city
-
వరల్డ్ టాప్ ఫుడ్ సిటీస్ : టాప్-5లో ముంబై, అయ్యో హైదరాబాద్!
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆహారం నగరం జాబితాలో వాణిజ్య రాజధాని టాప్ -5లో చోటు దక్కించుకుంది.ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్, టేస్ట్ అట్లాస్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన తాజా లిస్టును ప్రకటించింది. వాటిలో అనేక స్థానాల్లో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. అయితే గత ఏడాదితో పోలిస్తే ముంబై నగరం టాప్ప్లేస్కి ఎగబాకగా హైదరాబాద్, 50వ స్థానానికి పడిపోయింది.ముంబై ప్రపంచంలో 5వ అత్యుత్తమ ఆహార నగరంగా నిలిచింది. టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ఫుడ్ గైడ్ వివిధ వర్గాలలో ర్యాంకింగ్లను విడుదల చేసింది."ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల" జాబితాలో ముంబై 5వ స్థానంలో నిలిచింది.తొలి నాలుగు స్థానాలకు ఇటలీలోని నగరాలు చోటు సంపాదించాయి. నేపుల్స్, మిలన్, బోలోగ్నా, ఫ్లోరెన్స్. ముంబై తర్వాత రోమ్, పారిస్, వియన్నా, టురిన్ , ఒసాకా టాప్ 10లో ఉన్న నగరాలుగా ఉన్నాయి. అయితే ఈ జాబితాలో ఇతర భారతీయ నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి, వాటిలో మూడు ముంబైతో పాటు టాప్ 50లోకి వచ్చాయి. అమృత్సర్ 43వ స్థానంలో, న్యూఢిల్లీ 45వ స్థానంలో, హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 50వ స్థానంలో నిలిచాయి. కోల్కతా 71వ స్థానంలో ఉండగా, చెన్నై 75వ స్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) అలాగే టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ 2024-25లో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల ర్యాంకింగ్ను కూడా ప్రకటించింది. భారత్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ మెరుగ్గానే ఉందని తెలిపింది. కాగా గత ఏడాది ఈ జాబితాలో ముంబై35, హైదరాబాద్ 39వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ 56వ స్థానంలోనూ, చెన్నై, లక్నో 65, 92 స్థానాల్లోనూ నిలిచాయి. -
బందోబస్తు మధ్య ‘ఫ్యూచర్’ రోడ్డుకు సర్వే
కందుకూరు/ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చి తామెక్కడికి వెళ్లాలంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు? ఎలా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు సర్వే చేస్తుండగా.. కొంగరకలాన్లో కలెక్టరేట్ వెనక వైపు చేపట్టిన సర్వే పనులను అడ్డుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజు అనే యువ రైతు తమ భూమి తీసుకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. 330 అడుగుల రహదారి రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్కడికి చేరుకునేలా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 330 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్ట్, పంజగూడ, మీర్ఖాన్పేటలో కలిపి మొత్తం 449.27 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.ఫ్యూచర్సిటీ రోడ్డు కోసం ఇటువైపు కందుకూరు మండలం రాచులూరుతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లో అధికారులు ఏకకాలంలో సర్వే పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, కందుకూరు తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్తోపాటు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. అక్కడి రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంత పెద్ద రోడ్డు నిర్మిస్తే పొలాలు మొత్తం పోయి, రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. సమావేశం ఏర్పాటు చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు సర్వేను కొనసాగించారు. -
గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్.. 2000 మందికి ఉపాధి
అహ్మదాబాద్: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్సిటీ(గిఫ్ట్ సిటీ) గాంధీనగర్లో టెక్ఫిన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఈ సెంటర్ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్ల వ్యూహాత్మక కేంద్రంగా వినియోగించనున్నట్లు పేర్కొంది.ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) పరిశ్రమలకు సంబంధించిన క్లయింట్లకు ఆధునిక సాంకేతిక సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ప్రాథమికంగా ఈ సెంటర్లో 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్యను 2,000కు పెంచనుంది.ప్రపంచస్థాయి కంపెనీలను ఆకట్టుకోవడంలో రాష్ట్రానికున్న పటిష్టతను గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్ కొత్త కేంద్రం ప్రతిబింబిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధికి అత్యుత్తమ వాతావారణాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. టెక్ఫిన్ సెంటర్ ద్వారా బీఎఫ్ఎస్ఐ క్లయింట్లకు డిజిటల్ పరివర్తనలో తోడ్పాటునివ్వనున్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. -
ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్లు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సమగ్రాభివృద్ధిలో భాగంగా 352 కి.మీ. మేర రూపు దిద్దుకోనున్న రీజనల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు చేరుకొనేందుకు వీలుగా ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ ఆర్) నుంచి గ్రీన్ఫీల్డ్ రహదా రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 216.9 కిలోమీటర్ల మేర తొమ్మిది గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మించనుంది.రావిర్యాల టు ఆమన్గల్ వయా ఫ్యూచర్ సిటీసుమారు 14 వేల ఎకరాల విస్తీ ర్ణంలో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించినందున భవి ష్యత్తులో ఈ మార్గంలో వాహనా ల రాకపోకల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రతిపాదించింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్–13 రావిర్యాల నుంచి ఆర్ఆర్ఆర్ లో ని ఆమన్గల్ ఎగ్జిట్ నంబర్–13 వరకు 300 అడుగుల మేర గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనుంది. ఈ మార్గంమొత్తం 41.5 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ రోడ్డు 15 గ్రామాల మీదుగా సాగనుంది. మహేశ్వరం మండలంలోని కొంగరఖుర్డ్, ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్, ఫిరోజ్గూడ, కందుకూరులోని లేమూర్, తిమ్మాపూర్, రాచులూర్, గుమ్మడవెల్లి, పంజగూడ, మీర్ఖాన్పేట్, ముచ్లెర్ల, యాచారంలోని కుర్మిద్ద, కడ్తాల్ మండలంలోని కడ్తాల్, ముద్విన్, ఆమన్గల్ మండలంలోని ఆమన్గల్, ఆకుతోటపల్లి గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది.916 ఎకరాల భూసమీకరణ..గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి 916 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించాల్సి ఉంది. ఇందులో 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూములు ఉండగా 7 కిలోమీటర్లలో 156 ఎకరాలు టీజీఐఐసీ భూములు, కిలోమీటరులో 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. 25.5 కిలో మీటర్ల మేర పట్టా భూములు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డి–తూప్రాన్–గజ్వేల్–చౌటుప్పల్ మీదుగా కిలోమీటర్లు, దక్షిణ భాగం చౌటుప్పల్–షాద్నగర్–సంగారెడ్డి మీదుగా 194 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుండటం తెలిసిందే. -
వరదలో అల్లాడుతోన్న మహానగరాలు
-
కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!?
స్పెయిన్లోని అతి చిన్న నగరం ‘సిటీ ఆఫ్ ఫ్రియాస్’. స్పెయిన్కు వచ్చే పర్యాటకులు దీనిని పెద్దగా పట్టించుకోరు గాని, ఈ ఊరికి చాలా విశేషాలే ఉన్నాయి. పదో శతాబ్దికి చెందిన ఈ నగరంలో ఆనాటి రాజు రెండో జువాన్ నిర్మించిన రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. మునిసిపాలిటీ నిర్వహణలో ఉన్న ఈ ఊరు సాంకేతికంగా పట్టణమే అయినా, పేరులో మాత్రం ‘సిటీ’ ఉండటంతో స్పెయిన్లోని అతి చిన్న నగరంగా గుర్తింపు పొందింది.చిన్నా చితకా పట్టణాల్లోనే కాదు, పల్లెల్లో కూడా కార్లు విరివిగా తిరిగే పరిస్థితులు ఉన్నా, ఈ ఊర్లో మాత్రం కార్లు కనిపించవు. ఇక్కడి ప్రజలు తమ ఊరిలో కార్లను నిషేధించారు. అందువల్ల మోటారు శబ్దాల రొద లేకుండా ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊరి జనాభా దాదాపు మూడువందల మంది మాత్రమే! ఈ విశేషాలు తెలిసిన కొద్దిమంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఈ ఊళ్లోని పురాతనమైన ‘ఇగ్లేషియా డి సాన్ విన్సెంటె మార్టిర్’ కేథలిక్ చర్చి, ‘ఫ్యూంటే డి లాస్ తేజాస్’ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణలు.ఈ ఫౌంటెన్ నుంచి నీరు కిందకు పడేటప్పుడు సంగీత స్వరాలు వినిపిస్తాయి. ఈ ఊళ్లో చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటళ్లు, సెలూన్లు, మాంసం కొట్లు, ఫ్యాన్సీ దుకాణాలు, బేకరీ, ఫార్మసీ దుకాణాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడి ‘హోటల్ రూరల్ ఫ్రియాస్’ పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. పురాతన యూరోపియన్ విశేషాలను తిలకించాలనుకునే పర్యాటకులు ఇక్కడ బస చేయవచ్చు. ఈ హోటల్లో బస చేయడానికి రోజుకు 79 పౌండ్లు (రూ.8,411) చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ యూరోపియన్ హోటళ్లతో పోల్చుకుంటే ఈ ధర తక్కువే!ఇవి చదవండి: అబ్బే! ప్రాణహాని ఉందని కాదు! -
సరిహద్దుల్లో పేలనున్న సిటీ తుపాకీ
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో కాపుకాసే ఆర్మీ జవాన్ల చేతిలో ‘సిటీ తుపాకీ’ పేలనుంది. ‘అస్మి’ పేరుతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీర్డీఓ) డిజైన్ చేసిన ఈ మొట్టమొదటి భారతీయ సబ్ మెషీన్గన్ తయారీ కాంట్రాక్టును హైదరాబాద్కు చెందిన లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ కోసం రూ.4.26 కోట్లతో 550 తుపాకులు తయా రు చేసి సరఫరా చేయనున్నారు. ఇజ్రాయెల్, జర్మనీల్లోని ఆయుధ కర్మాగారాలకు దీటుగా నగరానికి చెందిన ఓ చిన్న సంస్థ ఈ ప్రతి ష్టాత్మక కాంట్రాక్టు దక్కించుకోవడం గమనార్హం. ఈ తుపాకీని సరిహద్దు భద్రతా దళాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగించనున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ ‘అస్మి’ అనువుగా ఉంటుంది.ఉజీ, హెక్లర్లకు దీటుగా..⇒ పుణేలోని డీఆర్డీఓలో అంతర్భాగమైన అర్మా మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఆర్మీ సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పరిశోధనతో ‘అస్మి’ రూపుదిద్దుకుంది. నాగ్పూర్కు చెందిన లెఫ్ట్నెంట్ కల్నల్ ప్రసాద్ బన్సోద్ దీన్ని డిజైన్ చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేశారు. సంస్కృతంలో అస్మిత అంటే ధైర్యం, గర్వం (ప్రైడ్) అని అర్థం. దీన్ని సంక్షిప్తీకరించిన ప్రసాద్ ఈ తుపాకీకి ‘అస్మి’ అని పేరు పెట్టారు. అంతర్జాతీ యంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ తయారు చేసే ఉజీ, జర్మనీలో తయా రయ్యే హెక్లర్, కోచీ ఎంపీ–5 ఆయుధాలకు దీటుగా ‘అస్మి’ పని చేస్తుందని డీఆర్డీఓ ప్రకటించింది.అంతర్జాతీయ పోటీని తట్టుకుని..హైదరాబాద్లోని బాలానగర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ సంస్థ చిన్న పరిమాణంలో ఆయుధాలు తయారు చేస్తుంది. అయితే అంతర్జాతీయ పోటీని తట్టుకున్న ఈ సంస్థ ‘అస్మి’ తయారీ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే పది చొప్పున తుపాకులు తయారు చేసి ఆర్మీతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ), అసోం రైఫిల్స్కు అందించింది. నాణ్యతపై వాళ్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ 550 తుపాకుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.ఈ ఏడాది సెప్టెంబర్ 28 నాటికి వీటిని అందించడానికి లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. మరోపక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) నుంచి ఈ సంస్థకు పైలట్ ఆర్డర్ వచ్చింది. ‘అస్మి’ ఈ తరహాకు చెందిన ఇతర ఆయుధాల కంటే 10–15 శాతం తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఆపకుండా 2,400 రౌండ్ల వరకు కాల్చే అవకాశం ఉంది.‘అస్మి’ వివరాలివీ..పేరు: అస్మిస్వరూపం: సబ్ మెషీన్ గన్ ఖరీదు: ఒక్కోటి రూ.50 వేలుబరువు: 2.4 కేజీలుపొడవు: 382 మిల్లీమీటర్లుక్యాలిబర్: 9 X 19 ఎంఎంరేంజ్: 100 మీటర్లుమ్యాగ్జైన్: 32 తూటాలుసామర్థ్యం: నిమిషానికి 800 తూటాలుపరిశోధనకు పట్టిన సమయం: మూడేళ్ల లోపు -
జలసంద్రంగా మారిన హైదరాబాద్.. వాహనదారులకు చుక్కలు (ఫొటోలు)
-
2030 నాటికి ఏర్పాటు కానున్న మెగాసిటీలు ఇవే
1800లలో 10శాతం కంటే తక్కువ మంది ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు. నేడు ప్రపంచ జనాభాలో 55 శాతంతో 4.3 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ కేంద్రాలకు పెద్ద ఎత్తున వలసలు పెరగడం వల్ల 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్ని మెగాసిటీలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. న్యూయార్క్, టోక్యోలు 1950లలో తొలిసారిగా మెగా సిటీలుగా గుర్తింపు పొందాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 32 మెగాసిటీలు ఉన్నాయి. యూఎన్ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ (2018) డేటా ఆధారంగా 2030 నాటికి మెగాసిటీలుగా మారుతుందని అంచనా.తదుపరి మెగాసిటీలుఅమెరికా, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, మధ్య ప్రాచ్య దేశాలతో సహా ఆదాయం అధిక సంఖ్యలో ఉన్న దేశాల జనాభాలో 80 శాతం పైగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే అందుకు విరుద్దంగా 2030 నాటికి తక్కువ ఆదాయ దేశాలు మెగాసిటీలుగా అవతరించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా మెగా సిటీల జాబితాలో పలు దేశాల్లోని నగరాలు ఇలా ఉన్నాయి. -
మహానగరాన్ని వణికిస్తున్న పిల్లి!
ఓ పిల్లి కారణంగా ఒక మహానగరం వణికిపోతోంది. ఎప్పుడు.. ఏం వార్త వినాల్సి వస్తుందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణం.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్లో పడ్డాక అక్కడి నుంచి కనిపించకుండా పోవడమే. దీంతో ఆ పిల్లి క్యాన్సర్ కారక రసాయనాన్ని అంతటా వెదజల్లుతుందనే భయం ఆ నగరంలో నెలకొంది. జపాన్ హిరోషిమాలోని ఫుకుయామా అధికారులు ఆ పిల్లిని వెదికేందుకు పెట్రోలింగ్ను మరింతగా పెంచారు. ఆ పిల్లి ఎక్కడ కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను హెచ్చరించారు. కాగా ఆ పిల్లి చివరిగా రసాయన కర్మాగారం నుండి బయటపడినట్లు భద్రతా ఫుటేజీలో కనిపించింది. ఒక కార్మికుడు ఆ పిల్లి పంజా గుర్తులను గమనించి, దానిని ఉన్నతాధికారులకు తెలిపాడు. ఆ పిల్లికి అంటుకున్న రసాయనం అత్యంత ప్రమాదకరం. దానిని ముట్టుకున్నా లేదా పీల్చినా వెంటనే శరీరంపై దద్దుర్లు, వాపు వచ్చి, తీవ్ర వ్యాధికి దారితీస్తుంది. ఫుకుయామా సిటీ హాల్లోని ఒక అధికారి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆ పిల్లి కోసం వెదకగా, ఇంకా దాని జాడ తెలియలేదన్నారు. అది సజీవంగా ఉందా లేదా అనేది కూడా సందేహాస్పదంగా ఉందన్నారు. ఫ్యాక్టరీ మేనేజర్ అకిహిరో కొబయాషి మాట్లాడుతూ కర్మాగారంలో రసాయన వ్యాట్ను కప్పి ఉంచే షీట్ పాక్షికంగా చిరిగిపోయిందని తెలిపారు. దానిలో పిల్లి పడి, తరువాత ఎటో వెళ్లిపోయిందని, దానికోసం తమ సిబ్బంది వెదుకుతున్నారని చెప్పారు. స్వీడన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్కు చెందిన రసాయన ప్రమాద అంచనాలో నిపుణురాలు లిండా షెంక్ మాట్లాడుతూ సాధారణంగా పిల్లులు తమ బొచ్చును నాకుతుంటాయని, ఈ విధంగా చూస్తే ఆ పిల్లి ఇప్పటికే ఆ రసాయన్నాన్ని నాకి, చనిపోయివుంటుందన్నారు. -
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను ఆర్కే బీచ్లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్క్రాఫ్ట్ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
అయోధ్యలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శ్రీరాముడు జగదానందకారకుడు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన రామ్లల్లా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆలయ గర్భగుడిలో రామ్లల్లా ప్రతిష్ఠాపన జరిగి వారం రోజులు దాటినా భక్తుల రద్దీ నిరంతరం కొనసాగుతూనే ఉంది. రామ్లల్లాను తనివితీరా దర్శించాలనే కోరిక అయోధ్యకు వచ్చే ప్రతీ ఒక్కరిలోనూ కనిపిస్తోంది. తీవ్రమైన చలి గజగజా వణికిస్తున్నా భక్తులు రామ్లల్లా దర్శనం కోసం బారులు తీరుతున్నారు. పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా యువత శ్రీరాముని దర్శించుకునేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తోంది. అయోధ్యకు వచ్చే భక్తుల కోసం పలు సేవా సంస్థలు వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రామ్పథ్ తదితర మార్గాల నుంచి వస్తున్న భక్తుల కోసం ఉచిత భోజనశాలలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రామ్లల్లా సందర్శకుల కోసం నిర్మించిన టెంట్ సిటీని ప్రారంభించారు. దీనిలో 25 వేల మంది భక్తులు బస చేసేందుకు అవకాశం ఉంది. ఈ టెంట్ సిటీలోనూ ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. -
మహిళా భద్రతలో టాప్.... చెన్నై!
అవతార్ గ్రూప్ తాజగా మహిళా భద్రతకు పెద్దపీట వేసిన నగరాల జాబితాను టాప్ సిటీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా(టీసీడబ్ల్యూఐ) అనే సూచిక పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఆ సూచీలో మహిళలకు ది బెస్ట్ సిటీగా చెన్నై నిలిచింది. దీన్ని వైవిధ్యం, సమానత్వం, భ్రదత అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. అంతేగాదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వ డేటా తోపాటు దాదాపు 12 వందల మంది మహిళల అభిప్రాయాలనే సేకరించి మరీ అవతార్ గ్రూప్ ఈ సూచీని రూపొందించింది. ఈ సర్వేలో రెండు కేటగిరీలలో తమిళనాడు నగరాలు అగ్రస్థానంలో నిలిచాయి. మిలియన్ ప్లస్ జనాభా విభాగంలో 49 నగరాలు, మిలయిన్కంటే తక్కువ జనాభా విభాగంలో 64 నగరాలు ఉన్నాయి. అయితే మిలియన్ ప్లస్ విభాగంలో చెన్నై టాప్ పొజిషన్లో ఉండగా, మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న విభాగంలో తిరుచిరాపల్లి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సర్వేలో దక్షిణాది రాష్ట్రలైన చెన్నై, బెంగళూరు, పూణె, ముంబై, హైదరాబాద్, నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో మన హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో ఉండటం విశేషం. ఈ సర్వేని సిటీ ఇన్క్లూజన్ స్కోర్ (CIS), సామాజిక చేరిక స్కోర్ (SIS), ఇండస్ట్రియల్ ఇన్క్లూజన్ స్కోర్ (IIS) వంటి కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ అంశాలే కొలమానంగా బాహ్య సామాజిక వాతావరణం, సంస్థల్లో శ్రామిక క్తిని చేర్చడం, సర్వేల ద్వారా మహిళల అనుభవాలుతీసుకోవడం, ఫోకస్ గ్రూప్ చర్చలు(FGDs) తదితర వాటితో మహిళల అనుభవాలను అంచనా వేసి మరీ వెల్లడించింది అవతార్ గ్రూప్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..మహిళలపై నేరాలకు పేరుగాంచిన దేశ రాజధాని ఢిల్లీ 8వ ర్యాంక్తో మొదటి 10 స్థానాల్లో నిలవడం విశేషం. గతేడాది ఢిల్లీ ఈ సీఐఎస్ ర్యాంక్లో 14వ స్థానంలో ఉంది. కానీ భద్రత పరంగా ఎస్ఐఎస్ ర్యాంక్ ఎనిమిది స్థానాలు దిగజారి 27వ ర్యాంక్కు పరిమితమైంది. ఈమేరకు అవతార్ గ్రూప్ ఫౌండర్-ప్రెసిడెంట్ డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ..ఈ సూచిక దేశంలోని మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేలా సమానత్వాన్ని తీసుకొచ్చేందుకు పిలుపునిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు..2027కల్లా భారతదేశం అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఉంది అనేందుకు తమ డేటా నిలువెత్తు సాక్ష్యం అవుతుందన్నారు. అంతేగాదు 2025 నాటికి భారతదేశం దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి వర్క్ఫోర్స్లో మహిళ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేస్తూ సంస్థల్లో మరింత వైవిధ్యాన్ని తీసుకొచ్చేలా సామాజిక సమానత్వంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని సౌందర్య రాజేష్ అన్నారు. (చదవండి: మురికి వాడ నుంచి రూ. 900 కోట్ల సామ్రాజ్యానికి యజమానిగా! రియల్ స్లమ్ డాగ్ మిలియనీర్!) -
మెడ్టెక్ జోన్లో మెగా ఎక్స్పో సిటీ
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ సమయంలో ర్యాపిడ్ టెస్ట్ కిట్ల తయారీ... భారత వైద్యరంగంలో ప్రపంచస్థాయి గామా రేడియేషన్ సెంటర్... ప్రపంచంలోనే మొదటి డేటా సెంటర్ ఏర్పాటు.. ఇలా వైద్యరంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన విశాఖపట్నంలోని ఏపీ మెడ్ టెక్ జోన్ మరో రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఇండియా ఎక్స్పో సిటీ పేరుతో భారీ ఎగ్జిబిషన్ సెంటర్ను నిర్మించింది. కేవలం 150 రోజుల్లోనే లక్షకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఎగ్జిబిషన్ సెంటర్ను ఏర్పాటుచేసి రికార్డు సృష్టించింది. ఈ ఇండియా ఎక్స్పో సిటీని శుక్రవారం ప్రారంభించారు. ఇక్కడ తొలి రోజే 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ప్రారంభం కావడం విశేషం. ఇవీ ప్రత్యేకతలు... మెడ్టెక్ జోన్లోని ప్రగతి మైదాన్లో 1,03,951 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇండియా ఎక్స్పో సిటీ నిర్మాణ పనులు జూన్ 14న ప్రారంభించారు. శుక్రవారం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. మొత్తం 5.40లక్షల పని గంటల్లో నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఎక్స్పో సిటీ నిర్మాణం కోసం 3,577 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 718 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగించారు. రోజుకు 10వేల మంది సందర్శించేలా ఎక్స్పో సిటీని నిర్మించారు. లోపల భాగంలో ఒక్క కోలమ్ కూడా నిర్మించకుండా దీనిని పూర్తి చేయడం విశేషం. ఎక్స్పో సిటీలో నాలుగు కాన్ఫరెన్స్ హాల్స్, బోర్డ్రూమ్లు ఉన్నాయి. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిస్ప్లే షాప్స్ ఏర్పాటుచేసుకోవచ్చు. తొలి రోజే అంతర్జాతీయ సదస్సు ఇండియా ఎక్స్పో సిటీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజే అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్(ఏఏఎంఐ), గ్లోబల్ క్లినికల్ ఇంజినీరింగ్ అలయెన్స్(జీసీఈఏ) ఆధ్వర్యంలో 5వ ఇంటర్నేషనల్ క్లినికల్ ఇంజినీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ (ఐసీఈహెచ్టీఎంసీ) ప్రారంభమైంది. ఈ నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న సదస్సులో కోవిడ్–19 అనంతర పరిణామాలతోపాటు వైద్య పరికరాల వినియోగం, అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య పరికరాలు, హెల్త్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికా, చైనా, వెనుజులా, మెక్సికో, స్కాట్లాండ్, బ్రెజిల్, స్పెయిన్, కొలంబియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కాంగ్రెస్లో భాగంగానే 14 నుంచి 16వ తేదీ వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ ఫోరం సమావేశం కూడా మెట్టెక్ జోన్లో నిర్వహించనున్నట్లు ఏఏఎంఐ చీఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాబర్ట్ బరోస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 80కి పైగా దేశాలకు చెందిన జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖల ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. -
ఇజ్రాయెల్కు ధర్మశాలతో సంబంధం ఏమిటి?
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైనికులు గాజా స్ట్రిప్నంతటినీ చుట్టుముట్టారు. ఈ యుద్ధ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సోదరులను ఇజ్రాయెల్ వెనక్కి రావాలంటూ పిలుపునిచ్చింది. దీంతో ఇప్పుడు భారతదేశ సందర్శనలో ఉన్న యూదులు తమ స్వదేశానికి తిరిగివెళుతున్నారు. ఫలితంగా మనదేశంలోని ఒక నగరం ఖాళీగా మారిపోతోంది. ఈ నగరం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ నగరం గురించి, ఇజ్రాయెల్తో ఆ నగరానికున్న అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న నగరం.. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల. ఇజ్రాయెలీలు ఈ నగరంలోని ధర్మ్కోట్కు వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇజ్రాయెలీలు సమావేశమవుతారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ యువత ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి, చాలా కాలం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఖబద్ హౌస్ కూడా ఉంది. దానిలో ఇజ్రాయెలీలు ప్రార్థనలు చేస్తారు. ఇజ్రాయెల్లోని ప్రతి ఒక్కరూ అంటే యువకులైనా, యువతులైనా సైన్యంలో తప్పనిసరిగా శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత చాలా మంది యువకులు హిమాచల్ ప్రదేశ్లోని ఈ ప్రాంతానికి వచ్చి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఈసారి హమాస్ దాడి వారి విశ్రాంతికి అంతరాయం కలిగించింది. అనుకోని పరిస్థితుల్లో వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లవలసి వస్తోంది. భారతదేశానికి వచ్చే ఇజ్రాయెలీలు ధర్మ్కోట్తో పాటు, ఢిల్లీలోని పహర్గంజ్, రాజస్థాన్లోని అజ్మీర్లను కూడా సందర్శిస్తారు. ఇజ్రాయెలీల మతపరమైన స్థలాలు అంటే ఖబద్ హౌస్లు ఢిల్లీ, రాజస్థాన్లో ఉన్నాయి. ఇజ్రాయెలీలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. యూదుల మత ప్రార్థనా స్థలాలు దాదాపు ప్రతి దేశంలో ఉన్నాయి. ఇక్కడ యూదులు బస చేస్తుంటారు. ఇది కూడా చదవండి: ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది? -
ఎస్క్లేటర్పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి?
సాంకేతికత పరంగా ప్రపంచంలోని అగ్రగామి దేశాలలో జపాన్ ఒకటి. అయితే ఈ దేశంలోని ఒక నగరంలోని జనం ఎస్క్లేటర్లపై నడవడంపై నిషేధం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఎస్క్లేటర్లపై ఎవరైనా నడిస్తే చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. ఈ విషయం తెలిశాక ప్రజారోగ్యం దృష్ట్యా ఇలా చేసి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే జనం మెట్లను ఎక్కువగా ఉపయోగించాలి. వారంతా ఫిట్గా ఉండాలనే ఆలోచనతో ఇలా చేసివుంటారని అనుకుంటారు. అయితే ఇలా అనుకోవడంలో అస్సలు నిజం లేదు. దీనికి ఒక ప్రత్యేక కారణం ఉంది. జపాన్ టుడే తెలిపిన వివరాల ప్రకారం నగోయా నగరం ఈ చట్టాన్ని చేసింది. 2023, అక్టోబర్ 1 నుంచి ఇక్కడ ఎస్క్లేటర్లపై నడవడంపై నిషేధం విధించారు. ఎస్కలేటర్ల నుండి పడిపోకుండా జనాన్ని రక్షించడం, ఈ తరహా ప్రమాదాలను నివారించడమే దీని ఉద్దేశ్యం. జపాన్లో ఎస్క్లేటర్ వినియోగంలో ఒక నియమం ఉంది. ప్రజలు ఎస్క్లేటర్ల ఎడమ వైపున నిలబడాలి. తద్వారా జనం త్వరగా ఎక్కడానికి లేదా దిగడానికి కుడి వైపున ఉన్న మార్గం తెరిచి ఉంటుంది. ఎస్క్లేటర్లు వినియోగించేవారు భయాందోళనలకు గురైనపుడు ఇతరులను నెట్టడంలాంటివి జరుగుతుంటాయి. ఫలితంగా పలువురు గాయపడటం లాంటివి జరుగుతుంటాయి. వృద్ధులు, వికలాంగులను ఇలాంటి ప్రమాదాల నుండి రక్షించడానికి ఈ నియమం అమలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా నగోయా నగరంలో ఎస్క్లేటర్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయి. జపాన్ ఎలివేటర్ అసోసియేషన్ నివేదిక ప్రకారం 2018-2019 సంవత్సరంలో 805 ఎస్క్లేటర్ల ప్రమాదాలు సంభవించాయి. ఎస్క్లేటర్ల దుర్వినియోగం కారణంగానే ఇలా జరిగినట్లు తేలింది. అప్పటి నుంచి అధికారులు ఎస్క్లేటర్ల వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకుముందు 2021 అక్టోబర్లో సైతామా నగరంలో కూడా ఇలాంటి నిబంధనలను అమలు చేశారు. అయితే దానికి చట్టరూపమివ్వలేదు. తాజాగా ఎస్క్లేటర్ల వినియోగంపై నగోయా నగరం ఒక చట్టాన్ని రూపొందించింది. ఎస్కలేటర్ల వాడకం మానేయాలని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రధాన రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో ప్రకటనల బోర్డులు ఏర్పాటుచేశారు. ఇది కూడా చదవండి: హర్దీప్ నిజ్జర్ హత్య వెనుక చైనా హస్తం? -
అదొక శాపగ్రస్త గ్రామం! అరవై ఏళ్లుగా మనుషులే లేని ఊరు
అరవై ఏళ్లుగా మనుషులు లేని ఊరు అదొక శాపగ్రస్త గ్రామం. అరవై ఏళ్లుగా ఆ ఊళ్లో మనుషులెవరూ ఉండటం లేదు. మధ్యయుగాల నాటి ఆ ఊరి పేరు క్రాకో. ఇటలీలోని బాజిలికా ప్రాంతంలో ఉందిది. కేవోన్ నది సమీపంలో ఎత్తయిన కొండ మీద దాదాపు పద్నాలుగు శతాబ్దాల కిందట కట్టుదిట్టంగా ఈ ఊరిని నిర్మించుకున్నారు. ఆనాటి రక్షణ అవసరాల కోసం దీనిని శత్రుదుర్భేద్యంగా రూపొందించుకున్నారు. కొండను తొలిచి ఊరిలోని ఇళ్లను, ప్రార్థన స్థలాలను పూర్తిగా రాళ్లతోనే నిర్మించుకున్నారు. కొన్నిచోట్ల గుహలలో కూడా ఇళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఇది ‘కేవ్ సిటీ’గా పేరుపొందింది. రోమన్ చక్రవర్తి రెండో ఫ్రెడెరిక్ కాలంలో ఈ ఊరు వ్యూహాత్మక సైనిక స్థావరంగా ఉపయోగపడేది. తర్వాత పద్నాలుగో శతాబ్దిలో ప్లేగు మహమ్మారి విజృంభించడంతో ఈ ఊళ్లోని వందలాది మంది చనిపోయారు. ఇక అప్పటి నుంచి వరుసగా ఏదో ఒక ఉపద్రవం ముంచుకొస్తూనే ఉండటంతో జనాలు దీన్నొక శాపగ్రస్త గ్రామంగా భావించడం మొదలుపెట్టారు. బందిపోట్ల దాడుల్లో కొందరు ఊరి జనాలు హతమైపోయారు. కొండచరియలు కూలిన సంఘటనల్లో కొందరు మరణించారు. చివరిసారిగా 1963లో ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో ఊళ్లో భారీ విధ్వంసమే జరిగింది. దాంతో మిగిలిన కొద్దిమంది జనాలు కూడా ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడిది పర్యాటక ఆకర్షణగా మారింది. ఇటలీ వచ్చే పర్యాటకుల్లో పలువురు ఈ ఊరిని ఆసక్తిగా చూసి వెళుతుంటారు. (చదవండి: 128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక.) -
చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్వు చక్రవర్తి కొడుకు ఝుడి నాన్జింగ్ నుంచి బీజింగ్కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. (చదవండి: Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!) -
అది ‘ఇత్తడి నగరం’ ఎందుకయ్యింది? నిత్యం శబ్ధాలు ఎందుకు వినిపిస్తాయి?
భారతదేశంలోని ప్రతి నగరానికి ఒక చరిత్ర ఉంది. కొన్ని కలల నగరం హోదాను కలిగి ఉoడగా, మరికొన్ని చరిత్రను సజీవంగా ఉంచడానికి కృషి చేస్తున్నాయి. భారతదేశంలోని ఒక నగరాన్ని ఇత్తడి నగరం అని అంటారు. ఆ నగరంలో జరిగే వ్యాపారం మనదేశంలోనే కాదు అమెరికా నుండి యూరప్ వరకు విస్తరించింది. ఆ నగరం గురించి, అక్కడి వ్యాపారం గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది మనదేశ ఘనతను తెలియజేస్తుంది. ఆ నగరానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ఇత్తడి నగరంగా ప్రసిద్ధి చెందిన నగరం పేరు మొరాదాబాద్. ఈ నగరం ఉత్తరప్రదేశ్లో ఉంది. ప్రభుత్వం ఈ నగరానికి బ్రాస్ సిటీ అనే పేరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఒక ఉత్పత్తి పథకం కింద దీనికి ఈ పేరు వచ్చింది. ఈ నగరంలో తయారైన ఇత్తడి ఉత్పత్తులు భారతీయ సంస్కృతి, వైవిధ్యం, వారసత్వం, చరిత్రను ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఇత్తడి వస్తువుల తయారీకి సంబంధించిన చిన్న పరిశ్రమలు, పెద్ద కర్మాగారాలు అనేకం ఉన్నాయి. హిందూ దేవుళ్లు, దేవతల బొమ్మలు మొదలుకొని మొఘల్ కాలం నాటి ఆకృతుల వరకు అన్నింటినీ ఇక్కడ ఇత్తడితో తయారుచేస్తారు. ఫలితంగా నగరంలో అనునిత్యం ఎక్కడచూసినా పాత్రల తయారీ శబ్ధాలు వినిపిస్తుంటాయి. అమెరికా నుండి యూరప్ వరకు.. బ్రాస్ సిటీలో తయారయ్యే ఉత్పత్తులు భారతదేశంలో విక్రయమవడమే కాకుండా అమెరికా, యూరప్ వంటి ఖండాలకు కూడా ఎగుమతి అవుతాయి. భారత్ నుంచి అమెరికాకు పెద్ద మొత్తంలో ఇత్తడి ఎగుమతి అవుతుంది. ఇక్కడి ఇత్తడి పరిశ్రమ టర్నోవర్ ఏటా రూ. 8,000 నుంచి 9,000 కోట్ల వరకూ ఉంటుంది. ది వైర్లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఈ నగర జనాభాలో దాదాపు 47% మంది ముస్లింలు. ఇక్కడి ముస్లింలు ఇత్తడి పాత్రల తయారీలో ముందున్నారు. ప్రస్తుతం మొరాదాబాద్లో దాదాపు 4,000 మంది ఇత్తడి ఎగుమతిదారులు ఉన్నారు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది? -
‘సిటీ ఆఫ్ డోర్స్’ అంటే ఏమిటి? మనదేశంలోని ఆ నగరానికి ఎందుకంత ప్రత్యేకత?
మనం ఎప్పటికీ గుర్తుంచుకునే కథలు కొన్ని ఉంటాయి. అవి కాలక్రమేణా మరుగుపడుతుంటాయి. అయితే మన దేశ చరిత్రకు సంబంధించిన విషయం అయినప్పుడు దానిని తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాం. అలాంటి ఒక అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలోని ఆ నగరంలోకి ప్రవేశించాలంటే ఎవరైనా 52 తలుపులు దాటాలి. ఈ నగరానికున్న చరిత్ర చాలా పురాతనమైనది. ఈ నగరంలో అసాధారణ రీతిలో తలుపులు ఉన్నాయి. ఇంతకీ ఆ నగరం ఎక్కడుందో, ఆ నగరానికి సంబంధించిన విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ‘సిటీ ఆఫ్ డోర్స్’ పేరుతో ప్రసిద్ధి ఇతర నగరాల కంటే భిన్నంగా ఉన్నప్పుడు ఆ నగరానికి ప్రత్యేకమైన పేరు ఏర్పడుతుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాన్ని ‘తలుపుల నగరం’ అని అంటారు. ఈ నగరం తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను కలిగి ఉంది. ఈ నగరంలోకి ప్రవేశించాలంటే 52 తలుపులు దాటుకుంటూ రావాలి. ఈ సమాచారం ఔరంగాబాద్ జిల్లా ప్రభుత్వ వెబ్సైట్లో పేర్కొన్నారు. ఈ నగరంలోని తలుపులు, వాటికి సంబంధించిన కథలు ఎంతో ప్రసిద్ధిపొందాయి. 500 సంవత్సరాల చరిత్ర ఔరంగాబాద్ నగర చరిత్రను పరిశీలిస్తే ఈ నగరం 500 సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఔరంగాబాద్లో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియాన్ని చూడవచ్చు. దీనిలో శివాజీ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలు కనిపిస్తాయి. అలాగే అప్పట్లో యుద్ధంలో ఉపయోగించిన 500 ఏళ్ల క్రితంనాటి దుస్తులు కూడా కనిపిస్తాయి. మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన స్వహస్తాలతో రాసిన ఖురాన్ కాపీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ నగరం పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా భాసిల్లుతోంది ఔరంగాబాద్ మీదుగా వెళుతున్నవారు ఈ నగరాన్ని చూస్తే వినూత్న అనుభూతికి లోనవుతారు. నగరం అంతటా పురాతన తలుపులు కనిపిస్తాయి. ఇది ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది కూడా చదవండి: India vs Bharat: తెగ నవ్విస్తున్న మీమ్స్! -
సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3
న్యూయార్క్: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ నేత ప్రియాంక ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్లో సనాతన ధర్మంపై ఇలాంటి వివాదాస్పద పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 3ని సనాతన ధర్మ దినోత్సవంగా జరుపుకోవాలని కెంటకీలోని లూయిస్విల్లే నగర మేయర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేశారు. US city declares September 3 as Sanatana Dharma Day https://t.co/YCCgNFK5Q9 — IndiaToday (@IndiaToday) September 6, 2023 లూయిస్విల్లేలోని హిందూ దేవాలయంలో జరిగిన మహా కుంభాభిషేకం వేడుకలో డిప్యూటీ మేయర్ బార్బరా సెక్స్టన్ స్మిత్ అధికారిక ప్రకటనను అందరికి చదివి వినిపించారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు చిదానంద సరస్వతి, పరమార్థ నికేతన్ అధ్యక్షుడు రిషికేశ్, శ్రీశ్రీ రవిశంకర్, భగవతీ సరస్వతి, లెఫ్టినెంట్ గవర్నర్ జాక్వెలిన్ కోల్మన్, డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కైషా డోర్సీ, పలువురు ఆధ్యాత్మిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: మరో వివాదం: ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ 'భారత్' వంతు -
కొద్దిసేపటిలో హైదరాబాద్లో ఖగోళ అద్భుతం.. అస్సలు మిస్సవకండి!
భూమి.. సూర్యుని చుట్టూ తిరుగుతూ, దాని చుట్టు అది తిరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అయితే ఈ నేపధ్యంలో కొన్ని విచిత్రమైన ఖగోళ సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు గ్రహణం సంభవిస్తుంది. ఇంకొన్నిసార్లు ఇతర ఖగోళ సంఘటనలు భూమి నుండి కనిపిస్తాయి. ఇప్పుడు భారతదేశం మరో సంఘటనకు సాక్షిగా నిలవబోతోంది. ఇది ఎంతో ఆశ్చర్యాన్ని గొలపనుంది. ఈ రోజు భారతదేశంలో షాడో డే ఆవిర్భవించనుంది. అంటే దీని అర్థం గురువారం(ఆగస్టు 3) భారతీయులు తమ నీడను తాము కాసేపు చూసుకోలేరు. ఇలా నీడ పడని కాలం ఎంతసేపు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనితో పాటు ఇది ఏ కారణం చేత జరుగుతుందో తెలుసుకుందాం. జీరో షాడో డే అంటే ఏమిటి? జీరో షాడో డే నాడు కొద్ది సమయం పాటు మన నీడ మనకు కనిపించదు. జీరో షాడో డే నాడు ఒక నిర్దిష్ట సమయంలో సూర్యుడు మన తలపైకి వచ్చే సమయంలో మన నీడ ఏర్పడదు. ఈ పరిస్థితినే జీరో షాడో అంటారు. ఇది ఆగస్ట్ 3, 2023న 12.23కి భారతదేశంలో సంభవించనుంది. దీని ప్రభావం హైదరాబాద్ సమీపంలో అధికంగా ఉంటుందని, ఇందుకోసం హైదరాబాద్లో కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీని వెనుక సైన్స్ ఇదే.. ఖగోళంలో సంభవించే ఈ దృగ్విషయం సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. భూమి తన అక్షంలో కొద్దిగా వంగి ఉంటుంది. ఈ వంపుతో భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఈ వంపు కారణంగా సూర్యకిరణాల కోణం ఏడాది పొడవునా మారుతూ ఉంటుంది. ఫలితంగా నీడ పొడవు, దిశ కూడా మారుతూ ఉంటుంది. దీనితో పాటు ఈ కోణం కారణంగా సూర్యుని వంపు కూడా మారుతూ ఉంటుంది. ఫలితంగా సూర్యుడు సరిగ్గా తలపైకి వచ్చినప్పుడు మన నీడ కనిపించదు. అయితే ఇది అక్షాంశంపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం దేశంలోని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో జీరో షాడో డే ప్రభావం ఉంటుంది హైదరాబాద్ అక్షాంశం 17.3850°N. గురువారం మధ్యాహ్నం 12.23 సమయంలో సూర్యుడి కోణం నిటారుగా ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్లో కొంత సమయం పాటు నీడ కనిపించదు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఫ్రీ ఫైర్ గేమ్తో పరిచయం ఏర్పడి.. -
అది దేశంలోనే అత్యంత చిన్న నగరం.. ఒకప్పుడు పారిస్తో పోల్చేవారు!
భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. దేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవి మనదేశ ఘనతను చాటుతాయి. వీటికి ఆకర్షితులైన విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మనదేశంలో మ్తొతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పలు నగరాలు ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత చిన్న నగరం కూడా ఉంది. ఆ నగరంలో జనసంఖ్య 2011లో 98,916 మాత్రమే. కోవిడ్ కారణంగా జనాభా గణన ఇటీవలి కాలంలో జరగలేదు. పంజాబ్లోని కపూర్థలా అందమైన చారిత్రక కట్టడాలకు, విశాలమైన రహదారులకు పేరొందింది. ఒకానొక సమయంలో దీనిని పంజాబ్ పారిస్ అని పిలిచేవారు. ఇక నగరాన్ని స్ణాపించిన నవాబ్ కపూర్ పేరిట ఈ ప్రాంతానికి కపూర్థలా అనే పేరు వచ్చింది. భారతీయ రైల్వోలతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది. రైల్వే బోగీలు ఇక్కడే తుదిమెరుగులు దిద్దుకుంటాయి. ఇక్కడి జగత్జీత్ ప్యాలెస్ ఒకప్పుడు కపూర్థలా రాజ్యానికి రాజైన మహారాజా జగత్జీత్ సింగ్కు నివాసంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్యాలెస్లో సైనిక స్కూల్ నడుస్తోంది. ఈ మహల్ను1908లో నిర్మించారు. ఇక్కడి వాస్తకళ ఈ నాటికీ అందరినీ అలరిస్తుంటుంది. కపూర్థలా నగరానికి పంజాబ్లోని అన్ని పట్టణాల నుంచి రవాణా సదుపాయం ఉంది. అలాగే అమృత్సర్లోని విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. జలంధర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా కపూర్థలాకు చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక.. -
సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే .!
సాధారణంగా వేసవి వచ్చేదంటే అమ్మో!.. ఉక్కపోతా అంటూ అరిచేస్తాం. ఏసీలు, కూలర్లు పెట్టేసి.. వేలల్లో కరెంట్ బిల్లులు కట్టేసి హమ్మయ్యా అనుకుంటాం. జేబు చిల్లు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం గానీ సహజసిద్ధంగా ఇంటిని ఎలా కూల్గా ఉంచుకోవచ్చో ఆలోచించం. ఎందకంటే ఎలాగో విద్యుత్ సౌకర్యం, డబ్బులు కట్టే సామర్థ్యం రెండు ఉన్నాయి. ఇక మరో ఆలోచన కాదు గదా!.. ఆ పదం వరకు కూడా వెళ్లం. కానీ ఈ ఎడారి దేశంలోని ఓ నగరం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవడమేగాక దాని వినూత్న ఆలోచన విధానంతో అందనంత ఎత్తులో ఉంది ఆ నగరం. వివరాల్లోకెళ్తే..ఇరాన్లో ఎడారి నగరమైన యాజ్డ్లో వేడి అలా ఇలా ఉండదు. తట్టుకోవడం చాల కష్టం, కనీస అవసరాలు ఉండవు. పైగా కావల్సినంత విద్యుత్ కూడా ఉండే అవకాశమే లేదు కూడా. అలాంటి ఆ ప్రాంతం అందుబాటులో ఉన్న వనరులతోటే అద్భుతాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా 2017లో యునెస్కోలో వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇంతకీ ఆ నగరంలో అంత గొప్పగా ఏముందంటే..ఆ నగరంలో ఇళ్లన్ని ఎత్తులో ఉండి పైన చిమ్నీ లాంటి టవర్లు ఉంటాయి. వేడి గాలిని ఇంట్లోకి రాకుండా నిరోధించి, చల్లగా ఉండేలా చేస్తుంటాయి ఆ టవర్లు. ఒకరకంగా చెప్పాలంటే వాటిని 'సహజసిద్ధమైన ఏసీ'లని చెప్పొచ్చు. నివాసాలను చల్లబర్చడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు. వీటిని విండ్ క్యాచర్లు అంటారు. ఇది మధ్యప్రాచ్యంలోని పర్షియన్ సామ్రాజ్య కాలం నాటి నిర్మాణంగా భావిస్తారు నిపుణులు. నిజానికి వేసవిలో అక్కడ సుమారు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో శతాబ్దాలకు ముందే అప్పటి వాళ్లే ఇళ్లను కూల్గా ఉంచడానికి వీలుగా ఇలాంటి నిర్మాణంలో ఇళ్లను నిర్మించారు. ప్రజలు దాన్ని ఇప్పటకీ కొనసాగిస్తుండటం విశేషం. విద్యుత్ గురించి తెలియక మునుపే మా పూర్వికులు ఇలాంటి ఇళ్లను కనుగొన్నారు, దాన్నే మేము కొనసాగించడమే కాకుండా ఆ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం అని గర్వంగా ఇరాన్ పర్యాటక మంత్రిత్వ శాఖ డిప్యూటీ అబ్డోల్మాజిద్ షాకేరి చెబుతున్నారు. ఇక్కడ ఇళ్లపై ఉండే 'విండ్ క్యాచర్'(చల్లటి గాలిని ఇచ్చేవి) టవర్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి. తమ పూర్వీకులు చెదపురుగుల గూడుని బేస్ చేసుకుని ఇలా ఇళ్లను నిర్మించినట్లు ఇరాన్ వాసులు చెబుతున్నారు. ఈ ఇళ్లు ఆధునిక సిమెంట్ భవనాలకు అత్యంత విరుద్ధం. ఇవి బంకమట్టి ఇటుకతో నిర్మించే శతాబ్దాల నాటి సంప్రదాయ రీతి కట్టడాల నిర్మాణం. ఇక్కడ ఇంకో అద్భుతమైన నిర్మాణం ఉంది. అది భూగర్భ జల వ్యవస్ధ. దీన్ని ఖానాట్స్ అని పిలుస్తారు. భూగర్భ బావులు, లేదా చిన్న కాలువలు అని చెప్పొచ్చు. అక్కడ ఇళ్లు వేడి ఎక్కకుండా ఉండటానికి ఇవి కూడా ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్లో ప్రస్తుతం 33వేల ఖానాట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ అధికారులు ఈ ఖానాట్స్లను ఎండిపోకుండా పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా దేశాలు ఇలాంటి ప్రకృతిసిద్ధంగా లభించే గాలిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే మంచి గాలి పీల్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే గాక వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించినవాళ్లము అవుతాం కదా ఆలోచించండి!. (చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్డ్రింక్స్లా తాగేస్తున్నామా..!) -
భూమిలో 285 అడుగుల లోతులో 'నగరం'.. 20 వేల మందిదాక..
ఇదొక పురాతన అధోలోక నగరం. ప్రస్తుత తుర్కియాలోని కపడోసియ ప్రాంతంలో ఉంది. భూమి లోపల 285 అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఉన్న ఈ నగరాన్ని తొలి పర్షియన్ సామ్రాజ్యానికి చెందిన పాలకులు నిర్మించి ఉంటారని చరిత్రకారులు, పురాతత్త్వ శాస్త్రవేత్తల అంచనా. దీనిని క్రీస్తుపూర్వం 550 ప్రాంతంలో నిర్మించి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇందులో ఇరవైవేల మంది నివాసం ఉండేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. నూనె గానుగలు, మద్యం పీపాలను భద్రపరచుకునే గదులు, తిండి గింజలు భద్రపరచుకునే గదులు, ప్రార్థన మందిరాలు వంటివీ ఉన్నాయి. దీని లోపలికి గాలి, వెలుతురు ప్రసరించేందుకు వీలుగా 180 అడుగుల పొడవైన మార్గం ఉండటం విశేషం. తొలిసారిగా దీనిని విహార యాత్రకు వచ్చిన ఒక కుటుంబం 1963లో గుర్తించడంతో ఈ నగరం గురించి ఆధునిక ప్రపంచానికి తెలిసింది. తుర్కియాలో దీనికి ‘డెరింకుయు’ అని పేరు పెట్టారు. అంటే నేలమాళిగ నగరం అని అర్థం. (చదవండి: టీచరే బడిదొంగ... ఇరవై ఏళ్లుగా డుమ్మా!) -
యమహానగరీ..నీటిలో తేలియాడే నగరం
సముద్రంలో తేలియాడే నగరాన్ని జపాన్కు చెందిన ఎన్–ఆర్క్ సంస్థ నిర్మిస్తోంది. మూడు భాగాల సమ్మేళనంగా నలభైవేల జనాభాకు ఆవాసం కల్పించేలా ఎన్–ఆర్క్ నిపుణులు ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. బయటివైపు ఉన్న వర్తుల భాగంలో స్థిర నివాస భవనాలు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ఉంటాయి. రెండో వర్తుల భాగంలో తేలియాడే భవంతులు, నగరంలో జనాల రాకపోకలకు వీలుగా పడవ మార్గాలు ఉంటాయి. లోపలి వైపు నడిమధ్యన ఉండే వర్తుల భాగంలో ఉపరితలంపై ఎలాంటి నిర్మాణం ఉండదుగాని, నీటి అడుగున డేటా సెంటర్, వైద్య పరిశోధన కేంద్రం ఉంటాయి. ‘డోజెన్ సిటీ’గా పేర్కొంటున్న ఈ నగరం సముద్రంలో వైద్య పర్యాటక కేంద్రంగా జనాలను ఆకట్టుకోగలదని దీని నిర్మాతలు చెబుతున్నారు. ఇందులో తేలియాడే భవంతులు ఉన్న భాగంలో నివాస భవనాలతో పాటు తేలియాడే ప్రార్థనాలయాలు, హోటళ్లు, శ్మశాన వాటికలు కూడా ఉంటాయి. అలాగే నగర ప్రజల అవసరాల కోసం పంటలు పండించుకునే చిన్న చిన్న పొలాలు, తోటలు కూడా ఉంటాయి. నాలుగు కిలోమీటర్ల పరిధిలో చేపడుతున్న ఈ నగర నిర్మాణం 2030 నాటికి పూర్తి కాగలదని చెబుతున్నారు. (చదవండి: 600 ఏళ్లనాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే) -
దిమ్మతిరిగే ఆ పట్టణం పేరు చదివితే.. మీరు జీనియస్!
ప్రపంచంలో అనేక చిత్రవిచిత్రాలు కనిపిస్తాయి. అలాంటి వాటి గురించి విన్నప్పుడు,చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటిదే న్యూజిలాండ్లోని ఒక పట్టణం పేరు. ఇది ఎంతపెద్దగా ఉంటుందంటే, దానిని పూర్తిగా చదవాలంటే పెద్ద జీనియస్ అయి ఉండాలి. ఆ పొడవైన పేరుగల పట్టణం గురించి, దాని వెనుకగల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పట్టణం ఎక్కడుంది? ఈ విచిత్రమైన పేరు గల పట్టణం న్యూజిలాండ్కి దక్షిణాన గల Porangahau పర్వత శ్రేణుల సమీపంలో ఉంది. ఈ పట్టణం పేరు Taumatawhakatangihangako auauotamateaturipukakapikikungungororukupokaiaienuakitanatahu. ఈ అక్షరాలను చూస్తే.. ఎవరో కీబోర్డును అడ్డదిడ్డంగా ఒకేసారి టైప్ చేశారేమోనని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. ఇది ఎంతో ఓపికతో చేసిన టైపింగ్ పదమే. ఇది ఎప్పటిదో అనుకుంటున్నారేమో..నేడు కూడా ఆ పట్టణం పేరు ఇదే. అయితే ఈ పట్టణం పేరును సులభంగా పలికేందుకు Taumata అని పిలుస్తారు. ఈ పట్టణం పేరులో మొత్తం 85 అక్షరాలున్నాయి. ఈ పట్టణం పేరు ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ కారణంగానే ఈ పట్టణం పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదయ్యింది. ఈ పేరు అర్థం ఏమిటంటే.. Taumatawhakatangihangakoauauotamateaturipukakapikiku ngungororukupokaiaienuakitanatahu.. ఇంత పెద్ద పేరు చూడగానే ఎవరికైనా దీని అర్థం ఏమిటని మనసులో సందేహం తలెత్తుతుంది. ఈ పదానికి అర్థం ఏమిటంటే..‘ఇది ఎటువంటి ప్రాంతమంటే పెద్ద పెద్ద అడుగులు వేస్తూ, పర్వతాలు అధిరోహించేవారు, ప్రపంచాన్నంతా కలియతిరిగేవారు, సుందరమైన Koauau ఫ్లూట్ వాయించే Tamatea ప్రజలు ఉండే ప్రాంతం’. అత్యంత పొడవైన పేరు కలిగిన యువతి.. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పొడవైన పేరు కలిగిన యువతి గురించి తెలుసుకుందాం. అత్యంత పొడవైన పేరు కలిగినందున యువతి పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదయ్యింది. ఈ యువతి పేరు 1000 అక్షరాలకు మించి ఉంటుంది. ఈ పేరు పూర్తిగా చదవాలంటే ఎవరికైనా చెమటలు పడతాయి. ఇంత పెద్ద పేరు కలిగిన ఈ యువతి బర్త్ సర్టిఫికెట్ రెండు అడుగుల పొడవు ఉంటుంది. ఈ యువతి పూర్తి పేరు.. Rhoshandiatellyneshiaunneveshenkescianneshaimondrischlyndasaccarnae renquellenendrasamecashaunettethalemeicoleshiwhalhinive'onchellecaundenesh eaalausondrilynnejeanetrimyranaekuesaundrilynnezekeriakenvaunetradevonneya vondalatarneskcaevontaepreonkeinesceellaviavelzadawnefriendsettajessicanneles ciajoyvaelloydietteyvettesparklenesceaundrieaquenttaekatilyaevea'shauwneorali aevaekizzieshiyjuanewandalecciannereneitheliapreciousnesceverroneccalovelia tyronevekacarrionnehenriettaescecleonpatrarutheliacharsalynnmeokcamonaeloies alynnecsiannemerciadellesciaustillaparissalondonveshadenequamonecaalexetiozetia quaniaenglaundneshiafrancethosharomeshaunnehawaineakowethauandavernellchishankcarl inaaddoneillesciachristondrafawndrealaotrelleoctavionnemiariasarahtashabnequcka gailenaxeteshiataharadaponsadeloriakoentescacraigneckadellanierstellavonnemyiat angoneshiadianacorvettinagodtawndrashirlenescekilokoneyasharrontannamyantoniaaquin ettesequioadaurilessiaquatandamerceddiamaebellecescajamesauwnneltomecapolotyoajohny aetheodoradilcyana. ఇది కూడా చదవండి: 56 కి.మీ మేర నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటూ.. -
అది ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’.. ఉదయం, సాయంత్రం వేళల్లో ఏం చూడొచ్చంటే..
భారత దేశంలో విచిత్రమైన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిని చూసేందుకు జనం ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. వాటిలో ఒకటే ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’. ఈ సిటీకి ఈ పేరు ఎందుకు వచ్చిందో.. ఇది ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మనదేశంలో పింక్ సిటీగా పేరొందిన జైపూర్.. రాజస్థాన్లో ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. మరి మన దేశంలో బ్లూ సిటీ అని ఏ ప్రాంతాన్ని అంటారో తెలుసా? భారతదేశం భిన్నత్వానికి పేరొందింది. మన దేశంలో ప్రతీ మతానికి చెందినవారూ ఉన్నారు. వివిధ రాష్ట్రల్లో పలు రకాలైన సంస్కృతులు కనిపిస్తాయి. అలాగే దేశంలోని ప్రతీ పట్టణం ఏదోఒక ప్రత్యేకతను కలిగివుంటుంది. మన దేశంలో పింక్ సిటీ మాదిరిగానే బ్లూ సిటీ కూడా ఉంది. ఉదయం సాయంత్రం వేళ్లలో ఇక్కడి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. The city which has my DREAM college AIIMS. The blue City the sun city one and only royal JODHPUR❤️❤️ https://t.co/HuDLrGFEpp— Chatenya Mathur 🦁🇮🇳 (@mathur_chatenya) June 8, 2023 రాజస్థాన్లోని జోధ్పూర్ను బ్లూ సిటీ అని అంటారు. దేశంలో జోధ్పూర్ నగరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది అందాల నగరంగానూ పేరొందింది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో ఈ నగరం అందాలు మరింత రెట్టింపు అవుతాయి. జధ్పూర్ను సూర్యనగరి అని కూడా అంటారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే జోధ్పూర్లో సూర్యుడు అత్యధిక సమయం కనిపిస్తాడు. బ్లూ సిటీగా పేరొందిన ఈ నగరాన్ని సుమారు 558 ఏళ్ల క్రితం రావ్ జోధ్ నిర్మాంచాడని చరిత్ర చెబుతోంది. రావ్ జోధ్.. రాథోడ్ సమాజానికి అధ్యక్షునిగా ఉండేవాడు. 1459లో అతను పట్టణాన్ని నిర్మించారు. రావ్ జోధ్.. జోధ్పూర్కు 15 రాజు. జోధ్పూర్ను బ్లూ సిటీ అని పిలవడానికి గత కారణం ఇక్కడి ఇళ్ల నిర్మాణం. ఈ పట్టణంలోని చాలా ఇళ్లు నీలిరంగుతో మెరిసిపోతుంటాయి. భవనాలు కూడా నీలిరంగు రాళ్లలో నిర్మితమై ఉంటాయి. రాజస్థాన్లోని ఈ పట్టణాన్ని మొదట్లో మార్వాడా పేరుతో పిలిచేవారు. జోధ్పూర్లోని అత్యధిక శాతం ఇళ్లు నీలిరంగుతో ఉండటానికి కారణం ఇక్కడి అత్యధిక ఉష్ణోగ్రతలు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడివారంతా తమ ఇళ్లకు నీలిరంగు పెయింట్ వేయిస్తుంటారు. దూరం నుంచి చూస్తే ఈ పట్టణం నీలిరంగులో కనిపిస్తుంది. ఇది కూడాచదవండి: విడాకుల గుడి ఉందని మీకు తెలుసా.. ఇంతకీ ఎక్కడ ఉందంటే.. -
గోల్డ్ సిటీలో చీకటి సామ్రాజ్యం.. జనజీవనం సాగుతుందిలా..
ఆ నగరంలో ఎటుచూసినా బంగారమే. ప్రపంచంలోనే గోల్డ్సిటీగాపేరొందిన ఆ ప్రాంతంలోని ప్రజల జీవితాలు ‘అంధకారం’, హింస, క్రిమినల్ సిండికేట్ల వివాదాల మధ్య నలిగిపోతూ కనిపిస్తాయి. ఈ బంగారు గనుల మెరుపుల వెనుక ఇక్కడివారి జీవితంలోని మరో కోణం ఎలా ఉంటుంది? ఇక్కడి సాధారణ ప్రజల జీవితం ఎలా కొనసాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో బంగారం మెరుపు ముందు మరేదీ సాటిరాదు. అలాగే బంగారాన్ని మించినది మరేదీ లేదని చెబుతుంటారు. బంగారం మాయ ప్రపంచాన్నంతటికీ ఒకే విధంగా కమ్మేసింది. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ నగరం.. ప్రపంచంలోనే అత్యంత పురాతన బంగారు గనులు కలిగిన ప్రాంతం. ఇక్కడ బంగారం తవ్వకాలు 5 వేల ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్నాయి. నాటి నుంచి నేటి వరకూ అంటే మహారాజుల కాలం నుంచి ప్రస్తుత యుగం వరకూ ఇక్కడ బంగారం తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. అయినా ఇక్కడి బంగారు వన్నె ఏమాత్రం తగ్గనేలేదు. భవిష్యత్లోనూ ఇది కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: రూ. 500 చొప్పున 22 మంది పిల్లల కొనుగోలు.. 18 గంటల వెట్టి చాకిరీ.. అమెరికా, చైనా, భారత్, ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పెద్దపెద్ద బంగారు గనులున్నాయి. కానీ ‘గోల్డ్ సిటీ ఆఫ్ వరల్డ్’ అని ఏప్రాంతాన్ని అంటారో తెలుసా? అదే దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్. ఇక్కడే అత్యంత భారీగా బంగారు నిల్వలు కలిగిన విట్వాటర్శాండ్ మైన్స్ ఉన్నాయి. ఈ విట్వాటర్ శాండ్ గనులు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ సువిశాల బంగారు గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే బంగారంలో 40 శాతం మేరకు ఉంటుంది. అందుకే జోహెన్స్ బర్గ్ పేరు బంగారంలా వెలిగిపోతుంటుంది. ఎంత బంగారం ఉందంటే... విట్వాటర్శాండ్కు చెందిన గోల్డ్ మైన్స్ భూమిలోపల మూడు వేల మీటర్ల లోతున ఉన్నాయి. ఇక్కడ 82 మిలియన్ ఔన్సుల బంగారం ఉందనే అంచానాలున్నాయి. ఇక్కడ గడచిన 61 ఏళ్లుగా బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. 1961 నుంచి ఇక్కడి గనుల్లో మొదలైన తవ్వకాలు రాబోయే 70 ఏళ్ల వరకూ అంటే 2092 వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. 2017లో ఇక్కడ 281,300 ఔన్స్లు, 2018లో 157,100 ఔన్సుల బంగారం ఉత్పత్తి జరిగింది. ఇక్కడ యురేనియం గునులు కూడా భారీగానే ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పకోదగిన ఐదు బంగారు గనులు ఉన్నాయి. అవి కూల్ప్ గోల్డ్మైన్, డ్రిఫోంటైన్ గోల్డ్ మైన్, సౌత్ డీప్ గోల్డ్ మైన్, ఇంపాలా మైన్, షిపాంగ్ మైన్. సామాన్యుల జీవితం ఇలా.. ఇక్కడి బంగారం మెరుపుల మధ్య సామాన్యుల జీవితం ఎంతో భిన్నంగా ఉంటుంది. జోహెన్స్ బర్గ్లోని గౌంటెడ్ ప్రాంతం దక్షిణాఫ్రికాలో అతి చిన్న భూభాగం. అంటే కేవలం 1.5 శాతం భూభాగం. అయితే ఇక్కడ అత్యధిక జనాభా నివసిస్తున్నారు. దేశంలోని 26 శాతం జనాభా అంటే ఒక కోటీ 60 లక్షల మంది ఇక్కడే ఉంటున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. గౌంటెడ్ ప్రాంతం.. వాల్ నదీ తీరంలో ఉంటుంది. పలు పర్వాతాలతో పాటు ఇక్కడి విభిన్న వాతారణం ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే ఇక్కడి బంగారుల గనుల తవ్వకాలకు సంబంధించిన ఉపాధి పనులు, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ప్రజలను ఇక్కడ ఉండేలా చేస్తున్నాయి. సముద్రమట్టానికి 1700 మీటర్ల ఎత్తున ఉన్న జోహెన్స్ బర్గ్ పట్టణ వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. తరచుగా ఇక్కడ మంచు కురుస్తుంటుంది. గోల్డ్సిటీగా మారడం వెనుక.. జోహెన్స్ బర్గ్ గోల్డ్సిటీగా మారడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. 19వ శతాబ్ధపు చివరినాళ్ల నుంచి ఇక్కడ బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. నదీ తీరంలో ఉన్న ప్రాంతమైనందున ఈ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం జోహెన్స్ బర్గ్ జనాభా 50 లక్షలు దాటింది. బంగారు గనుల్లో పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఇక్కడికి వస్తుంటారు. ఫలితంగా ఇక్కడి సంస్కృతి ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఇక్కడి రోడ్లపై ఆఫ్రికా వంటలు మొదలుకొని ఆసియాతోపాటు అన్ని రకాల యూరోపియన్ ఆహార పదార్థాలు లభ్యమవుతాయి. ఇక్కడి ప్రభుత్వం ఈ ప్రాంతంలో 60 లక్షల చెట్లను నాటి ఫారెస్ట్సిటీగా రూపమిచ్చింది. ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యధిక చెట్లతో కూడా సిటీగానూ అబివర్ణిస్తుంటారు. ఇక్కడి గోల్డ్మైన్స్పై మొదట యూరప్ వ్యాపారవేత్తల హవా ఉండేది. తరువాతి కాలంలో అరబ్బుల ప్రభావం వేగంగా వ్యాప్తి చెందింది. క్రిమినల్ సిండికేట్లకు నిలయంగా.. ఇక్కడి అడవులు, పర్వతశ్రేణులలో అక్రమంగా తవ్వకాలు జరిపేందుకు ఆసియా- ఆఫ్రికా దేశాల నుంచి అనైతికంగా కూలీలను తీసుకువస్తుంటారు. చీకటితో కూడిన సొరంగాలలో బంగారం పొందవచ్చంటూ ఆశ చూపించి ఇక్కడ జరిగే పనుల్లో కూలీలను నియమిస్తారు. కిలోమీటర్ల పొడవున క్రిమినల్ సిండికేట్ అక్రమ తవ్వకాలు సాగిస్తుంటుంది. ఈ నేధ్యంలో అప్పుడప్పుడూ హింసాయుత ఘటనలు, తూటాల కాల్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రాంతంలో 6 వేలకు పైగా బంగారు గనులు ఉన్నట్లు అంచనా. ఈ గనుల్లో తవ్వకాలు పూర్తయ్యాక వాటిని అలానే వదిలేస్తుంటారు. ఇక్కడి గనులను ఆక్రమించుకునేందుకు క్రిమినల్ సిండికేట్స్ మధ్య వివాదాలు జరుగుతుంటాయి. ఇంతటి భయావహ పరిస్థితుల మధ్య ఇక్కడ 50 లక్షల జనాభా నివసిస్తోంది. వీరంతా గోల్డ్మైన్స్ పనులపైననే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో జనం ఇక్కడికి తరలి వస్తున్నందున హౌసింగ్ సెక్టార్లో షార్టేజీ కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగిత కూడా 29 శాతం మేరకు పెరిగింది. సౌత్ ఆఫ్రికన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెలువరించి న ఒక రిపోర్టు ప్రకారం 2015 నాటికి ఇక్కడ 30 వేలకు మించిన ఆక్రమణదారుల ఇక్కడ తమ కార్యకలాపాలు యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీరిలో అత్యధికులు జోహెన్స్ బర్గ్ పట్టణ సమీప ప్రాంతాల్లోని గోల్డ్మైన్స్లో యాక్టివ్గా ఉన్నారు. వీరిలో 75 శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం విశేషం. వీరంతా ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్నారు. భారత్లో బంగారు గనుల విషయానికొస్తే.. బంగారు గనులనేవి కేవలం పర్వతప్రాంతాలు, పీఠభూములలోనే కాదు.. సముద్రపు లోతుల్లోని ప్రాంతాల్లోనూ వ్యాప్తిచెంది, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారత్లో కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎంతో పేరొందిన ప్రాంతం. దేశంలో అత్యధక స్థాయిలో బంగారు ఉత్పాదన కర్నాటకలో జరుగుతుంది. ఇక్కడ కోలార్, హుట్టీ, ఉటీ పేర్లతో బంగారు గనులు ఉన్నాయి. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్ప్రెస్ రైలు కర్నాటకలో సుమారు 17 టన్నుల బంగారం నిల్వలు కలిగిన గనులు ఉన్నాయని భావిస్తున్నారు. అంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్లలోనూ బంగారు, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే భారత్లోనూ బంగారు నిక్షేపాలు గుర్తించదగని రీతిలోనే ఉన్నాయని చెబుతుంటారు. చాలాదేశాల్లో బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు, తరలింపు చర్యలను అక్కడి ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకోవడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. -
ఆటోకి మూడు చక్రాలే ఎందుకుంటాయంటే...
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ఏదైనా వాహనం అవసరం అవుతుందనే సంగతి మనకు తెలిసిందే. కొంతమంది ఇందుకోసం తమ సొంతవాహనాన్ని వినియోగిస్తారు. చాలామంది ఈ విషయంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలను ఆశ్రయించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే చాలా వాహనాలకు నాలుగు చక్రాలు ఉంటుండగా ఆటోకు మాత్రం మూడు చక్రాలే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆటోకు నాలుగు చక్రాలు ఎందుకు అమర్చలేదని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? రండి... దీని వెనుకనున్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు చక్రాలతో కన్నా మూడు చక్రాలతో వాహనాన్ని రూపొందిస్తే ఖర్చు తగ్గుతుంది. అలాగే తక్కువ ఇంజినీరింగ్ వర్క్ సరిపోతుంది. నాలుగు చక్రాల వాహనం కన్నా మూడు చక్రాల వాహనం చిన్నదిగా రూపొందుతుంది. అలాంటప్పుడు ఎటువంటి ఇరుకు ప్రాంతంలో ప్రయాణించడానికైనా, కొద్దిపాటి ప్రాంతంలో పార్క్ చేయడానికైనా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే పట్టణాల్లో ఆటోలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మూడు చక్రాల వాహనం వలన ఇంధన వినియోగం కూడా భారీగా అవదు. ఆటోను నడిపించేందుకు ఇంజనుకు తక్కువ శక్తి సరిపోతుంది. సాధారణంగా మూడు చక్రాల వాహనాన్ని ప్రయాణికులను తరలించేందుకు, లేదా సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. అటువంటప్పుడు వాహనాన్ని అన్నిరకాలదారులలో త్వరగా ముందుకు తీసుకువెళ్లవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం అనువైనదికాదనిపిస్తుంది. మంచుతో కూడిన ప్రాంతాలలో లేదా కార్నరింగ్ ప్రదేశాలలో ఆటో డ్రైవ్ చేయడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. అలాగే నాలుగు చక్రాల వాహనంతో పోలిస్తే మూడు చక్రాల వాహనం తక్కువ సామర్థ్యం కలిగివుంటుంది. అలాగే తక్కువ సరుకును లేదా కొద్దిమంది ప్రయాణికులను మాత్రమే తరలించేందుకు అనువుగా ఉంటుంది. ఈ విధంగా చూస్తే మూడు చక్రాల ఆటో వలన కొన్ని లాభాలు, మరికొన్ని నష్టాలు ఉన్నాయి. -
నెట్ వాడకంలో ఇండియా జెట్ స్పీడ్.. రిపోర్టులో ఆసక్తికర అంశాలు!
సాక్షి, హైదరాబాద్: ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ఫోన్.. ప్రతిచోటా కంప్యూటర్.. వీటికితోడు స్మార్ట్ టీవీలు, ఇతర డివైజ్లు.. మొత్తంగా అంతా ఇంటర్నెట్కు కనెక్ట్ అయిపోయారు. నిత్యం ఇంటర్నెట్లో గడిపేస్తున్నారు. ఒకరిద్దరు కాదు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడాలేదు.. దేశవ్యాప్తంగా 75.9 కోట్ల మంది ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. ఇందులో పట్టణ ప్రాంతాల వారు 36 కోట్లు అయితే.. గ్రామీణ ప్రాంతాల యూజర్లు అంతకన్నా ఎక్కువగా 39.9 కోట్ల మంది ఉండటం గమనార్హం. ఇక యూజర్లలో 52 శాతం మంది కనీస స్థాయిలోనైనా ఇంటర్నెట్ను వాడుతున్నారు. అంటే మనదేశంలో తొలిసారిగా మెజారిటీ ప్రజలు యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్లుగా నిలవడం విశేషం. తాజాగా ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ)–కాంటార్ (మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ కంపెనీ) సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ‘ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్–2022’లో ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని 86 వేల కుటుంబాలపై ‘ఐక్యూబ్–2022’పేరిట నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఏటేటా పెరిగిపోతూ.. నివేదిక ప్రకారం.. దేశంలో యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య ఏటా 10 శాతం పెరుగుతోంది. 2022లో 75.9 కోటుŠాల్గ ఉన్న వినియోగదారుల సంఖ్య 2025 నాటికల్లా 90కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రధానంగా వినియోగదారులు మొబైల్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ను ఉపయోగిస్తుండగా.. ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, ఇతర స్ట్రీమింగ్ పరికరాలు, స్మార్ట్ పరికరాల ద్వారా వినియోగం కూడా ఇటీవలికాలంలో బాగా పెరిగింది. నూతన సాంకేతికతలు, సేవలను యాక్సెస్ చేసే విషయంలో భారతీయులు ముందుంటున్నారు. ఈ–కామర్స్ సేవలను పొందడంతోపాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు వేగంగా మారుతున్నారు. నివేదికలోని ముఖ్య అంశాలివీ.. - 2022లో భారత్లో యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య మొత్తంగా 75.9 కోట్లు. గతేడాది పట్టణ ప్రాంతాల్లో 6% యాక్టివ్ యూజర్లు పెరిగారు. - ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో14 శాతానికి వినియోగదారులు పెరిగారు. 2022లో కొత్తగా చేరిన యూజర్లలో 57% మహిళలే. - 2025 కల్లా కొత్త ఇంటర్నెట్ వినియోగదారుల్లో 56 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉండే అవకాశం. ఇందులో మహిళలే 65 శాతం ఉండే చాన్స్. - ఇంటర్నెట్ వినియోగం విషయానికొస్తే.. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా వినియోగం ఎక్కువగా ఉంది. - ఇండియన్లు వేగంగా సోషల్ మీడియా ప్లాట్ఫా మ్స్ వైపు మారుతున్నారు. ఈ–కామర్స్ను అందిపుచ్చుకుంటున్నారు. 2022లో ట్యాబ్లెట్లు, స్ట్రీమింగ్ పరికరాలను వాడేవారు 13% పెరిగారు. ఇది కూడా చదవండి: ఆస్తుల అమ్మకాలకు హెచ్ఎండీఏ రెడీ.. రూ.5 వేల కోట్లకు ప్లాన్! -
నిత్యానంద కైలాసకు బిగ్ షాక్
వాషింగ్టన్: కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో వార్తల్లోకెక్కిన వివాదాస్పద వ్యక్తి నిత్యానందకు పెద్ద షాకే తగిలింది. కైలాసానికి అంతర్జాతీయ ఉనికి, ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం నిత్యానంద అండ్ కో తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈలోపే కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా నగరం ఒకటి ప్రకటించింది. అమెరికన్ సిటీ నెవార్క్.. కైలాసతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘‘మేం మోసపోయాం. జరిగినదానికి చింతిస్తున్నాం. కైలాస పరిసర పరిస్థితుల గురించి తెలుసుకున్న వెంటనే మేం స్పందించాం. దాని చుట్టూరా అన్నీ వివాదాలే. అందుకే ఆ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని జనవరి 18వ తేదీనే రద్దు చేసుకున్నాం’’ అని నగర అధికార ప్రతినిధి సుసాన్ గారోఫాలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కైలాస ప్రభుత్వ వెబ్సైట్ మాత్రం అమెరికా నగరం, తమ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసను(USK)ను గుర్తించిందని, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుందంటూ సంబంధిత పత్రాలను పోస్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించుకుంటోంది. జనవరి 12వ తేదీన నెవార్క్ సిటీ హాల్లో కైలాస ప్రతినిధులతో ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోసం గురించి తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని, అది చెల్లుబాటు కాదని, పైగా కైలాసం చుట్టూ వివాదాలు ఉన్నట్లు గుర్తించామని నెవార్క్ ప్రతినిధులు ఇప్పుడు చెప్తున్నారు. అత్యాచారం, కిడ్నాప్ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు నిత్యానంద స్వామి. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించి జనాల్ని బిత్తరపోయేలా చేశాడు. పైగా ఆ దేశానికి పౌరసత్వం కూడా జారీ చేస్తున్నాడు. తాజాగా కైలాస తరపున ఐక్యరాజ్యసమితికి ఓ ప్రతినిధి హాజరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు ఐరాస మానవహక్కుల కమిషన్లో నిత్యానంద వేధింపులకు గురవుతున్నాడని, స్వదేశం నుంచే బహిష్కరణకు గురయ్యాడంటూ ఆ దేశ ప్రతినిధిగా చెప్పుకుంటున్న విజయప్రియ చేసిన ప్రసంగం.. దానిని ఐరాస మానవహక్కుల కమిషన్ కొట్టిపారేయడం గురించి తెలిసిందే. అసలు నిత్యానంద ఏర్పాటు చేసుకున్న ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని చెబుతున్నప్పటికీ.. నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూ ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పరమహంస నిత్యానంద ఫాలోవర్స్ మాత్రం కైలాసను విపరీతంగా ప్రమోట్ చేస్తుంటారు. అంతర్జాతీయ ప్రతినిధులను కలిసి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా కైలాస మీద నడిచే ట్రోలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. -
5జీ సేవలు ముందుగా ప్రారంభమయ్యే నగరాలు ఇవే!
సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే అందుబాటులోకి రానుంది. ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్లు ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో 5జీ సపోర్ట్ స్మార్ట్ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు మొబైల్ వినియోగదారులు కూడా 5జీ సేవల రాక కోసం ఎదురు చూస్తున్నారు. (హౌసింగ్ బూమ్..! రేట్లు పెరిగినా తగ్గేదెలే!) ఇటీవల, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 5జీ సేవలను ఊహించిన దానికంటే త్వరగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 4జీ కంటే 5జీ స్పీడ్ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. గతంలో 4జీ సేవలు కూడా మొదట్లో ప్రధాన నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. 5జీ సేవల విషయంలోనూ ఈ ఫార్ములానే పాటించనున్నారు. (బంపర్ ఆఫర్: మొబైల్ ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.2 లక్షలు) ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో 5జీ నెట్వర్క్ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చే నగరాల జాబితాలో.. హైదరాబాద్, అహ్మాదాబాద్, బెంగళూరు, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్నగర్, కోల్కతా, లక్నో, ముంబై, పుణె నగరాలు ఉన్నాయి. మొదట్లో ఈ నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత చిన్న నగరాలకు సైతం సేవలను అందించనున్నారు. (నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్) -
మంగమారిపేటలో ఎంటర్టైన్మెంట్ సిటీకి ప్రణాళికలు
సింగపూర్ వెళ్లే ప్రతి పర్యాటకుడూ సందర్శించే ఏకైక ప్రాంతం సెంటోసా దీవులు. భిన్నమైన పర్యాటక ప్రాంతాలన్ని ఒకే చోట కనువిందు చేసే ఈ ప్రాంతానికి వెళ్తే.. సరికొత్త ప్రపంచాన్ని చుట్టొచ్చినట్లే. సరిగ్గా ఇదే ఆలోచనతో సుందర నగరం విశాఖ తీరంలోనూ మెగా టూరిజం కాంప్లెక్స్కు పర్యాటక శాఖ శ్రీకారం చుడుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.700 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 24 విభిన్న టూరిజం ప్రాజెక్టులు ఒకే చోట రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్టులో ఇప్పటికే కొన్నింటికి కేబినెట్ ఆమోదముద్ర లభించింది. త్వరలోనే స్టేక్ హోల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు టూరిజం శాఖ సన్నద్ధమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: భారత్కు వచ్చే ప్రతి పది మంది పర్యాటకుల్లో ఐదుగురు విశాఖ నగరాన్ని సందర్శిస్తుంటారు. అందుకే పర్యాటకంగా నగరాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టూరిజం అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సెంటోసా దీవుల తరహాలో ఎంటర్టైన్మెంట్ సిటీని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం విశాఖపట్నం నుంచి 16 కి.మీ, భీమిలి నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న మంగమారిపేట బీచ్ను ఎంపిక చేశారు. 25 ఎకరాలు.. 24 ప్రాజెక్టులు.. రూ.700 కోట్లు మంగమారిపేట బీచ్లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎంటర్టైన్మెంట్ సిటీకి రూపకల్పన చేశారు. ఈ మెగా టూరిజం కాంప్లెక్స్లో మొత్తం 24 విభిన్న తరహా టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. ఇందుకోసం రూ.700 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న భీమిలి–భోగాపురం ఆరులైన్ల గ్రీన్ఫీల్డ్ కారిడార్కు అనుసంధానంగా ఈ ఎంటర్టైన్మెంట్ సిటీ రానుంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా అత్యాధునిక టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంతో పాటు.. ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించడం మొదలైన అంశాలతో టూరిజం అధికారులు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఒకే కాంప్లెక్స్లో పార్కింగ్, ఫుడ్ కోర్టులు, ఇతర మౌలిక వసతులు కల్పించడం వల్ల ప్రాజెక్టు వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఎఎంఎల్) సహకారంతో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనుంది. పలు ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇప్పటికే ఈ ఎంటర్టైన్మెంట్ సిటీలో రానున్న కొన్ని ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం వేసింది. జెయింట్ వీల్, స్నో పార్క్, స్కై టవర్, టన్నెల్ అక్వేరియం వంటి ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం లభించింది. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను రూపొందించిన తర్వాత.. కేబినెట్ ముందుకు ఈ ఫైల్ రానుంది. కేబినెట్ ఆమోదం అన్నింటికీ లభించిన తర్వాత.. మెగా టూరిజం కాంప్లెక్స్కు వడివడిగా అడుగులు పడనున్నాయి. (క్లిక్: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం) ఎంటర్టైన్మెంట్ సిటీ విశేషాలు ఎంటర్టైన్మెంట్ సిటీలో టన్నెల్ అక్వేరియం, జెయింట్ వీల్, స్కైటవర్, స్నోవరల్డ్తో పాటు పలు అడ్వెంచర్ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఐస్ స్కల్ప్ చర్ పార్క్, అవుట్ డోర్ స్కై డైవింగ్, టెథర్డ్ గ్యాస్ బెలూన్, వేవ్ సర్ఫింగ్, ఎలివేటెడ్ ట్రాక్డ్ ట్రైన్, డైనోసర్ పార్క్, డైనోసార్ 5డీ ఇండోర్ షో, గ్లో గార్డెన్, మినియేచర్ వరల్డ్, గ్లాస్ వ్యూయింగ్ డెక్, ఈవెంట్ డోమ్, అవుట్డోర్ మువీ సిస్టమ్, పెర్ఫార్మెన్స్ థియేటర్, గ్లాస్ డెక్ రెస్ట్ అకామిడేషన్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, బీచ్ రాంట్, వాటర్ బస్తో పాటు భిన్నమైన ఆటలు, చిల్డ్రన్ పార్క్, పిల్లల అడ్వెంచర్ గేమ్స్, ఇండోర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, స్టార్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, ఫుడ్కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. (క్లిక్: పర్యాటక ప్రాంతాలు కళకళ.. భారీగా ఆదాయం) త్వరలోనే ఎంవోయూలు ఎంటర్టైన్మెంట్ సిటీ కోసం మంగమారిపేటని గుర్తించాం. బీచ్రోడ్డులో కొంత భూమి కోతకు గురైన కారణంగా ఆరు ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించాం. భూ సేకరణకు సంబంధించి చిన్న చిన్న సమస్యలున్నాయి. అవి త్వరలోనే పరిష్కృతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటికి సంబంధించి మార్పులు చేర్పులు కూడా చేపట్టాం. పెట్టుబడిదారుల కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించి ప్రాజెక్టు గురించి వివరించనున్నాం. ఇప్పటికే చాలా మంది ఎంటర్టైన్మెంట్ సిటీలో పెట్టుబడుల కోసం ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఎంవోయూలు నిర్వహించి, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. – శ్రీనివాస్పాణి, టూరిజం రీజనల్ డైరెక్టర్ -
సముద్రంలో తేలియాడే నగరం.. పంటలు కూడా.. ఎక్కడో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా సాగరతీరాల్లో ఉన్న నగరాలు తక్కువేమీ కాదు గాని, సాగరంలోని అలలపై తేలియాడే నగరం ఎక్కడైనా ఉందంటే అది వింతే! అలాంటి వింతనే దక్షిణ కొరియా ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలి తేలియాడే నగరాన్ని బ్యూసన్ సాగరతీరానికి ఆవల సముద్రం అలలపై నిర్మించింది. ‘ఓషియానిక్స్’ పేరిట పూర్తి జనావాసానికి అనుకూలమైన నగరాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి సహకారంతో నిర్మించింది. త్వరలోనే ఇది పర్యాటకుల రాకపోకలకు, నౌకల రవాణాలకు అనువుగా సిద్ధం కానుంది. సముద్రంలో తేలియాడే ఈ నగరంలో రకరకాల ఆహార పంటలను పండిస్తుండటం, పండ్ల తోటలను పెంచుతుండటం కూడా విశేషం. -
వరదల నియంత్రణకు స్పాంజి నగరాలు
మానవ కల్పిత కారణాలతో భూతాపం పెరుగుతోంది. వర్షపాతం పెరుగుతోంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. గంటకు మూడు చొప్పున అనేక జంతువృక్ష జాతులు అంతరిస్తున్నాయి. శిలాజ ఇంధనాల వాడకం, అశుద్ధ పరిశ్రమలతో బొగ్గు పులుసు వాయువు విడుదల పెరిగింది. సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంత ముంపులు, వరదలు, తుఫాన్లు, కరువులు, రోగాలు పెరుగుతున్నాయి. మరోవైపు జలాశయాలు ఎండిపోతున్నాయి. ప్రపంచంలో 200 కోట్ల మందికి తాగునీరు లేదు. భవిష్యత్తులో ఈ సమస్యలు పెరిగే ప్రమాదముంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నట్లు మానవ మనుగడకు కొత్త ఆలోచనలు అవసరం. (చదవండి: దళితులు శూద్రులే... విడగొట్టారంతే!) స్పాంజి నగరాలు వరదల నిర్వహణకు, పంట, మురికి కాలువల మెరుగుదలకు ఏర్పరచిన నూతన నగర నిర్మాణాలు. నదుల ఒడ్డున చెట్లు, పొదలు, రెళ్ళుగడ్డి, నీళ్ళు ఇంకే కాళ్ళబాటలు, ఆకుపచ్చని పైకప్పులు, వంతెనల మధ్య గుంటల్లో పొదలు, చిత్తడి మైదానాలు, వర్షపు నీటి వనాలు, జీవసంబంధ స్థలాలు స్పాంజి నగరాల భాగాలు. యు కొంగ్జియన్ చైనా పెకింగ్ విశ్వవిద్యాల యంలో నిర్మాణ విజ్ఞానశాస్త్ర, ప్రకృతి సౌందర్యశాస్త్రాల కళాశాల పీఠాధిపతి. ఈయన స్పాంజి నగరాలను ఆవిష్కరించారు. ఇవి నీటి ఎద్దడి, జలవనరుల కొరతను, ఉష్ణోగ్రతల ప్రభావాన్ని, నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తాయి. వాన నీటిని ఒడిసిపట్టి, భూమిలో ఇంకింపజేసి నిలువచేస్తాయి. వరదలను అరికడతాయి. జీవావరణ, పర్యావరణాలను మెరు గుపరుస్తాయి. నున్నటి కాంక్రీటు నది గట్లు నీటి ప్రవాహ వేగాన్ని పెంచుతాయి. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) 2012 జూలైలో బీజింగ్ వరదల్లో 79 మంది చనిపోయారు. పొలాలు మునిగిపోయాయి. ప్రజలు, జంతువులు, ఆస్తులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దీనికి విరుగుడుగా చైనా పలు జిల్లాల్లో, నగరాల్లో స్పాంజి నగరాలను నిర్మించింది. నదుల కాంక్రీటు గట్లను తొలగించారు. చిత్తడి మళ్లను పెంచారు. జీవవైవిధ్యాన్ని పరిరక్షించారు. సహజ వనరులను కాపాడారు. సహజంగా పెరిగే పనికి రావనుకునే చెట్లు, మొక్కలు, పొదలను పెరగ నిచ్చారు. దీంతో వరదల సమస్య తీరింది. కప్పలు, పక్షులు తిరిగిచేరాయి. ఈ ప్రక్రియల్లో విద్యార్థుల ప్రమేయాన్ని పెంచారు. విద్యాసంస్థల్లో వ్యవసాయ ప్రదర్శనలు నిర్వహించారు. వాతావరణ మార్పుతో వచ్చే వరదల తీవ్రతను స్పాంజి నగరాలు తగ్గించాయి. మలేషియా, ఇండోనేషియా, బంగ్లా దేశ్ ఈ నగరాలతో ప్రయోజనం పొందాయి. సింగ పూర్, అమెరికా, రష్యా ఈ నగరాలను నిర్మిస్తు న్నాయి. పదేళ్ళ క్రితం జర్మనీ పర్యా వరణ పరిశోధక శాస్త్రజ్ఞులు హైదరాబాదులో స్పాంజి నగర ఏర్పాట్లు చేశారు. నాటి మెట్రోపాలిటన్ అభివృద్ధి అధికార సంస్థ వాటిని ఉపయోగించలేదు. కేరళ కొచ్చి స్పాంజి నగరం. కోజికోడ్, తిరువనంతపురంలలో స్పాంజి నగర నిర్మాణాలు జరుగుతు న్నాయి. గురుగ్రామ్, దిల్లీ, ముంబయిలలో స్పాంజి నగర పథకాలు రచించారు. వర్షపు నీటిని వేగంగా దూరంగా పంపడానికి గొట్టాలు, కాలువలు ఏర్పాటుచేయడం, నీళ్ళు పొంగి పారకుండా నది గట్లను కాంక్రీటుతో గట్టి పరచటం, ఎత్తు పెంచటం సంప్రదాయ పద్ధతులు. ఇవి జల ప్రవాహాన్ని తగ్గించవు. బయటికి, లేదా మరో వైపుకు నీళ్ళు వేగంగా పోయేటట్లు చేస్తాయి. స్పాంజి నగర పద్ధతి వర్షపు నీటిని భూమిలో ఇంకేటట్లు, భూఉపరితల నీటిని నిదానంగా పారే టట్లు చేస్తుంది. దీన్ని మూడు ప్రాంతాల్లో అమలు చేయవచ్చు. 1. నీటి ఊట ప్రదేశంలో, స్పాంజి రంధ్రాల లాగా చెరువులు, కుంటలు, ఇంకుడు గుంటలు నిర్మించటం. 2. చెట్లు, మొక్కలు నాటి నదుల, కాలువల ప్రవాహ దిశను వంకరటింకరగా మార్చటం. చిత్తడి నేలలను ఏర్పరిచి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి నీళ్ళు భూమిలో ఇంకేటట్లు చేయడం. దీంతో పచ్చని ప్రదేశాలు, కృత్రిమ వనాలు, అటవీ స్థలాలు పెరుగుతాయి. పశుపక్ష్యా దులకు నీటి వసతి ఏర్పడుతుంది. వాటి నివాస స్థలాలు పెరుగుతాయి. (చదవండి: ఈ ప్రమాదాలు యక్షప్రశ్నలేనా!) 3. జనావాసాల ముంపును తగ్గించటం. పై రెండు పద్ధతులు పాటిం చిన తర్వాత మిగులు నీరు ఆటంకం లేకుండా నదులు, సముద్రాల్లో కలిసేటట్లు చేయాలి. కాలువలను పూడ్చరాదు. చెత్త చెదారాలతో నింపరాదు. వర్షాకాలానికి ముందు కాలువల పూడిక తీయాలి. ప్రవాహ మార్గంలో, లోతట్టు ప్రాంతాల్లో నిర్మా ణాలు చేయరాదు. పట్టణాల్లో చెరువులను పూడ్చి, వాణిజ్య నిర్మాణాలు, అపార్టు మెంట్లు, ఇల్లు కట్టుకుంటారు. గుంటూరులో ఒకప్పటి ఎర్ర చెరువు నేటి బస్స్టాండ్. 1977 నవంబర్ ఉప్పెనలో మూడు వందల మందిని ముంచిన నల్ల చెరువు నేడు పెద్ద నివాస ప్రాంతం. నీటితో కుస్తీ పట్టరాదు. దాని దారిన దాన్ని పోనివ్వాలి. స్పాంజి నగర నిర్మాణానికి సంప్రదాయ పద్ధతుల ఖర్చులో నాలుగో వంతు ఖర్చవుతుంది. వరదల నియంత్రణకు కాంక్రీటు నేల, గట్ల ఏర్పాటు, దప్పిక తీర్చుకోటానికి విషం తాగటం లాంటిది. వాతావరణ మార్పు అనువర్తనకు మన జీవన విధానాలను మార్చుకోవాలి. ఇవి ప్రకృతికి దూరమైన మనుషులను మరలా ప్రకృతితో మమేకం చేస్తాయి. - సంగిరెడ్డి హనుమంత రెడ్డి వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
ఎలక్ట్రిక్ వాహనదారులకు కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బంపర్ ఆఫర్..!
ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నవారికి కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే వ్యక్తులకు, హౌసింగ్ సొసైటీలకు ఆస్తి పన్నుపై రాయితీలు ఇవ్వనున్నట్లు కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. ఇటీవల నోటిఫై చేసిన మహారాష్ట్ర ఈవీ పాలసీ 2021 కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి సాతేజ్ పాటిల్ ప్రకటించారు. ముంబై, వసాయి-విరార్, నవీ ముంబై, థానే, కళ్యాణ్-డొంబివాలి, నాగ్ పూర్, నాసిక్, పూణే, పింప్రి-చించ్వాడ్, ఔరంగాబాద్ నగరాలతో సహా ఇతర నగరాలలో కూడా ఈ రాయితీ అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. "ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే హౌసింగ్ సొసైటీలు, వ్యక్తులకు ఆస్తి పన్నులో రాయితీలు ఇచ్చిన మొదటి సంస్థగా కొల్హాపూర్ మునిసిపల్ కార్పొరేషన్ నిలవనుంది. ఇటీవల, మహారాష్ట్ర ప్రభుత్వం 2021 ఈవీ పాలసీని ప్రకటించింది. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీలు) అన్ని కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో 10 శాతం ఉండాలని కూడా ఈ విధానం లక్ష్యంగా పెట్టుకుంది" అని పాటిల్ ట్వీట్ చేశారు. కొల్హాపూర్ మునిసిపల్ పరిధిలో నివసిస్తున్న వ్యక్తులు, హౌసింగ్ సొసైటీల వారికి పన్ను రాయితీలు వెంటనే అందుబాటులో ఉంటాయని మంత్రి ప్రతినిధి ధృవీకరించారు. "ఎవరైనా సొంతం కోసం చార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే ఆస్తి పన్నుల్లో రెండు శాతం, వాణిజ్య వినియోగం కోసం ఏర్పాటు చేస్తే అయిదు శాతం రాయితీ ఇవ్వనున్నారు" అని ప్రతినిధి తెలిపారు. (చదవండి: వారు చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా!) -
అరుదైన ఘనత.. చరిత్ర సృష్టించిన దుబాయ్
UAE City Dubai world's first govt to go 100% paperless: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ నగరం దుబాయ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి 100 శాతం పేపర్లెస్ గవర్నమెంట్ ఖ్యాతి దక్కించుకుంది. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల సేవలను, ట్రాన్జాక్షన్స్ను ‘డిజిటల్ ఫార్మట్’లోనే కొనసాగిస్తూ.. ఈ ఘనత అందుకుంది దుబాయ్ నగరం. వంద శాతం ‘పేపర్లెస్’ సాధించిన తొలి ప్రభుత్వంగా దుబాయ్ సిటీ నిలిచింది. ఈ మేరకు ఎమిరేట్స్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. తద్వారా 14 మిలియన్ గంటల మనిషి శ్రమను.. 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) ఆదా చేసినట్లు పేర్కొన్నారాయన. ప్రభుత్వానికి సంబంధించి ఇంటర్నల్, బయటి ట్రాన్జాక్షన్స్తో పాటు.. ప్రభుత్వానికి సంబంధించి ప్రతీ సేవలను డిజిటల్ పద్దతిలో.. అదీ ప్రభుత్వ వేదికల మీదుగానే సాగిందని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. మొత్తం 45 ప్రభుత్వ రంగాల్లో 1,800 రకాల డిజిటల్ సేవలను .. అదీ ఆలస్యం అవ్వకుండా డిజిటల్ ఫార్మట్లో ప్రజలకు చేరవేయడం విశేషం. ఈ క్రమంలో నగరవాసులపై ప్రభుత్వం ఏమాత్రం ఒత్తిడి చేయకుండా.. స్వచ్ఛందంగా ఈ ఘనత సాధించింది. పేపర్లెస్ ఘనత ప్రపంచానికి డిజిటల్ క్యాపిటల్గా నిలవడానికి దుబాయ్కు ఎంతో ప్రొద్భలం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు క్రౌన్ ప్రిన్స్. అంతేకాదు మరో ఐదు దశాబ్దాలపాటు అత్యాధునిక వ్యూహాలతో దుబాయ్లో డిజిటల్ లైఫ్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే అమెరికా(ఖండాలు), యూకే, యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు ఈ తరహా విధానానికి మొగ్గు చూపించినప్పటికీ.. సైబర్ దాడుల భయంతో వెనక్కి తగ్గాయి. కానీ, దుబాయ్ మాత్రం ధైర్యం చేసి ముందడుగు వేసి.. ఈ ఫీట్ సాధించింది. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ మూమెంట్తో 336 మిలియన్ పేపర్లను, 1.3 బిలియన్ దిర్హమ్(350 మిలియన్ డాలర్లు) బడ్జెట్ను, 14 మిలియన్ గంటల ఉద్యోగుల శ్రమను మిగిల్చింది దుబాయ్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే ప్రపంచంలో రిచ్చెస్ట్ సిటీల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ జనాభా 35 లక్షలు కాగా.. మెట్రో ఏరియాలో జనాభా 29 లక్షలకు పైనే ఉంది. చదవండి: అర్జెంటీనా టు అస్సాం వయా దుబాయ్.. ఖరీదు 20లక్షలకుపైనే! -
ప్రపంచవ్యాప్తంగా మన నగరమే మొదటి స్థానం.. కానీ అదో చెత్త రికార్డ్
న్యూఢిల్లీ: మన దేశంలో వాయు కాలుష్యం గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది దేశ రాజధాని ఢిల్లీ. అభివృద్ధి పరంగా ఎంత ముందుందో కాలుష్యం కూడా అంతే ముందుంది. రోజురోజుకీ ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం పెరిగి అది కాస్త తీవ్ర స్థాయికి చేరుకుంది. శీతాకాలం మంచుతో పాటు కాలుష్యం తోడవడం ఢిల్లీ కాలుష్య పరిస్థితిని మరింత దిగజార్చిoది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న పది నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దేశం నుంచి ముంబై, కోల్కతా కూడా చేరాయి. స్విట్జర్లాండ్కు చెందిన క్లైమేట్ గ్రూప్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తాజా జాబితాను విడుదల చేసింది. ఈ గ్రూప్ గాలి నాణ్యత, కాలుష్యాన్ని ప్రమానికాలుగా తీసుకుంటారు. ఆ టాప్-10 జాబితా ఓ సారి చూస్తే.. పాకిస్థాన్లోని లాహోర్, చైనాలోని చెంగు నగరాలున్నాయి. దేశ రాజధానిలో నెలకొన్న ఈ దుస్థితికి వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతో పాటు పాటు పంజాబ్, హర్యానాల్లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారణాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యర్థాల విషయంలో రాష్ట్రాల మధ్య వాగ్వాదాలు జరుగుతునే ఉన్న పరిష్కారం మాత్రం దొరకడం లేదు. శనివారం దేశ రాజధానిలో గాలి నాణ్యత పడిపోయింది. ఏక్యూఐ 476గా నమోదైంది. వచ్చే 48 గంటల పాటు వాయు కాలుష్యం తీవ్రంగా ఉంటుందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి హెచ్చరించింది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు పాఠశాలలను మూసివేడంతో పాటు వాహనాలను ‘బేసి-సరి’ విధానం అమలు చేయడంతో పాటు నిర్మాణాలను నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే యూపీలోని బులంద్షహర్, హాపూర్, నోయిడా, మీరట్, ఘజియాబాద్లోనూ ఏక్యూఐ 400కు పెరిగింది. ఇదిలా కొనసాగితే భవిష్యత్తు లో ఇంట్లో కూడా మాస్కులు వేసుకోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. -
మార్బర్గ్; అంధుల స్వర్గధామం.. నగరమంతా ‘ప్రత్యేక’మే..
మార్బర్గ్.. జర్మనీలోని ఓ అద్భుత నగరం. కళ్లను కట్టిపడేసే ప్రాచీన భవంతులు, చుట్టూ పచ్చని పర్వతాలు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం దీని సొంతం. జర్మనీలోని సుందర నగరాల్లో ఇది ఒకటి. వీటన్నింటిని మించిన ప్రత్యేకత మార్బర్గ్కు ఉంది. అంధుల సంక్షేమ నగరంగా దీనికి పేరుంది. వారు అత్యున్నత శిఖరాలను అందుకునేలా ముందుకు నడిపించే నగరంగా ఇది ప్రసిద్ధి చెందింది. సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: లియోన్ పోర్జ్కు పుట్టుకతో వచ్చిన అనారోగ్యం వల్ల 8 ఏళ్ల వయసులో క్రమంగా కంటిచూపు మందగించింది. సైన్స్ సంబంధిత విషయాల మీద లియోన్ పోర్జ్కు అమితాసక్తి ఉండేది. అదే సమయంలో మార్బర్గ్ నగరం గురించి.. అంధుల కోసం అక్కడ ఉన్న విద్యా సంస్థల గురించి పోర్జ్ తెలుసుకున్నాడు. వెంటనే సెంట్రల్ జర్మనీలోని తన స్వస్థలం నుంచి సమీపంలోని మార్బర్గ్కు మారిపోయాడు. ఇలాంటి వారు అనేక మంది ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రతిభా పాటవాలు చాటుతున్నారు. నగరమంతా ‘ప్రత్యేక’మే.. అంధుల విద్యోన్నతి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ‘బ్లిస్టా’ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థ ఎంతో మంది అంధ విద్యార్థుల జీవితాలను మార్చేసింది. దీనిని స్థాపించినప్పటి నుంచి ఇక్కడి విద్యార్థులు అనేకఆవిష్కరణలు చేశారు. టాక్టైల్ అనే మ్యాథమెటికల్ ఫాంట్ను కూడా కనుగొన్నారు. కాలక్రమేణా మార్బర్గ్.. ఓ ఆదర్శ నగరంగా మారింది. ఇక్కడ బ్లిస్టాతో పాటు అంధుల కోసం మరికొన్ని విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. వారు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఎలాంటి భయాలు లేకుండా తిరిగేలా మార్పులు తీసుకొచ్చారు. వారిని అప్రమత్తం చేసే బీపింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రత్యేక రహదారులు, అవసరమైన చోట్ల వాటిపై కాస్త ఎత్తయిన సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. చదవండి: వరల్డ్ కార్ ఫ్రీ డే: ఈ విశేషాలేంటో తెలుసా? అలాగే మార్బర్గ్ను సందర్శించేందుకు వచ్చే పాక్షిక అంధుల కోసం ఎక్కడికక్కడ నగర ల్యాండ్మార్క్స్ను తెలియజేసే చిన్న చిన్న రూపాలను ఉంచారు. వీటి సాయంతో వారు సులభంగా తాము వెళ్లాలనుకొన్న ప్రదేశానికి వెళ్లొచ్చు. అంధుల కోసం ప్రత్యేకంగా హార్స్ రైడింగ్, ఫుట్బాల్, రోయింగ్, క్లైంబింగ్ క్లబ్లున్నాయి. తరచూ వారికి పోటీలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తుంటారు. అలాగే బస్ స్టాప్లను కూడా వీరికి తగిన సమాచారమిచ్చేలా రూపొందించారు. వీరితో ఎలా ప్రవర్తించాలనే అంశాలపై తరచూ డ్రైవర్లు, రెస్టారెంట్లలోని సిబ్బందికి శిక్షణ ఇస్తుంటారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల మెనూ కూడా బ్రెయిలీ లిపిలో ఉంటుంది. బయోకెమెస్ట్రీతో రికార్డుల్లోకి.. బ్లిస్టాతో పాటు ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకునే వారు భారీ పుస్తకాలతో ఇబ్బంది పడకుండా.. ప్రత్యేక స్క్రీన్ రీడర్స్ అందుబాటులో ఉంటాయి. లియోన్ పోర్జ్ ప్రస్తుతమిక్కడ కంప్యూటర్ సైన్స్, బయోకెమిస్ట్రీ చదువుతున్నాడు. మొత్తం జర్మనీలోనే చాలా తక్కువ మంది ఎంచుకొనే ‘బయోకెమిస్ట్రీ’ చదువుతున్న మొట్టమొదటి అంధ విద్యారి్థగా పోర్జ్ రికార్డుల్లోకి ఎక్కాడు. సాధారణ మనుషులే ఇందులో ఉండే చిత్రాలు, ల్యాబ్ ప్రయోగాలు నేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ దీనికి కూడా మార్బర్గ్లోని విద్యా సంస్థలు ప్రత్యామ్నాయాలను కనుగొన్నాయి. అంధ విద్యార్థులు వీలైనంత సులభంగా చదువుకునేలా ఇక్కడి అధ్యాపకులు ఎప్పటికప్పుడు సులభమైన మార్గాలు కనుగొంటూ, విద్యార్థులతోనే విభిన్న ఆవిష్కరణలు చేయిస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల్లో కూడా వీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా చదువులో ముందుకు దూసుకువెళ్తున్నారు. చదవండి: వరల్డ్ రోజ్ డే: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి -
IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్వార్కి రెడీ
ప్రపంచంలోనే అతి పెద్ద హోం ఫర్నీచర్ తయారీ, అమ్మకాల సంస్థ ఐకియా మరో కొత్త కాన్సెప్టుతో మార్కెట్లోకి రానుంది. అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ఎత్తులతో వస్తోంది. ఫర్నీచర్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపనుంది. హైదరాబాద్తో మొదలు స్వీడన్కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా తన తొలి స్టోర్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నవీ ముంబైలో రెండో స్టోర్ను ఇటీవల ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇందులో తొమ్మిది వేల రకాల ఫర్నీచర్ వస్తువులు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ తరహా ఆల్ ఇన్ వన్ అనే సూత్రానే పాటిస్తూ వచ్చింది ఐకియా సంస్థ. కానీ ఇటీవల మార్కెటింగ్లో కొత్త సిటీ స్టోర్స్ పేరుతో కొత్త కాన్సెప్టును తీసుకొచ్చింది. సిటీ స్టోర్లు విశాలమైన ప్రాంగణంలో అన్ని వస్తువులు ఒకే చోట కష్టమర్లకు లభించాలనే మార్కెటింగ్ టెక్నిక్కి స్వల్ప మినహాయింపులు ఇచ్చింది. అన్ని రకాల వస్తువుల స్థానంలో ముఖ్యమైన వస్తువులు లభించే విధంగా ఐకియా ఫర్నీచర్ స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని సిటీ స్టోర్ల పేరుతో ఏర్పాటు చేస్తోంది. పరిమాణంలో ఐకియా స్టోర్ల కంటే సిటీ స్టోర్లు చిన్నవిగా ఉంటాయి. యాభై వేల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సిటీ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ 6,500 రకాల ఫర్నీచర్లు లభిస్తాయి. ఎక్కడంటే ఐకియా సిటీ స్టోర్లు ఇప్పటికే యూరప్లో ముఖ్యమైన నగరాల్లో ప్రారంభం అవగా ఇండియాలో హైదరాబాద్, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో ఈ సిటీ స్టోర్లు రానున్నాయి. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. ధరల తగ్గింపు సిటీ స్టోర్ల ఏర్పాటుతో పాటు ధరలు తగ్గించడం ద్వారా ఎక్కువ కస్టమర్ బేస్ను సేల్స్ను సాధించాలనే లక్ష్యంతో ఐకియా ఉంది. ఈ మేరకు ఐకియా స్టోర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే 50 రకాల వస్తువుల ధరలను 20 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించినట్టు ఐకియా, ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పెర్ హార్నెల్ తెలిపారు. ఐకియా స్టోర్ల నిర్వహాణ సామర్థ్యం పెంచడంతో పాటు మార్జిన్లను తగ్గించుకునైనా ధరల తగ్గింపును అమలు చేస్తామన్నారయన. చదవండి: పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్ -
హైదరాబాద్ ఆహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం ప్రఖ్యాతిగాంచిన యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్కు అర్హత పొందింది. ‘గ్యాస్ట్రానమీ’ కేటగిరీలో హైదరాబాద్కు ఈ గుర్తింపు లభించినట్టు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ముషార్రఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. హైదరాబాద్ ఎంపికయ్యేందుకు దరఖాస్తు నుంచి ప్రెజెంటేషన్ దాకా వివిధ వర్గాలు, సంస్థలతో సమావేశాలు నిర్వహించి ముషార్రఫ్ అలీ కీలకభూమిక పోషించారు. శతాబ్దాల ఘనత.. వందల ఏళ్లనుంచి వివిధ రకాల వంటలకు సుప్రసిద్ధమైన హైదరాబాద్ నగరం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని దేశాల వారినీ ఆకట్టుకోవడమేకాక ఇక్కడి వివిధ రకాల వంటకాలు అందరినీ అలరిస్తున్నాయి. తరతరాల సంప్రదాయాలను అందిపుచ్చుకున్న పాకశాస్త్ర ప్రవీణులేగాక ఈ రంగానికి సంబంధించి ఎన్నో సంస్థలు, పరిశోధనశాలలు సైతం నగరంలో ఉన్నాయి. వీధిబండ్ల నుంచి సెవెన్ స్టార్ హోటళ్ల దాకా వివిధ ఆహారాలను అందిస్తుండటం నగరానికి ఈ చోటు దక్కడంలో కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైన హలీం వరకు హైదరాబాద్కే ప్రత్యేకమైనవి కావడం కూడా ఇందుకు ఉపకరించాయి. కాకతీయుల కాలం నుంచి టర్కీలు, మొఘల్ వంటకాలు హైదరాబాద్ జిహ్వచాపల్యాన్ని పెంచాయి. హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్ గురించి వేరుగా చెప్పాల్సిన పనిలేదు. కుతుబ్షాహీలు, ఆసఫ్జాహీలు మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, అమెరికా, చైనా తదితర దేశాలకు చెందిన రుచికరమైన ఆహారాలను హైదరాబాద్కు పరిచయం చేశారు. పరిశ్రమగానూ ఉపాధి నగరంలో రిజిస్టర్ చేసుకున్న రెస్టారెంట్లు 2,200 కాగా, మరో లక్ష కుటుంబాలు ఆహారమే జీవనాధారంగా కలిగి ఉన్నాయి. దాదాపు 3 లక్షలకు పైచిలుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంలో ఉన్నారు. ఆహార వినియోగంలోనూ హైదరాబాద్ తక్కువేం లేదు. నిత్యం 700 టన్నుల చికెన్, (ప్రత్యేక సందర్భాల్లో 2000 టన్నులు), 291 టన్నుల మాంసం వినియోగమవుతున్నాయంటే నగర వాసులకు వంటకాలపై ఎంత మక్కువో అంచనా వేసుకోవచ్చు. అన్ని వర్గాల వారికి తగినట్లుగా ఇరుకుసందులోని టిఫిన్ బండి నుంచి ప్రపంచశ్రేణి తాజ్, నోవాటెల్ వంటి గ్రూప్ హోటళ్లు, వాటి వినియోగదారులు నగరంలో ఉన్నారు. స్వీట్ఫెస్టివల్స్ వంటివి ఇక్కడే నిర్వహిస్తూ వివిధ ప్రాంతాల వారిని ఒక్కచోట చేరుస్తున్నారు. నగరానికి గర్వకారణం: మేయర్ నాలుగు వందల ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన హైదరాబాద్ దేశవిదేశాలకు చెందిన అన్ని రకాల ఆహారం దొరికే ఏకైక నగరం. మన నగరం యునెస్కో క్రియేటివ్ సిటీల జాబితాలో చేరడం అందరికీ గర్వకారణం. మంత్రి కేటీఆర్ ప్రశంసలు.. హైదరాబాద్ నగరానికి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో స్థానం లభించడంపై మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్లు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన జీహెచ్ఎంసీ అధికారులను అభినందించారు. -
సరికొత్త ‘పట్టణం’
తూర్పుగోదావరి ,మండపేట: పట్టణ ప్రాంతాలు త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనున్నాయి. వార్డుల్లోని వ్యత్యాసాలను సరిచేసి అభివృద్ధి ఫలాలను అక్కడి ప్రజలందరికీ చేరువ చేసేం దుకు ప్రభుత్వం చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ముసాయిదా జాబితాను జిల్లాలోని పురపాలక సంస్థలు, నగర పంచాయతీలు ప్రభుత్వానికి నివేదించాయి. పరిశీలన అనంతరం అక్టోబరు పదో తేదీన తుది నోటిఫికేషన్ జారీ కానుంది. ఇకపై వార్డుల్లోనిప్రజాప్రతినిధులకు సమాన ప్రాతినిధ్యం దక్కనుంది. జిల్లాలో రెండు నగర పాలక సంస్థలు, ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలుండగా, కార్పొరేషన్ల పరిధిలో 100 డివిజన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల పరిధిలో 264 వార్డులున్నాయి. జిల్లాలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉన్న రాజమహేంద్రవరం కార్పొరేషన్తోపాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఇప్పటికే అధికారులు ఓటరు జాబితాలను సిద్ధం చేశారు. ఒక్కో వార్డులో ఓటర్లు, జనాభా వివరాల్లో అధిక వ్యత్యాసం ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. ఒక వార్డులో నాలుగు వేల వరకు జనాభా ఉంటే, ఒక వార్డులో రెండు వేలు మాత్రమే ఉన్నాయి. తక్కువ జనాభా ఉన్న వార్డులతో పోలిస్తే అధిక జనాభా ఉన్న వార్డుల్లో పనిభారం అధికంగా ఉండటంతోపాటు పథకాల అమలులో తాత్సారం, పాలనాపరమైన సమస్యలకు ‘చెక్’ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని వార్డుల్లోను సమాన జనాభా ఉండే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన చేయాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) ఆదేశాలిచ్చింది. వార్డుల్లోని జనాభా సమానంగా ఉండాలి. 10 శాతం హెచ్చతగ్గులు ఉండవచ్చు. ప్రస్తుత వార్డు జనాభాలో వ్యత్యాసం అంతకన్నా ఎక్కువగా ఉంటే వ్యత్యాసం ఉన్న జనాభాను సమీప వార్డుల్లో కలపాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు, ముమ్మిడివరం నగరపంచాయతీ మినహా మిగిలిన మండపేట, అమలాపురం, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రపురం, తుని మున్సిపాల్టీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీలు వార్డుల పునర్విభజన నిమిత్తం గత నెలలో అధికారులకు ఆదేశాలందాయి. కాకినాడ కార్పొరేషన్లో ఇప్పటికే ఎన్నికలు జరగ్గా, రాజమహేంద్రవరం కార్పొరేషన్, ముమ్మిడివరం నగర పంచాయతీ లేకపోవడంతో వాటిలో సమీప గ్రామాల విలీన ప్రతిపాదన ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు 2011 జనాభా ప్రాతిపదికన అధికారులు జిల్లాలోని పురపాలక సంస్థలు, నగర పంచాయతీల వార్డుల పరిధిలో జనాభాను సమానం చేశారు. ప్రజల నుంచి అభ్యంతరాలు, పరిశీలన తదితర ప్రక్రియలను పూర్తి చేసి ముసాయిదా జాబితాను ఈ నెల 18వ తేదీన సీడీఎంఏకు నివేదించారు. పరిశీలన అనంతరం అక్టోబర్ 10వ తేదీన ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. -
మేలు చేసిన తేనెటీగ
సారంగపురంలో జనాభా పెరిగిపోయింది. నగరంలో పెద్ద భవనాలు, విద్యాసంస్థలు వెలిశాయి. రాజుగారి రథాలు, మంత్రిగారు సహా రాజ పరివారానికి చెందినవారి రథాలు, ఇతర సంపన్నుల రథాలు పోవాలంటే నగరంలోని వీధులు ఇరుకు కాసాగాయి. రహదారులను విశాలంగా తయారు చేయడానికి అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద చెట్లను కొట్టించేయాలని రాజుగారి మంత్రిమండలి నిర్ణయించింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువా! శరవేగంగా చెట్లు కొట్టే కార్యక్రమాన్ని అమలు చేయసాగారు. చిరకాలంగా నగర పౌరులకు నీడనిచ్చిన భారీ వృక్షాలు నేలకొరిగాయి. పచ్చని చెట్లతో కళకళలాడుతూ కనిపించే రహదారులు బోసిపోయాయి. నగరంలోనే నివాసం ఉంటున్న పుష్పరాజుకు చెట్లంటే వల్లమాలిన ప్రేమ. పుష్పరాజు నగరంలోని అనేక రహదారుల వెంబడి ఎన్నో చెట్లు నాటించాడు. పుష్పరాజు ఇంటి దగ్గర్లోనే ఉన్న మూడు పెద్ద వృక్షాలను కూడా రాజుగారి సిబ్బంది కొట్టివేశారు. చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ పెరిగిన పుష్పరాజు, నేలకొరిగిన ఆ వృక్షాలను చూసి చాలా బాధపడ్డాడు. ఇదివరకు పచ్చగా కళకళలాడే ప్రదేశం బోసిపోయి కనిపించడాన్ని తట్టుకోలేకపోయాడు. అందుకే, నగరానికి దూరంగా వెళ్లి ఒక పెద్దస్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని, చక్కని తోట వేసుకోవాలనుకున్నాడు. నగరానికి దూరంగా ఒక తటాకం పక్కన కనిపించిన స్థలం అనువైనదిగా అనిపించడంతో అక్కడ ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు. చుట్టూ బోలెడన్ని పండ్లు, కూరగాయల మొక్కలు వేశాడు. పూల మొక్కలు వేశాడు. తటాకానికి కొద్ది దూరంలోనే ఒక పెద్ద వృక్షం కూడా ఉంది. రోజూ తటాకం నుంచి నీళ్లు తెచ్చి శ్రద్ధగా తోటలోని మొక్కలకు పోయసాగాడు. మొక్కలు ఏపుగా పెరిగాయి. కొన్ని వృక్షాలుగా ఎదిగాయి. అవి పూలు, పండ్లు, కూరగాయలు ఇవ్వసాగాయి. ఆ అందమైన పూల సువాసన అల్లంత దూరంలో ఎగురుతున్న తేనెటీగను ఆకర్షించింది. అది ఎంతో సంతోషంతో తోటను గమనించింది. ఇంతకుముందు తేనె సేకరించాలంటే ఎంతో దూరం పోవాల్సి వచ్చేది. ఇంత అందమైన దృశ్యాన్ని ఆ తేనెటీగ ఇంతకు ముందు చూసి ఎరుగదు. అక్కడ దూరంగా ఉన్న తేనెటీగలు కూడా పూల సువాసనను గ్రహించాయి. కొద్ది దూరంలోనే ఉన్న పెద్ద చెట్టు మీద తేనెటీగలు తేనెపట్టు పెట్టాయి. అవి రోజూ పుష్పరాజు తోటలోని పూల నుంచి మకరందాన్ని సేకరించి తమ తేనెపట్టును నింపసాగాయి. పుష్పరాజు తోటలోని మకరందాన్ని సేకరిస్తున్నాయి కనుక అవి పుష్పరాజుకు ఏదైనా మేలు చేయాలని తలచాయి. అదలా ఉండగా, దూరంగా ఉన్న అడవి నుంచి ఒక తోడేలు పుష్పరాజు ఇంటి వైపు రాసాగింది. అప్పుడే పుష్పరాజు కొడుకు చెక్కతో చేసిన చిన్న బొమ్మతో ఆడుకుంటూ తోటలోకి వచ్చాడు. తోడేలు పుష్పరాజు కొడుకు వైపు రాసాగింది. తోడేలు వల్ల ఆ బాలుడికి ఎదురవబోయే ప్రమాదాన్ని గ్రహించిన పెద్ద తేనెటీగ మిగిలిన తేనెటీగలను వెంటనే అప్రమత్తం చేసింది. అంతే! అవి గుంపుగా బయలుదేరి పుష్పరాజు కొడుకు వైపు వస్తున్న తోడేలుపై మూకుమ్మడిగా దాడి చేశాయి. తేనెటీగల కాటుకు తోడేలుకు ఒళ్లంతా బాగా వాచిపోయింది. తేనెటీగల కాట్ల ధాటికి ఒళ్లంతా మంటలు పుట్టడంతో ఆ బాధ భరించలేక కుయ్యో మొర్రో అంటూ ఆ తోడేలు దూరంగా ఉన్న అడవిలోకి పారిపోయింది. ఇక ఆ రోజు నుంచి తోడేలు పుష్పరాజు తోట దరిదాపులకు వచ్చేందుకైనా సాహసించలేదు. పుష్పరాజు తోటలోని మకరందాన్ని గ్రహిస్తున్నందుకు కృతజ్ఞతగా తేనెటీగలు అతడి కొడుకును తోడేలు బారి నుంచి కాపాడాయి. తోడేలు పాదాల గుర్తులు గమనించి పుష్పరాజు ఇంటి చుట్టూ పెద్ద దడి కట్టించి, తన ఇంటికీ, కుటుంబానికి తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడు. మరిన్ని పూల మొక్కలు, పండ్ల మొక్కలను తీసుకొచ్చి తన తోటను మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నాడు. -
‘కంప్యూటర్’ నగరం!
ఈ ఫొటోను ఓ సారి పరిశీలించండి.. ఏముంది కంప్యూటర్లోని చిప్స్, ట్రాన్సిస్టర్లే కదా అనుకుంటున్నారా.. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే అందులో ఓ నగరం ఉంటుంది. అవును ఈ ఫొటోలో ఉన్నది మన్ హట్టన్ నగరం. అదేంటి నిజంగా ఆ నగరం అలాగే ఉంటుందా అని అనుకుంటున్నారా..? అది నిజమైన నగరం కాదు కానీ.. అమెరికాలోని న్యూయార్క్ పక్కనే ఉండే మన్హట్టన్ను పోలి ఉండేలా నిర్మించారు. కంప్యూటర్లోని పనికిరాని వస్తువులను ఉపయోగించి దీన్ని తయారు చేశాడు ఓ స్కూల్ పిల్లాడు. జింబాబ్వేకు చెందిన జేడ్ మెంక్ అనే 17 ఏళ్ల కుర్రాడు ఈ నగరాన్ని రూపొందించేందుకు 3 నెలల సమయం తీసుకున్నాడట. అది కూడా 0.0635:100 నిష్పత్తిలో చిన్న తేడా కూడా లేకుండా మొత్తం నగరాన్ని తీర్చిదిద్డాడు. ఇదంతా కూడా ఆ పిల్లాడి స్కూల్ ప్రాజెక్టు కోసం ఎంతో కష్టపడి మరీ తయారు చేశాడు. ఇందుకోసం 27 మదర్బోర్డులు, 11 సీపీయూలు, 10 సీఆర్టీ మానిటర్ మదర్బోర్డులు, 18 ర్యామ్ స్టిక్లు, 12 నోకియా ఈ–సిరీస్ ఫోన్లు, 4 వాచ్లు, 4 ఆడియో కార్డులు, 2 టెలిఫోన్లు ఇలా వాడి పాడేసిన వస్తువుల సాయంతో తయారు చేశాడు. మన్హట్టన్లోని భవంతులు, ఆకాశహర్మ్యాలు ఇలా ఒక్కటేమిటి అచ్చు ఆ నగరాన్ని పోలినట్లే ఆ పిల్లాడు తయారు చేశాడు. ఇదంతా తయారు చేయడానికి మంచి తెలివితో పాటు ఎంతో ఓపిక ఉండాలి కదా..! -
మాయలోడు..!
అవినీతికి కేరాఫ్గా నిలుస్తోన్న నగరపాలక సంస్థలో మరో అక్రమ బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఓ అధికారి ఏకంగా కమిషనర్ డిజిటల్ కీతో రెండు భవనాల బీపీఎస్ అనుమతుల ఫైళ్లపై సంతకాలు చేశాడు. ఫైర్ ఎన్ఓసీ లేకపోయినా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని వ్యవహారాన్ని చక్కబెట్టాడు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతపురం న్యూసిటీ: నగరంలోని సాయినగర్లో నూతనంగా ఏర్పాటుకు చేసిన ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రైల్వే స్టేషన్ సమీపంలోని మరో ఆస్పత్రి నిర్వాహకులు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. సాయినగర్లోని స్పెషాలిటీ ఆస్పత్రి రూ.35 లక్షలు, రైల్వే స్టేషన్ సమీపంలోని మరో ఆస్పత్రి రూ.20 నుంచి రూ. 25 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంది. డాక్యుమెంట్, లింక్ డాక్యుమెంట్, తదితర సర్టిఫికెట్లతో పాటు అగ్నిమాపక శాఖ అందించే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) పొందుపర్చాలి. అగ్నిమాపక శాఖ ఫైర్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇవ్వలేదని తెలుసుకున్న సదరు టౌన్ ప్లానింగ్ అధికారి బీపీఎస్ అనుమతులు తానిప్పిస్తానంటూ నిర్వాహకులతో లోపాయికార ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక శాఖకు సమర్పించిన దరఖాస్తునే అనుమతుల్లో పొందుపర్చారు. డిజిటల్ ‘కీ’ నగరపాలక సంస్థ కమిషనర్ డిజిటల్ కీతో ఈ రెండు ఆస్పత్రులకు ఫైర్ ఎన్ఓసీలు లేకుండానే బీపీఎస్ అనుమతులను గతేడాది డిసెంబర్లో ఇచ్చేశారు. ఈ విషయం ఆలస్యంగా కమిషనర్ దృష్టికి వెళ్లింది. దీంతో కమిషనర్ సదరు రెండు ఆస్పత్రుల బీపీఎస్ అనుమతులను నిలుపుదల (రీవోక్) చేయించారు. ఫోర్జరీకి పాల్పడిన అధికారిపై కమిషనర్ నిప్పులు చెరిగారు. బోగస్ సదరు ఆస్పత్రులకిచ్చిన బీపీఎస్ అనుమతులు చెల్లవని టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు సిబ్బంది చెబుతున్నారు. భవిష్యత్తులో టాస్క్ఫోర్స్ బృందం వస్తే ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. అధికార అండ అధికార పార్టీ అండతోనే టౌన్ ప్లానింగ్లోని ‘మాయలోడు’ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. మొదట అతన్ని సరెండర్ చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. కానీ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో పల్లెత్తు మాట మాట్లాడలేదు. ఏకంగా కమిషనర్ సంతకాన్నే దుర్వినియోగం చేసినా ఉన్నతాధికారులు ప్రేక్షకపాత్ర వహించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి. ఇలా కమిషనర్ డిజిటల్ కీతో మరెన్ని సంతకాలు చేశారో అర్థం కావడం లేదు. ఇప్పటికే నగరంలో అనధికార భవనాలు విచ్చలవిడిగా వెలిశాయి. రీవోక్ చేశా సాయినగర్లోని ఓ స్పెషాలిటీ ఆస్పత్రి బీపీఎస్ అనుమతులకు సంబంధించి ఎన్ఓసీ సర్టిఫికెట్ పూర్తిస్థాయిలో రాని విషయం వాస్తవమే. దీంతో అప్రమత్తమై ఆ ఆస్పత్రి బీపీఎస్ను రీవోక్ చేశా. మార్చి వరకు సమయం ఉందని, అంతలోపు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించా. – పీవీవీఎస్ మూర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ -
తాగునీరు కలుషితం..50 మందికి అస్వస్థత
నగరంపాలెం(గుంటూరు): గుంటూరు నగరంలో తాగునీరు కలుషితమై 50 మంది అస్వస్థతకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరపాలక సంస్థ పరిధిలోని సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డు పరిసర ప్రాంతాల్లోని మంత్రివారి వీధి, చిటికెల వారి వీధీ, రెడ్ల బజారు తదితర ప్రాంతాల్లోని వార్డులతో పాటు ఆనందపేట, పొన్నూరు రోడ్డులో పలువురు ఆదివారం విరోచనాలు, వాంతులతో గుంటూరు జీజీహెచ్, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. శనివారం ఉదయం వచ్చిన మంచినీరు తాగటం వలన అస్వస్థతకు గురైనట్లు పలువురు బాధితులు తెలుపుతున్నారు. ఆదివారం ఉదయం నీళ్ల విరోచనాలు, వాంతులు అవటంతో నీరిసించి అస్వస్థతతో 20 నుంచి 25 మంది వరకు సంగడిగుంట లాంచెస్టర్ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మురుగునీటి కాల్వ మీద నుంచే మంచి నీరు సరఫరా అవుతుండడంతో అక్కడక్కడ లీకులు వలన నీరు కలుషితం అవుతుందన్నారు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, ఇంజనీరింగ్, ప్రజారోగ్యశాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ ఎంహెచ్వో డాక్టర్ శోభారాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు లక్ష్మయ్య బాధితులు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్ళి వివరాలు సేకరించారు. కమిషనర్ ఆదేశంతో సంగడిగుంటలోని వడ్డేగూడెం మున్సిపల్ పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. -
నగరంలో డ్రంకన్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్ : మందుబాబులకు హైదరాబాద్ పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు. వరుస డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి పలు చోట్ల ముమ్మర తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, డైమండ్ హౌస్, రోడ్ నెంబర్ 45ల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో చెక్పోస్ట్ వద్ద 8కార్లు, 4బైక్లను సీజ్ చేశారు. పరిమితికి మించి మద్యం సేవించిన ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళ పోలీసుల కన్ను కప్పి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు చేజ్ చేసిమరీ పట్టుకున్నారు. మద్యం మత్తులో మరికొంత మంది పోలీసులపై చిందులేశారు. మరికొంత మంది గుట్టు చప్పుడు కాకుండా పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసుల ముందు వారి పప్పులు ఉడకలేదు. పరిమితికి మించి మద్యం సేవించిన వారందరినీ జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడంతో పాటు, జరిమానా విధించారు. డైమండ్ హౌజ్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు మరో 8కార్లు, 11 టూవీలర్లను స్వాధీనం చేసుకున్నారు. -
ఇండోర్.. ఇకపై ఇందూర్?!
సాక్షి, భోపాల్ : మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన ఇండోర్.. పేరును మార్చేందుకు అధికార భారతీయ జనతాపార్టీ అడుగులు ముందుకు వేస్తోంది. ఇండోర్ పేరును ఇందూర్గా మార్చాలంటూ ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో బీజేపీ కౌన్సెలర్ ప్రతిపాదించారు. ఇంద్రేశ్వర్ మహాదేవుడి పేరు మీద ఈ నగరం ఏర్పడిందని.. కాల క్రమంలో అది కాస్తా ఇండోర్గా రూపాంతరం చెందిందని ఆయన పేర్కొన్నారు. ‘ఎవరు అంగీకరించినా. అంగీకరించకపోయినా.. ఇది చరిత్ర వాస్తవం. దీనిని ఎవరూ మార్చలేరు. ఈ నగరం ఇంద్రేశ్వర్ పేరుమీద ఏర్పడింది. ఇప్పుడు తిరిగి దీనిని ఇందూర్గా మార్చాలి’ అని బీజేపీ కౌన్సెలర్ సుధీర్ డిగ్డే స్పష్టం చేశారు. హోల్కర్ రాజుల కాలంలో ఈ పట్టణాన్ని ఇందూర్ అని పిలిచేవారని.. ఈ పేరును బ్రిటీష్ అధికారులు ఇండోర్గా మార్చారని ఆయన పేర్కొన్నారు. ఇండోర్ నగరానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను సైతం సుధీర్ డిగ్డే మునిసిపల్ కార్పొరేషన్ దృష్టికి తీసుకువచ్చారు. డిగ్డే ప్రతిపాదనపై మునిసిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ సింగ్ నరుకా స్పందించారు. తదపరి సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. -
విశాఖ నగరం చాలా కాస్ట్లీ గురూ..
వావ్.. నగరవాసులకు ఇదో తీపికబురే! భారతదేశంలో అత్యంతధనిక నగరాల్లో విశాఖపట్నానికిచోటు దక్కింది. ప్రపంచ వ్యాప్తంగాఅత్యధిక నెటిజన్లు కలిగిన యాహూసంస్థ నిర్వహించిన సర్వేలో టాప్–10లో నిలిచింది. ఇండియాఫైనాన్స్ టీం అంచనా మేరకు స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) ప్రకారం2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన ఈ సర్వేఆధారంగా భారత దేశంలో టాప్–10 ధనిక నగరాల జాబితాను వెల్లడించింది. సాక్షి, విశాఖపట్నం: దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు టాప్– 10లో మూడు నగరాలే ఉన్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలకు మాత్రమే దశాబ్దాలుగా టాప్–10లో చోటుదక్కుతోంది. తొలిసారిగా విశాఖ ఈ కాస్మోపాలిటిన్ సిటీల సరసన చోటు దక్కించుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోసారి దేశంలోని ధనిక నగరంగా రూ. 23.92 లక్షల కోట్ల జీడీపీతో నెం.1 స్థానంలో నిలిచింది. దక్షిణ భారతదేశంలో వరుసగా కర్నాటక రాజధాని బెంగళూరు 4వ స్థానంలో నిలవగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. చెన్నై ఆరో స్థానంలో నిలవగా, విశాఖ తొమ్మిదవ స్థానంలో నిలిచింది. భారత ఆర్థిక సంస్థ అంచనా ప్రకారం విభజన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖపట్నం జీడీపీ రూ.2.79లక్షల కోట్లకు చేరడంతో ఈ అరుదైన ఘనత లభించింది. టాప్–10లో నిలిచిన మిగిలిన నగరాలను చూస్తే రూ.19.04 లక్షల కోట్ల జీడీపీతో రెండో స్థానంలో ఢిల్లీ, రూ.9.75లక్షల కోట్ల జీడీపీతో కోల్కత్తా మూడో స్థానం, రూ.4.14 లక్షల కోట్లతో అహ్మదాబాద్ ఏడో స్థానం, రూ.3.39లక్షల కోట్లతో పుణె నిలిచింది. విశాఖలో అన్నీ ఖరీదే.. దేశంలో కాస్మోపాలిటిన్ నగరాల్లో ఒకటైన సూరత్ జీడీపీ 2.6లక్షల కోట్లు కాగా..ఆ నగరాన్ని రూ.2.79లక్షల కోట్ల జీడీపీతో విశాఖ అధిగమించింది. యాహూ లాంటి సంస్థ నిర్వహించిన సర్వేలో టాప్–10లో విశాఖకు చోటు దక్కడంపట్ల విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సిటీ నడిబొడ్డున గజం రూ.50వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉంది. జగదాంబ, బీచ్రోడ్ వంటి అత్యంత ఖరీదైన ఏరియాల్లో లక్షన్నరకుపైగానే పలుకుతోంది. గజం రూ.30 వేల నుంచి రూ.50వేల లోపు కావాలంటే నగర శివారుకు వెళ్లాల్సిందే. అంతే కాదు.. సిటీ పరిధిలో ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కావాలంటే రూ.50లక్షల నుంచి కోటిన్నర వరకు ఉంది. అద్దెలు కూడా ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతున్నాయి. దిగువ మధ్య తరగతి, సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాల్లో సైతం అద్దెలు రూ.ఐదారు వేల నుంచి రూ.15 వేలకు తక్కువ లేవు. ఏపీ ఆర్థిక కేంద్రంగా గుర్తింపు విశాఖపట్నం ఏపీ ఆర్థిక కేంద్రంగా యాహూ గుర్తించింది. గ్రేటర్ విశాఖగా రూపాంతరం చెందిన తర్వాత విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. స్పెషల్ ఎకనామిక్ జోన్లు, ఐటీ సెజ్లు, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనతో 2005 నుంచి విశాఖకు పరిశ్రమలు క్యూ కట్టాయి. ఆ సమయంలోనే ఏర్పాటైన విశాఖ శివారు ఐటీ సెజ్లో నెలకొల్పిన ఫింటెక్ వ్యాలీలో పెద్దఎత్తున ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు అనువుగా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ)అనేది ఒక నిర్దిష్ట కాలానికి చెందిన చెందిన అన్ని వస్తువులు, సేవల ద్రవ్య ప్రమాణంగా చెప్పొచ్చు. తలసరిలో టాప్–2 2016–17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర జీడీపీ వృద్ధి రేటులో పారిశ్రామిక, సేవా రంగాల్లో నంబర్ వన్గా నిలిచిన విశాఖ, తలసరి ఆదాయంలో నంబర్ 2లో నిలిచింది. 2014–15లో తలసరి ఆదాయం రూ.1, 12,718, 2015–16లో రూ.1,27,378 కాగా, 2016–17లో ఏకంగా రూ.1,42,821లని ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. తలసరి ఆదాయంలో ఏపీలో కృష్ణా జిల్లా పధాన స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాన్ని విశాఖ జిల్లా దక్కించుకుంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో విశాఖ జిల్లా పారిశ్రామిక రంగంలో 35.6 శాతం, సేవా రంగంలో 51.4 శాతం వృద్ధి రేటు సాధించి టాప్–1 స్థానంలో నిలిచిన విషయం విదితమే. -
రాజధాని ప్రాంత రైతులపై భారం
-
ఏలికా.. మాట్లాడాలిక!
ఏ నియోజకవర్గాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం.. నగరం సమస్తంసమస్యల పద్మవ్యూహం. వానొస్తే చిగురుటాకులా వణుకుతున్న సిటీ. మరమ్మతులకు నోచుకోని రహదారులు.. అడుగడుగునాగుంతలు.. ఆక్రమణలకు గురైన నాలాలు.. పారిశుధ్యం కొరవడిన వీధులు.. నిధులున్నా ముందుకు సాగని అభివృద్ధి పనులు.. తాగునీటి ఇబ్బందులు.. ప్రగతికి దూరంగా మురికివాడలు... ఇలా ఒకటా రెండా మహానగరాన్ని ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు మూడేళ్లుగా చెబుతూనే ఉన్నారు. పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సభలో సిటీ ఎమ్మెల్యేలు గళం విప్పుతారని నగరవాసులు ఆశిస్తున్నారు. మీ వాణిని మీదైన బాణీలో వినిపించండి ఎమ్మెల్యే సార్లూ..! శేరిలింగంపల్లి:ఎ.గాంధీ ♦ నియోజకవర్గంలో డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. రూ.200 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు అటకెక్కాయి. ♦ చందానగర్లోని రెడ్డి కాలనీలో ఎస్టీపీ ప్లాంట్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ♦ నాలాల విస్తరణ ఊసే లేదు. నాలాలు కబ్జాకు గురవుతుండడంతో కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల వర్షాలకు దీప్తిశ్రీనగర్ నీట మునిగింది. గచ్చిబౌలి నాలా పొంగడంతో ఇందిరానగర్, రాంకీటవర్స్ రోడ్డు జలదిగ్భంధంలో చిక్కుకుంది. ♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. గౌలిదొడ్డి కేశవ్నగర్లో రెండెకరాలు, తాజీనగర్లో 1.25 ఎకరాలు, హఫీజ్పేట్ సాయినగర్లో 1.20 ఎకరాల స్థలం గుర్తించినప్పటికీ పనులు మొదలవడం లేదు. మలక్పేట్ :అహ్మద్ బలాల ♦ మలక్పేట్ నియోజవర్గంలోని మూసారంబాగ్, అక్బర్బాగ్, ఓల్డ్మలక్పేట, చావుణి డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ♦ మూసీ పరివాహక ప్రాంతాల్లోని తీగలగూడ, షాలివాహననగర్, చావుణి గుడిసెవాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ పనులు ప్రారంభం కాలేదు. ♦ చాదర్ఘాట్, మలక్పేట్లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యకు ఇంతవరకూ పరిష్కారం చూపలేదు. ♦ మలక్పేట్లోని ఆర్యూబీ కింద రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. ముషీరాబాద్ :కె.లక్ష్మణ్ ♦ హుస్సేన్సాగర్ నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం కలగానే మారింది. ♦ లోయర్ ట్యాంక్బండ్ గోశాల వద్ద పైప్లైన్ పగిలిపోయి ఏడాదిగా కలుషిత నీరు వస్తోంది. ♦ అశోక్నగర్ బ్రిడ్జి వెడల్పు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ♦ వీఎస్టీ చౌరస్తా విస్తరణ పనులు చేపట్టాలి. ♦ ముషీరాబాద్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మహేశ్వరం :తీగల కృష్ణారెడ్డి ♦ నియోజకవర్గంలో ఇంటింటికీ కృష్ణా జలాలు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. మీర్పేట్, జిల్లెలగూడ, బడంగ్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల పరిధిలో మూడు, నాలుగు రోజులకు ఒకసారి మంచినీరు వస్తోంది. ♦ జిల్లెలగూడ, మీర్పేట్లోని చెరువులను సుందరీకరిస్తామని ఇచ్చిన హామీ అటకెక్కింది. ఈ ప్రాంతాల్లోని చెరువులు మురుగు నీటితో కంపు కొడుతున్నాయి. ♦ రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. మరమ్మతు పనుల ఊసే లేదు. ♦ ఆర్కేపురం ఎన్టీఆర్నగర్ వాసులకు రెగ్యులరైజేషన్ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అంబర్పేట..: కిషన్రెడ్డి ♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ♦ బతుకమ్మ కుంట పునరుద్ధరణలో తీవ్ర జాప్యం. ♦ అంబర్పేట తహసీల్దార్ కార్యాలయంలో మౌలిక సదుపాయాల కొరత. ♦ ఆధునికీకరణకు నోచుకోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ♦ సమస్యగా పరిణమించిన రత్నానగర్, మోహిన్చెరువు, ఓయూ నాలాలు. చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ ఒవైసీ ♦ ఉప్పుగూడ రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పనులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో స్థానికులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాతబస్తీ..మారదా.. దుస్థితి చార్మినార్, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా నియోజకవర్గాల్లో మూడేళ్లుగా సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీటి కుళాయిల్లో మురుగు నీరు సరఫరా అవుతోంది. చార్మినార్ కాలిబాట పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. -పాషాఖాద్రీ,చార్మినార్ ఎమ్మెల్యే యాకుత్పురా: అహ్మద్ఖాన్ ♦ సంతోష్నగర్ ఐ.ఎస్.సదన్ చౌరస్తా వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. మూడేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ♦ పూర్తిస్థాయిలో రీమోడలింగ్ జరగని డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు. ♦ నూర్ఖాన్బజార్ వద్ద నిర్మిస్తున్న మంచినీటి రిజర్వాయర్ పూర్తి కాలేదు. బహదూర్పురా:మోజంఖాన్ ♦ లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ♦ నాలాల విస్తరణ పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ♦ బహదూర్పురా– కిషన్బాగ్ రోడ్డులో నౌ నంబర్ వరకు ప్లైఓవర్ బ్రిడ్జి మూడేళ్లుగా పెండింగ్లోనే ఉంది. గోషామహల్: రాజాసింగ్లోథా ♦ ధూల్పేట్లోని గుడుంబా తయారీదారులు రోడ్డున పడ్డారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించలేదు. ♦ బేగంబజార్లో చేపల మార్కెట్ అభివృద్ధి అటకెక్కింది. ♦ జుమ్మెరాత్ బజార్లో కల్యాణ మండపం నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. కుత్బుల్లాపూర్:వివేకానంద్ ♦ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాలుగేళ్లుగా పక్కా భవనం లేదు. ♦ సుభాష్నగర్ నుంచి ఫాక్స్సాగర్ వరకు నాలా పనులు మొదలు కాలేదు. ♦ జగద్గిరిగుట్టలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మారింది. ♦ గాజులరామారం సర్కిల్ పరిధిలో క్వారీ గుంతలు మృత్యుకుహరాలుగా మారాయి. ♦ బహదూర్పల్లి, కొంపల్లి మధ్య రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ♦ గండిమైసమ్మ జ్యోతిరావు పూలే స్టేడియం పనులు ఒక్క అడుగు కూడా పడలేదు. ♦ రసాయన వ్యర్థాలను అక్రమంగా నాలాల్లోకి వదులుతున్నా చర్యలు శూన్యం. ఉప్పల్:ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ♦ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు కలగానే మిగిలింది. ♦ ఉప్పల్ ప్రధాన రహదారి విస్తరణ ప్రతిపాదనకే పరిమితం. ♦ ఏడు చెరువుల పరిరక్షణ హామీ అటకెక్కింది. ♦ ఎమ్మెల్యే నిధులు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికే పరిమితం. ♦ నాచారం ప్రధాన రహదారి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ధర్నా చేసినా ఫలితం లేదు. ♦ పేదలకు ఇళ్ల నిర్మాణం హామీ నెరవేరలేదు. సనత్నగర్:తలసాని ♦ నియోజకవర్గంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య. బేగంపేట్ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉంటుంది. ♦ సికింద్రాబాద్ నుంచి అమీర్పేట్, పంజగుట్ట, బాలానగర్, బంజారాహిల్స్, సోమాజిగూడ, సనత్నగర్, ఎరగ్రడ్డ, కూకట్పల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదొక్కటే ప్రధాన మార్గంగా ఉంది. ♦ బండమైసమ్మనగర్, జీవై కాంపౌండ్, పొట్టిశ్రీరాములునగర్, అంబేడ్కర్నగర్ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ పునాదుల దశ దాటలేదు. బస్తీవాసులు అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్ :మాగంటి గోపీనాథ్ ♦ బోరబండలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు హామీ నెరవేరలేదు. ♦ బోరబండ పెద్దమ్మనగర్లో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. ♦ రహమత్నగర్లో ఆర్భాటంగా ప్రకటించిన ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ♦ రహమత్నగర్లో ప్రభుత్వ ఐటీఐ, మ«ధురానగర్లో స్విమ్మింగ్పూల్, రాజీవ్నగర్లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు కలగానే మిగిలాయి. మేడ్చల్ :సుధీర్రెడ్డి ♦ ఘట్కేసర్ మండలంలో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్న ఎమ్మెల్యే హామీ నేరవేరలేదు. ♦ మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట మండలాల్లో మినీ స్టేడియాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. కూకట్పల్లి :మాధవరం కృష్ణారావు ♦ భరత్నగర్ మార్కెట్ను ఆ«ధునికీకరిస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు. ♦ బాలానగర్ చౌరస్తాలో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులు మొదలు కాలేదు. మల్కాజిగిరి :చింతల కనకారెడ్డి ♦ ఆర్ఓబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ♦ అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచి, కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ♦ సఫల్గూడ చెరువులను మినీ ట్యాంక్లుగా అభివృద్ధి చేసి, ఇక్కడ బోటింగ్, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఎల్బీనగర్ :ఆర్.కృష్ణయ్య ♦ వర్షాలకు కాలనీలు మునిగిపోతున్నాయి. ఇటీవల తపోవన్ కాలనీ, గ్రీన్పార్కు, ఆదర్శనగర్, గడ్డిఅన్నారంలోని ఇళ్లలోని వరద నీరు చేరింది. ♦ నాలాల విస్తరణ ఊసే లేదు. చెరువుల అభివృద్ధి అటకెక్కింది. ♦ రహదారుల విస్తరణ కాగితాలకే పరిమితం. శివారు ప్రాంతాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. -
హోండా కార్ల ధరలు పెరిగాయ్..
సాక్షి, న్యూఢిల్లీ : హోండా కార్ల ఇండియా కూడా తన మోడల్స్ ధరలను పెంచేసింది. జీఎస్టీ సెస్కు అనుగుణంగా ధరలను పెంచుతున్నట్టు ఈ కంపెనీ కూడా ప్రకటించింది. సిటీ, బీఆర్-వీ, సీఆర్-వీ మోడల్స్పై రూ.7,003 నుంచి రూ.89,069 మధ్యలో ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ సమీక్షించిన ధరలు అమల్లోకి తెస్తున్నామని హోండా కార్ల ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. జీఎస్టీలో 2-7 శాతం అదనపు సెస్ భారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. తన మిడ్సైజు సెడాన్ సిటీ ధరలు వేరియంట్లను బట్టి రూ.7,0003 నుంచి రూ.18,791 వరకు పెరిగాయి. ఎస్యూవీ బీర్-వీ ధరలను రూ.12,490 నుంచి రూ. 18,242 మధ్యలో పెంచింది. అదేవిధంగా ప్రీమియం ఎస్యూవీ సీఆర్-వీ ధరలను రూ.75,304 నుంచి రూ.89,069 వరకు పెంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ వారం ప్రారంభంలో టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా ఎంపికచేసిన మోడల్స్పై ధరలను రూ.13వేల నుంచి రూ.1.6 లక్షల వరకు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం సెస్ను పెంచడంతో మిడ్సైజు కార్ల జీఎస్టీ రేటు 45 శాతం, పెద్ద కార్ల జీఎస్టీ రేటు 48 శాతం, ఎస్యూవీ రేటు 50 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. -
కరీంనగర్లో కార్డెన్ సెర్చ్.
-
అవినీతి గుట్టు రట్టు!
నగర పంచాయతీలో పనుల మాయజాలం విజిలెన్స్ తనిఖీలో బయటపడుతోన్న అక్రమాలు ముమ్మిడివరం : నగర పంచాయతీలో అవినీతి.. విజిలెన్స్ తనిఖీల్లో తవ్వేకొద్దీ బయటపడుతోంది. అవినీతి ఆరోపణలపై జూలై 6 నుంచి విజిలెన్స్, ఎన్పోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీఎస్టీ సబ్ప్లాన్ నిధులు నుంచి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, అక్రమ లేఅవుట్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరు వరకు అవకతవకలు చోటుచేసుకున్నట్టు సమాచారం. దీంతో ఇక్కడి పరిస్థితిపై విజిలెన్స్ అధికారులు జల్లెడ పడుతున్నారు. మూడేళ్లలో రూ.4 కోట్ల వరకు అవినీతి జరిగిందంటూ ఫిర్యాదు ఆందడంతో ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటికే పలు పర్యాయాలు కార్యాలయంలో వివిధ శాఖల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ఖాతాలలో... ఎస్సీ, ఎస్టీ నిధులు నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తే.. ఆ ఖాతాలలో రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉద్యోగులను రాజమహేంద్రవరం విజిలెన్స్ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన రూ.4 కోట్ల సబ్ప్లాన్ నిధులను పాలక వర్గం తీర్మానం లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. అసలేం జరిగిందంటే... టీడీపీకి చెందిన చైర్పర్సన్ భర్త ఆదేశాల మేరకు సబ్ప్లాన్ నిధులను నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. పాలకవర్గం సమావేశం నిర్వహించకుండానే...తీర్మానాల పుస్తకంలో సభ్యుల సంతకాలు తీసుకున్నట్టు అభియోగం. గౌరవ వేతనం కోసం మినిట్ బుక్లో సంతకం చేయాలని సభ్యులకు అబద్ధం చెప్పి ఈ పని కానిచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలకు రూ.60.98 కోట్లు మంజూరయ్యాయి. ఒక్క ముమ్మిడివరం నగర పంచాయతీలోనే నామినేషన్ల పద్ధ్దతిపై పనులు అప్పగించారు. రూ.4 కోట్ల నిధులను 74 పనులకు రూ.5 లక్షల చొప్పున విభజించి అనుకూలురైన 10 మంది కాంట్రాక్టర్లకు ఈ పనులను అప్పగించి పర్సంటేజీల పర్వానికి తెర తీశారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులకు 15 శాతం నుంచి 25 శాతం వరకు పర్సంటేజీలు ముట్టజెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను విజిలెన్స్ అధికారులు సాంకేతిక పరంగా విచారణ చేశారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా లోపాలను గుర్తించి నివేదిక తయారు చేస్తున్నట్టు తెలిసింది. -
దుమ్ము రేపుతోంది!
– కాలుష్యపు కోరల్లో ‘అనంత’ – ఏ రోడ్డులో చూసినా అపరిశుభ్రతే – ట్రాఫిక్ రద్దీతో వాహనాల కాలుష్యమూ అధికమే – కళ్ల సమస్యలతో బాధపడుతున్న జనం అనంత నగరంలో కాలుష్యం తారస్థాయికి చేరుకుంది. ఎగిసి పడుతున్న దుమ్ముతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనారోగ్యం చుట్టుముడుతుండడంతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నివాస గృహాల నుంచి బయటకు వచ్చేందుకు స్థానికులు భయపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగరంలో అత్యధికులు ఊపిరితిత్తులు, కంటి, శ్వాసకోస వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. - అనంతపురం మెడికల్ వాహన కాలుష్యమూ ఎక్కువే అనంతపురంలోని రాం నగర్ సమీపంలో ఫై ఓవర్ పనులు సాగుతున్న నేపథ్యంలో అటుగా వెళ్లాలంటే చాలా మంది జంకుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఇంట్లోంచి బయటకు రావాలంటే స్థానికులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నగరంలో వాహనాల రద్దీ మరీ ఎక్కువగా ఉంది. టవర్క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, పాతూరు, కలెక్టరేట్, కమలానగర్, సాయినగర్ తదితర ప్రాంతాల్లో వాహనాల నుంచి వెలువడే వాయువులు మనిషిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. కంటి సమస్యలతో ఆస్పత్రికి రోజూ 120 మంది దుమ్ము ధూళి కణాలు నేరుగా కళ్లలో పడడంతో జనం పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు మంటగా ఉండడం, ఎర్రబారడం వంటి రుగ్మతలతో ఆస్పత్రుల బాట పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దుమ్ము ధూళి కణాలు కళ్లలో పడి కళ్లు మసకబారుతున్న 120 మంది వరకు నిత్యమూ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని కంటి విభాగానికి చికిత్స కోసం వస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ప్రైవేట్ కంటి ఆస్పత్రులను ఆశ్రయించే వారు దీనికి రెండింతలు ఉంటారని అంచనా. దుమ్ము ధూళి పడిన వెంటనే కళ్లను శుభ్ర పరచకుండా నలుపుతుండడంతో సమస్యలు తీవ్రమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు కంటి పైపొర దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. బయటకు రావాలంటే భయం నగరంలో దుమ్ముధూళి ఎక్కువగా ఎగిసి పడుతోంది. చిన్న పిల్లలను తీసుకుని బయటకు రావాలంటే భయమేస్తోంది. ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న చోట అయితే పరిస్థితి మరీ ఘోరం. అసలు ఈ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియడం లేదు. నేను ఇక్కడే చిన్నపాటి వ్యాపారం చేసుకుంటుంటాను. ఈ దుమ్ముతో ఇటువైపు వచ్చే వాళ్లే తగ్గిపోతున్నారు. నా వ్యాపారం దుమ్ముకొట్టుకుపోతోంది. – జహీర్బాషా, రహమత్నగర్, అనంతపురం పరిస్థితి అధ్వానంగా మారింది నగరంలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఎప్పుడు బయటకు వద్దామన్నా గాలి దుమారం రేగుతూ ఉంటుంది. రోడ్లు కూడా సరిగా శుభ్రం చేయకపోవడంతో గాలికి ధూళి కళ్లలో పడుతోంది. ఇంటికెళ్లగానే కళ్లను శుభ్రం చేసుకుంటే గానీ ఉపశమనం కలగడం లేదు. – సతీష్, కోర్టు రోడ్డు, అనంతపురం కాలుష్యమే కంటి సమస్యలకు కారణం కళ్లలో మంట, గరుకుగా ఉండడం, తరచూ నేత్రాలు ఎర్రబారుతున్నాయంటే వైద్యులను సంప్రదించండి. పెరుగుతున్న కాలుష్యమే దీనికి కారణం. ద్విచక్రవాహనాల్లో వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన అద్దాలు ధరించడం వల్ల సూక్ష్మ ధూళి రేణువులు, కణాలు కంటిలో పడకుండా చూసుకోవచ్చు. బైక్లపై తిరిగే వారు హెల్మెట్, గాగుల్స్ ధరించడం మంచిది. ధూళి కణాలు కంటి రెప్పల అడుగుభాగంలో చేరిపోతున్నాయి. చికిత్స తీసుకుంటే సరిపోతుంది. తరచూ కళ్లు, ముఖం కడుక్కోవడం మంచిది. – డాక్టర్ పల్లా శ్రీనివాసులు, కంటి విభాగాధిపతి, సర్వజనాస్పత్రి నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదం దుమ్ము,ధూళి కణాలు ముక్కులోకి వెళ్లడం వల్ల ముందుగా అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ. ముక్కు దిబ్బడ, నీరు కారడం వంటివి జరుగుతాయి. ఇది కాస్తా ‘సైససైటిస్’కు దారితీస్తుంది. తలనొప్పిగా ఉండడం, ముక్కులో గడ్డలు వచ్చే ప్రమాదం ఉంది. కొంత వరకు కాలుష్యాన్ని ముక్కు నియంత్రించగలదు. చాలా రోజులు పరిస్థితి అలాగే ఉంటే దుమ్ము శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. బ్రాంకెటైటిస్, ల్యారింజైటిస్కు గురై ఊపిరితిత్తుల్లో పేరుకుపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. బయట ఎక్కువగా తిరిగేవాళ్లు తప్పనిసరిగా ముక్కుకు మాస్కులు ధరించండి. – డాక్టర్ రాజేశ్, ఈఎన్టీ వైద్యుడు, సర్వజనాస్పత్రి -
స్మార్ట్ ... పిటీ
కాకినాడ స్మార్ట్ సిటీలో పడని అభివృద్ధి అడుగులు సమస్యలతో సహవాసం చేస్తున్న ప్రజలు ప్రతిపాదననలకే పరిమితమైన రూ.1993 కోట్లు తొలి విడతగా విడుదలైన రూ. 378 కోట్లు నమూనాలు...టెండర్ల దశలోనే పనులు . అమరావతి ... రాజధాని ... ప్రపంచంలోనే అత్యద్భుతం ... కళ్ల ముందు ఊహా చిత్రాలు ఓ వైపు రాష్ట్ర ప్రజల ముందు ఒయ్యారాలు ఒలకబోస్తుంటే ... ఇంకోవైపు స్మార్ట్ సీటీల పేరుతో నగర ప్రజలను ఊరిస్తున్నాయి. అదిగో నవలోకం అంటూ రెండేళ్ల నుంచి ఆశలు ఆకాశంలో విహరిస్తున్నా ఆచరణలో మాత్రం చిన్న చిగురు కూడా కనిపించడం లేదేమిటంటూ జనం ప్రశ్నిస్తున్నారు. వందల కోట్ల రూపాయల కుమ్మరింపు సంఖ్యలు పుంఖానుపుంఖాలుగా అధికారులు చెబుతున్నారు గానీ విడుదల్లో ఆ స్పీడు కనిపించకపోవడంతో ఇదేమి ‘స్మార్ట్’రా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు నగర వాసులు. . ప్రకటన: కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తామని 2016 జూన్లో... - నిధుల ఆశల విహారం: రూ.1993 కోట్లతో ప్రతిపాదనలు కూడా రూపొందించారు. - విడుదల: దీనిలో భాగంగా మొదటి విడతగా రూ. 378 కోట్లు... - హడావుడి ఇలా: స్మార్ట్సిటీ నమూనాలు, మార్గదర్శకాల తయారీ పేరుతో పెద్ద ఎత్తునే హడావుడి చేశారు. - ఎలా అంటే...: రూ. 307 కోట్లతో సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, రూ. 80 కోట్లతో స్మార్ట్ రోడ్డు నిర్మాణం, రూ.75 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, రూ.50 కోట్లతో స్మార్ట్ బస్ టెర్మినళ్లు, రూ.40 కోట్లతో మాల్స్, మల్టీ ప్లెక్స్, రూ. 40 కోట్లతో భవనాలపై సోలార్ వ్యవస్థ, \రూ. 30.46 కోట్లతో గోదావరి కళాక్షేత్రం, రూ. 30 కోట్లతో నీటి సరఫరా, రూ. 10 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రూ. 7.4 కోట్లతో మార్కెట్ల అభివృద్ధి, రూ.6 కోట్లతో ప్రతాప్నగర్ వంతెన తదితర అభివృద్ధి చేపడుతున్నట్టు ఊరించారు - వామ్మో: దీంతో కాకినాడ దశ దిశ మారిపోతుందని ప్రజలు కూడా భావించారు. నగరం స్వరూపమే మారిపోతుందని ఆశించారు. కానీ ప్రజల ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. . సాక్షి ప్రతినిధి, కాకినాడ: పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది కాకినాడ పరిస్థితి. ప్లానింగ్ సిటీ అని, పెన్షనర్స్ ప్యారడైజ్ అని గొప్పగా చెప్పుకునే కాకినాడ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ పేరుకుపోతున్న చెత్త ... పట్టణమంతా అపారిశుద్ధ్య పరిస్థితులు... మురుగునీటి ముంపునకు గురవుతున్న కాలనీలు...దోమలతో నరకయాతన...పందుల స్వైర విహారం...చెలరేగిపోతున్న గ్రామ సింహాలు...గోతులమయమైన రోడ్లు...ప్రమాదాలకు గురవుతున్న వాహన చోదకులు... కాకినాడ నగరంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తున్న దృశ్యాలివీ. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ఏడాదిన్నర క్రితం ప్రకటించారు. రూ. 1993 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్ర రాజధాని మాదిరిగా నమూనాలతో ప్రజల్ని ఊహల్లో ఊరేగించారు. కానీ ఇంతవరకూ అభివృద్ధి అడుగులు వేయలేదు. టెండర్ల పేరుతోనే కాలయాపన చేస్తున్నారు. కనీసం పారిశుద్ధ్య పరిస్థితుల్ని మెరుగుపర్చలేకపోయారు. ఇప్పుడు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. స్మార్ట్ సిటీ మాటేమోగానీ దోమలు, పందుల్లేకుండా చెయ్యండి మొర్రో అని పట్టణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా నగరమంతా ఇదే పరిస్థితి నెలకుంది. మంత్రులు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు నిత్యం నడియాడే కాకినాడలోనే ఈ పరిస్థితి ఉందంటే జిల్లాలో మిగతాచోట్ల ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ పక్కన పెడితే కాకినాడను స్మార్ట్ సిటీగా తీర్చుదిద్దుతామని పాలకులు తెగ ప్రచారమిచ్చారు. ఆచరణలో వారి ఆ పనితనం కనిపించడం లేదు. . ఊరింపు ఇలా... కాకినాడ నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తామని 2016 జూన్లో ప్రకటించారు. రూ.1993 కోట్లతో ప్రతిపాదనలు కూడా రూపొందించారు. దీనిలో భాగంగా మొదటి విడతగా రూ. 378 కోట్లు విడుదలయ్యాయి. స్మార్ట్సిటీ నమూనాలు, మార్గదర్శకాల తయారీ పేరుతో పెద్ద ఎత్తునే హడావుడి చేశారు. రూ. 307 కోట్లతో సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, రూ. 80 కోట్లతో స్మార్ట్ రోడ్డు నిర్మాణం, రూ.75 కోట్లతో డ్రైనేజీ వ్యవస్థ, రూ.50 కోట్లతో స్మార్ట్ బస్ టెర్మినళ్లు, రూ.40 కోట్లతో మాల్స్, మల్టీ ప్లెక్స్, రూ. 40 కోట్లతో భవనాలపై సోలార్ వ్యవస్థ, \ రూ. 30.46 కోట్లతో గోదావరి కళాక్షేత్రం, రూ. 30 కోట్లతో నీటి సరఫరా, రూ. 10 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రూ. 7.4 కోట్లతో మార్కెట్ల అభివృద్ధి, రూ.6 కోట్లతో ప్రతాప్నగర్ వంతెన తదితర అభివృద్ధి చేపడుతున్నట్టు ప్రకటించారు. ఏరియా బేస్డ్ డెవలప్మెంట్ పేరుతో కాకినాడలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో తొలి విడద అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచించారు. దీంతో కాకినాడ దశ దిశ మారిపోతుందని ప్రజలు కూడా భావించారు. నగరం స్వరూపమే మారిపోతుందని ఆశించారు. కానీ ప్రజల ఆశలు కలలుగానే మిగిలిపోతున్నాయి. అభివృద్ధి పనులేవీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పడు అడిగినా టెండర్ల దశలో ఉన్నాయని అధికారులు సెలవిస్తున్నారు. ఈలోపు నగరంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయి. పరిష్కారం కాదు కదా ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. అపారిశుద్ధ్య పరిస్థితుల మధ్య పెరిగిన దోమలతో ఎటువంటి వ్యాధులు వస్తాయోనన్న భయం ప్రజలకు పట్టుకుంది. ముఖ్యంగా వర్షాలు పడుతుండటంతో సీజనల్ వ్యాధులు ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన నెలకుంది. -
శోభాయాత్రలకు భారీ బందోబస్తు
-
శాంతిభద్రలపై ఎస్పీ ఆరా
- నగరంలో ఆకస్మిక తనిఖీ - సీఐ, ఎస్ఐలకు తెలియకుండా సుడిగాలి పర్యటన - పోలీసు గస్తీ విధులపై ఆరా కర్నూలు: ఏమమ్మా.. మీ కాలనీల్లో పోలీసులు గస్తీ తిరుగుతున్నారా... డయల్ 100కు ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నారా... మహిళా వేధింపులు, గొలుసు దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు వంటి వాటిపై క్యూఆర్టీకి ఫోన్ చేస్తే స్పందిస్తున్నారా... ఉదయం పూట వాకింగ్కు వెళ్లడానికి మహిళలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా... అంటూ ఎస్పీ ఆకె రవికృష్ణ ఆరా తీశారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నగరంలోని పలు కాలనీల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం వాకింగ్కు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకొని గొలుసు నగలు తమ చేతి వాటం ప్రదర్శిస్తుండటంతో పలు చోట్ల వాకింగ్కు వెళ్లే మహిళలు, పురుషులను నిలిపి నగరంలో శాంతి భద్రతలప ఆరా తీశారు. శివారు ప్రాంతాలు లేబర్ కాలనీ, బాలజీనగర్, మమతానగర్, రామలింగేశ్వరనగర్, వెంకటరమణ కాలనీ, బళ్లారి చౌరస్తా, కొత్త బస్టాండు ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతలపై ఆరా తీశారు. బీట్ పోలీసులు గస్తీ తిరుగుతున్నారా... సీఐలు, ఎస్ఐలు కాలనీల్లో పర్యటిస్తున్నారా... అంటూ ఆరా తీశారు. కొత్త బస్టాండు దగ్గర రోడ్డుకు అడ్డంగా ఆటోలు నిలపడంతో డ్రైవర్లపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఆటోలను నిలుపుకోవాలని వారికి సూచించారు. రౌడీలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారా.. అని ఆరా తీశారు. మద్యం బాబుల ఆగడాలను వేగలేకపోతున్నాం: మద్యం బాబుల ఆగడాలను వేగలేకపోతున్నాం. ఉదయం 7 గంటలకే మద్యం వ్యాపారులు దుకాణాలను తెరుస్తుండటంతో మద్యం బాబులు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారు. ముందు సైడు షెట్టర్లు మూసి, వెనుకసైడు నుంచి పగలు, రాత్రి తేడా లేకండా మద్యం వ్యాపారాలు కొనసాగిస్తున్నారని బళ్లారి చౌరస్తా ప్రాంతంలో పలువురు మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రోజురోజుకు ఆటోల సంఖ్య పెరిగిపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని కొంతమంది వాహనదారులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. రాత్రి వేళల్లో శివారు కాలనీల్లో మందుబాబుల ఆగడాలు మితిమీరిపోయాయని, జాతీయ రహదారికి ఇరువైపులా కూర్చొని మద్యం సేవిస్తుండటంతో నడుచుకుంటూ వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉందని మహిళలు ఫిర్యాదు చేశారు. పాఠశాల మైదానాలు, కేసీ కెనాల్ గట్టుపైన, ఫ్లై ఓవర్ బ్రిడ్జీలపైన మద్యం బాబులు తిష్ట వేసి అర్థరాత్రి వరకు అల్లర్లు చేస్తున్నారని కొంతమంది వాకర్లు ఫిర్యాదు చేశారు. పోలీసు గస్తీ మరింత పెంచి కఠిన చర్యలు తీసుకుంటామని, సమస్యలు ఏమైనా ఉంటే తనకు గానీ, స్థానిక పోలీసులకు కానీ, డయల్ 100కు కానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ ఆదేశించారు. శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలపై స్టేషన్లకు వెళ్లినపుడు పోలీసు అధికారులు స్పందిస్తున్నారా.. లేదా అంటూ ఆరా తీశారు. కొంతమంది ఎస్ఐల పనితీరుపై మహిళలు తీవ్రంగా ఫిర్యాదు చేశారు. డబ్బు, పలుకుబడి ఉన్న వారికే అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు చేశారు. -
హోండా ‘సిటీ’.. కొత్త అప్డేటెడ్ వెర్షన్
ప్రారంభ ధర రూ.8.5 లక్షలు న్యూఢిల్లీ: జపాన్కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా’ తాజాగా తన సెడాన్ కారు ‘సిటీ’లో కొత్త అప్డేటెడ్ వెర్షన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.8.5 లక్షలు– రూ.13.58 లక్షల (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ‘కస్టమర్ల అంచనాలను పరిగణనలో ఉంచుకొని, అందుబాటులో ధరల్లో ఈ కారును రూపొందించాం. ఈ కారుతో తిరిగి మేం సెడాన్ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాం’ అని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో యోచిరో యునో తెలిపారు. ఈ కొత్త అప్డేటెడ్ సిటీ కారు పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. 1.5 లీటర్ ఇంజిన్ను కలిగిన పెట్రోల్ వేరియంట్ ధర రూ. 8.5 లక్షలు–రూ.13.52 లక్షల శ్రేణిలో ఉంటుందని తెలిపారు. అలాగే 1.5 లీటర్ ఇంజిన్ కలిగిన డీజిల్ వేరియంట్ ధర రూ.10.76 లక్షలు–రూ.13.58 లక్షల శ్రేణిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ధరలన్నీ ఎక్స్షోరూమ్ ఢిల్లీవి. కొత్త వెర్షన్ సిటీలో డ్యూయెల్ ఎయిర్బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. కాగా ఇది మారుతీ సియాజ్కు గట్టిపోటీనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
‘కుడా’కు క్యాబినెట్ ఆమోదం
కర్నూలు(టౌన్) కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)కి మంత్రి మండలి మంగళవారం ఆమోదముద్ర వేసింది. దీంతో కర్నూలు నగరం మరింత విస్తరించనుంది. కుడా పరిధిలోకి కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు, డోన్ నగర పంచాయతీలతో పాటు కల్లూరు, జూపాడుబంగ్లా, మిడుతూరు, ఓర్వకల్లు, కోడుమూరు, వెల్దుర్తి, బేతంచెర్ల, పాణ్యం, గడివేముల, మహానంది మండలాలు వస్తాయి. ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. 219 గ్రామాలను కలుపుకుని కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) ఏర్పాటు కానుంది. మునిసిపాలిటీ నుంచి.. మున్సిపాలిటీగా ఉన్న కర్నూలు 1994లో కార్పొరేషన్గా ఏర్పడింది. 2002 సంవత్సరం ఫిబ్రవరిలో కల్లూరు గ్రామ పంచాయతీని, 2014 సంవత్సరంలో మామిదాల పాడు, మునగాలపాడు, స్టాంటన్ పురం గ్రామ పంచాయతీలను కారొ్పరేషన్లో విలీనమయ్యాయి. దీంతో నగరం విస్తరించిపోయింది. ఇప్పుడు కుడాగా మారడంతో మరింత విస్తరించేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే పట్టణాభివృద్ధి అథారిటీ బిల్ 2015 ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. పట్టణాభివృద్ధి అథారిటీలకు ప్రభుత్వమే చైర్మన్లను నియమిస్తుంది. ప్రస్తుతం నగర విస్తీర్ణం 49.74 చదరపు కిలోమీటర్లు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 4,23,829 మంది ఉన్నారు. అలాగే మురికివాడల్లో నివసిస్తున్న జనాభా 1,43,797 మంది ఉన్నారు. మున్సిపాల్టీ/మండలాలు విస్తీర్ణం 2011 జనాభా లెక్కల చ.కి.మీ ప్రకారం 1. కర్నూలు (అర్బన్) 355.72 4,06,737 2. కల్లూరు 327.01 1,96,288 3. గూడూరు (అర్బన్) 163.08 46,286 4. నందికొట్కూరు (అర్బన్) 177.13 83,748 5. జూపాడుబంగ్లా 226.70 37,686 6. మిడుతూరు 302.74 41,652 7. ఓర్వకల్లు 371.72 58,487 8. కోడుమూరు 287.06 74,594 9. వెల్దుర్తి 334.62 63,120 10. బేతంచర్ల 296.25 88,726 11. పాణ్యం 283.29 51,428 12. గడివేముల 243.53 42,310 13. నంద్యాల (అర్బన్) 217.08 2,83,368 14. మహానంది 259.64 38,487 15. డోన్ (అర్బన్) 430.28 1,20,232 –––––––––––– –––––––––––––––––––––––––––––––––– మొత్తం 4224.82 16,19,587 –––––––––––––––––––––––––––––––––––––––––––––– -
పల్లె పొమ్మంటోంది..!
– పట్టించుకోని ప్రభుత్వం కోసిగి : పుట్టిన ఊరులో బతుకు భారమైంది. పొట్టకూటి కోసం పల్లెలను వదిలి ప్రజలు.. పట్టణాలకు వలస వెళ్తున్నారు. బడులు మాన్పించి చిన్నారులను సైతం తమ వెంట తీసుకెళ్తున్నారు. బుధవారం కోసిగిలోని 3, 4వ వార్డు ప్రజలు.. చింతకుంట, కామన్దొడ్డి, కౌతాళం మండలంలోని తిప్పలదొడ్డి గ్రామల వాసులు.. వందలాది మంది రైళ్లలోనూ, లారీలలో గుంటూరు పట్టణానికి తరలి వెళ్లిపోయారు. కోసిగి మండలంలోని 26 గ్రామాల్లో 69,500 జనాభా ఉంది. ఇందులో 90 శాతం మంది ప్రజలు వ్యసాయంపై జీవనం సాగిస్తున్నారు. మూడేళ్లుగా వానలు పడక..పంటలు ఎండి పోయి రైతులకు అప్పులు మిగిలాయి. భూగర్భజలాలు సైతం అడుగంటిపోయాయి. వ్యవసాయం కలసి రాకపోవడం..పల్లెల్లో పనులు లేకపోవడంతో ఇళ్లకు తాళాలు వేసి పిల్లాపాపలతో మూటాముల్లె సర్దుకుని వలస బాట పడుతున్నారు. ప్రతి రోజూ వందలాది మంది వలసలు వెళ్తుండడంతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. కరువు కనిపించలేదా? కరువు విలయ తాండవం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళం, కోసిగి మండలాలను కరువుప్రాంతాలుగా ప్రకటించలేదు. పంట నష్ట పరిహారం అందక..అప్పులు తీరే మార్గం కానరాక రైతులు..పొట్ట చేతపట్టకొని ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. గిట్టుబాటు కానీ ‘ఉపాధి’ ప్రభుత్వం కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు గిట్టుబాటు కావడం లేదు. రెండున్నర నెలలుగా.. చేసిన పనులకు కూలి ఇవ్వలేదు. దీంతో ఉపాధి పనులు ఎందుకు ఉపయోగపడడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వలస నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సి ఉంది. అప్పుల భారంతో వలస వెళ్లుతున్నాం : నరసప్ప, రైతు నాకు 3.50 ఎకరాల భూమి ఉంది. మరో 5 ఎకరాలు కౌలు తీసుకుని ఈ ఏడాది ఉల్లి, వేరుశనగ పంటలను వేశాను. వర్షాలు సకాలంలో రాకపోవడంతో పంట పూర్తి ఎండి పోయింది. పెట్టుబడి కూడా రాలేదు. మొత్తం రూ.2లక్షల అప్పు మిగిలింది. అప్పు తీర్చేందుకు కుటుంబంలో ఆరుగురం వలస వెళ్తున్నాం. కుటుంబ పోషణ భారమైంది : గోవిందమ్మ, గ్రామంలో ఎలాంటి పనులు దొరకడం లేదు. కుటుంబ పోషణ భారమైంది. ఇద్దరు చదువుకునే పిల్లలను బడి మానిపించి మా వెంట గుంటూరు తీసుకెళ్లుతున్నాం. ప్రభుత్వం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేదు. బడి మానుకున్నాను : రత్నమ్మ, విద్యార్థిని కోసిగి చాకలిగేరి ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాను. మా ఇంట్లో వాళ్లంతా గుంటూరుకు వెళ్తున్నారు. నేనొక్కదాన్ని ఉండలేక బడిమాని మా అమ్మానాన్న వెంట పనులకు వెళ్లుతున్నాను. -
కోర్టు ఆదేశాలతో ‘స్మార్ట్సిటీ’పై కదలిక
పీఎంసీ నియామకం కోసం కసరత్తు ∙ వాడియా, ఆర్వీ కన్సల్టెంట్లతో చర్చలు కాకినాడ : కోర్టు ఆదేశాలతో నిలిచిపోయిన కాకినాడ స్మార్ట్సిటీ ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎంసీ) నియామకంపై మళ్ళీ కదలిక వచ్చింది. పీఎంసీ కోసం ఆర్వీ కన్సల్టెంట్స్, వాడియా సంస్థలు తీవ్రంగా పోటీపడి చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కొద్దినెలలుగా ప్రతిష్టం బన నెలకొంది. స్మార్ట్సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాజెక్టు నివేదికలు, పనుల పర్యవేక్షణ సహా అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు గతంలో టెండర్లు పిలిచారు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చివరకు ఆర్వీ కన్సల్టెంట్స్ను పీఎంసీకి ఎంపిక చేయాలని స్మార్ట్సిటీ కార్పొరేష¯ŒS ఎవాల్యూష¯ŒS కమిటీ నిర్ధారణకు వచ్చింది. వీరితో పోటీపడ్డ వాడియా సంస్థ ఆర్వీ కన్సల్టెంట్స్ ఆర్హతలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎంపిక ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కేసును పరిశీలించిన న్యాయస్థానం ఇరు సంస్థలతోనూ ఎవాల్యూష¯ŒS కమిటీ సమావేశమై చర్చలు ద్వారా పరిష్కరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యలో శుక్రవారం స్మార్ట్సిటీ కార్పొరేష¯ŒS ఎండీ, కమిషనర్ అలీమబాషా సమక్షంలో ఇందుకు సంబంధించి ఇరు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయా సంస్థల వాదనలు విన్నారు. అనంతరం కమిషనర్ అలీమ్బాషా నగరపాలక సంస్థ అధికారులతోనూ సమావేశమై తదుపరి చర్యలపై సమీక్షించారు. ఎంపిక ప్రక్రియపై రాత్రి వరకూ అధికారులు ఓ నిర్ణయానికి రాలేదు. దీనిపై అధికారులు తుది నిర్ణయం తీసుకుని పీఎంసీ కోసం సంస్థను ఎంపిక చేస్తే స్మార్ట్సిటీ పనులను వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. -
భీమవరం పట్టణాభివృద్ధికి సహకరిస్తాం
రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ వలవన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీతో కలిసి ఆకస్మిక సందర్శన భీమవరం టౌన్ : భీమవరం పట్టణాభివృద్ధికి సహకరిస్తామని రాష్ట్ర పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ వలవన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ డి.మురళీధరరెడ్డి తెలిపారు. భీమవరం మునిసిపల్ కార్యాలయాన్ని వారు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. కౌన్సిల్ హాల్లో పట్టణాభివృద్ధి పనుల ప్రగతి, 82 ఎకరాల్లో పేదలకు గృహ నిర్మాణం, అమృత్ పథకం, ఉద్యోగుల పోస్టుల ఖాళీలు, మాస్టర్ప్లాన్, బీపీఎస్, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షించారు. మునిసిపాలిటీ ఆదాయ వ్యయాలు, ప్రజారోగ్యానికి తీసుకుంటున్న చర్యలు, అర్భన్ హెల్త్ సెంటర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం పనుల్లో ప్రగతి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, మునిసిపల్ కమిషనర్ సీహెచ్ నాగనర్సింహరావు అభివృద్ధి పనుల ప్రగతి, అవసరాలు వివరించారు. గృహ నిర్మాణం చేపట్టాల్సిన 82 ఎకరాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైస్ చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ పాలవెల్లి మంగ, టీడీపీ కౌన్సిలర్లు ములుగుర్తి వెంకటరామయ్య, మెంటే గోపి, ఎద్దు ఏసుపాదం, బీజేపీ కౌన్సిలర్ బొడ్డు దానయ్య పాల్గొన్నారు. త్వరలో పేదలకు గృహయోగం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్లో గృహ నిర్మాణం చేపట్టే జాబితాలో భీమవరం పట్టణం చేరిందని, లబ్ధిదారుల జాబితాను అందిస్తే గృహాల నిర్మాణానికి ఆమోదం వస్తుందని ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల్ వలవన్ తెలిపారు. త్వరలో మొదటి ఫేజ్లో 82 ఎకరాల్లో జీ ప్లస్ 3 తరహాలో పట్టణ పేదలకు రూ.522.50 కోట్లతో 9,500 గృహాలు నిర్మిస్తారని చెప్పారు. పట్టణంలో గృహాలకు 5,500 దరఖాస్తులు వచ్చాయి. ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి పంపించామని కమిషనర్ చెప్పడంతో మొదటి ప్యాకేజీని మంజూరు చేస్తామని మిగిలిన 4 వేల దరఖాస్తులు ఇంకా అర్హులు ఉంటే వాటిని కూడా అందిస్తే 2వ ఫేజ్లో మంజూరు చేస్తామన్నారు. -
మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్టు
కర్నూలు(అర్బన్): నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగతనం చేస్తున్న నలుగురు సభ్యులు ముఠాలోన ముగ్గురిని అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ మధుసూదన్రావు తెలిపారు. వీరి నుంచి ఆరు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న ట్లు చెప్పారు. రెండు మోటార్ సైకిళ్లను మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఠాకూర్నగర్, రైతు బజారు ప్రాంతాల్లో.. మిగిలిని నాలుగు మోటార్ సైకిళ్లు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, భవాని నగర్, కృష్ణానగర్, బృందావన్ నగర్లలో దొంగలించినట్లు విచారణలో వెల్లడయిందన్నారు. నిందితులు జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలతో పాటు మోటార్ సైకిళ్లను అపహరిస్తున్నట్లు గుర్తించామన్నారు. నాల్గవ ముద్దాయి కోసం గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వీరిని అరెస్టు చేసిన వారిలో ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ భాస్కర్ ఉన్నారన్నారు. -
మేలైన పారిశుధ్య నిర్వహణ
నిజామాబాద్ అర్బన్: వివిధ కార్పొరేషన్లలో అమలు చేస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను నిజామాబాద్లోనూ అమలు చేస్తామని మేయర్ ఆకుల సుజాత తెలిపారు. ఇటీవల న్యూఢిల్లీ, చండీగఢ్, అమృత్సర్లలో స్టడీ టూర్కు వెళ్లిన కార్పొరేటర్లు అక్కడి పారిశుద్ధ్య కార్యక్రమాలను అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. స్టడీ టూర్ వివరాలను డిప్యూటీ మేయర్ ఫయీమ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ సునీత తదితరులతో కలిసి మేయర్ సుజాత్ శనివారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులకు వివరించారు. న్యూఢిల్లీలోని ఓక్లాలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బాగుందని, అక్కడ తడి, పొడి చెత్తను వేరు చేస్తున్నారని చెప్పారు. పొడి చెత్త నుంచి రోజూ 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని వివరించారు. విద్యుత్ ప్లాంట్ నుండి వచ్చే బూడిదతో ఇటుకలను తయారు చేస్తున్నారని, మిగతా రా మెటీరియల్తో రోడ్లు వేస్తున్నారన్నారు. చండీగఢ్లో పార్కులు, నీటి సరఫరా నిర్వహణ బాగుందని, అక్కడి వైద్యశాలలు, స్కూళ్లను మున్సిపాలిటీ వారే నిర్వహిస్తున్నారనిచ ఎప్పారు. అమృత్సర్లో సానిటేషన్ ప్రక్రియలో ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారని, ఆటోమెటిక్ మెషిన్స్తో రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను, తడి,పొడిగా వేరు చేయడం, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ ఆదా ప్రక్రియ బాగుందన్నారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
వర్షపు నీటిలో కుట్టిన విషపురుగు నాలుగు రోజుల తర్వాత మృత్యువాత కరీమాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని ఎస్ఆర్ఆర్తోటలోని సీఆర్ నగర్లోని భారీగా వరద నీరు చేరింది. పాములు, తేళ్లు, ఇతర విష పురుగులు ఇళ్లలోకి వచ్చాయి. ఈక్రమంలో సీఆర్ నగర్లో ఇడ్లీ బండి నడుపుతూ పొట్టపోసుకుంటున్న పిన్నోజు పూర్ణచందర్(35)ను గురువారం రాత్రి ఓ విషపు పురుగు కుట్టింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు.పూర్ణచందర్కు భార్య లత, ఇద్దరు పిల్లలున్నారు. ఇడ్లీ బండి నడుపుతూ జీవనం గడుపుతున్న పూర్ణచందర్ దహన సంస్కారాలకు కూడా డబ్బు లేకపోవడంతో స్థానికులు వైట్ల శరత్, బొల్లం రాజు, రాము, ప్రతాప్ తదితరులు రూ.5 వేలు జమచేసి లతకు ఇచ్చారు. వీఆర్ఓ శ్రీనివాస్ క్వింటా బియ్యం అందించారు. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
వర్షపు నీటిలో కుట్టిన విషపురుగు నాలుగు రోజుల తర్వాత మృత్యువాత కరీమాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని ఎస్ఆర్ఆర్తోటలోని సీఆర్ నగర్లోని భారీగా వరద నీరు చేరింది. పాములు, తేళ్లు, ఇతర విష పురుగులు ఇళ్లలోకి వచ్చాయి. ఈక్రమంలో సీఆర్ నగర్లో ఇడ్లీ బండి నడుపుతూ పొట్టపోసుకుంటున్న పిన్నోజు పూర్ణచందర్(35)ను గురువారం రాత్రి ఓ విషపు పురుగు కుట్టింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందాడు.పూర్ణచందర్కు భార్య లత, ఇద్దరు పిల్లలున్నారు. ఇడ్లీ బండి నడుపుతూ జీవనం గడుపుతున్న పూర్ణచందర్ దహన సంస్కారాలకు కూడా డబ్బు లేకపోవడంతో స్థానికులు వైట్ల శరత్, బొల్లం రాజు, రాము, ప్రతాప్ తదితరులు రూ.5 వేలు జమచేసి లతకు ఇచ్చారు. వీఆర్ఓ శ్రీనివాస్ క్వింటా బియ్యం అందించారు. -
నగరంలో నరకయాతన!
-
‘చీకటి’ దందా !
నిజామాబాద్ అర్బన్: మారుమూల పల్లెల్లో కాదు.. ఏకంగా జిల్లా కేంద్రంలోనే ఇసుక దందా జోరందుకుంది. చిమ్మచీకట్లో అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. రాత్రి 11 దాటితే చాలు.. ఇసుక లారీలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కంఠేశ్వర్, గంగస్థాన్ తదితర ప్రాంతాలు ఈ చీకటి దందాకు అడ్డాగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపులు వెలిశాయి. బహిరంగంగానే ఇసుక నిల్వలు కనబడుతున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. అర్ధరాత్రి వేళ.. కంఠేశ్వర్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఇసుక లారీలు దూసుకెళ్తున్నాయి. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అర్ధరాత్రి వేళ ఇసుక రవాణాను యధేచ్ఛగా చేపడుతున్నారు. మంజీర, బోధన్, నందిపేట్, జన్నేపల్లి, జక్రాన్పల్లి ప్రాంతాల నుంచి రాత్రివేళ అధిక లోడ్తో టిప్పర్ల ద్వారా ఇసుకను తీసుకొస్తూ, గంగస్థాన్ ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. వందలాది లారీల ఇసుక ఉంది. గంగస్థాన్1, 2 ఫేజ్లలో, కంఠేశ్వర్లోని బైపాస్ రోడ్డు పక్కన , శ్రీరామాగార్డెన్ సమీపంలో, ఓ పెట్రోల్ బంకు వెనక ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుక డంపులు వెలిశాయి. నీటిపారుదల శాఖకు చెందిన ప్రభుత్వ స్థలంలో వందలాది లారీల ఇసుకను డంప్ చేశారు. ఈ స్థలంలో అనధికారికంగా మరో ప్రైవేటు వ్యక్తి ఇసుకను నిలిపినందుకు అద్దె తీసుకోవడం గమనార్హం. రాత్రి 11 గంటలైతే జిల్లా కేంద్రం నుంచి 30–40 టిప్పర్ల లో ఇసుక రవాణా కొనసాగుతోంది. తెల్లవారుజామున 5 గంటల వరకు అక్రమంగా ఇసుక రవాణా కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో నివాసగృహాలు ఎక్కువగా ఉన్నాయి. నివాస గృహాలకు ఆనుకుని ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈస్థలాల్లోనే ఇసుకను డంప్ చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ లారీల రాకపోకల వల్ల స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీల మోతతో నిద్ర కూడా సరిగా ఉండడం లేదని వాపోతున్నారు. అధిక లోడ్తో దూసుకెళ్తుండడంతో రోడ్లు కూడా ధ్వంసమవుతున్నాయి. కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి ఒక్కరే 20 టిప్పర్లతో ఇసుకదందాను కొనసాగిస్తున్నారు. మరో వ్యాపారి గంగస్థాన్లో ప్రహరీ నిర్మించి, ఇక్కడ 30 టిప్పర్ల ద్వారా ఇసుకను డంపు చేయిస్తున్నారు. తన కార్యాలయం వెనకనే వందలాది లారీల ఇసుకను నిల్వ చేసుకున్నారు. మరో వ్యాపారి గంగస్థాన్లో ప్రధాన రోడ్డును ఆనుకుని ఇసుకను డంపు చేస్తున్నారు. అందేకాదు, మాక్లూర్, ఆర్మూర్, జక్రాన్పల్లి, నాగారం ప్రాంతం నుంచి అక్రమంగా మొరం తీసుకొస్తున్నారు. పట్టించుకోని అధికారులు వందలాది టిప్పర్ల ఇసుక డంపులు నడిబొడ్డున ఉన్నా.. పోలీసులు, రెవెన్యూ అధికారులు సహా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇసుక డంపులు ఉన్న ప్రాంతాలు ప్రధాన రోడ్డుకు ఆనుకునే ఉన్నాయి. అయినా స్పందించడం లేదు. ఇక రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులు సైతం ఇసుక లారీలను చూసీచూడనట్లు వదిలేస్తుండడం విశేషం. వ్యాపారులు అధికారులకు, పోలీసులకు మామూళ్లు ఇవ్వడంతోనే ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సిటీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి
మద్దిలపాలెం : విశాఖ నగరాన్ని మరింత సుందరీకరించాలని, ఆకర్షణీయ నగరం తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేక అధికారి ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణతో కలసి శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఇందులో భాగంగా మద్దిలపాలెం జంక్షన్లో పర్యటించిన కలెక్టర్ తెలుగుతల్లి విగ్రహం వద్ద ఐలాండ్ను సుందరీకరించాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గ్రీన్బెల్టులొ పిచ్చిమొక్కలను తొలగించి, ఆధునీకరించాలని, ట్రాఫిక్ ఐలాండ్లు ఎక్కడక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దష్టిలో ఉంచుకుని కొండవాలు ప్రాంతాలలో రిటైనింగ్వాల్ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుందరీకరణకు చేపడుతున్న వివరాలను కలెక్టర్,ప్రత్యేక అధికారి ప్రవీణ్కుమార్కు, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ తెలిపారు. పర్యటనలో ఇన్చార్జ్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ వి.చంద్రయ్య, ఏడీహెచ్ దామోదర్, కార్యనిర్వాహక ఇంజినీర్ సుధాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
నగరంలో పార్కుల అభివృద్ధికి చర్యలు
మంచినీరు, పారిశుద్ధ్యం,రోడ్లపై ప్రత్యేక దృష్టి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం కమర్షియల్ జోన్లలో రోడ్డుపై కాగితం పడితే రూ.500 ఫైన్ విలేకరుల సమావేశంలో మేయర్ డాక్టర్ పాపాలాల్ ఖమ్మం మామిళ్లగూడెం: నగరంలో పార్కులు అధ్వానంగా ఉన్నాయని,వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నట్లు నగర మేయర్ డాక్టర్ పాపాలాల్ అన్నారు.మంగళవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు అవసరమైన మంచినీరు,పారిశుద్ధ్యం,రోడ్లపై దృష్టి సారించినట్లు, ఇక నుంచి నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటును కూడా నిషేధించినట్లు చెప్పారు.నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, వాటర్ట్యాంకులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళల కోసం షీ టాయిలెట్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూలై 2 వ తేదీ వరకు పూర్తి చేయనున్నట్లు వివరించారు. కార్పొరేషన్లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్ జోన్లలో కాగితం వేస్తే రూ.500 జరిమానా వైరారోడ్డులోని పలుసెంటర్లను కమర్షియల్ జోన్లుగా గుర్తించి ఆ ప్రదేశాల్లో కాగితాలు వేస్తే రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్లు శుభ్రం చేసేందుకు స్వీపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వైరా రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందితోపాటు పార్కింగ్ ఇబ్బంది కూడా ఉందని, అందుకు చేపల మార్కెట్ కోసం నిర్మించే నూతన భవనంలో అండర్ గ్రౌండ్ను కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ నిర్మాణంపై స్టే ఉందని చెప్పారు. పంపులకు మోటార్లు పెడితే కఠిన చర్యలు.. నగరంలో పంపులకు మోటార్లు పెట్టి ఎవరైనా నీటిని వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆమోదం పొందని ఇళ్లకు నోటరీ ద్వారా పంపు కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఫంక్షన్హాళ్లలో చెత్త తొలగింపు కోసం ప్రస్తుతం రూ.1000 వసూలు చేస్తున్నట్లు,దీనిపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి రేటు పెంచి 4 ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం జరుగుతుందన్నారు. సమావేశంలో కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, 26వ డివిజన్ కార్పొరేటర్ పగడాల నాగరాజు పాల్గొన్నారు. -
జర్మనీ మొదటి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్!
చెన్నైః ఒడిషాలోని భువనేశ్వర్, కేరళలోని కొచ్చి, తమిళనాడులోని కోయంబత్తూర్ లను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని గతంలో జర్మనీ హామీ ఇచ్చింది. అందులో భాగంగా ముందుగా తమ ప్రాజెక్టును కోయంబత్తూరు నుంచి ప్రారంభించేందుకు జర్మనీ సంసిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో సమావేశం అయ్యారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ముందుగా కోయంబత్తూర్ లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత్ లో మూడు నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు సాయం అందిస్తామని జర్మనీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఇండియాకు వచ్చిన జర్మన్ అంబాసిడర్ మార్టిన్ నే తమిళనాడు ముఖ్యంత్రి జయలలితను స్టేట్ సెక్రెటేరియల్ లో కలిసినట్లు తమిళనాడు ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సహాయం అందించేందుకు సంసిద్ధంగా ఉన్న జర్మనీ.. ముందుగా కోయంబత్తూర్ నుంచి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు జర్మన్ అంబాసిడర్ నే.. తెలిపారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్తల ప్రాతినిథ్యంతో కూడిన ఓ బృదం జూలై 20న కోయంబత్తూర్ సందర్శించి, కోయంబత్తూర్ నగర మేయర్, ఇతర అధికారులతో మిగిలిన చర్చలు జరపనున్నట్లు తెలిపింది. ప్రాజెక్టులకు తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నజర్మన్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమిళనాడులో బ్యాంకింగ్ గ్రూప్ కెఎఫ్ డబ్ల్యూ సహా.. మరిన్ని జర్మన్ కంపెనీలు పెట్టుబడులను పెట్టేందుకు ముందుకు రావాలని ఆమె కోరారు. -
నగరంలో రేపు విద్యుత్ ఉండని ప్రాంతాలు
హైదరాబాద్సిటీ: గ్రీన్ల్యాండ్స్ సబ్డివిజన్ ఆల్విన్, ఐడీపీఎల్, కుందన్బాగ్, హెచ్పీఎస్ విద్యుత్ ఫీడర్ లైన్ల మరమ్మతుల కారణంగా సోమవారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ మహేష్కుమార్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సనత్నగర్ ఎస్ఆర్టీ, 2ఆర్టీ, 3ఆర్టీ క్వార్టర్స్, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, అశోక్ లేబర్ కాలనీ, డీఎన్ఎం కాలనీ, ఇండస్ట్రీయల్ ఎస్టేట్, సనత్నగర్, ఆంధ్రాబ్యాంక్ లేన్, టయోటా షోరూం ఏరియా, సనత్నగర్ మెయిన్రోడ్డు, టోపాజ్ బిల్డింగ్, మా టీవీ లేన్, పంజగుట్ట ఐఏఎస్ క్వార్టర్స్, బేగంపేట్ ఆర్బీఐ క్వార్టర్స్, మూసాపేట్ హెచ్పీ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని పేర్కొన్నారు. -
ఢిల్లీని 'బెగ్గర్ ఫ్రీ' నగరంగా చేస్తాం..
న్యూఢిల్లీః దేశ రాజధాని నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం నడుం బిగించింది. జూలై నెలాఖరుకల్లా యాచకులకు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసి, వారికి పునరావాసాన్ని కల్పించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ కొత్త ప్రణాళికను రచించి, ప్రారంభించేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ ప్రాంతంలో 75,000 మంది వరకూ బిచ్చగాళ్ళు ఉన్నట్లు గుర్తించిన ఆ శాఖ... వారిని అక్కడినుంచి తరలించి రాజధాని గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసే పనిలో పడింది. ఢిల్లీ అభివృద్ధికి ఆమ్ ఆద్మీపార్టీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ మరో అడుగు ముందుకేసింది. రాజధాని నగరంలో యాచకులు లేకుండా చేసి, ఢిల్లీ గౌరవాన్నికీర్తి పాతకన నిలిపే ప్రయత్నం చేస్తోంది. ఆప్ చేపట్టిన ప్రస్తుత ప్రాజెక్ట్ లో భాగంగా జూలై నెలఖారుకల్లా రాజధాని నగరంలో ఉన్న సుమారు 75000 మంది యాచకులను అక్కడినుంచీ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బిచ్చగాళ్ళలో 40 శాతం మంది మహిళలు కూడ ఉన్నట్లు గుర్తించిన శాఖ.. వారికి పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రణాళికలు పూర్తి చేశామని, ఈ నెల్లోనే వీధుల్లో ఉండే బిచ్చగాళ్ళనందరినీ తరలిస్తామని ఆశాఖ అధికారులు చెప్తున్నారు. ఢిల్లీ గౌరవాన్ని మరింత పెంచేందుకు ఆప్ ప్రభుత్వం ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెప్తున్నారు. టూరిజం అభివృద్ధి చెందుతున్ననేపథ్యంలో నగరానికి వస్తున్న అనేకమంది విదేశీయులకు బిచ్చగాళ్ళ బెడద పెరుగుతున్నతరుణంలో ఈ ప్రత్యేక డ్రైవ్ పై దృష్టి సారించినట్లు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. కార్యక్రమంలోని మొదటి ఫేజ్ లో భాగంగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రచారం చేపట్టనున్నట్లు అధికారులు చెప్తున్నారు. కెన్నాట్ ప్లేస్ నుంచి ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సందీప్ కుమార్ ప్రారంభిస్తారు. ఏడు బృందాలుగా ఏర్పడిన ఢిల్లీ పోలీసులు నగరంలోని యాచకులను వారికి కేటాయించి షెల్టర్లకు తరలించే కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. ప్రణాళికలను అమలు చేయడంలో భాగంగా నగరంలోని బిచ్చగాళ్ళను తొలగించే ముందు వారిని మొబైల్ కోర్టుల్లో విచారించనున్నట్లు తెలిపారు. ఢిల్లీని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాలన్న నేపథ్యంలో 2009 కామన్ వెల్గ్ గేమ్స్ కు ముందు కూడ యాచకులను విచారించేందుకు ప్రభుత్వం రెండు మొబైల్ కోర్ట్ లను ప్రవేశ పెట్టింది. కాగా ప్రస్తుత డ్రైవ్ లో భాగంగా ఇప్పటికే సుమారు 25 మొబైల్ వ్యాన్లు ఢిల్లీలోని బిచ్చగాళ్ళను గుర్తించే పనిలో పడ్డాయని, ఈ వ్యాన్లలో తెచ్చిన బిచ్చగాళ్ళందరినీ కింగ్స్ వే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారు. అనంతరం అక్కడినుంచీ వారికి కేటాయించిన హోమ్ లకు తరలిస్తారు. ప్రస్తుతం 3000 మంది పట్టే 11 బెగ్గర్ హోం లు ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. కాగా ఢిల్లీలోని 75000 మంది యాచకుల్లో 30 శాతం మంది 18 ఏళ్ళ లోపు వారు, 40 శాతం మహిళలు ఉన్నట్లు సాంఘిక సంక్షమ శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది. -
భారత్ లో అదే అత్యంత చౌక నగరం!
కోల్ కతాః ప్రవాసితులు నివసించేందుకు వీలుగా, ఇండియలోని మిగిలిన నగరాలతో పోలిస్తే అతి తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ఒకప్పుడు సామాన్యులు సైతం బతికేందుకు వీలుగా, చౌకగా ఉండే నగరంగా పేరొందిన ముంబై ప్రస్తుతం ఆస్థానాన్ని కోల్పోయి అత్యంత ఖరీదైన నగరంగా మారిపోయిందని సర్వేల్లో తేలింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే ప్రస్తుతం కోల్ కతా అతి చౌక నగరంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో హాంకాంగ్ అత్యంత ఖరీదైన నగరంగా గుర్తింపు పొందిన కొద్ది రోజుల్లోనే ముంబైలోని అద్దెలు ఢిల్లీతో పోలిస్తే సుమారు 18 శాతం పెరిగిపోయినట్లు సర్వేలద్వారా తెలుస్తోంది. భారతదేశంలో సామాన్యులకు, ప్రవాసితులకు అందుబాటులో, తక్కువ ఖర్చు ఉండే నగరం కోల్ కతా అంటున్నాయి తాజా సర్వేలు. ప్రముఖ గ్లోబల్ కన్సల్టెన్సీ నిర్వహించిన సంవత్సరాంతపు సర్వేల్లో ఈ కొత్త వివరాలు వెల్లడయ్యాయి. మెట్రో నగరాల్లో ఒకటైన బెంగళూరు విదేశీయులకు అందుబాటులో ఉంటుందని, అతి తక్కువ ఖర్చుతో కోల్ కతాలో సామాన్యులు సైతం జీవించేందుకు వీలుందని సర్వే చెప్తోంది. మెర్సర్స్ 2016 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం హాంకాంగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఖర్చు ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో టాప్ ర్యాంక్ లో నిలువగా, రెండో స్థానంలో లువాండా, అంగోలా రాజధాని మోపడం లు ఉన్నాయి. జురిచ్, సింగపూర్ లు మూడు, నాలుగు స్థానాల్లో నిలువగా, గతేడాది ఆరోస్థానంలో ఉన్న టోక్యో ఈసారి ఐదో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఎక్కువ ఖర్చుగల నగరాల్లో మొదటిస్థానాన్ని 82 వ ర్యాంకుతో ముంబై ఆక్రమించింది. ఆ తర్వాత ర్యాంకులు 130 ఢిల్లీ, 158 చెన్నై ఆక్రమించగా... కోల్ కతా 194, బెంగళూరు 180 ర్యాంకులతో తక్కువ ఖర్చుగల నగరాలుగా గుర్తింపు పొందాయి. మెర్సర్స్ సంస్థ ప్రతియేటా మార్చి నెల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ పై సర్వే నిర్వహించి, మే, జూన్ ప్రాంతాల్లో ర్యాంకులను వెల్లడిస్తుంది. ఏ నగరంలోనైనా వస్తువులు మరియు సేవలు, హౌసింగ్ ఆధారంగానే జీవన వ్యయాన్ని అంచనావేస్తామని, మూడేళ్ళుగా ముంబై, ఢిల్లీకన్నా ఐదు కేటగిరీల్లో అత్యంత ఖరీదైన నగరంగా ఉంటోందని మెర్సర్ సంస్థ గ్లోబల్ మొబిలిటీలో.. ప్రిన్సిపాల్ ఇండియా ప్రాక్టీస్ లీడర్ గా పనిచేస్తున్న రుచికా పాల్ తెలిపారు. -
అడవుల్లో అద్భుతాన్ని కనిపెట్టిన బాలుడు!
మెక్సికో: శాటిలెట్ ఫొటోల ఆధారంగా ఓ బాలుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. దట్టమైన అడవుల్లో నిక్షిప్తమైన, ఎవ్వరికీ కనపడకుండా మరుగున పడిపోయిన మయన్ నగరాన్ని గుర్తించాడు. మాయ నాగరికతకు చెందిన చరిత్ర ఆధారంగా పరిశోధనలు చేశాడు. సెంట్రల్ అమెరికాకు చెందిన మెక్సికన్ పర్వత ప్రాంతంలో వేల ఏళ్ళనాడు మరుగున పడిపోయిన నగరాన్ని 15ఏళ్ళ విలియమ్స్ గడౌరీ గుర్తించాడు. ఇప్పటివరకూ పరిశోధకుల కంట కూడ పడని దట్టమైన అడవులు, కొండలు, గుట్టల్లో దాగి ఉన్న ఆ అద్భుత 'మాయ' నగరాన్ని శాటిలెట్ చిత్రాల ద్వారా గుర్తించిన బాలుడు... ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారిపోయాడు. ప్రాచీన కళలు, సంస్కృతి ప్రతిబింబించే కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఇప్పుడా నగరంలో బయటపడి, వేల యేళ్ళ చరిత్రకు ఆనవాళ్ళుగా మారాయి. 2014 సంవత్సరంలోనూ పురావస్తు శాఖ వారు రెండు పురాతన పట్టణాలను కనుగొన్నారు. అయితే అప్పట్లో అడవుల్లో దాగి ఉన్న ఈ నగరాన్ని మాత్రం గుర్తించలేకపోయారు. తాను చదివిన ఓ పుస్తకం ఆధారంగా ఆ అదృశ్య నగరాన్ని గుర్తించినట్లు విలియమ్స్ గడౌరీ చెప్తున్నాడు. మాయ నాగరికత నాటి నిర్మాణాలన్ని మారుమూల ప్రాంతాలు, దట్టమైన అడవులు, పర్వతాల నడుమే ఉన్నట్లు తెలుసుకున్న అతడు... అలా ఎందుకు నిర్మించేవారో తెలుసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ విషయంపై అధ్యయనాలు ప్రారంభించాడు. ఆ కాలంలో ప్రజలు నక్షత్రాలను ఎక్కువగా పూజించేవారని తెలుసుకుని ఆదిశగా అధ్యయనాలను మొదలు పెట్టాడు. నక్షత్రాల ఆధారంగా నగరాలను గుర్తించవచ్చన్న కోణంలో అడుగులు వేశాడు. గడౌరీ అనుకున్నట్లుగానే ఇప్పటిదాకా గుర్తించిన నగరాలన్నీ 22 నక్షత్ర సమూహాల స్థానంలోనే ఉన్నట్లు గుర్తించాడు. కానీ ఇంతకు ముందు పరిశోధకులు గుర్తించిన వాటిలో ఓ నగరం మిస్ అయినట్లు తెలుసుకున్న అతడు.. గూగుల్ ఎర్త్ ఆధారంగా పరిశోధనలు కొనసాగించి, రాడార్ శాట్-2 ఉపగ్రహ చిత్రాలద్వారా అడవుల్లో దాగిఉన్న అద్భుతాన్ని కనుగొన్నట్లు తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మానవమాత్రులు అడుగు పెట్టలేని అ మారుమూల యుకాతాన్ అడవుల్లోని నగరానికి తాను.. కాక్ చి అని గాని, మౌత్ ఆఫ్ ఫైర్ అనిగాని కొత్త పేరు పెట్టాలని కూడ భావిస్తున్నాడు. అయితే ఆ నగరం మానవ నిర్మితంగానే కనిపిస్తోందని, అయితే ప్రపంచం ఈ నంగరం ద్వారా కొత్త ఆవిష్కణను చూసే అవకాశం ఉందని న్యూ బ్రున్స్విక్ విశ్వవిద్యాలయం రిమోట్ సెన్సింగ్ లేబొరేటరీకి చెందిన డాక్టర్ ఆర్మాండ్ లా రాక్యూ చెప్తున్నారు. శాటిలెట్ చిత్రాల్లోని ఒక ఫొటో అక్కడి నిర్మాణాలు చతురస్రాకారంలో పిరమిడ్ ను పోలి ఉన్నట్లుగా తెలుస్తోందని చెప్తున్నారు. విలియమ్స్ కనుగొన్న పద్ధతిలో మాయన్ నగరం ఆధారంగా పురాతత్వవేత్తలు మరిన్ని నగరాలను కూడ గర్తించే అవకాశం ఉందన్నారు. తన కొత్త ఆవిష్కరణలను సైంటిఫిక్ జనరల్ లో ప్రచురించిన విలియమ్స్... 2017 లో జరిగే బ్రెజిల్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించనున్నట్లు కూడ తెలుస్తోంది. -
బ్రిటిష్ మ్యూజియంలో ఈజిప్టు అద్భుతాలు!
ఫ్రెంచ్ పురాతత్వవేత్త గాడియో అద్భుత ఆవిష్కారాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో సందర్శనకు సిద్ధమయ్యాయి. ప్రాచీన ఈజిప్టు నగరాల ఆనవాళ్ళు త్వరలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. సముద్రంలో మునిగిపోయి, ఎవ్వరికీ కనిపించకుండా పోయిన గొప్ప ఈజిప్టు నగరాలు ఎన్నో వేల సంవత్సరాలపాటు రహస్య నగరాలుగానే మిగిలిపోయాయి. కనిపించకుండా పోయిన ఆ నగరాలను పురాతత్వవేత్త ఫ్రాంక్ గాడియో కొన్నేళ్ళ క్రితం సముద్రానికి అడుగు భాగంలో కనిపెట్టిన విషయం తెలిసిందే. ఆ నగరాలకు సంబంధించిన అనేక అద్భుతాలను ఇప్పుడు సందర్శకులకు అందుబాటులో బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు పెడుతున్నారు. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన థోనిస్ హెరాస్టెయిన్ నగరంలోని అద్భుత దేవాలయాలు, ప్రాచీన శిలాకృతులు గాడియో కనిపెట్టే వరకూ ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా నీటి అడుగున నిక్షిస్తమైపోయాయి. చేపలకు ఆవాసాలుగా మారిపోయాయి. ఆ నగరాలనుంచి సేకరించిన దేవతా విగ్రహాలు, శిల్ప సంపద ప్రస్తుతం ప్రపంచానికి పరిచయం కానున్నాయి. సంవత్సరాలకొద్దీ కాలం ఈ ప్రాచీన చిహ్నాలను గుర్తించేందుకు గాడియో ఎంతో శ్రమించాడు. దీనికి తోడు కానోపస్ ను కూడ అంగుళం లోతు ఇసుకలో కూరుకుపోయి నీటి అడుగు భాగంలో ఉన్నట్లుగా 1933లో బ్రిటిష్ ఆర్ ఏ ఎఫ్ పైలట్ కనుగొన్నాడు. ప్రస్తుతం ఆ ఈజిప్టు అద్భుత శిలా సంపదను మే 19న ప్రదర్శనకు అందుబాటులోకి తేనున్నట్లు మ్యూజియం క్యూరేటర్ మాసెన్ బెర్గోఫ్ తెలిపారు. ప్రాచీన గ్రీకు చరిత్రకారులు, గ్రంథాలు, పురాణాలు వంటి ఎన్నో విశేషాలను ఇప్పుడు మ్యూజియంను సందర్శించిన వారు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏదో తెలుసా?
ముంబై: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో లండన్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రముఖ బ్రిటన్ రియల్ ఎస్టేట్ సంస్థ సవిల్స్ నిర్వహించిన సర్వేలో లండన్ తరువాతి స్థానాల్లో న్యూయార్క్, హాంకాంగ్ నగరాలు నిలిచాయి. ఈ టాప్ ట్వంటీ ఖరీదైన నగరాల జాబితాలో భారత్ నుంచి ఏకైక నగరం ముంబై 17వ స్థానంలో నిలిచింది. ముంబై తరువాతి స్థానాల్లో బెర్లిన్, జొహనెస్బర్గ్, రియోడీజెనీరో నగరాలు ఉన్నాయి. ఈ సర్వేలో ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లోని కార్యాలయాలు, నివాసస్థలాలకు గల అద్దె ఖర్చులను లెక్కలోకి తీసుకున్నారు. లండన్లో అత్యధికంగా ఒక వ్యక్తికి సంవత్సరానికి సుమారు 76 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లలో లండన్లో ఈ ఖర్చులు 18 శాతం పెరిగినట్లు సవిల్స్ వరల్డ్ రీసెర్చ్ నిర్వహించిన సర్వేకు నేతృత్వం వహించిన బార్నెస్ తెలిపారు. ప్రపంచ నగరాలు సాధిస్తున్న ఆర్థక ప్రగతే.. అక్కడ పెరిగిపోతున్న అద్దెలకు ప్రధాన కారణమౌతోందని, అలాంటి చోట్ల సామాన్య ప్రజానికానికి ఇంటి అద్దెలను భరించటం సమస్యగా మారిందని ఆమె వెల్లడించారు. ఒక నగరానికి సంబంధించిన ఉత్పాదకత, ప్రపంచ వాణిజ్యంపై నేరుగా ప్రభావం చూపించేలా ఉంటే అక్కడ అద్దె ఖర్చులు పెరుగుతున్నట్లు సర్వేలో తేలింది. -
అధిక సంపన్నులున్న నగరాల్లో ముంబై, ఢిల్లీ
♦ జాబితాలో టోక్యో నంబర్ వన్ ♦ హైదరాబాద్లో సంపన్నులు 7,800 మంది... న్యూఢిల్లీ: సంపన్నులు (మిలియనీర్లు) అధికంగా ఉన్న ఆసియా పసిఫిక్ ప్రాంతపు నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ స్థానం దక్కించుకున్నాయి. 41,200 మంది సంపన్నులతో ముంబై 12వ స్థానంలో, 20,600 మంది సంపన్నులతో ఢిల్లీ 20వ స్థానంలో నిలిచాయి. ‘న్యూ వరల్డ్ వెల్త్’కు సంబంధించిన ‘ఆసియా పసిఫిక్ 2016 వెల్త్’ నివేదిక ప్రకారం.. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంపన్నులు అధికంగా ఉన్న నగరాల్లో 2.64 లక్షల మంది సంపన్నులతో టోక్యో అగ్రస్థానంలో ఉంది. ఒక మిలియన్ డాలర్లకు సమానంగా లేదా అధికంగా సంపదను కలిగిన వారిని ధనవంతులుగా (మిలియనీర్లు) పరిగణనలోకి తీసుకుంటారు. కాగా పది మిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన మల్టీ మిలియనీర్ల జాబితాలో 9,650 మందితో హాంకాంగ్ అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో 2,690 మందితో ముంబై 8వ స్థానంలో, 1,340 మందితో ఢిల్లీ 14వ స్థానంలో నిలిచాయి. దేశంలో 10,000 మందికి లోపు సంపన్నులను కలిగిన నగరాల జాబితాలో 7,800 మందితో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. అగ్రస్థానంలో కోల్కతా (8,700 మంది) నిలిచింది. ఇక వీటి తర్వాతి స్థానాల్లో బెంగళూరు (6,700 మంది), చెన్నై (6,000 మంది) ఉన్నాయి. కాగా భారత్లో మల్టీ మిలియనీర్లు కోల్కతాలో 560 మంది, హైదరాబాద్లో 510 మంది, బెంగళూరులో 430 మంది ఉన్నారు. వచ్చే పదేళ్లలో సంపన్నులు వేగంగా పెరుగుతున్న పట్టణాల జాబి తాలో ముంబై, ఢిల్లీ ప్రాంతాలు టాప్-3లోకి చేరవచ్చని ‘న్యూ వరల్డ్ వెల్త్’ పేర్కొంది.