Commissioner of Police
-
సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరగాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సాప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్తాన్ దేశ కోడ్తో వాట్సాప్కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇటీవల అక్రమ కేసుల పేరిట ఫేక్ వాట్సాప్కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులతో పాటు కేసులు రిజిస్టర్ అవడం, ఫోన్ కనెక్షన్ను ట్రాయ్ కట్ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో భారీ చోరీ -
‘ఆర్జీకర్’ ఘటన ఎఫెక్ట్: కోల్కతా ‘సీపీ’ బదిలీ
కోల్కతా: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీని పశ్చిమబెంగాల్లో మమత సర్కారు నిలబెట్టుకుంది. డాక్టర్ల డిమాండ్ మేరకు ఇప్పటిదాకా కోల్కతా నగర పోలీస్కమిషనర్గా ఉన్న వినీత్కుమార్ గోయెల్ను ప్రభుత్వం బదిలీ చేస్తూ మంగళవారం(సెప్టెంబర్17) ఉత్తర్వులు జారీ చేసింది.గోయెల్ స్థానంలో మనోజ్కుమార్ వర్మను కమిషనర్ ఆఫ్ పోలీస్గా నియమించారు.కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నగర పోలీస్ కమిషనర్ గోయెల్పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ను జూనియర్ డాక్టర్లు సీఎం మమత ముందుంచారు. దీంతో ప్రభుత్వం కమిషనర్ను బదిలీచేసింది. పోలీస్కమిషనర్తో పాటు ఆరోగ్య శాఖలోని పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేయాలని డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. వీరి కోరిక మేరకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇదీ చదవండి.. కోల్కతా బాధితురాలి ఫొటో..పేరు తొలగించండి: సుప్రీంకోర్టు -
విశాఖలో అర్థరాత్రి సీపీ ఆకస్మిక తనిఖీలు
-
‘మమత’ వర్సెస్ గవర్నర్: తారాస్థాయికి విభేదాలు..!
కోల్కతా: వెస్ట్బెంగాల్లో మమతాబెనర్జీ ప్రభుత్వం, గవర్నర్ ఆనంద బోస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కోల్కతా నగర పోలీసు కమిషనర్ వినీత్కుమార్ను ఆ పదవి నుంచి తప్పించాలని గవర్నర్ బోస్ సీఎం మమతకు లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గవర్నర్ డిమాండ్ను మమత ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. రాజ్భవన్ను ఆనుకోని పోలీసులు ఓ కంటట్రోల్ను నిర్మించి తన కదలికలపై నిఘా ఉంచినట్లు గవర్నర్ భావిస్తున్నరని తెలుస్తోంది. దీంతో ఆయన కోల్కతా నగర పోలీసు కమిషనర్ను తప్పించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే కంట్రోల్ రూమ్ కొత్తగా నిర్మించి కాదని, రాజ్భవన్ భద్రత కోసం గత ప్రభుత్వాల హయాం నుంచే అక్కడ ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, రాజ్భవన్లో మహిళలకు రక్షణ లేదని సీఎం మమత చేసిన ఆరోపణలపై గవర్నర్ ఇప్పటికే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. -
‘ఎమ్మెల్యేలకు ఎర’పై దర్యాప్తు కొనసాగుతోంది
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తు కొన సాగు తుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మ హంతి తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడి స్తామన్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని చెప్పారు. గతేడాది అక్టో బర్లో నాటి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పైలట్ రోహిత్రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్రెడ్డిలతో మొయినాబాద్ అజీజ్నగర్లోని ఫాంహౌస్లో ముగ్గురు బీజేపీ రాయబారులు మంతనాలు జరపడం తెలిసిందే. దీనిపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సైబరాబాద్ పోలీసులు ఫాంహౌస్పై దాడి చేసి ఢిల్లీలోని ఫరీదాబాద్కు చెందిన పురోహితుడు రామచంద్రభా రతి అలియాస్ సతీష్ శర్మ, హైద రాబాద్కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజీ స్వా మిలను అరెస్టు చేశారు. మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్పై హత్యాయత్నం కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుందని సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో శ్రీనివాస్ గౌడ్పై హత్యా యత్నం కేసులో రాఘవేందర్ రాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, మున్నూ రు రవి, మధుసూదన్ రాజును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారంతా విచారణకు రావాల్సిందే..: మాదక ద్రవ్యాల కేసుల్లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్లను వదిలిపెడుతున్నా మనేది ఆరోపణ మాత్రమేనని సీపీ అవినాశ్ మహంతి స్పష్టం చేశారు. కబాలీ తెలుగు సినిమా నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి) కేసు దర్యాప్తులో ఉందని, ఈ కేసులో ఎవరినీ వద లిపెట్టబోమన్నారు. విచారణలో కేపీ చౌదరి వెల్లడించిన పేర్లలో ప్రతి ఒక్కరూ వి చారణకు రావాల్సిందేనని చెప్పారు. గోవా నుంచి హైదరాబాద్కు 82.75 గ్రాము ల కొకైన్ను తరలిస్తుండగా కేపీ చౌదరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు లో చౌదరిని విచారించగా.. డ్రగ్స్ కింగ్పిన్ ఎడ్విన్ న్యూన్స్తోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 900 మందితో సత్సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఇందులో ఓ ప్రముఖ దర్శకుడు, ఇద్దరు హీరోయిన్లు, నలుగురు మహిళా ఆర్టిస్టులున్నారు. -
ట్రైసిటీస్ లో కోలువుదీరిన కొత్త పోలీస్ బోస్ లు
-
హైదరాబాద్ కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి
-
హైదరాబాద్ కొత్త సీపీగా శ్రీనివాస్రెడ్డి: డ్రగ్స్పై వారికి వార్నింగ్
సాక్షి,హైదరాబాద్: డ్రగ్స్ ముఠాలు హైదరాబాద్ వదిలిపోవాల్ని, లేదంటే కఠిన చర్యలుంటాయని హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్(సీపీ) కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. బుధవారం(డిసెంబర్13) బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నూతన సీపీగా శ్రీనివాస్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటిదాకా సీపీగా ఉన్న సందీప్ సాండిల్య శ్రీనివాస్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కుడా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంది. సినిమా పెద్దలు మీటింగ్ పెట్టుకోవాలి. డిమాండ్ ఉన్నందునే సప్లై జరుగుతోంది. పార్టీల పేరుతో డ్రగ్స్ వాడొద్దు. కొన్ని పబ్లలో డ్రగ్స్ వాడకం జరుగుతోంది. అది వెంటనే ఆపేయాలి. తెలంగాణ స్టేట్తో పాటు హైదరాబాద్ సిటీని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఫ్రెండ్లీ పోలీస్ అనేది సరిగా అర్ధం చేసుకోవాలి.చట్టాన్ని అతిక్రమించే వారికీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు’అని సీపీ స్పష్టం చేశారు. ‘నా శక్తి సామర్థ్యాలు గుర్తించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు. ఇప్పుడు హైదరాబాద్లో ముఖ్యంగా డ్రగ్స్, జూదాన్ని నిర్ములిస్తాం. ప్రజలకు , ప్రభుత్వానికి వారధిగా మీడియా ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని మీడియా ద్వారా తెలియజేయాలని కోరుతున్నా. మహిళ వేధింపులు, ర్యాగింగ్లపై షీ టీమ్స్ పని తీరును మరింత మెరుగుపరుస్తాం’ సీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గతంలో గ్రేహౌండ్స్లో పనిచేసిన శ్రీనివాస్రెడ్డికి ముక్కుసూటి అధికారిగా పేరుంది. ఇదీచదవండి..కొత్త సర్కార్ ప్లాన్!.. సెంట్రల్లోకి స్వితా సబర్వాల్.. ఆమ్రపాలి ఇన్! -
HYD: నేను ఆరోగ్యంగానే ఉన్నా: సీపీ సందీప్ శాండిల్య
సాక్షి, హైదరాబాద్ : తాను ఆరోగ్యంగానే ఉన్నానని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఆరోగ్యం గురించి స్వయంగా వివరాలు వెల్లడిస్తున్న ఒక వీడియోను విడుదల చేశారు. తనను ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. మంగళవారం యథావిధిగా విధులకు హాజరవుతానని శాండిల్య వెల్లడించారు. కాగా, సీపీ సందీప్ శాండిల్య సోమవారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బషీర్బాగ్ పాత కమిషనరేట్లో ఉండగా సందీప్ చాతి నొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను అధికారులు హుటాహుటిన హైదర్గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శాండిల్య ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో సందీప్ శాండిల్యను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు పరామర్శించారు. ఇదీ చదవండి..ఐదేళ్ల చిన్నారి హత్య.. తల్లి మీద పగతో పొరుగింటి మహిళ ఘాతుకం -
Hyderabad: సీపీ ఆకస్మిక తనిఖీ.. బోరబండ సీఐపై వేటు
హైదరాబాద్: బోరబండ పీఎస్ను హైదరాబాద్ నగర సీపీ సందీప్ శాండిల్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం బోరబండ పోలీస్ స్టేషన్కు ఆకస్మికంగా వచ్చిన సీపీ.. సీఐ రవికుమార్ను రౌడీ షీటర్ల లెక్క అడిగారు. దీనికి సీఐ రవికుమార్ తటపటాయించారు. అసలు రౌడీ షీటర్లు ఎవరో గుర్తించు అంటూ సీఐని సీపీ వెంట తీసుకెళ్లారు. రౌడీ షీటర్ల ఇళ్లను సీఐ రవికుమార్ గుర్తించలేకపోయారు. దాంతో సీఐను సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సందీప్ శాండిల్య. పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్ ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
మీకు దండం సారూ.. మీ వల్లే నేను ఇప్పుడు బతికున్నా..
హైదరాబాద్: ఆర్పీరోడ్ లోని దర్గా ప్రాంతం..ఆదివారం ఉదయం..కొద్దిసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అక్కడ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం వస్తున్నారు. బందోబస్తులో భాగంగా మహంకాళి ఏసీపీ రవీందర్తో పాటు మిగతా పోలీసులు, నాయకులు అక్కడ ఉన్నారు. ఇంతలో ఓ మహిళ దూరం నుంచి పరుగెత్తుకుంటూ..అయాసపడుతూ వారి దగ్గరకు వచ్చింది. పోలీసులతో పాటు అందరూ ఏమైందా, అని కంగారు పడ్డారు. కానీ వచ్చీ రావడంతోనే ఆ మహిళ ఏసీపీ రవీందర్ వద్దకు వెళ్లి ‘మీకు దండం సారూ..మీ వళ్లే నేను ఇప్పుడు బతికున్నా..మీరు చేసిన సహాయం మరచిపోలేను..అప్పుడు ఆపరేషన్ చేయించడం వల్లే ప్రాణాలతో ఉన్నా అంటూ ఆయాసపడుతూ చెప్పింది. వెంటనే అక్కడున్న వాళ్లు ఆమెను కొద్దిసేపు కూర్చోబెట్టి మంచి నీళ్లు తాగించి..ఏమైందంటూ ఆరాతీయగా...తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో ఉన్న ఆమెకు ప్రస్తుత మహంకాళి ఏసీపీ రవీందర్ సొంత డబ్బుతో ఆస్పత్రిలో చేరి్పంచి ఆపరేషన్ చేయించిన సంగతి చెప్పింది. 2014 సంవత్సరంలో టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్లో రవీందర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. రోడ్డు పక్కన కార్వాన్కు చెందిన కవిత అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేర్పించి సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించగా పూర్తి ఆరోగ్యంతో బయటపడింది. ఆ తర్వాత మళ్లీ ఆయన ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లడంతో కలవలేకపోయింది. ఆదివారం ఆమె కార్వాన్ నుంచి ఆర్టీసీ బస్సులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళుతుంది. బస్సులో నుంచి బందోబస్తు విధుల్లో ఉన్న ఏసీపీ రవీందర్ను చూసి..గుర్తించి బస్సు ఆపాలని డ్రైవర్ను కోరింది. కానీ డ్రైవర్ ఆపకుండా ప్యాట్నీ సిగ్నల్ వరకు వెళ్లాడు. సిగ్నల్ దగ్గర బస్సు ఆగడంతో ఆమె బస్సు దిగి పరుగెత్తుకుంటూ దర్గా వరకు వచి్చంది. వచ్చీ రావడంతో ఆయనకు దండాలు పెడుతూ కన్నీరు పెట్టింది. మీ వల్లే ఈ రోజు ప్రాణాలతో ఉన్నా సారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. మీరు కలుస్తారో లేదో అనుకుంటూ పరుగెత్తుకొచ్చాను అంటూ చెప్పుకొచి్చంది. మీరు ఇంకా పెద్ద పోస్టులోకి రావాలి, ఎమ్మెల్యే అంత ఎదగాలి సారూ అంటూ కృతజ్ఞతాభావాన్ని చాటింది. ‘నా అన్న కోసం వెండి రాఖీ కొని తీసుకుని వచ్చి కడతా’ అంటూ చెప్పింది. అంతే కాకుండా తన ఫోన్లో భద్రపరుచుకున్న ఏసీపీ ఫొటోను చూపించి ఆశ్చర్య పరిచింది. ఈ సంఘటన చూసిన పోలీసులు, మీడియా ప్రతినిధులు, నాయకులు అందరూ ఆ మహిళ కృతజ్ఞతాభావాన్ని, ఏసీపీ మానవతా దృక్పథాన్ని అభినందించారు. -
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతో సీపీ రంగనాథ్ సమావేశం
-
ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం: తండ్రి నరేందర్
సాక్షి, వరంగల్: కేఎంసీ మెడికో ప్రీతి మృతి విషయంలో తమకు అనుమానాలు ఉన్నాయంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్న ఆమె కుటుంబ సభ్యులు.. తాజాగా ఇవాళ మరో ప్రకటన చేశారు. ఆమెది ఆత్మహత్యేనని నమ్ముతున్నట్లు ప్రీతి తండ్రి నరేందర్ మీడియా ముందు ప్రకటించారు. వరంగల్ సీపీతో భేటీ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి మృతి కేసులో పోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా ఆమెది ఆత్మహత్యేనని శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. వారం, పదిరోజుల్లో ఛార్జ్షీట్ వేయనున్నట్లు కూడా తెలిపారాయన. అయితే.. ఈ ప్రకటన తర్వాత కూడా ప్రీతి మృతిపై కుటుంబ సభ్యులు పాత మాటే చెప్పుకొచ్చారు. కానీ, శనివారం ప్రీతి తండ్రి నరేందర్, సోదరుడు పృథ్వీ వరంగల్ సీపీ రంగనాథ్ను కలిశారు. ప్రీతి మృతిపై వాళ్ల అనుమానాలను ఆయన నివృత్తి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లు.. మీడియాతో మాట్లాడారు. ప్రీతిది ఆత్మహత్యేనని నమ్ముతున్నాం. ఛార్జ్షీట్లో ఇంకా కొందరి పేర్లు చేరుస్తామని సీపీ చెప్పారు. కేఎంసీ ప్రిన్సిపాల్, హెచ్వోడీల బాధ్యతా రాహిత్యం ఉందని భావిస్తున్నాం అని ప్రీతి తండ్రి నరేందర్ మీడియాకు తెలిపారు. ప్రీతి మృతికి కారణమైన సిరంజీ దొరికింది. ఆమె శరీరంలో విష పదార్థాలు ఉన్నట్లు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వచ్చిందని సీపీ మాతో అన్నారు. రిపోర్ట్ మాత్రం చూపించలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని మేం కోరాం అని ప్రీతి తండ్రి నరేందర్ తెలిపారు. -
ప్రీతి సూసైడ్కు అతడే కారణం: సీపీ రంగనాథ్
సాక్షి, వరంగల్: కాకతీయ మెడికల్ కాలేజీ మెడికో ధారవత్ ప్రీతి నాయక్ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. ఆమెది ఆత్మహత్యేనని ప్రకటించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్. ఈ మేరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని ప్రకటించారాయన. ప్రీతిది ఆత్మహత్యేనని స్పష్టం చేసిన ఆయన.. ఇందుకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నాం. ఐపీసీ సెక్షన్ 306 కింద చర్యలు తీసుకుంటున్నాం. ప్రీతి ఆత్మహత్య కు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన కారణం. వారం పదిరోజుల్లో చార్జి షీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్కు వరంగల్ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని సైఫ్ బెయిల్ ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. సైఫ్కు బెయిల్పై విడుదలైన మర్నాడే ప్రీతి సూసైడ్ కేసులో వరంగల్ సీపీ కీలక ప్రకటన చేయడం గమనార్హం. ఇదీ చదవండి: నరబలి కాదు.. ఆర్థిక వివాదాలే కారణం -
హైదరాబాద్లో డ్రగ్స్ను రూపుమాపడమే లక్ష్యం: సీపీ సీవీ ఆనంద్
-
9 కోట్ల విలువైన గంజాయిని తగుల బెట్టిన విశాఖ పోలీసులు
-
హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
డ్రగ్స్ కేసులో కీలక నెట్వర్క్ చేధించాం..!
-
Sajay Pandey: ఆటోలో ఈడీ విచారణకు మాజీ సీపీ
ఢిల్లీ: అత్యున్నత అధికారిగా ప్రభుత్వం నుంచి మన్ననలు, నిజాయితీపరుడిగా ప్రజల నుంచి పొగడ్తలు అందుకున్నారాయన. అలాంటి వ్యక్తి.. సాదాసీదాగా ఈడీ విచారణకు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ముంబై మాజీ కమిషనర్ సంజయ్ పాండే మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. ఒంటరిగా ఆటోలో ఢిల్లీ ఈడీ కార్యాలయానికి సంజయ్ పాండే చేరుకోవడం.. ఒక్కరే విచారణను ఎదుర్కోవడం.. ఈడీ ప్రాంగణంలో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) కో-లొకేషన్ స్కామ్కు సంబంధించి విచారణ కోసం ఆయన హాజరయ్యారు. వారం కిందటే.. ఆయన ముంబై పోలీస్ కమిషనర్గా రిటైర్డ్ అయిన విషయం తెలిసే ఉంటుంది. రెండున్నర గంటలపాటు ఆయన్ని ప్రశ్నించింది ఈడీ.. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్లోని క్రిమినల్ సెక్షన్స్-50 ప్రకారం ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఐసెక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కార్యకలాపాల గురించి ఆయన్ని ప్రశ్నించింది ఈడీ. ఎన్ఎస్ఈ సెక్యూరిటీ అడిట్కు సంబంధించి.. కో-లొకేషన్ ఇర్రెగ్యులారిటీస్ ఈ కంపెనీలోనూ చోటు చేసుకున్నాయి. పైగా ఈ కంపెనీని పాండేనే 2001 మార్చిలో స్థాపించారు. 2006లో దాని డైరెక్టర్గా రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన తల్లికుమారుడు.. ఆ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్ను 2018 నుంచి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 1986 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన సంజయ్ పాండే.. ఐఐటీ-కాన్పూర్ గ్రాడ్యుయేట్. హర్వార్డ్ యూనివర్సిటీలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు. బాంబే అల్లర్ల సమయంలో డీసీపీగా ఆయన తెగువ.. ప్రజల నుంచి మన్ననలు అందుకునేలా చేసింది. ఆర్థిక నేరాల విభాగం తరపున 1998లో కోబ్లర్ స్కామ్ ఆయన్ని వివాదంలోకి నెట్టింది. ఆపై సెంట్రల్డిప్యూటేషన్ మీద పీఎం సెక్యూరిటీ యూనిట్కు ఆయన ఎటాచ్ అయ్యారు. ముంబై కమిషనర్గా మాత్రమే కాదు.. మహారాష్ట్రకు తాత్కాలిక డీజీపీగానూ విధులు నిర్వహించారు కూడా. అయితే పోలీసులు విధులకు రాజీనామా చేసిన తర్వాతే ఆయన కంపెనీని స్థాపించగా.. అప్పటి ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించకపోవడంతో తిరిగి విధుల్లో చేరారు. సమర్థవంతుడైన ఆఫీసర్గా పేరున్న సంజయ్ పాండే.. ఈడీ విచారణ ఎదుర్కోవడంపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. -
బెంగళూరు నగర పోలీస్ కమిషనర్గా సీహెచ్ ప్రతాప్రెడ్డి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్గా తెలుగు సీనియర్ ఐపీఎస్ సీహెచ్ ప్రతాప్రెడ్డి పగ్గాలు చేపట్టబోతున్నారు. ఆయనను సీపీగా నియమిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులిచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ప్రతాప్రెడ్డి 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గతంలో బెంగళూరు నగర అదనపు కమిషనర్గా పని చేశారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఉన్నారు. బీటెక్ పూర్తిచేసి ఐపీఎస్ అయిన ప్రతాప్రెడ్డి మొదట హాసన్ జిల్లా అరసికెరె ఏఎస్పీగా, తరువాత పలు జిల్లాల ఎస్పీగా, కొంతకాలం బెంగళూరు – ముంబయి సీబీఐ విభాగంలో విధులు నిర్వర్తించారు. సైబర్ సెక్యూరిటీ విభాగంలో కీలక పాత్ర పోషించారు. విశిష్ట సేవలకు రాష్ట్రపతి, సీఎం మెడళ్లను అందుకున్నారు. ఆయన మంగళవారం కొత్తబాధ్యతలు తీసుకుంటారు. చదవండి: (ఆత్మహత్య వెనుక హనీట్రాప్) -
తెరపైకి ఆ పోలీస్ కమీషనర్ బయోపిక్..
Mumbai Former Police Commissioner Rakesh Maria Biopic By Rohit Shetty: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి యాక్షన్ అండ్ కామెడీ సినిమాలకు పెట్టింది పేరు. ఇటీవల అక్షయ్ కుమార్తో సూర్యవంశీ తెరకెక్కించి హిట్ కొట్టాడు. అమెజాన్ ఓటీటీ కోసం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనె వెబ్ సిరీస్ను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శెట్టి మరో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. అది కూడా ముంబై ఎక్స్ పోలీస్ కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్ను తెరకెక్కించనున్నాడు రోహిత్. రాకేష్ మారియా తన కెరీర్లో సాధించిన విజయం ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ బయోపిక్ను తెరకెక్కిస్తున్నట్లు రోహిత్ శెట్టి అధికారికికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రోహిత్ శెట్టి మాట్లాడుతూ 'రాకేష్ మారియా తన 36 ఏళ్ల అద్భుతమైన ఉద్యోగ ప్రయాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆయన 1993 ముంబైలో జరిగిన పేలుళ్ల నుంచి అండర్ వరల్డ్ ముప్పు, 2008లోని 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు ఎన్నో చూశారు. నిజ జీవితంలోని ఈ సూపర్ కాప్ ధైర్య, సాహసాల ప్రయాణాన్ని తెరపైకి తీసుకురావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను.' అని తెలిపారు. కాగా ఐపీఎస్ అధికారి అయిన రాకేష్ మారియా 1981వ బ్యాచ్ నుంచి సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 1993లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా (ట్రాఫిక్) ఉన్న రాకేష్ మారియా ముంబై వరుస పేలుళ్ల కేసును ఛేదించారు. తర్వాత ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్కు డీసీపీగా, ఆ తర్వాత జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారిగా మారారు. 2008లో 26/11 ముంబై దాడులను పరిశోధించే బాధ్యతను కూడా మారియాకు అప్పగించారు. చదవండి: ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం ! అల్లు అర్జున్కు నెట్ఫ్లిక్స్ స్పెషల్ విషెస్.. దేనికంటే ? -
ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు కఠినం చేస్తాం: ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్
-
నో పార్కింగ్.. నో కార్.. పోలీస్ కమిషనర్ ట్వీట్తో కలకలం
ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే చేసిన ట్వీట్ ఒకటి వాహనదారుల్లో కలకలం సృష్టించింది. అనేకానేక చర్చలకు దారి తీసింది. ముంబై రహదారులపై విపరీతంగా పెరుగుతున్న వాహనాల నేపథ్యంలో, ‘పార్కింగ్ స్థలం లేని వ్యక్తులకు కార్లను అమ్మకూడదు.. అంటే నో పార్కింగ్, నో కార్ పద్ధతిని ముంబైలో ప్రవేశపెడితే ఎలా ఉంటుంది..?’ అని సంజయ్ పాండే ట్వీట్ చేశారు. ముంబైలో ప్రతి రోజూ 600 కొత్త కార్లు నమోదవుతున్నాయనీ, వీటితో పాటు అసంఖ్యాక ట్యాక్సీలు, ఇతర వాహనాలు ఉన్నాయనీ, వీటన్నింటి వల్ల నగరంలో విపరీతమైన వాహనాల రద్దీ ఏర్పడుతోందని, అందుకే ఏదో ఒక ఉపాయం చేయాల్సి ఉంటుందనీ, నో పార్కింగ్, నో కార్ పద్దతిని అమలుచేస్తే ఎలా ఉంటుందోనని యోచిస్తున్నామనీ ఆయన అన్నారు. కాగా, పోలీస్ కమిషనర్ చేసిన ఈ ప్రతిపాదనకు తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతోంది. ముంబైలో దాదాపు 80 శాతం ప్రజలు చాల్స్లో, మురికివాడల్లో నివాసముంటున్నారనీ, వారికి పార్కింగ్ స్థలం ఎక్కడి నుంచి వస్తుందనీ, సుమారు 40 శాతం వాహనాలు రోడ్ల పైనే పార్కింగ్ చేస్తారనీ, ప్రభుత్వమే చవక ధరల్లో పార్కింగ్ స్థలాలని పే అండ్ పార్క్ పద్ధతిలో ఏర్పాటు చేయాలనీ, అందుకోసం ప్రతి ప్రాంతంలో పార్కింగ్ భవనాల నిర్మాణం కొనసాగించాలనీ పలువురు సూచించారు. ప్రత్యామ్నాయమార్గం చూడాలి.. మొబిలిటీ ఫోరంకు చెందిన అశోక్ దాతార్ మాట్లాడుతూ, ముంబైలో నో పార్కింగ్ నో కార్ పద్ధతి అమలు చేయడం అసాధ్యమనీ, వేరే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ అన్నారు. నిజానికి నో పార్కింగ్ నో కార్ ప్రతిపాదన ఇప్పటిది కాదు.. పార్కింగ్ సమస్య ఎంత పాతదో ఈ ప్రతిపాదన కూడా అంతే పాతది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రతిపాదన సర్కారీ ఫైళ్ళల్లో మగ్గుతోంది. కాగా, గత పది సంవత్సరాల్లో ముంబైలో 107 శాతం వాహనాల సంఖ్య పెరిగిందనీ, ఈ సంఖ్య భస్మాసుర హస్తంగా మారక ముందే ఏదో ఒకటి చేయాలనీ, పోలీస్ కమీషనర్ సంజయ్ పాండే అభిప్రాయపడ్డారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయమనీ, నేను కూడా ఒక ముంబైకర్నే అని, నేను రోడ్పై సౌకర్యవంతంగా కారు నడిపించాలని కోరుకుంటున్నాననీ ఆయన అన్నారు. ప్రస్తుతం ముంబైలో ఒక కిలోమీటర్ పరిధిలో 2,100 వాహనాలున్నాయి. గత పది సంవత్సరాల్లో 107 శాతం వాహనాలు పెరిగాయి. కార్ల సంఖ్య 92 శాతం పెరిగింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 121 శాతం పెరిగాయి. వాహనాల రద్దీని అరికట్టేందుకు గతంలో కూడా పలు సూచనలు వచ్చాయి. అందులో 1. నో పార్కింగ్ నో కార్ పద్ధతి 2. రెండవ కారుపై అధికంగా రోడ్ ట్యాక్స్ విధించడం, 3. కారు యజమానులపై అధికంగా ఇంధన ట్యాక్స్ విధించడం, 4. మార్కెట్ ప్రాంతంలో పార్కింగ్ రేట్లను బాగా పెంచడం. కానీ ఈ సూచనలేవీ ఇంతవరకు అమలులోకి రాలేదు. వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. -
ఇది చాలా విషాదకరమైన సంఘటన: సీవీ ఆనంద్
-
విశాఖ పాప కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెల్లడి
-
‘కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులన్నీ ఫిబ్రవరి 15 లోపు పూర్తవ్వాలి’
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో నిర్మాణం జరుగుతున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు ఫిబ్రవరి 15 వరకు పూర్తవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అదేశించారు. ఫిబ్రవరి నెలలో మెయిన్ కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించాలని సీఎం నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ భవన పనులను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పరిశీలించారు. అనంతరం ఆయన ఆర్అండ్బి ఈఎన్సి గణపతి రెడ్డి, ఇతర అధికారులతో కలిసి రివ్యు సమావేశాన్ని నిర్వహించారు. భవనానికి కావాల్సిన ఫర్నిచర్ పై ఆయన పరిశీలించడంతో పాటు పెండింగ్ పనులన్నీ ఫిబ్రవరి 15 లోపు పూర్తవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. -
సీపీ నాగరాజు డైరెక్షన్లోనే దాడి
సాక్షి,హైదరాబాద్: నిజామాబాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు తనను హత్య చేయించేందుకు కుట్రపన్నారని, ఆయన డైరెక్షన్లోనే టీఆర్ఎస్ సర్కార్ తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. తనపై దాడి జరిగిన వైనాన్ని మంత్రి కేటీఆర్ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి పర్యవేక్షించారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ..తనపై జరిగిన హత్యాయత్నాన్ని, కమిషనర్, ఇతర అధికారుల తీరుపై లోక్సభ స్పీకర్కు, ప్రివిలేజెస్ కమిటీకి, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు, రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ, హోం కార్యదర్శులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దాడి ఘటనలో తనను కాపాడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసేందుకు వెళ్తే టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. దాడులకు భయపడం: విజయశాంతి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ సర్కార్.. గూండా రాజకీయాలకు తెరతీసిందని, ఈ దాడులకు భయపడేది లేదని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ధ్వజమెత్తారు. -
జీవితం చిన్నది కాదు.. మీ కుటుంబం మీకోసం ఇంట్లో వేచి ఉంది..
సాక్షి, సిద్దిపేట: రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కొంతమంది తమకేం కాదంటూ హెల్మెంట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవతున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ‘కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట’ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘దయచేసి హెల్మెట్ ధరించండి.. జీవితం చిన్నది కాదు, హెల్మెట్ ధరించి ఎక్కువ కాలం జీవించండి. మీ కుటుంబం మీ కోసం ఇంట్లో వేచి ఉంది’ అని కామెంట్ జతచేశారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో.. ఓ మహిళ బైక్ నడుపుతూ వెళుతోంది. అకస్మాత్తుగా ఓ వ్యక్తి కారు యూటర్న్ చేద్దామని తిప్పడంతో ఆమె ఆ వాహనాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆమె హెల్మెట్ ధరించడంలో ప్రమాదం తప్పింది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. #Please_Wear_Helmet Life will not be short, wear a helmet live longer.. your family is waiting for you at home. pic.twitter.com/lfXnxECo95 — Commissioner of Police, Siddipet (@siddipetcp) January 7, 2022 -
మెగా హీరోను వదలని యాక్సిడెంట్ కేసు.. త్వరలోనే ఛార్జ్షీట్
Sai Dharam Tej Bike Accident Case: CP To File Chargesheet Over His Rash Driving: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కేసు మరోసారి తెరమీదకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి నోటీసులు జారీ చేసిన పోలీసులు తాజాగా సాయితేజ్పై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. సైబరాబాద్లో జరిగిన ప్రెస్మీట్లో కమిషనర్ స్టీఫెన్ రవింద్ర మాట్లాడుతూ.. 'హీరో సాయిధరమ్ తేజ్కు జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి, అతడు కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చాం. లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్,పొల్యూషన్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వాలని కోరాం. కానీ అతడి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. దీంతో త్వరలోనే సాయితేజ్పై ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం' అని సీపీ వెల్లడించారు. కాగా కేబుల్ బ్రిడ్జి సమీపంలో సెప్టెంబర్10న సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇటీవలె ప్రమాదం నుంచి కోలుకున్న తేజ్ ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టాడు. -
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియామకం
-
పోలీసులకు రోజూ రెండు గంటలు సైకిల్ గస్తీ తప్పనిసరి: కమిషనర్
సాక్షి, చెన్నై: జీపులు, మోటారు సైకిళ్లను పక్కన పెట్టి సైకిల్పై గస్తీ వెళ్లేందుకు నగర పోలీసులు రెడీ అయ్యారు. ఇందుకోసం ఒక్కో స్టేషన్కు 4 చొప్పున సైకిళ్లను పంపిణీ చేశారు. రోజుకు 2 గంటలు సైకిల్ గస్తీ తప్పనిసరి చేస్తూ కమిషనర్ శంకర్జివ్వాల్ ఆదేశించారు. నగరంలో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రెండు గంటల పాటు తమ పరిధిలో సైకిల్ టీం గస్తీ నిర్వహించనున్నారు. తద్వారా నేరగాళ్లను పట్టుకునేందుకు వీలుంటుంది. చదవండి: (ట్రాఫిక్ కష్టాలు తీరేలా.. 2023కల్లా ‘కోస్టల్ రోడ్’ పూర్తి..) -
కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన.. సీపీ చర్యలు
సాక్షి, గౌలిపురా: భవానీనగర్ పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ కె.ఎన్.శివ కుమార్పై వేటు పడింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను సీఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వాహనదారునిపై దురుసుగా ప్రవర్తించడంతో కానిస్టేబుల్ కె.ఎన్.శివ కుమార్పై నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. శనివారం రాత్రి తలాబ్కట్టా రోడ్డులో బందోబస్తు నిర్వహిస్తున్న కె.ఎన్.శివ కుమార్కు ఓ వాహనదారుడితో వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య వాదోపవాదం తీవ్రస్థాయికి చేరడంతో పాటు వాహనదారుని ఎడమ కన్నుకు గాయమైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి భవానీనగర్ పోలీస్స్టేషన్కు చేరుకొని ఆందోళన నిర్వహించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సంఘటనపై విచారణ చేపట్టిన అధికారులు కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు. చదవండి: బురిడీ బాబాల నిర్వాకం: పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి -
విజయవాడ లో కర్ఫ్యూ ఎలా నడుస్తోంది ?
-
నకిలీలతో జాగ్రత్త.. మందులు కొనేముందు ‘6 పీ’ సరి చూసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: సెకండ్ వేవ్లో కరోనా రోజు రోజుకూ పెరుగుతోందని కొత్వాల్ అంజనీకుమార్ అన్నారు. ఈ నేపథ్యంలోనే రెమిడెసివర్ వంటి ఔషధాలకు డిమాండ్ పెరగడంతో కొందరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేరం చేస్తున్న 40 మందికి పైగా నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్టు చేశామని తెలిపారు. ఈ చీకటి దందాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియజేయండని కోరారు. ఈ పరిస్థితుల్లో నకిలీ మందులు కూడా మార్కెట్లోకి వస్తాయన్నారు. వీటి నుంచి తప్పించుకోవడానికి అంతర్జాతీయంగా అమలులో ఉన్న ’6 పీ’ లను తెలుసుకోవాలి... వాటిని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. అందులోని వీడియోలో ఆయన పేర్కొన్న అంశాలివి.. ‘ ’ ► పీ1: ప్లేస్... దీని ప్రకారం అపరిచిత వెబ్సైట్ల నుంచి మందుల్ని ఖరీదు చేయకూడదు.అధీకృత మెడికల్ షాపు, ఫార్మాసిస్టు నుంచే ఖరీదు చేయాలి. ► పీ2: ప్రిస్క్రిప్షన్...రిజిస్టర్డ్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మందులు కొనండి. ► పీ3: ప్రామిసెస్... కొందరు వైద్యులు, మందుల దుకాణం యజమానులు ఈ మందు చాలా పవర్ఫుల్ అంటూ హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ మాయలో పడకుండా వాడాల్సిన మందుల్నే ఖరీదు చేయాలి. ► పీ4: ప్రైస్... ఆయా మందులపై ముద్రించిన ఎమ్మార్పీ మొత్తాన్నే చెల్లించాలి. అంతకు మించి ఎవరైనా డిమాండ్ చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ► పీ5: ప్రైవసీ... మీకు ఇంటర్నెట్లో ఏదైనా ఔషధం తదితరాలు ఖరీదు చేస్తుంటే ఎక్కడా మీ క్రెడిట్/డెబిట్ కార్డులకు సంబంధించిన రహస్య సమాచారం పొందుపర్చొద్దు. అది సైబర్ నేరాలకు దోహదం అవుతుంది. ► పీ6: ప్రొడక్ట్...ఏదైనా వస్తువును ఆన్లైన్లో ఖరీదు చేసే ముందు మీకు తెలిసిన వారిలో అప్పటికే దాన్ని ఖరీదు చేసిన వాళ్లు ఎవరైనా ఉంటే వారి సలహాలు, సూచనలు తీసుకోండి. Follow 6 Ps and be safe . Buy medicine at authorized place only. Your safety is most important for us. pic.twitter.com/AjcdezPjh1 — Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) April 28, 2021 ( చదవండి: స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్సిజన్ సిలిండర్ల దందా ) -
మనిషి మాత్రమే మరో మనిషికి దానం..
సాక్షి, హైదరాబాద్: ప్లాస్మా దానం చేసి ప్రాణాలను రక్షించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మరోసారి పిలుపునిచ్చారు. కమిషనరేట్ పరిధిలోని సిబ్బంది ఇప్పటివరకూ 150మందికి పైగా పోలీస్ అధికారులు ప్లాస్మా దానం చేశారని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ‘మనిషి మాత్రమే మరో మనిషికి దానం చేయగలడు. మీకు సహాయం చేయడానికి సిటీ పోలీసులు ఉన్నారు. ప్లాస్మా విరాళం వాట్సాప్ కోసం లేదా 9490616780కు కాల్ చేయండి’అని కోరారు. కాగా కరోనా వైరస్తో బాధపడుతున్న రోగులకు మరొకసారి పునర్జన్మనిచ్చేందుకు రక్తదానం దోహదపడుతుందని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు నగర పోలీసులు తమ తరపున ప్లాస్మా అందచేస్తుందన్నారు. -
అంకుల్ సలహానే టర్నింగ్ పాయింట్..
సాక్షి, విశాఖపట్నం: ఎటువంటి బాల్ నైనా కూల్గా బౌండరీ దాటించే ఈ కెప్టెన్ ఆటలో ఎపుడూ అసహనం కనిపించదు. లక్ష్యం వైపే గురి.. అవరోధాలను అవలీలగా అధిగమించి విజయం సాధించే గడుసరి. అపుడు క్రికెట్ కెప్టెన్గా – ఇపుడు సిటీ పోలీసు టీమ్ కెప్టెన్గా ఒకటే పనితీరు– కూల్.. కూల్. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యనైనా– తనదైన స్టైల్లో సామరస్యంగా పరిష్కరించడం.. తప్పు జరిగితే తుప్పు వదిలించడం కూడా ఆయనకే సాధ్యం. కెరీర్ ‘సరిలేరు నీకెవ్వరూ’– అంటూ సాగుతున్న సిటీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా హృదయరాగం ఈ సండే స్పెషల్. టర్నింగ్ పాయింట్ ప్రాథమిక స్థాయి నుంచే టాపర్గా ఉన్న ఆర్.కె.మీనా ఇంటర్ నుంచి కామర్స్ సబ్జెక్ట్పై ఆసక్తి పెంచుకున్నారు. కామర్స్లోనే ఇంటర్, డిగ్రీ, పీజీ (ఎం.కామ్) పూర్తి చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం కూడా పొందారు. అలా ఢిల్లీలో ఉద్యోగం చేస్తూ.. జీవితం సాగిపోతున్న వేళ.. ఆయన మామయ్య భగవత్ ప్రసాద్ మీనా ఇచ్చిన సలహా సీపీ జీవితాన్నే మార్చేసింది. ఆర్.కె.మీనాకు సమస్యలపై స్పందించే గుణం ఉండడం, సామాజిక పరిస్థితులు, స్థితిగతులు, జనరల్ నాలెడ్జ్, సేవాతత్వం, రాజకీయ పరిణామాలపై ఆసక్తి ఉండటాన్ని ఆయన గమనించారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా ఆయన ప్రస్థానం ఆగిపోకూడదని భావించి.. ‘సివిల్స్ సాధించే సత్తా నీలో ఉంది.. సివిల్స్కు ప్రిపేర్ అవ్వు.. ఐపీఎస్ సాధించు‘ అని ఆర్.కె.మీనాకు సలహా ఇచ్చారు. ఆయన సలహానే ‘స్ఫూర్తిగా’ తీసుకుని సివిల్స్లో ఆర్.కె.మీనా ఉత్తమ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయ్యారు. ఉత్తమమైన పని తీరు కనబరుస్తూ.. అందరిచేత ప్రశంసలు పొందారు. అడిషనల్ డీజీగా పదోన్నతి పొందిన రాజీవ్కుమార్ మీనా విశాఖ సీపీగా తన ముద్ర వేసుకున్నారు. కుటుంబ నేపథ్యం ఆర్.కె.మీనా తల్లిదండ్రులు దప్పోదేవి మీనా, భగవాన్ సాహీ మీనా. అతని తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. తమ్ముడు ఢిల్లీలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. పెద్ద చెల్లి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్గా, చిన్న చెల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. ఆయనది వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆర్.కె.మీనా తాతయ్యకు వ్యవసాయం అంటే ఇష్టం. అప్పుడప్పుడు ఈయన కూడా తాతకు వ్యవసాయంలో సాయం చేసేవారు. మీనాకు పశువుల పెంపకం అంటే ఇష్టం. ఉద్యోగ బాధ్యతలు చూసుకుంటూనే.. వాటి పెంపకం చేపడుతున్నారు. విద్యాభ్యాసం ఆర్.కె.మీనా సొంత గ్రామం రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ పట్టణం. అల్వార్లోని ప్రభుత్వ నెహ్రూ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతి నుంచి 10 వరకు అల్వార్లోని ప్రతాప్ సెకండరీ స్కూల్, ఇంటర్ యశ్వంత్ హైయర్ సెకండరీ స్కూల్, డిగ్రీ, పీజీలు రాజ్ రిషి కళాశాలలో పూర్తి చేశారు. యు.కె.లోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఇన్ పబ్లిక్ అడ్మినిష్ట్రేషన్ చదివారు. అనామికాతో కల్యాణం ఇన్కమ్ ట్యాక్స్ అధికారి పనిచేస్తున్న సమయంలోనే జైపూర్కు చెందిన అనామికా మీనాను సీపీ వివాహం చేసుకున్నారు. ఆమె ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. క్రికెట్, ఫుట్బాల్, రన్నింగ్ అంటే ఇష్టం ఆర్.కె.మీనాకు అవుట్డోర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఆయన ఎక్కువగా ఆటలు ఆడేవారు. స్కూల్, కాలేజీల్లో ఫుట్బాల్, క్రికెట్ జట్లకు కెప్టెన్గా వ్యవహరించేవారు. పరుగుపందెంలో ఎన్నో బహుమతులు సాధించారు. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణలో ఉన్నప్పుడు రన్నింగ్లో(10కె) మొదటి బహుమతి గెలుపొందారు. తెలుగులో శ్రీరామదాసు సినిమా ఇష్టం శ్రీ రామదాసు సినిమా అంటే చాలా ఇష్టం. అందులో హీరో నాగార్జున నటన చాలా బాగుంటుంది. సంగీతం కూడా అద్భుతం. నేను ఖమ్మం ఎస్పీగా ఉన్న సమయంలో ఆ సినిమా ఆడియో రిలీజ్ భద్రాచలంలో నాచేతుల మీదుగా జరిగింది ఈ సినిమా రిలీజ్ బెనిఫిట్ షోకి వెళ్లాను. సినిమా చూసిన వెంటనే హీరో నాగార్జునకి ..మూవీ బావుందని చెప్పాను. ముంబై లాంటిది విశాఖ.. 2014 సంవత్సరంలో 16వ బెటాలియన్ ఐజీగా పనిచేస్తున్నప్పుడు విశాఖజిల్లా ఆనందపురం మండలంలోని పేకేరు గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. అప్పటి నుంచి విశాఖ నగరమంటే అమితమైన ప్రేమ. ఉద్యోగ జీవితంలో చాలా చోట్ల పని చేశాను. ...నాకు నచ్చిన ప్రాంతం విశాఖనగరం. ఇది ఓ అందమైన నగరం. దేశ ఆర్థిక రాజధాని ముంబై తరహా అన్ని వనరులున్న ఏకైక నగరం ఇది. అంకుల్ సలహానే టర్నింగ్ పాయింట్ సామాజిక పరిస్థితులు, రాజకీయాలపై నాకున్న అవగాహన గమనించిన మామయ్య భగవత్ మీనా ప్రసాద్.. సివిల్స్ సాధించే సత్తా నాలో ఉందని స్ఫూర్తి నింపారు. ఆయన ఇచ్చిన సలహాలతోనే ఇన్కమ్ ట్యాక్ ఆఫీసర్గా ఉన్న నేను.. సివిల్స్కు ప్రిపేర్ అయి ఐపీఎస్ సాధించాను. హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తారు ఆర్.కె.మీనా హిందీ సినిమాలు ఎక్కువగా చూస్తారు. అయితే ఇష్టమైన సినిమా మాత్రం రాజస్థానీ(హిందీ) మూవీ ‘ఖామోషీ’. హీరో సంజీవ్ కుమార్, హీరోయిన్ వహీదా రెహమాన్లకు ఆయన అభిమాని. సమర్థ పనితీరుకు ప్రశంసలు ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ములుగుకు ఏఎస్పీగా తొలుత బాధ్యతలు స్వీకరించాను. తర్వాత నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబాబాద్, ఖమ్మంలో కూడా పనిచేశాను. అనంతరం యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్లో డైరెక్టర్గా కూడా విధులు నిర్వర్తించాను. ఆ సమయంలో సమర్థవంతమైన విధులు నిర్వహించినందుకు గానూ ప్రశంసలు పొందాను. నా ఉద్యోగ జీవితంలో ఆ క్షణాలు మరిచిపోలేను’ అని సీపీ గుర్తు చేసుకున్నారు. తప్పుదారి పడుతున్న సమాజాన్ని సన్మార్గంలో నడిపించే నాయకులను ఆయన ఆరాధిస్తారు. సీపీకు బి.ఆర్.అంబేడ్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అంటే అమితమైన గౌరవం. అదే తరహాలో సమాజంలో మార్పునకు విశేష కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అంటే అభిమానం, ఇష్టమని సీపీ తెలిపారు. బెస్ట్ ఫ్రెండ్ ఉమేష్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న సమయంలో సహచర ఉద్యోగి ఉమేష్కుమార్తో ఆయనకు స్నేహం ఏర్పడింది. ఆర్.కె.మీనాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయనే. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏదైనా సమస్య గానీ, ఆలోచన గానీ, సంతోషంగానీ కుటుంబ సభ్యుల తర్వాత ఆయనతోనే పంచుకుంటారు. గ్రామాల దత్తత ఆర్.కె.మీనా ఢిల్లీలో ఐటీ మంత్రికి పీఎస్గా పనిచేస్తున్న సమయంలో అల్వార్ మండలంలో రెండు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆ రెండు గ్రామాల్లో ప్రజలకు విద్య, వైద్య భవనాల నిర్మాణం, పిల్లల చదువులకు పుస్తకాలు, పాఠశాలకు సామగ్రి అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014లో 16వ బెటాలియన్ ఐజీగా పని చేస్తున్నప్పుడు విశాఖ జిల్లాలో ఆనందపురం మండలంలోని పీకేరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. యువతా మేలుకో.. ‘చేతనైతే సాయం చేయి.. సాయం చేసే వారిని విమర్శించొద్దు’. అని ఆర్.కె.మీనా పిలుపునిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో పేదలకు సాయం చేసిన దాతలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. ‘సమయాన్ని వృథా చేసుకోకుండా.. నిజాయితీతో పనిచేయండి. కష్టపడి లక్ష్యాన్ని చేరుకోండి.. లక్ష్యసాధనలో గెలుపు మనదైతే.. పది మందికి సాయం చేసే స్థాయికి మనం ఎదుగుతాం’ అని ఆర్.కె.మీనా యువతకు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు: దప్పో దేవి మీనా, భగవాన్ సాహి మీనా భార్య: అనామికా మీనా పిల్లలు: హర్షుల్ మేవాల్ (ఐఐటీ ఢిల్లీ), యశి్వన్ మేవాల్ (10వతరగతి, టింపనీ స్కూల్, విశాఖపట్నం) ఇష్టమైన క్రీడ: ఫుట్బాల్, క్రికెట్, రన్నింగ్, బ్యాడ్మింటన్ ఇష్టమైన క్రికెటర్ : వినోద్ కాంబ్లీ ఇష్టమైన సినిమా : ఖామోషీ (రాజస్థానీ మూవీ) ఇష్టమైన హీరో: సంజీవ్ కుమార్ హీరోయిన్: వహీదా రెహమాన్ ఇష్టమైన ఆహారం: ఖీర్, దాల్బాటి, చుర్మా (రాజస్థానీ వంటకాలు) ఇష్టమైన భాష: హిందీ, తెలుగు ఇష్టమైన నగరాలు: విశాఖపట్నం, జైపూర్ ఇష్టమైన పుస్తకాలు: ప్రేమ్చంద్ చారిత్రక పుస్తకాలు హిందీలో ‘కర్మభూమి’ అలవాట్లు: ఉదయం వాకింగ్, వ్యాయామం చేయడం అవార్డులు: ఇండియా పోలీస్ మెడల్ (ఐపీఎం) -
బెజవాడ వాసులను బెంబేలెత్తిస్తున్న కరోనా
-
మరింత కఠినంగా లాక్డౌన్...
-
అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దు: సీపీ ద్వారకా తిరుమలరావు
-
కఠిన చర్యలు తీసుకుంటాం: సీపీ అంజనీ కుమార్
-
ఢిల్లీ పోలీస్ కమిషనర్గా ఎస్ఎన్ శ్రీవాస్తవ
-
ఏ వార్త అయినా ఏకపక్షంగా రాయెద్దు
-
ఏలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాయెద్దు
-
మీడియాతో విశాఖ సీపీ
-
2019లో మూడు శాతం క్రైం రేటు తగ్గింది: సీపీ
-
హైదరాబాద్ సీపీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్కు బెస్ట్ క్వాలిటీలో దేశంలోనే మొదటి స్థానం దక్కించుకుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో తగ్గిన క్రైంరేటు, కేసుల వివరాలు, పోలీసులు శాంతిభద్రతలను కాపాడటంలో నిర్వహించిన కార్యక్రమాలను తెలిపారు. హైదరాబాద్ నగరంలో జరిగిన వివిధ సంస్కృత కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించామని సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ షీ టీం బ్రాండ్ అంబాసిడర్గా రాష్ట్రంలో నిలిచిందని పేర్కొన్నారు. 14వేల మంది పోలీసులు ఈ ఏడాది(2019)లో పలు విధుల్లో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. 2019 మొత్తంగా మూడు శాతం క్రైం రేటు తగ్గిందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అందులో భాగంగా ఐపీసీ కేసులు 15, 598 నమోదు చేశామని అయన చెప్పారు. శారీరక నేరాలు తొమ్మిది శాతం, ప్రాపర్టీ క్రైం రెండు శాతం, చైన్ స్నాచింగ్ దొంగతనాలులు 30 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా 2019లో కోర్టుల్లో 42 శాతం క్రైం కేసుల్లో శిక్ష పడిందని తెలిపారు. రూ. 26 కోట్లకుపైగా నగదు, ప్రాపర్టీ సీజ్ చేసి ప్రపంచ రికార్డ్ నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. నాలుగు వందలకుపైగా చిన్న పిల్లలను పోలీసులు రక్షించారని ఆయన చెప్పారు. 2019 ఏడాదిలో ఆటో మొబైల్ కేసులు 17 శాతం పెరిగాయని సీపీ అంజనీకుమార్ తెలిపారు. వరకట్నం కేసులు పదకొండు శాతం ఎక్కువగా నమోదు అయ్యాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ పరిధిలో అత్యాచార కేసులు తగ్గాయని.. 2018లో 178 కేసులు నమోదైతే, 2019లో 150 కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. సుమారు 16 శాతం అత్యాచార కేసులు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో 17 కేసుల్లో 25 మందికి జీవిత ఖైదు పడిందని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 27, 737 కేసులు నమోదైనట్టు అంజనీకుమార్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు ద్వారా ఎనిమిది కోట్ల 32 లక్షలు వసూళ్లు అయినట్టు ఆయన వెల్లడించారు. 2019లో హైదరాబాద్ సిటీలో ఆక్సిడెంట్ కేసులు 2, 377 నమోదైతే, 261 మంది మరణించారని ఆయన వివరించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలో 135 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలు, మూడు లక్షల 40 వేల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. షీ టీమ్, భరోసా కేంద్రాలతో హైదరాబాద్ నగర పోలీస్కు మంచి ఫలితాలు వస్తున్నాయని నగర పోలీసు కమిషనర్ సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. -
శంషాబాద్ హత్యాచార ఘటన : సీపీ కీలక సూచన
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ హత్యాచార ఘటనలో బాధితురాలి వివరాలను ప్రచురించరాదని మీడియా సంస్థలకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఇలాంటి అత్యంత హేయమైన సంఘటన వివరాలను పదేపదే ప్రసారం చేయడంతో ప్రజలు ప్రత్యేకించి మహిళలు వారి తల్లితండ్రుల్లో భయం నెలకొంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా సంయమనం పాటిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో తమతో కలిసి రావాలని, ప్రజల్లో విశ్వాసం నెలకొల్పి వారికి మేమున్నామనే భరోసా ఇవ్వడంలో సహకరించాలని కోరారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఇలాంటి ఘటనల్లో బాధితురాలి పేరు ఇతర వ్యక్తిగత వివరాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి దూరంగా ఉండాలని మీడియా సంస్ధలను కోరుతున్నామని చెప్పారు. బాధితురాలి వివరాలు వెల్లడికావడంతో బాధిత కుటుంబానికి వివిధ రూపాల్లో సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో బాధితులు ఏం చేయాలనే విషయంలో వారిలో అవగాహన పెంచే అంశాలను ప్రసారం చేయాలని కోరారు. -
‘అమాయక విద్యార్థులను రెచ్చగొట్టవద్దు’
సాక్షి, హైదరాబాద్ : విద్యార్థులను మవోయిస్టులుగా మార్చే సంస్థలపై దర్యాప్తు కోసం డిటెక్టివ్ వింగ్లో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. నిషేధిత మావోయిస్టు సంస్థలతో కొందరు విద్యార్థులు కలుస్తున్నారని.. తుపాకీ పట్టి హింస సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీపీఐ మావోయిస్టు సంస్థతో పాటు, తెలంగాణ విద్యార్థి వేదిక, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే కుట్ర జరగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ విద్యార్థి వేదిక ప్రెసిడెంట్ మద్దిలేటి ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఆయన ఇంట్లో అనేక పత్రాలు, మెమొరీ కార్డులు, డీవీడీలు, సీడీలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేగాకుండా సీపీఐ మావోయిస్టు పార్టీ 50 వ వార్షికోత్సవానికి సంబందించిన కరపత్రాలు కూడా లభించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ విద్యార్థి వేదికకు చెందిన మద్దిలేటి, అనుదీప్, భరత్, సందీప్, కిషోర్లపై వరంగల్, కొత్తగూడెం, గద్వాల్, కాజీపేట ప్రాంతాల్లో పలు కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. మేధావుల పేరుతో కొంతమంది అమాయకపు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. అలాంటి వారిపై నిఘా పెంచామని.. నిషేధిత కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జయరాం కేసులో నిజాలను వెలికితీస్తాం : సీపీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు తెలంగాణకు బదిలీ అయ్యిందని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ స్పెషల్ మెసెంజర్ ద్వారా తమకు సమాచారం చేరిందని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రభుత్వం తమకు న్యాయం చెయ్యలేదని.. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుంచి న్యాయం ఆశిస్తున్నానంటూ జయరాం సతీమణి పద్మశ్రీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ పోలీసులపై తనకు పూర్తి నమ్మకం ఉందని.. కేసును తెలంగాణకు బదిలీ చేయాలని పద్మశ్రీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జయరాం హత్యకేసు తెలంగాణకు బదిలీ అయ్యింది. (శిఖా చౌదరే చేయించింది: జయరాం భార్య) తమపై జయరాం భార్య ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సీపీ స్పష్టం చేశారు. కేసుపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ చేపడుతామన్నారు. బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతుందని చెప్పారు. జయరాం హత్య కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న ఇద్దరు నిందితులను కూడా విచారిస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిలో ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలను వెలుగుతీస్తామని సీపీ పేర్కొన్నారు. -
సోమవారమొస్తా..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నూతన పోలీస్ కమిషనర్గా నియమితులైన ఇంటెలిజెన్స్ ఐజీ మహేష్చంద్ర లడ్డా సోమవారం నగరానికి వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఈనెల 17న నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ విజయవాడ అదనపు సీపీగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో సీపీగా నియమితులైన లడ్డా ప్రస్తుతం పని చేస్తున్న నిఘా విభాగంలో శాఖాపరమైన పనుల కారణంగా అమరావతిలోనే కొనసాగుతున్నారు. మరోవైపు సెలవులో ఉన్న యోగానంద్ రెండు రోజుల్లో వచ్చి రిలీవ్ కానున్న నేపథ్యంలో ఈనెల 30న లడ్డా రానున్నారు. ఈ మేరకు బుధవారం సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడి వివరాలు వెల్లడించారు. -
పోలీసింగ్లో సమూల మార్పులు
వరంగల్ క్రైం : వరంగల్ పోలీసు కమిషనరేట్ మార్పులకు వేదికైంది. గతానికి భిన్నంగా పరిపాలనలో కొత్త కొత్త పద్ధతులు పురుడు పోసుకుంటున్నాయి. ప్రజలు కోరుకుంటున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజలకు చేరువవుతూనే.. అసాంఘిక కార్యకలపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేరం జరిగిన గంటల్లో నిందితులను అరెస్టు చేసి రికార్డులు సృష్టిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో నేరం చేయాలంటే ఒంట్లో భయం పుట్టే విధంగా నేరస్తుల నేర చరిత్ర అధారంగా పీడీ యాక్టును ప్రయోగిస్తున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ నాలుగు నెలల కాలంలోనే పోలీసింగ్లో సమూల మార్పులు తీసుకువస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. డీజీపీ అదేశాల మేరకు పోలీసు స్టేషన్లలో మామూళ్లు వసూళ్లపై ఉక్కుపాదం మోపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాలనే లక్ష్యంతో పోలీసు శాఖలో ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ ముందుకు సాగుతున్నారు. కమిషనరేట్ పరిధిలో పాలన, పోలీసు శాఖలో వస్తున్న నూతన మార్పులపై విశ్వనాథ రవీందర్థేమంటున్నారో ఆయన మాటల్లోనే.. నేర రహిత కమిషనరేట్ దిశగా.. నేరస్తులు నేరం చేయటానికి భయపడాలి. అప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుంది. నేరం చేస్తే ఏమవుతుంది.. నాలుగు రోజుల్లో బయటకు వస్తాం.. అనే భావన నేరస్తుల నుంచి పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కేసుకు సంబంధించి సరైన అధారాలు సేకరించి శిక్ష పడే విధంగా చేస్తున్నాం. దీంతో పాటు నేరస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వివరాలను కూడా నమోదు చేస్తున్నాం. దీని వల్ల నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. నేరస్తులు ఎవ్వరిని కూడాఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. బ్లూకోల్ట్స్తో విజుబుల్ పోలీసింగ్.. ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగే విధంగా కమిషనరేట్ పరిధిలోని 12 పోలీసు స్టేషన్లలో బ్లూకోల్ట్స్ ఏర్పాటు చేశాం. ఒక్కో పోలీస్ స్టేషన్ను మూడు సెక్టార్లుగా విభజించి... మూడు షిప్ట్లలో బృందాలు 24 గంటలు గస్తీ నిర్వహించేలా చర్యలు చేపట్టాం. గతంలో నేరస్తుల వివరాలను సీ డాట్ (క్రిమినల్ డాటా) ద్వారా నమోదు చేయడం జరిగింది. దీంతో బ్లూకోల్ట్స్ బృందాలు నేరస్తుడి ఇంటి పరిసర ప్రాంతాలకు వెల్లగానే ట్యాబ్లో ఇండికేషన్ వస్తుంది. దీంతో నేరస్తుల కదలికపై నిరంతరం నిఘా పెట్టడం జరుగుతుంది. బ్లూకోల్ట్స్ ద్వారా కమ్యూనిటి పోలీసింగ్, విజుబుల్ పోలీసింగ్, బందోబస్తు, ఇంటెలిజెన్స్, క్రిమినల్ సర్వే జరుగుతాయి. అసాంఘిక కార్యకలాపాలపై ‘టాస్క్’తో ఉక్కుపాదం.. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, మట్కా, సట్టా, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్ఫోర్స్తో ఉక్కుపాదం మోపుతున్నాం. 90 శాతం గుట్కా వ్యాపారులపై కేసులు నమోదు చేశాం. గుట్కా సరఫరా చేసే వ్యాపారులు ఎక్కడ ఉన్నా కేసులు పెట్టడం జరిగింది. భూకబ్జాదారులు, రౌడీలు ప్రజలకు ఇబ్బందులు కలుగజేస్తే ఊరుకోం. అసాంఘిక కార్యకలపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. త్వరలో మార్కెట్ ఇంటెలిజెన్స్.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జరిగే మోసాలను అరికట్టేందుకు కమిషనరేట్ పరిధిలో త్వరలో మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ, సైబర్ నేరాలు, చిట్టీల పేరుతో చేసే మోసాలు తదితర అంశాలపై నిరంతరం నిఘా పెట్టేందుకు మార్కెట్ ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుంది. ట్రాఫిక్ నియంత్రణలో మార్పులు.. హైదరాబాద్ తర్వాత వరంగల్లో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతుంది. సుమారు 25వేల ఆటోలు, 5 లక్షల ఇతర వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ సహకారంతో ట్రాఫిక్ సిగ్నళ్లను పునరుద్ధరిస్తున్నాం. ట్రాఫిక్ సిబ్బందికి హైదర్బాద్ నుంచి నిపుణులను పిలిపించి నిబంధనలపై శిక్షణ ఇప్పించాం. త్వరలో కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. జంక్షన్లలో వాహనాలు అదుపు చేయడం ఎలా.. వాహనదారులతో ఎలా ప్రవర్తించాలి.. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు కౌన్సెలింగ్ను ఈ కేంద్రం నుంచి ఇస్తాం. దీంతో పాటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పద్ధతి మార్చుకోకుంటే వేటే.. కమిషనరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది చాలా సమర్థవంతులు. ఈ విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అందరు కూడా శిక్షణ పొందిన వారే. ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందరికీ నేను చెప్పే విషయం ఒక్కటే. తప్పు ఎవ్వరు చేసిన క్షమించాను. ఇప్పటివరకు ఎలా ఉన్న ఇప్పుడు పద్ధతి మార్చుకోవాలి. కమిషనరేట్ పరిధిలో యూనిఫాం సర్వీస్ అందాలి. పోలీసులందరూ బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలకు పోలీసులు ఉన్నారనే నమ్మకం కలగాలి. ఎవ్వరైనా మారకుంటే మారడానికి అవకాశం ఇస్తాను, అయినా పద్ధతి మార్చుకోకుంటే వేటు తప్పదు. షీటీమ్స్ సిబ్బందికి శిక్షణ.. మహిళలు, యువతల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. షీటీమ్స్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు నగరంలోని పోలీసు స్టేషన్లలో 15 వర్టికల్స్, గ్రామీణ ప్రాంతంలో 12 వర్టికల్స్ (విభాగాలు)లలో స్టేషన్లో పనిచేసే పోలీసులందరికీ బాధ్యతలను అప్పగించడం జరిగింది. దీని వల్ల వృతి పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించడం జరుగుతుంది. క్రమశిక్షణతో నేరాలను అదుపు చేసే అవకాశం ఉంది. ప్రజలకు ఎక్కడైనా.. ఎవ్వరైనా ఇబ్బందులకు గురిచేస్తే స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో 626 గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. దీనివల్ల నేరాల సంఖ్య తగ్గుతుంది. దీంతోపాటు ఎక్కడైనా నేరం జరిగిన వెంటనే సీసీ కెమెరాల అధారంగా నేరస్తులను పట్టుకోవడం జరుగుతుంది. నగరంలో రెండు మూడు నెలల్లో అన్ని కాలనీలలో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తవుతుంది. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట.. కమిషనరేట్ పరిధిలో పనిచేసే సిబ్బంది సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సర్వీస్ పరంగా వారికి అందాల్సిన పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇతర సర్వీసులలో ఎక్కడ జాప్యం జరుగకుండా చూస్తున్నాం. సిబ్బంది, సీపీఓ కార్యాలయ సిబ్బందితో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ఎవ్వరికి ఏం ఇబ్బంది ఉన్నా.. ఆ గ్రూప్లో పోస్టు చేసిన మూడు రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఈ విషయం కూడా గ్రూప్లో పోస్ట్ చేసేలా ఆదేశాలు ఇచ్చాం. కమిషనరేట్ పరిదిలో సుమారు 3 వేల మంది నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ ప్రాంతాల్లో కోచింగ్ ఇస్తున్నాం. పోలీసు స్టేషన్లకు త్వరలో వాహనాలు అందిస్తాం. ఎవ్వరికి ఇబ్బంది ఉన్నా.. సమస్యలు పరిష్కారం కాకున్నా నేరుగా సంప్రదించవచ్చు. నేరస్తులు పద్ధతి మార్చుకోకుంటే శిక్ష పడడం ఖాయం. -
చాప్టర్ IX
పోలీస్ కమీషనర్ బంగ్లా. లోధి ఎస్టేట్. న్యూఢిల్లీ.నేటినుంచి రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో ఆతిథ్య జట్టుతో తలపడనున్న సౌదీ అరేబియా.ఇసుక తుపాన్లతో, భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న దేశ రాజధాని. రెండు రోజుల నుండి కురుస్తున్న....‘‘హలో...’’...భయాందోళనలో ప్రజలు. మరో నాలుగు రోజుల వరకు పరిస్థితి ఇలానే కొనసా...‘‘నానీ! టీవీ వాల్యూం కొంచెం డౌన్ చెయ్. హలో.. కమిషనర్ అరవింద్ కుమార్ స్పీకింగ్..’’‘‘హలో అరవింద్ సర్! నేను రమేష్ని మాట్లాడుతున్నా. పదేళ్ళ క్రితం ఏలూరులో మీ సబార్డినేట్గా పనిచేశాను సర్.’’‘‘హే రమేష్! ఎలా ఉన్నావ్? ఏంటి ఇంత సడన్గా కాల్ చేశావ్? హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ?’’‘‘అందరూ బావున్నాం సర్. ఒక ఇంపార్టెంట్ విషయం చెబ్దామని కాల్ చేశా. పదేళ్ళక్రితం మనం ఏలూరులో పనిచేసేటప్పుడు అన్ సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయిన రైల్వే హాకర్ మర్డర్ కేస్కి ఫైనల్గా సమాధానం దొరికింది సర్.’’‘‘వా... వాట్? కమ్ అగైన్.’’‘‘మీకు తెలిసే ఉంటుంది.. త్రీ డేస్ బ్యాక్ డెబ్బై రెండేళ్ళ నాగ్పూర్ మాఫియా డాన్ విలాస్ రావ్ దండేర్కర్ హార్ట్ అటాక్తో చనిపోయిన సంగతి. ఆఖరి కోరికగా తను చనిపోయిన తర్వాత వాడి ఆటో బయోగ్రఫీ విడుదల చెయ్యాలని ఫ్యామిలీ మెంబెర్స్కి చెప్పి బుక్స్ కూడా ఎప్పుడో ప్రింట్ చేయించేశాడంట సర్.’’ ‘‘సో..?’’‘‘ఆ బుక్ ‘మై కన్ఫెషన్స్ – విలాస్ రావ్ దండేర్కర్’ మార్కెట్లోకి నిన్నే రిలీజ్ అయ్యింది. ఆ బుక్లో చాప్టర్ 9 మీరొక్కసారి చదవండి సర్.’’‘‘కమాన్ రమేష్! అసలేముంది ఆ బుక్లో? ఏలూరులో జరిగిన మర్డర్కి, నాగ్పూర్ మాఫియా డాన్కి సంబంధం ఏంటి?’’‘‘బిలీవ్ మీ సర్. ఒక్కసారి చదవండి. మూడేళ్ళు ఆ కేస్ మీద మీరు పడ్డ స్ట్రగుల్కి ఆన్సర్ దొరుకుతుంది.’’‘‘ఓకే... ఓకే... డెఫినెట్గా చదువుతాను. బట్...’’‘‘పదేళ్ళ నాటి మర్డర్ మిస్టరీ వీడిపోయింది సర్. అది నేను చెప్పడం కంటే మీరు చదివి తెలుసుకుంటేనే బావుంటుంది. చాప్టర్ 9. బై సర్.’’‘‘ఓకే రమేశ్.. బై.’’ పోలీస్ కమిషనర్ అరవింద్ ఫోన్ పెట్టేశాడు.‘‘వాట్ హాపెండ్ డాడ్? ఎవరు ఫోన్లో..’’ అరవింద్ కొడుకు నాని అడిగాడు.‘‘నథింగ్. నేను బైటకి వెళ్తున్నా నానీ.’’‘‘ఇంత పెద్ద వర్షంలోనా? కమాన్ డాడ్.. మీరేగా కలిసి ఫుట్బాల్ మ్యాచ్ చూద్దామన్నారు..’’.‘‘సారీ నానీ! ఐ హావ్ టు గో నవ్. రియల్లీ సారీ. డిన్నర్ చేసేయ్, నాకోసం వెయిట్ చెయ్యకు.’’‘‘ఎంత టైం పడుతుంది డాడ్? ఆఫీస్ వర్కా? కాదంటే చెప్పండి ఈరోజు డ్రైవర్ రాలేదుగా నేనొచ్చి కార్ డ్రైవ్ చేస్తా...’’ ‘‘నో. బయట చూడు ఎంత పెద్ద వర్షం పడుతోందో. ఇట్స్ నాట్ సేఫ్ అవుట్ దేర్. మ్యాచ్ చూసి డిన్నర్ చేసి పడుకో. చిన్న పనే. చూసుకుని నేను వచ్చేస్తా.’’కార్ ఇంజిన్ స్టార్ట్ అయ్యింది.హెడ్ లైట్స్ ఆన్ అయ్యాయి. వైపర్స్ అటూ ఇటూ కొట్టుకుంటున్నాయి. కారు బంగ్లానుండి బయటకి వచ్చింది. అరవింద్ని కారు ముందుకి తీసుకువెళ్తోంటే... కాలం వెనక్కి తీసుకెళ్తోంది. 2008. ఏలూరు.గంటకి 182 కిలోమీటర్ల వేగంతో తీరం దాటనున్న తుఫాన్......దేశంలోని ప్రజల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తున్న ఆ దేశ ప్ర...నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా......రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి జరిగిన సంఘటనకి...‘‘అబ్బబ్బబ్బా.. రేయ్ నానీ! ఒక్క చానల్ ఉంచలేవా, అస్తమానూ మారుస్తూ ఉంటావ్. అసలే అర్ధరాత్రెళ్లిన మనిషి ఇంకా ఇంటికి రాలేదు. చూస్తుంటే ఈ వానేమో ఆగి చచ్చేట్టులేదు. ఎక్కడున్నారో ఏంటో మీ నాన్నకోసారి ఫోన్ చెయ్.’’ టీవీ చూస్తున్న నానీతో అరుస్తున్నట్టు మాట్లాడింది వాళ్లమ్మ. పచ్చదనానికి, ప్రశాంతతకి నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరు నగరం అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలిన తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో తుపాకీతో చేసిన హత్య ఇదేమొదటిదవడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్ని జిల్లా ఎస్పీ అరవింద్ కుమార్ గార్ని అడిగి తెలుసుకుందాం.‘‘అమ్మా! ఇలా రా. ఫోనెందుకు, డైరెక్ట్గా టీవీలో చూద్దువుగాని నాన్నని.’’ అన్నాడు నాని చిన్నగా నవ్వుతూ. ‘‘ఇట్స్ ఎ క్వైట్æ షాకింగ్ ఇన్సిడెంట్ టు అస్. గన్ కల్చర్ అనేది ఈ జిల్లాలో ఇప్పటివరకు లేదు. సమ్ వన్, మేబీ సమ్ పీపుల్.. ఈ ఊరు పద్ధతుల్ని మార్చాలని అర్ధరాత్రి అలా జస్ట్ లైక్ దట్ ట్రిగ్గర్ పుల్ చేశారు. ఒక మనిషిని చంపారు. ఈ ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో హాకర్ అతను. పేరు నిమ్మకాయల నాగరాజు అలియాస్ రాజు. వి ఆర్ టేకింగ్ దిస్ కేస్ వెరీ సీరియస్ అండ్ హియర్ అయాం గివింగ్ మై వర్డ్ టు ది పీపుల్ ఆఫ్ ఏలూరు – డోంట్ పానిక్. వి విల్ హంట్ దిస్ గై డౌన్ అండ్ బ్రింగ్ బాక్ పీస్ టు ది సిటీ..’’ మీడియాతో మాట్లాడి పక్కకొచ్చాడు అరవింద్. ‘‘రమేశ్! కమాన్ కమ్ హియర్. ఇంత వర్షంలో కూడా ఎలా వచ్చింది ఈ బ్లడీ మీడియా. అసలు జనాన్ని సగం భయపెట్టేది వీళ్లే. జనం బాగా భయపడుతున్నారని వాళ్లకి కొంచెం ధైర్యం చెబుదామని నేనే మాట్లాడా. సరే! కేస్ గురించి రైల్వే పోలీస్ ఏమంటున్నారు?’’ సబార్డినేట్ రమేశ్ని పిలిచి ప్రశ్నించాడు అరవింద్. ‘‘అదే సర్! వాళ్ళు హేండిల్ చేస్తారంట ఈ కేస్ని.’’‘‘హేండిల్ చేస్తారా? ఎవరు వాళ్ళేనా? అయినా కేస్ గురించి వాళ్ళనెవడగుతాడు రమేశ్. సొసైటీ, మీడియా, హయ్యర్ అథారిటీస్ అందరూ పడేది మనమీదేగా. వాళ్ళు గనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే ఓ పదేళ్ళు పడుతుంది కేస్ క్లోజ్ చెయ్యడానికి. చెప్పు... కేస్ మనమే తీసుకుంటున్నామని.’’‘‘ఓకే సర్ మాట్లాడతా. రాజు బాడీని అటాప్సీకి పంపించేశాం సర్. నిన్నరాత్రి రాజుతో పాటున్న ఇంకో రైల్వే హాకర్ శీనుని రైల్వే పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నాం. ఏడుస్తున్నాడు కానీ ఏమీ చెప్పడంలేదు. షాక్లోనుండి ఇంకా తేరుకోలేదనిపిస్తోంది సర్.’’‘‘ఓకే! లెట్స్ సీ. పదండి’’.అరవింద్, రమేశ్ బయల్దేరారు. ‘‘ఈ రూమ్లో లైట్స్ లేవా? ఆన్ చెయ్యండి. వీడేనా?’’ అరవింద్ గట్టిగా మాట్లాడుతూ వచ్చాడు. ‘‘ఎస్ సర్!’’‘‘ఆ కిటికీలు మూసేయండి. జల్లు పడుతోంది లోపలకి. నీ పేరేంటి?’’‘‘సర్ అడుగుతున్నారుగా సమాధానం చెప్పు.’’‘‘సారు. నా పేరు శీనండి.’’ శీను నోరువిప్పాడు భయపడుతూ. ‘‘రైల్వే స్టేషన్లో ఏం చేస్తుంటావ్?’’ ‘‘ప్లాట్ఫారంమీద, రైల్లో కూల్డ్రింకులు, వాటర్ బాటిల్లు అమ్ముతాను సారు.’’‘‘రాజు నీకెలా తెలుసు?’’‘‘రేయ్ రేయ్... ఆపరా ఆ ఏడుపు. ఇది సర్ వీడి పరిస్థితి. వాడి పేరెత్తంగానే వీడేడుపెత్తుకుంటున్నాడు.’’ రమేశ్ కోపంగా అన్నాడు.‘‘వాడ్ని వీడే చంపేసుంటాడు రమేశ్. మనదగ్గర నుండి తప్పించుకోవడానికి ఇలా దొంగేడుపులు ఏడుస్తున్నాడు.’’‘‘సారు...?’’‘‘మరేంటి చెప్పు. ఇటు చూడు శీనూ! ముందు నిన్నరాత్రి ఏం జరిగిందో చెప్పు. ఇలా చెప్పకుండా నువ్వు ఆలస్యం చేసిన ప్రతి సెకనూ హంతకుడు పారిపోవడానికి హెల్ప్ అవుతుంది. హంతకుడికి హెల్ప్ చేస్తావా నువ్వు?’’‘‘లేదు సారు... లేదు. సెప్తా. రాజుగాడు, నేను సిన్నప్పట్నుండి స్నేహితులం సారు. పక్క పక్క ఇళ్లు. కలిసి పెరిగాం. ఒకేసోట సదువుకున్నాం. ఇప్పుడొకేసోట పనిజేత్తన్నాం సారు. ఆడు కూడా నాలానే ఇక్కడ కూల్డ్రింకులు, వాటర్ బాటిళ్లు అమ్ముతాడు. రోజూ ఇదే పనండి మాది. రోజూలానే నిన్న కూడా పన్లోకొచ్చాం. కానీ ఆ మాయదారి వాన పడకుండా ఉండుంటే రాజుగాడికి ఈ సావు తప్పేది సారు.’’‘‘ఊరుకో ఊరుకో. ఏడవకు. వానకి, రాజు హత్యకి సంబంధమేంటి?’’‘‘నిన్న కురిసిన వానకి స్టేషన్లో ఆఫీసర్లందరూ ఇంటికెళ్లిపోయారు సారు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ గారొక్కరే ఉండిపోయారనుకుంట. పయానం సేసేదానికి జనం కూడా గుబులు పడ్డట్టున్నారు.ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు. మేము కూడా ఇంటికి పోయేటోల్లమే కానీ కాలక్షేపానికి కబుర్లు సెప్పుకుంటా అలా ఉండిపోయాం. ఆ సరదా కబుర్లే ఇంత కొంప ముంచిద్దనుకోలేదు సారు.’’‘‘కరెక్ట్గా చెప్పు నిన్నరాత్రి ఏం జరిగిందో...’’‘‘సెప్తా సారు. నిన్నరాత్రి........... అప్పటికే రాత్రి పదకొండున్నర దాటింది.‘ఏరా రాజు. ఇంకిటికి పోదామా?’ అన్నాను నేను. ‘వెల్దాంలేహె! ఓ కంగారెందుకురా. ఆ స్పెషల్ ట్రైన్ కూడా సూసేసి పోదాం.’ అన్నాడు రాజుగాడు. సిగరెట్ తాగుతా, ‘ఆహా శీనుగా. భలే మజాగా ఉందిరా ఈ వానలో సిగరెట్టు తాగుతుంటే.’ అన్నాడు. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 07101 సికింద్రాబాద్ నుండి కాకినాడ వెళ్ళవలసిన సూపర్ఫాస్ట్ స్పెషల్ 11:45కి ప్లాట్ఫారం నంబర్ రెండు మీదకి వస్తుంది అని వినిపిస్తుంటే ‘ఒరేయ్ శీనుగా! ఎందుకురా అదలా ఓ కూత్తది. అయినా ఏ నా కొడుకున్నాడు ఈ స్టేషన్లో దాని మాటలిండానికి.’ అంటూ ఉషారుగా మాట్లాడాడు. తర్వాత కాసేపటికి ట్రైనొచ్చింది సారు. మేమిద్దరం అలాగే కబుర్లు సెప్పుకుంటున్నాం. ఏం సూసాడో ఏమో కానీ, ట్రైన్ ఆగుతుండగా డ్రింక్ బాటిల్లు వాటర్ బాటిల్లు ఉన్న ట్రే పట్టుకుని ట్రైన్ కేసే పరిగెత్తాడు రాజుగాడు. బండాగే దిక్కుకి నా ఈపెట్టి కూసోడంతో రాజుగాడ్ని ఎవరు పిలిసారో నాకు కనపడ్లేదు సారు. కానీ ఆ బండికున్న మొత్తం డోర్లు కిటికీలు అన్నీ యేసేసున్నాయి సారు ఒక్క కిటికీ తప్ప. వాన జోరుగా పడతానే ఉంది. మావోడు వానలో తడుత్తానే తీసిన ఆ కిటికీ ఉన్న పెట్టె దగ్గరకి పరిగెత్తుకుంటా ఎల్లాడు.’’‘‘ఓకే. రాజు ఆ కిటికీ దగ్గరకెళ్ళిన తర్వాత ఏం జరిగింది?’’‘‘అదే తెలియదు సారు. పెట్టె నాకు శానా దూరంలో ఆగింది. ఆడు కిటికీలోనుండి ఎవరితోనో మాట్టాడాడు. తర్వాత ఎనక్కి తిరిగి నా వంక సూసి నవ్వాడు సారు.’’‘‘వాట్. నీ వంక చూసి నవ్వాడా? ఎందుకు?’’‘‘తెలియదు సారు. నా వంక సూసి నవ్వాక మళ్లీ కిటికీకేసి తిరిగాడు. అంతే బండి కూత పెట్టడం, ముందుకి కదలడం, రాజుగాడు నున్చున్నోడు నున్చున్నట్టే ఫ్లాట్ఫారం మీద పడటం.. అన్నీ సిటికెలో జరిగిపోయినాయి సారు. నేను పరిగెత్తుకెల్లి సూసేసరికి అక్కడంతా రక్తం. అటు పక్కకి పడున్న రాజుగాడ్ని నాకేసి తిప్పాను సారు. అంతే! తలంతా రక్తం. నుదురుకి బెజ్జం పడి రక్తం వత్తానే ఉంది. ఆడ్ని పిలిశా. కొట్టా. ఏ ఉలుకూ పలుకూ లేకుండా అలా పడున్నాడు. నాకు బయ్యమేసి ఎంటనే 108కి కొట్టా సారు. పోలీస్ సార్లక్కూడా సెప్పా. ఆల్లొచ్చి సూసి పాణం లేదన్నారు. రాజుగాడ్ని తీసుకొచ్చి పొడి ప్రాంతంలో పొడుకోబెట్టాం. తర్వాత ఎనక్కి తిరిగి సూసేసరికి ఫ్లాట్ఫారంమ్మీద ఒక్కటంటే ఒక్క రక్తం సుక్క ఆనవాలన్నా లేకుండా ఆ వాన దేవుడు అంతా నీటితో కడిగేశాడు సారు. ‘‘ఊరుకో శీను. రమేశ్! తనకి మంచి నీళ్ళు ఇవ్వండి.’’ లేచాడు అరవింద్. శీను దగ్గర్నుంచి అంతకన్నా మించి ఇంకే సమాధానం వస్తుందని అతననుకోలేదు. ‘‘సర్ ఆటాప్సీ రిపోర్ట్ వచ్చింది. 9 ఎంఎం బుల్లెట్ క్లోజ్ రేంజ్డ్ స్ట్రయిట్ హెడ్ షాట్ సర్. ఫింగర్ ప్రింట్స్ ఏం ట్రేస్ చెయ్యలేకపోయాం. నాకు ఈ కేస్లో విట్నెస్ దొరకడం కూడా ఇంపాజిబుల్ అనిపిస్తోంది సర్.’’ రిపోర్ట్ పట్టుకొని చెబుతూ ఉన్నాడు రమేశ్. ‘‘వై ఈజ్ దట్ రమేష్?’’‘‘ఆ రోజు వచ్చింది డైలీ ట్రైన్ కాదు సర్, స్పెషల్ ట్రైన్. అండ్ తుఫాన్కి తొంభై శాతం మంది జనం ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మేము గేదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ క్లాస్ స్లీపర్ మొత్తం ఆరోజు 50 మంది మాత్రమే ప్రయాణం చేశారు. శీను చెప్పినదాని ప్రకారం చూస్తే ఆరోజు విండో ఓపెన్ చేసుంచిన కోచ్ 9 అని సస్పెక్ట్ చేసి పాసెంజర్స్ లిస్ట్ తీసుకున్నాం. ఆరోజు 9లో ముగ్గురు మాత్రమే ప్రయాణించారు సర్. భార్యాభర్తలిద్దరూ అండ్ ఒక స్టూడెంట్. వాళ్ళ బాక్గ్రౌండ్ వెరిఫై చేశాం. అంతా క్లీన్గా ఉంది. విడివిడిగా అడిగినప్పుడు వాళ్ళ ముగ్గురూ కూడా నాలుగో వ్యక్తిని చూడలేదనే చెప్పారు సర్. ఫైనల్లీ ఆరోజు జనమెక్కువ లేరని టీసీ కూడా టికెట్ చెకింగ్కి వెళ్లలేదంట సర్.’’ రమేశ్ తాను సేకరించిన వివరాలన్నీ చెప్పాడు. ‘‘వాట్ ఈజ్ దిస్ రమేశ్! ఇంకొన్ని రోజులాగితే హంతకుడే ఆరోజు తుఫాన్ తెప్పించాడంటారా? అసలు అంత పెద్ద కోచ్లో ఆ ముగ్గురికి కనపడకుండా ఇంకో వ్యక్తి ఉండటానికి అవకాశం లేదంటావా? వీళ్ళు కోచ్కి ఒక ఎండ్లో ఉండి నాలుగో వ్యక్తి ఇంకో ఎండ్లో ఉండే అవకాశం లేదంటావా?’’‘‘ఆ అవకాశం ఉంది సర్. కానీ ఆరోజు ట్రైన్ ఏలూరు నుండి బయలుదేరి వెళ్లిన తర్వాత వర్షం ఇంకా పెద్దది కావడంతో ట్రైన్ని కొవ్వూరులో నాలుగు గంటలపాటు ఆపేశారు. ఆ సమయంలో కోచ్లో ఉన్న ముగ్గురూ ఆ నాలుగో వ్యక్తిని చూసే అవకాశం లేదంటారా సర్?’’‘‘రైట్. అంటే వాడు ఆ కోచ్లో ఎక్కువసేపు ఉండుండడు. మనం ఎక్కడో ఏదో పాయింట్ వదిలేస్తున్నాం రమేశ్. ఒక రైల్వే హాకర్ని గన్తో కాల్చాల్సిన అవసరం ఎవరికుంటుంది? పైగా రాజుకి శత్రువులు కూడా ఎవరూ లేరు. ఉన్నా గన్తో కాల్చేంత స్కెచ్ వెయ్యగలరని నేననుకోవడం లేదు. హత్యకి క్లూ దొరకలేదు. మోటివ్ కనిపించట్లేదు. విట్నెస్ కూడా లేరు. ఇదంతా పకడ్బందిగా చేసిన హత్యా లేదా ఎవరైనా ఆకతాయిల పనా? ఎవరు చేసుంటారు రమేశ్ ఇదంతా?’’ ‘‘.... ఎవరు? ఎవరు?’’. కాలం పదేళ్లనాటి సంగతుల్ని, కారు పావుగంట ప్రయాణాన్ని ముగించుకుని ఆక్స్ఫర్డ్ బుక్స్టోర్ ముందుకొచ్చి ఆగాయి.‘‘గుడ్ ఈవినింగ్ సర్! హౌ మే ఐ హెల్ప్ యు?’’ నవ్వుతూ పలకరించాడు స్టోర్కీపర్. ‘‘యా! డూ యు హావ్ ద బుక్ ‘మై కన్ఫెషన్స్’ బై విలాస్ రావ్ దండేర్కర్?’’ అరవింద్ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు.‘‘జస్ట్ ఏ సెకండ్ సర్! యా వియ్ హావ్ ద బుక్ సర్. ఓవర్ దేర్ సిక్స్త్ రో ఫోర్త్ రాక్ సర్.’’ చెయ్యి ఆ రేక్ వైపు చూపిస్తూ చెప్పాడు స్టోర్కీపర్. ‘‘థాంక్యూ.’’ అంటూ ఆ రేక్ వైపుకు బయలుదేరాడు అరవింద్. బుక్ అందుకొని నేరుగా చాప్టర్ 9 ఉన్న పేజీకి వెళ్లిపోయాడు. చాప్టర్ IX నా తోడబుట్టిన తమ్ముడే నన్ను చంపాలనుకున్నాడు. చంపి నా కుర్చిలో కూర్చుని నేను నిర్మించిన చీకటి సామ్రాజ్యాన్ని ఏలాలనుకున్నాడు. భాయ్ భాయ్ అని ఆప్యాయంగా పిలుస్తూనే నన్ను చంపడానికి నా వెనుక పెద్ద కుట్ర రచించాడు.2008. అక్టోబర్. నాగ్పూర్లో రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతుండేది. తెల్లవారుజామున నాగ్పూర్ నుండి పెళ్లికని కారులో బయలుదేరి వెళ్తున్న మామీద దారి మధ్యలో ఎటాక్ జరిగింది. మేం కూడా వాళ్లమీద తిరిగి కాల్పులు జరిపాం. ఏడుగురున్న మా గుంపులో నలుగురు స్పాట్లో చచ్చిపోయారు. అందులో వికాస్ బాడీలో 32 బుల్లెట్లు దిగాయి నన్ను కవర్ చేసినందుకు. మిగిలిన ఇద్దర్ని నాగ్పూర్లో జరుగుతున్న విషయాలు తెలుసుకోమని పంపించి నేను ఆంధ్రా పారిపోయా. నా ప్రయాణమంతా వర్షమే. నేను తప్పించుకోవడానికి ఆ వర్షమే నాకు తోడయ్యింది. నేను ఆంధ్రాలోని వరంగల్ చేరే వేళకి చీకటి పడుతుంది. నాకు ప్రొటెక్షన్ ఇవ్వగలిగే ఒక ఆంధ్రా స్నేహితుడి దగ్గరకి వెళ్ళడానికి వరంగల్లో ట్రైన్ ఎక్కాను.ట్రైన్ అంతా దాదాపు ఖాళీగా ఉంది. వర్షాల వల్లనేమో ట్రైన్కున్న డోర్లు, కిటికీలు అన్నీ మూసేశారు. ట్రైన్ ఎక్కినప్పటినుంచి ఏ కోచ్లోనూ అరగంటకి మించి ఎక్కువసేపు ఉండలేదు నేను. ప్రమాదం నాకెంత దూరంలో ఉందో తెలియక ప్రతి అరగంటకి ఒక్కో కోచ్ మారుతూ పోయా. ఏ కోచ్లోనూ పెద్ద జనం లేరు. నా అరవయ్యేళ్ళ వయసుకి నన్ను అనుమానించినవారు, ప్రశ్నించినవారు ఎవ్వరూ లేరు. ఓ రెండు గంటల తరవాత ఎప్పుడు పట్టిందో తెలియకుండా నిద్ర పట్టేసింది. ఎంతసేపు పడుకున్నానో అలా!మెలకువొచ్చేసరికి ట్రైన్ మెల్లగా వెళ్తోంది. బాగా దాహం వేసింది. ట్రైన్ విండో ఐరన్ షట్టర్ పైకెత్తి బయటకి చూశా. వర్షం, చల్లగాలి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చాయి. చీకటి తప్ప బయటేమీ కనిపించలేదు. చాలాసేపట్నుంచి అదే కోచ్లో ఉండిపోవడంతో వెంటనే లేచి వేరే కోచ్కి వెళ్ళిపోయా. నా దాహానికి గొంతెండుకుపోయింది. ఏదైనా స్టేషన్ వస్తుందేమోనని షట్టర్ పైకెత్తి బయటకి చూస్తూనే ఉన్నా. మెల్లగా నా గొంతు పిడచకట్టుకుపోయింది. లాలాజలం ఊరక నాలుక ఎండిపోయి నోట్లో అటూ ఇటూ తిప్పడానికి కూడా కష్టంగా తయారయ్యింది. అప్పుడే జీవితంలో నీళ్ల విలువేంటో తెలిసింది. కిటికీలోనుండి నా కుడిచేయి బయటకి పెట్టా. వాన నీటికి తడిచిన చేతి వేళ్లని నాలుక మీద రాసుకున్నా. తేడా తెలియలేదు. నీళ్ళే కావాలి తాగడానికి. చూశా, చూశా, చూస్తూనే ఉన్నా. ట్రైన్ వెళ్తోంది కానీ ఏ స్టేషన్లోనూ ఆగట్లేదు. ఆ సమయంలో నీళ్ల కోసం నేను పడిన యాతనతో పోల్చుకుంటే ఇన్నేళ్ల నా జీవితంలో నేనసలు ఏ బాధలూ పడలేదనే చెప్పాలి. నేను నా ప్రాణాన్ని లెక్కచెయ్యను కానీ ఇంకిలాంటి బాధ ఎక్కువసేపు పడలేననిపించింది. ఎక్కడో నాగ్పూర్లో పుట్టి పెరిగిన నాకు, ఇక్కడింత బాధేంటో అని అనుకుంటుండగానే ట్రైన్ వేగం తగ్గింది. షట్టర్ పైకెత్తి చూశా. ఏదో స్టేషన్ వచ్చింది. ఆనందంలో వాటర్ బాటిల్స్ ఎక్కడున్నాయో అని ప్లాట్ఫారం మీద వెతికాను. కనిపించాయి. రెండు ట్రేల్లో వాటర్ బాటిల్స్, డ్రింక్స్ పక్కన పెట్టుకుని ప్లాట్ఫారం మీద కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు మనుషులు కనిపించారు. నేను ట్రైన్లో నుండి చెయ్యి బయటకి పెట్టి ఊపుతూ వాటర్ అని బొటన వేలు చూపించా. ఇద్దరిలో ఒక వ్యక్తి నన్ను చూసి ట్రే తీసుకుని నేనున్న కోచ్ వైపుకి పరిగెత్తాడు. ట్రైన్ ఆగింది. వర్షం మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. ఆ మనిషి ట్రే పట్టుకుని నా దగ్గరకు రాగానే వాటర్ బాటిల్స్ అని చెప్పి నా పర్స్లోనుండి చేతికి తగిలిన నోటు తీసి అతనికిచ్చా. వర్షంలో తడిసిపోతుందని అతను నా చేతిలో ఉన్న నోటుని టక్కున లాక్కున్నాడు. లాక్కునేటప్పుడు చూశా, అది వెయ్యి రూపాయిల నోటు. అతను నోటుని తీసుకుని జేబులో పెట్టుకుని వాటర్ బాటిల్స్ ఇవ్వకుండా వెనక్కి తిరిగి అక్కడెక్కడో కూర్చుని ఉన్న ఇంకొకడి వైపు చూసి నవ్వాడు. వాడలా ఎందుకు నవ్వాడో ఆ క్షణంలో నాకర్థం కాలేదు. అలా నవ్వుతూనే వాడు నా వైపుకి తిరిగి మెల్లగా వెనక్కి జరిగాడు. నేను ట్రే వైపు చూపిస్తూ బాటిల్స్ అని కళ్ళతో అడిగా. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు కానీ బాటిల్స్ ఇవ్వడం లేదు. అప్పుడర్థమైంది వాడు నన్ను మోసం చెయ్యబోతున్నాడని. నేను డబ్బుల్ని లెక్క చెయ్యను కానీ నాకివ్వాల్సిన వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వకుండా నా నుండి, వర్షం నుండి వెనక్కి జరుగుతుంటే కోపంతో నేను వాడ్ని అలా చూస్తూ ఉండిపోయా. వాడు కూడా ఈ అరవయ్యేళ్ళ ముసలోడు ఏం చేస్తాడ్లే అనే ఆలోచనతోనేగా నన్నిలా మోసం చేశాడు. నా జీవితంలో వాడికంటే దారుణమైన మనుషుల్ని చూశా. వాడినలాగే చూస్తూ నలభై ఏళ్లుగా నా వొంట్లో ఒక భాగమైపోయిన దానికోసం కుడి చేయి వెతికింది. పక్కన పెట్టిన కోట్లోకి చెయ్యి పోయింది.దొరికింది నా స్టార్ పిస్టల్. 92 మోడల్. టక్కున తీసి కిటికీలోపలనుండే ఆ మనిషికి గురి పెట్టా. అది కనబడగానే ఆ మనిషి మొహమ్మీద నవ్వు మాయం అయింది. గన్ చూడగానే చాలామంది షాక్లోకి వెళ్లిపోతారు. మెదడు మొద్దుబారిపోతుంది. వాడు కూడా షాక్లోకెళ్లిపోయాడు. వాడికి తగిలిన షాక్ భయంగా మారే సమయంలోనే... అసలు ఏం జరుగుతుందో మెదడుకి అర్థమయ్యే సమయంలోనే ట్రైన్ హార్న్ బ్లో చేశారు. నేను ట్రిగ్గర్ నొక్కాను. ట్రైన్ మెల్లగా కదిలింది. బులెట్ వేగంగా వెళ్లి వాడి నుదురిని చీల్చి తల్లోపలికెళ్లింది. వాడి చేతిలో ఉన్న ట్రే ఎగిరిపడింది. బాటిల్స్ అన్నీ చెల్లా చెదురయ్యాయి. వాడు నున్చున్నోడు నున్చున్నట్టే కుప్పకూలిపోయాడు. ప్లాట్ఫారం మీద చిమ్మిన వాడి రక్తం వర్షం కడిగెయ్యడమే నాకాఖరిగా కనిపించింది. అప్పుడంటే ఉద్రేకంలో చేశా కానీ, తర్వాత నా జీవితంలో ఈ సంఘటన తలచుకుని చాలాసార్లు బాధపడ్డాను. ‘‘సర్! ఎక్స్క్యూజ్ మీ సర్. వి ఆర్ క్లోజింగ్. డు యు వాంట్ ద బుక్, సర్?’’ స్టోర్కీపర్ మాటలతో చాప్టర్ 9 నుంచి బయటకొచ్చాడు అరవింద్. ‘‘యా! బిల్ ఇట్ ఫర్ మీ.’’ అన్నాడు ఏ భావం లేకుండా. కమిషనర్ అరవింద్ కుమార్ బుక్ స్టోర్ బైట గోడకానుకుని బంగారు కాంతిని వెదజల్లే సోడియం లైట్ల వెలుగులో వర్షాన్ని చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు –‘పదేళ్ల క్రితం ఓ వర్షం పడిన రాత్రి జరిగిన మర్డర్ మిస్టరీకి సమాధానం ఈరోజు రాత్రి ఈ వర్షంలో తెలిసింది. నిజంగా వర్షానికి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఇదంతా జస్ట్ కో ఇన్సిడెన్సా? ఏమో నిజంగా మనిషి మెదడుకి అందని విషయాలు ఇంకా ఎన్నున్నాయో!’అదే సమయంలో టీవీ చూస్తూ అరవింద్ కొడుకు నానీ కూడా తనలో తాను అనుకుంటున్నాడు – ‘డాడ్ ఇంకా రాలేదేంటి? ఫుట్బాల్ మ్యాచ్ కూడా అయిపోయింది. డిన్నర్ చేసి పడుకోమన్నారుగా డాడ్, ఇప్పుడు ఫోన్ చేస్తే డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతారేమో?’టీవీ మోగుతూనే ఉంది – బ్రేకింగ్ న్యూస్... బ్రేకింగ్ న్యూస్...ఢిల్లీ జన్పథ్ రోడ్లో బ్రేక్స్ ఫెయిలయిన ఒక ట్రక్ రెండు బైకులు, ఒక కారు మీదనుండి దూసుకెళ్లడంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం పడుతుండటం వల్ల సహాయక చర్యలకి ఆలస్యమవుతుందని అక్కడున్న అధికారులు చెప్తున్నారు. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం యాక్సిడెంట్కి గురైన కారు ఢిల్లీలోని ఒక ప్రభుత్వశాఖ ఉన్నతాధికారిదని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ కారులో ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది. - కె.ఎన్. మనోజ్ కుమార్ -
వాటిపై దృష్టి పెడతాం : విజయవాడ సీపీ
సాక్షి, విజయవాడ : నగర పోలీస్ కమీషర్గా ద్వారకా తిరుమల రావు గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీలో ఎటువంటి సవాళ్లనైనా స్వీకరిస్తామని చెప్పారు. నగరంలో ప్రాధాన్య అంశాలపై దృష్టి పెడతామని, ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్పై దృష్టి సారించినున్నట్లు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తామని, జనరల్ క్రైమ్ను కూడా అరికట్టడానికి కృషి చేస్తానని చెప్పారు. రాజధాని నగరంలో వీఐపీల తాకిడి పెరుగుతోందని, తద్వారా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. మహిళలు, పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. మహిళా మిత్రలను మరింత మలోపేతం చేస్తామని, నగర ప్రజల్లో భద్రతా భావం పెంచుతామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన ప్రజలనుంచి సలహాలు తీసుకుంటామని అన్నారు. బాధ్యతలను స్వీకరించడానికి ముందు కమీషనర్ ద్వారకా తిరుమల రావు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. బాధ్యతలు చేపట్టే ముందు అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చానని అన్నారు. నగరంలో ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పని చేసే శక్తి ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. -
‘ఒక్క ర్యాగింగ్ కేసు నమోదు కానివ్వం’
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కేవలం రెండు ర్యాగింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వచ్చే సంవత్సరం ఒక్క ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోకుండా పనిచేస్తామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. కాలేజీలలో ర్యాగింగ్ రూపు మాపాలనే ఉద్దేశంతో బషీర్బాగ్లోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం యాంటీ ర్యాంగింగ్ అవగాహనా కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ర్యాగింగ్కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్ నిర్మూలనపై, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. హైదరాబాద్ పోలీసులు, షీ టీమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అడిషనల్ సీసీ షికా గోయల్, అన్ని జోన్ల డీసీపీలు, కాలేజీ రిజిస్ట్రార్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘లేడీ సింగం’ నైటౌట్.. టెన్షన్ టెన్షన్!
పంచకుల : బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ఓ లేడీ సింగం గడగడలాడిస్తున్నారు. తమ డిపార్ట్మెంట్ పోలీసుల పనితీరు ఎలా ఉందని తెలుసుకునేందుకు నైటౌట్ చేశారు. భద్రతా చర్యలు ఎలా చేపడుతున్నారో తెలుసుకునేందుకు కమిషనర్గా వచ్చిన తొలిరోజు రాత్రి మొత్తం నగరాన్ని పర్యవేక్షించారు. హర్యానాలో ఇది హాట్ టాపిక్గా మారింది. చారు బాలి పంచకుల పోలీస్ కమిషనర్(సీపీ)గా సోమవారం ఛార్జ్ తీసుకున్నారు. అయితే రాత్రివేళ మహిళలు, సాధారణ పౌరులకు ఎంతమేరకు తమ పోలీసులు భద్రతా కల్పిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు చారు బాలి. బాధ్యతలు చేపట్టిన రోజు రాత్రే వాహనంలో పంచకుల రోడ్లపై తిరిగి పర్యవేక్షించి షాక్ తిన్నారు. పలు విధులు, ఏరియాల్లో పోలీసులు డ్యూటీలో లేకపోవడాన్ని డీసీపీ రాజేందర్ కుమార్ మీనాకు మంగళవారం తెలిపారు. పోలీసులు డ్యూటీలో ఎందుకు లేరో తనకు సాధ్యమైనంత త్వరగా వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. నైట్ షిఫ్ట్స్లో కొందరు పోలీసులను రోస్టర్ విధానంలో ప్రజల భద్రత కోసం నియమించాలని సీపీ చారు బాలి సూచించారు. అయితే కమిషనర్ ఛార్జ్ తీసుకున్న తొలిరోజే తాము డ్యూటీ ఎగ్గొట్టామని తెలిస్తే పరిస్థితి ఏంటని నైట్ డ్యూటీ పోలీసులు కంగారు పడుతున్నారు. తొలిసారి కనుక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారని.. ఇకపై బుద్ధిగా డ్యూటీ చేస్తే సరిపోతుందని పోలీసులు సర్దిచెప్పుకుంటున్నట్లు సమాచారం. లేడీ సింగం అప్పుడే రంగంలోకి దిగారంటూ పంచకుల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్లు
సాక్షి, విజయవాడ : విజయవాడలో విద్యార్థులే లక్ష్యంగా గంజాయి గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ దందా సాగిస్తున్నాయి. వీరిపై స్థానికులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన ఎన్నారై నూతక్కి నాగేశ్వరరావు అమెరికా నుంచి నేరుగా నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐటీఐ కాలేజీ ఆవరణలో గంజాయి గ్యాంగ్లు గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 13 నుంచి 15 ఏళ్లలోపు వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. మరికొన్ని సార్లు ముఠాలు శ్రుతిమించిపోతున్నాయని, విద్యార్థుల నుంచి ఫోన్లు, బ్యాగ్లు, పుస్తకాలతో పాటు ఇతర వస్తువులు గుంజుకొని రౌడీయిజానికి పాల్పడుతున్నారని తెలిపారు. స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడుకొనే ఈ గ్యాంగ్లకు ఆరుమెల్లి రామకృష్ణ అనే వ్యక్తి అండగా ఉన్నరని ఎన్నారై తన ఫిర్యాదులో ఆరోపించారు. ఒక్కోసారి వీధుల్లో ఈ గ్యాంగ్లు అల్లర్లకు పాల్పడుతూ స్థానికులను వేధిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీధుల్లో గంజాయి అమ్ముతూ, వద్దన్న వారిపై కత్తులు, బ్లేడ్లతో దాడులకు దిగుతున్నారని, విద్యార్థులు అటుగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇదంతా మాచవరం పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని సవాంగ్ను కోరారు. ఈ మేరకు గ్యాంగ్లకు సంబంధించిన పూర్తి వివరాలు, పేర్లు వారి ఫోన్ నెంబర్లతో సహా కమీషనర్కు ఫిర్యాదు చేశారు. -
4నెలలు..4బాధ్యతలు
సాక్షి, సిటీబ్యూరో: సిటీపోలీస్ కమిషనర్గా పని చేస్తున్న మహేందర్రెడ్డి డీజీపీగా వెళ్లిన తర్వాత సిటీ బాధ్యతలు స్వీకరించిన వీవీ శ్రీనివాసరావు పేరిట అరుదైన రికార్డులు మిగిలిపోతున్నాయి. సుదీర్ఘకాలం పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ) పోలీసు కమిషనర్గా పని చేయడం ఒకటైతే... ఏకకాలంలో నాలుగు పోస్టులను నిర్వహించారు. వీటిలో మూడు అత్యంత కీలకమైనవి కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 12 నుంచి సరిగ్గా నాలుగు నెలల పాటు ఎఫ్ఏసీ కమిషనర్గా పని చేసిన ఆయన సోమవారం (మార్చ్ 12) అంజనీ కుమార్కు బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో అసలు పోస్టు అదనపు సీపీతో (శాంతిభద్రతలు) పాటు మరో రెండు ఉన్నాయి. వీటి అప్పగింతలు పూర్తయితే తప్ప పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యతలు తీసుకునే అవకాశం లేదు. దీనికి మరో మూడునాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంజనీ బదిలీతోనే ఆ స్థానంలోకి... ఐజీ హోదాలో ఉన్న వీవీ శ్రీనివాసరావు నగర పోలీసు కమిషనరేట్లోకి అంజనీ కుమార్ స్థానంలోనే వచ్చారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనురాగ్ శర్మ తొలి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో జరిగిన బదిలీల్లో నగర అదనపు పోలీసు కమిషనర్గా (శాంతిభద్రతలు) ఉన్న అంజనీ కుమార్ అదనపు డీజీగా (శాంతిభద్రతలు) బదిలీ అయ్యారు. అప్పట్లో ఆక్టోపస్లో పని చేస్తున్న వీవీ శ్రీనివాసరావు అంజనీ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అదే బాధ్యతల్లో ఉన్న ఆయన మహేందర్రెడ్డి డీజీపీగా వెల్లడంతో ఎఫ్ఏసీ కొత్వాల్ బాధ్యతలు స్వీకరించారు. గతేడాది నవంబర్లో మహేందర్రెడ్డిని ఇన్చార్జ్ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే నాటికి నగర పోలీసు కమిషనర్ నియామకంపై ఓ స్పష్టత రాకపోవడంతో శ్రీనివాసరావును ఎఫ్ఏసీ సీపీగా నియమించింది. కొత్త అధికారి నియామకం జరిగినా... ఆయన రాకలో ఆలస్యం జరిగే పక్షంలో సదరు అధికారిని రిలీవ్ చేసేందుకు ఇన్చార్జ్ సీపీని నియమిస్తుంటారు. ఇందుకు సంబంధించి జారీ చేసే ఉత్తర్వుల్లో ఆయనకు హెచ్ఏసీ (హోల్డింగ్ అడిషనల్ చార్జ్) కమిషనర్గా నియమిస్తుంది. అంటే... సదరు అధికారి ఆయన విధులను నిర్వర్తిస్తూనే అదనంగా కమిషనర్ బాధ్యతలు చేపట్టాలని అర్థం. పర్యవేక్షణ మినహా హెచ్ఏసీ అధికారికి కొత్వాల్కు ఉండే ఇతర అధికారాలు ఉండవు. శ్రీనివాసరావుకు సంబంధించి ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయనను ఎఫ్ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్) కమిషనర్గా నియమించింది. దీని ప్రకారం ఆయన అదనపు సీపీ బాధ్యతలు కాకుండా పూర్తి స్థాయిలో కొత్వాల్ బాధ్యతలనే నిర్వర్తించారు. ఆ తర్వాత మరోటి. అప్పటికే శ్రీనివాసరావు అదనపు సీపీ బాధ్యతలో పాటు క్రీడల విభాగం అదనపు డీజీ బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు. ఎఫ్ఏసీ కమిషనర్గా నియామకం కావడంతో ఈయన కొత్వాల్గా కొనసాగుతూనే మొత్తం మూడు బాధ్యతలను నిర్వర్తించారు. సిటీకి కమిషనర్ నియామకం జరగకుండానే స్పెషల్ బ్రాంచ్ సంయుక్త పోలీసు కమిషనర్గా పని చేస్తున్న ప్రమోద్కుమార్ను కొన్నాళ్ళ క్రితం ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఈ బాధ్యతల్నీ సైతం శ్రీనివాసరావుకే అప్పగించింది. ఇలా దాదాపు మూడు నెలల పాటు మొత్తం నాలుగు పోస్టులను ఆయన నిర్వర్తించారు. తాజా బదిలీల్లో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్గా నియమితులు కావడంతో సోమవారం సీపీ బాధ్యతలను అంజనీ కుమార్కు అప్పగించారు. అదనపు సీపీగా (శాంతిభద్రతలు) రానున్న డీఎస్ చౌహాన్, సంయుక్త సీపీగా (స్పెషల్ బ్రాంచ్) తరుష్జోషిలకు సైతం బాధ్యతలు అప్పగించిన తర్వాత శ్రీనివాసరావు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటికే క్రీడల విభాగం అదనపు డీజీ పోస్టు ఆయన చేతిలోనే ఉంటుంది. త్వరలో ప్రభుత్వం పోలీసు విభాగంలో దాదాపు 18 వేల పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో శ్రీనివాసరావుకు కొత్త బాధ్యతలూ అత్యంత కీలకంగా మారనున్నాయి. -
కాలేజీ రోజుల్లో ఢిల్లీ పోలీస్తో ‘ఢీ’
‘కాలేజీ రోజుల్లో ఢిల్లీ పోలీసునే ఢీ కొట్టాం. ఆ కాస్సేపు నువ్వానేనా అన్నట్లు పోరాడాం. ఢిల్లీ యూనివర్శిటీ ఆధీనంలోని కేఎం కాలేజ్ బాస్కెట్ బాల్ టీమ్లో నేను ఉండగా ఢిల్లీ పోలీసు టీమ్పై ఆడినప్పటి మాట ఇది...’ అంటూ సిటీ కొత్త కొత్వాల్ అంజనీ కుమార్ తన జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో పోలీస్ యూనిఫాం అంటే ఎంతో క్రేజ్ ఉండేదని..ఆ క్రేజ్తోనే ఐపీఎస్ ఆఫీసరనయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. తనకు హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టమన్నారు. టీమ్వర్క్ ఉంటే ఏ పనిలోనైనా విజయం సాధ్యమని, తాను అందరినీ కలుపుకొనిపోయి నగరంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తానని చెప్పారు. హైదరాబాద్కు 57వ పోలీసు కమిషనర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో అంజనీకుమార్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.... సాక్షి, సిటీబ్యూరో : ‘బీహార్లోని పట్నాలోనే నా బాల్యం, స్కూలు జీవితం గడిచిపోయాయి. డిగ్రీ, పీజీ చేయడం కోసం ఢిల్లీ చేరుకున్నా. ఢిల్లీ యూనివర్శిటీతో పాటు దాని ఆధీనంలోని కాలేజీల్లో చదివా. స్కూలు రోజుల నుంచే నేను స్పోర్ట్స్ పర్సన్ను. అనేక స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొన్నా. బాస్కెట్బాల్, క్రికెట్ టీమ్స్కు కెప్టెన్గా వ్యవహరించా. ఆయా సందర్భాల్లో జరిగిన అనేక ఫంక్షన్లకు సీనియర్ ఐపీఎస్ అధికారులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యే వారు. దీంతో వారిని దగ్గర నుంచి చూసే అవకాశం దక్కింది. అప్పట్లో నాకు పోలీసు యూనిఫాం అంటే ఎంతో క్రేజ్. ఆగస్టు 15, జనవరి 26న జరిగే పెరేడ్స్ ఎంతో స్ఫూర్తి నింపాయి. అప్పట్లోనే పోలీసు అవ్వాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడది ఓ బాధ్యతగా మారింది... చిన్నప్పటి నుంచీ జాతీయ జెండాను చూసినా, జాతీయ గీతం విన్నా బయటకు చెప్పలేని పాజిటివ్ భావన కలిగేది. ఢిల్లీ యూనివర్శిటీ ఆధీనంలోని కేఎం కాలేజ్లో చదివే రోజుల్లో బాస్కెట్బాల్ టీమ్ కెప్టెన్గా వ్యవహరించా. అప్పట్లో మా జట్టు ఢిల్లీ పోలీసు జట్టుతో హోరాహోరా పోరాడి గెలిచింది. ఇలా పోలీసు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ జట్లతోనూ ఆట ఆడాం. 1990లో ఐపీఎస్కు ఎంపికై ఆంధ్రప్రదేశ్కు అలాట్ అయ్యా. జనగాం ఏఎస్పీగా కెరియర్ ప్రారంభించా. ప్రస్తుతం యూనిఫాం అన్నది ఓ బాధ్యతగా మారిపోయింది. 80 లక్షల జనాభా ఉన్న సిటీకి పోలీసు కమిషనర్గా రావడం ఈ బాధ్యతని మరింత పెంచింది. నాపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి, డీజీపీల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా. వీవీ శ్రీనివాసరావు నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్న అంజనీకుమార్ ప్రస్తుతం వాటికి పూర్తిగా దూరమైపోయా... నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో ఐపీఎస్ శిక్షణ తీసుకునే రోజుల్లో గుర్రపు స్వారీ, ఈతపై ఆసక్తి ఎక్కువగా ఉంటోంది. ఈ రెండు అంశాల్లోనూ మంచి ప్రతిభ కనబరుస్తూ వచ్చా. అధికారిగా పోస్టింగ్స్ తీసుకున్న తర్వాత కూడా ఖాళీ దొరికినప్పుడల్లా క్రీడాకారుడిగా, హార్స్ రైడర్గా మారిపోయేవాడిని. నగర పోలీసు విభాగంలో అదనపు సీపీగా పని చేసిన రోజుల్లోనూ దాన్ని కొనసాగించా. అయితే అదనపు డీజీపీగా (శాంతిభద్రతలు) బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటికి పూర్తిగా దూరమయ్యా. ఆ ఆటలు ఆడే అవకాశమే దక్కలేదు. గతంలో నగరంలో పని చేసిన అనుభవం ఇప్పుడు ఉపయుక్తంగా మారుతుంది. హైదరాబాద్ లాంటి నగరానికి సేవ చేసే అవకాశం దక్కడం అరుదైన అవకాశమే. టీమ్ వర్క్తోనే ముందుకు... సిటీ పోలీసింగ్ అంటే టీమ్ వర్క్. పోలీసు కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రతి స్థాయి అధికారీ ఇన్వాల్వ్ కావాలి. సీఎం, డీజీపీ నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవడానికి అదే పంథాలో పనిచేస్తాం. పోలీసు బాస్ ఎం.మహేందర్రెడ్డి ఆలోచనలతో అనేక విధానాలైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత ప్రాజెక్టులు సిటీలో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రానికే నగరం రోల్ మోడల్గా మారింది. భవిష్యత్తులోనూ వీటిని కొనసాగిస్తూ సమకాలీన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి, మార్పు చేర్పులు చేస్తుంటాం. పోలీసు విభాగంలో ఏ స్థాయిలోనూ అవినీతిని ఉపేక్షించేది లేదు. ఎలాంటి ఆరోపణలు వచ్చినా పక్కాగా విచారణ చేపడతాం. వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అంజనీ కుమార్ అన్నారు. ఎన్కౌంటర్ తర్వాత తీవ్ర కలకలం, సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం వ్యవహారాలపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్ ఐజీ వై.నాగిరెడ్డి అయినప్పటికీ ఆ విచారణను పర్యవేక్షించింది మాత్రం అదనపు డీజీ హోదాలో అంజనీ కుమారే. పోలో టీమ్ ఆయన డ్రీమ్... బషీర్బాగ్లోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు ఇన్చార్జ్ సీపీ వీవీ శ్రీనివాసరావు నుంచి అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో నగర పోలీసు అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గోషామహల్లో ఉన్న నగర పోలీసు అశ్వక దళం 2013కు ముందు తీవ్ర నిరక్ష్యానికి గురైంది. స్టేబుల్స్గా పిలిచే గుర్రపు శాలలు సైతం రూపు కోల్పోయాయి. అప్పట్లో నగర అదనపు పోలీసు కమిషనర్గా ఉన్న అంజనీకుమార్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. స్వతహాగా అశ్వ ప్రియుడు, రైడర్ కావడంతో జాతీయ పోలీసు అకాడెమీతో పాటు వివిధ రేస్ కోర్స్లు, స్టడ్ ఫామ్స్ తిరిగి అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేబుల్స్ను డిజైన్ చేశారు. ఆయన కృషి వల్లే 10 కొత్త గుర్రాలు సైతం నామమాత్రపు ధరకు సమకూరాయి. ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్స్/స్పోర్ట్స్ మీట్స్లో పాల్గొనేందుకు సిటీ పోలీసు తరఫున పోలో టీమ్ను తయారు చేయాలన్నది అప్పట్లో అంజనీ డ్రీమ్. 80 లక్షల జనాభా కలిగిన ఇంత పెద్ద సిటీకి కమిషనర్గా పనిచేయడం గర్వంగా ఉంది. నాకు ఈ బాధ్యత అప్పగించిన సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్రెడ్డిలకు కృతజ్ఞతలు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించి వారి నమ్మకాన్ని నిలబెడతా. – బాధ్యతల స్వీకరణ అనంతరం కొత్త పోలీస్ బాస్ అంజనీకుమార్ -
పెద్దల పెళ్లి ఉంది.. అటు వైపు వెళ్లద్దు
సాక్షి, బెంగళూరు: ‘నగరంలోని ప్యాలెస్ మైదానంలో రేపు సాయంత్రం పెద్దల పెళ్లి జరుగుతోంది. ప్యాలెస్ మైదానం వైపుగా వెళ్లకుండా వాహనదారులు ప్రయాణం మళ్లించుకోండి’ ఇది సాక్షాత్తు నగర ట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ ఆర్.హితేంద్ర చేసిన ట్వీట్. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ కుమారుడు సూరజ్ గౌడ్ వివాహం జరిగింది. ఈ వివాహం నేపథ్యంలో ట్రాఫిక్ కమిషనర్ ఈ మేరకు నగర పౌరులకు ట్వీటర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. బెంగళూరు విమానాశ్రయాన్ని నేరుగా చేరుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గమని, దారి మళ్లించుకోవడం కుదరదని నెటిజన్లు గట్టిగా చెప్పారు. పెద్దల కోసం సామాన్యులు ఎందుకు దారి మళ్లించుకోవాలంటూ మరికొందరు ఘాటుగా ప్రశ్నించారు. నెటిజన్ల ట్వీట్లకు హితేంద్ర కూడా ఘాటుగానే బదులిచ్చారు. పెద్దల పెళ్లి ఉంది కాబట్టి చాలా మంది ప్రముఖులు వివాహానికి హాజరవుతారని, ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తే ప్రమాదముందని, అందుకే ప్రజలకు తెలియజేద్దామని సూచించినట్లు తెలిపారు. ఇది కేవలం ఒక సూచన మాత్రమేనని, నిబంధన కాదని వెల్లడించారు. నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో తాను ట్వీట్ చేసినట్లు పేర్కొన్నారు. -
దక్షిణ మధ్య రైల్వే జీఎంకు వారంట్
సాక్షి, హైదరాబాద్: కోర్టు ముందు స్వయంగా హాజరు కావాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వి.కె.యాదవ్కు ఉమ్మడి హైకోర్టు శుక్రవారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వారంట్ అమలుకు చర్యలు తీసుకుని, ఈ నెల 25న యాదవ్ కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ షమీమ్ అక్తర్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి మరణించిన నేపథ్యంలో ఆయన కుమారుడిగా తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రతాప్ అనే వ్యక్తి రైల్వే అధికారులను కోరారు. రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వరాదన్న సర్క్యులర్ను కారణంగా చూపుతూ ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై ప్రతాప్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.సుధాకర్రెడ్డి వాదనలు వినిపిస్తూ, రెండో భార్య కుమారుడు కారుణ్య నియామకానికి అర్హుడు కాదన్న రైల్వేశాఖ సర్క్యులర్ను బాంబే, కలకత్తా హైకోర్టులు కొట్టేశాయని, ఆ తీర్పులపై రైల్వే అధికారులు అప్పీళ్లు దాఖలు చేయలేదన్నారు. వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రతాప్కు ఉద్యోగం ఇచ్చే విషయంలో 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ గత జూలైలో ఉత్తర్వులిచ్చింది. వీటిని అమలు చేయకపోవడంతో ప్రతాప్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం 20న కోర్టు ముందు హాజరు కావాలని వి.కె.యాదవ్ను ఆదేశించింది. శుక్రవారం ఆయన కోర్టు ముందు హాజరు కాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజినల్ పర్సనల్ ఆఫీసర్ జె.బలరామయ్య వ్యక్తిగత హాజరుకు సైతం ఆదేశాలిచ్చింది. -
‘దొంగ’ పోలీస్!
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): దొంగలను క్రమశిక్షణలో పెట్టాల్సిన జైలు కానిస్టేబుల్.. వారితోనే చేతులు కలిపాడు. ఎత్తుకొచ్చిన బంగారాన్ని విక్రయించేలా చోరులతో ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు గాను తులానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని ఇద్దరు అంతర్ జిల్లాల దొంగలతో ‘అగ్రిమెంట్’ చేసుకున్నాడు. సదరు చోరులు పట్టుబడడంతో ఆ కానిస్టేబుల్ ‘దొంగ వ్యవహారం’ బయటపడింది. నిందితుల అరెస్టు చేశామని, సదరు జైలు కానిస్టేబుల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో వివరాలు వెల్లడించారు. నిజామాబాద్లోని అంబేద్కర్ కాలనీకి చెందిన బొమ్మెర్ల సోమేశ్, కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్ కాలనీకి చెందిన మహ్మద్ షాహిద్ పాత నేరస్తులు. గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో జైలులో ఉన్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. గత నవంబర్ 16న శిక్ష పూర్తి కావడంతో ఇద్దరు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా వాళ్ల ప్రవర్తన మారలేదు. నవంబర్ నుంచి జనవరి వరకు నిజామాబాద్ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఏకంగా 15 సార్లు దొంగతనాలకు పాల్పడ్డారు. వరుసగా చోరీలు జరుగుతుండంతో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఈ క్రమంలో కంఠేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో చోరీ చేసేందుకు రాగా, అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. మొత్తం 12 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి నుంచి 16 తులాల బంగారం, 50 తులాల వెండి, ఒక కెమెరా, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సోమేష్పై 30 కేసులుండగా, షాహిద్పై 28 కేసులు ఉన్నాయి. ఇందులో నాన్బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయని సీపీ తెలిపారు. ‘దొంగ’లతో కలిసిన కానిస్టేబుల్! 30 కేసుల్లో నిందితుడైన సోమేశ్, 28 కేసుల్లో ముద్దాయిగా ఉన్న షాహిద్ తరచూ జైలుకు వెళ్తుండే వారు. ఈ క్రమంలో వారికి జైల్ కానిస్టేబుల్ సయ్యద్ ఖలీమ్ అహ్మద్తో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు నిందితులతో చేతులు కలిపాడు. మీరు దొంగిలించిన సొత్తును అమ్మి పెడతానని, ఇందుకు ప్రతిఫలంగా తులానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని సోమేశ్, షాహిద్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో నిందితులు రెండు నెల వ్యవధిలో దొంగిలించిన సొత్తును సదరు కానిస్టేబుల్ వద్ద పెట్టారు. ఈ విషయం పోలీసుల విచారణలో తేలటంతో అధికారులు నివ్వెర పోయారు. వెంటనే సయ్యద్ ఖలీంను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సీపీ తెలిపారు. దొంగలను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, 6వ టౌన్, మోపాల్, రూరల్ ఎస్సైలు లక్ష్మయ్య, సతీష్, శ్రీధర్, హెడ్ కానిస్టేబుల్స్ గఫార్, రమేశ్, కానిస్టేబుల్స్ ముఖీం, ఈశ్వర్, పోచయ్య, సురేశ్, శ్రీకాంత్, లింబాద్రి, పవన్లను అభినందించిన సీపీ.. వీరికి రివార్డులు అందజేస్తామన్నారు. -
'ఏడు రోజుల్లో చార్జిషీట్.. రంగంలోకి సీబీఎస్ఈ'
గుర్గావ్: దారుణ హత్యకు గురైన రెండో తరగతి బాలుడి కేసు విషయంలో కేసు విషయంలో కేంద్ర మాద్యమిక విద్యా విభాగం(సీబీఎస్ఈ) రంగంలోకి దిగింది. గుర్గావ్లో జరిగిన ఈ దుర్ఘటనలో నిజనిర్దారణ చేసేందుకు ఇద్దరుతో కూడిన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. రెండు రోజుల్లో కేసు వివరాలను తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ విచారణ కమిటీకి పాఠశాల సహకరించాలని, వాస్తవాలేమిటో వివరించడంతోపాటు ఎఫ్ఐఆర్ రిపోర్ట్తోపాటు ఇతర వివరాలను తమకు పంపించాలని ఆదేశించింది. ఈ కేసును నిజనిర్దారణ కమిటీ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తుందని కూడా స్పష్టం చేసింది. విచారణలో స్కూల్ నిర్లక్ష్యం, బాధ్యత ఉందని తేలితే పాఠశాల గుర్తింపును కూడా రద్దు చేస్తామని ఈ సందర్భంగా సీబీఎస్ఈ తరుపున హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఉపేంద్ర కుశ్వాహ హెచ్చరించారు. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దని కూడా స్పష్టం చేశారు. మరోపక్క, ఈ కేసు విచారణ వాయువేగంతో ముందుకెళుతోంది. వారం రోజుల్లో కేసుకు సంబంధించిన చార్జిషీట్ను వేస్తామని ఈ కేసు విచారణ చూస్తున్న గుర్గావ్ పోలీస్ కమిషనర్ సందీప్ ఖిర్వార్ హామీ ఇచ్చారు. బస్సు కండక్టర్ ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు స్పష్టమైందని, అయితే, మరేదైనా కోణం ఈ హత్య వెనుక ఉందా, ఈ హత్యకు ఎవరైనా ప్రేరేపించారా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని ముగ్గురుతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశామని, వారంలో కేసు చార్జిషీట్ను వేస్తామని స్పష్టం చేశారు. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ హత్య చోటు చేసుకున్న విషయం తెలిసిందే. -
విజయవాడకు కొత్త పోలీస్ కమీషనర్ !
-
బెల్లంపల్లి ఏసీపీపై బదిలీ వేటు
►పోలీస్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ మెమో ►ఏసీపీ సతీష్ బదిలీలో రాజకీయ జోక్యం? ►ఆరోపణల వెనుక వెలుగుచూడని మరో కోణం! ►అక్రమార్కులకు అండ, నకిలీ పత్తి విత్తన వ్యాపారులతో మైత్రి ఆరోపణలు ►రామగుండం కమిషనర్ దుగ్గల్ విచారణ..ప్రభుత్వానికి నివేదిక ►మంచిర్యాల ఏసీపీ చెన్నయ్యకు అదనపు బాధ్యతలు మంచిర్యాల: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే వివాదాస్పద అధికారిగా వార్తల్లోకెక్కిన బెల్లంపల్లి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) సిహెచ్.సతీష్పై బదిలీ వేటు పడింది. సతీష్ను రాష్ట్ర పోలీస్ హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ డీజీపీ అనురాగ్శర్మ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన స్థానంలో మంచిర్యాల ఏసీపీ సిహెచ్.చెన్నయ్యకు బెల్లంపల్లి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని డీజీపీ కార్యాలయం ఓ మెమో ద్వారా తెలిపింది. కాగా పోలీస్ శిక్షణ కోసం 21 రోజుల పాటు మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ వెళ్లిన ఏసీపీ సతీష్ తిరిగి వచ్చి విధుల్లో చేరినరోజే ఆయనపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశమైంది. అవినీతి, అక్రమాలకు అండగా నిలవడంతో పాటు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఏసీపీ వ్యవహారంలో మరో కోణం వెలుగుచూడకుండా ‘జిల్లా రాజకీయం’ పనిచేసిందని తెలుస్తోంది. సతీష్ను బలి చేయడానికి ఒక్కటైన యంత్రాంగం తమ అక్రమాలు వెలుగులోకి రాకుండా పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించినట్లు సమాచారం. స్వయంకృతమా... రాజకీయమా..? బెల్లంపల్లి ఏసీపీ సతీష్పై బదిలీ వేటు పడడం స్వయంకృతమా? బలమైన రాజకీయ కారణం ఉందా? అనే అంశం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏసీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన వ్యవహా రశైలి వివాదాస్పదంగానే ఉంది. పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమార్కులకు అండగా ఉన్నట్లు సీఎం స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. అయినా ఆయనపై డీజీపీ అనురాగ్శర్మ ఎలాంటి చర్యలూ తీసుకోలే దు. అంతా సద్దుమనిగిందని భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా బదిలీ వేటు పడడం చర్చకు కారణమవుతోంది. జూన్ ఆఖరి వారంలో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తగా విచారణ అధికారిగా రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ వ్యవహరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అయితే ఆరోపణలతో అట్టుడికినప్పుడు పోలీస్ శాఖ ఏసీపీ సతీష్ విషయంలో స్పం దించలేదు. ఆయన జూలై 24న షిల్లాంగ్లోని నార్త్ ఈస్టర్న్ పోలీస్ అకాడమీలో 21 రోజుల శిక్షణ పూర్తిచేసుకొని ఈనెల 11న తిరిగి వచ్చారు. సోమవారం డ్యూటీలో చేరిన రోజే బదిలీ వేటు వేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ బదిలీ వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు బడా వ్యక్తులను కాపాడడానికి ఏసీపీని బలిచేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. పకడ్బందీ వ్యూహమా..? బెల్లంపల్లి ఏసీపీ పరిధిలోకి మందమర్రి మునిసిపాలిటీ కూడా వస్తుంది. బెల్లంపల్లి, మందమర్రిలో జరిగే అవినీతి, అక్రమ కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్, ఇసుక దందా, ప్రజాప్రతినిధుల పేరుతో సాగే ఆగడాల విషయంలో ఏసీపీ వ్యవహారశైలి ఎవరికీ అంతు చిక్కలేదు. సుమారు కోటి రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలను మందమర్రి మండలం గద్దెరేగడి సమీపంలో సీజ్ చేసిన కేసులో తొలిసారి ఏసీపీ వివాదంలోకి వచ్చారు. ఈ కేసులో లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణతో ఏసీపీపై ఉచ్చు బిగిసింది. దీనికితోడు ఓ పెట్రోల్బంక్ యజమాని నుంచి లక్షలు వసూలు చేశారని, డబ్బులు ఇవ్వని మరో పెట్రోల్బంక్ యజమానిని కేసుల్లో ఇరికించారని ఆరోపణలు వచ్చాయి. ఏసీపీ పరిధిలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో గిట్టని వారిని వేధించినట్లు కూడా విమర్శలున్నాయి. ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులపైనే కేసులు నమోదు చేసి వేధించడం, ఇసుక అక్రమ రవాణాదారులకు అండగా ఉండడం వంటి ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో పలు అంశాల్లో ఫిర్యాదులు ఎదుర్కొన్న బడా వ్యక్తులపై ఎలాంటి కేసులు నమోదు చేయలేని పరిస్థితి ఎదురైంది. సతీష్ సతీమణి కవిత జైపూర్ ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె జైపూర్ పరిధిలో అక్రమార్కుల వెన్నులో చలి పుట్టించారు. ఇసుక దందా చేసే బడా డాన్ల మీదే కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నూర్లో ఇసుక మాఫియా డాన్గా పేరున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు ‘మరోవైపు నుంచి నరుక్కువచ్చే’ సూత్రాన్ని పాటించి సతీష్ను మానసికంగా దెబ్బతీసేలా దాడి చేసినట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. సతీష్ బదిలీ వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు వారు ఆరోపిస్తున్నారు. -
గుట్కాపై గూండా యాక్ట్
♦ ఇక, ఉక్కు పాదం ♦ నాన్ బెయిలబుల్ కేసులు ♦ చెన్నై పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు గుట్కా, మావా, జర్దా వంటి మత్తు పదార్థాలను విక్రయించే వారి భరతం పట్టేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు. ఇక, నాన్బెయిల్ వారెంట్తో కూడిన గుండా చట్టాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు ఆదేశాలను నగర పోలీసు కమిషనర్ విశ్వనాథన్ జారీచేశారు. గస్తీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. నిఘా పెంచాలని సూచించారు. ఈనేపథ్యంలో ఆదివారం పోలీసులు రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు జోరందుకున్నాయి. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో గుట్కా, మావా, జర్దా, హాన్స్ వంటి పొగాకు వస్తువుల్ని నిషేధించి ఉన్నారు. ఈ నిషేధంతో రాష్ట్రంలోకి ఇటీవల గంజాయి ప్రవేశం మరింతగా పెరిగింది. అన్నిరకాల మత్తు పదార్థాలకు నిషేధం ఉన్నా, మార్కెట్లో మాత్రం యథేచ్ఛగా ఆ వస్తువులు లభిస్తుండడం గమనార్హం. చిన్న చిన్న దుకాణాల్లోనే కాదు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోనూ గుట్కాలు జోరుగా లభిస్తుండటంతో యువత పెడదారి పడుతోందని చెప్పవచ్చు. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం, పోలీసుల బృందాల తనిఖీలు సాగుతున్నా, పట్టుబడేది మాత్రం గోరంతే అన్న విమర్శలు ఉన్నాయి. ఇక, గుట్కాల విక్రయాల వ్యవహారంలో పోలీసు బాసులు చేతివాటం సైతం ఉన్నట్టుగా ఇటీవల వెలుగులోకి వచ్చింది. మంత్రితో పాటుగా పోలీసు పెద్దల సహకారంతోనే రాష్ట్రంలోకి గుట్కాలు తరలి వస్తున్నట్టు, పాన్ మసాలాల అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు వెలుగులోకి వచ్చిన సమాచారం వివాదానికి దారితీసింది. వ్యవహారం కోర్టుకు సైతం చేరడంతో పోలీసు బాసులు తమ జాగ్రత్తల్లో పడ్డారు. ఇక, గుట్కాలు వంటి మత్తు పదార్థాలు విక్రయించే వారి భరతం పట్టే విధంగా నాన్ బెయిలబుల్ సెక్షన్తో కూడిన గూండా చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధం అయ్యారు. భరతం పడతారు జనవరి ఒకటో తేదీ నుంచి చెన్నై నగరంలో గుట్కా, గంజాయి వంటి మత్తుపదార్థాలు, పొగాకు వస్తువుల విక్రయాలకు సంబంధించి పోలీసులు 1120 కేసులు నమోదు చేసిన 1919 మందిని అరెస్టు చేశారు. ఈ ఏడు నెలల కాలంలో రూ.57 లక్షల 84 వేల 381 విలువ గల పొగాకు వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 84 వేల గుట్కా ప్యాకెట్లు, 8 వేల కేజీల మేరకు గంజాయి ఉందని చెప్పవచ్చు. తమమీద ప్రసుత్తం ఆరోపణలు బయలుదేరిన నేపథ్యంలో ఇక, గుట్కా విక్రయదారుల భరతం పట్టే విధంగా చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ ఆయా స్టేషన్లకు ఉత్తర్వులను జారీచేశారు. ఆమేరకు ఇక, గుట్కా వంటి వాటిని విక్రయిస్తూ పట్టుబడే వారి మీద గూండా చట్టం నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల పరిసరాల్లోని చిన్న చిన్న దుకాణాల మీద నిఘా పెంచాలని సూచించి ఉన్నారు. అలాగే, ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వాహనాల మీద నిఘా వేయడంతో పాటుగా, ఎవరైనా గుట్కా నములుతూ కనిపించినా, వారిని పట్టుకుని , ఎక్కడ విక్రయిస్తున్నారో ఆరా తీసి, ఆయా దుకాణాల మీద చర్యలు తీసుకునే విధంగా గస్తీ పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. ఇక, పొగాకు వస్తువుల్ని విక్రయించినా, బయటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలిస్తూ పట్టుబడినా, ఉపేక్షించబోమని, గూండా చట్టం నమోదు చేయడం తథ్యమని కమిషనర్ హెచ్చరించడం గమనార్హం. దాడులు గుండా యాక్ట్ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాల్లో ఆదివారం తమ దూకుడు ప్రదర్శించారు. దుకాణా ల్లో విక్రయిస్తున్న పాన్ మసాలా, గుట్కా వంటివి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడులు జోరందుకున్నాయి. కన్యాకుమారి జిల్లాలో అయితే, పెద్దఎత్తున గుట్కాలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.పది లక్షలుగా నిర్ధారించారు. -
బోనాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఆ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆది–సోమవారాల్లో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి పూజ ముగిసే వరకు: ♦ఉజ్జయిని మహంకాళి పూజ ముగిసే వరకు టుబాకో బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్, అధ్వయ్య చౌరస్తాల నుంచి మహంకాళి దేవాలయం వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్ అనుమతించరు. బాటా చౌరస్తా నుంచి రామ్గోపాల్పేట పోలీసుస్టేషన్ మధ్య ఉన్న సుభాష్ రోడ్లో వాహనాలకు మూసేస్తారు. ♦కర్బాలా మైదాన్ నుంచి రాణిగంజ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్ను మినిస్టర్స్ రోడ్, రసూల్పుర చౌరస్తా, సీటీఓ, ఎస్బీహెచ్ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, సెయింట్ జాన్స్ రోటరీ, గోపాలపురం లైన్, రైల్వేస్టేషన్ మీదుగా పంపిస్తారు. ♦ బైబిల్ హౌస్ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్ను ఘాస్మండి చౌరస్తా, సజన్లాల్ స్ట్రీట్ మీదుగా పంపిస్తారు. ♦ రైల్వేస్టేషన్ నుంచి ట్యాంక్బండ్ వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని అల్ఫా హోటల్, గాంధీ ఎక్స్ రోడ్, మహంకాళి ఓల్డ్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్, ఘాస్మండి, బౌబిల్ హౌస్, కర్బాలా మైదాన్ మీదుగా పంపిస్తారు. ♦రైల్వేస్టేషన్ నుంచి తాడ్బండ్, బేగంపేట వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని క్లాక్ టవర్, ప్యాట్నీ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, ఎస్బీహెచ్ చౌరస్తా మీదుగా మళ్ళిస్తారు. ♦ ఎస్బీహెచ్ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్ వైపు వెళ్ళే ట్రాఫిక్ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్ టవర్, ప్యారడైజ్ వైపు, ప్యారడైజ్ నుంచి ఆర్పీ రోడ్కు వచ్చే ట్రాఫిక్ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్, క్లాస్టవర్ వైపు పంపిస్తారు. ♦ క్లాక్ టవర్ వైపు నుంచి ఆర్పీ రోడ్లోకి వెళ్ళే ట్రాఫిక్ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు పంపిస్తారు. ♦ సీటీఓ జంక్షన్ నుంచి ఎంజీ రోడ్ వైపు వెళ్ళే ట్రాఫిక్ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సింధికాలనీ, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ చౌరస్తా, కర్బాలా మైదాన్ వైపు, ప్యాట్నీ చౌరస్తా నుంచి వచ్చే ట్రాఫిక్ను ప్యారడైజ్ చౌరస్తా నుంచి సీటీఓ వైపు పంపిస్తారు. సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు: ♦ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, సెయింట్ మేరీస్ రోడ్ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. హకీంపేట్, బోయిన్పల్లి, బాలానగర్, అమీర్పేట్ వైపుల నుంచి సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే బస్సుల్ని క్లాక్ టవర్ వరకే అనుమతిస్తారు. పార్కింగ్ ప్రాంతాలివి: సెయింట్ జాన్స్ రోటరీ, స్వీకార్ ఉప్కార్, ఎస్బీహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజ్ కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్, ఘాసీమండీ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇస్లామియా హైస్కూల్ రాణిగంజ్, ఆదయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్ హైస్కూల్ సుభాష్ రోడ్ వైపు నుంచి వచ్చే వాహనాలకు పాత జైల్ఖానాలోని ప్రాంతం మంజు «థియేటర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు అంజలి థియేటర్ మద్యం విక్రయాలపై ఆంక్షలు... సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి బోనాల నేపథ్యంలో ఉత్తర, మధ్య మండలాల్లోని కొన్ని ఠాణాల పరిధిలో మద్యం విక్రయాలు నిషేధిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు గోపాలపురం, చిక్కడపల్లి, లాలగూడ, తుకారాంగేట్, మహంకాళి, మార్కెట్, మారేడ్పల్లి, కార్ఖానా, బేగంపేట, తిరుమలగిరి, రామ్గోపాల్పేట, గాంధీనగర్ ఠాణాల పరిధిలో ఇవి వర్తిస్తాయి. స్టార్ హోటల్స్లో ఉండే బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపునిచ్చారు. -
ఏం చెప్పారు.. సీపీగారూ...
►ట్రాఫిక్ వ్యవస్థ పనిచేయకపోవడం కుట్ర పూరితమా..? ►మరి మూడు రోజులు మీరంతా ఏం చేస్తున్నట్టు ►సిగ్నల్స్ పనిచేయకపోతే.. పోలీసులైనా ఉండాలి కదా ►మరి వారంతా కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్లినట్టు ►ఇలాగైతే మహానాడు భద్రత ఎలా? ►సీపీ వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు నగరంలో మూడు రోజులుగా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం కుట్ర పూరితమట!.. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ కాంట్రాక్టు సంస్థ స్టాన్ పవర్ అలక్ష్యం వల్లే మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థ కుప్పకూలిందట!! వెంటనే సదరు సంస్థపై కేసు కూడా పెట్టేశారట!!! మూడు రోజులుగా నగర ప్రజలకు నరకం చూపిస్తున్న ట్రాఫిక్ వ్యవస్థ వైఫల్యంపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ చెప్పుకొచ్చిన సంజాయిషీ ఇది. ఈ వివరణలు సంతృప్తిçకరంగాలేకపోగా.. కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.. మరిన్ని విమర్శలకు తావిస్తున్నాయి. యోగానంద్ మీడియా ముందుకొచ్చి ఇదంతా కుట్రపూరితమని చెప్పుకొచ్చారు. సీపీ చెప్పినట్టుగానే జీవీఎంసీ, సిగ్నల్ కాంట్రాక్టు సంస్థ వైఫల్యమే అనుకుందాం.. మరి మూడురోజుల పాటు పోలీసు అధికారులు ఎందుకు స్పందించలేదు?.. సోమవారం నుంచి బుధవారం వరకు విశాఖ మహానగరంలో ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా పనిచేయలేదంటే పోలీసు వ్యవస్థ ఏమేరకు పని చేస్తున్నట్టు??.. ఒకవేళ నిజంగానే సదరు సంస్థల నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే సిగ్నల్స్ పనిచేయలేదనే అనుకుందాం.. మరి ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నట్టు.. వెంటనే పసిగట్టి సంబంధిత శాఖల అధికారులను అప్రమత్తం చేయాలి కదా.. ట్రాఫిక్ సిబ్బంది ఎక్కడ? రోజుల తరబడి సిగ్నల్స్ పనిచేయని పరిస్థితిలో కనీసం పోలీసులు అక్కడే విధులు నిర్వర్తించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలి కదా.. కానీ ఈ మూడురోజుల్లో నగరంలోని సిగ్నల్స్ వద్ద ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వందల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఉన్నట్టుండి ఏమైపోయారు.. ఖాకీలంతా కట్టకట్టుకుని ఒక్కసారిగా ఎక్కడికి వెళ్లినట్టు... ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం నగర ప్రజలందరికీ తెలుసు. మహానాడు పనుల్లో ఖాకీలు మునిగితేలడం వల్లే ఈ ట్రాఫిక్ వైఫల్యం అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఏమో సీపీ చెప్పినట్టు జీవీఎంసీ, స్టాన్పవర్ల నిర్లక్ష్యం వల్ల సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తి ఉండవచ్చు.. కానీ ట్రాఫిక్ జంక్షన్లలో ఒక్క పోలీసు కూడా విధులు నిర్వర్తించని తప్పిదానికి ఎవరిని బాధ్యులను చేయాలన్నది పోలీసు అధికారులకే వదిలేయాలి. ఇలాగైతే మహానాడు భద్రత ఏమేరకు మూడురోజుల పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడానికి కారణం కనుక్కునేందుకు విశాఖ పోలీసులకు మూడురోజుల సమయం పట్టింది. ఇంతటి ఘనత వహించిన పోలీసులు మహానాడుకు ఏ మేరకు భద్రత కల్పిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా నిర్వహిస్తున్న మహానాడుకు సీఎంతో సహా మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల చైర్మన్లు, ప్రజాప్రతినిధులతో పాటు పాతిక వేలమందికి పైగా టీడీపీ కార్యకర్తలు తరలిరానున్నారు. వీరి భద్రతా సిబ్బందితో పాటు మందీమార్బలమంతా మూడు, నాలుగురోజులు ఇక్కడే మకాం వేయనున్నారు. ఇక అధికార యంత్రాంగం తరలిరానుంది. ఓ విధంగా రాష్ట్రంలో పాలన మూడురోజుల పాటు ఇక్కడి నుంచే కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏ మేరకు భద్రత కల్పిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మహానాడు నేపథ్యంలో ఎటూ నగర పౌరుల భద్రతను గాలికొదిలేసిన ఖాకీలు కనీసం మహానాడుకైనా సరైన భద్రత కల్పిస్తే అదే మహా యోగం.. అనే పరిస్థితి ఇక్కడ నెలకొంది. -
టీఆర్ఎస్ బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు
-
బహిరంగ సభకు భద్రతా ఏర్పాట్లు..
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వెల్లడించారు. ఆరు వేల మంది పోలీసు సిబ్బందితో బహిరంగ సభ కోసం విధులు నిర్వహిస్తారని తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాదాపు 25 లక్షల మేరకు ప్రజలు హాజరయ్యే అవకాశాలు ఉన్నందున పార్కింగ్, ట్రాఫిక్ వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చోట్లా పికెటింగ్ నిర్వహిస్తూ పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు జారీ చేస్తామని చెప్పారు. సభకు హాజరయ్యే వారి వాహనాలను పార్క్ చేసుకోవడానికి వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే సభకు వెళ్లడానికి 21 రహదారులను ఏర్పాటు చేశామన్నారు. -
డిపాజిట్దారులకు భారీ ఊరట!
- టీఎస్పీడీఎఫ్ చట్టంలో కీలక సవరణ - చార్జ్షీట్ దాఖలుకు ఇన్స్పెక్టర్లూ అర్హులే సాక్షి, హైదరాబాద్: బోగస్ ఆర్థిక సంస్థల్ని నమ్మి, డిపాజిట్లు పెట్టి నిండా మునిగిన డిపాజిట్దారులకు పెద్ద ఊరటే లభించింది. ఈ కేసుల దర్యాప్తులో ప్రధాన అడ్డంకిగా ఉన్న ‘చార్జ్షీట్ అధికారాల’సమస్యకు హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు మార్గం కనిపెట్టారు. ఇన్స్పెక్టర్ కంటే తక్కువ స్థాయి కాని వారు అభియోగపత్రాలు దాఖలు చేయవచ్చంటూ తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (టీఎస్పీడీఎఫ్) రూల్స్కు కీలక సవరణకు తీసుకువచ్చారు. సీసీఎస్ అధికారులు రూపొందించిన సవరణ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి కేవలం నగరానికే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ వర్తిస్తాయని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. ఆస్తుల స్వాధీనానికి ఆస్కారం... ఆర్థికాంశాలు ముడిపడి ఉన్న ప్రతి కేసులోనూ టీఎస్పీడీఎఫ్ చట్టాన్ని ప్రయోగించడానికి ఆస్కారం లేదు. ఏఏ ఉదంతాల్లో అయితే నిందితులు బాధితుల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బు సేకరిస్తారో వాటిలో మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. మిగిలిన చట్టాల కింద నమోదైన కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు వారి ఆస్తులు మొత్తాన్ని స్వాధీనం చేసుకునే ఆస్కారం లేదు. కేవలం ఆ నేరానికి సంబంధించిన డబ్బుతో సమీకరించుకున్న వాటినే సీజ్ చేయాలి. అయితే టీఎస్పీడీఎఫ్ చట్టం కింద నమోదైన కేసుల్లో మాత్రం నిందితులతో వారి సన్నిహితుల ఆస్తుల్ని సైతం స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇలా సీజ్ చేస్తున్న ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి పంపడం ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని పోలీసు విభాగం న్యాయస్థానానికి అప్పగిస్తుంది. నిందితులపై నేరం రుజువై, దోషులుగా తేలిన తర్వాత వేలం వేసి, అలా వచ్చిన డబ్బును బాధితులకు పంచే ఆస్కారం ఉంటుంది. సవరణ ప్రతిపాదించిన సీసీఎస్... గతంలో ఈ తరహా కేసుల్లో పోలీసు కమిషనర్/జిల్లా కలెక్టర్ మాత్రమే అభియోగపత్రాలు దాఖలు చేసే ఆస్కారం ఉంది. అలా కాకుండా దర్యాప్తు అధికారులు అభియోగపత్రాలు దాఖలు చేస్తే నిబంధనలకు విరుద్ధం కావడంతో న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. దీంతో ఏళ్లుగా అనేక కేసులు పెండింగ్లో ఉండిపోయి బాధితులకు ఊరట లభించట్లేదు. ఒక్క సీసీఎస్లోనే దాదాపు 50 కేసులో ఈ కారణంగా పెండింగ్లో ఉండిపోయాయి. నగర నేర పరిశోధన విభాగం డీసీపీగా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించిన తరువాత టీఎస్పీడీఎఫ్ చట్టం కింద నమోదైన కేసులు అనేకం పెండింగ్లో ఉండడంపై ఆరా తీయగా... అభియోగపత్రాలు దాఖలు అధికారం అంశం బయటపడింది. దీంతో ఇన్స్పెక్టర్ కంటే తక్కువ స్థాయి కాని అధికారి ఎవరైనా అధీకృతులే అని, వారు అభియోగపత్రాలు దాఖలు చేయవచ్చంటూ సవరణకు ప్రతిపాదించారు. దీనికి ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీసీఎస్లో ఉన్న టీఎస్పీడీఎఫ్ కేసుల్లో అభియోగపత్రాలు దాఖలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఫోర్త్ లయన్ యాప్ కొత్త వెర్షన్ విడుదల
భవానీపురం : ఫోర్త్ లయన్ యాప్ను ప్రజలకు మరిన్ని సేవలను అందించేందుకుగాను దానిని ఆధునీకరించి రూపొందించిన కొత్త వెర్షన్ను విడుదల చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ను అప్డేట్ చేసుకోవాలని కోరారు. కొద్ది రోజులలో ఐఓఎస్ వెర్షన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. యాప్ కొత్త వెర్షన్లో పొందుపరిచిన సౌకర్యాలు ► హోమ్ పేజి డిజైన్ మార్చి మరింత ఆకర్షణీయంగా నగర పోలీస్ వెబ్సైట్ వివరాలు ఇచ్చారు ► పబ్లిక్ ఇన్ఫర్మేషన్లోని పోలీస్ స్టేషన్ ఆప్షన్లో ఆ స్టేషన్ను కాంటాక్ట్ చేసేందుకు ఫోన్ నెంబర్, స్టేషన్ ఉండే ప్రాంతాన్ని మ్యాప్లో చూపించారు. ► నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు పొందుపరిచారు. తద్వారా వారిని ఫోన్ ద్వారా సంప్రదించే అవకాశం కల్పించారు. ► రహదారులలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల (లైవ్ ట్రాఫిక్లో బ్లాక్ స్పాట్స్) వివరాలను ఇచ్చారు. ఈ సమాచారంతో బ్లాక్ స్పాట్స్ వద్ద జాగ్రత్తగా ప్రయాణం చేయవచ్చు. అలాగే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి పోలీస్ స్టేషన్, హాస్పటల్ ఎంత దూరంలో ఉంది అనే వివరాలను పొందుపరిచారు. రాబోయే వెర్షన్లో దీనిని మరింత మెరుగుపరచనున్నారు. యాప్లో ప్రత్యేక సర్వీసులు ► మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా ‘ట్రాక్ మై ట్రావెల్’, ఎస్ఓఎస్ను పొందుపరిచారు. ఏదైనా ప్రమాదాన్ని ఊహిస్తే యాప్లో ఈ బటన్ను నొక్కడం వలన పోలీసులు అప్రమత్తమై మీరు ఉన్న ప్రాంతానికి అతి తక్కువ సమయంలో చేరుకుని రక్షిస్తారు. ► నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో విజయవాడ నగరం, చుట్టు పక్కల ప్రాంతాలలో స్థిరపడేందుకు ఉద్యోగరీత్యాగానీ, జోవనోపాధి కోసంగానీ ఎంతోమంది వస్తున్నారు. అటువంటివారికి ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు, కొత్తగా పనులలో కుదుర్చుకునేటప్పుడు, డ్రైవర్లను నియమించుకునే సమయంలో వారి వివరాలను ఈ యాప్లోని ‘వెరిఫికేషన్’ ఆప్షన్ ద్వారా పంపితే, పోలీసులు వారి గురించి విచారించి వారి వివరాలను దరఖాస్తుదారునికి తెలియచేస్తారు. మంచివారిని పనిలోకి తీసుకోవడం, సరైనవారికి ఇల్లు అద్దెకు ఇచ్చుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. ► ఊరు వెళ్లాల్సివచ్చినప్పుడు ఇంటి వివరాలను వెకేషన్ ఇన్ఫర్మేషన్లో పొందుపరిస్తే, ఆ ప్రాంతంలో పోలీసు బీటును ఏర్పాటు చేస్తారు. ప్రజలందరూ ఈ యాప్ను ఉపయోగించుకుని పోలీసుల సేవలను అందుకోవాలని కోరారు. -
188 ఏళ్ల తర్వాత
లండన్: దాదాపు 188 సంవత్సరాల తర్వాత తొలిసారి ఓ మహిళ లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్కు కమిషనర్గా నియమితులయ్యారు. స్కాట్లాండ్ యార్డ్ కమిషనర్గా ఉన్న బెర్నాడ్ హోగన్హోవ్ వచ్చే వారం పదవివిరమణ చేయనున్నారు. ఇదే డిపార్ట్మెంట్లో గతంలో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహించిన క్రెసిడా డిక్ను కమిషనర్గా నియమించారు. 2015లో డిక్ విదేశాంగ శాఖలో విధులకు వెళ్లారు. తాజాగా ఓ మహిళను ప్రతిష్టాత్మకమైన పోస్టుకు ఎంపిక చేయడంపై బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి మాట్లాడారు. డిక్కు డిపార్ట్మెంట్కు సంబంధించిన ఓ సుదీర్ఘ అవగాహన ఉందని చెప్పారు. అది భవిష్యత్తులో డిపార్ట్మెంట్ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని అభిప్రాయపడ్డారు. బ్రిటన్లోని అతిపెద్ద పోలీస్ ఫోర్స్ లండన్ మెట్రోపాలిటనే. దీన్నే స్కాట్లాండ్ యార్డ్ డిపార్ట్మెంట్ అని కూడా పిలుస్తారు. -
సీఐ వేధిస్తున్నాడు..
మహిళాపోలీస్స్టేషన్ సిబ్బంది ఆవేదన సాక్షి, వరంగల్: వరంగల్ పోలీసు కమిష నరేట్ పరిధిలోని మహిళా పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ విష్ణుమూర్తి వేధింపులకు గురి చేస్తున్నారంటూ సిబ్బంది పోలీసు కమిషనర్ జి.సుధీర్బాబుకు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది బుధవారం పోలీస్ కమిషనర్ను స్వయంగా కలిసి ఫిర్యాదు పత్రం ఇచ్చారు. విధి నిర్వహణ పేరుతో పరేడ్, డ్రెస్ ఇలా ఉండాలంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా డని మహిళా సిబ్బంది పోలీసు కమిషనర్కు చెప్పారు. విష్ణుమూర్తిని ఇన్స్పెక్టర్గా కొన సాగిస్తే మూకుమ్మడిగా సెలవులు పెట్టేందు కు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణ జరిపి చర్య తీసు కుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. -
ఏ నిబంధన మేరకు ఉత్తర్వులిచ్చారు?
• ఆధార్ కార్డు విషయంలో • పోలీసుల ఉత్తర్వులపై హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: వాహనదారులు వాహనం నడిపే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంచుకోవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను వివరణ కోరింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి ఈ ఉత్తర్వులు జారీ చేశారో చెప్పాలని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అం బటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన వై.సోమరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆధార్ కోసం పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఆధార్ తప్పనిసరి కాదని నివేదించారు. హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణుగోపాల్ స్పందిస్తూ.. ఆధార్ దగ్గర ఉంచుకోవాలన్నది సలహా మాత్రమేనన్నారు. డ్రైవింగ్ లెసైన్స్ లేకపోతే ఆధార్ ద్వారా ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకే కమిషనర్ పత్రికా ప్రకటన ఇచ్చారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషనర్ను ఆదేశించింది. -
'మీడియా లేని పోలీసింగ్ను ఊహించలేం'
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో మీడియా లేకుండా పోలీసింగ్ను ఊహించలేమని నగర కొత్వాల్ ఎం.మహేందర్రెడ్డి అన్నారు. పోలీసులు తీసుకునే ప్రతి చర్యలోనూ మీడియా పాత్ర వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. ప్రతి దశలోనూ పోలీసులకు మీడియా అండగా నిలిచిందని కితాబిచ్చారు. రంజాన్, గణేష్ ఉత్సవాలు, బక్రీద్ పండుగల్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి పోలీసులకు సహకరించిన మీడియాకు కొత్వాల్ గురువారం ఆత్మీయ పూర్వక విందు ఇచ్చారు. జలవిహార్లోని వేదిక హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేందర్రెడ్డి మాట్లాడుతూ... 'ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలమైంది. అనేక సందర్భాల్లో పుకార్లను అరికట్టడంతోపాటు నిజానిజాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంలో కీలకపాత్ర పోషిస్తోంది. బుధవారం నగరంలో అనేకచోట్ల బాంబులు ఉన్నాయంటూ పుకార్లు సోషల్ మీడియాలో చెలరేగాయి. దీనిపై నేను ఇచ్చిన వివరణను ప్రజల్లోకి మీడియా తీసుకువెళ్ళి సాధారణ జనజీవనం కొనసాగేలా చేసింది. నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడంతోపాటు పోలీసింగ్ కోసం పోలీసులు తీసుకుంటున్న ప్రతి చర్యనూ మీడియా ప్రజలకు వివరిస్తోంది. లండన్ నగరం ప్రపంచంలోనే సేఫ్ సిటీగా మారడానికి కారణం అక్కడ దాదాపు పదేళ్ల క్రితం అమలులోకి వచ్చి, నేటికీ కొనసాగుతున్న కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టు. హైదరాబాద్లోనూ దాన్ని అమలు చేస్తున్నాం. సిటీలో ఇంతగా సక్సెస్ కావడానికి మీడియా ఇచ్చిన సహకారమే ప్రధాన కారణం. భవిష్యత్తులోనూ మీడియా ఇదే విధమైన సహాయసహకారాలను అందిస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. -
కొత్వాల్కు అభినందనలు...
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గణేష్ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి కావడంతో నగర పోలీసు కమిషనర్ను పోలీసు అధికారుల సంఘం అభినందించింది. సంఘం ప్రతినిధులు శుక్రవారం కొత్వాల్ను కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు అహర్నిషలు శ్రమించిన సిబ్బందికి బత్తా ఇవ్వాలని కోరారు. – సాక్షి, సిటీబ్యూరో -
బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్కు యాదగిరి!
-
బుల్లెట్ గాయాలతో పోలీసుస్టేషన్కు యాదగిరి!
ఓల్డ్ బోయిన్ పల్లి సమీపంలో శనివారం ఉదయం జరిగిన కాల్పులకు భూ వివాదాలే కారణమని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగిందని, ఈ పెనుగులాటలోనే కాల్పులు జరిగాయని ఆయన వివరించారు. కాల్పులు జరిగిన తర్వాత బుల్లెట్ గాయాలతోనే యాదగిరి పోలీసు స్టేషన్కు వచ్చారని చెప్పారు. అయితే ఈ ఘటనలో ఉపయోగించిన తుపాకి ఎవరిదనే విషయమై ఇంకా స్పష్టత లేదన్నారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని సీపీ మహేందర్రెడ్డి చెప్పారు. ప్రస్తుతం యాదగిరి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. అల్వాల్లో ఓ భూ వివాదానికి సంబంధించి యాదగిరికి, మరో వ్యక్తికి మధ్య గొడవలు ఉన్నాయని, వాటి నేపథ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చని తెలిపారు. -
పచ్చదనంతోనే ప్రగతి
l గంగదేవిపల్లికి రావడం అంటే టెంపుల్కు వచ్చినట్లు.. l హరితహారంలో 9.50 లక్షల మొక్కలు నాటాం l నగర పోలీస్ కమిషనర్ సుధీర్బాబు గీసుకొండ : పచ్చదనంతోనే ఏ సమాజమైనా ప్రగతి సాధిస్తుందని, ప్రస్తుతం కావల్సినవి కాంక్రీట్ జంగిల్స్ కావని, జంగిల్స్ అని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ జి. సుధీర్బాబు అన్నారు. హరితహారాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో పోలీసుల ఆ««దl్వర్యంలో బుధవారం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మాట్లాడుతూ.. గంగదేవిపల్లికి రావడం అంటే దేవాలయానికి వచ్చినట్లుగా ఉంటుందని, ఇలాంటి గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దడానికి తొలుత 6 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పెంబర్తిని దత్తత తీసుకుని గంగదేవిపల్లిలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. నీరు, చెట్లు సమృద్ధిగా ఉన్న చోటే గొప్ప నాగరికతలు వర్ధిల్లాయని గుర్తుచేశారు. గత ఏడాది హరితహారంలో 1.10 లక్షల మొక్కలు నాటితే, ప్రజల భాగస్వామ్యంతో ఈ ఏడాది నగర కమిషనరేట్ పరిధిలో 9.50 లక్షల మొక్కలు నాటామన్నారు. మామునూరు ఎసీపీ మహేందర్ మాట్లాడుతూ చైనా, ఆఫ్రికా దేశాల తర్వాత ఇక్కడే పెద్ద స్థాయిలో హరితహారం కార్యక్రమం జరుగుతోందన్నారు. మామునూరు డివిజన్ పరిధిలో 3.50 లక్షల మెక్కలు నాటామన్నారు. అనంతరం గ్రామంలో 8 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎంపీపీ ముంత కళావతి, జెడ్పీటీసీ ఆంగోతు కవిత, ఎంపీడీఓ సాయిచరణ్, ఈవోపీఆర్డీ భీంరెడ్డి రవీంద్రారెడ్డి, మామునూరు సీఐ శ్రీనివాస్, గీసుకొండ ఎస్ఐలు అంజన్రావు, నవీన్కుమార్, సర్పంచ్ ఇట్ల శాంతి, గ్రామాభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళి , అరబిందో ఫార్మసీ కాలేజి, ఉషోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ జామ్ ఎఫెక్ట్: పోలీసు కమిషనర్ బదిలీ
భారీ వర్షపాతంతో ఎన్నడూ కనీ వినీ ఎరుగనంత ట్రాఫిక్ జామ్ ఏర్పడటం, ఇది ఏకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా వివాదానికి కారణం అవడంతో ఓ పోలీసు కమిషనర్ మీద బదిలీ వేటు పడింది. హరియాణాలోని గుర్గావ్ పోలీసు కమిషనర్ నవదీప్ విర్క్ను రోహ్తక్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సందీప్ ఖిరావర్ను గుర్గావ్ సీపీగా నియమించారు. గుర్గావ్ వద్ద ఏకంగా 17 గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ తప్పునకు బాధ్యులు మీరంటే మీరంటూ హరియాణా, ఢిల్లీ ముఖ్యమంత్రులు పరస్పరం ఆరోపించుకున్న విషయం తెలిసిందే. ఇక తాము అన్ని గంటల పాటు రోడ్డు మీదే ఇరుక్కుపోయినా.. ఎక్కడా ఒక్క పోలీసు కూడా కనిపించలేదని ప్రజలు ఆరోపించారు. దాంతో విర్క్ మీద వేటు పడింది. అయితే పోలీసులు మాత్రం పూర్తిస్థాయిలో విధుల్లో పాల్గొన్నారని ఆయన అంటున్నారు. నీళ్లు నిలిచిపోతుంటే పట్టించుకోకపోవడం కార్పొరేషన్ తప్పని చెప్పారు. శుక్రవారం నాడు ఎన్హెచ్8 మీదుగా వెళ్లిన ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. వందలాది ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాంతో మొత్తం ట్రాఫిక్ క్లియర్ అవడానికి దాదాపు 17 గంటలకు పైగా సమయం పట్టింది. సాయంత్రం 6 గంటలకు మొదలైన కష్టాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. చాలామంది తమ వాహనాలను అక్కడే వదిలేసి, మోకాలి లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఢిల్లీ నుంచి గుర్గావ్ మధ్య ప్రయాణాలు ఆపుకోవాలని పోలీసులు ప్రజలకు సలహా ఇచ్చారు.