Chandigarh
-
రైతు సంఘాలతో కేంద్రం చర్చలు
చండీగఢ్: పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సారథ్యంలోని బృందం శుక్రవారం చండీగఢ్లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించింది. రెండున్నర గంటలకుపైగా జరిగిన ఈ చర్చల్లో సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాలకు చెందిన 28 మంది స భ్యుల ప్రతినిధి బృందం పాల్గొంది. పంజాబ్, హరియాణా సరిహద్దుల్లోని శంభు, ఖనౌరీల్లో ఈ రెండు రైతు సంఘాలు ఏడాదికిపైగా నిరసనలు సాగిస్తున్నారు. పంజాబ్ ప్రభుత్వం తరఫున వ్యవసాయ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుద్దియన్, ఆహారం, పౌరసరఫరా శాఖ మంత్రి లాల్ చంద్ తదితరులు పాలొ న్నారు. మహాత్మాగాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప బ్లిక్ అడ్మినిస్ట్రేషన్(ఎంజీఎస్ఐపీఏ)లో జరిగిన చ ర్చలు సుహృద్భావ వాతావరణంలో సాగాయన్నా రు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం తీసు కున్న చర్యలను ఈ సందర్భంగా రైతు నేతలకు వివరించామని ప్రహ్లాద్ జోషి చెప్పారు. తదుపరి రౌండ్ చర్చలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో 22న జరుగుతాయని మంత్రి చెప్పారు. నిరశనదీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఖనౌరీ నుంచి ఆయన్ను అంబులెన్సులో తీసుకువచ్చారు. ఆయన ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టిందని రైతు నేత కాకా సింగ్ కొట్ర చెప్పారు. -
chandigarh: మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం
చండీగఢ్: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించింది. బీజేపీకి చెందిన హర్ప్రీత్ కౌర్ బాబ్లా మేయర్గా ఎన్నికయ్యారు. ఈ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా క్రాస్ ఓటింగ్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు మొత్తంగా 17 ఓట్లు వచ్చాయి. మొత్తం 36 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ పార్టీలో మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు క్రాస్ ఓట్ చేశారు. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ల సంఖ్య 13, కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య 6. ఓటింగ్ సమయంలో సభలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం చండీగఢ్ మేయర్ ఎన్నికల(Chandigarh Mayoral Election) కేసులో సుప్రీంకోర్టు పంజాబ్- హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జైశ్రీ ఠాకూర్ను స్వతంత్ర పరిశీలకునిగా నియమించింది. ఈసారి చండీగఢ్ మేయర్ పదవికి ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూస్తామని ఆ సమయంలో కోర్టు చెప్పింది.గత ఏడాది ఫిబ్రవరి 20న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టు కీలక తీసుకుంది. నాడు సుప్రీంకోర్టు(Supreme Court) ఓట్ల లెక్కింపును తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. చెల్లనివిగా ప్రకటించిన 8 బ్యాలెట్లను చెల్లుబాటు అయ్యేవిగా ప్రకటించారు. బ్యాలెట్ పత్రాలను పరిశీలించి, వీడియో చూసిన తర్వాత ఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ను మందలించి, షోకాజ్ నోటీసు జారీ చేశారు.ఇది కూడా చదవండి: ఆకాశం నిర్మలంగా ఉన్నా ప్రమాదం ఎలా జరిగింది?.. ట్రంప్ సందేహం -
Ambedkar Row: కౌన్సిలర్ల డిష్యూం.. డిష్యూం
చండీగఢ్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారలేదు. ఈలోపు.. మంగళవారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. షా వ్యాఖ్యల నేపథ్యంతో.. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.గత వారం రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలతో అమిత్ షా రాజీనామా చేయాలంటూ చండీఘడ్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు తమ ఆమోదాన్ని తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కౌన్సిలర్లు జవహర్లాల్ నెహ్రూ హయాంలో బీఆర్ అంబేద్కర్కు అవమానం జరిగిందని ఆరోపించారు. దీంతో కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దాదాపు 20 నిమిషాల పాటు కౌన్సిలర్లు భౌతికంగా కలబడ్డారు. #WATCH | Scuffle erupted between Congress and BJP councillors over the subject of Dr BR Ambedkar during the general house meeting of Chandigarh Municipal Corporation todayNominated councillor Anil Masih had targeted Congress and stated that Rahul Gandhi is out on bail, citing… pic.twitter.com/iZmLidgbT0— ANI (@ANI) December 24, 2024అయితే జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో రిటర్నింగ్ అధికారి, నామినేటడ్ కౌన్సిలర్ అనిల్ మసీహ్ వివాదాస్పదంగా వ్యవహరించారు. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తేలింది. దీనిపై సుప్రీం కోర్టు అనిల్ మసీహ్పై అంక్షితలు వేసింది.ఇవాళ జరిగిన మున్సిపల్ సమావేశంలో బీజేపీ నుంచి నామినేటెడ్ కౌన్సిలర్గా ఉన్న అనిల్ మసీహ్ను కాంగ్రెస్ కౌన్సిలర్లు నాటి ఘటనను ప్రస్తావిస్తూ ఎన్నికల దొంగ అంటూ సంభోదించారు. బదులుగా అనిల్ మసీహ్ సైతం.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్పై బయట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు ఘర్షణకు దారి తీసింది. -
బ్యాట్తో రాణించిన షమీ.. క్వార్టర్ ఫైనల్లో బెంగాల్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో బెంగాల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (డిసెంబర్ 9) ఉదయం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ చండీఘడ్పై 3 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పదో నంబర్లో బ్యాటింగ్కు దిగిన మొహమ్మద్ షమీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి 17 బంతుల్లో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 33 పరుగులు చేసిన కరణ్ లాల్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ప్రదిప్త ప్రమాణిక్ 30, వ్రిత్తిక్ చట్టర్జీ 28 పరుగులు చేశారు. చండీఘడ్ బౌలర్లలో జగ్జీత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. రాజ్ బవా 2, నిఖిల్ శర్మ, అమృత్ లుబానా, భగ్మేందర్ లాథర్ తలో వికెట్ తీశారు.160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చండీఘడ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. సయాన్ ఘోష్ నాలుగు వికెట్లు తీసి చండీఘడ్ను దెబ్బకొట్టాడు. కనిష్క్ సేథ్ 2, షాబాజ్ అహ్మద్, షమీ తలో వికెట్ పడగొట్టారు. చండీఘడ్ ఇన్నింగ్స్లో రాజ్ బవా టాప్ స్కోరర్గా నిలిచాడు. ప్రదీప్ యాదవ్ (27), మనన్ వోహ్రా (23), నిఖిల్ శర్మ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కాగా, డిసెంబర్ 11న జరిగే క్వార్టర్ ఫైనల్-1లో బెంగాల్ బరోడాను ఢీకొంటుంది. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు రెండో ప్రీ క్వార్టర్ ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్లో ఉత్తర్ ప్రదేశ్.. ఆంధ్రప్రదేశ్తో తలపడనుంది. -
చండీగఢ్ లో ప్రధాని మోదీ పర్యటన
-
మరో వివాదంలో ఎమర్జెన్సీ.. కంగనకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదాల సుడిలో చిక్కుకుంది. . తాజాగా ఆమెకు చండీగఢ్లోని జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో సిక్కుల ప్రతిష్టను కించపరిచేలా నటించారని ఆరోపిస్తూ.. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.అయితే సినిమాలను సిక్కు ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, అనేక తప్పుడు సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కంగనపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కంగనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది.ఇక నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలో సిక్కులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని శిరోమణి అకాలీదళ్తో సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది.సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కారణంగా ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కంగనా ఇటీవల పేర్కొన్నారు. బాంద్రాలోని పాలి హిల్లో ఉన్న తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. -
CJI DY Chandrachud: న్యాయం, వైద్యం... అత్యంత ఖరీదు!
చండీగఢ్: ‘‘వైద్య, న్యాయ వృత్తుల రెండింటి లక్ష్యమూ ఒక్కటే. అంకితభావంతో కూడిన సేవ ద్వారా వ్యక్తులకు, సమాజానికి హితం చేకూర్చడం. సంక్షేమమే వాటి మూలసూత్రం. కానీ, సమాజ హితానికి పాటుపడేందుకే పుట్టుకొచి్చన అతి కీలకమైన ఆ రెండు రంగాలూ నేడు అదే సమాజానికి అందుబాటులో లేకుండా పోవడం ఆశ్చర్యకరం’’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం రాకతో 1980ల నుంచి భారత్లో వైద్యం బాగా వ్యాపారమయంగా మారిపోయిందన్నారు. ‘‘పలు ఔషధాల ఖరీదు భరించలేనంతగా పెరిగిపోయింది. గ్రామీణుల ఆదాయంలో ఏకంగా 77 శాతం, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం వైద్య ఖర్చులకే పోతోంది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్య కళాశాలు చూడాల్సిన అవసరముంది. ఇది వాటి సామాజిక బాధ్యత కూడా’’ అని హితవు పలికారు. శనివారం చండీగఢ్లో పీజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 37వ స్నాతకోత్సవంలో సీజేఐ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించారు. రోగుల పట్ల దయ, సహానుభూతి ఉండాలని వారికి ఉద్బోధించారు. ‘‘భారత్ ఇన్నొవేషన్ల కేంద్రంగా మారడం అభినందనీయం. కానీ వాటి ఫలాలు అతి కొద్దిమందికే పరిమితం అవుతుండటం బాధాకరం. కనుక వైద్య రంగంలో కీలక పరిశోధనలకు యువ డాక్టర్లు శ్రీకారం చుట్టాలి’’ అని ఆకాంక్షించారు. టెక్నాలజీ వాడకం పెరగాలి టెక్నాలజీ ద్వారా కోర్టుల పనితీరులో జవాబుదారీతనం పెరగడమే గాక న్యాయప్రక్రియ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘పారదర్శకత, ప్రజాస్వామ్యం, అందరికీ సమన్యాయం వంటి విలువల పరిరక్షణకు టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. కక్షిదారులు కూడా ఉన్నచోటి నుంచే వారి కేసుల విచారణను ప్రత్యక్షంగా వీక్షించే వీలు కలి్పస్తోంది’’ అని చెప్పారు. గత నాలుగేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 8 లక్షలకు పైగా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిందని గుర్తు చేశారు. పెండింగ్ భారాన్ని తగ్గించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. -
చండీగఢ్ కోర్టులో కలకలం.. ఐఆర్ఎస్ అల్లుడిపై ఐపీఎస్ మామ కాల్పులు
చండీగఢ్: చండీగఢ్ కోర్టు కాంప్లెక్స్లో కాల్పుల కలకలం రేగింది. పెళ్లి వివాదంపై రెండు బృందాలు ఫ్యామిలీ కోర్టుకు రాగా, అదే సమయంలో పంజాబ్ పోలీస్ మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన అల్లుడు హర్ప్రీత్ సింగ్పై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన మృతిచెందాడు. మల్వీందర్ అల్లుడు వ్యవసాయ శాఖలో ఐఆర్ఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. కేసు దర్యాప్తు ప్రారంభించారు.హర్ప్రీత్ సింగ్కు అతని భార్యతో విడాకుల కేసు నడుస్తోంది. విచారణ సందర్భంగా అతని బావ, సస్పెండైన ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. కోర్టులో విచారణ సందర్భంగా ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.ఈ సమయంలో నిందితుడైన మాజీ ఏఐజీ మల్వీందర్ సింగ్ సిద్ధూ తన తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు. కోర్టులో న్యాయవాదులు నిందితుడిని పట్టుకుని గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్ప్రీత్ను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. -
Paris Olympics : ఒకే యూనివర్సిటీ నుంచి ఎనిమిది మంది
చండీగఢ్: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందంలో ఒకే యూనివర్సిటీకి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఉండటం విశేషం. చండీగఢ్ యూనివర్సిటీకి అలాంటి అరుదైన అవకాశం దక్కింది.ఈ యూనివర్సిటీ విద్యార్థులు భజన్ కౌర్ (ఆర్చరీ), అర్జున్ (షూటింగ్), సంజయ్ (హాకీ), రితిక (రెజ్లింగ్), అక్ష్దీప్ సింగ్ (రేస్ వాకింగ్), యశ్ (కయాకింగ్)లతో పాటు పారాలింపియన్లు పలక్ కోహ్లి (బ్యాడ్మింటన్), అరుణ తన్వర్ (తైక్వాండో) ఒలింపిక్స్లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ గౌరవం పట్ల చండీగఢ్ యూనివర్సిటీ చాన్స్లర్, ఎంపీ సత్నామ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. క్వార్టర్ ఫైనల్లో అనాహత్, శౌర్య ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్లో తొలిసారి ఇద్దరు భారత క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించారు. అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో బాలికల సింగిల్స్లో జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్... బాలుర సింగిల్స్లో శౌర్య బావా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అనాహత్ 11–6, 13–11, 11–2తో అకారి మిదోరికావా (జపాన్)పై, శౌర్య 11–9, 5–11, 11–5, 13–11తో సెగుండో పొర్టాబాలెస్ (అర్జెంటీనా)పై విజయం సాధించారు. -
ప్రమాదం బారిన చండీగఢ్ బీఎస్ఫీ అభ్యర్థి
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికలకు సంబంధించిన విషయాలు ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. తాజాగా చండీగఢ్ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతూ సింగ్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, తలకు కుట్లు వేశారు.వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉన్న ఒక కాలనీలోని బీఎస్పీ నేతలు, కార్యకర్తలు డాక్టర్ రీతూ సింగ్ను నాణేలతో తూకం వేస్తున్నారు. ఇంతలో ఆ తూకం తెగిపోయి, దాని రాడ్డు ఆమె తలకు తగిలింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించి, తలకు కుట్లు వేసి ఇంటికి పంపించారు.చండీగఢ్ నుంచి డాక్టర్ రీతూ సింగ్ను బీఎస్పీ పోటీకి నిలిపింది. రీతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. సైకాలజీ సబ్జెక్టులో ఆమెకు విశేష అనుభవం ఉంది. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఆమె దళితుల పక్షాన గొంతెత్తారు. ఈ నేపధ్యంలో ఆమెను డిస్మిస్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ రీతూ సింగ్ పీహెచ్డీ పకోడా వాలీ పేరుతో ఓ స్టాల్ కూడా పెట్టారు. కుల వేధింపుల ఆరోపణలతో 2023, సెప్టెంబర్లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన చేపట్టారు. ఈ సమయంలోనే ఆమె విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గుర్యయ్యారు. -
హర్యానాలో కర్ఫ్యూ విధించిన సూర్యుడు
హర్యానాలో వేసవి తాపం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో పగటిపూట ఎక్కడ చూసినా కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చండీగఢ్తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణీయంగా పెరిగాయి. దేశంలోని హాటెస్ట్ నగరాల్లో హర్యానాలోని నుహ్ రెండో స్థానంలో ఉంది. దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నగరంగా యూపీలోని ఆగ్రా నిలిచింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్యానాలోని 25 నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ హర్యానాలోని 11 జిల్లాల్లో మే 23 వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో మహేంద్రగఢ్, రేవారీ, గురుగ్రామ్, నుహ్, పల్వాల్, ఫరీదాబాద్, సిర్సా, ఫతేహాబాద్, హిసార్, భివానీ, చర్కి దాద్రీ జిల్లాలు ఉన్నాయి. పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కైతాల్, కర్నాల్, ఝజ్జర్, రోహ్తక్, సోనిపట్, పానిపట్, జింద్ 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మరోవైపు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు పలు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంబాలాలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటిపూట మార్కెట్లు వెలవెల బోతున్నాయి. సాయంత్రం పూట కొద్దిసేపు మాత్రమే వ్యాపారం జరుగుతున్నదని దుకాణదారులు వాపోతున్నారు. ఒకప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. -
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
ఇటీవల కొందరూ సోషల్ మీడియా స్టార్డమ్ కోసం పిచ్చిపనులు మతిపోయేలా ఉంటాయి. అస్సలు అర్థంపర్థం లేని విధంగా రోతగా ఏవేవో రీల్స్ చేసేస్తుంటారు. చూశావాడి కర్మలే అనో లేక ఇలా చేస్తే వ్యూస్ పెరుగతాయన్న భావమో గానీ ఇలాంటి వాటి వల్ల కొందరూ ప్రాణాలు పోగొట్టుకుంటే మరికొందరూ నెగిటివిటీని తెచ్చుకుని చివరికి వివరణ ఇచ్చుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చండీగఢ్లో ఒకటి చోటు చేసుకుంది. చండీగఢ్లో ఓ ఆహార విక్రేత డీజిల్తో చేసిన పరాఠాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద దూమరం రేపింది. ఒక్కసారిగా నెటిజన్లు దీనిపై భారత ఫుడ్ కార్పొరేషన్ తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దెబ్బకు సదరు ఫుడ్ యజమాని చన్నీ సింగ్ దిగొచ్చి తాము డీజిల్ పరాటా వంటవి చేయమని వివరణ ఇచ్చారు. అలాగే వీడియోలో చెప్పినట్లుగా కస్టమర్లకు అలాంటి పరాటాలను అందించమని తెలిపారు.True recipe for cancer (petrol diesel wala paratha)Where r we heading? 🤦#AlluArjun #Pithapuram #MondayVibes #MorningVibes #MadhaviLatha #ViralVideo #ElectionDay pic.twitter.com/GyxC1xhQeb— K.P.Brinda Reddy (@kpbrindareddy) May 13, 2024 కేవలం వినోదం కోసం సరదాగా చేసిన రీల్ అని చెప్పుకొచ్చారు. మా కంటెంట్ మిమ్మల్ని ఎంతగానో బాధించిందనందుకు తనని క్షమించండని వేడుకున్నాడు. అలాగే తాము ఈ ఆలు పరాటాలను శుద్దమైన నెయ్యి, నూనెలతోనే తయారు చేస్తామని చెప్పారు. అలాగే ఆ వీడియోని తీసిన అమన్ ప్రీత్ సింగ్ కూడా ఇన్స్టామ్ వేదికగా క్షమాపణ తెలిపాడు. View this post on Instagram A post shared by Amanpreet Singh (@oyefoodiesinghఈ మేరకు సదరు వ్యక్తులు ఇన్స్టామ్లో.. చండీగఢ్ పరిపాలనా యంత్రాంగానికి, యావత్తు భారతదేశ ప్రజలకు నా హృదయపూర్వక క్షమాపణలు. తాము తీసిని వీడియో కంటెంట్ మిమ్మల్ని ఎంతో భాదించదనందుకు చింతిస్తున్నాం అని అందుకు మమల్ని క్షమించండని వేడుకున్నారు. సరదా కోసి ఇలా ఏదిపడితే అది చేస్తే జనాలు ఊరుకోరు. స్టార్ డమ్, వ్యూస్ మాట పక్కన ఉంచితే ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించారని ఎవరైనా కేసు పెడితే ఊచలు లెక్కించా ల్సిందే. సరదా అనేది అందరికీ సంతోషమే తెప్పించాలి గానీ ఆగ్రహం తెప్పించేలా ఉండకూడదు.(చదవండి: నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!) -
హోలీ 2024 : యూనివర్శిటీలో విద్యార్థుల హంగామా చూసి తీరాల్సిందే!
చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో వార్షిక హోలీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. శుక్రవారం నిర్వహించిన ఈ ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు హోలీ ఆడుతూ సందడి చేశారు. సరదాగా వాటర్ బెలూన్, తదితర ఆటపాటలతో విద్యార్థులంతా హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు. ఈవేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by '*·舞~ 𝕐άŜ𝓗Ɨ𝔰H ~舞*'¨¯ (@yashish023) అయితే ఈ సందర్బంగా క్యాంపస్లో భద్రతా తనిఖీలతో గందరగోళం ఏర్పడింది. అంతకుముందు విద్యార్థిపై బయటి వ్యక్తి దాడి చేసిన ఘటనలో విద్యార్థులు నిరసనకు దిగడంతో వేడుకలకు అంతరాయం ఏర్పడింది. నిందితుడు బాధితురాలికి క్షమాపణలు చెప్పినప్పటికీ విద్యార్థులు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అయితే నిరసనకారులు చెదరగొట్టారు.దాడి కేసులో నిందితుడిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.ఈ గందరగోళం హోలీ వేడుకల భద్రతా ఏర్పాట్లకు అంతరాయం కలిగించిందని పేరుచెప్పడానికి అంగీకరించని భద్రతా అధికారి ఒకరు వెల్లడించారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. View this post on Instagram A post shared by Chandigarh (@the__chandigarh) -
సీనియర్ , డిప్యూటీ మేయర్ బీజేపీ కైవసం
చండీగఢ్: సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ చివరకు సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యరి్ధకి పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటరి్నంగ్ అధికారిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన దరిమిలా చండీగఢ్ సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు సైతం అందరి దృష్టినీ ఆకర్షించాయి. సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు విజయాలను నమోదుచేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో 35 సభ్యులుండే మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్ప్రీత్ గబీపై బీజేపీ అభ్యర్థి కుల్జీత్ సంధూ విజయం సాధించారు. డెప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిపై బీజేపీ అభ్యర్ధి రాజీందర్ శర్మ గెలిచారు. -
ఛండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురు దెబ్బ!
పంజాబ్, హర్యానా రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నేత కుల్జీత్ సంధు విజయం సాధించారు. అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది. డిప్యూటీ మేయర్గా బీజేపీ అభ్యర్థి రాజిందర్ కుమార్ శర్మ గెలుపొందారు. మీడియా దగరున్న సమాచారం ప్రకారం చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన కుల్జీత్ సింగ్ సంధుకు మొత్తం 19 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గురుప్రీత్ సింగ్ గబీకి 16 ఓట్లు వచ్చాయి. శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ హర్దీప్ సింగ్ బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఒక ఓటు చెల్లదని ప్రకటించారు. గతంలో మేయర్ ఎన్నికల్లో గందరగోళం నెలకొన్న నేపధ్యంలో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రిసైడింగ్ అధికారిని కోర్టు మందలించింది. అనంతరం డిప్యూటీ మేయర్, సీనియర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరిగాయి. కాగా కొద్ది రోజుల క్రితం ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. వీరు ఇప్పుడు బీజేపీకి ఓటు వేశారు. దీంతో బీజేపీ విజయం సాధించింది. గతంలో కాంగ్రెస్, ఆప్లకు 20 మంది కౌన్సిలర్లు ఉండేవారు. వీరిలో ముగ్గురు బీజేపీలో చేరడంతో ‘ఇండియా కూటమి’ కౌన్సిలర్ల సంఖ్య 17కు తగ్గింది. అదే సమయంలో బీజేపీకి అకాలీ, కిరణ్ ఖేర్ మద్దతు పలకడంతో ఆ పార్టీకి మొత్తం 19 ఓట్లు వచ్చాయి. -
‘సర్వోన్నత’ న్యాయం!
వ్యవస్థలు నిర్మాణం కావటానికి సమయం పట్టినట్టే అవి భ్రష్టుపట్టడానికి కూడా ఎంతో కొంత వ్యవధి పడుతుంది. అప్రమత్తంగా వుండి సకాలంలో దాన్ని గమనించుకుంటే వాటిని రక్షించు కోవటం సులభమవుతుంది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీసుకున్న అసాధారణ నిర్ణయం ఆ కారణం రీత్యా హర్షించదగింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ను మేయర్గా ప్రకటిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పు వక్రమార్గాల్లో విజయం సాధించటానికి అలవాటుపడిన రాజకీయ నేతలకూ, వారికి దాసోహమయ్యే అధికారులకూ చెంపపెట్టు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసీ కనీసం సీసీ కెమెరాలున్నాయన్న వెరపు కూడా లేకుండా ఆప్ అభ్యర్థికి పడిన ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై స్వహస్తాలతో గీతలు పెట్టి అవి చెల్లని ఓట్లుగా లెక్కేసి బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ఆయన వ్యవహారశైలి పూర్తిగా చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చిచెప్పటంతోపాటు అఫిడవిట్లో సైతం ఆ అధికారి బొంకటం నేరంగా పరిగణించి ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 340 కింద విచారణ జరపాలని నిర్ణయించటం మంచి పరిణామం. నిజానికి ఏ ఇతర నగరాలతో పోల్చినా చండీగఢ్ మేయర్ పదవి ఏమంత ప్రాధాన్యత వున్నది కాదు. కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న ఆ నగరానికి మేయర్ అయినవారు కార్పొరేషన్ సమావేశాలు నిర్వహించటం, ఎజెండాను రూపొందించటం మాత్రమే చేయగలరు. పైగా ఆ పదవీకాలం ఏడాది మాత్రమే. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్ వరకూ ఎవరి దారి వారిదే అని ప్రకటించిన ఆప్... అందరినీ ఆశ్చర్యపరుస్తూ మేయర్ ఎన్నికలో మాత్రం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 13 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడింటిని గెలుచుకుంది. బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చండీగఢ్ లోక్సభ ఎంపీగా గెలిచిన బీజేపీ నేత కిరణ్ ఖేర్, ఒకే ఒక్క సభ్యుడున్న శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్ను కూడా కలుపుకొంటే బీజేపీ బలం 16. కనుక 36 మంది సభ్యులున్న కార్పొరేషన్లో 20 మంది సభ్యులున్న ఆప్–కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం. కానీ ఏం చేసైనా నెగ్గి తీరాలనుకున్న బీజేపీ వ్యూహానికి అనిల్ మాసీ వంతపాడారు. ఆది నుంచీ మేయర్ ఎన్నికను ఆయన ప్రహసన ప్రాయంగా మార్చారు. షెడ్యూల్ ప్రకారం వాస్తవానికి గత నెల 18న మేయర్ ఎన్నిక జరగాలి. కానీ ఆప్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశం కోసం వెళ్లాక మాసీ అస్వస్థులయ్యారంటూ దాన్ని కాస్తా వాయిదా వేశారు. కేంద్రపాలిత పాలనావ్యవస్థ ఈ ఎన్నికను ఫిబ్రవరి 6న జరపాలని నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ పంజాబ్ హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం దీన్ని జనవరి 30న జరపాలని ఆదేశించింది. ఈ క్రమం అంతా పరిశీలిస్తే, 30న జరిగిన తతంగం గమనిస్తే నాయకులు, అధికారులు ఎంత నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఈనెల 5న ఈ కేసు విచారణకొచ్చినప్పుడు మాసీ వ్యవహరించిన తీరును జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని వంచించటం, హత్య చేయటం తప్ప మరేమీ కాద’ని ఆయన అన్నారు. నిజానికి ప్రజలకు బాధ్యత వహించాల్సిన స్థానంలో, వారి విశ్వాసాన్ని పొందాల్సిన స్థానంలో వున్న రాజకీయ పార్టీలకు ఈ స్పృహ వుండాలి. రేపన్న రోజు అధికారంలోకొచ్చే మరో పార్టీ కూడా ఇదే తీరులో గెలుపును తస్కరించే ప్రమాదం వున్నదని గుర్తించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల దృష్టిలో ఈ ఎన్నికల తతంగం మొత్తం గుప్పెడుమంది బల వంతులు చేసే వంచనాత్మక విన్యాసమన్న అభిప్రాయం స్థిరపడితే తమ మనుగడే ప్రశ్నార్థక మవుతుందన్న ఎరుక వుండాలి. కానీ సమస్యాత్మకంగా వున్న బడి పిల్లలకు ఉపాధ్యాయులు చీవాట్లు పెట్టే రీతిలో సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుని చెప్పవలసిరావటం అధికారుల, నేతల పరువు ప్రతిష్ఠలకే తలవంపు. దాన్ని కనీసం గుర్తించలేని స్థితిలోనే మన నాయకగణం వున్నదని ఆదివారంనాటి పరిణామాలు చెబుతున్నాయి. మేయర్ ఎన్నికను సుప్రీంకోర్టు రద్దు చేసి, మళ్లీ ఎన్నికకు ఆదేశి స్తుందన్న అంచనాతో బీజేపీ నాయకులు ఫిరాయింపులకు తెరలేపి, ముగ్గురు ఆప్ సభ్యులను బుట్టలో వేసుకున్నారు. దాంతో ఆప్–కాంగ్రెస్ కూటమి బలం 17కి పడిపోగా, బీజేపీ బలం 19కి పెరిగింది. ఒకపక్క చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో వుండి, దేశమంతా దానిపై దృష్టిపెట్టిన తరుణంలో ఈ తరహా జుగుప్సాకర చేష్టలకు పాల్పడటం భావ్యంకాదన్న ఇంగితజ్ఞానం లోపించటం నిజంగా బాధాకరం. మేయర్గా పార్టీ అభ్యర్థి నెగ్గటంపైనే తమ భవిష్యత్తంతా ఆధారపడి వుందనుకోవటం దివాలాకోరుతనం. మాసీ మాయోపాయంవల్ల మేయర్ అయిన మనోజ్ సోంకార్ రాజీనామా చేశారు గనుక తిరిగి ఎన్నికకు ఆదేశించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను తోసిపుచ్చి 142వ అధికరణ కింద సంక్రమించిన అధికారాన్ని వినియోగించి ఆప్ అభ్యర్థిని విజేతగా నిర్ణయించటాన్ని చూసైనా అటు నాయకులూ, ఇటు అధికార గణమూ కళ్లు తెరవాలి. అక్రమాలతో, అన్యాయాలతో గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి తీవ్ర అపచారం చేయటమేనని అందరూ గుర్తించాలి. అసాధారణమైన ఈ తీర్పు మన వ్యవస్థలకు భయభక్తులు నేర్పాలి. -
‘ఆప్’ అభ్యర్థే చండీగఢ్ మేయర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అత్యున్నత న్యాయస్థానంలో ఘన విజయం లభించింది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్ను విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం తిరస్కరించింది. రిటర్నింగ్ అధికారి ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు కులదీప్ కుమార్కు పడినట్లు గుర్తించింది. చండీగఢ్ మేయర్గా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్ ఎన్నికైనట్లు తేల్చిచెబుతూ సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 కింద తమకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. ఎన్నిక ప్రక్రియను తారుమారు చేశారు మేయర్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ‘ఆప్’ నేత, మేయర్ అభ్యర్థి కులదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. చెల్లనివిగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించిన 8 బ్యాలెట్ పేపర్లను స్వయంగా పరిశీలించింది. అవి ఎక్కడ పాడైపోయాయి? ఎందుకు చెల్లుబాటు కావో చెప్పాలని అనిల్ మాసిని ప్రశ్నించింది. ఆ 8 ఓట్లు కులదీప్ కుమార్కు పడినట్లు తేల్చింది. పిటిషనర్కు అనుకూలంగా పడిన ఓట్లను రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగానే చెల్లనివిగా గుర్తించినట్లు ఆక్షేపించింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. మేయర్ ఎన్నిక విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వైఖరి సక్రమంగా లేదని వెల్లడించింది. మేయర్ ఎన్నిక ప్రక్రియను ఆయన చట్టవిరుద్ధంగా తారుమారు చేశారని, అంతేకాకుండా కోర్టులో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని, ఇందుకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. అనిల్ మాసిపై సీఆర్పీఎస్ సెక్షన్ 340 కింద ధర్మాసనం విచారణ ప్రారంభించింది. అసలేం జరిగింది? చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించారు. కార్పొరేషన్లో మొత్తం 36 ఓట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండడంతో రిటర్నింగ్ అధికారి అనిల్ మాషీ 8 ఓట్లపై రహస్యంగా ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించారు. ఈ వీడియో బయటకు వచ్చింది. మిగిలిన ఓట్లను లెక్కించగా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్కు 12, బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. దీంతో కులదీప్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడింది: కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆప్ జాతీయ కన్వి నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కాపాడిందన్నారు. ఇదో చరిత్రాత్మక తీర్పు అన్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి కలిసికట్టుగా పని చేస్తే బీజేపీని ఓడించడం సులువేనని తాజా పరిణామం స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పోలయ్యే 90 కోట్లకు పైగా ఓట్లను బీజేపీ ఎలా దొంగిలిస్తుందని ప్రశ్నించారు. నీచ రాజకీయాలను ఎదిరించాలి: ఖర్గే సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ బీజేపీ కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానం రక్షించిందంటూ ఎక్స్లో పోస్టు చేశారు. బీజేపీ నీచ రాజకీయాలను ప్రజలంతా కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి బీజేపీ పన్నిన కుట్రలో రిటర్నింగ్ అధికారి అనిల్ మాసి ఒక పావు మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ముఖం నరేంద్ర మోదీ అని ఆరోపించారు. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గత నెలలో జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నిక ఫలితాలు చెల్లవని సుప్రీంకోర్టు ప్రకటించింది. రిట్ర్నింగ్ అధికారి చట్ట విరుద్దంగా వ్యహరించారన్న సర్వోన్నత న్యాయస్థానం .. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ను చండీగఢ్ మేయర్గా ప్రకటించింది. మేయర్ఎ న్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ మేరకు రిటర్నింగ్ అధికారిపై తీవ్రంగా విరుచుకుపడింది. ఉద్దేశపూర్వకంగానే అనిల్ మసీహ్ 8 బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది. అంతకముందు మేయర్ ఎన్నికల ఓట్లను రీకౌంటింగ్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి చెల్లని ఓట్లుగా ప్రకటించి పక్కకు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎనిమిది బ్యాలెట్ పేపర్లను కూడా లెక్కించాలని ఆదేశించింది. ఈ మేరకు చెల్లుబాటు కాని ఎనిమిది బ్యాలెట్ పత్రాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. అనంతరం ఆ 8 ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుని.. వాటితో కలిపి మరోసారి మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని చండీగఢ్ మేయర్గా ప్రకటించాలని తెలిపింది. తాజాగా ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ను చండీగఢ్ మేయర్గా ప్రకటించడంతో ఈవివాదానికి తెరపడింది. చదవండి: పరువు నష్టం కేసులో రాహుల్గాంధీకి ఊరట కాగా జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్ను ఓడించి మనోజ్ సోంకర్ మేయర్గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. బ్యాలెట్ పేపర్లను మార్కింగ్ చేస్తూ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ కెమెరాకు చిక్కారు. దీంతో ఆప్ కౌన్సిలర్ సుప్రీంను ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన నేపథ్యంలో ఆదివారం సోంకర్ మేయర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆప్కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. -
బ్యాలెట్పై ‘ఎక్స్’ మార్కు ఎందుకేశారు?
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నిక సమయంలో బ్యాలెట్ పత్రాలను పాడుచేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు గాను రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. అనిల్ మసీహ్ను ప్రశ్నించడం ద్వారా, రిటర్నింగ్ అధికారిని దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ క్రాస్ ఎగ్జామినేట్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారిగా భావిస్తున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. చండీగఢ్ మేయర్గా ఎన్నికైన మనోజ్ సోంకార్ రాజీనామా, ఆప్ కౌన్సిలర్లు ముగ్గురు ఆదివారం బీజేపీ పంచన చేరినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అభ్యర్థులను ప్రలోభ పెట్టడాన్ని తీవ్రమైన అంశంగా పేర్కొంది. తాజాగా ఎన్నికలు జరపటానికి బదులుగా కొత్త రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణంలో మరోసారి ఓట్లను లెక్కించడం మంచిదని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే, మంగళవారం బ్యాలెట్ పత్రాలను పరిశీలించాకే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. నిజాయతీగా సమాధానమివ్వండి సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మసీహ్ను కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. నిజాయతీగా సమాధానాలు చెప్పకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం. ఆ ఫుటేజీ చూశాం. మీరు బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు పెడుతూ కెమెరా వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు క్రాస్ మార్కులు పెట్టారు?’ అని అడిగారు. ఎనిమిది బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కు పెట్టింది నిజమేనని మసీహ్ అంగీకరించారు. అవి అప్పటికే పాడైపోయి ఉన్నందున, వేరు చేసేందుకే అలా చేశాన’ని చెప్పారు. ‘బ్యాలెట్ పేపర్లపై మీరు కేవలం సంతకం మాత్రమే చేయాలి. అలాంటప్పుడు వాటినెందుకు పాడు చేశారు? బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారులు ఇతరత్రా మార్కులు వేయొచ్చని ఏ నిబంధనల్లో ఉంది?’అని సీజేఐ అడిగారు. ఎన్నికల ప్రక్రియలో కలుగ జేసుకున్నందుకు మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని చండీగఢ్ యంత్రాంగం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి సీజేఐ పేర్కొన్నారు. మంగళవారం జరిగే విచారణకు కూడా హాజరుకావాలని అనిల్ మసీహ్ను ఆదేశించారు. ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఉన్నారు. బ్యాలెట్ పత్రాలు, కౌంటింగ్ వీడియో పరిశీలిస్తాం బ్యాలెట్ పత్రాలతోపాటు ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన మొత్తం వీడియో ఫుటేజీని తమకు పంపించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. రికార్డులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఒక న్యాయాధికారికి బాధ్యతలు అప్పగించాలని, పటిష్ట బందోబస్తు నడుమ ఆయన్ను ఢిల్లీకి పంపాలని స్పష్టం చేసింది. ఏం జరిగిందంటే..? జనవరి 30వ తేదీన మేయర్ ఎన్నికలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎనిమిది ఓట్లను చెల్లనివిగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించడం, బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకార్ చేతిలో ఆప్–కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి నాలుగు ఓట్ల తేడాతో ఓటమిపాలవడం తెలిసిందే. బీజేపీ మైనారిటీ సెల్కు చెందిన అనిల్ మసీహ్ కావాలనే ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని ఆప్ ఆరోపించింది. కెమెరా వైపు చూసుకుంటూ ఆప్ కౌన్సిలర్లకు చెందిన బ్యాలెట్ పేపర్లపై మసీహ్ ‘ఎక్స్’ మార్కువేస్తున్న ఫుటేజీని ఆప్ కోర్టుకు సమర్పించింది. ఈ నెల 5వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ చర్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. -
చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు సీరియస్.. కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశారన్న కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను ప్రాసిక్యూట్ చేయాలని పేర్కొంది. ఆయన్ను మంగళవారం కూడా విచారణకు రావాలని తెలిపింది. అంతేగాక మేయర్ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను రేపు సుప్రీంకోర్టుకు తీసుకురావాలని ఆదేశించింది. అందుకోసం ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. జ్యుడిషియల్ అధికారికి, రికార్డులకు భద్రత కల్పించాలని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు బ్యాలెట్ పేపర్లు, ఓట్ల లెక్కింపు మొత్తం వీడియో రికార్డింగ్ను పరిశీలిస్తామని పేర్కొంది. సు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. అయితే రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. చదవండి: యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది: మోదీ నిజాయితీగా సమాధానాలు చెప్పండి: సుప్రీం చండీగఢ్ మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ అత్యున్నత న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్బంగా సీజేఐ డీవై చంద్రచూడ్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అనిల్ మసీహ్ను పలు సూటి ప్రశ్నలు సంధించింది. నిజాయితీగా సమాధానాలు చెప్పకుంటే తనపై విచారణ చేస్తామని హెచ్చరించింది. ఇది తీవ్రమైన విషయమని పేర్కొన్న ధర్మాసనం... ‘మేం వీడియో చూశాము. బ్యాలెట్ పేపర్లపై క్రాస్ మార్కులు వేస్తూ కెమెరాను చూసి ఏం చేస్తున్నారు? ఎందుకు మార్కులు వేస్తున్నారు అని ప్రశ్నించింది. ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై క్రాస్ మార్కులు వేసినట్లు అంగీకరించిన రిటర్నింగ్ అధికారి.. చెడిపోయిన బ్యాలెట్ పత్రాలను వేరుచేయవలసి ఉన్నందున తాను అలా చేశానని బదులిచ్చారు. ‘మీరసలు బ్యాలెట్ పత్రాలను ఎందుకు పాడు చేశారు. పత్రాలపై సంతకం మాత్రం చేయడమే మీ బాధ్యత. మీరు బ్యాలెట్ పత్రాలపై ఇతర గుర్తులు వేయవచ్చని నిబంధనలలో ఎక్కడ పొందుపరిచారు’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా వైపు తిరిగి.. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ను రేపు మళ్లీ ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడని సీజేఐ పేర్కొన్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించే బదులు కొత్త రిటర్నింగ్ అధికారితో ఓట్లను లెక్కించాలని తొలుత ప్రతిపాదించారు బ్యాలెట్ పత్రాలను పరిశీలించిన తర్వాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జనవరి 30న జరిగిన మేయర్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎనిమిది ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ప్రకటించడంతో బీజేపీకి చెందిన మనోజ్ సోంకర్ చేతిలో ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్కుమార్ నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ మైనారిటీ సెల్ సభ్యుడు మిస్టర్ మసీహ్ ఉద్దేశపూర్వకంగా ఓట్లను చెల్లుబాటు చేయలేదని ఆప్ ఆరోపించింది. ఈ క్రమంలోనే రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో అతడు కెమెరాను చూస్తూ కొంతమంది ఆప్ కౌన్సిలర్ల బ్యాలెట్ పత్రాలపై ఏదో రాస్తున్నట్లు కనిపిస్తుంది.దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. తొలుత ఈ పిటిషన్పై ఫిబ్రవరి 5న విచారించిన సుప్రీంకోర్టు.. అనిల్ మసీహ్ చర్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని పేర్కొంది. -
బీజేపీకిలోకి ముగ్గురు కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ రాజకీయాలు
చండీగఢ్: బీజేపీకి భారీ షాక్ తగిలింది. చంఢీగఢ్ మేయర్ పదవికి ఆ పార్టీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సోంకర్ రజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్ను ఓడించి మేయర్గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు. చదవండి: Kejriwal: ఈడీ విచారణకు ఆరో‘సారీ’! రిటర్నింగ్ అధికారిపై సుప్రీం కోర్టు మండిపాటు ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. 'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హజరు కావాలని చెప్పి, తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఆప్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేశారు. పూనవ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. మొతం 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 14 మంది కౌన్సిలర్లు ఉండగా తాజా చేరికలతో ఆ సంఖ్య 17కు చేరింది. వీరికి శిరోమణి అకాలీదళ్కు చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. అంతేగాక బీజేపీ చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్కు కూడా ఎక్స్ ఆఫీషియోగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. దీంతో బీజేపీకి మద్దతు సంఖ్య మొత్తం 19కి చేరింది. ఇక ఆప్కు 10 మంది కౌన్సిలర్లు ఉండా కాంగ్రెస్కు ఏడుగురు ఉన్నారు. -
మరోసారి కేంద్రంతో రైతుల చర్చలు.. అప్పటి వరకు నో యాక్షన్
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘ఢిల్లీ ఛలో’ చేపట్టిన రైతులను కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. చండీగఢ్లో గురువారం రోజు వివిధ రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. అప్పటి వరకు నిరసనకారులు శాంతియుంతంగా ఉంటారని రైతు సంఘం నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పేర్కొన్నాడు. వివిధ సరిహద్దుల వద్ద పోలీసులు ఏర్పాటు బారికేడ్లను దాటుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయరని తెలిపారు. చండీగఢ్లో బుధవారం సీనియర్ పోలీసు అధికారులతో సమావేశం అనంతరం రైతు నాయకుడు మాట్లాడుతూ.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చండీగఢ్లో గురువారం సాయంత్రం 5 గంటలకు నిరసన తెలుపుతున్న రైతుల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు.కాగా పీయూష్ గోయల్ ఆహారం, పౌర సరఫరాల పంపిణీ మంత్రి పదవిలో ఉండగా.. రాయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. తమపై దాడి చేసింది పోలీసులు కాదని, పారమిలటరీ బలగాలని చెప్పుకొచ్చారు, ఇంత జరిగినా తాము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉ న్నామన్నారు,. కేంద్రంలో గొడవ పడేందుకు రాలేదు. మాపై కొందరు తప్పుడు అభిప్రాయాలను కలగజేస్తున్నారు. మేము శాంతియుతంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఉన్న చోటు నుంచి ముందుకు వెళ్లడానికి ప్రయత్నించకూడాదని అనుకున్నాం. రేపు సాయంత్రం 5 గంటలకు సమావేశానికి పిలిచారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు మా నుంచి ఎలాంటి చర్య ఉండదు. ప్రధాని మోదీపెద్ద మనసుతో ఎమ్ఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి’ అని పేర్కొన్నారు. అంతకముందు కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ.. రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి పనులు చేయవద్దని కోరారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. -
సన్రైజర్స్ ఓపెనర్ ఊచకోత.. ఏకంగా 205 పరుగులతో
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా చండీగఢ్ వేదికగా పంజాబ్, చండీగఢ్ జట్లు తలపడతున్నాయి. అయితే ఈ మ్యాచ్ నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను ప్రారంభించలేదు. అయితే మూడో రోజు ముగిసే సమయానికి పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 477 పరుగులు చేసింది. పంజాబ్ వికెట్ కీపర్ బ్యాటర్ అన్మోల్ప్రీత్ సింగ్ ఆజేయ దిశ్వతకంతో చెలరేగాడు. అన్మోల్ప్రీత్ 329 బంతుల్లో 25 ఫోర్లతో 205 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నాడు. అతడితో పాటు మరో వికెట్ కీపర్ బ్యాటర్ ప్రభుసిమ్రాన్ సింగ్ సైతం భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ప్రభుసిమ్రాన్ 215 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్లతో 171 చేసి ఆజేయంగా ఉన్నాడు. కాగా అన్మోల్ప్రీత్ సింగ్ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది సీజన్లో ఓపెనర్గా వచ్చి ఒకట్రెండు మెరుపు ఇన్నింగ్స్లు అన్మోల్ప్రీత్ ఆడాడు. అతడిని ఐపీఎల్-2024 సీజన్కు ముందు ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుంది. అదే విధంగా ప్రభుసిమ్రాన్ సైతం క్యాష్రిచ్ లీగ్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. చదవండి: IND vs ENG: ధోనిని గుర్తుచేసిన రోహిత్.. కేవలం 3 సెకండ్లలోనే అద్భుతం! వీడియో వైరల్ -
‘ఇండియా కూటమి చారిత్రక గెలుపు నమోదు చేస్తుంది’
న్యూఢిల్లీ: చంఢీఘర్ మేయర్ స్థానాన్ని ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత రాఘవ్ చద్దా జోష్యం చెప్పారు. ఎప్రిల్/మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు చంఢీఘర్ మేయర్ విజయం.. ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుందని తెలిపారు. జనవరి 18వ తేదీ జరిగే చంఢీఘర్ మేయర్ ఎన్నికలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమి చారిత్రక, నిర్ణయాత్మక గెలుపు సొంతం చేసుకుంటుంది. మొదటి సారిగా ఇడియా కూటమి, బీజేపీ మధ్య పోరు జరగనుంది. మేయర్ ఫలితాలు విడుదలయ్యాక ఇండియా కూటమి-1, బీజేపీ-0గా మారబోతుంది. ఈ గెలుపుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుంది’ అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. #WATCH | Delhi | AAP MP Raghav Chadha says, "INDIA Alliance will fight the Chandigarh Mayor elections with all its strength and register a historic and decisive victory. Don't consider this an ordinary election. This will be an election where for the first time it will be INDIA… pic.twitter.com/l7d4Ej1kpg — ANI (@ANI) January 16, 2024 ఇండియా కూటమి చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోరాడి గెలుపొందుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా భావించమని పూర్తిస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు తాము ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు. చదవండి: ‘రామ మందిర కార్యక్రమం... మోదీ రాజకీయ కార్యక్రమం’ -
India-Pakistan Match: 70 బిరియానీలు ఆర్డర్ చేసిన కుటుంబం
క్రికెట్కు భారత్లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. అభిమానులు పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతక్కుపోతారు. టాస్ దగ్గర నుంచి మ్యాచ్ చివరి బాల్ వరకూ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తారు. ప్రస్తుతం భారత్లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా చంఢీగడ్లో ఓ కుటుంబం ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఏకంగా 70 బిరియానీలు ఆర్డర్ పెట్టింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ స్విగ్గీ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్టు పెట్టింది. దీనిపై యూజర్లు పలు రకాలుగా కామెంట్లు పెట్టారు. కాగా ఈ మ్యాచ్లో భారత్.. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 191 ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 30.3 ఓవర్లలలోనే లక్ష్యాన్ని చేధించింది. 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. గతంలో ఆసియా కప్లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఇలాగే 62 బిరియానీలు ఆర్డర్ పెట్టింది. 70 biryanis ordered by a household in chandigarh in one-go, seems they already know who's winning 👀 #INDvsPAK pic.twitter.com/2qQpIj5nhu — Swiggy (@Swiggy) October 14, 2023 -
పన్నులు పెరిగాయి.. అప్పు కూడా పెరిగింది: పంజాబ్ సీఎం
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో పెరిగిన ఆర్ధిక వ్యయానికి సంబంధించి గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్రంలో అప్పు రూ.50,000 కోట్లు పెరిగిపోవడంపై వివరణ కోరగా ముఖ్యమంత్రి భగవంత్ మన్ గత ప్రభుత్వం చేసిన రుణాలకు చెల్లించిన వడ్డీలతోపాటు ఇటీవలి కాలంలో పెరిగిన జీఎస్టీ, వాహన పన్ను, స్టాంపులు రిజిస్ట్రేషన్ చార్జీల వల్లనే వ్యయం పెరిగిందని లేఖ ద్వారా తెలిపారు. ముఖ్యమంత్రి భగవంత్ మన్ రాసిన లేఖలో.. గడిచిన ఏడాదిలో పంజాబ్ ఎక్సయిజ్ పన్ను ఏకంగా 37 శాతం పెరిగిందని అలాగే వస్తు సేవల పన్ను 16.6 శాతం, వాహనాలపై మన్ను వసూళ్లు 13 శాతం స్టాంపు రిజిస్ట్రేషన్ల వసూళ్లు 28 శాతం పెరిగాయని వెల్లడించారు. ఏప్రిల్ 1, 2002 నుండి ఆగస్టు 31,2023 వరకు పంజాబ్ రాష్ట్రం అప్పు రూ.47,107 కోట్లు పెరిగిందని అందులో రూ.27,016 కోట్లు అంతకుముందు తీసుకున్న అప్పుకు వడ్డీగా చెల్లించామని తెలిపారు. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వాలు వదిలిపెట్టిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేశామని వారు విస్మరించిన సంస్థల పునరుద్ధరణకు అలాగే వారు అమలు పరచిన కొన్ని పథకాలను కొనసాగించడానికి అప్పులను అలాగే సొంత ఆర్ధిక వనరులను కూడా వినియోగించామని లేఖలో నివేదించారు. ఇక రాష్ట్రంలో మూలధన వనరులను ఏర్పరిచి అభివృద్ధి పనుల కోసం కొత్తగా చేసిన అప్పులను వినియోగించినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: సిక్కింలో ఆకస్మిక వరదలు.. గల్లంతైన జవాన్లలో ముగ్గురి మృతదేహాలు లభ్యం -
గురపత్వంత్ సింగ్కి భారత్ బిగ్ షాక్
ఢిల్లీ: ఖలీస్థాన్ వేర్పాటువాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ చీఫ్ గురపత్వంత్ సింగ్ పన్నున్ Gurpatwant Singh Pannun కు భారత్ సాలిడ్ షాక్ ఇచ్చింది. గురపత్వంత్పై చర్యల్లో భాగంగా దర్యాప్తులోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థNIA.. భారత్లో ఉన్న అతని ఆస్తులను సీజ్ చేసింది. తాజాగా కెనడా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. కెనడాలోని హిందువులంతా ఇండియాకి వెళ్లిపోవాలంటూ గురపత్వంత్ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ వార్నింగ్ వీడియోను భారత్ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు అతనిపై పంజాబ్లో 22 క్రిమినల్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు దేశద్రోహం కేసులూ ఉన్నాయి. ఈ క్రమంలో.. NIA దర్యాప్తులో.. అమృత్సర్ జిల్లా ఖాన్కోట్లో ఉన్న అతని పేరిట ఉన్న వారసత్వ వ్యవసాయ భూమిని, ఛండీగఢ్లో ఉన్న ఇంటిని ఎన్ఐఏ సీజ్ చేసింది. ఇప్పటి నుంచి అవి ప్రభుత్వపరం అయ్యాయని ప్రకటించింది. వాస్తవానికి 2020లోనే అతని పేరిట ఆస్తులను ఎటాచ్ చేసింది భారత ప్రభుత్వం. అప్పటి నుంచి ఆ ఆస్తుల కోసం కెనడా లీగల్ సెల్ గ్రూపుల ద్వారా గురపత్వంత్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఎన్ఐఏ చర్యతో పూర్తిస్థాయి ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చేసినట్లయ్యింది. కెనడాలో ఉంటున్న గురుపత్వంత్.. అక్కడ భారత్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేషాలు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం గురపత్వంత్ను 2020లోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అతని కోసం ఇంటర్పోల్ రెడ్నోటీస్ విజ్ఞప్తి సైతం చేసింది. కానీ, సరిపడా సమాచారం లేదనే కారణంతో ఇంటర్పోల్ భారత్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. గురపత్వంత్ కార్యకలాపాలపై, అతని నేర చరిత్రపై చాలా రోజులుగా కెనడాను భారత్ అప్రమత్తం చేస్తూనే ఉంది. కానీ, కెనడా ప్రభుత్వం మాత్రం సరిగా స్పందించడం లేదు. ఇదీ చదవండి: మోదీ, షాలను వదలని గురపత్వంత్ -
నిన్ను చంద్రయాన్ ఎక్కిస్తా.. హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
చండీగఢ్: ఇటీవల నూహ్ అల్లర్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన హర్యానా రాష్ట్రం తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వివాదాస్పదమైన వ్యాఖ్యల వలన మరోసారి వార్తల్లో నిలిచింది. హర్యానా ప్రభుత్వం నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్కు ఓ మహిళ తన గోడు వినిపించగా సీఎం వెటకారంగా నిన్ను చంద్రయాన్-4 ఎక్కించి పంపిస్తానని వెటకారం చేశారు. మహిళ పట్ల సీఎం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. హర్యానా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి స్వయం సహాయక గ్రూపు మహిళలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా మొదట మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను సందర్శించిన ముఖ్యమంత్రి తర్వాత మహిళలతో కాసేపు మాట్లాడారు. వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇదే క్రమంలో ఓ మహిళ తమ గ్రామానికి సమీపంలో ఒక ఫ్యాక్టరీని నిర్మిస్తే మాలాంటి కొంత మహిళలకు ఉపాధి దొరుకుతుందని అభ్యర్ధించగా అందుకు సీఎం బదులిస్తూ.. మళ్ళీ ఇక్కడి నుంచి చంద్రయాన్ వెళ్తే అందులో నిన్ను పంపిస్తానని ఎద్దేవా చేశారు.. దీంతో అక్కడి వారంతా ఆ మహిళను వెంటనే కూర్చోమని బలవంతం చేశారు. ఇంకేముంది ఇలాంటి అవకాశం కోసమే కాచుకుని కూర్చున్న ప్రతిపక్షాలు ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఊరుకుంటాయా. సీఎం మాట్లాడిన వీడియోతో సహా విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. అధికారంలోకి వచ్చే వరకు ఒకలా ఉంటారు.. అధికారం దక్కించుకున్నాక ఒకలా ఉంటారని ఉదహరించారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇదే కోరిక ప్రధాని మోదీ సన్నిహితులెవరైనా కోరి ఉంటే ఆఘమేఘాల మీద ఫ్యాక్టరీని నిర్మించేవారని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై స్పందిస్తూ బీజేపీ ఆరెస్సెస్ మహిళలకు అంతకంటే ఏమి గౌరవమిస్తుందని విమర్శించింది. "अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।" धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं। महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt — AAP (@AamAadmiParty) September 7, 2023 BJP के मुख्यमंत्री की सोच देखिए... हरियाणा में एक महिला ने CM खट्टर से कहा कि उसके क्षेत्र में फैक्ट्री लगा दी जाए, जिससे उसे और दूसरी महिलाओं को काम मिल सके। इसके जवाब में CM चेहरे पर बेशर्म हंसी लिए कहते हैं- अगली बार तुम्हें चंद्रयान से चांद पर भेजेंगे। और उस गरीब महिला की… pic.twitter.com/wdV47Ow2db — Congress (@INCIndia) September 7, 2023 ఇది కూడా చదవండి: నాగ్పూర్ పోలీస్ శాఖ క్రియేటివ్ యాడ్ -
Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు
చండీగఢ్: గత నెల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా అల్లర్లతో సంబంధముందన్న కారణంతో బజరంగ్దళ్ సభ్యుడు గోసంరక్షకుడైన బిట్టు బజరంగీని అరెస్టు చేశారు హర్యానా పోలీసులు. నూహ్ జిల్లా గురుగ్రామ్ పరిసర ప్రాంతాల్లోని జరిగిన అల్లర్లలో ఐదుగురు మరణించగా సుమారు 70 మంది గాయపడ్డారు. స్థానికంగా ఉన్న ఒక మసీదు ధ్వంసం కాగా వందలాది వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ అల్లర్లు చెలరేగడానికి ప్రధానంగా బజరంగ్దళ్ కార్యకర్తలైన బిట్టు బజరంగీ, మోను మనేసర్ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని వారిపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో హర్యానా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న బిట్టు బజరంగీని ఫరీదాబాద్ లోని తన ఇంటి వద్దే పారిపోతుండగా వెంటాడి మరీ పట్టుకున్నారు పోలీసులు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డవడంతో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలో పోలీసులు సాదా దుస్తుల్లో కనిపించగా వారి చేతుల్లో కర్రలు తుపాకులు కనిపించాయి. అతడితో పాటు అతడి అనుచరులను కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు ఈ బృందంలోని ఒక పోలీస్ అధికారి. పోలీసుల విధులకు ఎవ్వరు ఆటంకం కలిగించినా విడిచిపెట్టేది లేదని.. సోషల్ మీడియాని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా అసత్య సమాచారంతో తప్పుదోవ పట్టించినా సహించేది లేదని అన్నారు. బిట్టు బజరంగీ అలియాస్ రాజ్ కుమార్ ఒక సాధారణ పండ్ల వ్యాపారి. ఫరీదాబాద్ లోని దాబువా మార్కెట్ లో పండ్ల వ్యాపారం చేసుకునే అతను ఒక గోసంరక్షణ గ్రూపును కూడా నిర్వహిస్తున్నాడు. గత నెలలోనే అతడిపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. నూహ్ అల్లర్ల తర్వాత గోసంరక్ష బజరంగ్ చీఫ్ పైనా కేసు నమోదైంది. స్థానిక నూహ్ ఎమ్మెల్యే చౌదరి అఫ్తాబ్ మాట్లాడుతూ బిట్టు బజరంగ్, మోను మనేసర్ ఇద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వలననే అల్లర్లు చెలరేగాయని ప్రజలు వారిపై కోపంగా ఉన్నారని అన్నారు. बिट्टू बजरंगी को हरियाणा पुलिस ने किया गिरफ्तार पहले सुदर्शन न्यूज के रेजिडेंट एडिटर मुकेश कुमार जी की गिरफ्तारी अब गौरक्षक #BittuBajrangi की गिरफ्तारी ये कैसा अमृतकाल है खट्टर साहब ? स्वतंत्रता दिवस के दिन गौरक्षक की गिरफ्तारी क्यों ? pic.twitter.com/7PlI99F7QR — Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) August 15, 2023 ఇది కూడా చదవండి: Yamuna River Floods: యమునా నది ఉగ్రరూపం -
కెనడాలో కొడుకు మరణం.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె..
చంఢీగడ్: కన్న కొడుకు మరణవార్త వినలేకపోయింది. ఆ వార్త తన చెవిలో పడగానే కళ్లు తిరిగి పడిపోయింది. అంతే.. ఇగ తిరిగి మేల్కోలేదు. కొడుకుతోపాటు తాను అనంతలోకాలకు చేరింది. కొడుకు, తల్లికి ఒకేసారి అంత్యక్రియలు జరిపారు. ఈ బాధాకర ఘటన పంజాబ్లోని నవాన్షహర్ జిల్లాలో జరిగింది. పంజాబ్కు చెందిన గుర్విందర్ నాథ్(24) చదువు కోసం కెనడా వెళ్లాడు. ఒంటారియో ప్రావిన్స్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. జూలై 9న కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 14న అక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్విందర్ తల్లి నరీందర్ కౌర్కు చెప్పలేదు. గుర్విందర్ మృతదేహం శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిందనే విషయం అతని తల్లికి ఎట్టకేలకు తెలిసింది. ఇక కుమారుని మరణవార్త విన్న ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దుఖిస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఆమెను లూథియానాలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాడు. తల్లి, కొడుకుకు ఒకేసారి శుక్రవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరిపారు. ఇదీ చదవండి: షాకింగ్..! ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే.. -
చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది
చండీఘర్కు చెందిన మోహిత్ అహ్లువాలియా, జగజ్యోత్ కౌర్ భార్యాభర్తలు. 2017 శీతాకాలంలో బాలికి విహారయాత్ర కోసం వెళ్లారు. ఈ వెకేషన్ వీరికి అద్భుతమైన జ్ఞాపకాలను అందించడమే కాకుండా కొత్త ఆలోచనను రేకెత్తించింది. నూతన ఆశ, ఆశయాలతో ఇంటికి వెళ్లిన ఆ దంపతులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. మోహిత్ అహ్లువాలియా సేల్స్ ప్రొఫెషనల్గా, జగజ్యోత్ కౌర్ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేసేవారు. ఈ చండీగఢ్ జంట 2019లో ‘రామే’ (raamae) అనే పేరుతో గృహపయోగ, జీవనశైలి వస్తువుల వ్యాపార సంస్థను స్థాపించారు. ఇది శిక్షణ పొందిన కళాకారులు తయారు చేసిన హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్ వస్తువులైన కుషన్ కవర్లు, టోట్ బ్యాగ్లు, క్విల్ట్లు, పర్సులను విక్రయిస్తుంది. రామే అనేది బాలినీస్ పదం. బాలినీస్ ప్రజల జీవన విధానాన్ని ఇది సూచిస్తుంది. రద్దీ, అస్తవ్యస్తమైన ప్రపంచంలో నివసిస్తున్నప్పటికీ ఆనందాన్ని పొందడం దీని అర్థం. బాలి పర్యటనతో మలుపు ‘కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన బాలి పర్యటన నా జీవితానికి మలుపు. అక్కడ స్థానికులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న ఆదరణను గమనించాను. భారత్లోనూ హస్తకళా ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. అయితే విదేశాల్లో హస్తకళా ఉత్పత్తులకు ఉన్నంత ఆదరణ భారత్లో ఎందుకు ఉండటం లేదో ఆశ్చర్యంగా ఉంది’ అని జగజ్యోత్ కౌర్ ‘షి ద పీపుల్’ అనే ఆన్లైన్ మ్యాగజైన్తో పేర్కొన్నారు. బ్లాక్ ప్రింటింగ్తో రూపొందించిన భారతీయ వస్త్రాలకు ఎంతటి ఆదరణ ఉందో బాలిలోని వీధుల్లో తిరుగుతున్నప్పుడు తెలుసుకున్నట్లు మోహిత్ ‘ది బెటర్ ఇండియా’తో చెప్పారు. డబ్బు పరంగానే కాకుండా కస్టమర్ల గౌరవం కూడా వాటికి అదే స్థాయిలో ఉందన్నారు. బాలిలో వాటికి గణనీయమైన డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ ఉత్పత్తులకు భారత్లో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ జంట చేతివృత్తుల జీవనోపాధికి మద్దతు ఇవ్వాలని, బ్లాక్ ప్రింటింగ్ను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లకు పైగా ఉన్న తమ కార్పొరేట్ కెరీర్ను విడిచిపెట్టారు. 2018లో జైపూర్ వెళ్లి స్థానిక కళాకారుల వద్ద బ్లాక్ ప్రింటింగ్లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత 2019లో రామే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం వారు క్విల్ట్లు, పర్సులు, పర్సులు, పిల్లో కవర్లతో సహా 60 విభిన్న ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తున్నారు. రూ. 4 లక్షలతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ప్రతి నెలా రూ.18 లక్షలు, ఏటా రూ. 2.16 కోట్ల మేర వ్యాపారం సాగిస్తోంది. రాజస్థాన్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్, గోవా, కేరళ, ఇంఫాల్, అస్సాం, మిజోరాం ప్రాంతాల నుంచి వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. యూఏఈ, అమెరికా వంటి దేశాల నుంచి కూడా వీరికి కస్టమర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Raamaé - Home Baby Lifestyle (@raamae_life) -
'మన్ కీ బాత్' వినకపోతే నన్ను కూడా శిక్షిస్తారా?.. మహువా మొయిత్రా ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్కు హాజరుకాలేదని 36 మంది విద్యార్థులకు శిక్ష విధించింది చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కళాశాల. వీరిని వారం రోజుల పాటు హాస్టల్ నుంచి కాలు బయటపెట్టొద్దని ఆదేశించింది. దీంతో ఆ విద్యార్థులు వసతిగృహానికే పరిమితమయ్యారు. పీజీ వైద్య కళాశాల తీసుకున్న ఈ నిర్ణయంపై టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రా ఫైర్ అయ్యారు. అసలు మోదీ రేడియా కార్యక్రమానికి హాజరుకాకపోతే శిక్షించడం ఏంటి? అని మండిపడ్డారు. ఇప్పటివరకు తాను మన్ కీ బాత్ ఒక్క ఎపిసోడ్ కూడా వినలేదని, అందుకు తనను కూడా ఇంట్లో నుంచి వారం రోజులు బయటకు రాకుండా శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. కాలేజీ యాజమాన్యం తీరును తప్పుబట్టారు. ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. అలాగే మోదీ మన్ కీ బాత్ను మంకీ బాత్ అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు మహువా. ఈమేరకు ట్వీట్ చేశారు. విద్యార్థులకు శిక్షపడిన విషయంపై ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథానాన్ని కూడా ట్వీట్కు జతచేశారు. I haven’t listened to monkey baat either. Not once. Not ever. Am I going to be punished as well? Will l be forbidden from leaving my house for a week? Seriously worried now. pic.twitter.com/HaqEQwsWOj — Mahua Moitra (@MahuaMoitra) May 12, 2023 మోదీ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఏప్రిల్ 30న జరిగింది. ఆరోజు విద్యార్థులంతా తప్పకుండా కార్యక్రమానికి హాజరుకావాలని పీజీఐఎంఆర్ కాలేజీ విద్యార్థులకు సర్కులర్ జారీ చేసింది. అయితే నర్సింగ్ మూడో సంవత్సరం చదువుతున్న 28 విద్యార్థులు, ఫస్ట్ ఇయర్కు చెందిన 8 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాని డుమ్మా కొట్టారు. ఎలాంటి కారణం కూడా చెప్పలేదు. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై చర్యలు తీసుకుంది. వారం రోజుల పాటు హాస్టల్ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. ఈ విషయంపై ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం తమ చర్యను సమర్థించుకుంది. ఈ ఎపిసోడ్కు విద్యార్థులు కచ్చితంగా హాజరుకావాలని ముందుగానే చెప్పామని, ఆరోజు గెస్ట్ లెక్చర్స్, ఇతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కానీ సరైన కారణం లేకుండా 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అందుకే వాళ్లపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. చదవండి: ఉద్ధవ్ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు -
క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలు.. ఆన్సర్షీట్లో బాలీవుడ్ పాటలు ..!
చండీగఢ్: పరీక్షలు రాయడానికి కూర్చున్న ఆ స్టూడెంట్కు క్వశ్చన్ పేపర్ చూడగానే పగలే చుక్కలన్నీ కట్టకట్టుకుని కన్పించాయి. ఒక్కదానికీ ఆన్సర్ తెలియదు! ఏం చేయడమా అని తల పట్టుకున్నాడు. బాగా ఆలోచించి... బాలీవుడ్ పాటలన్నీ తీరుబడిగా ఒకదాని తర్వాత ఒకటి రాస్తూ పోయాడు. అలా ఆన్సర్ షీటు నిండా జవాబులకు బదులుగా పాటలే రాసేసి ఇచ్చాడు. చండీగఢ్లో ఒక స్కూలులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆన్సర్ షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సదరు విద్యార్థి ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలు త్రీ ఇడియట్స్లోని ‘గివ్ మి సమ్ సన్షైన్...’, పీకేలోని ‘భగవాన్ హే కహా రే తూ...’ అంటూ తన అవస్థకు అద్దం పట్టే పాటలే రాశాడు! దాంతో పేపర్ను దిద్దిన టీచర్ సున్నా మార్కులిచ్చింది. అయితే, ‘మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సింది’ అంటూ చివరి పేజీలో సరదా కామెంట్ రాయడంతో నెటిజన్లు హాయిగా నవ్వుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో దీనిని విస్తృతంగా షేర్ చేస్తున్నారు. -
అక్కడ 54.1 శాతం కుటుంబాలకు ఏసీ.. ఏపీ, తెలంగాణాలో ఎంత శాతం అంటే?
దేశవ్యాప్తంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఎయిర్ కండీషనర్ల వినియోగం అధికంగా ఉంది. అత్యధికంగా చండీఘడ్లో 54.1 శాతం కుటుంబాలు ఏసీ నీడన సేదతీరుతున్నాయి. దేశంలో 4.9 శాతం కుటుంబాలకు ఏసీ సదుపాయం ఉన్నట్లు నేషనల్ శాంపిల్ సర్వే నివేదిక వెల్లడించింది. దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉన్న కేరళలో 10.4 శాతం, ఏపీలో 8.1 శాతం కుటుంబాలు ఏసీలను వాడుతున్నాయి. తెలంగాణలో 6.6 శాతం, తమిళనాడులో 6.1 శాతం కుటుంబాలకు ఏసీలున్నాయి. అత్యల్పంగా బిహార్లో 0.4 శాతం, ఒడిశాలో 1.5 శాతం, కర్ణాటకలో 1.8 శాతం కుటుంబాలు ఏసీలను వినియోగిస్తున్నాయి. శ్రీసిటీలో పలు యూనిట్లు దేశవ్యాప్తంగా ఏటా సగటున 75 లక్షల ఏసీల విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఎండలు చుర్రుమనే దక్షిణాదిలో ఏసీల వినియోగం పెంచడంపై తయారీ సంస్థలు దృష్టి సారించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీలో పలు ఏసీల తయారీ యూనిట్లు ఏర్పాటు కావడంతోపాటు ఉత్పత్తి కూడా ప్రారంభించాయి. డైకిన్, బ్లూస్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ లాంటి సంస్థలు తమ యూనిట్లను ఏపీలో నెలకొల్పుతున్నాయి. బ్లూస్టార్ విస్తరణ కార్యక్రమాలను సైతం చేపట్టింది. ఏటా వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 60 లక్షలకు పైగా ఉంది. వ్యత్యాసం ఎందుకంటే..? కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉండటం, అత్యధికంగా ఉపాధి అవకాశాలు, పన్నులు తక్కువ ఉండటం లాంటి కారణాలు కొనుగోలు శక్తిని పెంచుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యవసాయం, కూలీలు ఎక్కువగా ఉండటం ఏసీ వినియోగం తక్కువగా ఉండటానికి కారణం. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, కొనుగోలు శక్తి తక్కువగా ఉంటాయి. – ఎం.ప్రసాదరావు, ఏయూ ఎకనామిక్స్ విభాగం విశ్రాంత అధిపతి సగటు ఏసీ నియోగం భారత్ 4.9% పట్టణాల్లో12.6% గ్రామాల్లో 1.2% -
మందుబాబులకు గుడ్ న్యూస్.. ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే?
చండీగఢ్: కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకై బార్లు ఉదయం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన కొత్త ఎక్సైజ్ పాలసీ 2023-24ను బుధవారం విడుదల చేసింది. అలాగే మద్యంపై 'కౌ సెస్'ను తగ్గించింది. కొత్తగా 'క్లీన్ ఎయిర్ సెస్'ను తీసుకొచ్చింది. చండీగఢ్లో ఇంతకుముందు అర్ధరాత్రి ఒంటిగంట వరకే బార్లకు అనుమతి ఉండేది. కొత్త ఎక్సైజ్ పాలసీలో కౌ సెస్ను తగ్గించారు. స్వదేశంలో తయారైన 750 ఎంఎల్ లిక్కర్ బాటిల్పై కౌ సెస్ గతంలో రూ.5 ఉండగా.. ఇప్పుడు రూ.1కి తగ్గించారు. అలాగే బీరుపై కూడా రూ.5గా ఉన్న ఈ సెస్ను రూ.1కి పరిమితం చేశారు. ఇక 750/700 ఎంఎల్ విస్కీపై కౌ సెస్ను రూ.10 నుంచి రూ.2కి తగ్గించారు. అలాగే ఎక్సైజ్ డ్యూటీలోనూ ఎలాంటి మార్పు చేయలేదు. తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ను ప్రోత్సహించడానికి బీర్, వైన్ వంటి వాటిపై లైసెన్స్ ఫీజులు పెంచలేదు. చదవండి: ‘వారి టార్గెట్ నేను కాదు.. మీరే!’ రాజీనామా లేఖలో మనీష్ సిసోడియా -
క్షణం ఆలస్యమైనా ప్రాణం పోయేదే.. ఐఏఎస్ సమయస్పూర్తికి ఫిదా
ఇటీవలే బెంగళూరులో ఐకియా మాల్లో ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. అయితే, మాల్లో ఉన్న ఓ డాక్టర్ వెంటనే స్పందించి సీపీఆర్(కార్డియో పల్మనరీ రిసిటేషన్) బాధితుడి ఛాతిపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు. తాజాగా ఇలాంటి ఘటనే చండీగఢ్లో చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యాలయంలో ఓ వ్యక్తి కూర్చీలోనే కుప్పకూలిపోవడంతో ఆఫీసులో ఉన్న ఐఏఎస్ అధికారి వెంటనే స్పందించిన సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించాడు. వివరాల ప్రకారం.. చండీగఢ్ సెక్టార్-41కు చెందిన జనక్ లాల్ మంగళవారం చండీగఢ్ హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వెళ్లారు. తన ఇంటికి సంబంధించి ఉల్లంఘన కేసుపై అధికారులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కూర్చీలోనే కుప్పకూలిపోయాడు. ఈ క్రమంలో అతడికి గుండెపోటు వచ్చినట్టు గమనించిన ఆరోగ్యశాఖ కార్యదర్శి ఐఏఎస్ యశ్పాల్ గార్గ్ అతడి వద్దకు చేరుకుని సీపీఆర్ చేశారు. ఛాతిపై రెండు చేతులతో నొక్కుతూ సీపీఆర్ చేశారు. ఈ క్రమంలో రెండు నిమిషాల్లోనే జనక్ లాల్ స్పృహలోకి వచ్చారు. కళ్లు తెరిచి అక్కడున్న వారి చూసి పర్వాలేదంటూ చేతులతో సైగా చేశారు. దీంతో, ప్రాణాపాయ స్థితి నుంచి జనక్ లాల్ బయటపడ్డారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. యశ్పాల్ గార్గ్కు అసలు సీపీఆర్ గురించే తెలియదని.. ఇటీవలే ఓ టీవీలో చూసి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకున్నట్టు చెప్పారు. ఇక, జనక్ లాల్ ప్రాణాలు కాపాడిన గార్గ్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. एक आदमी को हार्ट अटैक आया तो चंडीगढ़ के हेल्थ सेक्रेटरी IAS @Garg_Yashpal जी ने तुरंत CPR देकर उस आदमी की जान बचाई। उनके इस काम की जितनी सराहना की जाए उतनी कम है। हार्ट अटैक से जानें बचाई जा सकती हैं। हर इंसान को CPR सीखना चाहिए। pic.twitter.com/C7dWVsAoOI — Swati Maliwal (@SwatiJaiHind) January 18, 2023 -
షాకింగ్ ఘటన: వీధి కుక్కలకి ఆహారం పెడుతుండగా..ర్యాష్గా దూసుకొచ్చిన కారు
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేలా ఎన్ని కట్టుదిట్టమైన వాహన చట్టాలను తీసుకొచ్చినా.. ఏదో ఒక దుర్ఘటన జరుగుతూనే ఉంటోంది. మొన్నటి మొన్న ఒక మహిళను కారుతో ఢీ కొట్టి కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన మరువక మునుపే ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం. అచ్చం అలానే ఇక్కడొక యువతి ఘోర రోడ్డుప్రమాదం బారిన పడింది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల తేజస్వీత, ఆమె తల్లి మంజీదర్ కౌర్లు ఇంటి సమీపంలోని ఫుట్పాత్పై ఉన్న వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారు. సరిగ్గా అదే సమయానికి ఒక ఎస్యూవీ కారు యూటర్న్ తీసుకుని వచ్చి మరి తేజస్వీతను దారణంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో తేజస్వీత తలకు తీవ్ర గాయాలయ్యాయి. కానీ ఆ కారు కనీసం ఆగకుండా అంతే వేగంగా వెళ్లిపోయింది. ఈ అనుహ్య ఘటనతో బిత్తరపోయిన ఆమె తల్లి మంజీదర్ కౌర్ వెంటనే తేరుకుని పోలీసుకు ఫోన్ చేసి తదనంతర కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోటుకుంటుందని తెలిపారు. బాధితురాలి తండ్రి ఓజస్వీ కౌల్ మాట్లాడుతూ..తేజస్విత ఆర్కిటెక్కర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఆమె వీధి కుక్కలకి ఆహారం పెట్టేందుక తన తల్లితో కలిసి వెళ్తుంటుందని ఆవేదనగా చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Caught On CCTV: Chandigarh Woman Hit By Car While Feeding Stray Dog https://t.co/xs6vfKpoPR pic.twitter.com/fgngCqWq4X — NDTV (@ndtv) January 16, 2023 (చదవండి: ప్రయాణికుడి కోసం విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..అయినా దక్కని ప్రాణాలు) -
Kudrat Dutta Chaudhary: హక్కుల గొంతుక
దేశం కాని దేశం వెళ్లిన వారికి రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి సమస్యల్లో ఉన్న వారికి తక్షణ సహాయం చేసే బలమైన వ్యక్తి అవసరం. అలాంటి వ్యక్తి... కుద్రత్ చౌదరి. ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్గా శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారులకు అండగా ఉండనుంది... శాన్ఫ్రాన్సిస్కో (యూఎస్) ఇమిగ్రెంట్ రైట్స్ కమిషనర్(ఐఆర్సీ)గా బాధ్యతలు చేపట్టిన కుద్రత్ దత్తా చౌదరి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఈ పదవికి ఎంపికైన భారతసంతతి(ఇమిగ్రెంట్)కి చెందిన తొలివ్యక్తిగా గుర్తింపు పొందింది. శాన్ఫ్రాన్సిస్కోలో నివసించే వలసదారుల సమస్యలు, విధానాలకు సంబంధించిన విషయాలపై మేయర్, బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్స్కు ‘ఐఆర్సీ’ సలహాలు ఇస్తుంది. ‘కొత్త బాధ్యత నాలో ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని నింపింది. నా వాళ్ల గురించి పనిచేసే అవకాశం లభించింది’ అంటుంది కుద్రత్. చండీగఢ్లో జన్మించిన కుద్రత్ ‘పంజాబ్ ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా’లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించింది. లండన్ కింగ్స్ కాలేజీలో క్రిమినాలజీ, క్రిమినల్ జస్టిస్ చదువుకుంది. హార్వర్డ్ లా స్కూల్లో స్త్రీవాదం, పితృస్వామిక హింస, లైంగిక దోపిడికి సంబంధించిన అంశాలను లోతుగా అధ్యయనం చేసింది. హక్కుల ఉద్యమాలపై మంచి అవగాహన ఉన్న కుద్రత్ సమస్యల పరిష్కారంలో ‘ట్రబుల్ షూటర్’గా పేరు తెచ్చుకుంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా తనదైన శైలిలో పరిష్కరించేది. కుద్రత్ మంచి రచయిత్రి కూడా. 2015 భూకంపం (నేపాల్) తరువాత మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు, మనుషుల అక్రమరవాణా, లైంగిక దోపిడిపై ‘లైజా: సమ్ టైమ్స్ ది ఎండ్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్’ అనే పుస్తకం రాసింది. కుద్రత్ రాసిన ‘లైజా’ పుస్తకం నేపాల్లో ఒక వేసవిలో వచ్చిన భూకంపం తాలూకు భయానక భౌతిక విలయ విధ్వంసాన్ని మాత్రమే కాదు మనిషిలోని విధ్వంసాన్ని కూడా కళ్లకు కడుతుంది. 19 సంవత్సరాల లైజా భూకంపంలో తల్లిదండ్రులను కోల్పోతుంది. ఏ దిక్కూ లేని పరిస్థితులలో తమ్ముడిని తీసుకొని కట్మాండూలోని మామయ్య ఇంటికి వెళుతుంది. నా అనుకున్నవారే మోసం చేయడంతో, ఇండియాలోని ఒక చీకటిప్రపంచంలోకి నెట్టబడుతుంది లైజా. ఇలాంటి విషాదాలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. -
10 వికెట్లతో చెలరేగిన చైనామన్ స్పిన్నర్.. కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్
Madhya Pradesh vs Chandigarh: చండీఘడ్తో మ్యాచ్లో మధ్యప్రదేశ్ కెప్టెన్ కుమార్ కార్తికేయ అదరగొట్టాడు. ఏకంగా పది వికెట్లు కూల్చి జట్టుకు భారీ విజయం అందించాడు. కార్తికేయ అద్భుత ప్రదర్శనతో చండీఘడ్పై మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ మీద 125 పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్ డిలో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ఇండోర్ వేదికగా డిసెంబరు 20న టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన మధ్యప్రదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యశ్ దూబే(44) ఫర్వాలేదనిపించగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన రజత్ పాటిదార్ 88 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో అక్షత్ రఘువంశీ 77 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో 309 పరుగులకు మధ్యప్రదేశ్ ఆలౌట్ అయింది. విలవిల్లాడిన చండీఘడ్ ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన చండీఘడ్కు మధ్యప్రదేశ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. ఓపెనర్ అర్స్లాన్ ఖాన్ 34 పరుగులు చేయగా.. మిగతా ఆటగాళ్ల స్కోర్లు వరుసగా 1, 0, 1, 0, 4, 0, 1, 11(నాటౌట్), 0, 0. చైనామన్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ 6 వికెట్లు కూల్చగా.. సారాంశ్ జైన్, ఆవేశ్ ఖాన్ తలా ఒక వికెట్ తీయగా.. అనుభవ్ అగర్వాల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా బౌలర్లు చెలరేగడంతో చండీఘడ్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. 57 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారీ ఆధిక్యంలో ఉన్న మధ్యప్రదేశ్.. చండీఘడ్ను ఫాలో ఆన్ ఆడించగా 127 పరుగులకే కథ ముగిసిపోయింది. ఈసారి సారాంశ్ జైన్ 5 వికెట్లు పడగొట్టగా.. కుమార్ కార్తికేయ 4 వికెట్లు తీశాడు. ఆవేశ్కు ఒక వికెట్ దక్కింది. రెండు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో 10 వికెట్లతో చెలరేగిన కుమార్ కార్తికేయ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: Ind VS Ban 2nd Test: టీమిండియాలో అనూహ్య మార్పు! కుల్దీప్ను తప్పించి.. 12 ఏళ్ల తర్వాత.. Tymal Mills: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. లీగ్ నుంచి వైదొలిగిన క్రికెటర్ తొమ్మిదేళ్ల తర్వాత కుటుంబాన్ని కలిసిన ‘ముంబై’ యువ స్పిన్నర్! -
వీడియో లీక్ ఘటన.. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన ఆర్మీ జవాన్ అరెస్టు
చండీగఢ్: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసుకు సంబంధించి ఆర్మీ జవాన్ సంజీవ్ సింగ్ను శనివారం అరెస్టు చేశారు మొహాలీ పోలీసులు. అరుణాచల్ ప్రదేశ్లో విధులు నిర్వహిస్తున్న ఇతను వీడియో లీక్ చేసిన విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేశాడని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలు లభించిన తర్వతే సంజీవ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఇందుకు అరుణాచల్ పోలీసులు సహకరించినట్లు పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు కూడా సంజీవ్ సింగ్ అరెస్టును ధ్రువీకరించారు. ఈ కేసుతో అతనికి సంబంధం ఉందని ఆధారాలు లభించిన తర్వాత పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్ పోలీసులకు తాము సహకరించామని పేర్కొన్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. సంజీవ్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లయింది. మరోవైపు చండీగఢ్ వీడియో లీక్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు ధర్మాసనం తేదీని నిర్ణయించాల్సి ఉంది. చండీగఢ్ యూనివర్సీటీలో 60 మంది అమ్మాయిలు బాత్రూంలో స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని కొద్ది రోజుల క్రితం వార్తలు రావడం దుమారం రేపింది. అయితే విచారణలో ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీక్ అయినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అది కూడా ఆ అమ్మాయే స్వయంగా తన వీడియోను రికార్డు చేసుకుని బాయ్ఫ్రెండ్కు పంపిందని చెప్పారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
చండీగఢ్ వర్సిటీ కేసుపై ‘సిట్’
చండీగఢ్: పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీలో వీడియోల లీక్ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు మహిళా అధికారులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ గౌరవ్ యాదవ్ సోమవారం చెప్పారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. హాస్టల్లో తోటి విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డు చేసి షేర్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థిని, ఆమె స్నేహితుడి ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపామన్నారు. ఆందోళనల సందర్భంగా విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలొచ్చిన ఇద్దరు హాస్టల్ వార్డెన్లను సస్పెండ్ చేశారు. మరికొందరిని బదిలీ చేశారు. వర్సిటీలో సెలవులను 24 దాకా పొడిగించారు. ముగ్గురు నిందితులను 7 రోజులపాటు పోలీసు కస్టడీకి కోర్టు అప్పగించింది. -
Indian Air Force: సవాలుకు సై
‘ఎగిరించకు లోహ విహంగాలను’ అన్నారు శ్రీశ్రీ ‘సాహసి’ కవితలో. ఈ సాహసులు మాత్రం రకరకాల లోహవిహంగాలను ఎగిరించడంలో తమ సత్తా చాటుతున్నారు. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీ చినూక్ హెలికాప్టర్ యూనిట్లలో తొలిసారిగా ఇద్దరు మహిళా ఫైటర్ పైలట్లు విధులు నిర్వహించబోతున్నారు.... మూడు సంవత్సరాల క్రితం... ‘ఇది చిరకాలం గుర్తుండే పోయే శుభసందర్భం’ అనే ఆనందకరమైన మాట ఫ్లైట్ లెఫ్టినెంట్ పారుల్ భరద్వాజ నోటి నుంచి వినిపించింది. రష్యా తయారీ ఎంఐ–17వీ5 హెలికాప్టర్ను నడిపిన తొలి ‘ఆల్ ఉమెన్ క్రూ’లో పారుల్ భరద్వాజ్ ఒకరు. ఆమెతోపాటు ఫ్లైట్ లెఫ్టినెంట్ హీన జైస్వాల్, ఫ్లైయింగ్ ఆఫీసర్ అమన్ నిధి ఉన్నారు. ‘ఆల్ ఉమెన్ క్రూ’కు ఎంపిక కావడం అంత తేలికైన విషయం కాదు. రకరకాల పరీక్షలలో విజయం సాధించి దీనికి ఎంపికయ్యారు. మొదట సికింద్రాబాద్లోని హకీంపేట్ హెలికాప్టర్ ట్రైనింగ్ సెంటర్లో, ఆ తరువాత బెంగళూరులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ‘ఎంఐ–17వీ5 నడిపే మహిళా బృందంలో నేను భాగం అయినందుకు గర్వంగా ఉంది. దేశం కోసం ఏదైనా చేయాలనుకునేవారికి స్ఫూర్తినిచ్చే విషయం ఇది’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది పారుల్ భరద్వాజ్. పంజాబ్లోని ముకేరియన్ పట్టణానికి చెందిన పారుల్ రకరకాల హెలికాప్టర్లను నడపడంలో సత్తా చాటింది. తాజాగా... అధిక బరువు ఉన్న ఆయుధాలు, సరుకులను వేగంగా మోసుకెళ్లే మల్టీ–మిషన్ ‘చినూక్’ సారథ్య బాధ్యతను తొలిసారిగా ఇద్దరు మహిళలకు అప్పగించింది ఇండియన్ ఎయిర్ఫోర్స్. వారు... పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్. చండీగఢ్, అస్సాంలోని మోహన్బరీలో ఈ ఇద్దరు విధులు నిర్వహిస్తారు. గత సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో ‘ఫ్లై– పాస్ట్’ లీడ్ చేసిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించిన స్వాతి రాథోడ్ రాజస్థాన్లోని నగౌర్ జిల్లాలో జన్మించింది. పైలట్ కావాలనేది తన చిన్నప్పటి కల. ఎన్సీసీ ఎయిర్వింగ్లో చేరడం తనను మరోస్థాయికి తీసుకువెళ్లింది. 2014లో పైలట్ కావాలనే తన కోరికను నెరవేర్చుకుంది స్వాతి రాథోడ్. ‘ఎం–17 నుంచి చినూక్లోకి అడుగుపెట్టడం ముందడుగుగా చెప్పుకోవాలి. వాయుసేనలో పనిచేస్తున్న మహిళలు తాము ఉన్నచోటే ఉండాలనుకోవడం లేదు. తమ ప్రతిభను నిరూపించుకొని ఉన్నతస్థాయికి చేరాలనుకుంటున్నారు. ఇది గొప్ప విషయం’ అంటున్నారు ఎయిర్ మార్షల్ అనీల్ చోప్రా. ఎంఐ–17వీ5తో పోల్చితే చినూక్ పనితీరు పూర్తిగా భిన్నం. దీనికితోడు కొన్ని భయాలు కూడా! అమెరికాకు చెందిన ఏరో స్పెస్ కంపెనీ ‘బోయింగ్’ తయారుచేసిన చినూక్ భద్రతపై ఇటీవల కాలంలో రకరకాల సందేహాలు వెల్లువెత్తాయి. వీటి ఇంజన్లో మంటలు చెలరేగే ప్రమాదం ఉందనేది వాటిలో ఒకటి. అయితే దీన్ని ‘బోయింగ్’ సంస్థ ఖండించింది. ఎలాంటి సమస్యా ఉండదని స్పష్టం చేసింది. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. అనుమానాలు, వాదోపవాదాల సంగతి ఎలా ఉన్నప్పటికీ... చినూక్ను నడపడం అనేది సవాలుతో కూడుకున్న పని. ఆ పనిని ఇష్టంగా స్వీకరించి సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు పరుల్ భరద్వాజ్, స్వాతీ రాథోడ్లు. వీరికి అభినందనలు తెలియజేద్దాం. -
పంజాబ్ సీఎంపై సంచలన ఆరోపణలు... ఆయన ఫుల్గా తాగింది నిజమేనా?
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జర్మనీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఆయన ఢిల్లీలోని ఆప్ జాతీయ సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా...సమయానికి పర్యటన ముగించుకుని రాలేకపోయారు. అంతేకాదు ఆయన అనారోగ్యంతో ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం అయ్యిందని సీఎం కార్యాలయం కూడా వెల్లడించింది. ఐతే సీఎం భగవంత్ మాన్ మద్యం మత్తులో ఉన్నందునే ఆలస్యమైందని, ఆయన్ను ఫ్లైట్ నుంచి దించేశారంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అందువల్లే ఆయన ఢిల్లీకి రావడం ఆలస్యమైందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు ఆప్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు భగవంత్ మాన్ సహా ప్రయాణికుడు ఆయన ఫుల్ తాగి ఉండటం వల్ల లుఫ్తానా ఎయిర్ పోర్టులో భగవంత్ మాన్ను విమానం నుంచి దించేశారని, పైగా ఆయన నడవలేకపోవడంతో భార్య, భద్రతా సిబ్బంది సాయం కూడా తీసుకున్నారని ట్విట్టర్లో పేర్కోన్నాడు. ఈ పోస్ట్ని కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తూ ఆప్ని ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది. ఈ క్రమంలో అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ భగవంత్ మాన్పై విమర్శలతో విరుచుకుపడ్డాడు. భగవంత్ మాన్ తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను సిగ్గుపడేలా చేసిందన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంపై జోక్యం చేసుకుని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అంతేగాదు జర్మనీ దేశాన్ని ఈ విషయమై విచారించాలంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఐతే ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్సింగ్ కాంగ్ మాట్లాడుతూ....సీఎం సెప్టెంబర్ 19న షెడ్యూల్ ప్రకారం తిరిగి వచ్చారు. మాన్ తన విదేశీ పర్యటనలతో విదేశీ పెట్టుబడులు తీసుకువస్తున్నారన్న అక్కసుతో ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతగా కావలనుకుంటే లుఫ్తాన్స్ ఎయిర్లైన్స్లో తనిఖీ చేసుకోండి అని సవాలు విసిరారు. A Big Shame!! Punjab Chief Minister Bhagwant Mann deplaned because he was heavily Drunk pic.twitter.com/7PaPSiVDtb — Delhi Congress (@INCDelhi) September 19, 2022 (చదవండి: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా అధికారులతో సిట్) -
వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఈమేరకు సీఎం భగవంత్ మాన్ ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ దేవ్ పర్యవేక్షణలో సిట్ ఈ కేసును వేగంగా విచారించనుంది. ముగ్గురు అరెస్టు.. యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో ఇప్పటివరకు మొత్తం ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు. స్నానం చేస్తుండగా తానే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోను పంపిన అమ్మాయి, దీన్ని రిసీవ్ చేసుకున్న సిమ్లాకు చెందిన ఆమె బాయ్ఫ్రెండ్ సన్నీ మెహతాతో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన హిమాచల్ప్రదేశ్ పోలీసులకు పంజాబ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. వార్డెన్ల సస్పెన్షన్ వీడియో లీక్ చేసిన అమ్మాయిని హాస్టల్ వార్డెన్ తిట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో లీక్ విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పనందుకు ఆమెను, మరో వార్డెన్ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు. 6 రోజులు క్లాసులు బంద్.. విద్యార్థినుల నిరసనలతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి శనివారం(సెప్టెంబర్ 24) వరకు క్లాసులు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే విద్యార్థుల డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని, దీంతో వాళ్లు నిరసన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూనివర్సిటీలో తమకు భద్రత లేదని కొంతమంది విద్యార్థినులు బ్యాగులు సర్ధుకుని ఇంటిబాట పట్టారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? -
విద్యార్థినుల వీడియోల లీక్ దుమారం.. ఫోన్లో నాలుగు ఆమెవే!
చండీగఢ్: అభ్యంతరకర వీడియోల వ్యవహారం పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో తీవ్ర అలజడి సృష్టించింది. యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని.. పలువురు విద్యార్థినుల ప్రైవేట్ వీడియోలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించి, మరో యూనివర్సిటీలో చదివే తన స్నేహితుడికి పంపించిందని, అతను వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడని, మొత్తంగా 60కి పైనే వీడియోలు వైరల్ అవుతున్నాయంటూ పుకార్లు గుప్పుమన్నాయి. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థినులు యూనివర్సిటీ ప్రాంగణంలో బైఠాయించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు శనివారం అర్ధరాత్రి నుంచి వర్సిటీ ప్రాంగణంలోకి ఆందోళన కొనసాగించారు. వారి నినాదాలతో వర్సిటీ అట్టుడికిపోయింది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ హాస్టల్ వార్డెన్ వీడియో లీకేజీల గురించి సదరు యువతిని నిలదీయడం.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ మొత్తం వ్యవహారం మొదలైంది. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో.. పుకార్లను నమ్మవద్దంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు పోలీసులు. వ్యక్తిగత వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చాక కొందరు విద్యార్థినులు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆత్మహత్యాయత్నంలో పలువురి పరిస్థితి విషమయంగా ఉందంటూ సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టులను పోలీసులు ఖండించారు. అలాంటిదేమీ జరగలేదన్నారు. ఒక విద్యార్థిని మాత్రం ఆందోళనకు గురై కుప్పకూలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని వెల్లడించారు. ఈ ఉదంతంలో ఎవరూ చనిపోలేదని.. పుకార్లు నమ్మొద్దని విద్యార్థినులకు సూచించారు. ఈ కేసులో యువతితో పాటు షిమ్లాకు చెందిన ఆమె బాయ్ఫ్రెండ్ను, ఓ బేకరీలో పని చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాయ్ఫ్రెండ్కు వీడియో పంపిన విద్యార్థిని యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఒక విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తూ తన ఫోన్లో రికార్డు చేసుకొని, హిమాచల్ ప్రదేశ్కు చెందిన తన బాయ్ఫ్రెండ్కు(ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడు) పంపించినట్లు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఆమె ఫోన్లోని అభ్యంతరకర వీడియోలను చూసిన సహచర విద్యార్థినులు, ఆమె తమవి కూడా రికార్డు చేసి అలాగే పంపి ఉంటుందని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మొదలైన అనుమానం.. పెనుదుమారాన్నే లేపింది. నిందితురాలిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఆమె బాయ్ఫ్రెండ్ను కూడా హిమాచల్ ప్రదేశ్లో అరెస్టు చేశామని అదనపు డీజీపీ గురుప్రీత్కౌర్ దేవ్ తెలిపారు. ఇప్పటిదాకా దర్యాప్తులో నిందితురాలికి చెందిన ఫోన్లో ఆమెకు సంబంధించిన నాలుగు వీడియోను గుర్తించామన్నారు. ఇతర విద్యార్థినుల వీడియోలను రికార్డు చేయలేదన్నారు. అయితే.. సదరు యువతి తమను బాత్రూంలో ఉండగా దొంగచాటుగా ఫొటోలు తీసిందని ఆరోపిస్తున్నారు కొందరు విద్యార్థులు. అలాగే వార్డెన్ ఆమెను నిలదీస్తున్నట్లు వైరల్ అయిన వీడియోపై కూడా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు డీజీపీ తెలిపారు. పోలీసులను నమ్మాలా? అయితే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, నిజాలను తొక్కిపెడుతున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధితుల తరపున పోరాడుతున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. అయితే, వాళ్లను కట్టడి చేసేందుకు లాఠీచార్జ్ ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు.. వీడియోల విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని, కేవలం ఒక విద్యార్థినికి చెందిన వీడియోలు మాత్రమే లీకైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మన బిడ్డలే మనకు గర్వకారణమని, ఈ మొత్తం ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారు. ఊహాగానాలను విశ్వసించవద్దని సూచిస్తూ ట్వీట్ చేశారు. అభ్యంతరకర వీడియోల వ్యవహారంపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని, నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని పంజాబ్లోని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థినులను మానసిక వేదనకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కఠిన చర్యలు: మహిళా కమిషన్ చండీగఢ్ వర్సిటీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) స్పష్టం చేసింది. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని పంజాబ్ డీజీపీ, చండీగఢ్ వర్సిటీ వైస్ చాన్సలర్కు కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. విద్యార్థినుల ప్రైవేట్ వీడియో లీకైనట్లు వచ్చిన వార్తలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీశా గులాజీ వెల్లడించారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మన సోదరీమణులకు అండగా నిలవాలని ట్విట్టర్లో సూచించారు. ఇది మనందరికీ పరీక్షా సమయమని పేర్కొన్నారు. రెండు రోజులు సెలవులు క్యాంపస్లో ఉద్రిక్తతల నేపథ్యంలో యూనివర్సిటీకి సోమవారం, మంగళవారం అధికారులు సెలవులు ప్రకటించారు. దీనిపై విద్యార్థినులు మండిపడ్డారు. ఏ తప్పూ జరగకపోతే సెలవులు ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. ఈ ఉదంతంపై లోతైన దర్యాప్తు కోసం సీనియర్ మహిళా ఐపీఎస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వీడియోల అంశంపై ఐపీసీ సెక్షన్ 354–సి, ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఫుల్గా తాగి.. స్నేహితుడిపై ఆటో ఎక్కించేశాడు! -
వీడియో లీక్ ఘటన.. ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్టు చేసిన పోలీసులు
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే వీడియో పంపిన విద్యార్థినిని అరెస్టు చేయగా.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు చెందిన ఆమె బాయ్ఫ్రెండ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడ్ని 23 ఏళ్ల సన్నీ మెహతాగా గుర్తించారు. దీంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు ప్రైవేట్ వీడియోను తన బాయ్ఫ్రెండ్ సన్నీ మెహతాకు పంపిన అమ్మాయిని చండీగఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది ఆమె సొంత వీడియో అని, ఇతర అమ్మాయిల వీడియోలేవీ లీక్ కాలేదని పేర్కొన్నారు. ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్టు చేస్తే అసలు నిజాలు తెలుస్తాయన్నారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు సిమ్లాలోని రోహ్రూ ప్రాంతానికే చెందినవారని పోలీసులు వెల్లడించారు. చండీగఢ్ యూనివర్సిటీలో 60 అమ్మాయిలు స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని తొలుత ప్రచారం జరిగింది. దీనిపై తీవ్రదుమారం చెలరేగింది. విద్యార్థినులంతా యూనివర్సిటీలో పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ ఘటనపై స్పందించారు. నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
యూనివర్సిటీ విద్యార్థిని వీడియో లీకు ఘటన.. పోలీసులు ఏం చెప్తున్నారంటే..
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ ఘటనపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఒక అమ్మాయి తన సొంత వీడియోను మాత్రమే బాయ్ఫ్రెండ్కు పంపిందని చెప్పారు. అతను హిమచాల్ ప్రదేశ్కు చెందినవాడని వెల్లడించారు. వీడియో పంపిన అమ్మాయిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే ఈ విషయం తెలిసిందని చెప్పారు. అయితే ఈ వ్యవహారంలో అమ్మాయి బాయ్ఫ్రెండ్ పాత్ర ఏమైనా ఉందా? అనే విషయం తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. అతడ్ని అరెస్టు చేసి విచారిస్తేనే అసలు నిజం బయటపడుతుందన్నారు. సొంత వీడియో లీక్ చేసుకున్న అమ్మాయి ఇతర అమ్మాయిల వీడియోలను కూడా రికార్డు చేసిందా? అనే విషయంపైనా విచారణ చేస్తామన్నారు. అలాగే యూనివర్సిటీలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు. అత్యంత సున్నితమైన ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిలు స్నానం చేస్తుండగా తీసిన వీడియోలు లీక్ అయ్యాయని ప్రచారం జరిగింది. దీనిపై విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి యూనివర్సిటీలో నిరసనలు చేపట్టారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే లీక్ అయింది ఒక్క అమ్మాయి వీడియోనే అని యూనివర్సిటీ అధికారులతో పాటు పోలీసులు స్పష్టతనిచ్చారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామన్నారు. కాగా.. యూనివర్సిటీలో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 19,20) క్లాసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
వారితో టచ్లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు: పంజాబ్ సీఎం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిటన్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. 'చండీగఢ్ యూనివర్సిటీ ఘటన దురదృష్టకరం. మన బిడ్డలే మనకు గర్వకారణం. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించాం. దోషులుగా తేలినవారిపై అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. అధికారయంత్రాంగంతో నేను టచ్లోనే ఉన్నా. దయచేసి వదంతులు నమ్మొద్దు' అని భగవంత్ మాన్ హిందీలో ట్వీట్ చేశారు. चंडीगढ़ यूनिवर्सिटी की घटना सुनकर दुख हुआ...हमारी बेटियां हमारी शान हैं...घटना की उच्च स्तरीय जांच के आदेश दे दिए हैं..जो भी दोषी होगा सख्त कार्रवाई करेंगे... मैं लगातार प्रशासन के संपर्क में हूं...मैं आप सब से अपील करता हूं कि अफवाहों से बचें... https://t.co/kgEGszUhAq — Bhagwant Mann (@BhagwantMann) September 18, 2022 చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు రావడం తీవ్రదుమారం రేపింది. దీనిపై యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీకైనట్లు వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పింది. అలాగే యూనివర్సిటోలో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని, ఆస్పత్రిలో కూడా చేరలేదని ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ
చండీగఢ్: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర దుమారం చెలరేగి యూనివర్సిటీ విద్యార్థినిలు నిరసనకు కూడా దిగారు. అయితే విషయంపై యాజమాన్యం స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం, అర్థరహితం అని కొట్టిపారేసింది. యూనివర్సిటీలో ఒక్క అమ్మాయి ప్రైవేటు వీడియో మాత్రమే లీక్ అయినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఓ అమ్మాయి తన సొంత వీడియోను సోషల్ మీడియాలో తన బాయ్ఫ్రెండ్కు పంపిందని వెల్లడించింది. తాము చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ ఒక్క వీడియో తప్ప మరే ఇతర అమ్మాయిల వీడియోలు లీక్ కాలేదని తేలిందని చెప్పింది. 60 ప్రైవేటు వీడియోలు లీక్ అయ్యాయని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డా.బవా స్పష్టం చేశారు. ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. There are rumours that 7 girls have committed suicide whereas the fact is that no girl has attempted any such step. No girl has been admitted to hospital in the incident: Chandigarh University pic.twitter.com/5zsMeibsxW — ANI (@ANI) September 18, 2022 అలాగే చండీగఢ్ యూనివర్సిటీలో ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని బవా చెప్పారు. ఏ ఒక్క విద్యార్థిని కనీసం ఆస్పత్రిలో కూడా చేరలేదని వెల్లడించారు. వీడియో లీక్ చేసిన అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారని, కేసు విచారణలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. This is Horrible Scenes From Chandigarh University #justiceforCUgirls #chandigarhuniversity pic.twitter.com/5eLP7BIYTc — r/Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2022 Chandigarh University videos scandal: Protests over objectionable clips of girls bathing in hostel Girl student arrested; police deny reports of suicide attempt on campus Details: https://t.co/RK1H5IZ5WU#chandigarhuniversity #protests pic.twitter.com/y94OTRibmN — Asianet Newsable (@AsianetNewsEN) September 18, 2022 చదవండి: ఫ్రెండే కదా అని నమ్మారు.. హాస్టల్ యువతుల ప్రైవేటు వీడియోలు తీసి..! -
ప్రపంచ అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’
చండీగఢ్: ఆజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ చేపట్టిన హర్ ఘర్ తిరంగ ప్రచారాన్ని బలోపేతం చేసేలా చండీగఢ్ వాసులు ఒక వినూతన కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో బాగంగా అతి పెద్ద జాతీయ జెండాలా మానవహారంగా నిలబడి రికార్డు సృష్టించారు. ఈ మేరకు చండీగఢ్ విశ్వవిద్యాలయంలోని సుమారు 16 ఎకరాల క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మందికి పైగా మానవహారంగా నిలబడి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్ఐడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కేంద్ర మంత్రి మీనాకాశీ లేఖి, చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ సత్నామ్ సింగ్ సంధు, విశ్వవిద్యాలయ అధికారులు తదితరులు హజరయ్యేరు. దాదాపు 5 వేల మందికి పైగా అతిపెద్ద మానవహారంలా ఏర్పడి జాతీయ జెండాను రెపరెపలాడించి సరికొత్త రికార్డును సృష్టించారు. ‘హర్ ఘర్ తిరంగ’ అనేది జాతీయ జెండాతో ఉన్న సంబంధాన్ని అధికారికంగా లేదా సంస్థాగతంగా ఉంచడం కంటే వ్యక్తిగతంగా దేశభక్తిని పెంపొందించేలా మార్చడమే ఈ కార్యక్రమం లక్ష్యం. భారతదేశ ప్రజలు, మన దేశ సంస్కృతి, సమర యోధులు సాధించిన విజయాలు వాటి వెనుక దాగి ఉన్న అద్భుతమైన చరిత్రను స్మరించుకుంటూ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రోత్సహించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా వీక్షించండి. #WATCH | Guinness World Record for the largest human image of a waving national flag achieved by Chandigarh University and NID Foundation at Chandigarh today. Union Minister Meenakashi Lekhi was also present here on the occasion. pic.twitter.com/6jRgnsi5um — ANI (@ANI) August 13, 2022 (చదవండి: -
Free Chhole Bhature: బూస్టర్ డోస్ తీసుకున్నవారికి బంపర్ ఆఫర్!
చండీగఢ్: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది కేంద్రం. అయితే.. ప్రజల నుంచి స్పందన లేకపోవటం వల్ల ఉచితంగా అందిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 రోజుల పాటు ఈ ఉచిత డోసులు అందిస్తామని తెలిపింది. మరోవైపు.. మూడో డోసు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రజలను పోత్సహించేందుకు కొందరు తమ వంతుగా పాటుపడుతున్నారు. చండీగఢ్కు చెందిన స్ట్రీట్ వెండర్ ఉచితంగా ఛోల్ భతుర్(సెనగ మసాల పూరీ) టిఫిన్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నవారికేనని ఓ షరతు పెట్టారు. ఉత్తర భారతంలో చోల్ భతురే చాలా ఫేమస్. సెనగ మసాలా కర్రీతో పూరీని అందిస్తారు. ఈ స్నాక్స్ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ స్ట్రీట్ ఫుడ్కు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు 45 ఏళ్ల సంజయ్ రాణా. చండీగఢ్లో తన ద్విచక్రవాహనంలో ఛోలో భతురేను విక్రయిస్తారు సంజయ్. గత 15 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు. ‘అర్హులైన ప్రతిఒక్కురు ముందుకు వచ్చి మూడో డోసు తీసుకోవాలి. దేశంలోని చాలా ప్రాంతాల్లో మళ్లీ కరోనా పెరుగుతోంది. పరిస్థితులు చేతి నుంచి చేజారేవరకు ఎందుకు వేచి చూడాలి? ప్రికాషన్ డోసు వేసుకున్న రోజున తన వద్దకు వస్తే ఉచితంగా ఈ ఛోలో భతురేను ఇస్తున్నా.’ గత ఏడాది సైతం తొలి డోసు వేసుకున్న వారికి ఉచితంగా అందించారు సంజయ్. ఈ విషయాన్ని మన్కీ బాత్లో ప్రస్తావించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సంజయ్ రాణాపై ప్రశంసలు కురిపించారు. ఇదీ చదవండి: ఇదేం విడ్డూరం.. పరీక్షలో 100కు 151 మార్కులు సాధించిన విద్యార్థి.. ఎలాగంటే -
అమిత్షా చూస్తుండగా.. 30,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
చండీగఢ్: దేశవ్యాప్తంగా ఒక్కరోజే 30వేల కిలోల డ్రగ్స్ను తగలబెట్టారు అధికారులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. పంజాబ్ చండీగఢ్లో డ్రగ్ ట్రాఫికింగ్, నేషనల్ సెక్యూరిటీ అంశంపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే సమయంలో అధికారులు ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్కతాలో మొత్తం 30వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'ను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా 75వేల కిలోల డ్రగ్స్ను ధ్వంసం చేయాలని ప్రతిజ్ఞ చేశామని అమిత్షా వెల్లడించారు. ఇప్పటికే 81వేల కిలోల డ్రగ్స్ను తగలబెట్టామని వెల్లడించారు. ఆగస్టు 15నాటికి లక్ష కిలోల డ్రగ్స్ ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. Visuals of incineration of seized drugs by the NCB. On PM @narendramodi Ji’s call to celebrate #AmritMahotsav, we took a pledge to destroy about 75000 kg of drugs. Glad to share that till today we have already incinerated 82000 kg and will reach the 1 lakh kg mark by 15th Aug. pic.twitter.com/zx1anMJrV4 — Amit Shah (@AmitShah) July 30, 2022 డ్రగ్స్ ధ్వంసం చేసే కార్యక్రమాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో జూన్ 1న మొదలుపెట్టింది. జులై 29నాటికి దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల డ్రగ్స్ను తగలబెట్టింది. తాజాగా అమిత్షా కార్యక్రమంలో మరో 30వేల కిలోల డ్రగ్స్ను నిర్వీర్యం చేసింది. చదవండి: ఐఐటీ మద్రాస్లో విద్యార్థినిపై లైంగిక వేధింపులు! 300 మంది ఫోటోలతో విచారణ -
28 ఏళ్లకే కొడుకును విగ్రహంగా చూసి తండ్రి కన్నీటి పర్యంతం
చండీగఢ్: సిద్ధూ మూసేవాలా తండ్రి కొడుకును తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మే 29న దారుణ సిద్ధూ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ తండ్రి బాల్కౌర్ సింగ్ ఆవిష్కరించి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. 28 ఏళ్లకే కొడుకును విగ్రహం రూపంలో చూడాల్సి వస్తుందని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రముఖ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాకు గుర్తుగా ఆయన అభిమానులు 6.5 అడుగుల విగ్రహాన్ని తయారు చేయించారు. సిద్ధూ అంత్యక్రియలు జరిగిన మాన్సా జిల్లాలోని మూసా గ్రామంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి సిద్ధూ తల్లిదండ్రులు బాల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుమారుడ్ని విగ్రహం రూపంలో చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి సిద్ధూ అభిమానులు భారీగా తరలివచ్చారు. Sidhu Moosewala’s parents got emotional while they were installing statue of their son where he got cremated #SidhuMooseWala pic.twitter.com/4qdlmXGWKn — Gagandeep Singh (@Gagan4344) July 17, 2022 విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బాల్కౌర్ సింగ్ మాట్లాడారు. తన కుమారుడ్ని హత్య చేసిన వారు దేశ, విదేశాల్లో ఎక్కడ తలదాచుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధూను చంపామని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తికి ప్రభుత్వం భద్రత కల్పించడమేంటని మండిపడ్డారు. మే 29న సిద్ధూను ఓ వాహనంలో వెంబడించిన దుండగులు అతనిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగి సరిగ్గా 50 రోజులవుతున్న సమయంలోనే అభిమానులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం గమనార్హం. చదవండి: ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ సరదా.. రిజర్వాయర్ ఎత్తైన అంచుకు వెళ్లి ఫొటో దిగుతూ.. -
అరే నాయన ఏంట్రా బాబు ఇది? తినాలా? వద్దా!
ఇటీవల కాలంలో కొన్ని హోటల్లో సదరు కస్టమర్లకు ఎదురైన చేదు అనుభవాలను చూస్తే బయట ఫుడ్ తినాలంటేనే భయపడేలా చేశాయి. మొన్నటికి మొన్న ఒక ఆమె కూతురు కోసం దోశ ఆర్డర్ చేస్తే...ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము కుబుసం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరొకసారి సాంబార్ బొద్దింకల అవయవాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అవన్నీ ఒకత్తెయితే ఇక్కడొక కస్టమర్ ఆర్డర్ చేసిన టిఫిన్ ప్లేట్లో బతుకున్న బల్లిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వివరాల్లోకెళ్తే...చండీగఢ్లో ప్రసిద్ధి చెందిన ఈలాంటే మాల్లోని సాగర్ రతన్ ఫుడ్ కోర్ట్లో గురిందర్ చీమా అనే కస్టమర్కి చేదు అనుభవం ఎదురైంది. చోలే భాతురే(పూరీ, శనగల కర్రీ) ఆర్డర్ చేశాడు. సదరు కస్టమర్ పూరీ తిందాం అనుకునేటప్పటికీ ప్లేట్లో బతికున్న బల్లిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో సదరు కస్టమర్ ఫిర్యాదు మేరకు ఆరోగ్యశాఖాధికారులు రంగంలోకి దిగి ఆహార పదార్థాల నమునాను సేకరించి పరీక్షలకు పంపిచడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని బీజేపీకి పార్టీకి చెందిన రవిరాయ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఫుడ్ కోర్ట్లో ఇది సర్వసాధారణం, బొద్దింకలు, చిన్న చిన్న సరీసృపాలు కూడా ఆహారాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాయంటూ వ్యగ్యంగా కామెంట్లు చేస్తూ...ట్వీట్ చేశారు. Had a very horrible experience on 14.6.22, at Sagar Ratan, food court, Elante Mall, Chandigarh. A live Lizard was found in semi-conscious state under the Bhatura. Complaint given to @DgpChdPolice they made sample seized by food health Dept. Chd. @KirronKherBJP@DoctorAjayita pic.twitter.com/ej4sLHrnH5 — Ravi Rai Rana #RWorld (@raviranabjp) June 15, 2022 (చదవండి: అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్ కట్ చేస్తే...) -
సిప్పీ సిద్ధూ హత్య కేసు.. ఏడేళ్లకు ప్రొఫెసర్ కళ్యాణి అరెస్ట్
చండీగఢ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షూటర్ సిప్పీ సిద్ధూ కేసులో.. ఏడేళ్ల తర్వాత ఎట్టకేలకు సీబీఐ తొలి అరెస్ట్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ తాత్కాలిక న్యాయమూర్తి సబీనా కూతురు, ప్రొఫెసర్ కళ్యాణిని బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధూ గర్ల్ఫ్రెండ్గా ఉన్న కళ్యాణిపైనే తొలినాటి నుంచి అందరికీ అనుమానం ఉంది. నేషనల్ లెవల్ షూటర్ సుఖ్మన్ప్రీత్ సింగ్ అలియాస్ సిప్పీ సిద్ధూ(35) 2015, సెప్టెంబర్ 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. సిద్ధూ షూటర్ మాత్రమే కాదు.. కార్పొరేట్ లాయర్ కూడా. పైగా ఛండీగఢ్ మాజీ సీజే ఎస్ఎస్ సిద్ధూ మనవడు. రిలేషన్షిప్ బెడిసి కొట్టడంతోనే ఆమె సిప్పీని హత్య చేయించిందని సమాచారం. ఛండీగఢ్ సెక్టార్ 27లో బుల్లెట్లు దిగబడిని అతని మృతదేహాన్ని అప్పట్లో పోలీసులు గుర్తించారు. జాతీయ షూటర్, పైగా హైఫ్రొఫైల్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కావడంతో.. సిప్పీ సిద్ధూ కేసు సంచలనం సృష్టించింది. చివరకు.. పంజాబ్ గవర్నర్ జోక్యంతో.. 2016లో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో క్లూ అందించిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు నజరానా ప్రకటించింది సీబీఐ. అంతేకాదు.. సిప్పీ హత్య జరిగిన సమయంలో ఓ యువతి అతనితో ఉందని, ఆమె ఎవరో ముందుకు వస్తే.. ఆమెను నిరపరాధిగా భావించాల్సి ఉంటుందని, లేకుంటే.. ఆమెకు కూడా హత్యలో భాగం ఉందని భావించాల్సి ఉంటుందని ఏకంగా సీబీఐ ఒక పేపర్ ప్రకటన ఇచ్చింది కూడా. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే.. ఇది అతని ప్రేయసి కళ్యాణి చేయించిన హత్యేనని, ఆమెను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న చర్చే నడిచింది. మరోవైపు 2021లో ఈ కేసులో నజరానాను ఏకంగా పది లక్షల రూపాయలకు పెంచింది సీబీఐ. ఇక 2020లో సిప్పీతో ఉన్న మహిళను గుర్తించలేకపోయామని కోర్టు తెలిపి.. కేసులో దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. కళ్యాణి సింగ్ను కూలంకశంగా ప్రశ్నించిన తర్వాతే.. అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆపై ప్రత్యేక న్యాయమూర్తి సుఖ్దేవ్ సింగ్ ఎదుట ఆమెను హాజరుపరిచి.. నాలుగు రోజుల కస్టడీకి తీసుకుంది సీబీఐ. (చదవండి: స్కూల్స్లో కరోనా కలకలం.. 31 మంది విద్యార్థులకు పాజిటివ్.. టెన్షన్లో అధికారులు) -
సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం!
ఛండీగడ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా దారుణహత్యకు.. ప్రతీకారం తీర్చుకుంటామని, అదీ రెండు రోజుల్లోనే అని సోషల్ మీడియాలో ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. సిద్ధూ మూసే వాలా మా హృదయం.. సోదరుడి లాంటి వాడు. రెండు రోజుల్లో ఫలితం ఏంటో చూస్తారు అంటూ ఫేస్బుక్ స్టోరీలో ఉంది ఆ హెచ్చరిక. పోస్ట్లో బావ్నా అని ఉండడంతో.. ఇది గ్యాంగ్స్టర్ నీరజ్ బావ్నాకు చెందిన ముఠా పని అని భావిస్తున్నారు పోలీసులు. పలు హత్య కేసుల్లో దోషిగా తేలిన నీరజ్ బావ్నా, అతని అనుచరులు టిల్లు తజాపూరియా, దేవిందర్ బంభియాలు.. తీహార్ జైలులో ఉన్నారు. అయితే పై హెచ్చరిక పోస్ట్ ఎవరు రాశారనేదానిపై స్పష్టత లేకపోయినా.. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్లలో విస్తరించి ఉన్న నీరజ్ బావ్నా అనుచరుల పని అయ్యి ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరుడు గోల్డీ బ్రార్లను ఉద్దేశించి ఆ ఫేస్బుక్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిష్ణోయ్.. ప్రాణ భయంతో సెక్యూరిటీ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జైలు నుంచి అంత పెద్ద హత్యకు ఎలా కుట్ర పన్నుతాడంటూ బిష్ణోయ్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సిద్ధూ మూసే వాలా హత్యను గ్యాంగ్వార్-ప్రతీకార హత్యగానే భావిస్తోంది పంజాబ్ పోలీస్ శాఖ. చదవండి: సింగర్ సిద్ధూ పోస్టుమార్టంపై వైద్యుల షాకింగ్ కామెంట్స్ -
కేంద్రంపై పోరాడండి..తోడుంటాం
సాక్షి, హైదరాబాద్: ఏది ఏమైనా తాము రైతుల వెంట ఉంటామని.. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పోరాటం కొనసాగించాలని రైతులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వాలను మార్చేసే శక్తి రైతులకు ఉందని.. ఈ విషయంగా దేశంలోని రైతులంతా ఏకం కావాల్సి ఉందని పేర్కొన్నారు. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో నిర్వహించిన రైతు ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలను, గల్వాన్లో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదివారం చండీగఢ్లో.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్లతో కలిసి సీఎం కేసీఆర్ పరామర్శించారు. 600 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున.. నలుగురు సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. దేశవ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. రైతులంతా ఉద్యమంలోకి రావాలి ‘‘రైతుల సంక్షేమం కోసం మాట్లాడే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులంటే కొందరికి నచ్చదు. ఒత్తిడి తెస్తారు. రైతు ఉద్యమ సమయంలో మిమ్మల్ని ఖలిస్తానీలన్నారు. దేశ ద్రోహులన్నారు. ఇవన్నీ మేం విన్నాం. ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని రైతు నాయకులను కోరుతున్నాను. పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల నుంచే కాదు.. యావత్ భారత దేశం నుంచీ రైతు ఉద్యమం సాగాలి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులన్నింటి నుంచి రైతులు ఉద్యమంలో పాల్గొనాలి. ఇది మన హక్కు. దేశానికి, ప్రపంచానికి మనం ఆహారం అందిస్తున్నాం. ఢిల్లీ సరిహద్దుల్లో నడిచిన రైతు ఉద్యమానికి కేజ్రివాల్ తమ వంతు సాయం చేశారు. రైతులను రక్షించే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్లన్నీ తీర్చే వరకు పోరాటానికి మేం సంపూర్ణ మద్దతునిస్తాం. ప్రాణాలు కోల్పోయిన రైతుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేం. కొన్ని మంచి మాటలు చెప్పి మీ మనసును శాంతపరిచేందుకు వచ్చాం. ఇలాంటి పరిస్థితి ఏ దేశంలోనూ లేదు కేంద్రం తెచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తలవంచి నమస్కరిస్తున్నాను. అమరులైన వారిని తిరిగి తీసుకురాలేం. కానీ రైతు కుటుంబాలు ఒంటరి కాదు. యావత్ దేశం వారి వెంట ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఇలాంటి సమావేశాలు నిర్వహించాల్సి రావడం బాధాకరం. అమరులైన వారికోసం నిర్వహించే సభలను చూసినప్పుడు కళ్లలో నీళ్లు తిరుగుతాయి. దుఃఖం వస్తుంది. దేశం ఎందుకిలా ఉందనిపిస్తుంది. దీని గురించి ఆలోచించాలి. భారత పౌరుడిగా దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో సమస్యల్లేని దేశం ఉండదు. కానీ మన దేశంలో ఉన్నటువంటి సమస్యలు మరెక్కడా ఉండవు. దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ దేశానికి పంజాబ్ చేసిన సేవలు అసామాన్యం. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన వీరులను కన్న పంజాబ్ను దేశం ఎన్నటికీ మర్చిపోదు. దేశం ఆహారం కోసం పరితపిస్తున్నప్పుడు హరిత విప్లవం ద్వారా దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రమిది. దేశం కోసం చైనా సైనికులతో పోరాడి అమరుడైన కల్నల్ సంతోశ్బాబుది మా తెలంగాణ. ఆయనతోపాటు పంజాబ్ సైనికులు కూడా వీర మరణం పొందారు. వీర మరణం పొందిన పంజాబ్ సైనికుల కుటుంబాలను పరామర్శించాలని అనుకున్నాను. కానీ ఎన్నికల కారణంగా రాలేకపోయిన. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో చెప్తే.. ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసి, నా కార్యక్రమానికి మద్దతిచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టుమంటోంది.. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాయి. తెలంగాణ కూడా రైతుల కోసం ఎంతో చేస్తోంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఒక్కోరోజు 10, 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకునేవారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. రాత్రిపూట వ్యవసాయ మోటర్లు వేసేందుకు వెళ్తే పాములు కుట్టేవి. ఆ బాధలు వినేవాళ్లే ఉండేవారు కాదు. తెలంగాణ ఏర్పడ్డాక భగవంతుడి దయతో విద్యుత్ సమస్యను అధిగమించాం. అన్ని రంగాలతో పాటు వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. కేంద్రం రైతుల కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటోంది. రైతుల రక్తాన్ని తాగాలని చూస్తోంది. మా ప్రాణాలు పోయినా.. మేం మాత్రం మీటర్లు బిగించబోమని అసెంబ్లీ నుంచే తీర్మానం చేసేశాం’’అని కేసీఆర్ స్పష్టం చేశారు. -
పంజాబ్లోనూ మందిర్–మసీదు వివాదం
పటియాలా: మందిర్–మసీదు వివాదం పంజాబ్నూ తాకింది. పటియాలా సమీపంలో రాజ్పురాలోని గుజ్రన్వాలా మొహల్లాలో ఉన్న మసీదు నిజానికి సిక్కులకు చెందిన సరాయి అని స్థానిక హిందూ, సిక్కు సమూహాలు బుధవారం ఆరోపించాయి. ‘‘రెండేళ్ల క్రితం అందులో ఉంటున్న రెండు సిక్కు కుటుంబాలను తరిమేసి ఆక్రమించుకున్నారు. సిక్కు మత, ఆరాధన చిహ్నాలను తొలగించారు. గుమ్మటం నిర్మించి ఆకుపచ్చ రంగు వేసి మసీదుగా మార్చారు’’ అని పేర్కొన్నాయి. దీన్ని ముస్లిం సమూహం ఖండించింది. అది స్వాతంత్య్రానికి ముందునుంచీ మసీదుగానే కొనసాగుతూ వస్తోందని వాదించింది. ఇరు వర్గాలూ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ హిమాన్షు గుప్తాకు ఫిర్యాదు చేశాయి. రెండు రోజుల్లోగా సాక్ష్యాలు సమర్పించాలని వారికి ఆయన సూచించారు. హర్యానా, యూపీకి చెందిన వాళ్లు ఇబ్బంది పెడుతున్నారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో కట్టడం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి -
ఆల్–వుమెన్ ప్లే:జీవన నాటకం
జీవితమే ఒక నాటకరంగం... తాత్విక మాట. నాటకంలోకి జీవితాన్ని తీసుకురావడం... సృజనబాట. ఈ బాటలోనే తన నాటకాన్ని నడిపిస్తూ దేశ, విదేశ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది రమణ్జిత్ కౌర్.... చండీగఢ్లో పుట్టి పెరిగిన రమణ్జిత్కౌర్ పెళ్లి తరువాత కోల్కతాలో స్థిరపడింది. అక్కడి నాటకరంగంపై తనదైన ముద్ర వేసింది. జాతీయత, ప్రాంతీయత, కులం, వర్గం, జెండర్ అంశాల ఆధారంగా ఆమె రూపొందించిన ‘బియాండ్ బార్డర్స్’ నాటకం దేశవిదేశాల్లో ప్రదర్శితమై ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ నాటకంలో 29 మంది మహిళలు నటించడం ఒక విశేషం అయితే, ఇంగ్లీష్, హిందీతో పాటు పంజాబీ, బెంగాలి, మరాఠీ, గడ్వలి... భాషలను ఉపయోగించడం మరో విశేషం. సమకాలీన సమస్యలను నాటకానికి వస్తువుగా ఎంచుకోవడం ఒక ఎత్తయితే... వీడియో ఆర్ట్, ఇన్స్టాలేషన్ ఆర్ట్, ఫొటోగ్రఫీ, సౌండ్ డిజైన్లాంటి సాంకేతిక అంశాలను కూడా సృజనాత్మకంగా ఉపయోగించడం మరో ఎత్తు. నాటకం నాడి తెలిసిన కౌర్కు సినిమాలపై కూడా మంచి అవగాహన ఉంది. దీపా మెహతా దర్శకత్వంలో వచ్చిన ఫైర్, హెవెన్ ఆన్ ఎర్త్ చిత్రాలలో నటించింది. ‘మ్యాంగో షేక్’లాంటి షార్ట్ఫిల్మ్స్ కూడా రూపొందించింది. ‘నాటకరంగం, సినిమా రంగానికి తేడా ఏమిటి?’ అనే ప్రశ్నకు ఆమె ఇలా జవాబు ఇస్తుంది... ‘పెద్ద తేడా ఏమీలేదు. భావవ్యక్తీకరణకు రెండూ ఒకేరకంగా ఉపయోగడపడతాయి. అయితే నాటకం ద్వారా తక్షణ స్పందన తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఒకవైపు నటిస్తూనే మరోవైపు ప్రేక్షకుల కళ్లను చూస్తు కొత్త పాఠాలు నేర్చుకోవచ్చు’ ‘థియేటర్ గేమ్స్’ రచయిత క్లైవ్ బర్కర్లాంటి దిగ్గజాల దగ్గర శిక్షణ తీసుకున్న కౌర్ తొలిసారిగా డూన్ స్కూల్ స్పెషల్ చిల్డ్రన్స్ కోసం వర్క్షాప్ని నిర్వహించింది. నాటకరంగంలో పిల్లలు చురుకైన పాత్ర నిర్వహించాలనేది తన కల. ‘ది క్రియేటివ్ ఆర్ట్’తో తన కలను నెరవేర్చుకుంది కౌర్. ఈ సంస్థ ద్వారా వేలాదిమంది విద్యార్థులు యాక్టింగ్, వాయిస్ ట్రైనింగ్, ఎక్స్ప్రెషన్, మ్యూజిక్, ప్రొడక్షన్ డిజైన్... మొదలైన వాటిలో శిక్షణ తీసుకున్నారు. కౌర్ దర్శకత్వం వహించిన తాజా నాటకం ‘ది ఈగల్ రైజెస్’కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాటకంలో నటించిన వారందరూ మహిళలే. జీవితం అనేది యుద్ధం అనుకుంటే... అక్కడ మనకు అడుగడుగునా కావాల్సింది సానుకూల దృక్పథం. మన మీద మనకు ఉండే ఆత్మవిశ్వాసం. ఇవే మన వజ్రాయుధాలు’ అని చెబుతుంది ది ఈగల్ రైజెస్. ‘థియేటర్ అంటే ముఖానికి రంగులు పూసుకొని, డైలాగులు బట్టీ పట్టడం కాదు. మనలోని సృజనాత్మక ప్రపంచాన్ని ఆవిష్కరించే వేదిక. అందుకు సరైన శిక్షణ కావాలి. కొందరు ఏమీ తెలియకపోయినా ఇతరులకు నటనలో శిక్షణ ఇస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలి. నాటకం అనేది ఉన్నచోటనే ఉండకూడదు. అది కాలంతో పాటు ప్రవహించాలి. సాంకేతికధోరణులను అందిపుచ్చుకోవాలి’ అని చెబుతున్న కౌర్, నటులకు ఫిజికల్ ఎనర్జీ, ఫిట్నెస్ ముఖ్యం అని నమ్ముతుంది. పిల్లలకు నాటకరంగలో శిక్షణ ఇవ్వాలనే తన కోరికను సాకారం చేసుకున్న కౌర్ ఆల్–వుమెన్ థియేటర్ కోర్స్కు రూపకల్పన చేస్తుంది. ఈ కోర్స్లో భాగంగా దేశ, విదేశ కళాకారులు ఔత్సాహికులకు శిక్షణ ఇస్తారు. మార్షల్ ఆర్ట్స్లో కూడా శిక్షణ ఉంటుంది. కౌర్ రెండో కల నిజం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. -
సోదాల పేరుతో సీబీఐ అధికారుల రచ్చ
న్యూఢిల్లీ: ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు గుంజేందుకు సోదాల పేరుతో హంగామా సృష్టించిన సీబీఐ అధికారులు నలుగురు అడ్డంగా దొరికిపోయారు. ఉన్నతాధికారులు వారిని డిస్మిస్ చేయడంతోపాటు అరెస్ట్ చేశారు. ఈనెల 10వ తేదీన సీబీఐ అధికారులమని చెబుతూ కొందరు తన ఆఫీసులోకి వచ్చి, నానా హంగామా సృష్టించారని చండీగఢ్కు చెందిన వ్యాపారవేత్త ఒకరు ఫిర్యాదు చేశారు. తనకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ బెదిరించి, రూ.25 లక్షలివ్వాలని డిమాండ్ చేశారని అందులో పేర్కొన్నారు. తమ సిబ్బంది ఒకరిని పట్టుకోగా, మిగతా వారు పరారయ్యారని వివరించారు. ఈ ఫిర్యాదుపై సీబీఐ డైరెక్టర్ సుబోధ్కుమార్ జైశ్వాల్ వెంటనే స్పందించారు. విచారణ జరిపి ఈ నలుగురూ ఢిల్లీ సీబీఐ ఆర్థిక నేరాలు, ఇంటర్పోల్ ప్రొటోకాల్ డివిజన్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్సైలు సుమిత్ గుప్తా, అంకుర్ కుమార్, ప్రదీప్ రాణా, అకాశ్ అహ్లావత్లుగా గుర్తించారు. వీరి నివాసాలపై సోదాలు చేపట్టి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురినీ అరెస్ట్ చేయడంతోపాటు వెంటనే విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. వీరిపై ఆరోపణలు రుజువైతే 10 ఏళ్ల నుంచి జీవితకాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. -
1857 సిపాయిల తిరుగుబాటు: వీరుల అస్థిపంజరాలు లభ్యం
బ్రిటిష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో భారతీయులకు తెలిసిందే. 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్లోని బయటపడ్డాయి. అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో సైనికుల అస్థిపంజరాలను కనుకొన్నట్లు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎస్ సెహ్రావత్ తెలిపారు. అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్లు బుధవారం వెల్లడించారు. కాగా, సిపాయిల తిరుగుబాటులోనే సైనికులు మరణించినట్టుగా ఆ ప్రాంతంలో లభించిన నాణేలు, డీఎన్యే అధ్యయనం, ఆంత్రోపోలాజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో-కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా తెలుస్తున్నదని ఆయన తెలిపారు. అయితే, బ్రిటిష్ కాలంలో భారత సైనికులు.. తూటాలను పంది మాంసం, గొడ్డు మాంసంతో తయారుచేశారన్న కారణంగా తిరుగుబాటు మొదలైంది. దీంతో బ్రిటిష్ అధికారులకు ఎదురుతిరిగిన భారత సైనికులను కిరాతకంగా చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఓ బావిలో పడేశారు. Chandigarh| These skeletons belong to 282 Indian soldiers killed during India's 1st freedom struggle against the British in 1857. These were excavated from a well found underneath religious structure in Ajnala near Amritsar, Punjab: Dr JS Sehrawat Asst Prof Dept Anthropology PU pic.twitter.com/pfGdz4W5sC — ANI (@ANI) May 11, 2022 ఇది కూడా చదవండి: షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు -
పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. 184 మంది భద్రత ఉపసంహరణ
చండీగఢ్: పంజాబ్లో భారీ విజయంతో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా 184 మందికి సంబంధించిన భద్రతను ఉపసంహరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారికి ఉన్న ముప్పును అంచనా వేసి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు బీబీ జాగీర్ కౌర్, మదన్ మోహన్ మిట్టల్, సుర్జిత్ కుమార్ రఖ్రా, సుచా సింగ్ చోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, తోట సింగ్, గుల్జార్ సింగ్ రాణికే ఉన్నారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు, మంత్రుల కుటుంబానికి ఉన్న భద్రతను కూడా ఉపసంహరించారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్ కుటుంబీకులు కూడా తమ భద్రతను కోల్పోనున్నారు. భద్రత కోల్పోయినవారిలో మాజీ ఎంపీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న మహి గిల్, మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ కుమారుడు సిధాంత్ కూడా భద్రతను కోల్పోనున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను ఆప్ ప్రభుత్వం తొలగించడం ఇది రెండోసారి కావాడం గమనార్హం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చి 11న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చదవండి: పాకిస్తాన్లో చదివినోళ్లకు ఉద్యోగాలు ఇవ్వం! -
వామ్మో..ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత ఖర్చా..! బండి ఖరీదు వేలల్లో ఉంటే..నెంబర్ మాత్రం!
వాహనదారులు కొత్త వెహికల్స్ కొనడం ఒక ఎత్తైతే. వాటికి ఫ్యాన్సీ నెంబర్లను ఎంపిక చేయడం మరో ఎత్తు. వాహనదారులు ప్రతీ నెంబర్కు ఓ ప్రత్యేకత ఉందని భావిస్తారు. నెంబర్ 1 నాయకత్వానికి సూచిక. అందుకే దాదాపూ ఈ నెంబర్ కోసం పోటీ పడుతుంటారు. ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడరు. గతంలో ఈ తరహా పోటీ జరగ్గా... తాజాగా అదే తరహా సీన్ రిపీట్ అయ్యింది. ఛండీఘడ్కు చెందిన బ్రిజ్ మోహన్ అడ్వటైజింగ్ ఏజెన్సీలో జాబ్ చేస్తున్నాడు. అయితే మోహన్ తాజాగా రూ.71వేలకు హోండా యాక్టీవాను కొనుగోలు చేశాడు. కానీ ఆ బండి ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలుసా? అక్షరాల రూ.15.44లక్షలుగా ఉంది. ఫ్యాన్సీ నెంబర్ను కొనుగోలు చేయడంపై మోహన్ మాట్లాడుతూ..హోండా యాక్టీవాను ఈ ఫ్యాన్సీ నెంబర్ను వినియోగిస్తాను. త్వరలో కారు కొంటా. ఆ కారుకి కూడా సేమ్ ఫ్యాన్సీ నెంబర్ను ఉపయోగిస్తానని చెబుతున్నాడు. ఇటీవల ఛండీఘడ్ ఆర్టీఓ అధికారులు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 16 వరకు ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు. ఈ ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో కొత్త సిరీస్ సీహెచ్01- సీజే-0001 (CH01-CJ) నెంబర్ ఉందని అన్నారు. తాము నిర్వహించిన వేలంలో ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.1.5కోట్ల వరకు వాహనదారులు చెల్లించినట్లు తెలిపారు. సీహెచ్01- సీజే-0001 ఫ్యాన్సీ నెంబర్కు మోహనే అత్యధికంగా రూ.15.44 లక్షలు చెల్లించాడని ఆర్టీఓ అధికారులు చెప్పారు. ఇక ఈ నెంబర్ రిజర్వ్ ధర రూ.50వేలు ఉండగా రెండవ అత్యంత ఖరీదైన ఫ్యాన్సీనెంబర్ సీహెచ్-01-సీజే-002పై రూ.5.4 లక్షలు చెల్లించిచారని..సీహెచ్-01-సీజే-007 నెంబర్ ధర రూ.4.4 లక్షలు పలకగా..సీహెచ్-01-సీజే-003 నెంబర్ రూ.4.2లక్షలకు వాహనదారులు సొంతం చేసుకున్నారు. ఇక ఈ నంబర్ రిజర్వ్ ధర రూ.30వేలుగా ఉంది. కాగా, ఇప్పటివరకు, 0001కి అత్యధిక బిడ్ 2012లో వచ్చింది. సెక్టార్ 44 నివాసి సీహెచ్ -01-ఏపీ సిరీస్ నుండి రూ.26.05 లక్షలకు నంబర్ను కొనుగోలు చేశారు.ఇది అతని ఎస్ -క్లాస్ మెర్సిడెస్ బెంజ్ కోసం కొనుగోలు చేశాడని ఆర్టీఓ అధికారులు గుర్తు చేశారు. -
చండీగఢ్ వివాదం; అసలేం జరిగింది?
పంజాబ్, హరియాణా రాష్ట్రాల మధ్య ‘రాజధాని’ వివాదం మరోసారి రాజుకుంది. చండీగఢ్ను తక్షణమే తమకు బదిలీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ సర్కారు తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. బీజేపీ సభ్యులు మినహా శాసనసభలోని మిగతా అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. చండీగఢ్పై పంజాబ్ తీర్మానం చేసిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం ఏప్రిల్ 5న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అసలేంటి వివాదం? చండీగఢ్ రాజధానిగా 1950లో పంజాబ్ రాష్ట్రం అవతరించింది. 1966లో పంజాబ్.. హరియాణా, హిమాచల్ప్రదేశ్గా విడిపోయింది. చండీగఢ్ను మాతృరాష్టమైన తమకే కేటాయించాలని ఆ సమయంలో పంజాబ్ పట్టుబట్టింది. భాషా ప్రాతిపదికన కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ విధానాన్ని అనుసరించారని వాదించింది. అయితే పంజాబ్ వాదననను హరియాణా గట్టిగా వ్యతిరేకించింది. ఇరు రాష్ట్రాల మధ్య విభేదాల కారణంగా చండీగఢ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి.. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేసింది. పరిపాలనాపరంగా పంజాబ్, హరియాణాలు 60:40 నిష్పత్తిలో చండీగఢ్ను పంచుకునేలా ఒప్పందం చేసింది. అప్పటి నుంచి రాజధాని వివాదం రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతూనే ఉంది. జేసీ షా కమిటీ రెండు రాష్ట్రాల వివాదాన్ని పరిష్కరించడానికి ఏర్పాటైన జేసీ షా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.. చండీగఢ్ను హరియాణాకు ఇచ్చేయాలని ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జేసీ షాతో పాటు ఎంఎం ఫిలిప్, ఎస్ దత్ కమిటీలో ఉన్నారు. ద ట్రిబ్యూన్ ఆర్కైవ్స్లో లభ్యమైన 1966, జాన్ 6 వార్తా కథనం ప్రకారం... ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు హరియాణా వైపు మొగ్గు చూపారు. పంజాబ్ కొత్త రాజధానిని ఎంచుకునే వరకు చండీగఢ్ను ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని జస్టిస్ షా, ఫిలిప్ సూచించారు. చండీగఢ్ భవిష్యత్తుపై కమిటీ ఏకాభిప్రాయం రాలేకపోవడం కేంద్రాన్ని సంకటంలో పడేసింది. నిర్ణీత సమయంలో హరియాణాకు స్వంత రాజధాని నిర్మిస్తామని, పంజాబ్కు చండీగఢ్ చెందుతుందని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించారు. ఈ మేరకు 1970లో లోక్సభకు కేంద్రం అధికారికంగా సమాచారం ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని ఆప్షన్లను కూడా కేంద్రం సూచించింది. చండీగఢ్ను పంజాబ్కు ఇచ్చేస్తే ఆ రాష్ట్రంలోని అబోహర్, ఫజిల్కాలోని హిందీ ప్రాంతాలను హరియాణాకు బదిలీ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. హరియాణా తన కార్యాలయాలు, నివాస గృహాలను 10 ఏళ్ల పాటు చండీగఢ్లో కొనసాగించవచ్చని.. తర్వాత స్వంత రాజధానికి తరలించాలని సూచించింది. హరియాణా సొంత రాజధాని నిర్మాణానికి అప్పట్లో 10 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా కేంద్రం ముందుకు వచ్చింది. దీంతో హరియాణా.. చండీగఢ్కు సమీపంలో పంచకుల పేరుతో కొత్త నగరాన్ని నిర్మించింది. చండీగఢ్ నుంచి తన కార్యాలయాలను పెద్ద సంఖ్యలో పంచకుల నగరానికి తరలించింది. అయితే చండీగఢ్ ఉమ్మడి రాజధాని హోదాను 1976లో కేంద్రం మరో 10 సంవత్సరాల పాటు పొడిగించింది. అబోహర్, ఫజిల్కా ప్రాంతాలను వదులుకోవడానికి పంజాబ్ ఒప్పుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. 1985లో రాజీవ్-లాంగోవాల్ ఒప్పందం(అప్పటి శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సంత్ హర్చంద్ సింగ్ లాంగోవాల్తో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సంతకం చేసిన ఒప్పందం) కూడా కాగితాలకే పరిమితం కావడంతో వివాదానికి ఎండ్ కార్డ్ పడలేదు. రెండు రాజధానులే బెటర్! సుదీర్ఘంగా కొనసాగుతున్న చండీగఢ్ సమస్య పరిష్కారానికి రెండేళ్ల క్రితం హరియాణా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా ఒక ప్రతిపాదన చేశారు. చండీగఢ్ను పంజాబ్ వదులుకుంటే తాము కూడా వదులుకుంటామని 2020, నవంబర్లో ప్రతిపాదించారు. చండీగఢ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా అంగీకరించి.. రెండు రాష్ట్రాలు స్వంత రాజధానులను, హైకోర్టు బెంచ్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇలా చేస్తే రెండు రాష్ట్రాలకు మంచిదని చౌతాలా అభిప్రాయపడ్డారు. ఏడుసార్లు తీర్మానాలు చండీగఢ్ వివాదం మరోసారి తాజాగా తెర మీదకు వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచి తీర్మానం చేయడంతో ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది. చండీగఢ్పై పంజాబ్ అసెంబ్లీ ఇటువంటి తీర్మానాన్ని ఆమోదించడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు ఏడు సార్లు తీర్మానాలు చేసింది. చండీగఢ్లో సెంట్రల్ సర్వీస్ రూల్స్ అమలులోకి వస్తాయని కేంద్ర హెంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనతో అప్రమత్తమైన ఆప్ సర్కారు తాజా తీర్మానం చేసింది. ముఖ్యంగా పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, చండీగఢ్లకు నీరు విద్యుత్ సరఫరాను నియంత్రించే భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్(బీబీఎంపీ)పై కేంద్రం పెత్తనాన్ని బీజేపీ మినహా పంజాబ్లోని అన్ని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మున్ముందు రోజుల్లో చండీగఢ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. (క్లిక్: చండీగఢ్ ఇచ్చేయాల్సిందే.. భగవంత్ మాన్ డిమాండ్) -
సీఎం భగవంత్ మాన్ మరొకటి.. చండీగఢ్ పంజాబ్కే సొంతం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో సంచలనానికి తెర తీశారు. శుక్రవారం విధాన సభ ప్రత్యేక సమావేశాల్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారాయన. చండీగఢ్ నగరాన్ని పంజాబ్కు బదిలీ చేయాలంటూ తీర్మానం చేశారాయన. చండీగఢ్పై సర్వహక్కులు తమవేనని, వెంటనే దానిని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారాయన. కేంద్రపాలిత ప్రాంత హోదాలో చండీగఢ్ ప్రస్తుతం పంజాబ్-హర్యానాల సంయుక్త రాజధానిగా ఉన్న సంగతి తెలిసిందే. పరిపాలనాపరంగా 60:40గా పంజాబ్, హర్యానాలు చండీగఢ్నును పంచుకుంటున్నాయి. ఈ తరుణంలో చండీగఢ్పై సర్వహక్కులు పంజాబ్వేనని, అందుకే పూర్తిగా పంజాబ్కు బదిలీ చేయాలంటూ ఒక తీర్మానం చేశారు సీఎం భగవంత్ మాన్. దీనికి ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా మద్దతు ప్రకటించగా.. తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇదిలా ఉండగా.. పంజాబ్ సర్వీస్ రూల్స్కు బదులు ఛండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మధ్య ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కౌంటర్గా చండీగఢ్.. పంజాబ్కే పూర్తి రాజధానిగా ఉండాలంటూ తీర్మానం సీఎం భగవంత్ మాన్ ప్రవేశపెట్టడం విశేషం. తీర్మానం సందర్భంగా.. భగవంత్ మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఛండీగఢ్ నుంచి కాకుండా బయటి వాళ్లను(కేంద్ర సర్వీస్ ఉద్యోగులతో) నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారాయన. అంతేకాదు ఇంతకాలం కొనసాగిన సమతుల్యతను దెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారాయన. భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డులో కేంద్ర ఉద్యోగుల్ని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. ఛండీగఢ్ పంజాబ్ రాజధానిగా పునరుద్ఘాటించిన సీఎం మాన్.. ఇంతకు ముందు ఇలా రాష్ట్రాలు విడిపోయిన సందర్భాల్లో రాజధాని మాతృరాష్ట్రంతోనే ఉన్న విషయాన్ని సైతం ప్రస్తావించారు. కాబట్టి, చంఢీగఢ్ను పంజాబ్కు బదిలీ చేయాలని అన్నారు. గతంలో సభ ఇందుకు సంబంధించి ఎన్నో తీర్మానాలు చేసినా లాభం లేకుండా పోయిందని, ఈసారి దానిని సాధించి తీరతామని చెప్పారాయన. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం.. పంజాబ్ రాష్ట్రం ఏర్పడింది. ఆపై పునర్వ్యవస్థీకరణతో హర్యానా పుట్టుకొచ్చింది. ఛండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా, పంజాబ్లో కొంత భాగంగా హిమాచల్ ప్రదేశ్లో కలిసిపోయాయి. అప్పటి నుంచి భాక్రా బియస్ మేనేజ్మెంట్ బోర్డు లాంటి సంయుక్త ఆస్తుల మీద పరిపాలనను పంజాబ్-హర్యానాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. -
గవర్నర్ను కలిసిన ఆప్ శాసనసభాపక్ష నేత భగవంత్ మాన్
-
కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..
-
కూతురు పోయిన బాధను దిగమింగి శతకంతో మెరిసే..
Baroda Player Vishnu Solanki: బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి రంజీ ట్రోఫీ 2022 సీజన్లో సెంచరీతో మెరిశాడు. చంఢీఘర్తో జరుగుతున్న మ్యాచ్లో సోలంకి ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇందులో వింతేముంది.. అందరి క్రికెటర్ల లాగే తాను సెంచరీ బాదాడనుకుంటే పొరపాటే అవుతుంది. విష్ణు సోలంకి సెంచరీ వెనుక విషాధగాథ ఉంది. కొన్ని రోజుల క్రితం విష్ణు సోలంకి కూతురు చనిపోయింది. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో ఆ పసికందు కన్నుమూసింది. ఆ సమయంలో విష్ణు రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సోలంకి.. హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకొని మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. వస్తూనే సోలంకి చంఢీఘర్తో మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు. పుట్టిన బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకిని మెచ్చుకోకుండా ఉండలేము. ''అంత బాధను దిగమింగి సూపర్ ఇన్నింగ్స్ ఆడావు.. నీ ఆటకు సలామ్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్లో ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన బరోడా ఆల్రౌండర్ 161 బంతులెదుర్కొని 12 బౌండరీల సాయంతో సెంచరీ మార్క్ను అందుకున్నాడు. సోలంకి సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే ఆట రెండో రోజు పూర్తైంది. ప్రస్తుతం బరోడా తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకముందు చంఢీఘర్ తొలి ఇన్నింగ్స్లో 168 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే బరోడా తొలి ఇన్నింగ్స్లో 230 పరుగుల ఆధిక్యంలో ఉండడం విశేషం. చదవండి: Rohit Sharma: టీమిండియా సరికొత్త చరిత్ర.. తొలి కెప్టెన్గా రోహిత్! Ranji Trophy 2022: తమిళనాడు కవల క్రికెటర్ల సరికొత్త చరిత్ర.. ఒకే ఇన్నింగ్స్లో.. What a player . Has to be the toughest player i have known. A big salute to vishnu and his family by no means this is easy🙏 wish you many more hundreds and alot of success 🙏🙏 pic.twitter.com/i6u7PXfY4g — Sheldon Jackson (@ShelJackson27) February 25, 2022 -
Ranji Trophy: ఆరు వికెట్లతో అదరగొట్టిన రవితేజ
భువనేశ్వర్: రంజీ ట్రోఫీ సీజన్ను హైదరాబాద్ క్రికెట్ జట్టు ఘనవిజయంతో ప్రారంభించింది. చండీగఢ్తో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ తొలి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ 217 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. 401 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చండీగఢ్ రెండో ఇన్నింగ్స్లో 50.5 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 21/2తో చివరిరోజు ఆట కొనసాగించిన చండీగఢ్ను హైదరాబాద్ మీడియం పేసర్లు తెలుకుపల్లి రవితేజ, రక్షణ్ రెడ్డి హడలెత్తించారు. ఫలితంగా ఆట చివరిరోజు చండీగఢ్ 162 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రవితేజ తన రంజీ కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు. 27 ఏళ్ల రవితేజ రెండో ఇన్నింగ్స్లో 17 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి చండీగఢ్ను దెబ్బతీశాడు. మరో పేస్ బౌలర్ రక్షణ్ రెడ్డి 62 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ గెలుపుతో హైదరాబాద్ ఖాతాలో 6 పాయింట్లు చేరాయి. ఈనెల 24న కటక్లో మొదలయ్యే రెండో లీగ్ మ్యాచ్లో బెంగాల్తో హైదరాబాద్ ఆడుతుంది. -
విహారి అద్భుత శతకం.. ఆకట్టుకున్న తిలక్ వర్మ
భువనేశ్వర్: రంజీ ట్రోఫీ 2022 గ్రూప్ బి లో భాగంగా చండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టెస్ట్ జట్టు సభ్యుడు, హైదరాబాద్ స్టార్ ఆటగాడు హనుమ విహారి అద్భుత శతకంతో మెరిశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లోనూ హాఫ్ సెంచరీ (59)తో రాణించిన విహారి.. రెండో ఇన్నింగ్స్లో 149 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఐపీఎల్ వేలంలో భారీ ధర (1.70 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది).దక్కించుకున్న తిలక్ వర్మ (76 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విహారికి మరో ఎండ్లో ఉండి సహకరించాడు. ఫలితంగా హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 269 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్ధికి 400 పరుగుల భారీ టార్గెట్ను నిర్ధేశించింది. అంతకుముందు టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులకు ఆలౌట్ కాగా, మనన్ వోహ్రా సూపర్ శతకంతో మెరవడంతో చండీగఢ్ తొలి ఇన్నింగ్స్లో 216 పరుగులు చేసి ఆలౌటైంది. చదవండి: Ranji Trophy 2022: హనుమ విహారి అర్ధ శతకం.. హైదరాబాద్ 270/7 -
Ranji Trophy 2022: ఆధిక్యం కోల్పోయిన ఆంధ్ర
Ranji Trophy 2022 Andhra Vs Raj- తిరువనంతపురం: రాజస్తాన్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ ఎలైట్ గ్రూప్ ‘ఇ’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 86.2 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 75/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర 149 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ గిరినాథ్ (71; 7 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో శశికాంత్ (26 బంతుల్లో 34; 4 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. 51 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన రాజస్తాన్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి ఓవరాల్గా తమ ఆధిక్యాన్ని 148 పరుగులకు పెంచుకుంది. ఇక తొలి రోజు ఆటలో భాగంగా ఆంధ్ర జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ చీపురపల్లి స్టీఫెన్ (5/51) ఐదు వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 59.2 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. చదవండి: తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా! -
Laya Mathikshara: ఈమెకు లక్షల్లో డబ్బు... అతడు ఏకంగా 7 కోట్లు సంపాదించాడు!
Laya Mathikshara- Non Fungible Tokens: ‘తన సెల్ఫీలు అమ్మకానికి పెట్టి కోట్లు గడించాడు’ అని ఎవరైనా అంటే– ‘అయ్యా! తమరికి నేనే దొరికానా’ అని అనుమానంగా చూసేవాళ్లే ఎక్కువ. కానీ ‘సెల్ఫీ’ కోట్లు గడించింది అనేది అబద్ధం కాదు... అతిశయోక్తి అంతకన్నా కాదు.. అద్భుతమైన నిజం.. లాక్డౌన్ సమయంలో చెన్నైకి చెందిన లయ మతిక్షర తన సోదరి దగ్గర సరదాగా పైథాన్ లాంటి ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ నేర్చుకుంది. అలా రకరకాల సైట్లు చూస్తూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ తన ఆర్ట్ను మెరుగు పరుచుకునే క్రమంలో ‘ఎన్ఎఫ్టీ’ గురించి విన్నది. ఒక ప్రయత్నం చేసి చూద్దామని రంగంలోకి దిగింది. తన ఫస్ట్ ఎన్ఎఫ్టీ ‘వాట్ ఇఫ్, మూన్ హ్యాడ్ లైఫ్?’ యానిమేటెడ్ ఆర్ట్వర్క్ మంచి ధరకు అమ్ముడు పోయింది. ‘మా పేరెంట్స్కు ఎన్ఎఫ్టీపై పెద్దగా నమ్మకం లేదు. మొదట్లో నాకు కూడా అంతే. మొదటి ఎన్ఎఫ్టీకీ మంచి ఆదరణ లభించడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది’ అంటుంది లయ. అంతరిక్షం, భౌతికశాస్త్రం తదితర రంగాలకు చెందిన ఆర్ట్లతో లక్షల్లో ఆర్జిస్తోంది. వీళ్లు కూడా సక్సెస్ కొట్టారు.. సౌత్లో రజనీకాంత్కు ఉన్న క్రేజ్ ఇంతా అంతా కాదు కదా. ఈ క్రేజ్ను ‘ఎన్ఎఫ్టీ’లోకి మళ్లించి సక్సెస్ కొట్టారు చెన్నై టీన్స్ షామిల్ కరీమ్, యశ్ రాథోడ్లు. రజనీకాంత్ డైలాగ్స్, కబాలీ సినిమాలో ఆయన సూట్, ఏఆర్ రెహమాన్ పాటలను ‘ఎన్ఎఫ్టీ’లోకి తీసుకువచ్చి హిట్ కొట్టారు. అంతేకాదు...‘డిజినూర్’ అనే ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్ మొదలుపెట్టి ఏవీయం ప్రొడక్షన్, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి అగ్రగామి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే స్థాయికి ఎదిగారు. చండీగఢ్లో ఆమె సైతం.. ఇప్పుడు చెన్నై నుంచి చండీగఢ్కు వద్దాం... అడపాదడపా పెయింటింగ్స్ వేసే స్వర్ణాళిసింగ్కు ఎన్ఎఫ్టీపై ఆసక్తి పెరిగిన తరువాత క్రిస్టో–కమ్యూనిటీల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. తన మార్క్ ప్రతిబింబించేలా సగటు భారతీయ గృహిణి చిత్రాలను ఎన్ఎఫ్టీలోకి తీసుకువచ్చింది. పెద్దగా ప్రమోట్ చేయకపోయినా సింగ్ ‘దుర్గాదేవి’ ఎన్ఎఫ్టీకి బాగా గుర్తింపు వచ్చింది, నిజంగానే కాసులు కురిపిస్తాయా? చిత్రాలు సరే, సెల్ఫీలు సైతం ఎన్ఎఫ్టీలుగా మారి లక్షలు కురిపిస్తాయా? ఇండోనేసియాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల గుస్తాఫ్ అల్ ఘోజాలి దగ్గరకు వెళితే ‘అవును. నిజమే’ అనక తప్పదు. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ అయిన ఘోజాలికి రోజుకు ఒక సెల్ఫీ తీసుకోవడం అలవాటు. ఒక ఎన్ఎఫ్టీ వెబ్సైట్లో ‘ఘోజాలి ఎవ్రీడే’ పేరుతో 933 సెల్ఫీలను అమ్మకానికి పెట్టాడు. ‘ఘోజాలి సెల్ఫీని ఎన్ఎఫ్టీగా కొన్నాను’ అని ఒక ప్రముఖుడు ట్విట్ చేశాడో లేదో అతడి సెల్ఫీలకు మహర్దశ పట్టుకుంది. అలా ఒకటి కాదు... రెండు కాదు ఎథెర్ (బిట్కాయిన్ లాంటిది)ల రూపంలో ఏడు కోట్లు సంపాదించాడు. ‘తమదైన సిగ్నేచర్ స్టైల్ను ఏర్పాటు చేసుకుంటే ఎన్ఎఫ్టీలో విజయం సులభం అవుతుంది’ అంటోంది యాక్టర్, డిజైనర్, ఆర్టిస్ట్ లేఖ వాషింగ్టన్. ఇంతకీ ఎన్ఎఫ్టీ అంటే? నాన్ ఫంజిబుల్ టోకెన్స్. వాస్తవిక ప్రపంచానికి చెందిన ఆర్ట్, మ్యూజిక్, వీడియో... మొదలైన వాటికి ప్రాతినిధ్యం వహించే డిజిటల్ ఆస్తి. వీటి అమ్మకాలు, కొనుగోళ్ల కోసం వజీర్ ఎక్స్, కళమింట్, ఓపెన్ సీలాంటి మార్కెట్ప్లేస్లు ఉన్నాయి. చదవండి: తొడలు, నడము, పొట్ట వంటి భాగాల్లో కొవ్వు సులభంగా తగ్గించుకోవచ్చు.. ఈ డివైజ్ ధర 9 వేలు View this post on Instagram A post shared by Laya Mathikshara (@laya_mathikshara) View this post on Instagram A post shared by Laya Mathikshara (@laya_mathikshara) View this post on Instagram A post shared by Laya Mathikshara (@laya_mathikshara) -
మా నాన్న గెలిచే వరకు నో మ్యారేజ్.. రబియా ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, చంఢీగడ్: పంజాబ్ కాంగ్రెస్లో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ ఎన్నికల్లో సీఎం స్థానం కోసం పోటీ పడి పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ భంగపాటుకు గురయ్యారు. తీవ్ర ఉత్కంఠ మధ్య చరణ్జిత్ సింగ్ చన్నీనే సీఎం క్యాండిడేట్ గా పార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చన్నీ, సిద్దూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చదవండి: వందేళ్ల పార్టీ.. చివరి అస్త్రంగా ఆత్మగౌరవ నినాదం! ఇదిలా ఉండగా శుక్రవారం అమత్ సర్(ఈస్ట్)లో ప్రచారంలో పాల్గొన్న సిద్దూ కూతురు రబియా సిద్దూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన తండ్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోబోనని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం అభ్యర్థి చన్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చన్నీ అవినీతికి పాల్పడ్డారంటూ.. ఆయన బ్యాంకు ఖాతాను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బ్యాంకు అకౌంట్లో రూ.133 కోట్లు ఉన్నాయని ఆమె ఆరోపించారు. నిజంగా చన్నీ పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే ఆయన ఖాతాలోకి అంత డబ్బు ఎలా వచ్చిందని ఆరోపించారు. తన తండ్రి సిద్దూ 14 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారని తెలిపారు. పంజాబ్ను న్యూ మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడంలో సిద్దూ పాత్ర ప్రముఖంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో సిద్దూ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
పంజాబ్లో ఫన్నీ ఛాలెంజ్లు
చండీగఢ్: పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల మధ్య, వ్యక్తుల మధ్య సవాళ్లు ఎక్కువయ్యాయి. అయితే వీటిలో అన్నీ సీరియస్ ఛాలెంజులు కాదు. ‘దమ్ముంటే ఒక్క సీటులో పోటీ చెయ్యి, సత్తా ఉంటే 30 నిమిషాలు ఆగకుండా బ్యాడ్మెంటెన్ ఆడు..’ లాంటి కాలక్షేపం సవాళ్లు కూడా ఉన్నాయి. కేవలం చిన్నా చితకా అభ్యర్ధులే సవాళ్లు విసురుకుంటున్నారనుకుంటే పొరపాటే! సీఎం చన్నీ, పీఎల్సీ నేత అమరీందర్, పీసీసీ చీఫ్ సిద్ధూ లాంటి వాళ్లు కూడా జోరుగా ఛాలెంజులు చేస్తున్నారు. చన్నీ రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, సిద్ధూను ఎదుర్కొనేందుకు ఎస్ఏడీ నేత మజితియా సిద్ధపడడంతో ఈ ఛాలెంజుల వేడి పెరిగింది. చన్నీ రెండు సీట్లలో పోటీ చేయడంపై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ, చన్నీ తప్పకుండా చమకూర్ సాహెబ్ సీటు ఓడిపోతారన్నారు. దీనిపై వెంటనే చన్నీ స్పందించి తనకు వ్యతిరేకంగా పంజాబ్లోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయాలని కేజ్రీవాల్కు సవాలు విసిరారు. అదే కోవలో పాటియాల సీటు వదిలి తనపై అమృతసర్ తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయాలని అమరీందర్ సింగ్ను నవ్జోత్సింగ్ సిద్ధూ ఛాలెంజ్ చేశారు. అంతటితో ఆగకుండా అమరీందర్ ఆపకుండా 30 నిమిషాలు బ్యాడ్మెంటెన్ ఆడితే తాను రాజకీయాలు వదిలేస్తానని ఎద్దేవా చేశారు. అలాగే తనపై పోటీకి దిగిన ఎస్ఏడీ నేత మజితియా కేవలం తనపై మాత్రమే పోటీ చేయాలని, మజితా నియోజకవర్గం వదిలిపెట్టాల ని సిద్ధూ సవాల్ చేశారు. దీన్ని మజితియా అంగీకరించి అమృత్సర్ సీటుకే పరిమితమయ్యారు. -
రెండేళ్లుగా మహిళతో సహజీవనం...ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురిని బలవంతంగా...
చండీగఢ్: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు నేరాలకు దారి తీస్తున్నాయి. అందులోని కొన్ని ఘటనలైతే కూతురు వరసయ్యే వాళ్ల మీద కూడా లైంగైక దాడులు పాల్పడుతున్నారు కొందరు కామందులు. తాజాగా ఇటువంటి ఘటనే చండీగఢ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ తన భర్తని ఆరేళ్ల క్రితం విడిచిపెట్టి ఒంటరిగా తన కూతురితో జీవనం గడుపుతోంది. రెండేళ్ల క్రితం ఆమెకు డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు అది కాస్త వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. దీంతో ఆ మహిళ డ్రైవర్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. కొన్ని నెలల క్రితం, అతను డ్రైవర్ ఉద్యోగం కోల్పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆ మహిళపై కూతురిపై కన్నేసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఈ దారుణాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో మహిళ అతన్ని నిలదీయగా ఆమెతో ఘర్షణకు దిగి పారి పోయాడు. మహిళా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ఆటో డ్రైవర్ అకృత్యం.. బస్టాప్లో దింపుతానని చెప్పి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి
చండీగఢ్: మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆడవారికి ఆడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. అండగా నిలవాల్సిన వారే బాధ్యత మరిచి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా బస్టాప్లో దించుతానని చెప్పి నమ్మించి యువతిపై ఆటో డ్రైవర్ తన ఆటోలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన చండీగఢ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన యువతి ఒకరిని కలిసిందేకు చండీగఢ్కు వచ్చింది. అయితే వారు సమాయానికి అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఢిల్లీకి వెళ్లాలనుకుంది. వెంటనే చండీగఢ్ రైల్వే స్టేషన్కు వెళ్లింది. అక్కడ ట్రైన్ అందుబాటులో లేకపోవడంతో బస్ ద్వారా ఢిల్లీకి చేరుకోవాలనుకుంది. దీంతో రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్వరకు ఆటోను అద్దెకు తీసుకుంది. చదవండి: వివాహేతర సంబంధం: ఫోన్కాల్ ద్వారా పరిచయం.. అర్థరాత్రి సమయంలో అయితే యువతిపై కన్నేసిన ఆటో డ్రైవర్ ఆమెను బస్టాండ్కు తీసుకెళ్లకుండా ఛండీగఢ్ సివిల్ సెక్రటేరియట్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ యువతిపై ఆటోలో అత్యాచారానికి ఒడిగట్టాడు. అంతేగాక ఆమెపై దాడి చేసి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం బాధితురాలి అరుపులు విన్న సివిల్ సెక్రటేరియట్ నైట్ గార్డ్ 112 హెల్ప్లైన్ నెంబర్కు కాల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జైదేవ్ అలియాస్ ఉపేందర్ను పోలీసులు అరెస్టు చేశారు. చండీగఢ్ రైల్వే స్టేషన్ సమీపంలోని దర్వా ప్రాంతంలో నివసిస్తున్న నిందితుడికి ఇటీవలే వివాహం అయినట్లు పోలీసులు తెలిపారు. -
చక్రం తిప్పిన బీజేపీ.. రెండో స్థానంలో నిలిచినా చండీగఢ్ మేయర్ పీఠం కైవసం
చండీగఢ్: చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సీటును అనూహ్యంగా బీజేపీ కైవసం చేసుకుంది. 35 వార్డులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలో దిగినా అత్యధికంగా 14 చోట్ల పార్టీ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ 12 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా, శిరోమణి అకాలీదళ్ కేవలం ఒకే ఒక్క చోట గెలిచిన విషయం తెల్సిందే. చదవండి: సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు న్యాయమూర్తులకు పాజిటీవ్ కాగా, మేయర్ స్థానం కోసం శనివారం జరిగిన ఓటింగ్ రసవత్తరంగా సాగింది. ఓటింగ్ సమయంలో ఒక శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్, ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో 35 సీట్లున్న నగర కార్పొరేషన్లో మేయర్ స్థానానికి జరిగిన ఓటింగ్లో సాధారణ మెజారిటీ 14కు పడిపోయింది. చండీగఢ్ ఎంపీ.. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్–అఫీషియో సభ్యుడి హోదాలో ఓటింగ్లో పాల్గొని బీజేపీకి మద్దతిచ్చారు. ఫలితాలు రాగానే ఒక కాంగ్రెస్ సభ్యుడు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆప్, బీజేపీ చెరో 14 మంది సభ్యులతో సమంగా నిల్చాయి. అయితే, శనివారం మేయర్ ఎన్నికలో ఒక ఆప్ సభ్యుని ఓటు చెల్లదని తేల్చడంతో మేయర్ పీఠం బీజేపీ వశమైంది. మహిళా కౌన్సిలర్ సరబ్జిత్ కౌర్ ధిల్లాన్ మేయర్గా గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని ఆప్ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్లు కావాలనే గైర్హాజరై బీజేపీకి పరోక్ష మద్దతిచ్చారని ఆప్ ఆరోపించింది. -
సోనూసూద్ కీలక నిర్ణయం.. పంజాబ్ స్టేట్ ఐకాన్కి గుడ్బై
చంఢిఘర్: బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా వైరస్, లాక్డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులు, కూలీలకు సాయం అందిచిన విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా సీరియస్గా ఉన్న పేషెంట్లకు వైద్య సదుపాయాలు అందించి పలువురి ప్రాణాలును కాపాడారు. అయితే ఆయన తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’గా ఉండబోనని సోనూసూద్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. పంజాబ్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం గతేడాది సోనూసూద్ను ‘స్టేట్ ఐకాన్’గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన సోదరి మాళవిక సూద్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్టేట్ ఐకాన్ హోదా నుంచి తప్పుకున్నారు. Like all good things, this journey has come to an end too.I've voluntarily stepped down as the State Icon of Punjab.This decision was mutually taken by me and EC in light of my family member contesting in Punjab Assembly Elections. I wish them luck for future endeavours.🇮🇳 — sonu sood (@SonuSood) January 7, 2022 ‘స్టేట్ ఐకాన్గా నా ప్రయాణాన్ని ముగిస్తున్నా. స్వచ్ఛందంగా తాను ‘స్టేట్ ఐకాన్’ పదవి నుంచి వైదొలుగుతున్నా. ఎన్నికల సంఘంతో చర్చించి సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నా. నా సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు’ అని సోనూ ట్విటర్లో పేర్కొన్నారు. నవంబర్లో ఆయన సోదరి మాళవిక సూద్ పంజాబ్ అసెంబ్లీలో పోటీ చేయనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఏ పార్టీ నుంచి ఆమె పోటీ చేస్తారన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. అనంతరం పంజాబ్ సీఎం చరణ్జిత్ చన్నీతో కూడా భేటీ అయ్యారు. అయితే ఆయన సోదరి కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్నారని వార్తలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీలో ‘దేశ్ కా మెంటర్స్’ అనే విద్యార్థుల సంబంధించిన ఓ కార్యక్రమానికి సోనూసూద్ను సీఎం కేజ్రీవాల్ అంబాసిడర్గా ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఆరు రోజుల్లోనే ఘర్ వాపసీ
చండీగఢ్: కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన ఆరురోజుల్లోనే ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడీ మనసు మార్చుకున్నారు. తిరిగి సొంతగూటికి చేరారు. శ్రీ హరగోవింద్పూర్ ఎమ్మెల్యే అయిన బల్వీందర్ గత ఏడాది డిసెంబరు 28న కాషాయతీర్థం పుచ్చుకున్నారు. తెరవెనుక ఏం జరిగిందో తెలియదుగానీ జనవరి 2న తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. -
చండీగఢ్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురు
చండీగఢ్: ప్రతిష్టాత్మకమైన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతిపెద్ద పార్టీగా అవతరించింది. 35 స్థానాలకు గాను 14 చోట్ల నెగ్గింది. పంజాబ్, హరియాణాల ఉమ్మడి రాజధాని, కేంద్ర పాలితప్రాంతమైన చండీగఢ్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ బరిలోకి దిగిన మొదటిసారే తమ సత్తా చాటుకుంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 12 వార్డుల్లో గెలిచి రెండోస్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ఎనిమిది స్థానాలు నెగ్గగా... శిరోమణి అకాలీదళ్ ఒకచోట గెలుపొందింది. చిత్రమేమింటే... 8 సీట్లు నెగ్గి మూడోస్థానంలో నిలిచిన కాంగ్రెస్కు అన్ని పార్టీలకంటే ఎక్కువగా 29.79 శాతం ఓట్లు పోలయ్యాయి. గతంలో 26 వార్డులుండగా (బీజేపీ 20, కాంగ్రెస్ 4, శిరోమణి అకాలీదళ్ 1) ప్రస్తుతం వాటి సంఖ్య 35కు పెరిగింది. శుక్రవారం ఎన్నికలు జరగగా... సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుత చండీగఢ్ మేయర్ రవికాంత్ శర్మ 17వ వార్డులో ఆప్ అభ్యర్థి దమన్ప్రీత్ సింగ్ చేతిలో 828 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మేయర్ పదవిని చేపట్టాలంటే సాధారణ మెజారిటీ.. 18 స్థానాలు కావాలి. పంజాబ్లో వచ్చే ఫిబ్రవరి– మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందువల్ల కాంగ్రెస్, అకాలీదళ్లు ఆప్కు మద్దతు ఇచ్చే అవకాశాలు స్వల్పం. 12 స్థానాలు నెగ్గిన బీజేపీ ఓటమిని అంగీకరించి... మేయర్ పదవికి పోటీకి దూరంగా ఉంటుందా? లేక ఇతర పార్టీల కార్పొరేటర్లకు వలవేసి మళ్లీ అధికారపీఠాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తుందా? అనేది చూడాలి. పంజాబ్లో మార్పుకు సంకేతం: కేజ్రీవాల్ చండీగఢ్ కార్పొరేషన్ ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే పంజాబ్లో రాబోయే మార్పుకు సంకేతమని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చండీగఢ్ వాసులు నీతివంతమైన పాలనకు పట్టం కట్టారని, ప్రత్యర్థి పార్టీల అవినీతిమయమైన రాజకీయాలను తిరస్కరించారని పేర్కొన్నారు. ఆప్ కార్యకర్తలకు, విజేతలకు అభినందనలు తెలిపారు. ఆప్ పంజాబ్ వ్యవహారాల ఉపబాధ్యుడు రాఘవ్ చద్దా (ఢిల్లీ ఎమ్మెల్యే) స్పందిస్తూ.. ‘పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’ అని వ్యాఖ్యానించారు. -
ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు!
అవరోధాలు, ఆటంకాలు, అడ్డుగోడలు ఎన్ని ఎదురైనా మనలో ప్రతిభ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కాస్త ఆలస్యమైనా చివరికి నిర్దేశించుకున్న గమ్యాన్ని చేరుకుంటాం. అనుకున్న దానిని సాధించేందుకు పట్టుదలతో పాటు ఆత్మస్థైర్యం ఉండాలని నిరూపించి, ఉదాహరణగా నిలుస్తోంది పదిహేడేళ్ల ఖుషీ శర్మ. ఒక పక్క చదువు, మరోపక్క ఆటల్లో రాణిస్తూనే పాఠకులు మెచ్చే నవలను రాసి, టీన్ ఆథర్గా ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. చండీగఢ్కు చెందిన ఖుషీ శర్మ ఇంటర్మీడియట్ విద్యార్థి. జాతీయ స్థాయి స్క్వాష్ పోటీల్లో పాల్గొని రెండుసార్లు పతకాలను సాధించింది. పియానో బాగా ప్లే చేస్తుంది. కథక్ డ్యాన్సర్. అనేక స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు ఏది అనిపించినా వెంటనే నోట్ చేసుకునే అలవాటు ఉన్న ఖుషీ..ఏకంగా సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ నవలను రాసింది.‘ద మిస్సింగ్ ప్రాఫెసీ– రైజ్ ఆఫ్ ద బ్లూ ఫోనిక్స్’ పేరిట నవలను విడుదల చేసింది. బుక్ విడుదలైన నెలరోజుల్లోనే వెయ్యికాపీలు అమ్ముడవడమేగాక, అమేజాన్ ట్రెండింగ్ బుక్ జాబితాలో టాప్ప్లేస్లో దూసుకుపోతోంది ఖుషి నవల. ఇంత చిన్నవయసులో థ్రిల్లింగ్ నవలను రాసి పాఠకుల మనసులు దోచుకుంటోంది ఈ టీనేజర్. కరోనా సమయంలో వైరస్కు సంబంధించిన అనేక విషయాలపై పరిశోధిస్తూ, అందుకు సంబంధించిన సమాచారాన్ని తను నడుపుతోన్న ‘బ్లాగ్ విత్ ఖుషి’లో పోస్ట్ చేస్తుండేది. ఇలా అనేక విషయాలమీద అవగాహన ఏర్పర్చుకున్న ఖుషి తనకు వచ్చే వినూత్న ఆలోచనలను పుస్తకంలో రాసి దాన్ని నవలగా తీర్చిదిద్దింది. ఈ నవలలో అంబర్ హార్ట్ అనే హీరోయిన్ ఉంటుంది. ఈమె మూడొందల ఏళ్లకోసారి ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే దుష్టశక్తులతో పోరాడుతుంటుంది. దీనిలో అడుగడుగునా సాహసాలు, సైన్స్, పర్యావరణానికి సంబంధించిన అనేక అంశాలను ఉత్కంఠ భరితంగా కథలో వర్ణించింది ఖుషి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకట్టుకునే అంశాలు దీనిలో ఉన్నాయి. ఇంత చిన్నవయసులో ఎంతో అనుభవం ఉన్న రచయితలా ఖుషి నవలను రాయడం విశేషం. ఇంతమందికి నచ్చుతుందనుకోలేదు! ‘‘చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టమేగానీ, నా నవల పాఠకులకు నచ్చుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా రాకముందు పదోతరగతి పరీక్షలు, మరోపక్క స్క్వాష్లో బిజీగా ఉండేదాన్ని. కరోనా లాక్డౌన్తో అన్నీ బంద్ అయిపోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఈ సమయంలో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. ఇలా రాస్తుండగా... ‘వన్ కంట్రోల్స్ ఫైర్, ద అదర్ కంట్రోల్స్ సోల్, టు సేవ్ ది వరల్డ్, ఈచ్ మస్ట్ ప్లే దెయిర్ రోల్’ కవిత తట్టింది. దీని ఆధారంగా పదిహేడు చాప్టర్ల వరకు రాశాను. అయితే మధ్యలో నా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయి. ఖాళీ సమయం దొరకడంతో అక్కను విసిగిస్తున్నానని చెప్పి ‘నువ్వు రాస్తున్న బుక్ను రెండురోజుల్లో’ పూర్తిచేయగలవా? అని ఇంట్లో వాళ్లు డెడ్లైన్ పెట్టారు. దీంతో కొన్ని రోజుల్లో తొమ్మిదివేల పదాలు రాశాను. అలా రాస్తూ 75000 పదాలతో ఏకంగా ఈ నవలను రాయగలిగాను’’ అని ఖుషి చెప్పింది. -
కొన్ని రోజులు కలిసుంటే సహజీవనం కాదు!
చండీగఢ్: ఇద్దరు వయోజనులు కొన్ని రోజులు కలిసి జీవించి, తాము సహజీవనం చేస్తున్నామని ప్రకటించుకోవడం నిజమైన సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్) కిందకు రాదని పంజాబ్, హర్యానా హైకోర్టు అభిప్రాయపడింది. కలిసి జీవించే కాలం, ఈ కాలంలో ఇరువురు నెరవేర్చిన బాధ్యతలు, ఒకరికొకరు చేసుకున్న సాయం తదితర అనేక అంశాలను బట్టి సహజీవనాన్ని గుర్తించాల్సిఉంటుందని జస్టిస్ మనోజ్ బజాజ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా స్త్రీ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఒక జంట పెట్టుకున్న అభ్యర్ధనను కొట్టివేసింది. దీంతో పాటు సదరు జంటకు రూ. 25వేల జరిమానా విధించింది. చదవండి: ఎమ్మెల్యే ‘అత్యాచార’ కామెంట్లు.. తీవ్ర దుమారం -
Kirron Kher: గ్రేట్ కమ్ బ్యాక్ గెలుపు కిరణం.. ‘ఆమె ఫైటర్. అంతే’!
Kirron Kher, Battling Cancer, Returns To India's Got Talent Set As A Judge: కిరణ్ ఠాకూర్ సింగ్ సందు ఎవరు? అంటే జవాబు చెప్పడానికి తటపటాయిస్తారుగానీ, ‘కిరణ్ ఖేర్’ అనే పేరు మాత్రం సుపరిచితం. నాటకరంగం, టెలివిజన్, సినిమా రంగాలలో తనదైన ప్రతిభ చాటుకున్న నటి. శ్యామ్ బెనగల్ ‘సర్దారీ బేగమ్’లో ఆమె నటన గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మరోవైపు రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె చంఢీగఢ్ పార్లమెంట్ సభ్యురాలు. కొన్ని నెలల క్రితం ఆమెకు క్యాన్సర్ అనే విషయం ప్రకటితమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతో బాధపడ్డారు. సోషల్ మీడియాలో సానుభూతి మాటలు వెల్లువెత్తాయి. కిరణ్ఖేర్ చికిత్స కోసం వెళ్లే ముందు తనయుడు సికిందర్ ఖేర్ ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేశాడు. అందులో ఆమె ఎప్పటిలాగే ఉన్నారు. అదే చిరునవ్వు. ‘కెమెరాను కాస్త నా ముందుకు తీసుకురా’ అన్నారు. అలాగే చేశాడు. అప్పుడు... స్నేహితులు, అభిమానులు, బంధువులు, సన్నిహితులను ఉద్దేశించి కిరణ్ ఖేర్ ఇలా అన్నారు... ‘హలో! థాంక్యూ ఎవ్రీబడీ ఫర్ యువర్ గుడ్ విషెస్ అండ్ లవ్’ ఎప్పటిలాగే చీర్ఫుల్ వాయిస్! చికిత్స జరుగుతున్న సమయంలో తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకునేవారు కిరణ్. హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా సమస్యల్లో ఉన్నవారికి అండగా ఉండేవారు. ఫోన్ ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కరించారు. చండీగఢ్లో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించాలనేది ఆమె కల. తన అనారోగ్యం ఆ కలను ఆపలేకపోయింది. ఎప్పటికప్పడు, ఎవరితోనో ఒకరితో ఈ ప్లాంట్ గురించి మాట్లాడుతూనే ఉండేవారు. పని వేగం పుంజుకోవడానికి ప్రయత్నించేవారు. ఎట్టకేలకు ఆమె కల ఫలించింది. ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి చండీగఢ్కు వెళ్లాలనేది ఆమె బలమైన కోరిక. అయితే ఆరోగ్యజాగ్రత్తల రీత్యా వైద్యులు నిరాకరించారు. ప్రస్తుతం థెరపీ కోసం నెలకు ఒకసారి హాస్పిటల్కు వెళ్లాలి. ‘ఎప్పటిలాగే చురుగ్గా ఉన్నారు’ అని చాలామంది ఇచ్చే ప్రశంసలకు ఆమె ఇచ్చే సమాధానం... ‘పనే నా బలం. పనే నా ఆరోగ్యం. పనే నా ఉత్సాహం’ పని లేకుండా తనను తాను ఊహించుకోలేని కిరణ్ మళ్లీ పనిలోకి దిగారు. రియాల్టీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ సెట్లోకి రావడం తొలి అడుగుగా చెప్పాలి. ఈ షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జడ్జిగా ఆమె ప్రతిభను గురించి సెట్లో ఉన్న శిల్పాషెట్టిలాంటివారు గొప్పగా మాట్లాడారు. ఆ ప్రశంసల మాధుర్యాన్ని కిరణ్ ఆస్వాదించారో లేదో తెలియదుగానీ, ఆరోజు తాను ధరించిన నగలపైన తానే జోక్ వేసి అక్కడ ఉన్నవారిని గట్టిగా నవ్వించారు. వారితో పాటు తాను కూడా గొంతు కలిపారు. దురదృష్టమా మళ్లీ రాకు... ఆ నవ్వుల్లో ఎంతబలం ఉందో చూశావు కదా! కిరణ్ చికిత్సకు వెళుతున్న రోజు భర్త అనుపమ్ ఖేర్ కళ్లలో ఎన్ని కన్నీటి సముద్రాలు ఉన్నాయో తెలియదుగానీ... వాటిని దాచుకొని ఆరోజు ధైర్యంగా అన్నాడు... ‘ఆమె ఫైటర్. అంతే’ అతడి ఆత్మవిశ్వాసం వృథా పోలేదు అని కిరణ్జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! కిరణ్జీ ఆత్మబలం చాలా బలంగా చెప్పింది! View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) -
ప్రతి మహిళకు నెలకు రూ.వేయి ఇస్తాం.. సీఎం ప్రకటన
చంఢీఘర్: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీపై విమర్శలు గుప్పించారు. ఆయన పంజాబ్లోని మోగా జిల్లాలో మాట్లాడుతూ.. పంజాబ్ ఎన్నికలకు సంబంధించి ఆప్ ఇచ్చిన హామీలను చరణ్జిత్ కాపీ కొట్టారని మండిపడ్డారు. ‘మీ చుట్టు ఓ నకిలీ వ్యక్తి తిరుగుతున్నాడు. నేను పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను రెండు రోజుల తర్వాత.. వాటినే తమ పార్టీ హామీలను సీఎం చరణ్జిత్ ప్రకటించారు. ఏ హామీలను తీర్చలేడు.. ఆయనో నకిలీ వ్యక్తి’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. పంజాబ్లోని 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు వేయి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. ఇది ప్రపంచంలోని చాలా పెద్ద పథకమని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు అడగకుండా మహిళలు అర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పథకం ప్రజయోజనం కలిగిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. -
చిరకాల ప్రేయసిని పెళ్లాడిన బాలీవుడ్ నటుడు.. ఫోటోలు వైరల్
Rajkummar Rao Marries Patralekhaa in Chandigarh: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు తన చిరకాల ప్రేయసి పత్రలేఖ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా పత్రలేఖతో రాజ్ కుమార్ నవంబర్ 15న(సోమవారం) ఏడడుగులు వేశారు. వీరి వివాహ వేడుకకు చండీగఢ్ వేదికగా మారింది. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను రాజ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారాయి. చదవండి: Samantha: పుకార్లే నిజమయ్యాయి.. సమంతకు ఫస్ట్ టైమ్ ఇది రాజ్ కుమార్.. పత్రలేఖ నుదుటున కుంకుమ దిద్దుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘11 సంవత్సరాల ప్రేమ, స్నేహం, వినోదం తరువాత చివరికి ఈరోజు నా సర్వస్వం, నా సోల్మెట్, బెస్ట్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకన్నాను. నా సోల్మెట్, బెస్ట్ ఫ్రెండ్. ఈ రోజు పత్రలేఖ నుంచి భర్తగా పిలిపించుకోవడంకంటే గొప్ప ఆనందం మరొకటి లేదు’ అనే క్యాషన్ ఇచ్చాడు. ఈ ఫోటోలనలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కాగా కాగా రాజ్ కుమార్ రావు, ప్రతలేఖ దాదాపు పదేళ్లకు పైగా ప్రేమించుకున్నారు. నేడు పెళ్లితో ఒకటయ్యారు. చదవండి: ఊర'నాటు' స్టెప్పులేసిన బిగ్బాస్ కంటెస్టెంట్లు నూతన జంటకు బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రియాంక చోప్రా, తాప్సీ, ఆయుష్మాన్ ఖురానా వంటి నటులు ‘మీ జంట చూడముచ్చటగా ఉంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) View this post on Instagram A post shared by 🌸 Patralekhaa 🌸 (@patralekhaa) -
petrol prices: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.10 తగ్గింపు
ఛండిఘర్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నవేళ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరలపై ప్రభుత్వం భారీ అదనపు తగ్గింపును ప్రకటించింది. లీటర్ పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.5 తగ్గిస్తున్నట్లు సీఎం చరణ్జిత్ చన్నీ ఆదివారం ప్రకటించారు. గత 70 ఏళ్లలో చమురు ధరలు ఇంతస్థాయిలో తగ్గించడం ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. చదవండి: Money Laundering Case: ఈడీ కస్టడికీ అనిల్ దేశ్ముఖ్ ఢిల్లీతో పోల్చుకుంటే ప్రస్తుతం పంజాబ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.9 తక్కువగా లభిస్తుందని అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా లీటర్ పెట్రోల్పై రూ.10, డీజిల్పై రూ.5 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు చమురు ధరలపై వ్యాట్ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. -
పంజాబ్ కాంగ్రెస్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక నిర్ణయం
చంఢిఘర్: పంజాబ్ రాష్ట్ర పీసీపీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఆయన సెప్టెంబర్ 28న పంజాబ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్లో పలు కీలక పరిణామాలు చేటు చేసుకున్నాయి. తాజాగా సిద్ధూ శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన పీసీసీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. చదవండి: జమ్మూ కశ్మీర్: ఆస్పత్రిలోకి చొరబడి ఉగ్రదాడి తాను తీసుకున్న నిర్ణయం వ్యక్తిగతమైంది కాదని, మళ్లీ పీసీసీ అధ్యక్ష పదని చేపడతానని పేర్కొన్నారు. కొత్త అడ్వకేట్ జనరల్(ఏజీ), డీజీపీ నియామకం త్వరలో జరగనుందని సిద్ధూ తెలిపారు. -
హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్ తీపికబురు
చండీగఢ్: హరియాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ రాష్ట్రంలోని.. వివిధ జైళ్లలో శిక్షలను అనుభవిస్తున్నవారికి తీపికబురు అందించారు. ఇప్పటికే.. జైళ్లలో లేదా పెరోల్పై ఉన్న సుమారు 250 మంది నిందితులకు క్షమాభిక్ష ఇస్తున్నట్లు ప్రకటించారు. శిక్షాకాలంలో 6 నెలలు, అంతకన్నా తక్కువ కాలం ఉన్న నిందితులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే, క్రూరమైన నేరాలకు పాల్పడి శిక్షలు అనుభవిస్తున్న వారికి మాత్రం ఇది వర్తించదని సీఎం మనోహర్లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. చదవండి: బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం Haryana CM ML Khattar announces pardoning of sentences of 250 prisoners lodged in different jails of the state or currently on parole, who have a duration of 6 months or less remaining in their sentence. This will not be applicable to convicts of heinous crimes. pic.twitter.com/BpJQS3Ymmc — ANI (@ANI) November 1, 2021 -
శాంతించిన సిద్ధూ..!
న్యూఢిల్లీ/చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఆయన గురువారం చండీగఢ్లోని పంజాబ్ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీతో భేటీ అయ్యారు. పంజాబ్లో డీజీపీ, అడ్వొకేట్ జనరల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే ఒక సమన్వయ కమిటీని(కో–ఆరి్డనేషన్ ప్యానెల్) ఏర్పాటు చేసుకోవాలని ఇరువురూ నిర్ణయానికొచి్చనట్లు తెలిసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతోపాటు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా తొలుత కమిటీలో చర్చిస్తారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇద్దరు నేతల మధ్య 2 గంటలపాటు భేటీ జరిగింది. భేటీ తర్వాత చన్నీ, సిద్ధూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అతిత్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం అతిత్వరలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం చెప్పారు. పార్టీలో ఇటీవలి కాలంలో లుకలుకలు, అసంతృప్త గళాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి సీడబ్ల్యూసీ భేటీ తక్షణమే నిర్వహించాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్లో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సమావేశంపై అధినేత సోనియా గాంధీ ఇటీవలే సంకేతాలిచ్చారని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. సీనియర్ నేత కపిల్ సిబల్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మరోవైపు, పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అస్థిరత సృష్టిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గురువారం ఆరోపించారు. -
పంజాబ్ లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
-
కాంగ్రెస్కు సిద్ధూ షాక్
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఐదు నెలలే గడువు ఉండగా రాష్ట్ర కాంగ్రెస్లో తాజాగా మరో రాజకీయ సంక్షోభం నెలకొంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా నియమితులై మూడు నెలలు తిరక్కుండానే నవజోత్ సింగ్ సిద్ధూ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖను పంపించారు. ముఖ్యమంత్రిని మార్చడం ద్వారా పంజాబ్ తలనొప్పి వదలిపోయిందని ఊపిరి తీసుకున్న అధిష్టానానికి సిద్ధూ రాజీనామా గట్టి షాక్నిచ్చింది. ‘రాజీపడటం మొదలైతే వ్యక్తిత్వాన్ని కోల్పోతాం. పంజాబ్ రాష్ట్ర సంక్షేమం, భవిష్యత్ విషయంలో నేను ఎన్నటికీ రాజీపడను. అందుకే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీకి సేవలందిస్తాను’ అని సోనియాకు రాసిన రాజీనామా లేఖను మంగళవారం సోషల్ మీడియాలో సిద్ధూ షేర్ చేశారు. సిద్ధూ రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు మద్దతుగా చన్నీ కేబినెట్లో మంత్రి పదవి పొందిన రజియా సుల్తానా రాజీనామా చేశారు. సిద్ధూకి సంఘీభావంగాS రాజీనామా చేస్తున్నట్టుగా సీఎంకు పంపిన లేఖలో ఆమె పేర్కొన్నారు. అమరీందర్ సింగ్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపే వరకు నిత్య అసమ్మతివాదిగా కెప్టెన్పై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్న సిద్ధూ పీసీసీ అధ్యక్షుడయ్యాక సూపర్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా పీసీసీ పదవికే రాజీనామా చేసి కాంగ్రెస్ అధిష్టానంపై గుగ్లీ విసిరారు. అన్నీ సర్దుకుంటాయి: కాంగ్రెస్: సిద్ధూ రాజీనామా విషయంలో కాంగ్రెస్ వేచిచూసే ధోరణిని అవలంభిస్తోంది. రాజీనామాను ‘భావోద్వేగ స్పందన’గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభివర్ణించారు. అన్నీ సర్దుకుంటాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ అంశంపై పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారని, సిద్ధూను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ... సిద్ధూతో మాట్లాడతారని, రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరతారని చెప్పాయి. ఎందుకీ నిర్ణయం ? పంజాబ్ కేబినెట్ విస్తరణ జరిగిన రెండు రోజులకే సిద్ధూ పీసీసీ చీఫ్గా రాజీనామా చేయడంతో రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమరీందర్సింగ్ స్థానంలో సిద్ధూకి సన్నిహితుడైన దళిత నాయకుడు చరణ్జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన కేబినెట్ మంత్రుల విషయంలో సిద్ధూ మాటల్ని అధిష్టానం పట్టించుకోలేదు. కేబినెట్ కూర్పు అంతా రాహుల్ గాంధీ ఇష్టం మేరకే సాగింది. వచ్చే ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం పీఠాన్ని ఆశిస్తున్న సిద్ధూ ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ, ఇతర అధికారిక నియామకాల్లో తన మాట చెల్లుబాటు కాలేదని అసహనంగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తునారు. ►సిద్ధూ ఇష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సుఖ్జీందర్ సింగ్ రాంధావాను అధిష్టానం ఎంపిక చేసింది. ఆయన జాట్ సిక్కు కావడం సిద్ధూకి మింగుడు పడలేదు. సిద్ధూ కూడా జాట్ సిక్కు కావడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సీఎంగా ఉండాలన్న తన కల నెరవేరడానికి రాంధావా అడ్డు పడతారని సిద్ధూ భావిస్తున్నారు. పైగా మంగళవారం జరిపిన శాఖల కేటాయింపుల్లో రాంధావాకు అత్యంత ముఖ్యమైన హోంశాఖను కట్టబెట్టారు. ►సిద్ధూ తనకు నమ్మకస్తులైన కుల్జిత్ సింగ్ నగ్రా, సుర్జిత్ సింగ్ ధైమన్కు కేబినెట్లో చోటు కోసం ప్రయత్నించి విఫమయ్యారు ►సిద్ధూ అనుచరులకు మంత్రి పదవులు లభించకపోగా తాను తీవ్రంగా వ్యతిరేకించిన, ఇసుక మైనింగ్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా గుర్జీత్సింగ్కు కేబినెట్లో చోటు దక్కడం పుండు మీద కారం చల్లినట్టుగా అయింది. అక్ర మ మైనింగ్పై పోరాడుతున్న సిద్ధూ... రాణా కు మంత్రిపదవి ఇవ్వడాన్ని సహించలేకపోయారు. ►ముఖ్యమంత్రిగా తాను మద్దతు ఇచ్చిన చన్నీ వివిధ పదవుల నియామకంలో తనకు నచ్చినవారికే కట్టబెట్టడం సిద్ధూకి మింగుడు పడడం లేదు. రాష్ట్ర డీజీపీగా సిద్ధార్థ చటోపాధ్యాయ, అడ్వొకేట్ జనరల్గా పట్వాలియాను నియమించాలన్న సిద్ధూ సూచనల్ని సీఎం పట్టించుకోలేదు. డీజీపీగా ఇక్బాల్ సిహŸతా, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్గా డియోల్ను నియమించారు. డియోల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తిగా ఉన్నారు. విజిలెన్స్ కేసుల్లో ఇరుక్కున్న మాజీ డీజీపీ సుమేధ్సింగ్ సైనికి న్యాయవాదిగా వ్యవహరించి.. ఆయనని ఆ కేసుల నుంచి డియోల్ బయటపడేశారు. అలాంటి వ్యక్తికి అత్యున్నత స్థాయి పదవి కట్టబెట్టడాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. –నేషనల్ డెస్క్, సాక్షి నేను చెప్పానా.. ముందే చెప్పానా! సిద్ధూఅసమ్మతి సెగలకు ఉక్కిరిబిక్కిరై.. అవమాన భారాన్ని భరించలేక సీఎం పదవిని వీడిన కెప్టెన్ అమరీందర్ సింగ్ సిద్ధూ రాజీనామాపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కు పెట్టారు. సిద్ధూ ఇచ్చిన ఝలక్ నుంచి ఇంకా తేరుకోని అధిష్టానాన్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘మీకు ముందే చెప్పాను. సిద్ధూకి స్థిరత్వం లేదు. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్కి అతను తగిన వ్యక్తి కాదు’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత వ్యక్తిగత పర్యటన మీద ఢిల్లీ చేరుకున్న అమరీందర్ విలేకరులతో మాట్లాడారు. పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టి మూడు నెలలు తిరక్కుండా వెళ్లిపోతే అతనిపై ఎవరికి నమ్మకం ఉంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ను వీడి మరో పార్టీతో చేతులు కలపడానికి సిద్ధూ సిద్ధమవుతున్నారని ఆరోపించారు. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ పంజాబ్ పర్యటనకు ఒక్క రోజు ముందే సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో అమరీందర్ చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఢిల్లీకి అమరీందర్ అమరీందర్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. సెప్టెంబర్ 18న సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. అమరీందర్ బీజేపీలో చేరుతారని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడానికే ఢిల్లీకి వెళుతున్నారని ప్రచారం జరిగింది. అయితే అమరీందర్ మీడియా సలహాదారు రవీణ్ తుక్రల్ అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. వ్యక్తిగత పనుల నిమిత్తమే అమరీందర్ ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. ‘ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. దాంతో పాటు ఢిల్లీలోని కపుర్తలా హౌస్ (ఢిల్లీలో పంజాబ్ సీఎం అధికారిక నివాసం)ను ఖాళీ చేసి కొత్త సీఎం చన్నీకి అప్పగిస్తారు’ అని తుక్రల్ ట్వీట్ చేశారు. అమరీందర్ చండీగఢ్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ తన పర్యటనపై అనవసరమైన ఊహాగానాలు చెయ్యొద్దని కపుర్తలా హౌస్ను ఖాళీ చేయడానికే వెళుతున్నానని చెప్పారు. అమరీందర్ ఢిల్లీకి వెళ్లడానికి విమానాశ్రయానికి వెళ్లినప్పుడే హిమాచల్ప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్లడం కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా విమానాశ్రయానికి చేరుకోవడం విశేషం. -
పిలవకుండానే పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించిన సీఎం
చండీగఢ్: సాధారణంగా ముఖ్యమంత్రి అంటే.. కట్టుదిట్టమైన భద్రత.. ఆయన చుట్టుపక్కల ఒక పెద్ద హడావిడితో కూడిన వాతావరణం ఉంటుంది. సీఎం చుట్టు ఉండే భద్రత సిబ్బంది.. ఆయన అపాయింట్ మెంట్ లేకుండా ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లనివ్వరనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. ఒక్కొసారి ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సీఎం భద్రత దృష్ట్యా.. సెక్యురిటీ సిబ్బంది నుంచి చేదు అనుభవం ఎదుర్కోవడం మనం చూస్తునే ఉంటాం. కొంత మంది ముఖ్యమంత్రులు మాత్రం దీనికి భిన్నంగా అవకాశం చిక్కినప్పుడల్లా ప్రజలతో మమేకమవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రజలు జరుపుకునే పండుగలకు, శుభకార్యాలకు హజరవుతుంటారు. ఆ కోవకు చెందిన వారే ఇటీవల పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చరణ్ జీత్ సింగ్ ఛన్నీ. ఆయన తాజాగా ఒక వివాహ వేడుకలో వధువరులను ఆశీర్వదించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల పంజాబ్ 16 వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చరణ్జీత్ సింగ్ చన్నీ బటిండా జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన.. తన కాన్వాయ్ రోడ్డు మండి కలాన్ అనే గ్రామంనుంచి వెళ్తుండగా.. ఒక వివాహ వేడుక జరుగుతోంది. వెంటనే సీఎం తన కాన్వాయ్ని ఆపించారు. ఆ తర్వాత కిందకు దిగి .. నూతన దంపతులను పలకరించారు. పెళ్లికుమారుడిని హత్తుకొని మరీ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ఆ వేడుకలో పెళ్లివారు ఇచ్చిన స్వీట్(పారట్) స్వీకరించి వారిని ఆనందపర్చారు. కాగా, సాక్ష్యాత్తూ.. ఒక సీఎం పిలవకుండా ఆగి.. తమకు శుభాకాంక్షలు తెలిపినందుకు వధువరులు ఆనందంతో ఉప్పోంగిపోయారు. వారితో సీఎం కొద్దిసేపు మాట్లాడారు. వధువరులను సీఎం చరణ్ జీత్ సింగ్ మనసారా ఆశీర్వదించారు. కాగా, దీన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. అయితే, గతంలో చరణ్ జీత్ సింగ్ విద్యార్థులతో కలిసి కపూర్తలాలో చేసిన భాంగ్రా ఫోక్ డ్యాన్స్ వైరల్గా మారిన విషయం తెలిసిందే. చదవండి: Charanjit Singh Channi: భాంగ్రా డ్యాన్స్తో హల్చల్ -
పంజాబ్ కాంగ్రెస్లో మళ్లీ సంక్షోభం.. సీఎం అమరీందర్పై తిరుగుబావుటా..
చండీగఢ్: పంజాబ్లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. పంజాబ్లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఒంటరవుతున్నట్లు తెలుస్తోంది. తాగాజా పంజాబ్ కాంగ్రెస్లో మళ్లీ సంక్షోభం తలెత్తింది. సీఎం అమరీందర్పై నమ్మకం పోయిందంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరవేశారు. దీనిపై చర్చించడానికి నలుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. చదవండి: సోనియమ్మకు థాంక్స్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు బయల్దేరినట్లు సమాచారం. కాగా ఇటీవల పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది ఎమ్మెల్యేలు హాజరైన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి బలం తగ్గినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. చదవండి: వివాదంలో బీజేపీ నేత..ఇంటిలో అర్ధనగ్నంగా కూర్చుని -
టీకా రెండు డోసులు తీసుకుంటేనే మా రాష్ట్రానికి రండి..!
చండీగఢ్: కరోనా వైరస్కు సంబంధించి రెండు టీకా డోసులు తీసుకోవడం లేదా ఆర్పీసీఆర్ పరీక్ష నివేదిక ఉన్నవారికి మాత్రమే సోమవారం నుంచి పంజాబ్లోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తెలిపారు. పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్, జమ్మూ నుంచి వచ్చే ప్రజలను ఖచ్చితంగా తనిఖీలు చేస్తామని ఆయన అన్నారు. పంజాబ్లోని పాఠశాలలు, కళాశాలల్లో పూర్తిగా టీకాలు వేసుకున్న టీచింగ్, బోధనేతర సిబ్బంది లేదా ఇటీవల కోవిడ్ -19 నుంచి కోలుకున్న వారు మాత్రమే భౌతికంగా బోధించడానికి హాజరు కావచ్చని వెల్లడించారు. కాగా పంజాబ్లో శుక్రవారం 88 కోవిడ్ కేసులు, జీరో మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య దాదాపు ఆరు లక్షలకు చేరుకుంది. ఇక పంజాబ్ ప్రభుత్వం పాఠశాలను తిరిగి తెరిచిన తర్వాత కోవిడ్ పరీక్షను వేగవంతం చేసింది. పాఠశాలల నుంచి ప్రతిరోజూ కనీసం 10,000 మందికి ఆర్పీసీఆర్ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పంజాబ్తో పాటు, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లోని పాఠశాలల్లో కూడా ఆఫ్లైన్ తరగతులు తిరిగి ప్రారంభమైనందున గత వారంలో చాలా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల్లో పెరుగుతున్న కేసుల కారణంగా పంజాబ్లో కోవిడ్ పాజిటివిటీ రేటు స్వల్పంగా 0.2 శాతానికి పెరిగింది. -
గ్రేట్ జర్నీ.. సోలోగా.. ధైర్యంగా
‘ఆకాశమే మన హద్దు... అవకాశాలను వదలద్దు’ ఇదేదో పర్సనాలిటీ డెవలప్మెంట్ నినాదంలా అనిపిస్తోంది. కానీ ఈ అడ్వంచరస్ ఉమన్ గురుదీపక్ కౌర్ను చూస్తే ఇలాంటి మరెన్నో స్ఫూర్తివచనాలు చెప్పాలనిపిస్తుంది. 73 ఏళ్ల వయసులో ఆమె సొంతంగా కారు నడుపుకుంటూ ఒంటరిగా కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్తుంటారు. సోలో ట్రావెలర్, సోలో ఉమెన్ ట్రావెలర్... ఇవేవీ గురుదీపక్కు సరిపోకపోవచ్చు. సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాల్సిందే. ఆమె మాత్రం ‘వయసు ఒక సంఖ్య మాత్రమే. మన ఉత్సాహానికి వయసు అడ్డుకట్ట వేయలేదు. బాధ్యతలు కొంత వరకు వేగాన్ని అదుపు చేస్తుంటాయి. కానీ నాకు బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఫ్రీ బర్డ్ని. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు నా చేత ప్రయాణం చేయిస్తున్నది... ప్రపంచాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక్కటే’’ అంటారు. మూడు రోజుల రైలు ప్రయాణం జీవితంలో పరిస్థితులే తన చేత ఒంటరి ప్రయాణాలు చేయించాయంటారు గురుదీపక్ కౌర్. ‘‘నాన్న మిలటరీ పర్సన్, బదిలీలుంటాయి. పన్నెండేళ్ల వయసు నుంచి ప్రయాణం అంటే మా వస్తువులు మేమే ప్యాక్ చేసుకుని సిద్ధం అయ్యేవాళ్లం. ‘ప్యాకింగ్, మూవింగ్, మీటింగ్ న్యూ పీపుల్’ ఇదే మా లైఫ్. ఇక ఒంటరి ప్రయాణాలు పెళ్లి తర్వాత మొదలయ్యాయి. నా భర్త కూడా మిలటరీ పర్సనే. పెళ్లయిన తర్వాత రెండో ఏడాదిలో ఆయనకు కర్నాటక, బెల్గామ్లో పోస్టింగ్ వచ్చింది. చండీగర్ నుంచి రెండు నెలల బాబుతో, ఎనిమిది పెద్ద పెద్ద చెక్క పెట్టెలతో బెల్గామ్కు ప్రయాణమయ్యాను. అప్పట్లో విమానాలు ఇంత ఎక్కువగా ఉండేవి కావు. రైల్లో మూడు రోజుల ప్రయాణం. అది నా తొలి ఒంటరి ప్రయాణం మాత్రమే కాదు, సాహసోపేతమైన ప్రయాణం కూడా. కారులో షికారు గురుదీపక్ కౌర్ తొలి సోలో ఇంటర్నేషనల్ టూర్ 1994లో చేశారు. యూఎస్కు ఒంటరిగా వెళ్లడం మాత్రమే కాదు, స్థానికంగా ప్రదేశాలను చూడడానికి రైల్లో ఒంటరిగానే ప్రయాణించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ సొంతంగా కారు నడుపుకుంటూ ప్రయాణించడం 2013లో మొదలైంది. సాంత్రో కారులో చండీగర్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు గురుదీపక్ కౌర్. ఢిల్లీ, అజ్మీర్, ఉదయ్పూర్, అహ్మదాబాద్, ముంబయి మీదుగా బెంగళూరు చేరారు. ఆ తర్వాత ఏడాది ఉత్తరాఖండ్కు కారు తీశారు. కొండలు, లోయల మధ్య మెలికలు తిరిగిన రోడ్డు మీద కారు నడుపుతూ తాను చూడదలుచుకున్న ప్రదేశాలను చుట్టి వచ్చారు. ప్రమాదం తప్పింది దేహం అలసటగా ఉన్నప్పుడు ట్రిప్ మొదలు పెట్టవద్దని చెబుతారు కౌర్. దేహం ఫిట్గా ఉందా నీరసంగా ఉందా అనేది ఎవరికి వాళ్లకు తెలుస్తుంది. దేహం అలసటకు మానసిక అలసట కూడా తోడైతే... ఇక వాహనం నడప కూడదని చెబుతూ మూడేళ్ల కిందట తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారామె. ‘‘ముంబయికి వెళ్లినప్పుడు కారు నడుపుతూ తీవ్రమైన అలసటతో రోడ్డు పక్కన కారాపి కొన్ని క్షణాలపాటు స్టీరింగ్ మీద తల వాల్చాను. మెలకువ వచ్చేసరికి కారు కదులుతోంది. అప్పటికే చెట్ల పొదల్లోకి వచ్చేసింది. వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది’’. ఇల్లు అపురూపమే... ‘‘ప్రతి మహిళకూ నేను చెప్పేది ఒక్కటే. ఇల్లు, కుటుంబం బాధ్యతలు ఎలాగూ ఉంటాయి. బాధ్యతల పట్ల బాధ్యతరహితంగా ఉండవద్దు. బాధ్యతలతోపాటు మీకూ కొంత సమయం కేటాయించుకోండి. మీకంటూ సొంతంగా కొంత డబ్బు ఉంచుకోండి. ఏడాదిలో కొన్ని రోజులు మీరు మీరుగా జీవించండి. ఆ తర్వాత తిరిగి మీ బాధ్యతల వలయంలోకి వచ్చి పడినప్పటికీ అప్పుడు ఆ బాధ్యత బరువుగా అనిపించదు. మానసికంగా ఒత్తిడిని కలిగించదు. మనకు ఇల్లు అపురూపమైనదే, అలాగే ప్రపంచం అందమైనది. ఆ అందానికి కూడా మన జీవితంలో స్థానం కల్పించాలనే విషయాన్ని మర్చిపోవద్దు’’ అంటారు గురుదీపక్ కౌర్. -
నీరజ్ చోప్రాకు స్వర్ణం.. ఇంట్లో సంబరాలు; వీడియో వైరల్
చంఢీఘర్: హరియాణా రాష్ట్రం, పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామం నీరజ్ స్వస్థలం. వ్యవసాయం చేసుకునే 17 మంది సభ్యుల ఉమ్మడి కుటుంబం. అధిక బరువు, అల్లరి పిల్లాడు కావడంతో కాస్త ఆటల్లో పెడితే కుదురుగా ఉంటాడని భావించిన తండ్రి సతీశ్ 13 ఏళ్ల నీరజ్ను సమీపంలోనే ఉన్న పానిపట్లోని స్టేడియానికి తీసుకెళ్లాడు. అయితే అక్కడి అన్ని ఆటల్లో అతనికి జావెలిన్ త్రో కొత్తగా అనిపించి ఆసక్తి పెరిగింది. కోచ్ జై చౌదరి మార్గనిర్దేశనంలో, బాబాయ్ భీమ్ చోప్రా అండగా నీరజ్ జావెలిన్ త్రోలోనే తన భవిష్యత్తును వెతుక్కునేందుకు సిద్ధమయ్యాడు. తన సహజసిద్ధమైన ప్రతిభతో చోప్డా కొద్ది రోజుల్లోనే ఆటలో మెరుగయ్యాడు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన తర్వాత అతని పయనం పంచ్కులాలోని ‘సాయ్’ స్పోర్ట్స్ హాస్టల్కు చేరింది. అక్కడి నుంచి నీరజ్ తన శ్రమ, పట్టుదలతో ఒక్కసారిగా ఎదిగిపోయాడు. వివిధ దశల్లో కోచ్లుగా వ్యవహరించిన గ్యారీ కాల్వర్ట్, యువ్ హాన్ అతడి ఆటను పైస్థాయికి తీసుకెళ్లగా, ప్రస్తుత కోచ్ క్లాస్ బార్టోనెట్జ్ నీరజ్ను చాంపియన్గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. #WATCH live from javelin thrower Neeraj Chopra's residence in Panipat, Haryana Chopra wins gold at #TokyoOlympics https://t.co/0kj0q2Pruu — ANI (@ANI) August 7, 2021 -
షాకింగ్: పార్కింగ్ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్
సాక్షి, న్యూఢిల్లీ: ఒకపక్క దేశంలో టోక్యో ఒలింపిక్స్ లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో పతకాలను సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. విజేతలపై ప్రశంసలు, బహుమతుల వర్షం కురుస్తోంది. మరోవైపు పొట్ట కూటికోసం యువ బాక్సర్ రోడ్డున పడిన వైనం క్రీడాభిమానుల్లోనూ, క్రీడాకారుల్లోనూ కలకలం రేపింది. (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్) చండీగఢ్లో యువ బాక్సర్ రీతు పార్కింగ్ టిక్కెట్లను విక్రయిస్తోంది. తనకు ప్రోత్సాహం లేకపోవడంతో బాక్సింగ్ను వదిలి వేసింది. చివరకి గత్యంతరం లేక తన కుటుంబానికి అండగా ఉండేందుకు చండీగఢ్లో పార్కింగ్ టిక్కెట్లను విక్రయిస్తోంది. తాను జాతీయ స్థాయిలో చాలా మ్యాచ్లు ఆడి, పతకాలు సాధించానని రీతూ తెలిపింది. క్రీడాకారిణిగా తనకు తన కుటుంబం చాలా అండగా నిలిచిందని తెలిపింది. కానీ తనకు ఎలాంటి ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్లు రాలేదని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని కాపాడుకునేందుకు, ఆర్థిక అవసరాలకోసం తనకెంతో ఇష్టమైన క్రీడలను విడిచిపెట్టాల్సి వచ్చిందని వాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం సహాయం చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. (Vandana Katariya: ఉత్తరాఖండ్ డాటర్కు భారీ నజరానా) Ritu, a young boxer, sells parking tickets in Chandigarh to run her household "I've played many matches at national level&won medals. Family supported me but I got no support/scholarships from institutions. My father's unwell, so I had to leave sports. Hope govt helps," she says pic.twitter.com/yn06NoZCPs — ANI (@ANI) August 7, 2021 -
రెజ్లర్ రవి దహియాకు భారీ నజరానా.. క్లాస్ 1 కేటగిరీ ఉద్యోగం..!
చండిగఢ్: టోక్యో 2020 ఒలింపిక్స్లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ పోరులో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఒలింసిక్స్లో రజతం సాధించిన రెజ్లర్ రవి కుమార్ దహియాకు హర్యానా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. దేశానికి పతకం సాధించి పెట్టిన రవి దహియాకు రూ.4 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే క్లాస్-1 కేటగిరి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. రవి దహియా అడిగిన చోట 50శాతం రాయితీతో ఓ ఫ్లాట్ స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. దహియా పుట్టి పెరిగిన తన స్వగ్రామం నహ్రిలో.. రెజ్లింగ్ కోసం ప్రత్యేకంగా ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు వెల్లడించింది. కాగా ఫైనల్లో రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్తో జరిగిన హోరాహోరి మ్యాచ్లో చివరి వరకు పోరాడిన దహియా 7-4 తేడాతో ఓడి రజతం గెలిచాడు. ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో సుశీల్ కుమార్ తర్వాత రజతం సాధించిన రెండో రెజ్లర్గా చరిత్ర సృష్టించిన రవి దహియాపై సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు ట్విటర్ వేదికగా రవి దహియాకు శుభాకాంక్షలు చెప్పారు. ఇక దహియా పతకంతో టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ రెండు రజతాలు, మూడు కాంస్యాలు సాధించింది. ఇక సుశీల్ కుమార్ 2012 లండన్ గేమ్స్లో రజతం గెలుచుకోగా.. అక్కడ యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. ఇక 2008 బీజింగ్ గేమ్స్లో సుశీల్ కాంస్యం గెలుచుకున్నారు. అంతేకాకుండా జాదవ్ 1952 హెల్సింకి గేమ్స్లో కాంస్య పతకం సాధించారు. 2016 రియో ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన తొలి మహిళా రెజ్లర్గా సాక్షి మాలిక్ నిలిచిన సంగతి తెలిసిందే. -
జిమ్ కోసం ఇన్నేసి రూల్సా.? ఇది జిమ్మా లేక ఇంకేందీ సామి
చండిగఢ్: ‘మీరు వేసుకునే లోదుస్తులపై స్టాంప్ ఉండాలి. స్మెల్ టెస్ట్ చేయించుకోవాలి’ అని ఓ క్లబ్ యాజమాన్యం సభ్యులకు ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. జిమ్కు వచ్చేవారందరూ ఇది తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అలా చెప్పారో.. కథ ఏమిటో తెలుసుకోండి. చండీగఢ్లోని లేక్ క్లబ్ ఇటీవల సభ్యులకు కొత్త నియమనిబంధనలు విడుదల చేసింది. అందులో భాగంగా పలు సూచనలు చేసింది. వాటిలో పైన పేర్కొన్న ప్రధాన సూచన సభ్యులను విస్మయానికి గురి చేసింది. ఈ రూల్స్కు సంబంధించిన ఫొటోను జర్నలిస్ట్ ఆర్ష్దీప్ సంధు ట్విటర్లో పంచుకోవడంతో ఈ విషయం బహిర్గతమైంది. నాలుగు సూచనలతో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జిమ్కు వచ్చేవారు సరైన దుస్తులు ధరించి రావాలి. జిమ్ సూట్లలోనే రావాలి. లోదుస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి. అనుమతి ఇచ్చిన వాటినే వేసుకోవాలి. ఆ దుస్తులు ఎలా ఉండాలో కార్యాలయంలో కొన్ని శాంపిల్స్ ఉన్నాయి. చూసుకోవచ్చు. మీ దుస్తులకు అనుమతి కోసం సభ్యులు మా వద్దకు తీసుకురావాలి. స్టాంప్లు వేసిన దుస్తులనే వేసుకోవాలి. సభ్యులు సరైన బూట్లు ధరించాలి. పరిశుభ్రంగా ఉండాలి. సాక్స్లు రోజుకొకసారి తప్పనిసరిగా ఉతకాలి. అపరిశుభ్రమైన బూట్లు.. వాసన వచ్చే సాక్స్లు ధరిస్తే ఆ సభ్యులకు జరిమానా విధిస్తాం. వాసన పరీక్ష (స్మెల్ టెస్ట్)లో మీరు ఫెయిలైతే చర్యలు ఉంటాయి. శారీరక దుర్వాసన కూడా రాకుండా చూసుకోవాలి. జిమ్ పరికరాలు శబ్ధం రాకుండా కసరత్తులు చేయాలి. కసరత్తులు చేసేప్పుడు అరవకూడదు.. శబ్దాలు చేయవద్దు. ఇతర భాషలు మాట్లాడేందుకు అనుమతి లేదు. కేవలం పంజాబీ భాషలోనే మాట్లాడాలి. అనుమతించిన తిట్లు మాత్రమే మాట్లాడాలి. జిమ్కు షార్ట్స్ వేసుకుని వచ్చేవారు తమ కాళ్లను షేవ్ చేసుకుని రావాలి. ఏకాగ్రత కోల్పోకుండా కాళ్లకు పట్టీలు ఉంటే ఇంట్లో ఉంచి రావాలి. ఉల్లంఘించినవారు శిక్షార్హులు. అని ఈ విధంగా నిబంధనలు పెట్టడంతో సభ్యులు ఖంగు తిన్నారు. జిమ్ చేయాలంటే ఇన్నేసీ రూల్సా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇన్నేసి రూల్స్ పాటించాలా? అని ప్రశ్నిస్తున్నారు. వాసన పరీక్షను సభ్యులు ఎలా పరాజయం పొందుతారు? అని ప్రశ్నిస్తున్నారు. * How does a member fail the "smell test"? * Who is incharge of smelling members ? * Can members wax instead of shave ? * "Only approved undergarment are to be worn ! And who will check the brand of the underwear ?" * what if the member abuses in another language ? 💪 — Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) August 3, 2021 Gym Suit pic.twitter.com/6VisGaHjOU — AchaTheekHai! (@neelaneelaamber) August 3, 2021 -
సిద్ధూ కామెంట్లపై రైతుల ఫైర్!
చండీగఢ్ : నూతన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల చేపట్టిన సందర్భంగా శుక్రవారం నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన కామెంట్లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రూప్నగర్ జిల్లాలో సిద్ధూకు వ్యతిరేకంగా నిరసలు చేపట్టారు. గురుద్వారాలో ప్రార్థనల కోసం వచ్చిన ఆయనకు నల్ల జెండాలతో స్వాగతం పలికారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, శుక్రవారం తను చేసిన కామెంట్లపై సిద్ధూ స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. రైతుల పట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉందని, వారి ఉద్యమానికి మనసా,వాచ మద్దతు ఇస్తున్నానని చెప్పారు. రైతన్నల విజయమే తన మొదటి ప్రాధాన్యమని.. నిరసనలు చేస్తున్న రైతులు తనను ఆహ్వానిస్తే వారి వద్దకు చెప్పులు లేకుండా వారి వద్దకు వెళతానని వ్యాఖ్యానించారు. శుక్రవారం పీసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిద్ధూ రైతుల ఉద్యమం గురించి మాట్లాడుతూ..‘‘ కిషన్ మోర్చా పెద్దలు.. మీరు దాహంతో బావి వైపు అడుగులు వేస్తున్నారు. ఆ బావి మీ దప్పిక తీర్చదు. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించారు. -
రైతుల గెలుపే మొదటి ప్రాధాన్యత
చండీగఢ్: కేంద్రం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాల రద్దే లక్ష్యంగా నిరసనలు చేస్తున్న రైతన్నల విజయమే తన మొదటి ప్రాధాన్యమని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ తెలిపారు. నిరసనలు చేస్తున్న రైతులు తనను ఆహ్వానిస్తే వారి వద్దకు చెప్పులు లేకుండా వారి వద్దకు వెళతానని వ్యాఖ్యానించారు. ఏడాది నుంచి జరుగుతున్న రైతు నిరసనలు ఎంతో పవిత్రమైనవని అందువల్ల సంయుక్త కిసాన్ మోర్చా విజయం తనకు ముఖ్యమని పేర్కొన్నారు. శనివారం ఆయన చమ్కౌర్ సాహిబ్ వద్ద మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతన్నల కోసం ఏం చేయగలదో చెబుతామని అన్నారు. పెరుగుతున్న ధరలు, తగ్గుతున్న దిగుబడి ప్రస్తుత నిరసనలకు కారణమైందని అన్నారు. -
లక్ష సంవత్సరాల క్రితం చిత్రాలు.. ఎలా ఉండేవి?
ఆటవిక యుగం మధ్య దశలో మనుషులు అరణ్యాలలో, కొండ గుహలలో నివసించేవారు. ఇళ్ళు కట్టుకోవడం అప్పటికి ఇంకా తెలియదు. వారిది గుంపు జీవితం. పదుల సంఖ్యలో ఉండే జనాభా చిన్న చిన్న గుంపులుగా జీవించేవారు. ఏ గుంపు ఆచారాలు దానివే. ఏ గుంపు నమ్మకాలు దానివే. ఇదంతా చరిత్ర. ఇక మన చుట్టూ జరుగుతున్న విషయాలను కొన్ని చిత్రాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. మరి లక్ష సంవత్సరాల క్రితం చిత్రాలు ఎలా ఉండేవి? చండీగఢ్: హర్యానాలోని ఫరీదాబాద్ గుహలోని చిత్రాలు లక్ష సంవత్సరాల క్రితం వేసినట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. టూల్ టోపోలాజీ ఆధారంగా.. ఈ ప్రదేశంలో చారిత్రక ఆనవాళ్లను గుర్తించినట్లు వివరించారు. పర్యావరణవేత్త సునీల్ హర్సనా వన్యప్రాణులు, వృక్షసంపదపై ఆరావళీ కొండల్లో వివిధ అంశాలను సునీల్ హర్సనా డాక్యుమెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి గుహలలోని కళను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో గుర్తించిన ఈ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో గుహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. అలా ఈ చిత్రాలు పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. కాగా ఈ ఏడాది మే నెలలో పర్యావరణవేత్త సునీల్ హర్సానా… మంగర్ బని అటవీప్రాంతంలోని గుహలో ఈ చిత్రాలను గుర్తించారు. జూన్ నుంచి హర్యానా పురావస్తు శాఖ అధికారులు వీటిపై పరిశోధనలు జరిపారు. పురావస్తు శాఖ ఫరీదాబాద్లోని శిలాఖరి, మంగర్, కోట్, ధౌజ్ ప్రాంతాలలో, గుర్గావ్లోని రోజ్ కా గుజ్జర్, దమ్దామా వంటి ప్రదేశాలలో పరిశోధనలు నిర్వహించారు. ఇక అక్కడ రాతి యుగంలో వాడిన కొన్ని సాధనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మంగర్ బని అడవికి రక్షణ దీనిపై హర్యానా ప్రధాన కార్యదర్శి అశోక్ ఖేమ్కా మాట్లాడుతూ.. పాలియోలిథిక్ యుగానికి చెందిన పురాతన గుహ చిత్రాలు, సాధనాలు పెద్ద సంఖ్యలో ఉన్నందున చారిత్రక కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల రక్షణ చట్టం 1964 ప్రకారం.. మంగర్ బని అడవికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల హర్యానాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఆరావళీ పర్వత శ్రేణిలోని గుహలలోని కొన్ని చిత్రాలను కూడా గుర్తించారు. ఇందులో మనుషుల బొమ్మలు, జంతువులు, ఆకులు, రేఖాగణిత చిత్రాలు ఉన్నాయి. ఇవి 40,000 సంవత్సరాల క్రితానికి (ఎగువ పాలియోలిథిక్ యుగం) చెందినవని, సుమారు 10,000 సంవత్సరాల క్రితం వరకు వర్థిల్లినట్లు తెలిపారు. @AshokKhemka_IAS Principal Secretary to govt archaeology dept Haryana said: "We will be giving MangarBani forest protection under Punjab Ancient & Historical Monuments & Archaeological Sites & Remains Act, 1964 because of presence of large number of stone age cave paintings." pic.twitter.com/IUN5AVzF31 — Aravalli Bachao (@AravalliBachao) July 15, 2021 -
ప్రాణం తీసిన సైకిల్ పార్కింగ్
చంఢీగడ్: హర్యానాలోని పంచకుల జిల్లాలో సైకిల్ పార్కింగ్ వివాదంలో ఓ 55 ఏళ్ల వ్యక్తిని పొరుగునవారు కత్తితో పొడిచి చంపారు. వివరాల్లోకి వెళితే.. బైందర్ అనే వ్యక్తి ఇందిరా కాలనీలోని సెక్టార్16 లో నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం తన నివాసం వెలుపల సైకిల్ను పార్క్ చేశాడు. వీధిలో సైకిల్ను పార్కింగ్ చేయడంపై బాధితుడు, అతని పొరుగు వ్యక్తి సతీశ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సతీష్ కోపంతో బైందిర్ సైకిల్ని అతడిపై విసిరాడు. అంతటితో ఆగకుండా అతనికి ఓ పాఠం నేర్పుతా అంటూ బెదిరించాడు. తర్వాత సతీశ్ తన ఇద్దరు కుమారులు విక్కీ, సన్నీ, పొరుగునే ఉన్న మహిపాల్, మోహిత్ అనే ఇద్దరు వ్యక్తులు కత్తి, రాడ్లు, కర్రలతో బైందర్ కుటుంబంపై దాడిచేశారు. విక్కీ బైందర్ను ఛాతిపై కత్తితో పొడవడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో బాధితుడి భార్య, ఇద్దరు కుమారులు కూడా గాయపడ్డారు. ఐదుగురు నిందితులపై 302, 321, 148 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో కూడా పార్కింగ్ విషయంలో ఇరు పార్టీలు పలుసార్లు గొడవ పడ్డాయని పోలీసులు తెలిపారు. -
నన్ను మోసం చేశారు.. సల్మాన్ ఖాన్పై చీటింగ్ కేసు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్పై చండీగఢ్లో చీటింగ్ కేసు నమోదైంది. సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్కు చెందిన ఏడుగురిపై అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఫిరాదుపై జూలై 13లోపు వివరణ ఇవ్వాలని సమన్లు కూడా జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా నేర కోణం దాగుంటే తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు. అరుణ్ గుప్తా ఆ ఫిర్యాదులో.. ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు నన్ను ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారు. ఇందుకు పెట్టుబడి ఖర్చు రూ.2 కోట్లు అవుతుందని చెప్పగా అందుకు అంగీకరించి అంత మోత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. కాగా షోరూమ్ తెరిచిన సంవత్సరం గడుస్తున్న, తనకు సదరు సంస్థ నుంచి ఏవీ రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారు. ఈ క్రమంలో అతను సల్మాన్ను కలుసుకోగా, షోరూమ్ ప్రారంభించేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ ఆ తర్వాత సల్మాన్ రాలేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ మేరకు సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. షోరూమ్ ప్రారంభించి 1.5 సంవత్సరాలు గడిచినప్పటికీ నాకు ఎటువంటి సమాధానం వాళ్ల నుంచి రాలేదని వాపోయాడు. Chandigarh police summon Bollywood actor Salman Khan, his sister Alvira Khan and 7 others associated with Being Human in an alleged case of fraud. "They have been given till July 13 to reply. If there's anything criminal, action will be taken," Chandigarh SP Ketan Bansal. pic.twitter.com/Ye2dI97aN5 — ANI (@ANI) July 8, 2021 -
సీఎం ఇంటి ముట్టడికి యత్నం.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులతో..
చండీగఢ్: రాష్ట్రంలో మాదకద్రవ్యాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విఫలమయ్యారంటూ.. బీజేవైఎం కార్యకర్తలు సోమవారం పంజాబ్ సీఎం అధికార నివాస ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిరసన కారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. పంజాబ్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాదక ద్రవ్యాలను అరికడతామని సీఎం అమరీందర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే డ్రగ్స్ను అరికట్టడంలో పంజాబ్ సీఎం విఫలమయ్యారని పంజాబ్ బీజేవైఎం చీఫ్ భాను ప్రతాప్ రానా ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం వృద్ధి చెందిందని రానా పేర్కొన్నారు. దీనికి నిరసనగా రానా నేతృత్వంలోని ఆందోళనకారులు నిసరస చేపట్టారు. -
కత్తిరిస్తే.. పక్కవాళ్ల జుట్టు తినేది.. కడుపులో కిలోన్నర ఉండ!
చండీఘడ్: ఐదేళ్ల బాలిక.. రెండేన్నళ్లుగా తన వెంట్రుకలు తానే తింటోంది.. వద్దని వారించినా వినకపోవడంతో ఎప్పటికప్పుడు జుట్టును కత్తిరించారు కూడా... అయినప్పటికీ అలవాటు మానుకోలేకపోయింది.. ఇంట్లో వాళ్లు తల దువ్వుకుంటున్న సమయంలో రాలి పడిన వెంట్రుకలను తినడం మొదలు పెట్టింది.. ఆఖరికి ఆమె కడుపులో కిలోన్నర పరిణామంలో వెంట్రుకల ఉండ పేరుకుపోగా.. అనారోగ్యం పాలైంది. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆపరేషన్ నిర్వహించి వెంట్రుకల ఉండను విజయవంతంగా తొలగించారు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. మౌలీ జాగ్రన్కు చెందిన చెందిన బాలికకు పంచకుల సివిల్ హాస్పిటల్లో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ విషయం గురించి సర్జరీ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ వివేక్ భదూ మాట్లాడుతూ... ‘‘వెంట్రుకలు జీర్ణం కావు. ఇవి ఉండలా పేరుకుపోయి.. ఆహారనాళంలో ఉండిపోతాయి. ఈ పరిస్థితిని ట్రైకోబేజర్ అంటారు. మానసిక స్థితి సరిగా లేనివారు, తీవ్రంగా ఒత్తిడికి గురయ్యేవారు సాధారణంగా ఇలా వెంట్రుకలు తింటూ ఉంటారు. అయితే, చిన్న పిల్లల్లో మాత్రం చాలా అరుదుగా ఇలా జరుగుతూ ఉంటుంది. 20 ఏళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నా. కానీ ఎప్పుడూ ఇలాంటి కేసు చూడలేదు. వారం రోజుల క్రితం పాప తల్లిదండ్రులు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చారు. కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో స్కానింగ్ చేయగా అసలు విషయం బయటపడింది. తనకు వెంట్రుకలు తినే అలవాటు ఉందని తల్లిదండ్రులు మాకు చెప్పారు. సర్జరీ చేశాం. తనను అబ్జర్వేషన్లో ఉంచాం’’ అని పేర్కొన్నారు. -
ఆ ఉద్యోగం వద్దు.. పంజాబ్ ఎమ్మెల్యే స్పష్టీకరణ
చండీగఢ్: పంజాబ్లోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫతేజంగ్ సింగ్ బజ్వా తన కుమారుడు అర్జున్ ప్రతాప్సింగ్కు ప్రభుత్వం ఇచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని వదులుకున్నట్టు స్పష్టం చేశారు. బజ్వా తండ్రి వేర్పాటు ఉద్యమ కాలంలో ఖలిస్తాన్ ఉగ్రవాదుల చేతుల్లో బలి కావడంతో కారుణ్య నియామకాల కింద ఆయన కుమారుడికి ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఇద్దరు ఎమ్మెల్యేల కుమారుల్లో ఒకరికి పోలీసు ఇన్స్పెక్టర్, ఇంకొకరికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వడంపై సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మౌనం వీడిన ఎమ్మెల్యే తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అందుకే ఆ ఉద్యోగం అక్కర్లేదని కుటుంబ సభ్యులందరం నిర్ణయించుకున్నట్టుగా తెలిపారు. చదవండి: వ్యాక్సినేషన్పై అపోహలు తొలగించండి -
Milkha Singh Love Story: ఆమె ప్రేమకై అతడి పరుగు
‘నాకొచ్చిన అన్ని ట్రోఫీల కన్నా గొప్ప ట్రోఫీ నా భార్య’ అని అనేవారు మిల్ఖా సింగ్. మిల్ఖా సింగ్, ఆయన భార్య నిర్మల్ కౌర్ 59 ఏళ్ల వైవాహిక జీవితం గడిపారు. తమ ప్రేమ కథను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి ఆ రోజుల్లోనే కొంత సాహసం చేశారు. వారు ఒకరిని విడిచి ఒకరు ఎంతగా ఉండలేకపోయారంటే 5 రోజుల తేడాలో ఇద్దరూ మరణించారు. జూన్ 13న నిర్మల్. జూన్ 18న మిల్ఖా. మిల్ఖా సింగ్ మరణించాక అభిమానులు ఆయన ప్రేమ కథను గుర్తు చేసుకుంటున్నారు. ఈ జూన్ నెలలో భార్య నిర్మల్ కౌర్ కరోనాతో మరణించిన ఐదు రోజులకు మిల్ఖా సింగ్ కూడా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నారు. బహుశా ఈ లోకం ఆయనకు నిరర్థకం అనిపించి ఉండవచ్చు ఆమె లేకుండా. తన భార్య నిర్మల్ను ఎవరికి పరిచయం చేసినా మిల్ఖా ‘నా గుండె చప్పుడు’ అని అనేవారు. ఆమె లేనప్పుడు ఆయన గుండె చప్పుడు ఆగిపోవడం ఆయన దృష్టిలో సహజమే కావచ్చు. భారతదేశానికి తన పరుగు తో విశేషమైన పేరు తెచ్చిన మిల్ఖా సింగ్ తన ప్రేమ కోసం కూడా బాగానే పరుగు తీశారు. 1960 లో మొదలైన ప్రేమ కథ 1962లో పెళ్లితో సుఖాంతమైంది. అతను స్టార్ ఆమె టీచర్ మిల్ఖాసింగ్, నిర్మల్ కౌర్ల పరిచయం 1958లో కొలంబోలో జరిగింది. ఆమె వాలీబాల్ ప్లేయర్. ఇతను అథ్లెట్. ‘అప్పుడు ఆమెతో కబుర్లు చెప్పాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనొచ్చు’ అంటారు మిల్ఖా. ఆ తర్వాత రెండేళ్లపాటు వాళ్లు కలవలేదు. ఢిల్లీలో 1960లో అక్కడి స్టేడియంలో ప్రాక్టీస్కు వెళ్లేవారు మిల్ఖా. అక్కడే స్కూల్ పిల్లలను ప్రాక్టీసు చేయిస్తూ నిర్మల్ వచ్చేవారు. ‘అక్కడ ఆమెను చూసి చాలా సంతోషించాను. రెండేళ్ల క్రితం చూసిన నిర్మల్కు ఇప్పటి నిర్మల్కు ఎంత తేడా. ఆమె ఇప్పుడు ఇంకా నిండుగా తయారైంది’ అని తన ఆత్మకథలో రాశారు మిల్ఖా. అయితే ఆయన బిడియపడుతూ ఉంటే ఆమే అతణ్ణి బలవంతం గా కాఫీకి పిలిచింది. ఆ తర్వాత వారు కలుసుకోవడం కొనసాగింది. ‘ఒకసారి నేను ఆమె కారులో వస్తూ ఉన్నాం. నేను డ్రైవింగ్ చేస్తూ ఉన్నాను. ఆమెతో మాట్లాడుతూ కొంచెం పరధ్యానంగా ఉండటంతో కారు కంట్రోల్ తప్పింది. రోడ్డు మీద వెళుతున్న కొంతమందికి డాష్ ఇచ్చాను. ఒకామె గాయపడింది. అది పెద్ద గొడవ అయ్యింది ఆమె ఖర్చులన్నీ భరించి కొంత డబ్బు నేను ఇచ్చినా...’ అని రాశారు మిల్ఖా. వీరిద్దరూ కలిసి తిరగడం పత్రికలకు ఎక్కింది. కాని ఇరువురూ భయపడలేదు. మిల్ఖాసింగ్, నిర్మల్ కౌర్ల పెళ్లినాటి ఫొటో చండీగఢ్ నుంచి ఢిల్లీకి ఆ సమయంలోనే మిల్ఖా మిలటరీ ఉద్యోగానికి రిజైన్ చేసి చండీగఢ్లో పంజాబ్ స్పోర్ట్స్ అకాడెమీకి ఉద్యోగిగా వెళ్లారు. కాని ఢిల్లీలో టీచరుగా పని చేస్తున్న నిర్మల్ ఆయనకు బాగా గుర్తుకొచ్చేది. ప్రతి వీకెండ్ కారు డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీకి వచ్చి ఆమెను కలిసేవారు. కొన్ని నెలలకే నిర్మల్ కూడా చండీగఢ్కు షిఫ్ట్ అయ్యారు. ఆమె కూడా పంజాబ్ స్పోర్ట్స్ అకాడెమీ ఉద్యోగి అయ్యారు. దాంతో వీరి ప్రేమ కథ ఇరు ఇళ్లల్లో తెలిసిపోయింది. మిల్ఖా సిఖ్. నిర్మల్ హిందూ. నిర్మల్ ఇంట్లో ఈ పెళ్లి మొదట ఇష్టం కాలేదు. నాటి పంజాబ్ సి.ఎం ప్రతాప్ సింగ్కు నిర్మల్ తల్లిదండ్రులు ఈ ఉదంతం పై లేఖలు రాసేవారు. దాంతో ఆయన మిల్ఖాను పిలిచి ఒకరోజు బాగా ఫైర్ అయ్యారు. ఆ తర్వాత మిల్ఖా ఆయనకు తమ ప్రేమ గురించి పూర్తిగా వివరించి చెప్పడంతో ఏకంగా సి.ఎం. రంగంలో దిగి ఇరు కుటుంబాల వారికి చెప్పి పెళ్లి జరిపించారు. 1962లో వీరి పెళ్లయ్యింది. మిల్ఖాకు, నిర్మల్కు ఎడం 9 ఏళ్లు. కొడుకు, కోడలు, మనవడితో మిల్ఖా దంపతులు ఆమె నా సర్వస్వం పెళ్లయ్యాక మిల్ఖా తన భార్యే తన సర్వస్వం గా భావించేవారు. ‘ఎప్పుడు మేము కారులో బయటకు వెళ్లినా ఆయనే డోర్ తెరిచి నిలుచునేవారు’ అంటారు నిర్మల్. ‘నేను మెట్రిక్యులేషన్ దాటలేదు. కాని నా నలుగురు పిల్లలు బాగా చదువుకున్నారు. అందుకు కారణం నిర్మల్’ అంటారు మిల్ఖా. వీరు ఒక పిల్లాడిని కూడా దత్తత తీసుకున్నారు. అతను మిలట్రీలో పని చేస్తూ 1999లో టైగర్ హిల్ బ్యాటిల్లో మరణించాడు. వీరి ఒక కుమార్తె న్యూయార్క్లో డాక్టర్ అయితే కుమారుడు జీవ్ మిల్ఖా ప్రొఫెషనల్ గోల్ఫర్. దేశ విభజన సమయంలో దాదాపు అనాథలా పాకిస్తాన్ నుంచి భారతదేశం వచ్చి స్వశక్తితో పెరిగి సైన్యంలో చేరి అక్కడే పరుగు నేర్చి భారతదేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే క్రీడాకారుడైన మిల్ఖా ఆ పరుగుతో వచ్చిన జీవితాన్ని సఫలం చేసుకోవడంలో భార్య నిర్మల్ను భాగస్వామిగా చేసుకున్నాడు. ప్రేమ మొదలయ్యే ముందు అప్పటికే కీర్తి గడించిన మిల్ఖా సింగ్ను చూసి ‘నువ్వు స్థిరం ఎరగని తుమ్మెదవు. నేను ఒంటరి చెట్టును. ఈ చెట్టు గురించి నీకు గుర్తుంటుందా’ అన్నదట నిర్మల్. ఆ తుమ్మెద ఆ తర్వాత ఆ చెట్టునే అంటిపెట్టుకుని ఉండిపోవడమే ఈ ప్రేమలోని అందం. సుగంధం. – సాక్షి ఫ్యామిలీ -
దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కన్నుమూత
చండీగఢ్: దిగ్గజ పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ (91) కన్నుమూశారు. కరోనా అనంతర సమస్యలతో శుక్రవారం అర్ధరాత్రి చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 11.30 సమయంలో తుదిశ్వాస విడిచారు. ఇంటి వంట మనుషుల్లో ఒకరు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆ వ్యక్తి ద్వారా మే 20వ తేదీన మిల్కాసింగ్కు వైరస్ సోకింది. మే 24న మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. నెగెటివ్ రావడంతో మే 30న డిశ్చార్జి అయినప్పటికీ ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో జూన్ 3న ఆయన్ను చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1932 నవంబర్ 20న పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న గోవింద్పురలో జన్మించారు. సిక్రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన మిల్కాసింగ్ 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగులపోటీలో మిల్కాసింగ్కు ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్గా మారారు. మిల్కాసింగ్కు హైదరాబాద్తో విడదీయరాని అనుబంధం ఉంది. సికింద్రాబాద్లో మిల్కాసింగ్ 9 ఏళ్లపాటు శిక్షణ పొందారు. అనంతరం 1958 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. అనంతరం1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్ ఒలింపిక్స్లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. త్రుటిలో ఒలింపిక్ పతకాన్ని కోల్పోయారు. ట్రాక్పై ఆయన చూపిన తెగువతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1959లో పద్మశ్రీతో సత్కరించింది. మిల్కాసింగ్ భార్య నిర్మల్ కౌర్ కరోనా వైరస్తో పోరాడుతూ జూన్ 14వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. భార్య మృతి చెందిన నాలుగు రోజులకే ఆయన కన్నుమూయడంతో మిల్కాసింగ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మిల్కాసింగ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ‘భాగ్ మిల్కా భాగ్’ అనే బాలీవుడ్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో క్రీడాలోకం మూగబోయింది. మరణవార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్ర్భాంతికి లోనయ్యారు. గొప్పవ్యక్తిని కోల్పోయామని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: కరోనాతో మిల్కా సింగ్ భార్య మృతి చదవండి: కరోనా బారిన పడిన భారత దిగ్గజ అథ్లెట్ In the passing away of Shri Milkha Singh Ji, we have lost a colossal sportsperson, who captured the nation’s imagination and had a special place in the hearts of countless Indians. His inspiring personality endeared himself to millions. Anguished by his passing away. pic.twitter.com/h99RNbXI28 — Narendra Modi (@narendramodi) June 18, 2021 Saddened to hear about the demise of Shri Milkha Singh Ji. A legendary sportsman, he will be dearly remembered. My sincere condolences to his family, loved ones and fans across the world. — Mamata Banerjee (@MamataOfficial) June 18, 2021 -
వివాదంలో అక్షయ్ కుమార్ చిత్రం.. దిష్టిబొమ్మ దహనం
బాలీవుడ్ కిలాడి హీరో అక్షయ్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పృథ్వీరాజ్ సినిమాకు వ్యతిరేకంగా చంఢీగఢ్లో ఆందోళనలు చేపట్టారు. గతంలో జోధా అక్భర్, పద్మావతి సినిమాలు వివాదంలో చిక్కుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. కొంచెం అలాంటి వివాదమే ఇప్పుడు పృథ్వీరాజ్ను చుట్టుముట్టింది. యశ్రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ మార్చాలని కోరుతూ అఖిల భారతీయ క్షత్రియ మహాసభ నేతృత్వంలోని నాయకులు నిరసనలు చేపట్టారు. అంతేగాక అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘంలోని వ్యక్తులు మాట్లాడుతూ.. సినిమా పేరు కేవలం పృథ్వీరాజ్గా ఉండకూడదని.. పూర్తి పేరు ‘హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ లేదా ‘చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహన్’గా ఉండాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే పృథ్వీరాజ్ చౌహన్ చివరి హిందూ చక్రవర్తి అని, అలాంటి సందర్భంలో ఈ చిత్రం పేరు అతని పేరుకు పూర్తి గౌరవం ఇవ్వాలని కోరారు. అదే విధంగా సినిమా విడుదలకు ముందే దీనిని క్షత్రియ, రాజ్పుత్ సమాజ ప్రతినిధులకు చూపించాలని కోరారు. అందువల్ల ఈ చిత్రంలో ఏదైనా వివాదం ఉందా అని, చిత్రం చరిత్రను దెబ్బతీస్తుందా అనే విషయం తెలుస్తుందని, అప్పుడే ఆ సన్నివేశాలను తొలగించేదుకు కోరవచ్చని అన్నారు. అయితే పృథ్వీరాజ్ సినిమా నిర్మాత, దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన అన్న వివాదాలను తొలగించాలని, లేకపోతే క్షత్రియ సమాజ్.. పద్మావతి, జోధా అక్బర్ సినిమాలకు ఎదురైన పరిస్థితే ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం చిత్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. చిత్ర నిర్మాత, దర్శకుడితోపాటు స్టార్ అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. చదవండి: ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేను: అక్షయ్ కుమార్ -
పీసీసీపై కాంగ్రెస్ కసరత్తు.. తెరపైకి వచ్చిన ఇద్దరు నాయకులు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర పార్టీలో సంస్థాగతంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహాలకు కాంగ్రెస్ హైకమాండ్ పదునుపెట్టింది. పంజాబ్ కాంగ్రెస్లో గొడవను పరిష్కరించేందుకు హైకమాండ్ ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనప్పటికీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధిష్టానం అనేక అవకాశాలను పరిశీలిస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు, నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు రాబోయే కొద్దిరోజుల్లో తీసుకుంటారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు సునీల్ జఖర్ స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్ యోచిస్తోందని తెలుస్తోంది. నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ చాన్నాళ్లుగా సీఎం అమరీందర్పై బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య సమోధ్య కుదర్చడం కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. పంజాబ్ కాంగ్రెస్లో గందరగోళం వాస్తవానికి కొన్ని నెలలుగా పంజాబ్ కాంగ్రెస్లో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితుల మధ్య ప్రతిరోజూ పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ మిలాఖత్ అయి పనిచేస్తున్నాయనే అభిప్రాయం సాధారణ జనంలో ఉందని అసమ్మతి శిబిరం మాట్లాడటం ప్రారంభమైనప్పటి నుంచి పార్టీలో అంతర్గత గొడవ మొదలైంది. క్రమంగా ఇది సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు వ్యతిరేకంగా మారడంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ముందు 63 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పనితీరుపై ప్రశ్నలు సంధించారు. అసమ్మతిని తగ్గించేందుకు ప్యూహం పీసీసీ అధ్యక్షుడిగా సునీల్ జఖర్ స్థానంలో ఆనంద్పూర్ సాహిబ్ ఎంపీ, యూపీఎ హయాంలో కేంద్రమంత్రి మనీష్ తివారీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లాల పేర్లు హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మనీష్ తివారీ గతేడాది పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని సోనియాగాంధీకి లేఖ రాసిన జీ–23లో సభ్యుడిగా ఉన్నారు. కానీ ఈమధ్య కాలంలో మనీష్ తివారీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ కారణంగా జీ–23లో అసమ్మతిని తగ్గించేందుకు మనీష్ తివారీ పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. మరోవైపు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో సన్నిహితంగా ఉండటమే కాకుండా, అధిష్టాన పెద్దల్లో... ముఖ్యంగా రాహుల్ గాంధీ శిబిరంలో మంచి గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరుగబోయే ఎన్నికల ముందు పీసీసీ మార్పు కీలక పరిణామంగా చూడాల్సి ఉంటుంది. చదవండి: ఇంజనీరింగ్ చదివారు.. గంజాయి అమ్ముతూ బుక్కయ్యారు! -
కొత్త సీపాప్ మెషీన్: కరోనా బాధితులకు వరం?
సాక్షి, చండీగఢ్: కరోనా సెకండ్వేవ్లో ఆక్సిజన్ కొరతతో కరోనా బాధితుల కష్టాలు వర్ణనాతీతం. ఊపిరాడక తమ కళ్లముందే ఆత్మీయులు విలవిల్లాడుతోంటే కుటుంబ సభ్యుల ఆవేదన ఇంతా కాదు. ఒక మాదిరి నుంచి తీవ్రంగా ప్రభావితమైన కరోనా బాధితుల్లో సీపాప్ థెరపీ చాలా కీలకంగా మారింది. అయితే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, సీపాప్, బీపాప్ మెషీన్లు ఖరీదైనవిగావటం బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళన రేపింది. అయితే జీవన్ వాయు పేరుతో రూపొందించిన ఒకకొత్త సీపాప్ డివైస్ వివరాలను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపర్ ( ఐఐటి రోపర్ )ట్వీట్ చేసింది. చాలా తక్కువ రేటులో సీపాప్ను మెషీన్ మోడల్ రూపొందించడం ఒక ప్రత్యేకత అయితే..విద్యుత్ అవసరం లేకుండానే పనిచేయడం మరో విశేషం. ఐఐటీ రోపార్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖుష్బూరాక దీన్ని డిజైన్ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా విద్యుతు అవసరం లేకుండానే అతి తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేసినట్టు రాక వెల్లడించారు. నిమిషానికి 15 లీటర్లు ఆక్సిజన్ అందిస్తుండగా, తమ డివైస్ ద్వారా నిమిషానికి 16 లీటర్లు దాకా అందిచ వచ్చన్నారు. అంతేకాదు దీన్ని 3 వేల రూపాయలలోపే దీన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘జీవన్ వాయు’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ మెషీన్ ద్వారా గ్రామాలు, సౌకర్యాలు కొరత వున్న గ్రామాల నుంచి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు చేరేవారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పీఈసీ భాగస్వామ్యంతో ఈ పరికరాన్ని తయారుచేసినట్టు వెల్లడించారు. అన్ని అనుమతులు లభిస్తే.. త్వరలోనే దీన్ని కమర్షియల్గా అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె చెప్పారు. @iitrpr develops NATION’S FIRST Power-free CPAP device ‘JIVAN VAYU’ to save lives in villages and low resource areas and during transit of patients from ambulance to hospitals. @Reuters @DrRPNishank @EduMinOfIndia @SanjayDhotreMP @iitcouncil @PIB_India @HuffPost @PTI_News pic.twitter.com/VBKtKxWWqG — IIT Ropar (@iitrpr) June 14, 2021 -
దారుణం: పదేళ్ల బాలికపై అత్యాచారం.. వీడియో చిత్రీకరణ
చంఢీగఢ్: హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. రేవారి అనే గ్రామంలో ఓ ఖాళీ పాఠశాల భవనంలో పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితులు బాలికను గ్రామంలోని ఓ ఖాళీ పాఠశాల భవనానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తెలిపారు. ఈ నేరాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని పేర్కొన్నారు. కాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలిక కుటుంబం జూన్ 9న పోలీసులకు ఫిర్యాదు చేసిందని అన్నారు. ఇక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఐదుగురు మైనర్లు 10 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 5వ తరగతి చదువుతున్న బాలికను తన ఇంటి బయట ఆడుతుండగా నిందితులు ఆమెను కిడ్నాప్ చేసినట్టు వెల్లడించారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి నిందుతులను అరెస్ట్ చేశారు. చదవండి: విషాదం: కుటుంబ కలహాలతో ఐదుగురు కుమార్తెలు సహా... -
వైరల్: వయసు డెబ్బై ఆరు.. ఈ విషయంలో యమ హుషారు!
చంఢీగఢ్: కాలం మారింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అన్ని విషయాల్లో వేగం పెంచాడు. అయితే ఓ 70 ఏళ్లు దాటిన మనిషి ఏం చేస్తాడు.. చాలా వరకు కృష్ణా!రామా! అంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ చంఢీగఢ్కి చెందిన ఈ 76 ఏళ్ల త్రిపాత్ మాత్రం ఫిట్నెస్ ఫీట్లతో ఇరదీస్తున్నాడు. "పునరాగమనం ఎల్లప్పుడూ ఎదురుదెబ్బ కంటే గొప్పది!" అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 39, 549 మంది వీక్షించగా..వందల మంది తాతను ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో త్రిపాత్ వివిధ రకాల ఫీట్లతో ఎక్స్ర్సైజ్ చేస్తూ కనిపిస్తాడు. అతడి కండలను చూపిస్తూ.. ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. కాగా 1999వ సంవత్సరంలో త్రిపాత్ భార్య మంజీత్ చనిపోయింది. దాంతో ఆయన గుండెలు బాదుకున్నాడు. తీవ్ర నిరాశకు లోనయ్యాడు. వ్యాపారాన్ని కూడా సరిగ్గా పట్టించుకోలేదు. ఒకానొక సమయంలో మంచానికి పరితమయ్యాడు. అయితే ఆయన పరిస్థితి చూసి కొంత మంది సలహా ఇవ్వడంతో వ్యాయామం చేయడం ప్రారంభించాడు. ప్రస్తుతం మంజీత్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: దారుణం: కావలసినంత కట్నం తేలేదని కాల్పులు) -
ప్రముఖ సీనియర్ నటికి బ్లడ్ క్యాన్సర్..
ముంబై : బీజేపీ చండీగఢ్ ఎంపీ, సీనియర్ నటి కిరణ్ ఖేర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ రకమైన బ్లడ్ క్యాన్సర్కు గురైన కిరణ్ ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని చండీఘడ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సూద్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ. .కిరణ్ ఖేర్ గత సంవత్సరం నవంబర్ 11న చండీగఢ్లోని తన ఇంట్లో పడిపోవడం వల్ల ఎడమ చేయి విరిగిందని, దీంతో చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఆర్)లో వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. ఇందులో ఆమెకు మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. అనంతరం ఈ వ్యాధి ఆమె ఎడమ చేతి నుంచి కుడి భుజానికి వ్యాపించిందని, వైద్యం కోసం డిసెంబర్ 4న ముంబైలోని ఆసుపత్రిలో చేరిందని పేర్కొన్నారు. నాలుగు నెలల చికిత్స పొందుతున్న కిరణ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆమెను ఇకపై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరనవసరం లేదన్నారు. కేవలం సాధారణ చికిత్స కోసం ఆసుపత్రిని సందర్శించాల్సి ఉంటుందని అరుణ్ సూద్ తెలిపారు. కాగా కిరణ్ బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ భార్య అన్న విషయం తెలిసిందే. అనుపమ్ కూడా తన ఆరోగ్యంపై స్పందిచారు. కిరణ్ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు స్వస్తి పలుకుతూ ఆమెకు రక్త క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్టు పెట్టారు. ‘కిరణ్ మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్నారని మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆమె ఎంతో అదృష్టవంతురాలు. అందుకే ఆమెను మీరు ఇంతలా ప్రేమిస్తున్నారు. మీ హృదయంలో ఆమె కోలుకోవాలని ప్రార్థించండి. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు- అనుపమ్, సికందర్’.. అని ట్వీట్ చేశారు. కాగా కిరణ్ ఖేర్ 2014లో బీజేపీ పార్టీ తరపున చండీగఢ్ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2019లోనూ గెలిచి తన స్థానాన్ని నిలుపుకున్నారు. చదవండి: రైల్వే ప్లాట్ఫామ్పై పడుకున్న రోజులూ ఉన్నాయి: నటుడు ‘పెళ్లైన ఆ స్టార్ హీరోతో నయనతార సహజీవనం’ 🙏 pic.twitter.com/3C0dcWwch4 — Anupam Kher (@AnupamPKher) April 1, 2021 -
నేల మీద ప్రయాణిస్తొన్న పంజాబ్ రాఫెల్
-
వైరల్: నేల మీద ప్రయాణిస్తొన్న పంజాబ్ రాఫెల్!
చంఢీగఢ్: విమానం అనగానే మనకు వేగం..ఆకాశంలో ఎగరడం గుర్తొస్తుంది. అయితే ఈ ‘పంజాబ్ రాఫెల్’ మాత్రం కాస్త స్సెషల్ . ఇది ఆకాశంలో కాకుండా నేలమీద ప్రయాణిస్తొంది. పంజాబ్లోని బతిండాకు చెందిన ఆర్కిటెక్ట్ రాంపాల్ బెహనీవాల్ దీన్ని తయారు చేశాడు. కాగా, రాఫెల్ను స్ఫూర్తిగా తీసుకొని దీన్ని తయారు చేసినట్టు ఆయన తెలిపాడు. ఇది రాఫెల్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ పంజాబ్ రాఫెల్ నేలపై గంటకు 15-20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. దీని తయారీకి మూడు లక్షలు ఖర్చయ్యిందని రాంపాల్ తెలిపాడు. కాగా, రాఫెల్లో ఎగరలేని వారు తన పంజాబ్ రాఫెల్లో ప్రయాణించి కోరిక నెరవేర్చుకోవచ్చని తెలిపాడు. మొత్తానికి ఈ రాఫెల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని తొందరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పంజాబ్ ఆర్కిటెక్ట్ తెలిపాడు. చదవండి: వైరల్: ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓడ! -
పెళ్లిలో జోష్గా స్టెప్పులేసిన కశ్మీర్ మాజీ సీఎం..
చంఢీగఢ్: రాజకీయాల్లో బిజీగా ఉండే జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా ఓ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మనవరాలి వివాహం ఢిల్లీకి చెందిన బిజినెస్మెన్ ఆదిత్యానారంగ్తో జరిగింది. చండీగఢ్లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఫరూఖ్ అబ్దుల్లా హాజరయ్యారు. కాగా, ఏనభై ఏళ్ళ వయస్సులోను ఫరూఖ్.. కెప్టెన్ అమరీందర్ సింగ్తో కలిసి స్టేజీ పైన జోష్గా స్టెప్పులేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో అమరీందర్ సింగ్ పాడుతూంటే దానికి తగ్గట్టుగా అబ్దుల్లా స్టెప్పులు వేసి అక్కడి వారిలో మరింత జోష్ను నింపుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ వయస్సులో కూడా ఇంత ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అయితే .. వీరిద్దరు కలిసి గతంలో మహమ్మద్ రఫీ పాడిన ‘ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కె చర్చే..’, ‘గులాబీ ఆంఖే జో తెరి దేఖీ..’ అనే పాటల పైన జోష్గా స్టెప్పులేశారు. చదవండి: వైరల్: భర్తను కోల్పోయిన టీచర్కు స్టూడెంట్ ఓదార్పు -
పెళ్ళిలో ఫుల్ జోష్గా కశ్మీర్ మాజీ సీఎం..
-
కాస్పర్ టెస్ట్ కేక: కరోనాను గుర్తిస్తున్న జాగిలాలు
న్యూఢిల్లీ: కరోనా సోకిందో లేదో అనేది చిన్న పరీక్షతో తేలనుంది. వైద్యలు అవసరం లేకుండా మన జాగిలాలు గుర్తిస్తున్నాయి. సైన్యానికి చెందిన కుక్కలు ఎవరికి కరోనా సోకిందో.. ఎవరికీ లేదో చెబుతున్నాయి. ఈ మేరకు జాగిలాలకు సైనిక అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో మొత్తం 3,800 నమూనాలు పరీక్షించగా వాటిలో 22 పాజిటివ్స్ను ఆ జాగిలాలు గుర్తు పట్టాయి. ఒక డబ్బాలోని మూత్రం (యూరిన్) శాంపిల్ వేస్తే.. దాని వాసన చూసి కరోనా పాజిటివా కాదా కుక్క చెప్పేస్తోంది. భారత సైన్యానికి చెందిన ఈ జాగిలం పేరు కాస్పర్. రెండేళ్ల వయసున్న దీని ముందు తీసుకున్న శాంపిళ్లను డబ్బాల్లో వేసి ఉంచగా వాటిలో పాజిటివ్ ఉన్న డబ్బాను ఎంచుకుంటుంది. దీంతో మిగతా డబ్బాల వారికి కరోనా సోకలేదని నిర్ధారించుకోవచ్చు. ఇంకో జాగిలం కూడా ఉంది. దాని పేరు జయ. ఏడాది వయసున్న ఈ కుక్క తన ముక్కుతో కోవిడ్ సోకిన వారి నమూనాలను గుర్తిస్తోంది. ఈ రెండు శునకాలు ఇప్పటికే 3,800 నమూనాలను పరీక్షించాయి. వీటిలో 22 పాజిటివ్గా తేలాయి. కొన్ని సెకన్లలోనే అవి ఫలితం ఇస్తుండడంతో అధికారులు వాటిని అభినందిస్తున్నారు. పాజిటివ్ కేసు ఉన్న శాంపిల్ను ఆ జాగిలాలు గుర్తించి వాటి పక్కన నిల్చుంటున్నాయి. దీంతో ఆ డబ్బాలో ఉన్న నమూనాకు సంబంధించిన వ్యక్తి కోవిడ్ సోకిందని నిర్ధారిస్తున్నారు. ఈ విధంగా జాగిలాలను వైద్యపరంగా కూడా వినియోగిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో అధికారులు మూత్రం, చెమట వాసనతో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించడంపై శిక్షణ ఇస్తున్నారు. ఈవిధంగా రెండూ జాగిలాలు సిద్ధం కాగా.. మరొకటి శిక్షణ పొందుతోంది. దాని పేరు మణి. ఈ జాగిలాలను లఢక్, కశ్మీర్లాంటి ప్రాంతాల్లో పని చేసే జవాన్ల శాంపిళ్లను గుర్తించేందుకు వినియోగించనున్నారు. ప్రస్తుతం చండీగఢ్ క్యాంప్లో ఈ జాగిలాలు ఈ పని చేస్తున్నాయి. ఈ విధంగా ఇంకా 8 జాగిలాలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి విధానం బ్రిటన్, ఫిన్లాండ్, రష్యా, ఫ్రాన్స్, యూఏఈ, జర్మనీ, లెబనన్ వంటి దేశాల్లో అమల్లోకి వచ్చింది. -
భారత్లో మొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు
చండీగఢ్: దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ సర్వీసు చండీగఢ్లో ప్రారంభమయ్యింది. హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ చండీగఢ్ విమానాశ్రయంలో ఈ సర్వీసును ప్రారంభించారు. ఉడాన్ పథకంలో భాగంగా ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ట్యాక్సీ చండీగఢ్ నుంచి హిసార్ వరకు ప్రయాణికులను చేరవేయనుంది. రెండో దశలో హిసార్ నుంచి డెహ్రాడూన్ వరకు మరో ఎయిర్ ట్యాక్సీని వచ్చేవారం ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. మూడో దశలో చండీగఢ్ నుంచి డెహ్రాడూన్, హిసార్ నుంచి ధర్మశాల వరకు ఈ సేవలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం సిమ్లా, కులూతోపాటు ఇతర పర్యాటక ప్రాంతాలను సైతం ఇందులో చేర్చాలని యోచిస్తున్నారు. ఎయిర్ ట్యాక్సీ కోసం టెక్నామ్ పీ2006టీ విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో నాలుగు సీట్లు ఉంటాయి. ప్రయాణ చార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ ఇవ్వనుంది. మెట్రో 2 టైర్, 3 టైర్ నగరాలను ఎయిర్ ట్యాక్సీలతో అనుసంధానిస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. చదవండి: ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం ‘నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని’ -
అగ్రస్థానంలో కేరళ.. అట్టడుగున యూపీ!
బెంగళూరు: సుపరిపాలన సాగిస్తున్న రాష్ట్రాల్లో కేరళ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తర్వాతి స్థానాలు ఆక్రమించాయి. ఇక అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ జాబితాలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరిరంగన్ నేతృత్వంలోని స్వచ్ఛంద సంస్థ ‘‘ది పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ 2020’’ పేరిట శుక్రవారం ర్యాంకులు ప్రకటించింది. సుస్థిరాభివృద్ధి ఆధారంగా ఈ జాబితా విడుదల చేసినట్లు పేర్కొంది. సమానత్వం, అభివృద్ధి సూచిలో పెరుగుదల, సుస్థిరత అనే మూడు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. (చదవండి: రోడ్డు మీద వరి పండించాడు ) ఇందులో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉండగా, యూపీ, ఒడిశా, బిహార్ నెగటివ్ పాయింట్లతో అట్టడగున నిలిచినట్లు తెలిపింది. ఇక చిన్న రాష్ట్రాల కేటగిరీలో గోవా 1.745 పాయింట్లతో అగ్రస్థానం ఆక్రమించగా, మేఘాలయ(0.797), హిమాచల్ ప్రదేశ్(0.725) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాగా మణిపూర్(-0.363), ఢిల్లీ(-0.289), ఉత్తరాఖండ్ (-0.277) అత్యంత ఘోరమైన ప్రదర్శనతో వెనుకబడినట్లు పీఏసీ నివేదిక వెల్లడించింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్(1.05) మొదటి స్థానంలో నిలవగా, పుదుచ్చేరి(0.52), లక్షద్వీప్(0.003), దాదర్ అండ్ నగర్ హవేలీ(-0.69), అండమాన్, జమ్మూకశ్మీర్(-0.50), నికోబార్ (-0.30)తర్వాతి స్థానాల్లో నిలిచాయి. -
పెళ్లిలో చేతివాటం.. రూ.3 లక్షలు చోరీ
చంఢీగడ్: ఓ వైపు పెళ్లి పనులతో కుటుంబ సభ్యులంతా బిజీ బిజీగా ఉండగా.. ఓ వ్యక్తి చేతివాటం ప్రదర్శించాడు. మూడు లక్షల రూపాయల సొమ్ము, డైమండ్ రింగ్తో ఉడాయించాడు. ఈ సంఘటన చంఢీగడ్లో చోటు చేసుకుంది. వివరాలు.. ఉషా ఠాకూర్ అనే మహిళ తన కుమార్తె వివాహాన్ని హోటల్ సెక్టార్ 22లో జరుపుతుంది. పెళ్లికి వచ్చిన వారు వధూవరులను ఆశీర్వదించి డబ్బులు ఇచ్చారు. ఇలా మొత్తం మూడు లక్షల రూపాయలు వచ్చాయి. ఈ మొత్తాన్ని తన హ్యాండ్బ్యాగ్లో ఉంచారు ఉషా. డబ్బుతో పాటు రెండు మొబైల్ ఫోన్లు, ఒక డైమండ్ రింగ్ కూడా బ్యాగులోనే పెట్టారు. ఇక పెళ్లి కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. కాసేపటి తర్వాత తన హ్యాండ్బ్యాగ్ లేదనే విషయం గుర్తుకు వచ్చింది. దాంతో అన్ని చోట్లా వెతికారు. కానీ లాభం లేకపోయింది. (చదవండి: మళ్లీ మత్తు దోపిడీ) వెంటనే సమీప పోలీసు స్టేషన్కి వెళ్లి దీని గురించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివాహ వేడుకకు సంబంధించి సీసీటీవీ, వీడియో ఫుటేజ్ని స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉషా ఠాకూర్ బంధువుగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి హడావుడిగా హోటల్ నుంచి వెళ్లడం పోలీసుల దృష్టికి వచ్చింది. మాస్క్ ధరించడంతో ముఖం పూర్తిగా కనిపించలేదు. దాంతో అతడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
నటుడు రాజన్ సెహగల్ కన్నుమూత
ఈ ఏడాది బాలీవుడ్ షాక్ల మీద షాక్లు ఇస్తోంది. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ వంటి స్టార్స్ను కోల్పోయింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడం ఓ పెద్ద విషాదం. తాజాగా బాలీవుడ్ సినీ, టీవీ నటుడు రాజన్ సెహగల్ (36) అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చండీగఢ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బుల్లితెరపై క్రైౖమ్ పెట్రోల్, సావధాన్ ఇండియా, తుమ్ దేనా సాత్ మేరా వంటి కార్యక్రమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన రాజన్ ఆ తర్వాత బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చారు. ఐశ్వర్యా రాయ్, రణదీప్ హుడా నటించిన ‘సరబ్జిత్’ చిత్రంలో చేసిన రవీంద్ర పాత్ర రాజన్కి మంచి గుర్తింపు తెచ్చింది. ‘ఫోర్స్, కర్మ’ వంటి చిత్రాలతో పాటు పంజాబీ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకుల్ని మెప్పించారాయన. రాజన్ సెహగల్ మృతి పట్ల సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
లైంగిక వేధింపులు : తండ్రి ఏం చేశాడంటే..
సాక్షి, చండీగడ్: కుమార్తెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న తండ్రి గాథ ఇది. టెన్నిస్ నేర్చుకోవడానికి వెళ్లిన కుమార్తెపై లైంగిక వేధింపులను తండ్రి గుండె తట్టుకోలేక పోయింది. న్యాయంకోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. అయితే నిందితులు మైనర్ పేరుతో విచారణనుంచి, శిక్షనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఆయన మరింత ఆందోళన పడ్డారు. దోషులను అంత తేలికగా వదలకూడదనే పట్టుదలతో తన న్యాయ పోరాటాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్పై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. చండీగఢ్లోని అకాడమీ ఆఫ్ రూరల్ టెన్నిస్లో మహిళా ట్రైనీని లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది ఆగస్టులో కేసు నమోదైంది. జూనియర్ డేవిస్ కప్ ప్లేయర్తో సహా ఐదుగురు నిందితులపై కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి. విచారణ సమయంలో(టెన్నిస్ అకాడమీ) అందించిన నిందితుల జనన ధృవీకరణ పత్రాలను చండీగఢ్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. అయితే దీన్ని ఎంతమాత్రం అంగీకరించలేని బాధితురాలి తండ్రి అవి తప్పుడు ధృవీకరణ పత్రాలని, నిందితులు మైనర్లు కాదని నిరూపించేందుకు నడుం బిగించారు. నిజమైన పత్రాల కోసం నిందితుల గ్రామాలకు వెళ్లారు. నెలల తరబడి హర్యానాలోని రోహ్తక్, పాల్వాల్, హిసార్లలో పర్యటించి, ముగ్గురు నిందితులు చదివిన ప్రాథమిక స్థాయి ప్రభుత్వ పాఠశాలలకు చేరుకుని, అక్కడ విచారించి మొత్తంమీద అసలు పుట్టిన తేదీలను తవ్వి తీశారు. అనంతరం వాటిని కోర్టుముందు ఉంచారు. నిందితుల బెయిల్ రద్దు చేయాలని అప్పీల్ చేశారు. వీటిని పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో చివరకు పోలీసులు కూడా బాధిత బాలిక తండ్రి సమర్పించిన పత్రాలు సరైనవని ధృవీకరిస్తూ తమ నివేదికను కోర్టులో సమర్పించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపి నివేదిక సమర్పించామని, మిగిలిన వ్యవహారం కోర్టు చేతిలో ఉందని చండీగఢ్ పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉంటే ఈ కేసులో ఒక నిందితుని బర్త్ సర్టిఫికెట్ను ఆరోగ్య శాఖ రద్దు చేసింది. ఈ కేసులో, అతని తండ్రి, మరో ఇద్దరిపై హిజార్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదయ్యాయి. మరో ఇద్దరు నిందితులపై దర్యాప్తు ఇంకా జరుగుతోంది. దీంతో నిందితుల్లో ఒకరికి వ్యతిరేకంగా ఆయన చేసిన వాదన నిజమని తేలింది. కరోనా మహమ్మారి కారణంగా కోర్టు విచారణ నిలిచిపోయిన కారణంగా న్యాయం చేయాలంటూ ఆయన ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్కు కూడా లేఖ రాశారు. అయితే ఇంకా స్పందన రాలేదని పేర్కొన్నారు. లైంగిక వేధింపుల నిందితులకు చట్టపరమైన మద్దతు ఇవ్వడంతోపాటు బెయిల్ బాండ్లను చెల్లించి చండీగఢ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ నిందితులకు వత్తాసు పలికిందని తండ్రి ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం జరిగి తీరుతుందనీ, మిగిలిన ఇద్దరి విషయంలో నిజాలు నిగ్గు తేలతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయం కోర్టులో ఉన్న కారణంగా స్పందించడానికి టెన్నిస్ అసోసియేషన్ నిరాకరించింది. -
కూతురికి వేధింపులు.. తండ్రి అలుపెరగని పోరాటం
చండీగఢ్: ఆడవారి మీద వేధింపులకు ప్రధానమైన కారణం.. బలహీనులు, బయటకు చెప్తే.. సమాజంతోపాటు కుటుంబ సభ్యులు కూడా వారినే శిక్షిస్తారనే ఉద్దేశంతో చాలా మంది మృగాళ్లు ఆడవారి పట్ల దారుణాలకు పాల్పడుతుంటారు. ప్రతిరోజు వెలుగులోకి వచ్చే వార్తలు చూస్తే.. ఇది నిజమేననిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆడవారికి అన్యాయం జరిగినప్పుడు సమాజం సంగతి పక్కనే పెడితే.. కుటుంబం తోడుగా నిలబడి మద్దతిస్తే చాలు.. మరిన్ని అన్యాయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చండీగఢ్లో చోటు చేసుకుంది. కుమార్తెను వేధించిన వారికి శిక్ష పడేలా చేయడం కోసం ఓ తండ్రి అలుపెరగిన పోరాటం చేస్తున్నాడు. ఆ వివరాలు.. చండీగఢ్కు చెందిన ఓ యువతి టెన్నిస్ శిక్షణ కోసం రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన ఓ అకాడమీలో చేరింది. అక్కడ ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న ఓ ఐదుగురు యువకులు బాధితురాలిని లైగింక వేధింపులకు గురి చేశారు. వీరిలో ఒక వ్యక్తి జూనియర్ డేవిస్ కప్ ప్లేయర్ కూడా కావడం గమనార్హం. దీని గురించి బాధితురాలు తండ్రితో చెప్పింది. ఆయన ఈ విషయం బయటకు తెలిస్తే.. పరువు పోతుందని ఆలోచించలేదు. తన బిడ్డ పట్ల తప్పుగా ప్రవర్తించిన వారికి శిక్షపడాలని భావించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు కోర్టుకు చేరింది. ఇక వారికి తప్పక శిక్ష పడుతుంది.. కూతురికి న్యాయం జరుగుతుందని ఆశించిన ఆ తండ్రికి నిరాశే ఎదురయ్యింది. కేసు విచారణ సమయంలో పోలీసులు టెన్నిస్ అకాడమీ వారు ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్లు కోర్టుకు అందజేశారు. దాని ప్రకారం నిందితులంతా మైనర్లుగా భావించింది కోర్టు. వారికి బెయిల్ మంజూరు చేసింది. తప్పు చేసిన వాళ్లే దర్జగా బయటకు వెళ్తుంటే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. నిందితులు కోర్టుకు తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చారని గ్రహించిన ఆ తండ్రి.. వాస్తవాలు వెలుగు తీసేందుకు ప్రయత్నించాడు. (మరో ఇద్దరు యువతుల ప్రమేయం!) నిజమైన బర్త్ సర్టిఫికెట్ల కోసం ఆ తర్వాత కొన్ని నెలల పాటు శ్రమించి ఆ ఐదుగురు నిందితుల స్వగ్రామాలైన హరియాణాలోని రోహ్తక్, పాల్వాల్, హిసార్లలో పర్యటించాడు. నిందితులు ప్రాథమిక స్థాయిలో చదివిన ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి వారి అసలు పుట్టిన తేదీల గురించి ఆరా తీయడం ప్రారంభించాడు. అతడి అనుమానం నిజమయ్యింది. పోలీసులు తప్పుడు బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిసింది. స్కూల్ రికార్డ్స్ ప్రకారం వారి మైనర్లు కాదని తేలింది. వీటిని కోర్టులో సమర్పించి.. నిందితుల బెయిల్ రద్దు చేయాలని బాధితురాలి తండ్రి కోరాడు. కోర్టు దీని గురించి పోలీసులను ప్రశ్నిస్తే వారు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ‘కోర్టు ఆదేశాల మేరకు మేం పత్రాలను పరిశీలించి రికార్డు సబ్మిట్ చేశాం. అయితే నిందితులు ఇచ్చిన పత్రాలు నిజమైనవా.. కావా అనే విషయం తేల్చాల్సింది కోర్టు’ అన్నారు. ముఖ్యమంత్రికి ఫిర్యాదు బాధితురాలి తండ్రి ఇంతటితో ఊరుకోలేదు. జరిగిన విషయాల గురించి హరియాణా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశాడు. అనంతరం జరిగిన విచారణలో ఒక నిందితుడు తప్పుడు పత్రాలు సమర్పించాడని రుజువయ్యింది. దాంతో ఆరోగ్య శాఖ అతడి బర్త్ సర్టిఫికెట్ను క్యాన్సల్ చేసింది. నిందితుడితో పాటు అతడి తండ్రి, మరో ఇద్దరి మీద కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే కారణంతో కేసు కూడా నమోదు చేసింది. మరో ఇద్దరిపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కోర్టు విచారణకు తాత్కలికంగా బ్రేక్ పడింది. కోర్టులు తెరిచిన తర్వాత అయినా వీరందరికి తగిన శిక్ష పడుతుందని భావిస్తున్నాడు బాధితురాలి తండ్రి. ఏఐటీఏ నుంచి ఎలాంటి స్పందన లేదు ఈ సందర్భంగా బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘ఈ విషయం గురించి నేను ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్కు లేఖ రాశాను. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. అంతేకాక చండీగఢ్ లాన్ టెన్నిస్ అసోసియేషన్(సీఎల్టీఏ) నిందితులకు చట్టపరమైన మద్దతు ఇవ్వడమే కాక వారి బెయిల్ బాండ్లను కూడా చెల్లించింది’ అని తెలిపాడు. దీని గురించి సీఎల్టీఏను ప్రశ్నించగా.. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తున్నందున తామేమి స్పందించలేమని తెలిపింది. -
లంక అంటూ పంజాబ్లో ఆడించారు...
న్యూఢిల్లీ: శ్రీలంకకు చెందిన రెండు జట్లు మొనరగల హార్నెట్స్, వెల్లవాయ వైపర్స్... ఇరు జట్ల మధ్య టి20 లీగ్ మ్యాచ్. పలు సోషల్ మీడియా సైట్లలో ప్రత్యక్ష ప్రసారం కూడా. ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్లో స్కోరు కార్డు. వేదిక శ్రీలంకలోని బదుల్లా పట్టణం. కామెంటేటర్ కూడా ‘ఇక్కడ బదుల్లాలో మ్యాచ్కు అంతా సిద్ధమైంది, వాతావరణం బాగుంది’ అంటూ వ్యాఖ్యానం. పైగా అక్కడక్కడా శ్రీలంక ప్రముఖ మొబైల్ కంపెనీ డైలాగ్కు చెందిన బ్యానర్లు కూడా... కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే వుంది. ఈ మ్యాచ్ జరిగింది లంకలో కాదు. భారత్లోనే... చండీగఢ్కు 16 కిలోమీటర్ల దూరంలోనే జాతీయ రహదారిపై ఉన్న సవారా గ్రామంలో మ్యాచ్ నిర్వహించారు. యువా టి20 లీగ్ పేరుతో ఈ టోర్నీ జరుగుతున్నట్లు కొందరు చెప్పారు. కానీ కరోనా కట్టుబాట్ల నేపథ్యంలో ఒక మ్యాచ్ ఎలా సాధ్యమంటూ వివరాల్లోకి వెళితే ఇది బయటపడింది. ఆన్లైన్ బెట్టింగ్ కోసమే ఇలాంటి మ్యాచ్ ఆడించినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆడింది అంతా పంజాబ్ కుర్రాళ్లే. శ్రీలంకలో గుర్తింపు పొందిన క్లబ్ యువా పేరు వాడుకొని కొందరు తెలివిగా ఇలా చేసినట్లు తెలిసింది. లంక బోర్డు తమకు టోర్నీ నిర్వహణ కోసం అధికారికంగా అనుమతి కూడా ఇచ్చినట్లు చూపించడంతో ప్రత్యక్ష ప్రసారానికి ‘ఫ్యాన్కోడ్’ అనే సైట్ ముందుకు వచ్చింది. దీనిపై ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు పొందిన ఆటగాళ్లు ఎవరూ ఇందులో పాల్గొనలేదు కాబట్టి తాము ఎలాంటి చర్య తీసుకోలేమని బీసీసీఐ స్పష్టం చేయగా... శ్రీలంక కూడా తమకు, ఈ టోర్నీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ప్రత్యక్ష ప్రసారం చేసిన ‘ఫ్యాన్ కోడ్’ మాతృసంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ కాగా...వారికి చెందిన బ్రాండ్, ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ ‘డ్రీమ్ 11’ ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటి. దీనికి ధోని అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు. -
ఈ మెడికల్ షాపు ప్రత్యేకతేంటో తెలుసా?
చండీగఢ్ : మామూలుగా ఏవైనా షాపు నేమ్ బోర్డులు ‘‘ సుబ్రహ్మాణ్యం అండ్ సన్స్.. వెంకటేశ్వర్లు అండ్ సన్స్’’ అంటూ పేరు చివర కుమారులను భాగస్వాములను చేస్తూ వ్యాపారాలు నడపటం పరిపాటి. కానీ పంజాబ్కు చెందిన ఓ మెడికల్ షాపు ఓనర్ మాత్రం ఉన్నతంగా ఆలోచించాడు. ‘‘ గుప్తా అండ్ డాటర్స్’’ అని షాపుకు పేరుపెట్టి వ్యాపారంలో కుమార్తెలను కూడా భాగస్వాములను చేశాడు. పంజాబ్లోని లుధియానాలో దర్శనమిచ్చింది ఈ మెడికల్ షాపు. డాక్టర్ అమన్ కశ్యప్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన ఫొటోను శుక్రవారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో మెడికల్ షాపు కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.(క్షణం ఆలస్యం అయ్యుంటే పరిస్థితి ఏంటి?) 2,500 లైక్స్, 500పైగా కామెంట్లతో దూసుకుపోతోంది. కేవలం ట్విటర్కు మాత్రమే పరిమితం కాకుండా ఫేస్బుక్లో కూడా వైరల్గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ‘‘ లవ్ ఇట్!... కొత్త శకం మొదలవుతోంది... నేను కూడా మా నాన్నకు ఇదే చెప్పాను. ఆయన ఒప్పుకోలేదు. దీన్ని చూసి చాలా సంతోషపడుతున్నా.. మా నాన్న కూడా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (కంటతడి పెట్టిస్తోన్న చిన్నారుల లేఖ) -
స్కూళ్లు ఫీజులు వసూలు చేసుకోవచ్చు!
చండీగఢ్: కరోనా విజృంభణ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా పలు నిబంధనలు సడలించిన కేంద్రం... విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు మాత్రం తెరవకూడదని స్పష్టం చేసింది. అదే విధంగా ఫీజులు వసూలు చేయరాదని, ఉద్యోగుల జీతాల్లో కోత విధించవద్దని నిబంధనల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ స్కూల్ అసోసియేషన్ ఆఫ్ చండీగఢ్ తమ ఇబ్బందులను వివరిస్తూ దాఖలు చేసింది. పాఠశాలల యాజమాన్య హక్కులు కాపాడాలని.. అలాగే జీతాలు చెల్లించడంతో పాటుగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు ఫీజు వసూలు చేయాల్సిన ఆవశ్యకత గురించి ప్రస్తావించింది.(మీడియాకు ముఖం చాటేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ) ఇక ఇందుకు స్పందించిన విద్యాశాఖ ప్రైవేటు స్కూళ్లు నెలవారీ ఫీజులు వసూలు చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు తాజాగా నోటీసులు జారీ చేసింది. అయితే ఏప్రిల్, మే నెలల ఫీజును మే 31 వరకు చెల్లించవచ్చని.. అయితే ఇందుకు ఎలాంటి పెనాల్టీలు విధించకూడదని స్పష్టం చేసింది. కాగా ఫీజు వసూళ్ల చెల్లింపు అంశంపై తల్లిదండ్రులు ఎలా స్పందిస్తారోనన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. లాక్డౌన్ కారణంగా ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ ప్రభుత్వ నిర్ణయం సరికాదని.. ఫీజు విషయంలో మరింత గడువు ఇవ్వాలని పలువురు హితవు పలుకుతున్నారు. (బస్సుల గోల.. కాంగ్రెస్పై అదితి ఫైర్) -
కన్న కూతుర్ని తల్లిని చేసిన కీచక తండ్రి
ఛండీఘర్ : అభంశుభం తెలియని మానసిక వికలాంగురాలైన కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో తండ్రి. కీచక తండ్రి కారణంగా ఆ కూతురు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన హర్యానా పంచుకులాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంచుకుల జిల్లాలోని సెక్టార్ 18 పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి మానసిక వికలాంగురాలైన 23 ఏళ్ల తన కూతురిపై తరచుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ఆమెకు కడుపునొప్పి రావటంతో ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ యువతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని, కుటుంబసభ్యుల్ని విచారించగా యువతి గర్భానికి గల కారణాలను వారు చెప్పలేకపోయారు. ( ఇద్దర్ని కాల్చిచంపిన పోలీస్ కానిస్టేబుల్ ) పోలీసులకు బాధితురాలి తండ్రిపై అనుమానం కలగటంతో అతడ్ని విచారించారు. దీంతో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఓ సంవత్సర కాలంగా కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలిపాడు. అనంతరం అతడిపై రేప్ కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడిన విషయం ఇంట్లో ఎవరికీ తెలియదని బాధితురాలు వాపోతుండటం గమనార్హం. ( కంటిపాపకు తెలియకుండా కాటికి..) -
రోడ్డుపై ఉమ్మి, చేతులతో క్లీన్ చేసి
చండీగఢ్: కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం కఠిన చర్యలను చేపడుతోంది. ఫేస్ మాస్కు ధరించకపోయినా, అనవసరంగా రోడ్ల మీదకు వచ్చినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేసినా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి అదేమీ పట్టించుకోకుండా రోడ్డుపై ఉమ్మివేశాడు. అయితే కొన్ని క్షణాలకే తిరిగొచ్చి మరీ దాన్ని క్లీన్ చేసిన ఘటన చండీగఢ్లో చోటు చేసుకుంది. పిల్లాడిని వెంటేసుకుని ఓ వ్యక్తి బైక్పై వెళుతున్నాడు. తననెవరూ గమనించట్లేదనుకున్నాడో ఏమో కానీ రోడ్డుపై ఉమ్మేశాడు. దీన్ని గమనించిన బల్దేవ్ సింగ్ అనే ట్రాఫిక్ వలంటీర్ అతడిని ఆపేశాడు. (లాక్డౌన్: రోడ్లపై అడవి జంతువుల కలకలం) సదరు వ్యక్తి ఉమ్మిన ప్రదేశాన్ని అతనితోనే శుభ్రం చేయించాడు. విశేషమేంటంటే ఇందులో అతను రోడ్డుపై కూర్చొని తన స్వహస్తాలతో క్లీన్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా ప్రధాని మోదీ సైతం రోడ్లపై ఉమ్మివేయరాదని ప్రజలను కోరిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రాథమిక పరిశుభ్రత మెరుగవుతుందని, కరోనా వైరస్కు వ్యతిరేకంగా పోరాడేందుకు కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇదిలా వుండగా కరోనా ముఖ్యంగా నోరు, ముక్కుతో పాటు కంటి ద్వారా వ్యాపిస్తుందన్న విషయం తెలిసిందే. (వైరల్ ఫొటో: తండ్రి, కూతుళ్లపై ప్రశంసలు) -
కన్న కూతురిని హతమార్చిన తల్లి.. ఆపై
చండీగఢ్: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న వేళ పంజాబ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమను ఎదురించి ప్రియుడి ఇంటికి చేరుకున్న కూతురిని దారుణంగా హతమార్చింది ఓ తల్లి. మిస్సింగ్ కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. వాస్తవాలు బయటపడటంతో కటకటాలపాలైంది. వివరాలు.. హోషియాపూర్కు చెందిన బల్వీందర్ కౌర్ కుమార్తె(19) అమన్ప్రీత్ సింగ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఇంట్లో గొడవపడి భల్జాన్ గ్రామంలో ఉన్న అమన్ వద్దకు చేరుకుంది. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి బల్వీందర్ తమ కుమార్తె కనిపించడం లేదని.. ఇందుకు అమనే కారణమంటూ పోలీసులకు ఏప్రిల్ 22న ఫిర్యాదు చేసింది.(ఫేస్బుక్ వీడియోపై కామెంట్లు చేసిందని..) ఈ క్రమంలో తన బంధువులు సదేవ్, ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు గుర్దీప్ సింగ్ సహా మరో ముగ్గురు వ్యక్తుల సాయంతో పంచాయతీ పెట్టించి కూతురిని తిరిగి ఇంటికి తీసుకువచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 25 అర్ధరాత్రి కూతురి చేత బలవంతంగా నిద్రమాత్రలు మింగించి.. తన కజిన్ శివరాజ్, లాలాను పిలిపించింది. వారిద్దరు నిద్రలో ఉన్న బాధితురాలిని గొంతునులిమి చంపేశారు. అనంతరం సత్యదేవ్, గుర్దీప్లతో కలిసి బల్వీందర్ కూతురి శవాన్ని రహస్యంగా కాల్చేసి మిన్నకుండిపోయింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బల్వీందర్, శివరాజ్లను విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారితో పాటు లల్లా, గుర్దీప్, సదేవ్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.(‘లూడో’లొ ఓడించిందని భార్యను..) -
ఆరు నెలల చిన్నారిని పొట్టన పెట్టుకున్న కరోనా
చండీఘడ్: కరోనాకు చిన్నాపెద్దా తేడా లేదు, ఎవరిని పడితే వారిని పొట్టనపెట్టుకుంటూ మృత్యు మృదంగం మోగిస్తోంది. తాజాగా కరోనా బారిన పడ్డ ఆరు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన పంజాబ్లోని చండీఘడ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చండీఘడ్లోని పగ్వారాకు చెందిన ఆరు నెలల పాప హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతోంది. దీంతో ఆమెను తొలుత స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించగా అనంతరం లూధియానా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో ఏప్రిల్ తొమ్మిదిన ఆమెను చండీఘడ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎమ్ఈఆర్)లో చేర్పించారు. మంగళవారం మధ్యాహ్నం ఆమెకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా తేలింది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్న క్రమంలో గురువారం మధ్యాహ్నం చిన్నారి కన్నుమూసింది. (లాక్డౌన్: పోలీసులతో గొడవ) -
ఐఏఎఫ్ హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
చండీగఢ్ : భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ శుక్రవారం మధ్యాహ్నం పంజాబ్లోని హోషియార్పూర్లో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండయింది. పఠాన్కోట్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయిన ఐఏఎఫ్ హెలికాఫ్టర్ సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిందని అధికారులు వెల్లడించారు. హెలికాఫ్టర్ కంట్రోల్ ప్యానెల్స్లో హెచ్చరిక సంకేతాలు రావడంతో ముందుజాగ్రత్త చర్యగా హోషియార్పూర్ గ్రామంలో ల్యాండయిందని భారత వైమానిక దళం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనలో పైలట్లు, ఇతర సిబ్బంది క్షేమంగా బయటపడ్డారని ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఎయిర్ఫోర్స్ వర్గాలు పేర్కొన్నాయి. హెలికాఫ్టర్ను పరిశీలించిన అనంతరం దాన్ని తిరిగి ఎయిర్బేస్కు తరలిస్తామని ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు. కాగా వైమానిక దళానికి చెందిన చీతా హెలికాఫ్టర్ సైతం గురువారం ఘజియాబాద్ ఎయిర్బేస్ నుంచి చండీగఢ్ వెళుతూ సాంకేతిక సమస్యలతో ఇదే ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. చదవండి : కూలిన విమానం; రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లతో... -
లాక్డౌన్: రోడ్లపై అడవి జంతువుల కలకలం
చండీగఢ్: కరోనా కారణంగా దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారడంతో అడవి జంతువులు రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో ఒక అడవి దున్న రోడ్డు పైకి వచ్చి స్థానికులను ఆశ్చర్యపరచగా, కేరళలో మలబార్ సివెట్ రోడ్డుపై ఠీవిగా నడుచుకుంటూ వెళుతూ కెమెరాలకు చిక్కింది. ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి చండీగఢ్లో చోటు చేసుకుంది. ( కరోనా: కేరళ రోడ్డుపై అనుకోని అతిథి) చిరుతను పోలిన ఓ అడవి జంతువు సోమవారం చండీగఢ్లోని సెక్టార్ 5 రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఒక ఇంటిలో కనిపించింది. దీంతో అక్కడ ఉన్న ఎవ్వరు ఇళ్లు దాటి బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అయితే వచ్చిన జంతువు చిరుత పులి అని పోలీసులు చెబుతుండగా.. అది చిరుతపులి అని కచ్ఛితంగా చెప్పలేమని వైల్డ్ లైఫ్ యాక్టివిస్ట్లు చెబుతున్నారు. దీనిపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ జస్పాల్సింగ్ మాట్లాడుతూ ‘ఇక్కడ చిరుత పులి ఉందని తెలుసుకోగానే ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని ప్రకటించాం. ఇప్పటి వరకు ఈ జంతువు వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. అటవీశాఖ అధికారులకు దీనికి సంబంధించి సమాచారం అందించాం. ఆ జంతువు ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడే చెప్పలేం. ఆదివారం కూడా కొన్ని మగ జింకలు రోడ్డు మీద తిరగడం నేను చూశాను ’ అని ఆయన తెలిపారు. -
అలా ఆ దేశాలు కరోనా వ్యాప్తిని అరికట్టాయి..
చంఢీఘడ్ : ‘కరోనాను పూర్తిగా అరికట్టడం అన్నది కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం ప్రకటించటం లాంటిది. అయితే దాన్ని మరొకరికి వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చ’ని మేదాంత ది మెడిసిటీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డా. నరేశ్ ట్రెహాన్ అంటున్నారు. మేదాంత ది మెడిసిటీ హాస్పిటల్లో నరేశ్ నేతృత్వంలో కరోనా వైరస్ సోకిన 14మంది ఇటాలియన్లకు చికిత్స జరుగుతోంది. ఈ సందర్భంగా డా. నరేశ్ ట్రెహాన్ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేసిన అనుభవాలను, నేర్చుకున్న పాఠాలను, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను పంచుకున్నారు. ‘‘మా ఆసుపత్రిలో కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేయటానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అయితే వైరస్ వ్యాప్తి చెందకుండా చేయటమే పెద్ద సవాలు. దీని కోసం ఆసుపత్రిలో ఓ ఏరియాను కేటాయించాం. ఒక ఆసుపత్రిలో 10మంది మరో ఆసుపత్రిలో మరికొంతమంది అన్నట్లు ఉండకూడదు. ఇలా అయితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ. అందుకే ఒకే చోట 500మంది రోగులకు చికిత్స చేసేందుకు వీలుండేలా పెద్ద ప్రదేశాన్ని కేటాయించాలి. చైనా, కొరియాలు ఇలానే చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టాయి. ముఖ్యంగా రోగులకు చికత్స చేసేవారికి కూడా ఎంతో ఓపికి ఉండాలి. దేనికైనా సిద్ధం అనేలా ఉండాలి. ( కరోనా ఎఫెక్ట్: ఇకపై వాట్సాప్లో పరీక్షా ఫలితాలు ) అందరికీ కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలా అన్న విషయానికి వస్తే.. అవసరం లేదు. ఇలా అందరికి పరీక్షలు చేసుకుంటూ వెళితే అవసరమైన వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెద్ద మొత్తంలో పరీక్షలు చేసేందుకు అవసరమైన సరంజామా కూడా మన వద్ద లేదు. డబ్బు వృధా చేయటం తప్ప వేరే ఏ ఉపయోగం ఉండదు. పరిస్థితుల్లో మార్పు వచ్చి ఎవరికి వారు తమ సొంతడబ్బుతో పరీక్షలు చేయించుకోవాల్సి వస్తే.. ప్రభుత్వం పరీక్షలకు ఓ రేటును నిర్ణయించి పరీక్షలు జరపించాలి. సోషల్మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు మంచివి కావు. కొంతమంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. దాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవాలో మనకు తెలుసుండాలి. సమాచారం త్వరగా అందజేయటానికి ఇదెంతో మేలైనది. ప్రజల్లో మరింత అవగాహన రావాల్సి ఉంద’ని అన్నారు. -
సత్తా చాటిన ఏపీ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యా ర్థులు చండీగఢ్ వర్సిటీ ప్రాంగణ నియామకాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పంజాబ్లోని చండీగఢ్ వర్సిటీలో జరిగిన ప్రాంగణ నియామకాలు– 2020 ఫేజ్–1లో 4 వేల మంది విద్యార్థులు వివిధ కంపెనీలకు ఎంపిక కాగా.. వారిలో 64 మంది ఏపీ విద్యార్థులేనని వర్సిటీ వీసీ ఆర్.ఎస్.బావా తెలిపారు. ఇందులోనూ 36 మంది ఒకటి కంటే ఎక్కువ ఆఫర్లు అందుకున్నవారేనని తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన గగన్ చాటు ఐబీఎం, కాగ్నిజెంట్, పెర్సిస్టెంట్, వర్చ్యూసా సిస్టమ్స్ అనే 4 కంపెనీల నుంచి, విశాఖపట్టణానికి చెందిన గొంటిన ఉదయ్ కుమార్కు విప్రో, కాగ్నిజెంట్, సార్టప్ ఫామ్ వంటి మూడు కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చినట్లు వర్సిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనం
-
ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనం
చండీగఢ్: చండీగఢ్లో భారీ అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సెక్టార్ 32 వద్ద ఉన్న పీజీ వసతి గృహంలో శనివారం ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థినులు సజీవ దహనమయ్యారు. ల్యాప్టాప్ చార్జ్ చేస్తుండగా మంటలంటుకున్నట్టు అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు అగ్నిప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా తేల్చలేదు. అలాగే ఈ భవనంలో కనీస భద్రతా చర్యలేవీ తీసుకో లేదనీ, అనేక అగ్నిమాపక భద్రతా ఉల్లంఘనలు జరిగినట్టు అగ్నిమాపక అధికారులు చెప్పారు. సెక్టార్ 32 లోని పీజీ వసతి గృహంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు యువతులు మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అధికారులు తెలిపారు. భవనం పై అంతస్తులో అక్రమ నిర్మాణం జరిగినట్టుగా గుర్తించామన్నారు. భవనం మొదటి అంతస్తులో మరణించిన విద్యార్థినులు పేయింగ్ గెస్ట్లుగా వుంటున్నారని చండీగఢ్ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ కుమార్ తెలిపారు. 19-22 సంవత్సరాల వయస్సు వీరిని పంజాబ్, హర్యానాకు చెందిన ముస్కాన్, రియా, ప్రాక్షిగా గుర్తించారు. మరో విద్యార్థిని భవనం పైనుంచి కిందికి దూకేయడంతో తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. మొత్తం 36 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉన్నట్టు సమాచారం. పోలీసు, రక్షక బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
భారత్ క్రికెట్ చరిత్రలో ‘రికార్డు’ స్కోరు
కోల్కతా: భారత క్రికెట్ చరిత్రలో మరో రికార్డు నమోదైంది. అత్యధిక తొలి ఇన్నింగ్స్ లీడ్లో చండీగఢ్ నయా అధ్యాయాన్ని లిఖించింది. రంజీ ట్రోఫీలో రౌండ్-9 ప్లేట్ గ్రూప్లో భాగంగా మణిపూర్తో జరిగిన మ్యాచ్లో చండీగఢ్కు 609 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మణిపూర్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 26. 4 ఓవర్లలో63 పరుగులకే కుప్పకూలగా, ఆపై చండీగఢ్ 672/8 వద్ద మొదటి ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేసింది. బిపుల్ శర్మ(200; 276 బంతుల్లో 27 ఫోర్లు, 4 సిక్స్లు), గురిందర్ సింగ్( 200 నాటౌట్; 171 బంతుల్లో 23 ఫోర్లు, 4 సిక్స్లు) రాణించి చండీగఢ్ భారీ స్కోరులో పాలుపంచుకున్నారు. వీరికి జతగా కీపర్ ఉదయ్ కౌల్(148) భారీ సెంచరీ సాధించడంతో చండీగఢ్ ఆరొందలకు పైగా స్కోరును నమోదు చేసింది. ఫలితంగా భారత క్రికెట్ చరిత్రలో నాల్గో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని చండీగఢ్ లిఖించింది. ఫిబ్రవరి 12వ తేదీన(బుధవారం) మ్యాచ్ ఆరంభం కాగా, రెండో రోజు ఆటకే మణిపూర్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్ను ఆరంభించడం గమనార్హం. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మణిపూర్ జట్టు వికెట్ కోల్పోకుండా 33 పరుగులు చేసింది. కాగా, మణిపూర్ జట్టును నిన్న తొలి సెషన్లోనే ఆలౌట్ చేసి, దాదాపు రెండు రోజులు పాటు ఆడిన చండీగఢ్ అరుదైన రికార్డును నమెదు చేసింది. ఇప్పటివరకూ భారత క్రికెట్ ఫస్ట్క్లాస్ హిస్టరీలో తాజా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కంటే మూడు మాత్రమే ముందు వరుసలో ఉన్నాయి. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో అత్యధిక ఆధిక్యం సాధించిన జట్లలో హెల్కర్ జట్టు 722 పరుగుల మొదటి ఇన్నింగ్స్ను సాధించి తొలి స్థానంలో కొనసాగుతోంది. 1945-46 సీజన్లో హోల్కర్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో912 పరుగులకు డిక్లేర్ చేయగా, మైసూర్ 190 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత 1993-94 సీజన్లో హైదరాబాద్ 681 పరుగుల ఆధిక్యాన్ని సాధించి రెండో స్థానంలో ఉంది. ఆంధ్రతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ తన తొలి ఇన్నింగ్స్లో 944/6 వద్ద డిక్లేర్డ్ చేయగా, ఆంధ్ర తమ మొదటి ఇన్నింగ్స్లో 263 పరుగులకు ఆలౌటైంది.ఇక 2014-15 సీజన్లో కర్ణాటక 628 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. తమిళనాడు జరిగిన మ్యాచ్లో కర్ణాటక తమ మొదటి ఇన్నింగ్స్లో 762 పరుగులు చేయగా, తమిళనాడును 134 పరుగులకు ఆలౌట్ చేసింది. -
పదేళ్ల తర్వాత లైవ్లో దొరికిపోయాడు
చంఢీగఢ్ : ఓ వ్యక్తి తను చేసిన హత్యల గురించి ఓ టీవీ షో లైవ్లో నోరువిప్పి అడ్డంగా బుక్కయ్యాడు. హత్యలు జరిగిన పదేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు ఈ ఘటన చంఢీగఢ్లో బుధవారం చోటు చేసుకుంది. చంఢీగఢ్కు చెందిన క్యాబ్ డ్రైవర్ మహీందర్ సింగ్ ఓ టీవీ షో లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను 2010లో తన ప్రేయసి సరబ్జిత్ కౌర్ను హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. ఆమెకు తన బావతో ఎఫైర్ ఉందని అందుకే చంపాలనుకున్నానని చెప్పుకొచ్చాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందామని పిలిచి చంఢీగఢ్లోని ఓ హోటల్లో ఆమెను హతమార్చానని అంగీకరించాడు. దీంతో పోలీసులు ఉన్నపలంగా టీవీ చానల్ స్టూడియోకు చేరుకుని అతన్ని లైవ్లోనే అరెస్టు చేశారు. కాగా అతను తన మరో ప్రేయసిని హతమార్చిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. దీనిపైన కూడా లైవ్లో అతను నోరు విప్పాడు. ఆమె ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తితో ప్రేమాయణం జరుపుతోందని అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు. దీనిపై అతను ఇప్పటికే శిక్ష అనుభవిస్తుండగా గత కొంతకాలంగా బెయిల్పై తిరుగుతున్నాడు. -
నేపాలీలా ఉన్నామంటూ పాస్పోర్ట్కు నో..
అంబాలా : నేపాలీలలాగా ఉన్నామంటూ తనకు, తన సోదరికి పాస్పోర్ట్ ఇచ్చేందుకు సంబంధిత అధికారులు నిరాకరించారని తమకెదురైన అనుభవాలను ఓ యువతి వెల్లడించింది. చండీగఢ్లోని పాస్పోర్ట్ కార్యాలయానికి తాము వెళ్లిన క్రమంలో అక్కడి అధికారులు తమ ముఖాలను తీక్షణంగా చూస్తూ తాము నేపాలీలమని పత్రాలపై రాశారని, తమ జాతీయత నిరూపించుకునే ఆధారాలు సమర్పించాలని వారు తమను అడిగారని ఆమె తెలిపారు. హరియాణా మంత్రి అనిల్ విజ్ దృష్టికి తాము ఈ విషయాలను తీసుకువెళ్లిన తర్వాతే తమకు పాస్పోర్ట్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారని తెలిపారు. తమ కుమార్తెలు సంతోష్, హెన్నాలను వెంటబెట్టుకుని భగత్ బహదూర్ పాస్పోర్ట్ కోసం చండీగఢ్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లగా దరఖాస్తుదారులు నేపాలీలుగా కనిపిస్తున్నారని వారి డాక్యుమెంట్లపై రాసిన అధికారులు వారికి పాస్పోర్టును నిరాకరించారని అంబాలా డిప్యూటీ కమిషనర్ అశోక్ శర్మ తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రాగానే అధికారులతో మాట్లాడానని, అప్పుడు అక్కాచెల్లెళ్లను పాస్పోర్ట్ కార్యాలయానికి పిలిపించి వారికి పాస్పోర్ట్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభించారని చెప్పారు. త్వరలోనే వారికి పాస్పోర్ట్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. -
నా భర్తను చంపేశాను.. ఉరి తీయండి!
చండీగఢ్: హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ వద్దకు ఒక మహిళ ఏడుస్తూ వచ్చి.. 'నా భర్తను రెండు సంత్సరాల కింద హత్య చేశాను. నాకు ఉరిశిక్ష విధించండి' అని విన్నవించుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటన అంబాలలో అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రజలు తమ సమస్యలను నివేదించేందుకు ఏర్పాటు చేసిన జంతర్ మంతర్ కార్యక్రమానికి వచ్చిన సునీల్ కుమారీ, తన భర్తను హత్య చేశానని పశ్చాత్తాపడుతూ.. తాను చేసిన తప్పునకు శిక్ష విధించమని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ను లేఖలో వేడుకొన్నారు. సునీల్ కుమారీ కథనం మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. Ambala: A woman confessed to killing her husband 2 years ago, in a letter she handed to Haryana Home Minister Anil Vij during a 'janta darbar'. He says, "She confessed & said she wants to be punished for it. I handed her over to police & she was taken to a police station" (24.12) pic.twitter.com/kLZpX2TUGj — ANI (@ANI) December 24, 2019 కాగా ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రోహ్తాష్ సింగ్, మద్యానికి బానిసై తరచూ తాగివచ్చి భార్య సునిల్ కుమారీని వేధింపులకు గురిచేసేవాడు. ఎప్పటిలానే జూలై15, 2017న కూడా అతిగా మద్యం సేవించి, దుర్భాషలాడుతూ.. మత్తులో తూలుతూ కింద పడిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కుమారీ.. భర్తకు వాంతులు అవడం గమనించి.. అతడి నోటికి తన దుపట్టాను అదిమిపెట్టగా.. అతడు చనిపోయాడు. ఇక పోస్టుమార్టం నివేదికలోనూ రోహ్తాష్ వాంతి కారణంగానే ప్రాణాలు విడిచాడని వెల్లడవడంతో.. ఆమె శిక్ష నుంచి తప్పించుకున్నారు. అయితే సునీల్ కుమారీ మాత్రం తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక.. అతడిని హత్య చేశాననే అపరాధ భావాన్ని తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో తానే హత్య చేశానంటూ హోంమంత్రి వద్ద మొరపెట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. -
నిప్పంటించుకుని బాలిక ఆత్మహత్యాయత్నం
చండీగఢ్: హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన చండీగఢ్లోని సెక్టర్ -7లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంచుకుల సెక్టర్ 11లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదోతరగతి చదివే బాలిక(15) తల్లిదండ్రులతో కలిసి చండీగఢ్లో నివాసం ఉంటుంది. కాగా, గత బుధవారం పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. రోజుమాదిరి తమ కూతురు ట్యూషన్కు వెళ్లిందిన భావించి వెతికే ప్రయత్నం చేయలేదు. రాత్రి అయినప్పటికీ కూతరు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలికకు ఫోన్ చేశారు. బాలిక స్పందించకోవడంతో పాఠశాలకు ఫోన్ చేసి అడిగారు. అయితే ఆ రోజు బాలిక పాఠశాలకు రాలేదని సిబ్బంది తెలిపింది. దీంతో ఆందోళన చెందిన తల్లితండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా.. అదే రోజు రాత్రి 8 గంటలకు బాలిక నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, తన కుతురు ఆత్మహత్యయత్నానికి పాల్పడలేదని, ఎవరో నిప్పంటించి హత్య చేసేందుకు కుట్రపన్నారని బాలిక తండ్రి ఆరోపిస్తున్నాడు. ఈ ఘటనలో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అనుమానం: ఈ ఘటన డీసీపీ కమల్ గోయల్ మాట్లాడుతూ.. విచారణలో భాగంగా పోలీసులు బాలిక బ్యాగ్ను తనిఖీ చేయగా ఒక మొబైల్ ఫోన్, బస్సు టికెట్లు లభించాయన్నారు. బాలిక ఆత్మహత్యయత్నానికి పాల్పడిందా లేదా ఎవరైనా పెట్రోలు పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారా అన్న కోణంలో విచారణ చేపట్టామని తెలిపారు. బాలిక మొబైల్ కాల్ రికార్డులను పరిశీలించగా.. ముంబైలోని ఓ వ్యక్తితో అమెకు పరిచయం ఉన్నట్లు తెలిసిందన్నారు. తన వాట్సప్, ఫేస్బుక్ అకౌంట్ తెరవడానికి ఫోన్ను సైబర్ సెల్ డిపార్ట్మెంట్కు పంపింపించినట్లు డీసీపీ పేర్కొన్నారు. -
మెరిసిన సిరాజ్, మెహదీ హసన్
సాక్షి, హైదరాబాద్: వరుస ఓటములకు హైదరాబాద్ జట్టు ఫుల్స్టాప్ పెట్టింది. దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం చండీగఢ్లో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో చండీగఢ్పై విజయం సాధించింది. మొదట బౌలింగ్లో మొహమ్మద్ సిరాజ్ (3/15), మెహదీ హసన్ (3/23) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యరి్థని కుప్పకూల్చారు. దీంతో చండీగఢ్ 19.5 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హైదరాబాద్ మరో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసింది. ఛేదనలో కాస్త తడబడినా బావనక సందీప్ (39 బంతుల్లో 32 నాటౌట్; ఫోర్) జట్టుకు విజయాన్ని అందించాడు. నిప్పులు చెరిగిన బౌలర్లు... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన చండీగఢ్ను హైదరాబాద్ బౌలర్లు ఆరంభం నుంచే బెంబేలెత్తించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడో బం తికే అమిత్ (0)ను సిరాజ్ ఔట్ చేశాడు. రెండో ఓవర్ చివరి బంతికి సారథి మనన్ వోహ్రా (1)ని యు«ద్వీర్ సింగ్ పెవిలియన్కు పంపి ప్రత్యర్థిని ఇరకాటంలోకి నెట్టాడు. అయితే ఈ దశలో జత కలిసిన శివమ్ బాంబ్రీ (14 బంతు ల్లో 12; 2 ఫోర్లు), గౌరవ్ పురి (13 బంతుల్లో 19; 3 ఫోర్లు, సిక్స్) జోడీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ దశలో బౌలింగ్కు వచి్చన మెహదీ హసన్ వరుస బంతుల్లో శివమ్, గౌరవ్ పురిలను ఔట్ చేశాడు. దీంతో చండీగఢ్ 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బిపుల్ శర్మ (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, సిక్స్), గురీందర్ సింగ్ (18 బంతుల్లో 20; ఫోర్, సిక్స్) ఆదుకున్నారు. చివర్లో సిరాజ్ మరోసారి కీలకమైన సమయంలో వికెట్లు తీయడంతో ప్రత్యర్థి జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. యుధ్వీర్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ వైడ్ రూపంలో ఒక్క పరుగును మాత్రమే ప్రత్యర్థికి ఎక్స్ట్రా రూపంలో ఇవ్వడం విశేషం. తడబడి... నిలబడి స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్కు తన్మయ్ అగర్వాల్ (15 బంతు ల్లో 28; 6ఫోర్లు) అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో తొలి మూడు ఓవర్లలోనే హైదరాబాద్ 35 పరుగులు చేసింది. ఈ దశలో ప్రత్యర్థి బౌల ర్లు పుంజుకొని రాయుడు (10; ఫోర్), తన్మయ్, అక్షత్ రెడ్డి (0), హిమాలయ్ (8) వెంటవెంటనే ఔట్ చేసి హైదరాబాద్ శిబిరంలో ఆందోళ న కలిగించారు. ఇక్కడ హైదరాబాద్ 12 పరుగుల తేడాలో నాలుగు వికెట్లను కోల్పోయింది. మరో ఓటమి ఖాయం అనుకునే సమయంలో బావనక సందీప్ నేనున్నానంటూ ఆదుకున్నా డు. అతడు మల్లికార్జున్ (27 బంతుల్లో 22; సిక్స్), చామా మిలింద్ (17 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్)లతో కలిసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు చండీగఢ్ ఇన్నింగ్స్: వోహ్రా (సి) మల్లికార్జున్ (బి) యు«ద్వీర్ 1; అమిత్ (ఎల్బీ) (బి) సిరాజ్ 0; శివమ్ (సి) యుధ్వీర్ (బి) మెహదీ హసన్ 12; గౌరవ్ పురి (సి) రాయుడు (బి) మెహదీ హసన్ 19; జస్కరన్వీర్ సింగ్ (సి) యు«ద్వీర్ (బి) ఆకాశ్ 14; బిపుల్ శర్మ (సి) తన్మయ్ (బి) మిలింద్ 35; జస్కరన్ సింగ్ (బి) మెహదీ హసన్ 12; గురీందర్ సింగ్ (సి) మల్లికార్జున్ (బి) సిరాజ్ 20; గౌరవ్ గంభీర్ (ఎల్బీ) (బి) యుద్వీర్ 3; శరణ్ (సి) ఆకాశ్ (బి) సిరాజ్ 5; శ్రేష్ట్ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 1; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 123 వికెట్ల పతనం: 1–1, 2–5, 3–32, 4–42, 5–52, 6–76, 7–100, 8–106, 9–118, 10–123. బౌలింగ్: సిరాజ్ 3.5–0–15–3, యుధ్వీర్ సింగ్ 4–0–37–2, మిలింద్ 4–0–24–1, మెహదీ హసన్ 4–0–23–3, బావనక సందీప్ 2–0–13–0, ఆకాశ్ భండారి 2–0–11–1. హైదరాబాద్ ఇన్నింగ్స్: తన్మయ్ (బి) జస్కరన్ 28; రాయుడు (బి) శ్రేష్ట 10; హిమాలయ్ (సి) గౌరవ్ పురి (బి) శ్రేష్ట్ 8; అక్షత్ రెడ్డి (సి) గౌరవ్ గంభీర్ (బి) జస్కరన్ 0; సందీప్ (నాటౌట్) 32 మల్లికార్జున్ (సి) జస్కరన్వీర్ సింగ్ (బి) గురీందర్ సింగ్ 22; మిలింద్ (నాటౌట్) 23; ఎక్స్ట్రాలు 3; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 123 వికెట్ల పతనం: 1–35, 2–43, 3–43, 4–47, 5–90. బౌలింగ్: బిపుల్ శర్మ 4–0–19–0, శ్రేష్ట్ నిర్మోహి 3–0–23–2, శరణ్ 4–0–36–0, జస్కరన్ సింగ్ 4–0–17–2, గౌరవ్ గంభీర్ 1–0–10–0, గురీందర్ సింగ్ 3–0–19–1. -
మళ్లీ వస్తున్న దీపావళి!
సినీతారలు బాగా ఇష్టపడే పండుగ దీపావళి. ఇంటింటా దీపాలు వెలిగించి, ఆకాశంలోని తారకలతో పోటీపడతారు. ఇతర సెలబ్రిటీస్ని పిలిచి పార్టీలు చేసుకుంటారు. స్వస్థలాలకు చేరుకుని, బాణసంచా కాల్చుతూ పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. యామీ గౌతమ్కి కూడా అలా ఇంటికి వెళ్లి, అందరితో కలిసి ఆనందంగా దీపావళి జరుపుకోవడం చాలా ఇష్టమట. అయితే కుటుంబం చండీగఢ్లో ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా యామీ తన తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపడానికి ఇంటికి వెళ్లారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి అనుబంధాల రుచులు తిని వద్దామనుకున్నారు. కాని పండుగ జరుపుకోలేకపోయారు! దగ్గర బంధువులు దీపావళి రోజునే గతించడంతో, ఆ రోజంతా అక్కడే గడిచిపోయింది. ‘ఈ సంవత్సరం దీపావళికి మా ఇంట్లో స్వీట్స్ లేవు, దీపాలు లేవు, టపాసులు లేవు. ఏమీ లేవు’ అన్నారు యామీ. ఆయుష్మాన్ ఖురానా, భూమీ పెడ్నేకర్లతో తెర మీద కనిపించబోతున్న యామీ.. ‘బాల’ చిత్రం ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆ దీపావళి వెలుగులు లేకపోయినా, ఈ చిత్రం విజయం సాధించి, యామీ ముఖంలో వెన్నెల కాంతులు కురిస్తే, యామీ దీపావళి జరుపుకున్నట్లేగా. ‘బాల’ ఈనెల 7న విడుదల అవుతోంది. -
యువతిపై బాలుడి అత్యాచారం.. !
చండీగఢ్: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం జరిపాడని 21 ఏళ్ల యువతి 15 ఏళ్ల బాలుడిపై రేప్ కేసు నమోదు చేసింది. ఈ ఘటన చండీగఢ్లో జరిగింది. సెక్షన్ 164 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితుడైన మైనర్ను జువెనైల్ హోమ్కు తరలించారు. నిందితుడు తనను ముంబైకి తీసుకెళ్లి ఒక హోటల్లో ఉంచి తనపై అత్యాచారం జరిపినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే నిందితుడి కుటుంబసభ్యులు మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. సదరు యువతి, బాలుడితో కలిసి ఇంటినుంచి పారిపోయి.. ముంబై వెళ్లిపోయారని, ఇరు కుటుంబసభ్యులు వారిని ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారని వారు అంటున్నారు. యువతి, బాలుడి ఒకరికొకరు తెలుసునని, నెలన్నర కింద వారు ఇంటినుంచి పారిపోయి ముంబైలో గడిపారని, అక్కడి నుంచి తీసుకొచ్చాక, బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని మైనర్ బంధువులు అంటున్నారు. ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ.. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును విచారిస్తున్నామని, అసలు ఏం జరిగిందన్నది తెలుసుకొని.. దాని ఆధారంగా నిందితుడైన మైనర్ను జువెనైల్ జస్టిస్ బోర్డుముందు ప్రవేశపెడతామని చెప్తున్నారు. -
బాలీవుడ్ కమల్హాసన్
విజయం అనేది ఒకరు వేసిన భిక్షగా పొందినవారి తీరు వేరుగా ఉంటుంది. విజయాన్ని ఊహించి, నిర్మించి, సొంతం చేసుకున్నవారి తీరు వేరుగా ఉంటుంది. ఆయుష్మాన్ ఖురానా విజయం అతడు కష్టపడి సంపాదించుకున్నది. పరాజయం విసిరిన ప్రతి రాయిని వరుసగా పేర్చి ఇవాళ బాలీవుడ్ కాలనీలో తన సౌధాన్ని నిర్మించుకున్నాడు.చిన్న కుటుంబం నుంచి వచ్చిన చిన్న కుర్రాడు అనేక ప్రతికూలతలను దాటి హీరో కావచ్చనడానికి ఇటీవలి ఉదాహరణ ఆయుష్మాన్. ప్రయోగాలు చేసే నటుడిగా కమల్హాసన్ను చెప్పుకుంటే ఇతణ్ణి బాలీవుడ్ కమలహాసన్ అనవచ్చు. ఆయుష్మాన్ ఖురానాను తెలుసుకోవాలంటే మీరు నెట్ఫ్లిక్స్లోనో, అమేజాన్లోనో అతడి సినిమాలు చూడాలి. ‘విక్కీడోనర్’, ‘నౌటంకి సాలా’, ‘హవాయిజాదా’, ‘దమ్ లగాకే హైసా’, ‘బరేలీకి బర్ఫీ’, ‘శుభ్ మంగల్ సావధాన్’, ‘అంధా ధున్’, ‘బధాయి హో’... ఇవన్నీ ఒకదానికి ఒకటి పోలిక లేని కథలు. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ఏ హీరో చేయని కథలు. ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలు చేసి నిరూపించుకున్నాడు. నిలబడ్డాడు. కాని ఆ జర్నీ ఏమీ సులువు కాదు. చండీగఢ్ కుర్రాడు ఆయుష్మాన్ ఖురానా చండీగఢ్ విశాలమైన వీధుల్లో నటుడు కావాలనే కలలతో తిరిగాడు. తండ్రి జ్యోతిష్యుడు. తల్లి గృహిణి. ఇంట్లో నానమ్మ ఆయుష్మాన్ ఖురానాను నవ్వించడానికి దేవ్ ఆనంద్, రాజ్ కపూర్లను ఇమిటేట్ చేసి నవ్వించేది. నాలుగేళ్ల వయసులో మొదటిసారి సినిమా హాలులో చూసిన ‘తేజాబ్’ సినిమా గుర్తుండిపోయి అలా స్క్రీన్ మీద కనిపించాలనే బాల్య కుతూహలం రేపింది. కాని అందుకు తగ్గ రూపం లేదు. ఆకారం లేదు. ఎత్తు తక్కువ. ఎత్తు పళ్లు. కాని బాగా పాడేవాడు. డాన్స్ చేసేవాడు. కాని న్యూనత వల్ల ఎవరిముందూ చేసేవాడు కాదు. ‘వీడికి ఇవి చేతనవును. స్టేజీ మీద చేయడం వస్తే చాలు’ అని తండ్రి అవకాశం దొరికితే చాలు స్టేజీ మీదకు తోసేవాడు. అలా ఆయుష్మాన్ స్టేజ్ మీద నటించడం నేర్చుకున్నాడు. కాలేజీ రోజుల్లో నాటకాల ట్రూపులు తయారు చేసి దేశమంతా స్ట్రీట్ ప్లే, స్టేజ్ ప్లే చేస్తుండేవాడు. ట్రయిన్లలో ప్రయాణం చేసేటప్పుడు కంపార్ట్మెంట్లలో తిరిగి పాడుతూ డబ్బులు కలెక్ట్ చేసి నాటకాలకు ఉపయోగించేవాడు. అనుభవం ఉంది. ఇక అవకాశం రావడమే మిగిలింది. మొదట రేడియోలో... ఆయుష్మాన్ డిగ్రీ అయ్యే సమయానికి దేశంలో ఎఫ్.ఎం చానెల్స్ ఓపెన్ అవుతున్నాయి. ఆయుష్మాన్ ఢిల్లీలోని బిగ్ ఎఫ్.ఎంలో రేడియోజాకీగా పని చేశాడు. ఆ అనుభవంతో ఎం టీవీలో ‘రోడీస్’ షోలో పాల్గొని గెలిచాడు. ఎం టీవీ వీడియో జాకీగా కూడా పని చేశాడు. కాని షారూక్ ఖాన్ ఫ్యాన్ కావడం వల్ల షారుక్ మాస్ కమ్యూనికేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడని తెలిసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తిరిగి చండీగఢ్ వెళ్లిపోయాడు. రెండేళ్ల పాటు చదివి తిరిగి ముంబై వచ్చాక అక్కడ రేడియో జాకీగా టీవీ వ్యాఖ్యాతగా పని చేశాడు. అలా ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరిగితే నీ రూపు కెమెరాకు పనికి రాదు అని చెప్పిన వారే అంతా. చివరకు దర్శకుడు సూజిత్ సర్కార్ అతడికి బ్రేక్ ఇచ్చాడు. వికీ డోనర్ వీర్య కణాల లోపం వల్ల తండ్రి కాలేని వారు కృత్రిమ పద్ధతిలో తండ్రి కావాలంటే పరాయి వీర్యకణాలు అవసరం. అందుకుగాను దేశంలో ‘స్పెర్మ్ డోనర్లు’ ఉన్నారు. అలాంటి స్పెర్మ్ డోనర్ కథను ‘వికీ డోనర్’గా తీశారు. సాధారణంగా ఇలాంటి కథను చేయడానికి కొత్తగా ఫీల్డ్లోకి వచ్చినవారు భయపడతారు. కాని ఆయుష్మాన్ ఆ పాత్రను అశ్లీలతకు తావు లేకుండా గొప్పగా చేసి హిట్ కొట్టాడు. అందులో తనే రాసిన పాడిన ‘పాని దా’ పాటకు అవార్డు పొందాడు. జోర్ లగాకే హైస్సా మన దేశంలో తొలిసారి విమానం ఎగరేయడానికి ప్రయత్నించిన బాపూజీ తల్పడే బయోపిక్ ‘హవాయిజాదే’లో నటించినా అది హిట్ కాలేదు. అయితే వారణాసి నేపథ్యంలో వచ్చిన ‘దమ్ లగాకే హైస్సా’ సినిమా సూపర్హిట్ అయ్యింది. టేప్ రికార్డర్లో పాటలు ఎక్కించే కుర్రాడి పాత్రలో ఆయుష్మాన్ నటించాడు. అందులో ఇష్టం లేని భార్యను క్రమంగా ప్రేమించే భర్తగా అందరికీ నచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘అంధా ధున్’ చాలా పెద్ద హిట్థ్రిల్లర్గా నిలిచింది. అందులో కళ్లుండీ గుడ్డివాడిగా నటించే సంగీతకారుడి పాత్రలో ఆయుష్మాన్ ఖురానా టాప్క్లాస్ నటన ప్రదర్శించాడని విమర్శకులు మెచ్చుకున్నారు. ఇక వయసుకాని వయసులో గర్భం దాల్చిన తల్లితో ఎలా వ్యవహరించాలో తెలియని ఎదిగొచ్చిన కొడుకుగా ‘బధాయీ హో’లో నటించి ఆ సినిమానూ సూపర్ హిట్ చేశాడు. తాజా చిత్రం ‘ఆర్టికల్ 15’ ఒక సాంఘిక ప్రయోజనం ఉన్న సినిమా. కొత్త తరం ఆశ ఆయుష్మాన్లాంటి వాళ్ల వల్ల బాలీవుడ్ కొత్త కథల రచన, నటన సాధ్యమవుతోంది. లైంగికస్తంభన సమస్య ఉన్న యువకునిగా ‘శుభ మంగళ్ సావధాన్’లో నటించిన ఆయుష్మాన్ ఇప్పుడు హోమోసెక్సువాలిటీ వస్తువును తీసుకొని ‘శుభ మంగళ్ జ్యాదా సావధాన్’లో నటిస్తున్నాడు. అలాగే అమితాబ్తో ‘గులాబో సితాబో’లో నటిస్తున్నాడు. ఈ ప్రయాణం కొనసాగాలని కోరుకుందాం. -
189 చలానాలు.. బైక్ మీరే తీసుకొండి
చండీగఢ్: కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ట్రాఫిక్ చలానా అంటే చాలు జనాలు దడుచుకుంటున్నారు. కొత్త రూల్స్ ప్రకారం ఒకటి, రెండు చలానాలు వస్తే.. చాలు.. ఆ సొమ్ము చెల్లించడానికి ఏకంగా వాహనాన్ని అమ్మల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఓ బైక్ మీద ఏకంగా 189 చలానాలు ఉండటం ఒక ఎత్తయితే.. దీని గురించి సదరు బైక్ యజమానికి ఎలాంటి సమాచారం లేకపోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. వివరాలు.. చండీగఢ్కు చెందిన సంజీవ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సెక్టార్ 33 ప్రాంతంలో రాంగ్ డైరెక్షన్లో యూ టర్న్ తీసుకున్నాడు. దాంతో ట్రాఫిక్ సిబ్బంది అతనికి రూ.300 చలానా విధించి.. జిల్లా కోర్టుకు పంపించారు. అక్కడ సంజీవ్కు దిమ్మతిరిగిపోయే విషయం తెలిసింది. 2017-19 మధ్య కాలంలో సంజీవ్ మీద 189 ట్రాఫిక్ చలానా నమోదయ్యాయనే విషయం వెలుగు చూసింది. దాంతో ఆశ్చర్యపోవడం సంజీవ్ వంతయ్యింది. దీని గురించి సంజీవ్ మాట్లాడుతూ.. ‘పని ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడు నేను ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాను. కానీ మరి ఇంత భారీ సంఖ్యలో నా మీద చలానాలు నమోదైన సంగతి నిజంగా నాకు తెలీదు. దీని గురించి ట్రాఫిక్ సిబ్బంది కూడా నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు’ అని తెలిపాడు. అంతేకాక ‘కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి జాగ్రత్తగానే ఉంటున్నాను. కానీ ఇన్ని చలానాలున్నాయని నిజంగానే నాకు తెలీదు. ఇప్పుడు చలానాలను చెల్లించడం కంటే బైక్ను ఇక్కడే వదిలేసి వెళ్లడం మంచిది’ అంటూ వాపోయాడు. గతంలో ఓ పాల వ్యాపారి బైక్ మీద కూడా 36 చలానాలున్నాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
‘విక్రమ్’ సమస్య కచ్చితంగా పరిష్కారమవుతుంది!
చండీగఢ్ : సైన్స్ అంటేనే తెలియని విషయాలను తెలుసుకోవడం అని.. ఆ క్రమంలో ఒక్కోసారి అపజయాలు కూడా ఎదురవుతాయని నోబెల్ బహుమతి గ్రహీత, ఫ్రెంచి శాస్త్రవేత్త సెర్జ్ హారోచ్ అన్నారు. అద్భుత విజయాలతో పాటు ఓటములను సైతం చిరునవ్వుతో స్వీకరించి వాటిని అధిగమించే దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు. చండీగఢ్లో జరుగుతున్న ‘నోబెల్ ప్రైజ్ సిరీస్ ఇండియా 2019’ కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సెర్జ్ మాట్లాడుతూ.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైందని తాను భావించడం లేదన్నారు. విక్రమ్ ల్యాండర్కు ఏమైందో తనకు తెలియదు గానీ.. ఇస్రో కచ్చితంగా సమస్యను పరిష్కరించి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సైన్స్ విభాగంలో పనిచేసే వారు అస్సలు నిరాశ చెందకూడదు. ప్రయోగాల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారన్న మాట నిజమే. ఆర్థిక అంశాలతో పాటు రాజకీయాలు కూడా దీనితో ముడిపడి ఉంటాయి. ఒక ప్రయోగం చేపట్టేపుడు మీడియా విపరీతంగా కవర్ చేయడం... ఈ క్రమంలో ఏ చిన్న తప్పు జరిగినా అది పెద్దదిగా కనిపించడం సహజమే. అంచనాలు పెరిగే కొద్దీ విమర్శల స్థాయి కూడా పెరుగుతుంది. యువత మెదళ్లపై పెట్టే పెట్టుబడే ఏ దేశానికైనా అత్యుత్తమైనది. యువ సంపద భారీగా ఉన్న భారత్ ఈ మేరకు పెట్టుబడులు పెడుతూ విదేశాల్లో ఉన్న తమ వాళ్లను ఇక్కడికి రప్పించాల్సిన అవసరం ఉంది. గణిత, భౌతిక శాస్త్రాలతో పాటు ఆస్ట్రో ఫిజిక్స్లో కూడా భారత్ నాణ్యమైన విద్యనందిస్తోంది. చంద్రయాత్ర వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మీడియా ప్రచారం కల్పించే ఖర్చుతో మరిన్ని చిన్న ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టవచ్చనేది నా భావన’ అని సెర్జ్ పేర్కొన్నారు. అదే విధంగా వాతావరణ మార్పుల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్్డ ట్రంప్ వైఖరి గురించి ప్రస్తావించగా..‘ ఆయనకు అసలు మెదడు లేదు. అందుకే ఆయనలోనూ ఏమార్పు ఉండదు’ అని వ్యాఖ్యానించారు. కాగా భౌతిక శాస్త్రం(మెజరింగ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్ క్వాంటం సిస్టమ్)లో తన పరిశోధనలకు గానూ మరో శాస్త్రవేత్త డేవిడ్ జే. విన్లాండ్తో కలిసి సెర్జ్ 2012లో నోబెల్ బహుమతి అందుకున్న విషయం తెలిసిందే.