UAE
-
తెలుగమ్మాయికి యూఏఈ ప్రతిష్టాత్మక అవార్డు..!
ఎయిర్ క్వాలిటీని పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనిక అక్కినేని అబుదాబికి చెందిన ప్రతిష్ఠాత్మకమైన ‘జాయేద్ సస్టైన్ బిలిటీ ప్రైజ్’ను గెలుచుకుంది. చిన్నప్పుడు జానపద కథల్లో రాక్షసుల గురించి విన్నదో లేదోగానీ కాలుష్యకారక రాక్షసుల గురించి విన్నది మోనిక. భూతాపం పెంచే ఎన్నో భూతాల గురించి విన్నది. అలా వింటున్న క్రమంలో కర్బన ఉద్గారాల కట్టడికి తన వంతుగా ఏదైనా చేయాలనుకునేది. ఆవిష్కరణకు ముందు అధ్యయనం ముఖ్యం కదా!క్లైమెట్ ట్రాన్స్పరేన్సీ రిపోర్ట్లు చదవడం నుంచి కార్బన్ కాప్చర్ స్టోరేజీ(సీసీఎస్) తెలుసుకోవడం వరకు ఎన్నో చేసింది.... ఏలూరు నగరానికి చెందిన భూపేష్ రఘు అక్కినేని, స్వీటీ దంపతులు అబుదాబీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారి కుమార్తె మోనిక అక్కినేని అబుదాబీలోని మేరీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ప్రాజెక్టులపై గత రెండేళ్ళుగా మోనిక ఆసక్తి పెంచుకుని సహ విద్యార్థి ముస్కాన్ తో కలిసి పనిచేస్తోంది. గత ఏడాది జూన్ నుంచి ఎయిర్ క్వాలిటీ పెంచే బయో డీగ్రేడబుల్ కార్బన్ స్పాంజ్ టైల్స్ తయారీపై పరిశోధనలు ప్రారంభించింది. సముద్ర గర్భంలో ఉండే నాచు, కొబ్బరిపీచులు, వైబర్ (ఇండస్ట్రియల్ సిమెంట్)తోపాటు మరికొన్ని రసాయనాలు వాడి చిన్నపాటి ప్లేట్లను సిద్ధం చేసింది. మోనిక పూర్తి చేసిన ప్రాజెక్టును స్కూల్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించింది. ఒక ఫ్యాక్టరీలో ప్రాజెక్టు పనితీరును అధ్యయనం చేసి మేరీల్యాండ్స్ స్కూల్ ప్రాజెక్టును ఎంపిక చేసింది. ప్రతి ఏటా అబుదాబీ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ రాజకుటుంబం పేరుతో ‘జాయేద్ సస్టైన్బిలిటీ ప్రైజ్లను 11 విభాగాల్లో అందిస్తుంటారు. ఆరోగ్యం, ఆహారం, ఎనర్జీ, నీరు, వాతావరణంలో మార్పులపై అధ్యయనం... ఇలా పదకొండు విభాగాలకు ఆన్న్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఈ ఏడాది 5,500 దరఖాస్తులు అందాయి. మోనిక ఈ అవార్డుకు దరఖాస్తు చేసింది. పదకొండు విభాగాల్లో 33 మందిని షార్ట్లిస్ట్ చేసి పదకొండు మందిని విజేతలుగా ఎంపిక చేశారు. ఎయిర్ క్వాలిటీ పెంచడానికి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేసే బయోడీగ్రేడబుల్ కార్బన్ స్పాంజీ టైల్స్ ఫార్ములాను రూపొందించిన మోనికకు ప్రైజ్ దక్కింది. మోనిక రూపొందించిన ఫార్ములా గురించి చెప్పుకోవాలంటే... 1,100 పీఎస్ఐ కార్బన్ డయాక్సైడ్ విడుదలైతే మూడు గంటల వ్యవధిలో 300 పీఎస్ఐ ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఆడిటోరియాలు, జనాలు అధికంగా ఉండే భవనాలు, పాఠశాల తరగతి గదుల్లో గోడలకు ఈ టైల్స్ను అతికిస్తే దీర్ఘకాలం పనిచేస్తాయి. ప్రత్యేకంగా స్కూల్ గదుల్లో ఉపయోగపడేలా ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఈ టైల్స్ను వినియోగించడం ద్వారా గాలిలోని కర్బన ఉద్గారాలను తగ్గించి గాలి నాణ్యత పెంచవచ్చు. అవార్డుతోపాటు మౌనిక అక్కినేనికి లక్షన్నర డాలర్ల గ్రాంటును మంజూరు చేశారు. భవిష్యత్లో ఈప్రాజెక్టు తోపాటు సరికొత్త ఆవిష్కరణలకు గ్రాంటును వినియోగించుకునే అవకాశం ఇచ్చారు.మరిన్ని ఆవిష్కరణలు...మా పేరెంట్స్, స్కూల్లో టీచర్ల ద్వారా పర్యావరణానికి జరుగుతున్న ముప్పు గురించి ఎన్నో సార్లు విన్నాను. బాధగా అనిపించేది. బాధ పడడం కంటే ‘నా వంతుగా ఏం చేయగలను’ అని ఆలోచించడం ముఖ్యం అనిపించింది. ఉపాధ్యాయులు, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను. పర్యావరణానికి ఉపయోగపడేలా మరిన్ని ఆవిష్కరణలు చేయాలనుకుంటున్నాను. మెడిసిన్ చేయాలనేది నా లక్ష్యం అంటోంది మోనిక అక్కినేని ఆక్సిజెమ్ – కాట్రపాటి కిషోర్, సాక్షి ప్రతినిధి, ఏలూరు(చదవండి: ది బెస్ట్ ఎగ్ రెసిపీ' జాబితాలో మసాలా ఆమ్లెట్ ఎన్నో స్థానంలో ఉందంటే..) -
యూఏఈలోకి రిలయన్స్ ప్రొడక్ట్స్ ఎంట్రీ.. కాంపా లాంచ్
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) యూఏఈలో (UAE) అడుగు పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ అండ్ బేవరేజ్ సోర్సింగ్ ఈవెంట్ అయిన గల్ఫుడ్ 30వ ఎడిషన్లో యూఏఈలో భారతీయ లెగసీ బ్రాండ్ కాంపాను అధికారికంగా ప్రారంభించింది.2022లో కాంపా కోలాను కొనుగోలు చేసి, 2023లో దేశంలో తిరిగి ప్రవేశపెట్టిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1970, 80లలో భారతదేశంలో కల్ట్ హోదాను కలిగి ఉన్న ఈ హెరిటేజ్ బ్రాండ్ను విజయవంతంగా పునరుద్ధరించింది. యూఏఈలో ప్రముఖ ఆహార, పానీయాల కంపెనీలలో ఒకటైన అగ్థియా గ్రూప్తో కలిసి కాంపా కోలాను ఇక్కడి వారికి పరిచయం చేస్తోంది."50 సంవత్సరాల క్రితం స్థాపించిన హెరిటేజ్ ఇండియన్ బ్రాండ్ అయిన కాంపాతో యూఏఈ మార్కెట్లోకి ప్రవేశించడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఇక్కడ దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడుతున్నాం. ఈ ప్రాంతంలో వేగవంతమైన వృద్ధికి గొప్ప సామర్థ్యాన్ని చూస్తున్నాము. యూఏఈలో వినియోగదారులకు పానీయాల అనుభవాన్ని మార్చడానికి భాగస్వాములతో కలిసి ఇక్కడికి వస్తున్నందుకు సంతోషిస్తున్నాము" అని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సీఓఓ కేతన్ మోదీ పేర్కొన్నారు. -
ఐవోసీ భారీ కాంట్రాక్ట్..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) భారీ డీల్కు తెరలేపింది. ఇందులో భాగంగా యూఏఈ నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ను (ఎల్ఎన్జీ) దిగుమతి చేసుకోనుంది. 14 ఏళ్ల ఈ దీర్ఘకాలిక కాంట్రాక్ట్ విలువ 7–9 బిలియన్ డాలర్లు. ఏడీఎన్ఓసీ గ్యాస్తో ఈ మేరకు ఐవోసీ ఒప్పందం చేసుకుంది. 2026 నుంచి ఏటా 1.2 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని ఏడీఎన్ఓసీ గ్యాస్ సరఫరా చేయనుంది.ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్తోనూ (బీపీసీఎల్) ఏడీఎన్ఓసీ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం 2025 ఏప్రిల్ నుంచి అయిదేళ్లలో 2.4 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేయాల్సి ఉంటుంది. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్కు 10 ఏళ్ల పాటు ఏటా 4,00,000 టన్నుల ఎల్ఎన్జీ విక్రయించేందుకు ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ చేతులు కలిపింది.బీపీసీఎల్ ఈ సందర్భంగా బ్రెజిల్కు చెందిన పెట్రోబ్రాస్తో 6 మిలియన్ బ్యారెళ్ల వరకు ముడి చమురు కొనుగోలుకై ఒప్పందాన్ని చేసుకుంది. దేశంలో తొలిసారిగా అలల నుంచి విద్యుత్ ఉత్పత్తికై ముంబై వద్ద 100 కిలోవాట్ సామర్థ్యంతో పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎకో వేవ్ పవర్తో బీపీసీఎల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. బీహెచ్ఈఎల్కు రూ.6,700 కోట్ల ఆర్డర్ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ తాజాగా సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి రూ.6,700 కోట్ల విలువైన ఆర్డర్ను పొందినట్లు తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మంచిర్యాల వద్ద 800 మెగావాట్ల సూపర్క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తారు. ప్రాజెక్ట్ డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, కార్యరూపంలోకి తేవడంతోపాటు సివిల్ పనులను చేపడుతుంది.ప్రతిపాదిత యూనిట్ ప్రస్తుతం పనిచేస్తున్న 2 గీ 600 మెగావాట్ల యూనిట్లకు ఆనుకొని ఏర్పాటు చేస్తారు. ఈ రెండు యూనిట్లను బీహెచ్ఈఎల్ 2016 ప్రారంభించడం విశేషం. ముఖ్యంగా తెలంగాణలోని వివిధ విద్యుత్ సంస్థల కోసం 75 శాతానికి పైగా బొగ్గు ఆధారిత సెట్స్ను బీహెచ్ఈఎల్ విజయవంతంగా ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 1,70,000 మెగావాట్లకుపైగా సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేసింది. -
పంచ్లో బెబ్బులి..కిక్ ఇస్తే.. ప్రత్యర్థులకు చుక్కలే ఎవరీ దేవి?
పెరెగ్రైన్ ఫాల్కన్ కన్నా వేగవంతమైన కిక్లకు టెక్నిక్ మేళవించి ప్రత్యర్థులను మట్టి కరిపిస్తుంది. చిరుత కంటే వేగంగా పాదాలను కదిలించి ఎదుటివారిని చిత్తు చేస్తుంది. పాల్గొన్న ప్రతిపోటీలోనూ పతకం సాధించి తనకుతానే సాటిగా అంతర్జాతీయ వేదికపై మరోమారు సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది సికింద్రాబాద్ చిలకలగూడకు చెందిన కరాటే క్వీన్ దేవిహంసిని. ఇప్పటి వరకూ అనేక జాతీయ, అంతర్జాతీయ కరాటే పోటీల్లో పాల్గొని బంగారు, వెండి మెడల్స్తోపాటు పలు అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది.- చిలకలగూడ యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) ఫుజైరాలో 2025 ఫిబ్రవరిలో జరిగే కరాటే–1 యూత్లీగ్ పోటీలకు అండర్–14 కటా విభాగంలో తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి దేవిహంసిని. వడోరై కరాటే డూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో యుఏఈలో జరిగే యూత్లీగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఎనిమిది మందిని ఎంపిక చేశారు. చిన్ననాటి నుంచే.. సాధారణ కుటుంబానికి చెందిన పెబ్బిలి దేవిహంసిని (12) సికింద్రాబాద్ సెయింట్ మేరీ హైసూ్కల్లో ఏడో తరగతి చదువుతోంది. తండ్రి కోటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి, తల్లి అంజలి గృహిణి. తన ఆరో ఏట నుంచే మార్షల్ ఆర్ట్స్పై చిన్ననాటి నుంచే మక్కువ పెంచుకుంది. మొదట విశాఖపట్నంలోని కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్లో చేరింది. కరాటే కోచ్ సిహాన్, సీహెచ్ శ్రీనివాసరావు వద్ద ఓనమాలు నేర్చుకుంది. కఠోరశ్రమ, చిత్తశుద్ధి, నేర్చుకోవాలనే తపనతో మెళకువలను ఔపోసన పట్టి బ్లాక్బెల్ట్ సాధించింది. సినీనటుడు సుమన్ నుంచి బ్లాక్బెల్ట్ అందుకోవడం గర్వంగా ఉందని చెబుతోంది దేవి. సాధించిన పతకాలు..జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దేవిహంసిని పాల్గొన్న ప్రతి పోటీలోనూ బహుమతి సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కటా, కుమిటీ విభాగాల్లో పది గోల్డ్, రెండు వెండి, జాతీయ స్థాయిలో 22 బంగారు, ఐదు వెండి, మూడు రజిత పతకాలు కైవసం చేసుకుంది. సౌత్ నేషనల్ లెవల్లో 7 గోల్డ్, ఒక్కో సిల్వర్, బ్రాంజ్, ఆసియన్ లెవల్లో ఒక్కో సిల్వర్, బ్రాంజ్, స్టేట్ లెవల్లో ఐదు బంగారు, ఒక్కో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. మువ్వన్నెల జెండా ఎగురవేస్తా.. అంతర్జాతీయ వేదికలపై మువ్వన్నెల జెండా ఎగురవేస్తా. యుఏఈ ఫుజైరాలో కరాటే యూత్లీగ్లో విజయం సాధిస్తా. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహం కూడా అవసరం. అందరి సహకారం ఉంటే గెలుపు తథ్యమని దేవిహంసిని ధీమా వ్యక్తం చేస్తోంది. చదవండి: చదివింది 10వ తరగతే..ముగ్గురు పిల్లలు : అట్టడుగు స్థాయినుంచి వ్యాపారవేత్తగా -
వీసా కష్టం.. పైసా నష్టం..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యార్జన, ఉజ్వల భవిష్యత్తు కోసం, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోగా.. మరోవైపు వీసా తిరస్కరణ (Visa Reject) బాధితుల సంఖ్యా ఎక్కువగానే పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వీసాలూ అధిక సంఖ్యలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాదిలో నష్టపోయిన మొత్తం రూ.660 కోట్ల పైమాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులను స్వాగతించే దేశంగా పేరున్న యూఏఈ వీసాలు పొందడంలో సైతం ఎదుర్కొన్న ఇబ్బందులను చాలామంది గత ఏడాది చివరిలో సోషల్ మీడియా (Social Media) వేదికగా పంచుకున్నారు.జనవరి నుంచి అక్టోబర్ 2024 మధ్యకాలంలో 24.8% మంది భారతీయలు (Indians) యూఏఈని సందర్శించారు. భారతీయ పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటిగా యూఏఈ (UAE) ఉంది. అయితే కొంతకాలం క్రితం దుబాయ్ ఇమ్మిగేషన్ విభాగం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనల కారణంగా భారీ స్థాయిలో వీసాలు తిరస్కరణలకు గురయ్యాయి. కోవిడ్ అనంతరం ఇతర అనేక దేశాలు కూడా తమ వీసా నిబంధనలను సవరించాయి. ఈ నేపథ్యంలో వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాది భారతీయులు రూ.664 కోట్లను నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడువీసా నిబంధనలు కఠినతరం చేసిన దేశాలలో యూఏఈతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే ప్రధానంగా ఉన్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ 32.5 శాతం భారతీయ వీసా (Indian Visa) దరఖాస్తులను తిరస్కరించింది, ఆస్ట్రేలియా 29.3 శాతం, యూకే 17 శాతం మందిని తిరస్కరించాయి. స్కెంజెన్ ఏరియా (యూరప్) 15.7 శాతం వీసాల్ని తిరస్కరించింది. యూఏఈ భారతీయ వీసాల తిరస్కరణ రేటు గత ఏడాది 6 శాతానికి చేరుకుంది. అయితే 2019లో వీసా ఆమోదం రేట్లతో పోల్చనప్పుడు. 2024లో భారతీయుల కోసం అధిక శాతం వీసాలను ఆమోదించిన దేశంగా అమెరికా నిలిచింది. 2019లో 28 శాతం భారతీయ వీసా దరఖాస్తులను యూఎస్ తిరస్కరించగా, 2024లోకి వచ్చేసరికి ఇది 16 శాతానికి తగ్గింది. అయితే అమెరికా వెళ్లేందుకు మనవారి వీసా దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఈ 16 శాతం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత కఠినంగా..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూఏఈ వంటి దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం అనేది..కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వీసా దరఖాస్తుల సూక్ష్మస్థాయి పరిశీలన, ఎంపిక ధోరణిని ప్రతిబింబిస్తోంది. వీసాల తిరస్కరణ రేటు పెరుగుదల భారతీయ ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తోంది. దరఖాస్తుదారులు.. తమకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని, తమ దరఖాస్తులు పూర్తి దోష రహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.సర్వ సాధారణంగా మారిన తిరస్కరణలు‘ఎంఫార్మ్ కోసం అమెరికా వీసాకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. మరోసారి అప్లయ్ చేయబోతున్నా. ఇప్పటివరకు రూ.42 వేలు ఖర్చయ్యింది. నా స్నేహితుడు ఒకరికి 10 సార్లు వీసా నిరాకరించారు..’అని పంజాగుట్ట నివాసి ప్రవీణ్ చెప్పాడు. ఇక రెండుసార్లు, మూడుసార్లు వీసా తిరస్కరణలకు గురి కావడమనేది సర్వసాధారణంగా మారుతోంది. యూకేకి రూ.12 వేలు మొదలుకుని రూ.లక్ష పైగా వీసా దరఖాస్తు ఫీజులు ఉన్నాయి. అలాగే ఆ్రస్టేలియాకు రూ.4 వేల నుంచి రూ.60 వేలు వరకూ, న్యూజిలాండ్కు రూ.11 వేల నుంచి రూ.1.15లక్షల వరకూ, యూఏఈకి రూ.8 వేల నుంచి రూ.35 వేలు ఆపైన ఉన్నాయి.చదవండి: ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!అమెరికాకు రూ.20 వేల వరకూ వీసా ఫీజులు ఉన్నాయి. అయితే వెళ్లే కారణాన్ని బట్టి, వీసా పొందడానికి ఎంచుకున్న విధానాన్ని బట్టి ఈ ఫీజులు ఇంతకంటే పెరగవచ్చు కూడా. ‘మా అబ్బాయి అమెరికా వీసాకి మొదటిసారి రూ.70 వేల దాకా పెట్టిన ఖర్చు వృథా అయ్యింది. రెండవసారి దాదాపు అంతే ఖర్చు పెట్టి వీసా తెచ్చుకున్నాం..’ అని మల్కాజిగిరికి చెందిన లక్ష్మి చెప్పారు. మొత్తంగా చూస్తే వీసా తిరస్కరణల కారణంగా పెద్ద మొత్తంలోనే నష్టం జరుగుతోందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని, డాక్యుమెంట్లన్నీ పూర్తి కచ్చితత్వంతో ఉండేలా చూసుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
CT 2025: టీమిండియా మేనేజర్గా హెచ్సీఏ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) కార్యదర్శి ఆర్. దేవ్రాజ్ మేనేజర్గా ఎంపికయ్యారు. వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నారు.ఇదో గొప్ప గౌరవం‘టీమిండియాకు నన్ను మేనేజర్గా నియమించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత భారత జట్టుకు మేనేజర్గా వ్యవహరించే అవకాశం హెచ్సీఏ అధికారికి లభించింది. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని దేవ్రాజ్ అన్నారు. టీమిండియా మేనేజర్గా ఎంపికైన దేవ్రాజ్కు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతోపాటు ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, అంతకంటే ముందు రోహిత్ సేన సొంతగడ్డపై ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. తద్వారా మెగా టోర్నికి ముందు ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవేగ్రూప్-‘ఎ’: ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’: ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా షెడ్యూల్ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ పాకిస్తాన్మార్చి 2, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్రజతం నెగ్గిన జ్యోతి సురేఖ సాక్షి, హైదరాబాద్: ఇండోర్ వరల్డ్ కప్ సిరీస్లో భాగంగా ఫ్రాన్స్లో జరిగిన నిమెస్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ వెన్నం జ్యోతి సురేఖ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 146–147తో అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. క్వాలిఫయింగ్లో జ్యోతి సురేఖ 600 పాయింట్లకుగాను 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. -
బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్
జైనబ్ రోష్నా దుబాయిలో ఉంటుందన్న మాటేగానీ కేరళలోని బామ్మ జ్ఞాపకాలు ఎప్పుడూ తనతోనే ఉంటాయి. ఆ జ్ఞాపకాలు హాయిగా ఉంటాయి, నవ్విస్తాయి. కొన్నిసార్లు భావోద్వేగానికి గురి చేస్తాయి. తనకు తీరిక దొరికినప్పుడల్లా బామ్మతో ఫోన్లో మాట్లాడుతుంది జైనబ్.‘ఇలా ఫోన్లో మాట్లాడుకోవడమేనా! నన్ను చూడడానికి ఎప్పుడు వస్తావు?’ అని అడుగుతుంది బామ్మ.‘నువ్వు దూరంగా ఉంటే కదా రావడానికి. నువ్వు ఎప్పుడూ నా కళ్ల ముందే ఉంటావు’ అని నవ్వుతుంది జైనబ్.‘నీ మాటలకేంగానీ... నువ్వు నన్ను చూడడానికి రావాల్సిందే’ అన్నది బామ్మ. అటు నుంచి నవ్వు మాత్రమే వినిపించింది! కట్ చేస్తే...ఆ రోజు బామ్మగారి బర్త్డే. తన ఊళ్లో ఆ రోజు కూడా బామ్మ అన్ని రోజులలాగే ఎప్పటిలాగే ఉంది. ‘నా బర్త్డేను జైనబ్ ఎంత ఘనంగా చేసేదో’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది. ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది.ఎవరా అని చూస్తే... ఊహించని వ్యక్తి. నిజమా? భ్రమా!’ అనుకుంటుండగానే సంతోషంగా అరిచింది జైనబ్. స్వీట్ షాక్ నుంచి తేరుకున్న తరువాత... View this post on Instagram A post shared by ZAINAB ROSHNA | ZR✌🏻 (@zainabroshna) ‘నన్ను చూడడానికి వచ్చావా తల్లీ... ఒక్క మాటైనా చెప్పలేదు...’ అంటూ సంతోషంతో కళ్ల నీళ్ల పెట్టుకుంది బామ్మ. ‘ముందే చెబితే ఏం మజా ఉంటుంది! ఇలా వస్తేనే సర్ప్రైజింగ్గా ఉంటుంది’ అన్నది జైనబ్. ఆ రోజు వంద పండగలు ఒకేసారి వచ్చినంత సంతోషంగా ఫీల్ అయింది బామ్మ. ప్రేమగా, గారాబంగా మనవరాలిని ముద్దు పెట్టుకుంది. ‘గత ఏడాది మా అమ్మమ్మ పుట్టిన రోజున నా ఎమిరేట్స్ యూనిఫాం ధరించి వీడియో కాల్ చేశాను. నన్ను యూనిఫాంలో చూసి అమ్మమ్మ ఆశ్చర్యపడింది. కొత్త అమ్మాయిని చూసినట్లుగా ఉంది అని నవ్వింది. ఈ పుట్టిన రోజుకు మరింత సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకే చెప్పకుండా వచ్చాను’ అని ఇన్స్టా పోస్ట్లో రాసింది జైనబ్.ఒక్క మాటలో చెప్పాలంటే... ఇది మామూలు సంఘటన. అయితే సోషల్ మీడియా లో బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి.జైనబ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ నేపథ్యంలో అమ్మమ్మ, నానమ్మలతో తమకు ఉన్న విలువైన జ్ఞాపకాలు పంచుకున్నారు నెటిజనులు.‘అమ్మ దగ్గర కంటే అమ్మమ్మ దగ్గరే నాకు చనువు ఎక్కువ. ఈ వీడియో క్లిప్ చూసినప్పుడు మా అమ్మమ్మ గుర్తుకు వచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. పెద్దవాళ్లు మన నుంచి ఏమీ కోరుకోరు. మనం వారికి ఒకసారి కనిపించినా పెద్ద బహుమతిగా ఫీలవుతారు’ అని స్నేహ అనే నెటిజన్ తన కామెంట్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ బామ్మ, మనవరాళ్ల వీడియో ఎంతో సందడి చేస్తోంది. దుబాయి నుంచి వచ్చిన జైనబ్ బామ్మ గదిలోకి సంతోషంగా పరుగెత్తుతున్న దృశ్యాలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. జైనబ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో క్లిప్ 2.3 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. చదవండి: Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలిఅత్యధిక జీతాన్ని వద్దనుకొని.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలు -
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమాదంలో 26 ఏళ్ల భారత సంతతికి వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్ దుర్మరణం పాలయ్యారు. యూఏఈలోని రస్ అల్ ఖైమా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేసింది.చనిపోయిన ఇద్దరిలో 26 ఏళ్ల పాకిస్థానీ మహిళ కాగా మరొకరు సులేమాన్ అల్ మాజిద్. ఇతను విమానంలో కోపైలట్గా ఉన్నాడు. సులేమాన్ దుబాయ్లోనే పుట్టి పెరిగాడు. విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బెంగుళూరుకి చెందిన ఇతని కుటుంబం యూఏఈ దేశానికి వలస వెళ్లింది. యూకే దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్లో ఫెలో డాక్టర్గా ఉద్యోగం చేసేవాడు. బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో-చైర్మన్ పదవులు చేపట్టాడు. అలాగే యూకేలో డాక్టర్గా ఉన్న సమయంలోజూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని ఉద్యమం చేసినట్టు సోషల్మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.సులేమాన్ తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని సరదాగా కొంత సమయం గడిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. పైలట్ ఒక పాకిస్తానీ మహిళ ఉన్నారు. అయితే వీరి విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కాంటాక్ట్ మిస్ అయింది. కోవ్ రొటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రి తరలించారు. కానీ ఇద్దరూ చనిపోయారు. సులేమాన్ అకాల మరణంపై తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నాం. త్వరలోనే అతడికి పెళ్లి కూడా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. తమకు సర్వస్యం అయిన సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా వాచ్మ్యాన్
దుబాయ్లో పనిచేస్తున్న హైదరాబాదీ వాచ్మెన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. హైదరాబాద్కి చెందిన 60 ఏళ్ల నాంపల్లి రాచమల్లయ్య దుబాయ్లోని అబుదాబిలో గత మూడు దశాబ్దాలుగా బిల్డింగ్ వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి అప్పుడప్పుడూ బిగ్టికెట్ కొనే అలవాటు ఉంది. ఎప్పటిలానే తన స్నేహితులతో కలిసి యథావిధిగా టికెట్ని కొనుగోలు చేశాడు. ఈసారి అనూహ్యంగా రాజమల్లయ్య కొనుగోలు చేసిన టికెట్కి లాటరీ తగలడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇటీవల అనౌన్స్ చేసిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రా లో విజేతగా నిలిచాడు రాజమల్లయ్య. ఈ లక్కీ డ్రాలో రాజమల్లయ్య సుమారు రూ. రెండు కోట్లు(రూ. 2,32,76,460) పైనే గెలుచుకున్నాడు. తాను ఇలా లాటరీ టిక్కెట్ని గత ముప్పైఏళ్లుగా కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఎట్టకేలకు అదృష్ట వరించిందని సంతోషంగా చెబుతున్నాడు రాజమల్లయ్య. ఈ ప్రైజ్ మనీని తాను టికెట్ కొనడానికి సాయం చేసిన స్నేహితులతో పంచుకుంటానని, అలాగే మిగతా మొత్తాన్ని కుటుంబం కోసం ఉపయోగిస్తానని తెలిపాడు రాజమల్లయ్య. View this post on Instagram A post shared by Big Ticket (@bigticketauh) (చదవండి: టీనేజ్ పిల్లలకు ఈజీగా వంట నేర్పించండిలా..!) -
Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్
అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో విజయం సాధించి సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది. షార్జాలో బుధవారం నాటి మ్యాచ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను చిత్తుగా ఓడించి టాప్-4కు అర్హత సాధించింది.కాగా దుబాయ్ వేదికగా వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్-‘ఎ’లో ఉంది. తమ తొలి లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడి ఓటమిపాలైన మహ్మద్ అమాన్ సేన.. రెండో మ్యాచ్లో జపాన్ను 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.137 పరుగులకే ఆలౌట్ఈ క్రమంలో మూడో మ్యాచ్లో భాగంగా యూఏఈతో షార్జా క్రికెట్ స్టేడియంలో యువ భారత్ తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది. రయాన్ ఖాన్ ఒక్కడు 35 పరుగులతో రాణించగా.. మిగతావాళ్లంతా చేతులెత్తేయడంతో 44 ఓవర్లలోనే యూఏఈ కథ ముగిసింది. భారత బౌలర్లలో యుధాజిత్ గుహ మూడు వికెట్లతో చెలరేగగా.. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ పసికూనపై ప్రతాపం చూపింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్తో జట్టుకు భారీ విజయం అందించారు. ఆయుశ్ 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులు చేయగా.. వైభవ్ 46 బంతుల్లోనే 76 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. ఇలా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో భారత్ కేవలం 16.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. వైభవ్ కొట్టిన సిక్సర్తో విజయతీరాలకు చేరిన టీమిండియా(143).. పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్లోనూ అదరగొట్టిన ఆయుశ్ మాత్రే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. కాగా అండర్-19 ఆసియా కప్లో డిసెంబరు 6న సెమీస్ మ్యాచ్లు జరుగనుండగా.. డిసెంబరు 8న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.చదవండి: రోహిత్ వచ్చాడు!.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్ -
భారత్ X పాకిస్తాన్
దుబాయ్: ఆసియా కప్ అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీలో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. యూఏఈలో జరుగుతున్న ఈ టోర్నీలో నేడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో యువ భారత జట్టు తలపడుతుంది. ఉదయం గం. 10:30 నుంచి జరిగే ఈ మ్యాచ్ను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరగనున్న ఈ లీగ్ పోరులో శుభారంభం చేయాలని మొహమ్మద్ అమాన్ సారథ్యంలోని భారత జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు 10 సార్లు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిదిసార్లు విజేతగా నిలిచిన యువ భారత్... ఈసారి కూడా టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉంది. ఇటీవల ఐపీఎల్ మెగా వేలంలో రూ.1.10 కోట్లకు అమ్ముడుపోయిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్ల్లో అఫ్గానిస్తాన్పై బంగ్లాదేశ్; నేపాల్ జట్టుపై శ్రీలంక విజయం సాధించాయి. -
యువ ఆటగాళ్ల ఆసియా సమరం
దుబాయ్: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అండర్–19 ఆసియా కప్ 11వ ఎడిషన్కు రంగం సిద్ధమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో 8 జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీ పడుతున్నాయి. పాకిస్తాన్, యూఏఈ, జపాన్తో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగుతుండగా... శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. ఈ టోర్నీలో మొత్తం 15 మ్యాచ్లు నిర్వహిస్తారు. బంగ్లాదేశ్ డిఫెండింగ్ చాంపియన్గా ఉంది. శుక్రవారం బంగ్లాదేశ్తో అఫ్గానిస్తాన్... శ్రీలంకతో నేపాల్ తలపడతాయి. దుబాయ్, షార్జాలలో మ్యాచ్లు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ఏసీసీ ఆసియా కప్ను 10 సార్లు నిర్వహించగా... అందులో ఎనిమిదిసార్లు భారత జట్టు చాంపియన్గా నిలిచింది. డిసెంబర్ 8న జరగనున్న తుది పోరుతో టోర్నమెంట్ ముగుస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు సాధించేందుకు ఆటగాళ్లకు ఈ టోర్నీ ఎంతో ఉపయోగపడనుంది. గతంలో అండర్–19 స్థాయిలో మెరుపులు మెరిపించి... ఆ తర్వాత గ్లోబల్ స్టార్స్గా ఎదిగిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం యువ భారత జట్టుకు మొహమ్మద్ అమాన్ సారథ్యం వహిస్తుండగా... కిరణ్ చోర్మలే వైస్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. టోర్నీలో భాగంగా భారత జట్టు శనివారం తమ తొలి పోరులో పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. అనంతరం డిసెంబర్ 2న జపాన్తో, 4న ఆతిథ్య యూఏఈతో మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్ దశ ముగిశాక రెండు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. భారత అండర్–19 జట్టు: మొహమ్మద్ అమాన్ (కెపె్టన్), కిరణ్ చోర్మలే (వైస్ కెపె్టన్), ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్ధార్్థ, కేపీ కార్తికేయ, ప్రణవ్ పంత్, హార్దిక్ రాజ్, నిఖిల్ కుమార్, హర్వంశ్ సింగ్, అనురాగ్, ఇనాన్, సమర్థ్ నాగరాజ్, యుధాజిత్ గుహ, చేతన్ శర్మ. -
Asia Cup 2024: పాక్ భారీ విజయం.. భారత్తో పాటు సెమీస్లో!
ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా టీ20 కప్-2024లో పాకిస్తాన్-‘ఎ’ జట్టుకు వరుసగా రెండో విజయం లభించింది. అల్ అమెరత్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో పాక్ యూఏఈ టీమ్ను ఏకంగా 114 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ గెలుపుతో సెమీ ఫైనల్ బెర్తును కూడా ఖరారు చేసుకుంది.పాక్, యూఏఈలపై గెలిచిన భారత్కాగా ఒమన్ వేదికగా వర్ధమాన టీ20 జట్ల మధ్య ఆసియా కప్ ఈవెంట్ జరుగుతోంది. ఇందులో తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టు సహా పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ గ్రూప్-బిలో ఉండగా.. హాంగ్కాంగ్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్ గ్రూప్-ఎలో ఉన్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే పాకిస్తాన్, యూఏఈలపై గెలుపొంది భారత్ గ్రూప్-బి నుంచి సెమీస్లో అడుగుపెట్టింది. తాజాగా పాక్ సైతం టాప్-4కు అర్హత సాధించింది. యూఏఈతో మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.కెప్టెన్ ధనాధన్ ఇన్నింగ్స్ఓపెనర్లు ఒమైర్ యూసఫ్(11 బంతుల్లో 21), యాసిర్ ఖాన్(13 బంతుల్లో25) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ మహ్మద్ హ్యారిస్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులు సాధించాడు.మిగతా వాళ్లలో కాసిం అక్రం 23 పరుగులు చేయగా.. హైదర్ అలీ మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 32*) ఆడాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది.65 పరుగులకే కుప్పకూలిన యూఏఈలక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే యూఏఈ తడబడింది. ఓపెనర్లు ఆయాన్ష్ శర్మ(8), మయాంక్ రాజేశ్ కుమార్(0) విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ తానిశ్ సూరి 15 రన్స్ చేశాడు. మిగిలిన ఆటగాళ్లలో వికెట్ కీపర్ సయీద్ హైదర్ షా(12), ధ్రువ్ పరాషర్(1), బాసిల్ హమీద్(4), సంచిత్ శర్మ(0), ముహ్మద్ ఫారూక్(3), అకీఫ్ రాజా(0), ఒమిద్ రెహ్మాన్(0 నాటౌట్) దారుణ ప్రదర్శన కనబరిచారు.ఇక కెప్టెన్ రాహుల్ చోప్రా చేసిన ఇరవై పరుగులే యూఏఈ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు. ఈ క్రమంలో 16.3 ఓవర్లలో కేవలం 65 పరుగులకే యూఏఈ జట్టు కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షానవాజ్దహాని అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. సూఫియాన్ ముఖీమ్ రెండు, అహ్మద్ దనియాల్, అబ్బాస్ ఆఫ్రిది, అరాఫత్ మిన్హాస్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా పాక్ అంతకుముందు ఒమన్పై విజయం సాధించింది.చదవండి: Ind vs NZ: అతడి ఆట తీరు బాగుంది.. అయినా..: గంభీర్ నువ్వేమైనా ‘హ్యాట్రిక్’ హీరోవా? బుద్ధిలేదా?: పాక్ మాజీ క్రికెటర్ ఫైర్ -
అభిషేక్ శర్మ ఊచకోత.. యూఏఈపై టీమిండియా ఘన విజయం
టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో భాగంగా యూఏఈతో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల ధాటికి 16.5 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా పేసర్ రసిఖ్ సలామ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం రమణ్దీప్ సింగ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్లో రాహుల్ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్లో రాహుల్తో పాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ రాజేశ్ కుమార్ (5 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అభిషేక్ శర్మ ఊచకోత..స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. అభిషేక్ శర్మ (24 బంతుల్లో 58; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో 10.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. భారత ఇన్నింగ్స్లో తిలక్ వర్మ 21, ప్రభ్సిమ్రన్ సింగ్ 8, అభిషేక్ 58 పరుగులు చేసి ఔట్ కాగా.. నేహల్ వధేరా 6, ఆయుశ్ బదోని 12 పరుగులతో అజేయంగా నిలిచారు. -
టీమిండియా బౌలర్ల విజృంభణ.. 107 పరుగులకే కుప్పకూలిన పసికూన
ఏసీసీ మెన్స్ టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీలో భాగంగా పసికూన యూఏఈతో ఇవాళ (అక్టోబర్ 21) జరిగిన మ్యాచ్లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. యూఏఈని 107 పరుగులకే (16.5 ఓవర్లలో) కుప్పకూల్చింది. టీమిండియా పేసర్ రసిఖ్ సలామ్ ఐదు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి యూఏఈని చావుదెబ్బ కొట్టాడు. అనంతరం రమణ్దీప్ సింగ్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. అన్షుల్ కంబోజ్, వైభవ్ అరోరా, అభిషేక్ శర్మ, నేహల్ వధేరా తలో వికెట్ దక్కించుకున్నారు. యూఏఈ ఇన్నింగ్స్లో రాహుల్ చోప్రా ఒక్కడే ఒంటరిపోరాటం చేశాడు. రాహుల్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు. యూఏఈ ఇన్నింగ్స్లో రాహుల్తో పాటు కెప్టెన్ బాసిల్ హమీద్ (12 బంతుల్లో 22; ఫోర్, 2 సిక్సర్లు), మయాంక్ రాజేశ్ కుమార్ (5 బంతుల్లో 10; ఫోర్, సిక్స్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. ఒమిద్ రెహ్మాన్ బౌలింగ్లో ప్రభ్సిమ్రన్ సింగ్ (8; సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 100 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, భారత్ ఈ టోర్నీలో జరిగిన తమ ఓపెనింగ్ మ్యాచ్లో దాయాది పాకిస్తాన్పై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది.చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్గా లియామ్ లివింగ్స్టోన్ -
గుర్తించారు... చాలు! క్రికెటర్ శ్రేయాంక పాటిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్
‘కుదిరితే క్షమించు. లేదంటే శిక్షించు. కానీ మేమున్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. దయచేసి గుర్తించు..’ అని అనేది ఓ సినిమాలో డైలాగ్! నిజమే.. క్షమించినా, శిక్షించినా, విమర్శించినా, ద్వేషించినా... అసలంటూ గుర్తించటమే కావలసింది. ఆటలోనైనా, బతుకు పోరాటంలోనైనా గెలుపోటములు ఎలా ఉన్నా ముందైతే గుర్తింపు ముఖ్యం. ఆ విషయాన్నే భారత మహిళా క్రికెట్ జట్టులోని ఆల్ రౌండర్ శ్రేయాంక పాటిల్ తన ఇన్స్టాగ్రామ్లో ఎంతో చక్కగా వ్యక్తం చేశారు. ‘మీ అభిమానానికి, మీ విమర్శలకూ నిజంగా అభివందనాలు. ఈవిధంగానైనా మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. ఓటమి మమ్మల్ని ఒకవైపు బాధిస్తున్నా, గెలుపు కోసం మరింతగా ఆకలిని మాలో రాజేసింది.. ‘ అని రాశారు. యూఏఈలో ప్రస్తుతం జరుగుతున్న టి20 విమెన్ వరల్డ్ కప్లో భారత జట్టు సెమీస్కి క్వాలిఫై కాలేక సోయిన సంగతి అటుంచితే... ఇన్స్టాగ్రామ్లో శ్రేయాంక పాటిల్ పెట్టిన ఈ పోస్ట్...ముఖ్యంగా స్పాన్సరర్లు మహిళల క్రికెట్ జట్టును గుర్తించి, మరింతగా ప్రోత్సహించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. View this post on Instagram A post shared by Shreyanka Patil (@shreyanka_patil31) -
అబుదాబిలో బతుకమ్మ సంబరాలు
అబుదాబి, సాక్షి : తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న తెలంగాణీయులందరు దేశ రాజధాని అయిన అబుదాబి లో జత చేరి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అబుదాబి లోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో గత నెల రోజులు గా ఈ ఉత్సవాల కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుత కార్యక్రమానికి అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదిక అయ్యిందియుఏఈ లో ఉన్న వందలాది తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు గత నెల రోజులు గా అవిశ్రాంతంగా వివిధ తెలంగాణ నృత్యాల ప్రదర్శనల తయారీ చేశారు. ఎడారి ప్రాంతం కావడం కారణంగా పూలు దొరకడం చాలా కష్టం తోను మరియు చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవహారం కావడం తో సంఘ నాయకత్వం ఎక్కువ మోతాదు లో తెలంగాణ నుండి వందలాది కిలోల వివిధ పూలను తెప్పించి అబూ దాబి ని పూల వనంగా మార్చారు. ఇండియా నుండి తెచ్చిన తీరొక్క పూలతో ఘనంగా సామూహిక బతుకమ్మ తయారీ కార్యక్రమాన్ని నిర్వాహకులు పల్లె వాతావరణాన్ని పరిమళించే లా చేశారు. ఈ కార్యక్రమానికి వందలాది తెలంగాణ మహిళలు విచ్చేసి బతుకమ్మ తయారీ ప్రాంగణాన్ని బతుకమ్మ పాట ల తో మార్మోగించారు. శుక్రవారం సాయంత్రం కార్యక్రమ వేదిక అయిన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ కి రెండు వేల మంది మహిళలు కార్యక్రమ ఆరంభ సమయానికి ముందే చేరుకొని సందడి చేశారు. ఈ తెలంగాణ సంబరాలకు వన్నె తెచ్చేందుకు అందరిని అలరించడానికి మరియు తెలంగాణ వాతావరణానికి మరింత కల తెచ్చేందుకు ప్రముఖ కవి గాయకుడు శ్రీ అష్ట గంగాధర్ మరియు తెలంగాణ వర్ధమాన గాయని శ్రీమతి తేజు ప్రియ ప్రత్యేకంగా ఇండియా నుండి విచ్చేసారు. కార్యక్రమాన్ని తెలంగాణ సంప్రదాయానికి ప్రతిభింబించే లా డప్పు వాయిద్యం మరియు కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను బతుకమ్మ ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారుఆ తరువాత తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు తెలంగాణ సాంప్రదాయo ఉట్టి పడుతూ చేసిన నృత్య ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేశాయి. తెలంగాణ నుండి వచ్చిన ఇద్దరు కళాకారులు వివిధ రకాల తెలంగాణ ఆట పాటలతో ప్రేక్షకులను అలరించారు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా జంటల (Couples) నృత్య ప్రదర్శన నిలిచింది. ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించి అందరికి పంచిన తెలంగాణ పిండి వంటలు కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ వారినందరిని విశేషంగా ఆకర్షించాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యుఏఈ భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ అఫ్ మిషన్ శ్రీ అమర్నాథ్ అశోకన్ ముఖ్య అతిధి గా మరియు కాన్సులర్ డా: ఆర్. బాలాజీ మరియు కుటుంబ సభ్యులు గౌరవ అతిధులు గా హాజరు అయ్యారు. వారు కూడా తెలంగాణ మహిళ ల తో బతుకమ్మ ఆడి పాడారు. తదనంతరం కార్య నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 3 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు మరియు జంటలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమ ముఖ్య దాతలు టైటిల్ స్పాన్సర్ గా సంపంగి గ్రూప్ మరియు కో స్పాన్సర్ గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏ ఎక్స్ ప్రాపర్టీస్, బ్యూటీ డెంటా కేర్ వారిని నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా అబుదాబి బాప్స్ హిందూ మందిర్ డైరెక్టర్ శ్రీ ప్రణవ్ దేశాయ్ మరియు వారి కుటుంబ సభ్యులు హాజరు అయి తెలంగాణ మహిళలందరితో బతుకమ్మ ఆడారు. చివరగా గౌరీ పూజ చేసి బతుకమ్మ నిమజ్జనం కృతిమ కొలను లో చేసి ప్రసాదాలు పంచి, విందు భోజనం ఆరగించారు ఈ కార్యక్రమాన్ని రాజశ్రీనివాస రావు, గోపాల్, వంశీ, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, పద్మజ, లక్ష్మి, నిధి తదితరులు దగ్గర ఉండి నడిపించారు. బతుకమ్మ ఉత్సవాలు విదేశాలలో కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్య నిర్వాహకులు రాజశ్రీనివాస రావు తెలియజేశారు. -
పాక్కు బిగ్ షాక్.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే ఛాన్స్! ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ సొంత గడ్డపై ఓ ఐసీసీ ఈవెంట్ జరగనుండడంతో విజయవంతంగా నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ టోర్నీలో పాల్గోనందుకు పాక్కు టీమిండియా వెళ్లడంపై ఇంకా సందిగ్ధం కొనసాగుతునే ఉంది.ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత 10 ఏళ్ల పాక్-భారత జట్ల మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగడం లేదు. ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్ వంటి ఈవెంట్లో తలపడతున్నాయి. ఆసియాకప్-2023కు పాక్నే ఆతిథ్యమిచ్చింది.కానీ భారత్ మాత్రం పాక్కు వెళ్లలేదు. దీంతో ఆ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించారు. భారత్ తమ మ్యాచ్లన్నింటని శ్రీలంకలో ఆడింది. ఇప్పుడు కూడా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని హైబ్రిడ్ మోడల్లోనే బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్కు వెళ్లేది లేదని ఐసీసీకి భారత క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పీసీబీ మాత్రం భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుతో ఉంది. పీసీబీ ఇప్పటికే డ్రాప్ట్ షెడ్యూల్ను కూడా ఐసీసీకి పంపించింది. దీనిలో భాగంగా ఫైనల్ మ్యాచ్కు లాహోర్ను వేదికగా నిర్ణయించింది. అయితే తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ నిర్వహణకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత్ ఒకే వేళ ఫైనల్ చేరితే వేదిక దుబాయ్కి మారే అవకాశం ఉందని ‘టెలిగ్రాఫ్’ తమ నివేదికలో పేర్కొంది. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. పాక్కు వెళ్లకూడదని భారత జట్టు నిర్ణయించుకుంటే టీమిండియా మ్యాచులన్నీ యూఏఈలో నిర్వహించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కాగా ఐసీసీ నూతన చైర్మెన్గా జై షా ఎంపికైన విషయం విధితమే. -
చెలరేగిన ఓపెనర్.. సౌతాఫ్రికా ఘన విజయం
ఐర్లాండ్తో తొలి వన్డేలో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాల్ స్టిర్లింగ్ బృందాన్ని ఏకంగా 139 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సౌతాఫ్రికా.. ఐర్లాండ్తో తొలుత రెండు టీ20లు ఆడింది.పొట్టి సిరీస్లో తొలి మ్యాచ్లో ప్రొటిస్ జట్టు గెలుపొందగా.. రెండో టీ20లో అనూహ్య రీతిలో ఐర్లాండ్ పది పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం వన్డే సిరీస్ మొదలైంది. అబుదాబి వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది.చెలరేగిన ఓపెనర్ఓపెనర్ రియాన్ రికెల్టన్.. 102 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్ల సాయంతో 91 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టోనీ డి జోర్జీ(12), కెప్టెన్ తెంబా బవుమా(4), వాన్ డెర్ డసెన్(0) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐదో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ రికెల్టన్తో కలిసి ప్రొటిస్ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు. 86 బంతుల్లో 79 పరుగులు చేశాడు.మిగతా వాళ్లలో జోర్న్ ఫార్చూన్ 28, లుంగి ఎంగిడి 20(నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. ఐరిష్ బౌలర్లలో మార్క్ అదేర్ నాలుగు, క్రెయిగ్ యంగ్ మూడు వికెట్లు కూల్చగా.. హ్యూమ్, ఆండీ మెక్బ్రిన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.132 పరుగులకు ఆలౌట్ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ను సౌతాఫ్రికా బౌలర్లు ఆది నుంచే బెంబేలెత్తించారు. ఏ దశలోనూ ఐరిష్ బ్యాటర్లను కోలుకోనివ్వలేదు. ఫలితంగా 31.5 ఓవర్లకే 132 పరుగులు చేసి ఐర్లాండ్ జట్టు కుప్పకూలింది. ప్రొటిస్ పేసర్లలో లిజాడ్ విలియమ్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్మన్, వియాన్ ముల్దర్ ఒక్కో వికెట్ కూల్చారు. స్పిన్నర్ జోర్న్ ఫార్చున్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఐర్లాండ్ బ్యాటర్లలో జార్జ్ డాక్రెల్ 21 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ రెకెల్టన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శుక్రవారం(అక్టోబరు 4) రెండో వన్డే జరుగనుంది.చదవండి: న్యూజిలాండ్ టెస్టు కెప్టెన్సీకి సౌథీ గుడ్బై.. కొత్త కెప్టెన్ ఎవరంటే? -
ఓర్నీ.. క్రికెట్ మ్యాచ్లో బ్యాట్లతో కొట్టుకున్న ప్లేయర్లు(వీడియో)
క్రికెట్.. జెంటిల్ మ్యాన్ గేమ్ గా పేరొందిన విషయం అందరికి తెలిసిందే. కానీ క్రికెట్ టోర్నమెంట్లో ఆ పేరుకే మాయని మచ్చ తీసుకువచ్చారు. ఓ మ్యాచ్లో ఆటగాళ్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అంపైర్లు ఆపినా కూడా బ్యాట్లతో మరి కొట్టుకున్నారు. ప్రొఫిషనల్గా ఉండాల్సిన క్రికెటర్లు వీధి రౌడీల్లా మారారు. అస్సలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఇంతకీ ఆ టోర్నీ ఏదో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.ఏం జరిగిందంటే?ఎంసీసీ స్పోర్ట్స్ క్రికెట్ క్లబ్.. ఎంసీసీ వీక్డేష్ బాష్ XIX పేరిట ఓ టోర్నీ నిర్వహించింది. ఈ టోర్నీకి యూఏఈలోని ఆజ్మల్ ఆతిథ్యమిచ్చింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన ఫైనల్లో ఏరోవిసా క్రికెట్, రబ్దాన్ క్రికెట్ క్లబ్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. రబ్దాన్ క్రికెట్ క్లబ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన నాసిర్ అలీ బౌలింగ్లో చివరి బంతికి కాషిఫ్ మహ్మద్ ఎల్బీగా ఔటయ్యాడు. అయితే కాషిఫ్ను ఔట్ చేసిన తర్వాత బౌలర్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. కాషిఫ్ వద్దకు వెళ్లిన అలీ అతడిని రెచ్చగొట్టేలా సంబరాలు చేసుకున్నాడు.అతడి వైపు చేతి వేలు చూపిస్తూ గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు. కాషిఫ్ కూడా అతడి వ్యాఖ్యలకు స్పందిస్తూ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇరు జట్ల నుంచి ఆటగాళ్ల సైతం తమ ప్లేయర్లకు మద్దతుగా నిలిచారు. దీంతో గొడవ మరింత తీవ్రమైంది. ఒకరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. బ్యాట్లతో కూడా కొట్టుకున్నారు. ఆఖరికి అంపైర్లు జోక్యం చేసుకుని ఈ గొడవను సద్దుమణిగేలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. KALESH on Cricket Pitch 🥵 pic.twitter.com/mhvNYFIp4I— Sameer Allana (@HitmanCricket) September 25, 2024 -
ICC Women's T20 World Cup 2024: సమరానికి సై
ముంబై: గతంలో జరిగిన తప్పిదాలను ఈసారి పునరావృతం చేయబోమని... ఈసారి విజేత హోదాతో స్వదేశానికి తిరిగి వస్తామని భారత మహిళల టి20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ వ్యాఖ్యానించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ కోసం భారత మహిళల జట్టు మంగళవారం బయలు దేరింది. గత జూలైలో ఆసియా కప్లో రన్నరప్గా నిలిచాక మరే టోర్నీలో ఆడని టీమిండియా... బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ప్రత్యేక శిబిరంలో పాల్గొంది. గత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం విజేతగా నిలువలేకపోయింది. 2017 వన్డే ప్రపంచకప్, 2020 టి20 ప్రపంచకప్లలో ఫైనల్కు చేరిన భారత అమ్మాయిలు... రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా చేతిలో ఓడి రిక్తహస్తాలతో వెనుదిరిగారు.వరల్డ్కప్లో సత్తా చాటేందుకు కఠోర సాధన చేశామని, సమరానికి సిద్ధంగా ఉన్నామని హర్మన్ప్రీత్ పేర్కొంది. ముఖ్యంగా చాన్నాళ్లుగా జట్టును ఇబ్బంది పెడుతున్న ఫీల్డింగ్, ఫిట్నెస్పై దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. జట్టు యూఏఈ బయలుదేరడానికి ముందు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కోచ్ అమోల్ మజుందార్, చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్తో కలిసి హర్మన్ప్రీత్ పాల్గొంది. అడ్డంకులు అధిగమిస్తాం... ‘అత్యుత్తమ జట్టుతో ప్రపంచకప్ ఆడనున్నాం. జట్టులోని ప్లేయర్లందరూ చాలా కాలం నుంచి కలిసి ఆడుతున్నారు. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. గతేడాది టి20 ప్రపంచకప్లో సెమీఫైనల్లో ఓడాం. ఈసారి అడ్డంకులన్ని అధిగమించి విజేతగా నిలవాలని అనుకుంటున్నాం. శిక్షణ సమయంలో బలహీనంగా ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాం. అన్ని రంగాల్లో రాటుదేలాం. ఆసియా కప్లో మెరుగైన ప్రదర్శనే చేశాం. కానీ మాది కాని రోజు ఒకటి ఎదురైంది. దీంతో ఫైనల్లో పరాజయం పాలయ్యాం. నేను ఇప్పటి వరకు చాలా ప్రపంచకప్లు ఆడాను. అయినా మొదటి సారి మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్నట్లే అనిపిస్తోంది. ఉత్సాహంలో ఏమాత్రం తేడా లేదు. మేము ఏ జట్టునైనా ఓడించగలం. ఆ్రస్టేలియాకు కూడా తెలుసు... ప్రపంచంలో వారిని ఓడించే జట్టు ఏదైనా ఉంది అంటే అది టీమిండియానే’ అని హర్మన్ వివరించింది. 2009 నుంచి ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహిస్తుండగా... ఇప్పటి వరకు జరిగిన 8 మెగా టోర్నీల్లోనూ 35 ఏళ్ల హర్మన్ప్రీత్ కౌర్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. స్పోర్ట్స్ సైకాలజిస్ట్ను నియమించాం: మజుందార్ ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో పరాజయం అనంతరం జట్టుకు ఎలాంటి శిక్షణ అవసరమో ఆలోచించి దాన్నే ప్రత్యేక శిబిరం ద్వారా అందించామని మహిళల జట్టు హెడ్ కోచ్ అమోల్ మజుందార్ అన్నాడు. ‘జట్టుకు ముందు ఫీల్డింగ్, ఫిట్నెస్ శిక్షణ అందించాం. ఆ తర్వాత పది రోజుల పాటు నైపుణ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాం. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ సైకాలజిస్ట్ ముగ్ధా బావ్రేను నియమించాం. ప్లేయర్ల సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ఫీల్డింగ్ను మెరుగు పరచడంపై మరింత దృష్టి సారించాం. శిబిరంలో భాగంగా యోగా సెషన్లు, మానసిక దృఢత్వానికి సంబంధించిన శిక్షణ అందించాం. అన్నీటికి సిద్దంగా ఉండే విధంగా ప్లేయర్లకు తర్ఫీదునిచ్చాం. వరల్డ్కప్లో భాగంగా పది రోజుల వ్యవధిలో ఐదు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అన్ని విభాగాలను సరిచూసుకున్నాం. టాపార్డర్లో ఆరుగురు మంచి బ్యాటర్లు ఉన్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి అయినా... అందరి లక్ష్యం జట్టును గెలిపించడమే. వన్డౌన్లో ఎవరిని ఆడించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చాం. యూఏఈలో పరిస్థితులు భారత్ను పోలే ఉంటాయి. ఆరంభంలో అధిక బౌన్స్ ఉండే అవకాశం ఉంది’ అని మజుందార్ అన్నాడు. షెడ్యూల్ ప్రకారం మహిళల టి20 ప్రపంచ కప్నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యూఏఈకి మార్చారు. -
ఈసారి టీ20 వరల్డ్కప్ టీమిండియాదే: కెప్టెన్
ఈసారి టీ20 ప్రపంచకప్ గెలిచితీరతామని టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. జట్టులోని ప్రతి ఒక్కరు ఈ మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతామని పేర్కొంది. ఈవెంట్ ఎక్కడైనా ప్రేక్షకుల మద్దతు మాత్రం తమకే లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది.న్యూజిలాండ్తో తొలి మ్యాచ్కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అక్టోబరు 3 నుంచి మహిళల టీ20 వరల్డ్కప్-2024 మొదలుకానుంది. బంగ్లాదేశ్- స్కాట్లాండ్ మధ్య మ్యాచ్తో ఈ ఐసీసీ ఈవెంట్కు తెరలేవనుంది. ఇక టీమిండియా అక్టోబరు 4న న్యూజిలాండ్తో పోరుతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాంఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడిన హర్మన్ప్రీత్ కౌర్.. ‘‘మా జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ట్రోఫీ గెలవాలనే పట్టుదలతో ఉన్నాము. చాలా కాలంగా మేము ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాం. అదే మా బలం. ఎక్కడున్నా అభిమానుల మద్దతు మాకే ఉంటుంది. జట్టులోని ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రోఫీ గెలవాలన్న నిరీక్షణకు ఈసారి తెరదించుతాం’’ అని పేర్కొంది. కాగా ఐసీసీ టోర్నీలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై బోల్తా పడుతున్న విషయం తెలిసిందే. గత టీ20 వరల్డ్కప్ ఆసాంతం నిలకడగా రాణించిన హర్మన్ సేన.. ఫైనల్లో మాత్రం అనుకన్న ఫలితం రాబట్టలేకపోయింది. గత పొరపాట్లు పునరావృతం చేయకుండాటైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇటీవల మహిళల ఆసియా కప్ టోర్నీలోనూ ఫైనల్లో శ్రీలంక చేతిలో అనూహ్యంగా పరాజయం పాలైంది. అయితే, ప్రపంచకప్ ఈవెంట్లో మాత్రం గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడిని జయించి టైటిల్ గెలవాలని భావిస్తోంది. చదవండి: IND vs BAN: అగార్కర్ కీలక నిర్ణయం.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్? -
యూఏఈలో ఆడటం సానుకూలాంశం
న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ యూఏఈ వేదికపై జరగనుండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేర్కొంది. మిగతా జట్లకంటే షార్జా, దుబాయ్ వేదికలు భారత్కు సానుకూలమని ఆమె విశ్లేషించింది. అక్కడి స్థానిక వాతావరణ, పిచ్ పరిస్థితులు అందరికంటే భారత్కే ఎక్కువగా లాభిస్తాయని ఆమె చెప్పింది. ‘యూఏఈలోని పరిస్థితులు కాస్తా భిన్నంగా ఉండొచ్చేమో కానీ భారత్కు దగ్గరగానే ఉంటాయి. ఇది మెగా ఈవెంట్లో మన జట్టుకు బాగా ఉపకరించే అంశం. ఈ సానుకూలతతో జట్టు అక్కడి వాతావరణానికి ఇట్టే అలవాటు పడుతుంది’ అని మిథాలీ వివరించింది. అయితే జరగబోయేది మెగా ఈవెంట్ అన్న సంగతి మరవొద్దని ప్రతీ జట్టు ప్రపంచకప్ కోసం సన్నద్ధమయ్యే వస్తుందని తమ జట్టు వర్గాలను అప్రమత్తం చేసింది. ‘మెగా ఈవెంట్లో పాల్గొనే ప్రతి జట్టు అన్ని రంగాల్లో పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని తెలిపింది. ఐసీసీ ప్రపంచకప్ టోరీ్నలో ఫైనల్ చేరిన సీనియర్ మహిళల జట్టు ఇంత వరకు టైటిల్ను మాత్రం గెలవలేకపోయింది. అండర్–19 ప్రపంచకప్లో మాత్రం యువ మహిళల జట్టు గతేడాది ఆరంభమైన తొలి మెగా ఈవెంట్ను గెలిచింది. ఈ ప్రపంచకప్లో భారత జట్టు రాణించాలని, కప్తో తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నట్లు మాజీ కెపె్టన్ చెప్పింది. వచ్చే నెల 3 నుంచి యూఏఈలో అమ్మాయిల టి20 ప్రపంచకప్ మొదలవుతుంది. దుబాయ్ వేదికగా 4వ తేదీన భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. -
T20 WC: టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు: కెప్టెన్
శారీరక ఫిట్నెస్తో పాటు మానసిక దృఢత్వం కూడా ముఖ్యమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ పేర్కొంది. ఈ రెండూ సమతూకంగా ఉంటేనే మెగా టోర్నీల్లో విజయవంతం కాగలమని అభిప్రాయపడింది. అందుకే తాము.. మహిళల టీ20 ప్రపంచకప్నకు ముందు... మానసిక స్థయిర్యం సాధించేందుకు కూడా కసరత్తు చేస్తుట్లు తెలిపింది.కాగా ఐసీసీ టోర్నమెంట్లలో భారత మహిళల జట్టు కొన్నేళ్లుగా ఆఖరి మెట్టుపై తడబడుతోన్న విషయం తెలిసిందే. గత టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో ఆసాంతం నిలకడగా రాణించిన అమ్మాయిల జట్టు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతిని రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇక ఈసారైనా గత పొరపాట్లు పునరావృతం చేయకూడదని.. ఒత్తిడి అధిగమించి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. టీ20 క్రికెట్.. పొట్టి ఫార్మాట్ కానేకాదు!ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ‘చాలా రోజులుగా మేమంతా మానసిక సంసిద్ధతపై దృష్టి పెట్టాం. మ్యాచ్ల్లో ఎప్పుడైనా చివరి మూడు, నాలుగు ఓవర్ల ఆట పెను ప్రభావాన్ని చూపిస్తోంది. నిజానికి టీ20 క్రికెట్ అందరు అనుకున్నట్లు పొట్టి ఫార్మాట్ కానేకాదు. ఆ రోజు 40 ఓవర్ల మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మెంటల్ ఫిట్నెస్పై ఎక్కువ దృష్టి పెట్టాంమేం ఆఖరి నాలుగైదు ఓవర్లు మానసిక పట్టుదలను కనబరిస్తే మ్యాచ్లు గెలవచ్చు. ఈ ఓవర్లే ఫలితాలను తారుమారు చేస్తున్నాయి. ఏదేమైనా.. చివరిదాకా చతికిలబడటం చాలా నిరాశను మిగులుస్తోంది. అందుకే అలాంటి సమయంలో నిలకడను కొనసాగించేందుకు ఈసారి మెంటల్ ఫిట్నెస్పై ఎక్కువ దృష్టి పెట్టాం’ అని తెలిపింది.ఇకపై గత పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని హర్మన్ప్రీత్ కౌర్ చెప్పింది. జట్టులో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లతో కలిసి ఆడటం వల్ల విభిన్న సంస్కృతులు తెలుసుకునేందుకు, ఏదైనా కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశముంటుందని పేర్కొంది. ఒత్తిడిని అధిగమించలేక ఆఖరి మెట్టుపై బోల్తాకాగా.. 2017 వన్డే ప్రపంచకప్లోనూ ఇంగ్లండ్తో భారత్ తుదిమెట్టుపై దాదాపు గెలిచే స్థితిలో ఉండి... అనూహ్యంగా 9 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండేళ్ల క్రితం జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల తేడాతో ఓడి స్వర్ణాన్ని చేజార్చుకుని... వెండి పతకంతో సరిపెట్టుకుంది.యూఏఈలోమహిళా టీ20 ప్రపంచకప్-2024 ఎడిషన్ అక్టోబర్ 3- 20 వరకు జరుగనుంది. షార్జా, దుబాయ్ ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యమిస్తున్నాయి. ఈ ఐసీసీ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో ఉంది.ఇక ఆరుసార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్లో ఈ గ్రూపులోనే ఉండటం విశేషం. దీంతో లీగ్ దశలో భారత్కు గట్టిపోటీ ఎదురుకానుంది.ఈ మెగా ఈవెంట్లో హర్మన్ సేన తమ తొలి మ్యాచ్ను అక్టోబర్ 4న న్యూజిలాండ్తో ఆడుతుంది.అందుకే వేదిక మార్పుఅదే విధంగా.. లీగ్ దశలోని మొదటి మూడు మ్యాచ్ల్ని దుబాయ్లో ఆడనున్న టీమిండియా... ఆసీస్తో జరిగే ఆఖరి మ్యాచ్ను షార్జాలో 13వ తేదీన ఆడుతుంది. నిజానికి ఈ మెగా ఈవెంట్ బంగ్లాదేశ్లో జరగాల్సింది. కానీ అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితి, హింసాత్మక ఘటనలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వేదికను యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. చదవండి: 38వ పడిలోకి స్పిన్ మాంత్రికుడు.. హ్యాపీ బర్త్ డే అశ్విన్ -
T20 WC: ‘కెప్టెన్సీకి కఠిన సవాలు.. ఈసారైనా ట్రోఫీ గెలవాలి’
ఒత్తిడిని అధిగమిస్తేనే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లలో విజయం వరిస్తుందని భారత మహిళా మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ పేర్కొంది. ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్లపై పైచేయి సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో ఆది నుంచే దూకుడు ప్రదర్శించాలని మహిళా జట్టుకు సూచించింది. ఆస్ట్రేలియా చేతిలో వరుస పరాజయాలుకాగా నాలుగేళ్ల క్రితం జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. అయితే, టైటిల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. అదే విధంగా... 2023 ఫిబ్రవరిలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సమయంలోనూ భారత మహిళా జట్టు ప్రయాణం సెమీఫైనల్స్నే ముగిసింది. ఈ దఫా కూడా మన జట్టు ఆస్ట్రేలియా చేతిలోనే ఓడటం గమనార్హం. అయితే ఈసారి మాత్రం అలాంటి అవకాశాన్ని వదలరాదని, మన ప్లేయర్లు ఒత్తిడిని అధిగమించాలని భారత మాజీ ప్లేయర్ డయానా ఎడుల్జీ సూచించింది. అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొంది.మనదైన రోజు ఏదైనా సాధ్యమేఈ సందర్భంగా... ఎడుల్జీ మాట్లాడుతూ... ‘ఆస్ట్రేలియాలాంటి ప్రొఫెషనల్ టీమ్ను ఓడించాలంటే మనం అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించాలి. మన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తేనే ప్రత్యర్థి కూడా తడబడుతుంది. అయితే టీ20ల్లో మనదైన రోజు ఏదైనా సాధ్యమే. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో మనం ఓడిపోతామని అనుకున్నామా? ప్లేయర్లు ఎలాంటి స్థితిలోనూ ఒత్తిడికి తలవంచవద్దు.భావోద్వేగాలను అదుపు చేసుకోవాలిప్రపంచకప్ కప్ టోర్నీలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అవసరం. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఆమెకు ఉంది. ఆమె బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీకి కూడా ఈ టోర్నీ సవాల్’ అని ఎడుల్జీ అభిప్రాయపడింది. అదే విధంగా.. భారత పురుషుల జట్టు మాదిరే మహిళల టీమ్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్ గెలిచి.. ఒకే ఏడాది అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. చదవండి: DT 2024: గిల్ ప్లేస్లో ఎంట్రీ.. కట్ చేస్తే మెరుపు సెంచరీ?(వీడియో) -
Pak vs Eng: పాకిస్తాన్లో కాదు శ్రీలంకలో!?
బంగ్లాదేశ్ చేతిలో ఘోర ఓటమిపాలైన పాకిస్తాన్ క్రికెట్ జట్టు సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఇంగ్లండ్తో తలపడనుంది. అక్టోబరు 7 నుంచి ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ముల్తాన్, కరాచి, రావల్పిండిలో ఈ మ్యాచ్లను నిర్వహించాల్సి ఉంది.అయితే, తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ వేదికను విదేశానికి తరలించినట్లు సమాచారం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా శ్రీలంకలో ఈ మ్యాచ్లను నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్లోని స్టేడియాల పునరుద్ధరణ కార్యక్రమం నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.అందుకే వేదిక మార్పుకాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీని సమర్థవంతంగా నిర్వహించాలంటే పాక్ స్టేడియాల్లో తగిన సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు వివిధ స్టేడియాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. అయితే ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించకపోవడంతో టెస్టుమ్యాచ్ల నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్తో సిరీస్ వేదికను తరలించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.కానీ.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును ఇందుకు ఒప్పించడం సహా... యూఏఈ లేదంటే శ్రీలంకలో సిరీస్ నిర్వహించడం పాక్ బోర్డుకు అంతతేలికేమీ కాదు. ఎందుకంటే.. బంగ్లాదేశ్లో అల్లర్ల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచకప్-2024 వేదికగా ఇప్పటికే యూఏఈని ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబరు 3- 20 వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది.లంక బెస్ట్ ఆప్షన్కాబట్టి యూఏఈలో పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. మరోవైపు.. శ్రీలంకలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడా మ్యాచ్లు సజావుగా నిర్వహించడం కష్టమేకానుంది. అయితే, లంక కంటే ఉత్తమ ఆప్షన్ లేదు కాబట్టి అక్కడే ఈ సిరీస్ను నిర్వహించాలని పాక్ బోర్డు భావిస్తున్నట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ఇటీవల బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్లో 0-2తో క్లీన్స్వీప్నకు గురైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ బంగ్లా చేతిలో టెస్టుల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి.పాకిస్తాన్లో ఇంగ్లండ్ పర్యటన 2024- ఖరారైన షెడ్యూల్మొదటి టెస్టు- అక్టోబరు 7- అక్టోబరు 11- ముల్తాన్రెండో టెస్టు- అక్టోబరు 15- అక్టోబరు 19- కరాచిమూడో టెస్టు- అక్టోబరు 24- అక్టోబరు 28- రావల్పిండి. -
యూఏఈ నుంచి 160 టన్నుల బంగారం దిగుమతి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యునైటెట్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ) నుంచి అధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ నుంచి భారత్ తయారీదారులు, వ్యాపారులు రాయితీ రేటుతో 160 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకునేలా ప్రభుత్వం నోటిఫై చేసింది. భారతదేశం–యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత స్థాయి అధికారి తెలిపారు.రెండు దేశాల మధ్య 2022 మే 1వ తేదీ నుంచి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పదం ప్రకారం, టారిఫ్ రేట్ కోటా (టీఆర్క్యూ) కింద ఒక శాతం టారిఫ్ రాయితీతో యూఏఈ నుండి ఏటా 200 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి భారత్ అంగీకరించింది. గత ఏడాది 140 టన్నులు ఈ తరహాలో నోటిఫైకాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాజాగా 160 టన్నుల దిగుమతులకు ఆమోదముద్ర వేసింది.భారత్ బంగారం దిగుమతులలో 40 శాతంతో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటా కలిగిఉంది. యూఏఈ వాటా 16 శాతం కాగా, దక్షిణాఫ్రికా వాటా 10 శాతంగా ఉంది. దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ నిధులకు సంబంధించిన కరెంట్ అకౌంట్పై పసిడి కొనుగోళ్ల (దిగుమతుల) ప్రభావం కనబడుతోంది. 2023–24లో భారత్ పసిడి దిగుమతుల విలువ 30 శాతం పెరిగి 45.54 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది.జీఎస్టీ లేకపోవడం, తయారీ ఖర్చులు తక్కువగా ఉండడంతో భారత్లో కంటే దుబాయ్లో బంగారం ధరలు చౌకగా ఉంటాయి. బంగారం దిగుమతులపై ప్రభుత్వం అందిస్తున్న ఈ వెసులుబాటుతో రెండు దేశాల మధ్య పసిడి వాణిజ్యం మరింత బలపడటమే కాకుండా భారతీయ జువెలరీ పరిశ్రమకూ ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. -
యూఏఈలో టి20 ప్రపంచకప్
దుబాయ్: ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో అక్టోబర్లో అక్కడ జరగాల్సిన మహిళల టి20 ప్రపంచకప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి తరలివెళ్లింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్లో హింస చెలరేగగా... ముందు జాగ్రత్తగా మహిళల టోర్నీని అక్కడి నుంచి తరలించినట్లు ఐసీసీ వెల్లడించింది. దీంతో అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్, షార్జాలో మహిళల తొమ్మిదో టి20 ప్రపంచకప్ జరగనుంది. ‘మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ పరిస్థితులు సహకరించక పోవడంతో మెగా టోర్నీని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చి0ది. బీసీబీ ఆతిథ్యంలోనే యూఏఈలో మహిళల టి20 వరల్డ్కప్ జరుగుతుంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్కు మరిన్ని ఐసీసీ టోర్నీలు నిర్వహించే అవకాశం ఇస్తాం. మహిళల వరల్డ్కప్ నిర్వహించేందుకు ముందుకు వచ్చిన యూఏఈ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జెఫ్ అలార్డైస్ తెలిపారు. -
యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్కప్..!?
బంగ్లాదేశ్లో వచ్చే అక్టోబరులో నిర్వహించాల్సిన మహిళల టీ20 వరల్డ్కప్పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. బంగ్లాలో నెలకొన్న రాజకీయ అనిశ్చితుల దృష్ట్యా పొట్టి ప్రపంచకప్ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.ఇప్పటికే ఈ టోర్నీ నిర్వహణ కోసం ప్రత్నామ్నాయ అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది. అందులో భాగంగా భారత్లో నిర్వహించాల్సిందిగా బీసీసీఐని ఐసీసీ అభ్యర్ధించింది. కానీ అందుకు బీసీసీఐ నో చెప్పింది. ఈ టోర్నీలో జరిగే ఆక్టోబర్లో భారత్లో వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఐసీసీ ఆఫర్ను బీసీసీఐ తిరస్కరించింది.అయితే ఈ మెగా ఈవెంట్ నిర్వహణకు యూఏఈ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. తమ నిర్ణయాన్ని ఇప్పటికే ఐసీసీకి యూఏఈ క్రికెట్ బోర్డు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు జింబాబ్వే క్రికెట్ కూడా ఈ టోర్నీని నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో రెండు వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్ మ్యాచ్లను జింబాబ్వే విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో వరల్డ్కప్ వంటి మెగా ఈవెంట్కు ఆతిథ్యమివ్వాలని జింబాబ్వే యోచిస్తోంది.కాగా ఆగస్టు 20 జరగనున్న బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఈ విషయంపై ఒక క్లారిటీ రానుంది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని వెల్లడించడానికి కొంత సమయం కావాలని ఐసీసీని అడిగినట్లు వినికిడి. ఇక షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు మహిళల టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. -
UAE: బంగ్లాదేశీయుల నిరసనలు.. 53 మందికి జైలుశిక్ష
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో బంగ్లాదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన పలువురు స్థానిక బంగ్లాదేశీయులకు ఒక కోర్టు జైలు శిక్ష విధించింది. ఆందోళనకారులలో ముగ్గురికి జీవిత ఖైదు కూడా విధించింది. ఈ వివరాలను యూఏఈ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.యూఏఈ ప్రభుత్వ వార్తా సంస్థ డబ్ల్యూఏఎం తెలిపిన వివరాల ప్రకారం అబుదాబిలోని ఫెడరల్ అప్పీల్ కోర్టు 53 మంది బంగ్లాదేశీయులకు 10 ఏళ్ల జైలు శిక్ష, ఒక బంగ్లాదేశీయునికి 11 ఏళ్ల జైలు శిక్ష, ముగ్గురికి జీవిత ఖైదు విధించింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఈ బంగ్లాదేశీయులను దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు ఆదేశించింది.బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూఏఈలోని పలు వీధుల్లో స్థానిక బంగ్లాదేశీయులు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కేసులో కోర్టు సాక్షులను కోర్టు విచారించింది. అరెస్టయిన బంగ్లాదేశీయులకు సంబంధించిన వివరాలను యూఏఈ అధికారులు విడుదల చేశారు. యూఏఈఏ ప్రభుత్వం రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ల ఏర్పాటును నిషేధిస్తుంది. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛకు కొన్ని హద్దులు ఉన్నాయి.బంగ్లాదేశ్ ప్రభుత్వం 1971లో ముక్తిసంగ్రామ్లో పాల్గొన్న ముక్తి వాహిని సభ్యుల బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 30 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించింది. దీనికి వ్యతిరేకంగా దక్షిణాసియా దేశంలో హింసాత్మక నిరసనలు జరిగాయి. ఇవి యూఏఈలోనూ చోటుచేసుకున్నాయి. కాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ముక్తివాహిని సభ్యుల రిజర్వేషన్ పరిమితిని ఏడు శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం నిరసనకారుల పాక్షిక విజయంగా పరిగణిస్తున్నారు. -
రిచా ఘోష్ ఊచకోత.. టీమిండియా ఖాతాలో మరో విజయం
మహిళల ఆసియా కప్ 2024లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. యూఏఈతో ఇవాళ (జులై 21) జరిగిన మ్యాచ్లో భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. యూఏఈ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.రిచా ఘోష్ ఊచకోత.. హర్మన్ మెరుపు హాఫ్ సెంచరీటాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. హర్మన్ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగి చివరి ఐదు బంతులను బౌండరీలుగా మలిచింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్లో హర్మన్, రిచాతో పాటు షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) కూడా రెచ్చిపోగా.. స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూఏఈ బౌలర్లలో కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు.మూకుమ్మడిగా దాడి చేసిన టీమిండియా బౌలర్లు202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 123 పరుగులకే పరిమితమైంది. దీప్తి శర్మ 2, రేణుక సింగ్, తనుజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.తిరుగులేని భారత్ఈ టోర్నీలో గ్రూప్-ఏలో పాకిస్తాన్, నేపాల్, యూఏఈలతో పోటీపడుతున్న భారత్.. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ టాపర్గా కొనసాగుతుంది. నేపాల్, పాక్ చెరో మ్యాచ్లో ఓడిపోయి రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన యూఏఈ ఆఖరి స్థానంలో నిలిచింది.గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో థాయ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా పోటీపడుతున్నాయి. థాయ్లాండ్, శ్రీలంక ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్లో గెలిచి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్, మలేషియా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
Asia Cup 2024: టీమిండియా భారీ స్కోర్.. పొట్టి ఫార్మాట్లో తొలిసారి..!
మహిళల ఆసియా కప్ 2024లో భాగంగా యూఏఈతో ఇవాళ (జులై 21) జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్.. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్), షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రిచా ఘోష్ చివరి ఐదు బంతులను బౌండరీలుగా తరలించింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది. భారత బ్యాటర్ల ధాటికి యూఏఈ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు. భారత ఇన్నింగ్స్లో స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. -
చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెట్ టీమ్
నేపాల్ మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. డంబుల్లా (శ్రీలంక) వేదికగా యూఏఈతో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నేపాల్ 2012, 2016 ఎడిషన్లలో ఆసియా కప్లో పాల్గొన్నప్పటికీ ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. టోర్నీ చరిత్రలో తొలి విజయం సాధించడంతో నేపాల్ ఆటగాళ్ల ఆనందానికి అవథుల్లేకుండా పోయాయి. విన్నింగ్ రన్ కొట్టగానే నేపాల్ ఆటగాళ్లంతా మైదానంలో చేరి సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.HISTORY CREATED BY NEPAL....!!!- Nepal won their first ever match in Women's Asia Cup history. 🫡 pic.twitter.com/V8CwPaybqe— Johns. (@CricCrazyJohns) July 19, 2024కాగా, మహిళల ఆసియా కప్ 2024 టోర్నీ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో యూఏఈ, నేపాల్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేయగా.. నేపాల్ 16.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.సత్తా చాటిన ఇందు బర్మాటాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. నేపాల్ కెప్టెన్ ఇందు బర్మా (4-0-19-3) సత్తా చాటడంతో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. నేపాల్ బౌలర్లు తలో చేయి వేయడంతో యూఏఈ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. షబ్నమ్ రాయ్, కబిత జోషి, క్రితిక తలో వికెట్ పడగొట్టారు. యూఏఈ ఇన్నింగ్స్లో ఇషా రోహిత్ ఓఝా (10), సమైరా ధర్నిధర్కా (13), కవిష ఎగోడగే (22), ఖుషి శర్మ (36) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.చెలరేగిన సంజనా116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. ఓపెనర్ సంజనా ఖడ్కా (45 బంతుల్లో 72 నాటౌటగ్; 11 ఫోర్లు) చెలరేగడంతో సునాయాసంగా విజయం సాధించింది. యూఏఈ బౌలర్లలో కవిష 3 వికెట్లతో సత్తా చాటినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ టోర్నీలో ఇవాళ మరో మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఆ మ్యాచ్లో భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. -
ఇన్స్టాగ్రామ్లో విడాకులిచ్చిన దుబాయ్ యువరాణి
అబుదాబీ: దుబాయ్ యువరాణి షేఖా మహ్రా బింట్(30) సంచలన ప్రకటన చేశారు. తన భర్తకు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్రిపుల్ తలాక్తో విడాకులు ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. అంతేకాదు విడాకులకు కారణాలేంటో కూడా ఆమె ఆ సందేశంలో ఉంచారు.షేఖా మహ్రాకు దుబాయ్లో ప్రముఖవ్యాపారవేత్త అయిన షేక్ మనా బిన్ మహమ్మద్ బిన్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్(30)తో కిందటి ఏడాది మేలో వివాహం జరిగింది. రెండు నెలల కిందటే ఈ జంటకు బిడ్డ పుట్టింది. అయితే.. వీళ్లు విడిపోతున్నారనే ప్రచారం ముందు నుంచే కొనసాగుతోంది. రెండు వారాల కిందట కన్నకూతురితో ఓ ఫొటోను ఉంచిన దుబాయ్ యువరాణి.. ఇద్దరం మాత్రమే అంటూ క్యాప్షన్ ఉంచింది. ఆ టైంలో ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం చాలామంది గమనించారు. అలాగే.. ఫొటోలను సైతం డిలీట్ చేసుకోవడంతో విడిపోతున్నారనే చర్చా మొదలైంది.అయితే.. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ విడాకుల ప్రకటన చేశారామె. తాజా ఇన్స్టా పోస్టులో.. ‘‘ప్రియమైన భర్త.. మీరు ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నందున నేను మన విడాకుల్ని ప్రకటిస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. మీ మాజీ భార్య.. అంటూ మూడుసార్లు విడాకులంటూ(తలాఖ్) రాసుకొచ్చారామె. View this post on Instagram A post shared by Shaikha Mahra Mohammed Rashed Al Maktoum (@hhshmahra) దుబాయ్ పాలకుడు, యూఏఈ దేశ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తనయ షేఖా మహ్రా. యూఏఈలో మహిళా హక్కుల సాధన కోసం న్యాయవాదిగా ఆమె తన వంతు కృషి చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజా విడాకుల ప్రకటన, అదీ భార్యగా సోషల్ మీడియా ద్వారా ట్రిపుల్ తలాఖ్ ప్రకటనతో ఆమె ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశంగా మారారు. -
యూఏఈలోనూ యూపీఐ చెల్లింపులు!
దేశంలో డిజిటల్ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను యూఏఈకి విస్తరిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) తెలిపింది. యూఏఈలో నివసిస్తున్న భారతీయులు, ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయని ఎన్పీసీఐ పేర్కొంది.ఈ సందర్భంగా ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా మాట్లాడుతూ..‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్ ఈస్ట్(మధ్యప్రాచ్య దేశాలు), ఆఫ్రికాలోని డిజిటల్ కామర్స్లో సేవలందిస్తున్న ‘నెట్వర్క్ ఇంటర్నేషనల్’తో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబట్టి యూఏఈలో యూపీఐ సేవలందించే ప్రక్రియ సులువైంది. యూఏఈలోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్) టెర్మినల్స్లో క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులకు ఈ సేవలు ప్రారంభించాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: యాపిల్కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!ఎన్పీసీఐ ఇప్పటికే నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్లలో ఈ యూపీఐ సేవలను ఆమోదించింది. -
మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసా
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్ట్లో చిరంజీవి చేరారు. గోల్డెన్ వీసా అంటే..విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన విదేశీ పౌరులకు యూఏఈ ప్రభుత్వం జారీ చేసేదే గోల్డెన్ వీసా. దీన్ని గరిష్టంగా పదేళ్ల కాలపరిమితికి అందిస్తారు. గోల్డెన్ వీసా వల్ల యూఏఈలో దీర్ఘకాల నివాసానికి వీలవుతుంది. వందశాతం ఓనర్షిప్తో సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం సాధ్యమవుతుంది. -
చిరంజీవికి అరుదైన గౌరవం.. మెగా కోడలు తర్వాత!
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. చిరుకు దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. ఈ వీసాతో దుబాయ్లో పదేళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా నివాసం ఉండేందుకు అనమతి లభిస్తుంది. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు అందిస్తోంది.అయితే ఇప్పటికే ఈ వీసా అందుకున్న వారిలో తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి అగ్రహీరోలు కూడా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ సైతం వారి సరసన చేరనున్నారు. అయితే మెగాస్టార్ కంటే ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. చిరుకంటే ముందుగా రామ్ చరణ్ భార్య, ఆయన కోడలు ఉపాసన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఈ వీసాను చిరంజీవికి ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార్ ఫేమ్, వశిష్ట డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. Megastar @KChiruTweets has been awarded the Golden Visa by the UAE (Dubai) government, facilitated by Emirates First!✨#Chiranjeevi #Vishwambhara #TeluguFilmNagar pic.twitter.com/ND4DOVrvDk— Telugu FilmNagar (@telugufilmnagar) May 27, 2024 -
రజనీకాంత్కు గోల్డెన్ వీసా.. స్నేహితుడి వల్లే ఈ గౌరవం దక్కిందంటూ..
సౌత్ ఇండియా స్టార్ హీరో రజనీకాంత్కు మరో గౌరవం దక్కింది. యూఏఈ ప్రభుత్వం వివిధ రంగాల్లో పేరు పొందిన వారిని సత్కరించేందుకు గోల్డెన్ వీసాను అందిస్తోంది. భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. తాజాగా ఆ జాబితాలో రజనీకాంత్ చేరారు. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్టర్మ్ వీసా 10 ఏళ్ల కాలపరిమితో ఉంటుంది.2019లో యూఏఈ ప్రభుత్వం ఈ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ వీసాను చాలామంది భారతీయ ప్రముఖలకు యూఏఈ అందించి గౌరవించింది. ఇప్పుడు రజనీకాంత్ను కూడా ఆ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో గౌరవించింది. వీసా పొందిన అనంతరం ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమాలో నటిస్తున్న రజనీకాంత్ వెకేషన్ కోసం దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా అబుదాబిలో జరిగిన ఓ కార్యక్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆయనకు ఈ గోల్డెన్ వీసాను అందించడం విశేషం. ఈ సందర్భంగా రజనీకాంత్ తనకు గోల్డెన్ వీసా మంజూరు చేసినందుకు దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. యూఏఈ ప్రభుత్వంతో పాటు తన స్నేహితుడు లులూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే ఇది సాధ్యమైనట్లు రజనీ తెలిపారు. పారిశ్రామికవేత్తలు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, నటులు వంటి వారికి గోల్డెన్ వీసా ఇస్తారు. 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిని వారందరూ పూర్తి ఓనర్షిప్తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు.ఇప్పటికే గోల్డెన్ వీసా పొందిన ప్రముఖులుభారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్న జాబితా ఇదే.. షారుక్ ఖాన్, అల్లు అర్జున్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, సంజయ్ దత్,ఊర్వశి రౌతేలా, త్రిష, అమలాపాల్, మోహన్లాల్, మమ్ముట్టి,మీరా జాస్మిన్, టొవినో థామస్,విజయ్ సేతుపతి,కమల్ హాసన్, విక్రమ్, యువన్ శంకర్ రాజా,టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ ఈ జాబితాలో ఉన్నారు.Thalaivar #Rajinikanth receives THE Golden Visa from the UAE (DUBAI) govt, through chairman and MD of LULU group. Benefits:* He can own a property. * He can visit any time. * He can reside for 10 years. * Can sponsor family members & even domestic staff. And many more 🔥 pic.twitter.com/2y8F6k3yvJ— Rana Ashish Mahesh (@RanaAshish25) May 23, 2024 -
యూఏఈలో అనూహ్య వర్షాలు
దుబాయ్: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్ట్గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా. -
Lok sabha elections 2024: పోటీ కేరళలో.. ప్రచారం గల్ఫ్లో!
– ఓ సినిమాలో హీరో చెప్పే డైలాగిది. కేరళ కాంగ్రెస్ నేత షఫి పరంబిల్ దీన్నే గుర్తు చేస్తున్నారు. వడకర లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్–యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన గల్ఫ్ దేశాల్లో ఓట్లను అభ్యరి్థస్తున్నారు. యూఏఈ, ఖతార్ తదితర గల్ఫ్ దేశాల్లో భారీగా స్థిరపడిన కేరళీయులను కలిసి భారత్కు వచ్చి ఓటేయాలని కోరుతున్నారు. షార్జాలో, ఖతార్లో తాజాగా కేరళీయులతో సమావేశాలు నిర్వహించారు. ఆర్థిక ఇబ్బందులు లేకపోతే దయచేసి వచ్చి ఓటేయాలని కోరారు. అలాగే కేరళ నుంచి విదేశాలకు వెళ్తున్న వారు కూడా పోలింగ్ దాకా ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. కేరళ ఎన్నారైలు గతంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాంతో ఈసారి వారి మద్దతు కోసం పరంబిల్ ఇలా గల్ఫ్ యాత్ర చేపట్టారు. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది. పరంబిల్ ప్రస్తుతం పాలక్కాడ్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మెట్రోమ్యాన్గా పేరొందిన ఇ.శ్రీధరన్పై 3,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం సీపీఎం ఎమ్మెల్యే కేకే శైలజ, బీజేపీ అభ్యర్థి ప్రఫుల్ కృష్ణన్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దాంతో ప్రచార నిమిత్తం ఇలా గల్ఫ్ బాట పట్టారు. -
దుబాయ్ శ్రీకృష్ణ మందిరంలో హోలీ వేడుకలు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో గల శ్రీకృష్ణ దేవాలయంలో భక్తులు హోలీ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు. యూఏఈలోని భారతీయులు సామరస్య పూర్వకంగా హోలీని జరుపుకుంటున్నారని ప్రముఖ వ్యాపారవేత్త చంద్రశేఖర్ భాటియా మీడియాకు తెలిపారు. భారత రాయబారి సంజయ్ సుధీర్ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రంజాన్ మాసంలో మత సామరస్యం ఉట్టిపడేలా వసంతోత్సవాలు చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. దుబాయ్లోని పలు దేవాలయాలలో హోలీ సందర్భంగా భజనలతో పాటు హోలికా దహనాన్ని నిర్వహించారు. దుబాయ్లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన సభ్యులు పలువురికి స్వీట్లు పంచి, హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. #यूएई ♦दुबई के कृष्ण मंदिर में श्रद्धालुओं ने मनाई होली#Holi #Dubai #KrishnaTemple pic.twitter.com/8YojdmjkFL — Knews (@Knewsindia) March 25, 2024 -
విజృంభించిన వసీం.. యూఏఈ చేతిలో స్కాట్లాండ్ చిత్తు
యూఏఈతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం స్కాట్లాండ్ జట్టు దుబాయ్లో పర్యటిస్తుంది. పర్యటనలో భాగంగా నిన్న (మార్చి 11 జరిగిన తొలి మ్యాచ్లో యూఏఈ స్కాట్లాండ్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగుల నామమాత్రపు స్కోర్ చేయగా.. యూఏఈ 17.4 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ముహమ్మద్ వసీం మెరుపు ఇన్నింగ్స్ (43 బంతుల్లో 68 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి యూఏఈని గెలిపించాడు. స్కాట్లాండ్ ఇన్నింగ్స్లో జార్జ్ మున్సే (49 బంతుల్లో 75; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే రాణించాడు. మైఖేల్ లీస్క్ (19), జాక్ జార్విస్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ (4-0-14-3) అద్బుతంగా బౌలింగ్ చేశాడు. ఆయాన్ ఖాన్ (4-0-19-2), బాసిల్ హమీద్ (4-0-26-2) పర్వాలేదనిపించారు. యూఏఈ ఇన్నింగ్స్లో ముహమ్మద్ వసీంతో పాటు తినష్ సూరి (35 బంతుల్లో 37; 4 ఫోర్లు), అలీషాన్ షరాఫు (29 బంతుల్లో 32; 3 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో జాక్ జార్విస్, క్రిస్ గ్రీవ్స్లకు తలో వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మార్చి 13న జరుగనుంది. -
BAPS అబుదాబి హిందూ మందిర్ : కఠిన నిబంధనలు, డ్రెస్ కోడ్
అబుదాబిలో ఇటీవల (ఫిబ్రవరి 14, 204) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ మందిరంలో డ్రెస్కోడ్ వార్తల్లో నిలిచింది. మార్చి ఒకటో తేదీనుంచి ఇక్కడ ప్రజల దర్శనాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్కు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా క్యాప్స్, టీషర్ట్లు, అభ్యంతరకరమైన దుస్తులకు అనుమతి ఉండదు. డ్రెస్ కోడ్, ఇతర నిబంధనలు అబుదాబి మందిర్ ట్విటర్లో షేర్ చేసిన వివరాల ప్రకారం ప్రతి మంగళవారం - శనివారం, ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఈ మందిర్ తెరిచి ఉంటుంది. సోమవారం మాత్రం ఆలయాన్ని మూసివేస్తారు. The wait is over!#AbuDhabiMandir is now open for all visitors and worshipers. Opening hours: Tuesday to Sunday: 9am-8pm Every Monday: Closed for visitors pic.twitter.com/JnYvZoVSPk — BAPS Hindu Mandir (@AbuDhabiMandir) March 1, 2024 ముస్లిం దేశంలో అబుదాబిలో తొలి హిందూ దేవాలయంబాప్స్లో డ్రెస్ కోడ్, మార్గదర్శకాల విషయంలో కఠినంగా వహరించనున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం, మెడ, మోచేతులు, మడమల వరకూ కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. టైట్గా ఉన్న దుస్తులు, స్లీవ్లెస్, షార్ట్స్కు అనుమతించరు. శబ్దాలు చేసే ఉపకరణాలనూ ఆలయంలోకి అనుమతించరు. బయటి ఆహారాన్ని ఆలయంలోకి తీసుకు రాకూడదు. పెంపుడు జంతువులకు కూడా ఆలయంలోకి ప్రవేశం నిషిద్ధం. అంతేకాదు దేవాలయం పరిసరాల్లో డ్రోన్స్ వినియోగంపై కూడా నిషేధం విధించారు. ఫోటోలకు అనుమతి ఉందా? వ్యక్తిగత అవసరాల కోసమే ఫోటోలు తీసుకోవచ్చు. ఎవరైనా వాణిజ్య అవసరాల నిమిత్తం వీడియోను రికార్డ్ చేయాలనుకుంటే, వారు తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆలయంలోని ఆధ్యాత్మిక, ప్రశాంత వాతావరణానికి ఎటువంటి ఇబ్బందీ రాకుండా భక్తులు నియమాలను పాటించి సహకరించాలని ఆలయ అధికారులు కోరారు. కాగా 700 కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో బాప్స్ సంస్థ ఆధ్వర్యంలో అబూ మారేఖ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగింది. శిల్పకళ ఉట్టిపడేలా నిర్మించిన ఈ ఆలయంలో ఒకేసారి 5 వేల మంది ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. -
కలిసి నడుస్తోన్న భారత్!
భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్రనే పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్ తో తన మొదటి త్రైపాక్షిక విన్యాసాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్ర జలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. అంతేకాదు, బహ్రెయిన్లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్లో భారతదేశం పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు.. దేశ భద్రత, ఆర్థిక ప్రయోజనాల రీత్యా ముఖ్యమైన వ్యూహాత్మక అవకాశాలకు దారితీశాయి. ఇటీవల భారతదేశ విదేశాంగ విధానం ఆసక్తికరమైన ఒక వైరుద్ధ్యాన్ని కనబరిచింది. కేంద్ర ప్రభుత్వం తూర్పు వైపు చూడటం, తూర్పు దేశాలతో వ్యవహ రించడం గురించి మాట్లాడుతోంది కానీ వాస్తవానికి అది పశ్చిమ దేశాలతోనే ఎక్కువగా ఉంది. ఆ వైరుద్ధ్యం ఎలాగున్నా ప్రధానమంత్రి మోదీ స్వయంగా పశ్చిమాసియా దేశాలను ఆకర్షించడంలో అపార మైన సమయాన్ని, కృషిని పెట్టుబడిగా పెట్టారు. ఈ కారణంగా.. ఇంధనం మీద, ప్రవాసులపైన ఆధారపడిన మన సంబంధాలు ఇప్పుడు రాజకీయ, ఆర్థిక, రక్షణపరమైన ప్రయోజనాలను పొందు తున్నాయి. వాస్తవానికి చైనా మాదిరిగా పశ్చిమాసియా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారతదేశానికి లేదు, అయితే ప్రవాస భారతీయులు, అమెరికా, ఇజ్రాయెల్,ఫ్రాన్స్ లతో భాగస్వామ్యం భారత్కి ఆ దిశగా ఇతర ప్రత్యామ్నాయ ఎంపికలను కల్పిస్తోంది. ఇజ్రాయెల్, ఇండియా–యూఏఈ, యు.ఎస్.లతో కూడిన ఐ2యూ2 గ్రూపింగ్లోనూ; ఇండియా, మధ్యప్రాచ్యం, యూరోప్ ఎకనామిక్ కారిడార్లోనూ భారతదేశ భాగస్వామ్యంలో ఈ చొరవ వ్యక్తమవుతోంది. మొదటిది ఇజ్రాయెల్, ఇండియా, యూఏఈ, అమె రికాలను కలుపుతూ ఒక రకమైన పాశ్చాత్య క్వాడ్గా పరిగణన పొందు తోంది. ఇక రెండోది యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్లనుంచి వెళుతున్న మల్టీమోడల్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశాన్ని యూర ప్తో అనుసంధానించడానికి అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిష్ఠా త్మకమైన కనెక్టివిటీ వెంచర్. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ ఏడోసారి యూఏఈ పర్యటనకు ఈ నెల ప్రారంభంలో వెళ్లారు. అబుదాబీలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన ఖతార్కు వెళ్లారు. గూఢచర్యం ఆరోపణతో అక్కడ ఖైదీలుగా ఉన్న ఎనిమిది మంది భారతీయులకు ఖతార్ రాజరికపు క్షమాపణనుపొందే క్రమంలో 2048 వరకు 78 బిలియన్ డాలర్ల విలువైన సహజ వాయువు దిగుమతి ఒప్పందాన్ని పొడిగించగలిగారు. ఈ ప్రాంతంలో ముఖ్యమైన ‘ప్లేయర్’ అయిన చైనా తన ఆటను జాగ్రత్తగా ఆడుతోంది. గల్ఫ్ దేశాలు, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భారతదేశం తన స్థానాన్ని నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తున్న సమ యంలోనే... చైనా ఇజ్రాయెల్ నుండి పక్కకు తొలిగిపోయింది. పైగా తటస్థ, సంభావ్య శాంతికర్తగా తనను తాను ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈజిప్ట్, ఇరాన్ నుండి సౌదీ అరేబియా, ఒమన్ వరకు మొత్తం ప్రాంతాన్ని తన పెట్టుబడితో, ప్రాధాన్యంతో చుట్టు ముడుతున్న చైనాకు పోటీదారుగా ఉద్భవించడానికి భారతదేశం ఇప్పుడు పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో యూఏఈ భారతదేశ రెండవ అతి పెద్ద ఎగు మతి మార్కెట్గా ఉద్భవించింది. 2022లో ఇరుపక్షాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. సంవత్సరంలో యూఏ ఈతో భారత వాణిజ్యం 16 శాతం పెరిగి 85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంతో ద్వైపాక్షిక మదుపు ఒప్పందం (బీఐటీ), స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) రెండింటిపై సంతకం చేసిన ఏకైక దేశం యూఏఈ. ఈ విధానంలో భాగంగా ఒక ప్రధాన ప్రయత్నం ఏమిటంటే, జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్లో రిటైల్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాల సృష్టి ద్వారా భారతీయ ఎగుమతుల్ని ప్రోత్సహించడం. భారత్ మార్ట్ అనే జాయింట్ వెంచర్తో ఇది లాజిస్టిక్స్, పోర్ట్ కార్యకలాపాలు, సముద్ర సేవలలో ప్రత్యేకత కలిగిన డీపీ వరల్డ్ అనే యూఏఈ కంపెనీతో ముడిపడి ఉంది. భౌగోళిక రాజకీయ స్థిరత్వంపై భాగస్వామ్య ఆసక్తి దృష్ట్యా, ఈ ప్రాంత భద్రత విషయంలో భారతదేశం పెద్ద పాత్ర పోషిస్తోంది. గత సంవత్సరం యూఏఈతో, ఫ్రాన్స్తో తన మొదటి త్రైపాక్షిక విన్యా సాలను భారత్ నిర్వహించింది. ప్రస్తుతం భారత నౌకాదళం వాయవ్య అరేబియా సముద్రజలాల్లో అసాధారణంగా చురుకుగా ఉంది. హౌతీల హెచ్చరికలకు గురైన వాణిజ్య నౌకలకు రక్షణ కల్పిస్తోంది. బహ్రెయిన్లో ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికా నేతృత్వంలోని కంబైన్్డ టాస్క్ ఫోర్స్లో భారత్ పూర్తి స్థాయి సభ్యదేశంగా మారింది. ఈ ప్రాంతంలో భారత్కు అవకాశాల కొరత లేదు. సౌదీ అరే బియా ప్రిన్్స మొహమ్మద్ బిన్ సల్మాన్ వంటి పాలకులు భారత్కు తలుపులు తెరిచేశారు. అంతర్జాతీయ గోల్ఫ్ నుండి ప్రీమియర్ సాకర్ వరకు, భవిష్యత్ కొత్త నగరం నుండి ప్రపంచ విమానయాన సంస్థను నిర్మించడం వరకు ప్రతిదానిలో పెట్టుబడి పెట్టడానికి లేదా పెట్టు బడిని ప్రతిపాదించడానికి వారు ముందుకొచ్చారు. యూఏఈకిచెందిన అతి పెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ భారతీయ మౌలిక సదుపా యాల కోసం 75 బిలియన్ డాలర్లకు పైగా మదుపు చేయడానికి కట్టు బడింది. సౌదీ కంపెనీలు 100 బిలియన్ డాలర్లను ఆఫర్ చేశాయి. సంపన్న అరేబియా రాజ్యాలు రెండూ చమురును దాటి తమ ఆర్థిక ప్రణాళికల్ని ముందుకు తీసుకెళ్లే మార్గాల్ని భారత ఆర్థికవృద్ధిలో చూస్తున్నాయి. సౌదీ రాజు ‘విజన్ 2030’... రెండు ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను నిర్వహించడానికి, సౌదీ వెల్త్ ఫండ్ అయిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి పిలుపునిచ్చింది. అదిప్పుడు 718 బిలియన్ డాలర్ల వరకు చేరుకుంది. సౌదీలు తమ ఆర్థిక వ్యవస్థను మెరుగు పర చాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో ఉన్నారు. సాంకేతికత బదిలీపై, అభివృద్ధిపై షరతులు విధించిన చైనా కంపెనీలు తిరిగి సౌదీలకు అపూర్వ మైన ఒప్పందాల్ని అందించడానికి చైనా ఆర్థిక సమస్యలే ఒప్పించాయి. ఈ పరిణామాలకు వెలుపలే మిగిలిన ఒక ప్రధాన దేశం ఇరాన్. అమెరికా ఆంక్షలే దీనికి కారణం. ఇష్టం ఉన్నా లేకున్నా పాకిస్తాన్, మధ్య ఆసియాకు సంబంధించి భారత్ లెక్కలలో ఇరాన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది భారతదేశానికి దగ్గరగా ఉన్న హైడ్రోకార్బన్ దేశం కూడా. చైనీయుల విషయానికొస్తే సౌదీ–ఇజ్రాయెల్కు సంబంధించి తమ ఇటీవలి ఎత్తుగడల విషయమై వారు పునరాలోచనలో పడినా, ఇప్పటికీ కొనసాగుతున్న సౌదీ–ఇరాన్ ఘర్షణ విషయమై మధ్యవర్తిత్వం నెరపటంలో వారు విజయవంతమయ్యారు. చైనా తన పెట్టుబడులను ఈ ప్రాంతం అంతటా విస్తరించినప్ప టికీ, ఇరాన్లో దాని వాగ్దానాలను అమలుపరచలేదు. యూఏఈ, సౌదీ అరేబియా (ఒక్కొక్కటి 8 బిలియన్ డాలర్లు), టుర్కీయే (5.8 బిలియన్ డాలర్లు) ఇరాక్ (4.3 బిలియన్ డాలర్లు) కంటే 2013–16 కాలంలో 16 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ పెట్టుబడితో దానిపెద్ద లబ్ధిదారుగా పాకిస్తాన్ నిలిచింది. ఇరాన్కు 0.35 బిలియన్ డాలర్లే లభించాయి. సాంకేతికత, ఆయుధాల ఎగుమతి దన్నుగా ఉన్న చైనాతో పాటుగా ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టగల సామర్థ్యం భారత దేశానికి లేదు. కానీ తనకున్న అపారమైన వలస నైపుణ్యాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్లతో భాగస్వామ్యం ఇండియాకు ఇతర ప్రత్యామ్నాయాల ఎంపికలకు వీలు కల్పిస్తోంది. ప్రస్తుతానికి, పశ్చిమాసియా ప్రాంత భౌగోళిక రాజకీయ భవి ష్యత్తు ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంతో మసకబారిపోయి ఉంది. ఇజ్రాయెల్తో సంబంధాల్ని మామూలు స్థితికి తెచ్చే విధానం నుండి యూఏఈ వైదొలగనప్పటికీ, శాంతికై సౌదీలు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. ఈలోగా ఇథియోపియా, ఇరాన్, ఈజిప్ట్లతో పాటు యూఏ ఈ, సౌదీ అరేబియా రెండూ విస్తరించిన బ్రిక్స్లో చేరిపోయాయి. పశ్చిమాసియాలో ఈ విధమైన భారతదేశ ప్రయత్నాలు... దేశా నికి భద్రత, ఆర్థిక ప్రయోజనాలలో ముఖ్యమైన వ్యూహాత్మక అవకా శాలను తెరవడానికి దారితీశాయి. అయితే ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదం, చైనా ప్రాంతీయ ఆకాంక్షలు రేపిన అల్లకల్లోలం మధ్య న్యూఢిల్లీ జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. - వ్యాసకర్త ‘డిస్టింగ్విష్డ్ ఫెలో’, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ - మనోజ్ జోషీ -
యూఏఈ కోచ్గా టీమిండియా మాజీ క్రికెటర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హెడ్ కోచ్గా భారత మాజీ ఆటగాడు లాల్చంద్ రాజ్పుత్ నియమితుడయ్యాడు. ఈ పదవిలో రాజ్పుత్ మూడేళ్ల పాటు కొనసాగుతాడని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. రాజ్పుత్ నియామకానికి ముందు యూఏఈ తాత్కాలిక కోచ్గా పాక్ మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్ వ్యవహరించారు. భారత మాజీ ఆల్రౌండర్ రాబిన్ సింగ్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న అనంతరం నాజర్ కొన్ని రోజుల పాటు తాత్కాలిక కోచ్గా పని చేశాడు. 62 ఏళ్ల రాజ్పుత్కు గతంలో అంతర్జాతీయ స్థాయిలో కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. టీమిండియా 2007 టీ20 వరల్డ్కప్ గెలిచినప్పుడు ఇతనే భారత జట్టు కోచ్గా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్కు టెస్ట్ హోదా లభించడంలో రాజ్పుత్ కోచ్గా క్రీయాశీలకపాత్ర పోషించాడు. 2018-2022 వరకు అతను జింబాబ్వే హెడ్కోచ్గా పని చేశాడు. యూఏఈ కోచ్గా నియమితుడైన అనంతరం రాజ్పుత్ ఇలా అన్నాడు. ఇటీవలికాలంలో యూఏఈ బలమైన అసోసియేట్ దేశంగా ఎదిగింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో యూఏఈ ఆటగాళ్లు టెస్ట్ హోదా కలిగిన దేశాల ఆటగాళ్లతో పోటీపడుతున్నారు. ప్రస్తుత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కాగా, లాల్చంద్ రాజ్పుత్ 1985-87 మధ్యలో భారత తరఫున 2 టెస్ట్లు, 4 వన్డేలు ఆడాడు. -
బంధం బలపడుతోంది!
ప్రధానమంత్రిగా తన రెండో విడత పదవీకాలం ముగిసిపోనున్న వేళ నరేంద్ర మోదీ చేస్తున్న తుది అంతర్జాతీయ పర్యటనల్లో ఒకటి గత రెండు మూడు రోజులుగా ఆసక్తి రేపుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, ఆ వెంటనే ఖతార్లో సాగిన మోదీ పర్యటన ఘన విజయం సాధించిందనే చెప్పాలి. అబుదాబిలో స్వామి నారాయణ్ ఆలయ ప్రారంభోత్సవం, ఈ పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందే ఖతార్ నుంచి ఎనిమిది మంది భారత మాజీ నౌకాదళాధికారుల విడుదల, దుబాయ్లోని వరల్డ్ గవర్నమెంట్ సమిట్లో ఇతర దేశాలు చెవి ఒగ్గి మన మాట వినేలా చేయడంలో భారత విజయం... ఇవన్నీ ఛాతీ ఒకింత ఉప్పొంగే క్షణాలు. కృత్రిమ మేధ (ఏఐ), క్రిప్టో కరెన్సీ సహా పలు అంశాలపై ప్రపంచ దేశాల మధ్య సహకారానికి పిలుపునిస్తూ, ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది సమ్మిళిత, స్వచ్ఛ, పారదర్శక, పర్యావరణ హిత ప్రభుత్వాలని భారత ప్రధాని పేర్కొనడం సైతం ఆకర్షించిందనే చెప్పాలి. వెరసి, అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో భారత ప్రధానికి ఉన్న ప్రత్యేక అనుబంధం రెండు దేశాలనూ మరింత సన్నిహితం చేస్తోంది. నమ్మకమైన ఇలాంటి మిత్రదేశం చలవతో గల్ఫ్ ప్రాంతంలో భారత ప్రాబల్యం మరింత పెరగడం ఖాయమనిపిస్తోంది. తాజా పర్యటనలో భాగంగా యూఏఈ రాజధాని అబుదాబిలో ‘ఎహ్లాన్ మోదీ’ (మోదీకి స్వాగతం) కార్యక్రమం అట్టహాసంగా సాగింది. అక్కడి పాలకులను ప్రశంసిస్తూ, ప్రవాస భారతీ యులను ఉత్తేజపరుస్తూ ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ హంగామా కానీ, ఆ మర్నాడు చేసిన భారీ హిందూ దేవాలయ ప్రారంభోత్సవం కానీ భారత్, గల్ఫ్సీమల మధ్య బలపడుతున్న బంధా నికి ప్రతీకలే. చెప్పాలంటే, మన దేశం దృష్టిలో పశ్చిమాసియాకు ముఖద్వారం అబుదాబి. అందుకే 2015 ఆగస్ట్లో మోదీ తొలిసారిగా ఈ గల్ఫ్దేశాన్ని సందర్శించారు. 1981లో ఇందిరా గాంధీ అనంతరం భారత ప్రధాని ఒకరు అక్కడికి వెళ్ళడం అదే తొలిసారి. మూడు దశాబ్దాల పైచిలుకు తర్వాత మొదలుపెట్టినా అప్పటి నుంచి ఈ తొమ్మిదేళ్ళలో 7 సార్లు యూఏఈ వెళ్ళారు మోదీ. విస్తృత ద్వైపాక్షిక అజెండాకూ, ఇరు దేశాల మధ్య బలమైన బంధానికీ అది బలమైన పునాది అయింది. పనిలో పనిగా యూఏఈలోని ప్రవాస భారతీయుల దీర్ఘకాలిక వాంఛకు తగ్గట్టుగా హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం కోరారు. ఆ దేశం అంగీకరించింది. సంప్రదాయవాద ఇస్లామిక్ దేశంలో, పూర్తిగా ఆ దేశ పాలకుల అండతో, 27 ఎకరాల విశాల ప్రాంగణంలో అత్యంత భారీ హిందూ దేవాలయ నిర్మాణం జరగడం, దాని ప్రారంభోత్సవానికి భారత ప్రధాని వెళ్ళడం అనూహ్యం, అసాధారణం. ఇరుదేశాల మధ్య గాఢమైన బంధాన్ని పరస్పర ప్రయోజనాలు ప్రోది చేశాయి. యూఏఈలో దాదాపు 35 లక్షల మంది ప్రవాస భారతీయులున్నారని లెక్క. ఏడు దేశాల సమూహమైన యూఏఈ మన వాళ్ళకు ఉపాధి అందించే కేంద్రం. ఫలితంగా, అక్కడి నుంచి మన దేశానికి ధన ప్రవాహం సరేసరి. గల్ఫ్సీమకు సైతం మనం వాణిజ్యానికీ, వ్యూహాత్మకంగా నమ్మదగిన దేశమయ్యాం. వీటన్నిటి ఫలితంగా స్థానిక రాజకీయాలతో సంబంధం లేకుండా కొన్నేళ్ళుగా బంధం బలపడిందన్న మాట. అసలు పశ్చిమాసియాలోని వివిధ శక్తిసంపన్న దేశాలతో చారిత్రకంగా మన దేశానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సున్నీల ప్రాబల్యమున్న సౌదీ అరేబియా నుంచి షియాలు చక్రం తిప్పే ఇరాన్ వరకు అన్నీ మనకు మిత్రదేశాలే. ఆ మధ్య కొన్నేళ్ళుగా అరబ్ ప్రపంచానికీ, ఇజ్రాయెల్కూ మధ్య సర్దుబాటు చేసే క్రమంలో పశ్చిమాసియాతో మన బంధం మరింత దృఢమవుతూ వచ్చింది. ఇక, భారత్, ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాల మధ్య ఐ2యూ2 సాంకేతిక సహకారం నిమిత్తం 2022 జూలైలో అమెరికాతో కలసి మనం సంతకాలు చేశాం. ఖతార్ సైతం భారత్లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అంతేకాక, భారత్ చేసుకొనే ద్రవీకృత సహజవాయు (ఎల్ఎన్జీ) దిగుమతుల్లో సగభాగం ఖతార్ చలవే. పైగా రష్యా ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకొనేలా ఒప్పందాల కోసం యూరప్ సైతం ఈ ప్రాంతం వైపు చూస్తున్న సమయంలో... భారత్ – ఖతార్ల మధ్య దీర్ఘకాలిక ఇంధన సరఫరా ఒప్పందం సంతోషదాయక విషయం. నిజానికి, 2022లోనే ఇరుదేశాలూ స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసి, 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని బాస చేసుకున్నాయి. ఇంధనం, డిజిటల్ లావాదేవీలు సహా పలు అంశాలపై ఒప్పందాలు కుదరడం విశేషం. ఇక,ఇండియా – మధ్యప్రాచ్యం– యూరప్ ఆర్థిక నడవాకు సంబంధించి ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒడంబడిక అత్యంత కీలకమైనది. చైనా చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’కు ప్రత్యామ్నా యమని భావిస్తున్న నడవాను గత సెప్టెంబర్లో ఢిల్లీలో జీ20 సదస్సు వేళ ప్రకటించారు. గాజాలో యుద్ధం కారణంగా దాని భవిష్యత్తుపై ప్రస్తుతం కొంత నీలినీడలు పరుచుకున్నా ఒక్కసారి అమలైతే ప్రాంతీయ అనుసంధానాన్ని అది పెంచుతుంది. అబుదాబిలో దిగితే అచ్చం స్వదేశంలో ఉన్నట్టే ఉందని భారత ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. వినడానికి కాస్త అత్యుక్తిగా అనిపించినా, ఆ మాటల్లో వాస్తవం లేకపోలేదు. భారత్ – అరబ్ ఎమిరేట్స్ మధ్య సాంస్కృతికంగా, ఆర్థికంగా, భౌగోళిక రాజకీయాల పరంగా సత్సంబంధాల సంచిత ఫలితమది. ముస్లిమ్ మెజారిటీ దేశంలో ఒక అతి పెద్ద హిందూ ఆలయ నిర్మాణం పెరుగుతున్న ధార్మిక సహిష్ణుతకు చిహ్నమనే చెప్పాలి. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ఆయుధాలు, సైనిక టెక్నాలజీల విషయంలోనూ గల్ఫ్, భారత్ కలసి అడుగులు వేస్తే మంచిది. పశ్చిమ హిందూ మహా సముద్రంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. పరస్పర వ్యూహాత్మక ప్రయోజనాలూ నెరవేరుతాయి. -
BAPS temple: సువర్ణాధ్యాయం
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబీలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో మత సామరస్యానికి, ఐక్యతకు చిహ్నంగా అది విలసిల్లుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థ (బాప్స్) ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామి నారాయణ్ ఆలయాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సంప్రదాయ పద్ధతిలో లేత గులాబి రంగు ధోవతి, కుర్తా, స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అర్చకులు, పురోహితులతో కలిసి పూజాదికాలు తదితరాల్లో పాల్గొన్నారు. దేవతా మూర్తులకు హారతులిచ్చారు. యూఏఈ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్, స్వామి నారాయణ్ సాంప్రదాయికులతో పాటు పలు మత సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అనంతరం వేలాదిగా పాల్గొన్న భక్తులనుద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ఈ ఆలయ నిర్మాణం ద్వారా మానవ చరిత్రలోనే సువర్ణాధ్యాయానికి యూఈఏ తెర తీసింది. 140 కోట్ల మంది భారతీయుల మది గెలుచుకుంది’’ అంటూ కొనియాడారు. భారతీయుల ఆకాంక్షలను సాకారం చేసినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్కు కృతజ్ఞతలన్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు మరవలేనివని ప్రశంసించారు. ‘‘ఈ ఆలయంలో అడుగడుగునా మత వైవిధ్యం కొట్టొచ్చినట్టు కని్పస్తుంది. యూఏఈ అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా, షేక్ జాయేద్ మసీదులకు ఇకపై స్వామి నారాయణ్ ఆలయం కూడా తోడవుతుంది. దీని సందర్శనకు మున్ముందు భారీగా భక్తులు తరలి వస్తారు’’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇటీవలే అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని ప్రారంభించుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు. ఆ వెంటనే అబుదాబీలోనూ ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఇది భారత్తో పాటు దేశ మత విశ్వాసానికి, సంస్కృతికి కూడా అమృత కాలమేనన్నారు. సుత్తి, ఉలి చేబట్టిన మోదీ... అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరినీ మోదీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుత్తి, ఉలి చేబూని అక్కడి రాతిపై వసుధైవ కుటుంబకం అంటూ స్వయంగా చెక్కారు. ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. -
అబుదాబిలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) మందిరాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. యూఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిది. భారత్తో యూఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరారనుంది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, మ్యూజిక్ కంపోజర్ శంకర్ మహదేవన్ హాజరయ్యారు. #WATCH | Prime Minister Narendra Modi at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi. pic.twitter.com/mUW34PpJfL — ANI (@ANI) February 14, 2024 ఆలయ విశేషాలెన్నో... బాప్స్ ఆలయం ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యూఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబాయ్లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే... ► ఇది దుబాయ్–అబుదాబి హైవే సమీపంలో వద్ద 27 ఎకరాల్లో నిర్మితమైంది. ► దీని నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చయింది. మొత్తం నిర్మాణం బాప్స్ సంస్థ కనుసన్నల్లో జరిగింది. ► 108 అడుగల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది. ► దీని నిర్మాణానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. రాజస్తాన్, గుజరాత్కు చెందిన 2 వేల మందికి పైగా కార్మికులు, నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు. ► ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏ మాత్రమూ వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు. ► ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్తాన్లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు. ► మందిర పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి. ► వీటిని మొత్తం 25 వేల పై చిలుకు విడి భాగాలుగా భారత్లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యూఈఏలో జోడించడం విశేషం! ► ఆలయ కాంప్లెక్సులో ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, థీమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లు, ఏకంగా 5,000 మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి. ► మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారికోసం ఆన్లైన్ రిజి్రస్టేషన్ పోర్టల్ ప్రారంభించారు. సోమవారం ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. #WATCH | Prime Minister Narendra Modi performs Aarti at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi. pic.twitter.com/PP5OwWFRxH — ANI (@ANI) February 14, 2024 ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా... ► ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈలోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దడం మరో విశేషం. ► రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు. ► ఆలయం బయటి గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చెక్కారు. తద్వారా ఈ ఆలయాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు. ► భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటైంది. దీన్ని అరేబియన్, ఇస్లామిక్ వాస్తు రీతుల్లో నిర్మించడం విశేషం. ఇలా పురుడు పోసుకుంది... ► 2014లో మోదీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్దికాలానికే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. 2015లో మోదీ యూఏఈ పర్యటన అనంతరం వేగం పుంజుకుంది. 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఇప్పటిదాకా యూఏఈలో ఆరుసార్లు పర్యటించారాయన. తాజాగా ఏడో పర్యటనలో ఉన్నారు. ► 2015 పర్యటన సందర్భంగా యూఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో పలు అంశాలపై మోదీ లోతుగా చర్చలు జరిపారు. ► ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఈఏ సర్కారు నిర్ణయం తీసుకోవడమే గాక 13.5 ఎకరాల భూమి కూడా కేటాయించింది. అనంతరం 2019లో మత సహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాలు ప్రకటించింది. అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది. ► 2018లో మోదీ తన రెండో యూఏఈ పర్యటన సందర్భంగా బాప్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపెరా హౌజ్ నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. -
యూఏఈలో అతిపెద్ద హిందూ దేవాలయం..సామరస్యానికి ప్రతీక..
-
భారత్ యూఏఈ దోస్తీ జిందాబాద్
అబుదాబి: యూఏఈ, భారత్ మైత్రి ప్రపంచానికే ఆదర్శనీయమని ప్రధాని నరేంద్ర మోదీ శ్లాఘించారు. మంగళవారం అబూదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ స్టేడియంలో ప్రవాస భారతీయులు నిర్వహించిన ‘అహ్లాన్ (హలో) మోదీ’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దాదాపు 50,000 మంది పాల్గొన్న కార్యక్రమం ‘హర్ హర్ మోదీ, ఘర్ ఘర్ మోదీ’, ‘వుయ్ లవ్ మోదీ’, ‘ భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తిపోయింది. స్టేడియం బయట మోదీకి యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ సాదర స్వాగతం పలికారు. ప్రేక్షకులనుద్దేశించి మోదీ ఏమన్నారంటే... ‘‘యూఏఈ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వచ్చి మీరంతా చరిత్ర సృష్టించారు. భారత్లోని విభిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వారూ ఉన్నారు. అందరి హృదయాలను యూఏఈ కలిపింది. ఇక్కడి ప్రతి ఒక్కరి శ్వాస, గుండె చప్పుడు, స్వరం, ప్రతి గళం ‘భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్’ అని నినదిస్తోంది. ఇరు దేశాల మైత్రి ప్రపంచానికే ఒక మోడల్గా మారింది. 21వ శతాబ్ది మూడో దశకంలో కొత్త చరిత్రను లిఖిస్తున్నాయి. రెండు దేశాల భాగస్వామ్యం అన్ని రంగాల్లోనూ సమున్నత శిఖరాలకు చేరుతోంది. రోజు రోజుకూ ఈ బంధం మరింత బలపడాలని భారత్ మనసారా కోరుకుంటోంది. ప్రతిభ, సృజన, సంస్కృతిలో మన అనుబంధం దాగి ఉంది’’ అని మోదీ అన్నారు. భారతీయ భాషల్లో అంతర్భాగంగా కలిసిపోయిన అరబిక్ పదాలను ప్రస్తావించారు. ఆ పదాలను మోదీ ఉచ్ఛరించినప్పుడల్లా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది ‘140 మంది భారతీయుల సందేశాన్నిమోసుకొచ్చా. అదేంటంటే.. మిమ్మల్ని చూసి భారత్ గర్విస్తోంది. ఈ పదేళ్లలో ఏడు సార్లు ఇక్కడికొచ్చా. ఈరోజు కార్యక్రమం నా స్మృతిపథంలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జయేద్’ నాకు రావడం నిజంగా నా అదృష్టం. ఇది నాకు మాత్రమే కాదు 140 కోట్ల భారతీయులకు గర్వకారణం. సుఖమయ జీవనం, సులభతర వాణిజ్యానికి ఇరు దేశాలు కృషిచేస్తున్నాయి. 2047 కల్లా ‘అభివృద్ధి చెందిన భారత్’ ప్రతి ఒక్క భారతీయుడి లక్ష్యం. మోదీ గ్యారెంటీ అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే. ప్రధానిగా మూడోదఫా పాలనలో భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారుస్తానని గ్యారెంటీ ఇస్తున్నా’’ అని మోదీ వ్యాఖ్యానించారు. తర్వాత స్టేడియంలో ఓపెన్టాప్ బ్యాటరీ వాహనంలో స్టేడియంలో అంతా కలియతిరిగారు. ప్రేక్షకులకు అభివాదం చేశారు. జాతీయ జెండాలతో, సంప్రదాయ భారతీయ వస్త్రధారణలో విచ్చేసిన జనంతో స్టేడియం భారతీయతను సంతరించుకుంది. మోదీ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో కొన్ని వాక్యాలు మాట్లాడారు. -
అరబ్బుల రాజధానిలో...అబ్బురాల ఆలయం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో హిందూ ఆలయం. కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా తోచిన ఆ ఆలోచన ఇప్పుడు సాకారమైంది. యూఏఈ రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆరంభానికి సిద్ధమైంది. అదే బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) మందిరం. యూఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిది. భారత్తో యూఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరారనుంది... విశేషాలెన్నో... బాప్స్ ఆలయం ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. దాదాపు 30 లక్షల దాకా భారతీయులున్న యూఏఈలో ఆలయాలు లేకపోలేదు. దుబాయ్లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అయితే అవి చూసేందుకు విల్లాల మాదిరిగా ఉంటాయి. యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే... ► ఇది దుబాయ్–అబుదాబి హైవే సమీపంలో వద్ద 27 ఎకరాల్లో నిర్మితమైంది. ► దీని నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చయింది. మొత్తం నిర్మాణం బాప్స్ సంస్థ కనుసన్నల్లో జరిగింది. ► 108 అడుగల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది. ► దీని నిర్మాణానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. రాజస్తాన్, గుజరాత్కు చెందిన 2 వేల మందికి పైగా కార్మికులు, నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు. ► ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్ ఏ మాత్రమూ వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు. ► ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్తాన్లోని భరత్పూర్ నుంచి, శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు. ► మందిర పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి. ► వీటిని మొత్తం 25 వేల పై చిలుకు విడి భాగాలుగా భారత్లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యూఈఏలో జోడించడం విశేషం! ► ఆలయ కాంప్లెక్సులో ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, థీమాటిక్ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్ సెంటర్లు, ఏకంగా 5,000 మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి. ► మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారికోసం ఆన్లైన్ రిజి్రస్టేషన్ పోర్టల్ ప్రారంభించారు. సోమవారం ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా... ► ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈలోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దడం మరో విశేషం. ► రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు. ► ఆలయం బయటి గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చెక్కారు. తద్వారా ఈ ఆలయాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు. ► భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటైంది. దీన్ని అరేబియన్, ఇస్లామిక్ వాస్తు రీతుల్లో నిర్మించడం విశేషం. ఇలా పురుడు పోసుకుంది... ► 2014లో మోదీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్దికాలానికే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. 2015లో మోదీ యూఏఈ పర్యటన అనంతరం వేగం పుంజుకుంది. 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయే. ఇప్పటిదాకా యూఏఈలో ఆరుసార్లు పర్యటించారాయన. తాజాగా ఏడో పర్యటనలో ఉన్నారు. ► 2015 పర్యటన సందర్భంగా యూఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో పలు అంశాలపై మోదీ లోతుగా చర్చలు జరిపారు. ► ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఈఏ సర్కారు నిర్ణయం తీసుకోవడమే గాక 13.5 ఎకరాల భూమి కూడా కేటాయించింది. అనంతరం 2019లో మత సహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాలు ప్రకటించింది. అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది. ► 2018లో మోదీ తన రెండో యూఏఈ పర్యటన సందర్భంగా బాప్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపెరా హౌజ్ నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. -
భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్: ప్రధాని మోదీ
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో హిందూ ధర్మం ఉట్టిపడేలా బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్టాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. అక్కడ ఉన్న భారతీయులను ఉత్సాహపరచడానికి మోదీ... తెలుగు, మళయాళం, తమిళం భాషల్లో మాట్లాడారు. భారత్, యూఏఈ మధ్య ఇవాళ కీలక ఒప్పందాలు కుదిరాయి. అబుదాబిలో ఆలయాన్ని నిర్మిస్తామని అడిగిన వెంటనే యూఏఈ అధ్యక్షుడు ఒప్పుకున్నారు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆలయం కోసం స్థలం ఇస్తామన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలకపాత్ర పోషించారు. భారత్, యూఏఈ దోస్తీ జిందాబాద్ అని మోదీ అన్నారు. VIDEO | PM Modi greets Indian diaspora as he leaves after addressing the 'Ahlan Modi' event at Sheikh Zayed Stadium in Abu Dhabi. pic.twitter.com/jlDJa3AVMr — Press Trust of India (@PTI_News) February 13, 2024 యూఏఈ అత్యున్నత పౌరపురస్కారం నాకు లభించిందంటే.. అది మీ వల్లే అని అక్కడి భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక్కడ ఉన్న భారతీయులను చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. 30 ఏళ్ల తర్వాత యూఏఈలో పర్యటించిన తొలి భారత ప్రధానిని నేనే యూఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చినప్పుడు ఆయనను గౌరవించామని తెలిపారు. తన మూడో టర్మ్లో భారత్ను మూడో అతిపెద్ద అర్థిక వ్యవస్థగా మారుస్తా అని స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. కొత్త ఎయిర్పోర్టులు, ఎక్స్ప్రెస్వేలు, ఆధునిక రైల్వే స్టేషన్లు నిర్మిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
‘అహ్లాన్ మోదీ’లో మార్పులు.. కారణమిదే!
యూఏఈలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఫిబ్రవరి 13) పాల్గొనబోయే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా కుదించారు. సోమవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో పలు మార్పులు చేశారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోయే బహిరంగ కార్యక్రమం గురించి అధికారి సజీవ్ పురుషోత్తమన్ మాట్లాడుతూ ప్రతికూల వాతావరణం కారణంగా 35 వేల మంది హాజరయ్యేందుకు మాత్రమే ఏర్పాట్లు చేయగలుగుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 60 వేల మంది ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరి కోసం 500లకు పైగా బస్సులను నడుపుతున్నామన్నారు. వెయ్యిమంది వాలంటీర్లు తమ సేవలను అందిస్తారని తెలిపారు. యూఏఈలో ప్రధాని ఈ నెల 13, 14 తేదీలలో పర్యటించనున్నారు. -
‘అహ్లాన్ మోదీ’కి 65 వేల రిజిస్ట్రేషన్లు
మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీకి అపరిమితమైన ఆదరణ ఉంది. యూఏఈలో జరగబోయే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా 65 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 13న అంటే నేడు (మంగళవారం) యూఏఈలో జరిగే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇండియన్ పీపుల్ ఫోరమ్ ప్రెసిడెంట్, ‘అహ్లాన్ మోదీ’ ఇనిషియేటివ్ హెడ్ జితేంద్ర వైద్య ఈ ఈవెంట్ గురించి మీడియాకు తెలిపారు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమమని, ప్రవాస భారతీయుల కమ్యూనిటీ దీనికి సకల ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 65 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అంతకుమించి జనం వస్తే, వసతి కల్పించలేమని, అందుకే రిజిస్ట్రేషన్లు ఇక నిలిపివేయాల్సి వచ్చిందని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనలో యూఏఈ, ఖతార్లోని ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. యూఏఈలో నిర్మితమైన హిందూ దేవాలయాన్ని 14న ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐదు వేల మంది భక్తులు హాజరుకానున్నరని అంచనా. 2015 తర్వాత ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. -
ఏడాదిలో భారత్- యూఏఈ బంధం ఎలా బలపడింది?
ప్రధాని నరేంద్ర మోదీ తన 2 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం(ఫిబ్రవరి 13) యూఏఈ చేరుకోనున్నారు. ఫిబ్రవరి 14న అబుదాబిలో నిర్మించిన బీఏపీఎస్ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. కాగా గత ఏడాది కాలంలో భారతదేశం- యూఎఈ మధ్య సంబంధాలలో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. అనేక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. గడచిన ఏడాదిలో రెండు దేశాల మధ్య ఐదు ఉన్నత స్థాయి పర్యటనలు జరిగాయి. ప్రధాని మోదీ జూలై 2023లో ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం యూఏఈ వెళ్లి, అధ్యక్షుడు హెచ్హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ను అబుదాబిలో కలిశారు. దుబాయ్లో కాప్-28లో పాల్గొంటున్నప్పుడు కూడా అంటే గత ఏడాది నవంబరు 30 ప్రధాని మోదీ యూఏఈ సందర్శించారు. అప్పుడు ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హిస్ ఎక్సలెన్సీ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, వైస్ ప్రెసిడెంట్ను కలుసుకున్నారు. భారతదేశ మద్దతుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిక్స్లో సభ్యదేశంగా చేరింది. వాణిజ్య రంగంలో కూడా ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఊపందుకున్నాయి. సరిహద్దు లావాదేవీల కోసం రూపాయి, దిర్హమ్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యూఏఈ భారతదేశంలో 3.5 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. 2024, జనవరి 10న యూఎఈ అధ్యక్షుడు హెచ్హెచ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ గుజరాత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. 2026-39 వరకు అంటే 14 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం కింద 1.2 ఎంఎంటీ ఎల్ఎన్జీ కొనుగోలు చేయడానికి ఐఓసీఎల్, ఏడీఎన్ఓసీ మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇది భారత్, యూఏఈ మధ్య కుదిరిన మొదటి దీర్ఘకాలిక ఒప్పందం. తాజాగా అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్ఓసీ) గ్యాస్ గెయిల్ ఇండియాకు సంవత్సరానికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు 10 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ రంగంలో గత ఏడాది కాలంలో రెండు దేశాల మధ్య ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. 2024 జనవరిలో భారత్-యూఎఈల ద్వైపాక్షిక సైనిక కసరత్తు రాజస్థాన్లో జరిగింది. 2024, జనవరి 21న భారత్- యూఏఈ, ఫ్రాన్స్ల వైమానిక దళాలతో కూడిన ఎక్సర్సైజ్ డెసర్ట్ నైట్ యూఏఈలోని అల్ దఫ్రా విమానాశ్రయంలో జరిగింది. ఇటీవల ఎడ్జ్, హెచ్ఏఎల్లు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం క్షిపణి వ్యవస్థల ఉమ్మడి రూపకల్పన, అభివృద్ధితో సహా సహకార రంగాలలో ఇరు దేశాలు పరస్పరం సహాయ సహకారాలు అందించుకోనున్నాయి. -
14న మరో అద్భుత ఆలయాన్ని ప్రారంభించనున్న మోదీ
సుమారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యానగరిలోని భవ్యమైన ఆలయంలో రామ్లల్లా కొలువయ్యాడు. తాజాగా ఒక ముస్లిం దేశంలోని హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధం అయ్యింది. ఈ నెల ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్మితమయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 13న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ప్రవాస భారతీయులు పాల్గొనే ‘హలో మోదీ’ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 14న యూఏఈ రాజధాని దుబాయ్లోని బీఏపీఎస్లో నిర్మితమైన హిందూ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ప్రధాని మోదీ యూఏఈ పర్యటనపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ మాట్లాడుతూ ‘హలో మోదీ’ కార్యక్రమానికి వేలాది మంది తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈలోని 150 భారతీయ కమ్యూనిటీ సొసైటీలు సంయుక్తంగా ‘హలో మోదీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. యూఏఈలో మూడేళ్ల వ్యవధిలో ఈ ఆలయాన్ని రాజస్థాన్, గుజరాత్లకు చెందినవారు నిర్మించారు. ఫిబ్రవరి 13న షేక్ జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రవాస భారతీయుల సమావేశం నిర్వహించనున్నట్లు యూఏఈ రాయబారి తెలిపారు. 2020 నివేదిక ప్రకారం యూఏఈలో 35 లక్షలమంది ప్రవాస భారతీయులు ఉన్నారు. పురాతన, పాశ్చాత్య శిల్పకళల కలయికతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. -
‘సీఎం జగన్కు ప్రజలే పెద్ద సైన్యం’
యూఏఈలో ఒక్క రోజు ముందుగానే ఎన్నికల సమరం శంఖారావం మోగింది. యూఏఈ పర్యటనలో ఉన్న కడప యువ నాయకులు షేక్ ఉమైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూఏఈ విభాగం కన్వీనర్ సయ్యిద్ అక్రం, సభ్యులు జాఫర్ అలీ, ఖాజా అబ్దుల్ ముతాలిబ్, విజయ భాస్కర రెడ్డి, ఫహీం, అబ్దుల్లా, చక్రితో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక, దుబాయ్ నగరంలోని కరమా పార్క్లో గణంత్ర దినోత్సవం సందర్భంగా కరమా ప్రాంతంలో ఉన్న ప్రవాసాంధ్రలకు కిరాణా వంట సామాన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కరమా వైఎస్సార్సీపీ నాయకులు ప్రేమ్, యాడ్ర శ్రీనివాస్, శేఖర్, తాడి రమేష్, సతీష్, నాగరాజు, అనిల్, షేక్ చిన్ని, శ్రీలక్ష్మి, దడాల సీత నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప యువ నాయకులు షేక్ ఉమైర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉమైర్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు రానున్న ఎన్నికల దృష్ట్యా దిశా నిర్దేశం చేశారు. వేల మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్నట్లు.. సరిగ్గా 14 ఏళ్ల కిందట ఒక్కడై వైఎస్సార్సీపీని స్థాపించి కడప గడపలో నిలబడి గర్జిస్తే.. దెబ్బకు ఢిల్లీ గడ్డ దద్దరిల్లింది అని గుర్తు చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వీడిన సమయంలో ప్రజలే తన సైన్యమని భావించి ధైర్యంగా అడుగు ముందుకేసిన జగనన్న.. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు దేశ విదేశాల్లోని తెలుగు ప్రజలకు తనొక్కడై, సైన్యమై నిలిచారని, ప్రతీ పనిలోనూ తోడుగా.. ఆపదొస్తే కొండంత అండగా ఉన్నారు. ఆయన సారథ్యంలో కార్యకర్తలుగా పని చేయడం మనందరికీ గర్వకారణం. ఇడుపుల పాయ మొదలు.. ఇచ్చాపురం వరకు చేపట్టిన ‘ప్రజా సంకల్ప’ యాత్రలో అందరి నాయకుల్లా కళ్లతో కాకుండ మనసుతో ప్రజల కష్టాల్ని దగ్గరుండి చూశారు. అందుకే అధికారంలోకి వచ్చినరోజు నుంచి ప్రజల కష్టాల్ని శాశ్వతంగా తీర్చడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. ప్రజల మనసుల్లో మనసున్న సీఎంగా నిలిచిపోయారు. దేశమంతా ఏపీ వైపు చూసేలా సంక్షేమాన్ని పరవళ్లు తొక్కించారని ఆయన తెలిపారు. ఈ రోజు విద్యా, వైద్యం.. సంక్షేమం.. అభివృద్ధి.. ఏ రంగంలో చూసినా.. ఏపీ దేశంలోనే నెంబర్వన్గా ఉంది. కరోనా కాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. సంక్షేమ సారథి అయిన సీఎం జగన్ను ఎదురించేందుకు ప్రతిపక్షాలు అందరూ కలిసి ఒక్కటిగా జట్టు కట్టారు. ఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ను గెలిపించుకునేందుకు మనమందరం సర్వ శక్తులు ఒడ్డి కృషి చేయాలి. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టు పేదలకి పెత్తందారులకు మధ్య యుద్ధంగానే చూడాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిసే వరకు ఉధృతంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రతీ గడపకి చేరవేసే బాధ్యత మన అందరం తీసుకొని తీరాలి. జగనన్న కోసం సైనికుడిగా తన శక్తి మొత్తం పెట్టి పోరాడేందుకు తాను సిద్ధంమన్నారు. మీరు సిద్దమా అని అభిమానులను సమరోత్సాహులను చేశారు. ఈ సందర్భంగా యూఏఈ వైఎస్సార్సీపీ కన్వీనర్ సయీద్ అక్రం మాట్లాడుతూ.. మరోసారి జగనన్న మన అందరికోసం రావాలని అందుకోసం అందరం ఒక్కటిగా ప్రభుత్వ గళాన్ని గట్టిగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించి.. ఎవరికి కష్టం వచ్చినా సత్వరమే స్పందించి ప్రభుత్వ ఖ్యాతిని ఎంతగానో పెంచుతున్న APNRTS చైర్మన్ మేడపాటి వెంకట్, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్కి కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రపంచంలోనే ధనిక కుటుంబం.. ఆస్తులు తెలిస్తే నోరెళ్లబెడతారు!
రాజ కుటుంబాలకు విలాసవంతమైన భవనాలు, తరిగినపోని ఆస్తులు, వ్యాపారాలు ఉంటాయి. కోటానుకోట్ల రూపాయాలు కూడా వాళ్ల సొంతం! అయితే ప్రపంచంలో కోట్ల ఆస్తులు ఉన్న రాజ కుటుంబాలు ఉన్నప్పటీకి యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ రాజ కుటుంబం చాలా ప్రత్యేకమైంది. చాలా తక్కువ మంది మాత్రమే తమ ఆస్తుల వివరాలు బయటి ప్రపంచానికి వెల్లడిస్తారు! ఇటువంటి రాజ కుటుంబాల ఆస్తులు, సౌకర్యాలు, వ్యాపార విలువ తెలిస్తే.. మనమంతా నోరెళ్లబెట్టక తప్పదు! యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు సుమారు 4,078 కోట్ల అధ్యక్ష భవనం(మూడు అమెరికా పెంటాగన్ భవనాలతో సమానం), 8 ప్రైవేట్ జెట్స్, అత్యంత విలువైన ఫుట్బాల్ క్లబ్ కలిగి ఉన్నారు. ఈ రాజ కుటుంబం ప్రపంచ చమురు నిల్వల్లో సుమారు 6శాతం కలిగి ఉంది. అదే విధంగా మాంచెస్టర్ నగరంలోని ఫుట్ క్లబ్, ప్రముఖ కంపెనీల్లో వందల షేర్లు కూడా ఉన్నాయ. అందులో హాలీవుడ్ గాయాని బ్యూటీ బ్రాండ్ నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థ వరకు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ షేర్లు ఉండటం గమనార్హం. యూఏఈ రాజకుటుంబానికి చెందిన మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చిన్న తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ వద్ద సుమారు 700 ఖరీదైన కార్లు ఉన్నారు. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద SUV వాహనంతో పాటు ఐదు బుగట్టి వేరాన్లు, ఒక లంబోర్గిని వరెన్టన్, ఒక మెర్సిడెస్ బెంజ్ CLK GTR, ఒక ఫెరారీ 599XX, ఒక Mc12 ఆర్ఎన్ వాహనాలు ఉన్నాయి. ఇక.. ఈ రాజకుటుంబం నివాసం ఉండే కస్ర్ అల్-వతన్ ( యూఏఈ అధ్యక్ష భవనం) ఆ దేశంలోనే అత్యంత పెద్ద రాజభవనంగా గుర్తింపు పొందింది. ఈ ప్యాలెస్ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 3,50,000 ప్రత్యేకమైన క్రిస్టల్స్లో తయారు చేయబడిన షాన్డీలియర్, విలువైన చారిత్రక కళాఖండాతో పాలెస్ అబ్బుర పరిచేలా ఉంటుంది. في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة! اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb — Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022 మరోవైపు అధ్యక్షుడి సోదరుడు తహ్నౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. రాజకుటుంబంలోనే ప్రధానమైన పెట్టుబడి కంపెనీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీని విలువ ఐదేళ్ల కాలంలో 28,000 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ 235 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ వ్యవసాయం, చమురు, వినోదం, సముద్ర వ్యాపారాలను కలిగి ఉంది. అదీకాక కంపెనీ పదివేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. యూఏఈ కాకుండా ఈ రాజ కుటుంబానికి లండన్, పారిస్ వంటి ప్రపంచశ్రేణి నగరాల్లో విలువైన ఆస్తులు ఉండటం గమనార్హం. ఇక రాజ కుటుంబంలోని మాజీ కుటుంబ పెద్దకు ‘లండన్ భూస్వామి’ అనే పేరు ఉండటం విశేషం. 2015లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం బ్రిటన్ రాజ కుటుంబంతో పోటీపడే ఆస్తులు యూఏఈ రాజ కుటుబానికి ఉన్నాయని పేర్కొన్నారంటే.. వీరి ఆస్తుల విలువ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! 2008లో మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్.. యూకే ఫుట్బాల్ టీం(మాంచెస్టర్ సీటీ)ను సుమారు 2,122 కోట్ల భారీ ధరకు కోనుగోలు చేసి సంచలనం సృష్టించారు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ది 18 మంది సోదరులు, 11 మంది సోదరీమణులు గల పెద్ద రాజ కుటుంబం. ఆయనకు 9 మంది పిల్లలు, 18 మంది మనవలు, మనవరాళ్లు ఉండటం గమనార్హం. చదవండి: ఇరాన్పై ప్రతీకారదాడి.. పాక్ అమెరికాను సంప్రదించిందా? -
ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు..
ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం. ఆ కుటుబంలోని వ్యక్తులంతా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్లు ఉండే ఫ్యాలెస్ ఏకంగా మూడు పెంటాగాన్ భవనాల పరిమాణంలో ఉంటుంది). సంతానం, తోబుట్లువులు కూడా ఎక్కువ మందే. పైగా అందరూ అత్యంత లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా ప్రముఖ కంపెనీలన్నింటిలో అత్యధిక శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఇంతకీ ఆ అత్యంత ధనిక కుటుంబం ఏదంటే.. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కుటుంటం. ఆయన పేరులోని మొదటి అక్షరాలతో ఎంబీజెడ్గా పిలుస్తారు. ఈయనే కుటుంబ పెద్ద. అతని కుటుబమే అత్యంత ధనిక రాయల్ కుటుంబంగా ఉంది. ఆయనకు 11 మంది సోదరీమణులు, తొమ్మది మంది పిల్లలు, సుమారు 18 మంది దాక మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. ప్రపంచంలోని చమురు నిల్వల్లో దాదాపు ఆరు శాతం ఆ కుటుంబమే సొంతం చేసుకుంది. అలాగే మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ వంటి అనేక ప్రసిద్ధ కంపెనీల్లో అత్యధిక వాటా కలి ఉన్నారు. ఎలోన్ మస్క్ స్పెసఎక్స్ కంపెనీ నుంచి ప్రముఖ గాయకుడు బ్యూటీ బ్రాండ్ ఫెంటీ వంటి కంపెనీలన్నింటిలో ఈ రాయల్ కుటుంబ సభ్యులే వాటాలు కలిగి ఉన్నారు. అధ్యక్షుబు షేక్ మొహమ్మద్ బిన్ తమ్ముడు షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్కే ప్రపంచంలోని అతిపెద్ద ఎస్యూవీ, మెర్సిడెస్ బెంజ్, వంటి లగ్జరీ కార్లు దాదాపు 700 పైచిలుకు ఉన్నాయి. ఆ కుటుంబ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద ప్యాలెస్లో నివశిస్తోంది. దాని విలువ నాలుగు వేల కోట్లు ఉంటుంది. ఆ కుటుంబానికి సంబధించని ప్రధాన ఇన్విస్టెమెంట్ కంపెనీకి ఆయన మరో సోదరుడు బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నిర్వహిస్తున్నారు. దీని విలువ గత ఐదేళ్లలో దాదాపు 2 లక్షల పర్సంటేజ్ వరకు పెరిగింది. ఐతే ప్రస్తుతం ఆ కంపెనీ విలువ లక్ష కోట్లు. ఇది వ్యవసాయం, ఇందనం, వినోదం, సముద్ర వ్యాపారాలు వంటివి నిర్వహిస్తుంది. సుమారు పదివేల మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. ఈ కుటుంబానికి యూఏఈలోనే కాకుండా పారిస్, లండన్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అత్యంత లగ్జరీ ఆస్తులు ఉన్నాయి. ఈ యూఏఈ అధ్యక్షుడికి యూకేలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో పెద్దమొత్తంలో ఆస్తులు ఉండటంతో ఆయన్ని ‘ల్యాండ్ లార్డ్ ఆఫ్ లండన్’(లండన్ భూస్వామి) అని కూడా పిలుస్తారు. అంతేగాదు న్యూయార్క్ నివేదిక ప్రకారం 2015లో ఈ దుబాయ్ రాజకుటుంబం బ్రిటీష్ రాజ కుటుంబంతో సరితూగేలా ఆస్తులను కలిగి ఉందని పేర్కొంది. అతేగాదు 2008లో అధ్యక్షుడు ఎంబీజెడ్కి చెందిన అబుదాబి యునైటెడ్ గ్రూప్ యూకే ఫుట్బాల్ జట్టు మాంచెస్టర్ సిటీని సుమారు రెండు వేల కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్ సిటీ, ముంబై సిటీ, మెల్బోర్న్ సిటీ, న్యూయార్క్ సిటీ ఫుట్బాల్ క్లబ్లను నిర్వహిస్తున్న సిటీ ఫుట్బాల్ గ్రూపులో 81 శాతం ఈ అబుదాబి కంపెనీ యాజమాన్యంలోనే ఉంది. في كلّ ركنٍ قصة من وحي تاريخ دولة الإمارات العربية المتحدة! اكتشفوا قصص تراث الأمة الغني والعظيم وخططوا لزيارتكم إلى #قصر_الوطن اليوم. #في_أبوظبي pic.twitter.com/Uv4zQH6bXb — Qasr Al Watan (@QasrAlWatanTour) November 1, 2022 (చదవండి: అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?) -
Viral Video: కోపంతో వెంబడించిన పులి.. భయపడి పరుగు!
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) దేశానికి చెందినవారి విలాసవంతమైన జీవితాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడీయాలో చాలానే చూసి ఉంటాం. అక్కడి సంపన్న వర్గానికి చెందిన వారు చాలా వరకు.. పులులు, సింహాలు, చీతాలను పెంచుకోవటం గొప్పగా భావిస్తారన్న విషయం తెలిసిందే. అటువంటి జంతువుల కలెక్షన్ వాటిని బీచ్లకు తీసుకువెళ్లడం యూఏఈ సంపన్న కుటుంబాలకు ఓ సరదా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా ఓ విలాసవంతమైన భవనంలో ఒక పెంపుడు పులి.. ఓ వ్యక్తిని భయంతో పరుగులు తీయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Billionaire Life Style (@billionaire_life.styles) బిలియనీర్స్ లైఫ్ స్టైల్ అనే ఓ ఇన్స్టాగ్రామ్ ఈ వీడియోను పోస్ట్చేసింది. ముందు సరదగా వెంబడిస్తున్నట్లు అనుకున్న ఆ వ్యక్తి.. పులి వేగం పెంచి అదే పనిగా కోపంగా తన వెంటపడటంతో ఆ వ్యక్తి భయపడిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘అందమైన పులి.. ఒక బొమ్మ కాదు’, ‘దాడి చేయడానికి వచ్చిన పులి నుంచి తప్పించుకున్నాడు’, ‘చాలా ఫన్నీగా ఉంది.. ఇది ఖచ్చితంగా బిలియనీర్స్ లైఫ్ స్టైల్!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: వాళ్లను చంపేయండి.. ఇజ్రాయెల్కు గాజా ప్రజల విన్నపం! -
చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్.. రోహిత్, గేల్కు కూడా సాధ్యం కాని ఘనత సొంతం
పొట్టి ఫార్మాట్లో యూఏఈ కెప్టెన్, పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ వసీం చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఏ ఆటగాడికి సొంతం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్లో 100 అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి అంతర్జాతీయ క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. టీ20ల్లో సిక్సర్ల వీరులుగా పేరున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సైతం ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్తో నిన్న జరిగిన రెండో టీ20లో వసీం ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో మూడు సిక్సర్లు బాదిన వసీం.. 2023 క్యాలెండర్ ఇయర్లో 100 సిక్సర్లు బాదిన తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది మొత్తం 47 అంతర్జాతీయ టీ20లు ఆడిన వసీం.. 101 సిక్సర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో వసీం తర్వాత ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్మ్యాన్ ఈ ఏడాది టీ20ల్లో 80 సిక్సర్లు (35 మ్యాచ్ల్లో) బాదాడు. ఈ విభాగంలో ఆ తర్వాతి రెండు స్థానాలు కూడా రోహిత్ శర్మ పేరిటే ఉన్నాయి. 2019, 2018 క్యాలెండర్ ఇయర్స్లో హిట్మ్యాన్ వరుసగా 78, 74 సిక్సర్లు బాదాడు. ఈ విభాగంలో ఐదో స్థానంలో టీమిండియా విధ్వంసకర వీరుడు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. స్కై 2022లో 74 సిక్సర్లు బాదాడు. ఈ జాబితాలో వీరి తర్వాత యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 2012లో 26 మ్యాచ్ల్లో 59 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన నిన్నటి మ్యాచ్లో ముహమ్మద్ వసీం 32 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 53 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యూఏఈ సంచలన విజయం సాధించింది. వసీంతో పాటు ఆర్యన్ లక్రా (63 నాటౌట్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఛేదనలో తడబడిన ఆఫ్ఘనిస్తాన్ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటై, 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముహమ్మద్ జవాదుల్లా (4/26), అలీ నసీర్ (4/24) ఆఫ్ఘనిస్తాన్ పతనాన్ని శాశించారు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ నబీ (47) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో యూఏఈ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జనవరి 2న జరుగనుంది. -
అఫ్గాన్ స్టార్ ఓపెనర్ విధ్వంసం.. యూఏఈ చిత్తు
యూఏఈతో మూడు టీ20ల సిరీస్లో అఫ్గానిస్తాన్ శుభారంభం చేసింది. షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో 72 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మునుల్లా గుర్బాజ్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో గుర్బాజ్ కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. అతడితో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ హాప్ సెంచరీతో మెరిశాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో జద్రాన్ 59 పరుగులు చేశాడు. యూఏఈ బౌలర్లలో సిద్దూఖీ, ఆయాన్ ఖాన్, జవదుల్లా తలా వికెట్ సాధించారు. అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమైంది. యూఏఈ వికెట్ కీపర్ బ్యాటర్ అర్వింద్(70) పరుగులతో టప్ స్కోరర్గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫరూఖీ రెండు వికెట్లు, నవీన్ ఉల్ హాక్, క్వైస్ చెరో వికెట్ పడగొట్టారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 షార్జా వేదికగా డిసెంబర్ 31న జరగనుంది. చదవండి: Ranji Trophy 2024: రంజీ ట్రోఫీకి జట్టు ప్రకటన.. మహ్మద్ షమీ తమ్ముడు ఎంట్రీ? -
ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఊచకోత.. 50 బంతుల్లోనే శతకం
యూఏఈతో జరుగుతున్న తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ యువ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్లో గుర్బాజ్ కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సెంచరీ పూర్తయ్యాక గుర్బాజ్ మరో రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ఔటయ్యాడు. గుర్బాజ్కు టీ20ల్లో ఇది తొలి శతకం. ఆఫ్ఘనిస్తాన్ తరఫున 44 మ్యాచ్లు ఆడిన గుర్బాజ్.. సెంచరీ, 5 అర్ధసెంచరీల సాయంతో 1143 పరుగులు చేశాడు. గుర్బాజ్కు ఐపీఎల్లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. గుర్బాజ్ ఐపీఎల్లో గుజరాత్, కేకేఆర్ల తరఫున 11 మ్యాచ్లు ఆడి 133.53 స్ట్రయిక్రేట్తో 227 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో గుర్బాజ్తో పాటు కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. జద్రాన్ 37 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. 18 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 173/2గా ఉంది. జద్రాన్తో పాటు అజ్మతుల్లా ఒమర్జాయ్ క్రీజ్లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో హజ్రతుల్లా జజాయ్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ, అయాన్ అఫ్జల్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్.. యూఏఈలో పర్యటిస్తుండగా, షార్జాలో ఇవాళ (డిసెంబర్ 29) తొలి టీ20 జరుగుతుంది. -
షార్జాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు షార్జాలోని కింగ్ ఫైసల్ పార్కులో సంఘ సేవకులు రిజవాన్గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనేక మంది అభిమానుల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ గారి పుట్టిన రోజుని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యూఏఈ వైస్సార్సీపీ కన్వీనర్ సయ్యద్ అక్రమ్, ఇర్షాద్, అబ్దుల్లా, చక్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రామాలని వివరిస్తూ మరోసారి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా శక్తి వంచన లేకుండా కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ప్రభుత్వం చేస్తున్న మంచిని విస్తృతంగా తీసుకువెళ్లాలి అని ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణుల్ని కోరారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీసీ ప్రెసిడెంట్ శ్రీ మేడపాటి వెంకట్ గారు, బీహెచ్ ఇలియాస్ గారు ప్రవాసాంధ్రలు అభివృద్ధి కొరకు ప్రభుత్వంతో సమన్వయము చేసుకుంటూ అన్ని విధాలుగా ప్రవాసాంధ్రుల అభ్యున్నతి కొరకు చేస్తున్న కృషిని వారు కొనియాడారు. (చదవండి: లండన్లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు!) -
34 ఏళ్ల నిరీక్షణకు తెర.. బంగ్లాదేశ్ రియల్ హీరో అతడే
అండర్-19 ఆసియాకప్ 2023లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఛాంపియన్స్గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో యూఏఈను 160 పరుగుల తేడాతో చిత్తు చేసిన బంగ్లా జట్టు.. తొలిసారి ఆసియాకప్ టైటిల్ను ముద్దాడింది. సీనియర్ జట్టుకు కూడా సాధ్యం కానిది జూనియర్ బంగ్లా టైగర్స్ చేసి చూపించారు. దీంతో తమ 34 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. 1989 నుంచి ఆసియాకప్ టైటిల్ కోసం పోరాడతున్న బంగ్లా అండర్-19 జట్టు ఎట్టకేలకు సాధించింది. కాగా సెమీస్లో భారత్ వంటి పటిష్ట జట్టును ఓడించి మరి బంగ్లాదేశ్ ఫైనల్కు దూసుకెళ్లింది. అతడే రియల్ హీరో.. బంగ్లాదేశ్ తొలిసారి అండర్-19 ఆసియాకప్ విజేతగా నిలవడంలో ఆ జట్టు హెడ్ కోచ్ స్టువర్ట్ లాది కీలక పాత్ర. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ లా గతేడాది జూలైలో బంగ్లా అండర్-19 జట్టు హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి బంగ్లా యువ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. అతడి నేతృత్వంతో యువ క్రికెటర్లు మరింత రాటుదేలారు. ఆసియాకప్ టోర్నీకి ముందు దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్లోనూ బంగ్లా యువ జట్టు అదరగొట్టింది. కాగా గతంలో బంగ్లా సీనియర్ జట్టుకు హెడ్కోచ్గా స్టువర్ట్ లా పనిచేశారు. 2011 నుంచి 2012 వరకు ఏడాది పాటు బంగ్లా ప్రధాన కోచ్గా లా కొనసాగారు. అతడి పర్యవేక్షణలో తమీమ్ ఇక్భాల్, ముష్ఫికర్ రహీం వంటి వారు వరల్డ్క్లాస్ క్రికెటర్లగా ఎదిగారు. అదే విధంగా అతడు శ్రీలంక, వెస్టిండీస్ జట్ల హెడ్కోచ్గా కొనసాగారు. ఇక అతడి నేతృత్వంలోని బంగ్లా జట్టు దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్కప్లోనూ అద్భుతాలు సృష్టించే ఛాన్స్ ఉంది. వీరే ఫ్యూచర్ స్టార్స్.. ఈ ఆసియాకప్ టోర్నీతో బంగ్లా జట్టుకు అషికర్ రెహ్మాన్ షిబ్లీ రూపంలో యువ సంచలనం దొరికాడు. ఈ టోర్నీ ఆసాంతం అషికర్ రెహ్మాన్ ఓపెనర్గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడిన షిబ్లీ... 255 పరుగులతో టోర్నీ టాప్ రన్స్కోరర్గా నిలిచాడు. యూఏఈతో జరిగిన ఫైనల్లో కూడా షిబ్లీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, అరిఫుల్ ఇస్లాం కూడా సంచలన ప్రదర్శన కనబరిచారు. కచ్చితంగా వీరిముగ్గురూ అతి త్వరలోనే బంగ్లా జాతీయ జట్టులో కన్పించనున్నారు. చదవండి: IPL 2024: నిన్న రోహిత్... తాజాగా సచిన్ గుడ్బై... ముంబై ఇండియన్స్లో ఏమవుతోంది? -
COP28: మానవాళి స్వార్థంతో ప్రపంచానికి పెను చీకట్లే
దుబాయ్: గత శతాబ్ద కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేసుకోవడానికి ప్రపంచానికి ఎక్కువ సమయం లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేవలం మన ప్రయోజనాలు మాత్రమే కాపాడుకోవాలన్న మానవాళి వైఖరి అంతిమంగా భూగోళాన్ని చీకట్లోకి నెట్టేస్తుందని స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, తద్వారా ప్రకృతి విపత్తులతో భూగోళానికి పెనుముప్పు పొంచి ఉందని, వాటి దుష్ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచానికి సవాలు విసురుతున్న కర్బన ఉద్గారాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా తగ్గించుకోవడానికి ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి వాతవరణ సదస్సు ‘కాప్–33’ని 2028లో భారత్లో నిర్వహిస్తామని ప్రతిపాదించారు. శుక్రవారం యూఏఈలోని దుబాయ్లో జరిగిన కాప్–28లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాలుష్యం, విపత్తుల నుంచి భూగోళాన్ని కాపాడుకొనే చర్యలను వెంటనే ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ను ప్రస్తావించారు. వ్యాపారాత్మక ధోరణికి భిన్నంగా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సాగే ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. మూల్యం చెల్లిస్తున్న మానవాళి అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతూకాన్ని భారత్ చక్కగా పాటిస్తోందని, ఈ విషయంలో ప్రపంచానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భూగోళ ఉపరితల ఉష్ణోగ్రత(గ్లోబల్ వార్మింగ్) పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పరమితం చేయాలన్న లక్ష్య సాధనకు నిబద్ధతతో కృషి చేస్తున్న అతికొన్ని దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. గత శతాబ్ద కాలంలో మానవళిలో ఒక చిన్న సమూహం ప్రకృతికి ఎనలేని నష్టం కలిగించిందని మోదీ ఆక్షేపించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయండి వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని అభివృద్ధి చెందిన, సంపన్న దేశాలకు నరేంద్ర మోదీ సూచించారు.అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్లోబల్ కార్బన్ బడ్జెట్లో తగిన వాటా ఇవ్వాలన్నారు. ‘కాప్–33’ని 2028లో భారత్లో నిర్వహించడానికి ప్రపంచ దేశాలు అంగీకరిస్తే తమ దేశంలో ఇటీవల జరిగిన జీ20 సదస్సు తర్వాత ఇదే అతిపెద్ద సదస్సు అవుతుందని పేర్కొన్నారు. ఏమిటీ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్? భారత ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్లో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ‘గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్’ కూడా దాదాపు ఇలాంటిదే. ఇదొక వినూత్నమైన మార్కెట్ ఆధారిత కార్యక్రమం. వేర్వేరు రంగాల్లో పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛందంగా కృషి చేసిన వ్యక్తులకు, వ్యవస్థలకు, కమ్యూనిటీలకు, ప్రైవేట్ రంగానికి ప్రత్యేక గుర్తింపునిస్తారు. ప్రోత్సాహకాలు అందజేస్తారు. అమెరికా, చైనా అధినేతల గైర్హాజరు దుబాయ్లో జరుగుతున్న కాప్–28కు వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత షీ జిన్పింగ్ మాత్రం హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ప్రతిఏటా కర్బన ఉద్గారాల్లో ఏకంగా 44 శాతం వాటా అమెరికా, చైనాలదే కావడం గమనార్హం. ఈ రెండు బడా దేశాల నిర్లక్ష్యం వల్ల ఇతర దేశాలకు నష్టపోతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా, చైనా మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
కాప్ దిశ ఎటువైపు..?
ఏటా తప్పనిసరి లాంఛనంగా జరిగే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)–28 సదస్సు శుక్రవారం మొదలైంది. ఈనెల 12 వరకూ జరగబోయే ఈ సదస్సుకు 130 మంది దేశాధినేతలు, దాదాపు 80,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. అలా చూస్తే ఈ సదస్సు గత సమావేశాలతో పోలిస్తే విస్తృతమైనదే. కానీ చివరాఖరికి ఇది ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోగలదా లేక గత సదస్సుల మాదిరే ఉస్సూరనిపిస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. లక్ష సంవత్సరాల వ్యవధిలో జరగాల్సిన వాతావరణ మార్పులు కేవలం గత వందేళ్లలో సంభవించాయన్న చేదు వాస్తవాన్ని గుర్తించి చిత్తశుద్ధితో కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమించాల్సిన సంపన్న దేశాలు మాటలతో కాలక్షేపం చేసి లక్ష్యానికి తిలోదకాలిస్తున్నాయి. భూమాత తన భవిష్యత్తును పరిరక్షించమంటూ మనవైపు చూస్తున్నదని, ఈ విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించి విజయం సాధించటం మనందరి కర్తవ్యమని సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అర్థవంతమైనది. 2030 కల్లా కర్బన ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించటంతో పాటు హరిత ఇంధనాల వాడకం వాటాను 50 శాతానికి పెంచాలని భారత్ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పటం కూడా మెచ్చదగ్గదే. అయితే ప్రధాన కాలుష్య కారక దేశాలైన చైనా, అమెరికా, ఇతర సంపన్న దేశాలూ ఏం చేయ బోతున్నాయన్నదే ప్రధానం. శిలాజ ఇంధనాల అవసరం లేని భవిష్యత్తును నిర్మించాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ దేశాధినేతలకు విన్నవించారు గానీ వినేదెవరు? వాతావరణ మార్పులు ఎలా వున్నాయో వివిధ నివేదికలు చెబుతున్నాయి. గత ఏడెనిమిది దశాబ్దాలుగా కనీవినీ ఎరుగని ఉష్ణోగ్రతలను ఈ ఏడాది చవిచూశామని వాతావరణ పరిశోధకులు అంటున్నారు. ఇది ఏ స్థాయిలో వున్నదంటే పనామాలో కరువుకాటకాలు విస్తరిల్లి పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్రాలను అనుసంధానించే 80 కిలోమీటర్ల పనామా కాలువకు నీటి పరిమాణం గణనీయంగా తగ్గింది. దాంతో ఆ కాల్వమీదుగా వెళ్లే నౌకల సంఖ్య 40 నుంచి 32కు తగ్గింది. అంతేకాదు... నౌకలు మోసు కెళ్లే సరుకుల బరువుపై కూడా పరిమితులు విధించారు. పర్యవసానంగా సరుకు రవాణా బాగా దెబ్బ తింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదంతా చవిచూసిన కార్చిచ్చులు, వరదలు అన్నీ ఇన్నీ కావు. ఈసారి భారీవర్షాలతో మన దేశం 1,500 కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టాన్ని చవిచూసింది. లిబియానూ, మెక్సికోనూ కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. ఇలాంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థలను తలకిందులు చేస్తాయి. నిజానికి ఈ పరిస్థితులను సమీక్షించి, సరైన నిర్ణయాలు తీసుకో వటానికి కాప్ వంటి వేదికలు తోడ్పడాలి. ఆచరణలో అది సాధ్యం కావటం లేదు. ఉష్ణోగ్రతల పెరు గుదలను పారిశ్రామికీకరణకు ముందునాటి ఉష్ణోగ్రతలతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకు పరిమితం చేయాలంటే అన్ని రకాల శిలాజ ఇంధనాల వాడకాన్నీ నిలిపేయటం తప్ప తగ్గించటంవల్ల ఒరిగేదేమీ లేదన్నది పర్యావరణవేత్తల మాట. కానీ సంపన్న దేశాలు నిలకడగా ఒక మాట మీద ఉండటం, ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చటం ఇంతవరకూ లేనేలేదు. ఉదాహరణకు శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చేస్తున్న హెచ్చరికలు చేదు వాస్తవమని పర్యావరణపరంగా జరుగుతున్న పెను మార్పులు రుజువు చేస్తున్నాయని, తక్షణం కర్బన ఉద్గారాలను ఆపటంలో విఫలమైతే మహా విపత్తు తప్పదని ఇదే సదస్సులో మాట్లాడిన బ్రిటన్ రాజు చార్లెస్–3 చెప్పారు. కానీ విషాదమేమంటే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గత ప్రభుత్వాల వాగ్దానాలను బుట్టదాఖలు చేస్తూ పెట్రోల్, డీజిల్ కార్ల విక్ర యాలకున్న గడువును 2030 నుంచి 2035కు పొడిగించారు. 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కనబెట్టారు. ఒకే దేశం భిన్న వైఖరులను ప్రదర్శించటం పర్యావరణ పరిరక్షణకు ఏమేరకు దోహదపడుతుందో చార్లెస్–3, సునాక్లు ఆలోచించాలి. అసలు శిలాజ ఇంధనాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో వున్న దేశాల్లో ఒకటైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కాప్ సదస్సు నిర్వహించటం, సదస్సు అధ్యక్ష స్థానంలో వుండటం ఒక విచిత్రం. నిరుడు ఈజిప్టులో కాప్ సదస్సు జరిగింది. అప్పటినుంచీ శిలాజ ఇంధనాలైన బొగ్గు, చమురు, సహజవాయు ఉత్పత్తులు రికార్డు స్థాయికి చేరాయని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఉత్పత్తుల్లో చమురు వాటా 40 శాతం కాగా, బొగ్గు ఉత్పత్తి వాటా 31 శాతం. మిగిలిన 29 శాతం సహజవాయు ఉత్పత్తులది. వీటిని ఒకేసారి పూర్తిగా తగ్గించుకోవటం సాధ్యపడదు గానీ, ఒక క్రమ పద్ధతిలో హరిత ఇంధనాల వైపు మొగ్గటం ప్రారంభిస్తే లక్ష్యసాధన సులభం అవుతుంది. కానీ ఆ దిశగా ఏ దేశమూ చర్యలు తీసుకోవటం లేదు. నిరుడు ప్రపంచదేశాలు శిలాజ ఇంధనాల సబ్సిడీ కోసం ఏడు లక్షల కోట్ల డాలర్ల సొమ్మును వినియోగించాయని ఒక అంచనా. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచటం విషయంలో ఈసారైనా కాప్ దృష్టి సారించాలి. లేనట్టయితే పర్యావరణ విధ్వంసం మరింత పెరగటం ఖాయం. ఇందుకు అవసరమైన సాంకేతికతలను వెనకబడిన దేశాలకు చవగ్గా అందించటంలో సంపన్న దేశాలు విఫలమవుతున్నాయి. ఇది సరికాదు. నిపుణుల మాట వినటం, పారిస్ ఒడంబడిక అమలుకు నిర్దిష్ట కార్యాచరణ రూపొందించి చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయటం తక్షణావసరం. ఒడంబడిక లక్ష్యాలను విస్మరించిన దేశాలపై ఎలాంటి చర్యలుండాలో నిర్ణ యించాలి. ప్రపంచంలో ఏమూల పర్యావరణానికి విఘాతం కలిగినా అది అన్ని దేశాలకూ ముప్పు కలిగిస్తుందని అందరూ గుర్తించాలి. కాప్ సదస్సు ఈ స్పృహను కలిగించగలిగితే దాని లక్ష్యం ఏదోమేరకు నెరవేరినట్టే. -
బంగారం దిగుమతిపై జ్యుయలర్లకు వెసులుబాటు
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పరిధిలో యూఏఈ నుంచి రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీపై బంగారం దిగుమతి చేసుకునే జ్యుయలర్లకు కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది. ఇటువంటి వర్తకులు ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్ఛేంజ్ ఐఎఫ్ఎస్సీ లిమిటెడ్ (ఐఐబీఎక్స్) ద్వారా బంగారాన్ని యూఏఈ నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ డెరక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దిగుమతి బంగారాన్ని భౌతిక రూపంలోనూ పొందొచ్చని పేర్కొంది. ఐఎఫ్ఎస్సీఏ నమోదిత ఖజానాల ద్వారా భౌతిక బంగారాన్ని పొందాల్సి ఉంటుందని తెలిపింది. భారత్–యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2022 మే నుంచి అమల్లోకి రావడం గమనార్హం. టారిఫ్ రేట్ కోటా (టీఆర్క్యూ) నిబంధనల కింద దేశీయ దిగుమతి దారులు నిర్ధేశిత పరిమాణంలో బంగారాన్ని రాయితీతో కూడిన సుంకం చెల్లించి పొందడానికి అనుమతి ఉంటుంది. -
లాటరీలో రూ.45 కోట్లు గెలుచుకున్న కేరళవాసి
తిరువనంతపురం: చాలా మంది భారతీయులు యూఏఈ వంటి అరబ్ దేశాలకు వలస వెళ్తుంటారు. అక్కడ లాటరీలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ ఎదురవుతూనే ఉన్నాయి. వందల్లో వెచ్చించి కొనుగోలు చేయగా.. కోట్ల రూపాయల లాటరీలు తగిలిన సందర్భాలు ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి అదృష్టమే కేరళకు చెందిన శ్రీజు(39) అనే వ్యక్తిని వరించింది. యూఏఈలో ఉంటున్న ఇతనికి రూ.45 కోట్ల లాటరీ తగిలింది. 'గత 11 ఏళ్లుగా యూఈఏలో పనిచేస్తున్నాను. ఆయిల్ గ్యాస్ పరిశ్రమలో కంట్రోల్ రూం ఆపరేటర్గా పనిచేస్తున్నాను. మంచి ఇళ్లు కొనుక్కుని , కేరళకు తిరిగిరావాలని అనుకున్నాను. కానీ లాటరీ రూపంలో నా దశ తిరిగింది. ఏకంగా రూ.45 కోట్ల లాటరీ తగలడం నమ్మశక్యంగా లేదు. అంతా అయోమయంగా ఉంది. చాలా సంతోషంగా కూడా ఉంది. నా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.' అని శ్రీజు తెలిపారు. శ్రీజూకి మాత్రమే కాదు.. గతంలో చాలా మంది భారతీయులు యూఏఈ డ్రాల్లో పెద్ద మొత్తాల్లో డబ్బులు సాధించారు. గత శనివారం, యూఏఈలోని మరో కేరళ వ్యక్తి శరత్ శివదాసన్ ఎమిరేట్స్ డ్రా ఫాస్ట్5లో సుమారు రూ. 11 లక్షలు గెలుచుకున్నాడు. ముంబయికి చెందిన మరో వ్యక్తి మనోజ్ భావ్సర్ కూడా రూ.16 లక్షల లాటరీ గెలుచుకున్నాడు. ఇదీ చదవండి: కాంగ్రెస్ Vs బీజేపీ: చిన్న పార్టీలతోనే పెద్ద చిక్కు! -
తీరు మార్చుకోని ట్రూడో.. మరోసారి కవ్వింపు చర్యలు
ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీరు మారలేదు. మరోసారి భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జోర్డాన్ రాజుతో భారత్ సంబంధాలపై చర్చించారు. కెనడా-భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులపై జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిన్ అల్-హుస్సేన్తో ఫొన్లో మాట్లాడారు. దౌత్య సంబంధాలలో వియన్నా కన్వెన్షన్ను గౌరవించడంపై చర్చించినట్లు ట్రూడో ఓ ప్రకటనలో తెలిపారు. On the phone today, His Highness @MohamedBinZayed and I spoke about the current situation in Israel. We expressed our deep concern and discussed the need to protect civilian life. We also spoke about India and the importance of upholding – and respecting – the rule of law. — Justin Trudeau (@JustinTrudeau) October 8, 2023 ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో ఇటీవలే యూఏఈ అధ్యక్షునితో కెనడా ప్రధాని ట్రూడో మాట్లాడారు. భారత్తో సంబంధాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయనియమాలపై మాట్లాడినట్లు స్పష్టం చేశారు. అటు.. కొన్ని రోజుల ముందే యూకే ప్రధాని రిషి సునాక్తోనూ జస్టిన్ ట్రూడో మాట్లాడారు. భారత్తో కెనడాకు ఉన్న అంతర్జాతీయ సంబంధాలపై చర్చించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించింది. అనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. అటు.. నిజ్జర్ హత్య కేసులో భారత్ సహకరించాలని కెనడా కోరుతోంది. సమస్యల పరిష్కారానికి ఇరుదేశాలు సమన్వయంతో పనిచేయాలని అమెరికా కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదీ చదవండి: Israel–Palestinian conflict: గాజాపై నిప్పుల వర్షం -
ట్రూడో కవ్వింపు చర్యలు.. భారత్పై యూఏఈ అధ్యక్షునితో చర్చ
ఒట్టావా: భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగుతున్న క్రమంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్తో భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్య సంబంధాలపై మాట్లాడారు. అలాగే చట్టాలకు మద్దతునివ్వడం, గౌరవించడంపై ముచ్చటించారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై కూడా ట్రూడో మాట్లాడారు. సాధారణ పౌరుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్షునితో మొబైల్లో మాట్లాడారు. 'ఈ రోజు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్తో ఫోన్లో మాట్లాడాను. ఇజ్రాయెల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాను. ఈ దాడులపై విచారం వ్యక్తం చేస్తూ.. సాధారణ పౌరుల జీవితాలను కాపాడాల్సిన అవసరంపై మాట్లాడాను. ఇండియాతో సంబంధాలపై కూడా చర్చించాం.. చట్టాలకు మద్దతునిస్తూ, గౌరవించడంపై చర్చించాం.' అని ట్రూడో ట్విట్ చేశారు. Trudeau discusses India-Canada row with UAE President Read @ANI Story | https://t.co/WbTR3qq9Pw#IndiaCanada #JustinTrudeau #UAE pic.twitter.com/NCI03teIep — ANI Digital (@ani_digital) October 8, 2023 ఇటీవల యూకే ప్రధాని రిషి సునాక్తో భారత్-కెనడా మధ్య చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులపై ట్రూడో చర్చించారు. దౌత్య సంబంధాలు, చట్టాల గురించి ఇరువురూ మాట్లాడుకున్నారు. అంతర్జాతీయ సంబంధాలను యూకే కట్టుబడి ఉంటుందని రిషి సునాక్ ఈ సందర్భంగ చెప్పారు. ఈ పరిణామాల అనంతరం మళ్లీ యూఏఈ అధ్యక్షునితో ట్రూడో భారత్ గురించి చర్చించడం గమనార్హం. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆనంతరం ఇరుదేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. ఇదీ చదవండి: ఇజ్రాయెల్పై హమాస్ దాడులు.. లండన్లో సంబరాలు -
ఇండియన్ ఫుడ్కు భారీ డిమాండ్.. భారత్ను వేడుకుంటున్న దేశాలు
భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్ను వేడుకుంటున్నాయి. భారత్ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆక్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది. ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు. బాస్మతి బియ్యానికి డిమాండ్ భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది. అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్మెంట్) కీర్తి మేఘనాని కూడా ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు. GCC గ్రూప్కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు. భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
రూపాయి-దిర్హామ్ వాణిజ్యం విస్తరణ:పెట్టుబడులకు అపార అవకాశాలు
భారత్-యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపీ-దిర్హామ్ రూపంలో మరింత విస్తరించు కునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇది ద్వైపాక్షిక వాణిజ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. రెండు దేశాలూ యూఏఈ నుంచి భారత్కు తక్కువ వ్యయానికే నిధులు పంపుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. 11వ భారత్–యూఏఈ ఉన్నత స్థాయి టాస్్కఫోర్స్ సమావేశం కోసం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం నుంచి యూఏఈలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన వెంట అధికారుల బృందం కూడా ఉంది. ‘‘ఆర్బీఐ, యూ ఏఈ సెంట్రల్ బ్యాంక్తో ఇప్పుడే చర్చలు పూర్త య్యాయి. పరిశ్రమ, బ్యాంకర్లతో కలసి రూపీ–దిర్హా మ్ వాణిజ్యాన్ని మరింత వేగంగా, పెద్ద మొత్తంలో అమలు చేయాలని నిర్ణయించాం’’అని మీడియా ప్ర తినిధులకు పీయూష్ గోయల్ చెప్పారు. దేశీ కరెన్సీల రూపంలో వాణిజ్యం నిర్వహించుకోవడం వల్ల మొత్తం వాణిజ్యంపై 5% ఆదా చేసుకోవచ్చన్నారు. పెట్టుబడులకు అపార అవకాశాలు ఆహార, పారిశ్రామిక పార్క్లు భారత్లో ఏర్పాటు చేయడంపైనా ఇరువైపులా చర్చలు జరిగినట్టు మంత్రి గోయల్ చెప్పారు. యూఏఈ ఇన్వెస్టర్లు భారత్లో ఆర్థిక సేవలు, శుద్ధ ఇంధనాలు, మౌలిక రంగం, విద్య, హెల్త్కేర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. భారత్లో విమానయాన రంగం యూఏఈ పెట్టుబడిదారులకు నమ్మకమైనదిగా మారినట్టు చెప్పారు. రవాణా, పర్యాటక రంగాలకు భారత్ సర్కారు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు పేర్కొన్నారు. రానున్న రజుల్లో తయారీ, సేవల రంగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడులు, సంబంధాలకు ఇప్పుడు చంద్రుడు కూడా హద్దు కాదని అభివర్ణించారు. ఆవిష్కరణలతో పాటు, పెట్రోలియం, పెట్రోలియం కెమికల్ రంగాల్లో అప్స్ట్రీమ్ (అన్వేషణ, ఉత్పత్తి), డౌన్స్ట్రీమ్ (మార్కెటింగ్, విక్రయాలు) పట్ల రెండు దేశాల్లో ఆసక్తి ఉన్నట్టు ప్రకటించారు. భారత్-యూఏఈ గతేడాది మేలో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అమలు చేయడం గమనార్హం. 2021-22లో ద్వైపాక్షిక వాణిజ్య 72.9 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2022–23లో అది 84.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఏఐ ఎతిహాద్తో ఎన్పీసీఐ ఒప్పందం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ)కు చెందిన అంతర్జాతీయ విభాగం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, గురువారం యూఐఈకి చెందిన ఏఐ ఎతిహాద్ పేమెంట్స్తో ఒప్పందం చేసుకుంది. వాణిజ్య మంత్రి గోయల్ సమక్షంలో ఇది కుదిరింది. దీంతో రెండు దేశాల్లోని వారు తక్కువ వ్యయానికే రియల్ టైమ్ (అప్పటికప్పుడు) సీమాంతర చెల్లింపులు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. దేశీ లావాదేవీలు నిర్వహించుకున్నంత సులభంగా సీమాంతర లావాదేవీలు చేసుకోవచ్చని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది. నగదు పంపిస్తున్నప్పుడు రెండు దేశాల కరెన్సీ విలువ, చార్జీల వివరాలు కనిపిస్తాయి. దీంతో పారదర్శకత పెరగనుంది. గ్లోబల్ కార్డ్ల అవసరం లేకుండా డొమెస్టిక్ కార్డులను వినియోగించి నగదు పంపించుకోవచ్చు. ఈ ఒప్పందంతో ఎన్పీసీఐ ఉత్పత్తి అయిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యూఏఈకి చెందిన ఇన్స్టంట్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ (ఐపీపీ) మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. దీంతో యూపీఐ లావాదేవీ మాదిరే సులభంగా నిర్వహించుకోవచ్చు. అలాగే, భారత్కు చెందిన రూపే స్విచ్, యూఏఈ స్విచ్ మధ్య కూడా అనుసంధాన ఏర్పడుతుంది. దీంతో కార్డుల నుంచి కూడా నగదు పంపుకోవడం సాధ్యపడుతుంది. ఈ ఒప్పందం యూఏఈలో ఉపాధి పొందుతున్న 35 లక్షల భారతీయులకు (ప్రవాసులు) ప్రయోజనం చేకూర్చనుంది. -
ఏఐ ఎతిహాద్ పేమెంట్స్తో ఎన్పీసీఐ ఒప్పందం
న్యూఢిల్లీ: నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అనుబంధ సంస్థ అయిన ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్, ఏఐ ఎతిహాద్ పేమెంట్స్తో ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలోని బృందం ఈ నెల 5, 6 తేదీల్లో అబుదాబిలో పర్యటించనుంది. ఈ సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరువైపులా సంతకాలు చేయనున్నారు. ఈ ఒప్పందంతో సీమాంతర చెల్లింపులకు వీలు కలుగనుంది. పెట్టుబడులకు సంబంధించి భారత్–యూఏఈ 11వ అత్యున్నత స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశానికి మంత్రి పీయూష్ గోయల్ సహాధ్యక్షత వహించనున్నారు. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఎండీ షేక్ హమీద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సైతం సహాధ్యక్షత వహిస్తారు. ముబదాలా ఎండీ, సీఈవో ఖల్దూన్ అల్ ముబారక్తో మంత్రి గోయల్ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. యూఏఈ ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇరుదేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ సమావేశం కానున్నారు. ఇరు దేశాల్లో మరో దేశం పెట్టుబడులకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లు, ఇతర అంశాలపై రెండు దేశాలు చర్చించనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు జాయింట్ టాస్క్ఫోర్స్ రూపంలో సాధించిన పురోగతిని సమీక్షించనున్నట్టు పేర్కొంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి మంత్రి పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా రెండు దేశాల మధ్య 2013లో జాయింట్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు కావడం గమనార్హం. -
జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?
Mahadev Gambling App Sourabh Chandrakar: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నిర్వహించిన దాడులు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈడీ దాడుల్లో రూ.417 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రాయ్పూర్, భోపాల్, కోల్కతా, ముంబై సహా పలు నగరాల్లో బెట్టింగ్ సిండికేట్కు చెందిన 39 ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏజెన్సీ 15 మందిని అరెస్టు చేయడంతో మహాదేవ్ బుక్ యాప్ అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దుబాయ్లో ఉంటూ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నసౌరభ్ చంద్రకర్ ఈ స్కాంలో కీలకం. మహాదేవ్ ఆన్లైన్ బుకింగ్ పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్లు, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ ఇతర ఆటల ద్వారా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తుంది. ఈ బెట్టింగ్ యాప్లో సహ ప్రమోటర్గా ఉన్న రవి ఉప్పల్ కలిసి బెట్టింగ్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను FPI మార్గం ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టారు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో దుబాయ్లో ఈ ఇద్దరు ప్రధాన ప్రమోటర్లు రూ. 5,000 కోట్ల వరకు కూడబెట్టారు. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) రూ. 200 కోట్ల స్టార్-స్టడెడ్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరభ్ దుబాయ్లోని అతిపెద్ద నగరంలో, అత్యంత విలాసవంతంగా వివాహం చేసుకున్నాడు. దీని కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేశాడు. నాగ్పూర్ నుండి తన బంధువులను, సినీ తారలను ప్రైవేట్ జెట్ల ద్వారా తరలించాడు. అంతేకాదువెడ్డింగ్ ప్లానర్కు రూ.120 కోట్లు చెల్లించాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ ప్రదర్శనలు ఇచ్చారంటే పెళ్లి ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముంబైలోని మలాద్ ప్రాంతంలోని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అంగడియ సంస్థలు డబ్బును డెలివరీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో యోగేష్ భాపట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ R-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.112 కోట్లు, హోటల్ బుకింగ్స్ కోసం రూ.42 కోట్లు అందాయి. భోపాల్కు చెందిన ర్యాపిడ్ ట్రావెల్స్ చంద్రకర్ బంధువులు, బాలీవుడ్ ప్రముఖులను దుబాయ్కు పంపడానికి టిక్కెట్లు ఏర్పాటు చేసిందని, అయితే కోల్కతాకు చెందిన వికాస్ చప్పరియా ద్వారా అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నాయని ఈడీ ఆరోపించింది. (ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!) @GoI_MeitY @NewsG2G @Cybercellindia Today Lotus365 Again With New Advertisement on Big Front Page Government Banned Betting websitehttps://t.co/luYqv9u3oh Banned Aftet They Update Domain To . in Then Smartly Changed The Domain To https://t.co/QXi0XQGCGL After Banned pic.twitter.com/k7cTplhNrG — Sunny Sunny (@SunnySu19623409) April 7, 2023 ఈ వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అతిఫ్ అస్లాం, విశాల్ దద్లానీ, రహత్ ఫతే అలీ ఖాన్, టైగర్ ష్రాఫ్, అలీ అస్గర్, సన్నీ లియోన్, క్రిసీ ఖర్బండా, ఎల్లి అవ్రామ్, నుష్రత్ భరుచ్చా, భారతీ సింగ్, క్రుషా అభిషేక్,భాగ్యశ్రీ వంటి తారలు హాజరయ్యారని ఈడీ గుర్తించింది. వీరందరినుంచి సమన్లు జారీ చేసి, వారి స్టేట్మెంట్లు తీసుకోవాలని ఈడీ చూస్తోంది.సెప్టెంబర్ 18, 2022న జరిగిన మూడవ వార్షికోత్సవ పార్టీకి కూడా బాలీవుడ్ తారలు హాజరయ్యారు. వీరిలో సంజయ్ దత్, కపిల్ శర్మ, అఫ్తాబ్ శివదాసాని, సుఖ్విందర్ సింగ్, సోఫీ చౌదరి, డైసీ షా, ఊర్వసాహి రౌతేలా, నర్గీస్ ఫక్రీ, నేహా శర్మ తదితరులు హాజరయ్యారు. ఈవెంట్ మేనేజర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హవాలా వ్యాపారులపై జరిపిన దాడుల్లో ఈ నెట్వర్క్ను గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈడీ ఆరోపణల ప్రకారం వీరు మహాదేవ్ ఆన్లైన్ బుక్ బెట్టింగ్ యాప్ గొడుగు కింద సిండికేట్ అయ్యారు. ముఖ్యంగా ఇన్యాక్టివ్ లేదా సెమీ-యాక్టివ్ ఖాతాలను గుర్తించి వారికి స్వల్పమొత్తంలో ఎరవేసి, ఆ ఖాతాల ద్వారా కోట్ల లావాదేవీలు చేశారని దీంతోనే వీటిని ట్రాక్ చేయడం కష్ట మైందని దర్యాప్తు ఏజెన్సీ చెప్పింది. జ్యూస్ అమ్ముకునే చంద్రకర్ ఛత్తీస్గఢ్లోని భిలాయ్కు చెందిన చంద్రకర్ మొదట్లో జ్యూస్ అమ్మేవాడు. మరోవైపు రవి ఉప్పల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. స్థానిక బుకీలుగా ప్రారంభమై, చాలా తక్కువ సమయంలోనే చంద్రకర్, రవి ఇద్దరూ దుబాయ్కి వెళ్లి 2018లో ఈ యాప్ను ప్రారంభించారు. త్వరితగతిన డబ్బులిస్తామంటూ విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, ఇతరులను ప్రలోభపెట్టారు. ఇది సక్సెస్ కావడంతో అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. సెలబ్రిటీల ద్వారా మహదేవ్ బుక్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించింది.అలా కోట్లకు పడగలెత్తిన చంద్రకర్, FairPlay, Reddy Anna, Lotus365 వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది. దీంతోపాటు, 'బేట్భాయ్' అంబానీ బుక్' పేరుతో కొత్త బ్రాండ్లను కూడా ప్రారంభించాడు. ఈ ఇద్దరు కింగ్పిన్లపై రెడ్ కార్నర్ నోటీసులు (ఆర్సిఎన్) జారీ చేసే యోచనలో ఉందిఈడీ. దీని నిమిత్తం రాయ్పూర్లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు పరారీలో ఉన్న నిందితులకు నాన్బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. -
యూఏఈ పర్యటనలో మంత్రి అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు యూఏఈ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూఏఈ లోని వైఎస్సార్సీపీ ఎన్నారై సలహాదారులు ప్రసన్న సోమిరెడ్డి, సమన్వయకర్త అక్రమ్ భాషా ఆధ్వర్యంలో పార్టీశ్రేణులను కలిశారు. రాబోయే ఎన్నికలను సమాయత్తపరిచే విధంగా దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. 'చంద్రబాబు అవినీతి కేసు విషయంలో చట్టం, న్యాయం తమ పని చేసుకొని వెళ్తున్నాయని, అన్నిసార్లు అబద్దాలను తమ పచ్చమీడియా ద్వారా ప్రచారం చేయలేరు. సోషల్ మీడియా ముసుగులో పచ్చమీడియా ఏకపక్ష వార్తలను ప్రజలను నమ్మడం లేదని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బంద్ విఫలం అవడంతోనే నిరూపితం అయింది' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ నివాస చౌదరి, ఫహీం, శ్యామ్ సురేంద్ర రెడ్డి, తరపట్ల మోహన్ రావు, బ్రహ్మానంద రెడ్డి, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
దుబాయ్లో ఘనంగా వైఎస్సార్ 14వ వర్థంతి వేడుకలు
యుఏఈ దుబాయ్: యుఏఈ దేశంలోని దుబాయ్ పట్టణంలో దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ 'వైఎస్ రాజశేఖర రెడ్డి' 14వ వర్ధంతి వేడుకలను వైఎస్సార్సీపీ యుఏఈ కమిటీ కన్వీనర్ సయ్యద్ అక్రం బాషా అండ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించినారు. ఈ సందర్భంగా సయ్యద్ అక్రం బాషా మాట్లాడుతూ.. దివంగత మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి పరిపాలన ఒక స్వర్ణయుగం లాంటిదని ఆయన పరిపాలనలో బడుగు బాలహీన వర్గాల ప్రజలు సఖ సంతోషాలతో వున్నారని పేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేసిన అపర భగీరథుడు, జలయగ్నం సృస్టికర్త, ఆరోగ్య శ్రీ ప్రదాత, విధ్యాదాత, ఉచిత విద్యుత్ పధకం, ఫీజు రీయంబ్రస్మెంట్, ఇలా ఎన్నో పధకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఏకైక ముఖ్య మంత్రి. ముస్లింలకు ప్రభుత్వ విద్య ఉద్యోగ రంగాలలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వారిదేనని, వారు చనిపోయోటప్పుడు కూడా ప్రజల సంక్షేమం కొరకు పాటు పడ్డారని, రాజన్న భౌతికంగా మన ముందు లేకపోయిన తెలుగు ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుఏఈ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. -
Chandrayaan-3: అబుదాబిలో భారత్ మాతా కీ జై
అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత అద్భుత ఘట్టంగా చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ నిలిచిపోయింది. ఈ అరుదైన ఘనతను చూడడానికి దేశవిదేశాల్లోనూ ప్రజలు ఆసక్తి కనబరిచారు. అలాగే.. విదేశాల్లో ఉంటున్న భారతీయుల కోసమూ ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి అక్కడి ఇండియన్ కమ్యూనిటీస్. ఈ క్రమంలో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ఉంటున్న ప్రవాస భారతీయులందరు ఒక్క దగ్గర ఉండి వీక్షించేందుకు ఇండియా సోషల్ అండ్ కల్చర్ సెంటర్ ముఖ్య ప్రాంగణంలో LED స్క్రీన్ ద్వారా ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వందలాది ప్రవాస భారతీయులు అక్కడికి చేరుకొని చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలం పై లాండ్ అవడం వీక్షించారు. ఎక్కువ మంది తెలుగు ప్రజలు.. అందునా తెలంగాణ ప్రజలు ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. చంద్రయాన్ 3 లాండింగ్ చివరి క్షణాలలో ప్రాంగణం అంతా భారత్ మాతా కీ జై నినాదాలతో మారు మోగింది. ఈ క్షణాలు భారతీయలందరి హృదయాలలో ఒక గర్వం తో కూడిన ఆనందం చేకూర్చిందని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజశ్రీనివాస రావు, గోపాల్ మరియు ఎట్టి రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. అలాగే ISC ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఇది ‘భారతీయలందరికి మరచిపోలేని అనుభూతి’గా పేర్కొన్నారు. -
కివీస్తో సిరీస్.. కొత్త కెప్టెన్గా అతడు! ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ వీరుడి అరంగేట్రం!
New Zealand tour of United Arab Emirates, 2023: న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టును ప్రకటించింది. సొంతగడ్డపై కివీస్తో పోరు నేపథ్యంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తమ టీ20 కొత్త కెప్టెన్గా మహ్మద్ వసీం పేరును ఖరారు చేసినట్లు యూఏఈ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇంగ్లండ్ కంటే ముందు కాగా ఇంగ్లండ్తో సిరీస్కు ముందు న్యూజిలాండ్.. యూఏఈతో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఆగష్టు 17, 19, 20 తేదీల్లో దుబాయ్ వేదికగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి. ఈ క్రమంలో కివీస్ వంటి పటిష్ట జట్టుతో తలపడనున్న వసీం సారథ్యంలో 16 మంది సభ్యులున్న జట్టును ఎంపిక చేసినట్లు యూఏఈ బోర్డు బుధవారం తెలిపింది. రిజ్వాన్ స్థానంలో వసీం సీపీ రిజ్వాన్ స్థానంలో వసీం యూఏఈ టీ20 జట్టును ముందుకు నడిపించనున్నట్లు పేర్కొంది. కాగా కివీస్తో సిరీస్ సందర్భంగా అసోసియేట్ దేశాల్లో వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన అసిఫ్ ఖాన్ అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేయనున్నాడు. అతడితో పాటు.. దేశవాళీ క్రికెట్లో అదరగిట్టిన ఆల్రౌండర్ ఫరాజుద్దీన్, స్పిన్నర్ జశ్ గియనానీ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు యూఏఈ జట్టు: మహ్మద్ వసీం(కెప్టెన్), అలీ నాసీర్, అన్ష్ టాండన్, ఆర్యాంశ్ శర్మ, అసిఫ్ ఖాన్, అయాన్ అఫ్జల్ ఖాన్, బాసిల్ హమీద్, ఈథన్ డిసౌజా, ఫరాజుద్దీన్, జశ్ గియనానీ, జునైద్ సిద్దిఖి, లవ్ప్రీత్ సింగ్, మహ్మద్ జవాదుల్లా, సంచిత్ శర్మ, వ్రిత్య అరవింద్, జహూర్ ఖాన్. యూఏఈతో సిరీస్కు కివీస్ జట్టు: టిమ్ సౌతీ(కెప్టెన్), అది అశోక్, చాడ్ బోస్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, కైలీ జెమీషన్, బెన్ లిస్టర్, కోలీ మెకాంచి, జిమ్మీ నీషం, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫర్ట్, విల్ యంగ్. సిరీస్ వివరాలు ►ఆగష్టు 17, ఆగష్టు 19, ఆగష్టు 20- మూడు టీ20లు ►స్టార్ స్పోర్ట్స్, ఫ్యాన్కోడ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం ►దుబాయ్లోనే మూడు టీ20లు ►భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్లు ఆరంభం. చదవండి: అక్కడ ఒక్కరాత్రికి 4 వేలు ఉండేది.. ఆరోజు మాత్రం ఏకంగా 60 వేలు! Squad ALERT: We unveil the 16 for the #UAEvNZ series. Mohammad Waseem to captain. More details: https://t.co/Vq3aSFqIwx pic.twitter.com/cmYCucYLUb — UAE Cricket Official (@EmiratesCricket) August 16, 2023 -
ఆ భారీ షాపింగ్ మాల్లో కనిపించని క్యాషియర్.. మరి పేమెంట్ ఎలాగంటే..
ఏవైనా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలంటే ఇంటి పక్కనున్న కిరాణా దుకాణానికో లేదా మార్కెట్కు వెళుతుంటాం. పెద్ద పట్టణాలు, నగరాల్లో అయితే షాపింగ్ స్టోర్కు వెళుతుంటారు. షాపింగ్మాల్లోకి వెళ్లిన తరువాత మనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నాక, బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చి, క్యాష్ పే చేస్తుంటాం. అయితే దుబాయ్లోని ఆ స్టోర్లో క్యాషియర్ ఉండరు. అంటే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునేందుకు ఎవరూ ఉండరు. మరి సరుకులు తీసుకున్నాక ఆ స్టోర్లో క్యాష్ ఎలా పే చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. యూఏఈలోని దుబాయ్ పగలు, రాత్రి అనే తేడాలేకుండా నిత్యం వెలుగు జిలుగులతో మెరిసిపోతుంటుంది. ఈ మహానగరంలో 2018లో అమెజాన్ కెరెఫోర్ మినీ అనే షాపింగ్ స్టోర్ తెరిచింది. ఇది చూసేందుకు ఇతర స్టోర్ల మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇది అత్యాధునిక స్టోర్గా పేరొందింది. ఈ స్టోర్లో సరుకులు కొనుగోలు చేసే వినియోగదారుల దగ్గర ఈ స్టోర్కు సంబంధించిన యాప్ ఉండాలి. ఇది ఉంటేనే స్టోర్లోనికి ఎంట్రీ లభిస్తుంది. లోనికి వచ్చాక వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ స్టోర్లో హై రిజల్యూషన్ కలిగిన సీసీ కెమెరాలు ఉంటాయి. అవి సెన్సార్ను కలిగివుంటాయి. ఇవి వినియోగదారుల ప్రతీ కదలికను పర్యవేక్షిస్తుంటాయి. స్టోర్లోని వచ్చిన వినియోగదారులు తాము సరుకులు తీసుకుని బ్యాగులో వేసుకోగానే రసీదు వివరాలు వారి ఫోనులోప్రత్యక్షమవుతాయి. షాపింగ్ పూర్తయిన తరువాత పేమెంట్ ఆదే ఫోను ద్వారా చేయాల్సివుంటుంది. కెరెఫోర్ సీఈఓ హనీ వీస్ మాట్లాడుతూ భవిష్యత్లో అంతా ఇలానే ఉంటుందని, ఈ స్టోర్లోకి వచ్చే వినియోగదారులు ప్రత్యేక అనుభూతికి లోనవుతారని అన్నారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి..