Startups
-
థరూర్ సీపీఎంలో చేరబోరు: కారత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సీపీఎం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తాత్కాలిక సమన్వయకర్త ప్రకాశ్ కారత్ తోసిపుచ్చారు. ఆయన పార్టీ వీడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదన్నారు. కేవలం కేరళలో స్టార్టప్లు సాధిస్తున్న గణనీయమైన ప్రగతి గురించి మాత్రమే మాట్లాడారని చెప్పుకొచ్చారు. శశిథరూర్ సాధారణ వ్యక్తి కాదని ప్రశంసించిన కారత్.. ఆయన నిక్కచ్చి అభిప్రాయాలు కొన్నిసార్లు కాంగ్రెస్కు అసౌకర్యాన్ని కలిగిస్తాయన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామికాభివృద్ధిని ప్రశంసిస్తూ థరూర్ గత నెలలో ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. ఇది రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ దానిపై ప్రశ్నల వర్షం కురిపించగా.. సీపీఎం వ్యాసాన్ని స్వాగతించింది. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశంసించలేదని, కేవలం స్టార్టప్ రంగంలో రాష్ట్ర ప్రగతిని ఎత్తి చూపానని థరూర్ స్పష్టం చేశారు. ఆ తరువాత మలయాళంలో ఓ పాడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేరళలో పార్టీ నాయకత్వ బాధ్యతలకు తాను అర్హుడినని ప్రకటించారు. సంసిద్ధతను సైతం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కాంగ్రెస్లో ఒక వర్గాన్ని కలవరపరిచింది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ థరూర్ మీడియాపై మండిపడ్డారు. -
టెక్ అంకురాల్లోనూ మహిళల హవా..!
న్యూఢిల్లీ: వినూత్న ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్న మహిళా స్టార్టప్లు, భారీ ఎత్తున నిధుల సమీకరణలోనూ సత్తా చాటుతున్నాయి. మహిళల సారథ్యంలోని అంకుర సంస్థలు ఇప్పటివరకు 26 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాయి. ఆల్టైమ్ ఫండింగ్ విషయంలో అమెరికా తర్వాత స్థానంలో నిల్చాయి. రీసెర్చ్, అనలిటిక్స్ సంస్థ ట్రాక్షన్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం దేశీయంగా మహిళల సారథ్యంలోని అంకుర సంస్థల సంఖ్య 7,000 పైచిలుకు ఉంది. క్రియాశీలకంగా ఉన్న మొత్తం స్టార్టప్లలో వీటి వాటా 7.5 శాతం. ఇవన్నీ కలిసి ఇప్పటివరకు 26.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2021లో అత్యధికంగా 6.3 బిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. 2022లో అంతర్జాతీయంగా చూస్తే మహిళా స్టార్టప్లు మొత్తం మీద 32.8 బిలియన్ డాలర్లు సమీకరించగా .. దేశీ అంకురాలు 5 బిలియన్ డాలర్లతో 15.18% వాటా దక్కించుకున్నాయి. ఇక 2024లో అంతర్జాతీయంగా మహిళల సారథ్యంలోని స్టార్టప్లకు ఫండింగ్ విషయంలో 3.96% వాటాతో అమెరికా, బ్రిటన్ తర్వాత భారత్ మూడో స్థానంలో నిలి్చంది. ఈ స్టార్టప్లు భారీగా నిధులను సమీకరించడంతో పాటు పరిశ్రమలకు కొత్త నిర్వచనాన్ని ఇస్తూ, ఉద్యోగాలు కల్పిస్తూ, భవిష్యత్ ఎంట్రప్రెన్యూర్లకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని ట్రాక్షన్ పేర్కొంది. ఇవి మరింత వృద్ధిలోకి రావాల ంటే ఆర్థిక తోడ్పాటు, మెంటార్షిప్, వ్యవస్థాగతంగా మద్దతు లభించడం కీలకమని వివరించింది. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → రంగాలవారీగా చూస్తే రిటైల్ స్టార్టప్లు అత్యధికంగా 7.8 బిలియన్ డాలర్లు, ఎడ్టెక్ 5.4 బిలియన్ డాలర్లు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంకురాలు 5 బిలియన్ డాలర్లు సమీకరించాయి. బిజినెస్ టు కన్జూమర్ ఈ–కామర్స్, ఇంటర్నెట్ ఫస్ట్ బ్రాండ్లు, ఫ్యాషన్ టెక్ అంకురాలు కూడా గణనీయంగా రాణిస్తున్నాయి. → మహిళా స్టార్టప్ల సంఖ్యాపరంగా, అలాగే ఇప్పటి వరకు సమీకరించిన నిధులపరంగా బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్ ఆ తర్వాత స్థానాల్లో నిల్చాయి. → 2021లో మహిళల సారథ్యంలోని స్టార్టప్లలో అత్యధికంగా ఎనిమిది అంకురాలు యూనికార్న్లుగా ఎదిగాయి. 2019లో మూడు, 2020లో నాలుగు, 2022లో అయిదు ఈ హోదా సాధించాయి. అయితే, 2017, 2023, 2024లో ఒక్క యూనికార్న్ కూడా నమోదు కాలేదు. → 2021లో మహిళా స్టార్టప్లు అత్యధికంగా 45 సంస్థలను కొనుగోలు చేశాయి. 2022లో ఇది 36కి, 2023లో 25కి, 2024లో 16కి తగ్గింది. → 2024లో మహిళల సారథ్యంలోని అయిదు స్టార్టప్లు పబ్లిక్ ఇష్యూకి వచ్చాయి. మొబిక్విక్, ఉషా ఫైనాన్షియల్, తన్వాల్, ఇంటీరియర్స్ అండ్ మోర్, లాసీఖో వీటిలో ఉన్నాయి. -
నిధుల వేటలో అంకురాలు..
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థలు ఫిబ్రవరిలో సగటున 83.2 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో 1.65 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 14,418 కోట్లు) నిధులను సమీకరించాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో స్టార్టప్లు మొత్తం 2,200 విడతల్లో 25.4 బిలియన్ డాలర్లు సమీకరించినట్లయిందని అధ్యయన సర్వీసుల సంస్థ ట్రాక్షన్ గణాంకాల్లో వెల్లడైంది. దీని ప్రకారం జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో మొత్తం ఫండింగ్ 19.5 శాతం పెరిగింది.వార్షిక ప్రాతిపదికన, గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే మాత్రం 2.06 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. మరిన్ని విశేషాలు..➤స్టార్టప్ల రాజధాని బెంగళూరులో అంకురాలు సగటున 2 మిలియన్ డాలర్ల చొప్పున 353 మిలియన్ డాలర్లు, ముంబైలో స్టార్టప్లు 102 మిలియన్ డాలర్లు సమీకరించాయి.➤ఫిన్టెక్ సంస్థ ఆక్సిజో 1 బిలియన్ డాలర్లు, బీ2బీ ప్లాట్ఫాం ఉడాన్ 75 మిలియన్ డాలర్లు దక్కించుకున్నాయి. స్పాట్డ్రాఫ్ట్, క్యాష్ఫ్రీ పేమెంట్స్, జెటా, జినీమోడ్ మొదలైనవి ఇతరత్రా సంస్థల్లో ఉన్నాయి. ➤ఫిబ్రవరిలో కంపెనీల కొనుగోలు లావాదేవీలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో నమోదయ్యాయి. అడ్డా52 మాతృసంస్థ డెల్టాటెక్ గేమింగ్ను హెడ్ డిజిటల్ వర్క్స్ రూ. 491 కోట్లకు దక్కించుకుంది. అలాగే, ఫ్రాడ్ డిటెక్షన్ ప్లాట్ఫాం క్లారి5ని పెర్ఫియోస్ అనే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) సంస్థ కొనుగోలు చేయగా, మెగాఫైన్ ఫార్మాలో మెజారిటీ వాటాలను మోతీలాల్ ఓస్వాల్ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ రూ. 460 కోట్లకు దక్కించుకుంది. ➤26.5 మిలియన్ డాలర్ల సగటు మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఫిబ్రవరిలో 16 ఐపీవోలు లిస్టయ్యాయి. హెక్సావేర్, ఎజాక్స్, కెన్ ఇండియా, డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, రాయల్ ఆర్క్ మొదలైన లిస్టింగ్స్ వీటిలో ఉన్నాయి.➤ఇన్వెస్టర్ల జాబితాలో షార్క్లు రితేష్ అగర్వాల్, అనుపమ్ మిట్టల్, అమన్ గుప్తా, పియుష్ బన్సల్ టాప్లో ఉండగా, వెంచర్ క్యాపిటల్ సంస్థల్లో బ్లూమ్ వెంచర్స్, ఎక్సిమియస్ వెంచర్స్, యూనికార్న్ ఇండియా వెంచర్స్, పీక్ ఫిఫ్టీన్, యాక్సెల్, నెక్స్ వెంచర్ పార్ట్నర్స్ గణనీయంగా ఇన్వెస్ట్ చేశాయి.➤2024 మొత్తం మీద దేశీ అంకుర సంస్థలు 30.4 బిలియన్ డాలర్లు సమీకరించాయి. 2023లో నమోదైన 32.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 6.5 శాతం తక్కువ. -
పదేళ్లలో పది లక్షలకు స్టార్టప్లు: పీయుష్ గోయల్
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే పదేళ్లలో ప్రభుత్వ గుర్తింపు పొందిన అంకురాల సంఖ్య 10 లక్షలకు చేరగలదని భారత్–ఇజ్రాయెల్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.140 కోట్ల జనాభా గల భారత మార్కెట్లో గణనీయంగా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ఆయన కోరారు. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నీర్ ఎం బర్కత్ సారథ్యంలో వ్యాపార దిగ్గజాల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. ఆర్థిక, సాంకేతికాంశాల్లో పరస్పర సహకారం, పెట్టుబడుల అవకాశాలు మొదలైన వాటిపై ఇందులో చర్చించారు. 2016లో 450గా ఉన్న రిజిస్టర్డ్ స్టార్టప్ల సంఖ్య ప్రస్తుతం 1.57 లక్షలకు చేరింది. కొత్త ఆవిష్కరణలను, అంకురాలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016 జనవరిలో స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని కింద గుర్తింపు పొందిన యూనిట్లకు పన్నులు, పన్నులయేతర ప్రోత్సాహకాలకు అర్హత లభిస్తుంది. ఇదీ చదవండి: ఆఫీస్ మార్కెట్ రారాజు.. హైదరాబాద్ఫ్లాగ్షిప్ పథకాలైన ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, క్రెడిట్ గ్యారంటీ స్కీము మొదలైన వాటి ద్వారా వివిధ రంగాలు, దశల్లో ఉన్న అర్హత కలిగిన స్టార్టప్లకు ఆర్థిక సహాయం కూడా లభిస్తోంది. -
స్టార్టప్లకు జోష్
దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో కేంద్రం పలు కార్యక్రమాలు ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.10 వేల కోట్ల కార్పస్తో నిధుల నిధి (ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్) పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన స్టార్టప్లకు పన్ను రాయితీలు కల్పించేందుకు సంబంధించిన విలీన కాలపరిమితిని (ఇన్కార్పొరేషన్ పీరియడ్) ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2016లో కూడా కేంద్రం రూ.10 వేల కోట్ల కార్పస్తో ఎఫ్ఎఫ్ఎస్ తరహా పథకాన్ని ప్రారంభించింది. వెంచర్ మూలధన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దీనిని నెలకొల్పారు. సెక్యూరిటీ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో రిజిస్టర్ అయిన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు (ఏఐఎఫ్లకు) పెట్టుబడి సమకూర్చే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బీ) దీనిని నిర్వహిస్తుంది. కాగా ఈ ఏఐఎఫ్లు తిరిగి స్టార్టప్లలో పెట్టుబడి పెడతాయి. స్టార్టప్ల కోసం ఉద్దేశించిన ఈ ఏఐఎఫ్లు రూ.91 వేల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలను కలిగి ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రూ.10 వేల కోట్ల ప్రభుత్వ కార్పస్తో కూడిన నిధుల నిధి పథకం వీటికి దన్నుగా నిలుస్తుందని తెలిపారు. తాజాగా మరో రూ.10 వేల కోట్ల సహాయంతో ఓ కొత్త నిధుల నిధి పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. పరిశ్రమలను, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ)తో భేటీలో ఏఐఎఫ్లు ఈ పథకం కింద మరిన్ని నిధుల కోసం డిమాండ్ చేశాయి. ఎఫ్ఎఫ్ఎస్ సహకారం పొందుతున్న ప్రముఖ స్టార్టప్ పెట్టుబడి సంస్థల్లో చిరాటే వెంచర్స్, ఇండియా కోషియెంట్, బ్లూమ్ వెంచర్స్, ఐవై క్యాప్ తదితరాలున్నాయి. ఎఫ్ఎఫ్ఎస్ కింద ప్రయోజనం పొందే ఏఐఎఫ్లు..తాము అంగీకరించిన మొత్తానికి కనీసం రెండింతలు స్టార్టప్లలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 2024 అక్టోబర్ నాటికి ఏఐఎఫ్లు రూ.20,572 కోట్ల మేర స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాయి. కంపెనీల హర్షం ఎఫ్ఎఫ్ఎస్ పథకంపై పలు కంపెనీలు హర్షం వ్యక్తం చేశాయి. బడ్జెట్ భారత్ను ప్రపంచ ఆవిష్కరణల పవర్హౌస్ గా నిలబెడుతుందని పేర్కొన్నాయి. రూ.10 వేల కోట్ల తాజా కార్పస్తో స్టార్టప్లకు అవసరమైన పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయని భారత్ పే వ్యవస్థాపకుడు శాశ్వత్ నకరాని చెప్పారు. కొత్త స్టార్టప్లకు తాజా ఎఫ్ఎఫ్ఎస్ పథకం కీలకమైన ఆర్థిక మద్దతును అందజేస్తునందని స్టార్టప్ పాలసీ ఫోరం (ఎస్పీఎఫ్) అధ్యక్షుడు, సీఈఓ రాజ్పాల్ కోహ్లి పేర్కొన్నారు. -
స్టార్టప్లతో బడా కార్పొరేట్లు కలిసి పని చేయాలి
న్యూఢిల్లీ: వ్యాపార సవాళ్లు, ఇతర సమస్యలను పరిష్కరించుకునేందుకు పెద్ద కార్పొరేట్ సంస్థలు, అంకుర సంస్థలతో కలిసి పని చేయాలని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అమర్దీప్ సింగ్ భాటియా సూచించారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు వృద్ధిలోకి వచ్చేందుకు కూడా ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు.ఇందుకోసం ఇప్పటికే పలు పెద్ద కంపెనీలు ముందుకొచ్చాయని, అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయని చెప్పారు. స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన పదో ఏట.. మరిన్ని అంకుర సంస్థలతో కలిసి పని చేసేలా కంపెనీలను ప్రోత్సహించే అవకాశం ఉందని భాటియా చెప్పారు. కొన్ని పనులను స్టార్టప్లకు ఔట్సోర్స్ చేయడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేందుకు వాటితో కలిసి పనిచేయడం, మెంటార్షిప్ ద్వారా సహాయపడటం, ల్యాబ్లు.. టెస్టింగ్ కేంద్రాలకు యాక్సెస్ ఇవ్వడం తదితర మార్గాల్లో ఇది ఉండొచ్చని పేర్కొన్నారు. మరోవైపు, విదేశాల నుండి భారత్కి తమ ప్రధాన కార్యాలయాలను మార్చుకోవాలనుకునే స్టార్టప్ల కోసం సదరు ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల శాఖ వేగవంతం చేసినట్లు భాటియా చెప్పారు. అంకుర సంస్థలకు ప్రోత్సాహమిచ్చేందుకు 2016 జనవరి 16న కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. దీని కింద, వివిధ దశల్లోని అంకుర సంస్థల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ అనే మూడు స్కీములను అమలు చేస్తోంది. 1.5 లక్షల స్టార్టప్లను డీపీఐఐటీ గుర్తించింది. -
ఇంక్యుబేటర్లకు దన్ను
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడం, వాణిజ్య వాతావరణాన్ని మరింత విస్తరించడం ద్వారా అంతర్జాతీయంగా భారతీయ స్టార్టప్లు రాణించేలా ‘టీ హబ్’ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ) సహకారంతో టీ హబ్ ఫౌండేషన్ ‘బిజినెస్ ఇంక్యుబేషన్ మేనేజ్మెంట్, లీడర్షిప్ ప్రోగ్రామ్’ (బీఐఎంఎల్) పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వివిధ సంస్థల్లో మేనేజ్మెంట్ అధిపతులుగా పనిచేస్తున్నవారికి ఇంక్యుబేషన్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణపై శిక్షణ ఇస్తారు. శిక్షణ, వాణిజ్య వ్యాపార సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాంకేతిక, మార్కెటింగ్ నెట్వర్క్తో అనుసంధానం వంటి అంశాల్లో సహకారం అందిస్తారు. ఇంక్యుబేషన్ వ్యవస్థలో పరివర్తనబీఐఎంఎల్ ద్వారా శిక్షణలో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయిలో ఇంక్యుబేషన్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మెంటార్లు, కార్పొరేషన్లు, విధాన నిర్ణేతలతో టీ హబ్కు ఉన్న విస్తృత నెట్వర్క్ ద్వారా భారతీయ ఇంక్యుబేటర్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దే అవకాశాలు మెరుగవుతాయి.బీఐఎంఎల్ కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు ఇప్పటికే టీ హబ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడులోని 15 సాంకేతిక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఎడ్యుటెక్, క్రీడలు, టెక్నాలజీ, మేనేజెమెంట్ రంగాల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటును వేగవంతం చేయడమే బీఐఎంఎల్ ప్రోగ్రామ్ లక్ష్యమని టీ హబ్ వర్గాలు వెల్లడించాయి. -
స్టార్టప్లకు అండగా కోటక్ బిజ్ల్యాబ్స్
వినూత్న ఆలోచనలు కలిగిన స్టార్టప్ కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంకు ‘కోటక్ బిజ్ ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ద్వారా సాయం అందించాలని నిర్ణయించింది. బ్యాంకు సీఎస్ఆర్ కార్యకలాపాల్లో భాగంగా స్టార్టప్ కంపెనీలు అవి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి, వారి వ్యాపారాలను సమర్థవంతంగా విస్తరించడానికి ఈ సాయం ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.ఎవరికి సాయం చేస్తారంటే..అగ్రిటెక్, ఫిన్టెక్, ఎడ్టెక్, హెల్త్కేర్, సస్టెయినబిలిటీ వంటి రంగాల్లో సర్వీసు అందించే స్టార్టప్ కంపెనీలకు ఈ ప్రోగ్రామ్ ద్వారా సాయం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అందుకోసం సమర్థమైన సంస్థలను ఎంచుకునేందుకు ఐఐఎంఏ వెంచర్స్, ఎన్ఎస్ఆర్సీఈఎల్, టీ-హబ్ వంటి టాప్ ఇంక్యుబేటర్ల సహకారం తీసుకోనున్నట్లు కోటక్ బిబ్ల్యాబ్స్ తెలిపింది.ఇదీ చదవండి: అమెరికాలో టిక్టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఎలాంటి సాయం చేస్తారంటే..ఈ ప్రోగ్రామ్లో భాగంగా అవసరమైన కంపెనీలకు మెంటార్ షిప్, మార్కెట్ యాక్సెస్, అడ్వైజరీ సపోర్ట్, వర్క్ షాప్లు, ఎకోసిస్టమ్ ఎక్స్ పోజర్, బిజినెస్ డెవలప్మెంట్, సీడ్ ఫండింగ్.. వంటి సహకారాలు అందిస్తుంది. ఎంపిక అయిన 30 స్టార్టప్లకు రూ.15 లక్షల వరకు గ్రాంట్లతో సహా సుమారు 50 హై-పొటెన్షియల్ స్టార్టప్లకు సపోర్ట్ లభించనుంది. పలు రాష్ట్రాల్లో హైబ్రిడ్ వర్క్షాప్ల ద్వారా 1,000 స్టార్టప్లకు మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. -
మహిళా స్టార్టప్లలో భారీ వృద్ధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో మహిళా స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఐదేళ్లలో ఏపీలో కనీసం ఒక మహిళ డైరెక్టర్గా ఉన్న స్టార్టప్లు కొత్తగా 795 ఏర్పాటయ్యాయని లోక్సభలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. 2019లో ఏపీలో కొత్త స్టార్టప్లు 92 ఏర్పాటైతే.. ఏటా ఆ సంఖ్య పెరుగుతూ 2023లో 294 ఏర్పాటయ్యాయని తెలిపారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీం(ఎస్ఐఎస్ఎఫ్ఎస్) పథకం కింద 2024 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రంలో 20 స్టార్టప్లకు రూ.4.53 కోట్ల నిధులను సమకూర్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,278 మహిళా స్టార్టప్లకు ఎస్ఐఎస్ఎఫ్ఎస్ పథకం కింద రూ.227.12 కోట్లు సమకూర్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన స్టార్టప్లు 1,52,139 ఉండగా.. అందులో కనీసం ఒక మహిళ డైరెక్టర్గా ఉన్న స్టార్టప్లు 73,151 ఉన్నాయని మంత్రి తెలిపారు. 2023లో 2,916 స్టార్టప్ల ఏర్పాటుతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, పౌర కేంద్రీకృత విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. ఇందుకు మిషన్ కర్మయోగి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కొత్తకొత్త ఆలోచనల కోసం స్టార్టప్లు, పరిశోధన విభాగాలు, యువత నుంచి సలహాలను స్వీకరించాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ లెర్నింగ్ వీక్(కర్మయోగి సప్తాహ్)ను ప్రారంభించి, అధికారులనుద్దేశించి మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మరింత సులువుగా మారుతుందంటూ ఆయన..పౌరులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిపై నిఘాకు ఏఐతో వీలు కలుగుతుందన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే యంత్రాంగం అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2020లో మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. నారీ శక్తి ఆశీర్వాదమే స్ఫూర్తిమహిళల ఆశీర్వచనాలే తనకు దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ప్రేరణను అందిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మోదీకి కృతజ్ఞతగా అందజేయా’లంటూ ఓ గిరిజన మహిళ పట్టుబట్టి మరీ తనకు రూ.100 ఇచ్చారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా శనివారం ‘ఎక్స్’లో షేర్ చేసిన ఫొటోలపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా హృదయాన్ని కదిలించింది. నన్ను సదా ఆశీర్వదించే నారీ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి ఆశీస్సులే నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.నేడు వారణాసికి ప్రధాని మోదీ ప్రధాని ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. శంకర నేత్రాలయం సహా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. -
మెదడు నుంచి మార్కెట్లోకి..
చెన్నై: విజయవంతమైన ప్రతి స్టార్టప్ మొదట విద్యార్థుల మెదడులో మొదలైన ఆలోచనే. అలాంటి ఆలోచనలు ఆవిష్కరణలై అభివృద్ధి చెంది మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. ఐఐటీ మద్రాస్లో ఏర్పాటైన ప్రీ-ఇంక్యుబేటర్ ‘నిర్మాణ్’.. యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ, వారికి మార్గనిర్దేశం చేస్తోంది. దీని ద్వారా పురుడు పోసుకున్న స్టార్టప్లను ప్రదర్శించేందుకు ఐఐటీ మద్రాస్ మొట్టమొదటిసారిగా 'నిర్మాణ్ డెమో డే 2024' కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్మాణ్ డెమో డే కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి.. అథితులు, ఫ్యాకల్టీ, విద్యార్థుల సమక్షంలో ప్రారంభించారు. ఏఐ, హెల్త్టెక్, డీప్టెక్, సస్టైనబిలిటీ వంటి వివిధ రంగాలలో ఆలోచన దశలో ఉన్న మొత్తం 30 స్టార్ట్-అప్లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ 'నిర్మాణ్ డెమో డే'ను వార్షిక కార్యక్రమంగా ఏటా నిర్వహించాలని ఐఐటీ మద్రాస్ భావిస్తోంది.క్రియాశీల విద్యార్థుల నేతృత్వంలోని క్షేత్ర స్థాయిలో ఉన్న 85 స్టార్టప్లకు నిర్మాణ్ మద్దతు ఇస్తోంది. వీటిలో దాదాపు 26 స్టార్టప్లు ఇప్పటికే విజయవంతంగా మార్కెట్లోకి వచ్చి వెంచర్ ఫండింగ్లో రూ.108 కోట్లకు పైగా నిధులు సాధించాయి. వీటన్నింటి విలువ రూ.1,000 కోట్లకు పైగా చేరుకోవడం గమనార్హం. ఇలా నిర్మాణ్లో విజయవంతమైన స్టార్టప్లలో అర్బన్ మ్యాట్రిక్స్, మాడ్యులస్ హౌసింగ్, టాన్90, టోకల్, ఇన్ఫ్యూ ల్యాబ్స్, ఇన్వాల్వ్, మెల్వానో, సస్స్టెయిన్స్, జిమ్స్, ప్లీనోమ్ టెక్నాలజీస్, ప్రిస్క్రైబ్, గెలాక్సీ స్పేస్ ఉన్నాయి. గెలాక్సీ స్పేస్ ఇటీవల ఇన్ఫోసిస్ నుండి రూ. 17 కోట్ల నిధులు పొందగలిగింది. -
స్టార్టప్స్కు జోష్.. ఏంజెల్ ట్యాక్స్ తొలగింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంకుర సంస్థలకు ఊరటనిచ్చే దిశగా అన్ని తరగతుల ఇన్వెస్టర్లకు ఏంజెల్ ట్యాక్స్ను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు, ఎంట్రప్రెన్యూర్షిప్నకు, నవకల్పనలకు ఊతమివ్వడానికి ఇది తోడ్పడగలదని ఆమె తెలిపారు.సముచిత మార్కెట్ విలువకు మించిన వేల్యుయేషన్లతో అన్లిస్టెడ్ కంపెనీలు లేదా స్టార్టప్లు సమీకరించే నిధులపై విధించే ఆదాయ పన్నును ఏంజెల్ ట్యాక్స్గా వ్యవహరిస్తారు. ఇది స్టార్టప్లతో పాటు ఇన్వెస్ట్ చేసే మదుపర్లకు సమస్యగా మారింది. గతంలో ఏంజెల్ ట్యాక్స్ స్థానిక ఇన్వెస్టర్లకే పరిమితం కాగా 2023–24లో కేంద్రం దీన్ని విదేశీ పెట్టుబడులకు కూడా వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో దీన్ని తొలగించాలంటూ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) సిఫార్సు చేసింది.నూతన ఆవిష్కరణలకు, భారత్ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మారడానికి మార్గం సుగమం చేసే దిశగా ఇది కీలక అడుగని టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇది అంకుర సంస్థలతో పాటు వాటికి మద్దతుగా నిల్చే ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీలు, వెంచర్ ఫండ్స్కూ సానుకూలమని న్యాయ సేవల సంస్థ ఇండస్లా పార్ట్నర్ లోకేష్ షా చెప్పారు. -
2030కల్లా లక్ష కోట్ల డాలర్ల జమ
న్యూఢిల్లీ: కొత్తగా యూనికార్న్లుగా ఆవిర్భవించే స్టార్టప్ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లు జమయ్యే వీలున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనా వేసింది. 2030కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలకు తెరలేవనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్లను యూనికార్న్గా గుర్తించే సంగతి తెలిసిందే. మెకిన్సీ అండ్ కంపెనీతో రూపొందించిన ‘యూనికార్న్ 2.0: తదుపరి ట్రిలియన్ జమ’ పేరుతో సీఐఐ నివేదికను విడుదల చేసింది. రానున్న కాలంలో రిటైల్, ఈకామర్స్, ఆధునిక తరం ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ, ఎస్ఏఏఎస్(శాస్), డిజిటల్ తదితర రంగాలు భారీ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. శతకాన్ని దాటాయ్ నివేదిక ప్రకారం దేశీయంగా 2011లో తొలి యూనికార్న్ నమోదుకాగా.. దశాబ్దం తదుపరి 100 మార్క్ను యూనికార్న్లు చేరుకున్నాయి. 2024 జనవరికల్లా 113 యూనికార్న్ల ఉమ్మడి విలువ 350 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! యూనికార్న్ల సంఖ్య 100ను అధిగమించడం చెప్పుకోదగ్గ విజయంకాగా.. ఇందుకు పలు కీలక అంశాలు సహకరించాయి. ఇందుకు యువత డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడం, విస్తారిత మొబైల్ ఇంటర్నెట్ వినియోగం, మధ్యతరగతి పుంజుకోవడం, దన్నుగా నిలిచిన మార్గదర్శకాలు కారణమయ్యాయి. -
రిచ్ సపోర్ట్ సిరీస్.. నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి మంచి ఛాన్స్!
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), తెలంగాణ గవర్నమెంట్ చొరవతో.. అక్టోబర్ 2023లో SAMARTHan@RICH పేరుతో 'నెలవారీ సపోర్ట్ సిరీస్' (Monthly Support Series) ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా మెడికల్ టెక్నాలజీ (మెడ్టెక్) ఇన్నోవేటర్లు, స్టార్టప్లు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి పుట్టుకొచ్చింది. SAMARTHan@RICH నెలవారీ సపోర్ట్ సిరీస్ ద్వారా.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) అవగాహన & అప్లికేషన్ ప్రాసెస్, వైద్యుల నుంచి ఐడియా వ్యాలిడేషన్, ఉత్పత్తి అభివృద్ధి & వాణిజ్యీకరణ కోసం రెగ్యులేటరీ రోడ్మ్యాప్, క్లినికల్ ధ్రువీకరణ అధ్యయనాలను నిర్వహించడం వంటివి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు IP ఏజెన్సీల నిపుణులు వంటి అనుభవజ్ఞులైన వైద్యులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో స్టార్టప్ల ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. విజ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా.. రెగ్యులేటరీ ల్యాండ్స్కేప్ను నావిగేట్ చేసుకోవచ్చు. వారి టెక్నాలజీలను మెరుగుపరచుకోవచ్చు. అంతే కాకుండా రోగుల జీవితాన్ని మార్చే పరిష్కారాలను వేగంగా అందించడానికి స్టార్టప్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని RICH సీఈఓ 'రష్మీ పింపాలే' అన్నారు. ఐడియా వ్యాలిడేషన్, క్లినికల్ వ్యాలిడేషన్, రెగ్యులేటరీ గైడెన్స్పై సెషన్లతో ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 2024లో ప్రారంభమైంది. దీని ద్వారా ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా.. సంచలనాత్మక పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. SAMARTHan@RICH నెలవారీ ప్రాతిపదికలో పాల్గొనటానికి ఆసక్తి కలిగిన ఆవిష్కర్తలు, స్టార్టప్లు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. -
రూ.100 కోట్ల కంపెనీ స్థాపించిన యంగ్ లేడీ.. ఎలాగంటే..
ఇంటికో వ్యాపారవేత్త... వీధికో స్టార్టప్ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఐఐటీల్లో చదవాలని పిల్లలు ఎంతగా కలలు కంటున్నారో ఆ చదువవగానే సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనీ అంతగానే కలలు కంటున్నారు. ఆ కలలకు దన్నుగా నిలుస్తోంది పారిశ్రామిక రంగం. దీంతో చాలా మంది యువత తమకు నచ్చిన పని చేసుకునేందుకు ఉద్యోగాలను మానేస్తున్నారు. అలా సొంత వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. ఐఐటీలో చదివి స్టార్టప్ను స్థాపించి ఏకంగా రూ.100 కోట్ల కంపెనీగా అభివృద్ధి చేసిన ఆ యువ వ్యాపారవేత్త ఎవరు.. తను చేస్తున్న బిజినెస్ ఏమిటి.. తనను ఆ దిశగా ప్రేరేపించిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా అనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రాజస్థాన్లోని భరత్పూర్కు చెందిన అహానా ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2014-16 మధ్య కాలంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పట్టా తీసుకున్నారు. అక్కడ చదువుతున్న రోజుల్లో యూఎస్లో ఒక హోటల్కు వెళ్లినప్పుడు అధిక కొవ్వు, క్రీముతో కూడిన ఆహార పదార్థాలను తయారుచేయడం చూశారు. అప్పుడే ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రజలకు అందించాలనే ఆలోచన తనకు తోచింది. సొంతంగా తానే పౌష్టిక ఆహార ఉత్పత్తులను తయారు చేసి తనలాంటి ఆరోగ్య ప్రియులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతో ‘ఓపెన్ సీక్రెట్’ పేరుతో రుచికరమైన పోషకాలతో కూడిన చిరుతిళ్లను ఉత్పత్తి చేసే కంపెనీని 2019లో స్థాపించారు. బయట మార్కెట్లో లభిస్తున్న ఫ్యాటీ ఫుడ్స్కు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ పోషకాహార ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు. దాంతో అహానా ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు అవి గొప్ప రుచి, పోషకాహారాన్ని కలిగి ఉన్నందున వ్యాపారం ఊపందుకుంది. ముప్పై ఏళ్ల వయస్సులో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించిన అహానా ప్రస్తుతం ‘ఓపెన్ సీక్రెట్’ కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. అమెరికాలో భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం రూ.100 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తుల సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అహానా గోద్రెజ్ టైసన్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇదీ చదవండి: యాప్లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా.. గతంలో చదువు అయిపోయాక నాలుగు ఏళ్లు ప్రోక్టర్ అండ్ గాంబుల్లోనూ పనిచేశారు. కృత్రిమ రంగులు, రుచులు, జంక్ ఫుడ్ నుంచి భారతీయులకు పూర్తిగా పౌష్టికాహారాన్ని అందించే దిశగా కృషిచేస్తున్నట్లు అహానా లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. -
పెట్టుబడులు తిరిగివ్వాలని స్టార్టప్లు భావించడం లేదు
న్యూఢిల్లీ: మదుపుదారుల నుంచి తీసుకున్న పెట్టుబడులను తిరిగి ఇచ్చేయడం తమ బాధ్యతని అంకుర సంస్థల వ్యవస్థాపకులు భావించడం లేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్లలో గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్లు పడిపోతుండటం మొదలైన వాటన్నింటికీ ఇదే కారణమని వారు చెబుతున్నారు. బైజూస్, భారత్పే వంటి టాప్ స్టార్టప్స్ వ్యవస్థాపకులకు, ఇన్వెస్టర్లకు మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలువురు మదుపుదారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘వ్యవస్థాపకులు తాము తీసుకున్న పెట్టుబడులను బాధ్యతగా తిరిగి ఇచ్చేయాలని భావించకపోతుండటమే కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్ల పతనానికి దారి తీస్తోంది‘ అని 100ఎక్స్డాట్వీసీ వ్యవస్థాపకుడు యజ్ఞేష్ సంఘ్రాజ్కా తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల సమస్యలు చాలా కాలంగా ఉన్నవేనని, ఇవి స్టార్టప్లకే పరిమితం కాకుండా సాధారణంగా లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీల్లోనూ కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, లాభాలు, వృద్ధిపై అత్యుత్సాహం చూపించే క్రమంలో స్టార్టప్లు కీలకమైన గవర్నెన్స్, నిబంధనల పాటింపు వంటి ప్రక్రియలను ఒకోసారి విస్మరిస్తుంటాయని సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ చెప్పారు. వ్యవస్థాపకులు లాభాలపై దృష్టి పెట్టాలి కానీ గవర్నెన్స్ను పట్టించుకోవడం మానేయకూడదు అని ఆయన సూచించారు. ప్రతి స్టార్టప్ .. కస్టమర్ల కోసం టెక్నాలజీని తయారు చేయడంపైనే పూర్తిగా దృష్టి పెడుతుందే తప్ప తమ సంస్థలో అంతర్గతంగా పాటించాల్సిన వాటికోసం టెక్నాలజీని రూపొందించుకోవడంపై అంతగా శ్రద్ధ చూపించదని యూనికస్ కన్సల్టెక్ సహ వ్యవస్థాపకుడు సందీప్ ఖేతాన్ తెలిపారు. అయితే, దేశీయంగా 95 శాతం స్టార్టప్లు నిజాయితీగా, నిబంధనలను పాటించే విధంగానే ఉంటున్నాయని ఇన్ఫోఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ అభిప్రాయపడ్డారు. -
నవభారతానికి స్టార్టప్లే వెన్నెముక.. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దు
న్యూఢిల్లీ: నవభారత నిర్మాణానికి అంకుర సంస్థలే వెన్నెముకలాంటివని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2047 నాటికి 35 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో దేశం అందించే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏ ఒక్కదాన్ని చేజార్చుకోవద్దని స్టార్టప్లకు సూచించారు. స్టార్టప్ మహాకుంభ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశాభివృద్ధిలో కీలకమైన స్టార్టప్ విప్లవానికి వచ్చే నెల 18 నుంచి మూడు రోజులు జరిగే మహాకుంభ్ దర్పణంగా నిలుస్తుందని గోయల్ చెప్పారు. దేశీయంగా మనకు అతి పెద్ద మార్కెట్ ఉంది కదా అని నింపాదిగా ఉండకూడదని, అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలను విస్తరించడంపై అంకుర సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. ఎంట్రప్రెన్యూర్ షిప్, ఆవిష్కరణలపై ఆసక్తి గల విద్యార్థులు ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు. -
దేశీయ స్టార్టప్లపై జెరోధా బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశీయ స్టార్టప్ల విజయం విదేశీ పెట్టుబడి దారులకు సొంతం అవుతుందని అన్నారు. కాబట్టే భారత్ సమిష్టి కృషితో అభివృద్ధి చెందుతూ దేశీయంగా సంపదను సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘నేను ఇంతకు ముందే చెప్పాను. భారత్ అభివృద్ధి చెందాలంటే అందరినీ కలుపుకోవాలి. స్థానికంగా సంపదను సృష్టించబడాలి. నేడు, స్వదేశీ స్టార్టప్ల విజయంలో ఎక్కువ భాగం భారతదేశం వెలుపల ఉన్న పెట్టుబడిదారులకు వెళుతుంది. తగినంత నిధులు ఉండడం వల్ల విదేశీ పెట్టుబడి దారులపై ఆధారపడడం తగ్గుతుంది. ట్యాక్స్ కూడా అదా చేసుకోవచ్చు అని నితిన్ కామ్ తెలిపారు. I've said this earlier: for India to grow inclusively, wealth has to be created locally. Today, much of the success of homegrown startups goes to investors outside India. Staying in India and incorporating at home also saves the future hassle of paying huge taxes to flip back.… https://t.co/vSFmlKL2zj pic.twitter.com/ErVzldeymH — Nithin Kamath (@Nithin0dha) February 20, 2024 దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్ల కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు నితిన్ కామత్ గత సంవత్సరం నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్లో చేరారు. స్టార్టప్ల కోసం భారత్ తన దేశీయ మూలధనాన్ని అన్లాక్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తాను కృషి చేస్తానని, స్వదేశంలో స్టార్టప్లకు మద్దతుగా భారతీయులను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. ఒక దేశంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే స్టార్టప్లు/ఎంఎస్ఎఈల కోసం దేశీయ మూలధనాన్ని అన్లాక్ చేయడం, విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, భారతీయ స్టార్టప్లకు భారతీయులు మద్దతునివ్వడమేనని అన్నారు. -
స్టార్టప్ల్లో రూ. 200 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ (ఐపీవీ) అంకుర సంస్థల్లో ఈ ఏడాది సుమారు రూ. 150–200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో వినయ్ బన్సల్ తెలిపారు. డ్రోన్, స్పోర్ట్స్, హెల్త్, ఫిన్టెక్ సంస్థల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. తమ దగ్గర రూ. 1,200 కోట్ల నిధులు ఉండగా ఇప్పటివరకు రూ. 750 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. 2023లో 56 పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. వీటిల్లో 46 కొత్తగా ఇన్వెస్ట్ చేసినవి కాగా మిగతావి ఫాలో–ఆన్ పెట్టుబడులని బన్సల్ పేర్కొన్నారు. గతేడాది సగటున 61 శాతం మేర రాబడులతో 14 సంస్థల నుంచి వైదొలిగినట్లు చెప్పారు. 2023లో ఒక మీడియా స్టార్టప్, కూవర్స్, స్పోర్టిడో మొదలైన వాటి నుంచి ఐపీవీ పూర్తిగా నిష్క్రమించింది. మీడియా వెంచర్లో పెట్టుబడులపై దాదాపు 200 శాతం రాబడి అందుకున్నట్లు బన్సల్ వివరించారు. -
స్టార్టప్స్కు డెస్టినేషన్గా ఏపీ
సాక్షి, విశాఖపట్నం: స్టార్టప్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) అడిషనల్ డైరెక్టర్(ఏడీ) సురేష్ బాత్రా అన్నారు. డీప్ టెక్ నైపుణ్య ఫౌండేషన్ (డీటీఎన్ఎఫ్) అధ్వర్యంలో విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్ర్డన్స్ ఎరీనాలో శనివారం నిర్వహించిన ఏఐ క్లౌడ్ సమ్మిట్–2024ను సురేష్బాత్ర, విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.రవిశంకర్ ప్రారంభించారు. సురేష్ మాట్లాడుతూ ఏపీలో స్టార్టప్లకు ఎకోసిస్టమ్ అద్భుతంగా ఉందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుకూల వాతావరణం ఏపీలో ఉండటంతో కొత్త ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఐటీ, అనుబంధ పరిశ్రమలకు విశాఖ కీలకంగా మారుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టార్టప్స్లో మూడోవంతు విశాఖలోనే ఉన్నట్లు తెలిపారు. సీపీ రవిశంకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది నేరస్తులను గుర్తించేందుకే కాకుండా నేర నియంత్రణకు, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏపీ ఇన్నోవేటివ్ సొసైటీ సీఈవో అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 44 ఇంక్యుబేషన్ సెంటర్లలో స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. డీప్టెక్ నైపుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీధర్ కొసరాజు మాట్లాడుతూ భారత్లో ఉన్న ఎంఎన్సీ, హైటెక్ కంపెనీలకు చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్న సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా డీటీఎన్ఎఫ్, ఏపీఐఎస్ మధ్య కృత్రిమ మేధకు సంబంధించిన ఎంవోయూ జరిగింది. సదస్సులో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు ఆయా రంగాల్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు. -
AP: రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించింది. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586 దాటింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది వీటిలో పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితమవడంతో స్టార్టప్లలో రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం దానికి భిన్నంగా స్టార్టప్ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్టెక్ జోన్లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా పలు స్టార్టప్లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. -
స్టార్టప్లకు ఆదాయపన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు కలిగిన 2,975 స్టార్టప్లకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు లభించింది. 2023 డిసెంబర్ 31 నాటికి 1,17,254 స్టార్టప్లు ప్రభుత్వ గుర్తింపును పొందినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ సంజీవ్ తెలిపారు. ఆదాయపన్ను మినహాయింపు పొందిన స్టార్టప్లు 2023 మార్చి నాటికి 1,100గానే ఉన్నాయని, వాటి సంఖ్య ఇప్పుడు 2,975కు పెరిగినట్టు చెప్పారు. అర్హత సరి్టఫికెట్లు మంజూరు చేసేందుకు వీలుగా, దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించేందుకు ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్వోపీ) రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సరి్టఫికెట్ ఆధారంగానే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పెండింగ్లో ఉన్న సుమారు 1,500 దరఖాస్తులను మార్చి 31లోపే పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ‘‘స్టార్టప్లకు వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు మొత్తం విధానాన్నే మారుస్తున్నాం. అవి ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా చూస్తున్నాం’’అని సంజీవ్ తెలిపారు. ఇప్పటికే 1,800 పేటెంట్లను స్టార్టప్లకు జారీ చేసినట్టు చెప్పారు. స్టార్టప్లకు నిధుల కొరతపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడు ఈ ధోరణిలో మార్పు వచి్చందని, స్టార్టప్లు సైతం డెట్ నిధుల కోసం చూస్తున్నట్టు తెలిపారు. ‘‘ఈక్విటీ రూపంలో నిధులు తగ్గి ఉండొచ్చు. అలా అని వాటికి నిధులు లభించడం లేదని చెప్పడానికి లేదు. స్టార్టప్లు ఐపీవో మార్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటున్నాయి’’అని వివరించారు. స్టార్టప్ల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తదితర పథకాలను కేంద్ర సర్కారు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. -
రెండే.. రెండు నిమిషాల కాల్.. 200 మంది ఉద్యోగాలు ఊడాయ్!
రెండే రెండు నిమిషాల కాల్.. రెండు వందల మంది ఉద్యోగుల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టింది. ఆర్ధిక మాంద్యం కారణంగా ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఓ కంపెనీ రెండు నిమిషాల వ్యవధిలో వందల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా కేంద్రంగా ఫ్రంట్డెస్క్ అనే సంస్థ తన 150 బిల్డింగ్లలో స్వల్పకాలానికి 1000 పోర్షన్లను అద్దెకు ఇస్తుంటుంది. ఫ్రంట్డెస్క్కు చెందిన బిల్డింగ్లో అద్దెకు ఉండే కస్టమర్లు అందులో ఉండొచ్చు. ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్లు సైతం రెంట్ తీసుకోవచ్చు. అయితే ఈ సంస్థ 7నెలల క్రితం జెన్సిటీ అనే సాఫ్ట్వేర్ కంపెనీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుస పరిణామాలతో ఫ్రంట్ డెస్క్ నిధులు మంచులా కరిగిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల నుంచి ఫండ్ సేకరించే ప్రయత్నాలు చేసింది. అక్కడా విఫలమైంది. చేసేది లేక కంపెనీ దివాళా తీయకుండా ఉండేలా రిసీవర్షిప్ కోసం కోర్టు మెట్లు ఎక్కుంది. ఆ వ్యవహారం కొనసాగుతుండగా.. పొదుపుపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న నిధులు ఖర్చు కాకుండా ఉండేలా సంస్థ మాస్ లేఆఫ్స్ తెరతీసింది. ఇందులో భాగంగా ఫ్రంట్డెస్క్ సీఈఓ జెస్సీ డిపింటో ఉద్యోగులతో రెండు నిమిషాల్ గూగుల్ మీట్ కాల్ మాట్లాడారు. సంస్థను షట్డౌన్ చేయకుండా ఫ్రంట్డెస్క్ స్టేట్ రిసీవర్షిప్ కోసం దాఖలు చేస్తుందని అన్నారు. అనంతరం 200 మంది ఫుల్టైమ్, పార్ట్టైమ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్స్తో పాటు మిగిలిన అన్నీ విభాగాల ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. రిసీవర్షిప్ అంటే ఏమిటి? రిసీవర్షిప్ అనేది సంస్థలు మూత పడకుండా ఉండేలా న్యాయ స్థానం ఆదేశాలతో నిధులను సేకరించే ఓ పద్దతి. ఇన్వెస్టర్ల నుంచి నిధుల్ని సేకరించి దివాళా తీయబోయే సంస్థలకు అప్పగిస్తుంది. దీంతో ఆయా కంపెనీలు మూత పడకుండా సురక్షితంగా ఉంటాయి. చదవండి👉 టీసీఎస్ సంచలన నిర్ణయం?, ‘ ఆ 900 మంది ఉద్యోగుల శాలరీ నిలిపేసిందా?’ -
‘వాటిపై ఆసక్తి ఏది?’.. స్మృతి ఇరానీ ఆవేదన
ముంబై: మహిళల ఆధ్వర్యంలో నడిచే వినూత్నమైన స్టార్టప్లకు మద్దతుగా నిలవకపోవడం పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీ) తీరును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘నేటికీ పురుషుల ఆధ్వర్యంలోని కంపెనీలతో పోలిస్తే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్ కంపెనీలపై వెంచర్ క్యాపిటలిస్ట్లు ఆసక్తి చూపడంలేదు’ అని మెంటార్ మైబోర్డ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇరానీ పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంతో మంది మహిళా ఆవిష్కర్తలు ఉన్నట్టు చెప్పారు. వారి ప్రయత్నాలు వాణిజ్య వెంచర్లుగా రూపాంతరం చెందడం లేదన్న ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. వినూత్నంగా ఉంటున్నప్పటికీ కార్పొరేట్ బోర్డుల్లో ఎంత మంది మహిళలకు చోటు లభించిందో పరిశీలించాలని సూచించారు. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి స్మృతి ఇరానీ ఇటీవలి వ్యాఖ్యలపై విమర్శలు రావడం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. ‘‘మీ కంపెనీ హెచ్ఆర్ హెడ్ ప్రతి నెలా మీ నెలసరిని అడిగి తెలుసుకునే పరిస్థితిని ఊహించగలరా?’’అని ఆమె ప్రశ్నించారు. నెలసరి సెలవు ఇవ్వడం ప్రస్తుత చట్టాలకు సైతం విరుద్ధమన్నారు. ‘‘మహిళలు పెళ్లి చేసుకుంటే, పిల్లల కారణంగా పురోగతి చూపించలేరని గతంలో వారికి అవకాశాలు తిరస్కరించడాన్ని చూశాం. ఇప్పుడు నెలసరి రూపంలో వారికి ఉపాధిని నిరాకరించే పరిస్థితిని సృష్టించడం అవసరం అంటారా?’’అని ఇరానీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విషయంలో ఒకే విధానం సరికాదన్నారు. సంప్రదింపుల నైపుణ్యాలను విద్యార్థుల్లో, ముఖ్యంగా మహిళా విద్యార్థుల్లో కలి్పంచడంపై దృష్టి సారించాలని బిజినెస్ స్కూళ్లకు ఆమె సూచించారు. -
1.14 లక్షల స్టార్టప్లు..
ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 1,14,902 సంస్థలను స్టార్టప్లుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. 2016 జనవరిలో ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ కింద ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగిన సంస్థలకు అవకాశం కలి్పంచినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా, హాంకాంగ్, చైనా వంటి ఎగుమతి దేశాల్లో డిమాండ్ మందగించడం, ముడి పదార్థాల ధరల పెరుగుదల వంటివి రత్నాభరణాల పరిశ్రమకు సవాళ్లుగా మారాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. 2022–23లో రత్నాభరణాల ఎగుమతులు అంతక్రితం ఏడాదిలో నమోదైన 39.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే సుమారు 3 శాతం క్షీణించి 38.11 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వివరించారు. -
ఐఐఎం వైజాగ్కు అరుదైన అవార్డు
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం (ఐఐఎంవీ) మరో అరుదైన అవార్డు దక్కించుకుంది. న్యూఢిల్లీలోని డా.బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్–2023లో ఐఐఎంవీకు అవార్డు ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తూ స్టార్టప్లకు చేయూతనందిస్తున్నందుకు గాను పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించిన ప్రతిష్ఠాత్మక అవార్డును ఐఐఎంవీ ప్రతినిధి ఎంఎస్ సుబ్రహ్మణ్యం అందుకున్నారు. ఐఐఎంవీలో మహిళా స్టార్టప్స్ని ప్రోత్సహించేందుకు ఐఐఎంవీ ఫీల్డ్(ఇంక్యుబేషన్ అండ్ స్టార్టప్స్)ను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి బ్యాచ్లో 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలు సాగించిన విజయాలకు సంబంధించిన వివరాలతో ‘బ్రేకింగ్ బౌండరీస్’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకం ప్రీమియర్ బిజినెస్ స్కూల్ అవార్డును సొంతం చేసుకుంది. అవార్డు సాధించడంపై ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొ.ఎం చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. ఐఐఎంవీ ఫీల్డ్లో 90 మందికిపైగా మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్టార్టప్స్ను అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...
ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్ కాన్ఫరెన్స్ వెబ్ సమ్మిట్ ఇటీవల పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఈ వెబ్ సమ్మిట్కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని రీ డిజైన్ చేయడానికి ఒక ఈవెంట్గా వెబ్ సమ్మిట్ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్సమ్మిట్ సీఈవో కేథరీన్ మహర్ ఈవెంట్ ప్రారంభంలో ‘స్టార్టప్స్ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు. స్టార్టప్స్.. నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్ల ద్వారా వెబ్ సమ్మిట్కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్లను సమ్మిట్ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్ అవర్స్ సెషన్స్ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్లు ఎక్స్పర్ట్స్ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, హెల్త్టెక్, వెల్నెస్, ఫిన్టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్టెక్ .. వంటివి ఉన్నాయి. కార్యాలయాలలో వేధింపులు ఈవెంట్కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్ స్టార్టప్ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్ సమ్మిట్ తన వార్షిక స్టేట్ ఆఫ్ జెండర్ ఈక్విటీ ఇన్ టెక్ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది. ప్రపంచానికి మహిళ పోర్చుగీస్ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ మైండ్ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్ సమ్మిట్ గొప్ప వేదిక’ అన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి. -
ఫ్యాషన్ స్టార్టప్స్లో అజియో పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 డైరెక్ట్ టు కస్టమర్ ఫ్యాషన్ స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టాలని లైఫ్స్టైల్, ఫ్యాషన్ ఈ–కామర్స్ కంపెనీ అజియో భావిస్తోంది. ఈ స్టార్టప్స్ తయారు చేసే, విక్రయించే దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీస్ వంటి ఉత్పత్తులను డైరెక్ట్ టు కంన్జ్యూమర్ వేదిక అయిన అజియోగ్రామ్లో అందుబాటులో ఉంచనుంది. భారతీయ ఫ్యాషన్, లైఫ్స్టైల్ విభాగంలోని 200 బ్రాండ్స్ను ఎక్స్క్లూజివ్గా అజియోగ్రామ్లో వచ్చే ఏడాదికల్లా చేర్చనున్నట్టు వెల్లడించింది. ఈ బ్రాండ్స్ విస్తరణకు, ఆదాయ వృద్ధికి పూర్తి సహకారం అందించనున్నట్టు అజియో ప్రకటించింది. -
అగ్రి - టెక్ స్టార్టప్లలో పెట్టుబడులు డౌన్ - మరింత తగ్గే అవకాశం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల ప్రభావం దేశీ అగ్రి - టెక్ స్టార్టప్పైనా పడుతోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో (2021–22, 2022–23) వాటిలో పెట్టుబడులు 45 శాతం మేర పడిపోయాయి. అటు 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయంగా అగ్రి - టెక్ పెట్టుబడులు 10 శాతం మేర తగ్గాయి. కన్సల్టింగ్ సంస్థ ఎఫ్ఎస్జీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా ఫండింగ్ తగ్గుదల కొనసాగవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి పుంజుకోగలదని నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు నిలదొక్కుకునేందుకు అంకుర సంస్థలు లాభదాయకతపైనా దృష్టి పెట్టడం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. ‘ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కొనసాగించవచ్చు. తమ దగ్గర పరిమిత స్థాయిలో ఉన్న నిధులను.. ఇప్పటికే నిలదొక్కుకున్న వ్యాపారాలవైపు మళ్లించే అవకాశం ఉంది‘ అని ఎఫ్ఎస్జీ వివరించింది. ‘పెట్టుబడుల తీరు మారిపోతుండటం.. అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల ప్రభావం దేశీ అగ్రి–టెక్ రంగంపై ఎలా ఉంటాయనేది తెలియజేస్తోంది. పెట్టుబడులు మందగించిన ఈ తరుణాన్ని స్టార్టప్లు.. తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లాభదాయకతవైపు మళ్లేందుకు ఉపయోగించుకోవాలి‘ అని సంస్థ ఎండీ రిషి అగర్వాల్ తెలిపారు. డీల్స్ పెరిగినా ఫండింగ్ తగ్గింది.. నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల డీల్స్ 121 నమోదు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 140కి చేరాయి. కానీ, అగ్రి–టెక్ స్టార్టప్లు సమీకరించిన నిధుల పరిమాణం 2022 ఆర్థిక సంవత్సరంలో 1,279 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 706 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరంలో అగ్రి–టెక్ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల బూమ్ వచ్చి, వాటి వేల్యుయేషన్స్ అసాధారణ స్థాయులకు ఎగిశాయి. కానీ మరుసటి ఆర్థిక సంవత్సరంలో కరెక్షన్ రావడంతో కొంత విచక్షణాయుతమైన పెట్టుబడుల వాతావరణం నెలకొంది. -
LinkedIn ranking: చేస్తే ఈ స్టార్టప్ కంపెనీలోనే పని చేయాలి..
ఇటీవల యునికార్న్గా మారిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో (Zepto) భారత్లో అత్యధిక మంది ప్రొఫెషనల్స్ ఇష్టపడే వర్క్ప్లేస్ పరంగా అగ్ర స్టార్టప్గా అవతరించింది. ప్రముఖ రిక్రూటింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ 'టాప్ 20 ఇండియన్ స్టార్టప్ల జాబితా'ను తాజాగా విడుదల చేసింది. తమకున్న దాదాపు కోటి మంది సభ్యుల డేటా ఆధారంగా నిపుణులు పని చేయాలనుకునే అభివృద్ధి చెందుతున్న కంపెనీల వార్షిక ర్యాంకింగ్ లింక్డ్ఇన్ రూపొందించింంది. ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగార్థుల ఆసక్తి, కంపెనీలో మెంబర్ ఎంగేజ్మెంట్ తదితర అంశాల్లో పురోగతి సాధించి జెప్టో టాప్ ప్లేస్లో నిలిచింది. గతేడాది ఇదే లింక్డ్ఇన్ టాప్ కంపెనీల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది మూడు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్ను సాధించింది. ఇక ఈ ర్యాంకింగ్లో జెప్టో తర్వాతి స్థానాలలో వరుసగా ఈవీ క్యాబ్ అగ్రిగేటర్ బ్లూస్మార్ట్, ఫిన్టెక్ కంపెనీ డిట్టో ఇన్సూరెన్స్, ఆడియో ఓటీటీ ప్లాట్ఫామ్ పాకెట్ ఎఫ్ఎం, స్కైరూట్ ఏరోస్పేస్ ఉన్నాయి. ఈ సంవత్సరం జాబితాలో ఉన్న 20 స్టార్టప్లలో 14 కొత్తగా చోటు దక్కించుకోవడం విశేషం. -
అతి నియంత్రణ అనర్ధదాయకం..
న్యూఢిల్లీ: ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సర్విసులని, మరొకటని ఇంటర్నెట్ సేవలను వేర్వేరుగా వర్గీకరిస్తూ ’అతిగా నియంత్రించడం’ అనర్ధదాయకంగా మారే ప్రమాదముందని స్టార్టప్లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల వివిధ రకాల సేవలు అందించే సంస్థలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలాకు 129 అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ మేరకు సంయుక్త లేఖ రాశారు. జిరోధాకు చెందిన నితిన్ కామత్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు వీరిలో ఉన్నారు. ఓటీటీలు భారీగా డేటాను వినియోగిస్తుండటం వల్ల తమ నెట్వర్క్లపై భారం పెరిగిపోతోందని, వ్యయాలను భర్తీ చేసుకునేందుకు సదరు ఓటీటీ సంస్థల లాభాల్లో కొంత వాటా తమకూ ఇప్పించాలని టెల్కోలు కోరుతున్న నేపథ్యంలో స్టార్టప్ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీడ్, లభ్యత, వ్యయాలపరంగా ఏ యాప్పైనా టెలికం, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించే నెట్ న్యూట్రాలిటీ విధానానికే తమ మద్దతని లేఖలో స్టార్టప్ల వ్యవస్థాపకులు తెలిపారు. ఓటీటీ వంటి సర్విసులు అందించే సంస్థలను టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ యాప్స్, సర్విసులకు టెలికం లైసెన్సింగ్ నిబంధనలను వర్తించేస్తే దేశీ స్టార్టప్ వ్యవస్థకు తీవ్ర హాని జరుగుతుందని వివరించాయి. ఇవన్నీ కూడా బడా బహుళజాతి సంస్థలకే లబ్ధి చేకూరుస్తాయని అంకుర సంస్థల వ్యవస్థాపకులు లేఖలో తెలిపారు. -
భారత్లో స్టార్టప్ కంపెనీల సరికొత్త రికార్డ్! ఏకంగా..
భారత్లో పారిశ్రామిక చైతన్యం పెరుగుతూ వస్తోంది. పరిశ్రమలు స్థాపించి తమకు చేతనైనంత మందికి ఉపాధి కల్పించాలన్న స్పృహ యువతలో బాగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహక విధానాలను అవలంభిస్తోంది. ఫలితంగా దీంతో దేశంలో స్టార్టప్ కంపెనీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2016లో 450 ఉండగా ప్రస్తుతం లక్షకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ విపరీతమైన వృద్ధిని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్కు హై సివియారిటీ వార్నింగ్!) భారతదేశంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా దేశంలో బిజినెస్ ప్రారంభించడం, నిర్వహించాడాన్ని సులభతరం చేసినట్లు వివరించారు. -
అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!
ఎన్నిఅవరోధాలు, అడ్డంకులు ఎదురైనా దృఢ సంకల్పం,అచంచలమైన అంకితభావం ఉన్నవారు విజయం సాధిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా చిన్న ఉద్యోగంచేస్తూనే అతి పెద్ద లక్ష్యంపై గురిపెట్టి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు. తాజాగా దాదాసాహెబ్ భగత్ విజయ గాథ దీనికి ఉదాహరణ.గతంలో ఇన్ఫోసిస్లో ఆఫీస్ బాయ్గా పనిచేసిన భగత్ ఇప్పుడు తన సొంత స్టార్టప్లకు సీఈఓగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలందుకున్నారు. షెడ్ నుండి "మేడ్-ఇన్-ఇండియా" కాన్వా దాకా తన టాలెంట్తో రెండు కంపెనీలకూ సీఈఓ అయిన భగత్ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం. దాదాసాహెబ్ భగత్ ఎవరు? మహారాష్ట్రలోని బీడ్కు చెందిన దాదాసాహెబ్ భగత్ 1994లో జన్మించారు. భగత్ ఉన్నత పాఠశాల పూర్తి చేసిన తర్వాత వృత్తిని కొనసాగించేందుకు తన గ్రామం నుండి పూణేకు వచ్చారు. ITI డిప్లొమా ప్రోగ్రామ్ను పూర్తి చేసిన తర్వాత రూమ్ సర్వీస్ బాయ్గా నెలకు 9వేల రూపాయల ఉద్యోగంలో చేరారు. కానీ దాన్ని వదిలేసి ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్లో చేరారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. (R Thyagarajan Life Story: సర్వం ధారపోసిన ఈ బిజినెస్ టైకూన్ గురించి తెలుసా?) ఇన్ఫోసిస్ గెస్ట్ హౌస్లో అతిథులకు రూమ్ సర్వీస్, టీ ,వాటర్ అందించడం భగత్ డ్యూటీ. ఇక్కడే సాఫ్ట్వేర్ విలువను తెలుసుకుని పరిశ్రమపై ఆసక్తి పెంచుకున్నారు. కార్పొరేట్ ప్రపంచం పట్ల ఆకర్షితుడయ్యారు. యానిమేషన్ అండ్ డిజైన్ను చేయాలన్నపెద్దల సలహా మేరకు రాత్రి ఉద్యోగం, పగటిపూట యానిమేషన్లో చదువును కొనసాగించారు. కోర్సు పూర్తి చేసిన భగత్ ముంబైలో ఉద్యోగంలో చేరి, కొంతకాలం తర్వాత హైదరాబాద్కు మకాం మార్చారు. అనుకోని ప్రమాదం, మంచానికే పరిమితం హైదరాబాద్లోని డిజైన్ అండ్ గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే పైథాన్, C++ కోర్సులు చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, టెంప్లేట్ల లైబ్రరీని సృష్టించడం దృష్టి పెట్టారు. ఈ డిజైన్ టెంప్లేట్లను ఆన్లైన్లో మార్కెట్ చేయడం ప్రారంభించాడు. అయితే దురదృష్టవశాత్తు, భగత్ కారు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా కుంగి పోలేదు. ఉద్యోగం మానేసి ఫుల్టైమ్ స్టార్టప్ని ప్రారంభించారు. అలా 2015లో Ninthmotion ఆవిష్కృతమైంది. బీబీసీ స్టూడియోస్, 9XM మ్యూజిక్ ఛానెల్ వంటి ప్రసిద్ధ కంపెనీలతో సహాతన సేవల్ని అందిస్తూ, తక్కువ వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వేల మంది క్లయింట్లను సాధించారు. మలుపు తిప్పిన కోవిడ్-19 కాన్వా వంటి ఆన్లైన్ గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్ఫారమ్ను రూపొందించాలని భగత్ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా రెండో బిజినెస్ డూగ్రాఫిక్స్ అవతరించింది. ఈ ప్లాట్ఫారమ్ సాధారణడ్రాగ్-అండ్-డ్రాప్ ఇంటర్ ఫేస్ను కలిగి ఉంది. దీనిద్వారా యూజర్లు టెంప్లేట్లు, డిజైన్లను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. అయితే COVID-19 సంక్షోభం, లాక్డౌన్ కారణంగా పూణేలో వ్యాపారాన్ని వదులుకుని, బీడ్లోని తన గ్రామానికి మకాం మార్చవలసి వచ్చింది. ఇండియన్ 'కాన్వా' ప్రారంభం తన గ్రామంలో మంచి మౌలిక సదుపాయాలు లేనందున తాత్కాలిక ఏర్పాట్లు చేయడానికి, భగత్ మంచి 4G నెట్వర్క్ రిసెప్షన్తో పశువుల కొట్టంలో దుకాణాన్ని ఏర్పాటు చేశారు. భగత్ స్వయంగా యానిమేషన్ అండ్ డిజైన్లో శిక్షణ పొందిన కారణంగా కొంతమంది స్నేహితులకు శిక్షణ ఇచ్చి, వారితో కలిసి ఆ షెడ్లోనే పని ప్రారంభించారు. అలా గ్రామం నుండి చాలా మందికి తక్షణమే వెంటనే డూగ్రాఫిక్స్ శిక్షణ ఇవ్వడం, కార్యకలాపాలు మొదలు కావడం జరిగిపోయింది. కేవలం ఆరు నెలల్లో 10వేల క్రియాశీల వినియోగదారులను సాధించింది. వీరిలో మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగుళూరుతోపాటు, జపాన్, ఆస్ట్రేలియా యూకే నుంచి కూడా ఉన్నారు. విశేష సేవలందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలాగే ప్రధాని మోదీ "ఆత్మనిర్భర్ భారత్" విజన్కు మద్దతుగా డూ గ్రాఫిక్స్, పూర్తిగా భారతీయ నిర్మిత సాఫ్ట్వేర్ను ప్రపంచంలోనే అతిపెద్ద డిజైన్ పోర్టల్గా మార్చాలనేది భగత్ ఆశయం. -
ఫ్రెషర్లకు పెరిగిన ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్: ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు గతేడాది ద్వితీయ ఆరు నెలల (జూలై–డిసెంబర్) కాలంలో 3 శాతం పెరిగాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాలు 62 శాతంగా ఉంటే, తర్వాతి ఆరు నెలల్లో 65 శాతంగా ఉన్నట్టు టీమ్లీజ్ ఎడ్టెక్ తెలిపింది. కెరీర్ అవుట్లుక్ రిపోర్ట్ హెచ్వై2, 2023 నివేదికను విడుదల చేసింది. అలాగే అన్ని విభాగాల్లోనూ నియామకాల ఉద్దేశ్యం కూడా 68 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. ఈ స్థిరమైన వృద్ది రానున్న నెలల్లో ఉద్యోగ మార్కెట్ వృద్ధికి, ఫ్రెషర్ల ఉపాధికి దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఫ్రెషర్లకు (విద్య అనంతం ఉపాధి మార్కెట్లోకి వచ్చిన వారు) సంబంధించి అత్యధికంగా నియామకాల ఉద్దేశ్యం ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లలో 59 శాతం, టెలీ కమ్యూనికేషన్స్లో 53 శాతం, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 50 శాతం చొప్పున నమోదైంది. కానీ, ఐటీ పరిశ్రమలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం 2023 మొదటి ఆరు నెలల్లో 67 శాతంగా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 49 శాతానికి తగ్గింది. అంటే 18 శాతం క్షీణత కనిపించింది. ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో నియామకాల ధోరణి 5 శాతం పెరిగింది. వీరికి డిమాండ్.. డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్, చార్టర్ అకౌంటెంట్, ఎస్ఈవో అనలిస్ట్, యూఎక్స్ డిజైనర్లకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఇతర పట్టణాల కంటే బెంగళూరు ఫ్రెషర్ల నియామకాల పరంగా ముందుంది. నియామకాల ఉద్దేశ్యం 65 శాతంగా నమోదైంది. 2023 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ద్వితీయ ఆరు నెలల్లో 10 శాతం తగ్గినప్పుటికీ ముందు స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబైలో 61 శాతం, చెన్నైలో 47 శాతం, ఢిల్లీలో 43 శాతం చొప్పున నమోదైంది. కొత్త నిపుణులకు డిమాండ్ స్వల్పంగా పెరిగింది. వీటిపై దృష్టి పెట్టాలి.. ఫ్రెషర్లు తమ ఉద్యోగార్హతలు పెంచుకునేందుకు వీలుగా కొన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్చైన్లో సర్టిఫికేషన్, ఆర్టిఫీషియల్ లెన్నింగ్ (ఏఐ), మెషిన్ లెన్నింగ్ (ఎంఎల్)లో పీజీ కోర్స్లకు డిమాండ్ ఉందని పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్లను నియమించుకునే విషయంలో తయారీ, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా, విద్యుత్, ఇంధన రంగాలు టాప్–3గా ఉన్నాయి. -
స్టార్టప్లకు నిధుల కొరత..
ముంబై: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో దేశీ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా తగ్గిపోతోంది. గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 79 శాతం క్షీణించింది. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం గతేడాది జనవరి–జూన్ మధ్యకాలంలో 18.4 బిలియన్ డాలర్ల మేర ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ/వీసీ) పెట్టుబడులు రాగా ఈసారి మాత్రం అదే వ్యవధిలో 3.8 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఫండింగ్ పరిమాణం తగ్గిపోవడం ఒక ఎత్తైతే.. అటు డీల్స్ కూడా పడిపోవడం మరో ఎత్తు. గతేడాది ప్రథమార్థంతో పోలిస్తే ఒప్పందాల సంఖ్య 60 శాతం క్షీణించి 727 నుంచి 293కి పడిపోయింది. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో పీఈ/వీసీ ఫండ్స్ వర్ధమాన మార్కెట్లలో రిసు్కలతో కూడుకున్న పెట్టుబడులు పెట్టడం కంటే పెద్దగా రిసు్కలు లేకుండా మెరుగైన రాబడులు అందించే బాండ్లు మొదలైన సాధనాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ సీఈవో రాజేష్ సలూజా తెలిపారు. అయితే, దీర్ఘకాలికంగా ఈ ధోరణి ఉండకపోవచ్చని, పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత పెట్టుబడులు మళ్లీ పుంజుకోగలవని ఆయన అభిప్రాయపడ్డారు. తగ్గిన వేల్యుయేషన్స్ .. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా ఎగిసిన దేశీ టెక్నాలజీ స్టార్టప్ల వేల్యుయేషన్లు గత కొన్నాళ్లుగా గణనీయంగా తగ్గాయి. యూనికార్న్లపరంగా (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్లు) ప్రపంచంలోనే భారత్ మూడో ర్యాంకులో ఉన్నప్పటికీ .. గత తొ మ్మిది నెలలుగా కొత్తగా ఒక్క అంకుర సంస్థ కూడా యూనికార్న్ హోదా దక్కించుకోలేదు. సమీప కాలంలో దక్కించుకునే సూచనలూ కనిపించడం లేదు. యూనికార్న్లు కాగలిగే సత్తా ఉన్న అంకురాలంటూ హురున్ గతేడాది 122 స్టార్టప్లతో జాబితా చేయగా, ఈ ఏడాది అందులో నుంచి 19 సంస్థలు స్థానం కోల్పోయాయి. మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా వాటాలు విక్రయించి పెట్టుబడులు తెచ్చుకునేందుకు అంకుర సంస్థలు కూడా సుముఖత చూపడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అత్యంత సంపన్న వర్గాలు లేదా వెంచర్ డెట్ ఫండ్స్ నుంచి రుణాల రూపంలో తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నాయి. తద్వారా వాటాలను విక్రయించాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నట్లు వివరించాయి. చక్కని పనితీరుతో మంచి వేల్యుయేషన్ గల కంపెనీలు.. మార్కెట్ పరిస్థితులు బాగా లేనప్పుడు నిధులను సమీకరించేందుకు ఇష్టపడవని హురున్ ఇండియా ఎండీ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. బుల్ మార్కెట్తో పోలిస్తే బేర్ మార్కెట్లో సరైన వేల్యుయేషన్ లభించదు కాబట్టి పరిస్థితి చక్కబడే వరకు అవి కాస్త వేచి చూస్తాయని పేర్కొన్నారు. డేటాలో మరిన్ని అంశాలు.. ► 2023 ప్రథమార్ధంలో 170 పైచిలుకు తొలి దశ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 2022 ప్రథమార్ధంలో నమోదైన 435 డీల్స్తో పోలిస్తే 61 శాతం క్షీణించాయి. ఇన్వెస్ట్ చేసిన నిధుల పరిమాణం బట్టి చూస్తే స్టార్టప్లకు 624 మిలియన్ డాలర్లు లభించాయి. గతేడాది ప్రథమార్ధంలో వచి్చన 1.8 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 65 శాతం క్షీణత. ► వృద్ధి దశ, ఆఖరు అంచె పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గాయి. 123 డీల్స్ ద్వారా 3.2 బిలియన్ డాలర్లు వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఈ విభాగానికి సంబంధించి 292 డీల్స్ ద్వారా 16.6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ► మే నెలలో 948 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో 53 డీల్స్ కుదరగా .. జూన్లో 546 మిలియన్ డాలర్ల విలువ చేసే 44 ఒప్పందాలు కుది రాయి. గతేడాది జూన్లో ఏకంగా 2.4 బిలియ న్ డాలర్ల విలువ చేసే 108 డీల్స్ కుదిరాయి. ► ప్రథమార్ధంలో పీక్ 15 పార్ట్నర్స్ (గతంలో సెక్వోయా ఇండియా) అత్యధికంగా 21 డీల్స్తో టాప్ ఇన్వెస్టరుగా నిలి్చంది. యాక్సెల్ ఇండియా 11, బ్లూమ్ వెంచర్స్ 10 ఒప్పందాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రెయిన్మ్యాటర్ క్యాపిటల్, ఆనికట్ క్యాపిటల్, లైట్స్పీడ్ వెంచర్స్ మొదలైన ఇన్వెస్ట్మెంట్ సంస్థలు చురుగ్గా పాలుపంచుకున్నాయి. ► ఈ ఏడాది ఇప్పటివరకూ కళ్లద్దాల బ్రాండ్ లెన్స్కార్ట్ అత్యధికంగా 500 మిలియన్ డాలర్లు సమీకరించింది. 250 మిలియన్ డాలర్లతో బిల్డర్.ఏఐ, తలో 150 మిలియన్ డాలర్లతో ఇన్ఫ్రా.మార్కెట్, జెట్వెర్క్, ఇన్సూరెన్స్దేఖో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అధిక వేల్యుయేషన్స్తో ఒత్తిడి .. అంకుర సంస్థల ప్రమోటర్లు, వ్యవస్థాపకులు భారీ వేల్యుయేషన్స్తో పెట్టుబడులు సమీకరించడం శ్రేయస్కరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల సత్వరం ఫలితాలు చూపించాల్సిన ఒత్తిడి పెరిగిపోతుందని వారు తెలిపారు. ఫలితంగా దీర్ఘకాలికంగా ఆలోచించడం కన్నా స్వల్పకాలిక ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని వివరించారు. భారత్పే, ట్రెల్, జిలింగో, గోమెకానిక్ వంటి పలు దేశీ అంకుర సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బైటపడటం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాల వల్ల కూడా ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాబట్టి అంకుర సంస్థలు అధిక వేల్యుయేషన్ల వెంటబడకుండా అవసరానికి తగినన్ని నిధులను మాత్రమే సమీకరించుకోవడం, సుస్థిరమైన వ్యాపార మోడల్ను తీర్చిదిద్దుకోవడంపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
బుడి బుడి నడకల నుంచి సూపర్ స్పీడ్ వరకు...
సక్సెస్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, విజయం కోసం ఎదురు చూస్తూ ఏఐ ఇంగ్లీష్ ట్యూటర్ స్టార్టప్ ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా ఘన విజయం సాధించింది అనుశ్రీ గోయల్... కొన్ని సంవత్సరాల క్రితం... స్టాన్ఫోర్డ్(యూఎస్)లో యూత్ ఫెయిల్యూర్ స్టార్టప్ల గురించి పాల్ గ్రహమ్ విశ్లేషణాత్మకమైన ప్రసంగం ఇచ్చాడు. ‘స్టార్టప్కు సంబంధించిన సమస్త విషయాలపై దృష్టి పెడుతున్నారు. ప్రజలు బాగా కోరుకునేది ఏమిటి అనే కీలకమైన విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు’ పాల్ గ్రహమ్ అన్నప్పుడు హాల్లో చప్పట్లు మారుమోగాయి. ఆ ప్రేక్షకులలో అనుశ్రీ గోయెంకా ఉంది. అనుశ్రీకి గ్రహమ్ ఉపన్యాసం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అహ్మదాబాద్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన అనుశ్రీ మానిటర్ గ్రూప్లో కన్సల్టంట్గా అయిదు సంవత్సరాలు పనిచేసింది. ఆ తరువాత స్క్రోల్ మీడియా, స్విగ్గీలో పనిచేసింది. ఉద్యోగం యాంత్రికం అనిపించిందో, ఇంతకంటే చేయడానికి ఏం లేదు.. అనే నిర్లిప్తత ఆవహించిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త దారిలోకి వచ్చింది. ‘వ్యాపారంపై నా ముద్ర ఉండాలి. అది నాకు సంతోషం కలిగించేలా ఉండాలి’ అనుకుంటూ రంగంలోకి దిగింది అనుశ్రీ. పది సంవత్సరాలు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన అనుశ్రీ గ్రహమ్ ప్రసంగాన్ని పదేపదే గుర్తు తెచ్చుకుంటూ బెంగళూరు కేంద్రంగా ‘స్పార్క్ స్టూడియో’తో ఎంటర్ప్రెన్యూర్గా ప్రయాణం మొదలుపెట్టింది. ‘స్పార్క్ స్టూడియో’ అనేది పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్. మొదట ‘స్పార్క్ స్టూడియో’ ఐడియాను శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ఎనలిస్ట్లకు చెప్పినప్పుడు– ‘సక్సెస్ కావడం కష్టం’ అంటూ ఎన్నో కారణాలు చెప్పారు. అయినా వెనకడుగు వేయలేదు అనుశ్రీ. ‘మన దేశంలో హై–క్వాలిటీ ఆర్ట్స్, లిబరల్ ఎడ్యుకేషన్కు కొరత ఉంది’ తాను తరచుగా విన్న మాట ‘స్పార్క్ స్టూడియో’కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. పిల్లలకు ఆన్లైన్ బోధన చేయడానికి ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా దేశవ్యాప్తంగా పేరున్న పెయింటర్లు, మ్యూజిషియన్లు, ఇతర ఆర్టిస్ట్లను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చింది అనుశ్రీ. ‘స్పార్క్ స్టూడియో’ ప్రారంభమైన కొద్ది నెలల తరువాత... ‘ఎక్స్ట్రా కరిక్యులర్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. మీరు చాలా ఆలస్యంగా దీనిలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఎంతోమంది సక్సెస్ సాధించారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చేసేదేమిటి?’ ఇలాంటి కామెంట్స్ ఎన్నో వినిపించాయి. ‘వంద వ్యాపారాల్లో నీదొకటి అయినప్పుడు దానిపై నీదైన ముద్ర, శైలి ఉండాలి’ అని గ్రహమ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన స్నేహితులైన కౌస్తుబ్ ఖడే, జ్యోతిక సహజనందన్, నమిత గోయెంకాలతో ఒక టీమ్గా ఏర్పడింది అనుశ్రీ. ‘నేను బాగా పేరున్న స్కూల్లో చదువుకున్నాను. అయితే హై–క్వాలిటీ ఆర్ట్స్ కరికులమ్కు అక్కడ చోటు లేదు. స్పార్క్ స్టూడియో ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కరికులమ్ను డిజైన్ చేశాము. పిల్లలు యానిమేషన్, మ్యూజిక్, ఫొటొగ్రఫీ...ఎన్నో నేర్చుకోవచ్చు. తమ పిల్లలు ఎన్నో కళలు నేర్చుకోవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులకు బాగా నచ్చింది. ఆర్ట్స్, మ్యూజిక్ ద్వారా పిల్లల్లో భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని ఎంత నచ్చజెప్పినా, వారు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేకపోవడం అసలు సమస్య. మార్కెట్ అంటే ఇదే అనే విషయం ఆలస్యంగా అర్థమైంది. ఇలా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను’ అంటుంది అనుశ్రీ. రెండు సంవత్సరాల ‘స్పార్క్ స్టూడియో’ ప్రయాణం లాభాలు లేవు, నష్టాలు లేవు అన్నట్లుగా ఉండేది. అప్పటికే కొన్ని ప్రసిద్ధ ఎక్స్ట్రాకరిక్యులర్ ఎడ్టెక్ స్టార్టప్లు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘ఏం మిస్ అవుతున్నాం’ అంటూ ఆలోచిస్తున్న సమయంలో అనుశ్రీకి తట్టిన ఐడియా....పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈ రెండు అంశాలు చేర్చడంతో అప్పటి వరకు బుడి బుడి నడకల ‘స్పార్క్ స్టూడియో’ వేగం పుంజుకుంది. సక్సెస్ఫుల స్టార్టప్గా నిలిచింది. ‘నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి’ అంటుంది అనుశ్రీ గోయెంక. నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి. – అనుశ్రీ గోయెంకా తన బృందంతో అనుశ్రీ గోయెంకా -
వ్యాపార విధానాలను స్టార్టప్స్ మెరుగుపర్చుకోవాలి
న్యూఢిల్లీ: నిధుల లభ్యత తగ్గిపోయిన నేపథ్యంలో అంకుర సంస్థలు ఆర్థికంగా మరింత మెరుగైన వ్యాపార విధానాలను పాటించాల్సిన అవసరం నెలకొందని, ఖర్చులను తగ్గించుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక పరిస్థితులు, వేల్యుయేషన్ల ప్రభావంతో పెట్టుబడుల ప్రవాహం మందగించడంతో స్టార్టప్లు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయని బిజ్2క్రెడిట్ వ్యవస్థాపకుడు రోహిత్ ఆరోరా తెలిపారు. 2023లో దేశీ స్టార్టప్లలోకి విదేశీ పెట్టుబడులు 72 శాతం పడిపోయాయని ఆయన వివరించారు. అయితే, ఆర్థికంగా నిలదొక్కుకుని, ఈ పరిస్థితి నుంచి బైటపడటంపై అంకుర సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉందని ఆరోరా తెలిపారు. అంతర్జాతీయంగా గత కొంతకాలంగా ఎదురైన చేదు అనుభవాల కారణంగా వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు నమ్మకం కాస్త దెబ్బతిందని ప్రాప్టెక్ సంస్థ రెలాయ్ వ్యవస్థాపకుడు అఖిల్ సరాఫ్ అభిప్రాయపడ్డారు. దీంతో డీల్స్ విషయంలో వారు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఇటీవలి నివేదిక ప్రకారం భారతీయ స్టార్టప్ వ్యవస్థలోకి ఈ ఏడాది పెట్టుబడులు 36 శాతం క్షీణించాయి. గతేడాది ప్రథమార్ధంలో 5.9 బిలియన్ డాలర్లు రాగా ఈసారి 298 డీల్స్ ద్వారా రూ. 3.8 బిలియన్ డాలర్లు వచ్చాయి. -
నీటిపారుదల రంగంలో 19 లక్షల కోట్ల పెట్టుబడి
రాయదుర్గం: కేంద్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంలో రూ. 19 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడుతోందని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు. హైదరాబాద్ నాలెడ్జిసిటీలోని టీ హబ్లో జిటో ఇంక్యుబేసన్ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (జేఐఐఎఫ్) రెండు రోజులుగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సమ్మేళనం, వ్యవ స్థాపక దినోత్సవాల్లో ఆదివారం ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట పునరుద్ధరణ కార్యక్రమా న్ని, భూగర్భజల స్థాయిని పునరుద్ధరించడానికి కార్యాచ రణ, నదుల అనుసంధానం చేప ట్టామని తెలిపారు. పారిశ్రామిక రంగాల కంటే వ్యవసాయం రంగమే ఎక్కువ నీటిని వినియోగి స్తోందన్నారు. వ్యవసాయ రంగంలో తలసరి నీటి వినియోగం ఏడాదికి 4,913 నుంచి 5,800 కిలోలీటర్ల వరకు ఉంటుందని, ఇది ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువన్నారు. వ్యవసాయరంగంలో నీటిసంరక్షణకు స్టార్టప్ల అవసరం వ్యవసాయరంగంలో నీటి సంరక్షణపై ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపడం లేదని, ఇక్కడే ప్రైవేట్ రంగ సహాయం, స్టార్టప్ల అవసరం ఏర్పడుతోందని కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యానించారు. మురుగునీటిని తిరిగి ఉపయోగించుకునే వ్యాపార నమూనాలను అభివృద్ధి చేసేందుకు స్టార్టప్ల కోసం మంత్రిత్వశాఖ కూడా ఎదురుచూస్తోందన్నారు. దేశంలో దాదాపు 2వేల ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన నీటి పరీక్ష ల్యాబ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక పరీక్ష సౌకర్యం ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. కాఠిన్యం, పీహెచ్, కాపర్, ఐరన్, ఫాస్పేట్, క్లోరిన్, ఆమ్మోనియా, క్రోమియం వంటి 12 పారామీటర్లపై(ప్రామాణికాలపై) నీటి నాణ్యత పరీక్షలు జరుగుతాయన్నారు. టెస్టింగ్ కిట్ల అభివృద్ధిలోనూ స్టార్టప్ల సాయం టెస్టింగ్ కిట్లను అభివృద్ధి చేయడంలో స్టార్టప్లు తమకు ఎంతో సహాయ పడ్డాయని కేంద్రమంత్రి తెలిపారు. ఇందులో 19 లక్షల మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని, 1.5 కోట్ల నమూనాలను సేకరించి పరీక్షించడం జరిగిందన్నారు. సెన్సార్ ఆధారిత తాగునీటి పరీక్ష కోసం పరిష్కారాలను రూపొందించడానికి స్టార్టప్ల కోసం తాము హ్యకథాన్ కూడా నిర్వహించామన్నారు. ఇందులో 250 స్టార్టప్లు దరఖాస్తు చేసుకోగా అందులో 20 స్టార్టప్లను షార్ట్ లిస్ట్ చేశామని కేంద్రమంత్రి షెకావత్ వెల్లడించారు. ప్రభుత్వం ఒక్కటే అన్ని పనులూ చేయలేదని, జేఐఐఎఫ్ వంటి సంస్థల నుంచి సహాయం కావాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఐఐఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
90 శాతం ఉద్యోగాలు ఫట్: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్
ప్రోగ్రామింగ్ అనుభవం లేని వ్యాపారులు తమ స్వంత ఇ-కామర్స్ స్టోర్ని సెటప్ చేసుకోవడానికి అనుమతించే DIY ప్లాట్ఫారమ్ దుకాన్ ఏఐ కారణంగా తన ఉద్యోగులను తగ్గించుకుంటున్న తాజా కంపెనీగా మారింది ఇ-కామర్స్ స్టార్టప్ దుకాన్ ఉద్యోగుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కస్టమర్ సపోర్ట్ టీమ్లో 90 శాతం ఉద్యోగుల స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ను రీప్లేస్ చేసింది. (రిటెన్షన్ బోనస్తో సీఈవో లగ్జరీ విల్లా: ఇపుడు ఉద్యోగులకు గుడ్ న్యూస్) ఈ విషయాన్ని దుకాన్ ఫౌండర్, సీఈవో సుమిత్ షా ట్విటర్లో వెల్లడించారు. లాభదాయకతకు ప్రాధాన్యమివ్వడమే ఈ నిర్ణయానికి కారణమని పేర్కొంటూ, కస్టమర్ సపోర్ట్ ఖర్చులు 85 శాతం తగ్గాయన్నారు. అలాగే కస్టమర్ సపోర్ట్ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఏఐ చాట్బాట్తో టైం బాగా తగ్గిందని వెల్లడించారు. (అదరగొట్టేస్తున్న యాంకరమ్మ: దిమ్మతిరిగే వీడియో హల్చల్) We had to layoff 90% of our support team because of this AI chatbot. Tough? Yes. Necessary? Absolutely. The results? Time to first response went from 1m 44s to INSTANT! Resolution time went from 2h 13m to 3m 12s Customer support costs reduced by ~85% Here's how's we did it 🧵 — Suumit Shah (@suumitshah) July 10, 2023 చాట్బాట్ను ప్రవేశపెట్టిన రిజల్యూషన్ సమయం మునుపటి 2 గంటల 13 నిమిషాల నుండి 3 నిమిషాల 12 సెకన్లకు తగ్గిందని సుమీత్ షా ట్విటర్లో వెల్లడించారు. లీనా అనే చాట్బాట్ 1400 మద్దతు టిక్కెట్లను పరిష్కరించినట్లుగా గుర్తించామనీ, డుకాన్లో ఏఐ విప్లవానికి ఇది నాంది అని షా చెప్పారు. 90శాతం టీంను తొలగించడం కఠినమైనదే కానీ అవసరమైన నిర్ణయం అంటూ తన చర్చను సమర్ధించు కున్నారు. దీంతో ట్విటర్లో ఆయనపై విమర్శలు చెలరేగాయి. (దేశంలో రిచెస్ట్ గాయని ఎవరో తెలుసా?ఏఆర్ రెహమాన్తో పోలిస్తే?) A day later, he came up with another demo and this time bot answered both generic as well as account-specific questions, instantly. Let's name her "Lina" and @_ggpush to prod. Next? Of course GGpush https://t.co/coiQz6oSxP Posted this in Dukaan VIP community on FB & slept. pic.twitter.com/fUBOoaQD1D — Suumit Shah (@suumitshah) July 10, 2023 తొలగించిన సిబ్బందికి ఏదైనా సహాయం అందించారా అనినొక యూజర్ అడిగారు. లేఆఫ్లపై మరిన్ని వివరాలను తన రాబోయే లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడిస్తానని షా తెలిపారు. అసలు మానవత్వంలేదు, సిగ్గు, సెన్సిటివిటీ లేదు అంటూ ట్వీపుల్ దుమ్మెత్తి పోశారు. ఉద్యోగులకు తొలగించడం అనేది బాధాకరమైన విషయం ఇందులో గర్వపడాల్సింది ఏముంది అంటూ మండిపడ్డారు. మీ ఉద్యోగులను తలచుకుంటే జాలిగా ఉంది. కానీ మీతో పని చేయాల్సిన అవసరం లేనందుకు సంతోషంగా కూడా ఉంది అని ఒక యూజర్ రాశారు. మీకు అసలు జాలి దయ లేదంటూ మరోకరు తమ ఆగ్రహాన్ని ట్విటర్ ద్వారా వ్యక్తం చేశారు. -
స్టార్టప్స్లోకి పెట్టుబడులు డౌన్..
న్యూఢిల్లీ: దేశీ అంకుర సంస్థల్లోకి ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) పెట్టుబడులు 36 శాతం క్షీణించాయి. 3.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గత నాలుగేళ్లలో అర్థ సంవత్సరానికి సంబంధించి స్టార్టప్స్లోకి పెట్టుబడులు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం. వ్యాపారాలకు సంబంధించి ప్రతి కోణంపై ఇన్వెస్టర్లు మరింత క్షుణ్నంగా మదింపు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉండటమే ఇందుకు కారణం పీడబ్ల్యూసీ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘గతేడాది ప్రథమార్ధంలో నమోదైన 5.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈసారి పెట్టుబడులు 36 శాతం క్షీణించి 3.8 బిలియన్ డాలర్లకు పరమితమయ్యాయి. 298 డీల్స్ కుదిరాయి. ఈ ఫండింగ్లో ప్రారంభ దశ స్థాయి డీల్స్ వాటా 57 శాతంగా ఉంది. ఫిన్టెక్, సాస్, డీ2సీ సంస్థల్లోకి అత్యధికంగా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది‘ అని రిపోర్టు పేర్కొంది. వెంచర్ క్యాపిటలిస్టులు (వీసీ) పుష్కలంగా నిధులు సమీకరించినా, స్టార్టప్స్లోకి పెట్టుబడులు రావడం మందగించింది. అంకుర సంస్థల ప్రస్థానంలో ఇదొక దశ మాత్రమే. రాబోయే కొన్ని నెలల్లో మళ్లీ ఇన్వెస్ట్మెంట్లు పుంజుకునే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఇన్వెస్టర్లు మరిన్ని విషయాలను మదింపు చేస్తున్నారు. ఫైనాన్స్ మొదలుకుని టెక్నాలజీ, హెచ్ఆర్, వ్యాపార ప్రక్రియలు మొదలైనవన్నీ చూస్తున్నారు. స్టార్టప్లలో పటిష్టమైన కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థ ఉందా లేదా అనేది పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటున్నారు‘ అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ అమిత్ నావ్కా తెలిపారు. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► ప్రథమార్ధంలో వీసీల పెట్టుబడులు తగ్గాయి. విలీన, కొనుగోలు (ఎంఅండ్ఏ) లావాదేవీలు దాదాపు గతేడాది ద్వితీయార్ధం స్థాయిలో సుమారు 80 డీల్స్ నమోదయ్యాయి. వీటిలో 80 శాతం దేశీ లావాదేవీలు కాగా మిగతావి సీమాంతర ఒప్పందాలు. ► సాస్ (23), ఫిన్టెక్ (11), ఈ–కామర్స్.. డీ2సీ (10) విభాగాల్లో అత్యధికంగా ఎంఅండ్ఏ డీల్స్ కుదిరాయి. ► ప్రథమార్ధంలో వచి్చన పెట్టుబడుల విలువలో సాస్, డీ2సీ, ఫిన్టెక్, ఈ–కామర్స్ బీ2బీ, లాజిస్టిక్స్.. ఆటో టెక్ రంగాలు అత్యధికంగా 89 శాతం వాటా దక్కించుకున్నాయి. ► బెంగళూరు, ఎన్సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్), ముంబై నగరాలు కీలక స్టార్టప్ సిటీలుగా కొనసాగుతున్నాయి. ప్రథమార్ధంలో స్టార్టప్స్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 83 శాతం వాటా దక్కించుకున్నాయి. -
లక్ష యూనికార్న్లు.. 20 లక్షల స్టార్టప్లు సాధ్యమే: కేంద్ర మంత్రి ధీమా
న్యూఢిల్లీ: నవకల్పనలు, ఎంట్రప్రెన్యూర్షిప్ ,ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజిటల్ రంగంలో భారత్ సాధించిన విజయాలు గోరంతేనని .. దేశం ముందు కొండంత అవకాశాలు అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. భవిష్యత్తులో ఒక లక్ష యూనికార్న్లు (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల స్టార్టప్లు), సుమారు 10–20 లక్షల స్టార్టప్ల స్థాయికి ఎదిగే సత్తా భారత్కి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల ఏర్పాటు ద్వారా టెక్నాలజీతో ప్రజలకు, సమాజానికి, దేశానికి టెక్నాలజీతో ఎలా ప్రయోజనాలు చేకూర్చవచ్చనేది ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని మంత్రి చెప్పారు. పాలనలో, ఆర్థిక వ్యవస్థలోనూ, ప్రభుత్వంలోను డిజిటలైజేషన్ మరింత వేగం పుంజుకోనుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయంగా టెక్నాలజీ, డిజిటల్ రంగంలో భారత్ అంగలు వేయడం ఇప్పుడే ప్రారంభమైందని, ఎదిగేందుకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మంత్రి ఈ విషయాలు వివరించారు. -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి,నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నించబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. (హార్లే డేవిడ్సన్ ఎక్స్440 బుకింగ్స్ షురూ ) అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కల్పించాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. (Virat Kohli First Car: స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్) స్టార్టప్లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్లో 1,00,000 పైచిలుకు స్టార్టప్లు, 108 యూనికార్న్లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) -
స్టార్టప్ వ్యవస్థ బలోపేతానికి కృషి
గురుగ్రామ్: అంకుర సంస్థలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. స్టార్టప్ల వ్యవస్థను ప్రోత్సహించేందుకే తప్ప నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయతి్నంచబోదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యవస్థలో భాగమైన వర్గాలే స్వీయ నియంత్రణ పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టార్టప్20 సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. అంకుర సంస్థల పురోగతికి అవరోధాలు కలి్పంచాలనేది ప్రభుత్వల ఉద్దేశం కాదనే స్పష్టమైన సందేశం స్టార్టప్లకు చేరాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని అంకుర సంస్థలను ఆహ్వానించారు. 2030 నాటికి అంకుర సంస్థల వ్యవస్థలోకి జీ20 దేశాలన్నీ కలిసి ఏటా 1 లక్ష కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు స్టార్టప్20 గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమైతే స్టార్టప్లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరగలవని గోయల్ చెప్పారు. మంచి స్టార్టప్లకు నిధుల కొరత లేదు: అమితాబ్ కాంత్ సరైన అంకుర సంస్థలకు పెట్టుబడుల కొరతేమీ లేదని జీ20 షెర్పా అమితాబ్ కాంత్ స్పష్టం చేశారు. పటిష్టమైన వ్యాపార విధానాలున్న మంచి స్టార్టప్లకు నిధుల లభ్యత బాగానే ఉందని ఆయన చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు స్టార్టప్ వ్యవస్థ చురుగ్గా పని చేస్తోందని స్టార్టప్20 శిఖర్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భారత్లో 1,00,000 పైచిలుకు స్టార్టప్లు, 108 యూనికార్న్లు (బిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే అంకురాలు) ఉన్నాయని అమితాబ్ కాంత్ తెలిపారు. -
నెమ్మదించిన అంకురాలు.. బిలియన్ డాలర్లు దాటిన స్టార్టప్లు ఎన్నంటే..
ముంబై: దేశీయంగా స్టార్టప్ వ్యవస్థలో మందగమనాన్ని సూచిస్తూ 2023లో కొత్త యూనికార్న్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2022లో మొత్తం 24 అంకుర సంస్థలు ఒక బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ అందుకోగా ఈసారి కొత్తగా మూడు మాత్రమే ఆ హోదా దక్కించుకున్నాయి. మొత్తం యూనికార్న్ల సంఖ్య 84 నుంచి 83కి తగ్గింది. ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియన్ ఫ్యూచర్ యూనికార్న్ సూచీ 2023 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇన్వెస్టర్లలో పెట్టుబడులపై ఆసక్తి మందగించడంతో అంకుర సంస్థలకు నిధుల లభ్యత తగ్గుతోందనడానికి తాజా పరిణామం నిదర్శనమని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ సీఈవో రాజేష్ సలూజా తెలిపారు. పలు స్టార్టప్ల వ్యాపార విధానాలు పటిష్టమైనవిగా లేకపోవడం వేల్యుయేషన్ల తగ్గుదలకు దారితీసిందని, అయితే సరైన కంపెనీలకు మాత్రం పెట్టుబడులు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బైజూస్ వంటి కొన్ని స్టార్టప్లలో సమస్యలు నెలకొన్నప్పటికీ భారతీయ స్టార్టప్ వ్యవస్థకు ఫండింగ్పై ప్రతికూల ప్రభావాలేమీ ఉండబోవని సలూజా చెప్పారు.భారత్లో అంకుర సంస్థల వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, వచ్చే అయిదేళ్లలో దేశీయంగా యూనికార్న్ల సంఖ్య 200కు చేరగలదని అంచనా వేస్తున్నట్లు హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. చైనాలో 1,000కి పైగా యూనికార్న్లు ఉన్నాయని.. భారత్ ఆర్థికంగా ఎదగాలంటే స్టార్టప్లు చాలా కీలకమన్నారు. ♦ అంకుర సంస్థలను యూనికార్న్లు (ఒక బిలియన్ డాలర్ల వేల్యుయేషన్), గెజెల్స్ (500 మిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ కలిగి ఉండి, మూడేళ్లలో యూనికార్న్లుగా ఎదిగే అవకాశం ఉన్నవి), చీతాలు (250 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్, అయిదేళ్లలో యూనికార్న్లుగా ఎదిగే అవకాశం ఉన్నవి)గా వర్గీకరించారు. ♦ 250 మిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్న మొత్తం అంకుర సంస్థల సంఖ్య గతేడాది 122గా ఉండగా 2023లో 147కి చేరింది. -
టాప్ ఆశావహ స్టార్టప్ 100 లిస్ట్: దేశీ సంస్థలు నాలుగు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్ నుంచి నాలుగు స్టార్టప్లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్మాజ్ టెక్నాలజీ, ఎవల్యూషన్క్యూ, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇందులో ఉన్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దీన్ని రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిసు్కలను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్) ఇన్వెస్టింగ్కు ఉపయోగపడేలా శాటిలైట్ డేటాను విశ్లేషిం చే సాంకేతికతను జాక్మాజ్ రూపొందిస్తోంది. ఇదీ చదవండి: వేదాంతా భారీ పెట్టుబడులు: ఏకంగా రూ. 14,000 కోట్లు నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్క్యూ సంస్థ ..క్వాంటమ్ టెక్నాలజీలకు సైబర్సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది. వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్బీఎన్బీ, గూగుల్, ట్విటర్ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది. -
టాప్ 100 స్టార్టప్లలో భారత్ సంస్థలు.. దిగ్గజాల సరసన చోటు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఆశావహ, మార్గదర్శక 100 అంకుర సంస్థల జాబితాలో భారత్ నుంచి నాలుగు స్టార్టప్లు చోటు దక్కించుకున్నాయి. గిఫ్టోలెక్సియా సొల్యూషన్స్, జాక్మాజ్ టెక్నాలజీ, ఎవల్యూషన్క్యూ, నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఇందులో ఉన్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) దీన్ని రూపొందించింది. పాఠశాల విద్యార్థుల్లో బోధనాంశాలను నేర్చుకోవడంలో లోపాలు తలెత్తే రిస్కులను గుర్తించే టెక్నాలజీ ఆధారిత సాధనాన్ని గిఫ్టోలెక్సియా అభివృద్ధి చేస్తోంది. ఈఎస్జీ (పర్యావరణం, సామాజిక, గవర్నెన్స్) ఇన్వెస్టింగ్కు ఉపయోగపడేలా శాటిలైట్ డేటాను విశ్లేషించే సాంకేతికతను జాక్మాజ్ రూపొందిస్తోంది. నెక్ట్స్ బిగ్ ఇన్నోవేషన్ సంస్థ.. 3డీ బయోప్రింటర్లను, ఎవల్యూషన్క్యూ సంస్థ .. క్వాంటమ్ టెక్నాలజీలకు సైబర్సెక్యూరిటీ ఉత్పత్తులను అందిస్తోంది. వ్యాపారం, సమాజంపై గణనీయంగా ప్రభావం చూపగలిగే కొత్త సాంకేతికతలను ఆవిష్కరించే అంకుర సంస్థలతో డబ్ల్యూఈఎఫ్ 2000 నుంచి టెక్నాలజీ పయోనీర్స్ జాబితాను రూపొందిస్తోంది. ఈ ఏడాది లిస్టులో 31 దేశాలకు చెందిన స్టార్టప్లు చోటు దక్కించున్నాయి. అమెరికా నుంచి అత్యధికంగా 29 కంపెనీలు, తర్వాత చైనా నుంచి 12 సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ పయోనీర్స్గా ఎంపికైన అంకుర సంస్థలకు.. ఎయిర్బీఎన్బీ, గూగుల్, ట్విటర్ వంటి దిగ్గజాల సరసన చోటు దక్కుతుంది. -
వారెవ్వా ఓనరు..ఫిదా చేశావ్ గురూ! ఏం చేశాడో తెలిస్తే!
బెంగళూరు: ప్రపంచ ఆర్థికమాంద్యం ఆందోళనలు చిన్నా, పెద్ద సంస్థల్ని భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా దిగ్గజ కంపెనీలు ఖర్చులను నియంత్రించుకునే పనులను ఇప్పటికే మొదలు పెట్టాయి. ఇక నిధులను సమకరించుకోవడంలో స్టార్ట్ప్ కష్టాలను సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగుళూరులో ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన పరిణామం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని, భూస్వామి తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి సంస్థ (స్టార్టప్)లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. దీనికి సంబంధించిన కథనం ఇపుడు ఇంటర్నెట్లో సంచలనం సృష్టించింది. వివరాళ్లోకి వెళ్లితేఏఐ పవర్డ్ మ్యారేజ్ యాప్ ‘బెటర్హాఫ్’ కో-ఫౌండర్, సీఈవో పవన్ గుప్తా ఈ కథనాన్ని సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. బిజినెస్ చాలా కష్టంగామారిపోయిన ప్రస్తు సమయంలో ఊహించని ఇన్వెస్టర్ నాకు దొరికాడు అంటూ తన ఇంటి యజమాని సంభాషణల స్క్రీన్షాట్ను పోస్ట్ చేశారు. సుశీల్ కుమార్ అనే ల్యాండ్ లార్డ్ తన ఇంట్లో ఉంటున్న వ్యక్తి నిర్వహిస్తున్న ‘బెటర్హాఫ్’ అనే మ్యారేజ్ బ్యూరో స్టార్టప్ కంపెనీపై ఎనలేని విశ్వాసాన్ని ప్రకటించాడు. ఏకంగా 10 వేల డాలర్లు (రూ. 8 లక్షలు) ఎలా పెట్టుబడి పెట్టాడు. ఈ విషయాన్ని పవన్తో వాట్సాప్ ద్వారా షేర్ చేసుకున్నారు. నిజాయితీగా పెట్టుబడి పెడుతున్నా అంటూ పవన్ వెంచర్పై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు ఆల్ ది బెస్ట్ , మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నానంటూ అభినందలు తెలిపారు. దీంతో నెటిజన్లు యజమాని ఔదార్యంపై ఫిదా అవుతున్నారు. In a tough business landscape, I found an unexpected investor in my landlord. He recently invested $10K in my startup @betterhalfai. Truly amazed by the entrepreneurial spirit everyone in Bangalore shows. Silicon Valley of India for a reason. #peakbengalurumoment pic.twitter.com/IfzUn0lPkl — Pawan Gupta (@pguptasloan) June 2, 2023 -
ఈ దేశాల నుంచి స్టార్టప్ల్లోకి పెట్టుబడులు.. పన్ను లేదు
న్యూఢిల్లీ: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర 21 దేశాల నుంచి అన్లిస్టెడ్ భారత స్టార్టప్ల్లోకి వచ్చే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. సింగపూర్, నెదర్లాండ్స్, మారిషస్ నుంచి వచ్చే పెట్టుబడులకు ఈ అవకాశం కల్పించలేదు. ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్ ఆస్ట్రియా, కెనడా, చెక్ రిపబ్లిక్, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, ఐస్ లాండ్, జపాన్, కొరియా, రష్యా, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ ఏంజెల్ ట్యాక్స్ మినహాయింపు జాబితాలో ఉన్నాయి. అన్లిస్టెడ్ కంపెనీల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులను ఏంజెల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. అనంతరం కొన్ని రకాల విదేశీ ఇన్వెస్టర్ల తరగతులను మినహాయించాలంటూ పరిశ్రమ నుంచి వినతులు రావడంతో.. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. -
భారత్లో బిలియనీర్లు ఎంత మందో తెలుసా?
న్యూఢిల్లీ: భారతదేశంలో 30 మిలియన్ డాలర్ల (రూ.246 కోట్లు) పైన నెట్వర్త్ ఉన్న అల్ట్రా–హై–నెట్–వర్త్ వ్యక్తుల సంఖ్య గత ఏడాది 7.5 శాతం తగ్గి 12,069కి చేరినట్లు నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక పేర్కొంది. అయితే రాబోయే ఐదేళ్లలో ఈ సంఖ్య 19,119 పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ తెలిపారు. ఇదే జరిగితే పెరుగుదల పరిమాణం 58.4 శాతమన్నమాట. ‘‘ది వెల్త్ రిపోర్ట్ 2023’’ శీర్షికన ఆయా అంశాలకు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ తాజా నివేదిక తెలిపిన ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తే... ♦ భారత్ బిలియనీర్లు 2021లో 145 ఉంటే, 2022నాటికి 161కి పెరిగింది. 2027 నాటికి 195 మందికి ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా. ♦ దేశంలో మిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి విలువ కలిగిన సంపన్నుల జనాభా 2021లో 7,63,674 ఉంటే, 2022లో 7,97,714కి పెరిగింది. 2027 నాటికి ఈ జనాభా 16,57,272కు చేరుతుందని అంచనా... ♦ భారత్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా 2022లో అల్ట్రా–హై–నెట్–వర్త్ వ్యక్తుల సంఖ్య 3.8 శాతం తగ్గింది. 2021లో మాత్రం 9.3 శాతం పెరిగింది. ♦ ఆర్థిక మందగమనాలు, తరచుగా రుణ రేట్ల పెంపుదల, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా అత్యంత సంపన్నుల సంపద, పెట్టుబడి పోర్ట్ఫోలియో ప్రభావితమవుతోంది. ♦ భారత్ విషయానికి వస్తే, వడ్డీరేట్ల పెరుగుదల, రూపాయిపై డాలర్ బలోపేతం వంటి అంశాలు వ్యక్తుల నెట్వర్త్ పెరుగుదలపై ప్రభావితం చూపిస్తోంది. వృద్ధి బాట... పారిశ్రామిక, పారిశ్రామికేతర రంగాలలో భారత్ ఇటీవల చక్కటి అభివృద్ధిని నమోదుచేసుకుంటోంది. ఆయా కార్యకలాపాలు ఇటీవలి కాలంలో దేశంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో దోహదపడ్డాయి. కొత్త సంపదను సృష్టించే గ్లోబల్ స్టార్టప్ హబ్గా భారతదేశం కీలక స్థానంలో ఉంది. దేశంలో గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టెక్నాలజీ స్టార్టప్లు మొదలైన రంగాల నుండి వెలువడుతున్న కొత్త అవకాశాలు ఆర్థిక ఊపును ప్రోత్సహిస్తున్నాయి. సంపద సృష్టికి దోహదపడతాయి, ఇవన్నీ భారత్లో అత్యంత సంపన్నుల సంఖ్య పెరగడానికి తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి – శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ -
అత్యధిక స్టార్టప్లున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ
హఫీజ్పేట్: దేశంలోనే అత్యధిక స్టార్టప్లున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని టీహబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని షర్టన్ హోటల్లో సీఐఓ క్లబ్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నేషనల్ టెక్నాలజీ కాంక్లేవ్–2023 శనివారం జరిగింది. ఈ కాంక్లేవ్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,500 స్టార్టప్లున్నాయన్నారు. వ్యాక్సినేషన్ ఉత్పత్తిలోనూ కొత్తగా ఏర్పడిన తెలంగాణే టాప్ రాష్ట్రంగా కొనసాగుతోందని తెలిపారు. ఈజీ ఆఫ్ బిజినెస్లో, బెస్ట్ ఇన్నోవేషన్ స్టేట్గానూ తెలంగాణ గుర్తింపు పొందిందన్నారు. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు.. అమెరికా తర్వాత తమ అతి పెద్ద కేంద్రాలను హైదరాబాద్లోనే ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. వ్యవసాయంలోనూ టెక్నాలజీని ఉపయోగిస్తూ తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. సీఐఓ క్లబ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ 2018లో సీఐఓ క్లబ్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఐఎస్బి అసోసియేట్ డైరెక్టర్ అజయ్ సింగ్, సీఐఓ క్లబ్ ప్రతినిధులు ఉమేష్ మెహతా, 14 చాప్టర్ల సీఐఓలు, సభ్యులు పాల్గొన్నారు. -
యుద్ధ విమానం స్వదేశీ గర్జన!
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి.కామత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పేస్ పాలసీలో భాగంగా రక్షణ రంగంలో ప్రధానంగా స్పేస్ టెక్లో ప్రైవేట్ పరిశ్రమలు, పరిశోధన సంస్థలకు అవకాశాలు కల్పించినట్లు వివరించారు. విశాఖలో ని నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్)లో గురువారం ప్రారంభమైన కండిషన్ మానిటరింగ్ జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. అంతరిక్ష పరిశోధనలపై దృష్టి స్పేస్ పాలసీలో భాగంగా పరిశోధనలపై దృష్టి సారించాం. ముఖ్యంగా రక్షణ శాఖతో పాటు అంతరిక్ష పరిశోధనలపై దృష్టి పెట్టాం. రాకెట్ లాంచింగ్, శాటిలైట్స్ అభివృద్ధి.. ఇలా ఎలాంటి హద్దులు లేకుండా ప్రైవేట్ సంస్థలు ముందుకు రావచ్చు. దీనిద్వారా అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి వేగంగా చేరుకుంటాం. అంతరిక్ష ఆధారిత నిఘా, అంతరిక్ష పరిస్థితులపై మన అవగాహన సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయి. అంకుర సంస్థలకు ప్రోత్సాహం రక్షణ రంగంలో స్టార్టప్స్ని ప్రోత్సహిస్తున్నాం. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై పని చేస్తున్న స్టార్టప్స్కు ప్రాధాన్యమిస్తున్నాం. పరిశోధన అభివృద్ధి(ఆర్ అండ్ డీ) బడ్జెట్లో 25 శాతం వరకూ పరిశ్రమలు, స్టార్టప్స్, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభ పరిణామం. అందుకే స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలకు అవకాశాలు కల్పిస్తున్నాం. 17 వేల అడుగుల ఎత్తు వరకు ‘యూఏవీ’ మానవ రహిత వైమానిక వాహనం (యూఏవీ)పై ప్రధానంగా దృష్టి సారించాం. ఇందుకోసం గైడెన్స్ కిట్, సీట్ ఎజెక్షన్ సిస్టమ్, పైరోటెక్నిక్ కాట్రిడ్స్ అభివృద్ధి చేసే పనిలో ఉన్నాం. ‘యూఏవీ తపస్’ కోసం 180 హెచ్పీ సామర్థ్యం కలిగిన ఇంజన్ను దేశీయంగా అభివృద్ధి చేశాం. దీని ద్వారా యూఏవీ 17 వేల అడుగుల ఎత్తువరకూ ఎగరగలదు. 2028లో తొలి దేశీయ యుద్ధ విమానం ఎగరనుంది మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మన సాయుధ బలగాల్లో చాలా వ్యవస్థలు స్వదేశీ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనున్నాయి. ఇందులో భాగంగా ఎల్సీఏ ఎంకే–2 ఇండక్షన్కు సిద్ధమవుతున్నాం. జీఈఎఫ్ 414 ఇంజన్తో కూడిన ఏఎంసీఏ (అడ్వాన్స్డ్ మీడియమ్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్) ఫేజ్–1 యుద్ధ విమానాన్ని 2028లో ఎగురవేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. దీనికి సంబంధించి అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. ఎలైట్ క్లబ్లో చేరడం గర్వకారణం ఇటీవల ‘సీ బేస్డ్ ఎండో అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్టర్ మిసైల్’ తొలి వి మాన ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ సామర్థ్యాల విషయంలో మన దేశం చరిత్రాత్మక మైలురాయిని అధిగవిుంచింది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలిచి ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్లో చేరడం గర్వకారణం. యుద్ధనౌకలు, ఉపరితలం నుంచి బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాన్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకుముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగాన్ని విజ యవంతంగా నిర్వహించాం. ఈ జంట విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యాన్ని మన దేశం సొంతం చేసుకుంది. -
లోకల్’కు 120 కోట్ల నిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైపర్లోకల్ కంటెంట్, కమ్యూనిటీ, క్లాసిఫైడ్ వేదిక అయిన లోకల్ తాజాగా రూ.120 కోట్ల సిరీస్-బి ఫండింగ్ అందుకుంది. గ్లోబల్ బ్రెయిన్, సోనీ ఇన్నోవేషన్ ఫండ్, ఇండియా కోషెంట్ తదితర ఇన్వెస్టర్లు ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. లోకల్ సేవలు అందిస్తున్న మార్కెట్లలో వృద్ధికి, కొత్త విభాగాల పరిచయానికి తాజా నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు రూ.225 కోట్లకుపైగా ఫండింగ్ అందుకున్నట్టు లోకల్ ఫౌండర్, సీఈవో జానీ పాషా తెలిపారు. బెంగళూరు కేంద్రంగా 2018లో ప్రారంభమైన లోకల్ యాప్ 7 రాష్ట్రాల్లో 6 భాషల్లో అందుబాటులో ఉంది. డెయిలీ అప్డేట్స్, కమోడిటీ ధరలు, స్థానిక జాబ్స్, రియల్టీ, మ్యాట్రిమోనియల్, స్థానిక యాడ్లు, క్లాసిఫైడ్స్ సమాచారాన్ని అందిస్తోంది. 4 కోట్లకుపైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. (బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) -
ఏడాదిలో కొత్తగా 14 స్టార్టప్లకు యూనికార్న్ హోదా
సాక్షి, అమరావతి: యూనికార్న్ స్టార్టప్లు వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గడిచిన ఏడాది కాలంలో కొత్తగా 14 స్టార్టప్లు యూనికార్న్ హోదాను దక్కించుకున్నాయి. మొత్తం 68 యూనికార్న్లతో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ వ్యాపార విలువ 1 బిలియన్ డాలర్లు (రూ.8,200 కోట్లు) దాటితే ఆ సంస్థలను యూనికార్న్లుగా పిలుస్తారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 68 స్టార్టప్లకు ఈ హోదా దక్కినట్లు హూరన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ – 2023 వెల్లడించింది. ఇందులో అత్యధికంగా బైజూస్ 22 బిలియన్ డాలర్ల (రూ.1,80,400 కోట్లు)తో మొదటి స్థానంలో నిలిచింది. డ్రీమ్ 11, స్విగ్గీలు 8 బిలియన్ డాలర్ల (రూ.65,600 కోట్ల)తో తర్వాతి స్థానాల్లో ఉంటే, ఓలా, రాజోర్పేలు 7.5 బిలియన్ డాలర్లు (రూ. 61,500 కోట్లు)తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కానీ భారత సంతతికి చెందిన వారు ఏర్పాటు చేసిన యూనికార్న్ స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా 138 వరకు ఉన్నట్లు హూరన్ పేర్కొంది. భారతీయులు దేశంలోకంటే బయటి దేశాల్లో 70కి పైగా యూనికార్న్లను కలిగి ఉన్నట్లు హూరన్ పేర్కొంది. ఇండియాలో అత్యధికంగా యూనికార్న్లు బెంగళూరు, ముంబై నగరాల్లో ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా 33, ముంబై కేంద్రంగా 13 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్ల విలువ రూ.352.6 లక్షల కోట్లు ప్రపంచవ్యాప్తంగా 1,361 యూనికార్న్లు ఉన్నట్లు హూరన్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే కొత్తగా 303 స్టార్టప్లు యూనికార్న్ హోదాను దక్కించుకున్నట్లు తెలిపింది. మొత్తం యూనికార్న్ల వ్యాపార విలువ గతేడాదితో పోలిస్తే 17 శాతం పెరిగి రూ.352.6 లక్షల కోట్లు (4.3 ట్రిలియన్ డాలర్లు) దాటినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా అమెరికాలో 666 యూనికార్న్లు ఉండగా, 316 సంస్థలతో చైనా రెండో స్థానంలో ఉంది. నగరాల ప్రకారం చూస్తే శాన్ఫ్రాన్సిస్కో 181 యూనికార్న్లతో మొదటి స్థానంలో నిలిస్తే, న్యూయార్క్ 126, బీజింగ్ 79, షాంఘై 66 యూనికార్న్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం 500 మిలియన్ డాలర్ల విలువకు (వీటిని గాజెల్స్ అంటారు) చేరుకొని వచ్చే మూడేళ్లలో బిలియన్ డాలర్ల మార్క్ను అందుకోవడం ద్వారా యూనికార్న్ హోదా పొందే సంస్థలు అత్యధికంగా బెంగళూరు కేంద్రంగా ఉన్నాయని తెలిపింది. గాజెల్స్ యూనికార్న్లుగా ఎదిగే నగరాల్లో బెంగళూరు ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది. -
తొమ్మిదేళ్లలో 90 వేల స్టార్టప్లు: అశ్వినీ వైష్ణవ్
జైపూర్: గడిచిన తొమ్మిదేళ్లుగా దేశీయంగా స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిమదని, 90,000కు చేరుకుందని ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అంకుర సంస్థల సంస్కృతిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయని ఆయన వివరించారు. జైపూర్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సెంటర్ ఏర్పాటు సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఇదీ చదవండి : బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ? అభివృద్ధిలో హైదరాబాద్ జోరు.. గత నెల రిజిస్రేషన్లు అన్ని కోట్లా? -
చాక్లెట్లు కాదు.. రాకెట్లు
కె.జి.రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : రండి బాబూ రండి.. కోరుకున్న డిజైన్లో రాకెట్ తయారు చేయబడును! వినటానికి ఇది వింతగానే అనిపించినా నిజమే మరి! స్పేస్ స్టార్టప్స్లో అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి. స్కాట్లాండ్కు చెందిన స్కైరోరా సంస్థ కావాల్సిన రీతిలో రాకెట్లు తయారు చేస్తోంది. ప్రైవేట్ సంస్థలు స మాచారాన్ని పొందేందుకు శ్రమ పడాల్సిన అవసరం లే కుండా తాము చేసి పెడతామని చెబుతోంది. వన్స్టాప్ సొల్యూషన్ తరహాలో సేవలందిస్తామని భరోసా ఇస్తోంది. రాకెట్లండీ.. రాకెట్లు! ప్రైవేట్ కంపెనీలు తమ కమ్యూనికేషన్స్, పర్యవేక్షణల సామర్థ్యాలు పెంచుకునేందుకు సొంతంగా రాకెట్లను అంతరిక్ష కక్ష్యలోకి పంపిస్తున్నాయి. గతంలో కేవలం ప్రభుత్వ రంగంలోనే అనుమతించిన మనదేశం ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు వెళుతోంది. స్పేస్ ఎక్స్తో ప్రైవేట్ రాకెట్ల రేసును ఎలన్ మస్క్ ప్రారంభించారు. ఆయనకు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ నెట్వర్క్ 42 వేల శాటిలైట్స్తో, జెఫ్ బెజోస్కు చెందిన కూపర్ నెట్వర్క్ 3,200 శాటిలైట్స్తో, యూకే ప్రభుత్వానికి చెందిన వన్వెబ్ నెట్వర్క్ 650 శాటిలైట్స్తో ఏర్పాటు చేసేలా పనులు సాగుతున్నాయి. పెద్ద ఎత్తున స్పేస్ స్టార్టప్స్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పేస్ స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. అమెరికా, చైనా, భారత్తోపాటు ఐరోపా అంతరిక్ష అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నా టికి గ్లోబల్ స్పేస్ మార్కెట్లో 10 శాతం వాటాను సొంతం చేసుకునేలా బ్రిటన్ సిద్ధమైంది. దీనికి సంబంధించి యూకే మార్కెట్ విలువ 483 బిలియన్ డాలర్లుగా అంచ నా వేస్తున్నారు. స్కాట్లాండ్కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త వోలోడిమిర్ లెవికిన్ 2017లో స్కైరోరాని ప్రారంభించా రు. లానార్క్షైర్ కంబర్నాల్డ్లోని ఫ్యాక్టరీలో స్కైరో రా తన రాకెట్లని డిజైన్ చేస్తోంది. ఎడిన్బర్గ్ శివార్లలోని టెస్ట్బ్లాస్ట్ ఏరియాలో వాటిని ఉంచుతోంది. ప్యాసింజర్ రాకె ట్స్ కాకుండా పేలోడ్ రాకెట్లను తయారు చేస్తోందీ సంస్థ. స్కైరోరా ఫ్లాగ్షిప్ రాకెట్ తొమ్మిది ఇంజన్లు, 50 వేల లీటర్ల ఇంధన సామర్థ్యం, 7 మెట్రిక్ టన్నుల్ని మోసుకెళ్లే సత్తాతో సెకనుకు 8 కి.మీ. వేగంతో దూసుకెళ్లగల ఫ్లాగ్షిప్ రాకెట్ని స్కైరోరా సిద్ధం చేసింది. స్కైరోరా ఎక్స్ఎల్ పేరుతో 315 కిలోగ్రాముల పేలోడ్ తీసుకెళ్లగల ఫ్లాగ్షిప్ రాకెట్ని ఈ ఏడాది షెట్ల్యాండ్ దీవుల నుంచి ప్రయోగించేందుకు సిద్ధమైంది. వ్యవసాయ పరిశ్రమలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, బీమా సంస్థలు.. ఇలా భిన్న రంగాలకు సంబంధించి అంతరిక్షం నుంచి ఆప్టికల్, టెంపరేచర్ సెన్సార్స్ లాంటి వాటితో సమాచారం సేకరించి రియల్టైమ్లో డేటా రూపొందించేందుకు రాకెట్లను తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రాజెక్టును పూర్తి చేసింది. 22.7 మీటర్ల పొడవైన రాకెట్ మొదటి దశ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. స్పేస్ ఎక్స్కు భిన్నంగా స్కైరోరా.. రాకెట్ల తయారీలో ఎలన్మస్్కకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు, స్కైరోరాకు గట్టి పోటీ నడుస్తోంది. స్పేస్ఎక్స్ అనేది బస్సు ప్రయాణంలాంటిదని, ఇతర ప్రయాణికులతో కలసి నిర్దేశించిన ప్రాంతం నుంచే వినియోగించుకునే అవకాశం ఉందని స్కైరోరా సీఈవో లెవికిన్ చెబుతున్నారు. స్కైరో రా మాత్రం ట్యాక్సీ ప్రయాణం లాంటిదని, ప్ర యాణికులు నచ్చిన ప్రాంతానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయలుదేరేలా రూపొందించా మని తెలిపారు. స్పేస్ఎక్స్లో రాకెట్ కోసం రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి ఉండగా స్కైరోరాలో మా త్రం ఆర్నెల్లు చాలని స్పష్టం చేస్తున్నారు. యూకే అంతరిక్ష పరిశ్రమలో స్కైరోరా సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇదే తరహాలో భారత్, చైనా సొంత రాకెట్లను తయారు చేసే స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహిస్తూ అంతరిక్ష రంగంలో దూసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. -
స్టార్టప్స్కు తగ్గిన నిధులు
భారతీయ స్టార్టప్స్ 2022 క్యూ1లో 12 బిలియన్ డాలర్ల నిధులను అందుకున్నాయి. 2023 జనవరి–మార్చిలో ఇది 3 బిలియన్ డాలర్లకు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనికార్న్ కంపెనీల జాబితాలో 2023 జనవరి–మార్చిలో కొత్తగా ఏ కంపెనీ చోటు సంపాదించలేదు. 2022 క్యూ1తో పోలిస్తే నిధులు 75 శాతం పడిపోయాయి. డీల్స్ సంఖ్య 58 శాతం తగ్గింది. 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ చేసే డీల్స్ 77 శాతం క్షీణించాయి. ఇదీ 2023 మార్చి త్రైమాసికంలో భారత స్టార్టప్స్ స్టోరీ. ఇంక్42 రూపొందించిన ఇండియన్ టెక్ స్టార్టప్ ఫండింగ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. ఫిన్టెక్ ముందంజలో.. మార్చి త్రైమాసికంలో అందుకున్న నిధుల విషయంలో ఫిన్టెక్ కంపెనీల వాటా ఏకంగా 44.9 శాతం ఉంది. ఈ–కామర్స్ 22.1 శాతం, ఎంటర్ప్రైస్టెక్ 6.8, కంన్జ్యూమర్ సర్విసెస్ 6.5, డీప్టెక్ 5.1, ఎడ్టెక్ 3.5, మీడియా, వినోదం 2.7, ఇతర కంపెనీలు 8.4 శాతం కైవసం చేసుకున్నాయి. డీల్స్ సంఖ్య పరంగా ఎంటర్ప్రైస్టెక్ 41, ఈ–కామర్స్ 40, ఫిన్టెక్ 25, డీప్టెక్ 21, ఎడ్టెక్ 17, మీడియా, వినోదం 16, హెల్త్కేర్ 13, ఇతర రంగాల కంపెనీలు 40 చేజిక్కించుకున్నాయి. విలీనాలు, కొనుగోళ్లు 2022 క్యూ1లో ఆల్టైమ్ హై రికార్డులతో 100 నమోదైతే, ఈ ఏడాది ఇదే కాలంలో 35కు వచ్చి చేరాయి. 2022 సెపె్టంబర్లో టాటా 1 ఎంజీ తర్వాత యూనికార్న్ కంపెనీల జాబితాలో కొత్త కంపెనీ చేరకపోవడం గమనార్హం. పడిన సీడ్ ఫండింగ్.. మందగమనం ఉన్నప్పటికీ భారత్ స్టార్టప్స్కు అత్యధిక సీడ్ ఫండింగ్ 2022లో సమకూరింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధికం. 2014 నుంచి 2022 మధ్య సేకరించిన 5 బిలియన్ డాలర్ల సీడ్ ఫండ్లో 2 బిలియన్ డాలర్లు 2022లో నమోదు కావడం విశేషం. సీడ్ ఫండింగ్ గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో 81% క్షీణించి 180 మిలియన్ డాలర్లుగా ఉంది. స్టార్టప్ వ్యవస్థలో భారీ నిధుల దిద్దుబాటును ఇది సూచిస్తోంది. మార్కెట్లు పుంజుకున్న తర్వాత మంచి వాల్యుయేషన్తో నిధులను సేకరించాలని వ్యవస్థాపకులు యోచిస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్కు చివరి దశలో రుణ నిధుల సాధనాల వైపు పరిశ్రమ మళ్లాల్సి వస్తోంది. కారణం ఏమంటే.. కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి విలువ పడిపోవడం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, ఆర్థిక అనిశ్చితి వంటి ఇతర విషయాల కారణంగా పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అంతే కాకుండా భారతీయ స్టార్టప్ల ఆదాయాలు క్షీణించడం, వాటి పెరుగుతున్న నష్టాలు, వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు వ్యవస్థాపకులు వ్యూహాలను కనుగొనడంలో విఫలం కావడం పెట్టుబడి సెంటిమెంట్ను స్పష్టంగా దెబ్బతీసింది. 2021 బుల్ రన్ తర్వాత నిధుల రాక తీరు చూస్తుంటే మహమ్మారి ముందస్తు స్థాయికి పడిపోయినట్టు అవగతమవుతోంది. ఈ సంవత్సరం వృద్ధి దశలో మూలధనాన్ని సేకరించడం సవాలుగా ఉంటుందని 84% పెట్టుబడిదారులు అభిప్రాయపడ్డారు. ఇవీ గణాంకాలు.. సిరీస్ సి–రౌండ్స్లో గరిష్ట కరెక్షన్తో ఈ ఏడాది జనవరి–మార్చిలో మెగా డీల్స్ 77 శాతం పడిపోయి ఏడుకు వచ్చి చేరాయి. 2022 క్యూ1లో ఈ సంఖ్య 30గా ఉంది. మెగా డీల్స్ సంఖ్య తగ్గడం 2023 క్యూ1లో భారతీయ స్టార్టప్లు సేకరించిన మొత్తం నిధులపై ప్రభావం చూపింది. ఫండింగ్ పరంగా ఈ ఏడాది క్యూ1లో టాప్–3లో నిలిచిన ఫోన్పే 650 మిలియన్ డాలర్లు, లెన్స్కార్ట్ 500 మిలియన్ డాలర్లు, ఇన్సూరెన్స్దేఖో 150 మిలియన్ డాలర్లు అందుకున్నాయి. గతేడాది జనవరి–మార్చిలో మొత్తం 506 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి క్వార్టర్లో ఈ సంఖ్య 213కు పరిమితమైంది. 2020 క్యూ1లో 3.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 212 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి త్రైమాసికంలో లేట్ స్టేజ్ ఫండింగ్ 77 శాతం పడిపోయి 1.8 బిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. గ్రోత్ స్టేజ్ ఫండింగ్ 76% క్షీణించి 700 మిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. సిరీస్–ఏ డీల్స్ 58 నుంచి 30కి, సిరీస్–బీ డీల్స్ 28 నుంచి 4కు పడిపోయాయి. -
స్టార్టప్లలో 24 వేల మంది ఉద్యోగుల తొలగింపులు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 24,000 పైచిలుకు ఉద్యోగులకు 84 ప్రధాన స్టార్టప్స్ ఉద్వాసన పలికాయి. మరికొన్ని కంపెనీలు సిబ్బంది సంఖ్యను తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. వీటిలో యూనికార్న్ కంపెనీలైన బైజూస్, చార్జ్బీ, కార్స్24, లీడ్, ఓలా, ఓయో, మీషో, ఎంపీఎల్ తదితర సంస్థలు ఉన్నాయి. కంపెనీనిబట్టి కొన్ని ఏకంగా 85 శాతం వరకు సిబ్బంది సంఖ్యను కుదించడం గమనార్హం. పునర్వ్యవస్థీకరణ, వ్యయ నియంత్రణ, తీవ్ర ఆర్థిక పరిస్థితులు, వ్యాపార విధానం మార్పు వంటివి ఉద్యోగుల తీసివేతలకు ప్రధాన కారణాలు. పనితీరు బాగోలేకపోవడం వల్ల కొంత మందిని కొన్ని కంపెనీలు తొలగించాయి. రాజీనామా చేయాల్సిందిగా కొన్ని సంస్థలు పలువురిని కోరాయి. 19 ఎడ్టెక్ స్టార్టప్స్లో నాలుగు యూనికార్న్ కంపెనీలు 9 వేల మందికిపైగా సిబ్బందిని సాగనంపాయి. ఎడ్టెక్ తర్వాత కంజ్యూమర్ సర్వీసెస్, ఈ–కామర్స్ రంగ కంపెనీల్లో ఎక్కువగా తీసివేతలు నమోదయ్యాయి. ఈ మూడు రంగాల్లోని 46 స్టార్టప్స్ సుమారు 19,000 మంది ఉద్యోగులను తొలగించినట్టు తెలుస్తోంది. అయిదు ఎడ్టెక్ స్టార్టప్స్ 2022లో మూతపడ్డాయి. ఈ విభాగంలోని 36 స్టార్టప్స్ 2023లో 5,800 మందికి ఉద్వాసన పలికాయి. -
నిరుద్యోగులను ఆదుకునేవి ఇవే.. నియామకాల సన్నాహాల్లో స్టార్టప్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రారంభ దశ స్టార్టప్స్లో అత్యధికం ఈ ఏడాది తమ సిబ్బందిని పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రధానంగా కొత్త ప్రాజెక్ట్ ఆర్డర్లు, పెట్టుబడిదారుల నుండి సేకరించిన అదనపు నిధులు, విస్తరణ వ్యూహాలు ఇందుకు కారణమని ఫిక్కీ–రాండ్స్టాడ్ ఇండియా నిర్వహించిన సర్వే పేర్కొంది. నియామకాల తీరుపై చేపట్టిన ఈ సర్వేలో 300లకుపైగా స్టార్టప్స్ పాలుపంచుకున్నాయి. ‘2023లో కొత్త నియామకాలకు 80.5 శాతం కంపెనీలు సమ్మతి తెలిపాయి. (పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!) ఈ కంపెనీలు సిరీస్–ఏ, సిరీస్–బి నిధులను అందుకున్నాయి. కావాల్సిన మూలధనాన్ని కలిగి ఉన్నాయి. కొత్త ప్రతిభను పొందేందుకు చురుకుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కొనసాగిస్తామని 15.78 శాతం కంపెనీలు వెల్లడించాయి. కొత్త వారిని చేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చిన కంపెనీల్లో ఆరోగ్య సేవలు 13 శాతం, ఐటీ, ఐటీఈఎస్ 10, వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత 8, ఏఐ, ఎంఎల్, డీప్టెక్ 7, ఫిన్టెక్ 7, తయారీ సంస్థలు 7 శాతం ఉన్నాయి’ అని నివేదిక తెలిపింది. అట్రిషన్కు ఇవీ కారణాలు.. స్టార్టప్స్లో క్రియాశీలక పని వాతావరణం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనువైన శిక్షణా వేదికను అందిస్తోంది. వారు తమ సొంత స్టార్టప్స్ను రూపొందించడానికి అడుగు వేసేందుకు ఇది దోహదం చేస్తుంది. పరిశ్రమలో పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందించే మెరుగైన పే ప్యాకేజీలు, అలాగే ఈ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, కెరీర్ పురోగతి, విశ్వసనీయత గురించి స్పష్టత లేకపోవడం వంటి అంశాలు అధిక అట్రిషన్ రేటుకు కారణమని 54.38 శాతం స్టార్టప్లు తెలిపాయి. అవసరమైన నైపుణ్యాలలో లోటు, జీతం అంచనాలలో అసమతుల్యత, ముప్పు ఉండొచ్చనే ఆందోళనల కారణంగా స్టార్టప్స్లో చేరడానికి విముఖత చూపుతున్నారు’ అని నివేదిక వివరించింది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) -
మళ్లీ ఉద్యోగాల కోత..12 నెలల్లో 1400మందిని తొలగించిన స్టార్టప్
సాక్షి,ముంబై: ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫారమ్ అన్ఎకాడమీ మరోసారి ఉద్యోగుల తీసివేతకు నిర్ణయంచింది. లాభదాయకత కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో మరో రౌండ్ లేఫ్స్లను ప్రకటించింది. సిబ్బందిలో 12 శాతం లేదా 380 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రధాన వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి సరైన దిశలో ప్రతీ అడుగు వేశాం. కానీ సరిపోలేదు.. ఈక్రమంలో దురదృష్టవశాత్తు మరో కష్టమైన నిర్ణయం తీసుకునేలా చేసిందని ఎడ్టెక్ స్టార్టప్ అన్ఎకాడమీ వ్యవస్థాపకుడు గౌరవ్ ముంజాల్ ప్రకటించారు. (ఇదీ చదవండి: ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది!150 కి.మీ. రేంజ్లో) గత 12 నెలల్లో ఇది నాలుగో రౌండ్ తొలగింపులు. 2022 ఏప్రిల్ లో 600 మందిని, గత ఏడాది నవంబర్లో 350 మంది ఉద్యోగులను తొలగించింది. కరోనా సమయంలో భారీ లాభాలనార్జించిన కంపెనీ తాజాగా తీవ్ర నష్టాలతో ఇబ్బందు లెదుర్కోంటోంది. కాగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు, బిజినెస్ దెబ్బతినడంతో ఖర్చు తగ్గించే చర్యల్లో భారతీయ స్టార్టప్లు ముఖ్యంగా ఫ్రంట్రో, బైజూస్, వేదాంతలాంటి ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. (నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!) -
మహిళా స్టార్టప్లకు నిధుల సాయం, ఎవరు? ఎలా?
హైదరాబాద్: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్స్ గ్రూప్ ‘స్కేల్ యువర్ స్టార్టప్’ పేరుతో క్తొత కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.10 లక్షలకు మించిన ఆదాయం గడించే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్లకు మద్దతు ఇవ్వనుంది. స్టార్టప్లకు ఆర్థిక సాయం, మార్గదర్శకం అందించాలన్నది ఎలైట్ గ్రూప్ చైర్మన్, ఎండీ టీఆర్ రఘులాల్ కలల ప్రాజెక్టు అని తెలిపింది. మహిళల ఆధ్వ ర్యంలో నడుస్తూ, వారి వాటా కనీసం 51 శాతం ఉంటే, ఏప్రిల్ 10 వరకు ఎలైట్కనెక్ట్ డాట్ ఇన్ఫో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. (చదవండి: ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) స్టార్టప్ల ఎంపిక ప్రమాణాలు టీం, మార్కెట్, వ్యాపార నమూనా ,సామాజిక ప్రభావం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.. వివిధ పరిశ్రమల రంగాలకు చెందిన నిపుణుల బృందం ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. "మహిళా పారిశ్రామికవేత్తలు వారి కలలను సాధించడానికి , వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి తోడ్పాటు అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దానేసా రఘులాల్ . (యాక్సెంచర్ సంచలనం: ఏకంగా 19వేల మందికి ఉద్వాసన) ఇదీ చదవండి: ‘నాటు నాటు’ ఫీవర్: నా వల్ల కావడం లేదు..ఇదే లాస్ట్! ఆనంద్ మహీంద్ర -
ఎస్వీబీ సంక్షోభం: స్టార్టప్లకు రిస్కులు తొలగిపోయినట్లే!
న్యూఢిల్లీ: సిలికాన్ వ్యాలీ బ్యాంకు (ఎస్వీబీ) విషయంలో అమెరికా ప్రభుత్వం సత్వరం చర్య తీసుకున్న నేపథ్యంలో దేశీ స్టార్టప్లకు పొంచి ఉన్న రిస్కులు తొలగిపోయినట్లేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను మరింతగా విశ్వసించాల్సిన అవసరం గురించి ఈ సంక్షోభం ఓ పాఠాన్ని నేర్పిందని ఒక ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఎస్వీబీ ఖాతాదారులకు సోమవారం నుంచి వారి నగ దు అందుబాటులో ఉంటుందంటూ అమెరికా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చంద్రశేఖర్ ఈ విషయాలు తెలిపారు. ఎస్వీబీ ప్రధానంగా స్టార్టప్ సంస్థలకు బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. అయితే, డిపాజిటర్లు విత్డ్రాయల్స్కు ఎగబడటంతో సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్న బ్యాంకును నియంత్రణ సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎస్వీబీ బ్రిటన్ విభాగాన్ని బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ నామమాత్రంగా 1 పౌండుకు కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా 3,000 మంది ఖాతాదారులకు చెందిన 6.7 బిలియన్ పౌండ్ల డిపాజిట్లను భద్రత లభిస్తుందని పేర్కొంది. -
సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో డిపాజిట్లు.. ఆందోళనలో ఇండియన్ స్టార్టప్స్..
న్యూఢిల్లీ: ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలకు చెందిన (ఎపాక్) చాలా మటుకు ఆర్థిక సంస్థలకు మూతబడిన అమెరికన్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెద్దగా లేవని మూడీస్ ఇన్వెస్టర్స్ సరీ్వస్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల మూసివేత ప్రభావం వాటిపై అంతగా ఉండబోదని పేర్కొంది. డిపాజిటర్లు విత్డ్రాయల్స్కు ఎగబడటంతో అమెరికాలో రెండు రోజుల వ్యవధిలోనే సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంకు మూతబడిన నేపథ్యంలో మూడీస్ విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మూసేసిన అమెరికా బ్యాంకుల్లో చాలా మటుకు ఎపాక్ సంస్థల నిధులు ఏమీ లేవు. ఏవో అరకొర సంస్థలకు ఉన్నా అవి భారీ స్థాయిలో లేవు. మొత్తం మీద చాలా మటుకు సంస్థలకు ఎస్వీబీపరంగా భారీ నష్టాలేమీ వాటిల్లే అవకాశం లేదు‘ అని మూడీస్ పేర్కొంది. ఎపాక్లోని రేటెడ్ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని, వాటి దగ్గర తగినంత స్థాయిలో నగదు లభ్యత ఉందని తెలిపింది. కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కాకుండా వాటి దగ్గర వివిధ రంగాల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొంది. ఆర్థిక శాఖ దృష్టికి స్టార్టప్ల కష్టాలు.. ఎస్వీబీ ప్రభావిత దేశీ స్టార్టప్ల సమస్యలను ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సంక్షోభం నుంచి బైటపడేందుకు వాటికి కావాల్సిన సహాయం అందించాలని కోరనున్నట్లు వివరించారు. మంగళవారం అంకుర సంస్థలతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. డిపాజిట్లు మొత్తం తిరిగి వస్తాయంటూ స్టార్టప్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు అమెరికా ప్రభుత్వ వర్గాలు హామీ ఇస్తున్నప్పటికీ ఇందుకోసం ఎంత సమయం పడుతుందనే అంశంపై ఇంకా స్పష్టత లేదని మంత్రి తెలిపారు. ఎస్వీబీ మాతృసంస్థపై షేర్హోల్డర్ల దావా మూతబడిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ)పై షేర్హోల్డర్లు కోర్టును ఆశ్రయించారు. ఎస్వీబీ మాతృ సంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్, సీఈవో గ్రెగ్ బెకర్, సీఎఫ్వో డేనియల్ బెక్పై కాలిఫోరి్నయాలోని న్యాయ స్థానంలో క్లాస్ యాక్షన్ దావా వేశారు. వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల వ్యాపారానికి పొంచి ఉన్న రిస్క్లను వెల్లడించడంలో కంపెనీ విఫలమైందని పిటీషన్లో పేర్కొన్నారు. 2021 జూన్ 16–2023 మార్చి 10 మధ్య ఇన్వెస్ట్ చేసిన వారికి పరిహారం ఇప్పించాలని కోరారు. -
దిగ్గజ బ్యాంక్ మూసివేత.. ప్రపంచ దేశాల్లో కలకలం!
అంతర్జాతీయ సంస్థల నుంచి స్టార్టప్ కంపెనీల్లో కలవరం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టే అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు (Silicon Valley Bank)ను ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Federal Deposit Insurance Corporation) మార్చి 10న షట్డౌన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. శాంతాక్లారా కేంద్రంగా శాంతాక్లారా కేంద్రంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb).. బ్యాకింగ్ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. బ్యాంక్ డిపాజిట్లు, ఖజానా నిర్వహణ సంస్థలకు ( treasury management) లోన్స్, ఆన్లైన్ బ్యాకింగ్, విదేశీ మారక వాణిజ్యం (foreign exchange trade)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది. ఎస్వీబీ మూసివేతకు కారణం ఎస్వీబీ షట్ డౌన్కు కారణంగా తన పేరెంట్ సంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ చేసిన నిర్వాకమేనని తెలుస్తోంది. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్ పోలియాలో 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలు,2.25 బిలియన్ల షేర్లను విక్రయించినట్లు ప్రకటన చేసిందని బ్లూమ్బెర్గ్ నివేదించింది.ఎస్వీబీ బ్యాంకు సైతం నికర వడ్డీ ఆదాయం క్షీణించినట్లు నివేదించింది. అతిపెద్ద 16వ బ్యాంక్ ఎస్వీబీ అమెరికాలోనే అతి పెద్ద 16వ బ్యాంక్. కాలిఫోర్నియా, మసాచుసెట్స్లలో 17 బ్రాంచీల నుంచి వినియోగదారులకు సేవలందిస్తుంది. బ్యాంక్ను ఎఫ్డీఐసీను షట్డౌన్ చేసిందన్న వార్తల నేపథ్యంలో ఎస్వీబీ ఆస్తుల విలువ మంచులా కరిగి 209 బిలియన్ల డాలర్ల నుంచి 175.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 80 బిలియన్ డాలర్ల నష్టం ఎస్వీబీ ప్రకటన రావడంతో మదుపర్లు బ్యాంకులో చేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన వెంచర్ క్యాపిటలిస్టులు బ్యాంకులో ఉన్న పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని,డబ్బును ఉపసంహరించుకోవాలని తమ పోర్ట్ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి. వెరసి ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు 35 ఏళ్లలోనే అత్యంత దారుణంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60శాతం షేర్లు క్షీణించడంతో 80 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. స్టార్టప్లకే నష్టం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ టెక్నాలజీ స్టార్టప్లకు రుణాలు ఎక్కువ ఇచ్చింది. ఈ పరిణామంతో ఇతర బ్యాంకులపై చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయని చెబుతున్నారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్! -
మహిళల కోసం ‘సింగిల్ విండో’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వారికి తగిన ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం టీఎస్–ఐపాస్ తరహాలో త్వరలో ఓ ‘సింగిల్ విండో’విధానం తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనిపై అధికారులు, మహిళా వ్యాపారవేత్తలతో చర్చిస్తున్నామని, త్వరలోనే పేరు పెట్టి అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీ హబ్ 5వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో పలువురికి ఉపాధి కల్పిస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వీ హబ్ వేదికగా ఉన్నత స్థాయికి మహిళలు రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల క్రితం వీహబ్ను ప్రారంభించామని, దాన్ని వేదికగా చేసుకుని ఎందరో మహిళలు ఉన్నతస్థాయికి చేరుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా 35,000 మందికి పైగా మహిళా ఉత్పాదకులను భాగస్వామ్యం చేయడంలో వీ హబ్ ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా.. స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి కింద వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నామని చెప్పారు. తాజాగా రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మాయి తక్కువ అనే భావన తగదు ‘పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పట్నుంచే విలువలు నేర్పించాలి. వారికి ఇష్టమైన చదువును చదివించాలి. తల్లిదండ్రుల వ్యవహారశైలి పిల్లలపై ప్రభావం చూపుతుంది. స్త్రీ, పురుషులకు ప్రతిభ సమానంగానే ఉంటుంది. కానీ కొందరు తెలిసీ తెలియక ‘అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ’అనే భావన నేర్పిస్తున్నారు. అలా వివక్ష చూపించకుండా ఇద్దర్నీ సమానంగా చూడటం మన ఇంటి నుంచే ప్రారంభిస్తే.. వారు కూడా ఇతర అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సమానంగా, గౌరవంగా చూస్తారు. అప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. మా ఇంట్లో నన్ను, నా చెల్లిని బాగా చదివించారు. నా చెల్లి యూఎస్ వెళ్తా అంటే నా కంటే ముందే పంపారు. మా పిల్లలను కూడా మేం సమానంగా చూస్తున్నాం. ఏం అవ్వాలనుకుంటే ఆ దిశగా ముందుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నాం. పిల్లలకు ఆ నమ్మకం ఇవ్వగలిగితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వంద శాతం అభివృద్ధి సాధిస్తారు. నా కూతురు 9వ తరగతి చదువుతోంది. తను మంచి ఆర్టిస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆమె ఏ రంగంలో ఉన్నా సరే మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాను..’అని కేటీఆర్ అన్నారు. ‘బాస్’కి భయపడాల్సిందే.. ‘మహిళలు ఎక్కువ నిబద్ధతతో ఫోకస్డ్గా, బాధ్యతాయుతంగా ఉంటారు. మమ్మల్ని తొక్కేస్తున్నారు కూడా. మేం బయటకి ఎంత నటించినా ఇంట్లో మహిళలే బాస్లు. ఎంత పెద్ద నేత అయినా ఇంటికి వెళ్లాక బాస్కి భయపడాల్సిందే..’అంటూ కేటీఆర్ చమత్కరించారు. ఐదేళ్లలో 3,194 స్టార్టప్లు, చిన్న పరిశ్రమలు వ్యాపారాల నిర్వహణలో మహిళల భాగస్వామ్యం కీలకంగా మారిందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. మహిళలను వివిధ రంగాల్లో ప్రోత్సహించడంలో వీ హబ్ పాత్రను వివరించారు. వీహబ్ ద్వారా గత ఐదేళ్లలో 3,194 స్టార్టప్లు, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, 1,247 మంది విద్యార్థులు, 986 మంది సామాజికంగా ప్రభావశీలురైన పారిశ్రామికవేత్తలు, 609 మంది పట్టణ పారిశ్రామికవేత్తలతో వీ హబ్ విజయవంతంగా సాగుతోందని చెప్పారు. వివిధ రంగాల్లో మహిళలు ఎదిగిన తీరును వీ హబ్ సీఈవో దీప్తి రావుల వివరించారు. పలువురు మహిళలు తమ విజయానికి వీ హబ్ ఎలా తోడ్పడిందీ తెలిపారు. -
స్టార్టప్ల తీరు ‘పొంజి స్కీమ్’ మాదిరే!: నారాయణమూర్తి
ముంబై: స్టార్టప్లు కేవలం ఆదాయం పెంపుపైనే దృష్టి సారిస్తూ, లాభాల గురించి ఆలోచించకుండా.. అదే సమయంలో వాటి మార్కెట్ విలువను పెంచుకోవడం అన్నది పొంజి స్కీమ్ మాదిరేనని, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందడంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, బోర్డు డైరెక్టర్ల పాత్రను తప్పుబట్టాలే కానీ, యువ పారిశ్రామికవేత్తలను కాదన్నారు. నాస్కామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నారాయణమూర్తి మాట్లాడారు. దీర్ఘకాల ప్రయోజాల కోసం ఇన్ఫోసిస్ సైతం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. విషయాల పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడాలని కోరారు. నిధులు సమీకరించినప్పుడల్లా వ్యాల్యూషన్లను పెంచుకుంటూ పోవడం ప్రమాదకరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా ఘటన వల్ల ఎదురుదెబ్బ లేదా ప్రతికూలతలు ఎదురైతే కంపెనీ ధర అదే మాదిరి పడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఐటీ కంపెనీలపై ఏ మేరకు ఉంటుందనే దానిపై మాట్లాడుతూ.. కష్ట సమయాలు ఎదురైనప్పుడల్లా భారత ఐటీ కంపెనీలు లాభపడినట్టు చెప్పారు. చాట్ జీపీటీ వంటి ఏఐ ప్లాట్ఫామ్లతో భారత ఐటీ ఉద్యోగాలపై ప్రభావం ఉండదన్నారు. గతంలో తానూ ఈ తరహా ప్లాట్ఫామ్ల కోసం ప్రయత్నించినట్టు చెప్పారు. -
బయో ఆసియా విజేతలుగా ఐదు స్టార్టప్లు..
సాక్షి, హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద లైఫ్సైన్సెస్, ఆరోగ్య రక్షణ సదస్సు బయో ఆసియా–2023లో రెండో రోజు జరిగిన చర్చా గోష్టిలో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, కార్పొరేషన్లు, పేరొందిన ఆరోగ్య రక్షణ రంగ నిపుణులు, విద్యాసంస్థల అధినేతలు, స్టార్టప్ల ప్రతినిధులు ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. బయో ఆసియా సదస్సులో భాగంగా రెండో రోజు ఐదు కీలక అంశాలపై చర్చా గోష్టులు జరగ్గా ఆపిల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుంబుల్ దేశాయ్, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి మధ్య ఫైర్సైడ్ చాట్ జరిగింది. 50కి పైగా దేశాల నుంచి రెండువేల మందికిపైగా ప్రతినిధులు హాజరు కాగా, రెండు రోజుల్లో రెండు వేల ముఖాముఖి వాణిజ్య సమావేశాలు జరిగాయి. 76 స్టార్టప్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించగా, అత్యంత వినూత్న ఆవిష్కరణలు ప్రదర్శించిన ఐదు స్టార్టప్లను విజేతలుగా ప్రకటించారు. విజేతలైన ఎక్సోబోట్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, లాంబ్డాజెన్ థెరాప్యుటిక్స్, ప్రతిభ హెల్త్కాన్, రాంజా జీనోసెన్సర్, సత్య ఆర్ఎక్స్ ఫార్మా ఇన్నోవేషన్స్ స్టార్టప్ల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ సత్కరించారు. ఈ సదస్సు ఆదివారం ముగియనుంది. -
సృజన భళా... ఆరోగ్య మేళా...
సాక్షి, హైదరాబాద్: సూది గుచ్చడం దగ్గర నుంచి సర్జరీ దాకా అవసరమైన సందర్భాల్లో నొప్పి తెలీకుండా చేసే ఉత్పత్తి ఏదైనా ఉంటే? మనం ఇంట్లో కూర్చుని ఓ వైపు మన పని మనం చేసుకుంటుండగానే మన హార్ట్ బీట్, బ్లడ్షుగర్ స్థాయిలు వైద్యునికి తెలిసిపోతూ ఉంటే..? ఆకాశమే హద్దుగా ఆరోగ్యరంగంలో వెల్లువెత్తుతున్న సృజన సాకారం చేస్తున్న అద్భుతాలివి... వీటన్నింటికి అద్దం పడుతోంది నగరంలో జరుగుతున్న బయో ఆసియా సదస్సు. ఇందులో విజేతలుగా నిలిచిన స్టార్టప్లు చేసిన ఆవిష్కరణలు ఇలా.. అందుబాటు ధరలో కృత్రిమ అవయవాలు వైకల్య బాధితులను దృష్టిలో పెట్టుకుని అత్యంత తేలికగా, అందరికీ అందుబాటులో ఉండేలా ఉత్పత్తులు రూపొందించాం. ప్రస్తుతం మేము చేతులను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. త్వరలో ప్రధాన అవయవాలనూ అందుబాటులోకి తెస్తాం. సహజమైన శరీర భాగాల తరహాలోనే ఇవి పనిచేస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్పత్తులు రూ7 లక్షల వరకుంటే.. మా ఉత్పత్తులు రూ.1.50 లక్షల్లోనే లభిస్తున్నాయి. – మునీష్ కుమార్, ఎగ్జోబొట్ డైనమిక్స్ సంస్థ సీఈఓ కేన్సర్ మందుల సృష్టితో... అంతర్జాతీయ మార్కెట్ కోసం కేన్సర్ మందులను తయారు చేసే సంస్థని మూడేళ్ల క్రితం ప్రారంభించాం. ఫస్ట్ ఇన్ క్లాస్ మెకానిజమ్తో దేశంలోనే మాది తొలి సంస్థ. లంగ్ కేన్సర్, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ కేన్సర్కు డ్రగ్ను అభివృద్ధి చేశాం. దీనిని త్వరలోనే మనుషుల మీద ప్రయోగించనున్నాం. దేశంలో ఇంతవరకు ఎవరూ చేయని మెకానిజమ్ను అనుసరిస్తూ ఈ డ్రగ్ను తెస్తున్నందుకే మాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. –సీఎస్ఎన్ మూర్తి, సీఈఓ సత్య ఫార్మా ఇన్నోవేషన్స్, హైదరాబాద్ ఆరోగ్యం చెప్పే మెషీన్ బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కనిపించే వెయింగ్ మెషీన్ తరహాలో ఓ అధునాతన మెషీన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని హైదరాబాద్కు చెందిన పల్స్ యాక్టివ్ స్టేషన్స్ నెట్వర్క్ రూపొందించింది. ఈ మెషీన్ మీదకు ఎక్కి స్క్రీన్ ముందు నిలబడి మొబైల్ నంబర్ తదితర వివరాలు ఎంట్రీ చేస్తే చాలు. మన ఆరోగ్య వివరాలు వాట్సాప్కు వచ్చేస్తాయి. ఇందులో మన బరువు, ఎత్తు, బీఎంఐ, బీపీతోపాటు ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. శరీరంలో ఉన్న కొవ్వు శాతాన్ని, ఫిట్నెస్ స్థాయిని, డయాబెటిస్ అవకాశాల్ని కూడా అంచనా వేస్తుంది. మెషీన్ని పూర్తిగా తెలంగాణలోనే తయారు చేశామని భవిష్యత్తులో అన్ని ఆసుపత్రుల్లో బహిరంగ ప్రదేశాల్లో అమర్చేలా ప్రయత్నిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో జోగిందర్ తనికెళ్ల చెప్పారు. ధర రూ.2.50 లక్షలు. నేరుగా వైద్యుడికి నివేదికలు.. ఆరోగ్య పరీక్షలు సొంతంగా చేసుకోవడంతోపాటు ఆ పరీక్షల ఫలితాలు నేరుగా మన వైద్యునికి చేరేలా ఉత్పత్తులు సృష్టించారు ‘ఆబో 1008 డిజిటల్ హెల్త్ కేర్’ సంస్థకు చెందిన నగరవాసి సత్యదేవ్. పల్స్ రేట్, బీపీ, ఈసీజీ, శరీర ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర శాతం ఇవన్నీ కలిపి హెల్త్ బోట్ డివైజ్ ద్వారా పరీక్షించుకునే సదుపాయాన్ని తెచ్చారు. అలాగే నిద్రలేమి సమస్యలు, ఒత్తిడి స్థాయిలు, మహిళల రుతుక్రమ సమస్యలు తెలుసుకునే ఉంగరం మాదిరి ఉండే పరికరాన్నీ రూపొందించారు. చర్మ పరీక్షలు, చెవి, గొంతు సమస్యలు తెలుసుకోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యల్ని గుర్తించడానికి ఆబో వన్ డివైజ్లను తయారుచేశారు. ఇంట్లో చేసుకున్న ఈ పరీక్షల రిపోర్టులు నేరుగా వైద్యునికి చేరేలా అప్లికేషన్ రూపొందించామన్నారు. విద్యుత్ అవసరం లేని ‘ఫ్రీజర్’.. కొన్ని రకాల వైద్య చికిత్సల్లో ఉపయోగించే ఉత్పత్తుల్ని నిర్ణీత ఉష్ణోగ్రతలో భధ్రపరచాల్సి ఉంటుంది. దీని కోసం ఇప్పటిదాకా థర్మాకోల్తో చేసిన బాక్స్లనే ఉపయోగిస్తుండగా, బయోస్యూర్ పేరుతో షిప్పర్ బాక్స్లను మ్యాక్ఫై అనే సంస్థ రూపొందించింది. విద్యుత్ అవసరం లేకుండా రోజుల తరబడి ఫ్రీజర్ సేవల్ని అందించే ఈ బాక్స్ను వెజిటబుల్స్ దాచుకోవడానికీ వాడొచ్చని సంస్థ చెప్పింది. పేస్ ఛేంజ్ మెటీరియల్ ఉపయోగించి దీన్ని చార్జ్ చేయాల్సి ఉంటుందని, ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే నిర్ణీత ఉష్ణోగ్రతను 24గంటలపాటు ఉంచుతుందని పేర్కొంది. అందరికీ ప్రాథమిక వైద్యం కోసం... ప్రాథమిక వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్నది మా హెల్త్ కాన్ అండ్ మెడ్ టెక్ స్టార్టప్ లక్ష్యం. ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రజలకు డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ సొల్యూషన్స్, మొబైల్ హెల్త్ సొల్యూషన్స్, అనలటిక్స్ ద్వారా హెల్త్కేర్ను చేరువ చేస్తున్నాం. అపోలో టెలీ హెల్త్తో కలిసి దేశవ్యాప్తంగా 440 కేంద్రాలు ఏర్పాటు చేశాం. దాదాపు 3 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. బయో ఆసియాలో లభించిన ఈ గుర్తింపు మా సేవలకు మరింత స్ఫూర్తినిస్తుంది. – డా.ప్రణయ్ కార్గ్, ప్రతిభ హెల్త్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా సరే ఇట్టే గుర్తించే పేపర్ ఆధారిత డివైజ్... రాంజా జీనో సెన్సర్ కూడా టాప్ 5లో నిలిచింది. అమెరికాలోని ఎండీ ఆండర్సన్ కేన్సర్ సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్న సింగపూర్కు చెందిన ల్యాంబ్డజెన్ థెరప్యూటిక్స్ కూడా ఈ జాబితాలో నిలిచింది. -
రాత్రికి రాత్రే ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ గుడ్న్యూస్!
ఆర్ధిక మాద్యం ముంచుకొస్తుందన్న భయాలతో ప్రపంచ వ్యాప్తంగా సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో టీసీఎస్ సైతం ఉద్యోగుల్ని ఇంటికి సాగంపుతుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని టీసీఎస్ ఖండించింది. సంస్థలో చేరిన ఉద్యోగి ప్రతిభను తీర్చిదిద్దుతామే తప్పా.. ఉద్యోగుల్ని తొలగించడం లేదని స్పష్టం చేసింది. ఇటీవల టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పీటీఐకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయనే అంశం చర్చకు వచ్చింది. ఇక, అట్రిషన్ రేటుతో పాటు ఉద్యోగుల తొలగింపులు ఉంటాయా? అన్న ప్రశ్నకు సమాధానంగా మిలింద్ మాట్లాడుతూ.. స్టార్టప్స్లో జాబ్ కోల్పోయిన ఉద్యోగుల్ని టీసీఎస్ నియమించుకునే ప్రణాళికల్లో ఉందని వ్యాఖ్యానించారు. సంస్థలోని ఉద్యోగుల ప్రతిభను మాత్రమే తీర్చిదిద్దుతామే తప్పా.. ఉద్యోగుల్ని తొలగించమని అన్నారు. ఆయా సంస్థలు అవసరానికి మించి ఉద్యోగుల్ని నియమించుకున్నాయి. అనిశ్చితి నేపథ్యంలో వారిని తొలగిస్తున్నాయి. కానీ టీసీఎస్ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంది. తమ సంస్థలో ఒక్కసారి చేరితే ఉద్యోగుల నుంచి ప్రొడక్టివిటీ, ఉత్పత్తుల తయారీ గురించి మాత్రమే ఆలోచిస్తుందని, లేఆఫ్స్పై కాదని పేర్కొన్నారు. ఒకవేళ సంస్థ ఊహించని దానికంటే నైపుణ్యం తక్కువైతే ఉద్యోగికి ట్రైనింగ్ ఇస్తామని.. అవసరం అయితే ఎక్కువ సార్లు ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రాధన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం టీసీఎస్లో మొత్తం 6 లక్షల మంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రతిఏడు ఉద్యోగులకు శాలరీలు ఎలా పెంచుతామో.. ఈ ఏడాది సైతం అలాగే పెంచుతామని మిలింద్ సూచించారు. అనేక స్టార్టప్లు ఉద్యోగుల్ని తొలగిస్తున్నందున.. ఎడ్యుకేషన్, టెక్నాలజీ వంటి రంగాలలో పింక్ స్లిప్లు తీసుకున్న ఉద్యోగుల్ని టీసీఎస్ నియమించుకోవాలని చూస్తున్నట్లు మిలింద్ చెప్పారు. దీంతో పాటు యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ విభాగాల్లో ప్రతిభ కోసం నిపుణులైన ఉద్యోగుల కోసం అన్వేషిస్తున్నట్లు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. -
ఏరోస్పేస్లో స్టార్టప్లకు ఊతం
సాక్షి, హైదరాబాద్: ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో కలిసి టీ–హబ్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. రెండేళ్లపాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం ద్వారా వైమానిక, రక్షణ రంగాల మార్కెట్లో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నారు. స్టాటిస్టా సంస్థ నివేదిక ప్రకారం 2021 నుంచి 2027 మధ్య వైమానిక, రక్షణ రంగాల మార్కెట్ వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 13.1శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో టీ–హబ్, హెచ్ఏఎల్ భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఏర్పడింది. పెరుగుతున్న మార్కెట్ డిమాండ్ను అందుకునేదిశగా.. స్టార్టప్లకు అవసరమైన నైపుణ్యం, వనరులు, మార్కెట్తో అనుసంధానం, ఆవిష్కరణల కోసం అవసరమయ్యే సాయాన్ని టీహబ్, హెచ్ఏఎల్ సంయుక్తంగా సమకూరుస్తాయి. స్టార్టప్ల ఆవిష్కరణలకు రూపం ఇచ్చేందుకు ఏరోస్పేస్ రంగ నిపుణుల తోడ్పాటు ఇప్పించేందుకు హెచ్ఏఎల్ చర్యలు చేపడుతుంది. స్టార్టప్లకు అవసరమయ్యే మార్గదర్శనం, శిక్షణ, విజయం సాధించేందుకు అవసరమైన అన్ని వనరులను టీ–హబ్ సమకూరుస్తుంది. ఏరో స్పేస్ రంగంలో కొత్త అవకాశాలు: టీ–హబ్ సీఈఓ ఎంఎస్ఆర్ ఏరోస్పేస్ రంగంలో స్టార్టప్లకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు హెచ్ఏఎల్తో తమ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని టీ–హబ్ సీఈఓ ఎం.శ్రీనివాసరావు చెప్పారు. టీ–హబ్ వనరులు, హెచ్ఏఎల్ నైపుణ్యాల కలబోతతో స్టార్టప్ల ఆవిష్కరణలు కొత్త పుంతలు తొక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్లో బలంగా ఉన్న ఆవిష్కరణల వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని స్టార్టప్లను సరైన దిశలో నడిపేందుకు టీ–హబ్తో తమ భాగస్వామ్యం మంచి ఉదాహరణగా నిలుస్తుందని హెచ్ఏఎల్ (ఇంజనీరింగ్, పరిశోధన అభివృద్ధి) డైరక్టర్ డీకే సునీల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ ప్రణాళికలో భాగంగా పన్నులు పోగా మిగిలే హెచ్ఏఎల్ లాభాల్లో 2 శాతాన్ని సాంకేతిక రంగంలో పనిచేస్తున్న స్టార్టప్ల కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్న టీ–హబ్ ఇప్పటికే అనేక విజయాలు సాధించిందని వివరించారు. -
స్టార్టప్లతో జత కలవండి, లేదంటే మీరు ఉన్న చోటే ..ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్టార్టప్లతో జత కలసి, అభివృద్ధి ప్రాజెక్టుల్లో వాటి సొల్యూషన్లు వినియోగించుకోవాలని దేశీ పరిశ్రమలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో పారిశ్రామిక వేదిక-సీఐఐ మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక చర్చాగోష్టిలో ఆర్థికమంత్రి ప్రసంగించారు. పెట్టుబడుల ఇతోధికానికి వీలుగా సంప్రదాయానికి భిన్నమైన ఆలోచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ‘‘స్టార్టప్లు వాటి సొల్యూషన్ల వేగాన్ని గమనిస్తే.. నిజానికి అవి మీ కోసమే. వారు సొల్యూషన్లను ఆవిష్కరించినంత వేగంగా మీరు కూడా ముందుకు కదలాలి. లేదంటే మీరు ఉన్న చోటే ఉంటారు. అప్పుడు అవి నూతన ఇండస్ట్రీ లేదా వ్యాపారాన్ని వెతుక్కుంటూ వెళతాయి. అందుకే ఉత్పత్తులు లేదా టెక్నాలజీ అవసరాల కోసం స్టార్టప్లతో కలసి పనిచేయాలి’’ అని ఆమె సూచించారు. ఉదయించే కొత్త రంగాలకు పీఎల్ఐ పథకం మంచి ప్రోత్సాహకంగా పేర్కొన్నారు. పీఎల్ఐ బయట ఏదైనా మంచి ఉత్ప్రేరకం ఉంటే సూచించాలని కోరారు. మూలధన వ్యయాన్ని తగ్గించే బడ్జెట్: అరవింద్ విర్మాణి ఇదిలావుండగా, 2023-24 బడ్జెట్లో ద్రవ్య స్థిరీకరణ చర్యలు తీసుకోవడం హర్షణీయ అంశమని నీతి ఆయోగ్ సభ్యుడు అరవింద్ విర్మాణి ఒక ఇంటర్వూలో పేర్కొన్నారు. భారతీయ కంపెనీలకు మూలధన వ్యయాన్ని తగ్గించడంలో బడ్జెట్ ఎంతగానో సహాయపడుతుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 6.4శాతానికి కట్టడి చేస్తూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనిని మరింతగా 5.9 శాతానికి తగ్గించాలని బడ్జెట్లో నిర్దేశించిన సంగతి తెలిసిందే. దీనితోపాటు మౌలిక రంగం పురోగతి లక్ష్యంగా మూలధన వ్యయాలను 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేరడం దేశ పురోభివృద్ధికి దోహదపడే అంశమని అన్నారు. కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానానికి మళ్లుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇది సరికాదని అన్నారు. కొత్త పెన్షన్ విధానం ఒక గొప్ప సంస్కరణ అని ఆయన అన్నారు. గత నెల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2022–23 జీడీపీ అంచనాలను 6.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తిరిగి దీనిని బహుళజాతి బ్యాంకింగ్ సంస్థ తిరిగి ఎగువముఖంగా సవరిస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. -
స్టార్టప్లకు అంతర్జాతీయ నెట్వర్క్
సాక్షి, హైదరాబాద్: ఆర్థికమాంద్యం మొదలు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన వరకూ ప్రపంచ స్థాయి సమస్యలను పరిష్కరించేందుకు స్టార్టప్లు అవసరమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయుష్ గోయెల్ అభిప్రడాయపడ్డారు. ఔత్సాహికులు, పెట్టుబడిదారులు, మెంటర్లతో కూడిన నెట్వర్క్ ద్వారా స్టార్టప్లకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. భారత్ అధ్యక్షతన ఈ ఏడాది జరగనున్న జీ–20 సదస్సు సన్నాహకాల్లో భాగంగా శనివారం హైదరాబాద్లో స్టార్టప్ –20 సమావేశాలు మొదలయ్యాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి, జీ–20 షేర్పా(సన్నాహక దేశ ప్రతినిధి) అమితాబ్ కాంత్ పాల్గొన్న ఈ సమావేశాన్ని ఉద్దేశించి గోయెల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్టార్టప్లకు అనుకూల వాతా వరణం ఏర్పాటు, అందరికీ అవకాశాలు, మద్దతు లభించేలా చేయడం జీ–20 దేశాల ఉమ్మడి బాధ్యత అని అన్నారు. స్టార్టప్ల ఏర్పాటుకు అంతర్జాతీయ నెట్వర్క్ స్ఫూర్తినిచ్చేదిగా ఉండటమే కాకుండా, ఆలోచనలు, మేలైన కార్యాచరణ పద్ధ తులను పంచుకునేలా ఉండాలని, అవసరమైన నిధులకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంశాల్లో పరస్పర సహకారానికి ప్రోత్సాహం అందించాలని సూచించారు. ‘‘ఈ రోజుల్లో సృజనాత్మ కత అనేది ఆర్థిక లక్ష్యాల సాధనకు మాత్రమే ఉపయోగపడటంలేదు. సామాజిక, పర్యావరణ, సుస్థిరాభివృద్ధి సమస్యల పరిష్కారానికీ అవసర మవుతోంది’’అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2016లోనే స్టార్టప్ ఇండియా కార్యక్ర మాన్ని మొదలుపెట్టగా ఈ ఏడేళ్లలో కొత్త, వినూత్న ఆలోచనలతో వివిధ రంగాల్లో పలు కంపెనీలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు. ఫిన్టెక్, ఫైనాన్షియల్ ఇన్క్లూషన్, ఆరోగ్య రంగాల్లోని స్టార్టప్ కంపెనీల కారణంగానే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగామన్నారు. ఆన్లైన్ విద్యా బోధన, వ్యవసాయ టెక్నాలజీల్లోనూ సవాళ్లను స్టార్టప్లతో ఎదుర్కోగలిగామని వివ రించారు. భారతదేశంలో ఆవిర్భవించిన కోవిన్, యూపీఐ వంటి టెక్నాలజీలు, ఈ–కామర్స్ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ నెట్వర్క్ (ఓఎన్డీసీ)లు ప్రపంచంలోని అనేక దేశాల సమస్యలను పరిష్కరించగలవని, అందుకే జీ–20 సదస్సు ద్వారా ఈ ‘ఇండియా స్టాక్’ను ప్రపంచానికి ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని గోయెల్ తెలిపారు. అనుకూల విధానాలతోనే వృద్ధి: కిషన్ రెడ్డి స్టార్టప్లకు అనుకూల విధానాలను రూపొందించి అమలు చేస్తున్న కారణంగానే భారత్ అతితక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా రూపాంతరం చెందిందని కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. ‘ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్’, ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’లను కేంద్రం తీసుకొచ్చిందని తెలిపారు. ఏడేళ్లలోనే భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 41 స్థానాలు పైకి ఎగబాకిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో స్టార్టప్–20 ఇండియా చైర్పర్సన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. -
నాకు ఆ సినిమా గుర్తొస్తుంది..హర్ష్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు!
షార్క్ ట్యాంక్ ఇండియా..! ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్లను వెలుగులోకి తెచ్చేందుకు సోనీ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. అమెరికాలో విజయవంతమైన ‘షార్క్ ట్యాంక్ షో’ దీనికి స్ఫూర్తి. ఇలాంటి షోలు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వరకు ఉన్నాయి. అన్ని చోట్లా ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలకే అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే ఈ షో మొదటి సీజన్ 2021లో విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఇండియా రెండో సీజన్ ప్రారంభమైంది. అయితే విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ కార్యక్రమంపై భారత్కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని షో జడ్జ్ అనుపమ్ మిట్టల్ ఖండించారు. హర్ష్ గోయెంకా ఏమన్నారంటే? ఎప్పుడూ మోటివేషన్, లేదా రోజూ వారి సామాజిక మాద్యమాల్లో జరిగే ఘటనల గురించి మాట్లాడే హర్ష్ గోయెంకా.. ఈ సారి రూటు మార్చారు. షార్క్ ట్యాంక్ షో జడ్జెస్ గురించి, వాళ్లు చేసే బిజినెస్ గురించి స్పందించారు. దేశానికి చెందిన స్టార్టప్లు పెద్దమొత్తంలో నష్టపోతున్నాయంటూ.. వారి నష్టాన్ని 1975లో విడుదలైన అడ్వంచర్ అండ్ థ్రిల్లర్ హాలీవుడ్ మూవీ జాస్తో పోల్చారు. ఎప్పుడైనా సరే థింక్స్ ఆఫ్ షార్క్స్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు నిజమనేలా కంపెనీల లాభ నష్టాల డేటా స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. వాటిల్లో 2022 ఆర్ధిక సంవత్సరంలో బోట్ కంపెనీ అధినేత అమన్ గుప్త రూ.79 కోట్ల లాభం గడించారు. కార్ దేకో కోఫౌండర్ అమిత్ జైన్ రూ. 246 కోట్లు లాస్ అయ్యారు. లెన్స్ కార్ట్ 102 కోట్లు, షాదీ. కామ్ రూ.27 కోట్లు, సుఘర్ కాస్మోటిక్స్ అధినేత వినీత్ సింగ్ రూ.75కోట్లు నష్టపోయారని ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేయగా.. షార్క్ ట్యాంక్ ఇండియా షోని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్లను వెలుగులోకి తెస్తుంది’. కానీ నేను షార్క్ల గురించి ఆలోచించినప్పుడల్లా, 'జాస్' సినిమా, ఆ సినిమాలోని రక్త పాతం గుర్తుకు వస్తుందని అన్నారు. పక్షపాతంగా, అర్ధరహితంగా ఆ ట్వీట్పై షార్క్ ట్యాంక్ జడ్జ్ షాది.కామ్ ఫౌండర్, అనుపమ్ మిట్టల్ స్పందించారు. సార్ మీరు దానిని హాస్యాస్పదంగా చెప్పారని అనిపిస్తుంది. మీరు పక్షపాతంగా, అసంపూర్ణంగా ఉండే అంశాలపై ప్రతిస్పందించారని నేను భావిస్తున్నాను. కానీ మీలాగే..సొరచేపలు నష్టాల్ని కాకుండా లాభాల్ని తెచ్చిపెడుతున్నాయంటూ చమత్కరించారు. I enjoy #SharkTankIndia as a program and I think it is a great platform for our budding entrepreneurs. 1 But whenever I think of sharks, I think of the movie ‘Jaws’ and bleeding 🩸! pic.twitter.com/LAmGxQOiU8 — Harsh Goenka (@hvgoenka) January 22, 2023 I know you meant it in jest so with all due respect sir, I think u reacted to what appears to be superficial, biased & incomplete data. Happy to learn from stalwarts, but just to clarify, like u, the sharks 🦈 don’t bleed red, we bleed blue 🇮🇳 & that’s why we do what we do 🤗 — Anupam Mittal (@AnupamMittal) January 24, 2023 -
దేశీ స్టార్టప్స్లోకి తగ్గిన విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్స్లోకి వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు గతేడాది 38 శాతం క్షీణించాయి. ఆర్థిక అనిశ్చితి, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నిధుల సమీకరణ, పెట్టుబడుల కార్యకలాపాలపై ప్రభావం పడటమే ఇందుకు కారణం. డేటా అనలిటిక్స్ సంస్థ గ్లోబల్డేటా విడుదల చేసిన ప్రకటనలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2021లో 33.8 బిలియన్ డాలర్ల విలువ చేసే 1,715 డీల్స్ కుదరగా 2022లో 1,726 ఒప్పందాలు కుదిరినా పెట్టుబడుల పరిమాణం 20.9 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. టాప్ 4 మార్కెట్లలో భారత్.. వీసీ పెట్టుబడుల పరిమాణం, విలువపరంగా చైనా తర్వాత ఆసియా–పసిఫిక్ దేశాల్లో భారత్ కీలక మార్కెట్గా ఉందని గ్లోబల్డేటా లీడ్ అనలిస్ట్ అరోజ్యోతి బోస్ తెలిపారు. అంతర్జాతీయంగా టాప్ 4 మార్కెట్లలో (అమెరికా, బ్రిటన్, చైనా, భారత్) ఒకటిగా ఉందని పేర్కొన్నారు. 2022లో అంతర్జాతీయంగా వీసీ ఫండింగ్లో విలువపరంగా 5.1 శాతం, పరిమాణంపరంగా 6.3 శాతం మేర భారత్ వాటా దక్కించుకుంది. అమెరికా, బ్రిటన్, చైనాలో 2022లో డీల్స్ పరిమాణం క్షీణించగా భారత్ మాత్రం 0.6 శాతం వృద్ధితో ప్రత్యేకంగా నిల్చింది. గ్లోబల్డేటా ప్రకారం 2021లో వీసీ ఫండింగ్ డీల్ సగటు విలువ 19.7 బిలియన్ డాలర్లుగా ఉండగా 2022లో 12.1 మిలియన్ డాలర్లకు తగ్గింది. అలాగే 100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే ఒప్పందాల సంఖ్య 2021లో 86గా ఉండగా గతేడాది 42కి తగ్గింది. ఇన్వెస్టర్లకు గణనీయంగా రాబడులు ఇవ్వగలిగే కంపెనీల కొరత కూడా వీసీ పెట్టుబడుల తగ్గుదలకు కారణమైందని బోస్ వివరించారు. వర్ధమాన దేశాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని, భారత్ ఇందుకు మినహాయింపు కాదని పేర్కొన్నారు. -
స్టార్టప్లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు!
తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న తారలు క్రేజ్ ఉన్నంత వరకు వెండితెరపై కనిపిస్తూ ఆపై కనుమరుగయ్యేవాళ్లు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పటి తారలు మరో ముందడుగు వేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను తూచ తప్పకుండా ఫాలో అవుతున్నారు. ప్రస్తుత సినీ స్టార్లు మరో ముందడుగు వేసి తాము సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని స్టార్టప్ (startups) కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఆ సంస్థల నుంచి లాభాలు ఆర్జించడమే కాకుండా తమ పెట్టుబడుల ద్వారా ఆ స్టార్టప్లకు కూడా గుర్తింపు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో బాలీవుడ్ సెలబ్రిటీలపై ఓ లుక్కేద్దాం! అనుష్క శర్మ విరాట్ కోహ్లీ భార్యగా, బీ టౌన్ నటిగా అనుష్క శర్మ అందరికీ తెలుసు. ఈ బాలీవుడ్ నటి ఇటీవలే ప్రత్యామ్నాయ మీట్ పుడ్ స్టార్టప్ బ్లూ ట్రైబ్ ఫుడ్స్లో పెట్టుబడి పెట్టడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్గా చేరారు. విరుష్క జంట ఈ స్టార్టప్లో ఎంత పెట్టుబడులు పెట్టారనే తెలియదు. వీటితో పాటు మిల్లెట్స్తో తయారుచేసే ఫుడ్ బ్రాండ్ స్లర్ప్ ఫామ్ (Slurrp Farm)లో అనుష్కకు పెట్టుబడులు ఉండగా, డిజిట్ ఇన్సురెన్స్ కంపెనీలోనూ వాటాలున్నాయి. పంకజ్ త్రిపాఠి ప్రముఖ బాలీవుడ్ నటుడు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి 30 లక్షలకు పైగా రైతుల నెట్వర్క్ను కలిగి ఉన్న అగ్రిటెక్ ప్లాట్ఫారమ్లో పెట్టుబడి పెట్టారు. ఇది రైతులకు అవసరమైన డేటాను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది ఈ నెట్వర్క్. దీని ద్వారా రైతలు తమ భూమి నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందేందుకు ఇది వారికి సహకరిస్తుంది. అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా తెలుగు ప్రజలకు చేరువైన అలియా భట్కు చాలా వ్యవస్థాపక ఆసక్తులు ఉన్నాయి. ఐఐటీ కాన్పూర్-మద్దతుగల D2C స్టార్టప్ ఫూల్ లో పెట్టుబడులు పెట్టింది. 2017లో స్థాపించబడిన ఈ స్టార్టప్ ఆలయాల్లో పూల వ్యర్థాలతో అగరబత్తీలు, దూప్స్టిక్లను తయారు చేస్తుంది. అలియా గతంలో ఓమ్నిచానెల్ లైఫ్స్టైల్ రిటైలర్ నైకా, ఫ్యాషన్-టెక్ స్టార్టప్ స్టైల్క్రాకర్లో పెట్టుబడులు పెట్టింది. అదనంగా, అలియా తన వ్యవస్థాపక ప్రయాణాన్ని నవంబర్ 2020లో 'ఎడ్ ఎ మమ్మా," ఎడ్ ఏ మామ్మ (Ed-a-Mamma) పేరిట చిన్నపిల్లల దుస్తుల ప్లాట్ఫాంనూ నిర్వహిస్తోంది. దీపిక పదుకొణె: బాలీవుడ్ నటి, రణ్వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణె సైతం పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. ఇటీవల పాపులర్ అయిన మింత్రాలోనూ దీపికకు పెట్టుబడులు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని వాల్మార్ట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేఏ ఎంటర్ప్రైజస్ ఎల్ఎల్పీ పేరిట ఓ కంపెనీ నెలకొల్పారు. వీటితో పాటు మరికొన్ని సంస్థలో వాటాలు ఆమెకు ఉన్నాయి. సోనూసూద్: సోనూసూద్.. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. కరోనా సమయంలో ఎంతోమందికి సాయం చేసి రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కె12 అనే ఎడ్యుకేషన్ కంపెనీకి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. జితిన్ భాటియాతో కలిసి Explurger అనే సోషల్ మీడియా యాప్ను సైతం సోనూ ప్రారంభించారు. చదవండి: కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవి కుమార్ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి! -
ఐటీ డిమాండ్లను తీర్చే సత్తా తెలంగాణకే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగ డిమాండ్లను తీర్చే సత్తా తెలంగాణకే ఉందని, స్టార్టప్ల ఫలితాలను రాష్ట్రానికే కాకుండా దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. ఆర్థికంగా వృద్ధి చెందుతున్న భారతదేశంలో పెట్టుబడులు రాబ ట్టడం కష్టమైనదేమీ కాదని, స్టార్టప్లకు నిధులు సేకరణ ఇబ్బందికర అంశంకాదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని స్టార్టప్లకు మార్గదర్శనం చేసే లక్ష్యంతో డల్లాస్ వెంచర్ కేపిటల్(డీవీసీ), టీహబ్ శుక్రవారం పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా టీ హబ్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో ఆరు వేలకుపైగా స్టార్టప్లు ఉన్నాయని, దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్ను ప్రయోగించిన సంస్థ టీ హబ్లోనే పురుడు పోసుకుందని అన్నారు. డీవీసీ, టీహబ్ కలిసి డీవీసీ ఇండియా ఫండ్ ఏర్పాటు చేయడం హర్షణీయమని, రెండు ప్రముఖ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం తెలంగాణను ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు మరింత దోహదం చేస్తుందన్నారు. ఒప్పందంలో భాగంగా డల్లాస్ వెంచర్ ఫండ్ ద్వారా డీవీసీ హైదరాబాద్ స్టార్టప్లకు నిధులు సమకూరుస్తుందని తెలిపారు. దేశంలో టెక్ స్టార్టప్లకు చేయూతనిచ్చేందుకు రూ.350 కోట్లతో డీవీసీ ఇండియా ఫండ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డీవీసీ ఇప్పటికే భారత్లో అనేక స్టార్టప్ లను నెలకొల్పిందని వివరించారు. కార్యక్రమంలో డీవీసీ ఎండీ దయాకర్ పూస్కూర్, సహ వ్యవస్థాపకులు అబిదాలీ నీముచ్వాలా, శ్యామ్ పెనుమాక, గోకుల్ దీక్షిత్, కిరణ్ కల్లూరి, టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్రావు, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. స్టార్టప్లకు ఊతం డల్లాస్ వెంచర్ కేపిటల్ 2023లో స్టార్టప్లు తమ వాణిజ్య పరిధిని విస్తరించుకునేందుకు ఊతమివ్వడం ద్వారా వినియోగదారుల్లో విస్త తిని పెంచుకునేందుకు సహాయపడుతుంది. దీని కోసం ప్రస్తుతమున్న స్టార్టప్లతోపాటు కొత్తగా ఏర్పాటయ్యే స్టార్టప్లతో కలిసి పనిచేస్తుంది. టీ హబ్ సహకారంతో వృద్ధి చెందే సామర్థ్యమున్న వినూత్న స్టార్టప్లను గుర్తించి అంతర్జాతీయ మార్కెట్ లో విస్తరించేందుకు అవసరమైన వినూత్న సాంకేతికత, మౌలిక వసతులు, బృంద సామర్థ్యం పెంపుదల తదితరాల్లో డీవీసీ మార్గదర్శనం చేస్తుంది. -
టెక్ స్టార్టప్ సంస్థలకు ఇన్నోవేషన్ ఫండ్
న్యూఢిల్లీ: డీప్ టెక్ స్టార్టప్ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం డిజిటల్ ఇండియా ఇన్నోవేషన్ ఫండ్ను ప్రారంభించనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహా య మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. దేశ అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ప్రతి భారతీయుడికి తగు అవకాశాలు కల్పించేలా నవ భరతం ఉండాలన్నది ప్రధాని ఆకాంక్షని ఆయన చెప్పారు. కేరళలోని క్యాథలిక్ బిషప్ హౌస్ క్యాంపస్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మంత్రి ఈ విషయాలు తెలిపారు. -
స్టార్టప్స్లోకి భారీగా విదేశీ పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు, స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో దేశీ అంకుర సంస్థల్లోకి కొత్త ఏడాది (2023)లో భారీగా విదేశీ పెట్టుబడులు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం భారత్.. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఉందని, మన అంకుర సంస్థల పనితీరును బట్టి చూస్తే త్వరలోనే అంతర్జాతీయంగా అగ్ర స్థానానికి చేరుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘గుర్తింపు పొందిన స్టార్టప్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. స్టార్టప్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్ఎఫ్ఎస్), స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకాలకు మంచి ఆదరణ ఉంటోంది’’ అని జైన్ పేర్కొన్నారు. ప్రభుత్వం సరళతరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని పాటిస్తుండటం కూడా అంకుర సంస్థల్లోకి మరిన్ని పెట్టుబడుల రావడానికి దోహదపడనుందని ఆయన చెప్పారు. మరోవైపు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) వినియోగించుకునేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తిగా ఉన్నాయని జైన్ తెలిపారు. పలు గ్లోబల్ సంస్థలు తమ తయారీ కార్యకలాపాలను భారత్కు మార్చుకునే యోచనలో ఉన్నాయని ఆయన వివరించారు. 14 రంగాల్లో పీఎల్ఐ స్కీములతో రూ. 2.74 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నట్లు జైన్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫార్మా, టెలికం, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన రంగాలు పెట్టుబడులు, ఉత్పత్తి/విక్రయాలు, ఉద్యోగాల కల్పనలో కీలకంగా ఉంటున్నాయని ఆయన తెలిపారు. పథకాల దన్ను దేశీయంగా నవకల్పనలు, అంకుర సంస్థలు, స్టార్టప్ వ్యవస్థలోకి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016 జనవరి 16న స్టార్టప్ ఇండియా ప్రణాళికను ఆవిష్కరించింది. గణాంకాల ప్రకారం నవంబర్ 30 వరకూ దీని కింద 84,000 పైగా అంకుర సంస్థలు గుర్తింపు పొందాయి. ఇక, స్టార్టప్లకు వివిధ దశల్లో అవసరమైన ఆర్థిక తోడ్పాటును అందించేందుకు కేంద్రం ఎఫ్ఎఫ్ఎస్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్), రుణ హామీ పథకం (సీజీఎస్ఎస్) మొదలైనవి అమలు చేస్తోంది. ఎఫ్ఎఫ్ఎస్ కింద 93 ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్లు) 773 స్టార్టప్స్లోకి పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే, 2021–22లో ప్రవేశపెట్టిన ఎస్ఐఎస్ఎఫ్ఎస్ కింద 126 ఇన్క్యుబేటర్స్లోకి రూ. 455 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. నవంబర్ 30 వరకూ ఈ ఇన్క్యుబేటర్స్ ద్వారా ఆర్థిక తోడ్పాటు పొందేందుకు 650 స్టార్టప్స్ ఆమోదం పొందాయి. ఇక సీజీఎస్ఎస్ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నోటిఫై చేయగా, పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నారు. -
భారత్ను వదిలి వెళ్లిపోతున్న దిగ్గజ కంపెనీలు.. కారణం అదే!
ముంబై: భారీ వ్యాపారాల ఆశలతో భారత మార్కెట్లో ప్రవేశించిన పలు బహుళ జాతి దిగ్గజాలు (ఎంఎన్సీ) .. తమ అంచనాలకు తగ్గట్లుగా ఇక్కడ పరిస్థితులు కనిపించక పోతుండటంతో ఆలోచనలో పడుతున్నాయి. నిష్క్రమించడమో లేక వ్యాపారాల పరిమాణాన్ని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నిష్క్రమించిన హోల్సిమ్, ఫోర్డ్, కెయిర్న్, దైచీ శాంక్యో వంటి సంస్థల బాటలోనే తాజాగా జర్మనీ హోల్సేల్ దిగ్గజం మెట్రో కూడా చేరింది. స్థానికంగా తీవ్ర పోటీ నెలకొనడం, అంతర్జాతీయంగా మార్కెట్ ప్రాధాన్యతలు .. వ్యాపార విధానాలు మారిపోతుండటం, పన్నులపరమైన వివాదాల్లో ఏకపక్ష నిర్ణయాలు, పెరిగిపోతున్న నష్టాలు మొదలైనవి ఎంఎన్సీల నిష్క్రమణకు కారణాలుగా ఉంటున్నాయని పరి శ్రమ వర్గాలు తెలిపాయి. ఎనిమిదేళ్ల క్రితం ఫ్రాన్స్కి చెందిన క్యారీఫోర్ .. భారత్లో తమ హోల్సేల్ వ్యాపారాన్ని మూసేసింది. 19 ఏళ్ల కింద భారీ అంచనాలతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన మెట్రో ప్రస్తుతం తమ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్కి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వ్యాపారంలో మార్జిన్లు అత్యంత తక్కువగా ఉండటమే క్యారీఫోర్ వంటి ఎంఎన్సీలు నిష్క్రమిస్తుండటానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయంగా రిటైల్ రంగంలో రిలయన్స్ వంటి బడా కంపెనీలకు అనుకూలంగా కన్సాలిడేషన్ చోటు చేసుకుంటోందని వారు తెలిపారు. కిరాణా దుకాణాలకు కూడా క్విక్ కామర్స్, ఈ–కామర్స్ వంటి విభాగాల నుంచి పోటీ తీవ్రమవుతోందని వివరించారు. దేశీ సంస్థల హవా.. దేశీ సంస్థల హవా పెరుగుతుండటంతో ఎంఎన్సీల వాటా తగ్గుతూ వివిధ రంగాల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉదాహరణకు సిమెటు రంగాన్ని తీసుకుంటే స్విస్ దిగ్గజం హోల్సిమ్ తమ భారత సిమెంటు యూనిట్లను అదానీ గ్రూప్నకు విక్రయించాక ఈ రంగంలో టాప్ కంపెనీలుగా దేశీ సంస్థలే ఉండటం గమనార్హం. పర్యావరణ అనుకూల వ్యాపారాలపై దృష్టి పెట్టేందుకే భారత్లో వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు హోల్సిమ్ పేర్కొంది. ఇలా ఆయా ఎంఎన్సీల వ్యాపార కారణాల వల్లే అవి నిష్క్రమిస్తున్నాయే తప్ప నియంత్రణ సంస్థలు, చట్టాలపరమైన అంశాల వల్ల కాదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అలాగే అంతర్జాతీయంగా మాతృ సంస్థ పాటించే విధానాలకు అనుగుణంగా ఇక్కడి వ్యాపార నిర్వహణ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఎంఎన్సీలు తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. మార్జిన్లు అంతగా లేకపోవడానికి తోడు భౌతిక స్టోర్స్ ద్వారా నిర్వహించే వ్యాపారాలకు ఆన్లైన్ మాధ్యమాల నుంచి పోటీ పెరగడం సైతం ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాయి. దీనికి క్యారీఫోర్ వంటి సంస్థలను ఉదాహరణగా తెలిపాయి. క్యారీఫోర్ ఇక్కడ పూర్తి రిటైలర్గా విస్తరించాలనుకున్నా .. హోల్సేల్ వ్యాపారం ద్వారానే కార్యకలాపాలు ప్రారంభించాల్సి వచ్చింది. ఇది ఆ సంస్థ అంతర్జాతీయ వ్యాపార విధానాలకు అనుగుణంగా లేకపోవడం .. కంపెనీ కార్యకలాపాలకు ప్రతికూలంగా మారిందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి👉 ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు, ప్రిన్స్ ఛార్లెస్ అవార్డు కార్యక్రమానికి ‘రతన్ టాటా’ డుమ్మా! -
ఉద్యోగాలకు గుడ్బై.. వ్యాపారాల్లో రాణిస్తున్న యువత
ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుతోంది. అందుకు తగ్గట్లే ఆలోచనా ధోరణి, జీవన విధానాల్లోనూ మార్పు చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. గతంలో బాగా చదవాలి, మంచి ఉద్యోగం సాధించాలి, చదువు పూర్తయ్యేదాకా మరో ఆలోచన చేయొద్దు.. అనే ధోరణి ఉండేది. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే ప్రోత్సహించారు. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడ్డట్లే అనే భావన కనిపించేది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన కూడా పాఠశాల నుంచి కాలేజీ పూర్తయ్యే వరకు ఉద్యోగం సాధించాలనే ఏకైక లక్ష్యం మినహా మనసులో మరో ఆలోచన వచ్చేది కాదు. కానీ ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలను గౌరవిస్తున్నారు. దీంతో ఉద్యోగంతో కాదు.. వ్యాపారంతో కూడా స్థిరపడొచ్చనే భావన పెరిగింది. – సాక్షి ప్రతినిధి కర్నూలు కోవిడ్ నేర్పిన పాఠమే ‘వ్యాపారం’ కోవిడ్ నేపథ్యంలో సాఫ్ట్వేర్తో పాటు చాలా రంగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీల్లోని ఉద్యోగులకు ‘లాక్డౌన్’ రోజుల్లో 50శాతం వేతనాలు ఇస్తే, కొన్ని పూర్తిగా ఇవ్వలేదు. ఈ క్రమంలో కొందరి ఉద్యోగులు బాగా ఇబ్బంది పడ్డారు. కూరగాయలు విక్రయించి బతికిన వ్యక్తులు కూడా ఉన్నారు. దీంతో ఉద్యోగం కంటే వ్యాపారమే ఉత్తమమనే దారి ఎంచుకున్నారు. ఉద్యోగంలో ఎవరి అభివృద్ధి కోసమో శ్రమించాలి. వ్యాపారమైతే కష్టపడే ప్రతీక్షణం, వచ్చే ప్రతి రూపాయి తమదే అనే భావనలో ఉన్నారు. దీంతోనే బిజినెస్పై ఆసక్తి చూపుతున్నారు. ఆలోచనా దృక్పథంలో మార్పులు గతంలో విద్యార్థి దశలో పెద్దగా ఆలోచనలు ఉండేవి కావు. బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండేవి కావు. ఇప్పుడు చదువులో కూడా మార్పులు వచ్చాయి. సీఏ, ఎంబీఏ లాంటి చదువులతో పాటు డిగ్రీ విద్యార్థులకు కూడా ‘స్కిల్ డెవలప్మెంట్’పై శిక్షణ ఇస్తున్నారు. ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ‘ఎంటర్ఫైనర్ డెవలప్మెంట్’ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఫీల్డ్విజిట్. ఇంటర్న్షిప్ పేరుతో పరిశ్రమలకు తీసుకెళ్తున్నారు. అక్కడ శిక్షణ ఇస్తున్నారు. దీంతో పెట్టుబడి, సబ్సిడీ, ఆదాయం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన వస్తోంది. ఉద్యోగం కంటే వ్యాపారమే బాగుందనే ధోరణికి వస్తున్నారు. పైగా జీవితంలో తక్కువ సమయం ఉంది, దీన్ని వృథా చేయొద్దు. ఏదోఒకటి సాధించాలి, అందరితో పోలిస్తే ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగం చేస్తే ఒకరి కింద పనిచేయాలి, వ్యాపారం చేస్తే కనీసం 5–9మందికి ఉద్యోగాలు కల్పించొచ్చు అనే ధోరణికి వచ్చారు. ఇతని పేరు డాక్టర్ యాసీర్ హుస్సేన్. రాయచూర్లో ఫార్మా–డీ డాక్టరేట్ పొందారు. వ్యాపారంపై ఆసక్తితో ప్రకాశ్నగర్లో రూ.5లక్షలతో నన్నారి తయారీ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర కిందట లక్ష్మీపురంలో ‘ఉస్తాద్’ జీరా జ్యూస్ ప్లాంట్ స్థాపించారు. ‘హంగర్బక్స్’ అనే ఐటీ కంపెనీతో కలిసి తేనె తయారీ ప్రారంభించారు. ఆపై ‘కూల్ మ్యాజిక్’ బ్రాండ్తో నన్నారి, ‘అనంత సుగం«దీ’ పేరుతో రెడీ టూ డ్రింక్ నన్నారిసోడా, జాయ్ సోడా తయారు చేస్తున్నారు. మరో వారంలో ‘కూల్మ్యాజిక్’ పేరుతో గోలీసోడాను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇతని వయస్సు 32 ఏళ్లు. పీఎంజీవై కింద రుణాలు తీసుకుని సబ్సిడీ పొందారు. ఏడాదిన్నరలోనే రెండు రాష్ట్రాలలో విక్రయాలు సాగిస్తున్నారు. ఇతని పేరు శేఖర్బాబు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఖతర్లో ఎలక్ట్రిక్ డిజైన్ ఇంజనీర్గా పనిచేశారు. సొంతూరును వదిలి దూరంగా ఉద్యోగం చేయడం నచ్చలేదు. స్వదేశానికి తిరిగొచ్చి వ్యర్థాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనకు వచ్చాడు. కల్లూరు ఎస్టేట్లో జీఎస్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ను స్థాపించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించే దిశగా వృథా ప్లాస్టిక్ను రీసైక్లింగ్ చేశాడు. పలురకాలు ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసి మార్కెటింగ్ చేశారు. ఆ తర్వాత హోటల్ బిజినెస్లోకి రావాలనే ఆశతో ఓ పాత బస్సును రూ.3లక్షలకు కొనుగోలు చేశాడు. లోపల ఇంటీరియర్ను మార్చేసి ‘డైన్ ఆన్ బస్’గా తీర్చిదిద్దాడు. వెంకటరమణ కాలనీలో దీనికి మంచి పేరుంది. ఇలా ఇతను 25మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇతని పేరు ఉపేంద్రం కృష్ణంరాజు. ఎంబీఏ పూర్తి చేసి బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేశారు. ఉద్యోగం సంతృప్తి ఇవ్వకపోవడంతో బిజినెస్ చేయాలనే ఆలోచనకు వచ్చాడు. భవిష్యత్లో హోం థియేటర్లకు డిమాండ్ ఉంటుందని గ్రహించి 2018లో తన ఆలోచనకు పదును పెట్టారు. ‘శ్రీదత్త హోమ్ థియేటర్’ పేరుతో బిజినెస్ ప్రారంభించినా మొదట్లో పెద్దగా లాభం లేకపోయింది. లాక్డౌన్లో ఓటీటీలు రావడం, ఇంట్లోనే సినిమాలు చూసే అలవాటు పెరగడం, కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు దాదాపు ‘హోం థియేటర్’పై ఆసక్తి చూపడటంతో బిజినెస్ ఊపందుకుంది. రూ.7లక్షల నుంచి రూ.35లక్షల వరకూ హోం థియేటర్కు ఖర్చు అవుతుంది. ఇలా తను ఎంచుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో సంతోషంగా జీవిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్తో అవకాశాలు మెండు మార్కెట్ పరిధి కూడా విస్త్తరించింది. గతంలో బాంబే, చెన్నై, కోల్కతాకు మాత్రమే ఎగుమతులు ఉండేవి. ఎక్స్పోర్టుపై అవగాహన ఉండేవి కాదు. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎగుమతి అవకాశాలను పెంచారు. పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో ఎగుమతులు చేస్తున్నారు. ఉదాహరణకు మన జిల్లాలో తడకనపల్లి పాలకోవ ఉంది. దీని క్వాలిటీ బాగుంటుంది. అయితే కర్నూలుకే పరిమితమైంది. దీనిపై గ్రామస్తులకు అవగాహన కలి్పంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగమతి చేస్తున్నారు. గతంలో వ్యాపారులు మనవద్దకు వచ్చి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ పెరగడంతో ఇంట్లో నుంచి ఏ ప్రాంతానికైనా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారు. దీంతో వ్యాపారం చేస్తే మార్కెటింగ్కు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం యువత ఆలోచనా ధోరణి మారడం శుభ పరిణామం. ఉద్యోగం కోసం వెతకడం కంటే పది మందికి ఉపాధి కలి్పంచే స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సబ్సిడీలు అందిస్తోంది. మార్కెటింగ్ కూడా సులభతరమైంది. వ్యాపార రంగంలో విజయాలు అధికంగానే ఉంటున్నాయి. ఎంఎస్ఎంఈలకు దరఖాస్తు చేసుకుంటే ఏపీఐఐసీ ద్వారా భూములు ఇస్తాం. పరిశ్రమలశాఖ కూడా సబ్సిడీలు ఇస్తోంది. – విశ్వేశ్వరరావు, జెడ్ఎం, ఏపీఐఐసీ -
ఆ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పండగే పండగ.. ఆఫీసులన్ని క్లోజ్..
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో ‘నయాజోష్’తో విధుల నిర్వహణకు సిద్ధమయ్యేలా ఉద్యోగులను ‘రీచార్జ్’చేసేందుకు వివిధ కంపెనీలు సిద్ధమయ్యాయి. 2023 కొత్త ఏడాదిలో ఫ్రెష్గా, మరింత ఉత్సాహంగా పనిచేసేలా వారిని కార్యోన్ముఖులను చేసేందుకు వివిధ ఆఫర్లను అందజేస్తున్నాయి. రెండేళ్ల తొమ్మిది నెలలకు పైగా కోవిడ్ మహమ్మారి మిగిల్చిన భారం, నిరాశా, నిస్పృహల నుంచి ఉద్యోగులు బయటపడేలా చేసేందుకు పలు కంపెనీలు, ముఖ్యంగా స్టార్టప్లు వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. డిసెంబర్ 25 నుంచి 31 దాకా మొత్తం ఆఫీస్లను కొన్ని సంస్థలు షట్డౌన్ చేస్తుండగా... వారం పాటు సెలవుతో కూడిన జీతం, నూతనోత్సాహాన్ని ఇచ్చే బ్రేక్లు, ఆఫ్సైట్ ట్రిప్లు, తదితరాలకు ఇతర కంపెనీలు సై అంటున్నాయి. ఫిలిప్పీన్స్లోని ఓ కాస్మెటిక్స్ కంపెనీ ఉద్యోగులకు అదనంగా 5 రోజుల పెయిడ్ లీవ్స్ను క్రిస్మస్ గిఫ్ట్ హాంపర్గా ఇచ్చింది. పటగోనియా (ఓ క్లోథింగ్ బ్రాండ్), ఎయిర్ బీఎన్బీ సంస్థలు కూడా తమ ఉద్యోగులు రీచార్జ్ కావడానికి పెయిడ్ లీవ్స్ను ప్రకటించాయి. ద గుడ్ గ్లామ్ గ్రూప్, ఎన్కాష్, ఇన్ట్యూట్, అగ్నిటో, ఖాటాబుక్, ఇన్మొబీ, వింగీఫై, నోబ్రోకర్, సింప్లీ లెర్స్ వంటి పలు సంస్థలు, స్టార్టప్ కంపెనీలు ఈ దిశలో వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. ఈ ఏడాది ముగిసి కొత్త ఏడాది వచ్చే దాకా అంటే పూర్తి వారమంతా ‘ద గుడ్ గ్లామ్ గ్రూప్’షట్డౌన్ ప్రకటించింది. అలాగే ఖాటాబుక్ సంస్థ ఈ నెల 25 నుంచి 31 దాకా ఉద్యోగులకు సెలవులు ఇచ్చేసింది. మరికొన్ని సంస్థలు ఆఫ్సైట్ టూర్స్ ప్లాన్ చేశాయి. -
5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాకారానికి స్టార్టప్లు
హైదరాబాద్: ప్రధాన మంత్రి లక్ష్యమైన ‘2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడం’ సాకారానికి స్టార్టప్లు ముఖ్య పాత్ర పోషిస్తాయని, ఈ స్టార్టప్ల నిధుల అవసరాలను తీర్చడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్వోఎఫ్) కీలకంగా పనిచేస్తాయని చిన్న పరిశ్రమ అభివృద్ధి బ్యాంక్ (సిడ్బీ) సీఎండీ సుబ్రమణియన్ రామన్ పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిధుల అవసరాలు, అభివృద్ధి, ప్రోత్సాహకాలను సిడ్బీ చూస్తుంటుంది. ఈ నెల 27న ఇన్వెస్టర్ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, వాణిజ్య బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. స్టార్టప్లకు సంబంధించి ఫండ్స్ ఆఫ్ ఫండ్స్, కొత్తగా ఏర్పాటైన క్రెడిట్ గ్యారంటీ స్టార్టప్లకు సంబంధించి సమాచారాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. స్టార్టప్లకు కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా డీపీఐఐటీ జాయింట్ సెక్రటరీ శృతీసింగ్ అభినందించారు. -
ఐటీ జాబ్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? విద్యార్ధుల కోసం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ కెరీర్ ఔత్సాహికులకు నైపుణ్యాల్లో శిక్షణనిచ్చే ఎడ్టెక్ సంస్థ బైట్ఎక్స్ఎల్ .. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపై మరింతగా దృష్టి పెడుతోంది. ప్రస్తుతం 90 పైచిలుకు కాలేజీలతో టై–అప్లు ఉన్నాయని, ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటున్నామని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో కరుణ్ తాడేపల్లి తెలిపారు. అలాగే 163 మంది ఉద్యోగులు, కన్సల్టెంట్లు ఉండగా.. వచ్చే 6–9 నెలల్లో 350 వరకు పెంచుకోనున్నట్లు ఆయన వివరించారు. ఆదాయాన్ని 4 రెట్లు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కొత్తగా నిర్మించిన కార్యాలయంలోకి కార్యకలాపాలు మార్చిన సందర్భంగా విలేకరులకు చెప్పారు. ఇప్పటివరకూ ఏడు రాష్ట్రాల్లో 1,20,000 మంది విద్యార్థులకు క్లౌడ్, ఏఐ, ఎంఎల్ వంటి కొత్త టెక్నాలజీలపై తమ లెర్నింగ్ ప్లాట్ఫాం, ఎక్సలరేట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణనిచ్చినట్లు కరుణ్ వివరించారు. కరోనా తర్వాత దాదాపు అందరూ కాలేజీలు, ఆఫీసుల బాటపట్టిన నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎడ్టెక్ కంపెనీలపై కొంత ప్రభావం పడిందని ఆయన చెప్పారు. అయితే, కొత్త పరిస్థితులకు అనుగుణంగా వినూత్న సర్వీసులు అందించడంపై దృష్టి పెడుతున్నట్లు కరుణ్ చెప్పారు. -
పీఈ, వీసీ పెట్టుబడులు వీక్
ముంబై: గత నెలలో ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు వార్షికంగా 42 శాతం నీరసించాయి. 4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే నెలవారీగా చూస్తే అంటే 2022 అక్టోబర్తో పోలిస్తే ఇవి 18 శాతం పుంజుకున్నట్లు పారిశ్రామిక సంస్థ ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక పేర్కొంది. వెరసి వరుసగా రెండో నెలలోనూ పెట్టుబడులు బలపడినట్లు తెలియజేసింది. ఈ వివరాలు ప్రకారం గత నెలలో నమోదైన లావాదేవీల సంఖ్య 2021 నవంబర్తో పోలిస్తే 15 శాతం తక్కువగా 88కు చేరగా.. అక్టోబర్తో చూస్తే 13 శాతం అధికమయ్యాయి. కాగా.. 2022 నవంబర్లో 29 అమ్మకం(ఎగ్జిట్) డీల్స్ జరిగాయి. వీటి విలువ 1.8 బిలియన్ డాలర్లుకాగా.. 2021 నవంబర్లో 3.1 బిలియన్ డాలర్ల విలువైన 21 లావాదేవీలు జరిగాయి. ఇక 2022 అక్టోబర్లో 1.6 బిలియన్ డాలర్ల విలువైన 15 ఎగ్జిట్ డీల్స్ నమోదుకావడం గమనార్హం. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
ఆర్థిక మాంద్యమనే బెంగే వద్దు, పిలిచి మరీ జాబ్ ఇస్తున్నారు..లక్షల్లో ఉద్యోగాలు
ఆర్ధిక మాంద్యం భయాలతో అమెజాన్, ట్విటర్, మెటా, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నాయి. రానున్న 18 నెలలు ఉద్యోగులకు గడ్డు కాలమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కంపెనీల్లో పరిస్థితులు ఇలా ఉంటే మనదేశానికి చెందిన స్టార్టప్స్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. లక్షల స్టార్టప్లలో లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు తేలింది. ఆయా స్టార్టప్లు అవసరాన్ని బట్టి ఇప్పటికే 2 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. రానున్న రోజుల్లో వాటి సంఖ్య భారీ స్థాయిలో పెరగనుంది. ఆర్థిక సేవల ప్లాట్ఫారమ్, స్ట్రైడ్వన్ నివేదిక ప్రకారం 2022లో మనదేశానికి స్టార్టప్లు 2లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాయి. స్టార్టప్ల ద్వారా ఉద్యోగాల కల్పన 2017-22 మధ్య 78 శాతం వృద్ధి సాధించినట్లు నివేదిక వెల్లడించింది. అదనంగా, దేశ ప్రభుత్వం డిజిటల్ ఎకానమీపై దృష్టి సారించడంతో ఉద్యోగాల కల్పన 2025 నాటికి 70 రెట్లు పెంచుతుందని హైలైట్ చేసింది. ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టం అమెరికా, చైనా తర్వాత ప్రపంచ దేశాల్లో మూడవ అతి పెద్ద దేశంగా భారత్ అవతరించింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం(ఇంటర్నల్ ట్రేడ్) విభాగంలో 770,000 పైగా స్టార్టప్లు నమోదు చేసుకున్నాయి. 108 యునికార్న్లతో కూడిన, స్టార్ట్ అప్ల సంయుక్త విలువ $400 బిలియన్లకు పైగా ఉంది. ఈ సందర్భంగా స్ట్రైడ్వన్ వ్యవస్థాపకుడు ఇష్ప్రీత్ సింగ్ గాంధీ మాట్లాడుతూ..స్కేలబిలిటీ, ఆల్టర్నేట్ ఫండింగ్ ఆప్షన్లు, గ్లోబల్ మార్కెట్లోకి విస్తరించడం వంటి వివిధ అంశాలలో పర్యావరణ వ్యవస్థ పెరుగుదల అనేక అవకాశాలను సృష్టించిందని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించే సామర్ధ్యాన్ని కూడా పెంచింది. దీంతో భారతదేశ జీడీపీకి సుమారు 4-5 శాతం దోహదపడే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది’ అని చెప్పారు. -
జోరుగా..హుషారుగా! 80 స్టార్టప్లు ఐపీవోకు
న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో దేశీయంగా 80 స్టార్టప్లు పబ్లిక్ ఇష్యూలను చేపట్టే అవకాశమున్నట్లు మార్కెట్ రీసెర్చ్, కన్సల్టెన్సీ సంస్థ రెడ్సీర్ తాజాగా అంచనా వేసింది. ఈ కాలంలో 100కు మించిన సంస్థలు మరింత బలపడనున్నట్లు, భారీ స్థాయిలో లాభాలు ఆర్జించేందుకు వీలున్నట్లు అభిప్రాయపడింది. ఐపీవోలపై రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ రూపొందించిన నివేదికలో ఇప్పటికే కార్యకలాపాలను విస్తరించిన 20 స్టార్టప్లు ఎక్సేంజీల్లో లిస్టయినట్లు వెల్లడించింది. దేశీయంగా మరో 100కు పైగా స్టార్టప్లు మరింత ఎదిగే వీలుందని, భారీ లాభార్జన స్థాయికి చేరవచ్చని పేర్కొంది. ఈ జాబితాలో ఇప్పటికే 20 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను పూర్తి చేసుకున్నట్లు ప్రస్తావించింది. వెరసి మరో 80 కంపెనీలు ఐదేళ్లలో ఐపీవోల ద్వారా నిధుల సమీకరణకు ముందుకురానున్నట్లు అంచనా వేసింది. టెక్ కంపెనీలు వీక్: ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కారణంగానే వినియోగ కంపెనీలతో పోలిస్తే టెక్నాలజీ సంస్థల ఐపీవోలు పతన బాటలో సాగుతున్నట్లు హెచ్ఎస్బీసీ సహకారంతో రూపొందిన రెడ్సీర్ నివేదిక పేర్కొంది. అయితే టెక్నాలజీ కంపెనీలు ప్రస్తుతం వృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపింది. వచ్చే రెండేళ్లలో సానుకూల నగదు ఆర్జనను సాధించగల కీలక కంపెనీలు ప్రస్తుతం 20-30శాతం డిస్కౌంట్లో ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు చౌక వడ్డీ రేట్లు కారణంకాగా.. ఇకపై మరింత ఊపందుకోనున్న వడ్డీ రేట్ల పరిస్థితుల్లో విలువ వేగంగా బలపడనున్నట్లు అభిప్రాయపడింది. ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ వృద్ధి చూపనున్నట్లు అంచనా వేసింది. (కొత్త ఏడాదిలో యూజర్లకు షాకివ్వనున్న టాటా మోటార్స్) కారణాలున్నాయ్: యూఎస్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 43 లక్షల కోట్ల డాలర్లలో టెక్నాలజీ లేదా న్యూఏజ్ కంపెనీల వాటా 25 శాతంగా నివేదిక పేర్కొంది. వీటిలో యాపిల్ ఇంక్, అమెజాన్ తదితర దిగ్గజాలున్నట్లు తెలియజేసింది. ఇక ఇండియాలో 3.9 లక్షల కోట్ల డాలర్ల స్టాక్ మార్కెట్ విలువలో టెక్ లేదా న్యూఏజ్ కంపెనీల వాటా 1 శాతమేనని వివరించింది. గత రెండు దశాబ్దాలలోనూ ఇదేతరహా పరిస్థితులను పరిశీలిస్తే.. వడ్డీ రేట్లు నీరసించినప్పటికీ మార్కెట్లు నిలకలకడను సాధించేందుకు కొంత సమయం పట్టినట్లు రెడ్సీర్ సంస్థ పార్టనర్ రోహన్ అగర్వాల్ తెలియజేశారు. మార్కెట్లు రికవరీ సాధించేందుకు మరింత సమయం పట్టవచ్చని అంచనా వేశారు. డౌన్టర్న్ల తదుపరి ఐపీవోలు జోరు చూపడం చూస్తున్నదేనని ప్రస్తావించారు. కాగా.. ఐపీవో బాటలో విజయవంతమయ్యేందుకు మార్కెట్ లీడర్షిప్, విస్తరించవలసిన మార్కెట్లు, నమ్మకమైన ఆదాయ అంచనాలు, లాభదాయకతకు స్పష్టమైన ప్రణాళికలు వంటి పలు కీలక అంశాలపై స్టార్టప్లు దృష్టిసారించవలసి ఉన్నట్లు వివరించారు. (టెక్ మహీంద్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్) -
ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: స్టార్టప్ కంపెనీ అయిన ‘వీ ఫౌండర్ సర్కిల్’ (డబ్ల్యూఎఫ్సీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో గణనీయమైన స్టార్టప్ పెట్టుబడుల ప్రణాళికలతో ఉన్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేళ్లలో 50కు పైగా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. 2023లో కనీసం ఎనిమిది స్టార్టప్లకు నిధులు సమకూర్చనున్నట్టు పేర్కొంది. సగటున ఒక్కో పెట్టుబడి రూ.82 లక్షల నుంచి రూ1.23 కోట్ల మధ్య ఉంటుందని ‘టై గ్లోబల్ సదస్సు’లో భాగంగా డబ్ల్యూఎఫ్సీ ప్రకటించింది. ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఐదు స్టార్టప్లలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టినట్టు పేర్కొంది. ద్వితీయ, తృతీయ తరగతి పట్టణాలకు చెందిన ఇన్వెస్టర్ల కోసం మంచి ప్రణాళికలతో ముందుకు వస్తామని సంస్థ సహ వ్యవస్థాపకుడు గౌవర్ వీకే సింఘ్వి తెలిపారు. -
సొంతానికి ఓ శాటిలైట్.. మనకు మనమే సమాచారం తెలుసుకునే వీలు!
రమేష్ హైదరాబాద్లో ఉంటున్నాడు. వచ్చే వారం రోజులు వర్షాలు అనే సమాచారం ఉంది. అయితే, తాను ఉంటున్న ప్రాంతంలో వర్షాలు పడతాయో లేదో తెలుసుకునేందుకు తాను పంపిన ప్రైవేటు శాటిలైట్ ద్వారా వర్షం పడుతుందా? లేదా చూశాడు. వర్షం పడదని నిర్ధారించుకుని తన పనిలో మునిగిపోయాడు. ఒక ప్రైవేటు విద్యా సంస్థ.. దేశవ్యాప్తంగా ఉన్న తన నెట్వర్క్లోని అన్ని విద్యా సంస్థల్లో ఒకేసారి ఆన్లైన్లో పాఠాలు బోధించేందుకు ఎవరిపై ఆధారపడాల్సిన అవసరంలేకుండా తమ విద్యార్థి ప్రయోగించిన శాటిలైట్ ద్వారా నేరుగా సేవలను ఉపయోగించుకుంటోంది. అదీ తక్కువ ఖర్చుతోనే.. ఒక ప్రైవేటు సంస్థ మారుమూల ప్రాంతాల్లో పనులను చేపడుతోంది. దేశవ్యాప్తంగా అటు కశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించేందుకు తాను సొంతంగా నిర్వహిస్తున్న శాటిలైట్ ఆధారంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆదేశాలు జారీచేస్తోంది. ..అవును కేంద్రం కొత్తగా అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయంతో మనమూ సొంతంగా ఒక ప్రైవేటు శాటిలైట్ను ప్రయోగించుకుని సేవలను పొందే రోజు దగ్గర్లోనే ఉంది. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సొంతంగా ఏర్పాటుచేసుకున్న అంతరిక్ష రవాణా కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ తరహాలో కాకపోయినా.. ప్రైవేటు పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, మెడికల్ సంస్థలు మొదలైనవి తమ సొంత శాటిలైట్ ద్వారా నెట్వర్క్ను ఏర్పాటుచేసుకునే వీలు కలగనుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు ఎప్పుడో తలుపులు తెరిచారు. కానీ, భారత్లో మాత్రం కేంద్రం ఇటీవలే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వేతర ప్రైవేటు సంస్థలు (ఎన్జీపీఈ).. అంతరిక్ష పరిశోధనలను తమ సొంత అవసరాలకు స్వయంగా చేసుకునేందుకు వీలుగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. తద్వారా విద్యా సంస్థలు, స్టార్టప్స్, పరిశ్రమలకు ఎండ్ టు ఎండ్ (నేరుగా సమాచారం చేరే విధంగా) అంతరిక్ష కార్యక్రమాల నిర్వహణకు అవకాశం కల్పించాలని సంకల్పించింది. ఇందుకోసం ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్)ను ఏర్పాటుచేసింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)తో అనుసంధానం చేసుకుంటూ ప్రైవేటు సంస్థలకు సహాయ సహకారాలతో పాటు నియంత్రణ కూడా చేస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇస్రోకు చెందిన సాధన సంపత్తిని ప్రధానంగా రాకెట్ లాంచింగ్ కేంద్రాలతో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు సంస్థలూ వినియోగించుకునే వెసులుబాటు లభించింది. ఇక బోలెడు అవకాశాలు.. ప్రైవేటు పెట్టుబడులను అనుమతించడంతో అంతరిక్ష రంగంలో అనతికాలంలోనే భారత్ గొప్ప ముందడుగు వేసే అవకాశాలున్నాయని అంతరిక్ష పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు వారు ఒక ఉదాహరణ చెబుతున్నారు. వాస్తవానికి మార్స్ (అంగారకుడు)లో అడుగుపెట్టేందుకు భారత్ కేవలం 75 బిలియన్ డాలర్లు మాత్రమే వెచ్చించింది. మిగిలిన పాశ్చాత్య దేశాల కంటే చాలా తక్కువ ఖర్చుతో మనం అంగారకుడిపై అడుగు పెట్టగలిగామనేది వారి అభిప్రాయం. అంతేకాక.. భారత్లో ఉన్న నిపుణులైన యువత ఈ అవకాశాలను మరింత త్వరగా అందిపుచ్చుకునే అవకాశం ఉందనేది వారి అంచనా. ప్రైవేటు సంస్థలకు అవకాశమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటగా విశాఖ, హైదరాబాద్కు చెందిన యువకులు.. స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ద్వారా దేశంలోనే మొదటి ప్రైవేట్ రాకెట్ను శ్రీహరికోట నుంచి 2022 నవంబరు 18న విజయవంతంగా ప్రయోగించారు. అవకాశాలు అందుబాటులోకి వస్తే భారత యువత రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్లి ప్రపంచ మార్కెట్లో త్వరలోనే పాగావేసే అవకాశం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2019 నాటికి భారత అంతరిక్ష మార్కెట్ విలువ 7 బిలియన్ డాలర్లు కాగా... ఇది కాస్తా 2025 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్టార్టప్స్ షురూ.. ప్రపంచ అంతరిక్ష మార్కెట్ విలువ 2020 నాటికి 447 బిలియన్ డాలర్లు కాగా.. 2025 నాటికి ఇది 600 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. వాస్తవానికి అంతర్జాతీయంగా ఇప్పటికే స్పేస్ ఎయిర్క్రాఫ్ట్ ఎక్విప్మెంట్, శాటిలైట్ కమ్యూనికేషన్స్లో ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. రష్యా దాడి తర్వాత ఉక్రెయిన్లో దెబ్బతిన్న సమాచార వ్యవస్థ పునరుద్ధరణలో స్టార్ లింక్ ప్రధాన పాత్ర పోషించింది. ‘స్పేస్ ఎక్స్’ సంస్థ అంతరిక్షంలో ఏకంగా 3,271 శాటిలైట్స్ను ప్రయోగించింది. ఇందులో 3,236 శాటిలైట్స్ ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అయితే, భారత్లో కూడా అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడుల క్రమం ఇప్పుడే మొదలవుతోంది. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే అంతరిక్ష రంగ పరిశోధనలకు మనం వెచ్చిస్తున్న మొత్తం తక్కువే. అమెరికా అంతరిక్ష బడ్జెట్ 41 బిలియన్ డాలర్లు కాగా.. ఇందులో నాసా ప్రాజెక్టుల మీద 23.3 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. మరోవైపు.. భారత్ అంతరిక్ష బడ్జెట్ రూ.13,700 కోట్లు మాత్రమే. అయితే, ఎవరి ప్రమేయం లేకుండా ఎండ్ టు ఎండ్ సర్వీసులను ప్రైవేటు సంస్థలు పొందేందుకు వీలుగా జూన్ 2022లో ప్రైవేటు రంగాన్ని ఆహ్వానిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో భారత్లోనూ వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. భారత్లో ఇప్పటికే ఇస్రో వద్ద 60 స్టార్టప్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. సమాచారం మరింత ఖచ్చితంగా.. అంతరిక్షంలో మరిన్ని శాటిలైట్లను ప్రయోగించడం ద్వారా మారుమూల ప్రాంతాల సమాచారాన్ని కూడా మరింత సమగ్రంగా, ఖచ్చితంగా విశ్లేషించే అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నిజానికి.. ఇంట్లో కూర్చుని మనం వివిధ సినిమాలు, న్యూస్, సీరియల్స్, గేమ్స్ చూస్తున్నామంటే అందుకు కారణం శాటిలైట్సే. ఎక్కడో దూరాన ఉన్న మన వారితో ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతున్నామన్నా.. మనం ఉన్న చోటునుంచే ఎక్కడో ఉన్న వారి బ్యాంకు అకౌంట్లోకి నగదు బదిలీ చేస్తున్నామన్నా.. ఎక్కడెక్కడో ఉన్న కంపెనీల ప్రతినిధులు ఆన్లైన్లో సమావేశం కావడం, ఫలానా తేదీన, ఫలానా ప్రాంతాల్లో వర్షాలు పడతాయన్న సమాచారం కానీ.. మనం ఉన్న ప్రాంతం నుంచి ఫలానా ప్రదేశం ఎంతదూరం ఉందన్న సమాచారం కానీ మనకు వస్తోందంటే శాటిలైట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్న సమాచారమే కారణం. ఇక అంతరిక్షంలోకి మరిన్ని శాటిలైట్లను ప్రయోగిస్తే ఏయే లాభాలు కలుగుతాయంటే.. వాతావరణంలో వచ్చే మార్పులను మరీ సూక్ష్మంగా విశ్లేషించొచ్చు. తద్వారా ఆయా సమాచారాన్ని రైతులకు, సంస్థలకు అందించడం ద్వారా నష్టాన్ని నివారించే వీలు కలుగుతుంది. స్టూడెంట్ శాటిలైట్స్ ద్వారా మారుమూలప్రాంతాలకు చెందిన సమాచారాన్ని తక్కువ ఖర్చుతో సేకరించొచ్చు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్స్కు కనెక్ట్ కాని 49 శాతం మంది ప్రజలు వీటి ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో తక్కువ ఖర్చుతో తయారుచేసే చిన్నచిన్న శాటిలైట్లు ప్రధానపాత్ర పోషించనున్నాయి. తక్కువ ఖర్చుతో ఆయా సంస్థలు అంతరిక్ష నెట్వర్క్ను ఏర్పాటుచేసుకోవడం ద్వారా ఇతరులకు తమ సమాచారమేదీ పొక్కకుండా కాపాడుకోవచ్చు. మెడికల్ రంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముంది. మన భూమిని ప్రకృతి వైపరీత్యాల నుంచి, వాతావరణ మార్పుల నుంచి కాపాడుకునే వీలుంది. -
హెచ్యూఎల్ గూటికి ఒజైవా
న్యూఢిల్లీ: ఒజైవా బ్రాండు సంస్థ జైవీ వెంచర్స్ ప్రయివేట్లో 51 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్యూఎల్) తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 335 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ బాటలో వెల్బీయింగ్ న్యూట్రిషన్ సంస్థ న్యూట్రిషన్ల్యాబ్ ప్రయివేట్లో 19.8 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు నగదు రూపేణా రూ. 70 కోట్లు వెచ్చించనున్నట్లు హెచ్యూఎల్ తెలియజేసింది. తద్వారా ఆరోగ్యం, సంక్షేమ విభాగాలలో ప్రవేశించనుంది. దేశీయంగా హెల్త్, వెల్బీయింగ్ విభాగం అత్యంత వేగంగా పురోగమిస్తున్నట్లు యూరోమోనిటర్ డేటా పేర్కొంది. రూ. 30,000 కోట్ల మార్కెట్ పరిమాణానికి వీలున్నట్లు అంచనా వేసింది. కాగా.. ఒజైవాలో మిగిలిన 49 శాతం వాటాను ముందస్తు అంచనా విలువ ప్రకారం మూడేళ్ల(36 నెలలు) తదుపరి కొనుగోలు చేయనున్నట్లు హెచ్యూఎల్ వివరించింది. గతేడాది(2021–22) జైవీ రూ. 124 కోట్లు, వెల్బీయింగ్ రూ. 19.4 కోట్లు చొప్పున టర్నోవర్ సాధించినట్లు వెల్లడించింది. -
ఐపీ ఫెసిలిటేటర్ల ఫీజులు పెంపు
న్యూఢిల్లీ: అంకుర సంస్థలకు పేటెంట్ దరఖాస్తులపరమైన సేవలు అందించే ఐపీ ఫెసిలిటేటర్ల ప్రొఫెషనల్ ఫీజులను కేంద్రం దాదాపు రెట్టింపు చేసింది. స్టార్టప్స్ మేథోహక్కుల పరిరక్షణ (ఎస్ఐపీపీ) పథకం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అంకుర సంస్థలకు ఐపీ ఫెసిలిటేటర్లు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఇది తోడ్పడగలదని వివరించింది. పేటెంట్లకు సంబంధించి .. దరఖాస్తును ఫైలింగ్ చేసేటప్పుడు ఫీజును రూ. 10,000 నుండి రూ. 15,000కు పెంచారు. అలాగే ట్రేడ్ మార్క్లు, డిజైన్ల విషయంలో రూ. 2,000 నుండి రూ. 3,000కు సవరించారు. స్టార్టప్ల మేథోహక్కులను పరిరక్షించేందుకు, నవకల్పనలు.. సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు కేంద్రం 2016లో ఎస్ఐపీపీని ప్రవేశపెట్టింది. ఐపీ ఫెసిలిటేటర్ల ద్వారా అంకుర సంస్థలు తమ పేటెంట్లు, డిజైన్లు లేదా ట్రేడ్మార్కుల దరఖాస్తులు సమర్పించేందుకు, ప్రాసెస్ చేయించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందుకు సంబంధించిన ఫీజులను ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ భరిస్తోంది. దీని కింద ఐపీల ఫైలింగ్స్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31 వరకూ ఈ స్కీమును కేంద్రం పొడిగించింది. ఐపీ ఫైలింగ్స్లో స్టార్టప్లకు తోడ్పడినందుకు గాను సెప్టెంబర్ 30 వరకూ ఫెసిలిటేటర్లకు రూ. 3.80 కోట్ల మేర ఫీజులు చెల్లించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తెలిపింది. -
రెండింతలైన అగ్రిటెక్ పెట్టుబడులు.. కారణం ఏంటంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయం, ఆహార రంగంలో ఉన్న సాంకేతిక స్టార్టప్స్లో పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలో రెండింతలకుపైగా పెరిగి రూ.37,425 కోట్లకు చేరాయి. 2020–21తో పోలిస్తే 119 శాతం వృద్ధి నమోదైంది. రెస్టారెంట్ మార్కెట్ప్లేస్, ఈ–గ్రాసరీ విభాగాల్లో పెట్టుబడుల వరద ఈ స్థాయి జోరుకు కారణమని ఇండియా అగ్రిఫుడ్టెక్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్–2022 పేరుతో వెంచర్ క్యాపిటల్ కంపెనీలైన ఆగ్ఫండర్, ఓమ్నివోర్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. డీల్స్ సంఖ్య 189 నుంచి 234కు చేరింది. రెస్టారెంట్ మార్కెట్ప్లేస్ రూ.15,458 కోట్లు, ఈ–గ్రాసరీ విభాగం రూ.11,390 కోట్ల నిధులను అందుకున్నాయి. పరిశ్రమ చేజిక్కించుకున్న నిధుల్లో ఈ రెండు విభాగాల వాటా ఏకంగా 66 శాతముంది. వ్యవసాయ సాంకేతిక రంగ స్టార్టప్స్ 140 డీల్స్కుగాను రూ.12,204 కోట్లు చేజిక్కించుకున్నాయి. ఆసియా పసిఫిక్ దేశాల్లో అత్యధికంగా పెట్టుబడులను భారత్ ఆకట్టుకుంది. చదవండి: అలర్ట్: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్! -
హైదరాబాద్: ఫుల్ డిమాండ్.. అందులో స్టార్టప్ల ఏర్పాటు కోసం ఎగబడుతున్న సంస్థలు!
సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో ఐటీ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంకుర పరిశ్రమల స్వర్గధామం టీహబ్– 2లో స్టార్టప్లు నెలకొల్పేందుకు తాజాగా వంద వరకు దేశ, విదేశీ సంస్థలు క్యూ కట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే సుమారు 200 అంకుర సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన విషయం విదితమే. వీటిలో ఐటీ, అనుంబంధ రంగాలు,కృత్రిమ మేథ,సైబర్సెక్యూరిటీ తదితర రంగాలతో పాటు ఆరోగ్య, ప్రజోపయోగ సేవలందించేందుకు నూతన ఆవిష్కరణలు చేసే సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో ఐటీ శాఖ ఈహబ్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు రూ.276 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ కేంద్రంలో దశలవారీగా దాదాపు రెండువేల కంపెనీలకు వసతి కల్పించనున్నారు. స్టార్టప్లకు కేరాఫ్.. ► టీహబ్– 2 కేంద్రాన్ని రాయదుర్గంలో 3.5 లక్షల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోనే ఇది అతిపెద్ద ఇంక్యుబేటర్ కేంద్రమని.. ప్రపంచంలోనే రెండోదని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టీ హబ్ మొదటి దశను ఐఐఐటీ హైదరాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నల్సార్ సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. ఇందులో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో నెలకొల్పారు. ► స్టార్టప్ కంపెనీలు నెలకొల్పాలనుకునే ఔత్సాహికులు, వారికి పెట్టుబడి సాయం అందించే ఇన్వెస్టర్లు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలను ఒకే చోటకు చేర్చడం హబ్ ఉద్దేశం. అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉన్న అవకాశాలను ఒడిసిపట్టుకునేదుకు అనువైన వ్యవస్థను టీహబ్లలో ఏర్పాటు చేయడం విశేషం. తొలిదశ సూపర్హిట్.. ► స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు గచ్చిబౌలిలో 2015లో ఏర్పాటు చేసిన తొలి టీహబ్ ప్రయోగం విజయవంతమైంది. హబ్లో గత ఏడేళ్లుగా 1200 స్టార్టప్ కంపెనీలు పురుడు పోసుకున్నాయి. సుమారు రూ.1800 కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. సుమారు 2500 మందికి ఉపాధి కల్పించింది. ఇక్కడ పురుడు పోసుకున్న పలు స్టార్టప్లు దేశ, విదేశాల్లో పని చేస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, సేవ, బీమా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హెల్త్కేర్, ఇండస్ట్రీ రంగాల్లో సేవలందిస్తోన్న కంపెనీలకు సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. ► ఈ హబ్ను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, బయోకాన్ చైర్మన్ కిరణ్ మంజుందార్షాలు సందర్శించి.. ఇక్కడ స్టార్టప్లను నెలకొల్పిన యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించారు. ఈ హబ్లో స్టార్టప్ ఇన్నోవేషన్, కార్పొరేట్ ఇన్నోవేషన్, డెమోడే, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తదితర అంశాలపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. ఐటీ బూమ్కు దోహదం.. టీహబ్ ఒకటి, రెండో దశలకు స్పందన క్రమంగా పెరుగుతుండడంతో నగరంలో ఐటీ రంగంలో మరిన్ని నూతన స్టార్టప్లు పురుడు పోసుకునే అవకాశాలుంటాయని హైసియా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐటీ రంగం మరింత వృద్ధి సాధించేందుకు ఈ హబ్లు దోహదం చేస్తాయని పేర్కొన్నాయి. చదవండి: ‘రేపట్నించి ఆఫీస్కు రావొద్దు’, అర్ధరాత్రి ఉద్యోగులకు ఊహించని షాక్..భారీ ఎత్తున తొలగింపు -
సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు
న్యూఢిల్లీ: ‘‘సౌర, అంతరిక్ష రంగాల్లో భారత్ అద్భుతాలు చేస్తోంది. ఆ రంగాల్లో మనం సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 36 ఉపగ్రహాలను ఇస్రో ఒకేసారి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించడాన్ని దేశానికి యువత ఇచ్చిన ప్రత్యేక దీపావళి కానుకగా అభివర్ణించారు. ఆదివారం నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘స్వయంసమృద్ధి దిశగా మా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది తాజా తార్కాణం. ఒకప్పుడు మనకు క్రయోజనిక్ రాకెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. కానీ మన శాస్త్రవేత్తలు దాన్ని సవాలుగా తీసుకుని దేశీయ పరిజ్ఞానం సాయంతోనే వాటిని నిర్మించి చూపించారు. ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా ఉపగ్రహాలను పంపి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ అంతరిక్ష వాణిజ్య మార్కెట్లో్ల భారత్ పెద్ద శక్తిగా నిలిచింది. అంతరిక్షంలోనూ ప్రైవేటు రంగానికి తలుపులు తెరవడంతో కొత్త స్టార్టప్లు పుట్టుకొచ్చి విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి’’ అన్నారు. మోదెరా స్ఫూర్తి: ప్రపంచమంతా పర్యావరణహిత సౌర విద్యుత్ కేసి మళ్లుతోందని మోదీ అన్నారు. ‘‘పీఎం కుసుమ్ యోజన ద్వారా ఎంతోమంది ఇళ్లపై సోలార్ ప్లాంట్లు పెట్టుకున్నారు. కరెంటు బిల్లులు తగ్గించుకోవడంతో పాటు మిగులు విద్యుత్ను విక్రయించి లాభపడుతున్నారు. గుజరాత్లోని మోదెరా దేశంలో తొలి సోలార్ గ్రామంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో దేశమంతటా సూర్యగ్రామ్లు వెలుస్తాయి. ఇది త్వరలోనే భారీ ప్రజా ఉద్యమంగా మారడం ఖాయం’’ అని జోస్యం చెప్పారు. పాత సవాళ్లు వదిలేద్దాం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ప్రతి భారతీయుడికి ఒక గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాత సవాళ్లను ఇక వదిలేద్దామని, నూతన అవకాశాల నుంచి లబ్ధి పొందుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మూకశ్మీర్లో నిర్వహించిన రోజ్గార్ మేళానుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్తగా ఆలోచించాలని, కొత్త మార్గంలో పయనించాలని సూచించారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందాలన్నదే తమ ఆశయమని ఉద్ఘాటించారు. మనమంతా కలిసి జమ్మూకశ్మీర్ను ఉన్నత శిఖరాలను చేర్చుదామని పిలుపునిచ్చారు. 21వ శతాబ్దంలో ప్రస్తుత దశాబ్దం జమ్మూకశ్మీర్ చరిత్రలో చాలా ముఖ్యమైన దశాబ్దమని చెప్పారు. పాత సవాళ్లను పక్కనపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. జమ్మూకశ్మీర్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు ఎంపికై, రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు అందుకున్న 3,000 మంది యువతకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరో 700 మందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేయడానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. తయారీ హబ్గా భారత్ వడోదర: రవాణా విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా మారబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని వడోదరలో రూ.22 వేల కోట్లతో యూరోపియన్ సి–295 మధ్యతరహా రవాణా విమానాల తయారీ కేంద్రానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఈ విమానాలను తయారు చేయబోతున్నారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద తయారీ హబ్గా అవతరించిందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థిక సంస్కరణ విషయంలో నూతన చరిత్రను రాస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు స్థిరంగా, దార్శనికతతో కూడి ఉన్నాయన్నారు. కొత్త మైండ్సెట్, కొత్త వర్క్కల్చర్తో ఇండియా ముందడుగు వేస్తోందని చెప్పారు. పెద్ద పెద్ద వాణిజ్య విమానాలు కూడా మన దేశంలో తయారయ్యే రోజులను మనం చూడబోతున్నామని తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’తోపాటు ‘మేక్ ఫర్ వరల్డ్’ అనేదే మన నినాదమని వివరించారు. సి–295 ఎయిర్క్రాఫ్ట్లతో భారత వైమానిక దళం బలోపేతం కావడంతోపాటు మనదేశంలో విమానయాన రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఆ దిశగా ఇదొక మైలురాయి అని అభివర్ణించారు. -
Vizag: ‘టెక్’ల కేంద్రంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: సాంకేతిక రంగంలో భారత్ వేగంగా దూసుకుపోతోందని, 130 కోట్ల మంది ప్రజలంతా టెక్నాలజీలో భాగస్వాములు కావడం విశేషమని మైక్రోసాఫ్ట్ ఇండియా క్లౌడ్ సైట్ లీడర్ చారుమతి శ్రీనివాసన్ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘వైజాగ్ ది నెక్ట్స్ టెక్ హబ్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై శుక్రవారం విశాఖలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఫిన్టెక్, హెల్త్టెక్, ఎడ్యుటెక్, ఫార్మాటెక్ రంగాల్లో దూసుకెళ్లేందుకు విశాఖకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. స్టార్టప్ హబ్గా విశాఖ అభివృద్ధి చెందేందుకు ఇంక్యుబేటర్స్ ద్వా రా కార్యకలాపాలను పెంచడంతోపాటు ఫ్రెండ్లీ పాలసీ ద్వారా ప్రధానసంస్థల్ని ఆకర్షించాలని సూచించారు. 81 శాతం పరిశ్రమలకు ఆవిష్కరణలే బలమని చెప్పారు. స్టార్టప్లు, ఆవిష్కరణలకు ఏపీ కీలకం సదస్సు సందర్భంగా ఎస్టీపీఐ, ఎస్టీపీఐ నెక్టస్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ నేతృత్వంలో ఇండస్ట్రీ 4.0 ద్వారా ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించేలా ఒప్పందం కుదిరింది. పరిశ్రమలతో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకునే వాతావరణాన్ని ఎస్టీపీఐ సృష్టిస్తుందని సదస్సును ప్రారంభించిన సంస్థ డైరెక్టర్ సీవీడీ రామ్ప్రసాద్ తెలిపారు. విశాఖలో ఆర్ఐఎన్ఎల్తో కలిసి ఆవిష్కరణలు, అంకుర సంస్థల్ని ప్రోత్సహించేందుకు ఇండస్ట్రీ 4.0 ప్రారంభించామని చెప్పారు. స్టార్టప్లు, ఆవిష్కరణలకు ఏపీ కీలకమన్నారు. ఐటీ సెక్టార్తో విద్యుత్ రంగం కలిసి పనిచేస్తే వినియోగదారుల సమస్యలను మరింత త్వరగా పరిష్కరించేందుకు మార్గం సుగమమవుతుందని సీఐఐ మాజీ చైర్మన్ డి.రామకృష్ణ తెలిపారు. స్టీల్ప్లాంట్, సెమ్స్, మారిటైమ్ యూనివర్సిటీ, ఎక్స్పోర్ట్ హబ్ లాంటి సంస్థలతో విశాఖ పారిశ్రామిక నగరంగా ఇప్పటికే అభివృద్ధి చెందిందని, ఐటీ హబ్గా ఎదిగే రోజులు సమీపంలోనే ఉన్నాయన్నారు. సీఐఐ వైస్ చైర్మన్ పీపీ లాల్కృష్ణ, పలు ఐటీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐఐటీల్లో స్టార్టప్స్పైనే దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బోధనావిధానం వినూత్న ఆలోచనలకు పదును పెట్టేవిధంగా మారుతోంది. స్టార్టప్స్ను ప్రోత్సహించేవిధంగా, విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు ఆలంబనగా ఉంటోంది.కోర్సు ప్రారంభం నుంచే భిన్నమైన ఆలోచనాధోరణికి పదును పెటాల్సిన అవసరం ఉందని సరికొత్త బోధనావిధానంలో కేంద్రం పొందుపర్చింది. ఐఐటీ విద్యావిధానంపై నాలుగేళ్ల క్రితమే కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే ఐఐటీలు మార్పులు చేస్తున్నాయి. ఐఐటీ విద్యార్థులకు మంచివేతనంతో ఉద్యోగం రావడం పెద్ద విషయమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు భిన్నంగా వాళ్లే సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నా రు. కోవిడ్కు ముందువరకూ ఈ తరహా ప్రయోగాలపై దృష్టి పెట్టారు. హార్డ్వేర్లోనూ విద్యార్థులు గణనీయమైన స్టార్టప్స్ తయారు చేశారు. ఆన్లైన్ తోడుగా... వినియోగదారుల అభిరుచి, మార్కెట్ పురోగతి వాస్తవ పరిస్థితి, కొత్తగా అన్పించే వస్తువుల రూపకల్పన ఇవన్నీ ఆన్లైన్ ద్వారా తేలికగా తెలుసుకునే చాన్స్ కన్పిస్తోందని హైదరా బాద్ ఐఐటీ విద్యార్థి శశాంక్ తెలిపారు. ఈ–కామర్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉన్న సాఫ్ట్వేర్ను వాడుకుంటూ కొత్తవి కనుక్కోవడంపై ఐఐటీల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమ ర్ పద్ధతిలో స్టార్టప్స్ నెలకొల్పేందుకు ఐఐటీ విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని చెప్పారు. హైదరాబాద్ ఐఐటీలో ఇదీ పురోగతి హైదరాబాద్ ఐఐటీలో 2017, 18లో కేవలం ఏడు మాత్రమే ఇంక్యుబేటెడ్ స్టార్టప్స్ నమోదయ్యాయి. 2019లో ఇవి 8కి చేరితే, 2020లో 38 నమోదయ్యాయి. 2021లో 23 ఉంటే, 2022లో 18 నమోదయ్యాయి. కోవిడ్ ప్రభావమే స్టార్టప్స్ తగ్గడానికి కారణమని హైదరాబాద్ ఐఐటీలో చదివిన నివేశ్ తెలిపారు. గడచిన ఐదేళ్లలో ఐఐటీ హైదరాబాద్లో హార్డ్వేర్ సంబంధిత స్టార్టప్స్ 43, సాఫ్ట్వేర్ 34, హైబ్రిడ్ 24 తయారయ్యాయి. పదును పెట్టాల్సిందే ఐఐటీ విద్యార్థుల ఆలోచనాశక్తిని పరిశోధనల వైపు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ల నుంచి సరికొత్త విప్లవాన్ని సృష్టించే అవకాశాలున్నాయి. సృజనాత్మకతకు పదును పెడితే, భారత్ మంచి ఉత్పాదక శక్తిగా ఎదుగుతుంది. – వైఎన్ సింఘాల్, ఐఐటీ నిపుణులు, ముంబై ఐఐటీ పలు వర్సిటీల్లో నమోదైన స్టార్టప్స్ ►ముంబై ఐఐటీ విద్యార్థులు 2020లో 4కే కెమెరాతో సరికొత్త డ్రోన్ రూపొందించారు. ఐదు కిలోమీటర్ల పరిధిలోని స్పష్టమైన చిత్రాలను ఫొటోటైప్ సాంకేతికతతో అందించేలా తయారు చేశారు. భౌగోళిక, వ్యవసాయపరమైన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని మరింత ఆధునీకరిస్తే రక్షణ విభాగంలోనూ ఉపయోగించే వీలుంది. వాస్తవానికి భారత్ ఇప్పటి వరకూ చైనా డ్రోన్స్పైనే ఆధారపడింది. భద్రత కారణాల రీత్యా వీటిని నిషేధించారు. ఐఐటీ విద్యార్థుల టెక్నాలజీని వీటికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ►పంటపొలాల్లో కలుపుమొక్కల నివారణకు ప్రస్తుతం కొన్ని రసాయనాలు వాడుతున్నారు. వీటి అవశేషాలు అత్యంత ప్రమాదకరమని పరిశోధనల్లో తేలింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఒకరు మోనోవీల్తో నడిచే కలుపుమొక్కల నివారణ యంత్రాన్ని సృష్టించాడు. అయితే, ఇది కలుపుమొక్కల్నే కాకుండా పంటకు కూడా నష్టం చేస్తోందని గుర్తించారు. కొన్ని మార్పులు చేస్తే మిర్చి, పత్తి పంటల్లో విజయవంతంగా కలుపు నివారణ చేపట్టడానికి వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ దిశగా మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. ►వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా డేటాను క్షణాల్లో ప్రాసెస్ చేసి, సమగ్ర సమాచారం ఇవ్వగల ఓ సాప్ట్వేర్పై ఐఐటీ ఖరగ్పూర్ విద్యార్థి పరిశోధన చేసి పురోగతి సాధించాడు. కోవిడ్ సమయంలో ఈ పరిశోధన ముందుకు వెళ్లలేదు. వ్యాధి నిర్ధారణలో ప్రాథమిక సమాచారంతోపాటు అవసరమైన వైద్యవిధానం ఏ దేశంలో ఎలా ఉందనేది తెలియజేయడమే ఈ స్టార్టప్ విధానం. -
వెబ్3 స్టార్టప్లు.. 1.3 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీయంగా 450 పైచిలుకు వెబ్3 స్టార్టప్లు గత రెండేళ్లలో 1.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,700 కోట్లు) సమీకరించాయి. వీటిలో 80 శాతం అంకుర సంస్థలు ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఉన్నాయి. అయితే, జైపూర్, వదోదర, అహ్మదాబాద్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు కూడా క్రమంగా వెబ్3 స్టార్టప్స్ హబ్లుగా ఎదుగుతున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, వెంచర్ క్యాపిటల్ ఫండ్ హ్యాష్డ్ ఎమర్జెంట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘గత రెండేళ్లలో వెబ్3 స్టార్టప్ల సంఖ్య 450కి పైగా పెరిగింది. వీటిలో 4 యూనికార్న్లు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గలవి) ఉన్నాయి. 2022 ఏప్రిల్ నాటికి ఇవి 1.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. 2021–22లో కొత్తగా 170 వెబ్3 స్టార్టప్లు నమోదయ్యాయి‘ అని నివేదిక పేర్కొంది. మెటావర్స్, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ) మొదలైన కొత్త సాంకేతిక కాన్సెప్టులతో వెబ్3 (మూడో తరం వరల్డ్ వైడ్ వెబ్) పదం మరింతగా ప్రాచుర్యంలోకి వస్తోంది. నివేదిక ప్రకారం అంతర్జాతీయంగా వెబ్3 నిపుణుల్లో 11 శాతం మంది భారత్లో ఉన్నారు. తద్వారా వెబ్3 నిపుణుల లభ్యతపరంగా భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. వచ్చే 1–2 ఏళ్లలో వీరి సంఖ్య 120 శాతం పైగా పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. చదవండి: ఈ ఫోన్పై బోలెడు ఆఫర్లు, 90 శాతం వరకు తగ్గింపు కూడా! -
భారత్ ఆ ట్రెండ్ని మార్చింది.. ఆగస్ట్లో రూ. 8,000 కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: గత నెల(ఆగస్ట్)లో వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్స్ నుంచి దేశీ స్టార్టప్లకకు 99.5 కోట్ల డాలర్ల(సుమారు రూ. 8,000 కోట్లు) పెట్టుబడులు లభించాయి. డేటా ఎనలిటిక్స్ సంస్థ గ్లోబల్ డేటా వివరాల ప్రకారం 128 స్టార్టప్లు నిధులను సమీకరించాయి. జులైతో పోలిస్తే ఆగస్ట్లో పెట్టుబడులు 9.7 శాతం ఎగశాయి. ఆగస్ట్లో వీసీ పెట్టుబడులు బిలియన్ డాలర్లను చేరనప్పటికీ క్షీణతకు అడ్డుకట్ట పడినట్లు గ్లోబల్ డేటా ప్రధాన నిపుణులు ఔరోజ్యో తి బోస్ పేర్కొన్నారు. లావాదేవీల పరిమాణం 2.3 శాతం తగ్గినప్పటికీ నిధుల సమీకరణలో వృద్ధి నమోదైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా ఇదే కాలంలో యూఎస్, యూకే తదితర గ్లోబల్ మార్కెట్లలో నిధుల సమీకరణ వెనకడుగులో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ట్రెండ్ను ఇండియా, చైనా మాత్రమే అధిగమించినట్లు పేర్కొన్నారు. 2022 జనవరి–ఆగస్ట్ కాలంలో 1,239 వీసీ పెట్టుబడుల డీల్స్ నమోదైనట్లు ప్రస్తావించారు. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ. 25వేల వరకు డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు! -
స్టార్టప్లకు ‘కల్పతరువు’
సాక్షి, అమరావతి: పారిశ్రామికరంగంలో నాలుగో తరం టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖ వేదిక అవుతోంది. విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)తో కలిసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా ‘కల్పతరువు’ పేరుతో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ–4.0 సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) కార్యకలాపాలు సెప్టెంబర్ 20 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దేశంలోని స్టార్టప్లను ఆకర్షించేలా ఓపెన్ చాలెంజ్ ప్రోగ్రాం–1 (ఓసీపీ–1)ను కల్పతరువు సీఓఈ ప్రకటించింది. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు ఆర్ఐఎన్ఎల్, ఎన్టీపీసీ, వైజాగ్ పోర్టు, హెచ్పీసీఎల్ వంటి పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి ఖర్చులను నియంత్రించే నూతన టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచి తద్వారా స్టార్టప్లను ప్రోత్సహించేందుకు కల్పతరువు సీవోఈని ఏర్పాటుచేసినట్లు ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో భాగంగా.. ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఓసీపీ–1 పేరుతో స్టార్టప్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సమస్యకు ఇండస్ట్రీ–4 టెక్నాలజీతో చక్కటి పరిష్కరం చూపిన ప్రోటోటైప్ స్టార్టప్ను ఎంపికచేసి రూ.4 లక్షలు బహుమతిగా ఇవ్వడమే కాక, కల్పతరువు సీవోఈ ద్వారా ప్రాజెక్టు ఫండింగ్ సౌకర్యం కల్పిస్తారు. పరిశ్రమల్లో ఆటోమేషన్ పెంచేందుకు బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఇందులో నూతన ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుందని కల్పతరువు ప్రాజెక్టు మేనేజ్మెంట్ గ్రూపు సభ్యుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ, కేంద్ర ఐటీ శాఖ అధికారులతో వర్చువల్గా మంగళవారం ఓసీపీ–1ను ప్రారంభించనున్నారు. రూ.20 కోట్లతో ‘కల్పతరువు’ సుమారు రూ.20 కోట్లతో కల్పతరువు ఇండస్ట్రీ–4 సీవోఈ అభివృద్ధి చేస్తున్నారు. ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ సీవోఈ పనులు వేగంగా జరుగుతున్నట్లు సురేష్ తెలిపారు. ఇప్పటికే ల్యాబ్ పనులు మొదలయ్యాయని, రెండు నెలల్లో ఈ సీవోఈని అధికారికంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఓసీపీ–1లో ఎంపికైన స్టార్టప్లతో కల్పతరువును ప్రారంభించడానికి ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ పోటీలో గెలిచిన స్టార్టప్లు కల్పతరువులో ఏర్పాటుచేసిన ల్యాబొరేటరీ, ఇంక్యుబేషన్ వినియోగించుకోవడంతోపాటు ఎస్టీపీఐ నుంచి ఫైనాన్సింగ్, మానిటరింగ్ సహకారం లభిస్తాయి. -
స్టార్టప్ ఇండస్ట్రీ: యూనికార్న్ల సెంచరీ
చెన్నై: స్టార్టప్ పరిశ్రమలో 100 యూనికార్న్లకు ఇండియా ఆవాసంగా నిలిచినట్లు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. వీటి మొత్తం ఉమ్మడి విలువ 250 బిలియన్ డాలర్లు(రూ. 20 లక్షల కోట్లు)గా తెలియజేశారు. గత కొన్నేళ్లలో ఈ సంస్థలు 63 బిలియన్ డాలర్ల(రూ. 5,04,000 కోట్లు) పెట్టుబడులను సమీకరించినట్లు వెల్లడించారు. దేశీయంగా అంకుర సంస్థలు(స్టార్టప్) ఊపిరి పోసుకునేందుకు అనువైన పటిష్ట వ్యవస్థ ఏర్పాటైనట్లు కాంచీపురం ఐఐఐటీ, డిజైన్, తయారీ నిర్వహించిన 10వ స్నాతకోత్సంలో కొత్త గ్రాడ్యుయేట్లనుద్ధేశించి మంత్రి ప్రసంగించారు. సిలికాన్ వ్యాలీలోని 25 శాతం స్టార్టప్లను భారత సంతతికి చెందినవారే నిర్వహిస్తుండటం గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక్కడినుంచి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి ఎంటర్ప్రెన్యూర్గా మారి ఇతరులకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తారన్న అభిప్రాయంతో ఈ విషయాలను ప్రస్తావిస్తున్నట్లు తెలియజేశారు. 25 శాతం స్టార్టప్లను భారతీయులు నిర్వహిస్తున్న సిలికాన్ వ్యాలీపై ఇప్పటికే మీలో చాలా మంది దృష్టి పెట్టి ఉంటారని వ్యాఖ్యానించారు. -
రియల్టీ స్టార్టప్స్కు మంచిరోజులు: రూ.800 కోట్ల ఫండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో మరో మైలురాయి.ఈ పరిశ్రమలో వినూత్న పరిష్కారాలు,సేవలను పరిచయం చేసేందుకు సిద్ధమైన స్టార్టప్స్లో పెట్టుబడులు చేసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), ఇంక్యుబేటర్, స్టార్టప్స్ యాక్సిలరేటర్ అయిన వెంచర్ క్యాటలిస్ట్స్ ముందుకు వచ్చాయి. ఇరు సంస్థలు రూ.800 కోట్ల ప్రాపర్టీ టెక్నాలజీ ఫండ్ను ఏర్పాటు చేశాయి. సాంకేతికత, డేటా అనలిటిక్స్, బ్లాక్చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారంగా పరిశ్రమను మార్చగల సామర్థ్యం ఉన్న ప్రారంభ, వృద్ధి దశలో ఉన్న స్టార్టప్స్కు ఈ ఫండ్ ద్వారా నిధులను సమకూరుస్తాయి. గృహ, వాణిజ్య, సంస్థాగత, పారిశ్రామిక విభాగాలకు సేవలు అందించే స్టార్టప్స్లో పెట్టుబడి చేస్తాయి. ప్రస్తుతం భారత రియల్టీ రంగం 300 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి దోహదం చేస్తుందని క్రెడాయ్ తెలిపింది. క్రెడాయ్లో డెవలపర్స్, వెండార్స్, చానెల్ పార్ట్నర్స్, ప్రమోటర్స్ వంటి 256 విభాగాల నుంచి 13,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఓయో, బేసిక్, షేర్నెస్ట్, హోమ్ క్యాపిటల్ వంటి రియల్టీ రంగ స్టార్టప్స్లో వెంచర్ క్యాటలిస్ట్ పెట్టుబడి చేసింది. -
బ్లాక్చెయిన్ స్టార్టప్లకు అండగా జీఎంఆర్ ఇన్నోవెక్స్!
న్యూఢిల్లీ: బ్లాక్చెయిన్ విభాగంలో స్టార్టప్లకు తోడ్పాటు అందించేందుకు ఇన్ఫ్రా దిగ్గజం జీఎంఆర్ గ్రూప్లో భాగమైన జీఎంఆర్ ఇన్నోవెక్స్ తాజాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేసింది. విమానాశ్రయాలు, అనుబంధ వ్యాపారాల్లో బ్లాక్ చెయిన్ సాంకేతికత వినియోగానికి అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఐడియాల్యాబ్స్, పాలిగాన్, కాయిన్ఎర్త్, ఇండియా బ్లాక్చెయిన్ ఫోరం, వెరోయిన్స్ సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాపార దిగ్గజాలు, పరిశ్రమ నిపుణులు, టెక్నాలజీ భాగస్వాముల సహాయంతో జీఎంఆర్ ఇన్నోవెక్స్–బ్లాక్చెయిన్ సీవోఈ .. అంకుర సంస్థలను గుర్తించి, అవి వృద్ధి చెందేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తుందని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఈడీ (సౌత్) ఎస్జీకే కిషోర్ తెలిపారు. -
మూడేళ్లలో 869 స్టార్టప్లు
సాక్షి, అమరావతి: స్టార్టప్లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో గత ఆరేళ్లలో 1,133 స్టార్టప్లు ఏర్పాటు కాగా అందులో 869 వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాకే ఏర్పాటు కావడం గమనార్హం. టీడీపీ హయాంలో 264 స్టార్టప్లు వచ్చాయి. కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి సోంప్రకాష్ ఈ విషయాన్ని లోక్సభలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఆంధ్రప్రదేశ్లో స్టార్టప్లు వేగంగా ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. వీటి ద్వారా 11,243 మందికి ఉపాధి లభించినట్లు చెప్పారు. రూ.100 కోట్లతో ఫండ్ గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఏటా రెండు వందలకుపైగా స్టార్టప్లు ఏర్పాటు అవుతున్నాయి. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలోనే 164 ఏర్పాటు కావడం గమనార్హం. ‘యాక్సిలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ ద్వారా అంకుర స్టార్టప్లను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని రూపొందించింది. స్టార్టప్స్కు నిధులను సమకూరుస్తూ రూ.100 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ను ఏర్పాటు చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, 5జీ, సర్వ్లెస్ కంప్యూటింగ్ లాంటి అంశాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. స్టార్టప్స్ హబ్గా విశాఖ రాష్ట్రంలో స్టార్టప్స్ బూమ్ మొదలైందని, రానున్న కాలంలో మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కొత్త స్టార్టప్లను ఆకర్షించడంతో రాష్ట్రం ముందంజలో ఉన్నట్లు కేంద్ర మంత్రే స్వయంగా ప్రకటించారన్నారు. స్టార్టప్స్లను ప్రోత్సాహంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని, ఇందులో భాగంగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారని గుర్తు చేశారు. ‘కల్పతరువు’ పేరుతో విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇండస్ట్రీ–4 ఆవిష్కరణలను ప్రోత్సహించేలా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎస్టీపీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీల ఏర్పాటు ద్వారా స్టార్టప్స్ హబ్గా విశాఖపట్నం ఎదగనుంది. -
స్టార్టప్స్లోకి భారీగా తగ్గిన పెట్టుబడులు.. ఎంత శాతం అంటే!
న్యూఢిల్లీ: మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు తగ్గాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 17 శాతం క్షీణించి 6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 47,800 కోట్లు) పరిమితమయ్యాయి. పీజీఏ ల్యాబ్స్తో కలిసి ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘ఈ క్యాలెండర్ సంవత్సరం (2022) రెండో త్రైమాసికంలో 16 భారీ డీల్స్ కుదిరాయి. వీటి ద్వారా 6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ వ్యవధిలో కొత్తగా 4 యూనికార్న్ సంస్థలు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గలవి) ఏర్పడ్డాయి. దీనితో ప్రథమార్ధంలో మొత్తం యూనికార్న్ల సంఖ్య 20కి చేరింది. వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 26 శాతం భాగం ఫిన్టెక్ విభాగం దక్కించుకుంది’ అని నివేదిక వివరించింది. క్రెడ్, డైలీహంట్ వంటి సంస్థల్లోకి భారీగా నిధులు రావడంతో ఫిన్టెక్, మీడియా.. వినోద రంగాల్లోకి వచ్చే పెట్టుబడుల పరిమాణం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. క్యూ2లో వచ్చిన పెట్టుబడుల్లో ఈ విభాగాలు 45 శాతం వాటా దక్కించుకున్నాయని తెలిపింది. మొత్తం ఫండింగ్లో 58 శాతం పెట్టుబడులు .. వృద్ధి దశలో ఉన్న సంస్థల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఒక నిర్దిష్ట స్థాయికి చేరిన స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపినట్లు నివేదిక వివరించింది. -
కష్టకాలంలోనూ ఎగురుతున్న గుర్రాలు
కనీసం వందకోట్ల డాలర్ల విలువను సాధించగలిగిన స్టార్టప్ సంస్థలను యూనికార్న్లు అంటున్నారు. 2022 నాటికి భారత్ 100 యూనికార్న్ల మైలురాయిని తాకింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇవి ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అమెరికా, చైనా తర్వాత ఎక్కువ యూనికార్న్లను కలిగిన దేశం మనదే. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను వీటి అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్ల శరవేగ వ్యాప్తి గురించి అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. ఉక్రెయిన్లో సైనిక సంఘర్షణ, పెరుగుతున్న అంతర్జాతీయ వడ్డీరేట్లు అనే ద్వంద్వ తాకిడి నుంచి కోలుకోవడానికి ఆర్థిక వ్యవస్థ మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ, ఒక రంగం మాత్రం శరవేగంగా పెరుగుతోంది. బాహ్య పరిణామాలకు ఈ రంగం ఏమాత్రం ప్రభావితం కానట్లు కనిపిస్తోంది. ఆ రంగం ఏదో కాదు, యూనికార్న్లు అని పేరొందిన భారీ స్టార్టప్ సంస్థలు. ఈ సంవత్సరం భారత్ 100 యూనికార్న్ల మైలురాయిని తాకింది. 2011లో దేశంలో తొలి స్టార్టప్ వెంచర్ యూనికార్న్గా మారి దశాబ్దం గడిచింది. ఇప్పుడు అమెరికా, చైనాల తర్వాత యూనికార్న్ సంస్థలు అధికంగా ఉన్న మూడో దేశంగా భారత్ ఆవిర్భవించింది. ఉమ్మడిగా చూస్తే ఈ వంద స్టార్టప్ సంస్థలు 90 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయి. వీటి మొత్తం విలువ ఇప్పుడు 333 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ఒక బిలియన్ డాలర్ల విలువను మార్కెట్లో సాధించిన స్టార్టప్ కంపెనీని యూనికార్న్ అని పిలుస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం ఇలాంటి వెంచర్లు చాలా అరుదుగా ఉండేవి కాబట్టి పూర్వకాలపు పౌరాణిక ఒంటికొమ్ము రెక్కల గుర్రాల్లాగా వీటిని వర్ణించేవారు. కానీ ఇప్పుడు, అమెరికా 487 యూనికార్న్ సంస్థలనూ, చైనా 301 సంస్థలనూ కలిగి ఉన్నాయి. ఇప్పుడు యూనికార్న్ అనే పదం డెకాకార్న్ వరకు విస్తరిస్తోంది. అంటే కనీసం 10 బిలియన్ డాలర్ల విలువ గల సంస్థలుగా ఇవి ఎదుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఫ్లిప్కార్ట్, నైకా, బైజూస్, స్విగ్గీ వంటి కొన్ని స్టార్టప్ సంస్థలు 10 బిలియన్ డాలర్ల నిధులు సేకరించిన వెంచర్లుగా నమోదయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2020 సంవత్సరం నుంచే యూనికార్న్ వెంచర్లు బాగా పెరుగుతూండటమే. మరో మాటలో చెప్పాలంటే, మహమ్మారి తర్వాతే ఇవి విస్తరిస్తున్నాయి. ఆ సంవత్సరం దేశంలో 11 యూనికార్న్ సంస్థలు ఆవిర్బవించాయి. 2021లో వీటి సంఖ్య రికార్డు స్థాయిలో 44. ఈ ఏడాది గత ఆరునెలల కాలంలో 16 ఏర్పడటం విశేషం. ‘ఇంక్42’ సంస్థ ప్రకారం, 2025 నాటికి దేశంలో 250 యూనికార్న్లు ఏర్పడతాయని అంచనా. ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ దూకుడుగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల యూనికార్న్లలో ఫండింగ్ కాస్త తగ్గుముఖం పట్టింది కానీ, 2022లో కూడా ఇన్నోవేషన్, స్టార్టప్ల ఎకో–సిస్టమ్ ఇప్పటికీ వికాస దశలోనే సాగుతోంది. ఫండింగ్కి సంబంధించి కాస్త ఆందోళన ఉన్నప్పటికీ అనేక స్టార్టప్లు ఈ సంవత్సరం కూడా యూనికార్న్ క్లబ్లో చేరనున్నాయి. మహమ్మారి కాలంలో ఆఫీసుకు నేరుగా వెళ్లి పనిచేసే పద్ధతి నుంచి, ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి ప్రపంచం మారిపోయింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి... ఇంటర్నెట్, డిజిటల్ ప్లాట్ఫామ్లవైపు సృజనాత్మక ఆవిష్కరణలను మళ్లించింది. ఇళ్లనుంచి బయటకు వెళ్లడంలో అవరోధాలు ఏర్పడటంతో ప్రజాజీవితంలో ఇంటర్నెట్ మరింత పెద్ద పాత్ర వహించే స్థాయికి పరిణమించింది. కాబట్టి రిటైల్ కొనుగోళ్లు చేయడం, ఆర్థిక లావాదేవీలను సాగించడం, బిజినెస్ను నిర్వహించడంతో పాటు విద్య సైతం ఆన్లైన్ యాక్టివిటీగా మారిపోయింది. పేటీఎం, మొబివిక్ వంటి ఫిన్టెక్ కంపెనీల ద్వారా... ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ కంపెనీల ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తృతరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్కెట్ వంటి తాజా స్టార్టప్లు దేశంలోని 2వ, 3వ శ్రేణి నగరాల్లో వేగంగా విస్తరించాయి. యూనికార్న్ ప్రపంచం విస్తరణకు మరొక కారణం సులభమైన ఫండింగ్. దేశంలో డిజిటల్ ఎకో సిస్టమ్ విస్తరణకు అపారమైన అవకాశం ఉంటుందని మదుపుదారులు గ్రహిస్తున్నారు. దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి ఇప్పటికీ సాపేక్షికంగా తక్కువ స్థాయిలో, అంటే 41 శాతంగానే కొనసాగుతోంది. అంటే ఈ రంగంలో పెరుగుదలకు అపారమైన అవకాశాలు ఉన్నట్లే లెక్క. అయితే ఆన్లైన్ స్పేస్లో వినియోగదారుల సంఖ్య ఇప్పటికీ ఏడు శాతంగా మాత్రమే నమోదైంది. వాట్సాప్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫాంలను ఉపయోగిస్తున్న వారు సైతం ఫిజికల్ రిటైల్ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారని తాజా డేటా చెబుతోంది. దేశంలోని 44 కోట్లమంది వాట్సాప్ యూజర్లలో 15 శాతంమంది మాత్రమే ఆన్లైన్లో కొంటున్నారు. ఈ నేపథ్యంలో, వచ్చే అయిదు లేదా పది సంవత్సరాల కాలంలో వెంచర్ కేపిటల్ ఫండ్స్ దీర్ఘకాలిక అంచనాల ప్రాతిపదికపై మదుపు పెట్టడానికి సిద్ధపడటం ఖాయం అని తేలుతోంది. గత సంవత్సరం నుంచి చైనాలో టెక్ కంపెనీలపై రెగ్యులేటరీ నిబంధనలను పెంచుతున్న నేపథ్యంలోనే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. దీంతో వెంచర్ కేపిటలిస్టులు మన దేశంలోని పరిణామాలపై తాజాగా దృష్టి సారిస్తున్నారు. మొత్తంమీద చూస్తే, లాభదాయకమైన ఐడియాలపైనే మదుపుదారులు డబ్బు పెడతారన్నది నిజం. గత కొన్ని సంవత్సరాల్లో ప్రారంభమైన అనేక స్టార్టప్ సంస్థలు ఫిన్టెక్, ఈ–కామర్స్ లేదా సాఫ్ట్వేర్ సర్వీస్ కేటగిరీల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించాయి. వీటిని పరిష్కరించాల్సి ఉంది. కొన్ని సమస్యలను ఎంపిక చేయడం కష్టమే అవుతుంది గానీ, నైకా సంస్థ ఆన్లెన్ మార్కెట్లో సౌందర్య ఉత్పత్తుల విషయంలో గ్యాప్ ఉన్నట్లు కనుగొన్నది. అలాగే చిన్న చిన్న వ్యాపారాలకు కూడా మార్కెట్లో స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని మీషో సంస్థ కనుగొంది. దేశంలో అత్యధిక సంఖ్యలో యూనికార్న్లను (33) కలిగి ఉన్న ఫిన్ టెక్ సంస్థలు రిటైల్ వినియోగదారులతోపాటు వ్యాపార సంస్థల డిజిటల్ చెల్లింపుల అవసరాలను కూడా పూరించడంలో అధిక కృషి చేస్తున్నాయి. ఆన్లైన్ బిజినెస్లలో ఉన్న ఖాళీలను పూరించడంలో సాయపడేందుకు ‘సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్’ స్టార్టప్లు ముందుకొస్తున్నాయి. ఎడ్యుకేషన్ లేదా ఎడ్టెక్ వెంచర్లుగా పేరొందిన సంస్థలు బైజూస్ వంటి డెకాకార్న్ల వికాసానికి దారితీశాయి. మహమ్మారి కాలంలో ఆరోగ్య సంరక్షణ మరో ప్రాధాన్య రంగంగా ముందుకొచ్చింది. ఆరోగ్య రంగంలో పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం వల్ల ఇన్నోవస్సెర్, ఫార్మియాసీ, క్యూర్ఫిట్, ప్రిస్టిన్ కేర్ వంటి శైశవదశలోని యూనికార్న్ల ఆవిర్భావానికి తావిచ్చాయి. యూనికార్న్లు ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యకరమైన విభాగంగా ఉంటున్నాయనడంలో సందేహమే లేదు. ప్రత్యేకించి ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్లతో ఆర్థిక వృద్ధికి దెబ్బ తగులుతూ, స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్న తరుణంలో ఇవి విశిష్ట పాత్రను పోషిస్తున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత వంటి కీలకమైన సమస్యలను యూనికార్న్ల అభివృద్ధి పరిష్కరించలేదన్నది వాస్తవం. కాబట్టి యూనికార్న్ల శరవేగ అభివృద్ధి గురించి మరీ అతిశయించి చెబితే అది వాస్తవానికి భిన్నంగా ఉంటుందని కూడా గుర్తించాలి. కొన్ని యూనికార్న్లు హైరింగ్ రంగంలో అడుగుపెట్టాయి. అయితే మొత్తం ఉపాధిరంగంలో తమదైన పాత్ర పోషించడానికి తగినంత పెద్ద మొత్తంలో ఇలాంటి వెంచర్లకు నిధులు లభ్యం కావడం లేదన్నది వాస్తవం. అదే సమయంలో, స్టార్టప్లు, యూనికార్న్లు, డెకాకార్న్ల వంటి వెంచర్లను దీర్ఘకాలిక దృష్టితోనే అంచనా వేయాలి. కాలం గడిచేకొద్దీ ఈ తరహా వెంచర్లు దేశాన్ని మరింత వేగంగా డిజిటల్ యుగంలోకి తీసుకెళతాయి. అంతే కాకుండా అంతిమంగా అసమానతలను తగ్గించడం వైపు దేశాన్ని నడిపిస్తాయి. అంతిమంగా, యూనికార్న్లను ఒంటరి ద్వీపాల్లాగా చూడకూడదు. దేశ వాణిజ్య వాతావరణంలో సానుకూల మార్పులను తీసుకొచ్చే ఉత్ప్రేరకాలుగా ఇవి పనిచేస్తాయి. సాంకేతికత ఆధారంగా పనిచేసే స్టార్టప్లు వేటికవి విడివిడిగా ఉంటాయి కానీ సాంప్రదాయికమైన ఇటుకలు, ఫిరంగి తయారీ పరిశ్రమల్లో సైతం ఇవి సృజనాత్మకతను పెంచుతున్నాయి. ‘బిగ్ టెక్’ కంపెనీ విదేశాల్లోనూ స్టార్టప్ల నుంచే ఆవిర్భవించింది. ప్రపంచమంతటా ఇప్పుడు స్టార్టప్ల రాజ్యం నడుస్తోంది. సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త ఫైనాన్షియల్ జర్నలిస్టు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పొంటాక్తో టీ–హబ్ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక ఆధారిత స్టార్టప్లకు ఊతమివ్వడం ద్వారా దేశంలోని ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహమిచ్చేందుకు ‘టీ–హబ్’మరో కీలక అడుగు ముందుకేసింది. బ్రిటన్, అమెరికా, భారత్, కెనడాలో ఆవిష్కరణల నిధిని సమకూర్చడంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పొంటాక్ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో టీ–హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, పొంటాక్ మేనేజింగ్ పార్ట్నర్ ప్రేమ్ పార్థసారథి ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ఏడాది పాటు అమల్లో ఉండే ఈ ఒప్పందంలో భాగంగా టీ–హబ్ కొత్త భవన్లో పొంటాక్ నూతన శాఖ ఏర్పాటుకు వీలుగా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. టీ–హబ్లో పురుడు పోసుకునే స్టార్టప్లను యూకే మార్కెట్తో అనుసంధానం చేసేందుకు వీలుగా పొంటాక్ టీ–హబ్తో కలిసి నిధులు సమకూరుస్తుంది. యూకే, భారత్లో స్టార్టప్లు మరింత వృద్ధి, మరిన్ని నిధులకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని శ్రీనివాస్రావు తెలిపారు. పొంటాక్ ఇప్పటికే రాష్ట్రంలోని నాలుగు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిందని, ఈ ఏడాది చివరిలోగా మరో ఐదు కంపెనీల్లో పెట్టుబడులు పెడతామని ప్రేమ్ పార్థసారథి వెల్లడించారు. పొంటాక్ అనుబంధ కంపెనీలు మైనీబో, మాక్స్బైట్ ద్వారా స్థానికంగా రాబోయే రోజుల్లో 5వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. -
భారత్లో గూగుల్ స్టార్టప్ స్కూల్
న్యూఢిల్లీ: అంకుర సంస్థలు ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, నిలదొక్కుకునేందుకు తోడ్పాటు అందించే దిశగా టెక్ దిగ్గజం గూగుల్.. భారత్లో స్టార్టప్ స్కూల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో దాదాపు 10,000 స్టార్టప్లకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాం వర్చువల్గా తొమ్మిది వారాల పాటు ఉంటుంది. మెరుగైన ఉత్పత్తిని సమర్థంగా రూపొందించేందుకు వ్యూహాలు, కొత్తగా ఇంటర్నెట్కు పరిచయమయ్యే యూజర్ల కోసం యాప్ల రూపకల్పన, కొత్త యూజర్లను దక్కించుకునేందుకు పాటించాల్సిన వ్యూహాలు మొదలైన వాటిలో ఇందులో శిక్షణ పొందవచ్చు. అలాగే స్టార్టప్ వ్యవస్థకు సంబంధించిన పలువురు దిగ్గజాలతో చర్చా కార్యక్రమాలు మొదలైనవి కూడా ఉంటాయి. దాదాపు 70,000 పైచిలుకు అంకుర సంస్థలతో స్టార్టప్ల విషయంలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచే కాకుండా చిన్న పట్టణాల నుంచి కూడా అనేకానేక స్టార్టప్లు వస్తున్నాయి. అయితే, 90 శాతం స్టార్టప్లు తొలి అయిదేళ్లలోనే మూతబడుతున్నాయి. ఖర్చులపై అదుపు లేకపోవడం, డిమాండ్ను సరిగ్గా అంచనా వేసుకోలేకపోవడం, సారథ్యం సరిగ్గా లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయని గూగుల్ ఒక బ్లాగ్పోస్ట్లో వివరించింది. ఇలాంటి సవాళ్లను అధిగమించి అంకుర సంస్థలు నిలదొక్కుకోవడంలో సహకరించే లక్ష్యంతోనే స్టార్టప్ స్కూల్ను తలపెట్టినట్లు పేర్కొంది. -
స్టార్టప్ ర్యాంకులు: కమింగ్ సూన్
సాక్షి, న్యూఢిల్లీ: స్టార్టప్ వ్యవస్థకు దన్నుగా నిబంధనల వాతావరణాన్ని సులభతరం చేసే బాటలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్స్ విడుదల చేయనుంది. ఈ ఏడాది 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం స్టార్టప్ ఎకో సిస్టమ్లో రాష్ట్రాలవారీగా సోమవారం(4న) ర్యాంకులను ప్రకటించ నుంది. ఇది మూడో ఎడిషన్ కాగా.. అంతక్రితం 2020 సెప్టెంబర్లో ర్యాంకులను ప్రకటించింది. గుజరాత్ టాప్ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్.. స్టార్టప్ ఎకోసిస్టమ్కు అండగా నిలిచిన రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా ర్యాంకులను విడుదల చేయనున్నారు. పోటీ, సహకార సమాఖ్య విధానాల ద్వారా దేశీ విజన్ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) ర్యాంకింగ్ను చేపట్టింది. స్టార్టప్ల వృద్ధికి అనుగుణంగా సరళతర నియంత్రణల అమలుతోపాటు వ్యవస్థ పటిష్టతకు మద్దతుగా నిలిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో తొలుత 2018లో ర్యాంకింగ్ విధానానికి తెరతీసింది. -
4 ఏళ్లలో 122 యూనికార్న్లు
ముంబై: ప్రపంచవ్యాప్తంగా లిక్విడిటీ పరిస్థితులు ఆవిరౌతున్న(ఫండింగ్ వింటర్) నేపథ్యంలోనూ దేశీయంగా స్టార్టప్ వ్యవస్థ బలపడే వీలున్నట్లు హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. రానున్న నాలుగేళ్లలో బిలియన్ డాలర్ల విలువ అందుకోగల స్టార్టప్ల సంఖ్య పెరగనున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. దీంతో కొత్తగా 122 సంస్థలు యూనికార్న్లుగా ఆవిర్భవించనున్నట్లు అంచనా వేసింది. తద్వారా దేశీయంగా యూనికార్న్ల సంఖ్య 200ను మించనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను సాధించే స్టార్టప్లను యూనికార్న్లుగా పిలిచే సంగతి తెలిసిందే. ఏడాది క్రితం 51గా నమోదైన యూనికార్న్ల సంఖ్య ప్రస్తుతం 84కు చేరినట్లు ప్రస్తావించింది. ఇప్పటికే 20 కోట్ల డాలర్లకుపైగా విలువ సాధించిన స్టార్టప్లు మరో 122 ఉన్నట్లు వెల్లడించింది. ఇవి రానున్న రెండు నుంచి నాలుగేళ్లలో యూనికార్న్లుగా ఎదిగే వీలున్నట్లు పేర్కొంది. 36 శాతం అప్ స్టార్టప్ ఎకోసిస్టమ్పై ‘ఫండింగ్ వింటర్’ ప్రభావం చూపగలదని ఏఎస్కే ప్రయివేట్ వెల్త్తో జత కట్టిన హురూన్ ఇండియా.. ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ 2022 పేరుతో రూపొందించిన నివేదికలో అభిప్రాయపడింది. కఠిన పరపతి విధానాలతో ఇటీవల అంతర్జాతీయంగా లిక్విడిటీ తగ్గుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. గతేడాదితో పోలిస్తే 36 శాతం విలువను పెంచుకున్న 122 స్టార్టప్ల విలువ 49 బిలియన్ డాలర్లకు చేరిన ట్లు వెల్లడించింది. ఈ సంస్థలు బిలియన్ డాలర్ల విలువను అందుకోగలవని అభిప్రాయపడింది. ఈ సంస్థలు ప్రస్తుతం 82,300 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. స్టార్టప్లకు పెట్టుబడులు అందిస్తున్న సంస్థలలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ సీక్వోయా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పేÆ ö్కంది. భవిష్యత్ యూనికార్న్లు 122లో 39 సంస్థలకు సీక్వోయా నిధులు అందించినట్లు వెల్లడించింది. ఈ బాటలో టైగర్ గ్లోబల్ 27 సంస్థలలో పెట్టుబడుల ద్వారా తదుపరి నిలిచినట్లు తెలియజేసింది. రెండేళ్లలో... తాజాగా రూపొందించిన జాబితాలోని 122 స్టార్టప్లలో 51 సంస్థలు రెండేళ్లలోనే బిలియన్ డాలర్ల విలువను సాధించే వీలున్నట్లు నివేదిక అంచనా వేసింది. తదుపరి మరో రెండేళ్లలో మిగిలిన 71 స్టా ర్టప్లు యూనికార్న్లుగా ఆవిర్భవించవచ్చని తెలి యజేసింది. 2017లో ఏర్పాటైన లాజిస్టిక్స్ టెక్ స్టార్టప్ షిప్రాకెట్ ముందుగా ఈ హోదాకు చేరే వీలున్నట్లు పేర్కొంది. ఇదేవిధంగా క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో, ఈకామర్స్ సంస్థ టర్టిల్మింట్ వేగ వంత వృద్ధి సాధించనున్నట్లు అభిప్రాయపడింది. -
ఆరంభ స్టార్టప్ల కోసం 130 మిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘ఫండమెంటల్ వీసీ’ ఆరంభ స్థాయిలోని స్టార్టప్ల కోసం 130 మిలియన్ డాలర్లతో (రూ.100 కోట్లు) నిధిని ప్రారంభించినట్టు ప్రకటించింది. కన్జ్యూమర్ ఇంటర్నెట్, ఆరోగ్య సంరక్షణ, బీమా, ఫైనాన్షియల్ సర్వీసెస్, సాస్, గేమింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్లకు పెట్టుబడులు అందిస్తామని తెలిపింది. ఈ ఏడాది మార్చిలోనే సెబీ నుంచి ఈ సంస్థకు అనుమతి లభించింది. ఒక్కో స్టార్టప్లో ఈ ఫండ్ 1.5 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెడుతుంది. వచ్చే రెండేళ్లలో 30 స్టార్టప్లకు మద్దతుగా నిలవాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. -
స్టార్టప్లతో 10 కోట్ల కొలువులు
న్యూఢిల్లీ: దేశీ డిజిటల్ వ్యవస్థ తోడ్పాటుతో అంకుర సంస్థలు రాబోయే రోజుల్లో 10 కోట్ల పైచిలుకు ఉద్యోగాలను సృష్టించగలవని వెంచర్ క్యాపిటల్ సంస్థ సెకోయా క్యాపిటల్ ఎండీ రాజన్ ఆనందన్ చెప్పారు. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే దేశీ స్టార్టప్లు ప్రధానంగా కార్పొరేట్ గవర్నెన్స్పై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ‘గత కొన్నాళ్లుగా కార్పొరేట్ గవర్నెన్స్కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదగాలంటే ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటించాలి. ఇందుకు సంబంధించి పాటించాల్సిన ప్రక్రియలు, క్రమశిక్షణ మొదలైన వాటి గురించి వ్యవస్థాపకుల్లో అవగాహన పెంచుతున్నాం‘ అని ఆనందన్ వివరించారు. సెకోయా ఇన్వెస్ట్ చేసిన భారత్పే, జిలింగో సంస్థల్లో కార్పొరేట్ గవర్నెన్స్పరమైన సమస్యలు బైటపడిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ అంశాల ఊతంతో అమెరికా, భారత్, చైనా తదితర దేశాల్లోని స్టార్టప్ వ్యవస్థల్లోకి భారీగా నిధులు వచ్చిపడ్డాయని ఆనందన్ చెప్పారు. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ చైనా వ్యవస్థలోకి గతేడాది దాదాపు 130 బిలియన్ డాలర్లు, అలాగే భారత స్టార్టప్ సంస్థల్లోకి 40 బిలియన్ డాలర్లు వచ్చినట్లు వివరించారు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ మారిపోయాయని ఆనందన్ చెప్పారు. ‘ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కూడా రేట్లు వేగంగా పెంచవచ్చు. ఎకానమీలోకి కుమ్మరించిన 7 లక్షల కోట్ల డాలర్లలో సింహభాగాన్ని వెనక్కి తీసుకోవచ్చు‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇంతటి కష్ట పరిస్థితుల్లో కూడా స్టార్టప్లు ఎదిగేందుకు మార్గాలు అన్వేషించాలని సూచించారు. -
స్టార్టప్లకు గడ్డుకాలం.. ఉద్యోగాలన్నీ హుష్ కాకి..
ద్రవ్యోల్బణంతో సతమతం అవుతుంటే కొత్తగా ఉద్యోగాల్లోనూ ఇబ్బందులు మొదలవుతున్నాయి. కోటి ఆశలతో మొదలైన స్టార్టప్ కంపెనీలో నష్టాలతో విలవిలాడుతున్నాయ్. ఆర్థిక భారం తగ్గించుకునే యత్నంలో నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయ్. భవిష్యత్తు ఆశాకిరణాల్లా కనిపించిన కంపెనీలే ఉద్యోగులపాలిట అశనిపాతాల్లా మారాయి. దేశవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ బేస్డ్ సేవలు ప్రధానంగా వచ్చిన కొత్త కంపెనీల అడుగులు తడబడుతున్నాయ్. కరోనా ఎఫెక్ట్ తగ్గిపోయిన తర్వాత కంపెనీల పనితీరు ట్రాక్ తప్పుతోంది. నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రతీ నెల క్రమం తప్పకుండా నష్టాలు పలకరించి వెళ్తున్నాయ్. దీంతో ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కాస్ట్ కట్టింగ్ వైపు స్టార్టప్ కంపెనీలు చూస్తున్నాయి. రీ స్ట్రక్చర్ వంకతో దేశవ్యాప్తంగా స్టార్టప్లు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఏడాదిలో ఇప్పటి వరకు పాపులర్ అయిన స్టార్టప్ కంపెనీల్లోనే ఏకంగా 10,500ల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపారు. నష్టాల పేరు చెబుతూ కంపెనీ పునర్మిణాం పేరిట వీళ్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ ఏడాది ఆరంభంలో మొదలైన తొలగింపు చర్యలు మే వచ్చే సరికి ఎక్కువై పోయాయి. రోజుకో స్టార్టప్ కంపెనీ నుంచి ఉద్యోగుల తొలగింపు ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. పాపులర్ స్టార్టప్లలోనూ దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బ్రాండ్గా ఓలాకు పేరుంది. ముఖ్యంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సూపర్ సక్సెస్ అయ్యింది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు గమనిస్తే జనవరి నుంచి జూన్ వరకు ఓలా ఏకంగా 2100 మంది సిబ్బందిని విధుల నుంచి తొలగించింది. ఇక యూట్యూబ్ ఆన్ చేసినా ఏ టీవీ ఛానల్ చూసినా కనిపించే అన్ అకాడమీ అనే ఎడ్యుటెక్ కంపెనీ 750 మందికి గుడ్బై చెప్పింది. తిరుగులేని కంపెనీగా పేరున్న ఓలా, అన్అకాడమీ పరిస్థితే ఇలా ఉంటే చోటామోటా స్టార్టప్లు ఇంకా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. వీళ్లు కొంత సేఫ్ స్టార్టప్ల బిజినెస్లు అనుకున్నంతగా పుంజుకోకపోవడంతో ఉద్యోగులపై వేటు తప్పడం లేదు. ప్రస్తుతం జాబ్లు కోల్పోతున్న వారిని పరిశీలిస్తే.. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇంజనీరింగ్, ప్రొడక్టు విభాగంలో కొంత మెరుగైన ఉద్యోగ భద్రత లభిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భారీగా తగ్గిపోయి ప్రైవేటు సెక్టారే శరణ్యం అనే పరిస్థితులు నెలకొనగా.. స్టార్టప్లు సైతం చేతులు ఎత్తేడయంతో నిరుద్యోగ సమస్య పెనుభూతంగా మారే పరిస్థితులు ఎదురవడానికి ఎంతో దూరం లేదని నిపుణులు అంటున్నారు. తొలగింపే పరిష్కారమా? మార్కెట్లో నిలదొక్కుకున్న కంపెనీలుగా గుర్తింపు దక్కించుకున్న మీషో, వేదాంతూ, బ్లింకిట్, కార్24 వంటి సంస్థలు కూడా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికే వస్తున్న నష్టాల పట్ల వెంచర్ క్యాపిటలిస్టులు ఆందోళన వ్యక్తం చేయడంతో మరిన్ని నిధులు సాధించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆర్థిక భారం మరింత ముదరకుండా ఉద్యోగుల తొలగింపే మేలైన పరిష్కారం అనే భావనలోకి స్టార్టప్లు వస్తున్నాయి. చదవండి: అగ్నివీరులకు కార్పొరేట్ల రెడ్ కార్పెట్: ఉద్యోగాలు పెరుగుతాయి! -
యూనికార్న్ స్టార్టప్స్ హబ్గా విశాఖ
దావోస్: యూనికార్న్ స్టార్టప్స్ హబ్గా విశాఖను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వివిధ స్టార్టప్స్కు చెందిన వ్యవస్థాపకులు, సీఓలు, వీటికి సంబంధించిన ముఖ్య అధికారులతో దావోస్లో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఏపీలో స్టార్టప్స్ కంపెనీల ఏర్పాటు, వాటి అభివృద్ధిపై చర్చించారు. విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం జగన్ తెలిపారు. ఇక్కడ పెట్టుబడులకు మీ అందరికీ ఏపీ ఆహ్వానం పలుకుతోందని ఆయన వెల్లడించారు. విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై వారితో సీఎం చర్చించారు. స్టార్టప్లు అభివృద్ధిచెందడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. విద్యారంగం ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్పాలసీ సుష్మిత్ సర్కార్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యకు సంబంధించి పరిశోధక, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా బైజూస్ పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామన్నారు. భూ సర్వే ఏపీలో సమగ్ర భూసర్వే, రికార్డులు భద్రపరచడం.. ఈ అంశాలతో ముడిపడిన సాంకేతిక పరిజ్ఞానం తదితర విషయాలపై కాయిన్స్విచ్ క్యూబర్ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ సింఘాల్తో సీఎం జగన్ చర్చించారు. అనంతరం సింఘాల్ మాట్లాడుతూ.. సమగ్ర భూ సర్వే రికార్డులు నిక్షిప్తం చేయడంతో ఏపీ సర్కారుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. టూరిజం ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టితో సీఎం సమావేశమయ్యారు. ఇందులో ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రశాంత్ పిట్టి మట్లాడుతూ.. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి అభివృద్ధికి తమవంతు చేయూత అందిస్తామన్నారు. అంతేకాదు ఏపీలోని పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపు తీసుకువస్తామని వెల్లడించారు. మరింత మంది దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్ ఉన్నారు. చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు -
పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ ఐటీ కంపెనీలు..బాబోయ్ వద్దంటున్న ఉద్యోగులు!
కరోనా కొంత మంది ఉద్యోగాలు ఊడేలా చేస్తే.. ఫ్రెషర్స్కు మాత్రం బంపరాఫర్ ఇస్తోంది.మా ఆఫీస్లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్కు తగ్గట్లు ప్యాకేజీ ఇస్తాం. కాదు..కూడదు అంటే అంతకంటే ఎక్కువ ఇస్తాం అంటూ దిగ్గజ సంస్థలు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. కానీ ఫ్రెషర్స్, ప్రస్తుతం ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. అందుకు కారణం ఏంటీ? అసలు ఐటీ కంపెనీల లోపల ఏం జరుగుతుంది. ఫ్రెషర్స్, ఉద్యోగులు సైతం మా ఆఫీస్లో జాయిన్ అవ్వండి. మీ టాలెంట్కు జీతాలిస్తాం. కాదు..కూడదు అంటే అంతకంటే ఎక్కువ ఇస్తామంటూ దిగ్గజ ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్కు పిలిచి మరి ఉద్యోగాలిస్తున్నాయి. దీంతో పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలీటీతో పాటు ఇంకా మరెన్నో ఆఫర్లు అందిస్తున్నాయి. కానీ ఆఫర్ లెటర్లు అందుకున్న ఫ్రెషర్స్ సైతం..ఆ ఆఫర్లను వద్దనుకుంటున్నారు. అందుకు కారణం అప్డేట్ అవుతున్న టెక్నాలజీయేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకీ పుట్టుకొస్తున్న కొత్త కొత్త టెక్నాలజీ కోర్స్లు నేర్చుకొని స్టార్టప్లలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కోవిడ్ సమయంలో విధించిన నిబంధనలు, అప్డేట్ అవుతున్న టెక్నాలజీల వల్ల తలెత్తే ఇబ్బందులు, జీతాల వంటి ఇతర కారణాల వల్ల చేస్తున్న ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నారు.స్టార్టప్స్లో చేరుతున్నారు. స్టార్టప్స్ జపం ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావ్ మాట్లాడుతూ..ఉద్యోగుల నిర్ణయాన్ని బట్టి వారికి నచ్చేలా ఉద్యోగాలు, ప్రమోషన్లు,జీతాలతో..స్టార్టప్లు,యూనికార్న్ సంస్థలు ఆకర్షిస్తున్నాయి. అంతెందుకు యూనికార్న్ కంపెనీలు సైతం మా కంపెనీ(ఇన్ఫోసిస్) ఉద్యోగులకు అవకాశం ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయని ప్రవీణ్ రావు అన్నారు.కాబట్టే టీసీఎస్, ఇన్ఫోసిస్తో పాటు ఇతర దిగ్గజ కంపెనీలు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తూ ఫ్రెషర్స్ను నియమించుకుంటూనే..అట్రిషన్ రేట్ తగ్గించుకునేందుకు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తున్నాయి. కారణం అదే కరోనా కారణంగా దేశంలో డిజిటల్ ట్రాన్సర్మేషన్ అంటే చేసే బిజినెస్, కల్చర్, కొత్త ప్రాజెక్ట్లను దక్కించుకునేందుకు కావాల్సిన మార్కెట్ రిక్వైర్ మెంట్స్ మారిపోయాయి. దీంతో సాఫ్ట్వేర్తో పాటు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కోర్స్లు నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థల్లో జీతాలు ఎక్కువగా ఉన్నా..వారికి నచ్చిన జాబ్లో జాయిన్ అవుతున్నారు. కాబట్టే ఇన్ఫోసిస్,టీసీఎస్ వంటి టెక్ కంపెనీలలో ఉద్యోగులు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్క ఇన్ఫోసిస్లోనే గత ఆర్థిక సంవత్సరానికిగాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ఇన్ఫోసిస్ ప్రకటించింది. మూడో త్రైమాసికం 25.5 శాతంతో పోల్చితే నాలుగో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 27.7 శాతానికి పెరిగింది. అట్రిషన్ రేట్ తగ్గించేందుకు ఈనెల నుంచి ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాల్ని భారీ ఎత్తున పెంచనుంది. ఇక ఇక గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 85,000 మంది ఫ్రెషర్లను నియమించుకోగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50,000 మందిని నియమించుకోనేందుకు ఇన్ఫోసిస్ చూస్తోంది. ఎంతమందిని నియమించుకున్నాయంటే? ఫైనాన్షియల్ ఇయర్ 2022లో టీసీఎస్ 1.03లక్షల మందిని..మూడు నెలల్లో ఎక్కువ మంది నియమించుకుంది. దీంతో మొత్తం 6లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చదవండి: జోరుగా..హుషారుగా! ఐటీ రంగంలో ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు! -
అగ్రి స్టార్టప్స్లో పెట్టుబడుల స్పీడ్
న్యూఢిల్లీ: దేశీయంగా నాలుగేళ్లలో అగ్రిటెక్ స్టార్టప్లు పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. 2020 కల్లా వీటిలో రూ. 6,600 కోట్ల పెట్టుబడులు ప్రవహించినట్లు తెలియజేసింది. వ్యవసాయ సంబంధ వేల్యూ చైన్లో సామర్థ్యాలను మెరుగుపరచగల అగ్రిటెక్ స్టార్టప్స్కు అపార వృద్ధి అవకాశాలుండటం ఇందుకు దోహదపడుతున్నట్లు తెలియజేసింది. గతంలో దేశీ వ్యవసాయ రంగం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చింది. అయితే కొత్త సాంకేతికతలు ప్రవేశించడంతోపాటు.. ఖచ్చితమైన సమా చారం అందుబాటులోకి రావడంతో కొత్త వృద్ధి దశలోకి మళ్లినట్లు వివరించింది. ‘దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఆవిష్కరణలు– వ్యవసాయం, గ్రామీణ ఫైనాన్స్లో సమీకృత వృద్ధికి ఊతమిస్తున్న బిజినెస్ విధానాలు’ పేరుతో వెలువడిన నివేదిక ఇంకా పలు అంశాలను ప్రస్తావించింది. బెయిన్ అండ్ కంపెనీ, సీఐఐ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. వీటి ద్వారా రానున్న కొన్నేళ్లలో దేశీ వ్యవసాయ రంగం భారీ మార్పుల (ట్రాన్స్ఫార్మేషన్)కు లోనుకానున్నట్లు అంచనా వేసింది. ఎఫ్పీవోలకు పాత్ర దేశ వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న చర్యలు గ్రామీణ వేల్యూ చైన్లో రైతు ఉత్పాదక సంస్థల(ఎఫ్పీవోలు) పాత్రను మరింత విస్తృతం చేయనున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. పంటల దిగుబడి తదుపరి మౌలిక సదుపాయాలను విస్తరించనున్నాయి. రియల్ టైమ్ గణాంకాలు, డేటా ఆధారంగా నిర్ణయాలకు వీలుంటుంది. రైతుల విశ్వాసం పెంపొందుతుందని, తద్వారా ట్రాన్స్ఫార్మేషన్ ఒక సహకార ప్రక్రియగా నిలుస్తుందని నివేదిక తెలియజేసింది. సామర్థ్య మెరుగు, రుణ లభ్యతకు వీలుగా ఈ రంగంలోకి దేశ, విదేశీ పెట్టుబడులు భారీగా ప్రవహిస్తున్నట్లు తెలియజేసింది. నాలుగేళ్లలో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ పెట్టుబడులు వ్యవసాయ రంగంలోకి దూసుకొస్తున్నట్లు పేర్కొంది. 2020కల్లా లభించిన రూ. 6,600 కోట్ల పెట్టుబడుల్లో పీఈ వాటా వార్షికంగా 50 శాతం చొప్పున వృద్ధి చూపినట్లు వివరించింది. -
ప్రైవేట్ ఉద్యోగులకు బంపరాఫర్, ఈ ఏడాది పెరగనున్న 75శాతం జీతాలు!!
ప్రైవేట్ ఉద్యోగులకు బంపరాఫర్. ఈ ఏడాది పలు స్టార్టప్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఆయా కంపెనీలు భారీ ఎత్తున జీతాలు పెంచేందుకు సన్నద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగులు కోవిడ్ కారణంగా భారీ ప్యాకేజీ అందించే సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉద్యోగులు బయటికి వెళ్లకుండా ఉండేందుకు ప్రస్తుత కంపెనీలు భారీ స్థాయిలో ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. దీంతో ఆయా కంపెనీల్లో తక్కువ వేతనాలున్న ఉద్యోగుల జీతాలు రెండింతలు పెరగనున్నాయి. వారికి, రెమ్యూనరేషన్లు రెండింతలు పెరగనున్నాయి. ఇప్పటికే షిప్రాకెట్, అప్గ్రేడ్, సింప్లీలెర్న్, క్రెడ్అవెన్యూ, హోమ్లేన్, నోబ్రోకర్, క్యాష్కరో వంటి స్టార్టప్లు 2022లో సగటు వేతన పెంపులు కరోనా ముందటి స్థాయిల కంటే ఎక్కువగా ఉంటాయని ప్రకటించాయి. ఇక తాజాగా మరికొన్ని స్టార్టప్ కంపెనీలు సగటున 15 శాతం నుంచి 25 శాతం వరకు జీతాల్ని పెంచనున్నాయి. సాధారణ ఉద్యోగులతో పాటు ప్రతిభ కనబరుస్తున్న ఉద్యోగులకు భారీ స్థాయిలో 75 శాతం వరకు జీతాల్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఈ మేరకు ప్రకటనలు చేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. -
యూని'ఫ్లాప్' కార్న్లు.. బేర్ మంటున్న టెక్ స్టార్టప్లు!
కొద్ది నెలలుగా రిటైల్ ఇన్వెస్టర్లను ఊరిస్తూ భారీ లాభాలతో స్టాక్ ఎక్స్చేంజిలో లిస్టయిన కంపెనీలు ఉన్నట్టుండి ‘బేర్’మంటున్నాయి. ప్రధానంగా టెక్ స్టార్టప్లలో ఊపందుకున్న అమ్మకాలు అనూహ్య నష్టాలకు తెరతీస్తున్నాయి. వెరసి కొద్ది వారాల్లోనే కొత్తగా లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 2 లక్షల కోట్లు ఆవిరైంది. వీటిలో ప్రధానంగా గత కేలండర్ ఏడాది(2021)లో లిస్టయిన ఆరు టెక్ స్టార్టప్లు కోల్పోయిన విలువే రూ. 1.2 లక్షల కోట్లుకావడం గమనార్హం! దిగ్గజ స్టార్టప్లకు దెబ్బ 2021లో ప్రైమరీ మార్కెట్లు కదంతొక్కాయి. దీంతో పలు స్టార్టప్లు సహా వివిధ రంగాల కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చాయి. ప్రధానంగా కొత్తతరం టెక్నాలజీ కంపెనీలు లిస్టింగ్కు పోటీపడ్డాయి. రిటైల్ ఇన్వెస్టర్లు క్యూకట్టడంతో ఐటీ, సాస్, ఎడ్టెక్, ఫిన్టెక్ తదితర కంపెనీలు ఐపీవోల ద్వారా అనూహ్య స్థాయిలో నిధులు సమకూర్చుకున్నాయి. దీనికితోడు సెకండరీ మార్కెట్లు జోరు మీదుండటంతో భారీ లాభాలతో సైతం లిస్టయ్యాయి. అయితే గతేడాది చివర్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బాండ్ల కొనుగోలుకి మంగళంపాడనుండటంతోపాటు.. వడ్డీ రేట్లను వేగంగా పెంచనున్న సంకేతాలు ఇవ్వడంతో ఒక్కసారిగా పరిస్థితులు యూటర్న్ తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా అటు సెకండరీ మార్కెట్లలో దిద్దుబాటు ప్రారంభమైంది. వెరసి లిస్టింగ్ తదుపరి ఈ కేలండర్ ఏడాది(2022) మూడో వారానికల్లా కొత్తగా లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 2 లక్షల కోట్లకు చిల్లు పడింది. ఆరు కొత్తతరం కంపెనీల ద్వారానే దీనిలో రూ. 1.2 లక్షల కోట్లమేర ఆవిరైంది. జాబితాలో ఎఫ్ఎస్ఎన్ ఈకామర్స్ వెంచర్స్(నైకా బ్రాండ్), వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో, పీబీ ఫిన్టెక్(పాలసీ బజార్), కార్ట్రేడ్ చేరాయి. అయితే గేమింగ్ ఆధారిత కంపెనీ నజారా టెక్నాలజీస్ నష్టాల నుంచి నిలదొక్కుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! పేటీఎమ్ పతనం రెండు నెలల క్రితం లిస్టయిన డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎమ్ మార్కెట్ విలువ తాజాగా సగానికి పడిపోయింది. ఈ నెల 24కల్లా రూ. 60,000 కోట్ల దిగువకు చేరింది. కంపెనీ షేరు ఐపీవో ధర రూ. 2,150తో పోలిస్తే రూ. 917 వరకూ జారింది. అంటే 57 శాతం పతనమైంది. ఇక 2021 నవంబర్ 16న 52 వారాల గరిష్టం రూ. 169ను అందుకున్న జొమాటో తాజాగా రూ. 91 వద్ద ముగిసింది. ఈ బాటలో ఆగస్ట్ 20న గరిష్టంగా రూ.1610ను తాకిన కార్ట్రేడ్ సోమవారానికల్లా రూ.768కు పడిపోయింది. గత నవంబర్ 17న రూ. 1,470 వద్ద లైఫ్టైమ్ హై సాధించిన పాలసీబజార్ రూ.776కు జారింది. ఇదేవిధంగా నవంబర్ 26న రూ. 2,674కు ఎగసిన నైకా రూ. రూ.1,735కు దిగింది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ షేరు రూ. 940 నుంచి రూ. 780కు నీరసించింది. అయితే రాకేష్ ఝున్ఝున్వాలాకు పెట్టుబడులున్న నజారా టెక్ మార్కెట్ విలువకు లిస్టింగ్ తదుపరి రూ.3,000 కోట్లమేర జమయ్యింది. అయినప్పటికీ ఈ షేరు సైతం అక్టోబర్ 11న రూ. 3,354ను అధిగమించగా.. తాజాగా రూ. 2,384 వరకూ క్షీణించింది. వేల్యూ స్టాక్స్వైపు చూపు కొద్ది రోజులుగా దేశీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఊపందుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఫండ్ మేనేజర్లు, తదితర ఇన్వెస్టర్లు అధిక అవకాశాలున్న గ్రోత్ స్టాక్స్ నుంచి వైదొలగుతున్నట్లు తెలియజేశారు. వీటి స్థానే ఇప్పటికే వ్యాపారాలు విస్తరించిన వేల్యూ స్టాక్స్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. యూఎస్ అంశాన్ని పక్కనపెడితే.. దేశీయంగా గతేడాది బుల్ట్రెండ్ కారణంగా నష్టాలలో ఉన్నప్పటికీ టెక్ ఆధారిత కంపెనీలైన జొమాటో, పేటీఎమ్ తదితర కౌంటర్లు పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజరీ సంస్థ క్రిస్ డైరెక్టర్ అరుణ్ కేజ్రీవాల్ తెలియజేశారు. ప్రస్తుతం వీటి విలువలు(పీఈ) అధికంగా ఉండటంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర వేల్యూ స్టాక్స్వైపు చూస్తున్నట్లు ఎలారా సెక్యూరిటీస్ ఇండియా ఎండీ హరేంద్ర కుమార్ పేర్కొన్నారు. కారణాలున్నాయ్... కొద్దిరోజులుగా సెకండరీ మార్కెట్లు కరెక్షన్కు లోనుకావడానికి ప్రధానంగా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, ఒమిక్రాన్ ఆందోళనలు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే యూఎస్లో ఇటీవల టెక్నాలజీ కౌంటర్లలో భారీ అమ్మకాలు కొనసాగుతుండటం ఇక్కడ గమనార్హం. టెక్ కౌంటర్లకు ఆవాసమైన నాస్డాక్ ఇండెక్స్ గత నవంబర్ నుంచి చూస్తే దాదాపు 20 శాతం పతనంకావడాన్ని ప్రస్తావిస్తున్నారు. స్వల్ప కాలంలో ఇండెక్స్ 20 శాతం పతనంకావడం బేర్ ట్రెండుకు సంకేతమని పేర్కొన్నారు. దీంతో ఇన్వెస్టర్లు అధిక విలువలుగల టెక్ స్టార్టప్ల నుంచి వైదొలగేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషించారు. (చదవండి: -
దేశం సుసంపన్నం కావాలంటే..
నా సహోద్యోగులు, స్నేహితులు, దేశవాసులతో పాటు.. తక్కిన ప్రపంచానికి ఉదాహరణగా నిలిచే భారతదేశం కోసం నేను కల కంటుంటాను. భారత పారిశ్రామిక ప్రతినిధిగా, మాజీ పార్లమెంటు సభ్యు డిగా నా మనస్సులో ఏడు సూత్రాల ఎజెండా ఉంది. ఈరోజు మనం స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ గురించి, నవతరం సంపద సృష్టికర్తల పురోగతి గురించి సంబరంగా మాట్లాడుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియా భావనను ఈ స్టార్టప్స్ ముందుకు తీసుకెళతాయి. భారత్ను అభివృద్ధి వైపు తీసుకెళ్లే ఈ ఏడు సూత్రాలను పరిశీలిద్దాం. ఒకటి. 2020 సంవ త్సరం గణాంకాలను చూసినట్లయితే మన జనా భాలో 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల్లో 80 శాతం మేరకు 20 శాతం ఆదాయ పన్నుచెల్లింపుదారుల నుంచి వస్తోంది. అంటే అధికాదాయం పొందు తున్న 0.4 శాతం మంది వ్యక్తులు 80 శాతం పన్నులను చెల్లిస్తున్నారు. వీరిని మనం తప్పకుండా గౌరవించాలి. అయితే పన్ను చెల్లింపుదారుల్లో చాలామంది వేధింపులకు గురవుతున్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. 2019లో అధికాదాయం కలిగిన వారిలో 7 వేలమంది విదేశాలకు వలస వెళ్లిపోయారని వార్తలు. ఇలా దేశం విడిచిపెట్టిన వారిలో చాలామంది తమచుట్టూ విషపూరితమైన వాతావరణం, వేధింపుల గురించి మాట్లాడు తున్నారు. అలా దేశాన్ని వదిలి వెళ్లిపోయిన సంపద సృష్టికర్తలందరినీ తిరిగి వెనక్కు తీసుకొచ్చి జాతి ఉన్నతి కోసం వారు పాటుపడేలా ప్రోత్సహించే రోజు కోసం నేను కలగంటున్నాను. 2. పారిశ్రామిక నేతలు తరచుగా ప్రభుత్వంతో తమ సంప్రదింపుల గురించి మాట్లాడుతుంటారు. అయితే పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసం కొరవడటం గురించి ఒక సందర్భంలో కూడా వీరు మాట్లాడటం లేదు. అందుకే న్యాయమైన, పార దర్శకమైన వ్యవస్థ కోసం మనందరం ఉమ్మడిగా కృషి చేయవలసి ఉంది. 3. సులభతర వాణిజ్య సూచికి సంబంధించి తన స్కోరును పెంచుకోవడంలో భారత్ ఎంతో మెరుగైంది. వాణిజ్యవర్గాల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ విధానం ప్రశంసలు అందుకుంటోంది. ఇక పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో గొప్ప సానుకూలత ఉంది. ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్లో పెట్టుబడుల ఉపసంహరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిబద్ధతను ప్రదర్శించింది. అయితే వాణిజ్య రంగంలో మనం చేయవలసింది ఎంతో ఉంది. 4. నిష్పక్షపాతమైన, న్యాయమైన, సంతోష కరమైన సమాజానికి హామీ ఇచ్చేలా న్యాయ సంస్కరణల దిశగా మనం కృషి చేయవలసిన అవ సరం ఉంది. 5. పోలీసు సంస్కరణలపై 2006లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో చాలా రాష్ట్రాలు అమలుపర్చలేదని తాజా నివేదిక తెలి పింది. దీన్ని ప్రభుత్వం పరిష్కరించాలి. 6. నాణ్య మైన విద్యను మనం మెరుగుపర్చాలి. 2020 జాతీయ విద్యావిధానాన్ని స్వాగతిస్తున్నాం. శిక్షణ పొందిన, ఉపాధి పొందగల శ్రామిక శక్తికి భరోసా ఇచ్చేలా శిక్షణ సంస్థలను నెలకొల్పాలి. 7. నేడు భారత్ అవకాశాలు పురివిప్పుతున్న దేశం. నిజంగానే కోవిడ్–19 మహమ్మారి అనిశ్చిత త్వాన్ని పరిష్కరించడంలో మన సామర్థ్యాన్ని పరీ క్షించింది. ఈ విషయంలో మరిన్ని çసృజనాత్మక ఆవిష్కరణలు రావాల్సిన తరుణమిది. దేశం పోకడ గురించి అనేక వాదనలు, ప్రతి వాదనలు కొనసాగుతూనే ఉంటాయి. భేదాభిప్రా యాలు, చీలికలు మనల్ని కలవరపెడుతున్న ప్పుడు త్రివర్ణ పతాకాన్ని మన మనస్సులో ఉంచు కోవలసిన సమయమిది. జాతీయ జెండా కంటే మించిన ఐక్యతా చిహ్నం మరొకటి లేదు. – నవీన్ జిందాల్ చైర్మన్ – జిందాల్ స్టీల్ అండ్ పవర్, మాజీ ఎంపీ -
అంబేడ్కర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ లీగ్.. స్టార్లప్లకు కొత్త వరం
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కులాల విభాగంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతిచ్చేందుకు ఐఎఫ్సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనుంది. అంబేడ్కర్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ లీగ్ పేరుతో త్వరలో తొలి దశను ప్రారంభించనున్నట్లు సంస్థ ఎండీ ఎస్.తోమర్ పేర్కొన్నారు. తద్వారా బిజినెస్ ఐడియాలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నట్లు తెలియజేశారు. ఐఎఫ్సీఐ లిమిటెడ్కు అనుబంధ సంస్థే ఐఎఫ్సీఐ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. సంస్థ ప్రస్తుతం ఐదు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ను నిర్వహిస్తోంది. వీటిలో రెండింటిని సామాజికంగా వెనుకబాటు, వెనుకబడిన కులాల్లో ఎంటర్ప్రెన్యూర్షిప్కు మద్దతిచ్చేందుకు వినియోగిస్తోంది. 2020లో తొలుత షెడ్యూల్డ్ కులాల(ఎస్సీలు)కు చెందిన 1,000 మంది ఎంటర్ప్రెన్యూర్స్తో మిషన్ను ప్రారంభించింది. తద్వారా అంబేడ్కర్ సోషల్ ఇన్నోవేషన్ ఇన్క్యుబేషన్ మిషన్ పేరుతో వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తూ ఎస్సీల కోసం ఫండ్ను ఏర్పాటు చేసిననట్లు ఈ సందర్భంగా తోమర్ తెలియజేశారు. చదవండి: నవ్విస్తూ.. నేర్పిస్తూ.. ఇంటింటికి చేరువై.. లక్షల కోట్లకు అధిపతిగా -
కేవలం నెలకు రూ. 85 చెల్లిస్తే 5 లక్షల ఆరోగ్య బీమా మీ సొంతం..! వివరాలు ఇవే..!
అతి తక్కువ ప్రీమియంతో అదిరిపోయే హెల్త్ బీమా పథకాన్ని ఉద్యోగుల ఆరోగ్య బీమా ప్లాట్ఫాం ప్లమ్ ప్రారంభించింది. కేవలం నెలకు రూ. 85 ప్రీమియం చెల్లిస్తే రూ. 5 లక్షల ఆరోగ్య బీమాను పొందవచ్చును. డిసెంబర్ 21 న ఈ కొత్త పాలసీను ప్లమ్ ప్రకటించింది. ఎవరికీ వర్తిస్తుందంటే..! చిన్న తరహా స్టార్టప్స్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులు, సూక్ష్మ-చిన్న తరహా పరిశ్రమలలో పనిచేసే వారు ఈ ఆరోగ్య బీమాను పొందవచ్చును. ఈ బీమాతో ఆయా పాలసీదారులు అపరిమితంగా వైద్యుల అపాయింట్మెంట్స్, వారానికోసారి వెల్నెస్ సెషన్స్, డెంటల్, కళ్ల పరీక్షలు, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన డాక్టర్ కన్సల్టేషన్స్, కోవిడ్-19 చికిత్స మొదలైన వాటికి క్లెయిమ్ చేసుకోనే వీలు ఉంటుంది. అప్పుడే మొదలైన స్టార్టప్స్కు చేయూత..! దేశవ్యాప్తంగా సుమారు 6.3 కోట్ల స్మాల్మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి. వీటితో పాటుగా భారత్లో 1 కోటి 15 లక్షలకు పైగా గిగ్ వర్కర్స్ (కాంట్రాక్టు పద్దతిలో పనిచేసేవారు) ఉన్నారు. వీరికి ఎటువంటి బీమా సౌకర్యాలు లేనట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా ప్రారంభ దశలో మొదలైన స్టార్టప్స్కు ప్లమ్ బీమా పాలసీ ఎంతగానో ఉపయోగపడనుంది. ఆయా స్టార్టప్స్లో ఇద్దరు సభ్యుల కంటే తక్కువ టీమ్లను కలిగి ఉన్న కంపెనీలకు, స్టార్టప్స్లోని ఉద్యోగులను బీమా కవర్ అందివచ్చును. హెల్త్ బెనిఫిట్స్ అందరికీ ఇవ్వడమే మా లక్ష్యం..! అప్పుడే మొదలైన చిన్న స్టార్టప్స్కు, గిగ్ వర్కర్స్కు హెల్త్ బీమాను అందించడమే మా ముఖ్య లక్ష్యమని ప్లమ్ కో-ఫౌండర్, సీఈవో అభిషేక్ పొద్దార్ అన్నారు. ఆయా కార్యాలయాల్లో వెల్నెస్ ప్రవర్తనను సృష్టించాలనే లక్ష్యంతో ఈ బీమాను ప్రారంభించినట్లు తెలిపారు. 2024 నాటికి సుమారు ఒక కోటి మందికి బీమా చేయాలనే ప్లమ్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. చదవండి: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్సెస్ అమెజాన్.. కోర్టుకు చేరిన పంచాయితీ -
‘ఏఐ’ సాయంతో పండుగలా వ్యవసాయం.. ఎలాగంటారా?
నకిలీ విత్తనాలు, ఎరువుల మోసాలు, అకాల వర్షాలు, కూలీల కొరత, మార్కెట్ మాయాజాలం... రైతుకు కాసిన్ని రూకలు గిట్టేందుకు తరచూ అడ్డుపడుతున్న సమస్యల చిట్టా ఇది. అయితే కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వీటన్నింటినీ అన్నదాత అధిగమించేందుకు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. దేశంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న స్టార్టప్లు వ్యవసాయాన్ని తిరిగి పండుగలా మార్చేందుకు కృషి చేస్తున్నాయి. దీంతో ఎరువులు వెదజల్లుతూ దూసుకెళ్లే డ్రోన్లు, విచ్చుకున్న పత్తికాయలను తెంపే రోబోలు పల్లెల్లో విరివిగా కనిపించే కాలం ఇంకెంతో దూరంలో లేదు! సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంలో వృద్ధిని సాధించడం ద్వారా రైతుతోపాటు ఇతర వర్గాల వారికీ లాభాలు చేకూర్చేందుకు కృత్రిమ మేధ (ఏఐ) అక్కరకొస్తోంది. పంట దిగుబడిని పెంచేందుకు, సకాలంలో తగిన సూచనలిచ్చి నష్టాలు, వృథాను అరికట్టేందుకు, కూలీల కొరత సమస్యను అధిగమించేందుకు సాయంగా నిలుస్తోంది. వ్యవసాయంలోని ప్రతి దశలోనూ రైతుకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నేల, నీరు, గాలి, వాతావరణం వంటి వాటిని నిత్యం పరిశీలిస్తూ రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఏఐ ఆధారిత సూక్ష్మ వాతావరణ కేంద్రాలు తయారవుతున్నాయి. చీడపీడల నియంత్రణ, ఎరువులు ఎప్పుడు? ఎక్కడ? ఎంత మేరకు వాడాలి? కీటకనాశినులు ఏయే సమయాల్లో వాడాలో కూడా సెన్సర్లు, ఆప్టికల్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నారు. మార్కెట్ ధర వివరాలు ఇంటర్నెట్ సాయంతో తెలుసుకోవడం కొంతకాలంగా వినియోగంలో ఉన్నా ఏఐ పుణ్యమా అని ఇప్పుడు ఫలానా పంటకు సమీప భవిష్యత్తులో ఎంత ధర వచ్చే అవకాశం ఉంది? ఎక్కడ అమ్ముకుంటే ఎక్కువ లాభం వంటి వివరాలు ఇచ్చే ప్రిడిక్టివ్ అనాలసిస్ కూడా అందుబాటులోకి వస్తోంది. డ్రోన్ల సాయంతో పంట ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు కూడా కొన్ని సంస్థలు తగిన టెక్నాలజీలను సిద్ధం చేశాయి. సెన్సర్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా తీసిన ఫొటోలు, ఐఓటీ పరికరాలు, డ్రోన్లు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వ్యవసాయ సంబంధిత సమాచారం అంతటినీ ఒక దగ్గరకు చేర్చి అవసరాలకు తగ్గట్టుగా విశ్లేషించడం కూడా ఏఐ కారణంగానే సాధ్యమవుతోంది. దేశంలో దాదాపు 58 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలన్నీ కలిపి సుమారు రూ.19.48 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించాయని అంచనా. వివిధ స్టార్టప్లు తయారు చేసిన ఏఐ ఆధారిత వ్యవసాయ యంత్ర పరికరాలు, వాటి ఉపయోగాలు ఇలా... కలుపు మొక్కలు ఏరేస్తుంది... కంపెనీ: టార్టాన్సెన్స్, బెంగళూరు https://www.tartansense.com/ ఏం చేస్తుంది?.: కలుపు మొక్కలను గుర్తించి వాటిపై మందులు చల్లే బ్రిజ్బోట్, యంత్రాలతో పెకలించగలిగే బ్లేడ్ రన్నర్ రోబోలను సిద్ధం చేసింది. ఈ కంపెనీని 2015లో జయసింహరావు ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్బోట్ బ్లేడ్రన్నర్ కొబ్బరిబొండాలు తెంపుతుంది... కంపెనీ: మెగరా రోబోటిక్స్, చెన్నై http://www.megararobotics.com/ ఏం చేస్తుంది?..: కొబ్బరి చెట్లు ఎక్కి బొండాలు తెంపేందుకు అమరన్ పేరుతో ఓ రోబోను తయారు చేసింది. రాజేశ్ కన్నన్ మహాలింగం అనే వ్యక్తి స్థాపించారు. స్మార్ట్ఫోన్ అప్లికేషన్, జాయ్స్టిక్ లేదా గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ల సాయంతో నియంత్రించగలిగే ఈ రోబో 15 మీటర్ల ఎత్తైన చెట్లను కూడా 15 సెకన్లలోనే ఎక్కగలదు. కేవలం పది నిమిషాల్లో ఏర్పాటు చేసుకుని పనిచేయించుకోగల అమరన్ మనుషుల మాదిరిగానే బొండాలను వేర్వేరుగా కాకుండా.. గుత్తులు తెంపగలదు. కిందకు మోసుకురాగలదు. తెలివిగా వేరు చేస్తుంది.. కంపెనీ: ఇంటెల్లో ల్యాబ్స్, గురుగ్రామ్ https://www.intellolabs.com/ ఏం చేస్తుంది?...: పంటలను గ్రేడింగ్ చేయడం, వేగంగా ప్యాక్ చేయడం, రవాణాపై పర్యవేక్షణ, పరిశీలనల కోసం ఈ కంపెనీ ఇంటెలోట్రాక్, ఇంటెలోసార్ట్, ఇంటెలోగ్రేడ్, ఇంటెలోప్యాక్ పేరుతో నాలుగు కృత్రిమమేధ ఆధారిత యంత్రాలను, సాఫ్ట్వేర్లను సిద్ధం చేసింది. అన్నీ తానై.. కంపెనీ: ప్లాంటిక్స్, హైదరాబాద్ https://plantix.net/en/ ఏం చేస్తుంది?..: కృత్రిమ మేధ సాయంతో మొక్కలను ఆశించే చీడపీడలు, పోషకాల లోపాలను గుర్తించేందుకు ప్రత్యేకమైన స్మార్ట్ఫోన్ అప్లికేషన్ను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా.. అవసరానికి మించి కీటకనాశినులు వాడకుండా నిరోధించడం కూడా ఈ ప్లాంటిక్స్ ద్వారా జరిగే పనుల్లో ఒకటి. విత్తనంతో మొదలుపెట్టి... కంపెనీ: ఫసల్, బెంగళూరు https://fasal.co ఏం చేస్తుంది?..: మీ పొలం వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తుంది. నేల సారాన్ని పరిశీలించడం మొదలుకొని వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడం వరకూ అన్ని పనులు చక్కబెట్టేందుకు ఫసల్ ఒక వ్యవస్థను తయారు చేసింది. సెన్సర్లు, ఇతర పరికరాల సాయంతో రానున్న 14 రోజుల వాతావరణ అంచనాలను రైతుకు తెలియజేస్తుంది. నీళ్లు ఎప్పుడు పెట్టాలి? ఎరువులు ఎప్పుడు వేయాలి? వంటి అంశాలపై సూచనలు చేస్తుంది. రైతుల వ్యవసాయ పద్దుల నిర్వహణకూ ఉపయోగపడుతుంది. పత్తి ఏరేందుకు... కంపెనీ: జీ–రోబోమ్యాక్, బెంగళూరు https://www.grobomac.com/ ఏం చేస్తుంది?..: పత్తి పువ్వులు ఏరేందుకు ఓ ప్ర త్యేక యంత్రాన్ని తయారు చేసిందీ కంపెనీ. అం తేకాకుండా వంకాయ, బెండ, క్యాప్సికమ్ వంటి వాటిని కోసేందుకూ రోబోలను సిద్ధం చేస్తోంది. త్రీడీ మెషీన్ విజన్, రోబోటిక్స్ టెక్నాలజీల సా యంతో మనుషులు కష్టపడి చేయగల పనులను సులువుగా ముగించేందుకు ప్రయత్నిస్తోంది. కో తలకు ఉపయోగించే యంత్రాలనే.. కలుపుతీతలకు, ప్రూనింగ్, మందుల పిచికారీకి కూడా ఉపయోగించుకోగలగడం విశేషం. పత్తిపువ్వులు ఏరే యంత్రం రెండేళ్ల నుంచి పొలాల్లో పనులు చేసుకుంటూండటం చెప్పకోవాల్సిన అంశం. -
Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–4 ప్రకారం మన దేశంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లల్లో 38% మందిలో పౌష్టికాహార లోపం వల్ల పెరుగుదల లోపించింది. 59% పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. పిల్లలతో పాటు పెద్దల్లోనూ పౌష్టికాహార లోపం తీవ్రంగానే ఉంది. రోజువారీగా తినే ప్రధాన ఆహార పదార్థాలతోపాటు పౌష్టిక విలువలు లోపించిన చిరుతిళ్లు కూడా వీరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లో అమ్మ చేసి పెట్టే చిరుతిళ్ల కన్నా మార్కెట్లో దొరికే ఆరోగ్యపరంగా నష్టదాయకమైన(జంక్) చిరుతిళ్లనే పిల్లలు.. ఆ మాటకొస్తే పెద్దలూ అంతే. జంక్ ఫుడ్కు చక్కని ప్రత్యామ్నాయం చిరుధాన్యాలతో తయారైన చిరుతిళ్లే అనటంలో సందేహం లేదు. ‘పౌష్టిక ధాన్యాలు’ (న్యూట్రి–సీరియల్స్)గా ప్రభుత్వం గుర్తించిన చిరుధాన్యాలలో ఖనిజ లవణాలు, బీకాంప్లెక్స్ విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణం. హైదరాబాద్లోని ఐసీఏఆర్ అనుబంధ కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) ప్రజలకు పౌష్టికాహార భద్రత కల్పించాలన్న లక్ష్యంతో కృషి చేస్తోంది. ఐదేళ్ల క్రితం అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఐఐఎంఆర్ దేశంలోనే తొలి ‘న్యూట్రిహబ్’ను నెలకొల్పింది. చిరుధాన్యాలతో రుచికరమైన వందలాది వంటకాలు, చిరుతిళ్లను అత్యాధునిక పద్ధతుల్లో తయారు చేయటంపై ‘న్యూట్రిహబ్’ ఔత్సాహిక స్టార్టప్ సంస్థలకు శిక్షణతోపాటు సాంకేతికత విజ్ఞానాన్ని, ఆర్థిక తోడ్పాటును సైతం అందించి ప్రోత్సహిస్తున్నట్లు ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. విలాస్ ఎ తొనపి తెలిపారు. న్యూట్రిహబ్ ద్వారా ఇప్పటికి మిల్లెట్స్తో రకరకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయించటంపై 175 స్టార్టప్ సంస్థలకు మార్గదర్శనం చేసినట్లు న్యూట్రిహబ్ సీఈవో, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి. దయాకర్రావు చెప్పారు. వినూత్న ఉత్పత్తులతో ముందుకొచ్చి మార్కెట్లో దూసుకెళ్తున్న స్టార్టప్లలో కొన్నిటికి మహిళలే సారధులుగా ఉన్నారు. వీరిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఇటీవల ఐఐఎంఆర్ నిర్వహించిన న్యూట్రి–సీరియల్స్ భాగస్వాముల జాతీయ మెగా సమ్మేళనంలో అవార్డులు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలైన మిల్లెట్ మహిళల విజయగాథలు.. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నెల రోజులు తింటే తేడా తెలుస్తుంది! వరి, గోధుమలకు బదులు చిరుధాన్యాలను రోజుకు ఒక భోజనం చేస్తూ.. చిరుధాన్యాలతో చేసిన చిరుతిళ్లు (స్నాక్స్) తింటే జీవన శైలి జబ్బులతో బాధపడేవారు నెల రోజుల్లో ఆరోగ్యంలో మంచి మార్పును గమనించవచ్చు అని హైదరాబాద్ నివాసి అయిన డాక్టర్మందరపు సౌమ్య అంటున్నారు. ఆహార శుద్ధి రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి, ఆహార సాంకేతిక నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం కలిగిన ఆమె 120 రకాల ఆహారోత్పత్తుల ఫార్ములాలను రూపొందించారు. మూడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ‘మిల్లెనోవా ఫుడ్స్’ పేరిట స్టార్టప్ సంస్థను నెలకొల్పారు. ఐఐఎంఆర్లోని న్యూట్రిహబ్ ద్వారా ఇంక్యుబేషన్ సేవలు పొందారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు తినదగిన ఆరోగ్యదాయకమైన చిరుధాన్య చిరుతిళ్ల ఫార్ములేషన్లకు రూపకల్పన చేశారు. చిరుధాన్యాలు, పండ్లు, పప్పుధాన్యాలు, కూరగాయలను కలిపి శాస్త్రీయ సమతులాహార ఫార్ములేషన్స్తో ప్రొటీన్ బార్, బ్రేక్ఫాస్ట్ బార్, ఇమ్యుటినిటీ బూస్టర్ బార్, స్పోర్ట్స్ ఎనర్జీ బార్లను రూపొందించారు. రైతుల నుంచి నేరుగా చిరుధాన్యాలను కొనుగోలు చేసి.. పోషకాలు సులువుగా జీర్ణమయ్యేందుకు ఎక్స్ట్రూజన్ టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నామని డా. సౌమ్య తెలిపారు. రూ. 1.41 కోట్ల పెట్టుబడి పెట్టారు. చదవండి: Wemmer Pan Killer: అతనో నరరూప రాక్షసుడు.. ఏ శిక్ష వేసినా తక్కువే..! పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మూడో ఏడాదిలో రూ. 1.27 కోట్ల నికర లాభాన్ని ఆర్జించారు. ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా స్టార్టప్ అవార్డును అందుకున్నారు. సిఎఫ్టిఆర్ఐ నుంచి తొలి బెస్ట్ స్టార్టప్ అవార్డును, ఇక్రిశాట్ నుంచి స్మార్ట్ ఫుడ్ ఎంటర్ప్రైజ్ అవార్డుతో పాటు ఐఎస్బి–యాక్షన్ ఫర్ ఇండియా బెస్ట్ సోషల్ ఎంటర్ప్రైజ్ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ టీ–హబ్లో ఎం.ఎస్.ఎం.ఈ. అసోసియేట్ గ్రోత్ సెక్రెటరీగా ఎంపికైన డా. సౌమ్య ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలదే భవిష్యత్తు అంటున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తుల రంగంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు డా.సౌమ్య. (79895 86619). https://millennova.com/ మహిళలకోసం ప్రత్యేక ఆహారోత్పత్తులు బెంగళూరుకు చెందిన రుచిక భువాల్క వృత్తి రీత్యా సోషల్ టీచర్. కుటుంబం కోసం వరి, గోధుమలు లేని ఆరోగ్యదాయకమైన ఆహారం తయారు చేసే క్రమంలో ఆమె చిరుధాన్యాలపై దృష్టి సారించారు. చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకోవటంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించడంలో ప్రజలకు దోహపడాలన్న తపనతో ‘అర్బన్ మాంక్’ పేరిట స్టార్టప్ను నాలుగేళ్ల క్రితం నెలకొల్పారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో చిరుధాన్యాల బియ్యం, పిండితోపాటు ఇడ్లీ /దోసెల పిండి, బిస్కెట్లు వంటి రోజువారీ అవసరమయ్యే 40 ఉత్పత్తులను అందిస్తూ పట్టణ ప్రాంత గృహిణుల మనసు చూరగొనటంలో రుచిక విజయం సాధించారు. సేంద్రియ చిరుధాన్యాలతో 30–60 ఏళ్ల మధ్య మహిళల కోసం ప్రత్యేక ఆహారోత్పత్తులను అందిస్తూ మిల్లెట్ అమ్మగా ప్రసిద్ధి పొందారు. 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ కామర్స్ సైట్స్ ద్వారా విక్రయిస్తూ రూ. 2 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించిన రుచిక.. ఐఐఎంఆర్ నుంచి బెస్ట్ ఎమర్జింగ్ స్టార్టప్ అవార్డును అందుకున్నారు. https://milletamma.com/ చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! ఆరోగ్యకరమైన చిరుతిళ్లు పౌష్టిక విలువలు లేని జంక్ స్నాక్స్ నుంచి పిల్లలను రక్షించుకోవడం కోసం చిరుధాన్యాలతో చిరుతిళ్లను తయారు చేయటం ప్రారంభించారు హైదరాబాద్కు చెందిన డి.మాధవి, బి. దివ్యజ్యోతి. ప్రగతినగర్లోని ఎలీప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో చిరుధాన్యాలతో రెడీ టు ఈట్ చిరుతిళ్ల ఉత్పత్తి కోసం చిరు పరిశ్రమను స్థాపించారు. రాగి కుకీస్, జోవార్ ఫ్లేక్స్ తయారీ కోసం ఐఐఎంఆర్ నుంచి టెక్నాలజీ తీసుకున్నారు. రాగి చోకో బాల్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి చిరుధాన్యాలను నేరుగా కొనుగోలు చేస్తున్నారు. రూ. 1.04 కోట్ల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి మూడేళ్లలో 80% తిరిగి రాబట్టుకోగలిగారు. 9 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2017లోనే ఐఐఎంఆర్ నుంచి ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తల అవార్డును మాధవి, దివ్యజ్యోతి స్వీకరించారు. తాజాగా ఐఐఎంఆర్ కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు. https://rigdamfoods.com/ చదవండి: ఈ పుట్టగొడుగు పొడిని మహిళలు ప్రసవసమయంలో తింటే.. మిల్లెట్ మీల్ బాక్స్ హైదరాబాద్కు చెందిన వేముల అరుణ ఐదేళ్ల క్రితం శిక్షణ పొంది జొన్న లడ్డు, ఇడ్లీ, దోసెలు వంటి వంటకాలను విక్రయించడం ప్రారంభించారు. వివిధ సంస్థల్లో మధ్యాహ్న భోజనం (మీల్ బాక్స్) అందిస్తున్నారు. ప్రస్తుతానికి 8 రకాల చిరుధాన్య వంటకాలను అందిస్తున్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ తోడ్పాటుతో మరికొన్ని ఉత్పత్తులను జోడించబోతున్నామని అరుణ తెలిపారు. స్విగ్గి, జొమాటో తదితర ఆన్లైన్ పార్టనర్స్ ద్వారా రుచికరమైన చిరుధాన్య వంటకాలను కోరిందే తడవుగా ప్రజల ముంగిటకు అందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె తెలిపారు. రూ. 2.5 లక్షల పెట్టుబడితో అరుణ చిరుధాన్యాల వంటశాలను ప్రారంభించారు. ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు. రూ. 2.8 లక్షల ఆదాయం గడించారు. తాజాగా ఐఐఎంఆర్ నుంచి కన్సొలేషన్ అవార్డును అందుకున్నారు అరుణ. vemulaaruna81@gmail.com చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! 6న వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై శిక్షణ ప్రకృతి వ్యవసాయంలో వేరుశనగ, కంది, ఉల్లిగడ్డ సాగుపై ఈనెల 6 (శనివారం)న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తారామతి పేట దగ్గర తన వ్యవసాయ క్షేత్రంలో ప్రముఖ రైతు శాస్త్రవేత్త గుడివాడ నాగరత్నం నాయుడుతోపాటు తాండూరు రైతు నారాయణ, నాగర్కర్నూలు రైతు రాజు రైతులకు శిక్షణ ఇస్తారు. పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. 95538 25532. 7న బొప్పాయి, మునగ, అరటి సాగుపై శిక్షణ గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా శిబిరంలో ఈ నెల 7 (ఆదివారం)న బొప్పాయి, మునగ, అరటి సాగుపై నందివెలుగు రైతు మీసాల రామకృష్ణ, ఉద్యాన సహాయ సంచాలకులు రాజా కృష్ణారెడ్డి రైతులకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666. 60% రైతులు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా వ్యవసాయం చేస్తున్నారు. పంటలు సాగయ్యే విస్తీర్ణంలో 55% వర్షాధార ప్రాంతాల్లోనే ఉంది. భూతాపోన్నతి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్న రైతులు వీరు. అయితే, దేశ వ్యవసాయ బడ్జెట్లో 10% మాత్రమే ఈ ప్రాంతాలపై ఖర్చు పెడుతున్నాం. ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. ఫసల్ బీమా యోజన ఒక్కటే మెట్ట రైతును రక్షించలేదు. పంటల జీవవైవిధ్యం పెంపొందించాలి. – డాక్టర్ సబ్యసాచి దాస్, రీవైటలైజింగ్ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ నెట్వర్క్ చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్నోవేట్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా ఏఐ ఇన్నోవేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆర్టీఫీషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ఉన్న స్టార్టప్స్ కార్యకలాపాలను విస్తృతం చేయడం, ఆవిష్కరణలను నడిపించడంతోపాటు పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. నవంబర్లో ప్రారంభమై 10 వారాలపాటు ఇది సాగనుంది. ఏఐ రంగంలో స్టార్టప్స్ సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ మూడవ స్థానంలో ఉందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఏఐ వినియోగం ద్వారా 2035 నాటికి భారత ఆర్దిక వ్యవస్థకు రూ.6,75,000 కోట్లకుపైగా తోడవుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి వెల్లడించారు. -
ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్
ముంబై: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న పబ్లిక్ ఇష్యూల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ) మరింత బలపడనున్నట్లు గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ప్రైమరీ మార్కెట్లో జోష్ కారణంగా రానున్న మూడేళ్లలో దేశీ మార్కెట్ క్యాప్నకు 400 బిలియన్ డాలర్లు జమకానున్నట్లు తెలియజేసింది. దీంతో 2024కల్లా మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా వేసింది. వెరసి ప్రపంచంలో అత్యధిక మార్కెట్ క్యాపిటటైజేషన్ కలిగిన దేశాలలో 5వ ర్యాంకుకు చేరే వీలున్నట్లు అభిప్రాయపడింది. గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లో నెలకొన్న బూమ్ నేపథ్యంలో తాజా అంచనాలను రూపొందించినట్లు యూఎస్ బ్రోకింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంనుంచీ చూస్తే పబ్లిక్ మార్కెట్ ద్వారా కంపెనీలు 10 బిలియన్ డాలర్లను సమీకరిస్తున్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత మూడేళ్లలోనే ఇది అత్యధికంకాగా.. రానున్న 12–24 నెలల్లోనూ ఇది కొనసాగనున్నట్లు అంచనా వేసింది. యూనికార్న్ల దన్ను నవ ఆర్థిక వ్యవస్థ నుంచి పుట్టుకొస్తున్న యూనికార్న్లు, ఐపీవోల ద్వారా లిస్టింగ్కు సిద్ధపడుతున్న కంపెనీలు మార్కెట్ క్యాప్ అంచనాలకు బలాన్నిచ్చినట్లు గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ఇటీవల బిలియన్ డాలర్ల విలువను అందుకోడం ద్వారా యూనికార్న్ హోదాను పొందుతున్న స్టార్టప్లలో స్పీడ్ నెలకొన్నదని తెలియజేసింది. ఇంటర్నెట్ వృద్ధి, ప్రయివేట్ పెట్టుబడుల లభ్యత, నియంత్రణ సంస్థల తోడ్పాటు వంటి అంశాలు దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు దన్నునిస్తున్నట్లు వివరించింది. ఫలితంగా ఇటీవల 3.5 ట్రిలియన్ డాలర్లను అందుకున్న దేశీ మార్కెట్ క్యాప్ 2024కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. గత వారం ఫ్రాన్స్ను అధిగమిస్తూ దేశీ మార్కెట్ విలువ ప్రపంచంలో ఆరో ర్యాంకును అందుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్ జోరు ప్రస్తుతం దేశీ ఈక్విటీ ఇండెక్సులలో పాతతరం ఆర్థిక రంగాలకు చెందిన కంపెనీలదే అధిపత్యమని గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. 20 ఏళ్ల సగటు లిస్టింగ్ వయసు కారణంగా పురాతన సూచీలుగా నిలుస్తున్నట్లు వ్యాఖ్యానించింది. అయితే అతిపెద్ద డిజిటల్ ఐపీవోల ద్వారా కొత్త తరానికి చెందిన రంగాలకు ప్రాధాన్యత పెరగనున్నట్లు అంచనా వేసింది. దీంతో నవతరం ఆర్థిక, టెక్ రంగాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడులు 5 శాతం నుంచి 12 శాతానికి(50 శాతం ఫ్లోట్) పెరగనున్నట్లు అభిప్రాయపడింది. ఈ బాటలో ఇటీవల స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటో లిస్ట్కాగా.. ఫిన్టెక్ దిగ్గజం పేటీఎమ్సహా పలు ఇతర కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలియజేసింది. -
డిజిటల్ న్యూస్ స్టార్టప్స్ కోసం గూగుల్ ’ల్యాబ్’
న్యూఢిల్లీ: దేశీయంగా స్వతంత్ర స్థానిక న్యూస్ స్టార్టప్ల కోసం టెక్ దిగ్గజం జీఎన్ఐ స్టార్టప్స్ ల్యాబ్ ఇండియా పేరిట యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించింది. దీని కింద ఆర్థికంగా, నిర్వహణపరంగా ఆయా అంకుర సంస్థలు నిలదొక్కుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో నాలుగు నెలల పాటు శిక్షణనిస్తుంది. ఇందుకోసం ఎకోస్, డిజిపబ్ న్యూస్ ఇండియా ఫౌండేషన్తో జట్టు కట్టింది. భారతీయ భాషల్లో ప్రచురిస్తున్న న్యూస్ స్టార్టప్ సంస్థలేవైనా ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరు తేది అక్టోబర్ 18. తొలి బ్యాచ్ కోసం 10 స్వతంత్ర డిజిటల్ న్యూస్ పబ్లిషింగ్ సంస్థలను ఎంపిక చేస్తారు. -
భారీగా పుట్టుకొస్తున్న సాస్ స్టార్టప్లు, ఐపీఓకి జోష్
ముంబై: ఇటీవల డిమాండుకు అనుగుణంగా దేశంలో సాస్(ఎస్ఏఏఎస్) స్టార్టప్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. మరోపక్క కొద్ది నెలలుగా స్టాక్ మార్కెట్లలో నెలకొన్న పబ్లిక్ ఇష్యూల హవా చిన్నా, పెద్దా కంపెనీలకు కొత్త జోష్నిస్తోంది. దీంతో సాఫ్ట్వేర్నే సర్వీసులుగా అందించే(సాస్) స్టార్టప్లు సైతం పబ్లిక్ ఇష్యూలను చేపట్టాలని యోచిస్తున్నాయి. తద్వారా పెట్టుబడుల సమీకరణతోపాటు స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్టింగ్ను సాధించాలని ఆశిస్తున్నాయి. గత నెలలో రెండు సాస్ స్టార్టప్లు ఐపీవో బాటలో సాగనున్నట్లు ప్రకటించాయి కూడా. ఇవి రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, ఫ్రెష్వర్క్స్ ఇంక్. మర్చంట్ బ్యాంకర్ల సమాచారం ప్రకారం సాస్ స్టార్టప్ల పట్ల ఇన్వెస్టర్లు అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో పలు కంపెనీలు ఈ బాట పట్టనున్నట్లు భావిస్తున్నారు. దేశీయంగా ఆతిథ్యం, ట్రావెల్ విభాగంలో అతిపెద్ద సాస్ కంపెనీగా నిలుస్తున్న రేట్గెయిన్ టెక్నాలజీస్ తొలిగా స్టాక్ ఎక్ఛేంజీలలో లిస్ట్కానున్నట్లు అంచనా వేస్తున్నారు. రూ. 1,200 కోట్లు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకునేందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రేట్గెయిన్ దరఖాస్తు చేసింది. మరోవైపు చెన్నై సిలికాన్ వ్యాలీ కంపెనీ.. ఫ్రెష్వర్క్స్ ఇంక్ 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 730 కోట్లు) సమీకరణకు గత వారాంతాన యూఎస్లో ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. తద్వారా నాస్డాక్ గ్లోబల్ సెలక్ట్ మార్కెట్లో క్లాస్–ఏ కామన్స్టాక్గా లిస్టయ్యే ప్రణాళికల్లో ఉంది. కొన్నేళ్ల నుంచీ సాస్ కంపెనీలు పెట్టుబడులను భారీగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ రంగంలో ఇప్పటివరకూ 6 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 44,000 కోట్లు) పెట్టుబడులు నమోదయ్యాయి. గత మూడేళ్లలోనే 4 బిలియన్ డాలర్లు లభించడం గమనార్హం! కాగా.. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్(ఏపీఐలు)లకు సహకార ప్లాట్ఫామ్గా వ్యవహరించే పోస్ట్మ్యాన్ కంపెనీ ఇటీవల 22.5 కోట్ల డాలర్లను సమీకరించింది. తద్వారా కంపెనీ విలువ 5.6 బిలియన్ డాలర్లను అందుకుంది. వెరసి దేశీయంగా అత్యంత విలువైన సాస్ స్టార్టప్గా ఆవిర్భవించింది. యూనికార్న్లుగా దేశంలో ప్రస్తుతం బిలియన్ డాలర్ విలువను సాధించడం ద్వారా యూనికార్న్ హోదా పొందిన 60 సంస్థలలో 10 స్టార్టప్లు సాస్ విభాగంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదిలో నాలుగు సంస్థలు కొత్తగా జాబితాలో చేరాయి. దేశీయంగా సాస్ విభాగంలో సమర్ధవంతమైన కంపెనీలు ఊపిరి పోసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్లకు ప్రాధాన్యత, ప్రపంచస్థాయి ప్రొడక్టులు సహకరిస్తున్నాయి. డిమాండు ఆధారంగా సంస్థలను నెలకొల్పే టెక్ వ్యవస్థాపకులకుతోడు.. నైపుణ్యం కలిగిన డెవలపర్ల అందుబాటు వంటి అంశాలతో పరిశ్రమ వేగంగా ఎదుగుతున్నట్లు ట్రూస్కేల్ క్యాపిటల్ అధికారి సమీర్ నాథ్ తెలియజేశారు. దీంతో చివరి కస్టమర్లకు పలు విలువైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా దేశీ సాస్ కంపెనీలు పోటీలో ముందుంటున్నట్లు వివరించారు. పలు దేశీ కంపెనీలు యూఎస్తోపాటు, అవకాశాలకు వీలున్న గ్లోబల్ మార్కెట్లపై దృష్టిసారిస్తున్నాయి. అధిక వృద్ధి, ఆదాయాలు, ఆకర్షణీయ మార్జిన్లతో పోటీ సంస్థలతో పోలిస్తే ప్రీమియం విలువలను అందుకుంటున్నాయని విశ్లేషకులు తెలియజేశారు. రేట్గెయిన్ ఐపీవో రేట్గెయిన్ ట్రావెల్ను 2004లో భాను చోప్రా ఏర్పాటు చేశారు. హోటళ్లు, ఎయిర్లైన్స్, ఆన్లైన్ ట్రావెల్, టూర్ ప్యాకేజీ ప్రొవైడర్స్, రైల్, క్రూయిజర్లు తదితరాలలో సొల్యూషన్స్ అందిస్తోంది. ఆతిథ్యం, ట్రావెల్ విభాగంలో అతిపెద్ద డేటాపాయింట్ సర్వీసులను కల్పిస్తోంది. 1400 కస్టమర్ సంస్థలను కలిగి ఉంది. గ్లోబల్ ఫార్చూన్–500 కంపెనీలలో 8 సంస్థలకు సేవలు సమకూర్చుతోంది. హోటళ్ల విభాగంలో ఇంటర్కాంటినెంటల్, కెస్లర్ కలెక్షన్, లెమన్ ట్రీ, ఓయో తదితరాలున్నాయి. ఫ్రెష్వర్క్స్కు పెట్టుబడులు ఇటీవల ఫ్రెష్వర్క్స్ 40 కోట్ల డాలర్ల(రూ. 2,925 కోట్లు) పెట్టు బడులు సమకూర్చుకుంది. దీంతో కంపెనీ విలువ 3.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఫ్రెష్వర్క్స్లో దిగ్గజాలు సీక్వోయా క్యాపిటల్, యాక్సెల్, టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, క్యాపిటల్ జి తదితరాలు ఇన్వెస్ట్ చేశాయి. గత ఏడాది కాలంలో యూఎస్లో సాప్ ఐపీవోలు విజయవంతమయ్యాయి. నాస్డాక్లో లిస్టింగ్ ద్వారా 10 బిలియన్ డాలర్ల విలువను అందుకోవాలని ఫ్రెష్వర్క్స్ చూస్తోంది. వెరసి అతిపెద్ద దేశీ సాస్ స్టార్టప్లలో ఒకటిగా నిలిచే అవకాశముంది. చదవండి : రూ.16వేల కోట్ల ఐపీఓ,పేటీఎం కొత్త స్ట్రాటజీ! -
రేసు గుర్రాల్లా యూనికార్న్లు
ముంబై: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల స్టార్టప్లు దూకుడు చూపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విభాగాలలో కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. వెరసి దేశీయంగా స్టార్టప్ల హవా నెలకొంది. ఇప్పటికే బిలియన్ డాలర్ల (రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్లు 60కు చేరాయి. వీటిని యూనికార్న్లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్లో సాగుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ ఎన్నడూలేని విధంగా కళకళలాడుతోంది. ఈ బాటలో స్టార్టప్ యూనికార్న్లు సైతం పబ్లిక్ ఇష్యూల బాటపడుతున్నాయి. రానున్న రెండేళ్లలో 18 పెద్ద స్టార్టప్లు ఐపీవోలకు రానున్నట్లు వాల్స్ట్రీట్ బ్రోకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవో ఎఫ్ఏ) ఒక నివేదికలో పేర్కొంది. 12 బిలియన్ డాలర్లు... ఈ ఏడాదిలోనే దేశీయంగా 20 స్టార్టప్లు కొత్తగా యూనికార్న్ హోదాను అందుకున్నాయి. ఫలితంగా వీటి సంఖ్య 60ను తాకింది. స్టార్టప్లలో కొద్ది నెలలుగా భారీ స్థాయిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య 100 మార్క్ను చేరవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ సైతం ఈ మార్చిలో ఇదే తరహా అంచనాలు వెలువరించడం గమనార్హం! రానున్న 24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు దిగ్గజాలు బైజూస్, ఫ్లిప్కార్ట్, పేటీఎమ్, ఓలా, ఓయో తదితరాలు ప్రణాళికలు వేశాయి. అంతేకాకుండా పాలసీబజార్, పెప్పర్ఫ్రై, ఇన్మోబి, గ్రోఫర్స్, మొబిక్విక్, నైకా, ఫ్రెష్వర్క్స్, పైన్ల్యాబ్స్, ఫార్మ్ఈజీ, డెలివరీ, డ్రూమ్, ట్రాక్సన్ సైతం ఇదే బాటలో నడవనున్నాయి. తద్వారా సుమారు 18 కంపెనీలు 12 బిలియన్ డాలర్లు(రూ. 88,000 కోట్లు) వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు బీవోఎఫ్ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ గౌరవ్ సింఘాల్ తెలియజేశారు. భారీ ఇష్యూలు.. ఇప్పటికే సెబీ వద్ద పలు స్టార్టప్ దిగ్గజాలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో పేటీఎం(రూ. 16,600 కోట్లు), ఓలా(రూ. 11,000 కోట్లు), పాలసీబజార్ (రూ. 6,000 కోట్లు), నైకా(రూ. 4,000 కోట్లు), మొబిక్విక్(రూ. 1,900 కోట్లు) ఉన్నాయి. ఇటీవల రూ. 6,300 కోట్లు సమీకరించిన జొమాటో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. దేశీయంగా యూనికార్న్లు ఐపీవోలు చేపట్టడం ద్వారా సంప్రదాయ కుటుంబ బిజినెస్ల ట్రెండ్లో మార్పులను తీసుకువచ్చే వీలున్నట్లు సింఘాల్ అభిప్రాయపడ్డారు. దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ)లో ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల వాటా 1 శాతానికంటే తక్కువేనని పేర్కొన్నారు. యూఎస్ మార్కెట్లో 40 శాతం మార్కెట్ వాటాను ఇవి ఆక్రమిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువ రూ. 250 లక్షల కోట్లను తాకిన సంగతి తెలిసిందే. రానున్న ఐదేళ్ల కాలంలో యూనికార్న్ల సంఖ్య రెట్టింపుకావచ్చని అంచనా వేశారు. ఈ ఏడాది యూనికార్న్ హోదాకు చేరిన కంపెనీలలో షేర్చాట్, గ్రో, గప్షుప్, మీషో, ఫార్మ్ఈజీ, బ్లాక్బక్, డ్రూమ్, ఆఫ్బిజినెస్, క్రెడ్, మోగ్లిక్స్, జెటా, మైండ్టికిల్, బ్రౌజర్స్టాక్, ఆప్గ్రేడ్ తదితరాలున్నాయి. త్వరలో మరో 32... ఫ్యూచర్ యూనికార్న్ జాబితాలో చేరగల మరో 32 కంపెనీలను హురున్ ఇండియా తాజాగా ప్రస్తావించింది. ఇవి ఇప్పటికే 50 కోట్ల డాలర్ల విలువను అందుకున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో 20 కోట్ల డాలర్ల విలువను సాధించిన మరో 54 సంస్థలు సైతం జోరు మీదున్నట్లు పేర్కొంది. భవిష్యత్లో యూనికార్న్లుగా ఆవిర్భవించగల కంపెనీల విలువను 36 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దేశీయంగా 60 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నట్లు తెలియజేసింది. 2025కల్లా ఈ సంఖ్య 90 కోట్లను తాకనున్నట్లు వివరించింది. ప్రస్తుతం అత్యధిక యూనికార్న్లున్న దేశాల జాబితాలో అమెరికా(396), చైనా(277) తదుపరి మూడో ర్యాంకులో భారత్ నిలుస్తున్నట్లు పేర్కొంది. -
స్టార్టప్స్కు ఆర్థిక సాయం అందిస్తాం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు)/గోపాలపట్నం (విశాఖ పశి్చమ): రక్షణ రంగానికి ఎదురవుతోన్న అనేక సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలు చూపే స్టార్టప్లు, ఇంక్యుబేషన్ కేంద్రాలకు ఆర్థిక సహకారం అందిస్తామని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ సతీష్రెడ్డి తెలిపారు. ఒక్కో సమస్యకు రూ.కోటి వరకు అందించే వెసులుబాటు తమకు ఉందన్నారు. ఈ దిశగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో నెలకొల్పుతున్న ఇంక్యుబేషన్ కేంద్రం దృష్టిసారించాలని సూచించారు. శుక్రవారం సతీష్రెడ్డి ఏయూని సందర్శించి ఆచార్యులతో సమావేశమయ్యారు. ముందుగా వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. తర్వాత ఆచార్యులతో మాట్లాడుతూ.. రక్షణ రంగ పరిశోధనలకు సంబంధించి ఏయూతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఏయూలో ఏర్పాటవుతున్న ఫుడ్ టెస్టింగ్ లేబరేటరీ.. మైసూరులోని డీఆర్డీవో ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీతో మౌలిక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకోవాలని ఆహా్వనించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సైతం పరిశోధన భాగస్వామ్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బెంగళూరు, ఢిల్లీల్లో ఉన్న తమ ప్రయోగశాలల్లో కలసి పనిచేస్తూ తగిన పరిష్కారాలు చూపాలన్నారు. డిఫెన్స్ టెక్నాలజీపై ఏఐసీటీఈ సహకారంతో పలు ఎంటెక్ కోర్సులను నిర్వహిస్తున్నామని.. వీటిని ఏయూలోనూ ప్రవేశపెట్టాలని కోరారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు విద్యార్థులకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే విధంగా వర్సిటీ ఆచార్యులకు తమ ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి.. వర్సిటీ ఆచార్యులు చేస్తోన్న రక్షణ రంగ పరిశోధన ప్రాజెక్టుల వివరాలు, వాటి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. సతీష్రెడ్డిని వర్సిటీ తరఫున ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పి.హరిప్రసాద్, డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ కామత్ తదితరులు పాల్గొన్నారు. స్వయం ప్రతిపత్తిని సాధించాలి.. కాగా, స్వయం ప్రతిపత్తిని సాధించేందుకు నేవల్ సైన్స్ టెక్నాలజీ లే»ొరేటరీ (ఎన్ఎస్టీఎల్) కృషి చేయాలని, దిగుమతులు తగ్గించుకునేలా వృద్ధి చెందాలని సతీష్రెడ్డి సూచించారు. విశాఖ మానసి ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన ఎన్ఎస్టీఎల్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్ఎస్టీఎల్ రూపొందించిన హైపవర్ లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని పుణేకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) సంస్థకు బదిలీ చేశారు. దీనికి సంబంధించిన పత్రాలను సతీష్రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్టీఎల్ డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
డబ్బే డబ్బు.. భారత్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫిన్టెక్ కంపెనీల్లోకి పెట్టుబడుల వరద సాగుతోంది. 2021 జనవరి–జూన్ కాలంలో రూ.14,900 కోట్లకుపైగా నిధులు వెల్లువెత్తాయని కేపీఎంజీ తన నివేదికలో వెల్లడించింది. 2020 సంవత్సరంలో వచ్చిన ఫండింగ్తో ఇది దాదాపు సమానం కావడం గమనార్హం. పైన్ల్యాబ్స్ రూ.2,860 కోట్లు, క్రెడ్ రూ.1,597 కోట్లు, రేజర్పే రూ.1,189 కోట్లు, క్రెడిట్బీ రూ.1,137 కోట్లు, ఆఫ్బిజినెస్ రూ.817 కోట్లు, భారత్పే రూ.802 కోట్లు అందుకున్నాయి. కంపెనీలు డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేజిక్కించుకున్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. టర్టిల్మింట్ రూ.342 కోట్లు, రెన్యూబీ రూ.334 కోట్లు, డిజిట్ ఇన్సూరెన్స్ రూ.134 కోట్లు స్వీకరించాయి. చిన్న స్థాయి ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఈ స్టార్టప్స్లో పెట్టుబడులు చేశాయి. టాప్–10లో నాలుగు.. ఆసియాలో టాప్–10 డీల్స్లో పైన్ల్యాబ్స్ మూడవ స్థానంలో, క్రెడ్ నాల్గవ, రేజర్పే ఎనమిదవ, క్రెడిట్బీ 10వ స్థానంలో నిలిచింది. ఇక ఐపీవోలు కొనసాగుతాయని కేపీఎంజీ నివేదిక తెలిపిం ది. పాలసీ బజార్ రూ.6,500 కోట్లు, పేటీఎం రూ.16,500 కోట్ల ఐపీవో ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనం, కొనుగోళ్ల విషయంలో ఫిన్టెక్ కంపెనీలను బ్యాంకులు, ఈ రంగంలోని పెద్ద సంస్థలు, సర్వీసులు అందిస్తున్న దిగ్గజాలు లక్ష్యంగా చేసుకున్నాయి. రానున్న ఏడాదిలో ముందు వరుసలో ఉన్న ఫిన్టెక్ యూనికార్న్ కంపెనీలు క్యాపిటల్ మార్కెట్పై దృష్టిసారిస్తాయి. బ్యాంకులు సైతం ఫిన్టెక్ కంపెనీలు, కొత్త బ్యాంకులు, వెల్త్టెక్ కంపెనీలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా సైతం.. తొలి ఆరు నెలల్లో అంతర్జాతీయంగా నిధులు వెల్లువెత్తాయి. రూ.7,28,140 కోట్లు ఫిన్టెక్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. 2020లో ఈ మొత్తం రూ.9,02,745 కోట్లుగా ఉంది. ఈ ఏడాది జనవరి–జూన్లో యూఎస్ కంపెనీల్లోకి రూ.3,78,930 కోట్లు, యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా రూ.2,90,513 కోట్లు, ఆసియా పసిఫిక్ సంస్థల్లోకి రూ.55,725 కోట్లు వచ్చి చేరాయి. విలీనాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ.3,02,400 కోట్ల విలువైన 353 డీల్స్ జరిగాయి. 2020లో 502 డీల్స్ నమోదయ్యాయి. వీటి విలువ రూ.5,49,820 కోట్లు. జూలై–డిసెంబరు కాలంలోనూ అన్ని ప్రాంతాల్లో ఇదే స్థాయిలో పెట్టుబడులు, డీల్స్ ఉండొచ్చని కేపీఎంజీ అంచనా వేస్తోంది. పేమెంట్స్, ఫైనాన్షియల్ సొల్యూషన్స్, బ్యాంకింగ్ యాజ్ ఏ సర్వీస్, బీ2బీ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్లో పెట్టుబడులు ఉంటాయని వివరించింది. చదవండి: భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం -
52 వేల స్టార్టప్స్లకు డీపీఐఐటీ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై నాటికి దేశంలో సుమారు 52,732 స్టార్టప్స్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తింపు, ప్రయోజనాలు పొందాయి. దేశంలో స్టార్టప్స్ల ఆవిష్కరణలు, బలమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్రం స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్) కింద ఇప్పటివరకు 9 ఇంక్యుబేటర్లకు రూ.30 కోట్లు మంజూరు చేసినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ లోకసభకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు. దేశంలో పరిశ్రమల అనుమతుల కోసం సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. దీంతో పెట్టుబడిదారులు వివిధ వాటాదారుల నుంచి అనుమతులు పొందడానికి పలు ఆఫీసులను సందర్శించాల్సిన అవసరాన్ని, సమయాన్ని తగ్గిస్తుందని తెలిపారు. -
స్టార్టప్స్లోకి నిధుల ప్రవాహం..
న్యూఢిల్లీ: దేశీ స్టార్టప్స్లోకి పెట్టుబడుల ప్రవాహం మరింత జోరందుకుంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ వెంచర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే.. అంకుర సంస్థల్లోకి సుమారు 12.1 బిలియన్ డాలర్ల మేర వెంచర్ క్యాపిటల్ (వీసీ) నిధులు రావడం ఇందుకు నిదర్శనం. గతేడాది ఇదే వ్యవధిలో స్టార్టప్ సంస్థల్లోకి సుమారు 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ప్రస్తుతం దానికి రెట్టింపు స్థాయిలో నమోదు కావడం గమనార్హం. ఇటీవలే ట్యాక్సీ సేవల సంస్థ ఓలా 500 మిలియన్ డాలర్లు, సోషల్ కామర్స్ అంకుర సంస్థ డీల్షేర్ 144 మిలియన్ డాలర్లు, ఫిన్టెక్ సంస్థ పైన్ ల్యాబ్స్ 315 మిలియన్ డాలర్లు సమీకరించాయి. 2020 మొత్తం మీద దాదాపు 11 స్టార్టప్లు మాత్రమే యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్) హోదా పొందగా ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా 16 అంకుర సంస్థలు యూనికార్న్ వేల్యుయేషన్ దక్కించుకున్నాయి. అంకుర సంస్థల్లోకి వచ్చిన వీసీ పెట్టుబడుల్లో సింహభాగం ఇన్వెస్ట్మెంట్స్కి సెకోయా క్యాపిటల్ ఇండియా, టైగర్ గ్లోబల్, యాక్సెల్ ఇండియా తదితర సంస్థలు సారథ్యం వహించాయి. విలీనాలు.. కొనుగోళ్లు.. కేవలం పెట్టుబడులను ఆకర్షించడానికే పరిమితం కాకుండా స్టార్టప్స్ విభాగంలో భారీగా ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాల డీల్స్ కూడా చోటు చేసుకుంటున్నాయి. కొత్తగా యూనికార్న్ హోదాను దక్కించుకున్న ఫార్మ్ఈజీ ఇటీవలే .. లిస్టెడ్ కంపెనీ అయిన డయాగ్నొస్టిక్ సర్వీసుల సంస్థ థైరోకేర్లో మెజారిటీ వాటాలను రూ. 4,546 కోట్లకు కొనుగోలు చేసింది. ఎడ్యుకేషన్ టెక్నాలజీ దిగ్గజం బైజూస్ ఏకంగా 1 బిలియన్ డాలర్లు వెచ్చించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను దక్కించుకుంది. కొత్తగా యూనికార్న్ స్థాయికి ఎదుగుతున్న అప్గ్రాడ్ .. ఇలాంటి కొనుగోళ్ల డీల్స్ కోసం 250 మిలియన్ డాలర్లు పైగా కేటాయించింది. మరోవైపు, పలు అంకుర సంస్థలు ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) సందడికి కూడా సిద్ధమవుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ సర్వీసుల సంస్థ జొమాటో అన్నింటికన్నా ముందుగా వస్తోంది. ఐపీవో ద్వారా రూ. 9,375 కోట్లు సమీకరిస్తోంది. జూలై 14న పబ్లిక్ ఇష్యూ ప్రారంభమవుతోంది. ఇక ఫిన్–టెక్ దిగ్గజం పేటీఎం సైతం నవంబర్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చేందుకు సన్నాహాల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి.. సాధారణంగా అంకుర సంస్థలకు దేశీయంగా టాప్ 20–30 నగరాలకు కార్యకలాపాలు విస్తరించిన తర్వాత వృద్ధి అవకాశాలు పెద్దగా ఉండటం లేదని మార్కెట్ పరిశీలకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పుష్కలంగా వస్తున్న నిధుల తోడ్పాటుతో ఇకపై చాలామటుకు స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ల వైపు దృష్టి సారించే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. లిమిటెడ్ పార్ట్నర్స్, మైక్రో వెంచర్ క్యాపిటల్ సంస్థలు తదితర కొత్త తరహా ఇన్వెస్టర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో స్టార్టప్ సంస్థల్లోకి పెట్టుబడుల ప్రవాహం ఇకపైనా కొనసాగే అవకాశం ఉందని పరిశీలకులు వివరించారు. కన్సల్టెన్సీ సంస్థ ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ నివేదిక ప్రకారం 2025 నాటికి అత్యంత సంపన్న భారతీయ ఇన్వెస్టర్లు .. టెక్నాలజీ స్టార్టప్ సంస్థల్లో సుమారు 30 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేయనున్నట్లు అంచనా. -
అగ్రి స్టార్టప్స్.. దున్నేస్తున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘దేశానికి వెన్నెముక రైతు’ అంటారు. కానీ, నేటి సాంకేతిక యుగంలో రైతుకే వెన్నెముకలా నిలుస్తున్నాయి అగ్రి స్టార్టప్స్. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ సమయంలో దేశంలో అన్ని రంగాలు క్షీణిస్తే.. ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే స్థిరమైన వృద్ధిని సాధించింది. ఇందుకు కారణం.. వ్యవసాయ పనుల్లో సాంకేతికతను వినియోగించటమే. వాతావరణం, నేల పరీక్షల నుంచి మొదలుపెడితే.. నాట్లు, ఎరువుల పిచికారీ, పంట నిర్వహణ, కోత, ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్, ధరల నిర్ణయం, గిడ్డంగులు, రుణాలు ఇలా ప్రతి దశలోనూ అగ్రి స్టార్టప్స్ అన్నదాతకు అండగా నిలుస్తున్నాయి. మనది వ్యవసాయ ఆధారిత దేశం. 58 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ప్రస్తుతం దేశంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న అగ్రి స్టార్టప్స్ 50-60 వరకుంటాయి. అగ్రిస్టార్టప్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఆ్రస్టేలియా, అమెరికా, స్విట్జర్లాండ్ ఎక్కువగా ఉంటాయి. భూమి ఎక్కువగా అందుబాటులో ఉండటం, విరివిగా ఆధునిక సాంకేతిత వినియోగం, రైతుల అక్షరాస్యత, వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. మన దేశంలో అగ్రి స్టార్టప్స్ను ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్లు ముందు వరుసలో ఉన్నాయి. స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రోత్సాహం, చాలా వరకు అగ్రి స్టార్టప్స్ ప్రమోటర్లు ఆయా రాష్ట్రాల నుంచే ఉండటం దీనికి ప్రధాన కారణాలని ఓరిగో కమోడిటీస్ కో-ఫౌండర్, డైరెక్టర్ సునూర్ కౌల్ తెలిపారు. దేశీయ అగ్రిటెక్ స్టార్టప్స్ 2014 నుంచి 2020 సెప్టెంబర్ వరకు 467 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. 2025 నాటికి దేశీ అగ్రిటెక్ మార్కెట్ 24.1 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇక్42 అంచనా వేసింది. మొత్తం అగ్రిటెక్ మార్కెట్ టర్నోవర్ 170 బిలియన్ డాలర్లు కాగా.. ఇప్పటివరకు 204 మిలియన్ డాలర్ల మార్కెట్ను మాత్రమే అగ్రిటెక్ స్టార్టప్స్ సాధించాయని పేర్కొంది. గత ఏడాది కాలంగా వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్ వినియోగం బాగా పెరిగింది. దేశంలో లాక్డౌన్ విధించిన కాలంలో అగ్రిటెక్ స్టార్టప్స్ పనితీరు మీద క్యాపిటల్ మేనేజ్మెంట్ అడ్వైజరీ ఓమ్నీవోర్ ఓ సర్వేను నిర్వహించింది. కరోనా ప్రారంభమైన ఏడాది కాలంలో 85% అగ్రిస్టార్టప్స్కు డిమాండ్ పెరిగిందని.. 51% స్టార్టప్స్ కరోనా కంటే మునుపటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 50% వృద్ధిని సాధించాయని తెలిపింది. కోతకు ముందు, తర్వాత సేవలు.. అగ్రి స్టార్టప్స్ సేవలను పంట కోతకు ముందు, తర్వాత అని రెండు రకాలుగా విభజించవచ్చు. క్రిషితంత్ర, మారుట్ డ్రోన్స్, క్రాపిన్ వంటి కంపెనీలు వాతావరణం, నేల రకాన్ని పరీక్షించడం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాల ఎంపిక, ఆర్థిక ప్రోత్సాహం వంటి పంట కోతకు ముందు సేవలను అందిస్తున్నాయి. నిన్జాకార్ట్, ఓరిగో, క్రోఫామ్, ఫామ్లింక్, వంటి కంపెనీలు పంట ఉత్పత్తుల సప్లయి, గిడ్డంగులు, మార్కెటింగ్, ధర ఎంపిక, చెల్లింపుల విధానం వంటి పంట తర్వాత సేవలను అందిస్తున్నాయి. అగ్రిస్టార్టప్స్తో పొలంలో భౌతికంగా పనిచేయాల్సిన అవసరం సగానికి పైగా తగ్గుతుంది. వ్యవసాయ కూలీల కొరత, క్రిమిసంహారకాల పిచికారీతో ఆరోగ్య సమస్యలను అధిగమించడంతో పాటు రైతులకు అధిక పంట దిగుబడులను, లాభాలను ఆర్జించవచ్చు. కార్మికుల వ్యయం, ఎరువుల వాడకం, సమయం వంటి ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుందని మారుట్ డ్రోన్టెక్ సీఈఓ ప్రేమ్కుమార్ విస్లావత్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, తాండూర్, పాలెం, కంపసాగర్ ప్రాంతాల్లోని సుమారు 3,200 మంది రైతులు, 10,800 ఎకరాలలో డ్రోన్స్తో పిచికారి, ఫామ్ ఫీల్డ్ సేవలను అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో అగ్రిస్టార్టప్స్ వృద్ధికి ప్రధాన కారణాలివే... గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరగడం. కరోనా వ్యాప్తితో డిజిటలైజేషన్కు మారటం. విద్యావంతులు వ్యవసాయ రంగంలోకి ఎంట్రీ ఇవ్వటం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వినూత్న పద్దతులు అవలంభిస్తుండటం. అన్ని రంగాల్లో లాగే వ్యవసాయ రంగంలో కూడా అంతర్జాతీయ కంపెనీలు, దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతుండటం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తుండటం. నాణ్యమైన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండటం. ఏ స్టార్టప్స్ ఏ సేవలందిస్తున్నాయంటే? వాతావరణం, నేల పరీక్షలు: క్రిషి తంత్ర, హార్వెస్టో, డీహాట్, మిత్ర, గ్రామోఫోన్. విత్తనాలు, ఎరువుల పిచికారీ: మారుట్ డ్రోన్స్, జనరల్ ఏరోనాటిక్స్, ప్రైమ్ యూఏవీ, థానోస్ టెక్నాలజీస్, బైజాక్, ఫ్రెషోకాట్జ్, ఏజీనెక్ట్స్ టెక్నాలజీస్, స్కైక్రాఫ్ట్. పంట నిర్వహణ: క్రాపిన్, ఏబోనో, క్రిహిహబ్, ఫామ్ఈఆరీ్ప. క్లోవర్, ఆక్సిన్. వ్యవసాయ యంత్రాలు: బిగ్హాట్, ఈఎం3 అగ్రి సర్వీసెస్, కేతీగాడీ, జేఫార్మ్ సర్వీసెస్, ట్రింగో, ఉజ్జయ్, ఫ్లైబర్డ్. సప్లయి, మార్కెటింగ్: అగ్రిబజార్, క్రోఫామ్, ఫామ్పాల్, నిన్జాకార్ట్, ఈకోజెన్, వేకూల్, మేరాకిసాన్, ఫామ్లింక్. రుణాలు, గిడ్డంగులు: ఓరిగో, సమున్నతి, ఫార్మర్ట్, అర్గోస్, జైకిసాన్, పేఅగ్రి, క్యాష్ప్లో, క్రిషీ ట్రేడ్, గ్రామీణ్, డబ్ల్యూహెచ్ఆర్ లోన్స్. చదవండి: కోవిడ్-19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు అవసరం? -
కరోనా విలయం: మహమ్మారిపై ‘స్టార్టప్’ వార్!
నిత్యం లక్షలాదిగా పెరిగిపోతున్న కరోనా కేసులతో ఆస్పత్రులపై భారం పెరిగిపోతోంది. ఇటువంటి క్లిష్ట సమయాల్లో కరోనాను ఎదుర్కొనే విషయంలో స్టార్టప్లు బహుముఖ పాత్ర పోషిస్తుండడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అత్యాధునిక టెక్నాలజీల సాయంతో ఆస్పత్రులు, ప్రజలు, సంస్థలకు సాయపడుతున్నాయి. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో చేదోడుగా నిలుస్తున్నాయి. క్లౌడ్ ఫిజీషియన్ అనే స్టార్టప్ కర్ణాటక, కేరళ, తమిళనాడు, లేహ్ లడక్, బిహార్, కోల్కతా, గుజరాత్ తదితర ప్రాంతాల్లో కరోనాతో తీవ్ర అనారోగ్యం బారిన పడిన 2,700 మంది రోగులు కోలుకునేందుకు తన వంతు పాత్ర పోషించింది. ఆస్పత్రులు, రోగులు, వైద్య నిపుణుల మధ్య అనుసంధానంతో మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ సంస్థ టెక్నాలజీ సాయపడింది. క్లౌడ్ ఫిజీషియన్ ‘‘భారత్లో 3 లక్షల ఐసీయూ (ప్రత్యేక వైద్య పర్యవేక్షణ) పడకలు ఉన్నాయి. కానీ వీటికి సంబంధించి అందుబాటులో ఉన్న ఐసీయూ వైద్యులు 5,000 మందే. దీంతో ఐసీయూ వైద్యంలో నైపుణ్యం ఉన్న డాక్టర్ల సేవలను అందరూ పొందలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం టెక్నాలజీ సాయాన్ని తీసుకోవడమే. ప్రస్తుతానికి 12 రాష్ట్రాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. 25 ఆస్పత్రుల పరిధిలోని 250 ఐసీయూ బెడ్ల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నాము. మా టెక్ ప్లాట్ఫామ్ ‘రాడార్’ ద్వారా ఐసీయూ రోగుల పర్యవేక్షణకు సంబంధించి నర్సులు, జూనియర్ డాక్టర్లకు సాయపడుతున్నాము. రాడార్ ప్లాట్ఫామ్ అన్నది ఐసీయూ పడకలను మా కమాండ్ కేంద్రంతో అనుసంధానం చేస్తుంది. బెంగళూరులోని ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో బహుళ విభాగాల్లో నిష్ణాతులైన ఐసీయూ స్పెషలిస్టు వైద్యుల బృందం పనిచేస్తుంటుంది. వీరు ఎప్పటికప్పుడు చికిత్సలను పర్యవేక్షిస్తుంటారు’’ అని క్లౌడ్ ఫిజీషియన్ సహ వ్యవస్థాపకుడు ధృవ్జోషి తెలిపారు. వృత్తి రీత్యా జోషి పల్మనరీ, క్రిటికల్ కేర్ వైద్య నిపుణుడు కావడం గమనార్హం. క్రిటికల్ కేర్ వైద్య సేవలకు నిపుణుల కొరతను గుర్తించిన ఆయన ఈ దిశగా క్లౌడ్ ఫిజీషియన్ను ఏర్పాటు చేసి తన లక్ష్యాల దిశగా సాగిపోతున్నారు. (18 ఏళ్లు పైబడిన వారికి టీకా: ఖర్చు ఎంతో తెలుసా?) డోజీ... రోగులను ఆన్లైన్ మాధ్యమంలో పర్యవేక్షించే సంస్థే డోజీ. కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ ఆధారితంగా ఈ ప్లాట్ఫామ్ పనిచేస్తుంటుంది. ఆస్పత్రిలోని ఎటువంటి పడకనైనా నిమిషాల వ్యవధిలోనే తన టెక్నాలజీ సాయంతో ఐసీయూగా మార్చేయగలదు. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల పర్యవేక్షణలో కీలకమైన సేవలను అందిస్తోంది. ఈ దేశీయ స్టార్టప్ రోగికి సంబంధించి కీలక అవయవాల పనితీరును పర్యవేక్షిస్తుంటుంది. గుండె కొట్టుకునే రేటు, శ్వాస తీసుకునే రేటు, ఆక్సిజన్ శాచురేషన్(ఎస్పీవో2), నిద్ర తదితర అంశాలను పరిశీలిస్తూ వైద్యులకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. గడిచిన రెండు వారాల్లోనే 30కు పైగా ఆస్పత్రులు డోజీ ప్లాట్ఫామ్తో ఒప్పందాలు చేసుకున్నాయంటే ఈ సంస్థ సేవల ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డోజీ 4,000 కరోనా హై డిపెండెన్సీ యూనిట్ (హెచ్డీయూ) పడకలను పర్యవేక్షిస్తోంది. (జొమాటో కొత్త ఫీచర్, దయచేసి మిస్ యూజ్ చేయకండి!) టెక్నాలజీ పాత్ర... ‘కరోనా రెండో విడతలో వేగంగా వ్యాపిస్తోంది. ఆస్పత్రులు ఆర్పీఎం, నూతన ఏఐ టెక్నాలజీల సాయంతో మహమ్మారిని ఎదుర్కొనే వ్యూహాలను అనుసరిస్తున్నాయి. రిమోట్గా రోగులను పర్యవేక్షించడం వల్ల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. సిబ్బంది కొరతను కూడా అధిగమించొచ్చు’ అని డోజీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు ముదిత్ దంద్వతే పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో రోగుల పర్యవేక్షణ సెల్లను ఈ సంస్థ ఏర్పాటు చేయడమే కాకుండా.. క్షేత్ర స్థాయిలో రోజులో 24 గంటలూ సహాయ, సహకారాలు అందిస్తోంది. బీ2బీ (బిజినెస్ నుంచి బిజినెస్ మధ్య వ్యాపారం) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ/ఇంటర్నెట్ అనుసంధానిత సేవలు) సొల్యూషన్లను అందించే సెన్స్గిజ్ టెక్నాలజీస్.. తొలి దశ కరోనా సమయంలో వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో సేవలు అందించింది. ‘దేశవ్యాప్తంగా 5,000కు పైగా ఉద్యోగులకు మా సెన్స్గిజ్ సెంటినెల్ ప్లాట్ఫామ్ ద్వారా భౌతిక దూరం, ఎక్కడ ఉన్నదీ గుర్తించే సేవలను అందిస్తున్నాం. తద్వారా వ్యాపార కార్యకలాపాలు ఆటంకాల్లేకుండా సాయపడుతున్నాము. హార్డ్వేర్ (ఉద్యోగులకు రిస్ట్బ్యాండ్), సాఫ్ట్వేర్ కూడా ఈ సేవల్లో భాగంగా ఉంటాయి. ఇదే ప్లాట్ఫామ్ ద్వారా 2,500 మందికి పైగా ఐపీఎల్ యూజర్ల కోసం వర్చువల్ బయో బబుల్ జోన్నూ నెలకొల్పాం. తద్వారా ఆటగాళ్లు, వారికి సేవలు అందించే సిబ్బంది, మ్యాచుల అధికారుల భద్రత కు భరోసా ఇచ్చాం. ఇండియా–ఇంగ్లాండ్ సిరీస్కు కూడా ఇదే విధమైన సేవలు అందించాము. 1,0,000 మందికి పైగా జీవితాలపై మా ప్రభావం ఉంటుంది’అని సెన్స్విజ్ టెక్నాలజీస్ మార్కెటింగ్ హెడ్ కుల్దీప్ రాణే వివరించారు. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు) వీడియో కన్సల్టేషన్లు.. వైద్యులు, రోగుల మధ్య వీడియో సంప్రదింపులకు ‘ఎంఫైన్’ అనే ప్లాట్ఫామ్ సేవలు అందిస్తోంది. యాప్ ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకునే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇటీవలే ఈ సంస్థ ఎంఫైన్ పల్స్ పేరుతో ఒక యాప్ను ఆవిష్కరించింది. దీని సాయంతో రక్తంలో ఆక్సిజన్ పరిమాణం (ఆక్సిజన్ శాచురేషన్/ఎస్పీవో2) ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. స్మార్ట్ఫోన్లో యాప్ను ఇన్స్టాల్ చేసుకుని తమ ఎస్పీవో2ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవచ్చు. కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న తరుణంలో ఎస్పీవో2 ట్రాక్ టూల్ను వినియోగించే వారి శాతం పది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. అలాగే, కరోనా స్వీయ పర్యవేక్షణ టూల్ను వినియోగించే వారు ఐదు రెట్లు, వీడియో కన్సల్టేషన్లు 80 శాతం పెరిగినట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి సంక్షోభంలో టెలిమెడిసిన్, డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సేవలన్నవి సాధారణంగా మారిపోయాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పర్యవేక్షణ, చికిత్సల ప్రణాళికల విషయంలో ఎంఫైన్ పల్స్ కీలకపాత్ర పోషిస్తోంది’’ అని ఎంఫైన్ సీటీవో అజిత్ నారాయణన్ పేర్కొన్నారు. -
స్టార్టప్ల లిస్టింగ్కు సెబీ బూస్ట్
న్యూఢిల్లీ: స్టార్టప్ల లిస్టింగ్ను ప్రోత్సహించే బాటలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొన్ని నిబంధనలను సరళీకరించింది. 25 శాతం ప్రీ ఇష్యూ క్యాపిటల్ హోల్డింగ్ సమయాన్ని రెండేళ్ల నుంచి ఏడాదికి కుదించడం తదితర సవరణలను చేపట్టింది. అంతేకాకుండా అర్హతగల ఇన్వెస్టర్లకు విచక్షణాధికార కేటాయింపునకు సైతం అనుమతించనుంది. 30 రోజుల లాకిన్ గడువుతో ఇష్యూ పరిమాణంలో 60 శాతం వరకూ షేర్లను కేటాయించవచ్చు. ఇన్నోవేటర్స్ గ్రోత్ ప్లాట్ఫామ్ ద్వారా స్టార్టప్ల లిస్టింగ్కు వీలు కల్పించనుంది. గురువారం (మార్చి 25) జరిగిన బోర్డు సమావేశంలో సెబీ ఇంకా లిస్టెడ్ కంపెనీలు, ప్రమోటర్లు, ఆర్థిక ఫలితాలు తదితర అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇతర వివరాలివీ.. 1,000 కంపెనీలకు.. ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలను నిర్ధారించడంలో ప్రస్తుతమున్న మార్గదర్శకాలను సెబీ క్రమబద్దీకరించింది. ఇక లిస్టెడ్ కంపెనీలు నిర్వహణ సంబంధ(సస్టెయినబిలిటీ) నివేదికలను రూపొందించడంలో కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. ప్రస్తుత బీఆర్ఆర్ స్థానే వ్యాపార బాధ్యతలు, నిర్వహణ సంబంధ నివేదిక (బీఆర్ఎస్ఆర్) పేరుతో తాజా నిబంధనలు రూపొందించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ) రీత్యా టాప్-1,000 లిస్టెడ్ కంపెనీలకు తాజా బీఆర్ఎస్ఆర్ నిబంధనలు వర్తించనున్నాయి. వీటిని వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో స్వచ్చందంగా పాటించేందుకు వీలుంది. అయితే 2022-23 ఏడాది నుంచి తప్పనిసరిగా ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేయాలి. డివిడెండ్ పంపిణీ విధానాల అమలులో ప్రస్తుతమున్న టాప్-500 లిస్టెడ్ కంపెనీల జాబితాను తాజాగా టాప్–1,000కు సవరించింది. 24 గంటల్లోగా లిస్టెడ్ కంపెనీలు విశ్లేషకులు, ఇన్వెస్టర్ల సమావేశాలను నిర్వహించినప్పడు ఈ ఆడియో, వీడియో వివరాలను 24 గంటల్లోగా(తదుపరి ట్రేడింగ్ రోజు) తమ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచవలసి ఉంటుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలకు సైతం అందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరి్థక ఫలితాలు ప్రకటించిన ఐదు పని దినాలలోగా వెబ్సైట్లు, స్టాక్ ఎక్సే్ఛంజీలకు సమాచారాన్ని చేరవేయవలసి ఉంటుంది. రెండు రోజులపాటు సమావేశాలను నిర్వహించిన పక్షంలో ఆర్థిక ఫలితాలను 30 నిమిషాల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. ఇన్వెస్టర్ల ఫిర్యాదులు, కార్పొరేట్ పాలన, వాటాదారుల వివరాలు వంటి అంశాలను ప్రతి క్వార్టర్ తదుపరి 21 రోజుల్లోగా వెల్లడించవలసి ఉంటుంది. కంపెనీలో మెజారిటీ వాటాలను విక్రయించాక ప్రమోటర్లు నామమాత్ర వాటాలను మాత్రమే కలిగి ఉండి, యాజమాన్య బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు పబ్లిక్ వాటాదారుగా గుర్తించే అంశంలోనూ నిబంధనలను సవరించింది. డీలిస్టింగ్ వెనుక ఉద్దేశ్యం చెప్పాల్సిందే మార్కెట్ల నుంచి కంపెనీల డీలిస్టింగ్ను మరింత పారదర్శకంగా మార్చాలని సెబీ నిర్ణయించింది. ఇందుకోసం డీలిస్టింగ్ ప్రకటన చేసే ప్రమోటర్లు/కొనుగోలుదారులు తమ ఉద్దేశ్యాన్ని వెల్లడించేలా చేయాలని సెబీ నిర్ణయించింది. అలాగే, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల నిర్వచనం కింద నిషేధిత కార్యకలాపాలు లేదా రంగాల జాబితాను తొలగించాలని కూడా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) కింద నమోదైన వెంచర్క్యాపిటల్ ఫండ్స్కు వెసులుబాటు రానుంది. డీలిస్టింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో ఇందుకు సంబంధించి నిబంధనల సవరణకు బోర్డు ఆమోదం తెలిపినట్టు సెబీ గురువారం ప్రకటించింది. నూతన నిబంధనల కింద ప్రతిపాదిత డీలిస్టింగ్కు సంబంధించి ఇండిపెండెంట్ డైరెక్టర్లు తమ సిఫారసులు తెలియజేయాల్సి ఉంటుంది. చదవండి: సూయజ్కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం ఈ బ్యాంకు కస్టమర్లకు బిగ్అలర్ట్! -
‘టెక్’ చదువుల్లో పరిశోధన అంతంతే!
దేశంలోని ఇంజనీరింగ్ కాలేజీలు 10,989 పరిశోధనా కేంద్రాలు ఉన్న కాలేజీలు 907 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో పరిశోధనలు జరగడం లేదు. ఎలాంటి కొత్త ఆవిష్కరణలూ రావడం లేదు. రీసెర్చ్కు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం మొత్తుకుంటున్నా కూడా.. కాలేజీలు ఉన్న సిలబస్నే బట్టీకొట్టిస్తూ నడిపించేస్తున్నాయి. ఏదో నామమాత్రంగా సాధారణ చదువులకే పరిమితం అవుతున్నాయి. దీంతో ఇంజనీరింగ్ చదువు పూర్తిచేస్తున్న చాలా మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా మొత్తం 10,989 ఇంజనీరింగ్ కాలేజీలుంటే అందులో కేవలం 907 కాలేజీల్లో (8.25 శాతం) మాత్రమే పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక స్టార్టప్ పాలసీని అమలు చేస్తున్న కాలేజీలు 17 శాతానికి మించి లేవు. ఇలాంటి పరిస్థితుల కారణంగానే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల్లో 57 శాతం మందికి ఉద్యోగాలు లభించడం లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తమ నివేదికలో వెల్లడించింది. కేవలం 43 శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు పేర్కొంది. హాజరు మినహాయింపు.. పరిశోధన, స్టార్టప్లను ప్రోత్స హించడం ద్వారా విద్యార్థులు సొంతంగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని, మెరుగైన ఉద్యోగావకాశాలైనా లభిస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కాలంగా చెబుతున్నాయి. కానీ దీనిని అందిపుచ్చుకోవడంలో విద్యా సంస్థలు విఫలం అవుతున్నాయి. తెలంగాణలో కూడా 5- 10 శాతం విద్యా సంస్థల్లోనే స్టార్టప్ పాలసీ అమలవుతోంది. స్టార్టప్లపై పనిచేసే విద్యార్థులకు 10 శాతానికిపైగా హాజరు మినహాయింపు ఇచ్చినా.. కాలేజీలు ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించడంలో వెనుకబడే ఉన్నాయి. 2019–20లో దేశవ్యాప్తంగా 10,989 ఇంజనీరింగ్ కాలేజీలు కొనసాగగా.. ఇందులో స్టార్టప్లకు అవసరమైన సదుపాయాలు ఉన్నవి 2013 మాత్రమే. వీటిలోనూ 1,869 కాలేజీల్లో మాత్రమే స్టార్టప్ పాలసీ అమలవుతోంది. వీటన్నింటిలో కలిపి 6,021 స్టార్టప్లు కొనసాగుతున్నాయని ఏఐసీటీఈ గుర్తించింది. ఇక 907 కాలేజీల్లో (8.25 శాతం) మాత్రమే పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర సర్కారు చెబుతున్నా.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో పరిశోధనలు, స్టార్టప్లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా.. కాలేజీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పేరున్న టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో వెనుకబడే ఉన్నాయి. 5 -10 శాతం కాలేజీలు మినహా మిగతా ఇంజనీరింగ్ కాలేజీలన్నింటిలో 95 శాతం ఫ్యాకల్టీని కేవలం బోధనకే పరిమితం చేస్తున్నారు. పరిశోధనలు, స్టార్టప్లను ప్రోత్సహించాలంటే సమయంతోపాటు ఆర్థిక తోడ్పాటు కూడా అవసరం. ఆ దిశగా కాలేజీలు చర్యలు చేపట్టడం లేదు. మెజారిటీ విద్యార్థులు తమకు ఎన్నో ఆలోచనలు ఉన్నా ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నారు. 5 వేల స్టార్టప్లు లక్ష్యంగా పాలసీ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ పాలసీని తీసుకువచ్చినా.. ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించడంలో కాలేజీలు వెనుకంజలో ఉన్నాయి. అయితే రాష్ట్రంలోని రాష్ట్ర విద్యా సంస్థలు కాకుండా జాతీయ స్థాయి సంస్థల్లో మాత్రం పరిశోధనలు, స్టార్టప్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇక ఇంజనీరింగ్ విద్యా సంస్థలు మినహా మిగతా రంగాల్లోని ప్రైవేటు సంస్థలు పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేశాయి. జేఎన్టీయూ, ఉస్మానియా వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మాత్రం వీహబ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసింది. వాటి పరిధిలోని కాలేజీల విద్యార్థులు కొద్దిమంది మాత్రం తమ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఇంక్యుబేటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యాసంస్థలు పరిశోధనలు, స్టార్టప్లకు ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. రాష్ట్ర సర్కారు మాత్రం స్టార్టప్లను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది. మరోవైపు మంత్రి కేటీఆర్ చొరవతో 5 వేల స్టార్టప్లు లక్ష్యంగా రాష్ట్ర ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. -
దేశీ యాప్లపై దృష్టి
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్లో పాల్గొనాలని ప్రధాని మోదీ స్టార్టప్లు, ఐటీ సంస్థలకు పిలుపునిచ్చారు. భారత్ తయారీ యాప్లు ప్రపంచ స్థాయిలో రాణించగలవని నిరూపించాలని ఆయన కోరారు. ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్న భారతీయ యాప్లలో ఉత్తమమైన వాటిని గుర్తించి, ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం 59 చైనీస్ యాప్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన శనివారం ‘ఆత్మనిర్భర్ భారత్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను ప్రారంభించడం గమనార్హం. ఈ చాలెంజ్ ఆత్మనిర్భర్ యాప్ ఎకోసిస్టమ్ను రూపొందించేందుకు దోహదపడుతుందన్నారు. ‘ఎవరికి తెలుసు?, మీరు రూపొందించిన ఈ యాప్లను నేను కూడా ఉపయోగించవచ్చునేమో’అని ఆయన లింక్డ్ ఇన్లో వ్యాఖ్యానించారు. ప్రపంచస్థాయి ‘మేడ్ ఇన్ ఇండియా యాప్స్’ తయారు చేయాలని ఐటీ, స్టార్టప్ రంగాల వారిలో అపారమైన ఉత్సాహం ఉందని తెలిపారు. వీరి ఆలోచనలు, ఉత్పాదనలకు సరైన వేదిక కల్పించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి ‘ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్’ ప్రారంభించాయన్నారు. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వారు గానీ, అలాంటి ఉత్పత్తులను సృష్టించే దృష్టి, నైపుణ్యం ఉన్న వారికి ఇది సాయపడుతుందని చెప్పారు. టెక్ రంగానికి చెందిన వారంతా ఇందులో పాల్గొనాలని ఆయన కోరారు. కోవిడ్ సృష్టించిన అనేక సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారాలు లభిస్తున్నాయని తెలిపారు. దీంతోపాటు ప్రధాని మోదీ.. వ్యవసాయ పరిశోధనలు, విస్తరణ, విద్య రంగాలపై అధికారులతో సమీక్ష జరిపారు. బీజేపీ శ్రేణులకు ప్రశంస లాక్డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రధాని మోదీ అతిపెద్ద సేవా యజ్ఞంగా పేర్కొన్నారు. శనివారం ఆయన ఏడు రాష్ట్రాల బీజేపీ శాఖల నేతలతో ఆన్లైన్ ద్వారా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన లాక్డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను కొనియాడారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ఈ కార్యక్రమంలో మాట్లాడారు. బుద్ధుని బోధనలు..నేటి సవాళ్లకు పరిష్కారాలు బుద్ధ భగవానుని బోధనలు నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాశ్వత పరిష్కారం చూపుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఆషాఢ పూర్ణిమ నాడు పాటించే ధమ్మ చక్ర దినం సందర్భంగా ప్రధాని వర్చువల్ ప్రసంగం చేశారు. ఆశ, ప్రయోజన పూర్వక జీవితమే మానవ దుఃఖాలను దూరం చేసే మార్గమని బుద్ధ భగవానుడు సారనాథ్లో తన మొదటి సందేశంలోనే చెప్పారన్నారు. తోటి వారిలో జీవితం పట్ల ఆశను ప్రేరేపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. లద్దాఖ్లో శుక్రవారం పర్యటన సందర్భంగా సింధు నది ఒడ్డున చేసిన సింధుపూజ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. -
టెక్ స్టార్టప్లలో భారీ నియామకాలు
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలోని స్టార్టప్స్ (అంకుర సంస్థలు) ఈ ఏడాదిలో 60,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. ఐటీ మంత్రిత్వ శాఖ, పరిశ్రమ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్’ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలియజేసింది. నాస్కామ్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని టాప్ 15 కంపెనీలు నిరంతరం ఉద్యోగాలను కల్పిస్తూనే ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. -
హిప్.. హిప్.. స్టార్టప్!
బెంగళూరు: స్టార్టప్ వ్యవస్థకు సంబంధించి భారత్ మూడో అతి పెద్ద దేశంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. దీంతో గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సుమారు 8,900–9,300 స్థాయికి చేరినట్లయిందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మంగళవారం వెల్లడించింది. గతేడాది టెక్ స్టార్టప్ల సంఖ్య సుమారు 7,800–8,200 దాకా ఉంది. ఇదే ఊపు కొనసాగితే 2014–2025 మధ్య కాలంలో భారత స్టార్టప్ వ్యవస్థ 10 రెట్లు వృద్ధి నమోదు చేయగలదని పేర్కొంది.ఇక 2025 నాటికి యూనికార్న్ల (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్లు) సంఖ్య దేశీయంగా 95–105 శ్రేణిలో ఉండొచ్చని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. 2014లో 10–20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న స్టార్టప్ వ్యవస్థ వేల్యుయేషన్ 2025 నాటికి 350–390 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని, 10 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని ఆమె పేర్కొన్నారు. ‘భారత స్టార్టప్ వ్యవస్థ వృద్ధి ఒక అద్భుత గా«థ. ప్రభుత్వం, పరిశ్రమ మద్దతుతో మరింత వేగంగా 10 రెట్లు వృద్ధి సాధించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి‘ అని ఘోష్ వివరించారు. 16వ నాస్కామ్ ప్రోడక్ట్ సదస్సులో కార్యక్రమంలో దేశీ టెక్నాలజీ స్టార్టప్ వ్యవస్థపై నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. స్టార్టప్ల కేంద్రంగా బెంగళూరు .. సంఖ్యాపరంగా అత్యధిక టెక్నాలజీ స్టార్టప్లతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్ తర్వాత స్థానంలో ఉంది. కొత్తగా వస్తున్న టెక్ స్టార్టప్ల్లో 12–15 శాతం సంస్థలు వర్ధమాన నగరాల నుంచి ఉంటుండటం గమనార్హం. స్టార్టప్స్లోకి గతేడాది 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఈ ఏడాది ఇప్పటిదాకా 4.4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని ఘోష్ చెప్పారు. గతేడాది 17గా ఉన్న యూనికార్న్ల సంఖ్య ఈసారి 24కి పెరిగిందని, ఏడాది ముగిసేలోగా మరో 2–3 కొత్తగా జతవ్వొచ్చని వివరించారు. గతేడాది టెక్ స్టార్టప్లు ప్రత్యక్షంగా 40,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1.6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కలి్పంచాయని చెప్పారు. ఈ ఏడాది 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1.3–1.8 లక్షల పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగిందని ఘోష్ వివరించారు. దేశీ స్టార్టప్లకు మార్కెట్, నిధుల లభ్యతపరమైన సవాళ్లు ఉంటున్నాయని చెప్పారు. -
స్టార్టప్లతో లక్ష్యాలను చేరుకోండి
సాక్షి, మణికొండ: యువ ఇంజినీర్లు స్టార్టప్లను ఏర్పాటుచేసి ఇతరుకుల ఉపాధిని చూపే స్థాయి ఎదగాలని జాతీయ పరిశోధనా సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పురుషోత్తం ఆకాంక్షించారు. గండిపేటలోని సీబీఐటీ కళాశాలలో శనివారం 3వ గ్రాడ్యుయేషన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని విద్యార్థులకు కళాశాల అధ్యక్షుడు డాక్టర్ వి.మాలకొండారెడ్డితో కలిసి పట్టాలు అందించారు. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్లకు యేటా రూ.10వేల కోట్లను కేటాయించి ప్రోత్సహిస్తోందని తెలిపారు. క్రమశిక్షణతో జీవితంలో స్థిరపడి వచ్చిన సంపాదనలో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నైపుణ్యం ఉన్నవారికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటంతో పాటు ఎన్ఆర్డీసీ సహకరిస్తుందని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థుల్లో యేటా 18 నుంచి 20శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారని చెప్పారు. చదువుతో పాటు సమాజంపై పరిజ్ఞానం ఉంటేనే రాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 700మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో డెవలప్మెంట్, పర్చెజింగ్ కమిటీ చైర్పర్సన్ సంధ్యశ్రీ, ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టాలను అందుకున్న ఆనందంలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. -
ఐపీఓ రూట్లో స్టార్టప్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టార్టప్స్ ఐపీఓ బాట పట్టాయి. బెంగళూరు, పుణె, ముంబై, హైదరాబాద్ తదితర నగరాలకు చెందిన 200కు పైగా స్టార్టప్లు ప్రస్తుతం ఐపీఓకి ముస్తాబయ్యాయి. దాదాపు రూ.1,000 కోట్ల నిధుల సమీకరించాలన్నది వీటి లక్ష్యం. వీటిలో భాగంగా అన్ని అనుమతులతో సోమవారం పుణెకు చెందిన టెక్నాలజీ కన్సల్టింగ్ సర్వీసెస్ అండ్ సపోర్ట్ సంస్థ ‘ఆల్ఫాలాజిక్ టెక్సైస్ లిమిటెడ్’... ఇష్యూకు వస్తోంది. ముంబైకి చెందిన వైద్య పరికరాల తయారీ సంస్థ ట్రాన్స్పాక్ట్ ఎంటర్ప్రైసెస్ లిమిటెడ్ ఐపీఓకు కూడా అనుమతి వచ్చింది. వీటి దరఖాస్తులు అనుమతి పొందాయని బీఎస్ఈ ఇండియా ప్రతినిధి ముఖేష్ షా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో చెప్పారు. ఒక్కో స్టార్టప్స్ తొలి దశలో రూ.5 కోట్ల నిధులను సమీకరిస్తాయని తెలియజేశారు. లిస్టింగ్కు దరఖాస్తు చేసిన స్టార్టప్స్ కార్యకలాపాలు, లావాదేవీలు, మేనేజ్మెంట్ ఇతరత్రా అంశాలను పరిశీలించిన తర్వాత ఐపీఓకి అనుమతి వస్తుంది కనక... దీనికి దాదాపు 3 నెలల సమయం పడుతుందని చెప్పారాయన. పరిశ్రమలో కొత్త ట్రెండ్.. దేశీ స్టార్టప్స్ పరిశ్రమలో ఐపీవో అనేది కొత్త ట్రెండే. ఎందుకంటే స్టార్టప్స్కు కార్యకలాపాల విస్తరణకు నిధులు కావాలంటే ఇప్పటిదాకా వెంచర్ క్యాపలిస్ట్ (వీసీ), సంస్థాగత పెట్టుబడిదారుల వైపు చూడాల్సి వస్తోంది. దీంతో స్టార్టప్లలో మెజారిటీ వాటా వారి చేతుల్లోకి వెళ్లటం, వారి నియంత్రణలో కార్యకలాపాలు సాగించాల్సి రావటం జరుగుతోంది. బీఎస్ఈ లిస్టింగ్తో ఈ ఇబ్బందులు తప్పుతాయని స్టార్టప్ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఓకి అర్హతలివే.. ► ఐటీ, ఐటీఈఎస్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిగ్ డేటా, ఈ–కామర్స్, వర్చువల్ రియాలిటీ , బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్, త్రీడీ ప్రింటింగ్, స్పేస్ టెక్నాలజీ, హైటెక్ డిఫెన్స్, నానో టెక్నాలజీ వంటి విభాగాల్లోని స్టార్టప్స్కు లిస్టయ్యే అవకాశముంది. ► ఎంఎస్ఎంఈ లేదా డిఐపీపీలో నమోదైన స్టార్టప్స్కు మాత్రమే బీఎస్ఈలో లిస్టయ్యే అర్హత ఉంటుంది. వీటిల్లో నమోదు కాని వాటికి రూ.కోటి చెల్లించిన మూలధనం ఉండాలి. ► కంపెనీల చట్టం కింద రిజిస్టరయి... కనీసం రెండేళ్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి ఉండాలి. వెబ్సైట్తో పాటు షేర్లు డీమ్యాట్ రూపంలో ఉండాలి. ► ఏడాది కాలంలో స్టార్టప్స్ ప్రమోటర్లలో ఎలాంటి మార్పులూ ఉండకూడదు. డైరెక్టర్లపై నిషేధం ఉండకూడదు కూడా. -
త్వరలో కొత్త పసిడి విధానం
న్యూఢిల్లీ: పసిడిపై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. త్వరలో బంగారంపై కొత్త విధానం ప్రకటించే అవకాశం ఉందని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారమిక్కడ తెలియజేశారు. పసిడి పరిశ్రమ వృద్ధి, ఆభరణాల ఎగుమతుల వృద్ధి ప్రధాన లక్ష్యాలతో తాజా విధాన రూపకల్పన ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం మొత్తం భారత ఎగుమతుల్లో రత్నాలు, ఆభరణాల వాటా 15 శాతంగా ఉంది. విధాన రూపకల్పనలో భాగంగా సంబంధిత వర్గాలతో రానున్న కొద్ది రోజుల్లో సమావేశం కానున్నట్లు ప్రభు తెలిపారు. పసిడిపై ప్రస్తుతం 10 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలన్న పరిశ్రమ డిమాండ్ను కూడా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 100 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు లక్ష్యం.. భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్డీఐ) ఆకర్షించడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు మంత్రి ప్రభు తెలిపారు. వచ్చే రెండేళ్లలో 100 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రప్పించటమనేది కేంద్రం లక్ష్యమని తెలిపారు. భారత్లో ఏ రంగాలు భారీ పెట్టుబడులను కోరుతున్నాయి? ఇందుకు ఏ దేశాల నుంచి పెట్టుబడులను పొందే అవకాశం ఉంటుంది? వంటి అంశాలపై వాణిజ్య, పరిశ్రమల పరిశ్రమల మంత్రిత్వశాఖ దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ దిశగా విదేశాలతో చర్చలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. స్టార్టప్స్ పన్ను సమస్యల పరిష్కారం స్టార్టప్స్ పురోగతికి కేంద్రం తగిన చర్యలన్నీ తీసుకుంటుందని సురేశ్ ప్రభు తెలిపారు. ప్రత్యేకించి ఏంజిల్ ఫండ్స్ నుంచి నిధుల సమీకరణలో స్టార్టప్స్ ఎదుర్కొంటున్న పన్ను సంబంధ సమస్యలు పరిష్కరించాలని ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీని కోరినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. స్టార్టప్స్, ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఎదుర్కొంటున్న పన్ను సమస్యల పరిష్కార మార్గాలను సూచించడానికి గత వారం కేంద్రం ఒక నిపుణుల కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. -
స్టార్టప్స్ వేల్యుయేషన్స్పై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన స్టార్టప్ సంస్థలు భారీ వేల్యుయేషన్స్ దక్కించుకుంటూ ఉండటంపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ దృష్టి సారించింది. ఈ స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు భారీ ప్రీమియంతో షేర్లు తీసుకోవడం వెనుక అసలు కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. తొలి విడత నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్స్ గణనీయంగా పడిపోయిన కంపెనీలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 2013 నుంచి నిధులు సమీకరించిన 2,000 పైచిలుకు స్టార్టప్స్కు గత 45 రోజుల్లో నోటీసులు పంపినట్లు సమాచారం. అసలు ఏ ప్రాతిపదికన ఇంత వేల్యుయేషన్ లెక్కగట్టి నిధులు సమీకరించారో వివరణనివ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఏదైనా ప్రభుత్వ పథకం కింద మినహాయింపులేమైనా పొందాయా అన్న విషయాన్ని కూడా తెలపాలని నోటీసుల్లో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘మీ స్టార్టప్ సంస్థ అధిక ప్రీమియంతో షేర్లను కేటాయించడం జరిగింది. దీన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారు. అలాగే, స్టార్టప్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి మినహాయింపులు పొందారో తెలపాలి‘ అంటూ స్టార్టప్లకు ఎంసీఏ నోటీసులు పంపింది. అయితే, వీటిల్లో ట్యాక్సేషన్ గురించి లేదా పెనాల్టీల గురించిన ప్రస్తావన ఏమీ లేదు. వేల్యుయేషన్ను ప్రభావితం చేసే అంశాలు అనేకం.. మరోవైపు, స్టార్టప్స్ వేల్యుయేషన్స్ అనేవి భవిష్యత్ లాభదాయకత మొదలైన అనేక అంశాల ఆధారంగా ఉంటాయని పన్నుల నిపుణులు తెలిపారు. వేల్యుయేషన్ లెక్కింపునకు పాటించే విధానాలు సందర్భానుసారంగా వివాదాస్పదంగానూ కనిపించవచ్చని పేర్కొన్నారు. ఇక అధిక ప్రీమియంతో నిధులు సమీకరించినా.. వ్యాపార పరిస్థితులు, తీవ్ర పోటీ, అధిక వృద్ధి సాధనలో మేనేజ్మెంట్ విఫలం కావడం వంటి అంశాల కారణంగా వేల్యుయేషన్ పడిపోయే అవకాశాలు ఉన్నాయని ట్యాక్స్ నిపుణులు తెలిపారు. ఆదాయ పన్ను శాఖ కూడా 2016లో స్టార్టప్స్ నుంచి ఇలాంటి వివరణే అడిగిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. తొలి రౌండు నిధుల సమీకరణ తర్వాత వేల్యుయేషన్స్ పడిపోయిన పక్షంలో స్టార్టప్లు 33 శాతం పన్నులు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ డిమాండ్ చేస్తోంది. అయితే, ఏంజెల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను మాత్రమే ఆదాయ పన్ను శాఖ ప్రశ్నించగా.. ఎంసీఏ మాత్రం వెంచర్ క్యాపిటల్, పీఈ లావాదేవీల సహా అన్ని రకాల పెట్టుబడులను నోటీసుల పరిధిలోకి చేర్చింది. ఆదాయ పన్ను శాఖ నోటీసులపై స్టార్టప్లు ఇంకా న్యాయపోరాటం కొనసాగిస్తుండగానే.. తాజాగా ఎంసీఏ నోటీసులు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టనున్నాయి. -
కొత్త వ్యాపారాల్లోకి గెయిల్!
న్యూఢిల్లీ: గెయిల్ కంపెనీ ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ గ్యాస్, పెట్రో కెమికల్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ వ్యాపారాలు కాకుండా సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం, స్టార్టప్లలో పెట్టుబడులు, తదితర రంగాల్లోకి విస్తరించాలని భావిస్తోంది. ఈ వ్యాపారాల నిర్వహణకు కంపెనీ చార్టర్లో సవరణలు చేయాలి. అందుకోసం వాటాదారుల ఆమోదాన్ని గెయిల్ కోరింది. కంపెనీ ఎంఓఏలో (మెమొ రాండమ్ ఆఫ్ అసోసియేషన్) ప్రధాన లక్ష్యాల క్లాజులో ఆరు కొత్త సెక్షన్లను చేర్చడానికి ఆమోదం తెలిపాలని వాటాదారులకు పంపిన నోటీసులో గెయిల్ కోరింది. వచ్చే నెల 11న కంపెనీ 34వ వార్షిక సాధారణ సమావేశం జరగనుంది. స్టార్టప్లలో పెట్టుబడి... తమప్రధాన వ్యాపారాలైన నేచురల్ గ్యాస్, పెట్రో కెమికల్స్, ఎనర్జీ సంబంధిత స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటితో పాటు ఆరోగ్య, సామాజిక, పర్యావరణ, రక్షణ, భద్రత సంబంధిత స్టార్టప్లలోనూ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ స్టార్టప్లలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్), ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్), ట్రస్ట్ల ద్వారా ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. ‘‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లను, చార్జింగ్ సర్వీసులను ఆరంభించాలనుకుంటున్నాం. సొంత వినియోగానికే కాకుండా, విక్రయానికి కూడా వెసులుబాటుండేలా సౌరశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. హైడ్రో కార్బన్ పైప్లైన్ల రంగంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ), ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్(ఈపీసీఎమ్), ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎమ్సీ)సేవలను అందించ గల సత్తా ఉంది. ఈ మేరకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కూడా చూస్తున్నాం’’ అని కంపెనీ తెలిపింది. గ్యాస్ మీటర్లు, సీఎన్జీ కిట్లు వంటి ఉపకరణాల తయారీ, పంపిణీ, మార్కెటింగ్లకు సంబంధించిన వ్యాపారంలో కూడా ప్రవేశించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. గురువారం జీవిత కాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో గెయిల్ షేర్లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో ఈ కంపెనీ షేర్ బీఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ.387 వద్ద ముగిసింది. -
స్టార్టప్లకు రక్షణశాఖ 11 సవాళ్లు
బెంగళూరు: రక్షణ రంగ సాంకేతిక అవసరాలకు ఉత్తమ పరిష్కారాలు చూపే స్టార్టప్లకు రక్షణ మంత్రిత్వ శాఖ 11 రకాలైన సవాళ్లను విసిరింది. ఈ నూతన ఆలోచనలు, ఆవిష్కరణలను పరిరక్షించటంతోపాటు మార్కెట్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ‘డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్’ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో ప్రారంభించారు. చాలెంజ్లోని 11 సవాళ్లు ఇవీ..సెన్సర్లతో కూడిన వ్యక్తిగత రక్షణ వ్యవస్థలు, కార్బన్ ఫైబర్ వైండింగ్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, హార్డ్వేర్ బేస్డ్ ఆఫ్లైన్ ఎన్క్రిప్ట్ ఫర్ గ్రేడెడ్ సెక్యూరిటీ, 4జీ/ఎల్టీఈ ఆధారిత లోకల్ ఏరియా నెట్వర్క్ అభివృద్ధి, సీ త్రూ ఆర్మర్, ఆధునిక సాంకేతికతతో కూడిన నిర్లవణీకరణ వ్యవస్థ, నీరు, నూనెలను వేరు చేసే వ్యవస్థలు, రవాణారంగంలో వాడే కృత్రిమ మేథ, రిమోట్ ద్వారా నియంత్రించే విహంగాలు, లేజర్ ఆయుధ వ్యవస్థలు, నేలపైనా, నీటిలోనూ సంచరించే మానవ రహిత వాహనాలు. -
స్టార్టప్స్లో పెట్టుబడులకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊరటనిచ్చే దిశగా స్టార్టప్స్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులకు పన్నులపరంగా పూర్తి మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏంజెల్ ఫైనాన్షియర్స్ సహా ఇతరత్రా ఇన్వెస్టర్లు చేసే రూ. 10 కోట్ల దాకా పెట్టుబడులకు ఇది వర్తిస్తుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గురువారం ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం కనీసం రూ. 2 కోట్ల నికర విలువ లేదా, గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో సగటున రూ. 25 లక్షలకు పైగా ఆదాయం కలిగిన ఏంజెల్ ఇన్వెస్టర్లు.. స్టార్టప్స్లో చేసే పెట్టుబడులపై 100 శాతం పన్ను మినహాయింపులు పొందడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఏంజెల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఐటీ చట్టం సెక్షన్ 56 కింద పన్నులు విధిస్తుండటంపై పలు స్టార్టప్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 18 స్టార్టప్స్కి ఆదాయ పన్ను శాఖ నోటీసులు కూడా పంపింది. ఇప్పటిదాకా ఏంజెల్ ఇన్వెస్టర్లకు సంబంధించి ప్రత్యేకించి నిబంధనలేమీ లేవని, ఈ నోటిఫికేషన్తో స్పష్టతనిచ్చినట్లవుతుందని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం రమేష్ అభిషేక్ పేర్కొన్నారు. -
దేశీ స్టార్టప్స్లో షావోమి పెట్టుబడులు!!
చండీగఢ్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్స్ తయారీ కంపెనీ ‘షావోమి’... భారతీయ స్టార్టప్స్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమౌతోంది. వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపు 100 స్టార్టప్స్లలో రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు పెట్టుబడులు పెడతామని సంస్థ ప్రకటించింది. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విభాగాల్లో బలోపేతమవ్వడమే ఈ ఇన్వెస్ట్మెంట్ల ముఖ్య ఉద్దేశమని కంపెనీ తెలిపింది. ‘2017 నాటికి కంపెనీ నికర పెట్టుబడులు రూ.3,000 కోట్లు. వచ్చే ఐదేళ్లలో భారత్లోని స్టార్టప్స్లలో రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేస్తాం’ అని షావోమి ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ తెలిపారు. మొబైల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఉన్న సంస్థల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. దీని వల్ల హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విభాగాల్లో సంస్థ బలోపేతమౌతుందని తెలిపారు. స్మార్ట్ఫోన్స్ విభాగంలో తమ ఆధిపత్యాన్ని భవిష్యత్లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తంచేశారు. చైనాలో విక్రయిస్తోన్న ప్రొడక్టులను భారత్లోకి తీసుకువచ్చేందుకు చెన్నైలో ఇటీవలనే ఒక ఎక్స్పీరియన్స్ స్టోర్ను ప్రారంభించామని గుర్తుచేశారు. ఇందులో ఎలక్ట్రిక్ సైకిల్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ స్కూటర్, స్మార్ట్ షూ, స్మార్ట్ కుకర్, ల్యాప్టాప్, వాటర్ ప్యూరిఫయర్ వంటి వాటిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ ఉత్పత్తులపై కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని, ఇక్కడి పరిస్థితులకు అనువైన మార్పులతో వీటిల్లో కొన్ని ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. ప్రతిదాన్ని స్మార్ట్గా, ఇంటర్నెట్ ఆధారంగా, స్మార్ట్ఫోన్ ద్వారా పనిచేసేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. -
పట్టభద్రులకు ప్రత్యేక ముద్ర
సిరిసిల్ల/కోరుట్ల:కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ‘ముద్ర’ లోన్ వృత్తి విద్యాకోర్సుల్లో పట్టభద్రులైన నిరుద్యోగులకు వరం. ఈ పథకం కింద సొంతంగా వ్యాపారం మొదలు పెట్టడానికి ఆర్బీఐ గుర్తించిన 27 బ్యాంకుల ద్వారా రుణసాయం అందుతుంది. ఇందుకు బిజినెస్ ప్లాన్ కీలకం. ఈ రుణాల్లో ఎలాంటి సబ్సిడీ ఉండదు. రుణం తీసుకునే బ్యాంకులను బట్టి వడ్డీ రేటు ఉంటుంది. ఎవరికి ఇస్తారు: భారత పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ ముద్ర రుణసాయం అందించవచ్చు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ముద్ర రుణాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా, సంస్థాపరంగా రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ముద్ర రుణాలు.. మూడు రకాలు: ముద్ర రుణాల్లో మూడు రకాలు ఉన్నాయి. బిజినెస్ ప్లాన్ వాటికి అవసరమైన రుణసాయం ఆధారంగా వీటిని విభజించారు. శిశు ముద్ర లోన్ కింద కేవలం రూ.50 వేల రుణసాయం మాత్రమే అందిస్తారు. చిన్నపాటి వ్యాపారాలకు ఈ రుణ సాయం పనికొస్తుంది. కిషోర ముద్రలోన్ కింద రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇస్తారు. తరుణ ముద్ర లోన్ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు రుణం అందిస్తారు. ఎక్కడ సంప్రదించాలి: ఆర్బీఐ ముద్ర రుణాలు ఇవ్వడానికి గుర్తించిన 27 బ్యాంకుల్లో మనకు అందుబాటులో ఉన్న ఏ బ్యాంకులోనైనా ముద్ర రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. ఇలా దరఖాస్తు చేయాలి..: ముద్ర రుణసాయం దరఖాస్తులు ఆన్లైన్లో దొరుకుతాయి. దరఖాస్తులో ఉన్న పూర్తి వివరాలు నింపి బ్యాంకును సంప్రదించాలి. దరఖాస్తుతోపాటు ఐడెంటిటీ కార్డు, రెసిడెన్స్ ప్రూఫ్, పాస్పోర్టు సైజు ఫొటోలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసి కెటగిరీని తెలిపే ధ్రువీకరణ పత్రాలు,మైనార్టీలు, బిజినెస్ ప్లాన్ వివరాలు, బిజినెస్ కోసం కొనుగోలు చేసే మిషనరీల వివరాలు, ఏ సంస్థ నుంచి మిషనరీలు కొనుగోలు చేస్తున్నామన్న సమాచారం. బిజినెస్కు చెందిన లైసెన్స్తో దరఖాస్తు చేయాలి. ముఖ్యంగా మనం ఏర్పాటు చేసే బిజినెస్ ఆదాయ వ్యయాలు, లాభాలు వంటి అంశాలను బ్యాంకర్లకు స్పష్టంగా చూపాలి. రుణం చెల్లింపు ఎలా..: రుణం అందించిన బ్యాంకు వడ్డీ రేటు ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మనం బ్యాంకు వారికి సమర్పించే బిజినెస్ ప్లాన్ను పరిశీలించిన తరువాత బ్యాంకు అధికారులే మనకు వచ్చే ఖర్చులు..ఆదాయం వంటి వివరాలు ఆధారంగా రుణం చెల్లింపుకు కాల వ్యవధిని నిర్ణయిస్తారు. ఫర్టిలైజర్ షాపులకు.. ♦ గ్రామాల్లో, పట్టణాల్లో ఫర్టిలైజర్ షాపులు పెట్టుకుని నిరుద్యోగులు ఉపాధి పొందాలంటే లైసెన్స్ ప్రక్రియ ప్రధానమైంది. ఇందుకోసం.. ♦ డిగ్రీలో కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం)చదివి ఉండాలి. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ♦ ఏ కంపెనీ స్టాక్ అమ్ముతారో, ఆ కంపెనీ నుంచి గుర్తింపు ఉండాలి. ♦ నివాస ధ్రువీకరణ పత్రం ఉండాలి. ♦ రూ.2500 వ్యవసాయశాఖ పేరిట చలానా తీయాల్సి ఉంటుంది. ♦ అధార్ కార్డు ఉండాలి. ♦ ఎక్కడ దుకాణం పెడతారో దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఉండాలి. -
2025 నాటికి లక్ష స్టార్టప్లు: పాయ్
న్యూఢిల్లీ: భారత్లో 2025 నాటికి లక్ష స్టార్టప్లు ఉంటాయని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టీవీ మోహన్దాస్ పాయ్ చెప్పారు. 2030 నాటికి స్టార్టప్ వ్యవస్థ దేశంలో 10 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీని సృష్టించే అవకాశం ఉందన్నారు. ‘‘ప్రస్తుతం మన దేశంలో 32,000 స్టార్టప్లు ఉన్నాయి. ఏటా 7,000 స్టార్టప్లు ఆరంభమవుతున్నాయి. 2025 నాటికి ఈ స్టార్టప్ల సంఖ్య లక్షకు చేరుతుంది. 32.5 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించగలదు’’ అని స్టార్టప్లపై ఎన్ఎస్ఈ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాయ్ చెప్పారు. .మోహన్దాస్ పాయ్ ఏంజెల్ ఇన్వెస్టర్గా పలు స్టార్టప్ సంస్థల్లో ఇన్వెస్ట్ కూడా చేశారు. కొత్త తరహా టెక్నాలజీ లతో వచ్చే స్టార్టప్లు పబ్లిక్ ఇష్యూలకు వెళ్లడం ద్వారా బ్రాండ్ విలువను సృష్టించుకోవాలని ఆయన సూచించారు. అమెరికా, చైనా తర్వాత స్టార్టప్లకు భారత్ అతిపెద్ద దేశమన్నారు. స్టార్టప్లు ఓ స్థాయికి చేరుకోగానే పబ్లిక్ ఇష్యూలకు వెళ్లాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎస్ఈ చైర్మన్ విక్రం లిమాయే కూడా సూచిం చారు. స్టార్టప్లు ఎదిగేందుకు, సమర్థవంతంగా కొనసాగేందుకు తగిన వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఎన్ఎస్ఈ కట్టుబడి ఉందన్నారు. -
స్టార్టప్లు లిస్టింగ్కు రావాలి
న్యూఢిల్లీ: స్టార్టప్లు ఒక స్థాయికి వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావాలని ఎన్ఎస్ఈ కోరింది. లిస్టింగ్ కారణంగా లిక్విడిటీ పెరుగుతుందని, ఈ స్టార్టప్ల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వైదొలగడానికి వీలవుతుందని న్ఎస్ఈ ఎమ్డీ, సీఈఓ విక్రమ్ లిమాయే చెప్పారు. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కారణంగా విస్తృతమైన క్యాపిటల్ మార్కెట్ తోడ్పాటు స్టార్టప్లకు లభిస్తుందని వివరించారు. మ్యూచు వల్ ఫండ్స్, విదేశీ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబ డులు పెడతాయని వివరించారు. ఒకటి రెండు సంవత్సరాల్లో చాలా స్టార్టప్లు లిస్టయ్యే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు. -
చౌక ఇంటర్నెట్ : రూపాయికే వై-ఫై
వై-ఫై ఇప్పుడు నిత్యావసర జాబితాలో చేరిపోయింది. వై-ఫై లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదేమో! అదే వైఫై ఇప్పుడు రోజూ తాగే టీ కంటే కూడా చవగ్గా అందుబాటులోకి వచ్చేసింది. ఛాయ్ దుకాణంలో కూర్చుని ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకోవడమే కాకుండా... అదే ఛాయ్ దుకాణంలో, లేదా పక్కనే ఉన్న కిరాణా షాపుల్లో వై-ఫై కూపన్లను కొనుక్కొని ఎంచక్కా వాడుకోవచ్చు. ఇందుకోసం ఢిల్లీ, బెంగళూరులోని ఈ స్టోర్లు, ప్రీ-పెయిడ్ వై-ఫై ప్యాక్స్లను అందించడానికి కొన్ని స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రూపాయి నుంచి రూ.20 వరకు అందరికీ అందుబాటులో ఉండేలా కూపన్లను విడుదల చేస్తున్నాయి. పట్టణాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యంత చవగ్గా వైర్లెస్ ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా స్టార్టప్లు ఈ సర్వీసులను అందిస్తున్నాయి. హరియాణా సరిహద్దులో ఉన్న ఢిల్లీలోని సంగం విహార్కు చెందిన ఓ స్టేషనరీ దుకాణ యజమాని బ్రహం ప్రకాశ్ ఇప్పటికే 250 వై-ఫై కూపన్లను విక్రయించాడు. రెండున్నర నెలల క్రితం తన దుకాణంలో వై-ఫై హాట్ స్పాట్ను ఏర్పాటు చేశాడు. ఐదు నిమిషాల పాటు వై-ఫైను ఉపయోగించుకునేందుకు రూపాయి కూపన్ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో యువత ఎక్కువగా ఈ ప్యాక్లను కొనుగోలు చేస్తున్నారని అతను పేర్కొన్నాడు. రూపాయితో కొనుగోలు చేసిన వైఫైతో ఐదు నిమిషాల్లో తమకు కావాల్సిన గేములు, పాటలు డౌన్లోడ్ చేసుకుని వెళ్లిపోతున్నారని తెలిపాడు. తన వద్ద రూ.20 కూపన్లు కూడా ఉన్నాయని ప్రకాశ్ చెప్పుకొచ్చాడు. ఢిల్లీకి చెందిన 'ఐ2ఆ1', బెంగళూరుకు చెందిన 'వైఫై డబ్బా' స్టార్టప్లు పబ్లిక్ డేటా ఆఫీసు(పీడీవో)లు ప్రారంభించి ప్రతి ఒక్కరికి వై-ఫైని అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాక కిరాణా స్టోర్లలో రూటర్లను ఇన్స్టాల్ చేయడం 23 శాతం పెరిగిందని తమ అనాలసిస్లో వెల్లడైనట్టు ఐ2ఈ1 సహ వ్యవస్థాపకుడు సత్యం ధర్మోరా చెప్పారు. బెంగళూరు వ్యాప్తంగా 600 దుకాణాల్లో తాము వై-ఫై సేవలందిస్తున్నామని, 50ఎంబీపీఎస్ స్పీడులో 100-200 మీటర్ల రేడియస్ వరకు వైఫై అందిస్తున్నామని వైఫైడబ్బా సహ వ్యవస్థాపకుడు సుభేంద్ శర్మ చెప్పారు. అయితే ఖరీదైన ప్రాంతాల్లో మాత్రం వై-ఫై కూపన్లు అమ్ముడుపోవడం లేదని ఢిల్లీకి చెందిన ఓ టీస్టాల్ యజమాని వాపోయాడు. తాను ఇప్పటి వరకు ఒక్క కూపన్ కూడా విక్రయించలేదని, వై-ఫై రౌటర్ను తిరిగి ఇచ్చేయాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం రూ.5 వై-ఫై కూపన్కు మంచి డిమాండ్ ఉందని ఓ షాప్ కీపర్ తెలిపాడు. -
భారీ ప్యాకేజీలతో ఎగ్జిక్యూటివ్లకు జాబ్ ఆఫర్స్
ముంబై : మీ సీవీకి కాస్త మెరుగులు దిద్దండి.. లింక్డిన్ పేజీలో అప్డేట్ చేసేయండి. ఎందుకంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు స్టార్టప్లు గుడ్న్యూస్ అందిస్తున్నాయి. భారీ ప్యాకేజీలతో ఉద్యోగవకాశాలను ఆఫర్ చేస్తున్నాయి. కోట్ల రూపాయల వేతనం, వేరియబుల్స్, స్టాక్ ఆప్షన్లతో సీనియర్ స్థాయి ఉద్యోగులకు స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయని తాజా రిపోర్టులు తెలిపాయి. ఎమర్జింగ్ రంగంలో వచ్చే కొన్ని నెలల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఆఫర్లు పెరుగనున్నాయని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. అప్గ్రాడ్, సింప్లీలెర్న్, టాపర్, పియర్సన్, ఎమెరిటస్ వంటి కంపెనీలు సీనియర్ ఎగ్జిక్యూటివ్ల నియామకాలు పెంచాయి. ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ అప్గ్రాడ్ను ప్రమోట్ చేస్తున్న ఎంటర్ప్రిన్యూర్ రోనీ స్క్రూవాలా ఇటీవలే నలుగురు సీనియర్ ఉద్యోగులను నియమించుకుంది. వారికి రూ.50 లక్షలకు పైగా ప్యాకేజీని ఆఫర్ చేసినట్టు తెలిసింది. మరో ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఎమెరిటస్ కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ముగ్గురు ఉద్యోగులను నియమించుకుందని, వారికి కూడా భారీగా వేతనాలు ఆఫర్ చేసినట్టు రిపోర్టులు తెలిపాయి. ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్పేస్లో నిధులు 2014లో 101.7 మిలియన్ డాలర్లుండగా.. 2015లో 126.4 మిలియన్ డాలర్లు, 2016లో 186.1 మిలియన్ డాలర్లకు పెరిగిందని ట్రాక్షన్ డేటా తెలిపింది. స్టార్టప్ల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఉద్యోగాల ఆఫర్తో పాటు బ్యాంకింగ్, మానుఫ్రాక్ట్ర్చరింగ్, ఈకామర్స్ వంటి రంగాల్లో డేటా అనాలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఎక్కువ ఉద్యోగాలు ఉండనున్నాయని తెలిసింది. -
గ్లోబల్... సక్సెస్ఫుల్
అతివకు అందలం..ఆవిష్కరణలకు ప్రోత్సాహం...స్టార్టప్స్కు సహాయం...ఇవే ప్రధాన ఇతివృత్తంగా సాగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సక్సెస్ఫుల్గా ముగిసింది. మూడురోజుల సందడికి గురువారం తెరపడింది. భాగ్యనగరి అందాలు, దేశీయ ఆవిష్కరణలను చూసి అబ్బురపోయిన విదేశీ ప్రతినిధులు... భారంగా బై..బై.. చెప్పారు. మెట్రో నగరికి మళ్లీ వస్తామంటూ దేశవిదేశీయులు వీడ్కోలు పలికారు. అవకాశాలు పుష్కలం.. అందుకోవాలి ‘నైపుణ్యానికి అద్దం పడుతూ ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. స్టార్టప్స్తో అసామాన్య ఫలితాలు సామాన్యులకు చేరువవుతాయి. వీటికి పెట్టుబడులతో ప్రోత్సాహం అందిస్తే విజయం సొంతమవుతుంది. ఉద్యోగం చేయడం కంటే.. పది మందికి ఉపాధి కల్పించడంలోనే సంతృప్తి ఉంటుంది. వ్యవసాయం, వైద్యం తదితర రంగాల్లో నూతన స్టార్టప్లకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాల’ని జీఈఎస్కు హాజరైన పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. తమ ఆవిష్కరణలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. డిజిటల్ అగ్రికల్చర్ వ్యవసాయానికి ఐటీని తోడు చేయాలనే సంకల్పంతో రెండేళ్ల క్రితం ఓ ప్రత్యేక యాప్ రూపొందించాం. సీజన్కు అనుగుణంగా ఏయే పంటలు వేయాలి? చీడపీడలకు ఏయే క్రిమిసంహార మందులు వాడాలి? తదితర సమాచారం ఇందులో ఉంటుంది. రైతులు, కంపెనీలు వివరాలూ ఉంటాయి. త్వరలోనే మార్కెటింగ్ అవకాశాలనూ చేర్చనున్నాం. పెట్టుబడి దొరికితే మా యాప్ను సామాన్యులకు చేరువ చేస్తాం. – జయ వల్లపు, ఫౌండర్, స్టాంప్ ఐటీ సొల్యూషన్స్ బొమ్మల తయారీ.. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పిల్లలు ఆడుకునే చెక్క బొమ్మలు తయారు చేస్తాం. ఏ చెక్కతో ఏ బొమ్మలు తయారు చేయాలో తెలియజేస్తాం. 3–13 ఏళ్ల పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసేందుకు వీలుంటుంది. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాం. – అశ్విని కుమార్, కో–ఫౌండర్, స్మార్టివిటీ ఇవాంకా స్ఫూర్తి... జీఈఎస్ సద్సులో ఇవాంకా ప్రసంగం నాకెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ సదస్సులో చాలా నేర్చుకున్నాను. వ్యాపార రంగంలో మహిళలు రాణించేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. – అబ్బిగేల్ లాంక్, గయానా టెలీ మెడిసిన్.. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా డాక్టర్ల వివరాలు సామాన్యులకు ఇప్పటికీ అందుబాటులో లేవు. ఆస్పత్రులు ఎక్కడుంటాయో? ఏ జబ్బుకు ఎక్కడికి వెళ్లాలో? తెలియని పరిస్థితి ఉంది. సామాన్యులకు వైద్య సమాచారం అందించేందుకు ‘ఇంటెలె హెల్త్’ పేరుతో టెలీ మెడిసిన్ సర్వీస్ను ఒడిశాలో ప్రారంభించాం. పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నాం. – నేహా గోయల్, సీఈఓ, ఇంటెలె హెల్త్ అవకాశాలెన్నో... వ్యాపార రంగంలో మహిళలకు ఎన్ని అవకాశాలున్నాయో జీఈఎస్ సదస్సులో స్పష్టంగా అర్థమైంది. వివిధ దేశాల బృందాలు తమ అనుభవాలు పంచుకున్నాయి. గోల్కొండ విందు బాగుంది. సదస్సుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సూపర్. – ప్రభా రాఘవ, యూఎస్ఏ నైపుణ్యానికి కొదవలేదు ఇండియాలో నైపుణ్యానికి కొదవలేదు. ఎందరో ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్టప్లపై దృష్టిసారిస్తున్నారు. యువత స్టార్టప్లపై ఉత్సా హం చూపుతోంది. అయితే ప్రభుత్వాలు, కంపెనీల ప్రోత్సాహం ఉంటేనే స్టార్టప్లు నిలబడతాయి. – కార్ల్ బిజ్లాండ్, స్వీడన్ గ్రీన్ టీ ఫ్లేవర్స్.. వివిధ ఫ్లేవర్లలో గ్రీన్ టీ తయారు చేసే విధానాన్ని వివరిస్తాం. గ్రీన్ టీ అంటే.. చేదు, వగరు అనుకుంటారు. కానీ దీన్ని వివిధ ఫ్లేవర్లలో అందించొచ్చు. మెక్సికో, అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధులకు టీ ఫ్లేవర్లను వివరించాం. – నీలిమా చౌదరి, ఫౌండర్, ఎగ్జాటిక్ బ్లూమింగ్ టీస్