దిశ నిందితుల ఎన్కౌంటర్తో మహిళలకు ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. ఏదేమైనా వ్యవస్థ, సమాజంలో మార్పు వచ్చినపుడే నిర్భయ, దిశ వంటి ఘటనలు జరగవని అభిప్రాయపడ్డారు. అదే విధంగా అత్యాచార ఘటనలకు మహిళల వస్త్రధారణను కారణంగా చూపడం దారుణమన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దిశ నిందితుల ఎన్కౌంటర్ నేపథ్యంలో శనివారం ఆమె సాక్షితో తన మనోభావాలు పంచుకున్నారు. ‘ఇంట్లో లక్ష్మీదేవి, సరస్వతిని పూజిస్తారు కానీ చాలా మంది మగవాళ్లు తమ ఇంటి లక్ష్మిని మాత్రం సరిగ్గా చూసుకోరు. ఇందుకు ఎవరూ అతీతం కాదు. దేవుడిపై ఉన్న భయం, భక్తి చట్టాలపై కూడా ఉండాలి. అప్పుడే నేరాలు కాస్తైనా తగ్గుతాయి. ఇక బట్టల వల్లే బలత్కారం అనే వాళ్లని అస్సలు క్షమించకూడదు. వారన్నట్లుగా మరి మూడు నెలల పసివాళ్లు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు. దిశ కూడా సల్వార్, దుపట్టా వేసుకునే బయటికి వచ్చారు కదా. చాలా వరకు ట్రైబల్ ఏరియాల్లో కొంగు కప్పుకొని మాత్రమే తిరుగుతారు. మరి వాళ్లందరి పట్ల మగవాళ్లు అలా ప్రవర్తించడం లేదు కదా. మహిళల స్వేచ్ఛను హరించవద్దు. బట్టల కారణంగా.. రాత్రి వేళల్లో బయట ఉన్నందు వల్లే అత్యాచారం చేశానంటే కుదరదు. మనకు స్వీయ నియంత్రణ ఉండాలి. ఓ మహిళ మీ ముందు నగ్నంగా ఉన్నా సరే అమ్మలా భావించి ఏమైందమ్మా అని అడిగి మరీ తనకు సాయం చేసే మానసిక పరిపక్వత రావాలి’ అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ‘ఇక దిశ ఘటనతో ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులకు భయం కలిగింది. నిందితుల పట్ల ఎన్హెచ్చార్సీ స్పందించిన తీరు సరైందే. అయితే దిశ మానవ హక్కులకు కూడా భంగం కలిగిన విషయాన్ని గుర్తించాలి కదా. పథకం ప్రకారం ఆమె స్కూటీని పంక్చర్ చేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేయడం ఎంత వరకు సమంజసం. కేవలం రూపాన్ని బట్టి మనిషి అనటం సరికాదు. మనిషి రాక్షసుడిగా ప్రవర్తించినపుడు అతడిని జంతువుగానే గుర్తించాలి. రాక్షసుడే అవుతాడు అలాంటి వాళ్లకు మానవ హక్కులు ఎలా వర్తిస్తాయి. పేద, ధనిక, కుల, వర్గ, మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ ఒకే న్యాయం ఉండాలి. తప్పు చేసింది ఎవరైనా అందరికీ సమానంగా శిక్షలు పడాలి. అయితే ఆ క్రమంలో నిజమైన దోషులెవరో గుర్తించగలగాలి. అంతేకాదు విద్యావిధానంలోనూ మార్పులు రావాలి. సైకాలాజీని పాఠ్యాంశంగా బోధించాలి. ఇక చదువుకునే అవకాశం లేని వాళ్లకు విద్యను అందించుటకై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మనిషి స్వభావంలో మార్పు వచ్చినపుడు, చట్టాల పట్ల భయం కలిగి ఉన్నపుడే మార్పు సాధ్యమవుతుంది. దిశ ఘటన జరిగిన రోజు దేశవ్యాప్తంగా ఎన్నో అత్యాచారాలు జరిగాయి. అయితే ఘటన తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. నిన్నటి ఎన్కౌంటర్ను నేను పూర్తిగా అంగీకరించను. అలాగని వ్యతిరేకించను. అయితే తెలంగాణ పోలీసుల చర్యకు జనామోదం లభించడం చూస్తుంటే అత్యాచార ఘటన పట్ల వారు స్పందించిన తీరు స్పష్టమవుతోంది. నిజానికి దిశ ఘటనలో ఆ నలుగురే కాదు. ఘటన జరుగుతున్నా ఆ వైపుగా దృష్టి సారించని వాళ్లతో సహా ఈ సమాజం మొత్తం ఆ నేరంలో భాగస్వామ్యమే. ఇక్కడ నేను ఓ ఆడపిల్లకు తల్లిగా మాట్లాడుతున్నాను’ అని చెప్పుకొచ్చారు.