April
-
మార్చి తర్వాత వడ్డీరేటు తగ్గింపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–2026) రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ విశ్లేషించింది. స్థిర వృద్ధి, ధరల పెరుగుదల్లో కట్టడి వంటి అంశాలు దీనికి దోహదపడతాయన్నది ఫిచ్ విశ్లేషణ. రెపో రేటు కోత 2025–26లో కార్పొరేట్ల రుణ లభ్యత పెరుగుదలకు దారితీసే అంశంగా పేర్కొంది. అధిక మూలధన వ్యయాలు నమోదయినప్పటికీ, వచే ఆర్థిక సంవత్సరం భారత్ కార్పొరేట్ల మార్జిన్లు మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని ఫిచ్ వెలిబుచ్చింది. ‘‘ఇండియా కార్పొరేట్ల క్రెడిట్ ట్రెండ్స్’’ పేరుతో ఫిచ్ రూపొందించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... వృద్ధి 6.5 శాతం 2025–26లో సిమెంట్, విద్యుత్, పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, ఇంజినీరింగ్, నిర్మాణ (ఈఅండ్సీ) కంపెనీల ఉత్పత్తులకు మంచి డిమాండ్ అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎకానమీ 6.5 శాతం పురోగమించే వీలుంది. మౌలిక సదుపాయాల వ్యయం పెరగవచ్చు. ఎకానమీ స్థిరవృద్ధికి ఈ అంశం దోహదపడుతుంది. మరికొన్ని అంశాలు... → దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు నెమ్మదించడం వల్ల ఆటో రంగంలో వృద్ధి మధ్యస్థంగా ఉండే వీలుంది. → రవాణా, పర్యాటక పరిశ్రమలో డిమాండ్ రికవరీ ఒక మోస్తరు వేగంతో కొనసాగుతుంది. → అంతర్జాతీయంగా అధిక సరఫరాల ప్రభావం రసాయన కంపెనీల ధరలపై ప్రభావం చూపుతుంది. → టెలికం కంపెనీల ఆదాయ వృద్ధికి టారిఫ్ల పెంపు మద్దతు లభిస్తుంది. → ఔషధ రంగంలో మెరుగైన ఫలితాలు నమోదుకావచ్చు.రూపాయిపై ఒత్తిడి కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత రూపాయి మరింత క్షీణించవచ్చు. అమెరికాసహా కొన్ని దేశాలు తీసుకునే వాణిజ్య రక్షణాత్మక చర్యల వల్ల దిగుమతులు తగ్గి, రూపాయిపై ఆ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఐటీ మందగమనం.. కీలకమైన విదేశీ మార్కెట్లలోని వినియోగదారులు ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వ్యయాల విషయంలో విచక్షణతో వ్యవహరించవచ్చు. దీనితో ఐటీ, సేవా కంపెనీల అమ్మకాల్లో కేవలం ఒక అంకె వృద్ధి మాత్రమే నమోదయ్యే వీలుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకు పరిమితం కావచ్చు.రేటు తగ్గింపు ప్రక్రియ షురూ! రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపనకు పడిపోయే అవకాశం ఉంది. ఆర్బీవ్యోల్బణం నుండి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని మేము నమ్ముతున్నాము. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నాము. – అఖిల్ మిట్టల్, సీనియర్ ఫండ్ మేనేజర్ (టాటా అసెట్ మేనేజ్మెంట్)ఫిబ్రవరిలో రేటు తగ్గదు నవంబర్ 2024లో 5.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.2 శాతానికి దిగివచ్చింది. ఇది మా అంచనాలకన్నా తక్కువ. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి పాలసీ సమీక్షలో రెపో రేటు తగ్గింపు కష్టమే. అయితే కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల్లో ధరలలో గణనీయమైన క్షీణత వల్ల వృద్ధే లక్ష్యంగా ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుల్లో కొందరు కోతకు మొగ్గుచూపే వీలుంది. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ ఏప్రిల్ పాలసీలో కోత కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుంది. – పరాస్ జస్రాయ్, ఇండ్–రా ఎకనమిస్ట్ -
భారత్ వృద్ధి 6.8 శాతం
న్యూఢిల్లీ: భారత్ ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.8 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి సాధిస్తుందన్న తన అంచనాలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ స్పష్టం చేసింది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యలోటు సవాళ్లు డిమాండ్ను తగ్గిస్తాయని తన తాజా ఆసియా పసిఫిక్ ఎకనమిక్ అవుట్లుక్లో పేర్కొంది. 2023–24లో భారత్ 8.2 శాతం వృద్ధి రేటు సాధనను సైతం ఈ సందర్భంగా ఎస్అండ్పీ ప్రశంసించింది. 2024–25కు సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ తాజా రేటింగ్స్ ఉద్ఘాటన.. ఆర్బీఐ అంచనా 7.2శాతంకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. గ్లోబల్ రేటింగ్ దిగ్గజం తాజా అవుట్లుక్లో ము ఖ్యాంశాలు చూస్తే.. 2025–26, 2026– 27లో భారత్ వృద్ధి రేట్లు వరుసగా 6.9 శాతం, 7 శాతాలుగా ఉంటాయి. 2024లో చైనా వృద్ధి అంచనా 4.6 శాతం నుంచి 4.8 శాతానికి పెంపు. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) చైనా ఎకానమీ మందగమనాన్ని చూస్తుంది. ఒకవైపు తగ్గిన వినియోగం, తయారీ పెట్టుబడుల పెరుగుదల వంటి కీలక అంశాలు లాభాల మార్జిన్లపై ప్రభావం చూపుతాయి. -
ఈఎస్ఐసీ కిందకు 16.47 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కింద ఏప్రిల్ నెలలో 16.47 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసింది.ఇందులో 47.60 శాతం అంటే 7.84 లక్షల మంది వయసు 25 ఏళ్లలోపే ఉందని, కొత్త ఉద్యోగాల కల్పనను ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని కార్మిక శాఖ పేర్కొంది. మొత్తం కొత్త సభ్యుల్లో 3.38 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈఎస్ఐసీ కింద 53 మంది ట్రాన్స్జెండర్లు కూడా నమోదు చేసుకున్నారు.సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించడమే ఈ పథకం లక్ష్యంగా కార్మిక శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్లో 18,490 కొత్త సంస్థలు ఈఎస్ఐసీ కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వచ్చినట్టయింది. -
వణికిస్తున్న వాణిజ్యలోటు
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు–దిగుమతుల విలువల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఏప్రిల్లో ఆందోళన కలిగించింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, సమీక్షా నెల్లో ఎగుమతుల విలువ కేవలం ఒక శాతం పెరిగి (2023 ఇదే నెలతో పోల్చి) 35 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దిగుమతుల విలువ ఇదే కాలంలో 10.25 శాతం ఎగసి 54.09 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 19.1 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ⇒ ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, పెట్రోలియం ప్రొడక్టులు, ఫార్మా ఎగుమతులు బాగున్నాయి. ⇒ విలువైన మెటల్స్ దిగుమతులు రెట్టింపై 3.11 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ⇒ క్రూడ్ ఆయిల్ దిగుమతులు 20.22% పెరిగి 16.5 బిలియన్ డాలర్లుకు ఎగసింది. ⇒ 30 కీలక రంగాల్లో 13 వస్తు ఎగుమతుల్లో పెరుగుదలను నమోదుచేశాయి. వీటిలో కాఫీ, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, ప్లాస్టిక్, హస్తకళలు ఉన్నాయి.2023–24లో రికార్డు మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతుల మొత్తం విలువ 778.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఒక రికార్డు. ఇందులో వస్తు ఎగుమతులు 437.1 బిలియన్ డాలర్లు. సేవల ఎగుమతుల విలువ 341.1 బిలియన్ డాలర్లు. సేవలు ఇలా... తొలి అంచనాల ప్రకారం ఏప్రిల్లో సేవల ఎగుమతులు 29.57 బిలియన్ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 25.78 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 16.97 బిలియన్ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 13.96 బిలియన్ డాలర్లు. ఎగుమతుల వృద్ధి కొనసాగుతుంది.. అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరం కొంత సానుకూలంగానే ప్రారంభమైంది. ఎగుమతుల వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నాం. – సునిల్ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శి -
ఆహార ధరల తీవ్రత
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్ ఆరి్టకల్స్లో పాటు, విద్యుత్, క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్లో సూచీ 0.79 శాతం పెరిగింది. అధికారిక గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ⇒ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు మార్చిలో 6.88 శాతం పెరిగితే, ఏప్రిల్లో 7.74 శాతం ఎగశాయి. ఇదే కాలంలో కూరగాయల ధరలు 19.52 శాతం నుంచి 23.60 శాతానికి ఎగశాయి. ఆలూ ధరలు 52.96 శాతం నుంచి 71.97 శాతానికి పెరిగాయి. ఇక ఉల్లి ధరలు మార్చిలో 56.99% పెరిగితే, ఏప్రిల్లో 59.75 % ఎగశాయి. ⇒ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 1.38 శాతంగా ఉంది. మార్చిలో ఈ విభాగంలో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 0.77 శాతంగా (క్షీణత) నమోదైంది. ⇒సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం ఏప్రిల్లో పెరక్కపోగా, 0.42 శాతం క్షీణించింది. అయితే మార్చిలో ఈ క్షీణ రేటు 0.85 శాతం ఉండడం గమనార్హం. -
5% దిగువనే రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 5 శాతం దిగువనే కొనసాగింది. సూచీ సమీక్షానెల్లో 4.83 శాతంగా నమోదయ్యింది. మార్చిలో నమోదయిన 4.85 శాతంతో పోలి్చతే స్వల్పంగా తగ్గింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి. అయితే 2023 ఇదే నెలతో పోల్చితే (4.7 శాతం) అధికంగా ఉంది. నెలవారీగా చూస్తే, ఒక్క ఆహార ద్రవ్యోల్బణం 8.52 శాతం (2024 మార్చి) నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2తో 4 శాతంగా ఉండాలి. -
భారత్ సేవల రంగం నెమ్మది
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటినెల ఏప్రిల్లో నెమ్మదించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మార్చిలో 61.2 వద్ద ఉంటే, ఏప్రిల్లో 60.8కి తగ్గింది. అయితే ఈ స్థాయి కూడా 14 ఏళ్ల గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటం గమనార్హం. కాగా, ఈ సూచీ 50పై ఉంటే దానిని వృద్ధి బాటగా, దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం గమనార్హం. మరోవైపు తయారీ, సేవలు కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ మార్చిలో 61.8 ఉంటే, ఏప్రిల్లో 61.5కు తగ్గడం మరో అంశం. అయితే ఇది కూడా 14 సంవత్సరాల గరిష్ట స్థాయే కావడం గమనార్హం. -
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. -
పరిమిత శ్రేణి ట్రేడింగ్
ముంబై: పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఏప్రిల్లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు, ప్రోత్సాహకర తయారీ రంగ పీఎంఐ డేటా, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో 415 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 128 పాయింట్లు లాభపడి 74,611 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 74,361 వద్ద కనిష్టాన్ని 74,812 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ రోజంతా 22,568 – 22,711 పాయింట్ల మధ్య ట్రేడైంది. ఆఖరికి 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద నిలిచింది. యుటిలిటి, విద్యుత్ సరీ్వసెస్, ఆటో, మెటల్, కన్జూమర్, ఇంధన, ఫార్మా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది. ⇒ హ్యుందాయ్ గతేడాది ఏప్రిల్లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. ⇒ టాటా మోటార్స్ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి. -
చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ షురూ!
చార్ధామ్ యాత్రకు నేటి (సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ఓపెన్ కానుంది. దీంతోపాటు మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పర్యాటక శాఖ చార్ధామ్ రిజిస్ట్రేషన్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి చార్ధామ్ యాత్ర ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. తద్వారా వారు తమ ప్రయాణ ప్రణాళికలను తగిన విధంగా రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నంబర్, చిరునామాను జతచేయాలి. పర్యాటక శాఖ వెబ్సైట్ registrationandtouristcare.uk.gov.inకు లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 8394833833కు యాత్ర అని రాసి సందేశం పంపడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్లో పేరు నమోదు చేసుకునే అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 01351364కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. గత ఏడాది 74 లక్షల మంది యాత్రికులు చార్ధామ్ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 56 లక్షల మంది చార్ధామ్ను సందర్శించారు. ఈసారి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండవచ్చని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. -
ఏప్రిల్ 2న ఉత్తరాఖండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభ!
రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఏప్రిల్ 2న ఉత్తరాఖండ్లోని నైనిటాల్-ఉధమ్ సింగ్ నగర్ లోక్సభ నియోజకవర్గం రుద్రాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య కొఠారి ప్రధాని బహిరంగ సభ షెడ్యూల్ వివరాలను తెలియజేశారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రుద్రపూర్లో ప్రధాని బహిరంగ సభ ఉండనుంది. ఆ తర్వాత అదే రోజు జైపూర్ రూరల్లోనూ బహిరంగ సభ జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏప్రిల్ 3న పితోర్గఢ్, వికాస్నగర్లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్లోని ఐదు లోక్సభ స్థానాల్లో ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారధ్యం వహిస్తున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీలు కూడా బహిరంగసభలు నిర్వహించనున్నారు. -
ఏప్రిల్లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. చూశారా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి. ఏప్రిల్ 2024లో సెలవుల జాబితా ఏప్రిల్ 1 (సోమవారం): మిజోరాం, చండీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ కారణంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 5 (శుక్రవారం): బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు. జుమాత్-ఉల్-విదా కోసం తెలంగాణ, జమ్మూ మరియు శ్రీనగర్లలో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 9 (మంగళవారం): మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్మూలో గుఢి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 10 (బుధవారం): రంజాన్ ( కేరళలోని బ్యాంకులకు హాలిడే) ఏప్రిల్ 11 (గురువారం): చండీగఢ్, గ్యాంగ్టక్, కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం మినహా చాలా రాష్ట్రాల్లో రంజాన్ కారణంగా బ్యాంకులకు హాలిడే. ఏప్రిల్ 13 (శనివారం): అగర్తలా, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్లలో బోహాగ్ బిహు/చీరోబా/బైసాఖీ/బిజు ఫెస్టివల్ ఏప్రిల్ 15 (సోమవారం): గౌహతి, సిమ్లాలో బోహాగ్ బిహు/హిమాచల్ డే ఏప్రిల్ 17 (మంగళవారం): గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో శ్రీరామ నవమి ఏప్రిల్ 20 (శనివారం): అగర్తలాలో గరియా పూజ కోసం బ్యాంకులకు హాలిడే ఏప్రిల్ 21- ఆదివారం ఏప్రిల్ 27- నాలుగో శనివారం ఏప్రిల్ 28- ఆదివారం బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. -
అయోధ్యలో మరో ఉత్సవానికి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలోని రామాలయంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ఇప్పుడు మరో ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలరాముని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. అయోధ్యలో బాలరాముని పుట్టినరోజును ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రామాలయ తలుపులు సాధారణ భక్తుల దర్శనం కోసం ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటున్నాయి. అయితే బాలరాముని జన్మదిత్సవాన్ని పురస్కరించుకుని దర్శన సమయాన్ని పెంచనున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ మీడియాకు తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్–జి (పెన్సిలిన్) ప్లాంటు ఏప్రిల్లో ట్రయల్ రన్కు సిద్ధం అయింది. జూన్లోగా వాణిజ్యపరంగా తయారీ కార్యకలాపాలు మొదలవుతాయని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. పెన్సిలిన్–జి ధర విషయంలో చైనాతో పోటీపడాలన్నది తమ లక్ష్యం అని చెప్పారు. పూర్తిగా దేశీయంగా పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. ఏటా 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,400 కోట్లు వెచి్చస్తోంది. ఈ ప్లాంటు జూలై–సెపె్టంబర్ కాలంలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోనుంది. 80–90 శాతం పెన్సిలిన్ను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద పెన్సిలిన్ ప్లాంటు ఆమోదం పొందింది. మరో రూ.1,000 కోట్లు.. అరబిందో ఫార్మా 8–10 ప్లాంట్ల ఏర్పాటుకు గడిచిన మూడు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు ఖర్చు చేసింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి చేయనుంది. చైనాలో ఏర్పాటు చేస్తున్న ఓరల్ సాలిడ్స్ తయారీ ప్లాంటులో వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంస్థ సీఎఫ్వో శాంతారామ్ సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరబిందో టర్నోవర్ 3.4–3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాగా పేర్కొన్నారు. డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలంలో టర్నోవర్ 2.6 బిలియన్ డాలర్లు నమోదైంది. అరబిందో ప్రస్తుతం అంటువ్యాధుల విభాగంలో ఐదు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైంది. సంస్థ ఖాతాలో 25 తయారీ, ప్యాకింగ్ కేంద్రాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న 10 ప్లాంట్లు ఒకట్రెండేళ్లలో కార్యరూపం దాల్చనున్నాయి. -
మాఘమాసం.. మంచి ముహూర్తం!
మాఘం...శుభ ముహూర్తాల మాసం. అందుకే అందరూ ఈ మాసం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండగా.. జిల్లాలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్యాణ మంటపాల వద్ద సందడి కనిపిస్తోంది. హిందూపురం అర్బన్: వివాహం... ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన వేడుక. అందుకే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు. పిల్లల తల్లిదండ్రులైతే మంచి ముహూర్తంలో మూడుముళ్లు వేయించాలని భావిస్తుంటారు. అందుకోసం అవసరమైతే నెలల తరబడి వేచి చూస్తుంటారు. మిగతా మాసాలు ఎలా ఉన్నా మాఘమాసం మాత్రం మంచి ముహూర్తాలను మోసుకువస్తుంది. అందుకే అందరూ ఎదురుచూస్తుంటారు. ఈ నెల 11 నుంచి క్రోదనామ సంవత్సర చైత్రమాసం వరకు (ఏప్రిల్ 26) మూడు నెలల పాటు 30 మాత్రమే వివాహ ముహూర్తాలున్నాయి. తర్వాత శ్రావణ మాసం(ఆగస్టు)లోనే తిరిగి వివాహాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. అన్నింటికీ డిమాండ్.. ఈ మాఘ మాసంలో జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ మేరకు ఆయా కుటుంబాలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 13న మంచి ముహూర్తం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా భారీగా స్థాయిలో వివాహాలు జరగనున్నాయి. సుమారు రెండు నెలల తరువాత మంచి ముహూర్తాలు వస్తుండటంతో ఇప్పటికే కల్యాణ మంటపాలన్నీ ఫుల్ అయ్యాయి. ప్రముఖ దేవాలయాల వద్ద పెళ్లి సందడి కనిపిస్తోంది. ఇక బంగారం, దుస్తుల దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. పురోహితులు, కేటరింగ్, సన్నాయి మేళం, డెకరేషన్స్, సప్లయర్స్కు గిరాకీ పెరిగింది. ప్రధానంగా హిందూపురం, కదిరి, ధర్మవరం ఇలా ప్రధాన పట్టణాలతో పాటు, అక్కడి దేవాలయాల ప్రాంగణాల్లో ఎక్కువ పెళ్లిల్లు జరగనున్నాయి. వివాహ సముహూర్తాలు ఇవే.. మాఘమాసం : ఫిబ్రవరి 13, 14, 17, 18, 24, 28, 29, మార్చి నెల 2, 3 తేదీలు. పాల్గుణం: మార్చి 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30 తేదీలు, ఏప్రిల్ 3, 4 తేదీలు. చైత్రం: ఏప్రిల్ 9, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీలు. ఏప్రిల్ వరకూ ముహూర్తాలు ఫిబ్రవరి 2 ఆదివారం మొదలు మంచి ముహూర్తాలు. కానీ మాఘమాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. మాఘమాసం ప్రారంభం నుంచి ఏప్రిల్ 26 వరకు మంచి ముహూర్తాలున్నాయి. అవి దాటితే మళ్లీ ఆగస్టులోనే. ఉపనయనాలు, వివాహాలు, గృహ ప్రవేశాలకు ఇదే మంచి తరుణం. – సునీల్శర్మ, పండితులు, హిందూపురం. -
సవాళ్లున్నా... 6.2 శాతం వృద్ధి!
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.2 శాతం పురోగమిస్తుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ నివేదిక పేర్కొంది. విదేశీ ఒత్తిడులు, గృహ రుణ స్థాయిలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయిలో (జీడీపీలో 5.8 శాతం) ఉన్నప్పటికీ సానుకూల పాలసీ విధానాలు, రుణ వృద్ధి, తగిన స్థాయిల్లో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు దేశం 2024–25లో 6.2 శాతం వృద్ధి బాటన నడవడానికి దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక ఆవిష్కరణ సందర్భంగా యుబీఎస్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. నివేదికలోని అంశాల్లో కొన్ని... ► 2023–24లో 6.3 శాతం వృద్ధి అంచనా. 2024–25లో 6.2 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. వినియోగ రంగంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి (2023–24 అంచనా), 4.7 శాతానికి మెరుగుపడే వీలుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం మూలధన మరింత విస్తృత ప్రాతిపదికన మెరుగుపడే వీలుంది. ఎన్నికల ముందు నెమ్మదించే అవకాశం ఉన్న ఈ విభాగం, ఎన్నికల అనంతరం వేగం పుంజుకునే వీలుంది. ► 2025–26 నుంచి 2029–30 మధ్య వార్షికంగా భారత్ 6.5 శాతం పురోగమించవచ్చు. 2030లో దేశం 6 ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ► డిజిటలైజేషన్, సేవల ఎగుమతుల పురోగతి, తయారీ రంగం పటిష్టత ఎకానమీకి దన్నుగా నిలుస్తాయి. ► 2024–25లో రుణ వృద్ధి 13 నుంచి 14 శాతం ఉండే వీలుంది. ► దేశంలో తిరిగి మోదీ ప్రభుత్వమే అధికారంలోని వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే రాజకీయ స్థిరత్వం విధాన నిర్ణయాల కొనసాగింపునకు తద్వారా వివిధ రంగాల పురోగతికి దోహదపడే అంశాలు. ► 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 5.4 శాతం, 2024–25లో 4.8 శాతం నమోదయ్యే వీలుంది. సరఫరాల పరిస్థితి మెరుగుపడ్డం ఈ అంచనాలకు కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశాల ప్రకారం– 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను చేరుకోడానికి దీర్ఘకాలం పట్టే వీలుంది. 4 ట్రిలియన్ డాలర్లకు ఎకానమీ: పీహెచ్డీసీసీఐ భారత్ ఎకానమీ విలువ 2024–25లో 4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్డీసీసీఐ ఒక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేíÙంచింది. 2024 ముగిసే సరికి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ప్రస్తుతం 6.5 శాతం నుంచి 5.5 శాతం వరకూ తగ్గించే వీలుందని కూడా ఇండస్ట్రీ చాంబర్ విశ్లేíÙంచింది. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటూ దూసుకుపోతున్న భారత్– 2047 నాటికి ‘వికసిత భారత్ ఎకానమీ’ లక్ష్యాలను చేరుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2024లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 4.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది. వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్స్టైల్, దుస్తులు, ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎల్రక్టానిక్స్, ఫిన్టెక్ సహా వృద్ధికి ఆశాజనకంగా ఉన్న పలు రంగాలను కూడా ఇండస్ట్రీ సంస్థ గుర్తించింది. నాలుగు విభిన్న కాల వ్యవధులను విశ్లేషణకోసం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కరోనా ముందస్తు సంవత్సరాలు(2018, 2019), కరోనా పీడిత సంవత్సరాలు (2020, 2021), కరోనా తర్వాతి సంవత్సరాలు (2022,2023) భవిష్యత్ అవుట్లుక్ సంవత్సరాలుగా(2024,2025) వీటిని విభజించింది. ఈ నాలుగు కాలాల్లో లీడ్ ఎకనామిక్ ఇండికేటర్స్ ర్యాంకింగ్ను గమనించినట్లు ఇండస్ట్రీ బాడీ పీహెచ్డీసీసీఐ తెలిపింది. -
ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడుల దన్ను!
న్యూఢిల్లీ: పటిష్ట ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో ఏప్రిల్తో ప్రారంభమైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ సోమవారం వెల్లడించింది. కొన్ని సవాళ్లతో కూడిన అంశాలు నెలకొన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుంది. ఏదైనా ప్రతికూలతలు ఎదురయితే 6 శాతానికి తగ్గవచ్చు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా అనిశ్చితి కొనసాగడం, చైనాలో వృద్ధి మందగించడం, కఠిన ద్రవ్య విధానం, సాధారణ రుతుపవనాల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వృద్ధికి ప్రతికూలతలు. ► మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శా తం వాటా ఉన్న వ్యవసాయ రంగం, అనుబంధ కార్యకలాపాల విషయంలో వృద్ధి రేటు 2.7 శా తంగా ఉంటుంది. అయితే 2022–23తో పోలి్చ తే (4 శాతం) ఈ వృద్ధి రేటు తగ్గుతుందని సర్వే వెల్లడిస్తోంది. ఎల్ నినో ప్రభావం దీనికి కారణం. ► జీడీపీలో మరో 15 శాతం వాటా ఉన్న పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. ► ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండే వీలుంది. ► 2023 సెపె్టంబర్లో సర్వే జరిగింది. పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ► మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ–మూడవ త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.1 శాతం, 6 శాతాలకు తగ్గవచ్చు. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023–24లో సగటున 5.5 శాతంగా నమోదయ్యే వీలుంది. కనిష్టంగా 5.3 శాతం, గరిష్టంగా 5.7 శాతంగా ఉండవచ్చు. ద్రవ్యోల్బణం గమనం అనిశ్చితంగానే ఉందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ప్లస్ 2, మైనస్ 2తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ పాలసీ అంచనావేస్తోంది. ► తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగవచ్చు. 2024 వరకూ ఇదే ధోరణి నెలకొనే అవకాశం ఉంది. అయితే భారత్ ఎకానమీ ఈ సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది. భారత్ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం తప్పదు. 2024–25 ప్రారంభంలో పావుశాతం రేటు కోత 2024 మార్చి వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగే వీలుందని ఫిక్కీ సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25)మొదటి లేదా రెండవ త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్బీఐ పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేíÙంచింది. ఉక్రేయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల మొదట్లో జరిగిన సమీక్షసహా గడచిన మూడు ద్రవ్య పరపతి విధాన సమక్షా సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి పెద్ద మరింత ఊరటనిస్తూ, మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి దిగివచి్చంది. అయితే ద్రవ్యోల్బణం పట్ల ఆర్బీఐ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 2–4 ఆర్బీఐ లక్ష్యం అని కూడా ఆయన ఇటీవలి పాలసీ సమీక్షలో ఉద్ఘాటించారు. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
ఎన్బీఎఫ్సీలు అవుట్లుక్ మరింత మెరుగు: ఐసీఆర్ఏ
నాన్–బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ–రిటైల్) హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ–రిటైల్) రుణాలు ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తన అవుట్లుక్ను ఎగువముఖంగా సవరించింది. ఎన్బీఎఫ్సీల నిర్వహణలోని రిటైల్ రుణాలు (ఏయూఎం) 2023 మార్చి నాటికి రూ.14 లక్షల కోట్లు ఉంటే, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది 18 నుంచి 20 శాతం పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 12 నుంచి 14 శాతంగా ఉంది. ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల రిటైల్ రుణాలు 2023 మార్చి నాటికి రూ.7లక్షల కోట్లయితే, 2023–24లో 12 నుంచి 14 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 11 నుంచి 13 శాతం. ఇక మౌలిక రంగానికి సంబంధించి మొత్తం ఎన్బీఎఫ్సీల రుణాలు మార్చి 2023 నాటికి రూ.40 లక్షల కోట్లయితే, ఈ విభాగంలో 2023–24లో క్రితం అంచనాల (10 నుంచి 12 శాతం)కన్నా అధికంగా 13 నుంచి 15 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. -
ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే!
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది ఏప్రిల్లో నికరంగా 17.20 లక్షల మంది సభ్యులు చేరారు. చేరిన మొత్తం ఈ సభ్యుల్లో కొత్త సభ్యుల సంఖ్య 8.47 లక్షలు. ఈ మేరకు విడుదలైన పేరోల్ డేటా ప్రకారం.. 8.47 లక్షల మంది కొత్త సభ్యుల్లో 54.15 శాతం మంది 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు. అంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో మెజారిటీ సభ్యులకు సంఘటిత రంగంలో స్థానం లభించిందన్నమాట. మొత్తం 17.20 లక్షల మందిని తీసుకుంటే, 2023 మార్చితో పోల్చితే (13.40 లక్షల మంది) వీరి సంఖ్య పెరిగింది. ఇక ఏప్రిల్లో రీజాయినర్స్ ఎన్రోల్ అయిన నికర మహిళా సభ్యుల సంఖ్య ఏప్రిల్లో 3.48 లక్షలుకాగా, మార్చిలో వీరి సంఖ్య 2.57 లక్షలు. కొత్త సభ్యులను మాత్రమే తీసుకుంటే 8.47 లక్షల మందిలో 2.25 లక్షల మంది మహిళలు. ఏప్రిల్లో చేరిన నికర సభ్యుల్లో మెజారిటీ (59.20 శాతం మంది) వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీలకు చెందినవారు ఉన్నారు. తయారీ, ఐటీ సంబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాతి స్థానాల్లో ఎలక్ట్రికల్, మెకానికల్, జనరల్ ఇంజనీరింగ్, వాణిజ్య సంబంధ సంస్థలు, దుస్తులు, నిర్మాణం, ఎగుమతుల సేవా రంగాలు ఉన్నాయి. 7 కోట్లకుపైగా సభ్యత్వం.. ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 7 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఈపీఎఫ్ఓ ఇటీవలే ఆమోదముద్ర వేసింది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసు కుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీ ఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) ఈఎస్ఐసీ కిందకు కొత్తగా 17.88 లక్షల మంది ఏప్రిల్ నెలలో చేరిక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కిందకు ఏప్రిల్ నెలలో కొత్తగా 17.88 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈఎస్ఐ అనే సామాజిక భద్రతా బీమా పథకాన్ని ఈఎస్ఐసీ నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ కింద 3 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. ఈఎస్ఐసీ కింద కొత్తగా 30,249 సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయి. (ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు) ఏప్రిల్లో కొత్తగా 17.88 లక్షల మందికి ఉపాధి లభించినట్టు కార్మిక శాఖ తెలిపింది. వీరిలో 8.37 లక్షల మంది సభ్యులు 25 ఏళ్లలోపు వారేనని పేర్కొంది. నికరంగా 3.53 లక్షల మంది మహిళా సభ్యులున్నట్టు తెలిపింది. అంతేకాదు, ట్రాన్స్జెండర్ కేటగిరీ నుంచి 63 మంది సభ్యులుగా చేరారు. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
మే నెలలో నియామకాలు ఓకే
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) మే నెలలో 2,849గా ఉన్నాయి. 2023 ఏప్రిల్ నెల నియామకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, 2022 మే నెలలో నియామకాలు 2,863తో పోల్చినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్గా నియామకాలు ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో నియామకాల ధోరణలు భిన్నంగా ఉన్నట్టు పేర్కొంది. ఆయిల్ అండ్ గ్యాస్తోపాటు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఈ ఏడాది మే నెలలో నియామకాల్లో వృద్ధిని ముందుండి నడిపించాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఏకంగా 31 శాతం పెరిగాయి. అదే ఐటీ రంగంలో నియామకాలు 2022 మే నెలతో పోల్చినప్పుడు 23 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యం పెరగడం, రిఫైనరీల విస్తరతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అధిక నియామకాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అంతకుముందు నెలల్లో ఈ రంగంలో నియామకాల్లో వృద్ధి 10–20 శాతం మించకపోవడం గమనార్హం. ► రియల్ ఎస్టేట్లో 22 శాతం, బ్యాంకింగ్లో 14 శాతం అధికంగా నియామకాలు నమోదయ్యాయి. రియల్టీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్, సైట్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు.. బ్యాంకింగ్లో రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్లకు డిమాండ్ నెలకొంది. ► ప్రొడక్షన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్వాలిటీ ఆడిటర్లకు డిమాండ్ ఏర్పడింది. ► హైదరాబాద్, చెన్నై, పుణె నగరాల్లో మధ్య స్థాయి, సీనియర్ ఉద్యోగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ► నియామకాలకు నాన్ మెట్రోలు కొత్త కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. అహ్మదాబాద్లో 26 శాతం, వదోదరలో 22 శాతం, జైపూర్లో 17 శాతం చొప్పున అధిక నియామకాలు (క్రితం ఏడాది మే నెలతో పోల్చినప్పుడు) జరిగాయి. ఇక్కడ బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు వృద్ధికి మద్దతుగా నిలిచాయి. ► పెద్ద మెట్రోల్లో నియామకాల పరంగా ఫ్లాట్ లేదా క్షీణత నమోదైంది. పెద్ద మెట్రోల్లో ముంబై, ఢిల్లీలో మాత్రం 5 శాతం వృద్ధి కనిపించింది. రియల్ ఎస్టేట్, టెలికం, హెల్త్కేర్, ఆటోమొబైల్ ఇక్కడ వృద్దికి దోహదపడ్డాయి. ► సీనియర్లకు అధిక డిమాండ్ నెలకొంది. 13–16 ఏళ్లు, అంతకుమించి సర్వీసు ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చాయి. ► ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో సీనియర్లకు నియామకాల పరంగా ప్రాధాన్యం నెలకొంది. ఇన్సూరెన్స్, హెల్త్కేర్ ఫ్రెషర్లకు అవకాశాలు ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఫ్రెషర్లకు నియామకాల్లో 7 శాతం క్షీణత నమోదైంది. -
మందగించిన మౌలిక రంగాల వృద్ధి..
న్యూఢిల్లీ: క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించడంతో ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఏప్రిల్లో 3.5 శాతానికి పరిమితమైంది. ఇది ఆరు నెలల కనిష్టం. 2022 అక్టోబర్లో చివరిసారిగా ఇన్ఫ్రా వృద్ధి 0.7 శాతంగా నమోదైంది. 2022 ఏప్రిల్లో మౌలిక రంగాల వృద్ధి 9.5 శాతంగా ఉండగా, ఈ ఏడాది మార్చిలో 3.6 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్నకు 40.27 శాతం వెయిటేజీ ఉంటుంది. -
ఏప్రిల్లో ఆన్లైన్ హైరింగ్ తగ్గింది
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ నియామకాలు ఏప్రిల్లో తగ్గాయని ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. 2022 ఏప్రిల్తో పోలిస్తే గత నెలలో ఇది 6 శాతం క్షీణత నమోదైందని వివరించింది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ స్టార్టప్స్లో హైరింగ్ పెరిగిందని తెలిపింది. ‘ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు వ్యాపారాలకు సవాలుతో కూడిన వాతావరణాన్ని సృష్టించాయి. నియామకా లు తగ్గినప్పటికీ ఉద్యోగార్థులకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు పుష్క లంగా ఉన్నాయి. భారత స్టార్టప్ వ్యవస్థ ఒక మలుపు తీసుకుంది. జాబ్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నియామకాల విషయంలో మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది’ అని తెలిపింది. టాప్–5లో ఎడ్టెక్.. ఉద్యోగావకాశాల పట్ల జాగ్రత్తతో కూడిన సెంటిమెంట్లు కొనసాగుతాయని ఆశిస్తున్నప్పటికీ, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి స్టార్టప్లు ప్రతిభ, ఆవిష్కరణల కోసం డిమాండ్ను పెంచుతూనే ఉన్నాయి. స్టార్టప్ నియామకాల్లో టాప్–5 రంగాల్లో ఎడ్టెక్ ఉంది. బీఎఫ్ఎస్ఐ/ఫిన్టెక్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర విభాగాలు కూడా స్టార్టప్ హైరింగ్లో గణనీయ డిమాండ్ను కలిగి ఉన్నాయి. ఆరోగ్య సేవలు, బీపీవో విభాగాలు తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. స్టార్టప్స్ హైరింగ్లో 33 శాతం వాటాతో బెంగళూరు టాప్లో నిలిచింది. ఢిల్లీ, ముంబై, పుణే సైతం మెరుగైన ప్రతిభ కనబరిచాయి. జోరుగా రిటైల్ రంగం.. రిటైల్ రంగం 22% వృద్ధి నమోదు చేసింది. ఈ రంగం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ వృద్ధికి ఈ–కామర్స్ గణనీయంగా దోహదపడింది. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్లకు వేదికైంది. ఈ విస్తరణ రిటైల్ ఔట్లెట్లలో నిపుణులకు డిమాండ్ను పెంచింది. ఉద్యోగార్థులకు పుష్కలమైన అవకాశాలను రిటైల్ రంగం కల్పిస్తోంది. ఇతర విభాగాల్లో ఇలా.. ట్రావెల్, టూరిజం విభాగం 19 శాతం, టెలికం 14, ఎన్జీవో, సోషల్ సర్వీస్ 11, ప్రకటనలు, మార్కెట్ పరిశోధన, పబ్లిక్ రిలేషన్స్ 7, చమురు, వాయువు 3, షిప్పింగ్, మెరైన్లో హైరింగ్ 2 శాతం ఎగసింది. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫామ్స్పై ఆధారపడటం పెరుగుతున్న కారణంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. బీఎఫ్ఎస్ఐ 4 శాతం, బీపీవో, ఐటీఈఎస్ విభాగంలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. ఆరోగ్య సేవలు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ 16, ఐటీ–హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విభాగాలలో 22 శాతం తిరోగమన వృద్ధి నమోదైందని నివేదిక వివరించింది. -
తగ్గేదేలే అంటున్న మారుతి సుజుకి - గత నెల అమ్మకాలు ఇలా!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి గత కొంతకాలంగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు 2023 ఏప్రిల్ నెల అమ్మకాల నివేదికను కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1,60,529 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 1,39,519 యూనిట్లు కాగా.. 16,971 యూనిట్లు ఎగుమతులుగా నమోదయ్యాయి. అయితే ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 1,50,661 యూనిట్లు. మినీ సెగ్మెంట్ విభాగంలో మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. వీటి మొత్తం అమ్మకాలు 14,110 యూనిట్లు. ఇక కాంపాక్ట్ సెగ్మెంట్ విభాగంలో బాలెనొ, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటివి ముందంజలో ఉన్నాయి. ఈ కార్ల అమ్మకాలు 89,045 యూనిట్లు. ఇక ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో సియాజ్ 1,017 యూనిట్ల అమ్మకాలను పొందింది. (ఇదీ చదవండి: మార్కెట్లో 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' స్మార్ట్వాచ్ లాంచ్ - ధర ఎంతంటే?) మారుతి సుజుకి యుటిలిటీ వెహికల్స్ సేల్స్ లో బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. ఈ కార్ల అమ్మకాలు ఏకంగా 90,062 యూనిట్లు. మొత్తం మీద మారుతి సుజుకి అమ్మకాలు గత నెలలో కూడా మంచి స్థాయిలో పెరిగాయి, రానున్న రోజుల్లో కూడా మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
గత నెలలో పుంజుకున్న గ్లోబల్ సేల్స్!
న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్ల వృద్ధి, ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దేశీయంగా తయారీ కార్యకలాపాలు ఏప్రిల్లో పుంజుకున్నాయి. నాలుగు నెలల గరిష్టానికి చేరాయి. ఇందుకు సంబంధించిన పీఎంఐ సూచీ (ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) మార్చిలో 56.4 పాయింట్లు ఉండగా ఏప్రిల్లో 57.2 పాయింట్లకు పెరిగింది. సూచీ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దానికి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. అంతర్జాతీయంగా అమ్మకాలు పెరుగుతుండటం, సరఫరా వ్యవస్థపరమైన పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటివి కూడా ఇందుకు దోహదపడినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోల్యానా డి లిమా తెలిపారు. దీనికి సంబంధించిన సర్వే ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఉత్పత్తి వృద్ధి రేటు పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరిగిందని, తగ్గిపోయే నిల్వలను భర్తీ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలు కూడా మరింతగా ముడి సరుకులను కొనుగోలు చేస్తున్నాయని లిమా వివరించారు. భారతీయ తయారీ సంస్థలు ముందుకు దూసుకెళ్లడానికి పుష్కలమైన అవకాశాలు కనిపిస్తున్నాయని లిమా పేర్కొన్నారు. మార్కెట్లో సానుకూల పరిస్థితులు, డిమాండ్ మెరుగ్గా ఉండటం వంటి అంశాలు కొత్త ఆర్డర్లకు దోహదపడుతున్నాయని చెప్పారు. -
ఏప్రిల్లో ఇంధన అమ్మకాలు పెరగటానికి కారణం ఇదే!
న్యూఢిల్లీ: రబీ పంటల కోత పనులు ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వంటి అంశాల దన్నుతో ఏప్రిల్లో ఇంధనాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే డీజిల్ అమ్మకాలు 6.7% పెరిగి 7.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే మార్చితో పోల్చినప్పుడు 4.8% వృద్ధి నమోదైంది. సోమవారం వెలువడిన గణాంకాల ప్రకారం.. పెట్రోల్ అమ్మకాలు ఏప్రిల్లో వార్షికంగా 2.5% పెరిగి 2.64 మిలియన్ టన్నులకు చేరగా, నెలవారీగా మాత్రం స్వల్పంగా 0.5% మేర తగ్గాయి. రబీ పంటల కోతకు ట్రాక్టర్లను ఉపయోగిస్తుండటం వల్ల డీజిల్ వినియోగం పెరుగుతుంది. -
ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్వో ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారం ప్రధానంగా రెండు అంశాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెల డెరివేటివ్ సిరీస్ గడువు గురువారం(27న) ముగియనుంది. అంటే ఏప్రిల్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు తీరనుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మే నెలకు రోలోవర్ చేసుకునే అవకాశముంది. మరోపక్క ఇప్పటికే ప్రారంభమైన క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాల సీజన్ ఊపందుకోనుంది. గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసిక ఫలితాలతోపాటు.. పూర్తి ఏడాది పనితీరును సైతం దేశీ కార్పొరేట్ దిగ్గజాలు వరుస గా వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ప్రకటించగా.. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్ వారాంతాన పనితీరును వెల్లడించాయి. దీంతో సోమవారం(24న) రిలయ న్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లపై ఫలి తాల ప్రభావం కనిపించనున్నట్లు మార్కెట్ నిపుణు లు తెలియజేశారు. వెరసి మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫలితాల జోరు ఈ వారం మరిన్ని కంపెనీలు గతేడాది చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ నెల 24న, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్ ప్రొడక్టŠస్ 25న, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ టవర్స్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, మారుతీ సుజుకీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 26న ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు ఏసీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎల్టీఐ మైండ్ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో 27న, ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, అల్ట్రాటెక్ సిమెంట్ 28న క్యూ4తోపాటు.. పూర్తి ఏడాదికి పనితీరును తెలియజేయనున్నాయి. ఇతర అంశాలూ కీలకమే నెలల తరబడి రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొ నసాగుతుండటం, అమెరికా, యూరప్లలో బ్యాంకింగ్ ఆందోళనలు, ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు వంటి అంశాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్ దేశీయంగానూ ప్రభావం చూపనుంది. దీనికితోడు ఇటీవల డాలరుకు పోటీ గా చైనా యువాన్ తదితర కరెన్సీలపై పలు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి కొంతమేర రికవరీ సాధించినప్పటికీ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముడిచమురు ధరలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విదేశీ అంశాలకూ ప్రాధాన్యం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగల విదేశీ అంశాల విషయానికి వస్తే.. మార్చి నెలకు మన్నికైన వస్తువుల ఆర్డర్ల గణాంకాలను ఈ నెల 26న యూఎస్ విడుదల చేయనుంది. మార్చి నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 27న వెల్లడికానున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) వడ్డీ రేట్లపై నిర్ణయాలను 28న ప్రకటించనుంది. ఇప్పటికే అనుసరిస్తున్న సరళతర విధానాలనే బీవోజే మరోసారి అవలంబించే వీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారమిలా.. ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు నామమాత్రంగా బలపడ్డాయి. గత వారం సెన్సెక్స్ 776 పాయింట్లు క్షీణించి 59,655 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 204 పాయింట్లు తక్కువగా 17,624 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం లాభంతో 24,845 వద్ద, స్మాల్ క్యాప్ 0.3 శాతం పుంజుకుని 28,234 వద్ద నిలిచాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు దేశీ మార్కెట్లను ప్రభావితం చేయగల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కొత్త ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల(ఏప్రిల్)లో ఇప్పటివరకూ నికరంగా రూ. 8,643 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత నెల(మార్చి)లోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రధానంగా అదానీ గ్రూప్ కంపెనీలలో యూఎస్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ రూ. 7,936 కోట్లు ఇన్వెస్ట్ చేయడం దోహదపడింది. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్పీఐలు ఫైనాన్షియల్ రంగ స్టాక్స్లో రూ. 4,410 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! అయితే గతేడాది(2022–23) ఎఫ్పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 37,631 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితులు వంటి అంశాలు ప్రభావం చూపాయి. -
ఎగుమతులు 900 బిలియన్ డాలర్ల పైనే..!
న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల ఎగుమతులు ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 900 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని ఎగుమతిదారులు అంచనావేస్తున్నారు. అమెరికాసహా కీలక ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువులకు పటిష్ట డిమాండ్, అలాగే వాణిజ్య ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు దోహదపడతాయన్నది వారి విశ్లేషణ. రష్యా వంటి ఇతర దేశాల్లో డిమాండ్ కూడా భారత్ ఎగుమతులకు దోహదపడే అంశమని వారు పేర్కొంటున్నారు. ఆయా దేశాలకు ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో భారీ ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2023–24లో 500 నుంచి 510 బిలియన్ డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరిగే అవకాశం ఉందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. దీనితోపాటు సేవల ఎగుమతులు సైతం 2022–23తో పోల్చితే (322.72 బిలియన్ డాలర్లు) భారీగా 390 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతులు 422 బిలియన్ డాలర్లు ఉంటే, 2022–23లో 6 శాతం పెరిగి 447.5 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అంచనాలు ఇలా... ► అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం... ఎగుమతులకు సంబంధించి లావాదేవీల వ్యయాలను తగ్గిస్తుంది. ► పర్యాటకం, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది. ► కరోనా అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగు తున్న డిమాండ్ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు. ► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి. ► ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది. ► ఎగుమతుల పురోగతే లక్ష్యంగా దేశం ఇటీవల ఆవిష్కరించిన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ను ఈ రంగంలో వృద్ధి బాటన నడుపుతుంది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీ దోహదపడుతుందన్న విశ్వాసం ఉంది. ► వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రో త్సాహకాలు అవసరం ఎంతైనా ఉంది. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్లు చాలా బాగా పని చేస్తాయి. మిగిలిన రంగాలకూ తగిన సహాయ సహకారాలు అందాలి. ఎఫ్టీఏల దన్ను... వస్తు, సేవల ఎగుమతులు రెండూ కలిసి 2023–24లో విలువ 900 బిలియన్ డాలర్లుగా ఉండే వీలుంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఆ మార్కెట్లలో ఎగుమతులను పెంచడానికి భారీ వేదికను అందిస్తాయి. ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎందుకంటే ప్రోత్సా హకాల కారణంగా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. – అజయ్ సహాయ్, ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ ఆర్డర్ బుక్ పటిష్టం అమెరికా ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న సంకేతాలు ఉన్నాయి. భారత్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 18 శాతం. ఎగుమతులకు సంబంధించి ఆర్డర్ బుక్ బాగుంది. ఇదే ట్రెండ్ 2023–24 అంతా కొనసాగుతుందని భావిస్తున్నాం. దీనితో వస్తు ఎగుమతులు 500 బిలియన్ డాలర్లు దాటతాయని భావిస్తున్నాం. – ఎస్సి రాల్హాన్, హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుద్ధ ప్రభావం తగ్గుతోంది 2022–23 కంటే 2023–24 ఆర్థిక సంవత్సరం ఎగుమతులుకు బాగుంటుందని భావిస్తున్నాం. మన పరిశ్రమపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తగ్గిపోతోంది. ఎందుకంటే వాణిజ్యం–ఇంధన వనరులకు పరిశ్రమ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. భారతదేశంలో మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదల ఉంది. అది ఎగుమతిదారులకు గట్టి మద్దతునిస్తుంది. – శారదా కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ 2022–23కంటే బెటర్... గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు పటిష్టంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా... కార్మికరంగం ఆవశ్యకత ఉన్న రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎగుమతులకు దోహపదడే అంశాల్లో ఒకటి. – ఖలీద్ ఖాన్, జికో ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ -
భారత్ వృద్ధి రేటు 5.9 శాతమే!
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో (2023–24) 5.9 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అంచనావేసింది. ఈ మేరకు క్రితం 6.1 శాతం అంచనాలకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. అయితే 5.9 శాతం వృద్ధి సాధించినప్పటికీ, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును కనబరుస్తుందని అభిప్రాయపడింది. కాగా, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రపంచ వార్షిక ఎకనమిక్ అవుట్లుక్ అంచనావేస్తోంది. 2024–25లో భారత్ వృద్ధి రేటు అంచనాలను సైతం క్రితం (జనవరిలో) 6.8 శాతం అంచనాల నుంచి అవుట్లుక్ 6.3 శాతానికి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా భారత్ వృద్ధికి సంబంధించి ఐఎంఎఫ్ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. 2022–23లో 7 శాతం, 2023–24లో 6.4 శాతం వృద్ధిని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2022–23 భారత్ జీడీపీ అధికారిక గణాంకాలు వెలువడాల్సి ఉంది. నివేదికలో మరికొన్ని అంశాలు చూస్తే... ► 2023లో చైనా వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంటుంది. 2024లో ఈ రేటు 4.5 శాతానికి తగ్గుతుంది. అయితే 2022లో నమోదయిన 3 శాతం వృద్ధిరేటు కన్నా తాజా అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. ► మహమ్మారి, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లే కనబడుతోంది. చైనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. సరఫరాల సమస్యలు తొలుగుతున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానమే వృద్ధికి ప్రతికూలతలు సృష్టించవచ్చు. ► ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో 2.8 శాతంగా నమోదుకావచ్చు. 2024లో ఈ రేటు 3 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నాం. ► 2022లో 8.7 శాతంగా ఉన్న గ్లోబల్ ఇన్ఫ్లెషన్ (అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం) 2023లో 7 శాతానికి, 2024లో 4.9 శాతానికి తగ్గవచ్చు. ► యూరోజోన్, బ్రిటన్లు మందగమనం అంచన నిలబడ్డాయి. యూరోజోన్లో 2023లో కేవలం 0.8 శాతం వృద్ది నమోదయ్యే అవకాశం ఉంది. బ్రిటన్లో అసలు వృద్ధిలేకపోగా 0.3 శాతం క్షీణత నమోదుకావచ్చు. అయితే 2024లో ఈ రేట్లు వరుసగా 1.4 శాతం, 1 శాతం వృద్ధి బాటకు మళ్లవచ్చు. -
Fact Check: ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో భారీ భూకంపం?
న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మార్చి 21న అఫ్గనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో 187 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.5 గా నమోదైంది. భూకంపం దాటికి ప్రజలు ఆందోళనకు గురై. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే తాజాగా ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో మరోసారి భారీ భూకంపం రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో దేశ రాజధానిలో రిక్టర్ స్కేల్పై 9.8 తీవ్రతతో భూకంపం సంభవించనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని జాతీయ మీడియా సంస్థ (timesnow) ఫ్యాక్ట్ చెక్ చేయగా వీటిని అసత్య ప్రచారాలుగా తేల్చింది. ఏప్రిల్లో ఢిల్లీలో భూకంపం చోటు చేసుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. అదంతా ఫేక్ అని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. మార్చి 21న ఢిల్లీతోపాటు పాకిస్తాన్, అఫ్గనిస్తాన్లో పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదైంది. భూకంపం ధాటికి కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి, కొండచరియలు విరిగిపడ్డాయి. పాక్లో భూకంపం ధాటికి ఇద్దరు మహిళలు సహా 9 మంది ప్రాణాలు కోల్పోగా 160 మందికిపైగా గాయపడ్డారు. అఫ్గనిస్తాన్ ఈశాన్య లాగ్మాన్ ప్రావిన్స్లో ఇద్దరు మరణించగా ఎనిమిదిమంది గాయపడ్డారు. చదవండి: చీరకట్టులో ఫుట్బాల్ ఇరగదీసిన మహిళలు.. వీడియో వైరల్.. -
ఏప్రిల్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఇన్ కమ్ ట్యాక్స్లో అనేక మార్పులు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ఇన్ కమ్ ట్యాక్స్ శ్లాబ్స్లో పన్ను రాయితీ పరిమితి పెంపు, లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్లో (ఎల్టీసీజీ) డెట్ మ్యూచివల్ ఫండ్స్పై పన్న విధింపు వంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు కొన్ని సామాన్యులకు ఊరట కలిగించేవి కాగా.. మరికొన్ని భారంగా మారనున్నాయి. ఇవే కాకుండా ఏప్రిల్ 1 నుంచి ఇంకా ఏయే మార్పులు చోటు చేసుకోనున్నాయో తెలుసుకుందాం. పన్ను రాయితీ పరిమితి పెంపు పన్ను రాయితీ పరిమితి రూ. 5 లక్షల నుండి రూ. 7 లక్షలకు పెరిగింది. అంటే రూ. 7 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్లో లేని మార్పులు పాత పన్ను విధానంలో ఉద్యోగులకు అందించిన రూ. 50000 స్టాండర్డ్ డిడక్షన్లో ఎలాంటి మార్పు లేదు. అయితే పెన్షనర్లకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. రూ.15.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు రూ. 52,500 ప్రయోజనం పొందుతారు . ఆదాయపు పన్ను స్లాబ్లలో మార్పులు గతంలో కొత్త పన్ను విధానంలో ఆరు శ్లాబులు ఉండేవి. వాటిని కుదించడంతో దీంతో ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఐదు శ్లాబులే ఉంటాయి. దీంతో రూ.0-3 లక్షల వరకు ఎలాంటి పన్ను విధించరు. రూ.3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు 5 శాతం, రూ.6 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల కంటే అధికంగా ఉంటే 30 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు షాక్ ఆర్థిక బిల్లు 2023 సవరణల్లో భాగంగా లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ (ltcg) ప్రయోజనాన్ని ఎత్తివేసింది. దీంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్పై పెట్టుబడి పెట్టగా వచ్చే రాబడిపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 35 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయని డెట్ మ్యూచువల్ ఫండ్లకు ఇకపై ఎల్టీసీజీ ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం డెట్ మ్యూచువల్ ఫండ్లలో మూడేళ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేస్తే వాటిని దీర్ఘకాల పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఈ ఫండ్స్లో పెట్టుబడులపై ఇండికేషన్తోపాటు 20 శాతం ఎల్టీసీజీ చెల్లించాలి. ఇండికేషన్ లేకుండా అయితే 10 శాతం పన్ను పే చేస్తే సరిపోతుంది. ఇన్సూరెన్స్ పాలసీలు ఇప్పుడే తీసుకోండి ఎక్కువ ప్రీమియం ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఏప్రిల్ 1 లోపే ఆ పనిచేయడం బెటర్. లేదంటే ఒక సంవత్సరంలో రూ. 5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించే జీవిత బీమా పాలసీలపై వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు ఊరట సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 15 లక్షల నుండి రూ. 30 లక్షలకు పెంచింది. గతంలో ఆ డిపాజిట్ కేవలం రూ.15లక్షల వరకు మాత్రమే ఉండేది. దీంతో పాటు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో సింగిల్ అకౌంట్ కలిగిన వ్యక్తి నెలకు కేవలం రూ.4.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేసే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ డిపాజిట్ను రూ.9లక్షలకు పెంచారు. ఇక జాయింట్ అకౌంట్లో రూ.7.5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.15 లక్షల వరకు పెంచారు. చదవండి : ఫార్మా కంపెనీలకు కేంద్రం భారీ షాక్! -
Bank holidays in April 2023: ఏకంగా అన్ని రోజులు సెలవులా?
సాక్షి,ముంబై: కేంద్ర బ్యాంకు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్లో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంకు సెలవులున్నాయి. రెండో శనివారం, ఆదివారాలు, సెలవులు, పండగలు కలిసి ఏప్రిల్లో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. దాదాపు నెలలో సగం రోజులు బ్యాంకులకు సెలవు. అయితే ఆన్లైన్సేవలు, యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదనేది గమనార్హం. ( ఇదీ చదవండి: విషాదం: ఇంటెల్ కో-ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత) ఏప్రిల్ నెలలో సెలవులు లిస్ట్ ఏప్రిల్ 1: కొత్త ఆర్థికసంవత్సరం తొలి రోజు ఏప్రిల్ 1న మిజోరం, చండీగఢ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ మినహా, బ్యాంకులకు సెలవు ఏప్రిల్ 2, 9,16,23,30, ఆదివారం కాబట్టి దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు ఏప్రిల్ 4 : మహావీర్ జయంతిని పురస్కరించుకుని వివిధ నగరాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో బ్యాంకులకు సెలవు ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు (ఇదీ చదవండి: బుజ్జి బంగారం: ఆనందంలో మునిగి తేలుతున్న మార్క్ జుకర్బర్గ్) ఏప్రిల్ 8: రెండో శనివారం, అలాగే 22 నాలుగో శనివారం ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బ్యాంకులకు సెలవు ఏప్రిల్ 15: వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పండగల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 18: షాబ్ ఇ బకర్ కారణంగా జుమ్మూ అండ్ శ్రీనగర్లో బ్యాంకులు మూసి ఉంటాయి. ఏప్రిల్ 21: రంజాన్ ఈద్( ఈద్ ఉల్ ఫితర్) అగర్తల, జమ్ము, కొచ్చి, శ్రీనగర్, తిరువనంతపురం ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. -
ఏప్రిల్ 1 నుంచి మారుతున్న ఐటీ రూల్స్ ఇవే..
2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయి కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతోంది. ఆదాయపు పన్ను కొత్త నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన 2023 బడ్జెట్లో ఆదాయపు పన్ను కొత్త నియమాలను ప్రతిపాదించింది. ఇదీ చదవండి: ట్యాక్స్ ప్లానింగ్లో చేసే పొరపాట్లు ఇవే.. తెలుసుకుంటే పన్ను ఆదా పక్కా! కొత్త పన్ను విధానంలో టీడీఎస్ను ప్రభుత్వం తగ్గించింది. దీంతో చాలామంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుంది. పన్ను చెల్లించదగిన ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువ ఉండి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారు ఎటువంటి టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద వారికి అదనపు మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 193 కింద డీమెటీరియలైజ్డ్ రూపంలో లిస్టెడ్ డిబెంచర్లకు టీడీఎస్ కోతలు ఉండవు. అయితే అన్ని ఇతర చెల్లింపులపై 10 శాతం టీడీఎస్ రూపంలో కోత ఉంటుంది. ఆన్లైన్ గేమ్ల ద్వారా డబ్బు గెలుచుకున్న వారు ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ 115 BBJ ప్రకారం 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టీడీఎస్ రూపంలో కట్ చేస్తారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద లభించే ప్రయోజనాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గుతాయి. రూ. 10 కోట్ల వరకు మూలధన లాభాలకు మాత్రమే ఈ సెక్షన్ల కింద మినహాయింపు ఉంటుంది. అంతకు మించిన మూలధన లాభాలపై 20 శాతం పన్ను విధిస్తారు. 2023 ఏప్రిల్ 1 నుంచి ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభంపై అధిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 24 కింద క్లెయిమ్ చేసే వడ్డీని కొనుగోలు లేదా మరమ్మతు ఖర్చులో చేర్చేందుకు వీలు లేదు. మార్కెట్ లింక్డ్ డిబెంచర్ల బదిలీ, రిడెంప్షన్ లేదా మెచ్యూరిటీ నుంచి వచ్చే మూలధన లాభాలపై ఇప్పుడు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ఉంటుంది. 2023 ఏప్రిల్ నుంచి ఈ-గోల్డ్ రిసీప్ట్గా మార్చుకున్న ఫిజికల్ గోల్డ్ లేదా ఫిజికల్ గోల్డ్గా ఈ-గోల్డ్ రిసీప్ట్పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఉండదు. అయితే ఈ మార్పిడి సెబీ రిజిస్టర్డ్ వాల్ట్ మేనేజర్ ద్వారా జరిగి ఉండాలి. ఇదీ చదవండి: ఆ విషయంలో షావోమీ రికార్డ్ను బ్రేక్ చేయనున్న ఐఫోన్! -
ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించే ముహూర్తాలను రాష్ట్ర ప్రభు త్వం ఖరారు చేసింది. కొత్త సచివాలయాన్ని ఏప్రిల్ 30న ప్రారంభించాలని, ఆలోపు అన్ని పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అంతకన్నా ముందే అంబేడ్కర్ జయంతి అ యిన ఏప్రిల్ 14న 125 అడుగుల అంబేడ్కర్ వి గ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ఆవిర్భవించిన జూన్ 2న అమరవీరుల స్మారక జ్యోతిని ప్రారంభించనున్నారు. ఈ 3 నిర్మాణాలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం వాటిని పరిశీలించారు. అనుకున్నట్టే అద్భుతంగా.. తొలుత సచివాలయాన్ని సందర్శించిన కేసీఆర్.. ప్రధాన ద్వారం, దానికి భోపాల్ నుంచి తెచ్చి ఏర్పాటు చేసిన వుడ్ కార్వింగ్, ఫౌంటెయిన్లు, పచ్చిక బయళ్లు, గుమ్మటాల పనులను.. ప్రహరీ, దాని అవతల వెడల్పు చేస్తున్న రోడ్లు, పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంతకుముందు పర్యటించినప్పుడు ఆరో అంతస్తులోని సీఎం చాంబర్లో చేయాల్సిందిగా సూచించిన మార్పులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లిన సీఎం కేసీఆర్.. విగ్రహం దిగువన సిద్ధమవుతున్న విశాలమైన హాళ్లు, ఫౌంటెయిన్లు, పచ్చి క బయళ్లను పరిశీలించారు. పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతలో లోపం లేకుండా చూ డాలని ఆదేశించారు. తర్వాత తెలంగాణ అమరవీరుల స్మారక భవనం వద్దకు సీఎం చేరుకున్నారు. ఆడిటోరియం, ప్రదర్శనశాల, లేజర్షో ప్రాంగణం, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు సుమన్, జీవన్రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు ఉన్నారు. వరుసగా వాయిదా పడుతూ.. తొలుత దసరాకు, ఆ తర్వాత సంక్రాంతికి కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు భావించింది. కానీ పనులు పూర్తి కాకపోవటంతో వాయిదా వేసుకుంది. తర్వాత సీఎం కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17ను ముహూర్తంగా ఖరారు చేసింది. పనులు పూర్తి కాకున్నా ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే సీఎం కార్యాలయం తప్ప మిగతావి పూర్తిస్థాయిలో సిద్ధం కావని అధికారులు పేర్కొనడంతో పునరాలోచించింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో మరోసారి వాయిదా వేసింది. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందున ఆయన జయంతి అయిన ఏప్రిల్ 14న ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ ఆ రోజు కాకుండా ఏప్రిల్ 30ని ముహూర్తంగా ఎంచుకుంది. మార్చి 23 తర్వాత శూన్యమాసం మొదలై ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని.. ఆ తర్వాతి రోజు (ఏప్రిల్ 30) వైశాఖ శుద్ధ దశమి నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం అవుతున్నాయని పండితులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 30ను కొత్త సచివాలయ ప్రారంభోత్సవం జరగనుంది. -
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
-
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇవి ఏప్రిల్ 13వ తేదీ వరకూ కొనసాగుతాయి. బుధవారం రాష్ట్ర పరీక్షల విభాగం దీనికి సంబంధించిన టైమ్ టేబుల్, ఇతర విధివిధానా లను విడుదల చేసింది. అలాగే పరీక్షల్లో ఇప్పటి వరకు ఉన్న 11 పేపర్ల విధానా నికి బదులు ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా మార్పులు చేస్తూ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీ చేశారు. టెన్త్తో పాటు 9వ తరగతి సమ్మేటివ్ అసెస్ మెంట్–2 కూడా 6 పేపర్లతోనే నిర్వ హించనున్నట్టు జీవోలో పేర్కొ న్నారు. ప్రతీ సబ్జెక్టులోనూ వంద మార్కులుంటాయి. 4 ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీ క్షల నుంచి 20 మార్కులు, పబ్లిక్ పరీ క్షలో 80 మార్కులు ఉంటాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఎఫ్ఏల ద్వారా 120 మార్కులు, పబ్లిక్ పరీక్షల ద్వారా 480.. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. సైన్స్ మినహా అన్ని సబ్జెక్టుల పరీక్షలకు 3 గంటల వ్యవధి ఉంటుంది. సైన్స్లో మాత్రం బయలాజి క ల్ సైన్స్, ఫిజికల్ సైన్స్.. 2 పేపర్లుగా విభజించా రు. ఒక్కో పేపర్కు గంట న్నర వ్యవధి ఇస్తారు. మొదటి పేపర్ పరీక్ష జరిగిన తర్వాత ఆ సమాధాన పత్రాల సేకర ణకు అదనంగా 20 నిమి షాలు ఇస్తా రు. అంటే సైన్స్ 2 పేపర్ల పరీక్ష వ్యవధి 3.20 గంటలు ఉంటుంది. ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షల్లో సంస్కృతం పేపర్–1, పేపర్–2గా ఒక్కొక్కటి 200 మార్కులకు ఉంటుంది. ఇదీ టెన్త్ టైమ్ టేబుల్... వంద శాతం సిలబస్తో పరీక్షలు: మంత్రి సబిత ఈ సారి టెన్త్ పరీక్షలను వంద శాతం సిలబస్తో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత తెలిపారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్న లకు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుందని, సూక్ష్మరూప ప్రశ్నలకు చాయిస్ లేదని ఆమె వెల్లడించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై బుధవారం మంత్రి విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. టెన్త్ పరీక్షలకు సంబంధించి నమూనా ప్రశ్న పత్రాలను వెంటనే విద్యార్థులకు అందు బాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వాటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయా లని సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వ హించాలని పేర్కొ న్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి ఆ విద్యార్థులకు ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రీ ఫైనల్స్ నిర్వహించాలని స్పష్టంచేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకో వాలని కోరారు. ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరు ణ, పాఠశాల విద్యా సంచాలకు రాలు దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు కృష్ణారావు తదితరు లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
‘గ్రీన్కార్డు’ సిఫార్సుల్లో కీలక కదలిక
వాషింగ్టన్: గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రాసెసింగ్, కేటాయింపు సమయాన్ని ఆర్నెల్లకు కుదించడంతో పాటు పెండింగ్ దరఖాస్తులన్నింటినీ 2023 ఏప్రిల్ కల్లా క్లియర్ చేయాలన్న సిఫార్సులపై అమెరికా దృష్టి నిశితంగా సారించింది. ఇవి ప్రస్తుతం డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్ పరిశీలనలో ఉన్నాయి. అక్కడ ఆమోదం పొందితే తుది నిర్ణయం కోసం అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు వెళ్తాయి. ఈ సిఫార్సులు అమలుకు నోచుకుంటే వేలాదిమంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ఆసియా అమెరికన్లు తదితరులకు సంబంధించిన సలహా కమిషన్ గత మే నెలలో ఈ కీలక సిఫార్సులు చేయడం తెలిసిందే. భారతీయ మూలాలున్న పారిశ్రామికవేత్త అజయ్ జైన్ భుటోరియా కమిషన్ తొలి భేటీలో ఈ ప్రతిపాదనలు చేయగా ఏకగ్రీవ ఆమోదం లభించింది. బైడెన్కు భుటోరియా తొలినుంచీ గట్టి మద్దతుదారు. -
హైదరాబాదీలకు షాక్..భారీగా పెరిగిన ఇళ్ల ధరలు!
న్యూఢిల్లీ: హైదరాబాద్లో నివాస గృహాల ధర ఏప్రిల్–జూన్ మధ్య చదరపు అడుగుకు సగటున రూ.9,218గా ఉంది. గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది. మొత్తం ఎనిమిది నగరాల్లో ఈ కాలంలో సగటు ధర పెరుగుదల రేటు 5 శాతంగా ఉంది. హౌసింగ్ డిమాండ్ పునరుద్ధరణ, నిర్మాణ వ్యయాల్లో పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణమని హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ నివేదిక– 2022 తెలిపింది. రియల్టర్ల అత్యున్నత సంస్థ క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా, డేటా అనలిటిక్ సంస్థ లియాసెస్ ఫోరాస్లు సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికలో హైదరాబాద్సహా ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), చెన్నై, కోల్కతా, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీ సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు.. ► కార్పెట్ ఏరియా (గోడలు కాకుండా ఇంటి లోపలి స్థలం) ఆధారంగా ధరలను లెక్కించడం జరిగింది. ► 2022 ఏప్రిల్–జూన్ సమయంలో భారతదేశంలో గృహాల ధరలు మహమ్మారికి ముందు స్థాయిలను అధిగమించాయి. భారీ డిమాండ్, దీనికి తగిన సరఫరాలను ఇది సూచిస్తోంది. ► భవిష్యత్తులో ధరలు భారీ ఒడిదుడుకులు లేకుండా ఒక నిర్దిష్ట శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ► పెరుగుతున్న వడ్డీరేట్ల ప్రభావాన్ని డెవలపర్లు ముందే గ్రహించి, తగ్గింపు ఈఎంఐ పథకాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పండుగ ఆఫర్లు, సరఫరా పరిస్థితి బాగుండడం వంటి అంశాల నేపథ్యంలో విక్రయాల పరిమాణం మెరుగుపడే అవకాశం ఉంది. ► గృహాల ధరల పెరుగుదలకు కీలకమైన నిర్మాణ సామగ్రి రేట్లు, కార్మికుల వేతనాల వంటివి ప్రధాన కారణాలు. ► గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం డిమాండ్పై స్వల్పంగానే ఉండవచ్చు. సెప్టెంబర్ నుంచి విక్రయాలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ► రాబోయే పండుగ సీజన్ మార్కెట్ సెంటిమెంట్ను సానుకూలంగా ఉంచే అవకాశం ఉంది. ఫలితంగా వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం నెలకొంది. ► ఢిల్లీ–ఎన్సీఆర్కు సంబంధించి చూస్తే, గురుగ్రామ్లోని గోల్ఫ్కోర్సు రోడ్డులో ఇండ్ల ధర అత్యధికంగా 21 శాతం ఎగసింది. ► అహ్మదాబాద్లో గృహాల ధరలు 3 సంవత్సరాలలో అత్యధికం. గాంధీనగర్ సబర్బ్లో అత్యధికంగా 13 శాతం పెరుగుదల కనిపించింది. ► సెంట్రల్ చెన్నైలో ధరలు దాదాపు 13 శాతం క్షీణించగా, పశ్చిమ పూనమల్లిలో అత్యధికంగా 13 శాతం పెరిగింది. ► కోల్కతా నైరుతి, హౌరాలో అత్యధికంగా 13 శాతం ధరలు పెరిగాయి. ► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్) మార్కెట్లో పశ్చిమ శివారు ప్రాంతాల్లో (దహిసర్కు ఆవల) 12 శాతం చొప్పున ధరలు పెరిగాయి. ► పూణె మార్కెట్లోని కోత్రుడ్, బ్యానర్ గృహాల ధరలు గరిష్టంగా 9–10 శాతం శ్రేణిలో పెరిగాయి. బడా రియల్టర్ల హవా... గత దశాబ్ద కాలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరగలేదు. బిల్డర్లు చాలా తక్కువ మార్జిన్లో పనిచేస్తున్నారు. కీలకమైన నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు వినియోగదారులపై భారం మోపడం మినహా వేరే మార్గం లేదు. అయినప్పటికీ ఈ రంగంలో బడా, విశ్వసనీయ బిల్డర్లు ఇతరుల కంటే మెరుగైన డిమాండ్ను చూస్తున్నారు. వారు మార్కెట్లో ప్రీమియంను (అధిక ధరల స్థితిని) నియంత్రించగలుగుతున్నారు. తద్వారా ప్రయోజనమూ పొందుతున్నారు. – పంకజ్ పాల్, ఏఐపీఎల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్లో రయ్!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 7.1 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఏప్రిల్ నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో ఉత్పత్తి 7.1 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టులో 13 శాతం పెరుగుదల తర్వాత) ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. విద్యుత్, మైనింగ్ రంగాలు మంచి ఫలితాలను అందించినట్లు శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన లెక్కలు వెల్లడించాయి. కొన్ని ముఖ్య విభాగాలను పరిశీలిస్తే... ► తయారీ: ఐఐపీలో దాదాపు 70 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో 6.3 శాతం పురోగతి నమోదయ్యింది. ► విద్యుత్: ఈ రంగం 11.8 % వృద్ధి సాధించింది. ► మైనింగ్: మైనింగ్లో 7.8% వృద్ధి నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులు, డిమాండ్కు ప్రతిబింబమైన ఈ విభాగంలో భారీగా 14.7% వృద్ధి నమోదుకావడం హర్షణీయం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేట్లర్ల వంటి దీర్ఘకాల వినియోగ వస్తువులకు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి 8.5 శాతంగా ఉంది. ► నాన్–కన్జూమర్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కి సంబంధించిన నాన్–కన్జూమర్ గూడ్స్ విభాగంలో స్వల్పంగా 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ప్రైమరీ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (నిర్మాణ) గూడ్స్ ఉత్పత్తి వృద్ధి రేట్లు వరుసగా 10.1 శాతం, 7.6 శాతం, 3.8 శాతాలుగా ఉన్నాయి. -
ఏప్రిల్లో సేవల రంగం భేష్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఏప్రిల్లో మంచి పనితీరు ప్రదర్శించింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 57.9కి ఎగసింది. గత 5 నెలల్లో ఈ స్థాయి నమో దు ఇదే తొలిసారి. మార్చిలో సూచీ 53.6 వద్ద ఉంది. కొత్త వర్క్ ఆర్డర్ల పెరుగుదల, సానుకూ ల వ్యాపార క్రియాశీలత వంటి అంశాలు ఇండెక్స్కు బలాన్ని అందించాయి. సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. ‘సేవల పీఎంఐ డేటా ప్రోత్సాహకరంగా ఉంది. పెరుగుతున్న డిమాండ్ దీనికి కారణం’ అని ఎస్అండ్పీ గ్లోబల్లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా పేర్కొన్నారు. సేవలు, తయారీ... దూకుడే: కాగా సేవలు, తయారీ రంగం కలగలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ మార్చిలో 54.3 వద్ద ఉంటే, ఏప్రిల్లో 57.6కు ఎగసింది. ఈ సూచీ కూడా ఐదు నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాల్లో కొంత మెరుగుదల కనబడింది. ఒక్క తయారీకి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్లో 54.7గా నమోదయ్యింది. సూచీ మార్చిలో 54 వద్ద ఉంది. -
కార్లు.. కుయ్యో.. మొర్రో, తగ్గిపోతున్న కార్ల అమ్మకాలు!
ముంబై: ఆటో పరిశ్రమ సప్లై సమస్యలతో సతమతమవుతోంది. దీనితో ఉత్పత్తి తగ్గి, కార్ల తయారీ కంపెనీల ఏప్రిల్ అమ్మకాలు క్షీణించాయి. ముఖ్యం గా దిగ్గజ కంపెనీలు మారుతీ సుజుకి, హ్యూందాయ్ కార్ల హోల్సేల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. అయితే టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్, స్కోడా ఆటో కంపెనీలు గత నెల మెరుగైన అమ్మకాల వృద్ధిని సాధించాయి. మారుతీ సుజుకి గతేడాది ఏప్రిల్ కంటే ఈసారి ఏడు శాతం తక్కువగా 1,32,248 యూనిట్లను విక్రయించింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వాహనాల ఉత్పత్తిపై ప్రభావం చూపిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. హ్యూందాయ్ సైతం సమీక్షించిన నెలలో పది శాతం క్షీణతతో 44,001 యూనిట్లను విక్రయించింది. హోండా కార్స్ కంపెనీ అమ్మకాలు ఏప్రిల్ 7,874 యూనిట్లతో 13 % పడిపోయా యి. ‘‘వినియోగదారుల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరా సమస్య తీవ్రంగా ఉందని, అందుకే అమ్మకాలు నెమ్మదించాయి’’ అని హోండా మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ యుచి మురాటా అన్నారు. చదవండి👉 ట్విటర్ ఎఫెక్ట్: టెస్లాకు భారీ షాక్! -
4 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలలు ఈనెల 4వ తేదీనుంచి ఒంటిపూట బడులుగా నడవనున్నాయి. వేసవి ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సోమవారం నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు ఒంటిపూట బడు లు ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 4వ తేదీనుంచి 13వ తేదీ వరకు టెన్త్ విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 27వ తేదీ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మే 6వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతాయి. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి గుండెపోటుతో మృతి -
ఏప్రిల్ నెల బ్యాంకు సెలవులు జాబితా ఇదే..!
వచ్చే ఏప్రిల్ నెలలో మీకు ఏమైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే ముఖ్య గమనిక. దేశవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు వస్తున్నాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోని అన్ని బ్యాంకులకు మొత్తం 15 రోజులు సెలవులు ఉండవు. రాష్ట్రాన్ని బట్టి సెలవులు మారుతుంటాయి. బ్యాంకుకు వెళ్లే ముందు ఏఏ రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. బ్యాంకుల్లో ఏదైనా పని ఉంటే సెలవు రోజులకు అనుగుణంగా ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. నిజానికి బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ.. ఆన్లైన్ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అన్ని అన్లైన్ లావాదేవీలు 24 గంటలు పని చేస్తాయి. ఏటీఎంలలో కూడా నగదు విత్డ్రా చేసుకునే వీలుంటుంది. ఏప్రిల్ నెల బ్యాంక్ సెలవుల జాబితా: ఏప్రిల్ 1- 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అకౌంట్స్ క్లోజింగ్ డే. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఏప్రిల్ 2- ఉగాది(తెలుగు నూతన సంవత్సరం), గుడిపడ్వా. తెలంగాణ, అంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర సహా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు సెలవులో ఉంటాయి. ఏప్రిల్ 3- ఆదివారం(సాధారణ సెలవు) ఏప్రిల్ 4- సర్హుల్ సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు) ఏప్రిల్ 9- రెండో శనివారం(సాధారణ సెలవు) ఏప్రిల్ 10- ఆదివారం(సాధారణ సెలవు) ఏప్రిల్ 14- డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి, మహవీర్ జయంతి, వైశాఖి, తమిళ నూతన సంవత్సరం, బిజు ఫెస్టివల్, బోగ్ బిహు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 15- గుడ్ ఫ్రైడే, బెంగాలి న్యూ ఇయర్, హిమాచల్ డే, విషు(దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు) ఏప్రిల్ 16- బోగ్ బిహు ఏప్రిల్ 17- ఆదివారం(సాధారణ సెలవు) ఏప్రిల్ 21- గరియా పూజ ఏప్రిల్ 23- నాలుగో శనివారం(సాధారణ సెలవు) ఏప్రిల్ 24- ఆదివారం(సాధారణ సెలవు) ఏప్రిల్ 29- శాబ్-ఐ-ఖదర్/ జుమాత్-ఉల్-విదా (చదవండి: పెరిగిన కేంద్ర ప్రభుత్వ రుణ భారం.. అప్పు ఎన్ని లక్షల కోట్లు తెలుసా?) -
వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్!
మీ వద్ద 15 ఏళ్లకు పైబడిన ఏదైనా ఒక పాత వాహనం ఉందా?.. అయితే, మీకో షాకింగ్ న్యూస్. ఎందుకంటే, 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్సీ రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఇకపై, 15 ఏళ్లు పైబడిన కారు ఆర్సీ రెన్యువల్కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక, ఆర్సీ రెన్యువల్ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్లో ఆలస్యం చేస్తే, నెలకు 300 నుంచి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది. ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ.50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజును రూ.300 నుంచి రూ.1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్నెస్ రెన్యువల్ కోసం రూ.12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న కార్ల ఆర్సీ రెన్యువల్ ఫీజు రూ.15,000 నుంచి రూ.40,000కి పెరిగింది. భారతదేశం అంతటా ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2022 నుంచి వర్తిస్తాయి. అయితే, ఈ రూల్ ఢిల్లీలో వర్తించదు. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు & 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. ఒకవేళ వారు తమ వాహనాలను దేశ రాజధాని ఢిల్లీలో నడపాలనుకుంటే తమ పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాల్సి ఉంటుంది. కొత్త ఫీజులు ఇలా.. వ్యక్తిగత వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజు వెహికల్ టైప్ రిజిస్ట్రేషన్ ఫీజు రెన్యువల్ ఫీజు మోటార్ సైకిల్: 300 1,000 థ్రీవీలర్ : 600 2,500 కారు/జీపు : 600 5,000 ఇంపోర్టెడ్ వెహికల్: 5,000 40,000 కమర్షియల్ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజు వెహికల్ టైప్ ఫిట్నెస్ ఫీజు రెన్యువల్ ఫీజు మోటార్ సైకిల్: 500 1,000 థ్రీవీలర్ : 1,000 3,500 ట్యాక్సీ/క్యాబ్ : 1,000 7,000 మీడియం గూడ్స్ /ప్యాసింజర్: 1,300 10,000 హెవీ గూడ్స్/ప్యాసింజర్: 1,500 12,500 (చదవండి: రూ.322 కోట్లు డీల్, టెక్ మహీంద్రా చేతికి మరో కంపెనీ!) -
కస్టమర్ల ధ్రువీకరణ తర్వాతే చెక్కులకు ఆమోదం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) రూ.10 లక్షలు అంతకుమించిన చెక్కుల ఆమోదానికి కస్టమర్ల ధ్రువీకరణను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పేసిస్టమ్ (పీపీఎస్)ను అమలు చేయనుంది. రూ.10 లక్షలకు మించిన చెక్కు క్లియరెన్స్ కోసం వచ్చినప్పుడు కస్టమర్ ధ్రువీకరణను తీసుకోనుంది. తద్వారా చెక్కుల రూపంలో భారీ మోసాలకు చెక్ పెట్టొచ్చన్నది పీఎన్బీ అభిప్రాయంగా ఉంది. ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ విధానంలో రూ.50,000, అంతకుమించిన చెక్కులకు పీపీఎస్ను పీఎన్బీ అమలు చేస్తోంది. ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారుల ఇష్టానికి వదిలేయాలని, రూ.5లక్షలకు మించిన చెక్కులకు బ్యాంకులు తప్పనిసరి చేయవచ్చని గతంలో ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు.. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని తెలిపింది. ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారని, ఎత్నిక్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంట్ సబ్జెక్టులు తీసుకున్న వారికి ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఈ పేపర్లకు పరీక్షలు ఉంటాయని బోర్డు వెల్లడించింది. ఒకేషనల్ సహా జనరల్ ఇంటర్ విద్యార్థుల పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది. -
భారత్ ఎకానమీ వృద్ధి 18.5 శాతం!
ముంబై: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 18.5 శాతం వృద్ధి సాధిస్తుందని ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్ట్– ఎకోరాప్ అంచనావేసింది. అయితే దీనికి ప్రధాన కారణం బేస్ ఎఫెక్ట్ అని (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) కూడా నివేదిక పేర్కొనడం గమనార్హం. ఈ నెలాఖరున మొదటి త్రైమాసికం జీడీపీ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎకోరాప్ తన తాజా అంచనాలను తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►పరిశ్రమలు, సేవల రంగాల క్రియాశీలత, అంత ర్జాతీయ ఆర్థిక పరిస్థితులుసహా 41 కీలక రంగా లు ప్రాతిపదికగా రూపొందించిన ‘నౌకాస్టింగ్ నమూనా’ ప్రాతిపదికన ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ భారత్ ఎకానమీ తాజా అంచనాలను వెలువరించింది. ►తుది ప్రొడక్ట్తో సంబంధం లేకుండా ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) ప్రకారం వృద్ధి రేటు క్యూ1లో 15 శాతంగా ఉంటుంది. ►మొదటి త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. స్థూల ఆదాయాల్లో మంచి రికవరీ కనిపించింది. ►4,069 కంపెనీలను చూస్తే, క్యూ1లో జీవీఏ వృద్ధి 28.4 శాతంగా ఉంది. అయితే 2020–21 చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) కన్నా ఈ వృద్ధి రేటు తక్కువ. ►కరోనా సెకండ్వేవ్తో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ జూన్లో పుంజుకుంది. ►బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు 16తో ముగిసిన వారంలో 103.3 వద్ద ఉంది. ►ప్రాంతీయ రవాణా కార్యాలయాల ఆదాయాలు, విద్యుత్ వినియోగం, రవాణా ఇండికేటర్లు రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ►కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టిన తర్వాత జీడీపీలో కుటుంబ రుణ భారాలు పెరుగుతూ వస్తుండడం గమనార్హం. 2017– 18లో ఇది 30.1 శాతంగా ఉంది. తరువాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 31.7 శాతం, 32.5 శాతంగా నమోదయ్యాయి. అంటే నాలుగేళ్లలో పెరిగిన రుణ భారం 7.2 శాతం. ►2020 లాక్డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీ గా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ►2021–22 మొదటి త్రైమాసికంపై ఆర్బీఐ అంచనా 21.4 శాతంకాగా, ఇక్రా అంచనా 20 శాతంగా ఉంది. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి -
Telangana: తొలి మాసం.. శుభారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో చెప్పుకోదగిన రీతిలోనే ఖజానా నిండింది. ప్రారంభ మాసమైన ఏప్రిల్లో దాదాపు రూ. 10 వేల కోట్లకు ప్రభుత్వ పద్దు చేరింది. ఇందులో రెవెన్యూ రాబడి రూ. 8 వేల కోట్లు కాగా, అప్పులు రూ. 1,900 కోట్లు కలిపితే ఆ మేరకు ఖజానా కళకళలాడిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పన్ను ఆదాయం రూపంలో రూ. 7,600 కోట్లకుపైగా రాగా, గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నేతర ఆదాయం కలిపి మొత్తం రెవెన్యూ రాబడులు రూ. 8,050 కోట్లకు చేరాయి. జీఎస్టీ కింద తొలి మాసంలో రూ. 3 వేల కోట్లకుపైనే సమకూరగా రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ. 700 కోట్లు దాటింది. ఎప్పటిలాగే రూ. 1,000 కోట్లకుపైగా ఎక్సైజ్ ఆదాయం రాగా, అమ్మకపు పన్ను కూడా రూ. 2 వేల కోట్ల వరకు వచ్చింది. అయితే కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కలిపి కేంద్రం నుంచి సుమారు రూ. 750 కోట్లు మాత్రమే అందాయి. గతేడాది ఏప్రిల్లో కరోనా విజృంభణతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఆ నెల మొత్తం కలిపి ప్రభుత్వానికి వచ్చిన రెవెన్యూ ఆదాయం కేవలం రూ. 3,377 కోట్లుకాగా, ఈ ఏడాది ఏప్రిల్లో మాత్రం రూ. 8 వేల కోట్లు దాటింది. చదవండి: ‘న్యూస్ ఆన్ ఎయిర్’ హైదరాబాద్ ఘనత -
భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు
ముంబై: లాక్డౌన్ తరహా ఆంక్షల విధింపుతో ఏప్రిల్లో మోటార్ సైకిల్, స్కూటర్ విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. రెండో దశలో విజృంభిస్తున్న కరోనా కేసుల కట్టడికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్లో స్థానిక లాక్డౌన్లను విధించాయి. దీంతో వాహనాల ఉత్పత్తి నెమ్మదించింది. సరఫరా అవాంతరాలు నెలకొని అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దేశవ్యాప్త సంపూర్ణ లాక్డౌన్ విధింపుతో గతేడాది ఏప్రిల్లో వాహన కంపెనీలేవీ విక్రయాలు జరపలేదు. అందువల్ల నాటి అమ్మకాలతో ఈ ఏప్రిల్ విక్రయాలను పోల్చిచూడలేమని ద్విచక్ర వాహన కంపెనీలు చెప్పుకొచ్చాయి. కావున ఈ ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చిచూడగా.., టూ-వీలర్స్ మార్కెట్ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఏప్రిల్లో మొత్తం 3.72 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ మార్చిలో అమ్మిన 5.76 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ. గత మార్చిలో 4.11 లక్షల వాహనాలకు విక్రయించిన హోండా మోటార్ సైకిల్ ఇండియా ఈ ఏప్రిల్లో 2.83 లక్షల యూనిట్లుకు పరిమితమైంది. అంటే మాస ప్రాతిపదికన 31 శాతం క్షీణత కనబరిచినట్లైంది. ఇదే ఏప్రిల్లో బజాజ్ ఆటో 1.34 లక్షల యూనిట్లను విక్రయించగా, మార్చిలో 3.88 లక్షల వాహనాలకు అమ్మింది. చదవండి: స్థానిక లాక్డౌన్లతో 70 లక్షలకు పైగా ఉద్యోగాల కోత -
పీఎం కిసాన్ ఎనిమిదో విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికి పెట్టుబడి సహాయం కింద చేయూత అందించడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. అయితే, ఈ పథకంలో భాగంగా ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతలలో రూ.2వేల చొప్పున అందజేస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఎనిమిదవ విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమ కాలేదు. కేంద్ర ప్రభుత్వం గత కొద్దీ రోజుల నుంచి 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రచారంలో బిజీగా ఉంది. దీంతో పీఎం కిసాన్ ఎనిమిదవ విడతకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. తాజాగా కేంద్రం ఈ విషయంపై స్పందించింది. ఏప్రిల్ చివరి నాటికి 20 నుంచి 25 మధ్య ఎనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయనున్నట్లు కేంద్ర వ్యవససాయ శాఖ సహయ మంత్రి కైలాష్ చౌదరి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 8వ విడత డబ్బులు వస్తాయని వార్తలు వస్తున్నాయి. కానీ అది నిజం కాదు, డబ్బులు ఇంకా రైతుల ఖాతాలోకి జమచేయలేదు.. అంటూ పేర్కొన్నారు కైలాష్ చౌదరి. చదవండి: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి పీఎఫ్ కొత్త రూల్స్ -
ఏప్రిల్లో సందడి చేసే సినిమాలివే..
ప్రేక్షకుడికి వినోదాన్ని పంచడానికే సినిమా. వినోదానికి ప్రతిఫలంగా నాలుగు కాసులు వస్తాయి కనుకనే ఏటా వేలాది సినిమాలు రిలీజవుతుంటాయి. అందులో కొన్ని హిట్ ట్రాక్ ఎక్కితే, మరికొన్ని మాత్రం ఏకంగా బ్లాక్బస్టర్ హిట్లు కొడతాయి. కానీ గతేడాది మాత్రం కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల థియేటర్లో బొమ్మ ఆడక సగటు ప్రేక్షకుడికి వినోదం కరువైంది. తర్వాత థియేటర్లు రీఓపెన్ అయినా కరోనా టెన్షన్తో జనాలు సినిమాలను ఆదరిస్తారో లేదో అన్న ఆందోళన వ్యక్తమైంది. కానీ ఈ అనుమానాలను పటాపంచలు చేశారు సినీప్రియులు. కంటెంట్ బాగుంటే భయాలన్నీ పక్కనపెట్టి థియేటర్కు కదిలివస్తామని చెప్తున్నారు. చెప్పినట్లుగానే ఇప్పటివరకు పలు సినిమాలను ఆదరించారు. అభిమానించారు. దీంతో నిర్మాతలు కూడా తమతమ సినిమాలను ఓటీటీల్లో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండగ ఉన్న ఏప్రిల్ నెలలో ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూసేద్దాం.. మన్మథుడు 2 ఫ్లాప్ కావడంతో కొంత నిరాశలో ఉన్నాడు టాలీవుడ్ కింగ్ నాగార్జున. దీంతో ఈసారి లవ్స్టోరీ కాకుండా క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఎంచుకున్నాడు. సాల్మన్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న వైల్డ్డాగ్ మూవీ ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఏప్రిల్ 2న మరో స్టార్ హీరో సినిమా రిలీజ్ కాబోతోంది. తమిళ హీరో కార్తీ నటించిన సుల్తాన్ అదే రోజు తెలుగులోనూ విడుదలవుతోంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తర్వాత చేస్తున్న సినిమా వకీల్సాబ్. ఈ చిత్రం ఏప్రిల్ 9న రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత వారం రోజులకే అంటే ఏప్రిల్ 16న నాగచైతన్య, సాయి పల్లవి జోడీగా నటించిన లవ్స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సత్యదేవ్, మిల్కీబ్యూటీ తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలోకి రానుంది. నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం ఏప్రిల్ 30న సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అలాగే విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం తెలుగులో ఓ మంచి రోజు చూసి చెప్తా పేరుతో ఏప్రిల్ 2న రిలీజ్ అవుతోంది. ఇక కన్నడ స్టార్ పునీత్ రాజ్కుమార్ నటించిన యువరత్న ఏప్రిల్ 1న విడుదల కానుంది. సునీల్ డిటెక్టివ్గా నటించిన కనబడుట లేదు ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయనుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తలైవి సినిమా ఏప్రిల్ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో సంచలన నటి కంగనా రనౌత్ నటించింది. చదవండి: టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ రివ్యూ.. 8 హిట్ సినిమాలు ఇవే -
వామ్మో! బ్యాంక్లకు ఇన్ని రోజులు సెలువులా?
ఏప్రిల్లో మీకు బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే ఒక గమనిక. ఏప్రిల్లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. అంటే ఏప్రిల్లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే. మీరు ఈ సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులను పూర్తీ చేసుకుంటే మంచిది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు పాటు పనిచేయవు. ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి. ఏప్రిల్లో బ్యాంక్ సెలవులు: ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 4: ఆదివారం ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు ఏప్రిల్ 10: రెండవ శనివారం ఏప్రిల్ 11: ఆదివారం ఏప్రిల్ 13: ఉగాది పండుగ ఏప్రిల్ 14: డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 18: ఆదివారం ఏప్రిల్ 21: శ్రీరామ నవమి ఏప్రిల్ 24: నాల్గవ శనివారం ఏప్రిల్ 25: ఆదివారం చదవండి: పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా! శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్...! -
బైక్ ధరలను పెంచేసిన హీరో మోటో
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బైక్ లవర్స్కి షాకిచ్చింది. వచ్చే నెలనుంచి తన మోటార్ సైకిళ్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులరీత్యా తమ అన్ని మోడళ్ల బైక్లు, స్కూటర్ల ధరలను పెంచాల్సి వస్తోందని ప్రకటించింది. సవరించిన ధరలు అన్ని షోరూంలలో 2021 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలో సంస్థ వెల్లడించింది. (మారుతి కార్ల ధరలకు రెక్కలు) వినియోగదారుల మీద తక్కువ భారం పడేలా, తమ ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్టు హీర మోటో తెలిపింది. అయితే ధరల పెరుగుదల పరిమాణంపై కంపెనీ నిర్దిష్ట వివరాలు ఇవ్వలేదు. కానీ, ఈ పెరుగుదల రూ .2500 వరకు ఉంటుందని, మోడల్, నిర్దిష్ట మార్కెట్ ఆధారంగా ఉంటుందని హీరో తెలిపింది. కాగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇన్పుట్ ఖర్చుల భారం నేపథ్యంలో అన్నిమోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఏప్రిల్లో బ్యాంకులకు 12 రోజులు సెలవు
ఏప్రిల్లో మీకు ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా? అయితే జాగ్రత్త. ఏప్రిల్లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. ఏప్రిల్లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే అని గుర్తుంచుకోవాలి. మీరు ఈ సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులను పూర్తీ చేసుకుంటే మంచిది. అలాగే, మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య బ్యాంకులకు 7 రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి మీ లావాదేవీలనుముందే ప్లాన్ చేసుకోవడం అవసరం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు మూసివేయబడతాయి. ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6 సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి. ఏప్రిల్లో బ్యాంక్ సెలవులు: ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 4: ఆదివారం ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు ఏప్రిల్ 10: రెండవ శనివారం ఏప్రిల్ 11: ఆదివారం ఏప్రిల్ 13: ఉగాది పండుగ ఏప్రిల్ 14: డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 18: ఆదివారం ఏప్రిల్ 21: శ్రీరామ నవమి ఏప్రిల్ 24: నాల్గవ శనివారం ఏప్రిల్ 25: ఆదివారం చదవండి: క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాంకులు షాక్! -
ఏప్రిల్ 9న రాజకీయ పార్టీ ప్రకటన: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: తాను ఎవరూ వదిలిన బాణం కాదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. మంగళవారం లోటస్పాండ్లోని తన కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో సమన్వయ సమావేశం జరిగింది. జిల్లా నేత లక్కినేని సుధీర్ ఆధ్వర్యంలో పలువురు ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాటు, విధి విధానాల విషయంలో పార్టీ నేతలకు ఉన్న అనుమానాలపై క్లారిటీ ఇచ్చా రు. టీఆర్ఎస్కో, బీజేపీకో ‘బీ’టీమ్గా ఉండాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. సమస్యల సాధనకు మాత్రమే తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. ఖమ్మం వేదికగానే పార్టీ సమర శంఖం పూరిద్దామని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 9న లక్ష మంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేద్దామని చెప్పారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని పలువురు వైఎస్ఆర్ అభిమానులు షర్మిలను కోరారు. -
ఏప్రిల్ 19న ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్ష
లాలాపేట: డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2020–21 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ కోర్సుల్లో (బీఏ, బీకాం, బీఎస్సీ) చేరడానికి ఏప్రిల్ 19న రాష్ట్ర వ్యాప్తంగా అర్హత పరీక్షను (ఎలిజబిలిటీ టెస్టు) నిర్వ హించనుంది. ఈ మేరకు యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దునుకు వేలాద్రి, డా. పర్వతం వెంకటేశ్వర్లు, డా. బాల్రెడ్డి, సాయిబాబా, సత్యానందం తదితరులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎటువంటి విద్యార్హత లేక పోయినా ఈ సంవత్సరం జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఈ పరీక్ష రాయవచ్చన్నారు. తెలంగాణ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ సెంటర్ల ద్వారా ఏప్రిల్ 4 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9959850497, 9000729590 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
వచ్చే నెల 7న ‘నిజామాబాద్ ఎమ్మెల్సీ’ పోలింగ్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ శాసన మండలిలో సుమారు ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో టీఆర్ఎస్ పక్షాన శాసన మండలికి ఎన్నికైన ఆర్.భూపతిరెడ్డి పార్టీ ఫిరాయించారనే కారణంతో గత ఏడాది జనవరి 16న మండలి చైర్మ న్ అనర్హత వేటు వేశారు. 2022, జనవరి 4 వరకు నిజామాబాద్ కోటా శాసన మండలి సభ్యుడి పదవీ కాలం ఉండటంతో ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 12న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు గడువు కాగా, ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో ఏప్రిల్ 7వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రి ల్ 9న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. ఏప్రిల్ 13లోగా నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొంది. -
H1B వీసాపై కత్తి
-
ఏప్రిల్ నుంచి పెట్రో ధరల పెరుగుదల!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 1 తర్వాత పెట్రోలు, డీజిల్ ధరలు 50పైసల నుంచి 1 రూపాయి వరకు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం వాహనాలకు బీఎస్ 4 ప్రమాణ ఇంధనం వాడుతుండగా.. ఏప్రిల్ 1 నుంచి మరింత మెరుగైన బీఎస్ 6 ప్రమాణ ఇంధనం వినియోగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైంది. ‘బీఎస్ 6’ ఇంధనం కారణంగా వాహన కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. బీఎస్ 6 గ్రేడ్ ఇంధన ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించామని, వచ్చే నెలలో అన్ని డిపోలకు బీఎస్ 6 గ్రేడ్ ఇంధనం చేరుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా బీఎస్ 6 గ్రేడ్ ఇంధనమే వాహనాలకు అందుబాటులో ఉంటుందన్నారు. -
వచ్చే ఏడాది ఏప్రిల్లో విద్యుత్ చార్జీల పెంపు!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెరగడం లాంఛనమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే విద్యుత్ టారీఫ్ పెంపు ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి (ఈఆర్సీ) సమర్పించేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) నిరీక్షిస్తున్నాయి. డిస్కంల ఆర్థిక లోటు ఏటేటా పెరిగిపోతుండటంతో సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలను అధిగమించి నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి డిస్కంలు భారీగా విద్యుత్ కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి ఉచిత్ విద్యుత్ సరఫరాను 24 గంటలకు పొడిగించాయి. దీంతో డిస్కంలపై ఆర్థిక భారం భారీగా పెరిగింది. రాష్ట్రంలో వరుస ఎన్నికలు రావడంతో గత మూడేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుతించలేదు. ఇక ఒక్క మున్సిపల్ ఎన్నికలు మాత్రమే మిగిలి ఉండగా, మరో నాలుగైదు ఏళ్ల వరకు రాష్ట్రం లో మరే ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించేందుకు డిస్కంలు సమాయత్తమయ్యాయి. ఏటా నవంబర్లోగా నివేదిక.. ప్రతి ఏటా నవంబర్లోగా డిస్కంలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తమ వార్షిక ఆదాయ అవసరాల అంచనా నివేదికను (ఏఆర్ఆర్) ఈఆర్సీకి సమర్పించాలని కేంద్ర విద్యుత్ చట్టం పేర్కొంటోంది. ప్రస్తుత విద్యుత్ చార్జీలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో యథాతథంగా కొనసాగిస్తే ఏర్పడనున్న ఆర్థిక లోటు, దీనిని అధిగమించేందుకు పెంచాల్సిన విద్యుత్ చార్జీల అంచనాలను ఈ నివేదికలో పొందుపరుస్తాయి. 2020–21కి సంబంధించిన ఏఆర్ఆర్ నివేదికను ఈ నెలాఖరుతో డిస్కంలు ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, మున్సిపల్ ఎన్నికలు ముగిసే వరకు డిస్కంలు వాయిదా వేసుకునే అవకాశాలున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏఆర్ఆర్ను సైతం డిస్కంలు ఈఆర్సీకి సమర్పించలేదు. దీంతో ఎలాంటి మార్పుల్లేకుండా విద్యుత్ చార్జీల్లో యథాతథంగా అమలవుతున్నాయి. ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఏఆర్ఆర్ నివేదికతో పాటు చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించడం ఖాయ మని దక్షిణ డిస్కం (టీఎస్ఎస్పీడీసీఎల్) వర్గాలు పేర్కొన్నాయి. ఒకటి రెండు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు ముగిస్తే వచ్చే ఏప్రిల్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి రావచ్చు. ఒకవేళ ఎన్నికలు ఆలస్యమైతే జూన్ నుంచి చార్జీల పెంపును అమలు చేసే అవకాశముంది. ఈఆర్సీ అంకెల గారడీతో మరింత సంక్షోభం.. ప్రస్తుత చార్జీలను యథాతథంగా కొనసాగిస్తే 2018–19లో రూ.9,970.98 కోట్ల ఆర్థిక లోటు ఏర్పడనుందని గతంలో ఈఆర్సీకి సమర్పించిన ఏఆర్ఆర్ నివేదికలో డిస్కంలు అంచనా వేశాయి. సాగుకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు పోగా మిగిలిన లోటును విద్యుత్ చార్జీల పెంపుతో పూడ్చుకోవాలని డిస్కంలు భావించాయి. ఎన్నికలు దగ్గర్లో ఉండటంతో విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వ అను మతి లభించలేదు. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.4,980 కోట్ల విద్యుత్ రాయితీలు కేటాయించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, డిస్కంల ఆర్థిక లోటు అంచనాలను రూ. 9,970.98 కోట్ల నుంచి రూ. 5,980 కోట్లకు ఈఆర్సీ తగ్గించింది. ఆర్థిక లోటు పెద్దగా లేదని, చార్జీలు పెంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పాత చార్జీలను కొనసాగించా లని 2018–19 టారీఫ్ ఉత్తర్వులు జారీ చేసిం ది. 2018–19 ముగిసేసరికి డిస్కంల ఆర్థిక లోటు రూ. 5,000 కోట్లకు చేరిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన ఆసరా పెన్షన్ల పథకంపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు దృష్టి సారించారు. కొత్త వారితో పాటు, ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారందరికి కూడా ఏప్రిల్ నుంచి పెంచిన కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పెన్షన్ దారుల వయో పరిమితి తగ్గించడంతో పాటు, పెన్షన్ మొత్తాన్ని పెంచుతామంటూ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన లబ్ధిదారుల ఎంపికను ఏప్రిల్ వరకూ పూర్తి చేయాలంటూ సీఎం కేసీఆర్, ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దాంతో సీఎస్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లకు మార్గదర్శకాలను జారీ చేశారు. ఓటర్ లిస్ట్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని.. 57 ఏళ్ల కన్నా ఎక్కువ ఉన్న వారికి పెన్షన్లు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది నూతన లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి కొత్తవారితో పాటు పాత లబ్ధిదారులకు కూడా పెంచిన పెన్షన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. -
ఏప్రిల్ మౌలిక రంగం వృద్ధి 4.7 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక రంగ పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 2018 ఏప్రిల్లో 4.7 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ రంగాల చక్కటి పనితీరు ఇందుకు కారణమయ్యింది. 2017 ఏప్రిల్లో ఈ గ్రూప్ వృద్ధిరేటు 2.6 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఆయా రంగాలను వేర్వేరుగా చూస్తే... వృద్ధి అప్...4 బొగ్గు: 2017 ఏప్రిల్లో అసలు వృద్ధిలేకపోగా –3.3% క్షీణత నమోదయ్యింది. ఈ ఏప్రిల్లో ఏకంగా 16% వృద్ధి నమోదయ్యింది. సహజ వాయువు: వృద్ధి రేటు 2 శాతం నుంచి 7.4 శాతానికి పెరిగింది. సిమెంట్: –5.2 శాతం క్షీణత 16.6 శాతం వృద్ధిలోకి మారింది. రిఫైనరీ ప్రొడక్టులు: 0.2 శాతం వృద్ధి 2.7 శాతానికి ఎగసింది. వృద్ధి డౌన్...3 విద్యుత్: వృద్ధి రేటు 5.3 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది. స్టీల్: వృద్ధి 9% నుంచి 3.5 శాతానికి పడింది. ఎరువులు: 6.2% నుంచి 4.6%కి దిగింది. క్షీణతలో...1 క్రూడ్ ఆయిల్: –0.6 శాతం క్షీణత మరింతగా క్షీణించి –0.8 శాతానికి పడింది. -
నాలుగునెలల గరిష్టానికి డబ్ల్యుపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. మార్చి నెల 2.47 శాతంతో పోలిస్తే ఏప్రిల్ నెలలో 3.18శాతంగా నమోదైంది. ప్రధాన ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 3.6 శాతంగా ఉంది. ఆహార ధరల్లో పెరుగుదలో దీనికి దారి తీసింది. ప్రభుత్వం సోమవారం విడుదలచేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్లో ఆహార ద్రవ్యోల్బణం 0.67 శాతంగాఉంది. గత నెలల ఇది -0.07గా ఉండగా. ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 0.87 శాతానికి పెరిగింది. గత నెలలో -0.29 శాతానికి పెరిగింది. నుంచి 0.0 శాతానికి పెరిగింది.సహజ వాయువు, ముడి పెట్రోలియం 2.4 శాతం పెరిగింది. గత నెలలో 80.2 శాతం నుంచి 82.1 శాతంగా నమోదైంది. కాగా డబ్ల్యుపీఐ మార్చి నెలలో 2.47 శాతానికి తగ్గింది. ఆహార పదార్ధాల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఎనిమిది నెలల కనిష్ట స్థాయిని తాకింది. -
వికసించిన ఏప్రిల్ పుష్పం
పెద్దవూర (నాగార్జునసాగర్) : మండలంలోని ముసలమ్మచెట్టు స్టేజీ గ్రామంలోని కత్తి ఎల్లారెడ్డికి చెందిన బాబాయ్ హోటల్ ఎదుట ఏప్రిల్ పుష్పం వికసించింది. ఈ పుష్పం ఏడాదిలో ఏప్రిల్ నెలలో ఒకసారి మాత్రమే పూస్తుంది. హోటల్కు వచ్చే వారితో పాటు దేవరకొండ–మిర్యాలగూడెం ప్రధాన రహదారిపై వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఈ పూలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
ఐయామ్ వెరీ సారీ...
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఏప్రిల్ ఈజ్ ది క్రుయలెస్ట్ మంత్’ టీఎస్ ఇలియట్ రాసిన ‘ది వేస్ట్ ల్యాండ్’ కవిత్వంలో మొదటి వ్యాక్యం ఇది. ఆ వ్యాక్యం వెనక ఆయన ఉద్దేశం ఏమిటో గుర్తు లేదుగానీ ఈసారి ఎక్కువ మంది తప్పనిసరి పరిస్థితుల్లో ‘సారీ’లు చెబుతున్నందున నిజంగా ‘ఏప్రిల్ ఈజ్ ది క్రుయలెస్ట్ మంత్’యే. సారీ చెప్పడం అంత సులభమైన విషయం కాదని, సారీ చెప్పడం చాలా కష్టమని మానసిక శాస్త్రవేత్తలు చెప్పడమే కాకుండా ‘సారీ సీమ్స్ టు బీ ది హార్డెస్ట్ వర్డ్’ అంటూ 1970లో ఎల్టాన్ జాన్ పాటగా పాడారు. భారత దేశంలో ఏప్రిల్ రెండవ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ‘సారీ’ చెప్పారు. ఆయన సారీల పర్వంలో అది మూడవది. అంతకుముందు ఆయన పంజాబ్ మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజీథియా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీలకు సారీ చెప్పారు. ఏప్రిల్ నాలుగవ తేదీన ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ విలేఖరులతో మాట్లాడుతూ ఫేస్బుక్ నకిలీ వార్తలు, తప్పుడు వార్తలు, విద్వేష ప్రసంగాలు వచ్చినందుకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగినందుకు ‘సారీ’ చెప్పుకున్నారు. ఆ తర్వాత మరోసారి ఏప్రిల్ పదవ తేదీన అమెరికా సెనేట్కు సారీ చెప్పారు. ఫేస్బుక్ను ప్రారంభించిందీ తానని, అందులోని వ్యవహారాలకు తాను బాధ్యుడినని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని, అందుకు సారీ అని చెప్పారు. రాజకీయాల్లో నిర్లక్ష్యానికి గురైన దళిత సోదర సోదరీ మణులకు అమిత్ షా క్షమాపణలు చెప్పారు. ఇంజన్ లేకుండా ప్రయాణికులు రైలు పరుగెత్తినందుకు భారతీయ రైల్వే ప్రయాణికులకు సారీ చెప్పింది. ఏ రోగికి తప్పుడు ఆపరేషన్ చేసినందుకు ఢిల్లీలోని ఏయిమ్స్ సారీ చెప్పింది. గురుపూరబ్ శుభాకాంక్షలను ఏడు నెలలు ముందుగా చెప్పినందుకు ఉత్తరప్రదేశ్ నేతలు క్షమాపణలు చెప్పారు. ఎన్నికల్లో కేంబ్రిడ్జి అనలిటికా సేవలను వినియోగించుకున్నందుకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్, సీబీఎస్ఈ ఫలితాలు లీకయినందుకు, బ్యాంకు కుంభకోణాలు పెరిగినందుకు, ఎస్సీ,ఎస్టీల చట్టాన్ని సడలించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ సారీ చెప్పాలంటూ రాహుల్ గాంధీ చేసిన డిమాండ్కు ఇంకా స్పందన రావాల్సి ఉంది. ఇంకా క్విడ్ప్రో కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చార్, కథువా లాంటి దారుణ హత్యా, అత్యాచారాలు పెరిగినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పదేళ్లలో కూడా హిందూ టెర్రరిస్టుల కేసుల్లో దోషులను నిరూపించలేకపోయిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పడక సుఖం ఇస్తేనే పాత్రలిస్తామంటూ విలువల వలువలూడదీసిన తెలుగు సినీ పరిశ్రమ ‘సారీ’ చెప్పాల్సి ఉంది. -
శ్రీవారి సేవా టిక్కెట్లు ఏప్రిల్ కోటా విడుదల
సాక్షి, తిరుమల: ఏప్రిల్ నెలకు సంబంధించిన 56,593 శ్రీవారి సేవా టికెట్లను టీటీడీ అధికారులు ఆన్ లైన్లో విడుదల చేశారు. ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు 10 గంటల నుంచి భక్తులకు అందుబాటులో ఉంచారు. ఎలక్ట్రానిక్ డిప్ సిస్టం ద్వారా 10,658 సేవా టికెట్లు టీటీడీ అందుబాటులో ఉంచింది. ఆన్లైన్ సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సుప్రభాతం 7,878, తోమాల సేవ, అర్చన ఒక్కొక్కటి 120 చొప్పున, అష్టదళం 240, నిజపాద దర్శనం 2,300, ఆర్జిత సేవా టిక్కెట్లు మొత్తం 45,935. విశేష పూజ 1,875, కల్యాణోత్సవం 11,250, ఊంజల్ సేవ 3వేలు, ఆర్జిత బ్రహ్మోత్సవం 5,805, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకరణ 12,825 టిక్కెట్లును అందుబాటులో ఉంచింది. -
డిమానిటైజేషన్ : ఉద్యోగాల ఊచకోత
సరిగ్గా ఏడాది కిందట ఉరుములేని పిడుగులా పెద్ద నోట్ల రద్దు దేశంమీద పడింది. ఏడాది తరువాత కూడా ప్రజలను పెద్ద నోట్ల రద్దు ప్రభావం వదిలిపెట్టడం లేదు. డిమానిటైజేషన్ ప్రభావం పడని రంగం లేదు.. అందులో ఉద్యోగాలు కూడా భాగమయ్యాయి. సాక్షి, న్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దు జరిగి నేటికి 12 నెలల పూర్తయ్యాయి. ఏడాది గడిచిన తరువాత కూడా ప్రభుత్వం ముందు వసూలు కానీ రుణాలు, నిరుద్యోగం ప్రభుత్వాన్ని సవాళ్లు విసురుతున్నాయి. దేశంలో పెరుగుతున్న శ్రామిక శక్తికి విలోమానుపాతంగా ఉపాధి మార్గాలు తగ్గుముఖం పడుతున్నాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) అంచనాల ప్రకారం 2017 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఉద్యోగ, ఉపాధి మార్గాలు మందగించాయి. లేబర్ బ్యూరో ఆఫ్ ఎంప్లాయిమెంట్ సర్వే ప్రకారం పెద్ద నోట్ల రద్దు ప్రబావం రోజువారీ కూలీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థల్లో ఉద్యోగస్తుల తగ్గింపు క్రమంగా కొనసాగుతూనే ఉంది. 2017 జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో సీఎంఐఈ వర్గాలు దేశవ్యాప్తంగా 5,19,285 మందిపై సర్వే నిర్వహించింది. ఈ సమయంలో మూడింటరెండొంతుల మంది నిరుద్యోగులుగా మరిపోయారు. ఈ సర్వే ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో మొత్తంగా 1.5 మిలియన్ ఉద్యోగాలు ఊడిపోయాయి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) స్కీమ్ కింద 2017 జులై మొదటి వారంలో 30. 67 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో కేవలం 2.9 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఇతర సర్వేల ప్రకారం పెద్ద నోట్లరద్దు తరువాత సుమారు 107 సంస్థలు 14,668 మంది ఉద్యోగులను తొలగించాయి. దేశంలో భారీ సంస్థలుగా నిలిచిన ఎల్ అండ్ టీ (1888), హిందుస్తాన్ యూనిలీవర్ (1453), ఐడియా సెల్యులార్ (707), ఏసీసీ (535), టాటా మోటార్స్ (534), టాటా స్టీల్ (450), హిందాల్కో (439), టైటాన్ ఇండస్ట్రీస్ (422) మంది ఉద్యోగాలను తొలగించాయి. ఆలోమొబైల్, ఫార్మాస్యుటికల్స్ రంగాల్లోనూ భారీగా ఉద్యోగాల కోత పడింది. లేబర్ బ్యూరో క్వార్టర్లీ ఎంప్లాయిమెంట్ సర్వే అంచనా ప్రకారం 2016 అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో 1.52 లక్షల క్యాజువల్ ఉద్యోగాలు, 46 వేల పార్ట్టైమ్ ఉద్యోగాల్లో కోత పడింది. -
ఆర్ఐఎల్కు జియో జోష్
ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో జోష్తో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా పుంజుకుంది. ఏప్రిల్ నెలలో జియో కస్టమర్లు పెరగడంతో మార్కెట్లో రిలయన్స్ కౌంటర్కు డిమాండ్ పుట్టింది. దాదాపు 3.37 శాతం జంప్చేసి బుధవారం నాటి మార్కెట్ లో టాప్ విన్నర్గా నిలిచింది. 4జీ సేవల మొబైల్ సంస్థ జియోకు కొత్తగా 3.9 మిలియన్లమంది వినియోగదారులు జత కలిశారు. ఏప్రిల్ నెలలో భారీగా వినియోగదారులు పెరగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భారీగా లాభపడింది. మంత్ ఆన్ మంత్ 3.56 వృద్ధిని సాధించి మార్కెట్ లీడర్లు భారతి ఎయిర్టెల్, వోడాఫోన్లను అధిగమించింది. టెలికాం రెగ్యులేటర్ అందించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ 30, 2017 నాటికి రిలయన్స్ జియో మొత్తం చందాదారులు మార్చిలో 10.86 కోట్ల నుంచి 11.26 కోట్లకు పెరిగింది .ఽ వైర్లెస్ సబ్స్క్రైబర్ల విషయంలో జియో మార్కెట్ వాటా మార్చి నెలాఖరు 9.29 శాతం నుంచి 9.58 శాతానికి చేరింది. ఉచిత 4జీ సేవలకు స్వస్తి చెప్పినప్పటికీ కంపెనీ వినియోగదారులు పెరగడంతో ఈ కౌంటర్కు డిమాండ్ పుంజుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో జియో చిన్నభాగమే అయినప్పటికీ కీలక పాత్ర పోషిస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. జయో ఉచిత సేవలు, సరసమైన ధరల నిర్ణయం కొంతకాలంగాభారీ చందాదారులను సంపాదించడానికి సహాయపడిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది సెప్టెంబరులో రిలయన్స్ జియో తన సేవలను ప్రారంభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ జియోలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని అంచనా. -
ఆల్టోను బీట్ చేసిన స్విఫ్ట్
న్యూఢిల్లీ : మార్కెట్లో మారుతీ సుజుకీ కార్ల హవా అంతా ఇంతా కాదు. పోటీపడి మరీ ఆ దిగ్గజ కార్లు టాప్ ప్లేస్ లో హల్ చల్ చేస్తుంటాయి. ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉండే ఆల్టోను తన తోబుట్టువు స్విఫ్ట్ బీట్ చేసింది. ఏప్రిల్ నెలలో మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా స్విఫ్ట్ నిలిచింది. 10 బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ లో ఏడు మారుతీ సుజుకీవే చోటు దక్కించుకున్నాయి. మిగిలిన మూడు స్థానాలు మారుతీ సుజుకీ ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ కార్లు ఉన్నాయి. సియామ్ తాజా డేటా ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో స్విఫ్ట్ కార్లు 23,802 యూనిట్లు అమ్ముడు పోయాయని తెలిసింది. ముందటేడాది ఇదే నెలలో ఇవి 15,661 యూనిట్లుగా ఉన్నాయి. అంటే గతేడాది కంటే ఈ ఏడాదికి 51.98 శాతం అమ్మకాలను పెంచుకుంది ఈ మోడల్. ఆల్టో మోడల్ 22,549 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది కంటే ఈ ఏడాది వృద్ధి 35.97 శాతం. 2016 ఏప్రిల్ లో ఆల్టో నెంబర్ వన్ సెల్లింగ్ మోడల్. ఆ సమయంలో స్విఫ్ట్ రెండో స్థానంలో ఉండేంది. ప్రస్తుతం ఆల్టోను స్విఫ్ట్ బీట్ చేసింది. మారుతీ సుజుకీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బెలానో మూడో స్థానంలో 17,530 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. గతేడాది 8వ స్థానంలో ఉండగా.. ఇది ప్రస్తుతం 3వ స్థానానికి వచ్చేసింది. వాగన్ ఆర్ 4వ స్థానం, హ్యుందాయ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10లు, ఐదు ఆరు స్థానాలు, మారుతీ సుజుకీ విటారా బ్రిజా 7వ స్థానం, హ్యుందాయ్ క్రిటా 8వ స్థానం, మారుతీ సుజుకి డిజైర్ టూర్ 9వ స్థానం, సెలెరియో 10వ స్థానం దక్కించుకున్నాయి. -
ఐటీ ఇండస్ట్రిలోనే భారీగా పతనం
న్యూఢిల్లీ : ఐటీ ఇండస్ట్రిలో ఇటీవల నెలకొన్న ఉద్యోగులపై ఉద్వాసన వేటు తెలిసిందే. ఇటు ఉద్యోగుల కోత మాత్రమే కాక, అటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల నియామకం కూడా భారీగా పతనమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐటీ ఇండస్ట్రిలో ఉద్యోగుల నియామకం 24 శాతం పడిపోయినట్టు నౌకరి.కామ్ తాజా సర్వేలో తెలిసింది. మొత్తంగా కొత్త ఉద్యోగాల కల్పన 11 శాతం పడిపోగా.. దానిలో ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీలోనే క్షీణించినట్టు తాజా సర్వే పేర్కొంది. గతేడాది కంటే ఈ ఏడాదిలో 24 శాతం పడిపోయినట్టు నౌకరి జాబ్ సీక్ ఇండెక్స్ నివేదించింది. మేజర్ మెట్రోలు ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నైలోనే ఏడాది ఏడాదికి ఉద్యోగుల కల్పన తగ్గిపోయినట్టు ఈ ఇండెక్స్ పేర్కొంది. టెలికాం, బీపీఓ, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగాల్లో ఈ క్షీణత ఎక్కువగా కనబడుతుందని తెలిపింది. కీలక పరిశ్రమలు నిర్మాణం, బీపీఓలలో 10 శాతం, 12 శాతం ఉద్యోగుల నియామకం పడిపోగా, బ్యాంకింగ్ సెక్టార్ లో 11 శాతం తగ్గిపోయింది. జాబ్ మార్కెట్ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితుల్లో కొనసాగుతుందని, ఏప్రిల్ నెలలో ఈ నెగిటివ్ వృద్ధి 11 శాతం నమోదైనట్టు పేర్కొంది. మరి కొన్ని నెలల పాటు మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగనుందని ఈ ఇండెక్స్ తెలిపింది. ఎనిమిది మెట్రోల్లో ఆరు మెట్రోల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఈ ఇండెక్స్ రిపోర్టు తెలిపింది. -
నాలుగు నెలల కనిష్టానికి డబ్ల్యుపీఐ
న్యూడిల్లీ: టోకుధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది. ఏప్రిల్ నెల డబ్ల్యుపీఐ 3.85 శాతంగా నమోదైంది. పదార్ధాల తయారీ, వస్తువుల ధరల ధరలు చల్లబడడంతో ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గింది. ఏప్రిల్లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం 2.99 శాతంగా నమోదైంది. మార్చ్లో ఇది 3.8 శాతంగా ఉంది. 2011-12 బేస్ ఇయర్గా టోకు ధరల ద్రవ్యోల్బణ కొత్త సిరీస్ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 697 అంశాలను కలిగి ఉండగా, వీటిలో ప్రాథమిక వస్తువులు 117, ఇంధన మరియు శక్తికి 16, తయారీ ఉత్పత్తులు 564 ఉన్నాయి. ప్రభుత్వం నేడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్లో ఆహార ద్రవ్యోల్బణం 1.16 శాతంగా నమోదైంది. మార్చిలో 3.82 శాతం కన్నా తక్కువ. సీపీఐ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 0.61 శాతానికి పరిమితం అయింది. గత నెలలో ఇది 1.93 శాతంగా ఉంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ ద్రవ్యోల్బణం 2.54 శాతం నుంచి 1.21 శాతానికి దిగి వచ్చింది. పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 15.94 శాతానికి చేరుకుంది. కూరగాయల ధరలు మైనస్ 1.24 శాతం నుంచి -8.59 శాతానికి తగ్గాయి.ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 18.52 శాతంగా ఉండగా, తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 2.66 శాతం నమోదైంది. కొత్త సిరీస్ డేటా ప్రకారం ఫ్యూయల్ అండ్ లైట్ ఇన్ఫ్లేషన్ 5.56 శాతం నుంచి 6.13 శాతానికి పెరిగింది. క్లోతింగ్ అండ్ ఫుట్ వేర్ ద్రవ్యోల్బణం 4.6 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 4.58 శాతంగా పరిమితమైంది. గ్రామీణ ద్రవ్యోల్బణం 3.75 శాతం నుంచి 3.02 శాతానికి దిగి రావడం విశేషం. హౌసింగ్ ఇన్ఫ్లేషన్ 4.86 శాతానికి చేరుకుంది. ఇక పాన్ అండ్ టుబాకో ఇన్ఫ్లేషన్ 6.23 శాతం నుంచి 6.05 శాతానికి తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు మార్చి నెలలో 2.7 శాతానికి తగ్గింది, అంతకు ముందు సంవత్సరం ఇది 5.5 శాతంగా ఉంది. -
మరోసారి మారుతీ రికార్డు సృష్టించింది!
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ మరోసారి రికార్డు సృష్టించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో విక్రయాల జోరును కొనసాగించింది. ఏప్రిల్ నెలలో కంపెనీ దేశీయ విక్రయాలు 23 శాతం కంటే పెరిగి, 1,44,081 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కారు దిగ్గజానికి ఇది మరో కొత్త రికార్డు. వ్యాన్స్ మినహా మిగతా అన్ని సెగ్మెంట్ వెహికిల్స్ లలో మారుతీకి రెండకెల వృద్ధి నమోదైంది. మినీ సెగ్మెంట్ (ఆల్టో, వాగన్ ఆర్) 22 శాతం పెరిగింది. కాంపాక్ట్ సెగ్మెంట్(సిఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్) వాహనాల్లో కూడా వాల్యుమ్ లో 39 శాతం పైగా మారుతీ ఎగిసింది. గత నెలలో యుటిలిటీ వాహనాల విక్రయాలు కూడా 28 శాతం కంటే పైగా పెరిగినట్టు కంపెనీ చెప్పింది. ఎగుమతులతో కలిపితే మొత్తంగా కంపెనీ వాల్యుమ్ ఏప్రిల్ లో 19.5 శాతం పెరిగి, 1,51,215 వాహనాలు విక్రమైనట్టు తెలిసింది. అయితే గత నెలలో కంపెనీ ఎగుమతులు వాల్యుమ్ 29 శాతం క్షీణించి కేవలం 6,723 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయి. -
ప్రజా పంపిణీ 81.41 శాతం పూర్తి
– 2,21,258 కార్డులకు నగదు రహితంపై సరుకులు – అత్యధికంగా బేతంచెర్ల మండలంలో నగదురహిత లావాదేవీలు కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రజా పంపిణీ కార్యక్రమం శనివారం నాటితో ముగిసింది. 81.41 శాతం కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. జిల్లాలో 2,423 చౌకదుకాణాలు ఉండగా.. 11,90199 రేషన్ కార్డులు ఉన్నాయి. సాయంత్రం 7గంటల సమయానికి 9,36,419 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 2,21,258 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్లో నగదు రహితంపై సరుకుల పంపిణీ గణనీయంగా పెరిగింది. బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 60.86 శాతం కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. కోవెలకుంట్ల, సంజామల, పగిడ్యాల, ఓర్వకల్లు మండలాల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అతి తక్కువగా ఎమ్మిగనూరు మండలంలో 3.41శాతం కార్డులకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహించారు. ఈ మండలంలో 45,603 రేషన్ కార్డులు ఉండగా 37,816 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 1,558 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. -
జియో ప్రైమ్ గడువు పెంపు??
ముంబై: టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన జియో తన దూకుడును కొనసాగించడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. ఉచిత కాల్స్, డేటా ఆఫర్లతో సంచలనం సృష్టిచింది. తన వినియోగదారులకు అందించిన ఉచిత జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ మార్చి 31తో ముగియబోతోంది. దీని తర్వాత ఏడాదిపాటు ఉచిత సర్వీసులు కావాలంటే రూ.99తో జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకోవాలి. అయితే ఈ సభ్యత్వం గడువు కూడా మార్చి 31తో ముగియనుంది. అయితే వినియోగదారుల సంఖ్య పెంచుకోవడానికి జియో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మరో నెలరోజులు పాటు ప్రైమ్ సభ్యత్వ గడువును పెంచి ఎక్కువ మొత్తంలో చందాదారులను చేర్చుకోవాలని భావిస్తోంది. అంటే ఏప్రిల్ 30లోపు రూ.99చెల్లించి ప్రైమ్ మెంబర్షిప్ పొందొచ్చు. ఇప్పటికే ఉచిత ఆఫర్లతో తమ వ్యాపారాలను భారీగా దెబ్బతీశాయని ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు పలుసార్లు ట్రాయ్కి ఫిర్యాదులు చేస్తున్నాయి. దీనిపై ఇతర టెలికాం సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కంటాక్స్ రూల్స్..
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థికబిల్లును బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో 2017-18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది. దీని ప్రకారం ఏప్రిల్ 1, 2017 నుండి కొన్ని ఆదాయ పన్ను చట్టాలు మారనున్నాయి. 2017 ఆర్థిక బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివిధ ఆదాయ పన్ను చట్ట సవరణలను ప్రకటించారు. వీటికి అదనంగా, కొన్ని సవరణలను కూడా లోక్సభ ఆమోదించింది. దీని ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇన్కంటాక్స్ రూల్స్ ఇలా ఉండనున్నాయి. 1. రూ. 2.5 లక్షలు- రూ. 5 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారికి పన్ను శాతం తగ్గనుంది. అలాగే మొత్తం ఆదాయం రూ.1 కోటి లోపు ఉంటే, ఆదాయపు పన్ను 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గనుంది. దీంతో ఏడాదికి రూ. 12, 500 పన్ను తగ్గనుంది. సర్ఛార్జ్, సెస్లతో కలుపుకుని రూ. 14, 806 రూపాయలు ఆదా కానుంది. రూ.3-5లక్షల ఆదాయం ఉన్నవారు రూ.7700, రూ. 5-50 లక్షల ఆదాయం ఉన్నవారికి రూ.12,900 ఆదా కానున్నాయి. 87ఎ సెక్షన్ ప్రకారం ఈ తగ్గింపు లభించనుంది. అయితే రూ.3.50 లక్షలు ఆదాయ పన్నుచెల్లించేవారికి మాత్రం ఈ రిబేటు వర్తించదు. 2. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి లోపు ఆదాయం ఉన్న సంపన్నులకు పన్నుపై పది శాతం సర్ఛార్జ్ విధింపు. ఇదిగతంలో 15 శాతంగా ఉంది. అయితే రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం గల కుబేరులపై మాత్రం ఈ సర్ఛార్జ్ విధింపులో మార్పులేకుండా 15 శాతంగా ఉండనుంది. ఆదాయం రూ. 3.5 లక్షల ఉన్న వారికి పన్ను రిబేటును రూ. 5000ల నుంచి రూ. 2,500కు తగ్గించారు(గతంలో ఇది రూ.5 లక్షలుగా ఉండేది). ట్యాక్స్, రిబేట్లలో మార్పుల ఉమ్మడి ప్రభావంతో గతంలో రూ. 3.5 లక్షల ఆదాయంలోపు ఉన్నవారు రూ. 5,150 పన్ను చెల్లించగా.. ఇప్పుడు రూ. 2,575 చెల్లిస్తే సరిపోతుంది. 3. రూ. 5లక్షలలోపు ఆదాయం ఉన్న వారికోసం సింపుల్ వన్ పేజీ ఫాంను కొత్తగా పరిచయం చేసింది. అంటే రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు (వ్యాపార ఆదాయం కాకుండా) సులభమైన ఒకటే పేజ్తో పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు. ఈ విభాగంలో మొదటిసారిగా దాఖలు చేసే పన్ను రిటర్న్లపై సహజంగానే స్క్రూటినీ ఉండదు. 4. నేషనల్ పెన్షన్ స్కీం విత్ డ్రాలపై ఎలాంటి పన్ను వుండదు. ఖాతాదారులకు 25 శాతం అత్యవసరాలకోసం విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే రిటైర్మెంట్ తర్వాత విత్డ్రాలపై వచ్చే మొత్తంగా 40శాతానికి ఎలాంటి టాక్స్ ఉండదు. 5. లిస్టెడ్ ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ ఓరియెంటెడ్ ఫండ్స్లో లిక్విడ్ యూనిట్స్లో మొదటిసారి పెట్టుబడులకు మినహాయింపును ఇచ్చే రాజీవ్ గాంధీ ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ను 2017-18 నుంచి ఉపసంహరిస్తున్నారు. చిన్న ఆదాయ దారులను పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలో ప్రోత్సహించేందుకు గాను 2012-13 లో ప్రత్యేకంగా పరిచయం చేసిన ఈ విధానంలో మార్పుల ద్వారా 2018-19 నుంచి ఎలాంటి మినహాంపులు లభించవు. 6. స్థిరాస్థులపై పెట్టుబడులను లాంగ్టెర్మ్గా పరిగణిచేందుకు అవసరమైన కాలపరిమితిని 3 ఏళ్ల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో స్థిరాస్తులపై 2 సంవత్సరాలకు మించిన పెట్టుబడులపై పన్ను 20 శాతానికి పరిమితం చేయడంతో పాటు, తిరిగి పెట్టుబడులు చేయడంపై పలు మినహాయింపులకు అర్హత లభిస్తుంది. 7. ప్రతిఫలంలో సవరణల్లో మార్పుల కారణంగా.. లాంగ్టెర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ తక్కువ పేఅవుట్స్కు కారణం కానుంది. ధర ఇండెక్సేషన్కు బేస్ ఇయర్ను 1981 ఏప్రిల్ 1 నుంచి, 2001 ఏప్రిల్ 1 కి మార్చారు. దీంతో అమ్మకాలపై లాభాలు తగ్గనున్నాయి. 8.అంతే కాకుండా, నోటిఫైడ్ రెడీమబుల్ బాండ్లలో కేపిటల్ గెయిన్స్పై రీఇన్వెస్ట్మెంట్కు పన్ను మినహాయింపు వర్తిస్తుంది(ఎన్హెచ్ఏఐ, ఆర్ఈసీ బాండ్లలో పెట్టుబడులకు అదనంగా). 9. ఆదాయ పన్ను చట్టంప్రకారం దీనిపై ట్రాన్సాక్షన్ మొత్తంపై 100శాతం జరిమానా. ట్యాక్స్ రిటర్న్ పునస్సమీక్షించేందుకు కాలపరిమితిని రెండేళ్ల నుంచి అదే ఆర్థిక సంవత్సరం చివరకు లేదా అసెస్మెంట్ ఏడాది చివరకు.. ఏది త్వరగా ముగియనుంటే దానికి పరిమితం చేశారు. 10. 2017-18 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్ను ఆలస్యంగా.. అంటే 2018 డిసెంబర్ 31వరకూ దాఖలు చేసినవారు రూ. 5,000వేలు, ఆ తర్వాత దాఖలు చేసే వారు రూ. 10వేలు అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులపై మాత్రం ఈ పెనాల్టీని రూ. 1000కి పరిమితి విధించారు. అలాగే నల్లధనాన్ని నిరోధించే ఉద్దేశంతో నగదులావాదేవీలపై పరిమితి విధించింది. ఈ పరిమితిని బడ్జెట్ లో ప్రతిపాదించిన రూ.3లక్ష నుంచి రూ. 2 లక్షలకు తగ్గించింది. రూ. 2లక్షల పైన లావాదేవీలపై ఆంక్షలు. దీని ప్రకారం లావాదేవీలపై 100శాతం జరిమానా. పాన్ కార్డు దరఖాస్తుకు , ట్యాక్స్ రిటర్న్కు ఆధార్ కార్డు తప్పనిసరి. జులై 2017నుంచి ఈ నిబంధన అమలుకానుంది. -
జియో యూజర్లు సగం తగ్గిపోనున్నారట!
ముంబై: ఉచిత ఆఫర్లతో టెలికాం మార్కెట్లోకి దూసుకొచ్చిన రిలయన్స్ జియోకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ తరువాత జియో ఖాతాదారుల సంఖ్య సగానికి పడిపోనుందట. ముఖ్యంగా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ మార్చి31తో ముగియ నుండటంతో జియో యూజర్లు వేరే నెట్వర్క్కు మారిపోయే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. దాదాపు ఆరునెలలపాటు ఉచిత డ్యాటా, వాయిస్ సేవలను అనుభవించిన జియో ఖాతాదారులు ఏప్రిల్ నుంచి కొత్త తారిఫ్లు అమలుకానున్న నేపథ్యంలో జియో లో ఉండాలా వద్దా లేదా ఆలోచిస్తారని తెలుస్తోంది. అలాగే డ్యాటా క్వాలిటీ, స్పీడ్ పై వేచి సూచే ధోరణిని అవలంబించనున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను రిలయన్స్ ప్రైమ్ మెంబర్ గా చేరినా.. జియో సేవల నాణ్యతపై వేచి చూస్తానని కోలకతాకుచెందిన ప్రభుత్వ రంగ బ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ షావోన్ దాస గుప్తా (69) చెప్పారు. ఈయన వాయిస్ కాల్స్కోసం వోడాఫోన్ ను వినియగిస్తే.. డాటా సర్ఫింగ్ కోసం జియోను వాడతారట. కోలకతా లో ఒక PSU ఒక అతను జియో ప్రధాని చేరాల్సి కానీ దాని సేవలు ఏదైనా లోపం కోసం లుకౌట్ న ఉంటుంది అన్నారు. దాస్గుప్తా వోడాఫోన్ నుండి తన కాల్స్ చేస్తుంది మరియు డేటా సర్ఫింగ్ కోసం తన జియో సిమ్ ఉపయోగిస్తారట. మార్కెట్లో పోటీదారులతో పోలిస్తే జియో ధరలు బావుంటే కొనసాగుతానని, లేదంటే వోడాఫోన్కు మళ్లీ తరలిపోనున్నట్టు చెప్పారు. కాగా వెల్ కం ఆఫర్ తో సంచలనంగా దూసుకొచ్చిన జియో హ్యాఫీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఇది మార్చి 31తో ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్ షిప్ స్కీం, కొత్త టారిఫ్ లను ప్రకటించింది. ప్రైమ్ మెంబర్లుగా మారాలంటే ముందు రూ.99 చెల్లించాలి. ఈ ఫీజు ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది. రిలయన్స్ అధినేత ముకేష అంబానీ ప్రకటించిన దాని ప్రకారం ఇలా మెంబర్లుగా మారిన తర్వాత ఫ్రీ ఆఫర్లు వాడుకోవాలంటే మాత్రం నెలకి మరో 303 రూపాయలు చెల్లించాల్సిన సంగతి తెలిసిందే. -
వన్ ప్లస్ సంచలనం: 8 జీబీ ర్యామ్తో మొబైల్
చైనాకు చెందిన మొబైల్ తయారీదారు వన్ ప్లస్ తక్కువ ధరలో హైఎండ్ ఫోన్లను అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. వన్ ప్లస్ విడుదల చేసిన వన్ ప్లస్ 3 ఫోన్ 6 జీబీ ర్యామ్తో ఫోన్ ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా 8 జీబీ ర్యామ్తో వన్ ప్లస్ 5ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలిసింది. అదేంటి వన్ ప్లస్ 4ని విడుదల చేయకుండానే వన్ప్లస్ 5కి కంపెనీ వెళ్లింది ఏంటా? అనుకుంటున్నారా.. చైనాలో నాలుగు అంకెను దురదృష్టంగా భావిస్తారు. సో.. వన్ ప్లస్ 5ని మార్కెట్లోకి రానుంది. ఏప్రిల్లో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర రూ.30 వేల వరకూ ఉండొచ్చు. వన్ప్లస్ 5 ఫీచర్లు: ర్యామ్: 8 జీబీ ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 64 జీబీ ఇంటర్నల్ మెమరీ ఆండ్రాయిడ్ 7.0(నౌగాట్) కెమెరా: 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సల్ వాటర్ప్రూఫ్ గోల్డ్, వైట్, బ్లాక్, సెరామిక్ రంగుల్లో మొబైల్ 5.5 ఇంచుల హెచ్డీ అమోఎల్ఈడీ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
రికార్డు స్థాయిలో టాక్స్ రిటర్న్స్ ఈ-ఫైలింగ్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో టాక్స్ రిటర్న్స్ 68.5శాతం పెరిగి, రికార్డు సృష్టించాయి. 8.32 లక్షల మంది వినియోగదారులు, ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్(ఐటీఆర్స్) ను ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేశారని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) గణాంకాలు తెలిపాయి. అయితే 2015-16లో ఈ-ఫైలింగ్ రిటర్న్స్ 4.94 లక్షలుగా మాత్రమే రికార్డు అయినట్టు పేర్కొంది. ఈ-ఫైలింగ్ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా యూజర్లు ఇంట్లోనే ఉండి తేలికగా ఈ సదుపాయాన్ని వాడుకుంటున్నారని తెలిపింది. 2016 ఏప్రిల్ 30వరకు మొత్తం 5.25 కోట్ల యూజర్లు రిజిస్టర్ చేసుకున్నారని, 49.54 శాతం రిటర్న్స్ ఆఫీసు పనివేళల్లో కాకుండా ఇతర సమయాల్లో.. అంటే ఇళ్లలో ఉన్నప్పుడే నమోదయ్యాయని సీబీడీటీ పేర్కొంది. అమెరికాలో కంటే భారత్ లోనే టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం సులభతరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రారంభ సమయంలో ఈ-ఫైలింగ్ చాలా భారమైన పని అని, తర్వాతి కాలంలో ఇది సులభతరంగా మారిందని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్ పీ పార్టనర్ దివ్య బవేజా తెలిపారు. మార్చి 30న కొత్త ఫారాలను సీబీడీటీ నోటిఫై చేసింది. వాటిని జూలై 31లోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రిటర్న్స్ ఫైల్ చేయడం మహారాష్ట్ర నుంచి జరిగాయని, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లు తర్వాతి స్థానాల్లో నిలిచాయని డేటా నివేదించింది. -
ఏప్రిల్ లో కార్ల అమ్మకాలు రయ్.. రయ్..
న్యూఢిల్లీ : వరుసగా మూడు నెలల పతనం అనంతరం ఏప్రిల్ నెలలో ప్యాసెంజర్ కార్ల అమ్మకాలు పెరిగాయి. 1.87శాతం వృద్దిని కార్ల అమ్మకాలు నమోదుచేశాయి. భారత ఆటోమోబైల్ తయారీదారుల సొసైటీ(ఎస్ఐఏమ్) విడుదల చేసిన గణాంకాల్లో దేశీయ కార్ల అమ్మకాలు ఏప్రిల్ లో 1,62,566 యూనిట్లగా రికార్డు అయ్యాయి. గతేడాది ఇదే నెలల్లో ఈ అమ్మకాలు 1,59,588 యూనిట్లగా ఉన్నాయి. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన మారుతీ బాలెనో, రెనాల్డ్ క్విడ్ లతో ఈ అమ్మకాలు పెరిగినట్టు ఎస్ఐఎమ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాధుర్ తెలిపారు.అయితే గ్రామీణ ప్రాంతాల్లో కార్ల అమ్మకాలు ఇంకా తక్కువగానే నమోదవుతున్నాయని చెప్పారు. మొత్తం ప్యాసెంజర్ వాహన రంగం 11శాతం వృద్ధిలో ఉందని, యుటిలిటీ వెహికిల్స్ హ్యుందాయ్ క్రిటా, మారుతీ విటారా బ్రీజా, మహింద్రా కేయూవీ100 ఈ వృద్ధికి దోహదంచేశాయని మాథుర్ తెలిపారు.అదేవిధంగా కమర్షియల్ వాహనాల అమ్మకాలు కూడా ఏప్రిల్ నెలలో 17.36 శాతం వృద్ధితో 53,853యూనిట్లగా నమోదయ్యాయని పేర్కొన్నారు. ఏప్రిల్ లో ప్యాసెంజర్ వాహన అమ్మకాలు 11.04శాతం వృద్ధిని నమోదుచేసి, 2,42,060 యూనిట్లగా రికార్డు అయ్యాయి. గతేడాది ఈ నెలలో ఈ అమ్మకాలు 2,17,989గా ఉన్నాయి. యుటిలిటీ వెహికిల్స్ 42.82శాతం వృద్ధిని నమోదుచేశాయి. మారుతీ సుజుకీకి ఏప్రిల్ లో 2.72శాతం వృద్ధితో 86,481యూనిట్ల దేశీయ అమ్మకాలు జరిగాయి. అయితే దాని ప్రత్యర్థి హ్యుందాయ్ మోటార్ అమ్మకాలు పడిపోయాయి. 10.52శాతం అమ్మకాలు కిందకి జారి, కేవలం 34,425 యూనిట్లనే నమోదుచేశాయి. అదేవిధంగా ఏప్రిల్ నెలలో టూవీలర్స్ అమ్మకాలు కూడా 21.23శాతం పెరుగుదలతో 15,60,339యూనిట్ల అమ్మకాలు జరిగాయి. 2016 ఏప్రిల్ నెలలో అన్ని విభాగాల్లో నమోదైన ఈ వృద్ధి భారత ఆటోమోటివ్ పరిశ్రమలో పాజిటివ్ ట్రెండ్ ను సూచిస్తుందని ఆటోమోబైల్ నిపుణులంటున్నారు. త్వరలోనే డీజిల్ వెహికిల్స్ సమస్యలు కూడా పరిష్కారం కాగలవని ఆశిస్తున్నారు.