-
World Cup 2023: ఇంగ్లండ్పై ఆస్ట్రేలియా ఘన విజయం
వన్డే ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా మరో విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో 33 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 253 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్లతో అదరగొట్టాడు. అతడితో పాటు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్, హాజిల్వుడ్ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్(64) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. డేవిడ్ మలాన్(50) పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(71) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. స్టీవ్ స్మిత్(44), కామెరాన్ గ్రీన్(47) పరుగులతో పర్వాలేదనపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు లివింగ్స్టోన్, విల్లీ చెరో వికెట్ సాధించారు. చదవండి: World Cup 2023: ఆస్ట్రేలియాకు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేస్తున్నాడు -
రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ 287
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలోనే ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ వికెట్లు కోల్పోయిన ఆసీస్ను మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ అదుకున్నారు. మూడో వికెట్కు వీరిద్దరూ 76 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం స్మిత్ ఔటైనప్పటికీ.. లబుషేన్ మాత్రం తన పని తను చేసుకుపోయాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(71) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. స్టీవ్ స్మిత్(44), కామెరాన్ గ్రీన్(47) పరుగులతో పర్వాలేదనపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లతో చెలరేగగా.. మార్క్ వుడ్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు లివింగ్స్టోన్, విల్లీ చెరో వికెట్ సాధించారు. చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్కప్ చరిత్రలోనే -
WC 2023: వన్డే వరల్డ్కప్లో భాగమయ్యే ఆటగాళ్లు.. 10 జట్ల పూర్తి వివరాలివే
ICC ODI World Cup 2023 All Final Squads: ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా అక్టోబరు 5న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య పోరుతో మెగా క్రికెట్ సమరానికి తెరలేవనుంది. పుష్కరకాలం తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా సహా ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్.. మొత్తంగా పది జట్లు పాల్గొననున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం నుంచే వామప్ మ్యాచ్లు కూడా మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే వరల్డ్కప్-2023 కోసం ఆయా మేనేజ్మెంట్లు ఖరారు చేసిన ఫైనల్ టీమ్లకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.. టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్. పాకిస్తాన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ ఆఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం. అఫ్గనిస్తాన్ హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా జుర్మతి, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ ఇసాఖిల్, ఇక్రమ్ అలీ ఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్ అర్మాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లకన్వాల్, ఫజల్హక్ ఫారూఖీ, అబ్దుల్ రెహ్మాన్ రహ్మానీ, నవీన్ ఉల్ హక్ మురీద్. ఆస్ట్రేలియా ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్. బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ కుమర్ దాస్, తన్జిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (వైస్ కెప్టెన్), తవ్హిద్ హృదోయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసూమ్ అహ్మద్, షేక్ మహేదీ హసన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తాంజిమ్ హసన్ సకీబ్. ఇంగ్లండ్ జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్. నెదర్లాండ్స్ స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మ్యాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కొలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లెయిన్, వెస్లీ బారెసి, సాకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్ట్. న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్. సౌతాఫ్రికా తెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహారాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, తబ్రేజ్ షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్. శ్రీలంక దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దుషన్ హేమంత, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీషా పతిరానా, లాహిరు కుమార, దిల్షాన్ మదుశంక. చదవండి: WC 2023: బహుశా నాకు ఇదే చివరి వరల్డ్కప్ కావొచ్చు: టీమిండియా స్టార్ -
WC 2023: ఈసారి వరల్డ్కప్ ఫేవరెట్లు ఆ ఐదు జట్లే! కానీ..
ICC World Cup 2023: వన్డే వరల్డ్కప్-2023కి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్- న్యూజిలాండ్ మధ్య అక్టోబరు 5న ఈ ఐసీసీ ఈవెంట్ 13వ ఎడిషన్ మొదలుకానుంది. పుష్కర కాలం తర్వాత భారత్ ఆతిథ్య ఇస్తున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ తదితర పది జట్లు పాల్గొనబోతున్నాయి. 2011లో.. తర్వాత మళ్లీ ఇప్పుడే ఇక సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో రోహిత్ సేన హాట్ ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఆసియా వన్డే కప్-2023 గెలిచి జోరు మీదున్న భారత జట్టు 2011 నాటి ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ రాకతో మరింత పటిష్టంగా మారగా.. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా కూడా బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(బార్డ్) వరల్డ్కప్-2023లో ఫేవరెట్లు ఎవరన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఈ ఐదు జట్లు ఫేవరెట్.. కానీ ‘‘వన్డే క్రికెట్లో ప్రపంచంలోనే ఇండియా టాప్ ర్యాంకులో ఉంది. అదీగాకుండా ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగనుంది. కాబట్టి వాళ్లకు హోం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇక ఇంగ్లండ్.. డిఫెండింగ్ చాంపియన్ కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్తో స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు అపార అనుభవం ఉంది. కాబట్టి ఆసీస్ జట్టు కూడా ఎప్పుడూ బలమైన పోటీదారే. పాకిస్తాన్ కూడా తనదైన రోజున అత్యంత ప్రమాదకారిగా మారుతుంది. పాక్ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ఇక సౌతాఫ్రికా కూడా గత కొన్నేళ్లుగా మెరుగ్గా ఆడుతోంది. సమతూకమైన జట్టుగానూ ఉంది. న్యూజిలాండ్, శ్రీలంక కూడా సవాల్ విసరగలుగుతాయి. అయితే, ఐసీసీ వరల్డ్కప్ విజేత ఎవరన్న అంశంపై అంచనా వేయడం కష్టం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రస్తుత ఫామ్, ర్యాంకింగ్ దృష్ట్యానే ఈ టీమ్లను ఎంచుకోవడం జరిగింది’’ అని బార్డ్ సమాధానమిచ్చింది. చదవండి: Ind vs Aus: తప్పు నీదే.. వరల్డ్కప్ జట్టు నుంచి తీసేయడం ఖాయం.. జాగ్రత్త! -
బజ్బాల్ సూపర్! రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి: టీమిండియా దిగ్గజం
Indian cricket legend Praising England’s “Bazball” approach: సంప్రదాయ క్రికెట్లో ఇంగ్లండ్ అనుసరిస్తున్న ‘బజ్బాల్’ విధానం అద్భుతంగా ఉందని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కొనియాడాడు. టెస్టుల్లో అన్ని క్రికెట్ జట్లు ఇలాంటి దూకుడు ప్రదర్శిస్తే ఆట మరింత రసవత్తరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇటీవల తాను చూసిన అత్యుత్తమ టెస్టు సిరీస్లలో యాషెస్ అద్భుతమని కొనియాడాడు. కాగా న్యూజిలాండ్ మాజీ స్టార్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కోచ్ అయిన తర్వాత.. బెన్స్టోక్స్ సారథంలో బజ్బాల్ విధానానికి శ్రీకారం చుట్టాడు. పరిమిత ఓవర్ల మాదిరే టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే ఇంగ్లండ్ గుర్తుండిపోయే విజయాలు సాధించింది కూడా! డ్రాగా ముగిసినా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లోనూ దూకుడును కొనసాగించింది. తొలి టెస్టులో అతి విశ్వాసంతో ఓటమి పాలైనా వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగింది. ఈ క్రమంలో పర్యాటక ఆసీస్తో కలిసి ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-2తో సమంగా నిలిచి డ్రాతో సరిపెట్టుకుంది. అయితే, సిరీస్ ఆసాంతం.. ముఖ్యంగా ఆఖరి టెస్టు నువ్వా- నేనా అన్నట్లు సాగడం అభిమానులకు మజాను అందించింది. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బజ్బాల్ విధానంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘బజ్బాల్ అద్భుతం. రోహిత్ మరింత దూకుడుగా ఉండాలి ఇటీవల నేను చూసిన సిరీస్లలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా సిరీస్ అత్యుత్తమంగా అనిపించింది. నిజానికి క్రికెట్ అంటే అలాగే ఆడాలి మరి! మన కెప్టెన్ రోహిత్ వర్మ మంచి సారథి అనడంలో సందేహం లేదు. అయితే, నాయకుడిగా తను కూడా ఇకపై మరింత దూకుడుగా ఉండాలి. ఇంగ్లండ్ ఎలా ఆడుతుందో గమనించాలి. కేవలం మనం మాత్రమే కాదు.. అన్ని క్రికెట్ జట్లు బజ్బాల్ గురించి ఆలోచించాలి. కేవలం డ్రాలతో సరిపెట్టుకునే విధానానికి స్వస్తి పలికి దూకుడుగా ఆడుతూ.. గెలుపే పరమావధిగా ముందుకు సాగాలి’’ అని కపిల్ దేవ్ ప్రపంచ టెస్టు క్రికెట్ జట్లకు సూచించాడు. అలాంటపుడే ఆటకు మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ను ఉద్దేశించి కపిల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే.. -
ఏమో.. టీమిండియాపై అదే రిపీట్ చేస్తామేమో! స్టోక్స్ ఓవరాక్షన్ వద్దు!
Ben Stokes Reply on England Bazball Tactics Against Rohit Sharma's Side: ‘బజ్బాల్’ ఇంగ్లండ్ తదుపరి గమ్యస్థానం భారత్. 177 రోజుల తర్వాత అది కూడా హైదరాబాద్లో టీమిండియాతో స్టోక్స్ బృందం తొలి టెస్టు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఆఖరి టెస్టులో అద్భుత విజయం సాధించింది. లండన్లో ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఉత్కంఠగా సాగిన మైదానంలో 49 పరుగుల తేడాతో ప్యాట్ కమిన్స్ బృందంపై గెలుపొందింది. తద్వారా సిరీస్ను 2-2తో సమం చేసుకుంది. అయితే, గత సిరీస్లో ఆస్ట్రేలియా గెలిచిన కారణంగా ట్రోఫీ మాత్రం కంగారూల వద్దనే ఉండనుంది. ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మక యాషెస్ తర్వాత టీమిండియాతో జనవరి నుంచి మరో టెస్టు సిరీస్కు ఇంగ్లండ్ సిద్ధమవుతోంది. ఇక న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్గా వచ్చిన తర్వాత స్టోక్స్ సారథ్యంలో బజ్బాల్ పేరిట దూకుడైన ఆటతో అలరిస్తోంది. మెకల్లమ్ మార్గదర్శనంలో స్టోక్స్ కెప్టెన్సీలో టెస్టుల్లో అగ్రెసివ్ క్రికెట్తో వరుస విజయాలు సాధించింది. అయితే, ఆసీస్తో మాత్రం ఇంగ్లండ్ అనుసరించి ఈ విధానం బెడిసికొట్టింది. ఫలితంగా సిరీస్ గెలిచే అవకాశం చేజారింది. ఈ క్రమంలో ఐదో టెస్టులో విజయానంతరం మీడియాతో మాట్లాడిన బెన్ స్టోక్స్కు టీమిండియాతో సిరీస్ గురించి ప్రశ్న ఎదురైంది. రోహిత్ సేనతో సిరీస్లోనూ బజ్బాల్ కంటిన్యూ చేస్తారా అని అడుగగా.. ‘‘మేము న్యూజిలాండ్ను 3-0తో క్లీన్స్వీప్ చేశాం. అయితే, సౌతాఫ్రికాపై అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాం. మళ్లీ పాకిస్తాన్ను ఓడించాం. కానీ ఆ తర్వాత.. ఆస్ట్రేలియాపై కూడా ఇలాంటి ఫీట్ అందుకోలేకపోయాం. ఏమో ఒకవేళ టీమిండియాతో సిరీస్లో ఇలాంటి విజయం అందుకుంటామేమో! కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది’’ అంటూ స్టోక్స్ బదులిచ్చాడు. కాగా బజ్బాల్తో కివీస్ను 3-0తో వైట్వాష్ చేసిన ఇంగ్లండ్.. సౌతాఫ్రికాపై 2-1తో గెలిచింది. అనంతరం పాకిస్తాన్ను క్లీన్స్వీప్ చేసింది. భారత పర్యటనలో భాగంగా ఇంగ్లండ్.. టీమిండియాతో జనవరి 25- మార్చి 24 వరకు ఐదు టెస్టులు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక స్టోక్స్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ‘‘ఓవరాక్షన్ వద్దు.. ఇక్కడికి వచ్చాక ద్రవ్బాల్ దెబ్బ రుచిచూద్దురు కానీ..’’ అంటూ టీమిండియా అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు వచ్చేశాడు -
'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవడంతో ఇంగ్లండ్ కథ ముగిసేనట్లేనని అంతా భావించారు. కానీ మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో ఐదోటెస్టు ఇంగ్లండ్కు కీలకంగా మారింది. చివరి టెస్టు గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని భావించిన ఇంగ్లండ్ అందుకు తగ్గట్లుగానే బజ్బాల్ ఆటతీరుతో ఆసీస్ను కట్టడి చేసింది. కానీ 384 పరుగుల టార్గెట్ను ఆసీస్ చేధించేలా కనిపించింది. కానీ ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకోవడంతో ఆట ఐదోరోజు తొలి సెషన్లో కథ మొత్తం మారిపోయింది. ఆసీస్ తొందరగా వికెట్లు కోల్పోవడంతో 49 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసీస్ ఆటగాళ్లు, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక దగ్గర చేరి డ్రెస్సింగ్రూమ్లోనే మందు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఖండించాడు. స్టోక్స్ మాట్లాడుతూ.. ''పార్జీ జరిగిన మాట నిజమే.. కానీ మీరు అనుకుంటున్నట్లు డ్రెస్సింగ్ రూమ్లో ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు. నిజానికి మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం అనంతరం ఆసీస్ ఆటగాళ్లు మా దగ్గరకు వచ్చారు. కానీ మా ప్రధాన ఆటగాళ్లు స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్పై స్పెషల్ స్పీచ్లతో చిన్న పార్టీ చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఒక గంటపాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేం బిజీగా ఉండడంతో మమ్మల్ని కలవకుండానే ఆసీస్ ఆటగాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిజానికి యాషెస్ సిరీస్ ముగిశాక ఆసీస్ ఆటగాళ్లతో కలిసి సంప్రదాయ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్, ఇతర కార్యక్రమాల వల్ల కలవడం కుదరలేదు. అయితే ఆసీస్ ఆటగాళ్లతో కలిసి నైట్క్లబ్కు వెళ్లి పార్టీ ఎంజాయ్ చేయాలని నిశ్చయించుకున్నాం. నెలరోజుల పాటు యాషెస్ ఆడాం. ఎన్ని గొడవలు జరిగినా అది మ్యాచ్ల వరకే పరిమితం. బయట ఆ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించుకోం.. సరదాగా ఎంజాయ్ చేయడానికి చూస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత! యాషెస్ చరిత్రలో 26 ఏళ్ల తర్వాత.. -
Ashes 2023: ఉస్మాన్ ఖవాజా అరుదైన రికార్డు! యాషెస్ చరిత్రలో..
The Ashes, 2023- England vs Australia: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియా బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్తో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ(141) సాధించి శుభారంభం అందుకున్న ఈ ఓపెనర్.. మొత్తంగా మూడు అర్ద శతకాలు కూడా సాధించాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఓవరాల్గా 496 పరుగులతో మెరిశాడు. ఈ క్రమంలో యాషెస్ చరిత్రలో అరుదైన ఘనత సాధించిన ఆసీస్ ఓపెనర్ల జాబితాలో చేరాడు. కాగా 1997లో ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాటర్ మాథ్యూ ఇలియట్ యాషెస్ సిరీస్లో మొత్తంగా 556 పరుగులు చేశాడు. అతడి కెరీర్ మొత్తంలో సాధించిన రన్స్లో సగానికి పైగా ఈ ప్రతిష్టాత్మక సిరీస్ సందర్భంగానే స్కోర్ చేయడం గమనార్హం. 26 ఏళ్ల తర్వాత.. ఈ నేపథ్యంలో 26 ఏళ్ల తర్వాత ఖవాజా అత్యధికంగా 496 పరుగులు సాధించి మాథ్యూ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 1997 తర్వాత యాషెస్ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఆసీస్ ఓపెనర్గా నిలిచాడు. ఆ రికార్డు మిస్! ఇదిలా ఉంటే.. 1948లో 39 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ యాషెస్లో 508 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక వయసులో 500కు పైగా రన్స్ సాధించిన ఆసీస్ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో 496 పరుగుల వద్ద నిలిచిపోయిన 36 ఏళ్ల ఖవాజా.. బ్రాడ్మన్ తర్వాత ఈ ఫీట్ నమోదు చేసిన రెండో బ్యాటర్గా రికార్డులకెక్కే అవకాశం కోల్పోయాడు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన యాషెస్ సిరీస్-2023 డ్రాగా ముగిసింది. ఉత్కంఠగా సాగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొంది సిరీస్ను 2-2తో సమం చేయగా.. గత సిరీస్ గెలిచిన ఆసీస్ ట్రోఫీని తమ వద్దే అట్టిపెట్టుకోనుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న క్రిస్ వోక్స్.. మిచెల్ స్టార్క్తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పంచుకున్నాడు. యాషెస్-2023లో ఉస్మాన్ ఖావాజా సాధించిన పరుగులు ►ఎడ్జ్బాస్టన్ టెస్టులో- 141, 65. ►లండన్ టెస్టులో- 17, 77. ►లీడ్స్ టెస్టులో- 13, 43. ►మాంచెస్టర్ టెస్టులో- 3, 18. ►ఓవల్ మైదానంలో- 47, 72. చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి'
దాదాపు నెలరోజులకు పైగా అలరించిన యాషెస్ సిరీస్ ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి 'యాషెస్'ను ఎగురేసుకపోతుందని అంతా భావించారు. కానీ మూడో టెస్టును గెలిచిన ఇంగ్లండ్ 2-1కి ఆధిక్యం తగ్గించింది. ఇక నాలుగో టెస్టులో ఇంగ్లండ్కు గెలిచే అవకాశం వచ్చినప్పటికి వరుణుడు అడ్డుపడడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక కీలకమైన ఐదోటెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లండ్ విధించిన 384 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో 334 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ 49 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది. అయినప్పటికి గత యాషెస్ను గెలిచిన ఆస్ట్రేలియా మరోసారి ట్రోఫీని రిటైన్ చేసుకుంది. నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకుంది. దాదాపు 37 ఓవర్ల పాటు అదే బంతితో బౌలింగ్ చేసింది. బంతి స్వింగ్ కాకపోవడంతో ఇంగ్లండ్ పేసర్లు ఎంత ప్రయత్నించినా వాళ్లను ఔట్ చేయలేకపోయారు. అయితే నాలుగో రోజు మార్క్ వుడ్ వేసిన ఒక బంతి ఖవాజా హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో ఆ బాల్ పాడవడంతో అంపైర్లు మరో బాల్ తీసుకున్నారు. అక్కడి నుంచే కథ మారిపోయింది. ఐదో రోజు ఉదయం ఆస్ట్రేలియా ఓపెనర్లును త్వరగా కోల్పోయింది. కాగా మ్యాచ్ ముగిశాకా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ బంతిని మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని మార్చడం వల్లే ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిందని పేర్కొన్నాడు. స్కైస్పోర్ట్స్తో మాట్లాడుతూ.. '' బంతి పరిస్థితి అంచనా వేయకుండానే దానిని మార్చాలని నిర్ణయించడం సరైంది కాదు. రెండు బంతులను పోలుస్తే సరైనవి చెప్పే మార్గంలో ప్రపంచంలో మరెక్కడా చూడలేదు. మధ్యలో అలా కొత్త బంతిని తీసుకోవడం సరైంది కాదు. మీరు ఒకవేళ బంతిని మార్చాలని భావిస్తే ఆ తరహాలోనే ఉండేలా చూడాలి. అంపైర్లు పరీక్షిస్తున్న పెట్టలో మరీ పాతబడిన బంతులు ఎక్కువగా లేవు. కొన్ని చూసినప్పటికి వాటిని పక్కన పడేశారు. పాత బంతి స్థానంలో కొత్తదానిని ఎంపిక చేసినట్లుగా ఉంది. ఐదోరోజు పిచ్ ఉదయం బౌలింగ్కు అనుకూలంగా ఉంది. నాలుగోరోజు చివర్లో బంతిని మార్చడం వల్ల ఇంగ్లండ్కు కలిసొచ్చింది. అందుకే ఈ విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా. బాక్స్లో అలాంటి పాత బంతులు లేవా? లేకపోతే అంపైర్లు ఏదొకటి ఎంచుకుని ఆడించారా? అనేది తేలాలి. అప్పటికి 37 ఓవర్లు మాత్రమే ఆ బంతితో ఆట జరిగింది. కానీ మార్చిన బంతి మాత్రం దానికి తగ్గట్టుగా లేదు'' అంటూ పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఉస్మాన్ ఖవాజా మాట్లాడుతూ.. "వాళ్లు బంతిని మార్చగానే ఆ కొత్త బాల్ చాలా భిన్నంగా ఉన్నట్లు అర్థమైంది. అప్పుడే అంపైర్ కుమార్ ధర్మసేన దగ్గరికి వెళ్లి ఈ బాల్ ఎంత పాతది? 8 ఓవర్లు వేసినట్లు కనిపిస్తోంది అని అడిగాను. ఆ బంతి నా బ్యాట్ ను చాలా బలంగా తాకింది. యాషెస్ లో ప్రతి టెస్టులో ఓపెనింగ్ చేశాను. కానీ ఏ బంతి కూడా అంత బలంగా నా బ్యాట్ను తాకలేదు. కొత్తగా బ్యాటింగ్ చేయడానికి వచ్చే వాళ్లతో ఈ కొత్త బంతి కాస్త భిన్నంగా ఉందని చెప్పాను. కొన్ని విషయాలు మనం నియంత్రించలేము. ఇది నిరాశ కలిగించింది. ఇంగ్లండ్ ది క్లాస్ బౌలింగ్ అటాక్. వాళ్లకు కాస్త సందు దొరికినా దానిని అద్భుతంగా ఉపయోగించుకుంటారు" అని ఖవాజా అన్నాడు. "There's no way in the world you can look at those two balls there and say in any way that they're comparable" 😤 Ricky Ponting is NOT happy with that 'new' ball 😳 pic.twitter.com/maDFpv8RhM — Sky Sports Cricket (@SkyCricket) July 31, 2023 Won WC by boundary count now winning ashes by changing ball. Is this how a 40 overs old ball change would look alike @ECB_cricket ? pic.twitter.com/aJPWSB2qkZ — ̴D̴̴e̴̴e̴̴p̴̴s̴ (@vkrcholic) July 31, 2023 చదవండి: మేమంతా దేశం కోసమే ఆడతాం.. అంతేగానీ: కపిల్ దేవ్కు జడ్డూ స్ట్రాంగ్ కౌంటర్ -
ఆఖరి మజిలీలో ఇంగ్లండ్దే విక్టరీ.. విజయంతో బ్రాడ్ విడ్కోలు
లండన్: సంప్రదాయ క్రికెట్లో యాషెస్ సిరీస్కున్న ప్రత్యేకత, విశిష్టత ఇంకే సిరీస్కు ఎందుకు ఉండదో తాజా సిరీస్లో ఏ ఒక్క మ్యాచ్ చూసిన ఇట్టే అర్థమవుతుంది. టెస్టు సమరం ఐదు రోజులు ఆసక్తి కరంగానే మొదలైంది. ఐదు టెస్టులూ రసవత్తరంగానే జరిగాయి. గెలిచినా... ఓడినా... ఫలితంతో సంబంధంలేకుండా ఇంగ్లండ్ ఈ సిరీస్ అసాంతం వన్డేను తలపించే దూకుడునే కొనసాగించింది. ఇక ఈ ఐదో టెస్టు చివరి మజిలీలో వర్షం కూడా ‘యాషెస్’ విశిష్టత ముందు తోకముడిచింది. ఆఖరి రోజు ఆటలో క్లైమాక్స్కు సరిపడా మలుపులిచ్చి... ఇరు జట్లను ఊరించి మరీ సిరీస్ను పంచింది. ఆసీస్ను నడిపించి... ఇంగ్లండ్ను గెలిపించి... ఆఖరి రోజు 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 135/0తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆస్ట్రేలియా 94.4 ఓవర్లలో 334 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు వార్నర్ (60; 9 ఫోర్లు), ఖ్వాజా (72; 8 ఫోర్లు) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. కానీ స్మిత్ (54; 9 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (43; 6 ఫోర్లు) కలిసి నాలుగో వికెట్ కు 95 పరుగుల జోడించడంతో ఆసీస్ ఆశలు పెంచుకుంది. టీ సెషన్లో 238/3 స్కోరుతో ఇంగ్లండ్ను కంగారు పెట్టిన ఆసీస్కు... హెడ్, స్మిత్, మార్ష్ (6), స్టార్క్ (0), కెప్టెన్ కమిన్స్ (9) వికెట్లను 300 పరుగుల్లోపే కోల్పోవడంతో ఓటమి ఖాయమైంది. బ్రాడ్ కెరీర్ ఆఖరి టెస్టులో ఆఖరి వికెట్గా క్యారీ (28; 1 ఫోర్, 1 సిక్స్)ని అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్కు 334 స్కోరువద్ద తెరపడింది. ఐదో టెస్టులో 49 పరుగులతో గెలిచిన ఇంగ్లండ్ సిరీస్ను 2–2తో సమం చేసుకుంది. అయితే గత సిరీస్ను గెలిచిన ఆసీస్ వద్దే ‘యాషెస్’ ఉండిపోనుంది. 2 వికెట్లతో బ్రాడ్ తన కెరీర్కు చిరస్మరణీయ ముగింపు ఇచ్చుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వోక్స్ 4, మొయిన్ అలీ 3 వికెట్లు తీశారు. వోక్స్, స్టార్క్లకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తదుపరి యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియాలో 2025–2026లో జరుగుతుంది. చదవండి: ఐర్లాండ్తో టీ20 సిరీస్.. టీమిండియాకు కొత్త కెప్టెన్, రింకూ సింగ్కు పిలుపు -
Ashes 5th Test: మరో రసవత్తర ముగింపునకు రంగం సిద్ధం..
లండన్: ఈసారి యాషెస్ సిరీస్ మునుపెన్నడు లేని విధంగా పోటాపోటీగా జరుగుతోంది. ఇప్పుడు ఆఖరి మజిలీ కూడా రసవత్తరంగా మారింది. అయితే ఆటలో అరటిపండులా... రసపట్టుపై వాన చినుకులు అంతరాయం కలిగించాయి. ఆదివారం నాలుగో రోజు ఓవర్నైట్ స్కోరు 389/9తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన మరో ఇంగ్లండ్ 6 పరుగులు చేసి ఆలౌటైంది. అండర్సన్ (8)ను అవుట్ చేసి మర్ఫీ (4/110) కూడా స్టార్క్ (4/100)తో సమంగా నిలిచాడు. అనంతరం 384 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆ్రస్టేలియా వర్షంతో ఆట నిలిచే సమయానికి 38 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 135 పరుగులు చేసింది. ఓపెనర్లు వార్నర్ (58 బ్యాటింగ్; 9 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (69 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ చివరిరోజు సోమవారం ఆసీస్ నెగ్గాలంటే మరో 249 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ గెలవాలంటే పది వికెట్లు తీయాలి. లంచ్ బ్రేక్ దాకా 75/0 స్కోరు చేసిన ఆసీస్ రెండో సెషన్లోనూ అదే ఆటను కొనసాగించడంతో ఖ్వాజా, వార్నర్ అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. తర్వాత కాసేపటికే వర్షం ముంచెత్తింది. దీంతో ఈ సెషన్లో కేవలం 14 ఓవర్ల ఆటే సాధ్యపడింది. ప్రస్తుతం ఆసీస్ 2–1తో ఆధిక్యంలో ఉంది. గత యాషెస్ సాధించడంతో ఈ మ్యాచ్తో సంబంధం లేకుండానే సిరీస్ను నిలబెట్టుకుంది. చదవండి: Ashes 5th Test Day 4: డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు -
రిటైర్మెంట్తో షాకిచ్చిన స్టువర్ట్ బ్రాడ్
ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఓవల్లో జరుగుతున్న మ్యాచే తనకు చివరి టెస్టు అని 37 ఏళ్ల బ్రాడ్ వెల్లడించాడు. యాషెస్లో చివరి టెస్టుకు ముందు 166 టెస్టుల్లో 27.68 సగటుతో 600 వికెట్లు తీసిన బ్రాడ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 2016లో చివరి వన్డే ఆడిన బ్రాడ్ అప్పటినుంచి ఒక్క టెస్టులకే పరిమితమయ్యాడు. ఈతరం టెస్టు క్రికెట్లో గొప్ప బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు స్టువర్ట్ బ్రాడ్. తన సహచర పేసర్ జేమ్స్ అండర్సన్తో పోటీ పడి మరీ వికెట్లు తీసే బ్రాడ్ అర్థంతరంగా రిటైర్మెంట్ ఇవ్వడం అభిమానులకు షాక్ కలిగించింది. ఇక స్టువర్ట్ బ్రాడ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్. 2007 టి20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో బ్రాడ్ బౌలింగ్లో యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పటికి బ్రాడ్ అనగానే ఆ ఆరు సిక్సర్లే కళ్లు ముందు కదలాడతాయి. అంతకముందు ఓవర్లో యువరాజ్తో ఆండ్రూ ఫ్లింటాఫ్ వైరం పెట్టుకున్నాడు. దీంతో యువరాజ్ కోపం ఆ తర్వాత బౌలింగ్కు వచ్చిన బ్రాడ్కు శాపంగా మారింది. ఓవరాల్గా స్టువర్ట్ బ్రాడ్ 167 టెస్టుల్లో 3656 పరుగులు.. 602 వికెట్లు, 121 వన్డేల్లో 529 పరుగులు.. 178 వికెట్లు, 56 టి20ల్లో 118 పరుగులు.. 65 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014లో జరిగిన టి20 వరల్డ్కప్లో బ్రాడ్ ఇంగ్లండ్కు కెప్టెన్గానూ వ్యవహరించాడు. అయితే ఇంగ్లండ్ను సెమీస్ చేర్చడంలో బ్రాడ్ విఫలమయ్యాడు. BREAKING 🚨: Stuart Broad announces he will retire from cricket after the Ashes ends. pic.twitter.com/dNv8EZ0qnC — Sky Sports Cricket (@SkyCricket) July 29, 2023 Forever remembered for 𝘁𝗵𝗼𝘀𝗲 mesmerising spells, 𝘁𝗵𝗼𝘀𝗲 Ashes battles, 𝘁𝗵𝗼𝘀𝗲 602* wickets. Take a bow, Stuart Broad 👏#EnglandCricket | #Ashes pic.twitter.com/6WvdTW5AoA — England Cricket (@englandcricket) July 29, 2023 చదవండి: Ben Stokes: యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్గా రికార్డు; రోహిత్ను దాటలేకపోయాడు ధోనిని దొంగచాటుగా వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్ -
యాషెస్ చరిత్రలో తొలి బ్యాటర్గా రికార్డు; రోహిత్ను దాటలేకపోయాడు
యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగిస్తోంది. మూడోరోజు ఆటలో మూడో సెషన్లో బ్యాటింగ్ ఆడుతున్న ఇంగ్లండ్ ప్రస్తుతం నాలుగు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. జో రూట్ 71, జానీ బెయిర్ స్టో 56 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఓవరాల్గా ఇంగ్లండ్ 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండడంతో నాలుగో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఆసీస్ ముంగిట ఇంగ్లండ్ కనీసం 400 పరుగుల టార్గెట్ను పెట్టాలని భావిస్తోంది. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన స్టోక్స్ 67 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఈ క్రమంలో స్టోక్స్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో స్టోక్స్ చోటు సంపాదించాడు. ఆసీస్తో జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023లో స్టోక్స్ ఇప్పటివరకు 15 సిక్సర్లు బాదాడు. 2018-19లో బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో వెస్టిండీస్ ఆటగాడు హెట్మైర్ కూడా 15 సిక్సర్లు బాదాడు. ఇక తొలి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్మ్యాన్ 2019-20లో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్లో 19 సిక్సర్లు బాది తొలి స్థానంలో ఉన్నాడు. ఇక యాషెస్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన టెస్టు సిరీస్లు కలిపి ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్గా స్టోక్స్ రికార్డులకెక్కాడు. స్టోక్స్ తర్వాతి స్థానంలో కెవిన్ పీటర్సన్(2005 యాషెస్లో) 14 సిక్సర్లు బాదగా, 2019 యాషెస్లో మళ్లీ బెన్ స్టోక్స్ 13 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.. 2005 యాషెస్లో ఆండ్రూ ఫ్లింటాఫ్ 11 సిక్సర్లు బాది నాలుగో స్థానంలో ఉన్నాడు. Ben Stokes straightaway in the mood. Smashes Josh Hazlewood for a six in the first over after Lunch. pic.twitter.com/z9Di8YY4PM — Mufaddal Vohra (@mufaddal_vohra) July 29, 2023 చదవండి: Cristiano Ronaldo: 'అవతలికి పో'.. కెమెరామన్పై రొనాల్డో అసహనం వాళ్లు లేరు.. వీళ్లకు ఛాన్స్.. బెడిసికొట్టిన ప్రయోగం! 8 బంతుల్లో ఒక్క పరుగు చేసి.. -
Ashes 2023: ఒకరి జెర్సీని మరొకరు.. 'మతిమరుపు' గానీ వచ్చిందా?
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు ఆసక్తికరంగా సాగుతుంది. తొలి రోజు ఇంగ్లండ్ ఆలౌట్ అయితే.. రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు ఆలౌట్ చేశారు. కాగా ఆసీస్ కేవలం 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడోరోజు ఆటలో లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 138 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 75 బంతుల్లో 73 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. స్టోక్స్ కూడా 30 బంతుల్లో 20 పరుగులతో దాటిగా ఆడుతూ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 128 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒకరి జెర్సీని మరొకరు ధరించారు. ఇది చూసిన అభిమానులకు కాసేపు అర్థం కాలేదు. ఇంగ్లండ్ ఆటగాళ్లు మరిచిపోయి ఒకరి జెర్సీ ఒకరు వేసుకున్నారేమోనని అభిప్రాయపడ్డారు. నిజానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇలా జెర్సీలను మార్చుకోవడానికి ఒక కారణం ఉంది. అల్జీమర్స్(Dementia-మతిమరుపు)వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు మద్దతుగా బెన్ స్టోక్స్ బృందం ఒకరి జెర్సీలు మరొకరు ధరించారు. కెప్టెన్ స్టోక్స్ వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో జెర్సీ వేసుకున్నాడు. మోయిన్ అలీ మాజీ కెప్టెన్ జోరూట్ జెర్సీతో వచ్చాడు. జేమ్స్ అండర్స్ మరో పేసర్ స్టువార్ట్ బ్రాడ్ జెర్సీతో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఒక్క చోట చేరారు. అల్జీమర్స్ సొసైటీ సభ్యులు ఆలపించిన పాట విన్నారు. ఆ తర్వాత మూడోరోజు ఆటను ప్రారంభించారు. అల్జీమర్స్ అనేది ఒక వృద్దాప్య సమస్య. 60 ఏళ్లు పైబడిన వాళ్లలో రోజు రోజుకు మతిమరుపు పెరుగుతుంటుంది. దాంతో, వాళ్లు అన్ని విషయాలు మర్చిపోతారు. కుటుంబసభ్యులను, ప్రాణ స్నేహితులను కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటారు. డిమెన్షియా వల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. A moving and powerful rendition of Jerusalem 👏@alzheimerssoc | #CricketShouldBeUnforgettable pic.twitter.com/cMC37JWC96 — England Cricket (@englandcricket) July 29, 2023 Today is the day! It's the @lv=Men's Ashes Test Match: Day 3 Supporting Alzheimer’s Society. 🏏 Huge thanks to the Kia Oval (@surreycricket) and @englandcricket - and sending lots of luck to our boys! 🤞 Great #CricketShouldBeUnforgettable https://t.co/oFsZXP1wXb pic.twitter.com/vbFrIO8HXj — Alzheimer's Society (@alzheimerssoc) July 29, 2023 చదవండి: ICC ODI WC 2023: గుడ్న్యూస్.. ఆగస్టు 10 నుంచి వన్డే వరల్డ్కప్ టికెట్లు అందుబాటులో! -
యాషెస్ చరిత్రలో తొలిసారి.. ‘అరుదైన’ రికార్డు బద్దలు! ఎంత గొప్పగా అంటే..
England vs Australia, 5th Test: ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ యాషెస్ సిరీస్లో ‘అరుదైన’ రికార్డు నమోదు చేశారు. యాషెస్ చరిత్రలో ఎన్నడూలేని విధంగా స్లో ఇన్నింగ్స్ ఆడి రికార్డులకెక్కారు. కాగా లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య గురువారం ఐదో టెస్టు ఆరంభమైంది. లబుషేన్ జిడ్డు బ్యాటింగ్ టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా... ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(47), డేవిడ్ వార్నర్(24) ఫర్వాలేదనిపించారు. అయితే, క్రిస్వోక్స్ బౌలింగ్లో వార్నర్ పెవిలియన్ చేరిన క్రమంలో వన్డౌన్లో వచ్చిన మార్నస్ లబుషేన్ జిడ్డు బ్యాటింగ్తో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. మొత్తంగా 82బంతులు ఎదుర్కొన్న అతడు 10.98 స్ట్రైక్రేటుతో కేవలం 9 పరుగులు సాధించాడు. రన్రేటు 1.61.. ఖవాజాతో కలిసి 26 ఓవర్ల ఆటలో.. రెండో వికెట్కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్క్వుడ్ బౌలింగ్లో బెయిర్స్టోకు క్యాచ్ ఇచ్చి లబుషేన్ అవుటయ్యే సమయానికి ఖవాజా 123 బంతులాడి 37 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఇక వీరిద్దరి పార్ట్నర్షిప్లో రన్రేటు 1.61గా నమోదైంది. వారి రికార్డు బద్దలు కొట్టి యాషెస్ చరిత్రలో.. ఒక ఇన్నింగ్స్లో కనీసం 150 బంతులు ఎదుర్కొని ఈ మేరకు అత్యల్ప రన్రేటుతో పరుగులు రాబట్టడం ఇదే తొలిసారి. గతంలో 2013 నాటి అడిలైడ్ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు మైకేల్ కార్బెర్రి, జోరూట్ 1.75 రన్రేటుతో 27 ఓవర్లలో 48 పరుగులు సాధించారు. ఖవాజా, లబుషేన్ ఇప్పుడు వారి రికార్డు బద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘మీకంటే నత్త నయమనుకుంటా. మహగొప్పగా ఆడారు.. 1.61 రన్రేటు గ్రేటు’’ అంటూ ఖవాజా, లబుషేన్లను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఐదో టెస్టులో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ స్టీవ్ స్మిత్ 71 పరుగులతో రాణించడంతో.. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులు చేయగలిగింది. ఐదో టెస్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. చదవండి: 151 కి.మీ వేగంతో బౌలింగ్.. అయినా 104 మీటర్ల భారీ సిక్స్! వీడియో వైరల్ -
ఆసీస్ ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో చూడలేదు: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
The Ashes, 2023- England vs Australia, 5th Test: యాషెస్ సిరీస్-2023 ఐదో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీరుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించాడు. కంగారూ జట్టు ఇంత బెరుగ్గా, భయం భయంగా బ్యాటింగ్ చేయడం ఎన్నడూ చూడలేదన్నాడు. ఓవల్ మైదానంలో ఆసీస్ ప్రదర్శన చెత్తగా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇప్పటికే 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ట్రోఫీ తమ వద్దే పెట్టుకునే అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై.. ఆఖరి మ్యాచ్లో గెలిచి 2-2తో సిరీస్ను డ్రా చేసుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. స్వల్ప ఆధిక్యంలో ఇక బజ్బాల్ విధానం పేరిట దూకుడుగా ఆడుతున్న స్టోక్స్ బృందం.. ఓవల్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. హ్యారీ బ్రూక్(85) మెరుగైన ప్రదర్శన కారణంగా తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో.. బ్యాటింగ్కు వచ్చిన ఆసీస్.. రెండో రోజు ఆట ముగిసే సరికి 295 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. ఇంత చెత్తగా ఆడటం ఎప్పుడూ చూడలేదు స్టీవ్ స్మిత్ అర్ధ శతకం(71) కారణంగా 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించగలిగింది. ఆచితూచి ఆడుతూ ఈ మేరకు స్కోరు సాధించింది. వన్డౌన్లో వచ్చిన మార్నస్ లబుషేన్ 82 బంతులు ఎదుర్కొని 9 పరుగులు మాత్రమే చేశాడంటే కంగారూల బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ స్పందిస్తూ.. ‘‘ఆస్ట్రేలియా ఇంత డిఫెన్సివ్గా ఆడటం ఎప్పుడూ చూడలేదు. సాధారణంగా వాళ్లు దూకుడుగా ఆడతారు. మ్యాచ్ చూసే వాళ్లకు మజా అందిస్తారు. కానీ ఈసారి.. బౌలర్లపై ఏమాత్రం ఒత్తిడి పెంచలేకపోయారు. నేనైతే ఆస్ట్రేలియా ఇంత చెత్తగా ఆడటం నా జీవితంలో ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. నిజం.. వాళ్లు గతంలో ఇలా అస్సలు ఆడలేదు’’ అని బీబీసీ మ్యాచ్ స్పెషల్ ప్రోగ్రామ్లో చెప్పుకొచ్చాడు. చదవండి: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి -
82 బంతుల్లో 9 పరుగులు.. సూపర్ ఇన్నింగ్స్! మరో పుజారా అంటూ
లండన్ వేదికగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న యాషెస్ ఆఖరి టెస్టు రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 295 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 61/1 తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన ఆసీస్ 151 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో స్మిత్ (71; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే ఆసీస్కు లభించింది. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 283 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. లబుషేన్పై ట్రోల్స్.. ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ స్లో ఇన్నింగ్స్పై విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో లబుషేన్ తన ఆటతీరుతో విసుగు తెప్పించాడు. 82 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన లబుషేన్.. ఆఖరికి వుడ్ బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. లుబషేన్ స్లో ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ రెండో రోజు తొలి సెషన్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో లుబషేన్ను ఉద్దేశించి మరో ఛతేశ్వర్ పుజారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంగ్లండ్ బజ్బాల్కు వ్యతిరేకంగా లబుషేన్ ఆడుతున్నాడని మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కాగా అంతకముందు నాలుగో టెస్టులో లబుషేన్ సెంచరీ నమోదు చేశాడు. రెండు ఇన్నింగ్స్లు కలిపి 162 పరుగులు చేశాడు. చదవండి: MLC 2023: జూనియర్ 'ఏబీడీ' సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్కు చేరిన ముంబై ఇండియన్స్ టీమ్ -
చరిత్ర సృష్టించిన స్టువర్ట్ బ్రాడ్.. తొలి ఇంగ్లండ్ బౌలర్గా
ఇంగ్లండ్ సీనియర్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ అరుదైన ఫీట్ సాధించాడు. యాషెస్ చరిత్రలో ఆసీస్పై 150 వికెట్లు తీసిన మొదటి ఇంగ్లండ్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ ఆఖరి టెస్టులో అతను ఈ మైలురాయిని అందుకున్నాడు. ఫామ్లో ఉన్న ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(47) ఎల్బీగా ఔట్ చేయడం ద్వారా బ్రాడ్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్గా ఇంగ్లండ్ తరపున 166 టెస్టుల్లో 600 వికెట్లు, 121 వన్డేల్లో 178 వికెట్లు, 56 టి20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఈ దశాబ్దంలో టెస్టు క్రికెట్లో 600కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో బ్రాడ్ ఒకడిగా నిలిచాడు. ఇక అండర్సన్ తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక వికెట్లు తీసిన పేస్ బౌలర్గానూ బ్రాడ్ రికార్డులకెక్కాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో తడబడుతోంది. ఇంగ్లండ్ను తక్కువకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ నిలబెట్టుకోలేకపోయింది. వరుస విరామాల్లో ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లు తీస్తుండడంతో ఆసీస్ ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ 64 పరుగులు.. అర్థసెంచరీతో రాణించగా.. కెప్టెన్ కమిన్స్ 16 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, మార్క్వుడ్లు రెండు వికెట్లు తీయగా.. అండర్సన్, వోక్స్, జోరూట్ తలా ఒక వికెట్ తీశారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 57 పరుగుల దూరంలో ఉంది. చదవండి: Japan Open 2023: సెమీస్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్.. సాత్విక్-చిరాగ్ జోడి ఓటమి -
మొదలైన ఐదో టెస్టు.. ఇంగ్లండ్ గెలిచినా యాషెస్ కంగారులదే
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ఓవల్ వేదికగా ఐదో టెస్టు గురువారం ప్రారంభమయింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు ఇంగ్లండ్ ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. కామెరాన్ గ్రీన్ ఈ టెస్టుకు దూరం కావడంతో అతని స్థానంలో స్పిన్నర్ టాడ్ మర్ఫీ తుదిజట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. బెన్ డకెట్ 29, జాక్ క్రాలీ 10 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలే, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్స్టో(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), జోష్ హేజిల్వుడ్, టాడ్ మర్ఫీ ఇంగ్లండ్ గెలిచినా ఆసీస్దే యాషెస్.. ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో 2-1తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. ఒకవేళ చివరి టెస్టులో ఇంగ్లండ్ గెలిచి 2-2తో సిరీస్ సమం అయినా యాషెస్ ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా వద్దనే ఉంటుంది. చివరగా 2021లో జరిగిన యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా 4-1తో ఇంగ్లండ్పై నెగ్గింది. రూల్ ప్రకారం యాషెస్ సిరీస్ ఎప్పుడు జరిగినా సిరీస్ డ్రాగా ముగిస్తే గత ఎడిషన్లో ట్రోఫీ సాధించిన జట్టు వద్దే యాషెస్ ఉంటుంది. ఈ లెక్కన ఆస్ట్రేలియా చివరి టెస్టులో ఓడినా, డ్రా అయినా యాషెస్ మాత్రం వారి వద్దే ఉంటుంది. ఇక ఇంగ్లండ్ చివరిసారి 2015లో యాషెస్ దక్కించుకుంది. స్టోక్స్ సారధ్యంలో బజ్బాల్ ఆటతీరుతో దూకుడుగా కనిపిస్తున్న ఇంగ్లండ్ ఈసారి కచ్చితంగా యాషెస్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శించిన ఆస్ట్రేలియా తొలి రెండు టెస్టుల్లో నెగ్గి ఇంగ్లండ్పై ఆధిపత్యం ప్రదర్శించింది. మూడో టెస్టులో ఓడినప్పటికి.. నాలుగో టెస్టులో ఇంగ్లండ్ దూకుడు చూపించినా.. వరుణుడి ఆటంకం, లబుషేన్ అద్భుత సెంచరీతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. చదవండి: Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! World cup 2023: భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు ఫుల్ డిమాండ్.. 10 సెకన్లకు 30 లక్షలు! -
ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు!
England Remain Unchanged For Fifth Ashes Test: యాషెస్ సిరీస్-2023లో ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. ఓవల్ వేదికగా జరుగనున్న మ్యాచ్లో మాంచెస్టర్లో ఆడిన జట్టునే కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. కాగా నాలుగో టెస్టులో విఫలమైన వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్పై విమర్శల నేపథ్యంలో.. ఆఖరి మ్యాచ్లోనూ ఇంగ్లండ్ అతడికి అవకాశం ఇవ్వడం విశేషం. కాగా లీడ్స్లో జరిగిన మూడో టెస్టులో అండర్సన్ మిస్ అయ్యాడు. ఈ క్రమంలో మాంచెస్టర్లో అతడికి ఛాన్స్ ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. వైఫల్యాలు కొనసాగిస్తూ గత వైఫల్యాలను కొనసాగిస్తూ కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో మొత్తంగా 114 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 4 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 1000 వికెట్ల(ఫస్ట్క్లాస్)తో లెజెండరీ బౌలర్గా పేరు తెచ్చుకున్న అతడు.. తాజా యాషెస్ సిరీస్లో మాత్రం జట్టుకు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ వంటి వాళ్లు ఘాటు విమర్శలు చేశారు. దీంతో.. ఆఖరి టెస్టులో అండర్సన్ ఆడిస్తారా లేదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అతడిని కొనసాగిస్తున్నట్లు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. దీంతో ఇంత మొండితనం పనికిరాదంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 2-1తో ఆధిక్యంలో ఆస్ట్రేలియా అండర్సన్కు బదులు ఓలీ రాబిన్సన్, జోస్ టంగ్లలో ఎవరో ఒకరికి ఛాన్స్ ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కాగా జూలై 27 నుంచి ఇంగ్లండ్- ఆసీస్ మధ్య ఐదో టెస్టు ఆరంభం కానుంది. లండన్లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్లో.. 2-1తో ఆధిక్యంలో ఉన్న కమిన్స్ బృందంపై ఇంగ్లండ్ పైచేయి సాధిస్తుందా లేదా వేచి చూడాలి!! యాషెస్ 2023- ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలీ, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
Ashes 2023: అదొక్కటే మార్పు.. చివరి టెస్టులో వార్నర్కు చోటు!
The Ashes, 2023- England vs Australia, 5th Test: ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్-2023 తుది అంకానికి చేరుకుంది. ఇరు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జూలై 27న ఆరంభం కానుంది. ఇక ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా రెండు, ఇంగ్లండ్ ఒక మ్యాచ్ గెలవగా.. నాలుగో టెస్టు వర్షార్పణం అయింది. ఆ ఒక్కటి గెలిచి కచ్చితంగా గెలుస్తామని భావించిన ఆతిథ్య ఇంగ్లండ్కు వరణుడు చేదు అనుభవం మిగల్చడంతో మాంచెస్టర్ డ్రాగా ముగిసిపోయింది. దీంతో.. ట్రోఫీ కోల్పోయినప్పటికీ ఐదో టెస్టు గెలిచి సిరీస్ సమం చేయాలని స్టోక్స్ బృందం ఆశిస్తోంది. అదే సమయంలో 2-1తో ఆధిక్యంలో ఉన్న పర్యాటక ఆసీస్ చివరి మ్యాచ్లోనూ సత్తా చాటి టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఐదో టెస్టు తుది జట్టు కూర్పు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీకి టీమ్లో స్థానంలో కల్పించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ను పటిష్టం చేసే క్రమంలో మర్ఫీని నాలుగో టెస్టు నుంచి తప్పించి తప్పుచేశారని అభిప్రాయపడ్డారు. అదొక్కటే మార్పు ‘‘ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియా ఏం చేయబోతోందో చూడాలి. నా లెక్క ప్రకారమైతే మర్ఫీని కచ్చితంగా జట్టులోకి తీసుకురావాలి. ఓవల్ మైదానంలో పిచ్ స్పిన్కు అనుకూలిస్తుంది. కాబట్టి అతడిని ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. మర్ఫీ ఒక్కడు తప్ప జట్టులో ఎలాంటి మార్పులు ఉండబోవనుకుంటున్నా. మాంచెస్టర్లో పర్వాలేదనిపించాడు. తక్కువ స్కోర్లకే పరిమితమైనా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తను ఓపెనర్గా రావడం ఖాయమనిపిస్తోంది’’ అని రిక్కీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా జూలై 27- 31 వరకు ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఐదో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. యాషెస్ ఐదో టెస్టుకు పాంటింగ్ ఎంచుకున్న ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), టాడ్ మర్ఫీ, జోష్ హాజిల్వుడ్. పాంటింగ్ ఇంగ్లండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, మొయిన్ అలీ, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్స్టో, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, స్టువర్ట్ బ్రాడ్, జోష్ టంగ్. చదవండి: 69 ఏళ్ల వయసులో ‘సూపర్స్టార్’ పెళ్లి! ఎవరీ బ్యూటీ? ఆమె పిల్లలు కూడా.. -
అంతకు మించి! బొక్కబోర్లా పడ్డ ఇంగ్లండ్.. టీమిండియా వరల్డ్ రికార్డు!
West Indies vs India, 2nd Test: వెస్టిండీస్తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్తో అదరగొట్టారు. టెస్టు క్రికెట్లో ‘బజ్బాల్’ అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ను మించిపోయే విధంగా దంచికొట్టారు. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ 30 బంతుల్లో 38, రోహిత్ శర్మ 44 బంతుల్లో 57, నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ 34 బంతుల్లో 52(నాటౌట్) ఆకాశమే హద్దుగా బ్యాట్తో వీరవిహారం చేశారు. సంచలన ఇన్నింగ్స్తో సరికొత్త రికార్డు ఈ ముగ్గురి అద్భుత ఆట తీరు కారణంగా రెండో ఇన్నింగ్స్లో2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది భారత జట్టు. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి విండీస్కు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్తో ట్రినిడాడ్ టెస్టులో సంచలన ఆట తీరుతో టీమిండియా టెస్టుల్లో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా పేరిట ఉన్న అరుదైన రికార్డు బద్దలు కొట్టి సత్తా చాటింది. కాగా విండీస్తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో 24 ఓవర్లలో రోహిత్ సేన 7.54 రన్రేటుతో 181 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. తద్వారా టెస్టుల్లో కనీసం 20 ఓవర్ల ఆటలో అత్యధిక రన్రేటుతో ఎక్కువ పరుగులు రాబట్టిన జట్టుగా ప్రపంచ రికార్డు సాధించింది. ఆస్ట్రేలియా అప్పుడలా అంతకు ముందు ఆస్ట్రేలియా.. 2017లో సిడ్నీలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో 32 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 7.53 రన్రేటుతో 241 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఆసీస్ను వెనక్కి నెట్టి ఈ జాబితాలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అంతేకాదు.. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగుల మార్కు అందుకున్న జట్టుగా శ్రీలంక పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించింది. ఇది ద్రవ్బాల్.. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘బజ్బాల్ కాదు.. అంతకుమించి! ఇది ‘ద్రవ్బాల్’(హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ను ఉద్దేశించి). ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. వాట్ టుడూ వాట్ నాట్ టుడూ’’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే, విండీస్ లాంటి బలహీన(ప్రస్తుతం) జట్టుపై ఆడటం కాదు.. పటిష్ట జట్లపై ప్రతాపం చూపాలని పెదవి విరిచేవాళ్లూ లేకపోలేదు. మెకల్లమ్ వచ్చిన తర్వాత కాగా న్యూజిలాండ్ మాజీ బ్యాటర్ బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆట తీరులో పలు మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ నాయకత్వంలో మెకల్లమ్ మార్గదర్శనంలో పరిమిత ఓవర్ల మాదిరే టెస్టు క్రికెట్లోనూ దూకుడుగా ఆడుతోంది. ఈ క్రమంలో బజ్బాల్ ఫేమస్ అయింది. అయితే, ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్-2023లో మాత్రం ఈ విధానంతో ఇంగ్లండ్ బొక్కబోర్లా పడింది. ఇప్పటికే 1-2తో వెనుకపడి ట్రోఫీని కోల్పోయే దుస్థితి తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ట్రినిడాడ్లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చదవండి: Ashes 2023: లెజెండ్ కదా అని మొహమాటానికి పోయి జట్టులో పెట్టుకున్నందుకు... -
దురదృష్టవంతుల లిస్ట్లో బెయిర్ స్టో.. ఏడో క్రికెటర్గా
ఇంగ్లండ్ వికెట్కీపర్ జానీ బెయిర్ స్టో బ్యాడ్లక్కు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔట్ ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవర్ పూర్తయిందని భావించిన బెయిర్ స్టో క్రీజు బయటకు రాగా.. ఆసీస్ కీపర్ అలెక్స్ కేరీ బంతిని నేరుగా వికెట్ల మీదకు విసిరాడు. బంతి ఇంకా డెడ్ కాలేదని.. రూల్ ప్రకారం బెయిర్ స్టో ఔట్ అని అంపైర్ ప్రకటించాడు. దీంతో చేసేదేం లేక బెయిర్ స్టో పెవిలియన్ చేరాడు. అయితే ఈ ఔట్పై ఆ తర్వాత చాలా పెద్ద చర్చే జరిగింది. సహచర బ్యాటర్ రూపంలో వెంటాడిన దురదృష్టం.. తాజాగా బెయిర్ స్టోను మరోసారి దురదృష్టం వెంటాడింది. అయితే ఈసారి ఔట్ రూపంలో కాదు.. సెంచరీ రూపంలో. సెంచరీ చేసే అవకాశమున్నా ఆ అదృష్టానికి నోచుకోలేకపోయాడు. కేవలం ఒక్క పరుగు దూరంలో సెంచరీకి దూరమయ్యాడు. మరి ఔట్ అయ్యాడా అంటే అదీ లేదు. తన సహచర బ్యాటర్ చివరి వికెట్గా వెనుదిరగడంతో బెయిర్ స్టో 99 పరుగులు నాటౌట్గా నిలవాల్సి వచ్చింది. దీన్నిబట్టి చూస్తే గాయంతో ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన బెయిర్ స్టో రీఎంట్రీ దగ్గరి నుంచి బ్యాడ్లక్ వెంటాడుతన్నట్లుగా అనిపిస్తోంది. ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి బెయిర్ స్టో తన ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ను పటిష్ట స్థితిలో నిలిపాడు. బెయిర్స్టో ఇన్నింగ్స్తో 592 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్లో 273 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. జాక్ క్రాలీ 189, మొయిన్ ఆలీ 54, జో రూట్ 84, హారీ బ్రూక్ 61, బెన్ స్టోక్స్ 51 పరుగులు చేసి ఔటయ్యారు. క్రిస్ వోక్స్,బ్రాడ్, అండర్సన్లతో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జానీ బెయిర్ స్టో సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న సమయంలో జేమ్స్ అండర్సన్ని కామెరూన్ గ్రీన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్కు తెరపడింది. 99 వద్ద నాటౌట్గా మిగిలిన ఏడో బ్యాటర్గా.. టెస్టు క్రికెట్ చరిత్రలో 99 పరుగుల వద్ద నాటౌట్గా మిగిలిన ఏడో క్రికెటర్గా జానీ బెయిర్స్టో నిలిచాడు. ఇంతకుముందు జోఫ్రె బాయ్కాట్, స్టీవ్ వా, అలెక్స్ టూడర్, షాన్ పోలాక్, ఆండ్రూ హాల్, మిస్బా వుల్ హక్లు 99 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది.మార్నస్ లబుషేన్ 51, మిచెల్ మార్ష్ 51, ట్రావిస్ హెడ్ 48, స్టీవ్ స్మిత్ 41, మిచెల్ స్టార్క్ 36, డేవిడ్ వార్నర్ 32, అలెక్స్ క్యారీ 20 పరుగులు చేసి సంయుక్తంగా రాణించారు. క్రిస్ వోక్స్ 5 వికెట్లు తీశాడు. 273 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా మూడోరోజు ఆట ముగిసే సమయానికి 41 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసిది. క్రీజులో మార్నస్ లబుషేన్(44 బ్యాటింగ్), మిచెల్ మార్ష్ ఒక్క పరుగుతో ఉన్నారు. ఆసీస్ ఇంకా 162 పరుగులు వెనుకబడి ఉంది. View this post on Instagram A post shared by We Are England Cricket (@englandcricket) చదవండి: #Jadeja: ఔటయ్యింది ఒక బంతికి.. చూపించింది వేరే బంతిని -
రూట్తో కలిసి చరిత్ర సృష్టించిన జాక్ క్రాలీ! అరుదైన రికార్డు బద్దలు
Ashes- 2023- England vs Australia, 4th Test: యాషెస్ సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ అద్భుతం చేశాడు. బజ్బాల్ విధానానికి అర్థం చెబుతూ 182 బంతుల్లో 189 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. మాంచెస్టర్లో వందకు పైగా స్ట్రైక్రేటుతో పరుగుల వరద పారించడం ద్వారా క్రాలీ వ్యక్తిగతంగా ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన జో రూట్(84)తో కలిసి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్లో మొయిన్ అలీ(54)తో కలిసి రెండో వికెట్కు 121 పరుగులు జోడించిన క్రాలీ.. మాజీ సారథి జో రూట్తో కలిసి 206 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. అయితే, 178 బంతుల్లోనే ఈ మేరకు మూడో వికెట్కు భారీగా పరుగులు జోడించడం విశేషం. ఈ క్రమంలో క్రాలీ- రూట్ జోడీ వరల్డ్ రికార్డు సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ సాధించిన జంటగా నిలిచింది. ఈ క్రమంలో తమ సహచర ఆటగాళ్లు జానీ బెయిర్స్టో- బెన్స్టోక్స్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీలివే! 1.జాక్ క్రాలీ- జో రూట్: మాంచెస్టర్, 2023- ఆస్ట్రేలియా మీద 206(178) 2.జానీ బెయిర్స్టో- బెన్ స్టోక్స్: కేప్టౌన్, 2016- సౌతాఫ్రికా మీద- 399 (306) 3.ఆడం గిల్క్రిస్ట్- మాథ్యూ హెడెన్: పెర్త్, 2002- జింబాబ్వే మీద- 233 (203) 4.జాక్ క్రాలీ- బెన్ డకెట్- రావల్పిండి: 2022- పాకిస్తాన్ మీద- 233 (214) 5.జో బర్న్స్- డేవిడ్ వార్నర్- బ్రిస్బేన్: 2015- న్యూజిలాండ్ మీద- 237 (226) 6. ఏబీ డివిల్లియర్స్- గ్రేమ్ స్మిత్- కేప్టౌన్: 2005- జింబాబ్వే మీద- 217 (209). చదవండి: మొన్న రుతురాజ్ గైక్వాడ్.. ఇప్పుడు టీమిండియాకు మరో కొత్త కెప్టెన్! ఆసియా కప్-2023 ఫైనల్కు చేరిన పాకిస్తాన్.. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 -
జాక్ క్రాలీ సంచలనం.. యాషెస్ చరిత్రలో మూడో ఇంగ్లండ్ బ్యాటర్గా
యాషెస్ సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైనప్పటికి బజ్బాల్ దూకుడు మాత్రం వదల్లేమని తేల్చి చెప్పింది. మూడో టెస్టులో విజయం అందుకున్న ఇంగ్లండ్ ఎలాగైనా సిరీస్ కోల్పోకూడదనే పట్టుదలతో ఉంది. అందుకే మాంచెస్టర్ వేదికగా మొదలైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మరోసారి బజ్బాల్ ఆటతీరును చూపించింది. ఒక్కరోజులోనే దాదాపు 400 పరుగులు మార్క్ అందుకునేలా కనిపించిన ఇంగ్లండ్ చివరకు రెండో రోజు ఆటను 4 వికెట్ల నష్టానికి 384 పరుగుల వద్ద ముగించింది. ఒకవేళ ఆసీస్ తొలి సెషన్ ఆరంభంలోనే ఔటయ్యి ఉంటే ఇంగ్లండ్ 400 పరుగులు మార్క్ను కూడా క్రాస్ చేసేదే. ఇక ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. వన్డే తరహాలో వేగంగా ఆడిన క్రాలీ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నప్పటికి 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. 93 బంతుల్లోనే శతకం మార్క్ సాధించిన క్రాలీ ఇన్నింగ్స్లో 21 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి రూట్(95 బంతుల్లో 84 పరుగులు) జత కలవడంతో ఇంగ్లండ్ స్కోరు ఓవర్కు ఐదు పరుగుల రనరేట్కు తగ్గకుండా పరిగెత్తడం విశేషం. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు కేవలం మూడు మెయిడెన్ ఓవర్లు మాత్రమే ఇచ్చుకున్నారంటే ఇంగ్లండ్ ఎంత ధాటిగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ► ఈ క్రమంలో జాక్ క్రాలీ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు.యాషెస్ చరిత్రలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్గా జాక్ క్రాలీ నిలిచాడు. క్రాలీ ఈ మ్యాచ్లో 182 బంతుల్లో 189 పరుగులు చేశాడు. క్రాలీ కంటే ముందు టిప్ ఫోస్టర్(1902లో సిడ్నీ వేదికగా 214 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో వాలీ హామండ్(1938లో లార్డ్స్ వేదికగా 210 పరుగులు) ఉన్నాడు.ఇక బాబ్ బార్బర్(1966లో సిడ్నీ వేదికగా 185 పరుగులు) నాలుగో స్థానంలో ఉన్నాడు. ► ఇక యాషెస్ టెస్టులో ఒక్క సెషన్లోనే సెంచరీ అందుకున్న ఆరో ఇంగ్లండ్ బ్యాటర్గా క్రాలీ రికార్డులకెక్కాడు. ► క్రాలీ స్ట్రైక్రేట్ 103 కాగా యాషెస్ చరిత్రలో ఇది రెండో బెస్ట్గా ఉంది. 103 స్ట్రైక్రేట్తో ఒక ఇన్నింగ్స్లో 150కి పైగా పరుగులు సాధించిన బ్యాటర్గా ఆడమ్ గిల్క్రిస్ట్తో కలిసి క్రాలీ సంయుక్తంగా ఉన్నాడు. ► 93 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్న క్రాలీ యాషెస్ టెస్టులో వేగవంతంగా సెంచరీ సాధించిన నాలుగో ఇంగ్లండ్ బ్యాటర్గా నిలిచాడు. A fourth Test century, coming in just 93 balls 💯 Take a bow, Zak Crawley! 👏 🏴 #ENGvAUS 🇦🇺 | @IGcom pic.twitter.com/25Nah8QBTh — England Cricket (@englandcricket) July 20, 2023 చదవండి: 500వ మ్యాచ్లో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఫిట్నెస్ విత్ బ్యూటీ : సమంతా లేటెస్ట్ ఫోటో వైరల్
పండంటి బాబుకు జన్మనిచ్చిన బుల్లితెర జంట (ఫోటోలు)
‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
సక్సెస్ ఊరికే రాదు : వేలకోట్లతో నెక్ట్స్ లెవల్ అంతే! ఎవరీ బిలియనీర్ మహిళ
తెలంగాణలో మరో రెండు రోజులు వానలే
800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
కిర్గిస్తాన్కు మన వాళ్లు ఎందుకు వెళ్తారంటే?
నా చిట్టి తల్లిని చూస్తుంటే గర్వంగా ఉంది: సుకుమార్
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
పిన్నెళ్లి వీడియోపై సీఈవో సంచలన ప్రకటన
తప్పక చదవండి
- Team India Head Coach: బీసీసీఐ ఆఫర్ నిజమే.. కానీ!
- టాప్ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్!
- మెరుగైన ఉద్యోగం కోసం.. ఇవి నేర్చుకోవాల్సిందే
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
- అలాంటి వార్తలతో నాతో పాటు కుటుంబం మొత్తం బాధ పడింది: లయ
- Raisin Water : ఎండు ద్రాక్ష నీళ్లు తాగితే ఇన్ని లాభాలా
- ప్రపంచంలోనే 50 బెస్ట్ రెస్టారెంట్ల జాబితాలో రెండు భారతీయ రెస్టారెంట్లకు చోటు!
- Dinesh Karthik: పదిహేడు సీజన్లు.. ఒకే ఒక్క టైటిల్! అరుదైన రికార్డులు
- ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement